breaking news
SPSR Nellore District News
-
పెద్ద పులి సంచారంతో కలకలం
● ఉదయగిరి దుర్గంపై పంజా ● వణుకుతున్న కొండ కింద గ్రామాల ప్రజలు ● 40 రోజులుగా కదలికలు ● తాజాగా కోనకాలువ వద్ద ఆవును చంపినట్లు గుర్తింపు ఉదయగిరి: ఉదయగిరి ఫారెస్ట్ పరిధిలోని దుర్గం ప్రాంతంలో పెద్దపులి సంచారంతో మరోసారి కలకలం రేగింది. ఈ క్రమంలో దుర్గం కింద ఉన్న 11 గ్రామాల వాసులు ఏ క్షణాన ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. వ్యాఘ్రం 20 రోజులుగా ఈ ప్రాంత వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా దుర్గంపల్లి సమీపంలోని కోనకాలువ ప్రాంతంలో పెద్ద పులి పంజాకు ఓ ఆవు బలైందనే విషయాన్ని పశువుల కాపర్లు గురువారం గుర్తించి అటవీ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో కావలి సబ్ డీఎఫ్ఓ శ్రీకాంత్రెడ్డి, ఉదయగిరి ఫారెస్ట్ రేంజ్ అధికారి కుమార్రాజా, మండల పశు వైద్యాధికారి రాఘవేంద్రశర్మతో పాటు పలువురు అటవీ అధికారుల బృందం ఘటన స్థలాన్ని శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఆవు కళేబరం కొంత మేర పాడైపోవడంతో శవపరీక్ష నిమిత్తం పలు నమూనాలను సేకరించారు. మరోవైపు ట్రాప్ కెమెరాలో పులి సంచారం నిక్షిప్తమై ఉన్నా, అధికారులు స్పందన నామమాత్రంగా ఉండటంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.అప్రమత్తంగా ఉండాలి ఉదయగిరి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పులి పంజా ద్వారా ఆవు మరణించిందాననే విషయం పోస్ట్మార్టం నివేదికలో తేలాల్సి ఉంది. అటవీ అధికారుల అనుమతి లేనిదే ఈ ప్రాంతానికి పర్యాటకులు రాకూడదు. – శ్రీకాంత్రెడ్డి, సబ్ డివిజన్ అటవీ అధికారి, కావలి -
గంజాయి మత్తులో బాలికపై దారుణం
● మొన్న పెంచలయ్య.. నేడు బాలిక ● మత్తుకు బానిసలవుతున్న బాలురు.. విచక్షణ కోల్పోయి నేరాలు ● అరాచకాలకు అడ్డుకట్టలో అధికార యంత్రాంగాల ఘోర వైఫల్యం ● అధికార పార్టీ నేతల సేవలో తరిస్తున్న వైనమే ఈ పరిస్థితికి కారణం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గంజాయి అరాచక శక్తులకు అడ్డాగా జిల్లా మారిపోయింది. ఒకప్పుడు నేరస్తుల గుండెల్లో సింహ స్వప్నంగా మారి వారి పీచమణిచిన పోలీసుల సమర్థత ప్రస్తుతం పాతాళానికి పడిపోయింది. జిల్లా పోలీస్ బాస్లుగా వ్యవహరించిన కొత్తకోట శ్రీనివాసరెడ్డి, కసిరెడ్డి రాజేంద్రనాథ్రెడ్డి, ఈతమొక్కల దామోదర్, సెంథిల్కుమార్, పీహెచ్డీ రామకృష్ణ వంటి అనేక మంది అధికారులు కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకొని అరాచక శక్తుల ఆటకట్టించారు. నేరం చేయాలంటేనే భయపడే పరిస్థితులను తీసుకొచ్చి, పోలీస్ ప్రతిష్టను ఇనుమడింపజేశారు. నేరాలను అరికట్టేందుకు అవసరమైతే అండగా నిలిచే పాలకులు గతంలో ఉండటంతో పోలీస్ బాస్లు సైతం ఖాకీ పవర్ చూపించారు. ప్రస్తుతం నేరాలను ప్రోత్సహిస్తున్న పాలకుల చేతిలో కీలుబొమ్మల్లా మారిన ఖాకీలు ఉండటంతో జిల్లా నేరమయంగా మారింది. నేరస్తులను పబ్లిక్ రోడ్లపై పరేడ్ చేయిస్తూ.. తద్వారా నేర నియంత్రణలో కఠినంగా వ్యవహరిస్తున్నామనే భ్రమలను కల్పిస్తున్నారు. గుప్పుమంటున్న గంజాయి కూటమి ప్రభుత్వంలో ఎక్కడా చూసినా గంజాయి గుప్పుమంటోంది. నగరం, పట్టణమనే తేడా లేకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయిన వారు నేరాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. నిలువరించాల్సిన పోలీస్, ఎకై ్సజ్ ఈగల్ టీమ్లు నామమాత్రపు చర్యలతో సరిపెట్టుకుంటున్నారు. సంబంధిత అధికారులు ఏదైనా సమాచారం వస్తేనో.. పైఅధికారుల ఆదేశాలతోనే అడపాదడపా దాడులు చేసి నిందితుల అరెస్ట్లతో సరిపెట్టుకుంటున్నారు. మూలాల్లోకి వెళ్లకపోవడంతో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు బ్రేక్ పడటం లేదు. దీంతో జిల్లాలో గంజాయి విక్రయాలు చాపకింద నీరులా సాగుతున్నాయి. మత్తులో నేరాలు పెరుగుతుండటంతో జిల్లా వాసులు భయపడుతున్నారు. జిల్లాలో జరుగుతున్న నేరాలు అధిక శాతం మత్తులోనే జరుగుతున్నాయని పోలీసుల విచారణలోనూ స్పష్టమైంది. మొక్కుబడి నిఘా నార్కొటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ సమన్వయ సమావేశంలో కలెక్టర్, ఎస్పీలు అన్నీ శాఖల సమన్వయంతో జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కింది స్థాయి అధికారులకు ఆదేశిస్తున్నారు. వారి ఆదేశాల అమలు క్షేత్రస్థాయిలో నామమాత్రంగానే ఉన్నాయనే విమర్శలున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయకపోతే శాంతిభద్రతలకు మరింత విఘాతం ఏర్పడే పరిస్థితి ఏర్పడనుంది. ఈ దారుణానికి బాధ్యులెవరు..? గతంలో ఉక్కుపాదంతో అణచివేత గంజాయిపై గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఎక్కడికక్కడ దాడులు చేసి గంజాయి సరఫరాదారులు, విక్రేతలను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. గంజాయి మూలాలను ఏరివేసి పూర్తిస్థాయిలో కట్టడి చేశారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఒడిశా, ఏఓబీ సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గంజాయి జిల్లా మీదుగా కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు తరలివెళ్తోంది. గంజాయి విక్రయాలు ఊపందుకున్నాయి. జిల్లాలోని వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా వివిధ మార్గాల ద్వారా గంజాయిని దిగుమతి చేసుకుంటున్నారు. చిన్న చిన్న పొట్లాలుగా చేసి వాటిని విక్రయించి సొమ్ముచేసుకుంటున్నారు. జిల్లాలోని మారుమూల గ్రామాల్లోనూ గంజాయి విక్రయాలు చాపకిందనీరులా సాగుతున్నాయి. మత్తుకు బానిసైన యువత నేరాలకు పాల్పడుతున్నారు. హత్యలకు, హత్యాయత్నాలకు వెనుకాడటం లేదు. బాలికలపైనా మత్తులో దాడులకు తెగబడుతున్నారు. మత్తులో మృగాళ్ల వికృత చేష్టలకు అభం శుభం తెలియని ఓ బాలిక ప్రాణాలను కోల్పోయింది. జిల్లాలో గంజాయి దాష్టీకానికి తాజాగా బాలిక బలైపోయింది. ఇటీవల గంజాయి నిరోధక ఉద్యమకారుడు పెంచలయ్యను విక్రేతలు ప్రజలు చూస్తుండగానే తరిమితరిమి నరికి చంపారు. ఇప్పుడు గంజాయి మత్తులో ఇద్దరు బాలలు.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడటంతో ప్రాణాలే కోల్పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే దానికి ఈ రెండు ఘటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఖాకీ దుస్తులు ధరించిన పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు అవినీతి, అధికార మత్తులో పడి అసాంఘిక శక్తుల ఆటకట్టించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ దాష్టీకాలను ప్రశ్నించే ప్రతిపక్షంపై కేసులు నమోదు చేయడం, ఉద్యమాలను అణచివేయడంలో చూపించే శ్రద్ధ, వీటిపై లేకపోవడంతోనే అరాచక శక్తులు చెలరేగిపోతున్నాయి. కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బలో అభం శుభం తెలియని బాలికపై జరిగిన దారుణానికి కారకులెవరు..? గంజాయిని నిరోధించలేని పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు కాదా..? బాలికపై దారుణానికి గంజాయి కారణమని తెలిసినా.. ఈ ఘటనకు మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. నేరం జరిగినట్లుగా నిర్ధారించి నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జువైనల్ హోమ్కు తరలించడం నిజం కాదా..? బాలిక మరణించడంతో తమ అసమర్థత ఎక్కడ బయట పడుతుందోనని 12 ఏళ్ల బాలికకు ప్రేమ వ్యవహారం అంటగట్టి ఆ కుటుంబాన్ని అప్రతిష్ట పాల్జేసేందుకు సైతం వెనుకాడటంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ బిడ్డకు జరిగిన అన్యాయం మరో బిడ్డకు జరగకూడదని, తమ బిడ్డకు ప్రేమ వ్యవహారాన్ని అంటగట్టారంటూ ఆ తండ్రి గుండెలు పగిలేలా రోదిస్తున్నాడు. వేలకు వేల జీతాలు, రూ.లక్షల్లో అవినీతి మరిగిన ఈ రెండు వ్యవస్థలు విచ్చలవిడిగా జరిగే గంజాయి విక్రయాలను అరికట్టడం, మద్యాన్ని నియంత్రించలేకపోవడంలో నిజం లేదా..? తమ వైపు తప్పులను కప్పి పుచ్చుకునేందుకు అసలు రేప్ జరగలేదంటూ చెప్పడం బాధ్యతారాహిత్యం కాదా..? పోలీసులు చెప్పినట్లు రేప్ జరగకపోతే ఆ పిల్లలను ఎందుకు అరెస్ట్ చేశారంటే.. ఒక్కొక్కరికీ ఒక్కో విధంగా సమాధానాలు చెప్పారు. గంజాయి తాగుంటే పట్టుకున్నామని ఒకరికి.. పోక్సో కేసు ఎందుకు నమోదు చేశారంటే ఆ బాలికను లైంగికంగా వేధించారని.. దీనికి కూడా పోక్సో కేసు పెట్టామంటూ కొత్త భాష్యం చెప్పారు. పోలీసులు చెప్పినట్లే చూసినా.. దీనింతటికీ గంజాయే కారణం కాదా..? దాన్ని నియంత్రించకపోవడమే కారణం కాదాననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
9 నుంచి పది ప్రీ పబ్లిక్ పరీక్షలు
నెల్లూరు (టౌన్): జిల్లాలోని అన్ని యాజమాన్య పరిధిలో గల ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ప్రీ పబ్లిక్ పరీక్షలను ఈ నెల తొమ్మిది నుంచి 19 వరకు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలను జరపనున్నారు. తొమ్మిదిన తెలుగు / ఉర్దూ / కాంపోజిట్ కోర్సు, పదిన హిందీ / స్పెషల్ తెలుగు / స్పెషల్ ఇంగ్లిష్, 11న ఇంగ్లిష్, 12న మ్యాథ్స్, 13న భౌతిక శాస్త్రం, 16న జీవశాస్త్రం, 17న సోషల్ స్టడీస్, 18న కాంపోజిట్ కోర్సు – 2, 19న ఓఎస్సెస్సీ – 2 ఒకేషనల్ కోర్సు పరీక్షలను నిర్వహించనున్నారు. అదే విధంగా ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఎఫ్ఏ – 4 పరీక్షలను ఈ నెల తొమ్మిది నుంచి 12 వరకు జరపనున్నారు. వీటికి ఎస్సీఈఆర్టీ నుంచి ప్రశ్నపత్రాలను ఇవ్వనున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు క్లస్టర్ కేంద్రాలు.. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు సంబంధించిన ప్రశ్నపత్రాలను మండల విద్యా వనరుల కేంద్రాల నుంచి గంట ముందు పాఠశాలలకు సరఫరా చేయనున్నారు. అనంతరం అసెస్మెంట్ బుక్లెట్ల మూల్యాంకనం చేసి మార్కులను అప్లోడ్ చేయాల్సి ఉంది. ధాన్యానికి మద్దతు ధర నెల్లూరు(పొగతోట): ధాన్యం కొనుగోళ్లలో రైతులు నష్టపోకుండా మద్దతు ధర కల్పించాలని డీఎస్ఓ లీలారాణి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో వివిధ శాఖల ఉద్యోగులకు శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో వచ్చే నెల నుంచి వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. క్వింటాల్ గ్రేడ్ – ఏ ధాన్యం రూ 2389.. సాధారణ ధాన్యం క్వింటాల్ ధరను రూ.2369గా ప్రభుత్వం ప్రకటించిందని వివరించారు. మద్దతు ధరకు మించి కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. తేమ శాతం, నిబంధనలను పూర్తి స్థాయిలో పరిశీలించి సేకరించాలని కోరారు. ఆపై రైస్మిల్లలకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. డీఏఓ నియామకంపై ఇరిగేషన్లో కలకలం నెల్లూరు(స్టోన్హౌస్పేట): జిల్లా ఇరిగేషన్ శాఖను రాష్ట్ర వ్యాప్తంగా అప్రతిష్టపాల్జేసిన గత డీఏఓ అక్రమాలపై విచారణ జరిపి నెల రోజులు కాక ముందే ఆయన హఠాత్తుగా బాధ్యతలను శుక్రవారం స్వీకరించారు. వాస్తవానికి విచారణ జరిగిన రోజే ఆయన మాతృశాఖ ఫైనాన్స్ అండ్ ఆడిట్కు సరెండరై వెళ్లిపోయారు. అనంతరం ఆ పోస్టు భర్తీకి అనేక మంది చాలా విధాలుగా యత్నించారు. అయితే తాజాగా డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్గా హరిప్రసాద్ బాధ్యతలు చేపట్టడం ఆ శాఖ అధికారులు, సిబ్బందిని విస్మయానికి గురిచేసింది. బాధ్యతలు స్వీకరించేంత వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. ఈయన మరో రెండు, మూడు చోట్ల డీఏఓగా పనిచేస్తున్నారని సమాచారం. ఇరిగేషన్ శాఖలో గ్రేడ్ – 1 డీఏఓలు పనిచేస్తుండగా, గ్రేడ్ – 2 వ్యక్తిని నియమిస్తూ రాష్ట్ర వర్క్స్ ఆండ్ ఆడిట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ ఉత్తర్వులివ్వడంపై ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాగా తనకు కావలి ఆర్ అండ్ బీలో డీఏఓ పదవి నుంచి గూడూరు ఇరిగేషన్, నెల్లూరు సెంట్రల్ డివిజన్ డీఏఓగా అదనపు బాధ్యతలను ఉన్నతాధికారులు అప్పగించారని ఆయన తెలిపారు. ఈఎమ్మార్ఎస్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం కొడవలూరు: మండలంలోని చంద్రశేఖరపురంలో గల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎమ్మార్ఎస్)లో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ శాంతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో 60 సీట్లుండగా.. బాలురు, బాలికలకు 30 చొప్పున కేటాయించనున్నామని వివరించారు. 2025 – 26 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్న వారే దీనికి అర్హులని చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు తమ దరఖాస్తులను aptwgurukulam.ap.gov.inలో ఈ నెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రవేశ పరీక్షను ఏప్రిల్ నాలుగో తేదీ ఉదయం 11.30కు నిర్వహించనున్నారని, వివరాలకు 95736 60645, 90001 65505 నంబర్లను సంప్రదించాలని సూచించారు. -
ప్రతిపక్షంపై శ్రద్ధ.. నేరాలను అరికట్టడంపై పెట్టండి
●జిల్లాలో పోలీస్ యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. ప్రతిపక్ష నేతల ఇళ్లపై వీరి కళ్ల ముందే దాడులు చేస్తున్నా.. చూస్తున్నారు. తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారు. అధికార పార్టీ నేతల అవినీతి, దాష్టీకాలపై ప్రెస్మీట్లు పెడితే.. కేసులు పెడతారు. ప్రభుత్వ అసమర్థను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారు. తమ పార్టీ నేతలు చేసే ఉద్యమాలను అడ్డుకునేందుకు ముందుంటారు. నేరస్తుల ఆటకట్టించరు. గుమ్మళ్లదిబ్బకు చెందిన బాలిక మరణానికి కారణం గంజాయి బానిసలు కాదా?. నిన్నా.. మొన్న ఎందుకు ఖండించలేదు. చనిపోవడంతో ఇప్పుడెందుకు కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి నిజానిజాలు నిగ్గు తేల్చాలి. అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం. -
ప్రాణం తీసిన అతివేగం
● ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి నెల్లూరు(క్రైమ్): రటాక్టర్ మితిమీరిన వేగంతో మోటార్బైక్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన పెన్నా నూతన బ్రిడ్జిపై చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కోవూరు మండలం లేగుంటపాడుకు చెందిన షేక్ రఫీ (30), బషీర్ఖాన్ స్నేహితులు. ఇద్దరూ కార్పెంటర్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం వారు నెల్లూరు హరనాథపురంలో పనులు చేసుకుని బైక్పై జాతీయ రహదారి మీదుగా ఇంటికి బయలుదేరారు. రఫీ బైక్ నడుపుతున్నాడు. కొత్త పెన్నానది బ్రిడ్జిపైకి వచ్చేసరికి ట్రాక్టర్ మితీమిరిన వేగంతో వెనుకవైపు నుంచి బైక్ను ఢీకొంది. రఫీకి తీవ్రగాయా లై మృతిచెందాడు. బషీర్కు స్వలగాయాలయ్యాయి. ప్రమాద ఘటనపై సమాచా రం అందుకున్న నార్త్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. రఫీకి భార్య, పిల్లలున్నారు. -
గుండెపోటుతో కుప్పకూలిన టీచర్
● సీపీఆర్ చేసిన విద్యార్థి ఉదయగిరి రూరల్: పాఠశాలలో గుండెపోటుకు గురై కుప్పకూలిన టీచర్కు ఓ విద్యార్థి సీపీఆర్ చేసిన ఘటన శుక్రవారం మండలంలోని గండిపాళెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్గా కేసీ మాలకొండయ్య పనిచేస్తున్నారు. ఆయన శుక్రవారం విధులకు హాజరయ్యారు. ప్రార్థన సమయం ముగిసిన అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతి గదుల్లోకి వెళ్తుండగా ఒక్కసారిగా మాలకొండయ్య ఛాతిలో నొప్పితో కుప్పకూలారు. పదో తరగతి చదువుతున్న ఇస్కపల్లె గ్రామానికి చెందిన విద్యార్థి కంచర్ల వెంకటకిరణ్ సిద్ధార్థ సీపీఆర్ చేయడంతో మాలకొండయ్య ప్రాణాపాయ స్థితినుంచి బయటపడ్డారు. 108 అంబులెన్స్కు సమాచారం అందించి చికిత్స నిమిత్తం ఉదయగిరి వైద్యశాలకు తరలించారు. అక్కడ్నుంచి మెరుగైన చికిత్స కోసం నెల్లూరు వైద్యశాలకు తరలించారు. వెంకటకిరణ్ను హెచ్ఎం రవీంద్ర, ఉపాధ్యాయులు వెంగళరావు, సురేష్, విష్ణు నారాయణ, నారాయ ణరావు తదితరులు అభినందించారు. -
ఆగని నేరాలు
జిల్లాలో నేరాలకు బ్రేక్ పడటం లేదు. బంగారం ధరలు భారీగా పెరగడంతో దొంగలు విజృంభిస్తున్నారు. ఇళ్లు, దేవాలయాలు అనే తేడా లేకుండా కొల్లగొట్టి అందినకాడికి దోచుకెళ్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు రూ.1.25 కోట్ల విలువచేసే బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, నగదును దుండగులు చోరీ చేశారు.నెల్లూరు(క్రైమ్): నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు రౌడీషీటర్లు, పాతనేరస్తుల కదలికలపై నిఘా పెంచారు. తీరుమారని రౌడీషీటర్లపై పీడీ యాక్ట్లు నమోదు చేస్తున్నారు. ప్రజాజీవనానికి భంగం కలిగించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. డ్రోన్ నిఘా, విజిబుల్ పోలీసింగ్, కార్డన్ సెర్చ్లు చేస్తున్నారు. అయినా నేరాలకు అడ్డుకట్ట పడటం లేదు. చిన్నపాటి వివాదాలకే కత్తులతో స్వైర విహారం చేస్తున్నారు. చంపుతామని బెదిరించి నగదు దోచుకుంటున్నారు. మత్తులో పోలీసులపైనా దాడులు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలో ఐదు హత్యలు చోటుచేసుకోగా హత్యాయత్నాలు పదుల సంఖ్యలో జరిగాయి. అధిక శాతం నేరాలు మత్తులోనే జరుగుతున్నాయి. కొల్లగొడుతూ.. బంగారం, వెండి ధరలు పెరిగాయి. దీంతో దొంగల కళ్లు బంగారంపై పడ్డాయి. ప్రజలు రాత్రింబవళ్లు కష్టపడి.. రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన మొత్తాన్ని పోలీసుల నిఘా కళ్లుగప్పిఒక్క రాత్రిలోనే కొల్లగొడుతున్నారు. దుకాణాలు, దేవాలయాలను వదలడం లేదు. ఆలయాల్లో అమ్మవార్లు, స్వామివార్ల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులతోపాటు హుండీలను ధ్వంసం చేసి నగదును దోచుకెళ్తున్నారు. బైక్లపై రెక్కీ చేస్తూ ఒంటరిగా ఉన్న మహిళల మెడల్లోని పుస్తుల తాడులను తెంపుకెళ్తున్నారు. వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఉదాసీనత కారణం కొందరి ఉదాసీనత దొంగలకు కలిసొస్తోంది. విలువైన వస్తువులు బీరువాల్లో పెట్టి బయటకు వెళ్లడం, తాళాలు అక్కడే పెట్టడం వంటివి చేస్తున్నారు. ఊర్లకు వెళ్లే సమయంలో విలువైన వస్తువులు ఇంట్లో ఉంచరాదని, లాకర్లలో భద్రపర్చుకోవాలని, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం సేవలను వినియోగించుకోవాలని పోలీసులు చెబుతున్నా ప్రజల నుంచి స్పందన నామమాత్రంగానే ఉంది. అప్రమత్తంగా ఉండాలి వరుస ఘటనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఊర్లకు వెళ్లే సమయంలో విలువైన వస్తువులను ఇంట్లో ఉంచరాదు. స్థానిక పోలీసులకు తెలియజేసి ఎల్హెచ్ఎంఎస్ సేవలను వినియోగించుకోవాలి. ఇంటిని గమనిస్తుండాలని చుట్టుపక్కల వారికి చెప్పాలి. అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలి. హడలెత్తిస్తున్న దొంగతనాలు ఈ ఏడాదిలో రూ.1.25 కోట్ల సొత్తు చోరీ చిన్నపాటి వివాదాలకే కత్తులతో స్వైర విహారం ఇటీవల -
సైన్స్ సెంటర్ క్యూరేటర్కు అవార్డు
నెల్లూరు(టౌన్): జిల్లా సైన్స్ కేంద్రంలో క్యూరేటర్గా విధులు నిర్వర్తిస్తూ గ్రామీణ ప్రాంతాల్లో విజ్ఞాన విద్యను ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తున్న ఎన్.సుబ్రహ్మణ్యంకు జాతీయ స్థాయిలో శిక్షాగ్రహ లీడర్షిప్ అవార్డు దక్కింది. బెంగళూరులో శుక్రవారం నిర్వహించిన ఇన్ఓక్డ్ 5.0 మిషన్ టు మూవ్మెంట్ జాతీయ విద్యా సదస్సులో అవార్డును అందుకున్నారు. విద్యా కార్యక్రమాల విస్తరణ కోసం రూ.10 లక్షలు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా 6,500 మంది ఉపాధ్యాయుల్లో నాయకత్వ లక్షణాలు, సామాజిక ప్రభావం, గ్రామీణ విద్యాభివృద్ధికి చేసిన కృషి ఆధారంగా ఎంపిక చేసిన ముగ్గురులో సుబ్రహ్మణ్యం ఒకరు. ఈ సందర్భంగా ఆయన్ను డీఈఓ బాలాజీరావు, సమగ్రశిక్షణ ఏపీసీ వెంకటసుబ్బయ్య అభినందించారు. రైల్వే ఉద్యోగి అనుమానాస్పద మృతి కావలి రూరల్: రైల్వే ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. కావలి రూరల్ రుద్రకోట గ్రామం ఎస్సీ కాలనీలో ఆర్.నాగరాజు (48) ఉంటున్నాడు. అతను రైల్వే గేట్మెన్గా అడవిరాజుపాళెంలో ఎల్సీ గేటు 160 వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. భార్య, ముగ్గురు పిల్లలున్నారు. కాగా కుటుంబ సలహాల నేపథ్యంలో భార్య నుంచి విడిపోయి 12 సంవత్సరాల నుంచి ఒంటరిగా జీవిస్తున్నాడు. భార్య ప్రకాశం జిల్లా చిన్నగంజాంలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. నాగరాజు ఇంటి ముందు శుక్రవారం ఉదయం ముగ్గువేయడానికి అతని పిన్ని వెళ్లింది. తలుపు తీసి చూడగా నాగరాజు మృతిచెంది ఉన్నాడు. దీంతో గ్రామస్తులతో కలిసి కావలి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. రూరల్ సీఐ రాజేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆడుకుంటూ.. విషగుళికలు తిని.. ● అపస్మారక స్థితిలోకి చిన్నారి వాకాడు: రొయ్య ల చెరువుల వద్ద కాపలా ఉంటు న్న కె.సురేంద్ర, గంగమ్మ దంపతుల కుమార్తె జయశ్రీ శుక్రవా రం ఆడుకుంటూ విషగుళికలు తిని అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికుల కథనం మేరకు.. చిట్టమూరు మండలం కొత్తగుంట సమీపంలో నాయుడుపేటకు చెందిన లోకేంద్ర అనే వ్యక్తికి రొయ్యల గుంతలున్నాయి. అక్కడ రేణిగుంట ప్రాంతానికి చెందిన సురేంద్ర, గంగమ్మ దాదాపు ఏడాది కాలంగా కాపలా ఉంటున్నారు. శుక్రవారం భార్యాభర్తలు తమ రెండేళ్ల వయసున్న కుమార్తెను పూరింట్లో వదిలి గుంతల వద్ద పనిచేస్తున్న చేస్తున్నారు. జయశ్రీ ఆడుకుంటూ అక్కడే ఉన్న విష గుళికలను తినింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే చిన్నారిని మోటార్బైక్పై వాకాడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్లో గూడూరుకు తరలించారు. వాకాడు పోలీసులు వివరాలు నమోదు చేసి చిట్టమూరు పోలీసులకు అందజేసినట్లు తెలిసింది. -
గనులు, భూగర్భ శాఖలో ఏసీబీ సోదాలు
● సర్వేయర్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఒంగోలు సిటీ: ఒంగోలులోని గనులు, భూగర్భ జలాల (మైన్స్ అండ్ జియాలజీ) శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో సర్వేయర్గా పనిచేస్తున్న షేక్ అబ్దుల్ ఆసిఫ్ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు అందిన సమాచారం ఆధారంగా అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం మంగమూరు రోడ్డు వేద రెసిడెన్సీలోని కార్యాలయంలో సోదాలు చేపట్టిన ఏసీబీ బృందం ఆసిఫ్ను అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించింది. అతడిది మార్కాపురం కాగా కనిగిరిలో వివాహం చేసుకుని ప్రస్తుతం విజయవాడలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. గతంలో కడప, కృష్ణా, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో పనిచేశాడు. నెల్లూరులో పనిచేస్తుండగా ఆదాయానికి మించి అక్రమంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి పక్కా సమాచారం అందిన నేపథ్యంలో ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ దాడులు చేపట్టారు. ఆసిఫ్ నివాసం విజయవాడలో ఉండటంతో అక్కడి స్వగృహంతోపాటు మార్కాపురం, కనిగిరి, నెల్లూరు, గుంటూరుల్లోని బంధువుల ఇళ్లల్లో కూడా ఏకకాలంలో ఏసీబీ సోదాలు కొనసాగిస్తున్నారు. అక్రమ ఆస్తులకు సంబంధించి వివిధ డాక్యుమెంట్స్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమ ఆస్తుల్లో రెండు ఇళ్లు, ఒక ఇంటి స్థలం, 22 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.2,82,264 నగదు, సుమారు 620 గ్రాముల బంగారం, సుమారు 500 గ్రాముల వెండి, రూ.3,54,000 ల ప్రాంసరీ నోట్లు, 16 చేతిగడియారాలు, ఒక మోటార్బైక్, విలువైన గృహోపకరణాలు ఉన్నాయన్నారు. ఇవికాక అసిఫ్ హెచ్డీఎఫ్సీ బీమాలో రూ.15 లక్షలతో పాలసీలు తీసుకొన్నట్లు చెప్పారు. అలాగే టొయోటా హై రైడర్ కారు కొనడానికి రూ.20 వేలు అడ్వాన్స్గా ఇచ్చినట్లు గుర్తించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఒక లాకర్ను గుర్తించారు. సోదాల అనంతరం సర్వేయర్ను అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు చెప్పారు. -
నూతన మేయర్ ఎన్నిక జరపాలి
● రిలే దీక్షకు వివిధ సంఘాల మద్దతు నెల్లూరు(దర్గామిట్ట): రాజ్యాంగబద్ధంగా నూతన మేయర్ ఎన్నిక నిర్వహించాలని వివిధ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. గిరిజన సంఘ ఐక్యవేదిక నెల్లూరులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారంతో ఏడో రోజుకు చేరుకున్నాయి. రైతు సంఘం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యవేదిక, బీఎస్పీల నేతలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి గంగపట్నం రమణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నెల్లూరు మేయర్ పదవి గిరిజన మహిళకు రాజ్యాంగబద్ధంగా కల్పిస్తే, దీనిని చూసి ఓర్వలేక జిల్లా నాయకులు మరో వర్గానికి చెందిన వ్యక్తికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం బాధాకరమన్నారు. ఇదేనా బడుగు, బలహీనవర్గాలకు ఇచ్చే గౌరవమంటూ ప్రశ్నించారు. బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నాసిన భాస్కర్గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ స్పందించి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నేతలు చిన్న భాస్కర్గౌడ్, ఎల్వీ సుబ్బయ్య, ఎడ్ల రవి, బత్తెన లక్ష్మణ, శేఖర్, ఏడుకొండలు, చౌటురి శ్రీనివాసులు, శివకృష్ణ, వెంకటయ్య తలారి, కోవూరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఫీజు చెల్లింపునకు 12 వరకు అవకాశం
నెల్లూరు (టౌన్): పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఫీజును చెల్లించేందుకు ఈ నెల 12 వరకు గడువుందని డీఈఓ బాలాజీరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తత్కాల్ ఫీజు కింద రూ.వెయ్యి, అపరాధ రుసుమును చెల్లించాలని కోరారు. అదే తేదీలోపు అన్ని డాక్యుమెంట్లతో నామినల్ రోల్స్ను ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు. వివరాలకు bse.ap.gov.in లేదా దర్గామిట్టలోని జెడ్పీ స్కూల్లో గల జిల్లా పరీక్షల విభాగాన్ని సంప్రదించాలని పేర్కొన్నారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగల అప్పగింత ఉదయగిరి: మండలంలోని ఆర్లపడియ అటవీ ప్రాంతంలో గత నెల 18న పోలీసులు స్వాధీ నం చేనుకున్న ఎర్రచందనం దుంగలు, వాహనాన్ని అటవీ శాఖ అధికారులకు గురువారం అప్పగించారు. 30 దుంగలు, వాహనాన్ని అప్పగించామని ఎస్సై ఇంద్రసేనారెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో 20న ఎంప్లాయీస్ గ్రీవెన్స్ నెల్లూరు(దర్గామిట్ట): కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఎంప్లాయీస్ గ్రీవెన్స్ను ఈ నెల 20న నిర్వహించనున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏపీ జేఏసీ అమరావతి కార్యదర్శిగా చంద్రశేఖర్ నెల్లూరు(క్రైమ్): ఏపీ జేఏసీ అమరావతి కార్యదర్శిగా ఏపీ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ జేఏసీ అమరావతి కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. ఇందులో కార్యదర్శిగా జిల్లాకు చెందిన చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. ఆయనకు పలువురు అభినందనలను తెలియజేశారు. మూడు నెలల పసికందు మృతి ● వ్యాక్సిన్ వికటించి మృతి చెందిందంటున్న బంధువులు దుత్తలూరు: మూడు నెలల పసికందు మృతి చెందిన ఘటన మండలంలోని భైరవరం ఎస్సీ కాలనీలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వ్యాక్సిన్ వికటించడంతోనే తమ బిడ్డ మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. వివరాలు.. భైరవరం ఎస్సీ కాలనీకి చెందిన చాట్ల లక్ష్మీదేవి మూడు నెలల క్రితం పాపకు జన్మనిచ్చారు. నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవం జరిగింది. స్థానిక అంగన్వాడీ కేంద్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహిస్తుండటంతో చిన్నారికి పోలియో వ్యాక్సిన్ను ఏఎన్ఎం వేశారు. రాత్రి సమయంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో 108కు సమాచారం అందించారు. ఊపిరాడటంలేదని, వెంటనే వైద్యశాలకు తరలించాలని కోరగా, పరిశీలించిన సిబ్బంది అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. సమాచారం అందుకున్న దుత్తలూరు వైద్యాధికారి అయూబ్ అఫ్సర్ సిబ్బందితో కలిసి గ్రామానికి గురువారం వెళ్లి చిన్నారిని పరీక్షించారు. వ్యాక్సిన్ వికటిస్తే గంటన్నర్లోనే ప్రభావం ఉంటుందని, ఇది కారణం కాదని తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారు సైతం ఇదే విషయాన్ని తేల్చారు. తమ బిడ్డ మరణానికి వ్యాక్సినే కారణమంటూ దుత్తలూరు పోలీసులకు చిన్నారి తల్లి ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి ఎస్సై ఆదిలక్ష్మి వెళ్లి చిన్నారి మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించారు. -
చికెన్ వ్యర్థాల వాహనం సీజ్
పొదలకూరు: తిరుపతి నుంచి పొదలకూరు మీదుగా సంగం వెళ్తున్న చికెన్ వ్యర్థాల వాహనాన్ని పొదలకూరు పోలీసులు గురువారం సీజ్ చేశారు. ఎస్సై హనీఫ్ కథనం మేరకు.. కోళ్ల వ్యర్థాలను సంగంలోని చేపల పెంపకానికి మేతగా వినియోగించేందుకు తీసుకెళ్తున్నట్లు నిందితులు వెల్లడించారు. ఈ మేరకు డ్రైవర్లుగా ఉన్న పడారుపల్లికి చెందిన మల్లి కృష్ణ, విడవలూరుకు చెందిన కంద్రాటి రవిప్రసాద్పై కేసు నమోదు చేశారు. వ్యర్థాలను ఊరికి దూరంగా తీసుకెళ్లి పాతిపెట్టారు. బైక్పై నుంచి పడి మహిళ మృతి చేజర్ల: తన కుమారుడి బైక్పై వెళ్తూ జారిపడి మహిళ మృతిచెందిన ఘటన గురువారం చేజర్ల మండలం ఆదూరుపల్లి గ్రామదేవత ఆలయ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామానికి చెందిన లక్ష్మమ్మ (55) ఆమె కుమారుడు శ్రీకాంత్తో కలిసి కలువాయి మండలంలో జరిగే బంధువుల ఉత్తరక్రియలకు బైక్పై బయలుదేరారు. ఆదూరుపల్లి వద్ద వెనుక కూర్చుని ఉన్న లక్ష్మమ్మ తన తలకు గుడ్డ చుట్టుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు జారి రోడ్డుపై పడిపోయింది. అక్కడికక్కడే ఆమె మృతి చెందడంతో కుమారుడు తీవ్రంగా రోధిస్తుండడం ఆ దారిలో వెళ్లేవారిని కలచివేసింది. కొందరు వాహన చోదకులు శ్రీకాంత్ను ఓదార్చారు. చేజర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిమ్మధరలు(కిలోల్లో) పెద్దవి: రూ. 50 సన్నవి: రూ. 30 పండ్లు: రూ. 20 -
పరిశ్రమల్లో ప్రమాదాలపై సమాచారమివ్వండి
● కలెక్టర్ హిమాన్లు శుక్లా నెల్లూరు(దర్గామిట్ట): పరిశ్రమల నిర్వహణలో ఇబ్బందికర, ఏదైనా ప్రాణాంతకమైన సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే విషయాన్ని అధికారులు తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్లోని శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి క్రైసిస్ గ్రూప్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రమా ద కారణాలను తెలుసుకోవడంతో పాటు నివారణ చర్యలను చేపట్టాలని సూచించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, కోస్ట్ గార్డులకు సమాచారమివ్వాలని పేర్కొన్నారు. జిల్లా స్థాయి క్రైసిస్ గ్రూప్లో చైర్మన్గా తాను, మెంబర్ సెక్రటరీగా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్, వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్, అగ్నిమాపక, మున్సిపల్ కమిషనర్, ఇతర శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ ఈశ్వర్ చంద్ తదితరులు పాల్గొన్నారు. -
వీఎస్యూలో పుస్తకావిష్కరణ
వెంకటాచలం: మండలంలోని కాకుటూరు వద్ద గల విక్రమ సింహపురి యూనివర్శిటీలో శాంతి సమర్ పుస్తకాన్ని వీసీ అల్లం శ్రీనివాసరావు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రసిద్ధ తెలుగు రచయిత పొట్లూరు సుబ్రహ్మణ్యం రాసిన పది ఉత్తమ కథలను డాక్టర్ ఐనాపురం రామలింగేశ్వరరావు హిందీలోకి శాంతి సమర్ పుస్తకంగా అనువందించడాన్ని అభినందించారు. అనంతరం బాల సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు గానూ ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్న నెల్లూరు వాసి డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ను సత్కరించారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ సునీత, పెన్నా రచయితల సంఘ అధ్యక్షులు గోవిందరాజు సుభద్రాదేవి, కవి ఇంద్రగంటి మధుసూదన్రావు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు దాటుతుండగా..
● లారీ ఢీకొని వ్యక్తి మృతి కలువాయి(సైదాపురం): రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో మృతిచెందిన ఘటన కలువాయి మండలంలో గురువారం చోటుచేసుకుంది. అనంతసాగరం మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన భాగాది నరసింహులు(38) పది రోజుల క్రితం మాదన్నగారిపల్లెలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. గురువారం మాదన్నగారిపల్లె వద్ద జాతీయ రహదారిని దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్ లారీని ఘటనా స్థలంలోనే వదిలి పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అణగారిన వర్గాలపై ఎందుకీ వివక్ష
● గిరిజన సంఘాల దీక్షకు వామపక్షాల మద్దతు నెల్లూరు(దర్గామిట్ట): రాష్ట్ర ప్రభుత్వానికి అణగారిన వర్గాల పట్ల ఎందుకింత వివక్ష అంటూ వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టరేట్ వద్ద గిరిజన సంఘాల ఐక్యవేదిక చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారంతో ఆరో రోజుకు చేరుకున్నాయి. దీనికి వామపక్ష నేతలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన సంఘ గౌరవాధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ కత్తి శ్రీనివాసులు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. 50 ఏళ్ల తర్వాత నెల్లూరు మేయర్ పదవి ఎస్టీలకు దక్కితే, దీనిని చూసి ఓర్వలేక కుట్రలు పన్నడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. గిరిజన మహిళను దించి మరో సామాజిక వర్గానికి పెత్తనం ఇవ్వడం ఏమిటని దుయ్యబట్టారు. మంత్రి నారాయణ ఇలాకాలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం నూతన మేయర్ ఎన్నికపై నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన సంఘాల నాయకులు పిట్ల సూర్యనారాయణ, ఎం.ప్రసాద్, ఎ.శ్రీనివాసులురెడ్డి, కత్తి చిన్న, సీపీఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, వివిధ సంఘాల నేతలు బాపట్ల శివకృష్ణ, చౌటురు శ్రీనివాసులు, తాళ్ల ఏడుకొండలు పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
దగదర్తి: తన తండ్రి ఆస్తులలో తనకు సక్రమంగా పంపకాలు చేయలేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని దుండిగం ఎస్సీ కాలనీలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. దుండిగం ఎస్సీ కాలనీకి చెందిన పందిళ్ల సుధాకర్ (41)కు ఆరేళ్ల క్రితం శాంతమ్మతో వివాహం జరిగింది. సుధాకర్ తండ్రి వెంకటేశ్వర్లు ఆస్తి పంపకాలు సక్రమంగా చేయకుండా కుమార్తెకు చెందేలా వ్యవహరించడంతో భార్యతో మరస్పర్థలు ఉన్నాయి. ఈ క్రమంలో భార్య కొద్దిరోజుల క్రితం ఆత్మకూరులోని పుట్టింటికి వెళ్లింది. ఓ వైపు ఆస్తి పంపకాల విషయంలో మనస్తాపంతో పాటు అనారోగ్య సమస్యల వల్ల అతను గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంట గదిలో రేకుల షెడ్డుకు వేసిన ఇనుప పైపునకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం వచ్చిన సమాచారం మేరకు ఎస్సై జంపానికుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశామని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మెడికల్ కాలేజీకి భౌతికకాయం దానం
నెల్లూరు(అర్బన్): జిల్లాలో ఎస్ఎఫ్ఐ ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన జానా వెంకయ్య (78) బుధవారం మృతిచెందారు. సింహపురి దేహ సమర్పణ సంస్థ కన్వీనర్ పి.విజయమ్మ అభ్యర్థన మేరకు ఆయన భౌతికకాయాన్ని కుమారుడు డా.చైతన్య కిశోర్, కుమార్తె స్రవంతి నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు దానం చేశారు. జానా వెంకయ్య ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తూ చాలాకాలం క్రితం స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు. ఆయన మరణించే వరకు సీపీఎంలో పని చేశారు. ఆయన మృతిపట్ల మాజీ డిప్యూటీ మేయర్ మాదాల వెంకటేశ్వర్లు, రామచంద్రారెడ్డి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేశ్వరరావు, ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎంవీ రమణయ్య, సీనియర్ డాక్టర్ దత్తాత్రేయులు తదితరులు సంతాపం తెలిపారు. ప్రధానమంత్రి ఫొటో ఎందుకు పెట్టలేదు● ప్రశ్నించిన బీజేపీ నేతలు వాకాడు: మండలంలోని వాకాడులో నిర్వహించిన రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో బ్యానర్పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటో లేకపోవడంపై బుధవారం జేసీ గోవిందరావును బీజేపీ నాయకులు ప్రశ్నించారు. తిరుపతి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు పాపారెడ్డి పురుషోత్తంరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పనబాక కోటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేస్తూ ప్రధాని ఫొటో లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కూటమిని అధికారంలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ అహర్నిశలు కష్టపడినట్లు చెప్పారు. ప్రతి పనికి రెవెన్యూ అధికారులు పేద ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటూ అన్యాయం చేస్తున్నారన్నారు. వారికి న్యాయం జరగకపోతే తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కండలేరులో 58.440 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 58.440 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 300 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,400, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 175, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసె క్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
శ్రీవారి హుండీ కానుకల లెక్కింపు
రాపూరు: పెంచలకోన క్షేత్రంలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాల్లోని హుండీల కానుకల లెక్కింపులో భారీ రాబడి వచ్చిందని ఏసీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. శ్రీవారి అలంకార మండపంలో బుధవారం కానుకల్ని లెక్కించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 రోజులకు గానూ రూ.35,36,474 వచ్చిందన్నారు. బంగారం 24 మిల్లీ గ్రాములు, వెండి 691 గ్రాములు వచ్చినట్లు చెప్పారు. పలు విదేశీ నాణ్యాలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో జిల్లా దేవదాయశాఖ అధికారులు, జె.శ్రీనివాసరావు, పి.శ్రీనివాసులు పాల్గొన్నారు. -
గిరిజనులపై చిన్నచూపు తగదు
● ఐదోరోజుకు రిలే నిరాహార దీక్షలు నెల్లూరు(దర్గామిట్ట): గిరిజనులపై చిన్నచూపు తగదని పలువురు నేతలు అన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ నూతన మేయర్ ఎన్నికకు సంబంధించి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని గిరిజన నేత బాపట్ల వెంకటపతి యానాది డిమాండ్ చేశారు. గిరిజన సంఘాలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష బుధవారం ఐదోరోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జయవర్ధన్, బాపట్ల వెంకటపతి యానాదికి పెద్దఎత్తున గిరిజన సంఘాల నుంచి మద్దతు లభించింది. నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తామన్నారు. అలాగే న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామన్నారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని జయవర్ధన్ హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు దీక్షకు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో చేవూరు శ్రీనివాసులు యానాది, యాకసిరి మురళి, ఎందేటి సురేంద్ర పాల్గొన్నారు. -
జిల్లా వ్యాప్తంగా నాకాబందీ
● డ్రంక్ అండ్ డ్రైవ్ 13, ఓపెన్ డ్రింకింగ్పై 27 కేసుల నమోదు నెల్లూరు(క్రైమ్): నేర నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడిలో భాగంగా మంగళవారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు నాకాబందీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, హైవే ప్రవేశం, నిష్క్రమణ, శివారు ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహించారు. 1,571 వాహనాలు తనిఖీ చేయగా 13 మంది మద్యం మత్తులో నడుపుతుండటంతో కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 121 మందిపై కేసు నమోదు చేసి రూ.73,345 అపరాధరుసుము విధించారు. బహిరంగ మద్యం సేవనంపై 27 కేసులు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా 51 లాడ్జీలను తనిఖీ చేశారు. ● షబ్ – ఏ – బరాత్ (పవిత్ర జాగరణ రాత్రి) సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి నగర ఏఎస్పీ దీక్ష నెల్లూరులోని మసీదులను సందర్శించారు. కమిటీలు, పెద్దలు, స్థానిక ముస్లింలతో మాట్లాడారు. ఆమె వెంట నగర ఇన్స్పెక్టర్లున్నారు. -
దోచుకొనే మిషన్
వింజమూరు(ఉదయగిరి): ఇంటింటికీ సురక్షత నీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్జీవన్ మిషన్ పథకం నిధులు పక్కదారి పడుతున్నాయి. అధికారుల కక్కుర్తి, కాంట్రాక్టర్ల స్వార్థం వెరసి రూ.కోట్ల ప్రజాధనం స్వాహా అవుతోంది. దీనికి ఉదాహరణ వింజమూరులో జరుగుతున్న పనులు. ఆవాసాలు, అవసరం లేని ప్రభుత్వ లేఅవుట్లలో తూతూమంత్రంగా పనులు చేస్తూ నిధులు ఆరగిస్తున్నారు. మండలంలో వివిధ పనులకు సంబంధించి రూ.1.84 కోట్లు జేజేఎం ద్వారా మంజూరయ్యాయి. చాకలికొండ లేఅవుట్కు రూ.16.20 లక్షలు, ఊటుకూరుకు రూ.13.20 లక్షలు, వింజమూరు సబ్స్టేషన్ వద్ద లేఅవుట్కు రూ.47 లక్షలు, దుత్తలూరు రోడ్డు మార్గంలో జాతీయ రహదారి వద్ద ఉన్న లేఅవుట్కు రూ.49.58 లక్షలు, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం ఉన్న మూడు లేఅవుట్లకు రూ.58 లక్షలు మంజూరయ్యాయి. వీటిలో జాతీయ రహదారి పక్కన ఉన్న లేఅవుట్ తప్ప మిగిలిన ఎక్కడా కూడా ఇళ్లు పూర్తి కాలేదు. ప్రజలు నివాసం ఉండటం లేదు. చిల్లచెట్లు పెరిగి అడవిని తలపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజిలెన్స్ విచారణ పేరుతో పనులు నిలిపివేశారు. ఎవరి కోసం చేస్తున్నారు? వింజమూరు – ఆత్మకూరు బైపాస్ సమీపంలో ఉన్న మూడు లేఅవుట్లలో సుమారు 250 మందికి పట్టాలు పంపిణీ చేశారు. వివిధ దశల్లో ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు ఆగిపోయాయి. దీంతో ప్రస్తుతం ఒక్కరు కూడా నివాసం లేరు. అదేవిధంగా ఊటుకూరు, చాకలికొండలో కూడా అదే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ పనులు అవసరం లేదు. ప్రజలున్న గ్రామాలు, కాలనీల్లో జేజేఎం పనులు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. కానీ గ్రామీణ నీటి సరఫరా అధికారులు ఈ అంశాలు పరిగణలోకి తీసుకోకుండా ఎస్టిమేషన్లు వేసి, టెండర్లు పిలిచి, పనులు చేయిస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల పూర్తి చేశారు. అప్పుడే పలు లేఅవుట్లలో కుళాయిలు ధ్వంసమయ్యాయి.జల్జీవన్ పథకం పేరుతో నిధుల స్వాహా నివాసాల్లేని ప్రాంతాల్లో పనులు కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కు రూ.1.84 కోట్ల పనుల్లో అక్రమాలునాసిరకంగా పనులు ఈ లేఅవుట్లలో చేస్తున్న పనులు నాసిరకంగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. పైపులైన్ వేసేందుకు తీసిన గుంతల్లో ఇసుక వేసి పూడాల్చి ఉండగా అలా జరగడం లేదు. తీసిన మట్టి పోసి పూడ్చుతున్నారు. కుళాయి దిమ్మెలు, సామగ్రి నాసిరకంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. బోర్లలో కొంచెం నీరు పడినా బిల్లులు పెడుతున్నారు. కానీ వాస్తవంగా కొన్ని బోర్లలో కనీసం అరగంట కూడా నీరు రావడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే వేసవిలో పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం వద్ద ఉన్న లేఅవుట్లలో మూడు బోర్ల పరిస్థితి ఇలాగే ఉంది. పనులపై విజిలెన్స్ విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయని స్థానికులు కోరుతున్నారు. -
రామాలయంలో చోరీ
● బంగారం, వెండి అపహరణకలువాయి(సైదాపురం): బంగారు, వెండి ధరలు పెరగడంతో కొందరు దుండగులు దేవస్థానాలను టార్గెట్గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. కలువాయి మండలం తోపుగుంట అగ్రహారంలోని రామాలయంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు పడ్డారు. అమ్మవారి మెడలో ఉన్న నాలుగు గ్రాముల బంగారు మంగళసూత్రం, కేజీ వెండి వస్తువులు, హుండీలోని నగదు తస్కరించారు. బుధవారం ఆలయానికి వచ్చిన పూజారి చోరీ జరినట్లు గుర్తించారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై కోటయ్య ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హుండీని పగులగొట్టి బయట గడ్డివాముల దగ్గర దుండగులు పడేశారు. హుండీలో సుమారు రూ.20 వేల నగదు ఉండొచ్చని భావిస్తున్నారు. ఘటన స్థలానికి క్లూస్టీమ్ వచ్చి వేలిముద్రలు సేకరించింది. మండలంలో జరుగుతున్న వరుస చోరీలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి
సంగం: జిల్లా స్థాయిలో 20,468 ఇళ్లను పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పనులు చేయిస్తున్నారని హౌసింగ్ శాఖ ఈఈ మోహన్రావు తెలిపారు. మండలంలోని పలు లేఅవుట్లను ఆయన బుధవారం సందర్శించి ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం కార్యాలయంలో రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఆప్షన్ 3 కింద కాంట్రాక్టర్లు నిర్మించిన ఇళ్లలో నాణ్యతా లోపాలు ఉన్నాయని ఫిర్యాదుల నేపథ్యంలో క్వాలిటీ కంట్రోల్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. 6,980 ఇళ్లలో లోపాలున్నట్లు గుర్తించామని వెల్లడించారు. 141 ఏజెన్సీలను బాధ్యులుగా గుర్తించగా, అందులో 67 ఏజెన్సీలు పనులు సరిచేయడానికి ముందుకు రావడం లేదన్నారు. వాటిపై పోలీసు కేసులు నమోదు చేసి ఖర్చులను రికవరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆవాస్ ప్లస్ పథకం కింద మరో 6,000 ఇళ్లకు సంబంధించిన సర్వే పూర్తయ్యిందన్నారు. ఈనెల 13వ తేదీ లోపు వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నట్లు ఈఈ తెలిపారు. కార్యక్రమంలో ఏఈ గౌస్మొహిద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఒంటరితనం.. ఆరోగ్య సమస్యలతో..
