breaking news
SPSR Nellore District News
-
సోమిరెడ్డి.. అవినీతి అనకొండ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నిత్యం నీతులు వల్లించే సోమిరెడ్డి అవినీతి అనకొండ అని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. సొంత ఆస్తులనే త్యాగం చేశానని చెప్పుకొనే ఆయన ఎవరి కోసం త్యాగం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. దేవుడి భూమిని కాజేసి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పడమే కాకుండా అధికారులతో కూడా తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పిస్తున్న ఘనుడని ఎద్దేవా చేశారు. పెద్ద మనిషనే ఉద్దేశంతో మధ్యవర్తిగా ఉండి పంచాయితీ చేస్తారని డబ్బులను సోమిరెడ్డి దగ్గర ఇరుపక్షాలిస్తే.. పరిష్కారమయ్యాక వారికివ్వకుండా కొట్టేశారని టీడీపీ కార్యకర్తలే వాపోతున్నారని చెప్పారు. సోమిరెడ్డి గెలుపుపై పందెం కాసిన నేతలు, కార్యకర్తలను పిలిచి ఆ మొత్తంలో వాటా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేయడాన్ని చూసి విస్తుపోవడం వారి వంతవుతోందని విమర్శించారు. సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీలో పర్సంటేజీలు వసూలు చేయడం.. బదిలీలకు వచ్చే చిరుద్యోగులను వదలకుండా మామూళ్లను దండుకుంటున్నారని ఆరోపించారు.నగరంలోని శ్రీనివాస మహల్ వద్ద జేబులు కొట్టే అలవాటు సోమిరెడ్డికి గతంలో ఉండేదని, ఇప్పటికీ అదే పంథాను కొనసాగిస్తూ.. ఇంటికెళ్లిన వారి జేబులు తడుముతున్నారంటూ ఆ పార్టీ నేతలే కథలుగా చెప్తున్నారని ఎద్దేవా చేశారు. సోమిరెడ్డి కారెక్కాలంటేనే కాంట్రాక్టర్లు, అధికారులు, వ్యాపారులు భయపడుతున్నారని చెప్పారు. టీడీపీ సర్కార్ కొలువుదీరాక ప్రభుత్వ భూములతో పాటు, దేవుడి మాన్యాలు సైతం దోపిడీకి గురవుతున్నాయని ధ్వజమెత్తారు. కాకుటూరు శివాలయానికి దాత హరిప్రసాద్రెడ్డి ఇచ్చిన 48 సెంట్ల భూమిని రూ.కోటికి లేఅవుట్ యజమానులకు విక్రయించి సొమ్ము చేసుకుంది వాస్తవం కాదానని ప్రశ్నించారు. వీటిని కాపాడాలంటూ దేవదాయ శాఖ కార్యాలయ ఎదుట భక్తులు నిరసన తెలియజేస్తే, వారి మనోభావాలను దెబ్బతీసేలా హేయంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేవస్థానం కోసం రోడ్డు వేశాడని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సోమిరెడ్డి నోరుతెరిస్తే అవినీతి కంపును సర్వేపల్లి ప్రజలు భరించలేకపోతున్నారని చెప్పారు. దేవాలయ భూమిని విక్రయించడం అన్యాయమని ప్రశ్నిస్తున్న తనపై కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పిరికిపందలు పెట్టే కేసులకు భయపడేదిలేదని తేల్చిచెప్పారు. సర్వేపల్లిలో ఇసుక, గ్రావెల్, మట్టి, బూడిదను దోచుకుంటూ, బల్కర్ల నుంచి రౌడీ మామూళ్లు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంట్రాక్ట్ల కోసం ప్రభుత్వ రంగ సంస్థలపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. పామాయిల్ అసోసియేషన్ పేరిట డబ్బుల కోసం సోమిరెడ్డి బెదిరిస్తున్నారంటూ ట్యాంకర్ యజమానులు మీడియా ఎదుట వాపోయారంటేనే ఆయన దోపిడీ ఏ స్థాయిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఆయన అవినీతిని ప్రజలకు తెలియజేస్తున్న ‘సాక్షి’పై కక్షగట్టి కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు.జైల్లో పెట్టించినా ఆయన అవినీతిని ప్రశ్నిస్తూనే ఉంటానని తేల్చిచెప్పారు. న్యాయస్థానాలను ఆశ్రయించి పోరాటం చేస్తామన్నారు. కోర్టులో ఫైళ్ల అదృశ్యం కేసుపై సీబీఐ క్లీన్చిట్ ఇచ్చినా.. సోమిరెడ్డి తన అనుకూల పత్రికల్లో అసత్యాలు రాయిస్తూ పైశాచికానందాన్ని పొందుతున్నారని మండిపడ్డారు. శివాలయ భూములపై కలెక్టర్ విచారణ జరిపించి, ప్రభుత్వానికి నివేదించి.. వీటిని పరిరక్షించి భక్తుల మనోభావాలను కాపాడాలని డిమాండ్ చేశారు. -
పీకలు తెగుతున్నాయ్.. !
సింహపురిలో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమై చేష్టలుడిగి చూస్తుండటంతో అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి. గంజాయి, మద్యం మత్తులో విచక్షణరహితంగా పీకలు కోస్తూ.. హత్యలకూ తెగబడుతున్నారు. జిల్లాలో ఎటు చూసినా నేరప్రవృత్తి పెరిగిపోతోంది. విచ్చలవిడిగా గంజాయి, మద్యం అమ్మకాలు, పేకాట, వ్యభిచార గృహాల నిర్వహణతో అసాంఘిక కార్యకలాపాలు మితిమీరాయి. తమ వ్యాపారాన్ని అడ్డుకుంటున్నారంటూ గంజాయి ముఠాలు ఏకంగా తరిమితరిమి చంపిన ఉదంతం మర్చిపోకముందే.. తాజాగా తమ బైక్కు దారివ్వలేదని సిటీ బస్సు డ్రైవర్ పీక కోశారు. అడ్డుకోబోయిన కండక్టర్పై కత్తులతో దాడి చేశారు. ఇదంతా చూస్తుంటే నెల్లూరుకు ఏమైందనే ఆందోళన వ్యక్తమవుతోంది.సాక్షి టాస్క్ఫోర్స్: జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతోంది. ఎప్పుడు ఏమి జరుగుతుందో.. ఎవరేమి చేస్తారోననే భయం ప్రజలను వెంటాడుతోంది. గత నెల 28న ఉద్యమకారుడు పెంచలయ్య హత్యను మరువకముందే.. మద్యం మత్తులో కొందరు యువకులు సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్పై బ్లేడ్లతో విచక్షణరహితంగా ఆదివారం పట్టపగలు దాడి చేసిన ఉదంతం నగర వాసులను కలవరపాటుకు గురిచేస్తోంది. అధిక శాతం నేరాలు మత్తులోనే జరుగుతున్నాయి.పోలీసులపైనా దాడులుశాంతిభద్రతల పరిరక్షణ, ప్రజారక్షణ చర్యల్లో భాగంగా నిరంతర తనిఖీలు, నేరస్తుల కదలికలపై నిఘా, రౌడీషీటర్లపై పీడీ యాక్ట్లను పోలీస్ అధికారులు నమోదు చేస్తున్నా, నేరాలు అదుపులోకి రావడం లేదు. ఖాకీలపై దాడులు చేసేందుకు సైతం నిందితులు వెనుకాడటం లేదు. నేరాల కట్టడికి మరింత దూకుడును పెంచాల్సిన అవసరాన్ని వరుస ఘటనలు తెలియజేస్తున్నాయి.నూతన ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచిటీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి నేరాలు పెరుగుతున్నాయి. నేరస్తుల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. పాతకక్షలు కత్తులు దూస్తున్నాయి. కిరాయి సంస్కృతి పెచ్చుమీరుతోంది. గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. అసాంఘిక శక్తులు, అల్లరిమూకలు మత్తులో వీరంగం చేస్తున్నాయి. మత్తుకు బానిసలైన వారు తమ అవసరాలకు సరిపడా నగదు కోసం హత్యలకూ వెనుకాడటం లేదు. పెన్నా సమీపంలో జరిగిన జంట హత్యలే దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదంటూ స్థానికులపైనా దాడులు చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదులతో పలువుర్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. లేడీ డాన్, దేవరకొండ సుధీర్, హసన్ గ్యాంగ్లతో పాటు పలువురు రౌడీషీటర్ల వద్ద పెద్ద ఎత్తున గంజాయిని ఇటీవల స్వాధీనం చేసుకొని జైళ్లకు పంపారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా ఓ ధర్మకాటా దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన 117 మద్యం బాటిళ్లను సంతపేట పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. బెల్టుషాపుల్లోనూ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మద్యం, గంజాయిని పూర్తిస్థాయిలో కట్టడి చేయడంతో పాటు నేరస్తులపై మరింత కఠినంగా వ్యవహరించాలని నగర వాసులు కోరుతున్నారు.జోరుగా అసాంఘిక కార్యకలాపాలుజిల్లాలోని కొందరు నిర్వాహకులు ఇళ్లు, లాడ్జిలను వేదికగా చేసుకొని పేకాట కేంద్రాలను నిర్వహిస్తున్నారు. కొన్ని లాడ్జిల నిర్వాహకులతో ముందస్తు ఒప్పందాలు కుదర్చుకొని వారాల తరబడి ఆడిస్తున్నారు. నగరంలోని రెండు లాడ్జిలపై పోలీసులు దాడులు చేసి నిర్వాహకులతో పాటు జూదరులను అరెస్ట్ చేసి రూ.లక్షల్లో నగదు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. -
నూడకు భూ సమర్పయామి
ఉదయగిరి నియోజకవర్గంలో విద్య, వైద్య, వ్యాపార, వాణిజ్య కేంద్రంగా ఉన్న వింజమూరులో విలువైన ప్రభుత్వ భూములపై తమ్ముళ్ల కన్ను పడింది. పట్ణణ భవిష్యత్తు అవసరాలను విస్మరించి సుమారు రూ.70 కోట్ల విలువజేసే ల్యాండ్ను నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా)కి అప్పనంగా కట్టబెట్టేందుకు ఫైల్ను రెవెన్యూ అధికారులు సిద్ధం చేశారు. నియోజకవర్గ ముఖ్య నేత ఆదేశాల మేరకు కావలి – దుత్తలూరు జాతీయ రహదారి పక్కనే (జగనన్న లేఅవుట్ను ఆనుకొని) ఉన్న దీన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం సమర్పించేందుకు చర్యలు చేపట్టారు. నుడా అని పైకి చెప్తున్నా, ఆ ముసుగులో విలువైన భూములను కొట్టేసే కుట్ర కోణముందనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.వింజమూరు (ఉదయగిరి): పట్టణాభివృద్ధి వద్దు.. తమ స్వలాభమే ముద్దు అనే రీతిలో టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. వింజమూరులో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు దీనికి అద్దం పడుతున్నాయి. ఇక్కడి విలువైన ప్రభుత్వ భూమిపై వీరు కన్నేశారు. వాస్తవానికి వింజమూరు నుంచి దుత్తలూరు వెళ్లే జాతీయ రహదారి మార్గంలో జీబీకేఆర్ ఎస్టీ కాలనీని ఆనుకొని జాగీర్ వనం వరకు ఉన్న భూముల ధరలు ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్నాయి. ఇక్కడ అనేక రియల్ ఎస్టేట్ వెంచర్లను ఏర్పాటు చేయగా, స్తిరాస్థి వ్యాపారం జోరుగా సాగుతోంది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 400 మంది లబ్ధిదారులకు నివేశన స్థలాలను ఉచితంగా ఇచ్చి.. జగనన్న కాలనీ పేరుతో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. దీంతో అనేక మంది లబ్ధిదారులు నివాసం ఉంటున్నారు.సంపద సృష్టంట..!గ్రామ సర్వే నంబర్ 839, 1599, 1602, 1603, 1604, 1605, 1608, 1611, 1614, 1616లో 94.53 ఎకరాలను నుడాకు ఇచ్చే అంశమై జిల్లా అధికారులకు ప్రతిపాదనలను తహసీల్దార్ హమీద్ పంపారు. ఈ తరుణంలో భూములను జేసీ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పది రోజుల క్రితం పరిశీలించారు. ఈ క్రమంలో పలువురు అభ్యంతరం వ్యక్తం చేయగా, సంపద సృష్టి కోసం అంటూ వాటిని తిరస్కరించారు. ఈ పరిణామాల క్రమంలో భూములు నుడాకు అప్పగించే ప్రక్రియ త్వరలో పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.ఏదీ ముందస్తు ప్రణాళిక..?ఉదయగిరి నియోజకవర్గంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పట్ణణం వింజమూరు. త్వరలో నగర పంచాయతీ హోదా వచ్చే అవకాశం ఉందని సమాచారం. రెవెన్యూ డివిజన్గా మార్చేందుకూ అవకాశాలున్నాయి. ఇక్కడ గురుకుల పాఠశాల, పాలిటెక్నిక్, వ్యవసాయ కళాశాలలు, మోడల్ స్కూల్, పట్ణణ ప్రజల క్రీడా అవసరాల నిమిత్తం మినీ స్టేడియం తదితరాలను కేటాయించే ఛాన్స్ ఉంది. పారిశ్రామికవాడకు ల్యాండ్స్ను కేటాయించాలనే డిమాండ్ సైతం వినిపిస్తోంది. ఈ తరుణంలో పట్టణ ప్రగతికి ఇవెంతో కీలకం. అయితే వీటిన్నింటినీ నుడాకు కేటాయిస్తే భవిష్యత్తులో ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.భూముల ధరలకు రెక్కలు2022లో జాతీయ రహదారి రావడంతో ఈ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో మామిడి తోటలను కొంతమంది ఎస్టీలు సాగు చేస్తున్నారు. భూముల పరిశీలన నిమిత్తం ఇటీవల వచ్చిన ఎమ్మెల్యే, జేసీ ఎదుట తమ సమస్యను వీరు లేవనెత్తారు. భూముల్లో ప్లాట్లేసి విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయంతోనే అభివృద్ధి చేయాలంటూ శాసనసభ్యుడు చెప్పడంతో వీరు అవాక్కయ్యారు. అర్హత ఉన్నవారికి వేరే చోట ఇస్తామని తెలిపారు. విలువైన భూములను లాక్కొని.. ఎక్కడో తమకెందుకని అవేదన వ్యక్తం చేశారు. రూ.కోట్ల విలువజేసే భూములను కాజేసేందుకు నుడా పేరుతో ప్రభుత్వ పెద్దలు పావులు కదుపుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.గతంలో ఇలా..నుడాకు ప్రతిపాదించిన సర్వే నంబర్లలో జీబీకేఆర్ కాలనీకి చెందిన 53 మంది ఎస్టీలకు 130 ఎకరాలకు లీజు పట్టాలను సీజేఎఫ్ఎస్ పేరుతో 1978లో అప్పటి ప్రభుత్వం అప్పగించింది. వీటిలో కొంత మేర విక్రయించగా, మరికొన్నింటిని సాగు చేయకుండా వదిలేశారు. ఈ తరుణంలో భూములను అన్యాక్రాంతం చేశారంటూ 2010, జూలైలో లీజు ఉత్తర్వులను రద్దు చేస్తూ అనాధీనంగా అప్పటి కావలి ఆర్డీఓ వెంకటేశ్వర్లు మార్చారు. ఈ తరుణంలో కోర్టును కొందరు ఆశ్రయించగా, భూముల్లేని పేదలకు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో మండలంలోని రావిపాడులో డీ ఫారం పట్టాలను కొందరికి ఇచ్చారు. గతంలో ఇచ్చిన లీజును రద్దు చేసినా, వాటిని కొందరు సాగు చేసుకుంటున్నారు.పరిశీలించి.. తగు నిర్ణయం తీసుకుంటాంవింజమూరులో నుడాకు భూముల కేటాయింపు కోసం ప్రతిపాదనలొచ్చాయి. వీటిని పరిశీలించాం. అన్ని విషయాలను పరిగణించి తగు నిర్ణయం తీసుకుంటాం. – మొగిలి వెంకటేశ్వర్లు, జేసీ -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు
సంగం: మండలంలోని తరుణవాయి వద్ద నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొని ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అదే విధంగా సంగం నాలుగు రోడ్ల సెంటర్లో నడిచి వెళ్తున్న ఓ వృద్ధుడు కళ్లు తిరిగి పడి తలకు తీవ్ర గాయమైన ఘటన ఆదివారం జరిగాయి. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని జెండా దిబ్బ గ్రామానికి చెందిన షామీర్ అనే యువకుడు తన ఎఫ్ జెడ్ బైక్పై గ్రామం నుంచి సంగానికి బయలుదేరాడు. తరుణవాయి వద్ద నెల్లూరు వైపు వెళ్తున్న కారు ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో బైక్ను ఢీకొట్టింది. దీంతో షామీర్ తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంగం 108 అంబులెన్స్లో బుచ్చిరెడ్డిపాళెం తరలించారు. వైద్యుల సూచనల మేరకు షామీర్ను నెల్లూరుకు తీసుకెళ్లారు. ● సంగం నాలుగు రోడ్ల సెంటర్ వద్ద చేజర్ల మండలం పెళ్లేరుకు చెందిన సహదేవుడు అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు కింద పడి గాయపడ్డాడు. అతను ఆలయాల్లో గీతాపారాయణం చేస్తుంటాడు. తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని స్థానికులు సంగం ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడ స్టాఫ్ నర్సు వైద్యసిబ్బంది ప్రథమ చికిత్స చేశారు. అనంతరం సంగం 108 అంబులెన్స్లో ఆత్మకూరు వైద్యశాలకు తీసుకెళ్లారు. తలకు తీవ్ర గాయం కావడంతో వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. -
రైలెక్కుతుండగా..
● జారిపడి మహిళ మృతి నెల్లూరు(క్రైమ్): కదిలే రైలు ఎక్కుతూ ఓ మహిళ ప్రమాదవశాత్తు ప్లాట్ఫారం, రైలుకు మధ్యలో పడి మృతిచెందిన ఘటన ఆదివారం నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్లో జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. అసోమ్ రాష్ట్రానికి చెందిన బి.సోనా (35) కుటుంబ సభ్యులతో కలిసి నాగాన్ ఎక్స్ప్రెస్ రైల్లో తాంబరానికి బయలుదేరారు. రైలు స్టేషన్లో మూడోనంబర్ ప్లాట్ఫారంపై ఆగింది. సోనా వాటర్ బాటిల్, స్నాక్స్ కొనుక్కునేందుకు దిగి దుకాణం వద్దకు వెళ్లింది. ఇంతలో రైలు ముందుకు కదలడంతో ఆమె పరుగులు తీస్తూ ఎక్కే ప్రయత్నం చేయగా కాలు జారింది. దీంతో ఆమె రైలు కిందకు వెళ్లిపోయింది. ఫ్లాట్ఫారం, రైలుకు మధ్యలో ఇరుక్కుపోయి తీవ్రగాయమై మృతిచెందింది. స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు ఎస్సై హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రభుత్వ హామీ.. మాటలకే పరిమితం
కందుకూరు: చంద్రబాబు ప్రభుత్వ మాటలకు చేసే పనులకు అసలు పొంతన ఉండదు. కందుకూరును చెత్త రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించామని, చెత్త లేకుండా చేశామంటూ ఊదరగొట్టారు. అయితే సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. అక్టోబర్ 2వ తేదీ నాటికి చెత్త రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. గుట్టలుగా పేరుకుపోతూ.. స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీ సీఎం చంద్రబాబు కందుకూరుకు వచ్చారు. ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డులో సభ జరిగింది. మున్సిపాలిటీని చెత్త రహితంగా తీర్చిదిద్దుతామని, డంపింగ్ యార్డు సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా కనిగిరి రోడ్డులోని దూబగుంట వద్ద నూతన డంపింగ్ యార్డు, చెత్త ప్రాసెస్ మెషినరీని ప్రారంభించారు. కానీ ఇప్పటి వరకూ ఆ యార్డుకు చెత్తను తరలించలేదు. మెషినరీ పూర్తిగా మూలనపడిపోయింది. అదే సందర్భంలో నాడు పట్టణంలోని గుర్రంవారి పాళెం ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డును స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులు పరిశీలించారు. అక్టోబర్ 2వ తేదీ నాటికి యార్డులో ఉన్న చెత్తను పూర్తిగా తొలగిస్తామని, చెత్త రహిత మున్సిపాలిటీగా మారుస్తామంటూ హామీ ఇచ్చారు. కానీ అమలు కాలేదు. ఏళ్ల తరబడి కందుకూరు మున్సిపాలిటీని వేధిస్తున్న సమస్య అలాగే ఉంది. కొండంత ఉన్నా.. ఇటీవల కాలంలో డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్తను ప్రాసెస్ చేసేందుకు తరుణి అసోసియేట్స్ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. దీని ప్రకారం కొంత మెషినరీని ఏర్పాటు చేసిన సంస్థ ప్రక్రియను మొదలు పెట్టింది. ఇప్పటి వరకు 26 వేల టన్నుల వరకు చెత్తను ప్రాసెస్ చేసింది. కాంట్రాక్ట్ ముగియడంతో వారు పనిని ఆపేశారు. వాస్తవానికి డంపింగ్ యార్డులో నేటికీ పేరుకుపోయి ఉన్న చెత్త 40 వేల టన్నుల వరకు ఉంది. ఇంకా రోజూ మున్సిపాలిటీలో చేపట్టే సేకరణ ద్వారా 25 టన్నుల వరకు చెత్త వచ్చిపడుతోంది. ఇప్పటికే కొండలా పేరుకుపోయిన చెత్త ఓవైపు కంపు కొడుతుంటే మరోవైపు కొత్తగా వచ్చి చేరుతున్న దాంతో సమస్య మళ్లీ మొదటికొచ్చినట్టు అయ్యింది. కాగా స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం డంపింగ్ యార్డు సమస్యను పూర్తిగా పరిష్కరించామంటూ ప్రచారాన్ని ఊదరగొడుతుండటం గమనార్హం. కానీ ప్రస్తుతం యార్డులో చెత్త ప్రాసెస్ ప్రక్రియ పూర్తిగా నిలిచిపోవడంతో సమస్య రోజురోజుకూ పెరుగుతుంది. ఇప్పటికే యార్డు సామర్థ్యాన్ని మించి పూర్తి స్థాయిలో నిండిపోయి కొత్తగా పోగవుతున్న దాంతో ఎక్కడ వేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే ప్రభుత్వం తిరిగి కాంట్రాక్ట్ పునరుద్ధరిస్తే తప్ప డంపింగ్ యార్డులో ప్రాసెస్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మున్సిపల్ అధికారులు కూడా తాము ఏమీ చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. దీంతో కందుకూరును పట్టి వేధిస్తున్న చెత్త సమస్య ఇప్పటికే పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డంపింగ్ యార్డులో రోజురోజుకూ పేరుకుపోతున్న చెత్త కుప్పలు కాంట్రాక్ట్ పూర్తి కావడంతో చెత్తశుద్ధిని నిలిపివేసిన సంస్థ 26 వేల టన్నులు ప్రాసెస్ పూర్తి, ఇంకా మిగిలింది 40 వేల టన్నులు అక్టోబర్ 2 నాటికి పూర్తిగా తొలగిస్తామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ హామీ నేటికీ అలాగే సమస్య -
స్పిల్వే నుంచి నీటి విడుదల నిలిపివేత
పొదలకూరు: కండలేరు స్పిల్వే నుంచి నీటి విడుదలను తెలుగు గంగ అధికారులు ఆదివారం నుంచి నిలిపివేశారు. కండలేరు జలాశయంలో ప్రమాదకర స్థాయిలో నీటినిల్వలు ఉన్నాయని, పైతట్టు నుంచి ఊహించని విధంగా నీరు వస్తున్నట్టు ఆందోళన చెందిన అధికారులు స్పిల్వే నుంచి 500 క్యూసెక్కుల నీటిని స్వల్పంగా విడుదల చేశారు. ఇక్కడి నుంచి నీటిని విడుదల చేస్తే ఏటికాలువలో కలిసి మనుబోలు మండలంలోని కొన్ని గ్రామాల మీదుగా సముద్రం వెళ్లాల్సి ఉంటుంది. అయితే మనుబోలు మండలంలోని గ్రామాలకు ఇబ్బందులు కలుగుతాయని, జలాశయానికి పైతట్టు నుంచి నీరు రావడం తగ్గిపోవడంతో స్పిల్వే నుంచి నీటిని నిలిపివేసినట్టు అధికారులు అంటున్నారు.పెన్నానదిలో మృతదేహం ఇందుకూరుపేట: మండలంలోని ముదివర్తిపాళెం వద్ద పెన్నానదిలో ఆదివారం ఉదయం ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. లింగసముద్రం మండలం పెద్దపవని గ్రామానికి చెందిన గుత్తి మల్లికార్జునరావు (52) మృతదేహం నదిలో కొట్టుకురాగా స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై నాగార్జునరెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించారు. మృతుడి జేబులో లభ్యమైన ఆధార్కార్డు ఆధారంగా వివరాలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసు అధికారులు చెప్పారు.117 మద్యం బాటిళ్ల స్వాధీనం నెల్లూరు(క్రైమ్): పోలీసులు దాడులు చేసి అక్రమంగా నిల్వ ఉంచిన 117 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వారి కథనం మేరకు.. నెల్లూరు నగరంలోని కామాటివీఽధికి చెందిన సీహెచ్ మల్లికార్జున అదే ప్రాంతంలో గదిని అద్దెకు తీసుకుని చైతన్య ఎలక్ట్రానిక్ ధర్మ కాటా నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం అతను కావలి ముసునూరులో ఉంటూ రోజు దుకాణానికి వచ్చి వెళ్తున్నాడు. ఆదివారం దుకాణంలో మద్యం బాటిళ్లు అక్రమంగా నిల్వ ఉంచారని సంతపేట పోలీసులకు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ వైవీ సోమయ్య నేతృత్వంలో ఎప్సై బాలకృష్ణ దాడి చేశారు. వివిధ కంపెనీలకు చెందిన 117 మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఎకై ్సజ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. పట్టుబడిన మద్యం ఎక్కడ? ఎప్పుడు? ఎవరి వద్ద కొనుగోలు చేశారు తదితర వివరాలపై ఎకై ్సజ్ అధికారుల సాయంతో ఆరా తీస్తున్నారు. కసుమూరులో కార్డన్ సెర్చ్ ● 46 వాహనాల స్వాధీనం వెంకటాచలం: నేర నియంత్రణ చర్యల్లో భాగంగా పోలీస్ అధికారులు కసుమూరులోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం కార్డన్ సెర్చ్ చేశారు. వాహనపత్రాల్లేని 46 వాహనాలను స్వాధీనం చేసుకున్నా రు. నెల్లూరు రూరల్ డీఎస్పీ జి.శ్రీనివాసరావు నేతృత్వంలో వెంకటాచలం ఇన్స్పెక్టర్ సుబ్బారావు తన సిబ్బందితో కలిసి కసుమూరులోని తిప్ప, బీసీ కాలనీ, పెద్దూరు తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఇళ్లలోని వారి వివరాలను సేకరించారు. వాహనపత్రాల్లేని 39 ద్విచక్ర వాహనాలు, ఏడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులు, రెండు జంటలపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల సంచారం, మత్తు పదార్థాల విక్రయాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్న డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
జూడో జిల్లా క్రీడాకారుల ఎంపిక
ఉలవపాడు: ఉమ్మడి నెల్లూరు జిల్లా జూడో క్రీడాకారుల ఎంపిక ఆదివారం కరేడు గ్రామంలో జరిగింది. జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోటీలు జరిపారు. మొత్తం 25 మంది పాల్గొనగా 14 మంది ఎంపిక చేసినట్లు కార్యదర్శి మురళి తెలిపారు. పి.కావ్య (కావలి), పి.పవిత్ర, సాగర్, బాలాజీ (కొత్తసత్రం), ఎ.సాయిఅక్షిత (వలేటివారిపాళెం), హైమ (లింగసముద్రం), లోకేశ్, ఉదయ్ సందేశ్ (కరేడు), శ్రీను, సందీప్, జె.హర్షిణి (కలిగిరి), ఎం.అల్లూరయ్య, శివప్రసన్నకుమార్ (రంగాపురం), పి.జీవిత (కందుకూరు) ఎంపికయ్యారు. వీరు కర్నూలులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి నెల్లూరు తరఫున పాల్గొంటారని తెలియజేశారు. -
విత్తనాల కోసం వెతుకులాట
పొదలకూరు: జిల్లాలో దిత్వా తుఫాన్తో నార్లు దెబ్బతిన్న రైతులు విత్తనాల కోసం వెతుకులాడుతూనే ఉన్నారు. డీలర్ల వద్ద ధర అధికంగా పలకడంతోపాటు మొలకెత్తుతాయో లేదో అని సందేహపడుతున్న వారు రైతులు సొంతంగా ప్రాసెసింగ్ చేసిన విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. పొదలకూరు పరిసర ప్రాంత పెన్నార్ డెల్టా అన్నదాతలు బుచ్చిరెడ్డిపాళెం, దామరమడుగు, కోవూరు, బత్తులపల్లిపాడు తదితర ప్రాంతాలకు వెళ్లి వరి విత్తనాలను తెచ్చుకుని నార్లు పోసుకున్నారు. భారీ వర్షాల కారణంగా నార్లు, నాట్లు దెబ్బతినడంతో కొందరు తిరిగి నార్లు పోసుకోవాల్సి వస్తోంది. దిత్వా తుఫాన్తో ముసురుపట్టి వర్షం కురిసిన సమయంలో 20 శాతం మాత్రమే నార్లు పోసుకున్నారు. మరో 20 శాతం మంది ముసురులోనే నార్లు పోసుకోవడంతో భారీ వర్షాలకు నష్టపోయారు. ఎన్నో ఇబ్బందులు రైతులు వరిసాగు కోసం విత్తన సేకరణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బహిరంగ మార్కెట్లో లభ్యమవుతున్న విత్తనాలు సరిపోవడం లేదు. దీనికితోడు సాగు చేయాలనుకునే రకాలు లభ్యం కాకపోవడంతో కర్షకులు గ్రామాలు తిరగాల్సి వస్తోంది. పొదలకూరు మండలం బత్తులపల్లిపాడులో సౌత్మోపూరుకు చెందిన వారు విత్తన శుద్ధి చేసి (ప్రాసెసింగ్) విక్రయిస్తున్నారు. కేఎన్ఎం 1638, ఆర్ఎన్ఆర్ 15048 (షుగర్ లెస్) రకాలను 25 కిలోల సంచి రూ.1,100కు అమ్ముతున్నారు. ఈ ప్రాంతంలో కొందరు అన్నదాతలు అక్కడే విత్తనాలను తీసుకెళ్తున్నారు. మరికొందరు కేఎన్ఎం 12510, 7715 రకాలను సాగు చేస్తున్నారు. గతేడాదే జిల్లాలో ఈ రకాలను సాగు చేయడంతో పరిమితంగా విత్తనాలు లభ్యమవుతున్నాయి. దీంతో రైతులు 12510, 7715 రకం సాగు చేసిన వారి నుంచి విత్తనాలను సేకరించారు. ఈ రకం విత్తనాలు మంచి దిగుబడినిస్తుందని చెబుతున్నారు. కేఎన్ఎం 12510 రకం ఎకరాకు ఐదు పుట్లు దిగుబడినిస్తుందని సాధారణ రకం కంటే 20 రోజులు పంటకాలం పెరుగుతుందని అంటున్నారు. ప్రభుత్వం నుంచి విత్తనాలపై ఎలాంటి రాయితీ లేకపోవడం, అవసరమైనవి అందుబాటులో ఉంచకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. నార్లు పోసుకోవాలంటే రైతులకు ఇబ్బందులు దిత్వా తుఫాన్కు నీటి మునిగిన నారుమళ్లు విత్తన సేకరణకే రూ.వేలు వెచ్చిస్తున్న వైనం జిల్లాలో 20 శాతమే నార్లు పోసిన కర్షకులు వరి విత్తనాలకు అందని రాయితీలు -
హామీకి టీడీపీ కట్టుబడాలి
● పేర్నాటి శ్యామ్ప్రసాద్రెడ్డి కోట: గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపే విషయమై ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీపై సీఎం చంద్రబాబునాయుడు కట్టుబడి ఉండాలని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు పేర్నాటి శ్యామ్ప్రసాద్రెడ్డి అన్నారు. ఆయన అల్లంపాడులో శనివారం మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని చంద్రబాబు గూడూరులో జరిగిన సభలో హామీ ఇచ్చారన్నారు. అదేవిధంగా కోటలో జరిగిన యువగళం పాదయాత్ర బహిరంగ సభలో లోకేశ్ కూడా హామీ ఇచ్చారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నేతలు సైతం గూడూరు సెగ ఢిల్లీకి చేరేలా తమ గళాన్ని వినిపించాలన్నారు. ప్రజల మనోభావాలను ప్రతి పార్టీ గౌరవించాలన్నారు. నాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి పార్లమెంట్ స్థానాల వారీగా జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు. అప్పుడు ఎక్కడా సమస్య రాలేదన్నారు. ఇప్పుడు ఇచ్చిన మాట తప్పడం వల్లే గూడూరు ప్రజలు అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారన్నారు. గూడూరుపై తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి తీసుకునే నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటామన్నారు. పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణారెడ్డి, సర్పంచ్ ఈశ్వర్రెడ్డి, ఉప సర్పంచ్ దేవరాల రాంబాబు పాల్గొన్నారు. -
మార్కెట్లోకి యమహా కొత్త బైక్లు
నెల్లూరు (టౌన్): దర్గామిట్టలోని గోల్డ్ ఫీల్డ్స్ యమహా షోరూంలో శనివారం ఎక్స్ఎస్సార్ 155, ఎఫ్జెడ్ రేవ్ నూతన బైకులను కర్ణాటక బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ కె.మధు మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా గోల్డ్ఫీల్డ్స్ ఎండీ హరీష్ మాట్లాడుతూ యమహా ఆర్ఎక్స్ 100 లెగసీని ఈ తరానికి అందించాలన్న ఉద్దేశంతో యమహా న్యూ రెట్రో, మోడల్ యమహా ఎక్స్ఎస్సార్ 155ను నాలుగు రంగుల్లో కొత్త ఫ్యూచర్స్తో తీసుకొచ్చారన్నారు. దీంతో పాటు మరో మోడల్ ఎఫ్జెడ్ రేవ్ న్యూ ఫ్యూచర్స్తో తీసుకొచ్చారన్నారు. ఎక్స్ఎస్ఆర్ 155 లిక్విడ్ కూల్ ఇంజిన్తో పాటు అప్ అండ్ డౌన్ సస్పెన్షన్ కలిగి డ్యూయల్ చానల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టంతో వచ్చిందన్నారు. ఈ బైక్ షోరం రూ.1,50,724లుగా ధర కాగా, ఎఫ్జెడ్ రేవ్ షోరూం ధర రూ.1,17,218లుగా నిర్ణయించారన్నారు. కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ రామకృష్ణ, మేనేజర్ సారథి, అడ్మిన్ మేనేజర్ ప్రసాద్ పాల్గొన్నారు. -
‘పొదుపు’లో గోల్మాల్
● గ్రూపుల వద్ద వీఓఏల చేతివాటం ● కలెక్టర్కు ఇటీవల ఫిర్యాదు కలువాయి(సైదాపురం): మండలంలోని పొదుపు సంఘాల గ్రూపులకు లోన్లు ఇప్పిస్తూ వీఓఏలు భారీ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కలువాయి మండలంలో ఎన్ఆర్ఎల్ పోర్టల్ ద్వారా లోన్ అఫ్రూవల్ కోసం మోక్రో క్రెడిట్ ప్లాన్ ఇచ్చేందుకు మండల స్థాయి ఏపీఎంలకు వెయ్యి, వీఓఏ, సీసీకి రూ.4 వేలు నుంచి రూ.10 వేలు ఇలా బ్యాంకు దగ్గరకు లోన్ కోసం వచ్చే ప్రతి పొదుపు గ్రూప్ దగ్గర వీఓఏలు నగదు తీసుకుంటున్నారు. సహకరిస్తున్న బ్యాంక్ మేనేజర్లు ఏ బ్యాంక్ అయినా పొదుపు గ్రూపులకు రుణం ఇచ్చేందుకు లోన్ సెట్లను ఉచితంగా ఇచ్చి వివరాలు పొందుపరిచి అప్రూవల్స్ చేయాల్సి ఉంది. ఇయితే అందుకు భిన్నంగా బ్యాంకులో ఉండాల్సిన లోన్ సెట్లను వీఓఏలకు అప్పజెప్పి బ్యాంక్ మేనేజర్ సైతం సహకరిస్తున్నట్లు పొదుపు మహిళలు తెలుపుతున్నారు. ఇటీవల కాలంలో వెంకట్రామరాజుపేట గ్రామానికి చెందిన బాపూజీ, పూజిత గ్రూపులకు లోన్లు ఇచ్చేందుకు వీఓఏకు బ్యాంకు లోన్సెట్ల డబ్బులు చెల్లించి మరీ లోన్కు వెళ్లిన పరిస్థితి. లోన్ అప్రూవల్ కాగానే వెంటనే వారి వ్యక్తిగత ఖాతాలకు నగదు జమ చేసే సమయంలో ఆ సంఘ వీఓఏలకు వారు అడిగిన నగదు చెల్లిస్తేనే మేనేజర్లకు చెప్పి నగదు జమ చేయిస్తున్న సందర్భం కుల్లూరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో నెలకొంది. పీజీఆర్ఎస్లో సైతం కుల్లూరు గ్రూపులలో అవినీతి జరుగుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్లాకు సాయిబాబా గ్రూప్ సభ్యుల ఫిర్యాదు మేరకు ఏపీఎం రవి, కుల్లూరు క్లస్టర్ సీసీ ధనమ్మతో గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. కుల్లూరు సంధ్యా గ్రూపులో ఒక సభ్యురాలికి రూ.50 వేల రుణం ఇస్తూ అక్కడికక్కడే వీఓఏ రూ.1500ల నగదు తీసుకున్నట్లు తెలిసింది. వీటిపై చర్యలేవీ గతంలో కలువాయి వీఓఏ బినామీ పేర్లతో వీఓఆర్ఎఫ్ కింద రూ.60 లక్షలు తీసుకుని ఇప్పటి వరకు ఒక్కపైసా కూడా చెల్లించలేదు. దీనిపై మండలాధికారులకు వాటాలు వెళ్తుంటే ఇక రీకవరీలు ఏమీ జరుగుతాయని పొదుపు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాదన్నగారిపల్లి, దాచూరు, తోపుగుంట గ్రామాల్లో పనిచేస్తున్న వీఓఏలను ఇటీవల టీడీపీ నాయకులు తొలగించి అనుకూలమైన వారికి నియమించుకున్నారు. నాయకులకు బినామీ పేర్లతో ఒక కుల్లూరు గ్రామంలోనే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల కింద 20 మందికి అప్రూవల్ పెట్టి రూ.50 వేలు నుంచి రూ.75 వేలు లోన్ తీసుకునే సదుపాయాన్ని రెడీ చేసుకున్నారు. అలాగే గ్రామ నిధి అని పొదుపులో ఉన్న మహిళలకు బినామీ పేర్లతో 15 మందికి రూ.50 వేల చొప్పున తీసుకునేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. గతంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.30 లక్షల మేర అవినీతికి పాల్పడిన సీసీ భవాని సస్పెండ్ అయినా అధికారుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. గతంలో వెలుగు సీసీగా పనిచేసిన పుల్లయ్య పెరంకొండలో సంఘం బంధం నుంచి రూ.లక్ష నగదు హెచ్డీ అమౌండ్ స్వాహా చేసినా ఒక్క రూపాయి రికవరీ చేయలేదు. పర్లకొండ, చీపినాపి, వేదనపర్తి, నూకలపల్లి, తెలుగురాయపురం గ్రామాల్లో బినామీ పేర్లతో స్వాహా చేయడమే వీఓఏల ముఖ్య ఉద్దేశం. న్యూట్రీ గార్డెన్ కింద రూ.15 లక్షల గోల్మాల్ జరిగినా అధికారులు ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు. మండల కేంద్రమైన కలువాయిని వదిలి కేవలం కుల్లూరు క్లస్టర్ పైనే వెలుగు అధికారులు కపట ప్రేమ చూపించడం పట్ల ఉన్నతాధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని పొదుపు మహిళలు కోరుకుంటున్నారు. -
టెన్త్ విద్యార్థులకు వంద రోజుల ప్రణాళిక
నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు శనివారం నుంచి వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నట్లు డీఈఓ బాలాజీరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు రెమిడియల్ క్లాసులు, 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయా సబ్జెక్టులపై అవగాహన ఉంటుందన్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు చిన్నారులకు సూచించిన సబ్జెక్టులపై అసెస్మెంట్ చేయాలన్నారు. పేపర్లను ఆయా రోజు వాల్యుయేషన్ చేసి ఆన్లైన్లో మార్కుల ఎంట్రీతో పాటు విద్యార్థులతో రివ్యూ చేయాలన్నారు. ఏ, బీ గ్రూపు విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ ప్రోగ్రామ్, సీ, డీ గ్రూపు విద్యార్థులకు రైజింగ్ స్టార్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలన్నారు. ఈ వంద రోజుల పాటు విద్యార్థులు సెలవు పెట్టకుండా తల్లిదండ్రులు తగిన శ్రద్ధ తీసుకోవాలన్నారు. పాఠశాల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు త్రికరణ శుద్ధితో కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. -