● వ్యక్తి ఆత్మహత్య నెల్లూరు సిటీ: ఓవైపు ఒంటరితనం.. మరోవైపు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఓ వ్యక్తి మానసికంగా కుంగిపోయి బలనవ్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. రూరల్ మండలంలోని కల్లూరుపల్లిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో దేవరకొండ శ్రీనివాసులు (54) నివాసం ఉంటున్నా డు. ఇటీవల అతని తల్లి మృతిచెందింది. శ్రీనివాసులుకు వివాహం కాకపోవడంతో ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో అతను బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మానసికంగా కుంగిపోయాడు. మంగళవారం తన ఇంటికి సమీపంలోని ఆటో స్టాండ్ వద్ద మద్యం తాగాడు. సమీపంలో మున్సిపల్ పార్కులో చెట్టుకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం తెల్లవారుజామున స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
అవినీతిలో కొత్త పుంతలు
తనఖాలో ఉన్న భూమికి రిజిస్ట్రేషన్ – కోవూరు సబ్ రిజిస్ట్రార్ నిర్వాకం రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి కొత్త పుంతలు తొక్కుతోంది. ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా, ఏ మాత్రం లెక్కచేయకుండా అధికారులు అడ్డదారుల్లో వెళ్తున్నారు. ప్రభుత్వ భూములే కాకుండా బ్యాంక్ తనఖాల్లో ఉన్న వాటికి సైతం కాసులకు కక్కుర్తిపడి రిజిస్ట్రే షన్లు చేస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది. తాజాగా కోవూరు సబ్ రిజిస్ట్రార్ తీరుపై బ్యాంక్ అధికారులు సీరియస్ అవ్వడం జిల్లాలో హాట్టాపిక్గా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అక్రమాలకు అడ్డాగా మారాయి. ఏ మాత్రం జంకు బొంకు లేకుండా అడ్డదారుల్లో అధికారులు వెళ్తున్నారు. తాజాగా బ్యాంక్ తనఖాలో ఉన్న భూమిని కోవూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేశారు. జరిగిందిదీ.. కోవూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని విడవలూరు మండలం ముదివర్తికి సంబంధించిన సర్వే నంబర్ 434లో దాదాపు మూడెకరాలకుపైగా భూమిని 2001లో అప్పటి ఆంధ్రా బ్యాంక్లో తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. అప్పట్లో 146 – 2001, 147 – 2001 మార్ట్గేజ్ డాక్యుమెంట్ నంబర్లుగా ఉన్నాయి. వాస్తవానికి ఇవి 22 బీగా నమోదవుతాయి. ఈసీలో సైతం మార్ట్గేజ్ చేసినట్లుగా ఉంటుంది. బ్యాంక్ క్లియరెన్స్ ఇచ్చేంత వరకు వీటిని రిజిస్టర్ చేయకూడదు. అయితే స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ భూమిని 5053 – 2025 డాక్యుమెంట్ నంబర్గా సబ్ రిజిస్ట్రార్ ఇటీవల రిజిస్ట్రేషన్ చేశారు. భారీగా చేతులు మారిన నగదు నిజానికి భూమిని రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు. భూమి స్థితిగతులు, వన్బీ, అడంగళ్తో పాటు ఈసీని నిశితంగా గమనిస్తారు. అయితే కోవూరు సబ్ రిజిస్ట్రార్ మాత్రం ఈసీని సైతం పరిశీలించకుండానే రిజిస్టర్ చేశారు. ఈ వ్యవహారం వెనుక భారీ మొత్తంలో చేతులు మారాయనే ప్రచారం జరుగుతోంది. సీరియస్ అయిన అధికారులు గతంలోని ఆంధ్రా బ్యాంక్ ప్రస్తుతం యూనియన్ బ్యాంక్గా రూపాంతరం చెందింది. తమ తనఖాలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయడంపై అక్కడి అధికారులు సీరియస్ అయ్యారు. చట్ట విరుద్ధంగా ఇలా ఎలా చేస్తారంటూ ఆయన్ను నిలదీశారని తెలుస్తోంది. ఈ విషయమై రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా, చర్యలకు ఆ శాఖ వెనుకాడుతోందనే టాక్ నడుస్తోంది. 2001లోనే అప్పటి ఆంధ్రా బ్యాంక్ ద్వారా రుణం పొందిన వైనం మార్ట్గేజ్లో ఉందని తెలిసినా క్లియరెన్స్ ఆగ్రహం వ్యక్తం చేసిన యూబీఐ అధికారులు చర్యలకు వెనుకాడుతున్న రిజిస్ట్రేషన్ శాఖ ఆఫీసర్లు ఈసీ చూడకుండా చేసింది వాస్తవమే ఈసీ చెక్ చేయకుండానే రిజిస్ట్రేషన్ చేశాను. తప్పును తెలుసుకొని సరి చేసుకున్నా. బ్యాంక్కు లోన్ను చెల్లించేలా చేసి క్లియరెన్స్ ఇప్పించా. – పెంచలయ్య, సబ్ రిజిస్ట్రార్, కోవూరు -
కృష్ణపట్నం పోర్టులో స్థానికులకే ఉద్యోగావకాశాలు
ముత్తుకూరు(పొదలకూరు): అదానీ కృష్ణపట్నం పోర్టులో జిల్లాకు చెందిన వారికే 70 శాతం మేర ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నామని యాజమాన్యం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘భూముల త్యాగం.. ఉద్యోగాల్లో మోసం’ శీర్షికన సాక్షిలో బుధవారం ప్రచురితమైన కథ నానికి వారు స్పందించారు. ఇక్కడి శ్రామికుల్లో 76 శాతం మంది రాష్ట్రానికి చెందిన వారేనని తెలిపింది. స్థానికంగా ఉపాధి అవకాశాలను సృష్టించడం, ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడేందుకు కృషి చేస్తున్నామని వివరించింది. భవిష్యత్తులో వచ్చే సవాళ్లను స్వీకరించేందుకు, నైపుణ్యాలను పెంపొందించేందుకు పని శక్తిని కొనసాగించనున్నామని వెల్లడించింది. అమరావతికి చేరిన నీటి పంచాయితీ నెల్లూరు(స్టోన్హౌస్పేట): జిల్లాలో సాగునీరు పుష్కలంగా ఉన్నా, దాన్ని అందించే విషయంలో సమస్యలు నెలకొన్నాయి. జిల్లా స్థాయిలో పరిష్కరించాల్సిన సమస్యలను టీడీపీ ప్రభుత్వం గాలికొదిలింది. నీటి వినియోగదారుల సంఘ అధ్యక్ష, ఉపాధ్యక్షులు, ఇంజినీర్లను రాష్ట్రస్థాయి సమావేశం నిమిత్తం అమరావతికి పిలిచారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం గురువారం మధ్యాహ్నం నుంచి జరగనుంది. ఇక్కడ పరిష్కరించలేని వాటిని అక్కడ ఎలా చక్కదిద్దుతారోనంటూ సమావేశానికి వెళ్తున్న వారే పేర్కొనడం గమనార్హం. అపార్ వ్యవస్థతో భవిష్యత్తుకు భరోసా వెంకటాచలం: అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్)తో విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా లభిస్తుందని వీఎస్యూ వీసీ అల్లం శ్రీనివాసరావు పేర్కొన్నారు. అపార్ క్రెడిట్ సీడింగ్పై మండలంలోని కాకుటూరు వద్ద గల వర్సిటీలో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్క్షాపులో ఆయన మాట్లాడారు. ఈ వ్యవస్థ ద్వారా విద్యార్థుల అకడమిక్ క్రెడిట్లను డిజిటల్ రూపంలో భద్రపర్చనున్నారని వివరించారు. కార్యక్రమంలో ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్పర్సన్ రత్నా షీలామణి, డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ప్రాంతీయ సమన్వయకర్త రవి పాండే, వీఎస్యూ ఇన్చార్జి రిజిస్ట్రార్ సునీత, ప్రిన్సిపల్ విజయ, వెంకట్రాయులు, మధుమతి, సుజాత తదితరులు పాల్గొన్నారు. 21 బార్లకు.. 84 దరఖాస్తులు నెల్లూరు(క్రైమ్): జిల్లాలో ఓపెన్ కేటగిరీలో మిగిలిపోయిన బార్ల దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ బుధవారంతో ముగిసింది. 21 బార్లకు గానూ 84 దరఖాస్తులొచ్చాయి. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 18.. కావలి పరిధిలో రెండు, ఆత్మకూరు పరిధిలో ఒకటి.. ఇలా మొత్తంగా 21 బార్లకు రీ నోటిఫికేషన్ను ఎకై ్సజ్ అధికారులు గత నెల 27న విడుదల చేశారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియడంతో కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో లాటరీ డ్రాను గురువారం నిర్వహించనున్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి ఉదయగిరి: ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రోత్సహించాలని ప్రకృతి వ్యవసాయ జిల్లా మేనేజర్ కన్నయ్య పేర్కొన్నారు. రైతు సాధికారత సంస్థ ఆధ్వర్యంలో ఏపీ కమ్యూనిటీ మేనేజ్మెంట్ నేచురల్ ఫార్మింగ్ పథకంలో భాగంగా పట్టణంలోని బిట్ – 1 రైతు సేవా కేంద్రంలో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై సీఆర్పీలతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పెట్టుబడులను రైతులు తగ్గించుకొని.. నాణ్యమైన అధిక దిగుబడులను పొందొచ్చని చెప్పారు. అనంతరం మట్టి నమూనాల సేకరణపై అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంతో సాగు చేసిన పంటలను పరిశీలించారు. రీజినల్ సాంకేతిక కోఆర్డినేటర్ రవిచంద్రప్రసాద్, ఏడీఏ చెన్నారెడ్డి, సిబ్బంది మల్లికార్జున, ట్రెయినర్ రామ్మోహన్ పాల్గొన్నారు. -
పర్మిట్లు లేకున్నా..
పర్మిట్లు లేకున్నా సిలికాను యథేచ్ఛగా తరలిస్తున్నారు. అనధికార రీచ్లలో తవ్వకాలు చేసి ఇతర పర్మిట్లతో పంపిస్తున్నారు. ఇందులో కూడా వాహనానికి పది టన్నుల పర్మిట్ను తీసుకొని ఓవర్ లోడ్ దాదాపు 25 నుంచి 30 టన్నుల వరకు తరలిస్తున్నార. కేవలం ఆ పది టన్నులకే రాయల్టీని చెల్లిస్తున్నారు. 12 టైర్ల వాహనాలకు 25 టన్నులు.. 16 టైర్ల వాహనాల్లో 35 టన్నుల మేర రవాణా చేస్తున్నా.. అటు మైనింగ్ అధికారులు గానీ ఇటు రవాణాశాఖాధికారులు గానీ ఎక్కడా వీటిని తనిఖీ చేసిన పాపాన పోవడం లేదు. యథేచ్ఛగా దోపిడీ సాగుతున్నా.. ఆ వైపు కన్నెత్తి చూసే సాహసాన్ని ఎవరూ చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో ప్రధాన నేతలతో సంబంధాలు ఉన్న సంస్థ కావడంతో దోపిడీని అరికట్టే సాహసం ఎవరూ చేయలేరు. స్థానిక అధికార యంత్రాంగం, విజిలెన్స్, మైనింగ్, పోలీస్, రెవెన్యూ యంత్రాంగం అనధికార దోపిడీకి రక్షణగా నిలుస్తున్నారు. ఇక స్థానిక ప్రజాప్రతినిధులు సైతం చూస్తూ ఉండాల్సిందే. వారిచ్చే తాయిలాలు తీసుకొని మౌనం పాటించాల్సిందేనని ప్రచారం ఉంది. -
రెడ్క్రాస్ కేన్సర్ ఆస్పత్రి సేవలు ఎనలేనివి
దాతల సహకారంతో ముందుకు ● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(అర్బన్): కేన్సర్ బారినపడిన పేద, మధ్య తరగతి ప్రజలకు అండగా ఉంటూ రూపాయి ఖర్చు లేకుండా ఎన్టీఆర్ వైద్యసేవా పథకం ద్వారా చికిత్సలను అందిస్తున్న రెడ్క్రాస్ కేన్సర్ ఆస్పత్రి సేవలు ఎనలేనివని కలెక్టర్ హిమాన్షు శుక్లా కొనియాడారు. ప్రపంచ కేన్సర్ దినోత్సవం, పొదలకూరు రోడ్డులో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో కేన్సర్ ఆస్పత్రిని స్థాపించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రజతోత్సవ వేడుకలను ఆస్పత్రి ఆవరణలో బుధవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. కేన్సర్ను ముందుగానే గుర్తించేందుకు గానూ స్క్రీనింగ్ పరీక్షలను చేయించుకోవాలని కోరారు. రెడ్క్రాస్ లాంటి సంస్థలు లాభాపేక్ష లేకుండా సేవా భావంతో వైద్యాన్ని అందిస్తున్నాయని చెప్పారు. పలువురి విరాళం కేన్సర్ ఆస్పత్రికి నగరానికి చెందిన శ్రీహరిరెడ్డి రూ.1.1 కోట్లను విరాళంగా ప్రకటించారు. ఆస్పత్రిలో ఐదు నూతన గదుల నిర్మాణానికి ఆర్థిక సాయాన్ని అందజేయనున్నామని రెడ్క్రాస్కు చెందిన రంగయ్యనాయుడు తెలిపారు. రెడ్క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు రామారావు, ఉపాధ్యక్షుడు రామచంద్రరాజు, కోశాధికారి శ్రీహరిరావు, వైస్ చైర్మన్ జనార్దన్రాజు, కో శాధికారి సురేష్జైన్, ఎడవల్లి సురేష్, వెంకటేష్, రంగాచారి, కేన్సర్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆరు పడకలతో 2001లో ప్రారంభమైన కేన్సర్ ఆస్పత్రి.. ఇప్పుడు 150 పడకలతో ఆధునిక యంత్రాలతో అభివృద్ధి చెందేందుకు నిబద్ధత కలిగిన డాక్టర్ల సేవలతో పాటు దాతల కృషి కారణమని రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ వాకాటి విజయకుమార్రెడ్డి పేర్కొన్నారు. దాతల సహకారంతోనే మంచి వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నామని చెప్పారు. ఆస్పత్రి అభివృద్ధికి సహకరించిన జేఎస్ చారిటబుల్.. భగవాన్ మహావీర్ ట్రస్ట్ల నిర్వాహకులతో పాటు సుమంత్రెడ్డి, దొడ్ల స్వాతి, డేవిట్ పీటర్, సీతారాములు తదితరులను కలెక్టర్ సత్కరించారు -
సీమ ఎత్తిపోతలపై వెనుకడుగేసేదిలేదు
● దీని సాధనే ధ్యేయంగా పనిచేస్తాం ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పొదలకూరు: రాయలసీమ ఎత్తిపోతలపై వెనుకడుగేసే ప్రసక్తే లేదని, దీని సాధనే ధ్యేయంగా నిర్వహించే ఉద్యమాల్లో పాల్గొంటామని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని పొదలకూరు, భోగసముద్రంలో బుధవారం ఆయన పర్యటించారు. యూరియా సకాలంలో అందడంలేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. కూటమి పాలన అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులను నిలిపేయడాన్ని నిరసిస్తూ చలో పోతిరెడ్డిపాడుకు తమ పార్టీ గురువారం పిలుపునిచ్చిందని వెల్లడించారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి తలపెట్టిన ఎత్తిపోతల పథకాన్ని తిరిగి ప్రారంభించేంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూనే ఉంటామని చెప్పారు. నాటికి.. నేటికీ మధ్య ఎంతో వ్యత్యాసం రైతులు, ప్రజల సంక్షేమానికి కృషి చేసిన నాటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి.. అన్నదాతలను అష్టకష్టాలకు గురిచేస్తున్న కూటమి సర్కార్కు మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని విమర్శించారు. కూటమి కక్షసాధింపులతో విసిగి వేశారిన ప్రజలు జగనన్న పాలనను కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలెప్పుడొచ్చినా జగన్మోహన్రెడ్డి సీఎం కావడం ఖాయమని తెలిపారు. ఆయన పర్యటనను అడుగడుగునా అడ్డుకునేందుకు పోలీసులను ఉసిగొల్పి, ఎక్కడా లేని నిబంధనలను సృష్టించి ప్రజలను నిలువరించేందుకు యత్నించారని మండిపడ్డారు. అయినా ప్రజలు భారీగా తరలిరావడం రేపటి రోజున తమ పార్టీ ఘన విజయానికి సంకేతమని పేర్కొన్నారు. జిల్లాలో పార్టీ కార్యకర్తలకు ఎలాంటి కష్టమొచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన పోరాటం చేస్తామన్నారు. యూరియా సకాలంలో అందక రైతులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని వివరించారు. పొదలకూరుకు చెందిన వెన్నపూస సుందర్రెడ్డి.. భోగసముద్రంలో త్రోవగుంట ప్రసాద్నాయుడి తండ్రి మస్తాన్నాయుడి మృతి చెందడంతో వారి కుటుంబాలను పరామర్శించారు. సొసైటీ మాజీ చైర్మన్ గోగిరెడ్డి గోపాల్రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, వెన్నపూస జనార్దన్రెడ్డి, విష్ణు, వేణుగోపాల్రెడ్డి, అంజద్, శ్రీనివాసులురెడ్డి, విజయభాస్కర్రెడ్డి, శ్రీనారెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులో ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్
నెల్లూరు(అర్బన్): నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కంటి రెటీనా వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఓజర్డెక్స్ అనే ఇంట్రావిట్రియల్ ఇంజెక్షన్ను అందుబాటులోకి తెచ్చామని కంటి విభాగాధిపతి డాక్టర్ వసంత తెలిపారు. మంగళవారం ఆస్పత్రిలో పీజీ వైద్య విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఇంజెక్షన్ ఖరీదు రూ.36 వేలు అన్నారు. ఏబీబీవీఐఈ సంస్థ స్పాన్సర్గా రెటీనా కన్సల్టెంట్ డాక్టర్ రాజశేఖర్ ఎలాంటి వారికి, ఏ స్థితిలో ఇవ్వాలో వివరించారు. నారాయణ ఆస్పత్రి కంటి వైద్య విభాగానికి చెందిన పీజీ వైద్య విద్యార్థులు, యువ వైద్యులు ఇంజెక్షన్ గురించి తెలుసుకున్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి సహకారంతో శిక్షణను నిర్వహించారు. డయాబెటిక్ మాక్యులర్ ఎడిమా, కంటి రక్తనాళాల అడ్డంకి, యువైటీస్ వంటి వ్యాధుల్లో వినియోగించే ఇంజెక్షన్లపై అవగాహన కల్పించారు. కంటి సమస్యలున్న పేదలు వినియోగించుకోవాలని అధికారులు కోరారు. -
ప్రధాన కార్యాలయానికి ఎంవీఐ అటాచ్
నెల్లూరు(టౌన్): జిల్లాలోని గూడూరులో ఎంవీఐగా పనిచేస్తున్న సునీల్రెడ్డిని విజయవాడలోని రవాణా శాఖ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆ శాఖ కమిషనర్ మనీష్కుమార్ సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సునీల్ గూడూరులో రిలీవై ప్రధాన కార్యాలయంలో మంగళవారం రిపోర్టు చేసినట్లు సమాచారం. కార్మికుడి ఆత్మహత్మకోట: ఆప్కో సంస్థలో కా ర్మికుడిగా పనిచేస్తున్న బాబుల్ హక్ (27) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై పవన్ కుమార్ కథనం మేరకు.. విద్యానగర్ వద్ద ఆప్కో సంస్థ ద్వారా సాగరమాల రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్కు చెందిన కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. వారిలో బాబుల్ హక్ కూడా ఉన్నాడు. రెండు నెలల క్రితం పనిలో చేరాడు. సోమవారం రాత్రి భార్యతో ఫోన్లో మాట్లాడుతూ ఇద్దరూ పరస్పరం గొడవ పడినట్లు కార్మికులు చెబుతున్నారు. సమీపంలోని వంతెన వద్ద కమ్ములకు బాబుల్ హక్ ఉరేసుకుని ఉండటాన్ని మంగళవారం తెల్లవారుజామున గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్సై వివరాలు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రెండు ఇసుక టిప్పర్ల సీజ్ కోవూరు: కోవూరు పరిసర ప్రాంతాల నుంచి ఎటువంటి పత్రాల్లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు టిప్పర్లను జాతీయ రహదారిపై లారీ యార్డు వద్ద మైన్స్ అండ్ జియాలజీ అధికారులు పట్టుకున్నారు. ఏడీ బి.రామచంద్రరావుకు అందిన ముందస్తు సమాచారంతో మంగళవారం తెల్లవారుజాము నుంచి నిఘా ఉంచారు. కోవూరు నుంచి ఒంగోలు వైపు ఇసుకను తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తదుపరి చర్యల నిమిత్తం వాహనాలను కోవూరు పోలీసుస్టేషన్లో అప్పగించారు. తనిఖీలు చేసే సమయంలో వాహనదారుల వద్ద ఎటువంటి వే బిల్లులు, మైనింగ్ అనుమతి పత్రాల్లేకపోవడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని విధంగా మైన్స్ అండ్ జియాలజీ శాఖ నేరుగా రంగంలోకి దిగి టిప్పర్లను సీజ్ చేయడం స్థానికంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో ఉన్న సూత్రధారులెవరు? పట్టుబడిన టిప్పర్లు ఎవరివి? అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. -
లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
● తప్పిన పెను ప్రమాదం కోవూరు: లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టిన ఘటన మంగళవారం కోవూరులో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కొందరు యాత్రికులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కన్యాకుమారికి వెళ్లారు. అక్కడి నుంచి విజయవాడకు బయలుదేరారు. ఈ క్రమంలో బస్సు కోవూరు లారీ స్టాండ్ సమీపానికి చేరుకుంది. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో బస్సు లారీ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై కేకలు వేశారు. కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. కోవూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పెను ప్రమాదం తప్పడంతో యాత్రికులు ఊపిరి పీల్చుకున్నారు. -
లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకూ పోరాటం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): లేబర్ కోడ్స్ను రద్దు చేసే వరకూ పోరాటం చేస్తామని వివిధ సంఘాల నేతలు తెలిపారు. ట్రేడ్ యూనియన్లు, రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు మంగళవారం నెల్లూరులోని టౌన్హాల్లో సదస్సు నిర్వహించాయి. దీనికి సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.అజయ్కుమార్, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జయకుమార్రెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కొండలరావు, ఏఐఎఫ్టీయూ (న్యూ) రాష్ట్ర అధ్యక్షుడు జాస్తి కిశోర్బాబు, ఏఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు మోహన్ మాట్లాడారు. కేంద్రం ప్రభుత్వం కార్మికులు, ఉద్యోగుల హక్కులను హరించేలా కార్మిక చట్టాలను రద్దు చేసిందన్నారు. కొత్త లేబర్కోడ్స్ అమలైతే కార్మికవర్గం కనీస వేతనం కోల్పోతుందని, ఉద్యోగభద్రత ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 12వ తేదీన జరిగే సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర బడ్జెట్ కార్మికులు, సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా ఉందన్నారు. కార్పొరేట్లకు ఆదాయాన్ని సమకూర్చే బడ్జెట్ అని ఆరోపించారు. సదస్సులో నాయకులు చంద్రశేఖర్రెడ్డి, బసవరాజు, టీవీవీ ప్రసాద్, గోగుల శ్రీనివాసులు, జలీల్ఖాన్, శంకర్ కిశోర్, యానాదయ్య, రాంబాబు, వినోదిని తదితరులు పాల్గొన్నారు. -
పెద్దాస్పత్రిలో హెర్బల్ పార్కు
● సీఈఓ చంద్రశేఖర్ నెల్లూరు(అర్బన్): పేషెంట్ దగ్గరకే నేచర్ అనే కాన్సెప్ట్తో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో హెర్బల్ పార్కు ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు సీఈఓ ఆవుల చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం ఆయన సూపరింటెండెంట్ డాక్టర్ మాధవితో కలిసి ఆస్పత్రి, మెడికల్ కళాశాల ఆవరణలోని ఖాళీ ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ తొలిదశలో జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో హెర్బల్ పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. నెల్లూరులో రెండెకరాల స్థలంలో పార్కును ఏర్పాటు చేస్తామన్నారు. వాకింగ్ ట్రాక్, బెంచీలు, పూలమొక్కలు, తాగునీటి వసతి, సీ్త్ర, పురుషులకు వేర్వేరుగా టాయిలెట్స్ ఉంటాయన్నారు. అశ్వగంధ, వేప, తులసి మొక్కలు నాటుతారన్నారు. ప్రభుత్వ నిధులతోపాటు దాతలు, పారిశ్రామికవేత్తల సహకారం తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి అభివృద్ధి కమిటీ కో ఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులు, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి, ఉద్యానాధికారి సాయి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రదీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆయిల్ యూనిట్పై విజిలెన్స్ దాడులు
● రూ.1.46 కోట్ల విలువైన ఆయిల్ స్వాధీనం మనుబోలు: మండల పరిధిలోని మనుబోలు జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఇండస్ట్రియల్ ఆయిల్ యూనిట్పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. జ్యాన్తి మల్టీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్లో తనిఖీలు చేశారు. బిల్లుల్లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఇండస్ట్రియల్ ఆయిల్ను దిగుమతి చేసుకుని, డీజిల్ పేరుతో అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. సదరు సంస్థ చెల్లుబాటయ్యే లైసెన్స్లు, విక్రయ బిల్లులు, ఫాం ఎఫ్ తదితర అనుమతులు లేకుండానే వ్యాపారం చేస్తున్నట్లు బయటపడింది. రూ.97.90 లక్షల విలువ చేసే 1.10 లక్షల లీటర్ల ఇండస్ట్రియల్ ఆయిల్, రూ.49 లక్షల విలువైన 5 ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సరుకును మనుబోలు తహసీల్దార్కు అప్పగించారు. ఈ ఘటనపై ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955లోని సెక్షన్ 6–ఏ ప్రకారం చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. సంస్థ డైరెక్టర్లు చంద్రభాన్ సింగ్, మమతాసింగ్, స్థానిక ఆర్గనైజర్ నరేష్నాయుడిపై కేసు నమోదు చేసి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించామన్నారు. దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఐఓపీ శ్రీహరి, ఏఎస్ఓలు లక్ష్మీనారాయణ, పుల్లయ్య, పొదలకూరు సీఎస్డీటీ రవి, తహసీల్దార్ కృష్ణప్రసాద్, ఏఈఈ వెంకటరెడ్డి, ఇన్స్పెక్టర్ ఎస్కే రియాజ్ పాల్గొన్నారు. -
కార్మికులతో డీఎస్పీ, అధికారుల చర్చలు
● నిరసన వాయిదా కొడవలూరు: మండలంలోని రాచర్లపాడు వయోనా ఎనర్జీ ఫ్యాక్టరీ ఎదుట కార్మికుల నిరసన మంగళవారం కూడా కొనసాగింది. తొలగించబడిన కార్మికులు ఉదయం 9 గంటలకు ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని నిరసన ప్రారంభించారు. దీంతో యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, సీఐ ఎ.సురేంద్రబాబు, ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి, తహసీల్దార్ కె.స్ఫూర్తి రెడ్డి ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని నిరసనకారులు, యాజమాన్యంతో చర్చించారు. తమను విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీలో జూలై మాసంలో ఉత్పత్తి ప్రారంభమవుతున్నందున అప్పట్నుంచే విధుల్లోకి తీసుకుంటామని సంస్థ ప్రతినిధి వేణుగోపాల్ తెలిపారు. అందుకు కార్మికులు అంగీకరించలేదు. నాలుగు రోజుల గడువిస్తే యాజమాన్యంతో మాట్లాడి స్పష్టత ఇస్తామని, అప్పటి వరకూ నిరసనలు ఆపాలని వేణుగోపాల్ కోరారు. అందుకు కార్మికులు కూడా అంగీకరించి నిరసనను ఉపసంహరించారు. కార్యక్రమంలో రేగడిచెలిక, రాచర్లపాడు గ్రామస్తులు పాల్గొన్నారు. -
కేన్సర్.. డేంజర్ బెల్స్
● వేగంగా పెరుగుతున్న కేసుల సంఖ్య ● జిల్లాలో ఇప్పటికే సుమారు 35 వేలమంది రోగులు ● అవగాహన, స్క్రీనింగ్ పరీక్షలతో చెక్ ● నేడు ప్రపంచ కేన్సర్ నివారణ దినోత్సవం మేజర్, మైనర్ సంవత్సరం ఆపరేషన్లు కీమో తీసుకుంది 2021 933 7,106 2022 1,055 9,497 2023 1,029 10,739 2024 1,135 8,871 2025 1,077 9,200 ● గతేడాదిలో సుమారు 9,757 కొత్త కేసులకు రేడియోథెరపీ ఇచ్చారు. నెల్లూరు(అర్బన్): పాతికేళ్ల క్రితం సమాజంలో ఎక్కడో ఒకటి, అరా కేన్సర్ కేసులు కనిపించేవి. జీవనశైలిలో మార్పులు, కాలుష్యం, కల్తీ ఆహారం, ప్లాస్టిక్ వినియోగంతో ఇప్పుడు చాపకింద నీరులా విస్తరిస్తోంది. జిల్లాలో 35 వేల మంది వరకు బాధితులున్నట్టు వైద్యాధికారులు అంచనా వేస్తున్నారు. ఇంటి పెద్దకు జబ్బు వస్తే కుటుంబ సభ్యులంతా అల్లాడిపోతున్నారు. ఆర్థికంగా మాత్రమే కాకుండా మానసికంగా కుంగిపోతున్నారు. అనేకమంది మృత్యువాత పడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వివిధ ఆరోగ్య సంఘాల సహకారంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీని ప్రపంచ కేన్సర్ నివారణ దినోత్సవంగా ప్రకటించింది. జిల్లాలో బుధవారం వైద్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఏడాది జిల్లాలో కేన్సర్ రోగులు ప్రతి ఏడాది పెరుగుతున్నారు. నెల్లూరు నగరంలో పూర్తిస్థాయిలో మెడికవర్ కేన్సర్ ఇన్స్టిట్యూట్, రెడ్క్రాస్ కేన్సర్ ఇన్స్టిట్యూట్లో సేవలందుతున్నాయి. తర్వాత ప్రభుత్వ పెద్దాస్పత్రిలో రేడియేషన్ మినహా మిగతా కీమో, సర్జరీలు లాంటివి చేస్తున్నారు. ఇంకా నారాయణ, అపోలో ఆస్పత్రుల్లో కీమో సేవలందిస్తున్నారు. మెడికవర్లో గత రెండేళ్లుగా రెడ్క్రాస్ ఆస్పత్రి స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రోజూ ఓపీ 10 నుంచి 15 వరకు ఉంది. నెలకు సరాసరి 20 నుంచి 22 మందికి ఆంకాలజీ, మరికొన్ని సర్జరీలు జరుగుతున్నాయి. ఇక చైన్నె, హైదరాబాద్, తిరుపతి నగరాలకు వెళ్లి చికిత్స పొందేవారు కూడా నాలుగు వేల మంది వరకు ఉన్నట్టు అంచనా. తొలిదశలో గుర్తిస్తేనే.. చాలామందికి కేన్సర్ ఉన్నట్టు తెలియదు. మూడో, నాలుగో స్టేజీల్లో బయటపడుతుంది. చివరి దశలో గుర్తిస్తే ప్రాణాంతకం. అందువల్ల ప్రజలు అవగాహన పెంచుకోవాలి. 35 సంవత్సరాల వయసు దాటిన వారు సంవత్సరానికి ఒక దఫా ముందస్తు స్క్రీనింగ్ చేయించుకోవాలి. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే సులభతరంగా చికిత్స అందించవచ్చు. అలాగే 9 నుంచి 14 ఏళ్ల వయసున్న బాలికలకు కొన్ని రకాల కేన్సర్లు సోకకుండా వాక్సిన్ వేయిచాలి. 40 ఏళ్లు దాటిన సీ్త్రలు మోమోగ్రఫీ, పాప్స్మియర్ లాంటి పరీక్షలు చేయించుకోవాలి.రెడ్క్రాస్ కేన్సర్ ఆస్పత్రిలో పరిశీలిస్తే.. -
సాక్షిపై మాజీ ఎమ్మెల్సీ వాకాటి చిందులు
నెల్లూరురూరల్: కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి సాక్షిపై, గత ప్రభుత్వంపై చిందులు తొక్కారు. సాక్షి విలేకరి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక గల్లీ స్థాయిలో అభ్యంతరకర భాషలో విరుచుకుపడ్డాడు. బడ్జెట్లో అమరావతికి రూ.1500 కోట్లు కేంద్రం ఇస్తున్నట్లుగా చెప్పడంతో.. అప్పుగానే తప్ప.. బడ్జెట్ కేటాయింపులు కాదు కదా? అని ప్రశ్నించిన విలేకరిపై ఆవేశంగా మాట్లాడారు. రైల్వేజోన్, ట్రిపుల్ ఐటీ, గిరిజన యూనివర్సిటీ, పోర్టులకు రైతులకు ఇచ్చే సబ్సిడీలు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించ లేదని ప్రశ్నించడంతో వాకాటి మరింతగా రెచ్చిపోయారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఏం చేశారని ప్రశ్నిస్తున్నారే.. అప్పట్లో కూడా కేంద్ర ప్రభుత్వం మీదే కదా అంటే అప్పుడు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరంటూ సమాధానం దాటవేశారు. తిరుమల లడ్డూలో కొవ్వు కలవలేదని సాక్షాత్తు సుప్రీం కోర్టు నియమించిన సీఐబీ నివేదిక ఇచ్చినా.. బీజేపీ నేతగా వాకాటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కూటమి నేతల దుష్ప్రచారంపై వైఎస్సార్సీపీ నేతలు నిజాలు నిగ్గుతేలాయని చెబుతుంటే జీర్ణించుకోలేక.. వారిపైనా దూషణలకు దిగారు. కూటమిలో భాగస్వామి పార్టీ నేతగా ఉన్న వాకాటి ఆ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా టీడీపీకి వత్తాసు పలుకుతూ చెలరేగిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలో మైపాడులో బీచ్ ఫెస్టివల్ ఇందుకూరుపేట: ప్రముఖ పర్యాటక కేంద్రమైన మైపాడు బీచ్లో త్వరలో బీచ్ ఫెస్టివల్ను నిర్వహించనున్నట్లుగా జిల్లా పర్యాటక శాఖ అఽధికారిణి ఉషశ్రీ తెలిపారు. సోమవారం ఆమె మండల తహసీల్దార్ బీ మురళీతో కలిసి మైపాడు బీచ్ను పరిశీలించారు. తీరంలోని పరిస్థితులపై అధికారులతో పాటు స్థానికులను ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు తీరంలోని పరిస్థితులను పరిశీలించినట్లుగా తెలిపారు. ఆమె వెంట స్థానిక వీర్వో శ్రీహరి ఉన్నారు. చిన్నారుల్లో వైకల్యాన్ని ముందుగా గుర్తించాలి నెల్లూరు(పొగతోట): గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చిన్నారుల్లో అంగవైకల్యాన్ని ముందుగా గుర్తించాలని ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్ అంగన్వాడీకార్యకర్తలకు సూచించారు. సోమవారం సీఆర్సీ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పీడీ మాట్లాడారు. పీడీబ్ల్యూడీ, సీఆర్సీ ప్రయోజనాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం అంగవైకల్యాన్ని గుర్తించేందుకు అవసరమై న కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ డైరెక్టర్ మనోజ్కుమార్, సీడీపీఓ అరుణ, సీడీఈఐసీ ప్రత్యేక విద్యావేత్త రాకేష్, పునరావాస అఽధికారి ప్రవీణ్కుమార్ పాల్గొన్నారు. పోలీసింగ్లో డ్రోన్ టెక్నాలజీ కీలక ఆయుధం నెల్లూరు(క్రైమ్): పోలీసింగ్లో డ్రోన్ టెక్నాలజీ కీలక ఆయుధమని ఏఎస్పీ సీహెచ్ సౌజన్య పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డ్రోన్ బృందాలకు సోమవారం నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఏఎస్పీ మాట్లాడారు. కార్డన్ సెర్చ్, ఓపెన్ డ్రింకింగ్, జూదాలు వంటి అక్రమ కార్యకలాపాలపై డ్రోన్ నిఘాను మరింత పెంచాలన్నారు. పాఠశాల, కళాశాలల పరిసరాల్లో ఈవ్టీజింగ్ కట్టడికి శక్తి టీమ్లను సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలని సూచించారు. పీసీఆర్ ఇన్స్పెక్టర్ భక్తవత్సలరెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ బీ శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
తిరుమల లడ్డూపై దుష్ప్రచారం దుర్మార్గం
నెల్లూరు(క్రైమ్): పవిత్రమైన తిరుమల లడ్డూపై ఆరోపణలన్నీ అవాస్తవమని సీబీఐ నివేదిక ఇచ్చినా ఇంకా కొందరు తప్పుడు ప్రచారాలు, అసత్యాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ దుష్ప్రచారం సాగిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పోలీసు అధికారులను కోరారు. ఈ మేరకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కే శ్రీనివాసరావుకు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఆటవిక పాలన రాజ్యమేలుతోందన్నారు. ఎక్కడ చూసినా దాడులు, దోపిడీలు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిరాధారమైన ఆరోపణలు చేయడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. లడ్డూ వ్యవహారంలో గత ప్రభుత్వ ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి మీద నిందలు వేశారన్నారు. సీబీఐ విచారణ ద్వారా నిజానిజాలు బయటకు వచ్చాయన్నారు. ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్ట్లలో లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని నిర్ధారణ అయిందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నిరాధారమని ఆధారాలతో సహా నిరూపితమైందన్నారు. అయినప్పటికీ నిసిగ్గుగా నేడు అదే అసత్యాలను ఫ్లెక్సీలు, బ్యానర్ల రూపంలో ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఆ ఫ్లెక్సీలను తొలగించమని కోరితే మాజీ మంత్రుల ఇళ్లపై దాడి చేస్తారా? మీరు చేసే తప్పుల ను ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తారా? చంపేస్తారా? అని ప్రశ్నించారు. ఆరు గంటల పాటు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ మూకలు దాడి చేస్తుంటే రక్షించాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన టీడీపీ మూకలు పెట్రోల్ బాంబులు వేశాయన్నారు. అంబటి రాంబాబు ‘అనుకోని పరిస్థితుల్లో మాట తూలాను..చంద్రబాబునాయుడును ఏమీ అనలేదు..నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా’ అని చెప్పినా ఇంటిమీద దాడిచేయడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి కక్ష పూరిత దాడులు ఆంధ్రరాష్ట్రంలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఆంధ్రరాష్ట్రం కూటమి పాలనలో రావణ కష్టంలా రగిలిపోతోందని, ఆటవిక పాలనతో అతలాకుతలమవుతోందన్నారు. దీనికి కూటమి ప్రభు త్వం భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు. శ్రీవా రి లడ్డూ వ్యవహారాన్ని, గీతం వర్శిటీకి ఐదువేల కోట్ల రూపాయల విలువైన భూముల అప్పగింత వ్యవహారాలను పక్కదోవ పట్టించేందుకే ఈ డైవర్షన్ పాలిటిక్స్ అని ప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు. పోలీసులు పక్షపాత ధోరణిని విడనాడాలని, అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాయడం ప్రజాస్వామ్యంలో సరైన పద్ధతి కాదన్నారు. తామిచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి ఫ్లెక్సీలను ఎవరు కట్టారు? ఎవరు కట్టించారు? ధన సాయం ఎవరు చేశారు? ఎవరి ప్రోద్బలంతో కట్టారో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో భక్తులకు మనోవేదనను కలిగించిన చంద్రబాబునాయుడు, లోకేశ్, పవన్కళ్యాణ్ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నిరాధారమైన ఆరోపణలు చేసి తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీయడమే కాకుండా హిందువుల మనోభావాలను కించపరిచారన్నారు. లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వును వినియోగించలేదని సీబీఐ నివేదికతో వెల్లడైనా దాన్ని వక్రీకరిస్తూ ప్రజల్లోకి అవాస్తవాలను తీసుకెళ్లేందుకు కూటమి నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించాలని కోరిన అంబటి రాంబాబు ఇంటిపై కూటమి నేతలు దుర్మార్గంగా దాడిచేశారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రశాంతతను పాడుచేస్తూ కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. కూటమి నేతలు చేస్తున్న అక్రమాలు, అవాస్తవ ప్రచారాలపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నా రు. పోలీసులు కేసులు నమోదు చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు. చంద్రబాబు కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామిని తన స్వార్థ రాజకీయాలకు వాడుకుంటూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, దీన్ని ప్రజలు క్షమించరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆనం విజయకుమార్రెడ్డి మాట్లాడుతూ దేవదేవుడిని రాజకీయాలకు వాడుకోవడం చంద్రబాబునాయుడుకే చెల్లిందన్నారు. పవిత్రమైన తిరు మల లడ్డూపై ఏ విషయం తేలకముందే ఎవరూ మాట్లాడవద్దని న్యాయస్థానాలు ఆదేశించినా తెలుగుదేశం పార్టీ నాయకులు పెడచెవిన పెట్టారన్నారు. ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్టులో లడ్డూలో ఎలాంటి జంతు కొవ్వు కలవలేదని నిర్ధారణ అయిన తర్వాత చంద్రబాబు, పవన్కళ్యాణ్, లోకేశ్లు ప్రజలకు ముఖం చూపించేందుకు ఇబ్బంది పడుతామని ఇంకా అసత్యప్రచారాలు కొనసాగించడం దుర్మార్గమన్నారు. వైఎస్సార్సీపీ నేతలు మొయిళ్ల గౌరీ, ఖలీల్అహ్మద్, మందల వెంకట శేషయ్య, చేజర్ల సుబ్బా రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, వివిధ విభాగాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి వేదాయపాళెం ఇన్స్పెక్టర్కు వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు -
విష సంస్కృతిని కొనసాగిస్తే తీవ్రపరిణామాలు
ఆత్మకూరు: టీడీపీ కూటమి నాయకులు చేసిన తప్పులను ప్రశ్నించిన ప్రతిఒక్కరిపై భౌతిక దాడులకు దిగుతూ కేసులు నమోదు చేయించి ఇబ్బందులకు గురిచేస్తూ విషసంస్కృతిని కొనసాగిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరిన నాయకులతో పాటు ప్రభుత్వ తప్పులను ప్రశ్నించిన వారిని టార్గెట్ చేస్తూ దాడులు చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం వంటివి చేస్తున్నారన్నారు. జిల్లాలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి నివాసంతో మొదలు పెట్టి మాజీ మంత్రులు విడదల రజని, అంబటి రాంబాబు, జోగి రమేష్తో పాటు వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తూ ఎంతగానో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించిన వారి నోళ్లు మూయించి కూటమి ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటుందని ప్రశ్నించారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపారని ఇప్పటి వరకు దుష్ప్రచారం చేసిన కూటమి నాయకులు సీబీఐ నివేదికతో తమ తప్పును గ్రహించారని, దీని నుంచి రాష్ట్ర ప్రజల దృష్టి మళ్లించేందుకు దాడులు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి దాడులు చూసి రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం నడుస్తుందా లేక కూటమి రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందా అని అనుకునే పరిస్థితుల్లోకి ప్రజలు వెళ్లిపోయారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై ఇలాంటి చర్యలు కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
ప్రతిపక్ష పార్టీ మీడియా సాక్షిగా చూపించినా..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీ ఎమ్మెల్యేల ధనదాహానికి పెన్నమ్మ శోకిస్తోంది. వీరి కనుసన్నల్లో తమ్ముళ్లు నదిని భారీ యంత్రాలతో కుళ్లబొడుస్తున్నారు. సోమశిల ప్రాజెక్ట్కు ముప్పు తప్పదని రైతుల ఆందోళన చేస్తున్నా.. ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పర్యావరణాన్ని, ప్రాజెక్ట్, రైతాంగం భవిష్యత్ను పణంగా పెట్టి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ప్రకృతి సంపదను కాపాడడంతో పాటు పర్యావరణాన్ని, ప్రజల భద్రతను పరిరక్షించాల్సిన అధికార యంత్రాంగాలు ముడుపుల మత్తులో ముఖం చాటేస్తున్నాయి. కలువాయి మండలం తెలుగురాయపురం అక్రమ రీచ్లో జరుగుతున్న ఇసుక దందాను ప్రతిపక్ష నేతలు మీడియా సాక్షిగా బట్టబయలు చేసినా చలించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వందల టిప్పర్లు.. వేల టన్నులు జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. పెన్నానదిలో అనధికార రీచ్లు ఏర్పాటు చేసుకుని భారీగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. ఉచిత ఇసుక విధానానికి ఎమ్మెల్యేలు, మంత్రులు తూట్లు పొడుస్తూ అక్రమ రవాణాకు గేట్లు తెరిచారు. వెంకటగిరి, ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో అక్రమ రవాణాకు అఽధికార యంత్రాంగం గ్రీన్ సిగ్నల్ వేయడంతో పబ్లిక్గా దోపిడీ జరుగుతోంది. ఓ వైపు ఇసుక అక్రమ రవాణా వల్ల లక్షల ఎకరాలకు పారుదల చేసే సోమశిల ప్రాజెక్ట్కు ముప్పు తప్పదని నిపుణులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నా.. అఽధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. తెలుగురాయపురంలో తగ్గేదేలా అంటున్న ప్రజాప్రతినిధి కలువాయి మండలం తెలుగరాయపురంలో కొన్ని నెలలుగా అనఽధికార రీచ్ను స్థానిక ప్రజా ప్రతినిధి ఓపెన్ చేశారు. నేరుగా నదిలోకి రోడ్డు వేయించి భారీ యంత్రం ద్వారా ఇసుక తోడేస్తున్నారు. రోజుకు వందల సంఖ్యలో టిప్పర్లు లోడింగ్ చేస్తున్నారు. తద్వారా రూ.12 లక్షలు జేబుల్లో వేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు తుంగలో తొక్కి పర్యావరణానికి తూట్లు పొడుస్తూ ఇప్పటికే నదీ గర్భాన్ని 20 మీటర్ల వరకు తోడేస్తున్నారు. భారీ గోతులు ఏర్పడి భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోతున్నాయి. ఈ రీచ్కు కేవలం వంద మీటర్ల దూరంలో ఉన్న సోమశిల ప్రాజెక్ట్కు పెను ముప్పు తప్పదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. అనధికార రీచ్లో నేరుగా ప్రజాప్రతినిధి జోక్యం ఉండడంతో అధికార యంత్రాంగం సైతం కళ్లకు గంతలు కట్టేసుకున్నారు. ఇసుక లోడింగ్ చేసిన టిప్పర్లు నేరుగా కలువాయి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు నుంచే వెళ్తున్నా రెవెన్యూ అధికారులకు కనిపించడంలేదు. అధికార యంత్రాంగానికే సవాల్ జిల్లాలో జరిగే ఇసుక అక్రమ దందాపై అధికార పక్షానికి చెందిన ఎల్లోమీడియా సైతం గగ్గోలు పెడుతోంది. పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నారని, ప్రజాపక్షంలో ఉన్న నేతలు సైతం అక్రమ రవాణాను ఆధారాలతో సహా చూపిస్తున్నారు. ఇటీవల మాజీ మంత్రి కాకాణి గోవర్ధ న్రెడ్డి సైతం పక్కా ఆధారాలతో సహా విరువూరు రీచ్లో జరిగే ఇసుక దందాను చూపించారు. ఇంత జరుగుతున్నా కలెక్టర్, ఎస్పీ సైతం కనీస కట్టడి చర్యలు చేపట్టలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అఽధికార పార్టీ అండ ఉంటే ప్రకృతిని చెరపట్టి చీల్చేస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. తెలుగురాయపురం, పడమటి కంభంపాడు అడ్డాలుగా ఇసుక దోపిడీ రోజుకు వందల టిప్పర్ల ఇసుక అక్రమ రవాణా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలిపోతున్నా.. ఎక్కడా నో చెకింగ్ అక్రమ రీచ్ సందర్శనకు వెంకటగిరి వైఎస్సార్సీపీ ఇన్చార్జ్జి నేదురుమల్లి వెళ్లగానే తవ్వకాలు ఆపేసి పలాయనం ప్రతిపక్ష పార్టీ నేతలొచ్చి ఇసుక దందా చూపించినా చర్యలు నిల్ ముందు మంత్రి ఆనంను ఆపమనండి.. ఆ తర్వాత చూస్తామన్న వెంకటగిరి ఎమ్మెల్యే మళ్లీ మరుగంట నుంచే యథా ప్రకారం విచ్చలవిడిగా తవ్వకాలు సోమశిల డ్యామ్కు అతి సమీపంలో ఇసుకను తవ్వేయడంతో ప్రాజెక్ట్ భద్రతకు ముప్పు పీకేపాడులోనూ ఇదే పరిస్థితి అనంతసాగరం మండలం పడమటి కంభంపాడులోనూ అనధికార ఇసుక రీచ్ నుంచి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకున్నా నది మధ్యలోనే భారీ యంత్రం పెట్టి లోడింగ్ చేస్తున్నారు. రోజుకు దాదాపు రూ.6 లక్షల మేర ఇసుక దందా జరుగుతుందనే ఆరోపణలున్నాయి. పీకేపాడు రీచ్ కూడా సోమశిల ప్రాజెక్టుకు వంద మీటర్ల దూరంలోనే ఉంది. ఓ వైపు సోమశిల ప్రాజెక్టుకు ముప్పు ఉందని స్థానిక రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నా తమ్ముళ్లు తగ్గడం లేదు. స్థానిక అఽధికార పార్టీ ప్రజాప్రతినిధి అండతో రెచ్చిపోతున్నారు. ఇటీవల ఇసుక అక్రమ రవాణా వాహనాల వల్ల రోడ్లు దెబ్బతిని వాహనాలు వేళ్లే పరిస్థితి లేదని స్థానిక టీడీపీ నేతలే అనధికార రీచ్ వద్ద ఆందోళన చేసిన సంగతి తెల్సిందే. ఇటీవల వర్షా కాలంలో స్కూటర్, బైకులు కూడా ఆ రోడ్డు వైపే వెళ్ల లేని పరిస్థితి నెలకొంది. అంతటి దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. అయినా కూడా తమ్ముళ్లు మాత్రం ఇసుక అక్రమ రవాణా నిలిపివేసే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు. మామూళ్ల మత్తులో అధికార యంత్రాంగంనేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా పచ్చ నేతలు పెన్నానదిలో ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారు. జిల్లాకు జలనిధి అయిన సోమశిల ప్రాజెక్ట్కు అతి చేరువలో దిగువన తెలుగురాయపురం, పడమటికంభంపాడులో అనధికార రీచ్లు ఏర్పాటు చేసి ఇసుక తవ్వుతున్నారు. ఈ రెండు అనధికార రీచ్ల్లోనే నిత్యం వందల కొద్దీ టిప్పర్ల ఇసుక తవ్వేస్తున్నారు.ఈ పరిణామాలతో భవిష్యత్లో జలాశయం భద్రతకు పెనుముప్పు పొంచి ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. జిల్లా అధికార యంత్రాంగాలు వీసమంత బాధ్యతగా వ్యవహరించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీ నేతలు స్వయంగా ఇసుక దందాను బట్టబయలు చేస్తున్నా.. అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ.. ధ్రుతరాష్ట్రుల్లా వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఆపే దమ్ముందా? అనే రీతిలో టీడీపీ నేతలు సవాల్ విసరుతున్నారు. తెలుగురాయపురం రీచ్లో జరిగే అక్రమ ఇసుక రవాణాపై వెంకటగిరి వైఎస్సార్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మీడియా సాక్షిగా బట్టబయలు చేశారు. రెండు రోజుల క్రితం ఆయన మీడియాను వెంట బెట్టుకుని వెళ్లి రీచ్లో సాగే ఇసుక దందాను చూపించారు. భారీ యంత్రంతో నదీ గర్భాన్నే తోడేస్తున్న వైనాన్ని ప్రత్యక్షంగా చూపించినా అధికార యంత్రాంగం కనీస చర్యలు చేపట్టలేదు. ఆయన రీచ్లో ఉన్నప్పుడు మాత్రమే ఇసుక లోడింగ్ ఆపేశారు. ఆయన అటు వెళ్లగానే గంటలోపే మళ్లీ యంత్రాలు పెట్టి లోడింగ్ చేశారంటే వారి బరితెగింపు చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
కార్మికులను నిలిపివేయడంపై ఆగ్రహం
● వయోనా ఎనర్జీ ఫ్యాక్టరీ ఎదుట రేగడి చెలిక, రాచర్లపాడు గ్రామస్తుల నిరసన ● ఫ్యాక్టరీలోకి కార్మికుల వాహనాలను వెళ్లనీయకుండా అడ్డగింత కొడవలూరు: మండలంలోని రాచర్లపాడులోని వయోనా ఎనర్జీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులను నిలిపివేయడంపై రేగడిచెలిక, రాచర్లపాడు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఫ్యాక్టరీ ఎదుట నిరసనకు దిగారు. ఫ్యాక్టరీలోకి కార్మికుల వాహనాలను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. గతంలో సీమెన్స్ గమేసాగా ఉన్న ఫ్యాక్టరీని నెల క్రితం వయోనా ఎనర్జీ సంస్థ తీసుకొంది. గమేసా సీమెన్స్ ఫ్యాక్టరీ రెండేళ్లుగా ఉత్పత్తి నిలిపివేసినా అందులో పని చేస్తున్న 110 మంది కార్మికులకు వేతనాలు చెల్లిస్తూ వచ్చింది. అయితే వయోనా ఫ్యాక్టరీ 75 మంది కార్మికులను నిలిపి వేసి కేవలం 35 మందిని మాత్రమే విధుల్లోకి తీసుకుంది. దీంతో తొలగించబడిన కార్మికులు గ్రామస్తుల అండతో ఫ్యాక్టరీ ఎదుట నిరసనకు దిగారు. ఫ్యాక్టరీలోకి కార్మికుల వాహనాలను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. కార్మికుల అందర్ని విధుల్లోకి తీసుకునే దాకా నిరసనను కొనసాగిస్తామంటూ పట్టుబట్టారు. దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యం తరఫున ప్రతినిధులు వచ్చి నిరసనకారులతో మాట్లాడారు. ఫ్యాక్టరీ రెండు నెలల తరువాత పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తుందని, ఆ సమయంలో మిగిలిన వారిని కూడా విధుల్లోకి తీసుకుంటామని బుజ్జగించారు. అయితే కార్మికులు సీమెన్స్ గమేసా రెండేళ్లుగా ఎలాంటి పనులు చేయించకుండానే వేతనాలు చెల్లించిందని, వయో నా సంస్ధ నిర్ధాక్షిణ్యంగా తొలగించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ ఉన్నతాధికారులు అందుబాటులో లేనందున మంగళవారం వారితో చర్చించి స్పష్టత ఇస్తామని చెప్పడంతో నిరసనకారులు శాంతించారు. స్థానిక నాయకులు దేవనబోయిన శివకుమార్, కసిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నాగేంద్ర యాదవ్, చెముకుల హజరత్తయ్య, దువ్వూరు శీనయ్య, ఓబులేసు, సతీష్, వంశీ తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ బియ్యం అక్రమ రవాణా కట్టడికి చర్యలు
● తనిఖీలకు మొబైల్ ఫ్లయింగ్ స్క్వాడ్లు ● ఫిర్యాదులకు టోల్ఫ్రీ నంబర్ 80083 04495 ● జేసీ మొగిలి వెంకటేశ్వర్లునెల్లూరు (దర్గామిట్ట) : రేషన్ బియ్యం అక్రమ రవాణా ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా మని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో మీడియా సమావేశం నిర్వహించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు 24 గంటలూ పనిచేసేలా రెండు మొబైల్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోలీసు, రెవెన్యూ, సివిల్ సప్లయీస్ అధికారులతో కూడిన ఈ బృందాలు రోజూ రెండు షిఫ్టుల్లో పనిచేస్తాయని చెప్పారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక స్క్వాడ్, సాయంత్రం ఆరు నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మరో స్క్వాడ్ పనిచేస్తుందని వివరించారు. వీరితోపాటుగా అక్రమ రవాణాపై ఫిర్యాదులకు టోల్ఫ్రీ నంబర్ 80083 04495ను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజలు ఏ క్షణమైనా ఆ ఫోన్ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. కాగా డీలర్లు కొందరు లబ్ధిదారులకు డబ్బులిచ్చి బియ్యం ఇవ్వడం లేదని, దీనిపై ఏమి చర్యలు తీసుకుంటారని జేసీని విలేకరులు ప్రశ్నించగా, అలాంటి ఫిర్యాదులు అందితే తక్షణమే కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని తెలియజేశారు. -
ఇంట్లో నుంచి తరిమేశారు
● పోలీసుల ఎదుట వృద్ధురాలి ఆవేదన ● పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’నెల్లూరు(క్రైమ్): ‘చిన్న కుమారుడు, కోడలు నా ఆస్తి అమ్ముకుని ఇంట్లో నుంచి తరిమేశారు. జీవనాధారం కష్టంగా ఉంది. విచారించి న్యాయం చేయండి’ అని సీతారామపురానికి చెందిన ఓ వృద్ధురాలు కోరారు. నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వినతుల వెల్లువెత్తాయి. 180 మంది పాల్గొని వినతులను పోలీసు అధికారులకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఎస్పీ అజిత చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఆయా ప్రాంత పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, మహిళ, పీసీఆర్ ఇన్స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, భక్తవత్సలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● కడపకు చెందిన అశ్విన్, కొండారెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.1.50 లక్షలు తీసుకుని మోసగించారు. విచారించి న్యాయం చేయాలని ఆత్మకూరుకు చెందిన ఓ యువకుడు కోరాడు. ● నా భర్త యాక్సిడెంట్లో మరణించాడు. స్థానిక పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఆయన మరణంపై అనుమానం ఉంది. లోతుగా దర్యాప్తు చేయాలని పొదలకూరుకు చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు. ● నేను గొర్రెలు మేపుకొని జీవనం సాగిస్తున్నాను. రామతీర్థం ప్రాంతానికి చెందిన భాస్కర్ రూ.4 లక్షల విలువైన గొర్రెలను కొనుగోలు చేసి నగదు ఇవ్వకుండా అడిగితే చంపుతామని బెదిరిస్తున్నాడు. తగిన చర్యలు తీసుకోవాలని అల్లూరుకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. -
భార్య హత్య కేసులో భర్త అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): భార్యను హత్య చేసిన కేసులో భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఇన్స్పెక్టర్ కె.సాంబశివరావు వివరాలు వెల్లడించారు. ఆత్మకూరు మండలం నెల్లూరుపాళేనికి చెందిన శ్రీనందిని (24)కు నెల్లూరు కోటమిట్టకు చెందిన శ్రీహరితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది. శ్రీనందిని తన చిన్ననాటి స్నేహితుడు సుభాష్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయమై దంపతుల నడుమ గొడవలు జరిగాయి. శ్రీనందిని నెల్లూరుపాళెంలోని తల్లి వద్దకు వెళ్లిపోయింది. మూడునెలల క్రితం ఆమె తన స్నేహితుడితో కలిసి మైపాడు బీచ్లో ఉండగా భర్త వారిని పట్టుకోగా గొడవ జరిగింది. చిన్నబజారు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు వారిని మందలించి పంపారు. అనంతరం ఆమె బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరి అప్పుడప్పుడు నెల్లూరుకు వచ్చి భర్తను కలిసి వెళ్లేది. ఆమె తీరు మార్చుకోకుండా స్నేహితుడితో సన్నిహితంగా ఉండసాగింది. దీనిని శ్రీహరి జీర్ణించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో గతనెల 30వ తేదీ రాత్రి నెల్లూరు వస్తున్నానని ఆమె భర్తకు చెప్పింది. బస్సు వద్దకు వస్తానని అతను చెప్పాడు. శనివారం తెల్లవారుజామున చింతారెడ్డిపాళెం క్రాస్రోడ్డు వద్ద శ్రీనందిని బస్సు దిగింది. ఆత్మకూరు బస్సు ఎక్కిస్తానని ఆమెను శ్రీహరి స్కూటీపై ఎక్కించుకున్నాడు. చిల్డ్రన్స్ పార్కు రోడ్డులోని పెట్రోల్ బంకు ఎదురు ఖాళీ ప్రదేశంలోకి తీసుకెళ్లి కత్తితో ఆమె గొంతు కోసి విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడని ఇన్స్పెక్టర్ చెప్పారు. మృతురాలి తల్లి ఉష ఫిర్యాదుపై కేసు నమోదు చేసి సోమవారం నిందితుడిని అరెస్ట్ చేశామని ఇన్స్పెక్టర్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన ఇన్స్పెక్టర్, ఎస్సై విజయ్ శ్రీనివాస్, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. -
మమ్మల్ని ఆదుకోండి సారూ..
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● వినతులు స్వీకరించిన అధికారులునెల్లూరు(దర్గామిట్ట): ‘మా వినతులు పరిశీలించి ఆదుకోండి సారూ’ అంటూ అర్జీదారులు అధికారులను కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్కుమార్, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కృష్ణకుమార్, జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి, డీపీఓ వసుమతి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలు, పింఛన్లకు సంబంధించి అర్జీలు ఎక్కువగా వస్తున్నాయని, వాటిపై అధికారులు ప్రత్యేకశ్రద్ధ పెట్టాలన్నారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు కలువాయి మండలం నూకనపల్లి, తెలుగురాయ పురం గ్రామాల్లో అక్రమ ఇసుక తవ్వకాలు నిలు పుదల చేయించాలని ఆయా గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు అధికారులకు వినతిపత్రమిచ్చారు. వారు మాట్లాడుతూ తవ్వకాలతో పొలాల్లోని బోర్లు, బావుల్లో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయిందన్నారు. సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని, రైతుల జీవనాధారం పూర్తిగా ప్రమాదంలో పడినట్లు వాపో యారు. తవ్వకాలు ఆపించి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. -
సమస్యల పరిష్కారానికి ‘ప్రత్యేక వేదిక’
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లా సర్కిల్ పరిధిలో ఉన్న పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక వేదిక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎస్ఈ రాఘవేంద్రం తెలిపారు. నెల్లూరులోని విద్యుత్ భవన్లో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతినెలా మొదటి బుధవారం విద్యుత్ భవన్లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. పారిశ్రామిక విద్యుత్ వినియోగదారులు ఈనెల 4వ తేదీన ఉదయం 10:30 నుంచి 11:30 గంటల మధ్య తమ సమస్యలను చెప్పొచ్చన్నారు.వివాహిత ఆత్మహత్యఉదయగిరి: పట్టణంలోని ఈద్గామిట్టలో నివాసముంటున్న ఓ వివాహిత సోమవారం ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గుంటూరు జిల్లాకు చెందిన అనిల్శర్మ కొంత కాలం క్రితం ఉదయగిరికి కాపురం వచ్చి శివాలయంలో పూజారిగా పని చేస్తున్నాడు. అతనికి భార్య గాయత్రి (28), ఇద్దరు చిన్న పిల్లలున్నారు. కుటుంబ కలహాలున్నట్లు తెలుస్తోంది. గాయత్రి సోమవారం మధ్యాహ్నం స్కూల్కు వెళ్లి పిల్లలకు భోజనం పెట్టి కొంతసేపు వారితో గడిపి ఇంటికొచ్చింది. అనిల్శర్మ గుడికి వెళ్లాడు. స్కూల్ వదిలిన తర్వాత పిల్లలు ఇంటికి రాగా తలుపులు వేసి ఉన్నాయి. వారు పక్కింట్లోని వారి ద్వారా అనిత్తో ఫోన్లో మాట్లాడారు. అతను ఇంటికొచ్చాడు. తలుపు లోపల గడి పెట్టి ఉంది. దీంతో గట్టిగా తలుపులను తన్నడంతో ఊడి వచ్చింది. భార్య ఫ్యాన్కు ఉరేసుకుని ఉంది. వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించగా వారొచ్చి ఆమెను తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎస్సై శ్రీనివాసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు. -
వేమిరెడ్డి దంపతులు గిరిజన ద్రోహులు
● నెల్లూరు మాజీ మేయర్ స్రవంతి కోవూరు: నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గిరిజన ద్రోహులని నెల్లూరు మాజీ మేయర్ పొట్లూరి స్రవంతి ధ్వజమెత్తారు. ఆమె కోవూరు మండల పరిధిలోని పోతిరెడ్డిపాళెం గిరిజన కాలనీలో సోమవారం ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవూరు ఏఎంసీ చైర్మన్ పదవి గిరిజనులకు దక్కాల్సి ఉండగా, తమ అనుచరుడికి కట్టబెట్టాలని వారు కుట్రలు పన్నారన్నారు. అయితే న్యాయస్థానం వారి దుర్మార్గపు ఆలోచనలకు అడ్డుకట్ట వేసి తగిన బుద్ధి చెప్పిందని పేర్కొన్నారు. కోవూరు జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలను అణచి వేయడమే ధ్యేయంగా వేమిరెడ్డి దంపతులు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం నెల్లూరు(దర్గామిట్ట): నగరపాలక సంస్థ నూతన మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వకుండా జాప్యం చేయడంపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. సోమవారం రిలే నిరాహార దీక్షలో గిరిజన సంఘాల తరఫున బాపట్ల వేంకటపతి పాల్గొని ప్రభుత్వం, వేమిరెడ్డి దంపతుల తీరును ఎండగట్టారు. అనంతరం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం సమర్పి ంచారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు తలపల జయవర్ధన్, బత్తిన లక్ష్మణ శేఖర్, మురళి, రమేష్, శ్రీనివాసులు, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
ప్రాక్టికల్స్కు 232 మంది గైర్హాజరు
నెల్లూరు(టౌన్): ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్కు సోమవారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 232 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం 4,743 మందికి గానూ 4,597 మంది హాజరుకాగా 146 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ప్రాక్టికల్స్కు 4,310 మందికి గానూ 4,224 మంది హాజరయ్యారు. 86 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఆర్ఐఓ వరప్రసాదరావు 6 కేంద్రాలు, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు 9 కేంద్రాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు 15 కేంద్రాలను తనిఖీ చేశారు. పాడిపరిశ్రమ అభివృద్ధికి చర్యలు● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో పశుసంవర్థక శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మాంసం, కోడిగుడ్ల ఉత్పత్తి పెంపుపై దృష్టి సారించాలన్నారు. పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులకు విద్యుత్ సబ్సిడీలు అందిస్తామన్నారు. దీనిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ అధికారికి సూచించారు. పాడి, పౌల్ట్రీ పరిశ్రమతోపాటు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై దృష్టి సారిస్తే గ్రామీణ ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయన్నారు. రైతులు, యువత ముందుకొచ్చి పాడి, పశుసంవర్థక రంగాల్లో పెట్టుబడి పెట్టి జిల్లాను ముందంజలో నిలపాలన్నారు. కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ జేడీ రమేష్ నాయక్, డీఆర్డీఏ, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్లు నాగరాజకుమారి, గంగా భవాని, పరిశ్రమల శాఖ అధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. పరిహారం అందించాలని వినతినెల్లూరు(దర్గామిట్ట): కండలేరు ప్రాజెక్ట్ నిర్మాణంతో భూములు కోల్పోయిన తమకు పరిహారం అందించాలని రాపూరు మండలం గుండవోలు గ్రామస్తులు కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ గ్రామంలో పట్టా భూములకు పరిహారం అందజేశారని, ప్రభుత్వ నిబంధనల మేరకు డీకేటీ, సీజేఐఎఫ్ఎస్ భూములకు నష్టపరిహారం పూర్తిగా చెల్లించలేదన్నారు. ప్రభుత్వం స్పందించాలని కోరారు. విద్యార్థినిపై కుక్కల దాడిసీతారామపురం: మండలంలోని తురకపాళెం ఉర్దూ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న రహమత్ అనే విద్యార్థినిపై సోమవారం కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. మధ్యాహ్నం సమయంలో రహమత్ ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తుండగా కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. బాధితురాలిని వెంటనే 108 అంబులెన్స్లో ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాలకులు, అధికారులు స్పందించి గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు. జీవాల మందపై.. ఉదయగిరి రూరల్: మండలంలోని గండిపాళెం జగనన్న కాలనీలో పాముల రాజాకు చెందిన జీవాల మందపై సోమవారం కుక్కలు దాడి చేశాయి. దీంతో మూడు గొర్రె పిల్లలు మృతిచెందగా మరో నాలుగు తీవ్రంగా గాయపడ్డాయి. దీంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. ఆదుకోవాలని కోరుతున్నాడు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యసీతారామపురం: కుటుంబ కలహాలతో మండలంలోని సింగారెడ్డిపల్లి గ్రామంలో పసుపుల చెన్నయ్య (45) అనే వ్యక్తి తన ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. చెన్నయ్య ట్రాక్టర్ డ్రైవర్. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి పాల్పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. -
వైఎస్సార్సీపీకి కార్యకర్తలే వెన్నెముక
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పొదలకూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలే వెన్నెముకని.. కష్టకాలంలో ఉన్న వారికి భవిష్యత్తులో ప్రాధాన్యమివ్వనున్నామని.. పార్టీని వీడిన వారిని తిరిగి చేర్చుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని ఎమ్మార్ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన పార్టీ మండల నేతలు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో అన్ని వర్గాల వారికి గ్రామ స్థాయి కమిటీల్లో అవకాశం కల్పిస్తామని తెలిపారు. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అనుబంధ సంఘాలను ఏర్పాటు చేసి నియోజకవర్గానికి ఎనిమిది వేల నుంచి పది వేల మంది గ్రామ కమిటీ సభ్యులను నియమించనున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల మందితో జగనన్న సైన్యాన్ని తయారు చేయనున్నారని ప్రకటించారు. దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రాంతీయ పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుర్తింపుందన్నారు. 2024లో నిర్వహించిన ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేసి 40 శాతం ఓట్లు సాధించగా.. మూడు పార్టీలతో కూటమి 58 శాతానికి మించి సాధించలేకపోయిందని తెలిపారు. చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు అసత్య వ్యాఖ్య లు చేశారని, దీనిపై బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంతో మంది భక్తులు మనోవేదనకు గురయ్యారని, వీరికి సమాధానం చెప్పాలన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ మాజీ మంత్రి అంబటి రాంబాబు మాటలను వక్రీకరించి గందరగోళాన్ని సృష్టించి లడ్డూ ప్రసాదాల విషయాన్ని డైవర్ట్ చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయనపై దాడి అమానుషమని, టీడీపీ నేతల దాష్టీకాలను తీవ్రంగా ఖండించారు. తమ ప్రభుత్వ హయాంలో అనేక పథకాలను అందజేశారని, అయితే ఇప్పుడు సక్రమంగా అందడంలేదని ధ్వజమెత్తారు. సర్వేపల్లిలో ఎమ్మెల్యేలుగా ఎందరో పనిచేశారని, అయితే సోమిరెడ్డి తరహాలో లే అవుట్ల యజమానుల వద్ద డబ్బులను ఎవరూ వసూలు చేయలేదని చెప్పారు. 2014 – 19, 2019 – 24 నుంచి నేటి వరకు ఇరిగేషన్ పనులపై సీబీఐ విచారణకు సిద్ధమానని సవాల్ విసిరారు. జిల్లాలో తమ పార్టీని తిరుగులేని శక్తిగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. ఎన్నికలెప్పుడొచ్చినా తమ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని చెప్పారు. సర్వేపల్లి బూత్ కమిటీ కన్వీనర్ బచ్చల సురేష్కుమార్రెడ్డి, జెడ్పీటీసీ తెనాలి నిర్మలమ్మ, ఎంపీపీ సుబ్బరాయుడు, వైస్ ఎంపీపీ వేణుంబాక చంద్రశేఖర్రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ గోగిరెడ్డి గోపాల్రెడ్డి, మాజీ ఎంపీపీ కోనం చినబ్రహ్మయ్య, సర్పంచ్ చిట్టెమ్మ, లక్ష్మీ కల్యాణి, నేతలు అంజద్, రావుల ఇంద్రసేన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
అనుచరుడి కోసం గిరిజనుల గొంతు కోస్తారా?
● వేమిరెడ్డి దంపతులకు మాజీ మేయర్ సూటి ప్రశ్న ● కరపత్రాల పంపిణీఅల్లూరు: ‘మీ అనుచరుడి కోసం గిరిజనుల గొంతు కోస్తారా? ఇది ఎంతవరకు సబబు’ అని నెల్లూరు మాజీ మేయర్ పొట్లూరి స్రవంతి వేమిరెడ్డి దంపతులను ప్రశ్నించారు. ఆమె ఆదివారం అల్లూరు మండలం బోడిసత్రంలో పర్యటించారు. ఇంటింటికీ తిరిగి తనకు, గిరిజనులకు జరిగిన అన్యాయంపై కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం స్రవంతి మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారంగా తనకు మేయర్గా అవకాశం లభించిందన్నారు. అయితే వేమిరెడ్డి దంపతులు వారి అనుచరుడి కోసం తనకు అన్యాయం చేశారని ఆరోపించారు. కోవూరు నియోజకవర్గంలో గిరిజనుల ఓట్లతో గెలిచిన ప్రశాంతిరెడ్డి వారిని అణచడం బాధాకరమన్నారు. బలహీనవర్గాలపై వేమిరెడ్డి దంపతులకు చులకన భావం ఎందుకంటూ మండిపడ్డారు. వెంటనే మేయర్ ఎన్నికపై నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక గిరిజన నాయకులు పాల్గొన్నారు. రెండో రోజుకు దీక్ష నెల్లూరు(దర్గామిట్ట): నూతన మేయర్ ఎన్నికకు సంబంధించి తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలని గిరిజన నేత పొట్లూరి జయవర్ధన్ డిమాండ్ చేశారు. ఆయన చేపట్టిన రిలే నిరాహారదీక్ష ఆదివారానికి రెండోరోజుకు చేరింది. జయవర్ధన్కు పెద్దఎత్తున గిరిజన సంఘాల నుంచి మద్దతు లభించింది. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులను చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో గిరిజనులు జరుగుతున్న అన్యాయంపై రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. బీఆర్ అంబేడ్కర్ బలహీనవర్గాలకు కల్పించిన హక్కులను సాధించే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదన్నారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తే ఆమరణ నిరాహారదీక్షకు సైతం పూనుకుంటామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు దీక్షకు సంఘీభావం తెలిపారు. -
నిరాశపర్చిన బడ్జెట్
● రేర్ ఎర్త్ కారిడార్ మాత్రమే ఉపయోగం నెల్లూరు(అర్బన్): పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాకు ఒరిగిందేమీలేదు. రేర్ ఎర్త్ కారిడార్లో తీర ప్రాంతాన్ని భాగం చేయడమే కొంత మేర ప్రయోజనంగా మారింది. అధునాతన సాంకేతిక రంగాలు, రక్షణ, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి రంగాలకు అవసరమైన రేర్ ఎర్త్ ఖనిజాల ఉత్పత్తి, శుద్ధి, వినియోగంపై పరిశ్రమలు నెల్లూరు తీరంలో రానుండటంతో ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయానికి ఒరిగిందేమీ లేదు వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు ఇచ్చే సబ్సిడీలు, ఎరువులకు సంబంధించిన విషయాల్లో ఆశించిన ప్రయోజనం చేకూరలేదు. నడికుడి – శ్రీకాళహస్తి రైల్వేలైన్, మరే కొత్త దానికీ అదనంగా నిధులివ్వలేదు. నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా నిధులను కేటాయించినా, స్వల్ప స్థాయిలోనే ఉందని తెలుస్తోంది. ఎన్హెచ్ఎం ద్వారా సుమారు రూ.7.5 కోట్లే జిల్లాకు రానున్నాయి. విద్యకు పెద్దపీటేస్తున్నామని చెప్పినా, రూ.20 కోట్లు సైతం రావడంలేదనే విమర్శలున్నాయి. నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ లేదు. పంటల గిట్టుబాటు ధరలకు సంబంధించిన ప్రయోజనాలను చేకూర్చలేదనే ఆరోపణలున్నాయి. సాగు, తాగునీటి పథకాలకు నిధులివ్వలేదు. జాతీయ రహదారులు, ఇతర మౌలిక వసతులకు రూ.50 కోట్ల వరకు రావొచ్చనే అంచనాల మినహా జిల్లాకు పెద్దగా ఒరిగిందేమీలేదనే భావన వ్యక్తమవుతోంది. కొంత ఊరట నెల్లూరు – ప్రకాశం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో బీచ్ శాండ్స్లో మోనజైట్, ఇల్మనైట్, రుటైల్ వంటి విలువైన ఖనిజాలున్నాయని భౌగోళిక అధ్యయనాలు వెల్లడించాయి. కేంద్ర నిర్ణయంతో తీర ప్రాంతాల్లో ఖనిజాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఏర్పడింది. ప్రాసెసింగ్ యూనిట్లు, రిఫైనింగ్ ప్లాంట్ల స్థాపనతో యువతకు నైపుణ్యాధారిత ఉద్యోగాలొస్తాయి. పోర్టులకు సమీపంలో ఉండటంతో ఎగుమతులకు ఆస్కారం ఉంది. -
తప్పు ఒప్పుకోవడానికి మొహమాటమెందుకు?