వర్సిటీ స్థాయి అథ్లెటిక్స్ మీట్ ప్రారంభం
కావలి (అల్లూరు): విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ స్థాయి అథ్లెటిక్స్ మీట్ శనివారం కావలి జవహర్ భారతి డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ తొలి నుంచి జవహర్ భారతి కళాశాల క్రీడలకు ఆటపట్టు అని, గెలుపోటములను స్వీకరించే క్రీడా స్ఫూర్తిని క్రీడాకారులు అలవర్చుకోవాలని కోరారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ సీహెచ్ వెంకట్రాయలు మాట్లాడుతూ గెలుపు కోసం పోరాడే నైపుణ్యాలు, పోరాట పటిమలను క్రీడల్లో పాల్గొనడం వల్ల అలవడుతాయని తెలియజేశారు. అథ్లెటిక్ మీట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ పి.ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులందరూ పోటీల్లో ఆసక్తిగా, ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. యూనివర్సిటీ ఫిజికల్ డైరెక్టర్ ఎ.ప్రవీణ్కుమార్ అథ్లెటిక్ మీట్ పురుషుల జట్లకు పరిశీలకుడిగా, సూళ్లూరుపేట డిగ్రీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ అమ్మాజీ సీ్త్రల జట్లకు పరిశీలకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో వివిధ డిగ్రీ కళాశాలల వ్యాయామ అధ్యాపకులు, క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేశారు. -
నాడు.. రైతే.. రారాజు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాపై ఇటీవల తుఫాన్లు చూపిన ప్రభావం అంతా ఇంతా కాదు. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించగా, పొలాలు చెరువులను తలపించాయి. మోంథాతో అరటి తోటలు, వరి, వేరుశనగ పంటలను రైతులు తీవ్రంగా నష్టపోయారు. తాజాగా దిత్వాతో వేలాది ఎకరాల్లో నారుమడులు, నాట్లు, శనగ పంటలు దెబ్బతిని అన్నదాతలు నిండా మునిగిపోయారు. ఇంత జరుగుతున్నా, కర్షకులను ఆదుకునే అంశంలో ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. పరిహారం మాట అటుంచితే.. రైతులను కనీసం పరామర్శించాలనే ఆలోచన సైతం వీరికి రాలేదు. జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా, ప్రయోజనం శూన్యం. సమీక్ష జరిపి నష్ట నివేదికను రూపొందించాలనే ధ్యాసా కరువైంది. కష్టం నీటిపాలు అక్టోబర్ 27, 28న సంభవించిన మోంథా తుపాన్తో 1320 హెక్టార్లలో కోతకొచ్చిన వరి.. 44.9 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఇవన్నీ అధికారిక లెక్కలే. పంట నష్టపోయిన అన్నదాతలు, పాడి రైతులకు రూపాయి సాయం నేటికీ అందలేదు. ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వకపోవడం.. ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేయడంతో కర్షకులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాల తీవ్రతకు 24 పెద్ద పశువులు, ఏడు గొర్రెలు, 600 కోళ్లు మృతి చెందాయి. ప్రజలకూ పంగనామాలే.. మోంథా తుఫాన్ సమయంలో లోతట్టు ప్రాంతాల్లో 11 వేల మంది ప్రజలు కష్టాలు పడగా, వీరిలో 3977 మందిని 117 పునరావాస కేంద్రాలకు తరలించామని మొదట ప్రకటించారు. ఈ తరుణంలో నిత్యావసర సరుకుల పంపిణీపై ప్రభుత్వం ప్రకటన చేయగానే, టీడీపీ నేతల కోసం ఈ సంఖ్యను 8930కు పెంచారు. మొత్తమ్మీద రూ.96.27 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారికంగా ప్రకటించినా, ఈ సంఖ్య వాస్తవంగా ఎక్కువే. రిలీఫ్ క్యాంపులకు తరలించిన వారికి తుఫాన్ తీవ్రత తగ్గిన నాలుగైదు రోజుల తర్వాత 25 కిలోల బియ్యం, కందిపప్పు, చక్కెర, ఎర్రగడ్డలు, బంగాళాదుంపలను కిలో చొప్పున, లీటర్ పామాయిల్ను అరకొరగా అందజేశారు. అధికార పార్టీకి సంబంధించిన స్థానిక నేతల కనుసన్నల్లో ఈ వ్యవహారం జరగడంతో తమ వారికే పంపిణీ చేయించుకున్నారు. అండగా నిలిచిన వైఎస్సార్సీపీ శ్రేణులు దిత్వా సమయంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను కనీసం పునారావాసాలకు తరలించలేదు. దీంతో బాధితులకు భోజన సదుపాయాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, మరికొందరు కల్పించారు. ఈ పరిణామాల క్రమంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తోందంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలతో అనంతసాగరం మండలంలో పాచిపోయిన నారుమడులు ముంచిన దిత్వా దిత్వా తుఫాన్ నాటికి జిల్లాలో వేలాది ఎకరాల్లో నాట్లేశారు. అధికారిక లెక్కల మేరకు 6970 హెక్టార్లలో నాట్లు, నారుమడులు.. 557.5 హెక్టార్లలో శనగ పంట దెబ్బతినిందని ప్రకటించారు. వాస్తవానికి డెల్టా ప్రాంతంలోనే వేలాది ఎకరాల్లో నాట్లు జరుగుతున్నాయి. సుమారు 25 వేల ఎకరాల్లో వరినాట్లు, నారుమడులు మునిగి కుళ్లిపోతున్నాయి. పొలాల నుంచి వరద నీరు పూర్తిస్థాయిలో ఇప్పటికీ బయటకెళ్లలేదు. దీంతో నాట్లేసిన రైతులు ఎకరాకు రూ.30 వేల చొప్పున.. నారుమడులేసిన వారు ఎకరాకు రూ.ఐదు వేల చొప్పున నష్టపోయారు. ఇంత జరిగినా మంత్రులు నారాయణ, రామనారాయణరెడ్డి ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. నష్టంపై సమీక్షా జరపలేదు. తూతూమంత్రంగా ఎన్యూమరేషన్ చేసి నష్టాన్ని తగ్గించి చూపి కాకి లెక్కలేశారు. మరోవైపు రైతులను ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి తాను లేఖ రాశానని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గొప్పలు చెప్పుకొన్నారు. అయితే క్షేత్రస్థాయిలో సాయమందించిన దాఖలాల్లేవు. తుఫాన్ల తాకిడికి కుదేలు పరిహారం లేదు.. పరామర్శపై ధ్యాసేదీ..? మోంథా నష్టంపై మొక్కుబడిగా ఎన్యూమరేషన్ దిత్వాతో సమస్య మరింత తీవ్రం సమీక్షలు సైతం జరపని అధికారులు, మంత్రులు అన్నదాత పరిస్థితి దయనీయం 35 రోజుల వ్యవధిలో జిల్లాపై మోంథా, దిత్వా తుఫాన్లు పంజా విసిరాయి. వీటి ప్రభావానికి కురిసిన భారీ వర్షాలతో అన్నదాతలు కుదేలయ్యారు. పంట నష్టపోయి దయనీయ స్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో వీరికి భరోసానివ్వాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. వ్యవసాయమే దండగ అంటూ గతంలో ప్రకటించిన చంద్రబాబు.. ప్రస్తుతం అదే పోకడను అవలంబిస్తూ రైతులపై నిర్దయ చూపుతున్నారు. దిక్కుతోచక విలవిల్లాడుతున్న కర్షకులకు పరిహారాన్ని అందించే విషయం పాలకులకు ఏ మాత్రం పట్టడంలేదు. గతంలో ఇలాంటి విపత్తులు ఎదురైన సమయాల్లో నాటి సీఎం జగన్మోహన్రెడ్డి ఎంతో ఉదారంగా స్పందించి వీరికి చేయూతనిచ్చేవారు. అప్పటికీ.. ఇప్పటికీ మధ్య వ్యత్యాసాన్ని గమనిస్తున్న రైతులు.. ప్రస్తుత సర్కార్ తీరుపై భగ్గుమంటున్నారు. ప్రకృతి విపత్తులనేవి సర్వ సాధారణం. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనూ ప్రకృతి ప్రకోపానికి ఇవి సంభవించాయి. అయితే ఆ సమయంలో సీఎంగా ఉన్న జగన్మోహన్రెడ్డి రైతులకు అండగా నిలిచారు. సబ్సిడీపై విత్తనాలు.. ఉచిత పంటల బీమా ద్వారా అన్నదాతలకు భరోసానిచ్చారు. అయితే ప్రస్తుతం ఇవేవీ అందించకుండా సర్కార్ నిర్లిప్త ధోరణిని అనుసరిస్తోంది. ఇప్పటి కూటమి సర్కార్ను.. నాటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రైతులు బేరీజేసుకుంటున్నారు. టీడీపీ సర్కార్ తీరుతో తాము తీవ్రంగా నష్టపోయామనే ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. -
అంబేడ్కర్ మహనీయుడు
నెల్లూరు(స్టోన్హౌస్పేట): అణగారిన, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితకాలం కృషి చేసిన మహనీయుడు అంబేడ్కర్ అని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకొని నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి శనివారం నివాళులర్పించిన అనంతరం కాకాణి మాట్లాడారు. రాష్ట్రంలో నారావారి రాజ్యాంగాన్ని టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తోందని ఆరోపించారు. అరాచక పాలనను సీఎం చంద్రబాబు సాగిస్తూ.. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెడుతూ.. జైళ్లకు పంపి హింసిస్తున్నారని ధ్వజమెత్తారు. అణగారిన వర్గాలు, మహిళలపై దాడులు చేస్తూ పైశాచికానందాన్ని పొందుతున్నారని విమర్శించారు. పేదలకు వైద్య విద్యను దూరం చేయాలనే కుట్రతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారని ధ్వజమెత్తారు. అంబేడ్కర్ ఆశయసాధన కోసం మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పాటుపడ్డారని గుర్తుచేశారు. -
నకిలీ డీఏపీ కలకలం
● గతేడాదీ ఇదే తరహాలో ● రైతులను మోసం చేస్తున్న కొందరు వ్యాపారులు మర్రిపాడు: రబీ సీజన్ ప్రారంభమవడంతో రైతుల కష్టాన్ని దోచుకునేందుకు నకిలీ వ్యాపారులు సిద్ధమయ్యారు. తక్కువ ధరకే డీఏపీని అందిస్తామంటూ మాటలు చెప్పి.. నకిలీని అంటగట్టేందుకు యత్నాలను ప్రారంభించారు. జరుగుతోందిలా.. మండలంలోని పలు గ్రామాల్లో రైతులకు డీఏపీని రూ.వెయ్యికే అందిస్తామంటూ నంద్యాలకు చెందిన కొందరు వ్యాపారులు ప్రస్తుతం చెప్తున్నారు. సాయంత్రం వేళ బుక్ చేసుకొని.. మరుసటి రోజు ఉదయం పది గంటల్లోపు అంటగట్టి నగదును తీసుకెళ్తున్నారు. అయితే ఇది నకిలీదని సమాచారం. గతేడాది సైతం ఇదే తరహాలో అందజేశారు. మండలంలోని ఇస్కపల్లికి చెందిన రైతు బత్తల రత్తయ్యకు 20 టన్నుల డీఏపీని ఇచ్చారు. దీని ద్వారా తనకు రూ.ఆరు లక్షల మేర నష్టమొచ్చిందని ఆయన వాపోయారు. మర్రిపాడు మండలంలోని కొత్త అల్లంపాడులో లోడ్ను తాజాగా దించారు. రైతులు జాగ్రత్తగా ఉండాలి మండలంలో గ్రామాల్లో నాణ్యత లేని ఎరువులు, పురుగుమందును కొందరు విక్రయిస్తున్నారని రైతులు చెప్తున్నారు. లైసెన్స్ లేకుండా ఇలా ఎవరైనా అమ్మితే వ్యవసాయాధికారికి తెలియజేయాలి. రైతులు అప్రమత్తంగా ఉంటూ.. సలహాలు సూచనల కోసం గ్రామ వ్యవసాయ సహాయకులు లేదా ఏఓలను సంప్రదించాలి. – కవిత, వ్యవసాయాధికారి, మర్రిపాడు ● -
నేత్రపర్వంగా శ్రీవారి కల్యాణం
రాపూరు: మండలంలోని పెంచలకోన క్షేత్రంలో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా శనివారం నిర్వహించారు. అభిషేకం, సుప్రభాతం, గోపూజ, పూలంగిసేవను జరిపారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను నిత్య కల్యాణ మండపంలో కొలువుదీర్చి వివిధ రకాల ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ కల్యాణాన్ని నిర్వహించారు. ఊజంల్సేవను సాయంత్రం జరిపారు. నిత్యాన్నదాన పథకానికి రూ.రెండు లక్షల విరాళాన్ని నెల్లూరులోని జెడ్పీ కాలనీకి చెందిన మలిశెట్టి పాపయ్య అందజేశారని దేవస్థాన ఏసీ శ్రీనివాసులు తెలిపారు. చాగంటికి ఘన స్వాగతం నెల్లూరు(బారకాసు): ఆదిశంకరాచార్య కృత జగన్నాథాష్టకంపై ఆధ్యాత్మిక దివ్య ప్రవచనలకు ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు శనివారం హాజరయ్యారు. పురమందిర ప్రాంగణంలోని ఓపెన్ ఆడిటోరియంలో భరద్వాజ రుద్రాభిషేక సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. సంఘ కార్యదర్శి యజ్ఞమూర్తి బాలసుబ్రహ్మణ్యం తదితరులు పర్యవేక్షించారు. -
రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి
నెల్లూరు(లీగల్): రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చరిత్ర ఎంతో ఘనమైందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ పేర్కొన్నారు. అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కోర్టు కాంప్లెక్స్లో కార్యక్రమాన్ని నెల్లూరు బార్ అసోసియేషన్, ఎస్సీ, ఎస్టీ అడ్వొకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్.. అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు వేనాటి చంద్రశేఖర్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పులిమి అయ్యప్పరెడ్డి, నాగరాజుయాదవ్, అసోసియేషన్ ప్రెసిడెంట్ జల్లి పద్మాకర్, న్యాయవాదులు అబ్బాయిరెడ్డి, విజయకుమార్రెడ్డి, వెంకయ్య, బద్దెపూడి రవీంద్ర, సంపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ‘డీకేడబ్ల్యూ’లో రేపట్నుంచి స్పాట్ అడ్మిషన్లు నెల్లూరు (టౌన్): నగరంలోని డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాలలో ఎమ్మెస్సీ జువాలజీ, ఎంఏ తెలుగు పీజీ కోర్సుల్లో ప్రవేశానికి స్పాట్ అడ్మిషన్లను సోమవారం నుంచి నిర్వహించనున్నామని ప్రిన్సిపల్ గిరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ సెట్ అర్హత లేకపోయినా స్పాట్ అడ్మిషన్లను పొందొచ్చని చెప్పారు. కోటాలో చేరే వారికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించదని పేర్కొన్నారు. అడ్మిషన్లు, సమాచారం కోసం 94913 21150, 94415 40317 నంబర్లను సంప్రదించాలని సూచించారు. 9న జాబ్ మేళా నెల్లూరు (టౌన్): మద్రాస్ బస్టాండ్ సమీపంలోని వీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్లో జాబ్ మేళాను ఏపీఎస్సెస్డీసీ, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, సీడాప్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించనున్నామని కళాశాల డైరెక్టర్ తనూజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 15 కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారని చెప్పారు. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, ఏదైనా డిగ్రీ చదివిన వారు అర్హులని.. ఆధార్ కార్డు జిరాక్స్, బయోడేటాను తీసుకురావాలని కోరారు. వివరాలకు 63016 28981, 99888 53335 నంబర్లను సంప్రదించాలని సూచించారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం మోస్తరుగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 15 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారిని 67,336 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 25,063 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.68 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
బీపీసీఎల్ ఏర్పాటుతో ఉపాధి
● కలెక్టర్ హిమాన్షు శుక్లా కందుకూరు: బీపీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థ నెల్లూరు జిల్లాకు రావడం గర్వకారణమని, ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వస్తాయని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. బీపీసీఎల్ ఏర్పాటు వల్ల ప్రభావితమయ్యే గుడ్లూరు మండలంలోని రావూరు, చేవూరు, కావలి మండలంలోని చెన్నాయపాళెం, రుద్రకోట గ్రామాల ప్రజలతో కంపెనీ ప్రతినిధులు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సభను శుక్రవారం రామాయపట్నం పోర్టు వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గుడ్లూరు మండలం చేవూరు వద్ద ఐదు వేల ఎకరాల్లో రూ.1.03 లక్షల కోట్ల పెట్టుబడితో బీపీసీఎల్ కంపెంనీ రిఫైనరీని ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రజల అభిప్రాయాలను నివేదిక రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తామన్నారు. స్థానికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కంపెనీ ప్రతినిధులు రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా చూడాలన్నారు. బీపీసీఎల్ ప్రతినిధులు మాట్లాడుతూ కంపెనీ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన రోజే యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే సంస్థకు కూడా శంకుస్థాపన ఏర్పాటు చేస్తామన్నారు. 70 శాతం ఉపాధి అవకాశాలను స్థానికులకే కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ హిమవంశీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ అశోక్కుమార్, కావలి ఆర్డీఓ చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
గర్భిణి మృతిపై అనుమానాలు
ఉదయగిరి: దుత్తలూరు మండలం నందిపాడులో షేక్ కుబ్రా అనే గర్భిణి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెది హత్య లేదా ఆత్మహత్య చేసుకుందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అత్తంటి వారు చంపి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కుబ్రా భర్త షేక్ మహ్మమద్ రఫీ, అత్త రసూల్బీని గురువారం అదుపులోకి తీసుకుని విచారించి పంపారు. శుక్రవారం వారిని కావలి డీఎస్పీ కార్యాలయంలో విచారించినట్లు సమాచారం. కుబ్రాకు ఆరునెలల క్రితమే వివాహమైంది. తల్లిదండ్రులు మృతిచెందగా సోదరి మాత్రమే ఉన్నారు. కుబ్రాను హత్య చేశారని, విచారణ జరిపించి న్యాయం చేయాలంటూ బంధువులు శుక్రవారం ఉదయగిరిలో ఎమ్మెల్యే కాకార్ల సురేష్ను కలిసి విన్నవించారు. రెండు రోజులుగా ఉదయగిరి సీహెచ్సీలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో శుక్రవారం మృతదేహనికి శవపరీక్ష నిర్వహంచారు. రిపోర్టు అనంతరం కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సీపీఎం నాయకుల అరెస్ట్ ఉలవపాడు: గుడ్లూరు మండలంలో భూ సేకరణ సమావేశానికి సీపీఎం నాయకులు వస్తారని పోలీసులు ముందస్తుగా అరెస్ట్గా చేసి ఉలవపాడు పోలీస్స్టేషన్కు తరలించారు. కందుకూరులో ఉంటున్న సీపీఎం నాయకులు జీవీబీ కుమార్, గౌస్ను శుక్రవారం ఉదయం ఉలవపాడు స్టేషన్కు తీసుకొచ్చారు. గ్రామసభకు వెళ్తున్న గుడ్లూరు మండల కార్యదర్శి జి.వెంకటేశ్వర్లును చేవూరు వద్ద అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. చేవూరు గ్రామానికి చెందిన ఇరువూరి ఉపేంద్రబాబు, గోచిపాతల జక్రయ్య, రావూరుకు చెందిన కాకు మల్లికార్జున, మిరియం వెంకట్రావును గురువారం అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఉలవపాడు స్టేషన్లో ఉంచారు. సాయంత్రం 3 గంటలకు సమావేశం పూర్తైన తర్వాత వారిని పంపించారు. ప్రజాభిప్రాయ సేకరణ అని చెప్పి అరెస్ట్లు చేయడం దారుణమని నేతలు అన్నారు. పచ్చని భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. కలుజు దాటే ప్రయత్నం చేయొద్దునెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ మండలంలోని పొట్టేపాళెం కలుజు వద్ద వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో కలుజు దాటే ప్రయత్నం చేయొద్దని అధికారులు శుక్రవారం హెచ్చరిక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చేపల వేట, సెల్ఫీలు దిగే ప్రయత్నం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
దారుణంగా జాతీయ రహదారి
నెల్లూరు(అర్బన్): కోవూరు నుంచి నెల్లూరు నగరం మీదుగా చైన్నె వెళ్లే నేషనల్ హైవేపై పలుచోట్ల కొన్నినెలలుగా గుంతలున్నాయి. శాశ్వత రిపేర్లు చేయించాల్సిన హైవే నిర్వాహకులు గోతుల్లో కంకర మట్టి వేసి వదిలేశారు. ప్రస్తుతం కురిసిన భారీ వర్షాలకు కంకర డస్ట్ కొట్టుకుపోయింది. నిత్యం ఈ మార్గం గుండా వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. నేషనల్ హైవే నిబంధనల ప్రకారం చిన్నగుంత ఏర్పడినా అప్పటికప్పుడు దానిని పక్కాగా తారుతో పునర్నిర్మించాల్సి ఉంది. అయితే పాలకుల నిర్లక్ష్యం వల్ల నిర్వహణ అధ్వానంగా తయారైంది. సుందరయ్య కాలనీ – బుజబుజనెల్లూరు మధ్య పలుచోట్ల భారీగా గోతులున్నాయి. వాహనచోదకులుకు ఈ రోడ్లు నరకం చూపిస్తున్నాయి. కలెక్టర్ జోక్యం చేసుకుని గతుకులు లేని రోడ్లు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
ముందస్తు చర్యలెక్కడ?
● ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్) గురవయ్య నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడిన సందర్భాల్లో పునరుద్ధరణ చర్యలు చేస్తున్నారు. కానీ అంతరాయాలు రాకుండా ముందస్తు చర్యలు ఎక్కడ తీసుకుంటున్నారు’ అని ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్) గురవయ్య అధికారులను ప్రశ్నించారు. జిల్లాకు శుక్రవారం వచ్చిన ఆయన కోవూరు డివిజన్ విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని వీడాలన్నారు. ప్రతి సెక్షన్ కార్యాలయానికి నిర్దేశించిన సమయానికి సిబ్బంది రావాలని ఆదేశించారు. విద్యుత్ సబ్స్టేషన్లను అధికారులు తనిఖీలు చేస్తుండాలన్నారు. విద్యుత్ చౌర్యాన్ని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. పగటి పూట వీధి దీపాలు వెలగకుండా చూడాలన్నారు. అధికారులు, సిబ్బ ంది వారు విధులు నిర్వహిస్తున్న హెడ్క్వార్టర్స్లోనే ఉండాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఎస్ ఈ రాఘవేంద్రం, కోవూరు ఈఈ రమేష్చౌదరి, డీఈఈ మధుసూదనరెడ్డి, సతీష్, సురేంద్ర, వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు, రెవె న్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
పండ్ల వ్యాపారులపైకి దూసుకెళ్లిన కారు
● ఇద్దరు మహిళలకు గాయాలు నెల్లూరు(క్రైమ్): కారు ఢీకొని ఇద్దరు పండ్ల వ్యాపారులకు గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం నెల్లూరులోని ఏసీ కూరగాయల మార్కెట్ వద్ద చోటుచేసుకుంది. స్థానికులు, ట్రాఫిక్ సిబ్బంది కథనం మేరకు.. నగరానికి చెందిన ఓ వ్యక్తి వీఆర్సీ వైపు నుంచి ఆర్టీసీ బస్టాండ్ వైపు కారు నడుపుతూ బయలుదేరాడు. కారు మాజీ ప్రధాని నెహ్రూ విగ్రహం వద్దకు వచ్చేసరికి ఆటో అడ్డు వచ్చింది. అతను బ్రేక్కు బదులుగా ఎక్స్లేటర్ తొక్కాడు. దీంతో కారు వేగంగా రోడ్డు పక్కనే ఉన్న తోపుడు బండ్లపైకి దూసుకెళ్లి అక్కడే ఉన్న పోస్టుబాక్స్ను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ఘటనలో తోపుడు బండ్లపైకి పండ్లను విక్రయిస్తున్న ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కారు నడుపుతున్న వ్యక్తి, స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. -
వర్షం ఆగింది.. నష్టం మిగిలింది
పొగమంచు వేళలో ప్రకృతి పులకింత రైతులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు● మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి నెల్లూరులో ఫతేఖాన్పేట ప్రాథమిక పాఠశాలలో నిలిచిన వర్షపునీరు ఆర్ఎస్ఆర్ స్కూల్లో ఇదీ పరిస్థితిముగ్గు వేసేందుకు వర్షపునీటిని స్కూల్ బయట పోస్తున్న విద్యార్థిని పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఈ వేళలో అనేక ప్రాంతాలు ప్రకృతి గీసిన చిత్రాల్లా కనిపిస్తున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు విద్యార్థులకు కష్టాలుకండలేరులో 60.280 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 60.280 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 12,585 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
ప్రాణం తీసిన అతివేగం
● లారీ ఢీకొని బేల్దారి మృతి కోవూరు: కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాళెం – చంద్రశేఖరపురం గిరిజన కాలనీ వద్ద నేషనల్ హైవేపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. బుచ్చిరెడ్డిపాళెంలోని రేబాలకు చెందిన ఎస్కే ఇబ్రహీం (45) బేల్దారి పనిచేస్తుంటాడు. శుక్రవారం తెల్లవారుజామున పనికి వెళ్లేందుకు మోటార్బైక్పై నెల్లూరుకు బయలుదేరాడు. ఈ క్రమంలో వెనుక నుంచి లారీ వేగంగా ఢీకొట్టడంతో ఇబ్రహీం అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న కోవూరు ఎస్సై ముత్యాలరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇబ్రహీం మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. కాగా పెన్నానది నుంచి ఇసుక లారీలు, టిప్పర్లు ఈ రహదారిపై నిత్యం వేగంగా తిరుగుతుంటాయి. హెచ్చరిక బోర్డులు కూడా లేవు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రోడ్డు ప్రమాదంపై మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి స్పందించారు. ఈ రహదారిపై ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీం మృతికి సంతాపం తెలిపారు. -
పీటీఎం.. పేలవంగా
నెల్లూరు (టౌన్): రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న మెగా పేరెంట్స్.. టీచర్స్ మీట్ జిల్లాలో అట్టర్ ఫ్లాపైంది. జిల్లాలోని 2608 ప్రభుత్వ పాఠశాలలు.. 26 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో శుక్రవారం చేపట్టిన కార్యక్రమాలు నామమాత్రంగా జరిగాయి. తల్లిదండ్రులు చాలా తక్కువగానే హాజరయ్యారు. కనీసం టెంట్లు, ఫ్లెక్సీలను సైతం ఎక్కడా ఏర్పాటు చేయలేదు. అల్లీపురంలోని జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన సమావేశానికి జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ.. ఇతర చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నిధుల విడుదలేదీ..? మెగా పేరెంట్స్.. టీచర్స్ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు పాఠశాలలకు నిధులను విడుదల చేయలేదు. జిల్లాలోని 2608 పాఠశాలలకు రూ.51.43 లక్షలను విడుదల చేస్తామని ప్రకటించినా, పైసాను విదిల్చలేదు. దీన్ని ఎప్పుడిస్తారో సైతం చెప్పకపోవడంతో నిధులను వెచ్చించేందుకు హెచ్ఎంలు విముఖత చూపారు. ఫలితంగా ప్రక్రియ మొక్కుబడి తంతుగా మారింది. వారొస్తేనే ఆర్భాటం మెజార్టీ పాఠశాలల్లో తరగతి గదిలోనే మీటింగ్లను నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యే స్కూళ్లలోని బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించినా.. కుర్చీలు, టెంట్లను సరిపడా ఏర్పాటు చేయలేదు. కొందరు విద్యార్థులు నేలపై కూర్చోగా, మరికొందరు నిలిచే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. స్నాక్ను అందించకుండా.. రోజు తరహాలోనే మధ్యాహ్న భోజనాన్ని వడ్డించి మమ అనిపించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, తల్లిదండ్రులకు ఆటల పోటీల ఊసేలేదు. సమస్యలపై నిలదీత మెగా పేరెంట్స్.. టీచర్స్ సమావేశాల్లో భాగంగా పాఠశాలల్లో పలు సమస్యలపై స్థానిక నేతలు, ఉపాధ్యాయులను తల్లిదండ్రులు నీలదీశారు. మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉందంటూ అధిక చోట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గదుల కొరత, సరిపడా ఫ్యాన్లు, బెంచీలు లేకపోవడంపై మండిపడ్డారు. నాడు – నేడు రెండో విడత పనులకు నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో చాలా స్కూళ్లలో చెట్ల కిందే బోధించాల్సిన పరిస్థితి నెలకొనడంపై భగ్గుమన్నారు. నగరంలోని బీవీఎస్ మున్సిపల్ హైస్కూల్లో ఏడో తరగతి పిల్లలను కింద కూర్చోబెడుతున్నారంటూ తల్లిదండ్రులు మండిపడ్డారు. ఫ్యాన్లు సైతం లేవని నిలదీశారు. ఆపై విషయాన్ని కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆర్జీ రూపంలో ఇవ్వాలని ఉచిత సలహా ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన పీటీఎంలలో ఇదే పరిస్థితి నెలకొంది. మద్రాస్ బస్టాండ్ సమీపంలోని సుంకు చెంగన్న.. బీవీనగర్లోని కేఎన్నార్ మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాల్లో నాసిరకం భోజనంపై హెచ్ఎంలు, స్థానిక నేతలను విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు. దీన్ని మీరు లేదా మీ పిల్లలు తింటారానని ప్రశ్నించారు. ఆపై లంచ్ చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొక్కుబడిగా పేరెంట్స్.. టీచర్స్ సమావేశాలు నామమాత్రంగా హాజరైన తల్లిదండ్రులు నిధులు విడుదల చేయని రాష్ట్ర ప్రభుత్వం సరిపడా కుర్చీల్లేక కిందే కూర్చున్న విద్యార్థులు నాసిరకం భోజనంపై నిలదీత జూనియర్ కళాశాలల్లోనూ ఇదే తంతు -
నన్ను జైలుకు పంపితే సోమిరెడ్డి అవినీతికి అడ్డుండదు
● వర్షాలొస్తే టీడీపీ నేతలకు పండగ ● మరమ్మతుల పేరిట దొంగ బిల్లులు ● ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్రెడ్డి ముత్తుకూరు(పొదలకూరు): తనను జైలుకు మళ్లీ పంపితే సోమిరెడ్డి అవినీతిని అడ్డుకునే వారుండరని.. దీంతో పదేపదే అక్రమ కేసులు పెట్టిస్తున్నారని.. ఎన్ని కేసులు పెట్టినా ఆయన అక్రమాలను అడ్డుకుంటూ.. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను ప్రశ్నిస్తూనే ఉంటానని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలైన ముత్తుకూరు మండలంలోని పోలంరాజుగుంట, డమ్మాయపాళెం గ్రామాల్లో రైతులతో కలిసి శుక్రవారం ఆయన పర్యటించారు. నక్కల కాలువ డ్రెయిన్కు వెళ్లే మార్గం జలమయం కావడంతో రైతులతో కలిసి ట్రాక్టర్లో ప్రయాణించారు. కాలువ పనులను గత ప్రభుత్వంలో మీరు చేయడంతో ఆక్వా గుంతల్లోకి నీరు రాకుండా రక్షించుకోగలిగామంటూ వారు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. వర్షాలు కురిస్తే జనజీవనాన్ని నక్కల కాలువ అతలాకుతలం చేసేదని, అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. కాలువలో పూడికను తొలగించి రైతులను గత ప్రభుత్వంలో ఆదుకుంటే.. ప్రస్తుతం సోమిరెడ్డి నాలుగు గంటలు పనిచేసి గుర్రపు డెక్కను సైతం పూర్తిగా తొలగించలేదని విమర్శించారు. తన రాకను తెలుసుకొని మెషీన్ను హడావుడిగా తెప్పించి గుర్రపు డెక్కను తొలగించారనే అంశాన్ని రైతులే చెప్పారని పేర్కొన్నారు. ప్రభుత్వ సొమ్ము స్వాహా వరదలతో దెబ్బతిన్న కాలువలు, చెరువుల రిపేర్ల పేరుతో పనులు చేయకుండానే దొంగ బిల్లులను సృష్టించి ప్రభుత్వ సొమ్మును సోమిరెడ్డి స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. తుఫాన్తో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పనులపై తండ్రీకొడుకు ప్రణాళికను రూపొందిస్తున్నారని ధ్వజమెత్తారు. బాధితులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. నక్కల కాలువ పనులను గతంలో సజావుగా జరగనీయకుండా సోమిరెడ్డి అడ్డంకులు సృష్టించారని తెలిపారు. పనులను తన పర్యవేక్షణలో పూర్తి చేయడంతో రైతులు, ప్రజలు ఇబ్బందుల్లేకుండా ఉన్నారని పేర్కొన్నారు. తమ హయాంలో జరిగిన పనులు.. ఇప్పుడు ఇరిగేషన్ శాఖలో చేస్తున్న పనులపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ శాఖలో అవినీతి ఏరులై పారుతోందని.. అధికారులు, ఉద్యోగులు ఎంతమంది శిక్షార్హులవుతారో కాలమే సమాధానం చెప్తుందన్నారు. ప్రజల కష్టాలను సోమిరెడ్డి గాలికొదిలి.. తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. నష్టపోయిన రైతులు, ప్రజలను తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విత్తనాలను రాయితీపై అందజేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదుకోని పక్షంలో.. తమ పార్టీ పోరాటం చేస్తుందని వివరించారు. -
ఎస్ఈబీ అంటేనే హడల్
టీడీపీ సర్కార్ కొలువుదీరాక జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. ఎక్కడ చూసిన విక్రయాలు జోరుగా సాగుతూ సింహపురిలో శాంతిభద్రతలనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. వాడవాడలా విక్రేతలు పుట్టుకొస్తూ.. యువతను మత్తులో దించుతున్నారు. ఫలితంగా నషాలో జోగుతూ కనిపించిన వారిపై దాడులకు పాల్పడుతూ.. హత్యలకూ తెగబడుతున్నారు. ఇంత జరుగుతున్నా, వీటిపై ఉక్కుపాదం మోపాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తూ.. తమ వైఫల్యాన్ని గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్పై మోపేందుకు కుట్ర పన్నుతోంది. వాస్తవానికి గతంలో ఈ వ్యవహారాలపై అడుగడుగునా నిఘా ఉంచడం.. పీడీ యాక్ట్లు నమోదు చేయడంతో ముఠాల అరాచకాలకు ముకుతాడు పడింది. అయితే ఇవేవీ పట్టించుకోకుండా ప్రస్తుత ప్రభుత్వం సాగిస్తున్న దుష్ప్రచారంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. వాస్తవంగా గంజాయి కేసులు ఎక్కువగా మన ప్రభుత్వంలోనే నమోదవుతున్నాయి. ఇవన్నీ వైఎస్సార్సీపీ ఖాతాలో వేసేద్దాం.గంజాయి ప్యాకెట్లు (ఫైల్) గంజాయిపై కొరడా ఝళిపించేందుకు గానూ గత ప్రభుత్వ హయాంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేశారు. ఎస్ఈబీ, పోలీస్ అధికారులు ఉక్కుపాదం మోపి.. పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు. గంజాయి హాట్ స్పాట్స్, జాతీయ రహదారి వెంబడి, రైళ్లలో నిరంతర దాడులు, తనిఖీలు జరిపి పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసుల నమోదు, అరెస్ట్లతో సరిపెట్టుకోకుండా మూలాల ఏరివేతకు చర్యలు చేపట్టారు. సరఫరాదారుల వివరాలను సేకరించి వారిపైనా కేసులు పెట్టారు. ఇతర రాష్ట్రాల్లోని జైళ్లలో ఉన్న నిందితులను కోర్టు అనుమతితో పీడీ వారెంట్లపై జిల్లాకు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. నిందితులు ఎక్కడున్నా వదిలే ప్రసక్తే లేదనే అంశాన్ని తమ చేతలతో నిరూపించారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: గంజాయి.. ఈ పదాన్ని వింటేనే జిల్లా వాసులకు వణుకు పుడుతోంది. సాయంత్రమైతే బయట అడుగుపెట్టాలంటే పురుషులు సైతం జంకే పరిస్థితి నెలకొంటోంది. టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువుదీరాక జిల్లాలో వీటి విక్రయాలు మూడు పువ్వులు.. ఆరు కాయలు అనే చందంగా సాగుతున్నాయి. ఒడిశా, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఈ అక్రమ రవాణా దందా జరుగుతోంది. జిల్లాకు చెందిన వ్యాపారులు.. గంజాయి పెంపకదారులు, సరఫరాదారుల నుంచి కిలోను రూ.మూడు వేల నుంచి రూ.నాలుగు వేల వరకు కొనుగోలు చేసి దిగుమతి చేసుకుంటున్నారు. అరెస్ట్లతో సరి.. మూలాలను విస్మరించి చిన్న పొట్లాలుగా మార్చి రూ.100 నుంచి రూ.400 చొప్పున విక్రయించి జేబులు నింపుకొంటున్నారు. పోలీస్, ఎకై ్సజ్ అధికారులు దాడులకే పరిమితమై.. గంజాయి స్వాధీనం, నిందితుల అరెస్ట్లతో సరిపెడుతూ.. మూలాలను మాత్రం విస్మరిస్తున్నారు. ఫలితంగా ఎక్కడపడితే అక్కడ లభ్యమవుతుండటంతో మత్తుకు బానిసలైన కొందరు యువత నేరాలకు పాల్పడుతున్నారు. ఖాకీలపై దాడులకు సైతం వెనుకాడటం లేదు. నూతన ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి ఇప్పటి వరకు పోలీసులను వాహనాలతో స్మగర్లు, గంజాయి బ్యాచ్ రెండుసార్లు గుద్దించారు. హెడ్ కానిస్టేబుల్పై కత్తితో దాడికి ఇటీవల తెగబడ్డారు. వారే స్థాయిలో బరితెగిస్తున్నారో దీన్ని ద్వారా స్పష్టమవుతోంది. పాతనేరస్తులపై కొరవడిన నిఘా గంజాయి పాత నేరస్తులపై గతంలో నిశిత నిఘా ఉండేది. దీంతో వారు క్రైమ్ చేయాలంటనే భయపడేవారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితే లేదు. ఆర్డీటీ కాలనీలో ఉద్యమకారుడు పెంచలయ్య హత్య కేసులో లేడీ డాన్, ఆమె తమ్ముడిపై నవాబుపేట పోలీస్స్టేషన్లో సస్పెక్టడ్ షీట్లున్నాయి. వీరిపై ఖాకీల నిఘానే ఉండుంటే పెంచలయ్య హత్య జరిగేదే కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వారు అనుసరించిన ఉదాసీన వైఖరే అరవ కామాక్షి బరితెగింపునకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.టీడీపీ ప్రభుత్వంలో వాడవాడలా.. విచ్చలవిడిగా నాటి వైఎస్సార్సీపీ సర్కార్కు ఆపాదించేందుకు కుట్ర తీరుమారని తొమ్మిది మందిపై గతంలో పీడీ యాక్ట్లు ప్రస్తుతం నామమాత్రపు చర్యలు రవాణా, విక్రయాలపై కొరవడిన నిఘా జిల్లాలో జోరుగా అమ్మకాలు నాడు.. శాంతిభద్రతలే పరమావధిగా యువత జీవితాలను గంజాయి నాశనం చేస్తోందనే విషయాన్ని గమనించిన నాటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ దీన్ని నిర్మూలించేందుకు సమూలంగా అడుగులేసింది. నిఘా వ్యవస్థను పటిష్టం చేసి అక్రమ రవాణా, విక్రయాలపై ఎక్కడికక్కడ ఉక్కుపాదం మోపింది. గంజాయి తాగేవారిపై సైతం కేసులు నమోదు చేసింది. తీరుమారని వ్యాపారులపై పీడీ యాక్ట్లనూ ప్రయోగించింది. దీంతో దానికి జోలికెళ్లాలంటేనే భయపడే పరిస్థితికి తీసుకొచ్చింది. అయితే టీడీపీ సర్కార్ వచ్చాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అడపాదడపా దాడులు చేస్తూ.. నిందితులపై కేసుల నమోదుకే పరిమితమవుతున్నారు. పీడీ యాక్ట్లతో కఠినంగా నేరగాళ్లపై కఠిన చర్యలు చేపట్టే అంశంపై పోలీస్ అధికారులకు నాటి సీఎం జగన్మోహన్రెడ్డి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దీంతో నేరస్తుల కదలికలపై నిశిత నిఘా ఉంచి, ఎక్కడికక్కడ వారిని అణిచేశారు. నేరాలకు తరచూ పాల్పడేవారిపై పీడీ యాక్ట్లను నమోదు చేశారు. తీరుమారని గంజాయి వ్యాపారులైన కపాడిపాళేనికి చెందిన రాజమ్మ, సిరాజ్, సుభానీ, ముంతాజ్, జమీర్, వెంగళరావునగర్కు చెందిన వెంకటేశ్వర్లు, సలీం, బోడిగాడితోటకు చెందిన అరవ చిన్నరాజా (లేడీడాన్ తమ్ముడు), కందుకూరుకు చెందిన చిన వెంకటేశ్వర్లుపై ఈ యాక్ట్ను ప్రయోగించి కటకటాల వెనక్కి పంపారు. జైలు నుంచి బయటకొచ్చాకా వీరి కదలికలపై నిఘాను కొనసాగించారు. కేసుల్లోని నిందితులను స్టేషన్లకు తరచూ పిలిచి బైండోవర్లు చేశారు. దీంతో విక్రయాలు సాగించాలంటేనే భయపడే పరిస్థితిని తీసుకొచ్చారు. మరోవైపు మత్తు, మాదకద్రవ్యాల జోలికెళ్లకుండా.. వాటి వినియోగంతో సంభవించే దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టారు. అధికారుల చర్యలతో విక్రయాలు, రవాణాను కట్టడి చేశారు. అయితే ప్రస్తుతం జరుగుతోంది దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. గతంలో ప్రశాంతంగా ఉన్న సింహపురి.. నేడు హింసపురిగా మారిందనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. -
కండలేరు స్పిల్వే నుంచి నీటి విడుదల