● చంద్రబాబును ప్రశ్నించిన కాకాణి నెల్లూరు రూరల్: ‘చంద్రబాబూ చేసిన తప్పు ఒప్పుకోవడానికి మొహమాటం ఎందుకు?, ఏడుకొండలవాడా క్షమించు దేవుడా అనడగడానికి ఎందుకు సంకోచిస్తున్నావ్?, దేవదేవుడ్ని, తిరుమల ప్రసాదాన్ని బజారుకు ఈడ్చింది నువ్వుకాదా బాబూ’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో నానాయాగీ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాదా అని ప్రశ్నించారు. వారు జంతువుల కొవ్వు ఉందని వ్యాఖ్యానిస్తే, ఆ మాటలు తప్పు అని ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐల నివేదికలు చెప్పాయన్నారు. రాజకీయం చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా వారు ఆగలేదన్నారు. ల్యాబ్ రిపోర్ట్ తమకు అనుకూలంగా రాలేదని అనిల్ సింఘాల్ని బలిపశువును చేసి బదిలీ చేశారన్నారు. లడ్డూ విషయంలో ఫ్లెక్సీలు కట్టి తప్పుడు ప్రచారం చేస్తుంటే తప్పని చెప్పిన అంబటి రాంబాబుపై దాడి చేస్తారా, అక్రమ కేసులు పెడుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి ఇలా దాడులు చేయించడం సరికాదన్నారు. జంతు కొవ్వు కలవలేదని తెలిశాక టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం చేయించడం, రకరకాల వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రాన్ని అ గ్నిగుండంగా మార్చడానికి చేసిన డైవర్షన్ పాలిటిక్స్, అనుచిత వ్యాఖ్యలను చూసి ప్రజలు చంద్రబాబును చీదరించుకుంటున్నారన్నారు. కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు నిజం గెలిచింది, వాస్తవాలు బయటికి వచ్చాయని పూజలు చేస్తున్నారన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని భక్తులకు క్షమాపణ చెప్పి, చెంపలేసుకోవాలన్నారు. -
దివ్యాంగుల సంక్షేమానికి ‘కూటమి’ తూట్లు
నెల్లూరు రూరల్: కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి తూట్లు పొడిచిందని వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆవుల నాగేంద్ర అన్నారు. నెల్లూరులోని ఆ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సమస్యలను పరిష్కరించలేదన్నారు. ఇప్పుడు ఇస్తున్న రూ.6 వేల పెన్షన్ కూడా టీడీపీ ఘనత కాదన్నారు. మందకృష్ణ మాదిగ పోరాటం చేసి టీడీపీ నేతల మెడలు వంచితేనే సాధ్యమైందన్నారు. దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోటేశ్వరరావు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు కరువయ్యయన్నారు. అలాగే హాస్టళ్లలో సీసీ కెమెరాల్లేక విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. వాటికి నిధులు విడుదల చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని, దమ్ముంటే వాటిపై మాట్లాడాలని కోటేశ్వరరావుకు హితవు పలికారు. దివ్యాంగుల 21 రకాల వైకల్యాల ఉపకరణాల తయారీ కేంద్రాలు మూసివేసి ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. కోటేశ్వరరావు వైఎస్సార్సీపీ నేతలపై ఇస్టానుసారంగా మాట్లాడితే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో దివ్యాంగుల విభాగం నగర అధ్యక్షుడు సుభాని పాల్గొన్నారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి
● మరొకరికి తీవ్రగాయాలుకలిగిరి: మండలంలోని కలిగిరిలో కావలి – కలిగిరి జాతీయ రహదారిపై పెద్దచెరువు అలుగు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు టీవీఎస్ మోపెడ్ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో తమ్మినేని శంకరయ్య (70) మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. జలదంకి మండలం కేశవరానికి చెందిన చదలవాడ మాల్యాద్రి, చేజర్ల మండలం పెల్లేరుకు చెందిన శంకరయ్య మోపెడ్పై కలిగిరి వైపు వస్తున్నారు. పెద్దచెరువు అలుగు సమీపానికి వచ్చేసరికి కలిగిరి పైపు వేగంగా వస్తున్న ట్రావెల్స్ బస్సు డ్రైవర్ హారన్ కొట్టాడు. మోపెడ్ను నడుపుతున్న మాల్యాద్రి పక్కకు తప్పించబోయాడు. అదే సమయంలో వెనుక నుంచి బస్సు ఢీకొట్టింది. మోపెడ్తో సహా ఇద్దరూ కొంచెం దూరం ముందుకెళ్లారు. శంకరయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మాల్యాద్రి కాళ్లు విరిగి, తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 వాహనంలో మాల్యాద్రిని వింజమూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరులోని ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. శంకరయ్య గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుంటాడు. అలాగే పెళ్లి సంబంధాలు కుదురుస్తుంటాడు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎస్సై ఉమాశంకర్ ఘటనా స్థలానికి చేరుకుని వివారాలు సేకరించారు. కలిగిరి పంచాయతీ జిర్రావారిపాళేనికి చెందిన బస్సు డ్రైవర్ గోసాల సుబ్బరాజును అదుపులోకి తీసుకున్నారు. బస్సును స్వాధీనం చేసుకున్నారు. శంకరయ్య మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు. -
అంబటిపై దాడి అమానుషం
ఉదయగిరి : మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడటం అమానుషమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కూటమి నేతలు సాగించిన దుష్ప్రచారం బూటకమని సీబీఐ నివేదికతో బట్టబయలైందని చెప్పారు. అయినా టీడీపీ నేతలు ఇంకా దిగజారి నీచంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడాన్ని అంబటి ఖండిస్తూ వాటిని తొలగించాలని సూచించారన్నారు. ప్రభుత్వ దుర్మార్గ చర్యను ఖండించడాన్ని సహించలేక టీడీపీ గూండాలు ఆ పార్టీ పెద్దల కనుసన్నల్లో అంబటి ఇంటిపై దాడికి దిగి తగలబెట్టడం అరాచకమన్నారు. అడ్డుకోవాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించి ప్రభుత్వ పెద్దల సూచనలతో బాధితుడైన అంబటిని ఆరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఈ దాష్టీకాన్ని చూస్తే రాష్ట్రంలో అరాచక, దుర్మార్గ పాలన నడుస్తోందనే విషయం అర్ధమవుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, డైవర్షన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. -
అంబటి రాంబాబు అరెస్ట్ హేయం
● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి నెల్లూరు రూరల్: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేయడం అత్యంత హేయమని, ఇది టీడీపీ ప్రభుత్వ నియంతృత్వ పాలనకు నిదర్శనమని ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. నగరంలోని పార్టీ నగర కార్యాలయంలో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. అంబటి రాంబాబును అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు ప్రవర్తించిన తీరు.. టీడీపీ గూండాలు చేసిన రౌడీయిజంపై ప్రజలు చర్చించుకుంటున్నారని చెప్పారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. లడ్డూ ప్రసాదంలో జంతువులు, పంది కొవ్వు కలిసిందంటూ ఎలాంటి ఆధారాల్లేకుండా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడటాన్ని హేయమైన చర్యగా అభివర్ణించారు. సీబీఐ ఇచ్చిన నివేదిక చెంపపెట్టు అన్నారు. సీబీఐ నివేదికకు వ్యతిరేకంగా గుంటూరులో పలు చోట్ల ఫ్లెక్సీలను టీడీపీ నేతలు ఏర్పాటు చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని మండిపడ్డారు. టీడీపీ సాగిస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ.. ఆ పార్టీ నేతలకు సద్బుద్ధిని ప్రసాదించాలని స్వామివారికి పూజలు చేసి తిరిగొస్తుంటే.. రౌడీలు, గంజాయి బ్యాచ్ను ఉసిగొల్పి అంబటి రాంబాబుపై హత్యాయత్నం చేశారని మండిపడ్డారు. ఆయన మాటలను వక్రీకరించి.. చంద్రబాబును దూషించారనడం తగదని చెప్పారు. ఆయన ఇంటిపైకి వందల మంది టీడీపీ గూండాలను పంపి విధ్వంసం సృష్టించారని దుయ్యబట్టారు. రెడ్బుక్లో అంబటి రాంబాబు పేరుంది కాబట్టే, ఆయన్ను ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేద్దామాననే దురుద్దేశంతో ఇలా వ్యవహరించారని ధ్వజమెత్తారు. పోలీసుల కళ్ల ముందే ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నా, శాంతిభద్రతలను వారు కూటమి నేతలకు తాకట్టు పెట్టి చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఇలాంటి అరాచక పాలనను ఏ రాష్ట్రంలోనూ చూసి ఉండరని తెలిపారు. ఇలాంటి వాటికి తమ పార్టీ నేతలు భయపడబోరని స్పష్టం చేశారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ప్రజల పక్షాన పోరాడేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ప్రకటించారు. -
ఎర్రచందనం కేసులో వీడని మిస్టరీ
● కొన‘సాగుతున్న’ దర్యాప్తు ● కనిపించని పురోగతిఉదయగిరి: ఉదయగిరి మండలం ఆర్లపడియకు సంబంధించిన అక్రమ ఎర్రచందనం కేసులో నిందితుల ఆచూకీ లేదు. గ్రామస్తులు పట్టించిన ఎర్రచందనం దుంగలు, వాహనం పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినా దర్యాప్తులో పురోగతి లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ ఘటన జరిగి రెండు వారాలు గడుస్తున్నా పోలీసులు దరాప్తు పేరుతో సాగిదీస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కేసు విచారణ ఉదయగిరి సీఐ వెంకట్రావు పర్యవేక్షణలో సాగుతున్నా ఇంతవరకు నిందితుల ఆచూకీ కనిపెట్టలేదు. దీంతో ఈ వ్యవహారంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. ఆరంభం నుంచి వివాదమే.. ఆర్లపడియ అటవీ సమీపంలో ఉన్న చెన్నంబావి ప్రాంతంలో ఎర్రచందనం దుంగలతో ఉన్న వాహనాన్ని గ్రామస్తులు జనవరి 18వ తేదీ రాత్రి అడ్డుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సైలు కలిసి వాహనంతోపాటు ఎర్రచందనం దుంగలు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కానీ పోలీసులు ఆ దుంగలను రహస్యంగా పోలీస్స్టేషన్లో దాచి, వాహనాన్ని పాత పోలీస్ క్వార్టర్స్ ప్రాంతంలో ఉంచారు. ఇలా చేయడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా పక్కరోజు పోలీస్స్టేషన్లో వాహనం కనిపించకపోవడంతో గ్రామస్తులు మీడియాకు సమాచారం అందించారు. మీడియా ప్రతినిధులు ఈ విషయం గురించి పోలీసులను అడగ్గా మాకు తెలియదని చెప్పారు. ఈ వ్యవహారంపై 20వ తేదీన కథనాలు వచ్చాయి. దీంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసులు దుంగలు, వాహనాన్ని ఆర్లపడియ వద్ద స్వాధీనం చేసుకున్న ప్రాంతానికి 21వ తేదీన చేర్చి మీడియాను అనుమతించకుండా అటవీ, రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా చేసి హైడ్రామా నడిపారు. దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో దర్యాప్తులో జాప్యం జరుగుతుండటం, నిందితులను అదుపులోకి తీసుకోకపోవడంతో స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన నిందితుడి ఆచూకీ ఎక్కడ? అర్లపడియ గ్రామస్తులు పోలీసులకు వాహనం, ఎర్రచందనం దుంగలు, సెల్ఫోన్ అప్పుగించారు. సెల్ఫోన్లో ఉన్న డేటా అధారంగా నిందితులను పట్టుకోవడం ప్రస్తుత టెక్నాలజీ ద్వారా పెద్ద కష్టమేమి కాదు. పైగా పోలీసుల అదుపులో ఉన్న వాహనం వివరాలు ద్వారా కూడా నిందితులను సులువుగా పట్టుకునే అవకాశం ఉంది. కానీ జాప్యం చేస్తుండటంపై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రధాన వ్యక్తి నెల్లూరు ప్రాంతానికి చెందన పాత ఎర్రచందనం స్మగ్లర్గా గుర్తించినట్లు సమాచారం. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తే మరికొన్ని మూలాలు వెలుగు చూసే అవకాశం ఉంది. అయితే నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. కానీ ఘటన జరిగిన రోజు వెంటనే స్థానిక పోలీసులు జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేసి ఉంటే ప్రధాన నిందితుడు అప్పుడే చిక్కేవాడని ఆ వర్గాల్లో జరుగుతున్న చర్చ. మొత్తంగా ఈ ఘటన జరిగిన రోజు పోలీసులు వ్యహరించిన వైఖరి, కీలకమైన ఆధారం ఉన్న ప్రధాన నిందితుడిని పట్టుకోవడంలో జరుగుతున్న జాప్యంతో కేసు పురోగతిపై నీలినీడలు కమ్ముకున్నాయి. -
భారం కాదు.. ప్రాణాలకు అభయం
ఇటీవల పోలీసుల సూచనలు ● హెల్మెట్ ధరించకుండా నిర్లక్ష్యంగా ప్రయాణం ● రెండు నెలల్లో 13 మంది మృతి ● జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ● మర్రిపాడులో మోటార్బైక్పై వెళ్తున్న అంజిబాబు అనే వ్యక్తిని కారు వేగంగా ఢీకొనడంతో మృతిచెందాడు. ● కలిగిరిలోని పెద్ద చెరువు అలుగు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో మోపెడ్పై వెళ్తున్న శంకరయ్య అక్కడికక్కడే చనిపోయాడు. ● గౌవరవరం సమీపంలో జాతీయ రహదారిపై కారు ఢీకొని బైక్పై వెళ్తున్న శ్రీనివాసులురెడ్డి అనే వ్యక్తి దుర్మరణం చెందాడు.నెల్లూరు(క్రైమ్): రహదారి ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడంతో తలకు బలమైన గాయాలై అనేకమంది మృతిచెందుతున్నారు. ద్విచక్ర వాహనచోదకునితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి విధిగా హెల్మెట్ ధరించాలని పోలీసు అధికారులు నిరంతరం అవగాహన కల్పిస్తున్నా కొందరిలో మార్పురావడం లేదు. హెల్మెట్ను శిరోభారంగా భావిస్తున్నారు. చిన్నపాటి పొరపాటే తమ ప్రాణాలనే తీయడమే కాకుండా ఎదుటివారిని సైతం ప్రమాదంలోకి నెట్టేస్తోందన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ఫలితంగా ప్రమాదాల్లో తమ వారిని కోల్పోయి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. జిల్లాలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందుతున్న ద్విచక్ర వాహనదారుల్లో 90 శాతం మంది హెల్మెట్ లేకుండా ఉన్నవారే. రెండు నెలల వ్యవధిలో 13 మందికిపైగా ద్విచక్ర వాహనదారులు మృతిచెందినట్లు తెలుస్తోంది. గతేడాది హెల్మెట్ ధరించని 14,663 మందికి జరిమానాలు విధించారు. ఆ సంవత్సరంలో 902 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 514 మంది మృతిచెందగా 894 మంది క్షతగాత్రులయ్యారు. తక్కువ ధరకు వచ్చేవి కొంటూ.. రూ.లక్షలు వెచ్చించి వాహనాలు కొనుగోలు చేస్తున్న వారు జీవితానికి అత్యంత భద్రత కల్పించే హెల్మెట్ విషయంలో అశ్రద్ధ చూపుతున్నారు. తక్కువ ధరకు వస్తున్నాయని రహదారుల వెంట దొరికే నాసిరకం హెల్మెట్లను కొనుగోలు చేస్తున్నారు. ప్రమాద సమయంలో అవి వాహనచోదకులను రక్షించ లేకపోతున్నాయని పరిశీలనల్లో తేలింది. బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) రూపొందించిన ఐఎస్ 4151 – 2015 మార్క్ కలిగిన హెల్మెట్ను పెట్టుకోవాలి. దాని బరువు 1,500 గ్రాముల కంటే తక్కువగా ఉండాలి. ఎక్కువైతే మెడపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. రోజువారీ వినియోగానికి ఫుల్ ఫేస్, ఓపెన్ ఫేస్, మాడ్యులర్ హెల్మెట్లను వాడాలి. సరైన పరిణామం, వైజర్ స్పష్టంగా, బిగువైన చిన్ స్ట్రాప్ ఉండేలా చూసుకోవాలి. గాలిలోపలకి వెళ్లేలా రంధ్రాలుండాలి. ఒకసారి ప్రమాదానికి గురైన హెల్మెట్ను పక్కన పెట్టేయాలి. ప్రతి మూడేళ్లకోసారి కొత్తది తీసుకోవడం ఉత్తమం. హెల్మెట్ ధారణతో ప్రమాద సమయంలో తలకు రక్షణనిస్తుంది. గాలి, దుమ్ము, వర్షం, గాలిలోని పురుగుల నుంచి నుంచి కళ్లను, ముఖాన్ని కాపాడుతుంది. హెల్మెట్ ధారణతో ప్రాణాలు భద్రం అనే నినాదంతో జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వాహనచోదకులకు మితిమీరిన వేగం, మద్యం మత్తులో వాహనాలు నడపరాదని సూచిస్తున్నారు. గమ్యానికి సకాలంలో చేరడం కన్నా క్షేమంగా చేరుకోవడం ముఖ్యమని, ఇంటి వద్ద కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారన్న విషయాన్ని మర్చిపోవద్దని తెలియజేస్తున్నారు. హెల్మెట్ భారం కాదని, భద్రత అని, చట్ట భయంతో కాకుండా కుటుంబ భవిష్యత్ కోసం ధరించాలని సూచిస్తున్నారు. నిబంధనలు విధిగా పాటించే వాహనదారులకు రోజా పువ్వులిచ్చి అభినందిస్తున్నారు. హెల్మెట్ ధరించని వారిపై రూ.1,000 అపరాధరుసుము విధిస్తున్నారు. -
ప్రాక్టికల్స్కు 207 మంది గైర్హాజరు
నెల్లూరు (టౌన్): ఇంటర్ ప్రాక్టికల్స్కు తొలి రోజు ఆదివారం 207 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన ప్రాక్టికల్స్లో 3886 మందికి గానూ 137 మంది.. మధ్యా హ్నం నిర్వహించిన పరీక్షకు మూడు వేల మందికి 70 మంది గైర్హాజరయ్యారు. కేంద్రాలను ఆర్ఐఓ, పరీక్షల కమిటీ జిల్లా సభ్యులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు. దర్గాలో వక్ఫ్ బోర్డు సీఈఓ ప్రార్థనలు అనుమసముద్రంపేట: మండల కేంద్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన హజరత్ ఖాజారసూల్ దర్గాను రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓ యాకూబ్ అలీ ఆదివారం సందర్శించారు. ఆయన్ను దర్గా ఈఓ హుస్సేన్ సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏఎస్పేట దర్గాను అభివృద్ధి చేయనున్నామని వెల్లడించారు. రోజువారీ కార్యక్రమాలపై ఈఓను అడిగి తెలుసుకున్నారు. మాజీ సీఈఓ అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు పీడీఎస్ బియ్యం పట్టివేతవెంకటాచలం(పొదలకూరు): బాయిల్డ్ రైస్ను నెల్లూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెంకటాచలం టోల్ప్లాజా వద్ద ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. అధికారుల వివరాల మేరకు.. చైన్నె నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న లారీని తనిఖీ చేయగా, తమిళనాడులోని పీడీఎస్ బియ్యా న్ని ఉడికించి అక్రమంగా తరలిస్తున్నారనే అంశాన్ని గుర్తించారు. లారీలో 712 గోనె, పాస్టిక్ సంచుల్లో ప్యాకింగ్ చేసి ఉండటాన్ని కనుగొన్నారు. రూ.10 లక్షల విలువైన లారీతో పాటు 349.65 క్వింటాళ్ల బియ్యం మొత్తం రూ.18,74,125గా తేల్చారు. స్వాధీ నం చేసుకున్న బియ్యాన్ని నెల్లూరు ఎమ్మెల్ఎస్ పాయింట్లో అప్పగించారు. బియ్యం కొనుగోలుదారుడు, మధ్యవర్తి హరినాఽథ్రెడ్డి, శంకర్, లారీ యజమాని మజహర్, డ్రైవర్ యరగర్ల శివప్రసాద్పై నిత్యావసర చట్టం కింద 6 – ఏ కేసును నమోదు చేశారు. విజిలెన్స్ సీఐ అక్కిశెట్టి శ్రీహరిరావు, సివిల్ సప్లయ్స్ అధికారి లక్ష్మీనారాయణరెడ్డి, విజిలెన్స్ తహసీల్దార్ కృష్ణప్రసాద్, విజిలెన్స్ ఇంజినీర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు ● దగదర్తిలో జోరుగా సాగుతున్న వైనం ● భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులు దగదర్తి: మండలంలో గ్రావెల్ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అనంతవరం సర్వే నంబర్ – 2లో అటవీ భూములను ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఎలాంటి అనుమతుల్లేకుండా యంత్రాల సాయంతో తవ్వి టిప్పర్లలో తరలిస్తున్నారు. అధిక లోడుతో ఇవి ఎస్సీ కాలనీ మీదుగా వేగంగా వెళ్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వీటి కారణంగా రోడ్డు గుంతలమయంగా మారుతోంది. దీనిపై డీటీ భాగ్యలక్ష్మికి సీపీఎం మండల కార్యదర్శి గోపసాని రమేష్ ఫోన్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. అనుమతుల్లేకుండా తరలిస్తే తమ పార్టీ ఆధ్వర్యంలో అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. కాగా ఈ విషయమై డీటీని సంప్రదించగా, అనంతవరంలో గ్రావెల్ తవ్వకాలకు ఎలాంటి అనుమతుల్లేవని, దీనిపై ఫిర్యాదులు రాగా, వీఆర్వోను వెంటనే పంపించి నిలిపేయించామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవ ని ఆమె స్పష్టం చేశారు. -
వేతనజీవులకు నిరాశ
నెల్లూరు(టౌన్): కేంద్ర బడ్జెట్లో నూతన, పాత ఆదాయ పన్ను శ్లాబులను మార్చకపోవడం వేతనజీవులను నిరాశపరిచిందని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అల్లంపాటి సురేంద్రరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సేవింగ్స్ పరిమితిని కనీసం రూ.2.5 లక్షలకు పెంచి ఉంటే పొదుపు చేసుకోవడానికి ప్రోత్సాహం ఉండేదన్నారు. రీసెర్చ్లో కొత్త ఉద్యోగాలు, ఎడ్యుకేషన్ టు ఎంప్లాయ్మెంట్ కమిటీ స్వాగతించాల్సిన అంశాలైనా రాష్ట్ర విభజనతో ఏర్పడిన లోటు బడ్జెట్ పూడ్చడానికి, ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చడానికి విభజన చట్టం ప్రకారం ప్రత్యేక హోదా ప్రకటించాల్సి ఉందన్నారు. ఉద్యోగలందరూ కోరుకునే విధంగా ఆర్థిక భద్రత కల్పించడానికి సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం ప్రకటించి ఉంటే బాగుండేదన్నారు. రైతులకు భరోసా కల్పించలేదు నెల్లూరు(దర్గామిట్ట): బడ్జెట్ వ్యవసాయ రంగానికి, రైతుల అభివృద్ధికి ఎటువంటి భరోసా కల్పించలేదని, తీవ్ర నిరాశ మిగిల్చిందని ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిరసాని కోటిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మద్దతు ధరల అమలుకు నిధుల కేటాయింపు లేదన్నారు. ప్రస్తుతం రైతాంగం పండించే ఏ పంటలకు కనీస మద్దతు ధరలు లభించడం లేదన్నారు. రైతుల్ని ప్రోత్సహించేలా బడ్జెట్లో మార్పులు చేయాలన్నారు.చిరసాని కోటిరెడ్డి సురేంద్రరెడ్డి -
అక్రమ నిల్వలపై విజిలెన్స్ దాడులు
● పాన్మసాలా, ఖైనీ, ఫ్యాన్సీ వస్తువుల స్వాధీనం ● విలువ రూ.27.89 లక్షలునెల్లూరు (క్రైమ్): పాన్మసాలా, ఖైనీతోపాటు బిల్లుల్లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన ఫ్యాన్సీ వస్తువుల గోదాముపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. శని, ఆదివారాల్లో అధికారులు నెల్లూరు స్టౌన్హౌస్పేట సాలివీధిలోని శ్రీక్యామెల్ కాస్మోటిక్ షాపులో బిల్లుల్లేకుండా నిల్వ ఉంచిన రూ.55,920 విలువైన పాన్ మసాలాలు, రూ.11,27,520 విలువైన ఫ్యాన్సీ వస్తువులను, అదే ప్రాంతంలోని గీతా ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్స్లో రూ.8,50,424 విలువైన ఫ్యాన్సీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. సౌత్రాజుపాళెంలోని ఖదీర్ అనే వ్యక్తి గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన రూ.7,55,200 విలువైన 94,400 ఖైనీ సాచెట్స్ను పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న పాన్మసాలా, ఖైనీ, ఫ్యాన్సీ వస్తువుల మొత్తం విలువ రూ.27,89,064. బిల్లులు లేకుండా అక్రమ వ్యాపారం చేస్తే భారీ ఎత్తున అపరాధ రుసుం వసూలు చేస్తామని విజిలెన్స్ డీసీటీఓ విష్ణురావు వ్యాపారులను హెచ్చరించారు. దాడుల్లో విజిలెన్స్ వ్యవసాయ శాఖ అధికారి వేణుగోపాలరావు, ఏఓ శాంతి భూషణ్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ హరికృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.యువకుడిపై పోక్సో కేసు నమోదుఆత్మకూరు: బాలికను మోసం చేసిన కేసులో ఓ యువకుడిపై ఆత్మకూరు పోలీసులు అట్రాసిటీ, పోక్సో కేసు నమోదు చేశారు. సీఐ జి.గంగాధర్, ఎస్సై ఎస్కే జిలానీ ఆదివారం వివరాలు వెల్లడించారు. మున్సిపల్ పరిధిలోని ఉలవదిబ్బ ప్రాంతానికి చెందిన సంతోష్ ఓ బాలికకు కొన్నినెలలుగా మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో ఆ బాలిక గర్భం దాల్చింది. ఈ విషయమై ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ నిర్వహించారు. వివాహం చేసుకోవాలని కోరినా ఆ యువకుడు అడ్డం తిరగడంతో అట్రాసిటీ, పోక్సో కేసులు నమోదు చేశామని, కోర్టుకు హాజరుపరిచినట్లు పోలీసులు పేర్కొన్నారు. రైల్వే ట్రాక్ పక్కన మృతదేహం మనుబోలు: మండల పరిధిలోని కొమ్మలపూడి – మనుబోలు రైల్వేస్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని సిబ్బంది ఆదివారం గుర్తించారు. 147/23 – 25 కిలోమీటర్ వద్ద అప్లైన్లో మృతదేహం గుర్తుపట్టలేని విధంగా కుళ్లిపోయి ఉండటాన్ని గుర్తించారు. కొద్దిరోజుల క్రితం రైల్లోంచి పడి మరణించి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడు 5.5 అడుగుల ఎత్తు ఉన్నాడు. గులాబీ, తెలుపు రంగు హాఫ్ హ్యాండ్ షర్ట్, గ్రే కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించిన రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. కండలేరులో 58.960 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 58.960 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 450 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,500, లోలెవల్ కాలువకు 300, హైలెవల్ కాలువకు 175, పిన్నేరు కాలువకు 250, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. నిమ్మ ధరలు (కిలో) పెద్దవి: రూ.34 సన్నవి: రూ.20 పండ్లు: రూ.10 -
నేటి నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
నెల్లూరు (టౌన్): ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ను ఆదివారం నుంచి ఈ నెల పది వరకు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా 130 కేంద్రాల్లో నిర్వహించనున్న ప్రాక్టికల్స్కు 21,952 మంది హాజరుకానున్నారు. ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12, మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు వరకు నిర్వహించనున్నారు. 1300 మందికిపైగా ఎగ్జామినర్లు, 130 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 130 మంది డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. విద్యార్థుల సౌకర్యార్థం 0861 – 2320312 నంబర్తో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. నాన్ జంబ్లింగ్ విధానంలో పరీక్షలను నిర్వహించనున్నారు. అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను బిగించాలని ఇంటర్ బోర్డు అధికారులు ఆదేశించారు. మాస్ కాపీయింగ్కు తావు లేకుండా రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లతో పాటు జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు తనిఖీలు జరపనున్నారు. ఏపీఆర్వోకు ఉద్యోగోన్నతి నెల్లూరు రూరల్: నెల్లూరు సమాచార, పౌర సంబంధాల శాఖ ఏపీఆర్వో అళహరి రవీంద్రబాబుకు డివిజనల్ పీఆర్వోగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులను ప్రభుత్వం శనివారం జారీ చేసింది. ఈ మేరకు ఆయన్ను గుంటూరు బదిలీ చేశారు. -
274 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): జాతీయ రహదారిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సీఎస్డీటీ అధికారులు శుక్రవారం అర్ధరాత్రి వెంకటాచలం మండలం గొలగమూడి క్రాస్రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై వాహన తనిఖీలు నిర్వహించారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్ మొదటి లేన్ చివరలో ఓ లారీ పార్క్ చేసి ఉంచడాన్ని గుర్తించారు. అధికారులు లారీని తనిఖీ చేయగా వివిధ రకాలకు చెందిన 564 సంచుల్లో 274 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించారు. వాటి విలువ రూ.13,28,900గా నిర్ధారించారు. పీడీఎస్ బియ్యంతో పాటు లారీని స్వాధీనం చేసుకుని డ్రైవర్ శబరినాథ్ను అదుపులోకి తీసుకున్నారు. బియ్యాన్ని నెల్లూరులోని ఎంఎల్ఎస్ పాయింట్లో అప్పగించారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం లారీ డ్రైవర్, లారీని వెంకటాచలం పోలీస్స్టేషన్లో అప్పగించారు. తిరుపతి జిల్లాలో సేకరించి.. తిరుపతి జిల్లా తడ మండలానికి చెందిన మధ్యవర్తి హరినాథ్రెడ్డి పీడీఎస్ బియ్యాన్ని సేకరించి వాటిని నెల్లూరు జిల్లాలో విక్రయించేందుకు తరలిస్తున్నట్లు విజిలెన్స్ అధికారుల విచారణలో వెల్లడైంది. సదరు వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఆయన దొరికితే ఎవరికి విక్రయిస్తున్నారన్న వివరాలు తెలిసే అవకాశం ఉంది. అయితే లారీ డ్రైవర్ మాత్రం కావలికి చెందిన ఓ వ్యక్తి లారీ వద్దకు వస్తాడని చెప్పారని, ఆయన ఎవరన్న విషయం తనకు తెలియదని వెల్లడించినట్లు సమాచారం. దీంతో మధ్యవర్తి, లారీ యజమాని ప్రవీణ్కుమార్రెడ్డి, డ్రైవర్పై వెంకటాచలం పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసుతో పాటు అదనంగా నిత్యావసర సరుకుల చట్టం 1955లోని సెక్షన్ 6–ఏ కింద నివేదికను వెంకటాచలం సీఎస్డీటీ ద్వారా కలెక్టర్కు అందజేయనున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ అక్కిశెట్టి శ్రీహరిరావు, కావలి సహాయ పౌర సరఫరాల అధికారి ఇండ్ల పుల్లయ్య, వెంకటాచలం సీఎస్డీటీ సైమన్బాబు, విజిలెన్స్ తహసీల్దార్ జీఎస్ కృష్ణప్రసాద్, సహాయ ఇంజినీర్ బి.వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గురుకులాల్లో సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు(స్టోన్హౌస్పేట): జిల్లాలోని తొమ్మిది బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యాసంవత్సరానికి 6, 7, 8, 9, 10 తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అంబేడ్కర్ గురుకులాల జిల్లా సమన్వయాధికారిణి డాక్టర్ సి.ప్రభావతమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి పాఠశాలలో 5వ తరగతిలో 80 సీట్లు ఉన్నాయని, ముత్తుకూరు, బుచ్చిరెడ్డిపాళెం, సంగం, కోడూరులలో ఇంటర్మీడియట్ ఎంపీసీలో 40, బైపీసీలో 40 సీట్లు ఉన్నాయని, కండలేరులో ఎంఈసీలో 40, సీఈసీలో 40 సీట్లు ఉన్నాయని, చిల్లకూరు, కోటలో ఎంపీసీలో 40, బైపీసీలో 40 సీట్లు ఉన్నాయన్నారు. 6, 7, 8, 9, 10 తరగతుల్లో రిజర్వేషన్ అనుసరించి మిగిలిన సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. https://apbragcet. apcfss.in వెబ్సైట్లో ఈనెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బైక్ను ఢీకొన్న కారు ● వ్యక్తి మృతి మర్రిపాడు: బైక్ను కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి మృతిచెందిన ఘటన మర్రిపాడు మండల కేంద్రానికి సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రాపూరు మండలం అక్కంపేటకు చెందిన అంజిబాబు(29) అనే వ్యక్తి బైక్పై మర్రిపాడు వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కారు అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో బైక్ రోడ్డుపై పడిపోగా, అతను తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి 108కు సమాచారం అందించారు. ప్రథమ చికిత్స అందించి గాయపడిన వ్యక్తిని హుటాహుటిన ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలో మృతిచెందారు. మర్రిపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి ఆత్మహత్య ● ప్రేమ వ్యవహారమే కారణమా? కోవూరు: మండల పరిధిలోని కోనమ్మతోటకు చెందిన గరికపాటి నవీన్ (21) అనే యువకుడు తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఏడాది కాలంగా నవీన్ ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు సమాచారం. అయితే కొన్ని రోజులుగా వారి మధ్య వ్యక్తిగత కారణాలతో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన నవీన్, శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి సెల్ఫోన్ డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
నేత్రపర్వంగా రథయాత్ర
నెల్లూరు(బృందావనం): గౌర – నితాయ్ (జగన్నాథ, బలదేవ, సుభద్ర) రథయాత్రను నగరంలో అంగరంగవైభవంగా శనివారం నిర్వహించారు. ఇస్కాన్, నెల్లూ రు శాఖ అధ్యక్షుడు శుకదేవస్వామి పర్యవేక్షణలో సాగి న రథయాత్రను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూ రు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు, నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్రెడ్డి ప్రారంభించారు. బారకాస్ సెంటర్ నుంచి ప్రారంభమైన రఽథయాత్ర వివిధ ప్రాంతాల మీదుగా టీటీడీ కల్యాణ మండపానికి చేరుకుంది. కృష్ణ నామస్మరణతో సమస్యలు దూరం కృష్ణ భగవానుడి నామస్మరణతో ఎలాంటి సమస్యలు దరిచేరవని దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఇస్కాన్ మందిర నిర్వాహకులు తెలిపారు. తొలుత పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే వస్త్ర సంచులు, టీ షర్టులు, గౌర – నితాయ్ లీలలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. దాతలు మాలతిలత, సుధాకర్రావు, సుమతి, నెల్లూరు ఏఎస్పీ దీక్ష తదితరులకు వీటిని అందజేశారు. 56 వంటకాలతో నివేదన, హారతి కీర్తన, దీపహారతులను ఇచ్చారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఇంద్రానుజదాస్ (అమృత్సర్), వేణుకృష్ణదాస్ (మైసూర్), మహాశృంగదాస్ (సికింద్రాబాద్), హరేకృష్ణదాస్ (హైదరాబాద్), అమియా నిమాయ్దాస్ (ముజఫర్నగర్), కరుణా సింధుదాస్ (ఝూన్సీ) తదితరులు పాల్గొన్నారు. -
భార్యను కడతేర్చిన భర్త
నెల్లూరు(క్రైమ్): భార్య ప్రవర్తనతో విసిగిపోయిన భర్త ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన శనివారం తెల్లవారుజామున బాలాజీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అయోధ్యనగర్లో ఓ ఖాళీ స్థలంలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. ఆత్మకూరు మండలం నెల్లూరుపాళేనికి చెందిన శ్రీనందిని(24)కి నెల్లూరు కోటమిట్టకు చెందిన శ్రీహరితో ఐదేళ్ల కిందట వివాహమైంది. వారికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. శ్రీహరి ఓ ప్రైవేటు బస్సు సర్వీస్లో సూపర్వైజర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది. శ్రీనందిని మరొకరితో వివాహేతర సంబంధం ఏర్పరచుకోవడంతో దంపతుల నడుమ విబేధాలు పొడచూపాయి. అవి తారస్థాయికి చేరడంతో తొమ్మిది నెలల కిందట భర్త, కుమార్తెను వదిలి ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఇద్దరూ విడాకులు తీసుకోవాలనుకుని మధ్యలో ఆగిపోయారు. ఈ క్రమంలో భార్య తీరుతో విసిగిపోయిన ఆయన ఎలాగైనా ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకుని అదను కోసం వేచి చూడసాగాడు. మూడునెలల కిందట నందిని బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరింది. శ్రీహరి ఆమెతో తరచూ ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఆమె నెల్లూరు వస్తున్నానని, చింతారెడ్డిపాళెం క్రాస్రోడ్డు వద్ద బస్సు దిగుతానని శుక్రవారం రాత్రి భర్తకు ఫోన్ చేసి చెప్పింది. ఆమెను అంతమొందించేందుకు ఇదే సరైన సమయంగా భావించిన శ్రీహరి ఓ కత్తిని తీసుకుని శనివారం తెల్లవారుజామున చింతారెడ్డిపాళెం క్రాస్రోడ్డు వద్దకు వెళ్లాడు. బస్సు దిగిన భార్యతో మాట్లాడుకుంటూ అయోధ్య నగర్ నాలుగో వీధి ఖాళీ స్థలం వద్ద ఆమెతో గొడవపడ్డాడు. తన వద్దనున్న కత్తితో కడుపులో, గొంతుపై విచక్షణారహితంగా పొడిచి ఆమెను హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ కె.సాంబశివరావు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి జీజీహెచ్ మార్చురీకి తరలించి మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు నెల్లూరుకు చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మృతురాలి తల్లి ఉమ ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేశారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. తల్లి మృతిచెందడం, తండ్రి జైలుకు వెళ్లనుండటంతో అభం శుభం తెలియని చిన్నారి ఒంటరిగా మిగిలిపోయింది. -
లడ్డూలో కొవ్వు అబద్ధం
● బట్టబయలైన బాబు కుట్ర ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ● కసుమూరులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు వెంకటాచలం (పొదలకూరు): శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వనేది అబద్ధమని.. చంద్రబాబు పన్నిన కుట్ర బట్టబయలైందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. లడ్డూ ప్రసాదంపై కొంతకాలంగా జరుగుతున్న అసత్య ప్రచారాలు నిరాధారమని సీబీఐ నివేదిక ద్వారా తేటతెల్లమైన తరుణంలో వెంకటాచలం మండలం కసుమూరులోని కల్యాణ వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలను కాకాణి శనివారం నిర్వహించారు. చంద్రబాబుకు సద్బుద్ధిని ప్రసాదించాలని కాంక్షిస్తూ దేవస్థాన ప్రాంగణం వద్ద 101 టెంకాయలను కొట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యాన్ని టీటీడీ పొందిందని, దేవదేవుడు మన రాష్ట్రంలో కొలువుదీరడాన్ని అదృష్టంగా భావించాలని చెప్పారు. 2024, సెప్టెంబర్ 18న నిర్వహించిన సమావేశంలో గత ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు అసత్య ఆరోపణలు చేశారని చెప్పారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపారంటూ తీవ్రంగా వ్యాఖ్యానించిన అంశాన్ని గుర్తుచేశారు. ప్రసాదంలో పందికొవ్వు కలిసిందంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దుర్మార్గంగా మాట్లాడారని మండిపడ్డారు. దొంగ దీక్షలు చేపట్టి తిరుమల మెట్లను కడిగి హడావుడి చేశారని విమర్శించారు. నిజాలు నిర్ధారణ కాకముందే భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటాన్ని న్యాయస్థానం ప్రశ్నించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్పై నమ్మకం లేదని.. సీబీఐ అధికారులను ఈ దర్యాప్తులో భాగస్వాములను చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించిందని పేర్కొన్నారు. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం ప్రసాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదని, ఇతర కల్తీ జరగలేదని సీబీఐ నిర్ధారించి చార్జిషీట్ను దాఖలు చేసిందని తెలిపారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా, సనాతన ధర్మం పేరుతో పవన్కల్యాణ్ ఎన్ని కుయుక్తులు చేసినా జగన్మోహన్రెడ్డిపై వెంకటేశ్వరస్వామి ఆశీస్సులున్నాయని వివరించారు. సీబీఐ దర్యాప్తుతో భక్తుల్లో నెలకొన్న అనుమానాలు తొలగిపోయాయని తెలిపారు. మందల వెంకటశేషయ్య, ఎంపీపీ కవిత, జెడ్పీటీసీ సుబ్రహ్మణ్యం, వైస్ ఎంపీపీ కోదండరామిరెడ్డి, పార్టీ కన్వీనర్ మోహన్నాయుడు, వేమారెడ్డి రఘునందన్రెడ్డి, కసుమూరు సర్పంచ్ శివ తదితరులు పాల్గొన్నారు. -
డోంట్ టాక్.. నేను చెప్పేది విను..!
● నీ జీతమెంత..? ● హౌసింగ్ డీఈపై ఫోన్లో సోమిరెడ్డి చిందులు మనుబోలు: డోంట్ టాక్.. ముందు నేను చెప్పేది వింటావా..?.. నీ జీతమెంత అంటూ హౌసింగ్ డీఈపై ఫోన్లో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి చిందులేశారు. మండలంలో శనివారం నిర్వహించిన పలు కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. కొండూరుసత్రంలో కొత్త పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. తమకు కాలనీలో ఇళ్లు నిర్మించివ్వకుండా కాంట్రాక్టర్ మోహన్రెడ్డి డబ్బులు తినేశారని పలువురు లబ్ధిదారులు ఆయనతో మొరపెట్టుకున్నారు. దీంతో హౌసింగ్ ఏఈ శరత్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈకి ఫోన్ చేసి అవకతవకలపై నిలదీశారు. అధికారి సర్దిచెప్పేందుకు యత్నించగా, డోంట్ టాక్.. ముందు నేను చెప్పేది వింటావా.. నీకు నెలకు జీతమెంత.. ఏడాదికి రూ.పది లక్షలు తీసుకుంటూ ఏమి చేస్తున్నావ్ అంటూ చిందులేయడంతో అక్కడున్న పలువు రు ఎమ్మెల్యే తీరుపై నివ్వెరబోయారు. గ్రూప్ – 1లో దుత్తలూరు యువకుడి సత్తా దుత్తలూరు: ఏపీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ – 1 ఫలితాల్లో దుత్తలూరుకు చెందిన యువకుడు సత్తా చాటి స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్కు ఎంపికయ్యారు. దుత్తలూరుకు చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి భారతాల గంగాధర్, లలితమ్మ కుమారుడు ఉదయశంకర్ ఎంపికవ్వడంపై పలువురు అభినందనలను తెలియజేశారు. దగదర్తి ఎఫ్ఏసీ తహసీల్దార్కు రిమాండ్ నెల్లూరు(క్రైమ్): దగదర్తి తహసీల్దార్ (ఎఫ్ఏసీ) పాల కృష్ణకు రిమాండ్ను ఏసీబీ కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి శనివారం విధించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కృష్ణ ఇంటితో పాటు స్నేహితులు, బంధువుల నివాసాల్లో సోదాలను ఏకకాలంలో ఏసీబీ ఇన్చార్జి డీఎస్పీ రామకృష్ణుడు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు శుక్రవారం నిర్వహించారు. ఇవి శనివారం సైతం కొనసాగాయి. బుచ్చిరెడ్డిపాళెంలోని బ్యాంక్ లాకర్లను అధికారులు పరిశీలించారు. గుర్తించి స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ సుమారు రూ.మూడు కోట్లు అని తెలుస్తోంది. సోదాల ఆనంతరం కృష్ణకు 14 రోజుల రిమాండ్ను నెల్లూరు ఏసీబీ కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి విధించారు. అంబటి రాంబాబుపై దాడి హేయం నెల్లూరు రూరల్: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ఇంటిపైకి టీడీపీ గూండాలెళ్లి హత్యాయత్నం చేయడం సిగ్గుచేటని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో దాడిని ఖండించారు. అనంతరం ఆయన మాట్లాడారు. లోకేశ్ పాలనలో ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి దాడులు చేయడం సర్వసాధారణంగా మారిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని మండిపడ్డారు. లోకేశ్ నియంతృత్వ పోకడలతో తమ పార్టీ నేతలపై దాడులు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. కల్తీ నెయ్యి విషయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ను నిలదీసేసరికి, సమాధానం చెప్పలేని స్థితిలో, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా దాడులు జరిపారని మండిపడ్డారు. రాంబాబును తీవ్ర పదజాలంతో దూషిస్తూ కర్రలు, రాడ్లతో దాడి చేశారని, ఆయన చంద్రబాబును ఏమీ అనకపోయినా కావాలనే దాడి చేశారన్నారు. ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని మండిపడ్డారు. అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగం అమలు కావడం లేదని, రాష్ట్రంలో నారా వారి రెడ్బుక్ పాలన సాగుతోందని దుయ్యబట్టారు. మాజీ మంత్రికే రక్షణను డీజీపీ కల్పించలేకపోతే, సామాన్యుల పరిస్థితేమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరల్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. -
అవాస్తవాలని తేలినా మారరా..?
మాట్లాడుతున్న మురళీధర్ ● ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ చిల్లకూరు: తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు సాగించిన ప్రచారాలు బూటకమని.. ఎలాంటి కల్తీ జరగలేదని సీబీఐ నిగ్గుతేల్చినా, కూటమి నేతల నోర్లు మూతపడటంలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మండిపడ్డారు. వారికి సద్బుద్ధిని ప్రసాదించాలని వేడుకుంటూ పట్టణంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. అనంతరం ఆలయ బయట విలేకరులతో మాట్లాడా రు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందంటూ పచ్చ మీడియాలో విష ప్రచారం చేయించారని మండిపడ్డారు. నాటి సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో తిరుమల విశిష్టతను మరింత పెంచేలా కృషి చేశారని చెప్పారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక స్వామివారి సన్నిధిలో ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నా, ఆయన మిన్నకుండిపోయారని మండిపడ్డారు. సీబీఐ నివేదిక అనంతరం చంద్రబాబు, పవన్కల్యాణ్ ఏమీ మాట్లాడకుండా తేలు కుట్టిన దొంగల్లా మిన్నకుండిపోయారని విమర్శించారు. వారు చెప్పినవన్నీ అబద్ధాలేనని దీని ద్వారా తెలుస్తోందన్నారు. ప్రజలకు వీరు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లడ్డూ ప్రసాదంపై వచ్చి న ఆరోపణలు పటాపంచలు కావడంతో వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసేందుకు బయల్దేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు దాడికి పాల్పడటం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి అరాచక పాలనలో ఇంకెన్నాళ్లు ఉండాలాననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోందని చెప్పా రు. పట్టణ, రూరల్ కన్వీనర్లు బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయకుమార్రెడ్డి, సీనియర్ నేత ఎల్లసిరి గోపాల్రెడ్డి, చిల్లకూరు మాజీ ఎంపీపీ దువ్వూరు మధుసూదన్రెడ్డి, నాశిన నాగులు, కోట, గూడూరు మహిళా విభాగ అధ్యక్షులు రేష్మా, సృజనారెడ్డి, దీప్తి, సురేష్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంత దుష్ప్రచారమా..?
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: తిరుమల లడ్డూ కల్తీ విషయంలో సీబీఐ క్లీన్చిట్ ఇచ్చినా, తమ పార్టీపై సీఎం చంద్రబాబు బురదజల్లడం అన్యాయమని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ధ్వజమెత్తారు. పట్టణంలోని రామకృష్ణనగర్లో కొలువైన వెంకటేశ్వరాలయంలో పూజలను శనివారం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందంటూ టీడీపీ నిరాధారమైన ఆరోపణలు చేసిందని మండిపడ్డారు. తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే ఆయనే తగిన బుద్ధి చెప్తారని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. ఇప్పటికై నా సీఎం చంద్రబాబు దుష్ప్రచారాలు మానకపోతే వెంకటేశ్వరస్వామి ఆగ్రహానికి గురికాక తప్పదని స్పష్టం చేశారు. పార్టీ పార్లమెంట్ ని యోజకవర్గ పరిశీలకుడు వెంకటరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
న్యాయస్థానం కొట్టేసినా తప్పుడు రాతలా?
● అక్రమ కేసులపై హైకోర్టు తీర్పు చెంపపెట్టు ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వెంకటాచలం(పొదలకూరు): గ్రావెల్ తవ్వకాల విషయంలో మైనింగ్ శాఖ జారీ చేసిన షోకాజ్, డిమాండ్ నోటీసులను న్యాయస్థానం కొట్టివేసిందని, అస్తవ్యస్తంగా విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఇచ్చిన నోటీసులకు విలువ లేదని కోర్టు స్పష్టం చేసినా పచ్చపత్రికల్లో తనపై తప్పుడు రాతలు ఏమిటని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. వెంకటాచలం పార్టీ కార్యాలయంలో శనివారం కాకాణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం అనుకూల పచ్చ మీడియా తనపై అసత్య కథనాలు వండి వార్చినట్లు పేర్కొన్నారు. మైనింగ్ వ్యవహారంలో తన అనుచరులు, తనకు రూ.53 కోట్ల పెనాల్టీ వేసినట్టు సోమిరెడ్డి ప్రోద్బలంతో పచ్చ పత్రికలు రాసినట్లు ఆరోపించారు. హైకోర్టు ఏవైనా ఆధారాలు ఉంటే వాటిని ముందుగా అందించి వివరణ తీసుకున్న తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో లేని కొవ్వును సృష్టించిన విధంగా కొన్ని పత్రికల్లో తనపై తప్పుడు కథనాలు రాసినట్లు మండిపడ్డారు. విజిలెన్స్ నివేదికలో చవ్వా చంద్రబాబునాయుడు గ్రావెల్ తరలించాడని స్పష్టంగా పేర్కొన్నా అతను టీడీపీకు చెందిన వాడు కావడంతో ఎలాంటి నోటీసులు అందజేయలేదన్నారు. జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా చవ్వా చంద్రబాబునాయుడు అనే వ్యక్తే గ్రావెల్ తీసినట్టు విజిలెన్స్ ఆధారాలు ఉన్నాయని వెల్లడించినట్టు తెలిపారన్నారు. అయితే అతను తనకు అనుచరుడని సోమిరెడ్డి ఆరోపిస్తున్నాడని.. అతడిని నేను చూసినట్టుగా, కలసినట్టుగా ఆధారాలు లేవని.. సోమిరెడ్డితో రాసుకుపూసుకు తిరుగుతుంటాడనే ఆధారాలు ఉన్నాయన్నారు. సోమిరెడ్డికే చంద్రబాబు అనుచరుడు 2014 నుంచి 2019 వరకు సోమిరెడ్డి ఎమ్మెల్సీగా, మంత్రిగా దోచుకున్న గ్రావెల్ గుంతలు చూపించి చవ్వా చంద్రబాబునాయుడు నా అనుచరుడని తమ పార్టీ నాయకుల పేర్లు చేర్చి గ్రావెల్ తరలించిన చంద్రబాబునాయుడు పేరు విజిలెన్స్ నివేదికలో లేకుండా చేయడం దుర్మార్గంగా పేర్కొన్నారు. అధికారులు ఉద్దేశపూర్వంగా చేసిన దారుణాలను కోర్టు కొట్టివేసిందని, హైకోర్టు తీర్పు తప్పుడు కేసులు పెట్టిన వారికి చెంపపెట్టుగా పేర్కొన్నారు. మేము ఎలాంటి తప్పు చేయలేదని ఎవరికి రూ.53 కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. న్యాయస్థానాలపై తనకు నమ్మకం ఉందని, ఎన్ని దొంగ కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. సోమిరెడ్డి ఆరోపణలు మాత్రమే చేస్తాడని, మేము ఆధారాలను కూడా చూపెడుతామన్నారు. ఇసుక రీచ్లలో స్కానర్లు పెట్టి దోచుకుంటున్న వైనాన్ని ఆధారాలతో సహా బయటపెట్టిన వైనాన్ని గుర్తుచేశారు. సోమిరెడ్డి పెట్టే దొంగ కేసులు, బ్లాక్మెయిల్ రాజకీయాలకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరన్నారు. గ్రావెల్పై వారు పెట్టిన దొంగ కేసులో కోర్టు షోకాజ్, డిమాండ్ నోటీసులు చూసిన వెంటనే కొట్టి వేసిందంటే సోమిరెడ్డికి అంతకంటే సిగ్గుమాలినతనం ఇంకోటి ఉండదని విమర్శించారు. పచ్చపత్రికలు ఏమి రాసినా భయపడే ప్రసక్తే లేదని, న్యాయస్థానాల్లో తేల్చుకుంటామని వెల్లడించారు. సమావేశంలో నాయకులు మందల వెంకటశేషయ్య, కోదండరామిరెడ్డి, రఘునందన్రెడ్డి, మోహన్నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీకి భారీ మెజారిటీ ఖాయం
నెల్లూరు సిటీ: రూరల్ నియోజకవర్గంలో ఆనం విజయకుమార్రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొంది, వైఎస్సార్సీపీ జెండా రెపరెపలాడడం ఖాయమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని జీపీఆర్ కల్యాణ మండపంలో పార్టీ నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలను జగన్మోహన్రెడ్డి అమలు చేశారన్నారు. కరోనా కష్టకాలం, ఇతర సమస్యలతో కార్యకర్తలకు సరిగ్గా గుర్తింపు లభించలేదని, ఈ సారి కార్యకర్తలకు పెద్దపీఠ వేయాలని జగన్మోహన్రెడ్డి నిర్ణయించారన్నారు. అందుకే గ్రామ, డివిజన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి కార్యకర్తలకు గుర్తింపు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతిసారీ చంద్రబాబును నమ్మి మోసపోతున్నామని ప్రజలు అభిప్రాయ పడుతున్నారన్నారు. ఈ ప్రభుత్వం గ్రామాల్లో బెల్టు షాపులు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందన్నారు. కొన్ని గ్రామాల్లో పిక్ పాకిటర్లతో డివిజన్ చైర్మన్ అని చెబుతూ పింఛన్లు ఇస్తున్నారని, వీళ్ల దగ్గరా పింఛన్లు తీసుకునేది అని ప్రజలు ఛీకొడుతున్నారన్నారు. సర్పంచ్లు, కార్పొరేటర్లను పక్కన పెట్టి అర్హత లేని వ్యక్తులతో పింఛన్ల పంపిణీలు చేస్తున్నారన్నారు. కొన్ని ఫంక్షన్లలో టీడీపీ వర్గీయులే ఈసారి వైఎస్సార్సీపీ వస్తుందని చెప్పడం చూస్తున్నామన్నారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని హంగామా చేసిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని నిలదీశారు. ముందు వెంకటేశ్వరస్వామికి పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కల్తీ జరగలేదని సీబీఐ తేల్చినా పచ్చ పత్రికలు చంద్రబాబు చెప్పిన విధంగా వార్తలు రాస్తున్నారని మండిపడ్డారు. కోటి సంతకాల సేకరణలో జిల్లాలో రూరల్ నియోజకవర్గంలో ఆనం విజయకుమార్రెడ్డి ఆధ్వర్యంలో చాలా బాగా జరిగిందన్నారు. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీలు కడితే తీసివేయడానికి, టీడీపీ వాళ్లు ఫ్లెక్సీలు కట్టేందుకు పోలీసులు పనిచేస్తున్నారన్నారు. ఫ్లెక్సీలు కాపాడుకోవడానికి వందలాది పోలీసులను తీసుకొచ్చారంటే అది వైఎస్సార్సీపీ పవర్ అని అన్నారు. రూరల్లో అరాచక పాలన రూరల్ నియోజకవర్గంలో రౌడీలు, రౌడీషీటర్లు వీధికుక్కల్లా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ అరాచక పాలన సాగిస్తున్నారని వైఎస్సార్సీపీ రూరల్ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి అన్నారు. డివిజన్, గ్రామ కమిటీలతో వైఎస్సార్సీపీ రూరల్లో బలంగా ఉందన్నారు. ప్రజల పక్షాన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతరం పోరాడుతున్నారని తెలిపారు. నెల్లూరు రూరల్లో జగన్మోహన్రెడ్డి పేరు చెప్పుకుని పదవులు అనుభవించిన వారు, తాను చస్తే కొరివి పెట్టాలని మాట్లాడిన వారు ఇప్పుడు మోసం చేసి వెళ్లిపోయారన్నారు. అతని దగ్గర రౌడీలు, రౌడీషీటర్లు ఉన్నారని మండిపడ్డారు. కార్యకర్తలు అభిమానంతో ఫ్లెక్సీలను కడితే వాటిని కూడా తొలగించడం పిరికిపంద చర్యలు అని తెలిపారు. మళ్లీ సీఎంను చేసుకుందాం వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎంగా చేసుకునేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అన్నారు. పార్టీ కోసం కార్యకర్తలు నిత్యం అండగా ఉంటున్నారని తెలిపారు. భారీ విజయం తథ్యం 2029 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం దక్కుతుందని ఎమ్మెల్సీ, సిటీ నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఇబ్బందులకు గురిచేసినా మీ వెంటే నడుస్తామని ప్రతి కార్యకర్త నిలబడుతున్నారన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తల కోసం గ్రామ, డివిజన్ కమిటీలు వేశారన్నారు. కార్యకర్తకు ఐడీ కార్డులు అందజేస్తున్నట్లు తెలిపారు. పార్టీ కోసం కష్ట సమయాల్లో అండగా నిలిచిన కార్యకర్తలను గుర్తు పెట్టుకుని నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పిద్దామని జగన్మోహన్రెడ్డి చెప్పారన్నారు. 2029 ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయన్నారు. టీడీపీ దౌర్జన్యాలకు భయపడేది లేదు టీడీపీ నేతలు చేస్తున్న దౌర్జన్యాలకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు భయపడరని ఆ పార్టీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు జంకె వెంకటరెడ్డి తెలిపారు. జగన్మోహన్రెడ్డిని కచ్చితంగా సీఎం చేసుకుంటామన్నారు. తిరుమల నెయ్యిలో కల్తీ జరగలేదని సీబీఐ తేల్చి చెప్పినా టీడీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తలకు ఐడీ కార్డుతో పాటు బీమా పథకం కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైఎస్సార్సీపీ నేతలపై దాడులు చేయడం దురదృష్టకరమన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని దేశ ప్రధాని మోదీ ప్రశంసించారని గుర్తుచేశారు. రూరల్ నియోజకవర్గ పరిశీలకుడు చిల్లకూరు సుధీర్రెడ్డి, మలిరెడ్డి కోటారెడ్డి, నాయకులు పాల్గొన్నారు. ప్రతి కార్యకర్తకు జగన్మోహన్రెడ్డి అండగా ఉంటారు ఇబ్బందులు పెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి -
స్థిరాస్తి రిజిస్ట్రేషన్లపై బాదుడు
నెల్లూరు సిటీ: టీడీపీ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి ప్రజలపై ఏదో రకంగా భారాన్ని మోపుతూనే ఉంది. తాజాగా వీరి కన్ను మార్కెట్ వాల్యూపై పడింది. గతేడాది ఈ రకంగా 50 శాతం వరకు ప్రభుత్వం పెంచిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆదివారం నుంచి దీన్ని మరో పది శాతానికి పెంచారు. దీనికి సంబంధించిన ఆమోదానికి గానూ రిజిస్ట్రేషన్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా శనివారం నిర్వహించారు. ఏడాది తిరగకముందే.. జిల్లాలో 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. నగరంలో ప్రధాన రిజిస్ట్రేషన్, స్టోన్హౌస్పేట, బుజబుజనెల్లూరు రిజిస్ట్రార్ ఆఫీసులు ఉన్నాయి. జిల్లాలోని అన్ని కార్యాలయాల పరిధిలోని ప్రాంతాలతో పాటు నగరంలో పది శాతం మేర పెంచు తూ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ఏడాది తిరగకముందే ప్రజలపై 60 శాతం మేర భారం పడింది. రియల్ ఎస్టేట్పై తీవ్ర ప్రభావం ఇప్పటికే జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి ప్లాట్ల కొనుగోళ్లు, విక్రయాల్లేక రియల్టర్లు లబోదిబోమంటున్నారు. వెంచర్లు, ఇళ్లను నిర్మించిన బిల్డర్లు ఆర్థికంగా కుదేలయ్యారు. ఈ రంగంలో ఏ మాత్రం కదలికలేని పరిస్థితుల్లో పది శాతాన్ని పెంచడం వీరి పాలిట అశనిపాతంలా పరిణమించనుంది. ఒక్క రోజులో 518 రిజిస్ట్రేషన్లు జిల్లాలోని 15 రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 518 రిజిస్ట్రేషన్లు జరిగాయి. కార్యాలయాలు శనివారం కిటకిటలాడాయి. రూ.2.87 కోట్ల ఆదాయమొచ్చింది. కార్యాలయాలు రిజిస్ట్రేషన్ల సంఖ్య నెల్లూరు ఆర్ఓ 72 స్టోన్హౌస్పేట 56 బుజబుజనెల్లూరు 18 కందుకూరు 40 అల్లూరు 23 ఆత్మకూరు 38 బుచ్చిరెడ్డిపాళెం 40 మార్కెట్ విలువ పది శాతం పెంపు నేటి నుంచి అమల్లోకి గతేడాది ఫిబ్రవరి ఒకటిన 50 పర్సంట్ మోత ఈ సంవత్సరమూ అదే పంథా -
భక్తుల మనోభావాలను దెబ్బతీశారు
● ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి నెల్లూరు రూరల్: భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తిరుమల లడ్డూ ప్రసాదంలో కొవ్వు కలిసిందంటూ కూటమి నేతలు దుష్ప్రచారం సాగించారని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. కూటమి నేతలకు కనువిప్పు కలగాలని కాంక్షిస్తూ రామలింగాపురంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను పార్టీ నేతలతో కలిసి శనివారం నిర్వహించారు. సీఎం చంద్రబాబు బుద్ధి మారాలంటూ ఆలయ బయట ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్ దుష్ప్రచారం సాగించారని ఆరోపించారు. సీబీఐ నివేదిక కూటమి నేతలకు చెంపపెట్టు అన్నారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంటే కలియుగ దైవం వెంకటేశ్వరస్వామి క్షమించరని చెప్పారు. నేతాజీ సుబ్బారెడ్డి, పార్టీ రాష్ట్ర సెక్రటరీ పేర్నేటి కోటేశ్వరరెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వేలూరు ఉమామహేష్, జిల్లా ఉపాధ్యక్షుడు మజ్జిగ జయకృష్ణారెడ్డి, కార్పొరేటర్లు శ్రీకాంత్రెడ్డి, కామాక్షిదేవి, మద్దినేని మస్తానమ్మ, విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు ఆశ్రిత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రీ సర్వేను పక్కాగా జరపాలి
రాపూరు: మండలంలో రీ సర్వేను పక్కాగా జరపాలని జేసీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మండలంలోని కండలేరు అతిథి గృహంలో రెవెన్యూ సిబ్బందితో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వే సమయంలో భూమి గల రైతులుండేలా చూడాలని సూచించారు. అర్జీలు పెండింగ్లో లేకుండా చూడాలని ఆదేశించారు. భూముల పరిశీలన మండలంలోని పంగిలిలో భూములను జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నెల్లూరు రూరల్ మండలంలోని దొంతాలిలో డంపింగ్ యార్డు ఏర్పాటు కోసం 42 ఎకరాల అటవీ భూమిని సేకరించామని, దీనికి ప్రత్యామ్నాయంగా 84 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవ్వాల్సి ఉందని చెప్పారు. దీనికి గానూ మండలంలోని పంగిలిలో ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించారని తెలిపారు. సర్వేను పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక పంపనున్నామని, ఆమోదం లభించాక ఈ భూమిని అటవీ శాఖకు అప్పగించనున్నామని వెల్లడించారు. తహసీల్దార్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. -
జగనన్న 2.0లో శ్రేణులకే అధిక ప్రాధాన్యం
● 18 లక్షల మందితో సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాం ● నేతలు, కార్యకర్తలకు ఐడీ కార్డులిస్తాం ● మంచిని చెడుగా చూపడం తప్ప బాబుకు పాలన చేతకాదు ● మాజీ మంత్రులు కాకాణి, ప్రసన్న కొడవలూరు: రాష్ట్రంలో ఎన్నికలెప్పుడొచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి జగన్మోహన్రెడ్డి మరోసారి సీఎం కావడం తథ్యమని, జగనన్న 2.0లో పార్టీ శ్రేణులకు తొలి ప్రాధాన్యమివ్వనున్నామని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి పేర్కొన్నారు. గ్రామ కమిటీల ఎంపికలో భాగంగా నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేసేందుకు గానూ మండలంలోని నార్తురాజుపాళెంలో గల పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కాకాణి మాట్లాడారు. గ్రామ కమిటీల ఎంపిక ద్వారా నియోజకవర్గానికి ఏడు వేల నుంచి పది వేల మంది చొప్పున రాష్ట్రంలో 18 లక్షల మందితో జగనన్న సైన్యాన్ని సిద్ధం చేయనున్నారని వెల్లడించారు. కమిటీల్లో ఎంపికై న ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులను ఇవ్వనున్నామని తెలిపారు. దీంతో వీరికి గుర్తింపు, గౌరవం లభించడంతో పాటు ఎక్కడికెళ్లినా పని జరిగేలా చర్యలు చేపట్టనున్నామని చెప్పారు. డబ్బా కొట్టుకునేందుకే పరిమితం సీఎం చంద్రబాబుకు పరిపాలన చేతకాదని విమర్శించారు. మంచిని చెడుగా చిత్రీకరించడమే ఆయనకు తెలుసునని ధ్వజమెత్తారు. 20 లక్షల కోట్ల ఉద్యోగాలిస్తామని చంద్రబాబు చెప్పారని ఆయన ఎద్దేవా చేశారు. సూపర్ సిక్స్ విజయవంతమంటూ డబ్బా కొట్టుకుంటున్నారని, అయితే ఏ పథకాన్నీ అందరికీ ఇవ్వలేదనే అంశాన్ని గుర్తుచేశారు. దీనిపై సంబరాలు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. పింఛన్లను సైతం పచ్చ చొక్కా తొడుకున్న వారికే ఇస్తూ సమాజం సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆయన పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు. బాబుకు ఓటు ద్వారా వాతలు పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తాము టీడీపీ వారిని గతంలో చేర్చుకొని తప్పు చేశామని, వీరంతా తమకు గుణపాఠం చెప్పి ప్రలోభాలకు లొంగి మరోసారి అదే గూటికి చేరారని ధ్వజమెత్తారు. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. పోలీస్ అధికారులు కొందరు ఓ జిల్లాలో తమ పా ర్టీ వారిని చితకబాది.. మరో జిల్లాలో మన పార్టీ నేతలతో సఖ్యతగా ఉండటాన్ని చూస్తున్నామని, ఇలాంటి వారిపై అప్రమత్తంగా ఉంటామని చెప్పారు. పార్టీకి కార్యకర్తలే బలం జగన్మోహన్రెడ్డి రెండోసారి అధికారంలోకి వచ్చాక కార్యకర్తలకు పెద్ద పీటేయనున్నారని ప్రసన్నకుమార్రెడ్డి పేర్కొన్నారు. పార్టీకి కార్యకర్తలే బలమని చెప్పారు. క్షేత్ర స్థాయి నుంచే పార్టీని మరింత బలోపేతం చేసేందుకు గ్రామ కమిటీలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన వద్ద లబ్ది పొంది.. అధికారం కోల్పోయాక అవతలి పార్టీ వద్ద సూట్ కేసులు తీసుకొని ఫిరాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారే అసలైన కార్యకర్తలని పేర్కొన్నారు. ఇప్పుడు మన వెంట నడిచిన వారికి మన ప్రభుత్వం వచ్చాక అత్యంత ప్రాధాన్యమివ్వనున్నామని ప్రకటించారు. తొలుత గ్రామ కమిటీల జాబితాను కాకాణికి నేతలు అందజేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, ఆఫ్కాఫ్ మాజీ చైర్మన్ కొండూరు అనిల్బాబు, జిల్లా ఉపాధ్యక్షుడు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, ఎంపీపీ గాలి జ్యోతి, జెడ్పీటీసీ శ్రీలత, పార్టీ మండలాధ్యక్షుడు చిమటా శేషగిరి, అత్తిపల్లి అనూప్రెడ్డి, మావులూరు శ్రీనివాసులురెడ్డి, కాటంరెడ్డి నవీన్రెడ్డి, సతీష్రెడ్డి, షాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
యూరియా అడిగితే కొడతారా..?
● నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి కలువాయి(సైదాపురం): పంటల సాగు నిమిత్తం యూరియాను కోరిన రైతులకు ఇవ్వకపోగా, వారిని పోలీసులు లాఠీలతో కొట్టడం ఎంతవరకు సమంజసమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కలువాయి మండలంలోని తెలుగురాయపురానికి చెందిన రైతులపై అక్రమ కేసులను బనాయించిన తరుణంలో బాధిత కుటుంబసభ్యులను శుక్రవారం పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటూ ఎమ్మెల్యేకు కొమ్ముకాస్తూ తమ పార్టీ శ్రేణులను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు. తెలుగురాయపురంలో కూటమి నేతల అరాచకాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆరోపించారు. యూరియా కోసం వెళ్లిన రైతులపై కక్షసాధింపులు తగవన్నారు. ఎమ్మెల్యేను ఏదో అన్నారంటూ తమ పార్టీకి చెందిన శ్రీనివాసులురెడ్డి, చిన్నపెంచలరెడ్డి, వెంకటనరసారెడ్డి, కిశోర్పై అక్రమ కేసులు బనాయించడం, వారిని చిత్రహింసలకు గురిచేయడం దారుణమన్నారు. ముందస్తు నోటీసులు, సమాచారం లేకుండా రైతులను రోజంతా పోలీస్స్టేషన్లో నిర్బంధించి.. అనంతరం వారిపై కేసులు నమోదు చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. ఇదెక్కడి అన్యాయమని స్థానిక ఎస్సైను ప్రశ్నించగా, పైనుంచి ఒత్తిళ్లు అని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. తమ పార్టీ శ్రేణుల జొలికొస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. రైతులపై కేసులను బనాయిస్తే సహించేదిలేదని, దీని కోసం ఎంత దూరానికై నా వెళ్తామని తెలిపారు. తమ పార్టీ సారథ్యంలో ప్రభుత్వం త్వరలోనే కొలువుదీరనుందని, ఇప్పుడు అరాచకాలకు పాల్పడుతున్న అధికారులను వదలబోమన్నారు. పార్టీ శ్రేణులకు తానెప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. జెడ్పీటీసీ అనిల్కుమార్రెడ్డి, మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జగనన్నను మరోసారి సీఎం చేద్దాం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ● పార్టీ నెల్లూరు నగర కార్యకర్తలతో విస్త్తృత స్థాయి సమావేశం నెల్లూరు రూరల్: జగనన్న 2.0లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అధిక ప్రాధాన్యమివ్వనున్నారని, శ్రేణులు మరింత కష్టించి జగన్మోహన్రెడ్డిని మరోసారి సీఎంను చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరులోని జీపీఆర్ కల్యాణ మండపంలో పార్టీ నెల్లూరు నగర కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. దీనికి కాకాణి గోవర్ధన్రెడ్డి, పార్లమెంట్ సమన్వయకర్త జంకె వెంకటరెడ్డి, పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి, నగర పరిశీలకుడు చిల్లకూరు సుధీర్రెడ్డి, ఖలీల్ అహ్మద్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. గ్రామ, వార్డు స్థాయిలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తించి ప్రోత్సహించనున్నామని వివరించారు. గ్రామస్థాయి కమిటీ సభ్యులకు గుర్తింపు కార్డులిచ్చి, సముచిత స్థానాన్ని కల్పిస్తామని వెల్లడించారు. తమ పార్టీ శ్రేణులను ఇబ్బందులకు గురిచేసిన వారిని భవిష్యత్తులో వదిలేదిలేదని స్పష్టం చేశారు. అబద్ధానికి, అన్యాయానికి, మోసానికి నిలువెత్తు రూపం చంద్రబాబు అని మండిపడ్డారు. ఎన్నికలెప్పుడు జరిగినా, నగరంలో పార్టీ జెండా రెపరెపలాడటం ఖాయమని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఏ హామీనీ అమలు చేయడంలేదని ఆరోపించారు. గ్రామాల్లో అభివృద్ధి ఊసే కనిపించడంలేదని, కూటమి పాలనతో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. 2029లో జగన్మోహన్రెడ్డి సీఎం కావడం తథ్యమన్నారు. వలంటీర్ల ద్వారా పింఛన్లను గతంలో అందజేసేవారని గుర్తుచేశారు. కష్టకాలంలోనూ పార్టీలో ఉన్న వారే జగనన్న సైనికులని, వీరికి రానున్న రోజుల్లో పెద్దపీటేస్తామని వెల్లడించారు. వెనుకడుగేయడంలేదు.. ఓటమి తర్వాత కార్యకర్తలు నెలల్లోనే చురుగ్గా పనిచేయడం చిన్న విషయం కాదని చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎనిమిది వేల మంది కార్యకర్తలను గుర్తించి ఐడీ కార్డులను ఏప్రిల్లో అందజేయనున్నామని వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తున్నా, తమ పార్టీ శ్రేణులు వెనుకడుగేయడంలేదని చెప్పారు. కార్యకర్తలను కాపాడుకునే విషయంలో ఎంత దూరమైనా వెళ్తామన్నారు. టీడీపీకి అధికారాన్ని ప్రజలు కట్టబెడితే, దాన్ని విస్మరించి తమ పార్టీ కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేంత వరకు జిల్లాలో కాకాణి సారథ్యంలో పోరాడతామని ప్రకటించారు. అక్రమ కేసులు తప్ప ఇంకేమీలేవు.. అక్రమ కేసులు, దౌర్జన్యాలు, హత్యలు తప్ప ప్రస్తుత ప్రభుత్వంలో మరేవీ లేవని జంకె వెంకటరెడ్డి ఆరోపించారు. దిగజారుడు రాజకీయాలు తప్ప ప్రజలకు ఏ మేలునూ చంద్రబాబు చేయడంలేదని ఆరోపించారు. అధికారం ఉన్నా లేకపోయినా జగనన్నతోనే తమ పయనమని ఆనం విజయకుమార్రెడ్డి తెలిపారు. కార్యకర్తలే తమ పార్టీకి బలమని చెప్పారు. -
తవ్వేకొద్దీ.. బయటపడుతున్న అక్రమాస్తులు
● ఏసీబీ సోదాల్లో నగదు, బంగారు గుర్తింపు ● రూ.కోట్లకు పడగలెత్తిన ఎఫ్ఏసీ తహసీల్దార్ నెల్లూరు(క్రైమ్) / బుచ్చిరెడ్డిపాళెం రూరల్: దగదర్తి తహసీల్దార్ (ఎఫ్ఎసీ) పాల కృష్ణ ఆదాయానికి మించి భారీగా ఆస్తులను కూడబెట్టారనే అంశం ఏసీబీ సోదాల్లో వెలుగులోకి వచ్చింది. ఆయన్ను అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నగరంలోని తెలుగుగంగ కాలనీ సమీపంలో గల విజయలక్ష్మినగర్లో కృష్ణ ఇంటితో పాటు స్నేహితుల నివాసాలు, బుచ్చిరెడ్డిపాళెంలోని ఆయన సోదరుడు, దగదర్తిలోని తహసీల్దార్ కార్యాలయంలో నెల్లూరు ఏసీబీ ఇన్చార్జి డీఎస్పీ రామకృష్ణుడు పర్యవేక్షణలో బృందాలు శుక్రవారం ఉదయం ఆరు నుంచి సోదాలు చేపట్టారు. తెలుగుగంగ కాలనీ సమీపంలో 33.24 అంకణాల్లో జీ + 3 స్కూల్ భవనం.. చేజర్ల మండలంలో 5.59 ఎకరాల వ్యవసాయ భూమి.. పొదలకూరు మండలం తోడేరులో 31.48 చదరపు గజాల ఇంటి స్థలం.. ఒక స్కూల్ వ్యాన్.. ద్విచక్రవాహనం.. ఇంట్లో రూ.లక్ష నగదు.. 395.36 గ్రాముల బంగారు ఆభరణాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దగదర్తి భూముల వ్యవహారంలో పలు ఆరోపణలు ఉండటంతో ఆ దిశగా ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ.కోట్లల్లో ఉండొచ్చని తెలుస్తోంది. సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. 2017లో డీటీగా.. బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన పాల కృష్ణ 2009లో స్కూల్ అసిస్టెంట్గా చేరారు. 2017లో ఏపీపీఎస్సీ ద్వారా డిప్యూటీ తహసీల్దార్గా ఎంపికై నాయుడుపేట, గూడూరులో పనిచేశారు. సైదాపురం, వెంకటాచలం, చేజర్ల, రాపూరు మండలాల్లో తహసీల్దార్ (ఎఫ్ఎసీగా) విధులు నిర్వర్తించారు. దగదర్తి తహసీల్దార్గా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. సైదాపురంలో పనిచేస్తున్న సమయంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలొచ్చాయి. దీనిపై 2022 జూలైలో ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. డిపార్ట్మెంటల్ ఎంకై ్వరీ పెండింగ్లో ఉందని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. సోదాల అనంతరం కృష్ణను కోర్టులో హాజరుపర్చనున్నామని చెప్పారు. ఏసీబీ ఇన్స్పెక్టర్లు విజయకుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. లీలలెన్నో.. సైదాపురం: దగదర్తి తహసీల్దార్ (ఎఫ్ఏసీ) కృష్ణ బాగోతాలు అన్నీ అన్నీ కావు. వాస్తవానికి గూడూరు ఆర్డీఓ కార్యాలయంలో ఏఓగా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో కొందరి సిఫార్సులతో 2022 – 23లో సైదాపురం అడ్హాక్ తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టారు. పైసలిస్తేనే ఫైల్ను చక్కబెట్టేవారనే ఆరోపణలు అప్పట్లోనే గుప్పుమన్నాయి. కంప్యూటర్ల మొదలుకొని ఇంటికి ఏసీల వరకు ఇలా ఏదీ వదలకుండా చక్కదిద్దుకున్నారనే విమర్శలూ లేకపోలేదు. భారీగా వెనుకేసుకున్న మొత్తంతో ఆత్మకూరు డివిజన్ పరిధిలో ఓ తోటనూ కొనుగోలు చేశారని తెలుస్తోంది. గతంలో సైదాపురం తహసీల్దార్గా ఉన్న సమయంలో 2022, జూలై రెండు, మూడున కార్యాలయంపై ఏకకాలంలో 16 మంది ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆయన అక్రమాలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. పలు ఆరోపణల నేపథ్యంలో అప్పట్లో ఆయన్ను బదిలీ చేశారు. మరోవైపు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 2015 నుంచి 2022 వరకు పనిచేసిన 14 మంది రెవెన్యూ అధికారులకు వివిధ కారణాలతో నోటీసులను ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్ బుధవారం జారీ చేశారు. ఈ జాబితాలో పాల కృష్ణ పేరుంది. ఇలా ఉత్తర్వులు జారీ అయిన రెండో రోజే ఏసీబీ దాడులు జరగడం గమనార్హం. ఏసీబీ దాడులతో కలకలం దగదర్తి: స్థానిక తహసీల్దార్ (ఎఫ్ఏసీ) కృష్ణ అవినీతి, ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలతో కార్యాలయంలో సోదాలను ఏసీబీ అధికారులు శుక్రవారం నిర్వహించారు. పలు రికార్డులను సీఐ వెంకటేశ్వర్లు ఇతర అధికారులతో తనిఖీ చేశారు. భూములకు సంబంధించిన పలు రికార్డులపై డిప్యూటీ తహసీల్దార్ భాగ్యలక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ శివకుమార్, ఆర్ఐ ప్రియాంకను ప్రశ్నించారు. వెలుపోడు, విమానాశ్రయ భూముల్లో అవినీతి జరిగిందనే సమాచారంతోనే దాడులను ఏసీబీ నిర్వహించిందని తెలుస్తోంది. -
భక్తుల మనోభావాలతో కూటమి ఆటలు
● ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ చిల్లకూరు: ‘తిరుమల లడ్డూ విషయంలో కూటమి నేతలు భక్తుల మనోభావాలతో ఆటలాడారు. ప్రసాదంపై దుష్ప్రచారం చేసిన వారు సీబీఐ ఇచ్చిన నివేదికతో ఏమి చెబుతారు’ అని వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ప్రశ్నించారు. గూడూరులోని సనత్నగర్లో ఉన్న ఆ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మండల కన్వీనర్లు, పార్టీ అధ్యక్షులు, నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదని సీబీఐ తేల్చి చెప్పినా కూటమి నాయకులు కళ్లు తెరుచుకోలేదన్నారు. కోట్లమంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని కనీసం ఆలోచన చేయకుండా పవన్ కళ్యాణ్ నానాయాగీ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. సీబీఐ ఇచ్చిన నివేదికపై నమ్మకం లేదని టీడీపీ నాయకులు చెబుతున్నారన్నారు. కేంద్రంలో ఉండేది కూడా కూటమిలోని ప్రభుత్వమే కాబట్టి, అక్కడికి వెళ్లి సీబీఐది తప్పుడు నివేదికని చెప్పండి చూద్దామంటూ ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెడ్డపేరు తీసుకురావాలని కూటమి ప్రయత్నిస్తే అది వికటించిందన్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కళ్యాణ్లు లెంపలు వేసుకుని ప్రజలకు, దేవదేవునికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. సమావేశంలో గూడూరు పట్టణ, కోట మండల కన్వీనర్లు బొమ్మిడి శ్రీనివాసులు, పలగాటి సంపత్కుమార్రెడ్డి, కోట, గూడూరు మహిళా విభాగాల అధ్యక్షులు రేష్మ, సృజనారెడ్డి, దీప్తి, సీనియర్ నాయకులు రాజీవ్రామిరెడ్డి, టౌన్ ఉపాధ్యక్షుఉల సుభాన్, ఇమ్రాన్, అన్నం మురళి తదితరులు పాల్గొన్నారు. -
పొగాకు ఉత్పత్తులపై విజిలెన్స్ దాడులు
నెల్లూరు(క్రైమ్): బిల్లుల్లేకుండా జరుగుతున్న పొగాకు ఉత్పత్తుల విక్రయాలు, గుట్కా తయారీ కేంద్రంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. రూ.40 లక్షల విలువైన సిగరెట్లు, పాన్మసాలాలు, గుట్కా తయారీ మెషీన్లు, గుట్కాలను సీజ్ చేశారు. కొంతకాలంగా కొందరు పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తూ ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లించకుండా వ్యాపారాలు చేస్తున్నారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు బృందాలుగా విడిపోయి నెల్లూరు సాలివీధిలోని శ్రీలక్ష్మి వెంకటశ్రీనివాస జనరల్ స్టోర్స్, శ్రీలక్ష్మి శ్రీనివాస ఎంటర్ప్రైజెస్, స్టోన్హౌస్పేటలోని ఎస్వీ ట్రేడర్స్లో తనిఖీలు చేశారు. బిల్లులు లేకుండా విక్రయిస్తున్న సిగరెట్లు, పాన్ మసాలాలను స్వాధీనం చేసుకున్నారు. మనుబోలు అపర్ణసాయి ట్రేడర్స్లో గుట్కా తయారీ మెషీన్ను సీజ్ చేసి, గుట్కాలు, పాన్మసాలాలను పట్టుకున్నారు. వ్యాపారులపై తదుపరి విచారణ అనంతరం ప్రభుత్వానికి జీఎస్టీ కట్టిస్తామని విజిలెన్స్ అధికారులు తెలిపారు. తనిఖీల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ సుభాని, డీసీటీఓ విష్ణురావు, సిబ్బంది పాల్గొన్నారు. -
టెర్మినల్ పునరుద్ధరణకు కృషి చేయాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టె ర్మినల్ను పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభు త్వం కృషి చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి డిమాండ్ చేశారు. నగరంలోని సంతపేటలో ఉన్న ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టెర్మినల్ తొలగించిన సమయంలో పునరుద్ధరించాలంటూ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తమతో పోరాటం చేసిన విషయాన్ని మర్చిపోయినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే టెర్మినల్ను పునరుద్ధరిస్తామని చెప్పిన టీడీపీ నేడు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ, అదానీ కంపెనీకి భూములను పందేరం చేస్తోందని ఆరోపించారు. వచ్చేనెల 9న ప్రేరణ ఉత్సవం ఫేస్ – 2నెల్లూరు(టౌన్): మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వచ్చేనెల 9వ తేదీన కృష్ణాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రేరణ ఉత్సవం ఫేస్ – 2 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఈఓ ఆర్.బాలాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, సీబీఎస్ఈ పాఠశాలలు, కళాశాలల్లో 8వ తరగతి నుంచి 11వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. ప్రతి స్కూల్, కళాశాల నుంచి ఇద్దరికి (ఒక బాలుడు, ఒక బాలిక) మాత్రమే అవకాశం ఉందన్నారు. వికసిత్ భారత్ 2047, మై కాంట్రిబ్యూషన్ టు వార్డ్స్ సొసైటీ అండ్ నేషన్, వై షుడ్ బీ సెలెక్టెడ్ ఫర్ ప్రేరణ, మై విజన్ ఆఫ్ ఇండియా అంశాల్లో వ్యాసరచన, కవితా రచన, కథ, సాంగ్, వ్యంగ్య చిత్రం గీయడం, డ్రాయింగ్ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. పాఠశాల స్థాయిలో పాల్గొనే విద్యార్థులు ముందుగా https://prerana. education.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 88861 94201, 94929 45017 ఫోన్ నంబర్లను సంప్రదించాలని తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతినెల్లూరు(క్రైమ్): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. సౌత్ ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు.. కృష్ణ జిల్లా పెద్దపారుపుడికి చెందిన ఎ.అజయ్ (23) అవి వివాహితుడు. అతను టాటా దోస్త్ వాహన డ్రైవర్. అజయ్ గురువారం రాత్రి ఇంజిన్ ఆయిల్ లోడ్తో చిత్తూరుకు బయలుదేరాడు. శుక్రవారం తెల్లవారుజామున గొలగమూడి క్రాస్రోడ్డుకు చేరుకుంటుండగా ముందు సిమెంట్ బ్రిక్స్తో వెళ్తున్న లారీ ఒక్కసారిగా బ్రేక్ వేసింది. వేగాన్ని నియంత్రించలేక అజయ్ లారీ ట్రాలీని ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సౌత్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.వెంకట్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు అంకమరావు, జయలక్ష్మి నెల్లూరుకు చేరుకుని విగతజీవిగా ఉన్న కుమారుడిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తల్లి ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేశారు. ఆలయాల్లో చోరీలుమర్రిపాడు: మండలంలోని చిలకపాడు, సన్నువారిపల్లి, శెట్టిసముద్రంలోని ఎనిమిది ఆలయాల్లో గురువారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. గ్రామస్తుల ఫిర్యాదుతో శుక్రవారం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.34 సన్నవి : రూ.20 పండ్లు : రూ.10 -
లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి తూట్లు పొడిచి కార్పొరేట్ శక్తులకు అండగా నిలుస్తోంది. నూతనంగా ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్స్ను వెంటనే రద్దుచేయాలి’ అని సీఐటీయూ నాయకులు అజయ్కుమార్, నాగేశ్వరావు, సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నెల్లూరులోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన భవన్లో శుక్రవారం ‘లేబర్ కోడ్స్ – కార్మికులపై ప్రభావం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ కార్మికులు సృష్టిస్తున్న సంపద కార్పొరేట్ శక్తుల ఖజానాకు పోతుందన్నారు. పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడిపోతున్నారన్నారు. వచ్చే నెల 12వ తేదీ చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
● నెల్లూరులో పోలీస్ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ● ప్రారంభించిన ఎస్పీ అజితనెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని పోలీస్ కవాతు మైదానంలో జిల్లా పోలీస్ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ – 2026ను శుక్రవారం ఎస్పీ అజిత వేజెండ్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గెలుపోటములతో నిమిత్తం లేకుండా క్రీడా స్ఫూర్తితో ఆడాలని సిబ్బందికి సూచించారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకునేందుకు క్రీడలు దోహదపడుతాయన్నారు. జీవితంలో క్రీడలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మూడురోజులపాటు జరిగే స్పోర్ట్స్ మీట్లో రెట్టింపు ఉత్సాహంతో ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. ఏఎస్పీ సీహెచ్ సౌజన్య క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపారు. తొలిరోజు 100 మీటర్లు, 200, 400, 800 మీటర్ల పరుగు, ఫుట్బాల్, బాస్కెట్బాల్, వాలీబాల్, షాట్పుట్, డిస్క్త్రో, లాంగ్జంప్, హైజంప్, ట్రిపుల్ జంప్, కబడ్డీ, క్రికెట్, టగ్ ఆఫ్ వార్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పోలీసు కవాతు మైదానంలో పండగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో నగర ఏఎస్పీ దీక్ష, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, పోలీసు కార్యాలయ మినిస్టీరియల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక దందా ఆగే వరకూ పోరాటం చేస్తా
● అక్రమ రవాణా జరుగుతుంటే అధికారులేం చేస్తున్నారు ● వైఎస్సార్సీపీ వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లికలువాయి(సైదాపురం): ‘అధికార పార్టీ నేతలు ధనదాహానికి సహజ వనరులు అడుగంటి పోతున్నాయి. ఇసుక అక్రమ దందా ఆగే వరకూ పోరాటం కొనసాగిస్తా’ అని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి తెలిపారు. కలువాయి, సైదాపురం, రాపూరు, బాలాయపల్లి, డక్కిలి, వెంకటగిరి మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నేతలతో కలిసి కలువాయి మండలంలోని తెలుగురాయపురంలో అక్రమ ఇసుక తవ్వకాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల అండతో పెన్నానదిలో భారీ యంత్రాలు ఏర్పాటు చేసి ఇసుకను తహసీల్దార్ కార్యాలయం మీదుగానే తరలించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. ఈ ప్రాంతంలో తవ్వకాలు చేయకూడదని ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉన్నాయన్నారు. స్థానిక ప్రజాప్రతినిధికి తెలియకుండా ఇసుక దందా జరుగుతుందా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు ఇసుక ఫ్రీ అంటూ ప్రకటనలు చేస్తున్నారని, కానీ పేదలకు అందకపోవడంతోపాటు నేతలకు కల్పతరువుగా మారిందన్నారు. నదిలోకి రహదారిని ఏర్పాటు చేయడంతోపాటు యంత్రాలను అక్కడే ఉంచడం, ఇసుక రీచ్పై టీడీపీ జెండా రెపరెపలాడడం చూస్తుంటే అధికార పార్టీకి చెందిన నేతలు ఏ స్థాయిలో బరితెగించారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. పోలీసు, రెవెన్యూ వ్యవస్థలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ దందాపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలియజేశారు. మద్యం షాపులను ప్రైవేటీకరించడంతో ఏ గ్రామంలో చూసినా విచ్చలవిడిగా బెల్టు దందా జరుగుతున్నట్లు ఆరోపించారు. కార్యక్రమంలో కలువాయి జెడ్పీటీసీ సభ్యుడు అనిల్కుమార్రెడ్డి, కలువాయి, రాపూరు, సైదాపురం, డక్కిలి, బాలాయపల్లి, వెంకటగిరి వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు మాగినేని కృష్ణారెడ్డి, మధుసూదన్రెడ్డి, మన్నారపు రవికుమార్ యాదవ్, శ్రీనివాసులురెడ్డి, వెందోటి కార్తీక్రెడ్డి, పులి ప్రసాద్రెడ్డి, నేతలు నారాయణరెడ్డి, చిట్టేటి హరికృష్ణ, సేతరాసిబాలయ్య, విజయభాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీకి పూర్వ వైభవం తీసుకొస్తాం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు రూరల్: జిల్లాలో వైఎస్సార్సీపీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని మాజీ మంత్రి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం మనుబోలు మండల నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. జగనన్న సైన్యం క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తామన్నారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా, సంపూర్ణంగా అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. జగనన్న సైన్యంలో యువతకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ, వారిని రాజకీయంగా చైతన్యవంతులను చేస్తామన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. గత ఐదేళ్ల పాలనలో కులమతాలకు అతీతంగా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూశామన్నారు. రాష్ట్ర భవిష్యత్తు జగన్తోనే సాధ్యమని ప్రజలు బలంగా నమ్ముతున్నారన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందన్నారు. -
నెల్లూరులో టీవీఎస్ షోరూమ్ ప్రారంభం
నెల్లూరు(టౌన్): నెల్లూరులోని మినీబైపాస్లో అన్నమయ్య సర్కిల్లో గురువారం టీవీఎస్ మోటార్ కంపెనీ నూతన షోరూమ్ను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఇన్చార్జి మేయర్ రూప్కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనూరాధ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ కంపెనీ జనరల్ మేనేజర్ కేంద్రీజ్ జోషి, ఏరియా మేనేజర్ వంశీకృష్ణ, సర్వీసు మేనేజర్ రోనాల్డ్ రాబర్ట్ మాట్లాడుతూ ద్విచక్ర వాహన మోడళ్లను ప్రదర్శనలో ఉంచుతామన్నారు. ఆధునిక సదుపాయాలు, అనుభవజ్ఞులైన సిబ్బందితో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. షోరూమ్ను అత్యాధునికంగా తీర్చిదిద్దారన్నారు. నెల్లూరు, పరిసర ప్రాంతాల్లో టీవీఎస్కు ఉన్న ఆదరణను బలోపేతం చేయడంతోపాటు నాణ్యమైన ఉత్పత్తులతో వినియోగదారుల్లో నమ్మకాన్ని మరింత పెంచడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో డీలర్లు సాయిమోహన్రెడ్డి, నిఖిత్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
బైక్లు ఢీకొని ఒకరి మృతి
కలిగిరి: మండలంలోని అయ్యప్పరెడ్డిపాళెం సెంటర్ సమీపంలో 14వ మైలు వద్ద ఎదురెదురుగా మోటార్బైక్లు ఢీకొన్న ఘటనలో మద్దూరి శ్రీనివాసులు (50) అనే వ్యక్తి మృతిచెందిన ఘటన గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. జలదంకి గ్రామానికి చెందిన శ్రీనివాసులు బైక్పై వింజమూరు వెళ్తున్నాడు. తెల్లపాడు గ్రామానికి చెందిన ఉప్పాల శీనయ్య కావలి మండలం మన్నగిదిన్నెకు బైక్పై వెళ్తున్నాడు. అయ్యప్పరెడ్డిపాళెం సెంటర్ సమీపంలో బైక్లు ఢీకొన్నాయి. శ్రీనివాసులు అక్కడికక్కడే మృతిచెందాడు. శీనయ్య కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. అతడ్ని చికిత్స నిమిత్తం కావలికి తరలించారు. మృతుడు శ్రీనివాసులు వింజమూరులో నివాసం ఉంటూ స్థానికంగా ఉన్న వివేకానంద జూనియర్ కళాశాలలో కేటరింగ్ పనులు చేస్తున్నాడు. జలదంకిలో జరిగిన బంధువుల కర్మక్రియల కార్యక్రమానికి హాజరైన తిరిగి వింజమూరుకు వెళ్తూ ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. కలిగిరి ఎస్సై ఉమాశంకర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. -
‘కుష్టు వ్యాధి’ నయమవుతుంది!
● జిల్లాలో రోగులు 996 మంది ● నూతన కేసులు 55 ● చికిత్సలో ఉన్నవారు 107 మంది ● ప్రారంభంలో గుర్తిస్తే వైకల్యానికి చెక్ ● నేడు వరల్డ్ లెప్రసీ డేనెల్లూరు(అర్బన్): కుష్టు సోకిన వారిని సమాజం వెలివేసినట్టు చూస్తోంది. ఈ జబ్బు వస్తే శరీర భాగాలు వికృతంగా తయారవుతాయి. కుష్టు వ్యాధి (హాన్సెన్ వ్యాధి)ని మైకో బ్యాక్టీరియం లెప్రె అనే బ్యాక్టీరియా కలిగిస్తుంది. మనిషి చర్మం, నరాలు, కళ్లపై ప్రభావం చూపుతుంది. ఇది అంటువ్యాధి కాదు. అయితే జబ్బుతో ఉన్న వ్యక్తితో ఎక్కువకాలం ఉంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్ల సోకుతుంది. ఒక్కోదఫా శరీర అవయవాలు కోల్పోయి వైకల్యం ఏర్పడుతుంది. దీంతో కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతుంది. ఇలాంటి పరిస్థితిని గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం జనవరి చివరి ఆదివారాన్ని వరల్డ్ లెప్రసీ డేగా ప్రకటించి ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. అయితే మన దేశంలో ప్రతి సంవత్సరం జనవరి 30వ తేదీన గాంధీ వర్ధంతి రోజుని అనుసంధానంగా చేసి లెప్రసీ డేను నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం థీమ్గా కు ష్టు వ్యాధి నయమవుతుంది. అందరికీ సేవలు, సమానత్వం. జిల్లాలో వైద్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి. జిల్లాలో ఇదీ పరిస్థితి జిల్లాలో 20 సంవత్సరాల క్రితం రెండు వేలకు పైగా కుష్టు రోగులు ఉండేవారు. చికిత్సతో అనేకమంది కోలుకున్నారు. కొందరు వృద్ధులు మరణించారు. గత సంవత్సరం వెయ్యికి పైగా రోగులుండగా ఆ సంఖ్య నేడు 996కి తగ్గింది. ఈ ఏడాది కొత్తగా 55 కేసులు వెలుగు చూశాయి. పాత కేసులతో కలిపి 107 మంది చికిత్సలో ఉన్నారు. నెల్లూరు రూరల్ మండల పరిధిలోని ఆమంచర్ల గ్రామంలో రెండు కాలనీలు, రాపూరు వద్ద ఒక వ్యాధిగ్రస్తుల కాలనీలున్నాయి. ప్రభుత్వం రెండు దశాబ్దాలకు పైగా తీసుకున్న చర్యల ఫలితంగా జిల్లాలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 490 మందికి పింఛన్లు సకాలంలో గుర్తించపోవడంతో కుష్టు వ్యాధితో 490 మంది అవయవ లోపంతో బాధపడుతున్నారు. వీరికి ప్రభుత్వం రూ.6 వేల చొప్పున పింఛన్ అందజేస్తోంది. 149 మందికి అంత్యోదయ కార్డులున్నాయి. జిల్లా కుష్టు నివారణ శాఖ ఆధ్వర్యంలో అధికారులు 300 మందికి టబ్బులు, టవల్స్, నీమ్ ఆయిల్, పీబీ స్టోన్స్ (కాలి పగుళ్లు తగ్గేందుకు వాడే రాయి) అందజేశారు. 307 మందికి రెండు దఫాలుగా 614 జతల ఎంసీఆర్ చెప్పులిచ్చారు. 180 మందికి చేతికర్రలు, 150 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. -
కంటైనర్ టెర్మినల్ను పునరుద్ధరించాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘కృష్ణపట్నం పోర్టులో కంటైనర్ టెర్మినల్ను పునరుద్ధరించాలి. అదానీకి అక్రమంగా భూములు కట్టబెట్టడాన్ని వెంటనే ఆపివేయాలి’ అని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టీవీవీ ప్రసాద్, గోగుల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. టెర్మినల్ను పునరుద్ధరించాలంటూ నెల్లూరులోని ముత్తుకూరు గేటు సెంటర్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు. నేతలు మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే టెర్మినల్ను తిరిగి ప్రారంభిస్తామని సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. రాష్ట్ర మంత్రిమండలి కంటైనర్ టెర్మినల్ కాంప్లెక్స్ కోసం ఏర్పాటు చేసిన భూములకు బదులుగా జిల్లాలోని 5 మండలాల్లో భూములు కేటాయిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జిల్లాలో వేలాది ఎకరాలను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడం దారుణమన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు నాగేశ్వరరావు, అంకయ్య, సురేష్, రాజా, సుధాకర్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు శ్రీనివాసులు, సంపూర్ణమ్మ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
కుష్టు నివారణే ధ్యేయంగా కృషి
కుష్టు నివారణకు కృషి చేయడం జరుగుతోంది. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ప్రతి సంవత్సరం కేసులు తగ్గుతున్నాయి. ప్రజలు చైతన్యవంతమై తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధిని నివారించవచ్చు. – డాక్టర్ సురేంద్రబాబు, జిల్లా న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ అవగాహనతోనే చెక్ ప్రజలు కుష్టు వ్యాధిపై అవగాహన పెంపొందించుకోవాలి. మురుగు లేకుండా చూసుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. శరీరంపై గుండ్రటి, నల్లటి, తేనె రంగులో పెద్ద మచ్చలుంటే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి. ఎవరికై నా కుష్టు ఉంటే ఆ ఇంట్లో ఉండే మిగిలిన వారికి రాకుండా పెప్ మాత్రలు మింగేలా చర్యలు తీసుకున్నాం. ఈనెల 30 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు జిల్లాలో స్పర్శ కార్యక్రమం చేపట్టాం. ప్రతి పీహెచ్సీ, స్కూలు, సచివాలయ పరిధిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. సర్పంచ్ అధ్యక్షతన గ్రామస్థాయిలో ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం. రానున్న సంవత్సరాల్లో జిల్లాను కుష్టు రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. – డాక్టర్ ఖాదర్వలీ, జిల్లా టీబీ, కుష్టు, ఎయిడ్స్ నివారణ అధికారి -
బంగారు గొలుసు అపహరణ
పొదలకూరు: మండలంలోని విరువూరు గ్రామం జొన్నమిట్ట కాలనీకి చెందిన మహిళ మెడలో బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తి గురువారం అపహరించుకెళ్లారు. ఎస్సై హనీఫ్ కథనం మేరకు.. సుదర్శనమ్మ కాలినడకన పొలాల మీదుగా కాలనీ నుంచి విరువూరు గ్రామంలోని తన కుమార్తె వద్దకు వెళ్తోంది. దుండగుడు కాపుకాచి 4 సవర్ల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.విద్యార్థి ఆత్మహత్య కావలి(దగదర్తి): కావలి పట్టణం వెంగయ్యగారిపాళేనికి చెందిన ఓ విద్యార్థి గురువారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. వినాయకస్వామి దేవస్థానం వద్ద నివాసముంటున్న రాజవరపు చంద్రహాసన్ (19) బీసీఏ చదువుతున్నాడు. అతను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న కావలి ఒకటో పట్టణ సీఐ ఫిరోజ్ మృతుడి నివాసానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. -
లైంగికదాడికి యత్నించిన కేసులో నిందితుడి అరెస్ట్
కోట: బాలికపై లైంగికదాడికి యత్నించిన కేసులో నిందితుడు ఆటో డ్రైవర్ వెంకటేష్ను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు సీఐ కిశోర్బాబు గురువారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ తిన్నెలపూడికి వెంకటేష్ ఇటీవల ఓ బాలికను ఆటోలో ఎక్కించుకుని మండలంలోని కేసవరం అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడన్నారు. కేసు నమోదు చేసి విచారణ జరిపామన్నారు. మైక్రో టవర్ కాలనీ వద్ద వెంకటేష్ను అరెస్ట్ చేసి ఆటోను సీజ్ చేసినట్లు తెలిపారు. ఎస్సై పవన్కుమార్ పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్ల స్వాధీనంముత్తుకూరు(పొదలకూరు): నేలటూరు పరిసర ప్రాంతంలో గ్యాస్ మాఫియా తయారైంది. అక్రమంగా వంట గ్యాస్ సిలిండర్లను నిల్వ చేసుకుంటూ తద్వారా చిన్నపాటి సిలిండర్లకు రీఫిల్లింగ్ చేస్తున్నారు. ఈ అక్రమ వ్యాపారంపై గురువారం సివిల్ సప్లయీస్, విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. చాలాకాలంగా ఈ వ్యాపారం చేస్తున్న మాఫియాను పట్టుకున్నారు. వివిధ కంపెనీల సిలిండర్లు గుర్తించారు. సుమారు రూ.1.34 లక్షల విలువైన సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. -
పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాం
నగరంలో పారిశుధ్య మెరుగునకు ప్రత్యేక చర్యలు చేపట్టాం. ఇప్పటికే అనేక ప్రాంతాల్లోని కాలువల్లో పేరుకుపోయిన మురుగును తొలగించాం. కాలువల్లోని సిల్ట్, వ్యర్థాలను తొలగించి నీరు ప్రవహించేలా చర్యలు చేపట్టాం. పూడిపోయిన పంట కాలువలను శుభ్రం చేసే పనులను ఇంజినీరింగ్ విభాగాధికారులు చూస్తుంటారు. ప్రజలు అంటురోగాల బారిన పడకుండా ఉండేందుకు దోమల నాశనం కోసం బ్లీచింగ్, సున్నం చల్లడం, ఫాగింగ్ వంటి కార్యక్రమాలను చేపడుతున్నాం. – కనకాద్రి, హెల్త్ ఆఫీసర్, నెల్లూరు కార్పొరేషన్ -
లడ్డూపై దుష్ప్రచారంలో నిజమే గెలిచింది
వెంకటేశ్వరస్వామి ఆలయం ఎదుట టెంకాయలు కొడుతూ.. నెల్లూరు రూరల్: తిరుమల లడ్డూ ప్రసాదంపై కొంతకాలంగా జరుగుతున్న దుష్ప్రచారంలో నిజమే గెలిచిందని.. అసత్య ప్రచారాలు, అర్థరహిత ఆరోపణలన్నీ అబద్ధాలని సీబీఐ నివేదిక ద్వారా తేటతెల్లమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని మాగుంట లేఅవుట్లో గల వెంకటేశ్వరస్వామి ఆలయంలో పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి, కార్పొరేటర్లు, ముఖ్య నేతలు, భక్తులతో కలిసి గురువారం ప్రత్యేక పూజలు చేసి టెంకాయలను కొట్టారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. టీటీడీకి పంపిన నెయ్యి నమూనాల్లో ఎక్కడా పంది కొవ్వు లేదా ఇతర జంతువుల కొవ్వు ఆనవాళ్లు కనిపించలేదని ఎన్డీఆర్ఐ కర్ణాల్ నివేదిక నిగ్గుతేల్చిందని చెప్పారు. అధర్మాన్ని అణిచి, భక్తుల నమ్మకాన్ని కాపాడిన ఏడుకొండలస్వామి సాక్షిగా నిజం తెలిసిందని వివరించారు. లడ్డూ ప్రసాదంపై జరిగినవన్నీ అసత్య ప్రచారాలేనని సీబీఐ నివేదికతో తేలిపోయిందని.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కేవలం రాజకీయ లబ్ధి కోసం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని మండిపడ్డారు. శ్రీవారి పవిత్రతను తాకట్టు పెట్టి చంద్రబాబు అల్లిన అబద్ధాల కోటలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయని.. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే అబద్ధపు ప్రచారాల నుంచి భక్తుల నమ్మకాన్ని కాపాడారని వివరించారు. గత ప్రభుత్వంపై కావాలనే బురద జల్లారని, ఇప్పుడు నివేదికలతో నిజం బట్టబయలైందని వివరించారు. పవిత్రమైన లడ్డూపై లేనిపోని అనుమానాలను రేకెత్తించి.. భక్తులను ఆందోళనకు గురిచేసి వారి మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. లడ్డూలో పంది కొవ్వు ఉందంటూ చేసిన ఆరోపణలు అబద్ధమని సీబీఐ దర్యాప్తులో తేలిందని, పవన్ కల్యాణ్ దీనికి ఏమి సమాధానం చెప్తారని ప్రశ్నించారు. భక్తులను తప్పుదోవ పట్టించిన ఆయన ఏ రకంగా ప్రాయశ్చిత్తం చేసుకున్నా.. పాపపరిహారం సరిపోదన్నారు. సనాతన ధర్మం పేరుతో పవన్ కల్యాణ్ చేసిన హడావుడి కేవలం రాజకీయ డ్రామాలేననే విషయం నివేదికతో స్పష్టమైందని చెప్పారు. పవిత్రమైన ప్రసాదాన్ని వివాదాల్లోకి లాగి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలను దెబ్బతీశారని.. నోటికొచ్చినట్లు మాట్లాడి ప్రజల్లో అనుమానాలు రేకెత్తించిన ఆయన సీబీఐ నివేదికపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. భక్తులకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం స్వచ్ఛంగా ఉందని తేలడంతో భక్తులు ఊపిరి పీల్చు కుంటున్నారని తెలిపారు. చంద్రబాబుకు ఇప్పటికై నా మంచి బుద్ధిని ప్రసాదించాలని వెంకటేశ్వరస్వామిని వేడుకుంటున్నామని తెలిపారు. అనంతరం విజయకుమార్రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ దుర్మార్గమైన ఆలోచనలతో అసత్య ప్రచారానికి తెరలేపారని మండిపడ్డారు. తప్పును అంగీకరించి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొంతకాలంగా అసత్య ప్రచారాలు అర్థ్ధరహిత ఆరోపణలన్నీ అబద్ధాలని నిగ్గుతేల్చిన సీబీఐ నివేదిక మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వెంకటేశ్వరస్వామి ఆలయంలో పార్టీ నేతలతో కలిసి ప్రత్యేక పూజలు -
దోమల దండయాత్ర
నెల్లూరు నగరానికి నిద్ర కరువైంది. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారడంతో మురుగు ఆవాసాలుగా దోమలు ప్రబలి దండయాత్ర చేస్తున్నాయి. రాత్రుళ్లు కునుకు తీస్తే ఒట్టు అన్నట్టుగా పరిస్థితి మారింది. పగలూ కుట్టి పెడుతుండటంతో నగర ప్రజలకు ప్రశాంతత కరువైంది. నెల్లూరు (బారకాసు): నగరాన్ని మురుగు రహితంగా మారుస్తామంటూ 2019కు ముందే అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ రూ.వందల కోట్ల ఖర్చు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు శ్రీకారం చుట్టినా.. ఇప్పటికీ పూర్తి కాలేదు. నగర నియోజకవర్గ పరిధిలోనే ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినా, ఏ మాత్రం ఉపయోగంలేదు. కాలువలు సైతం చెత్తాచెదారాలతో నిండిపోవడంతో మురుగు పారుదల లేక రోడ్లపైనే ప్రవహిస్తోంది. బురద (సిల్ట్)ను తొలగించకపోవడంతో దుర్ఘంధం వెదజల్లుతోంది. ఇవి దోమల ఉత్పత్తికి ఆవాసాలుగా మారుతున్నాయి. దోమలు అధికమై నగర ప్రజలపై దండయాత్ర చేస్తున్నాయి. వీటితో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. పగలు సైతం కుట్టిపెడుతున్నాయంటే దోమల విజృంభణ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. దోమల ధాటికి ప్రజలు డెంగీ, చికున్గున్యా, మలేరియా, టైఫాయిడ్ జ్వరాల బారిన పడుతున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో చెత్తను తొలగించకపోవడంతో అంటురోగాలు ప్రబలుతున్నాయి. మరికొన్ని పంట కాలువల్లో సిల్ట్ను తొలగించకపోవడంతో వాటిల్లో చెత్తాచెదారం నిల్వ చేరి నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది. దీంతో కాలువలకు ఇరువైపులా ఉండే నివాసాల్లోకి మురుగు ప్రవహిస్తోంది.తప్పుడు లెక్కలతో నిధుల స్వాహాఅధికారులు మాత్రం నిత్యం ప్రతి కాలువను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం శుభ్రం చేస్తున్నట్లు రికార్డుల్లో పొందుపరుస్తున్నారని తెలుస్తోంది. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 54 డివిజన్లుండగా, 167 సచివాలయాలున్నాయి. 150 కిలోమీటర్ల మేర విస్తీర్ణం గల నగరంలో 1,83,643 గృహాలున్నాయి. దాదాపు తొమ్మిది లక్షల మందికిపైగా నివసిస్తున్నారు. చెత్త సేకరణకు 165 వాహనాలున్నాయి. చెత్త తొలగించడంతో పాటు వీధులు, కాలువలను శుభ్రం చేసేందుకు 1350 మంది పారిశుధ్య కార్మికులున్నారు. వీరితో పాటు నలుగురు శానిటరీ సూపర్వైజర్లు, ఆరుగురు శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఏడుగురు హెల్త్ అసిస్టెంట్లు, 131 మంది వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలు, 24 మంది పబ్లిక్ హెల్త్ మేసీ్త్రలూ ఉన్నారు. ఆయా వాహనాలతో నిత్యం ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తను సేకరిస్తూ డంపింగ్ యార్డుకు తరలిస్తారు. మరో వైపు రోడ్లు ఊడుస్తూ కాలువలను శుభ్రం చేస్తారు. అయితే పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోందని పరువురు ఆరోపిస్తున్నారు. మూడు పూటలా ఫినాయిల్, బ్లీచింగ్, ఆయిల్ బాల్స్ వినియోగిస్తున్నట్లు రికార్డుల్లో రాసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఎక్కడా దోమల నివారణకు చర్యలు చేపడుతున్న దాఖలాల్లేవు. మొక్కుబడి చర్యలు, ప్రచారార్భాటాలు మాత్రమే కనబడుతున్నాయి. దోమల నియంత్రణ పేరుతో భారీనే ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు రాసుకొని, కాసులను నొక్కేస్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సాక్షాత్తు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఇలాకాలోనే దోమలు దండయాత్ర చేస్తుండటం విశేషం.అనారోగ్యంతో ప్రజలు విలవిలపారిశుధ్యం అస్తవ్యస్తంగా మారడంతో నగర ప్రజలు అనారోగ్యంతో విలవిల్లాడుతున్నారు. మురుగు నీరు నిల్వ చేరడంతో దోమల ఉత్పత్తి అధికమైంది. దీంతో దోమలు ఇళ్లల్లో కి చేరడంతో వాటి కాటుతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అనేక మంది దోమకాటుతో డెంగీ మలేరియా వంటి విషజ్వరాల బారిన పడి పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు దోమల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు జెట్ కాయిల్స్, ఆలౌట్, గుడ్నైట్ వంటి లిక్విడ్స్ వాడకం కోసం నిత్యం వందలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయినా ఆశించిన ఫలితం కానరావడంలేదు.కార్పొరేషన్ కార్యాలయంలోనే స్వైర విహారంనగరపాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ చాంబర్ వద్ద ఉదయం 10.30 గంటల సమయంలో దోమలు దండయాత్ర చేస్తున్నాయి. దీంతో కార్యాలయ సిబ్బంది వాటిపై బ్యాట్తో దండయాత్ర చేస్తున్నారంటే నగరంలో దోమల బెడద ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతోంది. ఇక్కడే ఈ పరిస్థితి ఉంటే ఇక మారుమూల వార్డుల్లో ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. కార్పొరేషన్ పరిధిలోని ప్రతి ఏరియాలో దోమల తీవ్రత ఎక్కువగా ఉందని నగర ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. -
యూరియాకూ సిఫార్సులేనా..?