పొదలకూరు: కండలేరు స్పిల్వే నుంచి 500 క్యూసెక్కులను తెలుగుగంగ అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలు, వరద కాలువ ద్వారా పది వేల క్యూసెక్కులకుపైగా నీరొచ్చి చేరుతుండటంతో విడుదల చేశారు. తక్కువ సంఖ్యలో వదలడంతో దిగువ గ్రామాలకు ఇబ్బందుల్లేవని పేర్కొన్నారు. పరిస్థితిని సమీక్షించి అవసరమైతే పరిమాణాన్ని పెంచుతామని వెల్లడించారు. ఎస్ఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు పర్యవేక్షించారు. పల్స్ పోలియోను విజయవంతం చేద్దాం నెల్లూరు(అర్బన్): జిల్లాలో ఈ నెల 21న నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని డాక్టర్లు, వైద్య సిబ్బంది పక్కాగా జరిపి విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ సుజాత సూచించారు. నెల్లూరు డివిజన్ పరిధిలోని పీహెచ్సీలు, యూపీహెచ్సీల మెడికల్ ఆఫీసర్లకు నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. శిశువు నుంచి ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలను వేయాలని కోరారు. ఏడీఎంహెచ్ఓ ఖాదర్వలీ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి ఉమామహేశ్వరి, డీపీఎంఓ సునీల్, డెమో అధికారి కనకరత్నం, ఎస్ఓ సహన, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అశోక్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు కావలి (అల్లూరు): విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. పట్టణంలోని వెంగళరావునగర్లో గల పొట్టి శ్రీరాములు మున్సిపల్ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎంకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. మొబైల్ ఫోన్ల నుంచి విద్యార్థులను దూరంగా ఉంచాలని కోరారు. పిల్లలతో తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి రూ.పది లక్షలను మంజూరు చేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డి, ఆర్డీఓ వంశీకృష్ణ, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలుతిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 51,082 మంది గురువారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 19,836 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.86 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేని వారికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. స్పోర్ట్స్ అకాడమీ స్థాపనకు ఒప్పందం పొదలకూరు: నెల్లూరులో ఇన్క్లూజివ్ స్పోర్ట్స్ అకాడమీ స్థాపనకు ఎన్ఐఈపీఐడీతో ఎస్ఈఐఎల్ ఎనర్జీ ఒప్పందం కుదుర్చుకుందని సీఈఓ జన్మేజయ మహాపాత్ర పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడారు. కాంపోజిట్ రీజినల్ సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ రిహాబిలిటేషన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ ప్రాంగణంలో అకాడమీని నిర్మించనున్నారని వెల్లడించారు. సీఎస్సార్ నిధులతో ఆధునిక స్టేడియం ద్వారా క్రీడా సౌకర్యాలను కల్పించనున్నామని తెలిపారు. -
టీడీపీ పాలనలో అరాచక రాజ్యం
● గడిచిన ఏడాదిన్నరలో జిల్లాలో 30 హత్యలు ● నేరాలకు పాల్పడే వారిపై కఠిన చట్టాలు అమలు చేయాలి ● ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి, మాజీ మంత్రి ప్రసన్నకుమార్రెడ్డి కోవూరు: రాష్ట్రంలో టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడ్డాక జిల్లాలో మాఫియా గ్యాంగ్లు, రౌడీషీటర్లు, గంజాయి గూండాలు చెలరేగిపోతున్నారని.. బెల్టు షాపులు, నకిలీ మద్యం విలయతాండవం చేస్తున్నాయని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆరోపించారు. కోటి సంతకాల సేకరణలో భాగంగా నియోజకవర్గంలో సేకరించిన 60 వేల సంతకాల పత్రాలను నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయానికి పార్టీ మండలాధ్యక్షుడు అత్తిపల్లి అనూప్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం తరలించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చంద్రశేఖర్రెడ్డి మాట్లాడారు. రాజకీయ కారణాలతో గంజాయి విక్రేతలపై పోలీసులు చర్యలు చేపట్టడంలేదని చెప్పారు. జిల్లాలో గంజాయి ముఠా సభ్యులు 300 మంది వరకు ఉంటారని, వీరిని అణిచేస్తే సమస్యను పరిష్కరించొచ్చని తెలిపారు. అయితే ఈ విషయాన్ని విస్మరించి.. ప్రతిపక్ష పార్టీ నేతలపై గంజాయి కేసులు పెడుతుండటంతో సమస్య తీవ్రమవుతోందని చెప్పారు. రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుడితే కోటిన్నర మేర పూర్తి చేశామని వెల్లడించారు. ప్రభుత్వంపై ఆగ్రహంతో పార్టీలకతీతంగా పలువురు సంతకాలు చేశారని వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో విఫలం శాంతి భద్రతలను కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రసన్నకుమార్రెడ్డి ఆరోపించారు. హత్యలకు పాల్పడిన వారు జైళ్లలో రాజభోగాలను అనుభవిస్తున్నారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం కొలువుదీరిన ఏడాదిన్నరలో జిల్లాలో 30 మందిని నిర్దాక్షిణ్యంగా హత్య చేశారని ఆరోపించారు. గంజాయి వ్యాపారం వద్దన్నందుకే సీపీఎం నేత పెంచలయ్యను మాఫియా హతమార్చిందని చెప్పారు. శిక్షలు కఠినంగా ఉన్నప్పుడే నేరాలు అంతమవుతాయని పేర్కొన్నారు. హత్యలు, దారుణమైన నేరాలకు పాల్పడిన వారి తరఫున వాదించకుండా ఉండాలని న్యాయవాదులను కోరారు. డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు, ఆఫ్కాఫ్ మాజీ చైర్మన్ కొండూరు అనిల్బాబు, ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్, జెడ్పీటీసీ శ్రీలత, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, మల్లికార్జునరెడ్డి, రైతు విభాగ జిల్లా అధ్యక్షుడు నరసింహులురెడ్డి, పార్టీ మండలాధ్యక్షులు నవీన్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, శేషగిరి, సతీష్రెడ్డి, షాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాను వీడని వర్షాలు
సాక్షిప్రతినిధి, నెల్లూరు: దిత్వా తుఫాన్ జిల్లాలో బీభత్సాన్ని సృష్టించింది. చైన్నె సమీపంలోని మహాబలిపురం వద్ద తీరం దాటినా, దాని ప్రభావం జిల్లాపై తీవ్రంగా ఉంది. నాలుగు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం గురువారం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోల్కతా – చైన్నె జాతీయ రహదారిపై మనుబోలు, వెంకటాచలం ప్రాంతాల్లో వరద నీరు చేరింది. ఫలితంగా గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్లు ఛిద్రమయ్యాయి. చెరువులు, వాగులు, వంకలు, కాలువలు ఏకమయ్యాయి. పొంగిన వరద నీరు రోడ్డెక్కడంతో పలు చోట్ల గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. మునిగిన నారుమడులు నాట్లకు సిద్ధంగా ఉన్న నారుమడులు.. వేసిన నాట్లు వే లాది ఎకరాల్లో మునిగిపోయాయి. పొలాలు చెరువుల ను తలపిస్తున్నాయి. చిరు వ్యాపారులు, వలస కార్మికులు, దినసరి కూలీలు పనుల్లేక పస్తులతో గడుపుతున్నారు. మగ్గం గుంతల్లోకి నీరు చేరడంతో చేనేత పనులు స్తంభించిపోయాయి. నగరంతో పాటు పలు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. నగరంలో బీభత్సం నగరంలో గురువారం మధ్యాహ్నం 12 నుంచి క్లౌడ్బరస్ట్ తరహాలో రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో రోడ్లపై మూడడుగుల మేర నీరు చేరింది. గాంధీబొమ్మ, పొగతోట, చిన్నబజార్, పెద్దబజార్, ఆచారివీధి, రాయాజీవీధి తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ నీటితో కలిసి వర్షపు నీరు రోడ్లపై ప్రవహించింది. ఆత్మకూరు బస్టాండ్, మాగుంట లేఅవుట్, రామలింగాపురం అండర్ బ్రిడ్జిలు నిండిపోయాయి. మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జిలో ఓ కారు మునిగిపోయింది. విజయమహల్ గేట్ సమీపంలోని బాక్స్టైపు బ్రిడ్జి వద్దా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఆదుకోవడంలో మంత్రులు విఫలం మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరులోనే ఉన్నారు. పేదలు, పూట గడవని అభాగ్యులు లోతట్టు ప్రాంతాల్లో పస్తులతో గడుపుతున్నా, వీరు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని మనుమసిద్ధినగర్లో డ్రైనేజీ కాలువలను వారం క్రితమే నిర్మిస్తే అవి కూలిపోయాయి. 7527.5 ఎకరాల్లో పంట నష్టం జిల్లాలో ప్రస్తుతం కురిసిన వర్షాలకు సుమారు 6500 మంది రైతులు నష్టపోయారు. 6970 ఎకరాల్లో వరినార్లు, నాట్లు మునిగిపోయాయి. 557.5 ఎకరాల్లో శనగ పంట దెబ్బతినింది. మొత్తం 7527.5 ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని వ్యవసాయాధికారులు ప్రకటించారు. మరోవైపు పది వేల మందికిపైగానే రైతులు నష్టపోయి ఉంటారని అంచనా. సుమారు 13 వేల ఎకరాల్లో నారుమడులు, నాట్లు మునిగిపోయాయని తెలుస్తోంది. ఐదు రోజుల్లో భారీగా.. గత నెల 30 నుంచి గురువారం వరకు వెంకటాచలం మండలంలో 395.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సైదాపురంలో 351, పొదలకూరులో 340.4, మనుబోలులో 330.2, నెల్లూరు రూరల్లో 329.2, కోవూరులో 312.2, నెల్లూరు అర్బన్లో 300.8, ముత్తుకూరులో 282.6, కొడవలూరులో 273.2, రాపూరులో 248.6, బుచ్చిరెడ్డిపాళెంలో 244.2, విడవలూరులో 243, కలువాయిలో 228.6, ఆత్మకూరులో 217, తోటపల్లిగూడూరులో 210.8, ఇందుకూరుపేటలో 204.8, కావలిలో 201.8, సంగంలో 199.8, అనంతసాగరంలో 196.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెరువును తలపిస్తున్న తల్పగిరి కాలనీ వర్షపాతమిలా.. ఉరుములు, మెరుపులతో వణికించిన వాన జలదిగ్బంధంలో పలు ప్రాంతాలు నెల్లూరులో నీటమునిగిన అండర్ బ్రిడ్జిలు చెరువులను తలపిస్తున్న పొలాలు ఆరు వేల ఎకరాల్లో నీటిలో కుళ్లుతున్న నాట్లు, నారుమడులు జిల్లాలో గురువారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం ఐదులోపు నెల్లూరు రూరల్లో అత్యధికంగా 88.8 మిల్లీమీటర్ల వర్షం పడింది. నెల్లూరు అర్బన్లో 83.4, కోవూరులో 67.2, ముత్తుకూరులో 62.4, పొదలకూరులో 45.8, కొండాపురంలో 43.4, సైదాపురంలో 42, కొడవలూరులో 39, విడవలూరులో 30.8, రాపూరులో 24.4, ఇందుకూరుపేటలో 20.4, తోటపల్లిగూడూరులో 17.6, కలువాయిలో 16.4, బుచ్చిరెడ్డిపాళెంలో 15.8, లింగసముద్రంలో 14.8, మనుబోలులో 12.6, చేజర్లలో 11.2, వెంకటాచలంలో 11, అల్లూరులో 7, సంగంలో 6.6, దగదర్తిలో 6.4, గుడ్లూరులో 4.4, ఉదయగిరిలో 4.2, అనంతసాగరంలో 3, ఆత్మకూరులో 2.8, మర్రిపాడులో 2.4, వలేటివారిపాళెంలో 2.4, వరికుంటపాడులో 2.2, సీతారామపురంలో 2, ఏఎస్పేటలో 1.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
రైతన్నా మీ కోసం.. మరో మోసం
ప్రశ్నిస్తారనే భయం ● జిల్లాలో మొక్కుబడిగా నిర్వహణ ● మద్దతు ధర లేక నష్టపోతున్న కర్షకులు ● పట్టించుకోని ప్రజాప్రతినిధులు ● కొందరికే అన్నదాత సుఖీభవ ● ప్రభుత్వానిదంతా ప్రచారార్భాటమే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎరువులు, విత్తనాలను అందించడంలో వారి వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాల క్రమంలో అన్నదాతలు ప్రశ్నిస్తారనే భయంతో ప్రజాప్రతినిధులు ముఖం చాటేస్తున్నారు. మరోవైపు సర్కార్పై అన్నదాతల్లో వ్యతిరేకత పెరగడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ కార్యక్రమానికి తెరలేపారనే వాదనా లేకపోలేదు. ఆరుగాలం శ్రమించి పంటను పండించే అన్నదాతకు చేయూతనివ్వాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. రైతులను వంచిస్తూ వికటాట్టహాసం చేస్తున్న సర్కార్ వారిని మభ్యపెట్టేందుకు సరికొత్త డ్రామాకు తెరలేపింది. ‘రైతన్నా మీ కోసం’ అంటూ కార్యక్రమాలను మొక్కుబడిగా జరుపుతోంది. జిల్లాలోని 421 చోట్ల నిర్వహిస్తున్నా, వీటి వైపు ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడటంలేదు. ప్రచారార్భాటం కోసమే వీటిని ఏర్పాటు చేశారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులు సంతోషంగా ఉండేవారు. పుట్టి ధాన్యాన్ని రూ.25 వేల నుంచి రూ.28 వేల వరకు విక్రయించారు. పక్క జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి రైస్ మిల్లర్లు, వ్యాపారులను పిలిపించి ధాన్యాన్ని కొనుగోలు చేయించారు. దీంతో పోటీ పెరిగి మద్దతు ధరకు మించి లభించింది. అయితే ప్రస్తుతం అందుకు భిన్నంగా వ్యవహారం నడుస్తోంది. నెల్లూరు(పొగతోట): అన్నదాత వెన్ను విరుస్తున్న టీడీపీ ప్రభుత్వం వారిని మభ్యపెట్టేందుకు ‘రైతన్నా మీ కోసం’ అనే బోగస్ కార్యక్రమానికి తెరలేపింది. జిల్లాలో 421 చోట్ల తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారు. ప్రోగ్రామ్ జరుగుతున్న తీరును చూస్తే ఈ అంశం తేటతెల్లమవుతోంది. ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడకపోవడంతోనే వారికి కర్షకులపై ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో స్పష్టమవుతోంది. ప్రయోజనమేదీ..? ఉదాహరణకు కోవూరులో నిర్వహించిన రైతన్నా మీ కోసం కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు. అన్నదాత సుఖీభవ డబ్బులు జమయ్యాయనే అంశమై మహిళా రైతును ప్రశ్నించగా, తనకు రాలేదని ఆమె సమాధానమిచ్చారు. ఎందుకు జమకాలేదంటూ అధికారులను ప్రశ్నించి, షో చేశారు. జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా, ఎక్కడా హాజరుకాలేదు. అసలీ కార్యక్రమాలతో రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడంలేదు. అక్కడక్కడా ఎమ్మెల్యేలు వస్తూ తూతూమంత్రంగా జరుపుతున్నారు. అన్నింట్లో అలసత్వమే ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నించేందుకు కర్షకులు సిద్ధంగా ఉన్నారు. దీంతో వారిని కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నారు. వాస్తవానికి గత సీజన్లో జిల్లాలో ఐదు లక్షలెకరాల్లో వరిని సాగు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు, రైతు సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తూనే వచ్చారు. చివరికి 90 శాతం వరి కోతలు పూర్తయ్యాక మొక్కుబడిగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ తీరు కారణంగా పుట్టి ధాన్యానికి రూ.ఐదు వేల నుంచి రూ.ఆరు వేల వరకు అన్నదాతలు కోల్పోయారు. ఇలా జిల్లాలో సుమారు రూ.250 కోట్లకుపైగా నష్టపోయారు. దళారులకు మాత్రం లాభాలు రైతులు నిలువునా మోసపోతుండగా.. దళారులు, వ్యాపారులు మాత్రం లాభాలను ఆర్జిస్తున్నారు. టమాటోలు కిలోను రూపాయికి కర్షకుల నుంచి కొనుగోలు చేసి, నెల్లూరు మార్కెట్లో రూ.30కు విక్రయిస్తున్నారు. అరటి రైతులకు కిలో రూపాయి కన్నా తక్కువ లభిస్తోంది. మార్కెట్లో అరటి పండ్లను రూ.25 నుంచి రూ.30కు విక్రయిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరైనా, రైతులకు చేసింది శూన్యం. గత ప్రభుత్వ హయాంలో ఖుషీఖుషీ -
ఉధృతంగా వాగులు
● జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వెంకటాచలం చెరువు నిండిపోయి నీరు జాతీయ రహదారిపైకి చేరింది. మండలంలో జెర్రిపోతు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ● మనుబోలు మండలం పిడూరు, బద్దెవోలు, కొలనకుదురు గ్రామాల్లోకి వాన నీరు చేరింది. ● పొదలకూరు మండలం ముడిగేడు – ఇనుకుర్తి మధ్య వాగు పొంగి రాకపోకలు స్తంభించాయి. ● చేజర్లలోని నల్లవాగు, నాపూరు పెద్ద వాగు ఉధృతంగా ప్రవిహిస్తున్నాయి. ● సైదాపురం మండలంలో పాలూరు – వేములచేడు మధ్య కుంటి కాలువ పొంగింది. కై వల్య నది ఉధృత రూపం దాల్చింది. బొగ్గేరు, బీరాపేరు, పైడేరు, మలిదేవి డ్రెయిన్లు ప్రవహిస్తున్నాయి. ● ఆత్మకూరు మండలంలోని వెన్నవాడ సమీపంలో ఉత్తర కాలువకు భారీ గండిపడింది. పొలాల్లోని నీరు కాలువ వద్దకు చేరడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ● అనంతసాగరం సమీపంలోని ఓ కాలువకు వరద పెరగడంతో దళితవాడకు రాకపోకలు నిలిచిపోయాయి. ● రాపూరు మండలంలోని గోనుపల్లి బాడవ వాగు పొంగి ప్రవహిస్తోంది. -
సోమిరెడ్డీ.. సీబీఐ విచారణకు సిద్ధమా?
● తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదు ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వెంకటాచలం: ‘ఇరిగేషన్ పనుల్లో అవినీతిపై నేను సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నా. సోమిరెడ్డి సిద్ధమా’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రశ్నించారు. మండలంలోని ఇడిమేపల్లి, పలుకూరువారిపాళెం గ్రామాల్లో గురువారం వరద ప్రభావిత ప్రాంతాల్లో కాకాణి పర్యటించారు. నీటమునిగిన నారుమడులను చూపి తాము నష్టపోయామని, అధికారులెవరూ పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. గ్రామ పరిధిలోని చెరువు కట్ట మరమ్మతులను రైతులందరూ కలిసి చేయిస్తే వాటి బిల్లులను టీడీపీ నాయకులు చేసుకున్నారని వాపోయారు. ఈ సందర్భంగా గోవర్ధన్రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పాలనలో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు తక్షణమే సాయం అందించినట్లు గుర్తు చేశారు. పంట నష్టం జరిగితే వెంటనే పరిహారం ఇవ్వడం, నారుమళ్లు దెబ్బతింటే సబ్సిడీ విత్తనాలు సరఫరా చేసి అండగా నిలిచినట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం వారిని పట్టించుకునే పరిస్థితి లేకపోవడం దారుణమన్నారు. అవినీతి సంపాదనపైనే ధ్యాస సర్వేపల్లి నియోజకవర్గాన్ని అడ్డం పెట్టుకుని సోమిరెడ్డి ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారని కాకాణి ఆరోపించారు. ఆయనకు అవినీతి సంపాదనపై ఉన్న ధ్యాస, ప్రజల సమస్యలపై లేదని ధ్వజమెత్తారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మొక్కుబడిగా పర్యటించి, ఫొటోలకు పోజులిచ్చి వెళ్లడం తప్ప, ప్రజల సమస్యలను ఎక్కడా పరిష్కరించడం లేదన్నారు. అక్రమంగా గ్రావెల్ తరలింపు, ఇరిగేషన్ పనులు కొన్నిచోట్ల చేయకుండానే బిల్లులు చేసుకుంటున్నారని ఆరోపించారు. సోమిరెడ్డి అవినీతి గురించి ప్రశ్నించినందుకే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని, ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. కాకుటూరు శివాలయ భూములను లేఅవుట్ యజమానులకు అమ్మే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖలో జరిగిన పనులు, కూటమి పాలనలో జరిగిన పనులు, సోమిరెడ్డి దొంగ బిల్లులపై రైతుల సమక్షంలోనే చర్చించడానికి రావాలని సవాల్ విసిరారు. -
జలదిగ్బంధం
నెల్లూరు నగరాన్ని వర్షం ముంచెత్తింది. ఎటుచూసినా నీరే కనిపించింది. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా పడిన వానకు రహదారులు చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. బుధవారం రోడ్లపై రాకపోకలు సాగించేందుకు వాహనదారులు పడిన కష్టాలు వర్ణనాతీతం. మగ్గం గుంతల్లో నీరు చేరడంతో చేనేత కార్మికులు కన్నీరుమున్నీరవుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు చెరువు కాదు.. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డుకు వెళ్లే ప్రాంతంలో నిలిచిన నీరు నెల్లూరు రూరల్ మండలం సౌత్మోపూరులో నీట మునిగిన పొలాలుమాగుంట లేఅవుట్ ప్రాంతంలో వాహనదారుల కష్టాలుఅయ్యప్ప గుడి సమీపంలో ఇలా.. -
బిడ్డా.. మాకు దిక్కెవరయ్యా..
● అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లు తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య ● గుండెలవిసేలా రోదించిన తల్లిఉదయగిరి: బిడ్డా మమ్మల్ని వదిలిపోయావా.. నీతోటి నన్ను, మీ నాయన్నూ తీసుకుపోవచ్చు కదా.. నీవు లేకపోతే మేమెలా బతకాలి కొడుకా.. రాత్రి ఫోన్ చేసి అమ్మా.. అన్నం తిన్నావా.. మందులేసుకున్నావా.. నాన్న ఎలా ఉన్నారు.. అని అడిగి.. రేపు ఇంటికొస్తానని చెప్పి ఇంతలోనే ఎంత పని చేశావయ్యా అంటూ తల్లి రోదిస్తుండటం చూపరులను కలిచేస్తోంది. సీతారామపురం మండలం రంగనాయుడుపల్లికి చెందిన వల్లెపు ప్రతాప్ (28) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటంతో మృతుడి తల్లి రోదనలు మిన్నంటాయి. ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాల వద్ద ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. రంగనాయుడుపల్లికి చెందిన వల్లెపు పెద్దక్క, వెంకటేశ్వర్లు ఇద్దరు కుమారులు వివాహానంతరం ఉపాధి నిమిత్తం పామూరు, దుత్తలూరులో స్థిరపడ్డారు. బద్వేలులోని అత్తారింటికి కుమార్తె వెళ్లగా, చిన్న కుమారుడు ప్రతాప్ డిగ్రీ వరకు చదువుకొని తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామ వలంటీర్గా పనిచేసి గుర్తింపును తెచ్చుకున్నారు. బెట్టింగులకు బానిసై.. అంధుడైన తండ్రికి.. పక్షవాతంతో బాధపడుతున్న తల్లికి ప్రతాప్ ఒక్కరే ఆసరాగా మిగిలారు. వలంటీర్గా పనిచేస్తూ.. మరోవైపు గేదెలు మేపుకొంటూ వచ్చే మొత్తంతో తల్లిదండ్రులను చూసుకునేవారు. ఈ తరుణంలో స్నేహితులతో కలిసి ఆన్లైన్ బెట్టింగ్లకు గతేడాదిలో బానిసయ్యారు. ఆ విష వలయంలో చిక్కుకొని.. తన వద్ద ఉన్న నగదును పోగొట్టుకొని.. వివిధ అవసరాల నిమిత్తం అంటూ గ్రామస్తుల వద్ద రూ.26 లక్షల వరకు అప్పు చేశారు. సర్వస్వాన్ని బెట్టింగుల్లో పెట్టి నిండా మునిగిపోయారు. దీంతో అప్పిచ్చిన వారు పది నెలలుగా అడుగుతుండటంతో రేపు.. మాపు అంటూ సాగదీశారు. రెండు నెలల నుంచి ఒత్లిళ్లు అధికమవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయారు. తల్లితో ఫోన్లో అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఆరోగ్యంపై ఆరా తీస్తూ జాగ్రత్తలు చెప్పేవారు. ఈ నేపథ్యంలో దుత్తలూరులోని అన్న ఇంటికి రెండు రోజుల క్రితం వచ్చారు. విషయం తెలుసుకున్న కొంతమంది అక్కడికెళ్లి బాకీ డబ్బులివ్వాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన ప్రతాప్.. భోజనం చేసి ఒక గదిలో ఒంటరిగా మంగళవారం రాత్రి నిద్రించారు. తన సోదరుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడాన్ని బుధవారం తెల్లవారుజామున గమనించిన సోదరుడు లబోదిబోమంటూ ఇరుగుపొరుగు వారికి చెప్పారు. మృతదేహాన్ని స్వగ్రామం రంగనాయుడుపల్లికి తీసుకెళ్లారు. వివరాలను స్థానిక పోలీసులు ఆరాతీసి కేసు నమోదు చేశారు. పోస్ట్మార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు ఎస్సై ఆదిలక్ష్మి తరలించారు. అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఆన్లైన్ బెట్టింగుల్లో చిక్కుకొని దుత్తలూరు మండలం కొత్తపేటలో ఓ యువకుడు రూ.17 లక్షలు పోగొట్టుకున్న ఉదంతం మరువకముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. -
గండిపాళెం జలాశయంలో గాలింపు
ఉదయగిరి రూరల్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్ జిల్లాకు చెందిన సౌరభ్కుమార్ మండలంలోని గండిపాళెం జలాశయంలో మంగళవారం గల్లంతైన విషయం తెలిసిందే. అతని కోసం బుధవారం ఎస్సై శ్రీనివాసులు, ఫైర్ సిబ్బంది మత్స్యకారుల సహకారంతో జలాశయంలో ముమ్మరంగా గాలించారు. గంజాయి స్వాధీనం● పోలీసుల అదుపులో ముగ్గురు ఆత్మకూరు: ముగ్గురు యువకుల వద్ద గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఆత్మకూరు ఎస్సై బి.సాయిప్రసాద్ వివరాలు వెల్లడించారు. మున్సిపల్ పరిధిలోని బట్టేపాడు మార్గంలో ముగ్గురు వ్యక్తులు గంజాయి తాగుతున్నారని పోలీసులకు సమాచారం అందడంతో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద కొంత గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బట్టేపాడుకు చెందిన ముగ్గురిని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. కాకాణిపై పోలీసులకు సోమిరెడ్డి ఫిర్యాదునెల్లూరు సిటీ: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డిపై నెల్లూరు రూరల్ పోలీస్స్టేషన్లో బుధవారం రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావుకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాకాణి కండీషన్ బెయిల్పై ఉన్నాడనే విషయం గుర్తు పెట్టుకోవాలని, ఆయన్ను వదిలిపెట్టేది లేదన్నారు. ఆస్తులను ఉదారంగా వదిలేసిన తాము శివాలయం భూమిని అమ్ముకుంటామా అని ప్రశ్నించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు.డీసీసీ అధ్యక్షుడి మార్పు?నెల్లూరు(వీఆర్సీసెంటర్): కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడ్ని మార్చే అవకాశాలున్నట్టు విశ్వసనీయ సమాచారం. వారంరోజుల నుంచి ఏఐసీసీ పరిశీలకుడు, తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే హసన్ మౌలానా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ క్రమంలో డీసీసీ అధ్యక్షుడిని మార్చాలని పలువురు ఆయన దృష్టికి తీసుకురావడం, కొందరు పదవి కోసం దరఖాస్తులు ఇవ్వడం జరిగింది. రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం తగిన మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 10 సంవత్సరాలుగా డీసీసీ అధ్యక్షుడిగా చేవూరు దేవకుమార్రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆశించిన స్థాయిలో జిల్లాలో పార్టీ బలోపేతం కాకపోవడంతో మరో వ్యక్తిని నియమించే అవకాశముందని సీనియర్ నాయకులు చెబుతున్నారు. కండలేరులో 58.780 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 58.780 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 2,600 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 850, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 100, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
పలు మండలాల్లో కుంభవృష్టి
వర్షపాతం ఇలా.. నెల్లూరు అర్బన్ 78.6 కోవూరు 79.6నెల్లూరు రూరల్ 107.0 తోటపల్లిగూడూరు 120.8సైదాపురం 98.6 ముత్తుకూరు 160.4మనుబోలు 158.8ఇందుకూరుపేటలో 68.8, పొదలకూరులో 66, విడవలూరులో 64.8, కొడవలూరులో 49.8, అల్లూరులో 40.6, బోగోలులో 42.2, బుచ్చిరెడ్డిపాళెంలో 34.2, దగదర్తిలో 28.4, జలదంకిలో 27.8, రాపూరులో 17.2, ఉలవపాడులో 14.2, గుడ్లూరులో 10.2, చేజర్లలో 8.2, సంగంలో 8.2, కందుకూరులో 6.2, కలువాయిలో 5.4, కావలిలో 7.6, అనంతసాగరంలో 4.4, కలిగిరిలో 3.8, కొండాపురంలో 3.2, ఉదయగిరిలో 2.8, ఆత్మకూరులో 2.6, ఏఎస్పేటలో 2.2, లింగసముద్రం, వలేటివారిపాళెంలో 2, వింజమూరులో 1.8, మర్రిపాడులో 1.6, సీతారామపురంలో 1.2 మిల్లీమీటర్ల వర్షం పడింది. -
పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి
● కలెక్టర్కు సీపీఎం నేతల వినతి నెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరు ఆర్టీడీ కాలనీలో గంజాయి ముఠా చేతిలో హత్యకు గురైన ప్రజానాట్య మండలి కళాకారుడు కె.పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లాను సీపీఎం నేతలు కోరారు. నాయకులు, పెంచలయ్య భార్య, ఇద్దరు కుమారులు బుధవారం కలెక్టర్ను ఆయన ఛాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఉన్నతాశయం కోసం పనిచేసిన పెంచలయ్య కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా, ఆయన భార్య దుర్గకు ప్రభుత్వ ఉద్యోగం, కుమారుల చదువులకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు. సాగు భూమి కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి మూలం రమేష్, మాదాల వెంకటేశ్వర్లు, నాయకులు పాల్గొన్నారు. -
గర్భిణి ఆత్మహత్య
● అత్తింటి వేధింపులే కారణమని బంధువుల ఆరోపణదుత్తలూరు: ఉరేసుకుని గర్భిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని నందిపాడులో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఉదయగిరి మండలం దేవలాలగడ్డకు చెందిన షేక్ కుబ్రా (18) చిన్నతనంలోనే తల్లి చనిపోయింది. కొన్నేళ్లకు తండ్రి మృతిచెందాడు. దీంతో బంధువులు ఆమెను దుత్తలూరు మండలంలోని నందిపాడు గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ రఫీకిచ్చి గత ఆగస్టులో వివాహం చేశారు. కాగా యువతి ఇటీవల గర్భం దాల్చింది. దీంతో బంధువుల ఇంటికెళ్లి వస్తానని అత్తారింట్లో చెప్పింది. కాగా కుబ్రా బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుంది. అత్త రసూల్బీ ఇంటికొచ్చి చూసి కేకలు వేసింది. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఉదయగిరి సీఐ వెంకట్రావు, తహసీల్దార్ యనమల నాగరాజు, ఎస్సై ఆదిలక్ష్మిలు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా అత్తింటి వేధింపులతోనే కుబ్రా ఆత్మహత్య చేసుకుందని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి పెద్దమ్మ గౌసియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఆటో, మోటార్బైక్ల దొంగ అరెస్ట్
● రూ.5.20 లక్షల విలువైన వాహనాల స్వాధీనం నెల్లూరు(క్రైమ్): రోడ్లపై పార్క్ చేసిన ఆటో, ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు చిన్నబజారు పోలీస్స్టేషన్లో బుధవారం ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు వివరాలను వెల్లడించారు. మనుబోలు మండలం కాగితాలపూరుకు చెందిన మీర్జా జుల్ఫీకర్ అలీ గత నెల 22వ తేదీన తన ఆటోను నెల్లూరు పొగతోటలోని వెంకటరమణ హోటల్ వద్ద పార్క్ చేసి టిఫిన్ చేసేందుకు వెళ్లాడు. తిరిగొచ్చిచూడగా వాహనం కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సాంకేతికత ఆధారంగా నిందితుడు నెల్లూరు రూరల్ మండలం యలమవారిదిన్నెకు చెందిన పి.కల్యాణ్ కుమార్గా గుర్తించారు. బుధవారం నిందితుడు తన ఇంట్లో ఉన్నాడని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దొంగతనం చేసిన ఆటోలో కల్యాణ్ పారిపోయేందుకు యత్నించగా అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి విచారించారు. నెల్లూరు చిన్నబజారు, సంతపేట, తిరుపతి జిల్లా గూడూరు తదితర ప్రాంతాల్లో ఒక ఆటో, 11 మోటార్బైక్లను చోరీ చేసినట్లు అంగీకరించాడు. దొంగతనానికి గురైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కల్యాణ్ వాచ్మెన్గా పనిచేసే సమయంలో వ్యసనాలకు బానిసయ్యాడని, నగదు కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఇన్స్పెక్టర్ చెప్పారు. కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్, ఎస్సై అబ్దుల్ రజాక్, క్రైమ్ పార్టీ సిబ్బంది జె.సురేష్ బాబు, ఎస్వీ శ్యామ్ప్రసాద్, ఎం.సుబ్బారావు, కె.వర్ధన్, షేక్ రియాజుద్దీన్, కె.దేవనాయుడు, ఎన్.దయాశంకర్, కె..విజయ్కుమార్ను పోలీసు ఉన్నతాధికారులు అభినందించి రివార్డులను ప్రకటించారు. -
నేదురుమల్లితో ప్రసన్న భేటీ
నెల్లూరు(స్టోన్హౌస్పేట): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డితో నగరంలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపే అంశమై చర్చించారు. పార్టీ చిల్లకూరు మండల కన్వీనర్ మధురెడ్డి, మల్లు విజయ్కుమార్రెడ్డి, చిట్టమూరు రాజారెడ్డి, పలగాటి సంపత్కుమార్రెడ్డి, వీరి చలపతిరావు, కొండూరు అనిల్బాబు, నల్లపరెడ్డి రాజేంద్రకుమార్రెడ్డి, కలువ బాలశంకర్రెడ్డి, చిల్లకూరు సాయిప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. కార్గో హ్యాండ్లింగ్లో రికార్డు ముత్తుకూరు(పొదలకూరు): కృష్ణపట్నం పోర్టులో మెకనైజ్డ్ బెర్త్లో ఒక్క రోజులోనే 1,32,800 మెట్రిక్ టన్నుల కార్గోను హ్యాండ్లింగ్ చేశారు. దీంతో సరికొత్త రికార్డును నెలకొల్పామని సీఈఓ జగదీష్ పటేల్ బుధవారం పేర్కొన్నారు. నెలవారీ ఎరువులను 0.43 ఎమ్మెమ్టీలను విజయవంతంగా నిర్వహించి, గతేడాది డిసెంబర్ కంటే అధిక ప్రగతిని సాధించామని వెల్లడించారు. క్షేమంగా ఉన్నా.. ఎవరూ ఆందోళన చెందొద్దు కావలి(అల్లూరు): తాను క్షేమంగా ఉన్నానని.. ఎవరూ ఆందోళన చెందొద్దని.. త్వరలోనే మీ ముందుకొస్తానని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్చార్జి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటనను బుధవారం విడుదల చేశారు. బైపాస్ సర్జరీ విజయవంతంగా జరిగిందని, ఇప్పుడు క్షేమంగా ఉన్నానని చెప్పారు. రక్త పరీక్షలను సకాలంలో చేయాలి నెల్లూరు(అర్బన్): ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు.. రక్త పరీక్షలను సకాలంలో చేయాలని డీఎంహెచ్ఓ సుజాత సూచించారు. సంతపేటలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో ల్యాబ్ టెక్నీషియన్లతో బుధ వారం నిర్వహించిన నెలవారీ సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. నాణ్యతతో కూడిన రక్త పూతలను సేకరించి మలేరియా, ఫైలేరియా కేసులను నిర్ధారించాలని కోరారు. పరీక్ష ఫలితాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఏడీఎంహెచ్ఓ ఖాదర్వలీ, జిల్లా మలేరియా నివారణాధికారి హుస్సేనమ్మ, సహాయ మలేరియా నివారణాధికారి నాగార్జునరావు పాల్గొన్నారు. -
లారీ ఢీకొని ట్యాంకర్ డ్రైవర్ మృతి
నెల్లూరు(క్రైమ్): మరమ్మతులకు గురైన పాల ట్యాంకర్ను పరిశీలిస్తున్న డ్రైవర్ను లారీ వెనుక నుంచి వేగంగా ఢీకొంది. దీంతో ట్యాంకర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందిన ఘటన కనుపర్తిపాడు క్రాస్రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కృష్ణా జిల్లా చల్లపల్లికి చెందిన వి.సాంబశివరావు (64) పాల ట్యాంకర్ డ్రైవర్. అతను బుధవారం విజయవాడ నుంచి ట్యాంకర్తో చైన్నెకు బయలుదేరాడు. కనుపర్తిపాడు క్రాస్రోడ్డు సమీపంలోకి వచ్చేసరికి ట్యాంకర్ బ్రేక్డౌన్ అయ్యింది. దీంతో డ్రైవర్ ట్యాంకర్ను ఆపి వెనుక వైపు పరిశీలిస్తుంగా కావలి నుంచి చైన్నె వైపు ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ వేగంగా అతడిని ఢీకొని డివైడర్ మధ్యలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో సాంబశివరావు తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న సౌత్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె.వెంకటరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి బాధిత కుటుంబానికి సమాచారం అందించారు. ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. -
సాయమందించడంలో విఫలం
● తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడంలోనూ వైఫల్యమే ● ప్రభుత్వంపై ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్రెడ్డి వెంకటాచలం: దిత్వా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు సాయమందించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. వెంకటాచలంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం ఆయన పర్యటించారు. భారీ వర్షాలతో జలమయమైన కాలనీలను సందర్శించి, ప్రజల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వరదనీటితో మునిగిన కోల్కతా – చైన్నె జాతీయ రహదారిని పరిశీలించారు. పలు కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరడంతో వంట చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న వారికి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోజన సదుపాయాలను పరిశీలించిన అనంతరం కాకాణి మాట్లాడారు. జిల్లాలో మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నా, ముందస్తు చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం, అధికార పార్టీ నేతలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని ధ్వజమెత్తారు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొన్నా, అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని చెప్పారు. మంత్రులున్నారో లేరో తెలియక జిల్లా అనాథగా మారిందని మండిపడ్డారు. అంతా ప్రచారార్భాటమే.. చంద్రబాబుకు ప్రచారార్భాటం తప్ప, ప్రజలకు మేలు చేసే ఆలోచన రాకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో భారీ వర్షాలొస్తే అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారని గుర్తుచేశారు. సోమిరెడ్డికి అవినీతి సంపాదనే తప్ప, ప్రజల కష్టాలను పట్టించుకునేందుకు సమయం వెచ్చించడంలేదని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డిని విమర్శిస్తూ.. ఫొటోలకు పోజులిస్తూ.. కాలయాపన చేస్తున్నారే తప్ప, ప్రజల సమస్యలను పరిష్కరించే బాధ్యత తీసుకోవడంలేదని ఎద్దేవా చేశారు. తమ పార్టీ ప్రజాప్రతినిధులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ.. పదవుల నుంచి తొలగిస్తుండటంతో ఆయా గ్రామాల్లో సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్లు మంజూరు చేసి.. నిర్మిస్తే, వాటికి గృహ ప్రవేశాలను ప్రస్తుత ప్రభుత్వం చేయిస్తూ ప్రచారం చేసుకోవడాన్ని విమర్శించారు. తుఫాన్తో ఇబ్బందులు పడుతున్న వారిని ప్రభుత్వం, అధికారులు పట్టించుకోకపోవడంతో.. ఆ బాధ్యతను తమ పార్టీ తీసుకుందని చెప్పారు. ప్రజలకు అవసరమైన ప్రతి చోట వసతి, భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నామని వెల్లడించారు. పంట పొలాల్లో పరిశీలన మండలంలోని కసుమూరులో నీటమునిగిన పంట పొలాలను రైతులతో కలిసి కాకాణి గోవర్ధన్రెడ్డి పరిశీలించారు. నారుమడులు పూర్తిగా మునిగిపోయాయని, ఇటీవల వరినాట్లేసిన పొలాల్లోకి నీరు చేరడంతో తాము నష్టపోయామని వాపోయారు. రైతుల సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నా ఏ మాత్రం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. వర్షాలకు దెబ్బతిన్న నారుమడులకు సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. నష్టంపై అధికారులు వెంటనే అంచనా వేసి పరిహారాన్ని అందజేయాలని పేర్కొన్నారు. జెడ్పీటీసీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నేతలు మందల పెంచలయ్య, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. -
కోనలో వైభవంగా హనుమద్వ్రతం
రాపూరు: హనుమద్వ్రతం పురస్కరించుకుని జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో బుధవారం ఆంజనేయస్వామికి అభిషేకం, ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. పెంచలకోన క్షేత్రంలో పెనుశిల లక్ష్మీనరసింహ స్వామికి అభిముఖంగా ఉన్న క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామి మూలమూర్తికి ఉదయం పాలు, తేనె, పెరుగు, పంచామృతాలతో అభిషేకం, పూలంగిసేవ నిర్వహించారు. 8 గంటలకు తిరుచ్చిపై స్వామి ఉత్సవ విగ్రహాన్ని కొలువుదీర్చి వివిధ రకాలు ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలకరించారు. వేదపండితులు ఆస్థాన సేవ నిర్వహిచారు. -
పాత నేరస్తుడి ఇంట్లో తనిఖీలు
● గంజాయి, ఇతర వస్తువుల స్వాధీనం కావలి(అల్లూరు): కావలి పట్టణానికి చెందిన దేవరకొండ సుధీర్బాబు అనే పాత నేరస్తుడిని కావలి టు టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కావలి డీఎస్పీ పి.శ్రీధర్ టు టౌన్ పోలీస్స్టేషన్లో బుధవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎస్పీ ఆదేశాల మేరకు సుధీర్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. రూ.6.24 లక్షల విలువైన 24.970 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా పలు వెండి, రోల్డ్ గోల్డ్ వస్తువులు, హర్డ్డిస్క్లు, బేడీలు, క్యాష్ కౌటింగ్ మెషీన్, ఖాళీ బ్రీఫ్కేసులు, ఒక ట్యాబ్, రెండు ఫోన్లు, రూ.20,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇతడిపై గతంలో40 కేసులున్నాయి. టు టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోనే 28 కేసులున్నట్లు డీఎస్పీ తెలియజేశారు. ఒడిశా, ఆంధ్రా సరిహద్దుల్లో గంజాయిని కేజీ రూ.500కు కోనుగోలు చేస్తున్నాడు. దానిని ఇక్కడికి తీసుకొచ్చి కేజీ రూ.25 వేలకు అమ్ముతున్నట్లు చెప్పారు. సుధీర్పై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