నెల్లూరు(పొగతోట): ప్రస్తుత టీడీపీ పాలనలో సిఫార్సులున్న ఏజెన్సీలు, రైతులకే యూరియా బస్తాలందుతున్నాయి. ఆరెస్కేల పేరుతో ప్రైవేట్ ఏజెన్సీలకే సరఫరా చేస్తున్నారు. కలువాయి మండలం వెంకటరెడ్డిపల్లి ఆరెస్కేకు అందజేయాల్సిన యూరియాను కుల్లూరులో నిల్వ చేశారు. చింతలపాళెంలోని రైతు సేవా కేంద్రంలో కూటమి నేత కూర్చొని వారికి అనుకూలంగా ఉండే రైతులకే పంపిణీ చేశారు. తెలుగురాయపురంలో ఇవి అందక అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. ఆర్థికంగా నష్టపోతూ.. రూ.266కు విక్రయించాల్సిన యూరియా బస్తాను రూ.350 నుంచి రూ.420కు కొనుగోలు చేసి రైతులు నష్టపోతున్నారు. కొండాపురం మండలం సాయిపేటలోని ఆరెస్కేకు సరఫరా చేయాల్సిన దాన్ని కూటమి నేతల సిఫార్సులతో ప్రైవేట్ ఏజెన్సీలకు తరలించి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. అనంతసాగరం మండలంలో సైతం అందక రైతులు అల్లాడిపోతున్నారు. యూరియాను సరఫరా చేయకపోతే రోడ్లెక్కి ధర్నాలకు దిగుతామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిఫార్సులకే సై.. కూటమి నేతల సిఫార్సులకు అధికారుల సైతం వంతపాడుతుండటంతో రైతులకు అవస్థలు తప్పడంలేదు. వ్యవసాయ శాఖ అధికారులు చూపుతున్న లెక్కలకు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మధ్య ఏ మాత్రం పొంతన ఉండటంలేదు. కలువాయి మండలానికి సంబంధించి 130 శాతం మేర పంపిణీ చేశామని అధికారులు చెప్తున్నారు. మరోవైపు వీటి కోసం రైతులు ఎందుకు పరుగులు తీస్తున్నారో ఎవరికీ అంతుచిక్కడంలేదు. ఇదీ తంతు.. జిల్లా వ్యాప్తంగా 5.6 లక్షల ఎకరాలకుపైగా వరిని సాగు చేస్తున్నారు. 94,383 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలేశారు. దీనికి అనుగుణంగా ఇప్పటి వరకు 76 వేల మెట్రిక్ టన్నులను పంపిణీ చేశారు. 12 వేల మెట్రిక్ టన్నుల మేర జిల్లాలో అందుబాటులో ఉందని చెప్తున్నారు. దగదర్తి మండలంలో రూ.420కు ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని ఇస్తున్నారు. పెద్ద గోదాముల్లో బస్తాలను నిల్వ చేసి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదెక్కడి చోద్యమో..! పేరుకే ఆరెస్కేలు.. ఏజెన్సీలకే తరలింపు అందక రైతుల ఆందోళన కాగితాలకే పంపిణీ ప్రక్రియ పరిమితం రవాణా పేరిట దోపిడీయే సరికొత్త దోపిడీ యూరియా బస్తాల రవాణా పేరిట రైతులను దోపిడీ చేస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి గ్రామీణ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి యూరియాను తీసుకొచ్చామంటూ రవాణా పేరుతో రైతుల నుంచి ఏజెన్సీలు అధికంగా వసూలు చేస్తున్నాయి. ఇలా బస్తాకు రూ.70 నుంచి రూ.100 వరకు దగా చేస్తున్నారు. ఒకవేళ రైతులు ప్రశ్నిస్తే, అధికంగా వసూలు చేయాలని వ్యవసాయాధికారులు చెప్పారనే సమాధానమొస్తోంది. ఏదిఏమైనా టీడీపీ పాలనలో యూరియా కోసం రైతులు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. -
6 కేజీల గంజాయి స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 6.660 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నగర ఏఎస్పీ దీక్ష నెల్లూరులోని తన కార్యాలయంలో వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావుతో కలిసి నిందితుల వివరాలను వెల్లడించారు. నెల్లూరు రూరల్ మండలం వైఎస్సార్ నగర్ తొమ్మిదో వీధిలోని ఓ ఇంట్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని ఇన్స్పెక్టర్కు సమాచారం అందింది. ఆయన తన సిబ్బందితో కలిసి నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి ఆ ఇంటిపై దాడులు చేశారు. గంజాయి విక్రేతలైన అదే ప్రాంతానికి చెందిన అరవ ఓంరేష్, సయ్యద్ లియాకత్ అలీ, నగరంలోని కపాడిపాళేనికి చెందిన ఊట్ల జాన్వెస్లీని అదుపులోకి తీసుకున్నారు. విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన రూ.66 వేల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీసుస్టేషన్కు తరలించి విచారించగా ఏఓబీ సరిహద్దు ప్రాంతాలనుంచి గంజాయిని తీసుకొచ్చి నెల్లూరులో విక్రయిస్తున్నట్లు వెల్లడించడంతో నిందితులను అరెస్ట్ చేశామని దీక్ష తెలిపారు. ఓంరేష్పై ఇప్పటికే రెండు కేసులున్నాయన్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన ఇన్స్పెక్టర్, హెడ్కానిస్టేబుల్ జిలానీ, కానిస్టేబుళ్లు రాజకిశోర్, వెంకట్రావు, గురుమహేష్, నాగరాజు, శ్రీనివాసులను ఏఎస్పీ అభినందించారు. -
విద్యార్థులపై దాడి కేసులో ఐదుగురి అరెస్ట్
● నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావునెల్లూరు సిటీ: పదో తరగతి విద్యార్థులను కత్తులతో బెదిరించి, దాడికి పాల్పడిన ఘటనలో ఐదుగురిని నెల్లూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్స్టేషన్లో బుధవారం రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. కోడూరుపాడు గ్రామానికి చెందిన శుషాంత్ ఓ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. ఈనెల 26వ తేదీన పాఠశాలలో గణతంత్ర వేడుకల్లో పాల్గొని తిరిగి స్నేహితులతో కలిసి ఇంటికెళ్తున్నాడు. ఈ క్రమంలో కాకాణి రాకేష్ అలియాస్ రాఖీ, బోడెద్దుల శ్రీనివాసులు, మరో బాలుడు బైక్పై వెళ్తూ విద్యార్థులకు అడ్డు తగిలారు. చూసుకుని వెళ్లాలని శుషాంత్ చెప్పడంతో బైక్ ఆపి వారి వద్దకు వచ్చారు. గతంలో వారి మధ్య పాతగొడవలున్న నేపథ్యంలో వాగ్వాదం జరిగింది. విద్యార్థులపై రాఖీ, శ్రీనివాస్, బాలుడు భౌతికంగా దాడికి దిగారు. అంతటితో ఆగకుండా ఫోన్ చేసి కాసు కల్యాణ్, కోలగట్ల ఉమయ్య, కాసు మోహన్, మరో బాలుడ్ని పిలిపించుకుని విద్యార్థులను చంపుతామని కత్తులతో భయభ్రాంతులకు గురిచేశారు. వారు కేకలు వేయడం, ప్రజలు రావడంతో నిందితులు పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో కోడూరుపాడుకు చెందిన మోహన్, శ్రీనివాసులు, కల్యాణ్, ఉమయ్య, పెనుబర్తి గ్రామానికి చెందిన రాకేష్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శ్రీనివాసులు, ఉమయ్యపై గతంలో కొట్లాట కేసులున్నాయి. వారి నుంచి మోటార్బైక్, మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిపై రౌడీషీట్ తెరుస్తామని డీఎస్పీ తెలిపారు. ఇద్దరు బాలురను జువైనల్ హోమ్కు తరలించారు. సమావేశంలో ఎస్సైలు లక్ష్మణ్, సుధీర్ పాల్గొన్నారు. -
ఏడీఎఫ్.. మహోన్నతం
యద్దల వెంకటసుబ్బారెడ్డికి నివాళులు గూడూరు రూరల్: మండలంలోని మంగళపూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత యద్దల నరేంద్రరెడ్డి తండ్రి యద్దల వెంకటసుబ్బారెడ్డి ఉత్తరక్రియలను బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటసుబ్బారెడ్డి చిత్రపటానికి మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఎమ్మెల్సీ, గూడూరు నియోజకవర్గ ఇన్చార్జి మేరిగ మురళీధర్, సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్రెడ్డి, ఎస్ఈసీ సభ్యుడు కుమారస్వామిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు మెట్టా రాధాకృష్ణారెడ్డి, కోడూరు మీరారెడ్డి, కల్పలత, గూడూరు పట్టణ, రూరల్, చిల్లకూరు మండల కన్వీనర్లు బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయకుమార్రెడ్డి, భక్తవత్సలరెడ్డి, మధుసూదన్రెడ్డి, సుబ్రహ్మణ్యంరెడ్డి, మనపాటి రవీంద్రబాబు, యోగి, సుబ్బారావు, గూడూరు ఎంపీపీ గురవయ్య, యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండూరు సునీల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు: ఆత్మకూరు నియోజకవర్గాభివృద్ధికి ఏడీఎఫ్ ఎనలేని కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తన కుటుంబసభ్యులతో అప్పటి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి మాట్లాడి.. అందరికీ ఆదర్శంగా నిలిచేలా తొలుత రూ.10 కోట్లను దీని కోసం కేటాయించారు. గ్రామాల అభివృద్ధి విషయంలో ప్రభుత్వంపై ఆధారపడకుండా కలిసొచ్చిన దాతలను కలుపుకొని పనులు చేసేలా ప్రణాళికలను రూపొందించారు. అభివృద్ధి పరవళ్లు.. తన సోదరుడు, దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఆశయ సాధనలో భాగంగా ఆత్మకూరులో రూ.4.5 కోట్లతో మున్సిపల్ బస్టాండ్ను నిర్మించారు. ఏడీఎఫ్ రూపకల్పన, ఆలోచన శైలి, అభివృద్ధి పనుల్లో నిజాయతీని పరిశీలించిన పలువురు భాగస్వాములయ్యేందుకు ముందుకొచ్చారు. దీంతో ఏడీఎఫ్ బెంగళూరు చాప్టర్ను ఆవిష్కరించారు. ఆత్మకూరు ప్రాంతానికి చెంది కర్ణాటకలోని పలువురు తమ ప్రాంత అభివృద్ధి కోసం దీన్ని వేదికగా చేసుకునేందుకు ముందుకొచ్చారు. పుట్టిన ఊరిపై మమకారంతో ఆర్థిక స్థితిమంతులు, వ్యాపారవేత్తలు, ఉన్నత స్థాయి ఉద్యోగులు.. మేకపాటి విక్రమ్రెడ్డి వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. డిజిటల్ తరగతి ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడుతున్న విక్రమ్రెడ్డి (ఫైల్) ఏడీఎఫ్ నిధులతో నిర్మించిన మున్సిపల్ బస్టాండ్ చేపట్టిన కార్యక్రమాలివీ.. సోమశిలలోని సోమేశ్వరాలయ పునరుద్ధరణకు రూ.50 లక్షలను అందజేశారు. పలు ప్రముఖ కంపెనీలతో జాబ్ మేళాలను రెండుసార్లు నిర్వహించి 2250 మందికి ఉద్యోగావకాశాలను కల్పించారు. హసనాపురం – కలిగిరి రోడ్డు మరమ్మతు పనులకు రూ.నాలుగు లక్షలను వెచ్చించారు. గ్రూప్ – 2 పరీక్షలు రాసే వారికి రూ.నాలుగు లక్షల విలువజేసే మెటీరియల్ను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 31 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు రూ.60 లక్షల వ్యయంతో డిజిటల్ తరగతులను ఏర్పాటు చేశారు. మర్రిపాడు మండలంలోని చాబోలు విద్యార్థుల కోసం స్కూల్ బస్సు ఏర్పాటుతో పాటు అనంతసాగరం పంచాయతీ బస్టాండ్ను నిర్మించారు. 108 వాహన ఉద్యోగులకు గది ఏర్పాటు.. సంగం, ఆదూరుపల్లి, ఆత్మకూరు, అన్నారెడ్డిపాళెం, నందవరం, కంపసముద్రం, ఏఎస్పేట ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, ఏఎస్పేట కేజీబీవీలో ఇన్వర్టర్లను సమకూర్చారు. అలింకో సంస్థ సహకారంతో రూ.21.1 లక్షల వ్యయంతో 170 మంది దివ్యాంగులకు అవసరమైన పరికరాలను పంపిణీ చేశారు. రూ.ఆరు లక్షలతో పలువురికి మోకాలి శస్త్రచికిత్సలు.. మర్రిపాడు మండలంలోని సింగనపల్లి, బాట, కంపసముద్రం గ్రామాల్లో రూ.ఎనిమిది లక్షల వ్యయంతో మూడు వాటర్ ప్లాంట్ల ఏర్పాటు.. ఇలా ఎన్నింటినో కల్పించారు. ఆత్మకూరులో విస్తృతంగా అభివృద్ధి కార్యక్రమాలు ఐదో వసంతంలోకి అడుగిడుతూ.. మాజీ ఎమ్మెల్యే విక్రమ్రెడ్డి మాననపుత్రిక ప్రభుత్వ పాఠశాలలు, గ్రామాల్లో పలు సౌకర్యాలు రూ.4.5 కోట్లతో మున్సిపల్ బస్టాండ్ ఏర్పాటు ఆత్మకూరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఎన్నో చర్యలు చేపట్టారు. అంతా సజావుగా సాగుతున్న తరుణంలో 2022లో ఆయన హఠాన్మరణం చెందారు. ఈ తరుణంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టి అదే ఏడాదిలో నిర్వహించిన ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్రెడ్డి ఘన విజయం సాధించారు. శోకసంద్రంలో ఉన్న తన కుటుంబాన్ని ఆదరించి పట్టంకట్టిన ప్రజానీకానికి తన వంతు సేవ చేయాలనే మహోన్నత ఆశయంతో ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం (ఏడీఎఫ్) ఏర్పాటుకు ఆయన సంకల్పించారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా దాతల సహకారం, తన వంతు భాగస్వామ్యంతో 2022, డిసెంబర్ పదిన దీనికి శ్రీకారం చుట్టారు. నాటి నుంచి నేటి వరకు మౌలిక వసతులను కల్పిస్తూ.. అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ప్రజా సంక్షేమమే తన పరమావధి అని చాటి చెప్తున్నారు. -
సూరాయపాళెంలో రేయింబవళ్లూ దోపిడీ
నెల్లూరు సిటీలో మంత్రి అనుచరులే.. నెల్లూరు సిటీ పరిధిలోని కొత్త పెన్నాబ్రిడ్జి వద్ద, భగత్సింగ్ కాలనీ ప్రాంతాల్లో రేయింబవళ్లు ఇసుకను తరలిస్తున్న వైనం ఇటీవల వివాదాస్పదమైంది. టీడీపీ నేత, నుడా చైర్మన్ సైతం దీనిపై ఆరోపణలు గుప్పిస్తూ ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొని అధికారులను రీచ్ వద్దకు పిలిపించిన విషయం తెలిసిందే. ఇటీవల మంత్రి నారాయణ సామాజికవర్గానికే చెందిన టీడీపీ పట్టణాధ్యక్షుడు మామిడాల మధుతో పాటు మరికొందరు టీడీపీ నేతలు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారంటూ వాట్సాప్ కాన్ఫరెన్స్ కాల్లో బహిరంగంగా మాట్లాడారంటే ఏ స్థాయిలో ఇక్కడ ఇసుక అక్రమ రవాణా జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇసుక దోపిడీలో పోలీసులకే కమీషన్లు ఇస్తున్నామని వారు బాహాటంగానే చెప్పుకొంటున్నారు. అయితే ఈ ఇసుక దోపిడీని పోలీసులే తన దృష్టికి తీసుకొచ్చారని మంత్రి నారాయణ సైతం చెప్పినా.. సదరు ఇసుక దోపిడీదారులపై ఇంతవరకు చర్యలు తీసుకోకపోగా, రాత్రుళ్లు టిప్పర్లలో కాకుండా ట్రాక్టర్లలో తరలించుకోమని ఉచిత సలహాలిస్తున్నారనీ, ఇందులో మంత్రికి వాటాలు వెళ్తున్నాయనే ఆరోపణలు లేకపోలేదు. ఎన్జీటీ ఆదేశాలు తుస్ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను తమ్ముళ్లు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నేతల ఆదేశాలనే చట్టాలుగా మార్చేసి యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నారు. కాలువకు సాగునీరు వెళ్లే చోట అడ్డంగా గట్టుకట్టి మరీ గ్రావెల్ వేసి రహదారులు నిర్మించి ఇసుక దందాను కొనసాగిస్తున్నారు. భవిష్యత్తు ప్రమాదాలను సైతం పట్టించుకోకుండా రోజూ వేలాది టన్నుల ఇసుకను తోడేస్తూ ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ తమ్ముళ్లు సొమ్ము చేసుకుంటున్నా.. అధికార యంత్రాంగానికి చీమకుట్టినట్లు లేదు. అటు పోలీసులు ఇసుక అక్రమ దందాకు రక్షణగా ఉండగా, జిల్లా యంత్రాంగం సాగిల పడి అఽధికారానికి సలామ్ చేస్తూ ప్రకృతిని నాశనం చేస్తున్నారు. తెలుగురాయపురంలో అనుమతి లేని రీచ్లో యంత్రాలతో తవ్వకాలుసాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార పార్టీ నేతల ధనదాహానికి సహజ వనరులు అడుగంటిపోతున్నాయి. ఆత్మకూరు, వెంకటగిరి, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ, కోవూరు నియోజకవర్గాల పరిధిలో పెన్నానది ప్రవహిస్తోంది. ఉచిత ఇసుక పేరుతో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు బినామీలతో తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ జేబులు నింపుకొంటున్నారు. నదీ గర్భంలోనే రోడ్లు నిర్మించి భారీ యంత్రాలతో ఇసుకను అక్రమంగా తవ్వి లారీల్లో తరలిస్తున్నారు. పగలూ రాత్రనే తేడా లేకుండా పెన్నా నదిలో 10 మీటర్ల లోతు వరకు ఇసుకను తవ్వి టిప్పర్లు, లారీల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక తోడేళ్లతో సోమశిల ప్రాజెక్ట్తో పాటు దిగువన ఉన్న సంగం, పెన్నా బ్యారేజీలు, రైల్, రోడ్డు వంతెనలకు ప్రమాదం ముంచుకొస్తోంది. పెన్నమ్మ గర్భం శోకిస్తూ నిత్యం వణికిపోతోంది. నెలవారీగా ముడుపులు ముడుతుండటంతో అధికార యంత్రాంగం సైతం జీ హుజూర్ అంటూ కళ్లకు గంతలు కట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. సెమీ మెకనైజ్డ్ రీచ్లలో పొక్లయినర్లకు అనుమతి లేదని తెలిసినా నిబంధనలు ఉల్లంఘించి ఇసుకను తరలించడమే కాకుండా, ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే అధిక రేట్లకు అమ్మేసుకుంటున్నారు. తెలుగురాయపురంలో.. వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండలంలో తమ్ముళ్లు బరితెగిస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధి అండతో పెన్నానదిని యంత్రాలతో కుళ్లబొడుస్తున్నారు. తెలుగురాయపురం సమీపంలో ఉన్న నదిలో భారీ యంత్రాలు పెట్టి నిత్యం వందలాది వాహనాల్లో ఇసుకను లోడ్ చేస్తున్నారు. ఇక్కడి ఇసుక రీచ్కు అనుమతి లేదు. పర్యావరణ అనుమతులూ లేవు. దీనికి కిలోమీటర్ పరిఽధిలోనే సోమశిల ప్రాజెక్ట్ ఉంది. అక్కడ తవ్వకాలు చేయకూడదనే నిబంధనలున్నాయి. కానీ స్థానిక తమ్ముళ్లు సంగం బ్యారేజీకి ముందు వైపు డీసిల్టింగ్ పేరుతో అనుమతులు పొంది తెలుగురాయపురంలో తవ్వేస్తున్నారు. నేరుగా నది మధ్యలోనే యంత్రాలను పెట్టి రేయింబవళ్లు ఇసుక తవ్వకాలను సాగిస్తూ భారీ టిప్పర్లలో లోడింగ్ చేస్తున్నారు. ఒక్కో వాహనానికి లోడింగ్ కింద రూ.12 వేల వంతున వసూలు చేస్తున్నారు. ఈ అక్రమ రీచ్ నుంచి రోజుకు సగటున వంద లారీల్లో లోడింగ్ జరుగుతుండగా, రూ.12 లక్షల వరకు రాబడి వస్తున్నట్లు అంచనా. అందులో షాడో ఎమ్మెల్యేగా ఉన్న కీలక నేతకు రూ.8 లక్షలు, మిగిలిన సొమ్మును ఖర్చులతో పాటు తమ్ముళ్లు పంచుకుంటున్నారు. గత నెల రోజులుగా బరితెగించి తమ్ముళ్లు తవ్వకాలు చేస్తున్నా.. అధికారులకు తెలియదంటే.. ప్రజలు నమ్మాలి మరీ. పీకేపాడులోనూ అదే పరిస్థితి చేజర్ల మండలం పడమటికంభంపాడు ఓపెన్ రీచ్కు అనుమతి లేదు. కానీ అక్కడ డంపింగ్ పేరుతో అధికారుల వద్ద అనుమతి పొంది తమ్ముళ్లు బరితెగించి తవ్వకాలు చేస్తున్నారు. సోమశిల ప్రాజెక్ట్కు దిగువన 500 మీటర్లలోపే రీచ్ను ఏర్పాటు చేసి యంత్రాలు పెట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. ఓ వైపు తెలుగురాయపురం, మరో వైపు పీకేపాడు రెండు అనధికార రీచ్లు సోమశిల ప్రాజెక్ట్కు కూతవేటు దూరంలోనే ఉన్నాయి. పది మీటర్ల లోతు వరకు ఇసుకను తోడేస్తుండటంతో ప్రాజెక్ట్కు ప్రమాదం పొంచి ఉందని ప్రాజెక్ట్ మాజీ ఇంజినీరింగ్ అధికారులు, ప్రాజెక్ట్ ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెన్నాలో భారీ గోతులతో భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో అడుగంటిపోతున్నాయి. భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. బరితెగించి నిత్యం వందల వాహనాల్లో లోడింగ్ చేస్తున్నా.. ఏ అధికారి ఆ వైపు కన్నెత్తి చూడటంలేదంటే అధికార పార్టీ ఒత్తిడితోపాటు వారికి నెల మామూళ్లు అందుతున్నాయనే ప్రచారమూ లేకపోలేదు. విరువూరు రీచ్లో బరితెగింపు సర్వేపల్లి నియోజకవర్గంలోని విరువూరు రీచ్లో తమ్ముళ్ల బరితెగిస్తున్నారు. రీచ్లో పర్యావరణానికి తూట్లు పొడిచేలా భారీ యంత్రాలతో రాత్రీ, పగలనే తేడా లేకుండా తవ్వకాలు చేస్తున్నారు. దాదాపు 20 మీటర్లు వరకు నదీగర్భాన్ని తోడేశారు. డంపింగ్ పేరుతో యంత్రాలు పెట్టి నదిలోకి రోడ్లు వేసి దోపిడీ చేస్తున్నారు. ఉచిత ఇసుక పేరుతో చేస్తున్న దందాను చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. ఒక్కో ట్రాక్టర్కు ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం టన్ను రూ.68 అయితే టీడీపీ నేతలు రూ.300 వరకు వసూలు చేశారు. వీరు పబ్లిక్గా ట్రాక్టర్ ఇసుకను రూ.2500 వరకు విక్రయిస్తున్నారు. టిప్పర్ ఇసుకకు రూ.1400 వసూలు చేయాల్సి ఉంటే రూ.8 వేలు.. 12 టైర్ల వాహనాలకు రూ.1600 వసూలు చేయాల్సి ఉంటే రూ.12 వేలు.. 14 టైర్ల వాహనాలకు రూ.15 వేల వంతున వసూలు చేసి దోచుకుంటున్నారు. కోవూరులో విచ్చలవిడిగా.. ఈ నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాళెం వద్ద డీసిల్టింగ్కు అనుమతి ఉంది. అయితే ఇందుకు భిన్నంగా పోతిరెడ్డిపాళెం, మినగల్లు, జొన్నవాడు, జమ్మిపాళెం, సుబ్బారెడ్డిపాళెం, వేగూరు, లేగుంటపాడు, ముదివర్తి, ఊటుకూరు, ముదివర్తిపాళెం తదితర ప్రాంతాల్లో రేయింబవళ్లు ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధికి సంబంధించిన బంధువులే ఈ రీచ్లను నిర్వహిస్తున్నారు. వీరంతా బినామీలను పెట్టి ఇసుక తవ్వుతున్నారంటూ స్థానికంగా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా.. పట్టించుకున్న పాపాన పోలేదు. జిల్లా వ్యాప్తంగా రీచ్లలో జరిగేంత స్థాయిలో ఒక్క సూరాయపాళెం రీచ్లో ఇసుక దోపిడీ జరుగుతోంది. స్థానిక ప్రజాప్రతినిధి బినామీ ద్వారా సాయి శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన బ్యాంక్ అకౌంట్కు వెళ్లేలా క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి నేరుగా చేతికి ఇసుక అంటకుండానే రూ. కోట్లు కొల్లగొడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇసుక కొనుగోలు చేసిన వారికి ట్రిప్ షీట్ పేరుతో చేత్తో రాసిన స్లిప్పును చేతిలో పెట్టి పంపిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం నాలుగున్నర టన్నులకు రూ.300 లోపు వసూలు చేయాల్సి ఉండగా, ఐదు రెట్లు అధికంగా రూ.1250 వంతున వసూలు చేస్తున్నారు. పైగా ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య మాత్రమే ఇసుక తవ్వకాలు చేపట్టాలనే ప్రభుత్వ నిబంధనలున్నా, రేయింబవళ్లు పొక్లయినర్లతో తోడేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలే బినామీలను పెట్టి ఇసుక దందా భారీ యంత్రాలతో పెన్నానదిలో తోడేస్తున్న వైనం సోమశిల నుంచి కడలి వరకు 60 రీచ్లు అనుమతులు మూడు చోట్లే జిల్లా నుంచి 500 టిప్పర్లు, వెయ్యికిపైగా ట్రాక్టర్లలో అక్రమ రవాణా నిత్యం రూ.10 కోట్ల వ్యాపారం కలువాయిలోని తెలుగురాయపురంలో తమ్ముళ్ల బరితెగింపు విరువూరు, పీకేపాడు రీచ్లలో అర్ధరాత్రీ తవ్వకాలు సోమశిల ప్రాజెక్ట్కు పొంచి ఉన్న ముప్పు పర్యావరణానికి తూట్లు పొడుస్తున్నా.. పట్టించుకోని అధికారులు మామూళ్ల మత్తులో కళ్లకు గంతలు పెన్నానదిలో టీడీపీ తోడేళ్లు సై‘ఖతం’ చేస్తున్నాయి. గర్భశోకంతో నది అల్లాడిపోతోంది. మంత్రులు, ఎమ్మెల్యేల బినామీలు భారీ యంత్రాలు పెట్టి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతుల్లేకుండా ఇసుకను ఇష్టారీతిన తోడేస్తున్నారు. సోమశిల ప్రాజెక్ట్ దిగువ నుంచి బంగాళాఖాతం వరకు ఉన్న పెన్నాలో ఊరికో రీచ్ను ఏర్పాటు చేసి రేయింబవళ్లు ట్రాక్టర్లు, టిప్పర్లు, లారీల్లో అక్రమ రవాణా చేస్తున్నారు. రోజూ రూ.కోట్లల్లో ఇసుక వ్యాపారం జరుగుతుందంటే దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా పొర్లుకట్టలను తవ్వేసి, నదిలోకి గ్రావెల్ రోడ్లు వేసి ఇసుక రవాణా చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలకు ప్రైవేట్ వ్యాపారుల క్యూఆర్ కోడ్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారంటే ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నారో తెలుస్తోంది. ఇటీవల మంత్రి నారాయణ తన నియోజకవర్గంలో టీడీపీ నేతలే ఇసుక దోపిడీ చేస్తున్నారంటూ మాట్లాడిన మాటలను బట్టే అర్థమవుతోంది. -
సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి
● డీఆర్వో విజయ్కుమార్ నెల్లూరు(దర్గామిట్ట): దేశ రక్షణలో సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని డీఆర్వో విజయ్కుమార్ అన్నారు. జాతీయ మాజీ సైనికుల దినోత్సవాన్ని బుధవారం నెల్లూరులోని తిక్కన ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 70 సంవత్సరాల వయసు దాటిన 30 మంది మాజీ సైనికులను డీఆర్వో శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. యుద్ధాల్లో పాల్గొన్న సైనికుల ధైర్యసాహసాలను ఆయన కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమాధికారి జి.హరికృష్ణ, అఖిల భారతీయ పూర్వ సైనిక సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి, మాజీ వింగ్ కమాండర్ శ్యామ్ప్రసాద్, జిల్లా మాజీ సైనికుల అసోసియేషన్ అధ్యక్షుడు కరేటి కళాధర్, ఉపాధ్యక్షుడు మేడేపల్లి రత్నయ్య, కావలి అసోసియేషన్ అధ్యక్షుడు రాజారావు తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(దర్గామిట్ట): చదువు, క్రమశిక్షణ, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే ఏ పరిస్థితినైనా జయించవచ్చని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులతో బుధవారం కలెక్టర్ తన ఛాంబర్లో ముఖాముఖి నిర్వహించారు. పిల్లల్ని కలెక్టర్ పేరుపేరునా పలుకరించినవారి చదువు, ఆరోగ్యం, భవిష్యత్ లక్ష్యాలు, ఎదురవుతున్న ఇబ్బందులను ఆరాతీశారు. స్పష్టమైన ప్రణాళికతో చదవాలని సూచించారు. కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన జిల్లాలోని 24 మంది విద్యార్థులకు పీఎం కేర్స్ పథకం ద్వారా రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.10 లక్షలు చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించి, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వారి పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆ పాస్బుక్స్ను చిన్నారులకు కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ హేనాసుజన్, బాలల సంరక్షణాధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.పొదలకూరు నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.30 సన్నవి : రూ.20 పండ్లు : రూ.5 -
అనుమతి గోరంత.. తవ్వేది కొండంత
వరంలా సాగరమాల చిట్టమూరు/చిల్లకూరు: చిట్టమూరు మండలంలోని మెట్టు గ్రామంలో తెలుగుదేశానికి చెందిన ప్రజాప్రతినిధుల అండతో 9 నెలలుగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయి. గనుల శాఖ నుంచి 30 సంవత్సరాలకు సుమారు ఏడు ఎకరాలకు లీజు పొంది తవ్వకాలకు అనుమతి తీసుకున్నారు. అక్కడే కాకుండా పక్కనే ఉన్న మరో 40 ఎకరాల్లో ఇష్టానుసారంగా తవ్వి రోజూ కనీసం 70 నుంచి వంద టిప్పర్లలో గ్రావెల్ను తరలించేస్తున్నారు. వాస్తవానికి ఆ ప్రాంతంలో 6 నుంచి 13 అడుగల మేర మాత్రమే తవ్వకాలు చేపట్టాలి. అయితే గనులు, రెవెన్యూ శాఖల అధికారులు కనీసం అటువైపు కన్నెతి చూడకపోవడంతో 15 నుంచి 20 మీటర్ల వరకు తవ్వకాలు చేపడుతున్నారు. మూగజీవాలు ఆ గుంతల్లో పడితే ప్రాణాలు పోయే ప్రమాదముంది. అడ్డుకుంటూ.. గ్రావెల్ తవ్వకాలు చేపట్టే ప్రాంతానికి పూర్తిగా కంచె వేశారు. లోపల ఏమి జరుగుతుందో బయట వారికి తెలియకుండా అడ్డుకునేలా ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైనా వెళ్తే ఎందుకొచ్చారు?, ఇక్కడ మీకేం పనంటూ అడ్డుకోవడంతోపాటుగా దౌర్జనాలకు పాల్పడుతున్నారు. రోజూ పెద్ద సంఖ్యలో టిప్పర్లు తరలిపోతున్నా అధికారులు తమకేం పట్టనట్టున్నారు. ఇక్కడ కూడా.. కోట మండంలో రెవెన్యూ, గనుల శాఖాధికారులకు టీడీపీ నేతల నుంచి ఒత్తిళ్లు ఎక్కవ అవుతుండటంతో కనీసం తనిఖీలు చేసిన దాఖలాల్లేవు. ఊనుగుంటపాళెంలో సుమారు 50 ఎకరాల్లో గ్రావెల్ తవ్వేయడంతో భారీ గోతులు ఏర్పడ్డాయి. అలాగే రాఘవాపురం, కొండుగుంట, మద్దాలి ప్రాంతాల్లో గ్రావెల్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. టిప్పర్ల రాకపోకలతో రహదారులు పూర్తిగా దెబ్బతినడంతోపాటు ఆయా గ్రామల ప్రజలు దుమ్ముతో అల్లాడిపోతున్నారు. గూడూరు నియోజకవర్గంలో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చిట్టమూరు మండలంలో 9 నెలలుగా.. కోట మండలంలోనూ అదే పరిస్థితి ప్రభుత్వాదాయానికి గండి చోద్యం చూస్తున్న గనులు, రెవెన్యూ శాఖలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గూడూరు నియోజకవర్గంలో ఇసుక, సిలికా, గ్రావెల్, మట్టి, తెల్లరాయిని నేతలు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న విషయం తెలిసి అధికారులు వెళ్తే మామూళ్లు ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే పరిశీలిస్తాం.. అనుమతులు ఉన్నాయంటున్నారు. రోజూ వందల లారీలు, టిప్పర్లలో గ్రావెల్, మట్టి, ఇసుక తరలిపోతోంది.గ్రావెల్, మట్టి తవ్వకాల చేపట్టే వారికి సాగరమాల రహదారి నిర్మాణం వరంలా మారింది. గత ప్రభుత్వ హయాంలో దాని నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థ నేరుగా భూములు కొనుగోలు చేయడం, ఎక్కడైనా క్వారీలుంటే అక్కడ్నుంచి గ్రావెల్, మట్టి తవ్వకాలు చేపట్టి వినియోగించుకునేది. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తవ్వకాలు పూర్తిగా నిలిపివేసి తమ కనుసన్నల్లోనే జరగాలని పట్టుబట్టారు. దీంతో గ్రావెల్, మట్టి తరలించేందుకు ముందస్తుగా అధికార పార్టీకి చెందిన నాయకుల అనుమతి తీసుకోవాలి. సాగరమాల కాంట్రాక్ట్ సంస్థ నిర్వాహకులు నేతలకు నగదు ఇచ్చి గ్రావెల్ను తీసుకెళ్తున్నారు. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీలో ఎక్కవ శాతం ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి వెళ్తోంది. -
సమ్మె విజయవంతానికి పిలుపు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్స్ను రద్దు చేయాలంటూ ఫిబ్రవరి 12వ తేదీన జరిగే సమ్మెను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. నెల్లూరులోని సీఐటీయూ కార్యాలయంలో బుధవారం ట్రేడ్ యూనియన్లు, రైతు, వ్యవసాయ, కౌలు రైతు సంఘాల నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాలుగు లేబర్ కోడ్స్ను అమల్లోకి తీసుకురావడంతో కార్మిక, ఉద్యోగ వర్గాలకు కనీస వేతనం అందే పరిస్థితి లేదన్నారు. వచ్చే నెల 3వ తేదీన టౌన్హాల్లో జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో నేతలు టీవీవీ ప్రసాద్, శంకర్ కిషోర్, వెంగయ్య, అజయ్కుమార్, గోగుల శ్రీనివాసులు, యానాదయ్య, రాంబాబు, బసవరాజు, షాన్వాజ్, రెహానా బేగం, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
గుప్త నిధుల కలకలం
● సంగం కొండపై భారీ గుంత ● ఘటన స్థలంలో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు ● పోలీసులకు సమాచారమిచ్చిన పశువుల కాపర్లు ● భయాందోళనలో స్థానికులు సంగం: సంగంలోని కొండ ప్రాంతంలో బుధవారం వెలుగు చూసిన భారీ గుంత కలకలం రేపింది. గుప్త నిధుల కోసం తవ్వారా లేదా క్షుద్రపూజలు చేశారాననే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమయ్యాయి. వాస్తవానికి సంగానికి ఇరువైపులా ఉన్న కొండ ప్రాంతంలో అక్కడక్కడా అలనాటి సంస్కృతికి సంబంధించిన శిలలు, కాలభైరవుడి విగ్రహం ఇలా ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో గుప్త నిధుల ముఠా కళ్లు దీనిపై పడ్డాయని తెలుస్తోంది. గుర్తుతెలియని వ్యక్తులు వారంలో మూడుసార్లు పడిగాపులు కాయగా.. మరికొందరు కొండ పైభాగానికి వెళ్లి తవ్వకాలు సాగించడంతో ఏర్పడిన భారీ గుంత సుమారు 100 అడుగులపైనే ఉంటుంది. గుంతలో నిచ్చెనను సైతం ఏర్పాటు చేయడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఓ చెట్టుకు పసుపు, కుంకుమను చల్లి.. నిమ్మకాయలను ఉంచి పూజలు చేసిన ఆనవాళ్లు సైతం దర్శనమిస్తున్నాయి. ప్రశ్నించడంతో పరార్.. సంగం కొండపై పట్టపగలే గుంత తవ్వుతుండటంతో గొర్రెల కాపరి కేశవులు గమనించారు. గుంత పైభాగంలో ఇద్దరు కూర్చొని ఉండగా, కొత్త వారిగా గుర్తించి ప్రశ్నించారు. దీంతో వీరు పరారయ్యారు. ఆపై సంగం పోలీసులకు సమాచారమిచ్చారు. కొండపైకెళ్లి భారీ గుంతను ఎస్సై రాజేష్, సిబ్బంది పరిశీలించారు. చెంతనే ఉన్న చెక్పోస్ట్ వాసులతో మాట్లాడారు. ఆనవాళ్ల బట్టిచూస్తే గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపి ఉంటారని భావిస్తున్నారు. ముఠాను పట్టుకుంటామని ఎస్సై తెలిపారు. ఖేలో ఇండియా కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం నెల్లూరు(స్టోన్హౌస్పేట): ఖేలో ఇండియా క్రీడా కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలను పంపాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పాండురంగారావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. దేశవ్యాప్తంగా 139 ఖేలో ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారని వివరించారు. దీనికి సంబంధించిన క్రీడా శిక్షణకు అవసరమైన మైదానాలు, మౌలిక సదుపాయాలున్న వారు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలను పంపొచ్చని చెప్పారు. సదరు సంస్థకు ఉన్న అనుభవం, క్రీడాకారుల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకొని కేంద్రాలను కేటాయించనున్నామని వెల్లడించారు. అర్హత కలిగిన వారు నిర్ణీత దరఖాస్తులను ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో వచ్చే నెల సాయంత్రం 5.30లోపు అందజేయాలని కోరారు. -
విద్యాసాగర్ ప్యానల్కే మద్దతు
నెల్లూరు(అర్బన్): వచ్చే నెల 8వతేదీన జరిగే ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర ఎన్నికల్లో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పోటీ చేస్తున్న అలపర్తి విద్యాసాగర్, డీవీ రమణ ప్యానల్కే జిల్లా సంఘం తరఫున పూర్తి మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశామని ఆ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండారుపల్లి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం దర్గామిట్టలోని ఎన్జీఓ భవన్లో ఆ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యాసాగర్ ఆధ్వర్యంలోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు నిబద్ధతతో జరుగుతున్నాయన్నారు. అనంతరం ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో నేతలు గాదిరాజు రామకృష్ణ, ఆంజనేయవర్మ, లక్కాకుల పెంచలయ్య, కిరణ్ప్రసాద్రెడ్డి, రాజేంద్రప్రసాద్, సతీష్, సురేష్, రాజేంద్ర, రవికుమార్, రమ్య, కరుణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అంకితభావంతో విధులు నిర్వహించాలి
● ఎస్పీ అజిత వేజెండ్ల నెల్లూరు(క్రైమ్): మానసిక, శారీరక ధృడత్వాన్ని, వృత్తినైపుణ్యాలను పెంపొందించుకుంటూ అంకితభావంతో విధులు నిర్వహించాలని ఎస్పీ అజిత వేజెండ్ల సాయుధ పోలీసులకు సూచించారు. జిల్లా సాయుధ బలగాల వార్షిక సమీకరణ (యాన్యువల్ మొబలైజేషన్) ముగింపు కార్యక్రమం బుధవారం నెల్లూరులోని పోలీసు కవాతు మైదానంలో జరిగింది. బ్యాండ్ పార్టీ వాయిద్యాల నడుమ సాగిన కవాతును వీక్షిస్తూ వారి నుంచి ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడతూ పోలీస్ శాఖలో ఏఆర్ సిబ్బంది పాత్ర విశిష్టమైందన్నారు. విధి నిర్వహణతోపాటు ఆరోగ్యంపై తగిన శ్రద్ధ తీసుకోవాలన్నారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏఆర్ డీఎస్పీ చంద్రమోహన్ మాట్లాడుతూ వార్షిక సమీకరణ కార్యక్రమంలో ఆయుధాల శిక్షణ, ఫైరింగ్ ప్రాక్టీస్, డ్రిల్, మాబ్ కంట్రోల్, ప్రవర్తన నియమాలు తదితరాలపై సిబ్బందికి తర్ఫీదునిచ్చామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, డీఎస్పీలు, సీఐలు, ఆర్ఐలు, ఏఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కలెక్టర్ బంగ్లాలో తేనీటి విందు
నెల్లూరు(దర్గామిట్ట): గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం సాయంత్రం తన బంగ్లాలో అధికారులు, ప్రజాప్రతినిధులకు తేనీటి విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, ఎస్పీ అజిత, ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, బల్లి కల్యాణ్ చక్రవర్తి, ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కాకర్ల సురేష్, కురుగొండ్ల రామకృష్ణ, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్కుమార్, ఆర్డీఓలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
సీఎంఆర్, చందనలో లక్కీ డ్రా
నెల్లూరు(బృందావనం): క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతికి చందన, సీఎంఆర్ ప్రవేశపెట్టిన ఫెస్టివ్ వండర్స్ స్కీమ్లో భాగంగా సోమవారం మెగా బంపర్ డ్రాను కోవూరు ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తీశారు. టాటా టియోగో కారును ముత్తుకూరు మండలం జంగాలదొరువుకు చెందిన ఎం.వైష్ణవి గెలుచుకున్నారు. గత వారం స్కూటీ విజేత గిద్దలూరుకు చెందిన ఎం.గాయత్రికి మోడల్ కీని అందజేశారు. 35 మంది డైలీ డ్రా విజేతలకు గ్రైండర్, ప్యాన్ సెట్, మిక్సీ, రైస్కుక్కర్, డిన్నర్సెట్లను పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ సీఎంఆర్, చందన అంటే ప్రజలు ఎంతో అభిమానిస్తారన్నారు. కార్యక్రమంలో సీఎంఆర్ అధినేత మావూరి శ్రీనివాసరావు, డైరెక్టర్లు సంతోష్, గణేష్, మోపూరు పెంచలయ్య, మేనేజర్ కిశోర్ పాల్గొన్నారు. -
కండలేరులో 60.06 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 60.06 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 600 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,500, లోలెవల్ కాలువకు 300, హైలెవల్ కాలువకు 150, పిన్నేరు కాలువకు 250, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. గణతంత్ర వేడుకల్లో విదేశీయులు నెల్లూరు(దర్గామిట్ట): పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన గణతంత్ర వేడుకల్లో విదేశీయులు సందడి చేశారు. స్పెయిన్ దేశానికి చెందిన జువానా, యానా వేడుకల్లో పాల్గొన్నారు. వారి వెంట డిప్యూటీ మేనేజర్ అరుణ ఉన్నారు. -
కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం
కావలి(దగదర్తి): కావలి సమీపంలోని గౌరవరం జాతీయ రహదారిపై సోమవారం మోటార్బైక్ను కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గౌరవరం గ్రామానికి చెందిన తిప్పారెడ్డి శ్రీనివాసరెడ్డి (59) తన బైక్పై పొలానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన కారు బైక్ను ఢీకొట్టింది. దీంతో శ్రీనివాసరెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. కావలి రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. -
లారీని ఢీకొట్టిన కారు
● ఏడుగురికి గాయాలు వరికుంటపాడు: మండలంలోని జడదేవి గ్రామ సమీపంలో 565వ జాతీయ రహదారిపై సోమవారం లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. పొదిలి నుంచి కడప వైపు లారీ వెళ్తోంది. ఏసుదాసు కుటుంబం అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి కారులో బెంగళూరుకు వెళ్లింది. శుభకార్యానికి హాజరై తిరిగి కనిగిరిలో బంధువుల ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు బోల్తా పడగా అందులో ప్రయాణిస్తున్న ఏసుదాసు కుటుంబంలోని ఏడుగురిలో ముగ్గురికి తీవ్రగాయాలు, నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. క్షతగాత్రులను ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై ఎం.రఘునాథ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు. -
పురస్కారాల అందజేత
నెల్లూరు(క్రైమ్): విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులు, సిబ్బందికి కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజండ్లలు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, నెల్లూరు రూరల్, ఆత్మకూరు, గూడూరు, డీటీసీ, ఎస్బీ డీఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, కె.వేణుగోపాల్, గీత, ఎం.గిరిధర్, ఎ.శ్రీనివాసరావు, డీసీఆర్బీ, ఎస్బీ ఇన్స్పెక్టర్లు ఎన్.రామారావు, డి.వెంకటేశ్వరరావు, చిన్నబజారు, బాలాజీనగర్, కావలి రూరల్, కావలి వన్ టౌన్, అల్లూరు, ఏఎస్పేట, ఆత్మకూరు, డీసీఆర్బీ ఎస్సైలు ఎ.అయ్యప్ప, ఎం.పుల్లారెడ్డి, ఎం.బాజీబాబు, సీహెచ్ తిరుమలరెడ్డి, ఎస్.సుమన్, ఎ.శ్రీనివాసరెడ్డి, ఎ.సైదులు, షేక్ జిలానీ, ఎన్.శ్రీనివాస్సింగ్, ఏఎస్సైలు, హెచ్సీలు, పీసీలు, ఏఆర్ పీసీ లు ప్రశంసాపత్రాలు అందుకున్న వారిలో ఉన్నారు. ● సీఐడీలో ఎస్సై కె.బాలకోటయ్య, హెచ్సీలు కె.క్రాంతికుమార్, కె.దయానిధి, ఎం.మధు, కేవీ రమణయ్య, జిల్లా కేంద్ర కారాగార డిప్యూటీ సూపరింటెండెంట్ సీహెచ్ బాలమహేష్, డిప్యూటీ జైలర్ పి.గోవిందరాజులు, హెడ్వార్డర్లు ఎ.వెంకటరెడ్డి, బి.శోభారాణి, వార్డర్లు ఎల్.విజయకుమార్, ఎన్.చిరంజీవి, ఆర్.ధర్మేంద్ర, ఎకై ్సజ్ శాఖలో పొదలకూరు, ఇందుకూరుపేట కానిస్టేబుళ్లు ఎస్కే జిలానీ, బి.సురేష్, అగ్నిమాపక శాఖలో ఆత్మకూరు ఎస్ఎఫ్ఐ పి.బాలాజీ గురుప్రసాద్, మర్రిపాడు లీడింగ్ ఫైర్మెన్ జె.వెంకటేశ్వర్లు, నెల్లూరు డ్రైవర్ సీహెచ్ నరహరి, ఫైర్మెన్ డి.మల్లికార్జున, ఆత్మకూరు ఫైర్మెన్ షేక్ రబ్బానిబాషాలు ప్రశంసాపత్రాలు స్వీకరించారు. -
పొట్టకూటి కోసం వెళ్లి..