గంజాయి కేసులో దంపతుల అరెస్ట్
● 7 కిలోల స్వాధీనం కొడవలూరు: గంజాయి కేసులో భార్యాభర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొడవలూరు పోలీస్స్టేషన్లో మంగళవారం సీఐ ఎ.సురేంద్రబాబు వివరాలు వెల్లడించారు. బక్కి చినరాజా, లక్ష్మీది తెలంగాణ రాష్ట్రం కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలం సారపాక గ్రామం. వీరు నెల్లూరు డైకస్ రోడ్డులోని చాణక్యపురి కాలనీలో స్థిరపడ్డారు. ఇద్దరూ కొడవలూరు మండలం గండవరం ఫ్లై ఓవర్ వద్ద సోమవారం అనుమానాస్పదంగా తిరుగుతుండగా కొడవలూరు, విడవలూరు ఎస్సైలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం పట్టుకుంది. వారి వద్ద ఏడు కిలోల గంజాయిని గుర్తించారు. డిప్యూటీ ఎంపీడీఓ సమక్షంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను పట్టుకున్న ఎస్సైలు సీహెచ్ కోటిరెడ్డి, పి.నరేష్, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అజిత అభినందించి రివార్డులు ప్రకటించారు. -
మార్కెటింగ్పై రైతులకు శిక్షణ
నెల్లూరు(పొగతోట): ఎఫ్పీఓల్లో ఉన్న రైతులకు పంటల సాగు, మార్కెటింగ్ తదితర అంశాలపై పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి ఆదేశించారు. మంగళవారం నెల్లూరులోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్పీఓ)లు, ఏపీఎంలు, సీసీలు, బీఓడీలు తదితరులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పీడీ మాట్లాడారు. సంస్థలోని కార్యక్రమాలు అమలు చేయడానికి ఉత్సాహవంతులైన రైతులను డైరెక్టర్లుగా ఎంపిక చేసుకోవాలన్నారు. ఎరువులు, విత్తనాలు ఏర్పాటు చేసుకునేలా లైసెన్సుల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. పండించిన పంటలకు ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ కల్పించాలన్నారు. శిక్షణ, యంత్రాలకు బ్యాంక్ల నుంచి రుణాల మంజూరుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఎన్జీఓ డాక్టర్ ఎన్వీఆర్ గణేష్ మాట్లాడుతూ ఏడు జిల్లాల్లో 72 ఎఫ్పీఓలను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 5న మెగా పీటీఎంనెల్లూరు(టౌన్): జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈనెల 5వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులచే అమలు జరుగుతున్న కార్యక్రమాలు, అసెస్మెంట్ బుక్లెట్లు, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు, స్పోర్ట్స్ కిట్స్, పాఠశాల ప్రగతిని ప్రదర్శించాలన్నారు. , సౌకర్యాలపై చర్చ, ఫీడ్బ్యాక్ సేకరణ, ముగింపు సెషన్లను నిర్వహించాలన్నారు. తల్లిదండ్రులు, సంరక్షకులు మీటింగ్లో తప్పకుండా పాల్గొనాలని కోరారు. కండలేరులో 58.690 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 58.690 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 5,100 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 850, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 100, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.12 సన్నవి : రూ.6 పండ్లు : రూ.3 -
గండిపాళెంలో యూపీ వ్యక్తి గల్లంతు
ఉదయగిరి: ఆ యువకుడిది పేద కుటుంబం.. తల్లిదండ్రులకు అసరాగా ఉండేందుకు ఉపాఽధి నిమిత్తం ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాడు. ఈ క్రమంలో గండిపాళెం జలాశయంలో గల్లంతైన ఘటన మంగళవారం జరిగింది. పోలీసులు, మృతుడి మిత్రుల కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్కు చెందిన సౌరభ్ (24) వారం రోజుల క్రితం మిత్రులతో కలిసి ప్రకాశం జిల్లా పామూరుకు వచ్చాడు. మేసీ్త్ర చెప్పిన ప్రాంతాలకు వెళ్లి పెయింట్ పనులు చేశాడు. మూడు రోజుల నుంచి వరికుంటపాడు మండలం కాంచెరువులో ఓ భవనంలో పని చేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం నిత్యావసర సరుకుల కోసం స్నేహితుడితో కలిసి గండిపాళెం వచ్చాడు. తిరిగెళ్తూ జలాశయాన్ని చూసేందుకు వెళ్లారు. లోతట్టు గేటు వద్ద ఉన్న నీటిని సౌరభ్ అందుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయాడు. మిత్రుడు కేకలు వేయడంతో అక్కడున్న వారు రక్షించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు. రెస్క్యూ టీమ్కు సమాచారం అందించారు. -
యువత నాశనం
గంజాయి, డ్రగ్స్ నేరాల్లో ● గాడితప్పుతున్న యువత ● గంజాయికి బానిసలవుతున్న వైనం ● పెంచలయ్య హత్య కేసులో నిందితుల వయసు 18 నుంచి 25 ఏళ్ల లోపే.. నెల్లూరు(క్రైమ్): యువత వ్యసనాల బాటపడుతోంది. మత్తు అనే చెడు సరదా కోసం బంగారు భవిష్యత్ను పణంగా పెట్టి కన్నవారి కలల్ని మరిచి నేరాలకు పాల్పడుతూ జీవితాన్ని నాశనం చేసుకుంటోంది. ఆర్టీడీ కాలనీకి చెందిన ఉద్యమకారుడు, ప్రజానాట్య మండలి కళాకారుడు పెంచలయ్యను గంజాయి బ్యాచ్ పొట్టనబెట్టుకుంది. హత్యలో పోలీసులు అరెస్ట్ చేసిన ఏడుగురు నిందితుల్లో ఆరుగురి వయసు 18 నుంచి 25 సంవత్సరాల్లోపే. ఇటీవల నెల్లూరు రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో గంజాయి విక్రయాలు, నకిలీనోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయిన నిందితుల్లో ముగ్గురి వయసు 25ఏళ్ల లోపే. వారే లక్ష్యంగా.. ప్రధానంగా యువత, విద్యార్థులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు సాగుతున్నాయి. తొలుత సరదాగా అలవాటు చేసుకున్న కొందరు మత్తుకు బానిసలవుతున్నారు. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్మనీ, తమ సంపాదనంతా గంజాయికే ఖర్చు పెడుతున్నారు. మత్తుకు సరిపడా నగదు లేని వారు స్మగ్లర్లుగా అవతారమెత్తుతున్నారు. ఇంకొందరు కమీషన్ పద్ధతిపై అక్రమ రవాణాకు, విక్రయాలకు పాల్పడుతున్నారు. బానిసలుగా మార్చి.. కొందరు గంజాయి వ్యాపారులు యువకులను చేరదీసి మత్తును రుచి చూపిస్తున్నారు. క్రమేపీ వారిని బానిసలుగా మార్చి తమ అవసరాలకు వాడుకుంటున్నారు. వారిచే గంజాయి అమ్మించడంతోపాటు నిత్యం మత్తులో జోగేలా చేసి తమకు అడ్డొచ్చిన వారిపై దాడులు, దౌర్జన్యాలతోపాటు హత్యలు చేయించేందుకూ వెనుకాడటం లేదు. ఇటీవల జరిగిన పలు ఘటనల్లో నిందితులు గంజాయి మత్తులోనే నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇదిలా ఉంటే కొందరు వ్యక్తులు తమ రాజకీయ అవసరాలకు యువతకు మత్తు అలవాటు చేసి వెంట తిప్పుకొంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోకపోవడంతో యువత చెడుమార్గం పడుతున్నారు. వారు తమ బిడ్డల నడవడి, స్నేహాలు తదితరాలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడూ దిశానిర్దేశం చేయాలి. హద్దు మీరితే దండించాలి. ఇష్టారాజ్యంగా.. జిల్లాలో గంజాయి గుప్పుమంటోంది. చదువుకోవాల్సిన వయసులో యువత పెడదారిపడుతూ మత్తులో జోగుతోంది. ఖాళీ స్థలాలు, శివారు ప్రాంతాలు, పాడుబడిన భవనాల్లో చేరి గంజాయి తాగుతున్నారు. మత్తు వారిని చిత్తు చేస్తోంది. విచక్షణ కోల్పోయి ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితుల్లో నేరాలకు తెగబడుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని నేరాల్లో గంజాయి వినియోగం తేటతెల్లమవడం పోలీసులు క్షేత్రస్థాయిలో దృష్టిసారించాల్సిన ఆవస్యకతను స్పష్టం చేస్తోంది. -
భయం గుప్పెట్లో ఆర్టీడీ కాలనీ
● గంజాయి బ్యాచ్కు చెందిన ఆరు ఇళ్లు ధ్వంసం ● ఓ ఇంట్లో బయటపడిన కత్తి ● కాలనీలో కొనసాగుతున్న పోలీస్ పికెట్నెల్లూరు సిటీ: గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు, ప్రజానాట్య మండలి కళాకారుడు పెంచలయ్య పాశవిక హత్యతో ఆర్టీడీ కాలనీవాసులు భయం గుప్పెట్లో బతుకుతున్నారు. గంజాయి బ్యాచ్ చేసిన హత్యతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళనలో ఉన్నారు. పోలీసులు కాలనీలో పికెట్ ఏర్పాటు చేశారు. పెంచలయ్య మృతికి కారణమైన అరవ కామాక్షి, అనుచరుల ఇళ్లను సోమవారం రాత్రి స్థానికులు ధ్వంసం చేశారు. ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఓ ఇంట్లో తుప్పుపట్టిన పెద్ద కత్తి మంగళవారం బయటపడింది. కామాక్షి, హత్యలో నేరుగా ప్రమేయం ఉన్నవారిని పోలీసులు అరెస్ట్ చేసినా కాలనీ వాసుల్లో ఇంకా భయం పోలేదు. ఉద్యమకారుడు, పార్టీ నేతనే ఇలా మట్టుపెట్టారంటే, సామాన్యులమైన తమ పరిస్థితి ఏమిటని స్థానికులు చర్చించుకుంటున్నారు. మాటలు, పాటలు తలుచుకుంటూ.. ఉద్యమకారుడు, కళాకారుడిగా, సీపీఎం నేతగా ఉంటూ ఆర్టీడీ కాలనీలో గంజాయిని తరిమికొట్టాలని నిరంతర పోరాటం చేసిన పెంచలయ్య మాటలను కాలనీవాసులు గుర్తుతెచ్చుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. అతను కాలనీలో పోలీసులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. అదే విధంగా తన కళతో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఇప్పుడు ఆ మాటలు, పాటలు లేక కాలనీ మూగబోయిందని ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. -
సకాలంలో చికిత్స అవసరం
నెల్లూరు(అర్బన్): స్క్రబ్ టైఫస్.. ఈ వ్యాధి కలవరపెడుతోంది. రెండు రోజుల క్రితం రాష్ట్రంలో ఓ మహిళ ఈ వ్యాధితో మరణించింది. జిల్లాలో కొన్ని నెలలుగా కేసులు నమోదవుతున్నాయి. పలువురు గాలితీసుకోలేక ఆయాసంతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. రోగుల కుటుంబాలు అప్పుల పాలవుతున్నాయి. ఇంత జరుగుతున్నా వైద్యశాఖ తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తోందని విమర్శలున్నాయి. మైట్ కీటకంతోనే.. ఓరియంటియా సుత్సుగముషి అనే బ్యాక్టీరియాతో స్క్రబ్ టైఫస్ వ్యాధి వస్తుంది. నల్లిని పోలిన మైట్ అనే కీటకం మనిషిని కుట్టినప్పుడు దాని ద్వారా బ్యాక్టీరియా ప్రవేశించి జబ్బు కలిగిస్తోంది. ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్యలో ఎక్కువగా ప్రబలుతోంది. అటవీ ప్రాంతాలు, పొదలు, గడ్డి ఎక్కువగా ఉండే ప్రాంతాలు, పశువుల పాకలు తదితర ప్రదేశాల్లో స్క్రబ్ టైఫస్ వ్యాధిని కలిగించే కీటకాలుంటాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే అధికం. గుర్తు ఆధారంగా.. కీటకం కరిచిన చోట నల్లటి మచ్చ లేదా పుండు (స్కార్) ఉంటుంది. ఈ గుర్తును ఆధారంగా స్క్రబ్ టైఫస్ జబ్బుగా అనుమానించాలి. వారం, పదిరోజులుగా జ్వరం రావడం, కండరాల నొప్పులు, ఒళ్లు నొప్పులు, దద్దుర్లు, వాపు, వణుకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, వాంతులు, అలసట తదితర లక్షణాలుంటే ఎలీసా ఐజీజీ, ఐజీఎం, ఆర్టీపీసీఆర్, మైక్రోస్కోపి పరీక్షలు చేయించుకోవాలి. ర్యాపిడ్ పద్ధతిలో కూడా నిర్ధారిస్తున్నారు. పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ పద్ధతిలో చేసే పరీక్షలను వైద్యశాఖ అంగీకరించడం లేదు. అందువల్ల వాస్తవాలు వెలుగు చూడటం లేదు. కేసులు అంతే.. జిల్లాలోని పలు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఇప్పటి వరకు 58 కేసులే నమోదయ్యాయని వైద్యశాఖాధికారులు ప్రకటించడం విశేషం. శంకరాగ్రహారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోనే గత నెలలో 20కి పైగా కేసులు వచ్చాయి. అధికారులు కాకిలెక్కలు చూపుతూ కొన్నింటిని మాత్రమే రికార్డు చేస్తున్నారని విమర్శలున్నాయి. కేసులు నమోదైతే ఐహెచ్ఐపీ (ఇంటర్నేషనల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ పోర్టల్)లో ప్రభుత్వ, ప్రైవేట్ డాక్టర్లు నమోదు చేయాల్సి ఉంది. వైద్యశాఖ నుంచే వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యం ఈ పోర్టల్లో పాజిటివ్ కేసులను సైతం నమోదు చేయడం లేదని తెలుస్తోంది. అనుమానాస్పద కేసులకు పరీక్షలు చేయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలవరం నల్లిని పోలిన కీటకం.. కరిస్తే ప్రాణాంతకం ప్రైవేట్ ఆస్పత్రుల్లో పదుల సంఖ్యలో కేసులు అధికారిక లెక్కల్లో 58 మాత్రమే అంట వైద్యశాఖ కాకిలెక్కలు స్క్రబ్ టైఫస్ వ్యాధి మొదట జ్వరంతోనే ప్రారంభమవుతుంది. అయితే డెంగీ, మలేరియా లాంటి పరీక్షలు చేయించుకుంటున్న రోగులు స్క్రబ్ టైఫస్ పరీక్షలు చేయించుకోవడం లేదు. డాక్టర్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. సాధారణ జ్వరంగా భావించి మందులు రాస్తున్నారు. అయితే మొదట్లోనే గుర్తించి యాంటీ బయాటిక్స్ వాడితే తగ్గిపోతోంది. వారం, పదిరోజుల వరకు నిర్లక్ష్యం చేసి తర్వాత పరీక్ష చేయించుకునే లోపు వ్యాధి తీవ్రత పెరిగిపోతుంది. సకాలంలో వైద్యం అందకపోతే తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు, మెదడు, వెన్నెముక వాపు, కిడ్నీలు ఫెయిలవడం లాంటివి జరిగి ప్రాణాలు పోయే అవకాశాలున్నాయి. చికిత్స ఉంది స్క్రబ్ టైఫస్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాస్పత్రుల్లో అన్ని రకాల యాంటీ బయాటిక్స్, ఇతర మందులున్నాయి. జ్వరం వస్తే ఆర్ఎంపీ వద్దకెళ్లడం, సొంతంగా జ్వరం మాత్రలు వేసుకోవడం చేయొద్దు. అయితే ప్రాథమిక దశలోనే డాక్టర్ల సలహాలు తీసుకోవడం మంచిది. ప్రభుత్వాస్పత్రుల్లో పరీక్షలు చేస్తున్నాం. – సుజాత, జిల్లా వైద్యశాఖాధికారి నిర్లక్ష్యం వద్దు స్క్రబ్ టైఫస్ అనే జబ్బు పరీక్షల్లో మాత్రమే తెలుస్తోంది. అందువల్ల జ్వరం వచ్చినప్పుడు సొంత వైద్యం చేయించుకోకుండా డాక్టర్ను కలిసి సలహాలు తీసుకోవాలి. లక్షణాలను బట్టి పరీక్ష చేసి వైద్యం చేస్తారు. మొదట్లోనే ఈ జబ్బును కనుక్కుంటే నయం చేసుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి తీవ్రమైన సమస్యగా మారుతుంది. – డాక్టర్ గంగాధర్, నెల్లూరు -
మతిస్థిమితం లేని మహిళ గృహనిర్బంధం
● ఖైదీలకు పెట్టినట్లుగా భోజనం అందజేత ● కొత్తకోడూరులో అమానుషం తోటపల్లిగూడూరు: మతి స్థిమితం బాగా లేదని ఏడాదిగా ఓ మహిళను గృహనిర్బంధం చేసిన ఘటన మండలంలోని కొత్తకోడూరులో వెలుగు చూసింది. స్థానికుల వివరాల మేరకు.. కోడూరు పంచాయతీ కొత్తకోడూరు గ్రామానికి చెందిన 60 ఏళ్ల రత్నమ్మ మతిస్థిమితం సరిలేక ఇబ్బందులు పడుతోంది. అవివాహితురాలైన ఆమె వయస్సులో ఉన్నప్పుడు తోడబుట్టిన అక్కకు చేదోడు వాదోడుగా ఉండేది. ఈ క్రమంలోనే అక్క తన చెల్లి బాగోగులు చూసేది. కొద్ది కాలం తర్వాత అక్క చనిపోగా బావ, ఇతర బంధువులు మానసిక రోగి అయిన రత్నమ్మ బాగోగులను విస్మరించారు. వారందరూ నెల్లూరులో ఉంటూ ఆమెను కొత్తకోడూరులోని ఓ పురాతన ఇంట్లో నిర్బంధం చేశారు. మతిస్థిమితం లేదనే సాకుతో జనంలోకి రాకుండా అమానుషంగా గదిలో కట్టడి చేశారు. రత్నమ్మకు ప్రతి నెలా వచ్చే రూ.6 వేల పింఛన్, 35 కేజీల రేషన్ బియ్యాన్ని ఆమె బావ తీసుకొంటూ ఒక్క పూట మాత్రమే ఆమెకు భోజనం పెట్టేలా ఒకరిని నియమించాడు. అతను ఆ పూట భోజనం కూడా జైల్లో ఖైదీకి మాదిరిగా వరండాలోనే విసిరేసి వెళ్తుంటారు. భోజనంతో పాటు ఇతర కాలకృత్యాలన్నీ ఆ నాలుగు గోడల మధ్య కానించాల్సిన పరిస్థితి ఆమెది. ఒంటరిగా ఉన్న రత్నమ్మ రాత్రి పూట భయానికి ఏడస్తూ, పెద్ద పెద్దగా కేకలు వేస్తుండడంతో స్థానికులకు కంటిమీద కునుకులేకుండా పోతోంది. ఈ క్రమంలో స్థానికులు మంగళవారం మీడియా దృష్టికి తీసుకొచ్చారు. రత్నమ్మకు సంబంధించిన అన్నీ తీసుకొంటూ ఆమెను ఇలా ఓ పిచ్చిదానిలాగా ఒంటరిగా వదలి వేయడం అమానుషమన్నారు. మానవత్వంతో ఆలోచించి ఇంటికి తీసుకెళ్లడమా లేదా అనాఽథ ఆశ్రమంలో చేర్పించడమో చేయాలని ఆమె బావను కోరారు. -
మెడికోల ఆత్మహత్యల నివారణకు చర్యలు
నెల్లూరు(అర్బన్): రాష్ట్రంలోని అన్ని వైద్య కళాశాలల్లో మెడికల్ విద్యార్థులు భవిష్యత్తులో ఆత్మహత్యలకు పాల్పడకుండా తగిన కార్యాచరణను సిద్ధం చేసి అమలు చేయనున్నామని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) డాక్టర్ రఘునందన్ అన్నారు. నెల్లూరు ప్రభుత్వ వైద్యకళాశాలలో రెండు నెలల కాలంలో ఇద్దరు మెడికోలు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో మంగళవారం ఆయన కళాశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలకు అనుబంధంగా ఉన్న సర్వజన ఆస్పత్రిలోని క్యాజువాలిటీ, ట్రామాకేర్, చిన్నపిల్లల విభాగం, డెలివరీ వార్డు ఇలా పలు విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు సంబంధించిన వివరాలను పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం వైద్యులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత మెడికల్ విద్యార్థులు, హెచ్ఓడీలు, వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి, సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవితో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంఈ మాట్లాడుతూ వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్గౌర్, వైద్యశాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ ఆదేశాలతో వైద్య కళాశాలలోని పరిస్థితులను పరిశీలించి విద్యార్థులకు అండగా ఉండేందుకు వచ్చామన్నారు. వైద్య విద్యార్థులకు ర్యాగింగ్, అకడమిక్, ఫ్యాకల్టీ, సొసైటీ పరంగా ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. అయినప్పటికీ వ్యక్తిగత కారణాలతో కొందరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడడం బాధాకరమన్నారు. ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా ప్రతి 12 మంది విద్యార్థులను ఒక గ్రూపుగా విభజించి మొదటి, రెండు, మూడు సంవత్సరాలకు సంబంధించి ఇన్చార్జులుగా అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తున్నామని తెలిపారు. నాల్గో, ఐదో సంవత్సరాలకు సంబంధించి అసోసియేట్ ప్రొఫెసర్లను నియమిస్తున్నామన్నారు. వారు విద్యార్థులతో మమేకవుతూ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తారన్నారు. అలా చేసిన కృషిపై ప్రిన్సిపల్ ప్రతి మూడు నెలలకొకసారి తమకు నివేదిక అందించాల్సి ఉంటుందన్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలకు రూ.80 కోట్లతో వైద్యపరికరాలు సూపర్స్పెషాలిటీ వైద్యసేవలను అందించేందుకు పెద్దాస్పత్రిలో రూ.80 కోట్లతో అన్ని రకాల పరికరాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు వచ్చాయని డీఎంఈ తెలిపారు. వాటిని త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల పూర్తయిన క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయు)భవనాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. సీసీయూ భవనాలకు ఇప్పటికే 50 శాతం పరికరాలు వచ్చాయన్నారు. మిగిలిన వాటిని త్వరలోనే పంపిస్తామన్నారు. కాగా పలువురు డాక్టర్లు సమయపాలన పాటించకపోవడం, కొందరు విధులకు డుమ్మాకొట్టి ప్రైవేట్ ఆస్పత్రుల్లో పని చేస్తుండడంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ అలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవిని ఆదేశించారు. ప్రతిరోజూ రౌండ్స్ వేయాలని సూపరింటెండెంట్కు సూచించారు. విధులకు డుమ్మా కొట్టే వారిని గురించి ఆధారాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డి, అడ్మినిస్ట్రేటీవ్ అధికారులు డాక్టర్లు కళారాణి, సుశీల్, అన్ని విభాగాల హెచ్ఓడీలు, ఏడీ ఏడుకొండలు, జూనియర్ వైద్యులు పాల్గొన్నారు. ప్రతి 12 మందికి ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్తో పర్యవేక్షణ సూపర్ స్పెషాలిటీ సేవలకు రూ.80కోట్లతో వైద్యపరికరాలు డీఏంఈ డాక్టర్ రఘునందన్ -
వామపక్షాల బంద్ ప్రశాంతం