● తెలంగాణలో జిల్లా వాసి మృతిభూపాలపల్లి అర్బన్/సోమశిల(చేజర్ల): తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ – 2లో సూపర్వైజర్గా ఉన్న చొప్పరి శ్రీహరి (49) గనిలో జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. సహ కార్మికుల కథనం ప్రకారం.. ఆదివారంవిధులు నిర్వర్తిస్తుండగా వెనుక నుంచి గ్రేడర్ వాహనం ఢీకొనడంతో శ్రీహరి అక్కడిక్కడే చనిపోయాడు. వెంటనే ిసింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించి మృతదేహాన్ని మార్చరీలో భద్రపరిచారు. శ్రీహరి స్వస్థలం నెల్లూరు జిల్లాలో చేజర్ల మండలం తూర్పు కంభంపాడు. ఐదు సంవత్సరాలుగా అక్కడ పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. పిల్లల చదువుల నిమిత్తం కుటుంబం నెల్లూరులో నివాసముంటోంది. స్వగ్రామంలో తల్లిదండ్రులున్నారు. పొట్టకూటి కోసం వెళ్లిన శ్రీహరి మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. -
పెన్నానదిలో దూకిన వివాహిత
● రక్షించిన స్థానికులు, పోలీసులు నెల్లూరు(క్రైమ్): కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత పెన్నానదిలో దూకి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టగా పోలీసులు స్థానికుల సహాయంతో రక్షించారు. పోలీసుల కథనం మేరకు.. జెండావీధి ప్రాంతానికి చెందిన షేక్ అజ్మతున్నీసా, ఖాజా మొహిద్దీన్ దంపతులకు కుమారుడున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో అజ్మతున్నీసా ఆదివారం సాయంత్రం పెన్నా బ్యారేజ్ సమీపంలో నదిలో దూకింది. రథసప్తమి సందర్భంగా రంగనాయకుల స్వామి దేవస్థానం సమీపంలో విధులు నిర్వహిస్తున్న సంతపేట పోలీసులు ఈ విషయాన్ని గమనించారు. ఎస్సై బాలకృష్ణ తన సిబ్బంది, స్థానికుల సహాయంతో నదిలోకి వెళ్లి వివాహితను రక్షించి కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేశారు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. సకాలంలో స్పందించిన పోలీసు అధికారులకు వివాహిత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
భూములపై పచ్చ గద్దలు
ఆత్మకూరు: వ్యవసాయమే వీరి జీవనాధారం. తరతరాల నుంచి వస్తున్న భూములను సాగు చేసుకుంటూ మారుమూల గ్రామంలో నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు తెలియకుండానే 20 మందికి చెందిన 11.28 ఎకరాలను తన పేరిట ఓ టీడీపీ నేత రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇది చేసిన వారు కేరళ, దుబాయ్ తదితర ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో బాధిత రైతులు ఆత్మకూరు ఆర్డీఓ పావని ఎదుట తమ గోడును వెళ్లబోసుకున్నారు. జరిగిందిదీ.. ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం మండలం ఆమనిచిరివెళ్లలో సర్వే నంబర్ 19, 20, 21, 22, 24, 26లో 20 మందికిపైగా కర్షకులకు చెందిన 11.28 ఎకరాల సాగు భూమిని వెంగంపల్లికి చెందిన టీడీపీ నేత బట్రెడ్డి రోశిరెడ్డి తన కుమారుడు మహేష్రెడ్డి సహకారంతో దూర ప్రాంత రైతులు విక్రయించినట్లుగా ఏకంగా రిజిస్ట్రేషన్ చేయించేశారు. గ్రామానికి ఇటీవల వచ్చి ఇవి తన పేరిట రిజిస్టరయ్యాయని, వీటిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని పేర్కొనడంతో రైతులు నివ్వెరబోయారు. తరతరాలుగా తమ కుటుంబీకుల నుంచి సంక్రమించిన భూములని.. టెన్1, అడంగళ్, పట్టాదారు పాస్పుస్తకాలు తమ వద్దే ఉండగా, భూములు ఆయనకెలా దక్కాయని ప్రశ్నించారు. దిక్కుతోచని స్థితిలో కలెక్టర్కు వినతిపత్రాన్ని ఇటీవల అందజేశామని వారు పేర్కొన్నారు. రికార్డులను తారుమారు చేసి.. గతంలో అనంతసాగరం ఇన్చార్జి తహసీల్దార్, వీఆర్వో, సర్వేయర్ ముడుపులను స్వీకరించి రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న వారి పేరుతో నమోదు చేయడంతో రోశిరెడ్డికి రిజిస్ట్రేషన్ చేశారనే విషయం తెలిసిందని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ప్రశ్నించగా, లింగంగుంటకు చెందిన ఓ టీడీపీ నేత బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం కొలువుదీరాక గతేడాదిలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగిందని పేర్కొన్నారు. తమ పొలాలను సొంతం చేసుకునేందుకు యత్నించిన వారిని అడ్డగిస్తే, పోలీసుల నుంచి ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారని ఆరోపించారు. వీటిపై కలెక్టర్, ఆర్డీఓ విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరారు. రైతులకు తెలియకుండానే తమ పేరిట రిజిస్ట్రేషన్ బరితెగిస్తున్న టీడీపీ నేతలు ప్రశ్నిస్తే.. బెదిరింపులు దిక్కుతోచక విలవిల్లాడుతున్న 20 మందికిపైగా రైతులు టీడీపీ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి అక్రమాల పరంపరను ఆ పార్టీ నేతలు సాగిస్తున్నారు. ఇసుక, మట్టి ఇలా ప్రకృతి సంపదను కొల్లగొడుతూ భారీగా వెనుకేసుకుంటున్న వీరి కళ్లు తాజాగా పేదలపై పడ్డాయి. అధికారముందనే ధీమాతో చెలరేగిపోతూ రైతుల భూములను వారికి తెలియకుండానే తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకొని పొట్టగొడుతున్నారు. రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న కొందరి సహాయ, సహకారాలు వీరికి పుష్కలంగా ఉండటంతో ఈ వ్యవహారాలకు అడ్డే లేకుండా పోతోంది. ఆత్మకూరు నియోజకవర్గంలోని అనంతసాగరం మండలం ఆమనిచిరివెళ్లలో జరిగిన ఈ తంతు విస్మయానికి గురిచేస్తోంది. -
కొత్త నగరాన్ని తలపించేలా ‘సెంట్రల్ వరల్డ్’
నెల్లూరు సిటీ: కొత్త నగరాన్ని తలపించేలా ‘సెంట్రల్ వరల్డ్’ను ఏర్పాటు చేసినట్లు ఆ వెంచర్ మేనేజింగ్ డైరెక్టర్ బొల్లినేని హజరత్నాయుడు, డైరెక్టర్ హరిబాబునాయుడు తెలిపారు. నెల్లూరు రూరల్లో కనుపర్తిపాడులో గ్రీన్హోమ్ సెంట్రల్ వరల్డ్ వెంచర్ను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరుకు అతి సమీపంలో సెంట్రల్ వరల్డ్ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 50 ఎకరాల విశాలమైన ప్రాంతంలో నుడా, రేరా అనుమతులతో వెంచర్ను ఏర్పాటు చేశామన్నారు. 5 వేల గజాలలో 25 విల్లాలు నిర్మించబోతున్నామన్నారు. వెంచర్లో ప్రత్యేక వాటర్ ట్యాంక్ నిర్మించామని, తద్వారా మున్సిపల్ వాటర్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు. స్విమ్మింగ్ పూల్, పార్కులు, రెస్టారెంట్లు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ప్రారంభం రోజే అత్యధిక ప్లాట్లు బుకింగ్ కావడం సంతోషంగా ఉందన్నారు. అత్యాధునికంగా వెంచర్ను నిర్మించి, అన్ని వసతులు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జ్ఞానశేఖర్, సాయిరామ్, బొల్లినేని ఆనంద్, మల్లికార్జున్రెడ్డి పాల్గొన్నారు. ‘సెంట్రల్ వరల్డ్ వెంచర్ ప్రారంభంలో సందడి -
అటవీ శాఖ వాహనం ఢీకొని..
● ఆర్టీసీ కండక్టర్ మృతి ● మహిళకు గాయాలు ఆత్మకూరు: మున్సిపల్ పరిధిలోని నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై ఇంజినీరింగ్ కళాశాలలో మోటార్బైక్ను ఆత్మకూరు అటవీ శాఖ వాహనం ఢీకొనడంతో యేసుపోగు సుదర్శన్ (57) అనే వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. ఎస్సై ఎస్కే జిలానీ కథనం మేరకు.. ఎంఎస్ఎంఈ పార్కు సమీపంలో నగరవనం పనులను పరిశీలించేందుకు అటవీ శాఖ సిబ్బంది జీపులో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఉదయగిరికి చెందిన ఆర్టీసీ కండక్టర్ సుదర్శన్ ఆత్మకూరుకు బైక్పై వస్తున్నాడు. దారిలో మర్రిపాడు మండలం శెట్టిసముద్రం గ్రామానికి చెందిన జయమ్మ లిఫ్ట్ అడిగి బైక్ ఎక్కింది. ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఫారెస్ట్ సిబ్బంది జీపు కుడివైపునకు తిప్పుకొని రోడ్డు దాటుతూ ఎదురుగా వస్తున్న సుదర్శన్ బైక్ను ఢీకొట్టింది. అతను అపస్మారక స్థితికి చేరుకోగా, జయమ్మకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సుదర్శన్ మృతిచెందాడు. జయమ్మ చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ప్రభుత్వ తీరు దారుణం సైదాపురం: మండలంలోని సైదాపురం – డేగపూడి వరకు దారుణంగా ఉన్న రోడ్డును అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని చెప్పడం దారుణమని సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి అన్నారు. ఆదివారం కలిచేడులో ర్యాలీ చేశారు. గుంతల్లో మట్టి పోసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటగిరి, సర్వేపల్లి రహదారులు దారుణంగా ఉన్నాయని సత్వరమే అభి వృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం బస్సులో ఎక్కి రహదారుల స్థితిగతులపై ప్రయాణికులతో మాట్లాడారు. నేతలు జిలానీఖాన్, ఆదినారాయణ, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
తాతల నుంచి ఈ భూమి మా ఆధీనంలోనే ఉంది
●మా తాతల కాలం నుంచి ఈ భూమి మా ఆధీనంలోనే ఉంది. ఇటీవల దీన్ని వేరే వారి పేరుపై రిజిస్ట్రేషన్ చేశారని తెలపడంతో నిర్ఘాంతపోయా. రిజిస్ట్రేషన్ చేసిన వ్యక్తులను తీసుకురావాలంటే వారు దుబాయ్, కేరళలో ఉన్నారని టీడీపీ నేత రోశిరెడ్డి చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ చేయడానికి వారెవరని ప్రశ్నిస్తే సీఐతో ఫోన్లో బెదిరించారు. రోశిరెడ్డి భూ కబ్జాదారుడనే విషయం గ్రామంలో అందరికీ తెలుసు. ఆయన కుమారుడు మహేష్రెడ్డి రేషన్ బియ్యం మాఫియా లో దిట్ట. వీరి కుటుంబీకులు గ్రామంలో 70 ఎకరాలకుపైగా భూములను ఆక్రమించారు. – అశోక్, బాధిత రైతు, ఆమనిచిరివెళ్ల -
నల్లపరెడ్డి కుటుంబంలో విషాదం
● ప్రసన్న సతీమణి తండ్రి, సీనియర్ న్యాయవాది జనార్దన్రెడ్డి కన్నుమూత కోవూరు : మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన సతీ మణి తండ్రి, నిజామా బాద్ జిల్లాకు చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది కాట్పల్లి జనార్దన్రెడ్డి (80) ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా వయోభారంతోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని తన నివాసంలోనే కన్నుమూశారు. నిజామాబాద్ జిల్లా రెంజల్కు చెందిన జనార్దన్రెడ్డికి సీనియర్ న్యాయవాదిగానే కాక, వ్యక్తిగతంగా మహోన్నతమైన పేరుంది. జనార్దన్రెడ్డికి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన పెద్ద కుమార్తె గీతమ్మను నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వివాహం చేసుకున్నారు. తన మామ మరణవార్త విన్న వెంటనే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి రెంజల్కు బయలుదేరారు. జనార్దన్రెడ్డి మరణానికి చింతిస్తూ పలువురు రాజకీయ నేతలు, న్యాయవాదులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. నల్లపరెడ్డి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో జిల్లాకు ఐదో స్థానం ● ఉత్తమ అవార్డును అందుకున్న కలెక్టర్ నెల్లూరు (దర్గామిట్ట): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో అత్యుత్తమ ఎన్నికల మ్యాపింగ్ను సమర్థవంతంగా అమలు చేసినందుకు రాష్ట్ర స్థాయిలో ఐదో స్థానం దక్కింది. ఈ మేరకు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించిన 16వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ఈ విశిష్ట సాధనకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చేతుల మీదుగా ఈ అవార్డు కలెక్టర్ హిమాన్షు శుక్లా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్, మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ సమక్షంలో అందుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ఎన్నికల యంత్రాంగం సమన్వయంతో చేసిన కృషి ఫలితంగానే ఈ ఘనత సాధ్యమైందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్లోనూ మరింత సమర్థవంతంగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల ఉప తహసీల్దార్ ఆషర్, ఉత్తమ బీఎల్ఓ పర్యవేక్షకుడిగా టీపీగూడూరుకు చెందిన రాంప్రసాద్, జిల్లాలో అత్యధిక మ్యాపింగ్ సాధించిన ఉత్తమ బీఎల్ఓగా బొల్లం వెంకట రమణయ్య కూడా అవార్డులు అందుకున్నారు. విజిలెన్స్ ఇన్స్పెక్టర్కు ఎంఎస్ఎం పురస్కారం నెల్లూరు (క్రైమ్): నె ల్లూరు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ కె. నరసింహరావు పోలీస్ మెడ ల్ ఫర్ మెరిటోరియల్ సర్వీసెస్ (ఎంఎస్ఎం) వరించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏటా కేంద్ర ప్రభుత్వం విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసు అధికారులకు అవార్డులు ప్రకటిస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది పోలీసు అధికారులకు ఆదివారం అవార్డులను ప్రకటించింది. బాపట్ల జిల్లా భట్టిప్రోలు గ్రామానికి చెందిన కుందేటి నరసింహరావు 1996లో ఆర్ఎస్ఐగా పోలీసుశాఖలో బాధ్యతలు చేపట్టి సివిల్ ఎస్ఐగా కన్వెర్షన్ పొందారు. 2011లో సీఐగా పదోన్నతి పొందారు. ప్రకాశం, నెల్లూరు జిల్లా లో విధులు నిర్వహించి ప్రస్తుతం నెల్లూరు విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. పని చేసిన ప్రతి చోట సమర్థవంతమైన అధికారిగా పేరు గడించారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించినందుకు ఈ ఏడాది ఆయనకు ఎంఎస్ఎం లభించింది. నరసింహరావు ఇప్పటి వరకు సేవాపతకం, ఉత్తమ సేవాపతకం, ఉత్కృష్ట సేవాపతకంతోపాటు 182 ప్రశంసాపత్రాలు, అవార్డులను పొందారు. ఆగస్టులో జరగనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్యమంత్రి చేతుల మీదుగా మెడల్ అందుకోనున్నారు. నరసింహరావుకు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. -
ఉత్తరాది రాష్ట్రాల్లో కార్లు దొంగలించి..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆయన అధికార పార్టీ కార్యకర్త. ఓ కానిస్టేబుల్ భర్త. లగ్జరీ జీవితం అనుభవించాలని భావించాడు. ఉత్తరాది రాష్ట్రా ల్లో లగ్జరీ కార్లను దొంగలించి సన్నిహితులతో నంబరు ప్లేట్లు మార్చి, నకిలీ రికార్డులు సృష్టించి విక్రయిస్తూ దొంగసొమ్ముతో విలాసవంతమైన జీవనం సాగిస్తున్నాడు. దొంగ కార్ల కేసులో ఇప్పటికే ఇద్దరు స్నేహితులు పోలీసులకు చిక్కితే.. తమ్ముడు మాత్రం దొరకలేదు. అటు తెలుగు తమ్ముడు.. ఇటు ఖాకీ మొగుడు కావడంతో వదిలేశారన్న ప్రచారం సాగుతోంది. బుచ్చిరెడ్డిపాళెం మండలం మినగల్లు ప్రాంతానికి చెందిన మస్తాన్ టీడీపీ కార్యకర్త. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ నేతలకు దగ్గరయ్యాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం అతని లైఫ్ స్టైల్ ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. ఆయన భార్య నెల్లూరు నగరంలోని ఓ పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తోంది. దంపతులు పోలీసు క్వార్టర్స్లో ఉంటున్నారు. మస్తాన్కు నెల్లూరు బీవీనగర్కు చెందిన కార్ల గ్యారేజ్ నిర్వాహకుడు టి.శివ, తిరుపతిలోని ఓ కార్ల షోరూమ్లో పని చేస్తున్న ఆత్మకూరు పట్టణానికి చెందిన పి. లక్ష్మణ్కుమార్ స్నేహితులు. వీరు ఎలాగైనా డబ్బు సంపాదించి ఆర్థికంగా బలపడాలని నిర్ణయించుకున్నారు. గుట్టు బయటపడిందిలా.. ఇటీవల దర్గామిట్ట పోలీసులు అన్నమయ్య సర్కిల్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఓ కారులో శివ, లక్ష్మణ్కుమార్ అనుమానాస్పదంగా ఉండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో గుట్టు చప్పుడు కాకుండా సాగుతోన్న కార్ల దొంగతనం వ్యవహారం బట్టబయలైంది. దీంతో ప్రధాన నిందితుడు పరారీ కావడంతో శివ, లక్ష్మణ్కుమార్ను అరెస్ట్ చేసి ఐదు లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఢిల్లీలోని పశ్చిమ విహార్, డీబీజీ రోడ్డు సెంట్రల్ డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర నాగపూర్ జిల్లా యశోదరానగర్, హరియాణా రాష్ట్రం జనకపురి పరిధిలో కార్ల దొంగతనాలపై అక్కడి పోలీసులు కేసులు నమోదు చేశారు. దర్గామిట్ట పోలీసుస్టేషన్లో పోలీసు కేసు నమోదైంది. ఇంకెంత కావాలో చెప్పు.. చాలా కార్లు కొట్టుకొస్తా డార్లింగ్ఇంతేనా?ప్రధాన నిందితుడు పోలీస్ భర్త కావడంతో.. ఈ కేసులో ప్రధాన నిందితుడు మస్తాన్ ఓ పోలీస్ కానిస్టేబుల్ భర్త కావడంతో ఇతన్ని పట్టుకునే విషయంలో పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇతని కోసం విస్తృతంగా గాలిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ అందులో నిజం కొంతేనని సమాచారం. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ వద్ద ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడు ఎక్కడున్నాడో పసిగట్టడం పెద్ద పనికాదని, అందులోనూ కానిస్టేబుల్ భర్త కావడం వల్ల తెలుసుకోవడం అంత కష్టం కాదనేది అక్షర సత్యం. నిందితులు ఏ కలుగుల్లో దాక్కున్నా.. ఇట్టే గంటల వ్యవధిలో పట్టుకొచ్చి మీడియా ముందు చూపించి కటకటల వెనక్కి పంపించే పోలీస్ సామర్థ్యం ఈ విషయంలో జాప్యానికి కారణాలు అనేకం ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ప్రధాన నిందితుడు టీడీపీ కార్యకర్త కావడంతోపాటు అతను కార్లను టీడీపీ నేతలకు విక్రయించినట్లు తెలుస్తోంది. ఇతను పట్టుబడితే ఎక్కడెక్కడ ఎన్ని కార్లు అపహరించాడు.. ఎవరెవరికి విక్రయించాడో బయటపడితే.. మరికొందరు టీడీపీ తమ్ముళ్ల అక్రమ బాగోతాలు బయటకు వస్తాయనే భయంతో ఈ వ్యవహారం వెలుగుచూసి రెండు వారాలు అవుతున్నా.. ఇంత వరకు పట్టుకోవడంలో ఖాకీలు కాలయాపన చేస్తున్నట్లు అనుమానించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతర రాష్ట్రాల్లో కార్లను దొంగలించి ఇక్కడికి తీసుకువచ్చి విక్రయించడం అంతా అషామాషీ కాదు. అలాంటి పరిస్థితుల్లో నిందితుడు ఒక్కడే కార్లను దొంగలించాడా? ఆయా రాష్ట్రాలకు చెందిన వారు ఎవరైనా సహకరించారా అనే అనుమానాలు లేకపోలేదు. నిందితుడు దొరికితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో మారిన లైఫ్ స్టైల్ ఖాకీ నీడలో ఖరీదైన కలలు.. అధికార పార్టీ కార్యకర్త ముసుగులో దొంగతనాలు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా మారిపోయిన ‘ఓ తెలుగు తమ్ముడు’ జీవితం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సబ్స్టేషన్లో హెల్పర్గా పనిచేస్తున్నానని చెప్పుకునే వ్యక్తి, ఖాకీ ధరించిన భార్య నీడలో దొంగ సొమ్ముతో లగ్జరీ ఇళ్లు, ఖరీదైన హెయిర్ కట్లు, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఉత్తరాది రాష్ట్రాల్లో కార్ల దొంగతనాల దందాకు మాస్టర్ మైండ్గా మారాడన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. రూ.కోట్ల విలువైన లగ్జరీ కార్లకు నకిలీ పత్రాలు సృష్టించి, నంబర్ ప్లేట్లు మార్చేసి అతి తక్కువ ధరలకు విక్రయాలు చేస్తున్నట్లు బయటపడినా.. ప్రధాన నిందితుడు తెలుగు తమ్ముడు మాత్రం ఇంకా పోలీసుల చేతికి చిక్కకపోవడం వెనుక ‘ఖాకీ సంబంధాలే రక్షణగా మారాయా?’ అనే అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఇతను దొరికితే.. తమ్ముడికి సహకరించే మరికొందరు తమ్ముళ్ల బాగోతాలు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయని పోలీస్ వర్గాల్లోనే హాట్టాపిక్ చర్చ జరుగుతోంది. చేసేది సబ్ స్టేషన్లో హెల్పర్ ఉద్యోగం ఈ కొలువుకు రూ.12 లక్షలు లంచం ఇచ్చుకున్నట్లు ఆరోపణలు ఏడాదిన్నరలోనే లగ్జరీ ఇల్లు కొనుగోలు సినిమాల్లోనూ పెట్టుబడులు ఆయన హేర్ కటింగ్ చేయించుకుంటే రూ.70 వేల ంట! ఢిల్లీ, హరియాణా, మహారాష్ట్రాల్లో ఖరీదైన లగ్జరీ కార్ల అపహరణ నకిలీ పత్రాలను సృష్టించి, నంబరు ప్లేట్లు మార్చి నెల్లూరులోనే అతి తక్కువకే విక్రయాలు ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేసినా తమ్ముడు మాత్రం దొరకలేదంట ఇతను దొంగ దొరికితే.. మరికొందరు తమ్ముళ్ల బాగోతాలు బట్టబయలు! అటు తమ్ముడు, ఇటు ఖాకీ మొగుడు కదా అందుకే వదిలేశారేమో.. విలాసవంతమైన జీవనం కార్ల విక్రయ సొమ్ముతో ప్రధాన నిందితుడు మస్తాన్ విలాసవంతంగా జల్సాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా రూ.12 లక్షల దొంగ సొమ్మును లంచంగా ఇచ్చి పేరుకు సబ్స్టేషన్లో హెల్పర్ ఉద్యోగం సంపాదించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడాదిన్నరలోనే నెల్లూరులో ఖరీదైన ప్రాంతంలో రూ.కోట్లు విలువైన లగ్జరీ ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. సినిమా ఇండస్ట్రీలో సైతం పెట్టుబడులు పెట్టినట్లు ప్రాథమిక సమాచారాన్ని పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది. ఆయన హేర్ కటింగ్కే రూ.70 వేలు ఖర్చు చేస్తున్నాడంటే ఏ స్థాయిలో జీవితం అనుభవిస్తున్నాడో ఇట్టే అర్థమవుతోంది. సినీ రంగంలో పెట్టుబడులు పెడుతూ.. సినిమాల్లోనూ నటిస్తున్నాడని సమాచారం. కార్లను దొంగలించి వాటిని అమ్మి సొమ్ము చేసుకునేందుకు పథక రచన చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో దొంగలిస్తే త్వరితగతిన ఈ వ్యవహారం బయట పడుతుందని భావించి ఉత్తరాది రాష్ట్రాలను ఎంచుకున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, హరియాణాల్లో మకాం వేసి లగ్జరీ కార్లను దొంగలించి నెల్లూరుకు తీసుకువచ్చి శివ గ్యారేజ్లో ఉంచేవాడు. శివ, లక్ష్మణ్కుమార్ సాయంతో ఆ కార్ల నంబర్ ప్లేట్లను మార్చి వాటి స్థానంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నంబర్ ప్లేట్లను అమర్చేవారు. అనంతరం నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి జిల్లాతోపాటు పరిసర ప్రాంతాల్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం కొన్నేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. -
నేడు గణతంత్ర సంబరం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ను సిద్ధం చేశారు. కొద్దిరోజులుగా అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉన్నతాధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. కలెక్టర్ కార్యాలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్కలెక్టర్ కార్యాలయానికి విద్యుద్దీపాలంకరణ -
కంచె తీగలే.. చితులయ్యాయి
ఆ ఇద్దరు గిరిజన యువకులు సమీప బంధువులు. చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో పలకా, బలపం పట్టాల్సిన వయస్సు నుంచే కూలీ పనులు చేస్తూ, చేపల వేట సాగిస్తూ తల్లిదండ్రులకు బాసటగా నిలిచారు. బతుకుదెరువు కోసం తెలంగాణకు వలస వెళ్లి తాపీ పనులు చేస్తూ కుటుంబ పోషణలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. సంక్రాంతిని కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఇంటికొచ్చారు. పది రోజులు సరదాగా గడిపారు. శనివారం రాత్రి వేళ పిల్లాపేరు వాగులో చేపలు పట్టుకునేందుకు వెళ్తుండగా వారి పాలిట విద్యుత్ తీగలు వేటగాళ్లయ్యాయి. మిత్రత్వం ప్రాణాల చివరి వరకూ విడవలేదు. మరణంలోనూ కలిసి కాలి బూడిదయ్యారు. తల్లిదండ్రుల కన్నీళ్లతో తూర్పు రొంపిదొడ్ల ఎస్టీ కాలనీ శోకసంద్రంగా మారింది. ఉదయగిరి/వరికుంటపాడు: తెల్లారితే.. ఆదివారం కావడంతో పిల్లాపేరులో శనివారం రాత్రి సరదాగా టార్చిలైట్ల వెలుగులో చేపల వేటకు బయల్దేరారు. అయితే దారి మధ్యలో పంట రక్షణకు వేసిన కంచె తీగలే వారి పాలిట వేటగాళ్లయ్యాయి. చివరికి చితులయ్యాయి. వరికుంటపాడు మండలం తూర్పురొంపిదొడ్ల ఎస్టీ కాలనీకి చెందిన మేకల తిరుపాలు, నయోమి మూడో సంతానం గణేష్ (19). పేద కుటుంబం కావడంతో చిన్న తనం నుంచి తల్లిదండ్రులకు పనుల్లో ఆసరాగా, ఎదిగొచ్చాక తాపీ మేసీ్త్ర పనిచేస్తూ కుటుంబానికి ఆదరవుగా ఉన్నాడు.అదే కాలనీకి చెందిన తలపల మాలకొండయ్య, సునీత ఇద్దరి సంతానంలో పెద్ద కుమారుడు రమేష్ (17). వీరిది పేద కుటుంబం. రోజూ వారి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. రమేష్ సైతం తన స్నేహితుడు గణేష్తో కలిసి తాపీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. స్థానికంగా పనులు తక్కువగా ఉండడంతో తెలంగాణ ప్రాంతానికి తాపీ పనులు చేసేందుకు వలసపోయారు. సంక్రాంతి వేళ కుటుంబ సభ్యులతో గడిపేందుకు వచ్చిన ఆ ఇద్దరు సోమవారం తిరుగు ప్రయాణానికి బస్సు టికెట్లు రిజర్వు చేసుకున్నారు. అయితే రాత్రి వేళ లైట్ల వెలుగులకు చేపలు పట్ట డం సులువుగా ఉంటుందని సమీపంలోని పిల్లా పేరు వాగు వద్దకు బైక్పై బయల్దేరారు. పొలాల మధ్యలో ఉన్న బాట దారిలో వెళ్తుండగా విద్యుత్ తీగలు మృత్యుపాశాలుగా మారాయి. బైక్తో సహా బూడిద బొంగరాలపాడులో వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన మాదరపు వెంకటేశ్వర్లు కంది పంట సాగు చేస్తున్నాడు. ఆ కంది చేనును అడవి పందుల బారి నుంచి కాపాడుకునేందుకు ఆయన 12 కేవీ లైన్ నుంచి అక్రమంగా విద్యుత్ కంచెను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో దారి పక్కనే విద్యుత్ వైర్లు ఉండటాన్ని గమనించకుండా తూర్పు రొంపిదొడ్ల ఎస్టీ కాలనీకి చెందిన గణేష్, రమేష్ వెళ్తుండగా వాటిని తగులుకుని బైక్తోపాటు ఇద్దరు విద్యుత్ కంచైపె పడ్డారు. దీంతో హైఓల్టేజ్తో బైక్తోపాటు ఇద్దరు కనీసం కడసారి చూపునకు కూడా నోచుకోని విధంగా కాలి బొగ్గులుగా మారారు. ఈ నేపథ్యంలో చేతికొచ్చిన కొడుకులు ఊహించని విధంగా అగ్నికీలల్లో సజీవ దహనం కావడం జీర్ణించుకోలేక ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. కాలనీకి చెందిన ఇద్దరు యువకులు మృత్యువాత పడడంతో స్థానికులు విషాదంలో మునిగిపోయారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం జిల్లాలోని మెట్ట పైర్లు సాగు చేసే ప్రాంతాల్లో రైతులు తమ పంటలను పందులు, జింకలు, ఇతర అటవీ జంతువుల బారి నుంచి రక్షించుకునేందుకు చుట్టూ విద్యుత్ కంచెలు వేస్తున్నారు. ఈ క్రమంలో అడవి జంతువులే కాకుండా, మనుషులు కూడా ప్రమాదం బారిన ఘటనలు అనేకం ఉన్నాయి. దీనిపై విద్యుత్ అధికారులు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. ఈ విషయంపై గ్రామ ప్రాంతాల్లో రైతులకు అవగాహన కల్పించాల్సి ఉన్నా.. పట్టించుకోవడం లేదు. రైతులు పంటలు కాపాడుకునేందుకు సోలార్ విద్యుత్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా ప్రాణాపాయం ఉండదు. కానీ కొంత మంది బడా రైతులు నిర్లక్ష్యంతో అధిక ఓల్టేజ్ ఉండే 11 కేవీ లైన్లను ఉపయోగిస్తున్నారు. ఈ విషయం ఎస్సీడీసీఎల్ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇద్దరు స్నేహితులు సజీవ దహనం మరణంలోనూ వీడని స్నేహ బంధం కడచూపునకు కూడా నోచుకోక విలపించిన తల్లిదండ్రులు శోక సంద్రంగా మారిన తూర్పు రొంపిదొడ్ల ఎస్టీ కాలనీ కఠిన చర్యలు తీసుకుంటాం ఈ విషాదకరమైన ఈ ఘటనకు సంబఽంధం ఉన్న అందరిపైనా కఠిన చర్యలు తీసుకుంటాం. సంబంధిత బాధ్యులైన విద్యుత్ శాఖాధికారులపై చర్యలకు ప్రతిపాదన చేస్తాం. ఈ ఘటనపై ఎవరినీ ఉపేక్షించబోము. దర్యాప్తు చేపట్టి.. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తాం. వెంకట్రావు, సీఐ ఉదయగిరి -
జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు
నెల్లూరు(క్రైమ్): గణతంత్ర వేడుకల నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, పార్కింగ్ ప్రదేశాలు, పార్శిల్ కేంద్రాలు, ప్రముఖ దేవాలయాలు, జనసామర్థ్యం అధికంగా ఉండే ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో ఆదివారం పోలీసు అధికారులు బాంబ్, డాగ్ స్క్వాడ్లతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల వివరాలను అడిగి తెలుసుకుని వారి గుర్తింపుకార్డులను పరిశీలించారు. లగేజీ బ్యాగ్లు, ఇతర వస్తువులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అజిత వేజెండ్ల మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టామన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణే లక్ష్యంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు గమనిస్తే వెంటనే డయల్ 112 లేదా సమీప పోలీసు స్టేషన్కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. నెల్లూరులో నగర ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీల్లో ఇన్స్పెక్టర్లు చిట్టెం కోటేశ్వరరావు, వేణుగోపాల్రెడ్డి, వైవీ సోమయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
కలెక్టరేట్లో ఓటర్ల దినోత్సవం
నెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మొగిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవడం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడవచ్చన్నారు. 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలన్నారు. ఓటు హక్కు కలిగిన సీనియర్ సిటిజన్, నూతనంగా నమోదు చేసుకున్న యువతను జేసీ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయ్కుమార్, ఆర్డీఓ అనూష, కలెక్టరేట్ ఏఓ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. నిమ్మధరలు(కిలో) పెద్దవి: రూ.34 సన్నవి: రూ.20 పండ్లు: రూ.10 -
నైపుణ్యాలతో అంతర్జాతీయ అవకాశాలు
● వీసీ అల్లం శ్రీనివాసరావు వెంకటాచలం(పొదలకూరు): నైపుణ్యాలతో యువతకు అంతర్జాతీయ అవకాశాలు వస్తున్నాయని, డిజిటల్ యుగంలో డేటా విశ్లేషణ, విజువలైజేషన్ నైపుణ్యాలు పారిశ్రామిక రంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాయని విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ఉపకులపతి అల్లం శ్రీనివాసరావు అన్నారు. కాకుటూరులోని వీఎస్యూ ప్రాంగణంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్, స్టాటిస్టిక్స్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో వారం రోజులపాటు నిర్వహించిన జాతీయ స్థాయి వర్క్షాప్ శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులు, పరిశోధకులు కేవలం పుస్తక విజ్ఞానానికే పరిమితం కాకుండా ప్రోగ్రామింగ్, ఆధునిక సాఫ్ట్వేర్లపై పట్టు సాధించాలన్నారు. రిసోర్స్ పర్సన్గా ఢిల్లీ టెక్నాలాజికల్ యూనివర్సిటీ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ రుచికా మల్హోత్రా వ్యవహరించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత తదితరులు పాల్గొన్నారు. -
జగనన్నను మరోసారి సీఎం చేయాలి
నెల్లూరు రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీల నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి.. ప్రతి ఒక్కరూ సమర్థంగా పనిచేసి జగన్మోహన్రెడ్డిని మరోసారి సీఎంను చేయడమే లక్ష్యంగా పోరాడాలని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని గాంధీనగర్లో గల ఆరెస్సెన్ ఫంక్షన్ హాల్లో పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ సంస్థాగత నిర్మాణ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత హాజరయ్యారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. నియోజకవర్గానికి ఎనిమిది వేల నుంచి పది వేల మందితో జగనన్న సైన్యాన్ని ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. 18 లక్షల మందితో ఇలా ఏర్పాటు చేయడం దేశ చరిత్రలోనే ప్రథమమని చెప్పారు. మండలాల వారీగా సమావేశాలను నిర్వహించి విధివిధానాలను ఖరారు చేయనున్నామని ప్రకటించారు. అన్ని వర్గాలను దగా చేస్తున్న సర్కార్ మహిళలు.. రైతులు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా అన్ని వర్గాలను ప్రభుత్వం దగా చేసిందని కాకాణి ఆరోపించారు. చంద్రబాబును నమ్మే స్థితిలో ఎవరూ లేరని పేర్కొన్నారు. కొన్ని పత్రికలు, చానళ్లు కనికట్టు చేస్తూ ప్రజలను నమ్మించేందుకు యత్నిస్తున్నాయని విమర్శించారు. మోసం చేయడంలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో చంద్రబాబు ఉంటారని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం ఈ రాష్ట్రంలో ఆలోచించిన వ్యక్తులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, గత సీఎం జగన్మోహన్రెడ్డి మాత్రమేనని గుర్తుచేశారు. అధికారంలో లేకపోయినా, ఈ రోజు గ్రామాల్లో తలెత్తుకొని తిరుగుతున్నామంటే అది ప్రజలకు జగన్మోహన్రెడ్డి చేసిన మేలేనన్నారు. రాష్ట్రంలో మద్యం మాఫియా విచ్చలవిడిగా సాగుతోందని ఆరోపించారు. బెల్టు షాపులను ఏర్పాటు చేసి వాట్సాప్ గ్రూపుల ద్వారా ఇంటింటికీ డోర్ డెలివరీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం పోవాలని కూటమి నేతలే కోరుకుంటున్నాని చెప్పారు. ఇతరులు చేసిన పనులను కాపీ కొట్టి తానే చేశానని చెప్పుకోవడంలో పెద్ద విజనరీ బాబు అని ఎద్దేవా చేశారు. పింఛన్లలివ్వడం మినహా ఆయన చేసిందేమీలేదని విమర్శించారు. పార్టీ కష్టకాలంలో ఉన్న ప్పుడు ఆదరించిన వారందర్నీ గుర్తుపెట్టుకుంటామన్నా రు. జగనన్న సైన్యంలో ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులను అందజేస్తామని వెల్లడించారు. సముచిత స్థానం పార్టీలో గ్రామ, మండల, వార్డు స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి సంస్థాగత నిర్మాణానికి చర్యలు చేపట్టామని చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. కమిటీల్లో పనిచేసే శ్రేణులకు సముచిత స్థానం, గౌరవం దక్కేలా జగన్మోహన్రెడ్డి చర్యలు చేపట్టనున్నారని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ తమ పార్టీ అధికారంలోకి వచ్చాక సముచిత స్థానాన్ని కల్పించనున్నారని చెప్పారు. కాకాణి గోవర్ధన్రెడ్డిపై బూటకపు కేసును టీడీపీ ప్రభుత్వం బనాయించినా, ఆయనెంతో ధైర్యంగా ఎదుర్కొన్నారని చెప్పారు. అధికార పార్టీ పెట్టే ఎన్ని కష్టాలనైనా తలొగ్గి ఎదుర్కొని నిలిచే శక్తిని కార్యకర్తలకు ఆయన అందించారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది స్థానాలను గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు ● ప్రస్తుత ప్రభుత్వం ఎంతో కాలం ఉండదని గురుమూర్తి చెప్పారు. దాడులు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని, అక్రమ కేసులను బనా యించి ప్రజల గొంతును అణగదొక్కేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రామ కమిటీల నుంచి కార్యకర్తలు వీటిని ఎదుర్కొని పోరాడాలని పిలుపునిచ్చారు. ● అంతులేని అవినీతికి ప్రభుత్వం పాల్పడుతోందని రఘునాథరెడ్డి ఆరోపించారు. అక్రమ కేసులు బనాయించి పైశాచికానందాన్ని పొందుతోందని ధ్వజమెత్తారు. ● తన తండ్రిపై అక్రమ కేసులను బనాయించి జైలుకు పంపిన రోజు కుటుంబానికి అండగా నిలిచింది సర్వేపల్లి ప్రజలేనని పూజిత పేర్కొన్నారు. సహోదరిగా తనకెంతో ధైర్యాన్ని జగన్మోహన్రెడ్డి ఇచ్చారని చెప్పారు. మహిళలకు సంబంధించిన ఒక్క హామీనైనా ప్రభుత్వం అమలు చేసిందానని ప్రశ్నించారు. మహిళలపై దాడులు ఎక్కువవుతున్నాయని మండిపడ్డారు. శ్రేణులు సైనికుల్లా పనిచేయాలి ప్రభుత్వ తీరుపై గుర్రుగా టీడీపీ నేతలు గ్రామ కమిటీలే నిర్ణయాత్మక శక్తులు 18 లక్షల మందితో జగనన్న సైన్యం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి -
కత్తులతో దుండగుల హల్చల్
● భయాందోళనలో గూడూరు ప్రజలు చిల్లకూరు: గూడూరు పట్టణంలో శాంతిభద్రతలు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఏడాదిన్నరగా పట్టణంలో గంజాయి విక్రయాలు, చోరీలు, హత్యలు ఇలా ఒకటి తరువాత ఒకటి చోటుచేసుకుంటుండడంతో పట్టణ ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఈ క్రమంలో శనివారం వేకువజామున పట్టణంలోని తూర్పువీధి ప్రాంతంలో గుర్తుతెలియని నలుగురు వ్యక్తులు కత్తులతో హల్చల్ చేశారు. టూల్కిట్ను చేతిలో పెట్టుకుని వీధుల్లో తిరుగుతూ మూడు నివాసాల్లో చోరీకి పాల్పడేందుకు ప్రయత్నించారు. ఓ ఇంట్లో సుమారు 10 సవర్ల బంగారు వస్తువులు, రెండు కిలోల వెండి వస్తువులు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అటు పోలీసులు, ఇటు బాధితులు వివరాలు వెల్లడించేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం. కత్తులతో దుండగులు హల్చల్ చేసిన సీసీ టీవీ ఫుటేజీ వైరల్ కావడంతో గూడూరు ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు గూడూరుపై ప్రత్యేక నిఘా ఉంచాలని నగర వాసులు కోరుతున్నారు. -
అంతర్ జిల్లాల బైక్ దొంగ అరెస్ట్
● రూ.8.50 లక్షల విలువ చేసే 17 బైక్ల స్వాధీనం నెల్లూరు(క్రైమ్): బైక్ చోరీలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అంతర్ జిల్లాల దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.8.50 లక్షల విలువ చేసే 17 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం వేదాయపాళెం పోలీస్స్టేషన్లో నగర ఏఎస్పీ దీక్ష, ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావుతో కలిసి నిందితుడి వివరాలను వెల్లడించారు. ఇటీవల నెల్లూరులో బైక్ దొంగతనాలు అధికమయ్యాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వేదాయపాళెం పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు బైక్ దొంగలపై నిఘా పెట్టారు. ఆయన శనివారం తల్పగిరి కాలనీ వద్ద తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం సిరసనంబేడు గ్రామానికి చెందిన పాతనేరస్తుడు కల్లూరు శ్రావణ్కుమార్ అనుమానాస్పదంగా ఉండటంతో అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా వేదాయపాళెం పోలీస్స్టేషన్ పరిధిలో నాలుగు, చిన్నబజారు పోలీస్స్టేషన్ పరిధిలో 5, దర్గామిట్ట పరిధిలో 4, సంతపేట పరిధిలో ఒకటి, బాలాజీనగర్ పరిధిలో ఒకటి, తిరుపతి జిల్లా నాయుడుపేట పరిధిలో ఒకటి, తడ పోలీస్స్టేషన్ పరిధిలో బక బైక్ను దొంగలించినట్లు అంగీకరించాడు. దీంతో నిందితుడి వద్ద నుంచి 17 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే అతనిపై తిరుపతి జిల్లాలో సుమారు 20కుపైగా దొంగతనం కేసులున్నాయని, జైలుకు వెళ్లివచ్చినా మార్పు రాలేదని పోలీసు అధికారులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి చోరీ సొత్తును రాబట్టేందుకు కృషి చేసిన ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, ఎస్సై సాయి కల్యాణ్, హెడ్ కానిస్టేబుల్ జిలానీ, కానిస్టేబుల్స్ రాజకిశోర్, శ్రీను, నాగరాజు, వెంకటరామ్, బాలకృష్ణ తదితరులను ఏఎస్పీ అభినందించారు. సమావేశంలో వేదాయపాళెం ఇన్స్పెక్టర్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
రిపబ్లిక్ డే రిహార్సల్స్ పరిశీలన
నెల్లూరు(క్రైమ్): నగరంలోని పోలీస్ కవాతు మైదానం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు అందంగా ముస్తాబవుతోంది. ఈ క్రమంలో శనివారం సిబ్బంది నిర్వహించిన గణతంత్ర దినోత్సవ కవాతు రిహార్సల్స్ను ఎస్పీ అజిత వేజెండ్ల పరిశీలించారు. గౌరవ వందన సమర్పణను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవానికి విచ్చేసే ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వాతంత్ర సమరయోధులు, విద్యార్థులు, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిఒక్కరినీ డీఎఫ్ఎండీ ద్వారా తనిఖీ చేసి కవాతు మైదానంలోకి అనుమతించాలన్నారు. ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలుగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, నెల్లూరు రూరల్, ఏఆర్ డీఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, చంద్రమోహన్, ఎస్బీ ఇన్స్పెక్టర్లు డి.వెంకటేశ్వరరావు, బి.శ్రీనివాసరెడ్డి, ఆర్ఐలు హరిబాబు, రాజారావు తదితరులు పాల్గొన్నారు. -
చేపలకు మేత వేసేందుకు వెళ్లి..
● చెరువులో పడి వ్యక్తి మృతి వెంకటాచలం(పొదలకూరు): చెరువులో చేపలకు మేత వేసేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందిన ఘటన మండలంలోని కసుమూరు పంచాయతీ శ్రీరామపురంలో శనివారం వెలుగుచూసింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన శనగల ప్రసాద్(45) తెప్పపై చెరువులోకి వెళ్లి చేపలకు మేత వేస్తుండగా నీటి ప్రవాహం పెరిగింది. తెప్ప అదుపుతప్పడంతో ప్రసాద్ చెరువులో గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు శనివారం గజ ఈతగాళ్లను రప్పించి చెరువులో గాలించి ప్రసాద్ మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టమ్కు తరలించారు. అయితే చెరువుకు పంచాయతీ వేలం పాట నిర్వహించకుండా అనధికారికంగా చేపలను వదిలినట్టుగా తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన వారు చేపలను వదలారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మద్యం దుకాణంలో చోరీ ● రూ.30 వేల అపహరణ పొదలకూరు: పట్టణంలోని సినీ కాంప్లెక్స్కు సమీపంలో ఉన్న మద్యం దుకాణంలో శుక్రవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. షాపు వెనుక వైపు ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేసిన ఆగంతకులు లోనికి ప్రవేశించారు. షాపులో ఉంచిన సుమా రు రూ.30 వేలను అపహరించుకుని వెళ్లారు. శనివారం షాపు తెరిచేందుకు వెళ్లిన నిర్వాహకులు చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నెల్లూరు నుంచి క్లూస్ టీమ్ వచ్చి ప్రాథమిక ఆధారాలను సేకరించారు. స్థానికులా లేక బయట వ్యక్తులు చోరీకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెయిన్ రోడ్డుకు సమీపంలోనే రాత్రివేళ కూడా జనసంచారం ఉండే సెంటర్లో దొంగతనం జరగడంపై వ్యాపారులు హడలెత్తిపోతున్నారు. ఎస్సై హనీఫ్ కేసు నమోదు చేశారు. -
ఖాకీల మాటునే కోడి పందేలు!
కోవూరు: పోలీస్ యంత్రాంగంలో నిఘా పటిష్టత కొరవడిందా?. అధికార పార్టీ ఒత్తిళ్లతో, అవినీతి ముడుపుల మత్తులో అసాంఘిక కార్యకలాపాలను చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నారా?. విడవలూరు తీర ప్రాంతంలో ప్రతీ వారాంతంలో జరుగుతున్న కోడిపందేలు పోలీస్ శాఖ నిఘా వైఫల్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. వందల బైక్లు, పదుల సంఖ్యలో కార్లు, ఆటోలు, వేల మందితో జాతరను తలపించేలా జరుగుతుంటే పోలీసులకు తెలియకుండా సాగుతుందంటే నమ్మశక్యంగా అనిపించడంలేదు. విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాళెం కాలువ వద్ద రెగ్యులర్గా పెద్ద ఎత్తున కోడి పందేలు జరుగుతున్నాయి. కానీ ఈ విషయం పోలీసుల కు తెలిసినా ఎప్పుడూ ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలా లు లేవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక్కడ కోడిపందేలు విచ్చలవిడిగా జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వారాంతం శనివారం కావడంతో భారీ ఎత్తున నెల్లూరు, కోవూరు, కొడవలూరు, విడవలూ రు, అల్లూరు, ఇందుకూరుపేట తదితర చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వందల మంది కార్లు, బైక్ల్లో పందెం రాయుళ్లు రావడంతో తిరునాళ్ల వాతావరణం మాదిరిగా ఉంది. జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు అందిన సమాచారంతో ఎట్టకేలకు పోలీసులు కోడిపందేల స్థావరానికి చేరుకుని 54 మందిని అదుపులోకి తీసుకున్నామని, రూ.6.24 లక్షల నగదు, తొమ్మిది కార్లు, రెండు ఆటోలు, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నామని ప్రెస్మీట్లు పెట్టి గొప్పలు చెప్పుకున్నారు. కానీ అసలు ప్రశ్న ఇది కాదు. వందల బైక్లు, వందల మంది జనం, పదుల సంఖ్యలో కార్లు కళ్ల ముందు కనిపిస్తుంటే.. మొక్కుబడి అరెస్ట్లు, నగదు, బైక్లు, కార్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పడం చూస్తే హాస్యాస్పదంగా కనిపిస్తోంది. ఈ కోడి పందేల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? కోట్ల రూపాయల్లో జరిగే ఈ దందాను నడిపిస్తున్న పెద్ద తలకాయలు ఎవరు? వాళ్లను టచ్ చేసే ధైర్యం పోలీసులకు లేదా? లేక వాళ్ల పేర్లు బయట పడితే ఖాకీల నిజస్వరూపం బయటకు వస్తుందనే భయమా?.. అనే ప్రశ్నలకు పోలీసుల నుంచి సమాధానం కొరవడిందంటే.. దీని వెనుక అధికార పార్టీ పెద్దలతోపాటు పోలీస్ పెద్ద పాత్ర ఉండొచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇన్నాళ్లు ప్రతీ వారం జరుగుతున్న ఈ కోడిపందేలపై ఒక్క కేసు కూడా ఇప్పటి వరకు నమోదు కాలేదంటే.. ఇప్పటి వరకూ ఖాకీలు నిద్రపోతున్నారా? లేక అవినీతి మత్తులో జోగుతున్నారా? అనే అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఊటుకూరు పెద్దపాళెం కాలువ వద్ద జరుగుతున్న కోడిపందేలు పోలీస్ వ్యవస్థ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది. 54 మంది కోడి పందెం రాయుళ్ల అరెస్ట్ రూ.6.24 లక్షల నగదు, 9 కార్లు, రెండు ఆటోలు, రెండు బైక్లు, 14 కోడి పుంజులు స్వాధీనం సీఐ సురేంద్రబాబు విడవలూరు తీరం అడ్డాగా ప్రతి వారాంతంలో భారీ ఎత్తున నిర్వహణ కిక్కిరిసినట్లు తరలివచ్చిన జనం వందల బైక్లు, పదుల సంఖ్యలో కార్లల్లో రాక పోలీసులకు తెలియకుండానే ఈ స్థాయిలో సమీకరణ జరుగుతుందా? ముడుపుల మత్తులో కళ్లుమూసుకున్నారనే ఆరోపణలు పోలీస్ బాస్కు తెలియడంతో విధిలేని పరిస్థితుల్లో దాడులు మొక్కుబడిగా 54 మంది అరెస్ట్, రూ.6.25 లక్షల నగదు, 9 కార్లు, రెండు బైక్లు, రెండు ఆటోలు స్వాధీనంకొడవలూరు: విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాళెం కాలువ వద్ద జరుగుతున్న కోడి పందేల స్థావరంపై పోలీసులు శనివారం దాడులు చేసినట్లు కొడవలూరు సీఐ ఎ.సురేంద్రబాబు స్థానిక పోలీస్ స్టేషన్లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. పెద్దపాళెం కాలువ వద్ద భారీ స్ధాయిలో కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు.. ఆరుగురు ఎస్సైలు, 15 మంది కానిస్టేబుళ్లతో తాను స్వయంగా దాడి చేశామని తెలిపారు. ఈ దాడిలో 54 మంది పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.6,24,500 నగదు, 9 కార్లు, 14 కోడి పుంజులు, రెండు ఆటోలు, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అదుపులోకి తీసుకొన్న పందెం రాయుళ్లతోపాటు స్వాధీనం చేసుకొన్న నగదు, వాహనాలు, కోడి పుంజులను కోర్టులో హాజరు పరచనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి పాల్గొన్నారు. -
వచ్చారు.. వెళ్లారు..!
● ఎట్టకేలకు కాలు కదిపిన క్వాలిటీ కంట్రోల్ ఈఈ ● అర్ధగంటలోనే ఇరిగేషన్ పనుల పరిశీలన నెల్లూరు(స్టోన్హౌస్పేట): కార్యాలయానికి రాకుండా.. పనుల పరిశీలనకూ వెళ్లకుండా కాలం వెళ్లదీస్తున్న క్వాలిటీ కంట్రోల్ ఈఈ ఎట్టకేలకు తన కాలును శుక్రవారం కదిపారు. ఇరిగేషన్ శాఖలో కతే వేరయా.. అనే శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైన నేపథ్యంలో ఆయనలో కదలికొచ్చింది. సీఎంఓకు కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేయడం.. ఇరిగేషన్ శాఖలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని క్వాలిటీ కంట్రోల్ ఈఈ తన తీరును కొంత మేర మార్చుకున్నారు. నీలగిరి సంఘంలోని వెంకన్న కాలువ, రామిరెడ్డి డ్రెయిన్, ముత్తుకూరు వైపు వెళ్లే రేవపల్లి కాలువలో జరుగుతున్న పనులను హడావుడిగా అర్ధగంటలో పరిశీలించి.. ప్రక్రియను ముగించారు. నిర్మాణాల్లో ఉన్న బొంత రాళ్ల విషయమై ఏఈ, డీఈకి సూచనలు చేసి వెళ్లిపోయారు. ఇన్నాళ్లూ స్పందించని ఆయన తీరులో ఇంత మార్పు రావడం ఆ శాఖ అధికారులనే ఆశ్చర్యపర్చింది. పనివేళలు ముగిసే సమయానికి ఇరిగేషన్ సెంట్రల్ ఆఫీస్కు శుక్రవారం సాయంత్రం ఆయన వచ్చారు. గురువారం జరిగిన విచారణకే మళ్లీ వచ్చారని భావించిన ఆ శాఖ అధికారులు తమ సీట్లనొదిలి పరుగులు తీశారు. ఆ శాఖలో ఏమి జరుగుతుందో దీని ద్వారానే అర్థమవుతోంది. -
వైఎస్సార్సీపీ లీగల్ సెల్లో పలువురికి పదవులు
నెల్లూరు (లీగల్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్లో జిల్లాకు చెందిన పలువురు న్యాయవాదులకు చోటు కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులను జారీ చేసింది. నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది రామిరెడ్డి రోజారెడ్డిని రాష్ట్ర లీగల్ సెల్ జోన్ – 4 వర్కింగ్ ప్రెసిడెంట్గా, నెల్లూరు రూరల్కు చెందిన సిద్ధన సుబ్బారెడ్డిని లీగల్ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా, నెల్లూరు సిటీకి చెందిన నావూరు శ్రీధర్, రమాదేవిని లీగల్ సెల్ రాష్ట్ర సెక్రటరీలుగా, నెల్లూరు రూరల్, కావలికి చెందిన చుండూరు శ్రీధర్రావు, సునీల్కుమార్సింగ్ను లీగల్ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీలుగా, నెల్లూరుకు చెందిన కమలాకర్రెడ్డిని లీగల్ సెల్ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్గా నియమించారు. సీతారామపురం ఎస్సై సస్పెన్షన్ ీసతారామపురం: స్థానిక ఎస్సైగా 15 నెలలుగా విధులు నిర్వర్తిస్తున్న శివకృష్ణారెడ్డిని శుక్రవారం సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యంతో పాటు పలు ఆరోపణల నేపథ్యంలో సంబంధిత యంత్రాంగం విచారణ జరిపి నివేదికను పంపింది. ఈ క్రమంలో సస్పెన్షన్ వేటేశారు. ఉదయగిరి ఎస్సై శ్రీనివాసులుకు ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 64,571 మంది గురువారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకునేందుకు 12 గంటల సమయం పడుతోంది. -
అన్నీ వెతలే..
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రజల సంక్షేమమే పరమావధిగా నాటి సీఎం జగన్మోహన్రెడ్డి ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అమలు చేశారు. ఇందులో భాగంగా నాడు – నేడు కార్యక్రమం కింద సర్కారీ స్కూళ్లను సమగ్రంగా అభివృద్ధి చేసి.. పేద విద్యార్థులకు కార్పొరేట్ తరహాలో బోధనను అందించాలని సంకల్పించారు. మొదటి విడతను పక్కాగా పూర్తి చేసి.. రెండో విడతను ప్రారంభించి నిధులనూ విడుదల చేశారు. ఈ తరుణంలో 2024లో ఎన్నికలు రావడం.. అందులో టీడీపీ విజయం సాధించాక తమ మార్కు రాజకీయాలకు సీఎం చంద్రబాబు పదునుపెట్టి దీనికి నిధులను విడుదల చేయకుండా మీనమేషాలను లెక్కిస్తున్నారు. కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేందుకే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. -
కలెక్టరేట్లో జాతీయ ఓటర్ల దినోత్సవం
నెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరు కలెక్టరేట్ ప్రాంగణంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్లా ఉద్యోగస్తుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ ఎం.వెంకటేశ్వర్లు, నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, డీఆర్వో విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్డన్ సెర్చ్లో 42 వాహనాల స్వాధీనం నెల్లూరు(క్రైమ్): నెల్లూరు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) దీక్ష ఆధ్వర్యంలో శుక్రవారం వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు, నగర పోలీసు అధికారులు, సిబ్బంది వైఎస్సార్ నగర్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బృందాలుగా విడిపోయిన పోలీసులు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వాహనపత్రాలు సక్రమంగా లేని 39 మోటార్బైక్లు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. ముగ్గురు రౌడీషీటర్లు, ఒక సస్పెక్ట్ షీటర్ను గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా దీక్ష మాట్లాడుతూ నేర ప్రవృత్తిని వీడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలు, అనుమాన్పాద వ్యక్తులను గుర్తిస్తే డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. తనిఖీల్లో బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ కె.సాంబశివరావు, ఎస్సైలు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
నెల్లూరు(టౌన్): అండర్ – 19 స్కూల్ గేమ్స్ జాతీయ స్థాయి బాలుర బీచ్ వాలీబాల్ పోటీలకు జిల్లాలోని కావలి జేబీ జూనియర్ కళాశాల సీనియర్ ఇంటర్ విద్యార్థి బాలాజీ, ముత్తుకూరులోని అదానీ జూనియర్ కళాశాల ప్రథమ సంవత్సర విద్యార్థి వి.ఆనంద్ కుమార్ ఎంపికయ్యారు. గతనెల 19 నుంచి 20వ తేదీ వరకు బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో నెల్లూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. అదే విధంగా అండర్ 19 స్కూల్ గేమ్స్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు కావలిలోని జేబీ జూనియర్ కళాశాల ప్రథమ సంవత్సర విద్యార్థి కె.కావ్య ఎంపికయ్యారు. గతేడాది నవంబర్ 11 నుంచి 17వ తేదీ వరకు పల్నాడు జిల్లాలోని వినుకొండలో రాష్ట్ర స్థాయి పోటీలు జరిగాయి. వీటిల్లో కావ్య అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చింది. బాలిక త్వరలో హిమాచల్ప్రదేశ్లో జరిగే పోటీల్లో పాల్గొంటుంది. విద్యార్థులను శుక్రవారం నెల్లూరులోని కేఏసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డీవీఈఓ బీవీ కృష్ణారెడ్డి, ఆర్ఐఓ వరప్రసాదరావు అభినందించారు. కార్యక్రమంలో అండర్ – 19 స్కూల్ గేమ్స్ సెక్రటరీ పాటూరు వేణుగోపాల్రెడ్డి, కబడ్డీ కోచ్ కోటయ్య, ఫిజికల్ డైరెక్టర్ సురేష్ పాల్గొన్నారు. -
అధికారం ఉంది.. మా ఇష్టం
● ఆస్పత్రి వరండాలో లోకేశ్ పుట్టినరోజు వేడుకలువాకాడు: అధికారం ఉందని తెలుగుదేశం నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తమ నేతల పుట్టినరోజు వేడుకలు టీడీపీ కార్యాలయంలోనో.. లేదా ఇతర ప్రాంతాల్లో జరుపుకోవాలి. అంతేగానీ ప్రభుత్వాస్పత్రి వరండాలోనే రోగులకు అసౌకర్యంగా టీడీపీ నేతలు మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు వేడుకలు బుధవారం నిర్వహించడంపై పలువురు విస్తుపోయారు. మండల కేంద్రమైన వాకాడు ప్రభుత్వాస్పత్రి ప్రధాన ద్వారం ఎదురుగా వరండాలో టీడీపీ నేతలు కేక్లు కోసుకుని నినాదాలతో సంబరాలు చేసుకున్నారు. దీంతో రోగులు అసౌకర్యానికి గురయ్యారు. ఎన్నో ప్రభుత్వాలు, నేతలను చూశాం గానీ ఇంతవరకు ఇలా ఎవరూ చేయలేదని స్థానికులు విమర్శలు గుప్పించారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. -
పైసలిస్తేనే సేవలు
నెల్లూరు(అర్బన్): ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కొందరు సిబ్బంది డబ్బుల కోసం రోగులు, వారి బంధువులను పీడిస్తున్నారు. ఎవరికై నా ఆపరేషన్ చేసినా.. కాన్పులు చేసినా ఎఫ్ఎన్ఓలకు పండగే. రోగులకు మాత్రం బాధలు తప్పడం లేదు. ఉదాహరణకు ఓ మహిళకు కాన్పు చేయాలంటే గర్భిణికి సిజేరియన్ చేస్తే ఆమెను వార్డులోకి స్ట్రెచర్లోకి తరలించేందుకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అలాగే చిన్న ఐఅండ్డీ, మేజర్ ఆపరేషన్లు చేసినా రోగుల నుంచి రూ.500 నుంచి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. రోగి డిశ్చార్జి అయ్యే నాటికి కనీసం రూ.1500 వరకు వసూలు చేస్తున్నట్లు ప్రచారముంది. వార్డుల్లో లంచాలను అరికట్టాల్సిన నర్సింగ్ సిబ్బంది తమకేమీ పట్టనట్టున్నారు. పరిస్థితిని చక్కదిద్దాల్సిన డాక్టర్లు, అధికారులు పట్టించుకోకపోవడంతో ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓలు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. రోజూ రూ.100 చొప్పున ఇటీవల హరనాథపురానికి చెందిన స్థానిక రాజకీయ నేత ఓ పేద రోగిని వైద్యం కోసం పెద్దాస్పత్రిలో చేర్పించాడు. అతను రోజూ వెళ్లి రోగితోపాటు సహాయకుడి తిండి, ఇతర ఖర్చుల కోసం రూ.500 ఇచ్చి వెళ్లేవాడు. అది చూసిన ఎఫ్ఎన్ఓలు వార్డును శుభ్రం చేసినందుకు, రోగిని వీల్చైర్లో పరీక్షలకు తీసుకెళ్లినందుకు అంటూ రోజూ రూ.100 నుంచి రూ.200 వరకు వసూలు చేశారు. విషయం తెలిసిన హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు లంచాలు వసూలు చేసిన ఎఫ్ఎన్ఓలను పిలిచి మందలించి తీసుకున్న డబ్బులు వెనక్కు ఇప్పించారు. అల్లాడిపోతూ.. 850 పడకల పెద్దాస్పత్రిలో రోజుకి 1,200 నుంచి 1,400 మంది ఓపీ రోగులు వైద్యం కోసం వస్తున్నారు. 500 మంది వరకు అడ్మిషన్లో ఉంటున్నారు. అడ్మిట్ అయిన వారి నుంచే కాకుండా అవుట్ పేషెంట్లను వీల్చైర్లో పట్టినందుకో.. స్ట్రెచర్లో దించినందుకో డబ్బులు వసూలు చేస్తున్నా కట్టడి చేసేవారు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. లంచాల దెబ్బకు పేద రోగులు అల్లాడిపోతున్నారు.ఇదీ పెద్దాస్పత్రిలో పరిస్థితి డబ్బులివ్వకపోతే బెదిరింపులు ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓల చేతివాటం కాన్పుల వార్డులో రూ.1,000ల డిమాండ్విచారించి చర్యలు తీసుకుంటా డబ్బులు వసూలుపై నాకు ఎవరూ ఫిర్యాదులు చేయలేదు. అయినా విచారించి డబ్బులు వసూలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాను. అంతేకాకుండా అత్యవసరంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి సిబ్బందికి హెచ్చరికలు చేసి నగదు తీసుకోకుండా చర్యలు చేపడతా. – డాక్టర్ కొండేటి మాధవి, సూపరింటెండెంట్, సర్వజన ఆస్పత్రి ధర్మాస్పత్రా? లేక పీడించే ఆస్పత్రా? మేము నిరుపేదలం. నా భర్త అనారోగ్యానికి గురై అసలే టెన్షన్లో ఉన్నాం. ఈ సమయంలో ఎఫ్ఎన్ఓలు డబ్బుల కోసం పీడిస్తున్నారు. ఇది మరింత బాధగా ఉంది. డిమాండ్ చేసి వసూలు చేస్తున్నారు. ఎక్కడ్నుంచి తెచ్చివ్వాలి. ధర్మాస్పత్రా లేదా పీడించే ఆస్పత్రా అర్థం కావడం లేదు. – రాజమ్మ, కొండాయపాళెం -
మార్చురీలోనూ లంచాలకు పీక్కుతింటూ..
● ఎస్సైనూ వదలని వైనం ● రూ.30 వేలు డిమాండ్ చేసిన డాక్టర్ చచ్చిన శవాలను రాబంధులు పీక్కు తింటాయి. అచ్చం అలాగే ఉంది నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(పెద్దాస్పత్రి) మార్చురీ విభాగం తీరు. ప్రమాదంలో మరణించిన వారు, అనుమానాస్పద మరణాలకు సంబంధించిన శవాలను పోస్టుమార్టం చేయాలంటే సంబంధిత ఫోరెన్సిక్ డాక్టర్లకు రూ.వేలకు వేలు లంచాలు సమర్పించుకోవాల్సిందే. లేదంటే పోస్టుమార్టం సకాలంలో చేయకుండా బాధిత కుటుంబాలను ఏడిపిస్తున్నారు. తమ ఆప్తులను పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ పెద్దాస్పత్రిలోని మార్చురీ విభాగంలో లంచాల కోసం కొందరు పీక్కుతింటున్నారు. ఆ డాక్టర్ మాత్రమే వద్దంటున్నాడు కోవూరుకు చెందిన ఓ డాక్టర్ కూడా ఫోరెన్సిక్ విభాగంలో (మార్చురీ)లో పని చేస్తున్నాడు. ఆయన తన డ్యూటీలో ముందుగానే బాధితుల వద్దకు వచ్చి ఎవరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వవద్దని చెబుతాడు. ఎవరైనా లంచం ఇచ్చినట్టు తెలిస్తే వారికి రిపోర్టు కూడా ఇవ్వనని చెప్పి ఆ తర్వాతనే పోస్టుమార్టం చేస్తాడు. ఆ ఒక్క డాక్టర్ డ్యూటీ చేసినప్పుడు సిబ్బంది కూడా భయంగా ఉంటున్నారు. మిగతా సందర్భాల్లో డాక్టర్లు, సిబ్బంది పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. నెల్లూరు(అర్బన్): కొత్తవంగల్లు గ్రామంలో ఇద్దరు వృద్ధ దంపతులు నివసిస్తుండే వారు. అందులో సుశీలమ్మ సుమారు మూడేళ్ల క్రితం మరణించింది. బంధువులు అంత్యక్రియలు కూడా జరిపారు. ఇదిలా ఉండగా మరో కేసులో ఓ మహిళను చంపి జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీని కొడవలూరు ఎస్సై కోటిరెడ్డి విచారణ చేశారు. ఈ క్రమంలో ఆ ఖైదీ కొత్త వంగల్లుకు చెందిన సుశీలను కూడా తాను చంపినట్టు తెలిపాడు. దీంతో ఎస్సై సుశీల కేసును రీఎగ్జామిన్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో చట్టబద్ధంగా లెటర్ తీసుకుని గురువారం నెల్లూరులోని పెద్దాస్పత్రి మార్చురీ వద్దకు వచ్చాడు. గతంలో పూడ్చిపెట్టిన శవాన్ని బయటకు తీసి రీఎగ్జామినేషన్ నిర్వహించాల్సి ఉందని మార్చురీలో ఉండే డాక్టర్లకు తెలిపాడు. దీంతో డాక్టర్లు రూ.30 వేలు ఇస్తే ఇప్పుడే వస్తామన్నారు. అందులో రూ.15 వేలను తమ డిపార్ట్మెంట్ హెచ్ఓడీకి ఇవ్వాలని చెప్పారు. దీంతో ఎస్సై మాట్లాడుతూ వృద్ధురాలికి సంబంధించిన కుటుంబం నిరుపేదలని, వారు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని, తన జేబులో నుంచి రూ.10 వేలు ఇస్తానని చెప్పాడు. దీనికి అంగీకరించకపోతే రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. అయితే రీఎగ్జామినేషన్కు సంబంధించి లెటర్ను ఇస్తే తీసుకోలేదు. దీంతో ఆయన పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవిని కలిసి తనను లంచం అడిగిన తీరు వివరించి లెటర్ తీసుకోవాలని కోరాడు. అయితే డాక్టర్ మాధవి లెటర్ను నిబంధనల మేరకు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్కు ఇవ్వాలని సూచించారు. దీంతో ఆయన మెడికల్ కళాశాల ప్రిన్సిపల్కు అందజేశారు. ఇదే సందర్భంలో ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ అధికారిగా కొనసాగుతున్న డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డిని కలిసి తమను లంచం డిమాండ్ చేస్తున్న వైనాన్ని ఎస్సై వివరించారు. అయితే డిప్యూటీ కలెక్టర్ పద్ధతి ప్రకారం డాక్టర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించాల్సి ఉంది. అయితే కింది స్థాయిలోని ఓ అవుట్ సోర్సింగ్ కార్మికుడు మనోజ్ను పిలిచి డాక్టర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించాడు. బేరం కుదరకపోవడంతో తమ శాఖ హెచ్ఓడీ లేడని శుక్రవారం రావాలని డాక్టర్లు ఎస్సైకు తెలిపారు. నగరంలోని ప్రభుత్వ పెద్దాస్పత్రి మరికొన్ని ఉదాహరణలు.. ఒక కార్పొరేట్ ఆస్పత్రికి ఎండీగా పనిచేసిన (ఇప్పుడు లేదు) వ్యక్తి బంధువుల పోస్టుమార్టానికి గత సంవత్సరంలో రూ.20 వేలు ఇచ్చాడని తెలుస్తోంది. ఈ విషయం హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీకి తెలిసి సదరు డాక్టర్ను నిలదీశారు. అయితే డబ్బులు ఇచ్చిన వ్యక్తి దీని గురించి వదిలేయండి.. అని చెప్పడంతో ఆగిపోయారు. కోవిడ్ సమయంలో ఎంఎన్ఓగా పనిచేసిన ఓ వ్యక్తి పీడించి, పీడించి డాక్టర్లకు ఇవ్వాలంటూ డబ్బులు వసూలు చేశాడు. తర్వాత కాలంలో ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు హెచ్డీఎస్ కమిటీ వారి సిఫార్సుతో ఉద్యోగంలో చేర్చుకున్నారు. ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పటికై నా కలెక్టర్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని బాధితులు కోరుతున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు రీ ఎగ్జామినేషన్ కోసం డాక్టర్లు డబ్బులు డిమాండ్ చేశారని కొడవలూరు ఎస్సై ఓరల్గా చెప్పారు. అయితే ఎవరైనా ఆధారాలతో రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. డబ్బులు వసూలు చేయకుండా చేస్తాం. – డాక్టర్ కె.మాధవి, పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు డిమాండ్ పెద్దాస్పత్రి మార్చురీ విభాగంలో సందర్భాన్ని బట్టి పోస్టుమార్టం నిర్వహించాలంటే రూ.50 వేల వరకు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. అంతేకాకుండా అక్కడ ఒక ప్రైవేటు ఫొటోగ్రాఫర్ తిష్ట వేశాడు. ఆయన డాక్టర్లకు పోలీసులకు మధ్య రాయబారిగా ఉంటూ దండకాలు సాగిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఏ దిక్కులేని నిరుపేదలకు చెందిన వారైతే కనీసం రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆప్తులను పోగొట్టుకుని రోదనలు మిన్నంటుతున్నా డబ్బులు కోసం పీడిస్తున్నారని బాధితులు పేర్కొంటున్నారు. అనాథ శవాలకు పోస్టుమార్టం చేయాలంటే పోలీసులే తమ జేబుల నుంచి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన చెందుతున్నారు. ఇదంతా ఫోరెన్సిక్ విభాగం హెచ్ఓడీ ఆధ్వర్యంలో జరుగుతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
అంతా ఇష్టారాజ్యం
ఉదయగిరి: స్థానిక అటవీ రేంజ్ పరిధిలో పెద్ద పులి సంచరిస్తోందనే వార్తలు ఇక్కడి వారిని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. దుర్గం ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో పెద్ద పులి కదలికలు నిక్షిప్తమయ్యాయి. దాదాపు 120 కిలోలకుపైగా బరువున్న మగ పెద్దపులి సంచరిస్తోందనే అంశాన్ని కొనుగొన్నారు. అయితే ఈ విషయమై వివరాలను అధికారులు నేటికీ వెల్లడించలేదు. కొర్సుకొండ, అన్నంపల్లి, కొత్తపల్లి, దుర్గంపల్లి, ఘాట్ రోడ్డులోని కనుమ బావి ప్రాంతాల్లో కదలికలను గుర్తించారు. పల్లె వాసుల ఆందోళన ఉదయగిరి అటవీ పరిధిలోని ఉదయగిరి – బండగానిపల్లి ఘాట్రోడ్డులో బిజ్జంపల్లికి ద్విచక్రవాహనంలో వెళ్తున్న ఇద్దరికి ఇది గత నెల 23వ తేదీ రాత్రి కనిపించింది. ఆ సమయంలో అధికారులు పరిశీలించి పాదముద్రలను గుర్తించి పులి సంచరిస్తోందనే అంశాన్ని తేల్చారు. మరోవైపు అదే నెల 31 వరకు పలు ప్రాంతాల్లో కదలికలపై అధికారులకు స్థానికులు తెలియజేశారు. అయినా వీరిలో కనీస స్పందన కొరవడిందనే విమర్శలున్నాయి. ఫలితంగా సమీప వ్యవసాయ పొలాల వద్దకు రాత్రి వెళ్లాలంటేనే స్థానికులు జంకే పరిస్థితి నెలకొంది. వెళ్లిపోయిందంటూ ప్రచారం ఇరవై రోజులుగా పులి జాడ లేకపోవడంతో ఇది వెళ్లిపోయిందంటూ అధికారులు ప్రచారం చేశారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా కొండకింద పల్లెలకు ఘాట్ రోడ్డులో ఆటో వెళ్తున్న వారికి ఇది సోమవారం రాత్రి కంటపడింది. ఇదే విషయమై వారు సమాచారమివ్వడంతో ఆ ప్రాంతాన్ని అధికారులు పరిశీలించి పాదముద్రల ద్వారా పెద్ద పులి అని తేల్చారు. ట్రాప్ కెమెరాను పరిశీలించగా, ఈ నెల 18వ తేదీ సాయంత్రం 6.37 గంటల సమయంలో దీన్ని చిత్రం నిక్షిప్తమైంది. అయితే ఇందులోనూ అధికారులు గోప్యత పాటించారు. మరోవైపు ఈ అటవీ ప్రాంతం చుట్టూ అతి సమీపంలో పల్లెలున్నాయి. వీటికి సంబంధించిన వ్యవసాయ భూములూ అడవి చుట్టే ఉన్నాయి. పశువులు, జీవాలను మేపేందుకు అడవిలోకి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో వీరి ప్రాణాలకు ముప్పున్న తరుణంలో అటవీ శాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదయగిరి ఫారెస్ట్ రేంజ్ అధికారి పర్యవేక్షణ లోపంతో కొంతమంది సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ విధులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. దీంతో ఎవరి వ్యాపకాల్లో వారుంటూ అటవీ రక్షణను గాలికొదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్లపడియ అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగల ఉదంతం.. పెద్దపులి సంచారం తదితర అంశాలను స్థానికులు గుర్తించేంత వరకు అటవీ అధికారులకు తెలియకపోవడం గమనార్హం. ఉదయగిరి దుర్గంలో పెద్ద పులి సంచారం హడలిపోతున్న కొండకింద పల్లెలు తూతూమంత్రంగా అటవీ సిబ్బంది చర్యలు -
నంద్యాల ప్రమాదంలో సంగం వాసికి గాయాలు
సంగం: నంద్యాల జిల్లా సిరివెళ్లమెట్ట సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగం మండలం పెరమన గ్రామానికి చెందిన ఓ యువకుడికి తీవ్ర గాయాలైంది. వివరాల మేరకు.. పెరమన గ్రామానికి చెందిన పి.బాబు కుమారుడు పి.హరీష్ సినిమా ఫీల్డ్లో డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఉన్నాడు. సంక్రాంతి సెలవులు కావడంతో ఇంటికి వచ్చిన హరీష్ అనంతరం హైదరాబాద్కు వెళ్లేందుకు బుధవారం పెరమన వద్ద బస్సు ఎక్కాడు. నంద్యాల జిల్లా సిరివెళ్లమెట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరీష్కు గాయాలయ్యాయి. అతన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే కుటుంబసభ్యులు నంద్యాలకు బయలుదేరారు. గుర్తుతెలియని వ్యక్తి మృతి నెల్లూరు సిటీ: సంతపేట పోలీస్స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి (38) మృతిచెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. నగరంలోని బోసుబొమ్మ సెంటర్ ఏబీఎం కాంపౌడ్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు అనారోగ్యంతో మృతి చెందాడా? లేక మరేదైనా కారణమా తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రేషన్ బియ్యం స్వాధీనం మనుబోలు: మనుబోలులో విలువైన రేషన్ బియ్యాన్ని గురువారం సివిల్ సప్లయ్స్ అధికారులు స్వాధీనం చేసుకొని పొదలకూరు గోడౌన్కు తరలించారు. మనుబోలు మండలం బద్దెవోలు క్రాస్రోడ్డు వద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముందు వెళ్తున్న లారీని బడా దోస్త్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో బడా దోస్త్ వాహనంలో ఉన్న 96 బస్తాల రేషన్ బియ్యాన్ని ఎస్సై శివరాకేష్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.3,64,040 ఉంటుందని అధికారులు తెలిపారు. వీటిని సీఎస్ డీటీ ఐ.రవి స్వాధీనం చేసుకుని పొదలకూరు గోడౌన్కు అప్పగించారు. ఆయన వెంట వీఆర్వో నాగార్జున రెడ్డి ఉన్నారు. ఎర్రచందనం దుంగల స్వాధీనం ● నలుగురి అరెస్టు ● కారు, ద్విచక్రవాహనం సీజ్ తిరుపతి అన్నమయ్య సర్కిల్: నెల్లూరు జిల్లా వెంకటాచలం టోల్ప్లాజా వద్ద గురువారం అక్రమంగా కారులో తరలిస్తున్న 28 ఎర్రచందనం దుంగలను టాస్క్ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. దుంగలు తరలిస్తున్న కారును, పైలట్ వాహనంగా వినియోగిస్తున్న ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. రైల్వేకోడూరు సబ్ కంట్రోల్ ఆర్ఐ కృపానంద టీమ్, స్థానిక ఎఫ్బీఓ ఆదిశేషయ్యతో కలిసి నెల్లూరు–గూడూరు మార్గంలో వెళ్తున్న వాహనాలను తనిఖీ చేశారు. వెంకటాచలం టోల్ప్లాజా వద్దకు చేరుకోగా, ఒక మోటారు సైకిల్లో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారితో పాటు వెనకే వస్తున్న ఒక కారును అడ్డగించి నిలిపారు. కారును ఆపిన వెంటనే అందులోని వ్యక్తులు దిగి పారిపోయే ప్రయత్నం చేశారు. టాస్క్ఫోర్సు పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని కారులో తనిఖీ చేయగా ఎర్రచందనం దుంగలు లభించాయి. ఆ నలుగురు వ్యక్తులను నెల్లూరు, తిరుపతి జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. దుంగలతో సహా తిరుపతి టాస్క్ఫోర్సు పోలీస్స్టేషన్కు తరలించారు. డీఎస్పీ వి.శ్రీనివాసరెడ్డి, ఏసీఎఫ్ శ్రీనివాస్ విచారణ అనంతరం ఎస్సై రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జెడ్పీ హైస్కూల్లో కేంద్ర బృందం కోట: స్థానిక ఏవీకేఆర్ జెడ్పీ హైస్కూల్ను ఎన్సీఈఆర్టీ బృందం గురువారం పరిశీలించింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన మనోదర్పన్ కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్లు గిరితేజ్కుమార్ యాదవ్, దీప, లక్ష్మీనరసింహ తదితరులు పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా 9, 10, ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థులతో మాట్లాడారు. మొత్తం 84 అంశాలపై విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి వివరాలు సేకరించారు. ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల స్థితిగతులు, పాఠశాల స్థాయి మొదలగు వాటిపై వివరాలు నమోదు చేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కరుణాకర్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిమ్మధరలు(కిలో) పెద్దవి: రూ.34 సన్నవి: రూ.20 పండ్లు: రూ.10 -
జిల్లాకు 10,444 మెట్రిక్ టన్నుల యూరియా
దిగుమతిని పరిశీలిస్తున్న సత్యవాణి నెల్లూరు(పొగతోట): జిల్లాకు 10,444 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి తెలిపారు. పడుగుపాడు ర్యాక్ పాయింట్లో యూరియా దిగుమతిని గురువారం పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడారు. ఈ నెల్లో 23,577 మెట్రిక్ టన్నులకు గానూ 10,444 మేర వచ్చిందని చెప్పారు. మరో రెండు, మూడు రోజుల్లో 11 వేల మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రానుందని వెల్లడించారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి
● జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న కార్డన్ సెర్చ్లు నెల్లూరు(క్రైమ్): నేరాలను కట్టడి చేసి ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలు అందించేందుకు ఎస్పీ అజిత వేజెండ్ల పటిష్ట చర్యలు చేపట్టారు. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు శివారు ప్రాంతాలు, నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించడంతో పాటుగా పత్రాలు సక్రమంగా లేని వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. గురువారం తెల్లవారుజామున జిల్లాలోని చిల్లకూరు పోలీస్స్టేషన్ పరిధిలోని కృష్ణాపురం, ఆత్మకూరు పోలీస్స్టేషన్ పరిధిలోని పాములవీధి, నెల్లూరు సంతపేట పోలీస్స్టేషన్ పరిధిలోని ఉప్పరపాళెంలో పోలీసు అధికారులు కార్డన్ సెర్చ్ నిర్వహించి 55 బైక్లు, ఐదు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజాము నుంచే.. నెల్లూరు నగర డీఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో నగర ఇన్స్పెక్టర్లు, సిబ్బంది సంతపేటలోని ఉప్పరపాళేన్ని నాలుగు వైపుల నుంచి చట్టుముట్టారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇంట్లోని వారి ఆధార్ కార్డులను పరిశీలించి ఎంతకాలం నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు? ఏం చేస్తున్నారు.. తదితర వివరాలను సేకరించారు. రికార్డులు సరిగాలేని 20 బైక్లను స్వాధీనం చేసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. అనుమానితుల వేలిముద్రలను సేకరించారు. ఈ సందర్భంగా దీక్ష మాట్లాడుతూ నేరనియంత్రణే లక్ష్యంగా చేస్తున్న కార్డన్ సెర్చ్కు ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. చట్టవ్యతిరేక చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా 112కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు సూచించారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర ఇన్స్పెక్టర్లు వైవీ సోమయ్య, చిట్టెం కోటేశ్వరరావు, జి.వేణుగోపాల్రెడ్డి, బి.కల్యాణరాజు, కె.శ్రీనివాసరావు, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కోసం తప్పని పడిగాపులు
సోమశిల: అనంతసాగరం మండలంలో మరలా యూరియా కష్టాలు తలెత్తుతున్నాయని, ఆర్ఎస్కేలలో యూరియా అందుబాటులో లేక డీలర్ల వద్ద కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నామని రైతులంటున్నారు. అనంతసాగరం మండల కేంద్రంలోని సొసైటీ కేంద్రంలో గురువారం యూరియా అందుబాటులో ఉందని తెలిసి సొసైటీ ప్రాంగణంలో రైతులు భారీగా క్యూలైన్లు గట్టి పడిగాపులు కాశారు. యడగారులో నీరిచ్చి యూరియా అందజేయకుండా నానా అవస్థలు పెట్టారని, అలానే ఇప్పుడు కూడా ఎరువులు ఉపయోగించాల్సిన సమయంలో యూరియా అందుబాటులో లేకుండపోవడం దారుణమని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా స్టాక్ తెప్పించి రైతులకు అందజేయకుంటే ధర్నాలకు దిగుతామని రైతులు చర్చించుకుంటున్నారు. -
అర్ధరాత్రి ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం ఏంటి?
● ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నాయకులు రాపూరు: మండలంలోని రాపూరు మద్దెలమడుగు సెంటర్లో పైలాన్ ఉన్న స్తూపం వద్ద మంగళవారం అర్ధరాత్రి మాజీ సీఎం ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడంపై వైఎస్సార్సీపీ నాయకులు అభ్యంతరం తెలిపారు. ఆ పార్టీ మండల కన్వీనర్ బొడ్డు మధుసూదన్రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి బత్తిన పట్టాభిరామిరెడ్డి స్థానిక బాలాజీ కల్యాణ మండపం వద్ద బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2009లో సోమశిల – స్వర్ణముఖి లింక్ కెనాల్ శంకుస్థాపనకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వచ్చి పైలాన్ను ఆవిష్కరించారన్నారు. ఇందుకు గుర్తుగా వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు అప్పట్లో నేతలు చర్యలు తీసుకున్నారన్నారు. అయితే వివిధ కారణాలతో ఆ విగ్రహ నిర్మాణం వాయిదా పడిందన్నారు. పైలాన్ ఉన్న స్థానంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడం దారుణమన్నారు. మరోచోట పెట్టొచ్చు కదా అన్నారు. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని రాత్రికిరాత్రే పెట్టడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయపై జిల్లా నాయకులతో చర్చించి కలెక్టర్ దృష్టి తీసుకెళ్తామన్నారు. సమావేశంలో తిరుపతి పార్లమెంట్ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఖాదర్బాషా, రాష్ట్ర రైతు నాయకులు పిచ్చిరెడ్డి, కోటేశ్వరరెడ్డి, రాపూరు మండల ఉపాధ్యక్షుడు గౌస్పీర్, సెక్రటరీ డీవీ రమణయ్య, నాయకులు ఏటూరు మురళీమోహన్రెడ్డి, రమణారెడ్డి, వెంకటసుబ్బయ్య, డమ్మాయి రమణయ్య తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక శాఖ శకటంలో ‘ఉదయగిరి కోట’కు చోటు
ఉదయగిరి: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో సోమవారం నిర్వహించనున్న శకటాల ప్రదర్శనలో ఉదయగిరి కోటకు చోటు దక్కనుంది. వివిధ శాఖల శకటాలతో పాటు పర్యాటక శాఖకు చెందిన శకటాన్ని ప్రదర్శనలో ఉంచాలని అధికారులతో ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. ఈ క్రమంలో దీన్ని సిద్ధం చేసేలా పర్యాటక శాఖ జిల్లా అధికారి ఉషశ్రీ ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మైపాడు బీచ్, ఉదయగిరి కోటకు అత్యంత ప్రాధాన్యమివ్వనున్నారు. ఉదయగిరి పట్టణంలోని ప్రాచీన కట్టడాలైన రంగనాథ, కృష్ణాలయాలు, దుర్గంపై గల పెద్ద మసీదు, కోటబురుజులు తదితరాలను కనిపించేలా శకటాన్ని తీర్చిదిద్దనున్నారు. నెల్లూరుకు చెందిన ప్రముఖ డిజైనర్ సూర్యప్రకాష్, ఉదయగిరికి చెందిన చరిత్ర పరిశోధకుడు మహమ్మద్ ఖాజా సహకారంతో దీన్ని సిద్ధం చేస్తున్నారు. పోస్టుల్లో నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం నెల్లూరు (లీగల్): జిల్లా న్యాయసేవాధికార సంస్థలో పలు పోస్టుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన పనిచేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ● డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంటాఫీస్ కో ఆర్డినేటర్ ఒక పోస్ట్కు గానూ నెలకు రూ.28,280 నుంచి రూ.89,720 వరకు వేతనం లభించనుందని, గ్రాడ్యుయేషన్ను పూర్తి చేసి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఎమ్మెస్ ఆఫీస్, వెబ్ బ్రౌజింగ్లో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలని చెప్పారు. ● రికార్డు అసిస్టెంట్ నాలుగు పోస్టులకు గానూ సెకండరీ స్టేట్ బోర్డు లేదా సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలని చెప్పారు. ఈ పోస్టులన్నింటికీ 18 నుంచి 42 ఏళ్లలోపు వయస్సు ఉండాలని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఐదేళ్ల సడలింపు ఉంటుందని చెప్పారు. ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్, పరీక్ష ఫీజుగా రూ.వెయ్యి.. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కు చెందిన వారు రూ.500కు సంబంధించిన డీ డీని ఏదైనా జాతీయ బ్యాంక్లో సెక్రటరీ, డిస్ట్రి క్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, నెల్లూరు – 524003 పేరిట తీసుకోవాలని తెలిపారు. ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, డిస్ట్రిక్ట్ కోర్టు కాంపౌండ్, నెల్లూరుకు ఈ నెల 27లోపు పంపాలని కోరారు. వివరాలకు కార్యాలయాన్ని పనివేళల్లో సంప్రదించాలని సూచించారు. ట్రాప్ కెమెరాకు చిక్కిన పులి ఉదయగిరి: స్థానిక అటవీ రేంజ్ పరిధిలో పెద్ద పులి సంచారంపై మిస్టరీ వీడింది. దుర్గం ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలో పెద్దపులి కదలికలు నిక్షిప్తమయ్యాయనే అంశాన్ని అటవీ అధికారులు గుర్తించారు. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కొర్సుకొండ, అన్నంపల్లి, కొత్తపల్లి, దుర్గంపల్లి, ఘాట్ రోడ్డులోని కనుమ బావి ప్రాంతాల్లో దీని సంచారం ఉందని గుర్తించారు. ఓటరు ప్రతిజ్ఞ రేపు నెల్లూరు(పొగతోట): ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని జెడ్పీ కార్యాలయంలో ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నామని సీఈఓ శ్రీధర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి ఓటరు దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించాల్సి ఉందని, అయితే ఆ రోజు సెలవు కావడంతో ఈ మేరకు జరపనున్నామని చెప్పారు. జెడ్పీ అధికారులు, ఉద్యోగులు హాజరుకావాలని కోరారు.