● పెంచలయ్య హత్యకు నిరసనగా కదం ● గాంధీబొమ్మ సెంటర్లో డ్రగ్స్, గంజాయి దిష్టిబొమ్మల దహనం ● నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు ● సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు అరెస్ట్ నెల్లూరు(వీఆర్సీసెంటర్): సీపీఎం నాయకుడు, ప్రజానాట్యమండలి కళాకారుడు పెంచలయ్య హత్యకు నిరసనగా వామపక్షాలు మంగళవారం చేపట్టిన జిల్లా బంద్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో గంజాయి, డ్రగ్స్, మత్తుపదార్థాల విక్రయాలను నిషేధించాలనే డిమాండ్తో సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, ప్రజానాట్యమండలి, ఐద్వా తో పాటు ప్రజా సంఘాలకు చెందిన నాయకులు బంద్ చేపట్టారు. కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీల నాయకులు తమ మద్దతును ప్రకటించారు. బంద్కు సంఘీభావంగా జిల్లాలోని విద్యాసంస్థలు సెలవు ప్రకటించగా, బ్యాంకులు, వ్యాపార, వాణిజ్య దుకాణాలను స్వచ్ఛందంగా మాసివేశారు. నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు ఆధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, వామపక్ష కార్యకర్తల నడుమ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్జ్జి చేశారు. కత్తి శ్రీనివాసులును అరెస్ట్ చేసి వాహనంలో స్టేషన్కు తరలిస్తుండగా కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనంతరం వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు గాంధీబొమ్మసెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తామని చెప్పిన రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటి వరకు పెంచలయ్య హత్య ఘటనపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం దారుణమన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి మాట్లాడుతూ జిల్లాలోని గంజాయి ముఠా సమాజానికి, పోలీసులకు సవాల్గా మారిందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వాలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సంబంధం లేకుండా పోలీసులు గంజాయి బ్యాచ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ పెంచలయ్య గంజాయి బ్యాచ్ చేతిలో హత్యకు గురై మూడ్రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు సీఎం చంద్రబాబునాయడు, డీసీఎం పవన్కళ్యాణ్, హోంశాఖ మంత్రి అనిత ఎలాంటి ప్రకటన చేయకుండా మౌనంగా ఉండడాన్ని చూస్తుంటే గంజాయి విక్రయాలకు పరోక్షంగా మద్దతు ఇస్తూ గంజాయి బ్యాచ్లను బలపరుస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. జిల్లాలో గంజాయిని నిర్మూలించకపోతే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
18న కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం
నెల్లూరు(బారకాసు): నెల్లూరు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 18న నిర్వహించనున్నారు. ప్రస్తుతం మేయర్గా కొనసాగుతున్న పొట్లూరు స్రవంతిపై కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు కార్పొరేషన్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉదయం 11.30 గంటలకు కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే టీడీపీకి పూర్తిస్థాయిలో 42 మంది కార్పొరేటర్ల మద్దతు ఉంది. 18న జరిగే సర్వసభ్య సమావేశంలో మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నారు. ఆ తరువాత మేయర్ ఎన్నిక ప్రక్రియ ఎన్నికల కమిషనర్ సూచనల మేరకు ఉంటుంది. అప్పటి వరకు ఇన్చార్జి మేయర్గా ఎవరిని ఎన్నుకుంటారో వారే కొనసాగే అవకాశం ఉండొచ్చని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. అధికారులు అప్రమత్తంగా ఉండాలి కావలి(అల్లూరు): కలెక్టర్ హిమాన్షుశుక్లా మంగళవారం కావలిలో పర్యటించారు. తుపాను నేపథ్యంలో ఆర్డీఓ వంశీకృష్ణతో కలిసి చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దిత్వా తుపాను ప్రభావంతో కావలిలో వర్షపాతం ఎక్కువగా ఉందన్నారు. చెరువులకు వరద నీరు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇరిగేషన్ అధికారులు చెరువుల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి సహాయక చర్యలు అవసరమైన తెలియజేయాలని అధికారులకు సూచించారు. ఓపెన్ స్కూల్ తాత్కాలిక అడ్మిషన్లకు అవకాశం నెల్లూరు (టౌన్): 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ ఓపెన్ స్కూల్లో తాత్కాలిక అడ్మిషన్లు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ వరకు అవకాశం కల్పించిందని జిల్లా విద్యాశాఖాధికారి బాలాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాత్కాలిక అడ్మిషన్లు పొందేందుకు అభ్యాసకులు ఆన్లైన్ ద్వారా రెగ్యులర్ ఫీజుతో పాటు అదనంగా రూ.600 చెల్లించాల్సి ఉంటుంద న్నారు. ఒరిజనల్ సర్టిఫికెట్లను సంబంధిత కోఆర్డినేటర్కు సమర్పించాలని సూచించారు. జిల్లాలో 69.4 మి.మీ. వర్షపాతం నెల్లూరు(దర్గామిట్ట): దిత్వా తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మంగళవారం 69.4 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. అధికంగా కోవూరులో 14.8 మి.మీ. వర్షం పడింది. ముత్తుకూరు 11.6, సైదాపురం 8.4, విడవలూరు 6.0, నెల్లూరురూరల్ 5.8, ఇందుకూరుపేట 3.8, నెలూరు అర్బన్ 3.4, తోటపల్లిగూడూరు 3.0, రాపూరు 2.6, పొదలకూరు 2.2, కొడవలూరు 2, అల్లూరు 1.8, బుచ్చిరెడ్డిపాళెం 1.4, దగదర్తి 1, జలదంకి 1.2 మి.మీ.ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనానికి పది గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు 70,345 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 24,292 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.43 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. కాగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
అధికారమే అండ.. భూ కబ్జా కాండ
ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు. స్థానికులు ప్రతిఘటించినా అధికార బలంతో లెక్క చేయడం లేదు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా రెడ్బుక్ భయంతో వారు భూ దోపిడీకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా ఉదయగిరి మండలం పప్పువారిపల్లిలోని రూ.2 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఓ టీడీపీ నేత బరితెగించి ఆక్రమించి జామాయిల్ సాగుకు యంత్రాలతో చదును చేస్తున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. 40 ఎకరాలకు ఎసరు ఆర్లపడియ పంచాయతీ పప్పులవారిపల్లి గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 47, 49, 53లలో 40 ఎకరాల ప్రభుత్వ అనాధీనం, పశువుల మేత పోరంబోకు భూమి ఉంది. ఈ భూమిపై పక్క గ్రామానికి చెందిన టీడీపీ నేత కన్నేశాడు. గత పదిహేను రోజులుగా జేీసీబీ సాయంతో చెట్లను తొలగించి ట్రాక్టర్లతో చదును చేయిస్తున్నాడు. దీనిపై రెవెన్యూ అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేసినా తొలుత పట్టించుకోలేదు. మరోసారి గ్రామస్తులు తహసీల్దార్ షాజియాకు ఫిర్యాదు చేయడంతో తాత్కాలికంగా పనులు నిలిపివేయించారు. కానీ భూ ఆక్రమణదారుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం భూమిలో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు జామాయిల్ మొక్కలు నాటేందుకు ఆదివారం ఏర్పాట్లు చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగడంతో తాత్కాలికంగా రెవెన్యూ అధికారులు పనులు నిలిపివేయించారు.అంతేతప్ప ఆక్రమణదారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించలేదు. దీంతో రేపుమాపో గుట్టు చప్పడు కాకుండా రాత్రి వేళలో మొక్కలు నాటుతారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పప్పువారిపల్లిలో టీడీపీ నేత కబ్జా పర్వం రూ.2 కోట్ల విలువ చేసే భూమికి ఎసరు గ్రామస్తులు ప్రతిఘటిస్తున్నా లెక్క చేయని వైనం మౌనవ్రతంలో రెవెన్యూ అధికారులు -
ల్యాబ్ టెక్నీషియన్ల సమస్యల పరిష్కారానికి కృషి
నెల్లూరు(అర్బన్): ల్యాబ్ టెక్నీషియన్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పలువురు నేతలు అన్నారు. సోమవారం నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఆ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. డీఎంహెచ్ఓ సుజాత, జిల్లా మలేరియా నివారణ అధికారి హుస్సేనమ్మ మాట్లాడుతూ 52 పీహెచ్సీలు, 28 అర్బన్ హెల్త్ సెంటర్లలో ఉన్న ల్యాబ్ టెక్నీషియన్లకు అండగా ఉంటామన్నారు. కాగా ఎన్నికల అధికారిగా పశ్చిమగోదావరి జిల్లా సెక్రటరీ వీఎన్వీఆర్ కిశోర్, సహాయ ఎన్నికల అధికారిగా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మహిళా విభాగం నుంచి శ్రీలక్ష్మి సుభద్ర, పరిశీలకులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్వీఎస్ఎన్ మూర్తి వ్యవహరించారు. నూతన అధ్యక్షుడిగా బీవీ రాజేష్, సెక్రటరీగా సీహెచ్ రత్నం, అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎస్డీ రసూల్ సాహెబ్, కోశాధికారి మహమ్మద్ షఫీ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా మీరామొహిద్దీన్, మహిళా వింగ్ నుంచి జాయింట్ సెక్రటరీగా శాంతి నియమితులయ్యారు. కార్యక్రమంలో ఏపీజీఈఏ జిల్లా అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, ఏపీ ఎన్జీఓ నగర కార్యదర్శి రామకృష్ణ, ఎన్హెచ్ఎం ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సునీల్కుమార్, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ సందానీబాషా పాల్గొన్నారు. -
కుండపోత వర్షం
నెల్లూరు(అర్బన్): జిల్లాపై మోంథా తుపాను చూపిన ప్రభావానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ ప్రభావం నుంచి తేరుకునేలోపు జిల్లాపై దిత్వా ప్రభావం చూపింది. గత నెల 29 నుంచి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే ప్రభావం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. అయితే ఆదివారం నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. సోమవారం తీరప్రాంత మండలాల్లో భారీ వర్షాలు నమోదు కాగా, మెట్టప్రాంత మండలాల్లో మోస్తరుగా కురిశాయి. తుపాను ప్రభావంతో సముద్రం కసురు మీద ఉంది. అలలు ఎగిసి పడుతున్నాయి. పలుచోట్ల సముద్రం నాలుగైదు మీటర్ల వరకు ముందుకు చొచ్చుకొచ్చింది. తీరం వెంబడి ఈదురుగాలులు వీస్తున్నాయి. చలివాతావరణం ఎక్కువగా ఉంది. సోమవారం తుపాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఫలితంగా తుపాన్ ప్రభావం కొంతమేర తగ్గింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో సోమవారం జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదికలను రద్దు చేశారు. రాష్ట్రం నుంచి వచ్చిన జిల్లా ప్రత్యేకాధికారి యువరాజ్ పర్యవేక్షణలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు క్షేత్రస్థాయిఅధికారులతో ఎప్పటికప్పుడు చర్చి స్తూ ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్య లు చేపట్టారు. పొంగుతున్న వాగులు తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు జిల్లాలో పలు చోట్ల వాగులు పొంగాయి. చేజర్ల మండలంలోని నల్లవాగుకు ప్రవాహం పెరగడంతో యనమదల, తూర్పుకంభంపాడు, తూర్పుపల్లి తదితర ఐదు గ్రామాలకు రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. పొదలకూరు మండలంలోని నావూరు వద్ద పెద్ద వాగుకు నీటి ప్రవాహం పెరిగింది. బొగ్గేరు, బీరాపేరులకు మోస్తరుగా వరద ప్రవాహం పెరిగింది. విడవలూరు మండలం మలిదేవి డ్రెయిన్, పైడేరులకు నీటి ప్రవాహం పెరిగింది. ఇప్పటికే చెరువులు నిండి ఉండడంతో ఎక్కడ తెగిపోతాయోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. నెల్లూరు నగరంలోని లోత ట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వ్యవసాయ పనులకు ఆటంకం జిల్లాలోని రైతులు రబీ సాగు పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పొలాల నిండా నీరు చేరడంతో వేసిన నాట్లు, నారుమళ్లు కుళ్లిపోతాయోమోనని ఆందోళన చెందుతున్నారు. ముసురుతో వ్యవసాయ పనులకు ఆటంకం ఏర్పడడంతో వలస కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. నేడూ వర్షాలు కొనసాగే అవకాశం బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. ఇది నెమ్మదిగా కదులుతూ నెల్లూరుకు దక్షిణ ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రాగల 12 గంటల్లో మరింత బలహీన పడి వాయుగుండంగా మారవచ్చని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో నెల్లూరు జిల్లాలో మంగళవారం కూడా వర్షాలు కురవనున్నాయి. ఒకటి, రెండు చోట్ల భారీవర్షాలు, మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయి. బలహీనపడి వాయుగుండంగా మారిన దిత్వా తుపాన్ పొంగిన వాగులు, వంకలు పెన్నానదిలో పెరిగిన ప్రవాహం మునిగిన నారుమళ్లు, నాట్లు ఆందోళనలో అన్నదాతలు వ్యవసాయ పనులకు ఆటంకం మూతపడిన పాఠశాలలు, కళాశాలలు కోవూరులో అత్యధికంగా 136.4 మి.మీ. వర్షపాతం జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుంచి సోమవారం సాయంత్రం 5గంటల వరకు పడిన వర్షపాతం వివరాలను పరిశీలించగా కోవూరులో అత్యధికంగా 136.4 మి.మీ. వర్షం నమోదైంది. కావలిలో 135.2, బుచ్చిరెడ్డిపాళెం 131.6, సంగం 129.8, బోగోలు 116.8, జలదంకి 115.0, దగదర్తి 105.6, అల్లూరు 106.2, పొదలకూరు 102.2, నెల్లూరు అర్బన్ 102.2, కొడవలూరు 100.2, ఆత్మకూరు 97.6, ఏఎస్పేట 96.0, రాపూరు 93.6, నెల్లూరు రూరల్ 93.4, విడవలూరు 88.2, చేజర్ల 78.8, కలువాయి 78.2, అనంతసాగరం 67.6, సైదాపురం 65.6, ఇందుకూరుపేట 57.8, కందుకూరు 51.8, ఉలవపాడు 51.6, కలిగిరి 49.6, గుడ్లూరు 43.4, వెంకటాచలం 70.8, తోట పల్లిగూడూరు 43.4, ఉదయగిరి 29.4, మనుబోలు 41.8, వలేటివారిపాళెం 25.6, ముత్తుకూరు 38.8, మర్రిపాడు 22.0, కొండాపురం 20.4, వింజమూరు 21.0, లింగసముద్రం 12.6, దుత్తలూరు 11.6, వరికుంటపాడు 10.4, సీతారామ పురం 5.8 మి.మీ చొప్పున కురిసింది. -
ప్రజాభీష్టం మేరకే కార్యాచరణ
● మాజీ ఎమ్మెల్యే ప్రసన్న చిల్లకూరు: నెల్లూరు జిల్లాలో గూడూరును విలీనం చేసే విషయంపై ప్రజాభీష్టం మేరకు కార్యాచరణను ప్రకటిస్తామని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి పేర్కొన్నారు. ఈ విష యంపై గూడూరులోని రెండో పట్టణంలోని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్రెడ్డి నివాసంలో వైఎస్సార్సీపీ నాయకులతో సోమవారం ఆయ న చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సయయంలో గూడూరులో జరిగిన మహిళా సమావేశంలో చంద్రబాబు, యువగళం పాదయాత్రలో లోకేశ్ గూడూరును నెల్లూరులో విలీనం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే నేడు తండ్రీతనయులు ఇద్దరూ హామీని నిలబెట్టుకోకుండా గూడూరు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టా రు. స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్ సైతం గూడూరు విలీనంపై అసెంబ్లీలో గళమెత్తిన సమయంలో లోకేశ్ సానుకూలంగా స్పందించారని, ఇప్పు డు మాట మీద నిలబడకుండా గూడూ రు ప్రజలను వంచించారన్నారు. తాను గూడూరును నెల్లూరులో కలిపే విషయంపై ఒక నిర్ణయం ప్రకటించడం జరిగిందని, దీనిపై నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్, గూడూరులోని నాయకులతో చర్చిస్తామన్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి గూ డూరు నియోజకవర్గ ప్రజల మనోభీష్టా న్ని తెలియజేసి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. ఈ నెలఖారులోగా ప్రభుత్వం విడుదల చేసే గెజిట్లో గూడూరును నెల్లూరులో కలిపే విషయంపై తుది నిర్ణయం తీసుకోకుంటే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ గూడూరు పట్ట ణ,రూరల్, కోట మండలాల అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయకుమార్రెడ్డి, పలగాటి సపంత్కుమార్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మెట్టా రాధాకృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు నల్లపరెడ్డి రాజేంద్రకుమార్రెడ్డి, డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ వీరి చలపతి పాల్గొన్నారు. -
గంజాయి గ్యాంగ్ ఇళ్లు ధ్వంసం
నెల్లూరు సిటీ: సీపీఎం నేత పెంచలయ్య హత్యకు కారకులైన గంజాయి గ్యాంగ్ అరవ కామాక్షి, ఆమె అనుచరుల ఇళ్లను సీపీఎం కార్యకర్తలు, స్థానికులు సోమవారం రాత్రి ర్యాలీగా వెళ్లి ధ్వంసం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ఆర్టీడీ కాలనీలో కామాక్షి, జేమ్స్, మరికొందరు నివాసం ఉంటున్నారు. అదే కాలనీకి చెందిన పెంచలయ్య పిల్లలతో కలిసి స్కూటీపై వెళ్తుండగా హౌసింగ్ బోర్డు కాలనీ వద్ద అడ్డుకుని కత్తులతో అతికిరాతకంగా నరికి చంపారు. ఈ నేపథ్యంలో ఆర్టీడీ కాలనీలో ఆలయ అభివృద్ధికి దోహదపడుతూ గంజాయిపై పోరాటం చేస్తున్న మంచివ్యక్తి పెంచలయ్యను గంజాయి గ్యాంగ్ పొట్టన పెట్టుకోవడంపై స్థానికులకు కడుపు మండింది. పెంచలయ్య హత్యకు గురైన రోజే కామాక్షి ఇంటికి నిప్పుపెట్టారు. ఆదివారం నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిన నేపథ్యంలో సోమవారం రాత్రి గంజాయి గ్యాంగ్ ఇళ్లను కూల్చివేసి తమ కోపాన్ని తీర్చుకున్నారు. శ్రీవారి దర్శనానికి పది గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
నేరస్తులపై ఉక్కుపాదం : ఐజీ
నెల్లూరు(క్రైమ్): ప్రజా జీవనానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై ఉక్కుపాదం మోపాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదేశించారు. సోమవారం ఆయన ఎస్పీ అజితతో కలిసి నెల్లూరు చిన్నబజారు పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి సూచనలు, సలహాలిచ్చారు. సిబ్బంది యోగక్షేమాలను తెలుసుకున్నారు. శాఖాపరమైన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు. నేరస్తుల కదలికలపై నిఘా పెంచాలని, వారికి క్రమం తప్పకుండా కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. విజిబుల్ పోలీసింగ్ ముమ్మరం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో నగర ఇన్చార్జి డీఎస్పీ ఎం.గిరిధర్, ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్అండ్బీ ఎస్ఈగా ప్రసాద్రావు
నెల్లూరు(అర్బన్): బాపట్ల జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ ఈఈగా పనిచేస్తున్న డి.ప్రసాద్రావును పదోన్నతిపై ఆ శాఖ నెల్లూరు సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్గా ప్రభుత్వం నియమించింది. ఆయన సోమవారం దర్గామిట్టలోని ఆ శాఖ సర్కిల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్అండ్బీ ఉద్యోగుల అసోసియేషన్, అమరావతి జేఏసీ నాయకులు కలిసి పూలబొకేలు అందజేశారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శరత్బాబు మాట్లాడుతూ గత అధికారులు ఉద్యోగుల సమస్యలు పట్టించుకోలేదని అందువల్లే తాము ఇటీవల ఆందోళనలు చేశామని వివరించారు. ప్రసాద్రావు మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తానన్నారు. -
సిరుల వరి విత్తనం
నెల్లూరు(పొగతోట): నెల్లూరులోని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ పరిశోధన క్షేత్రం శాస్త్రవేత్తలు నూతన సన్నరకం వరి వంగడం ఎన్ఎల్ఆర్–3648ను సృష్టించారు. దీన్ని అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా రూపొందించారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులను ఇచ్చే ఈ రకం 130 నుంచి 135 రోజుల్లో కోతకు వస్తుంది. అగ్గి, దోమపోటు వంటి తెగుళ్లతో పాటు అధిక వర్షాలకు సైతం తట్టుకుని నేలవాలకుండా ఉండడం దీని ప్రత్యేకత. గత ఖరీఫ్లో ప్రయోగాత్మకంగా సాగు జిల్లాలోని రైతులతో గత ఖరీఫ్ సీజన్లో ఎన్ఎల్ఆర్–2648 రకాన్ని వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా సాగు చేయించారు. సుమారు 200 మంది నూతన వంగడాన్ని సాగు చేశారు. ఎకరాకు మూడున్నర నుంచి నాలుగు పుట్ల వరకు ధాన్యం దిగుబడి వచ్చింది. మొక్క 85 నుంచి 90 సెంటి మీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది. ఒక్కో దుబ్బులో 20 నుంచి 25 వెన్నులు వస్తాయి. వెన్నులో 250 నుంచి 300 వరకు గింజలు ఉండడంతో అధిక దిగుబడులు వస్తున్నాయి. నెల్లూరు రైస్ ప్రత్యేకం రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ నెల్లూరు రైస్కు అత్యంత డిమాండ్ ఉంది. నెల్లూరు సన్న బియ్యాన్ని అధిక శాతం మంది ఇష్టపడుతారు. నెల్లూరు ధాన్యం సన్నగా ఉండి వండిన తరువాత అన్నం తినడానికి రుచికరంగా ఉంటుంది. జిల్లాలోని రైతులు వరి వంగడాలు అందుబాటులో లేక తెలంగాణకు సంబంధించిన కేఎన్ఎం వరి రకాలపై ఆధారపడుతున్నారు. కేఎన్ఎం స్థానంలో ఎన్ఎల్ఆర్–3648 రకం నూతన వంగడాన్ని శాస్త్రవేత్తలు రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. గత ఖరీఫ్ సీజన్లో విడవలూరుకు చెందిన రైతు శ్రీనివాసులరెడ్డి కొత్త రకాన్ని సాగు చేశారు. ఈ రకం గింజ నాణ్యంగా ఉండి బీపీటీల కన్నా బాగుందని, వెన్ను దశలో అధిక వర్షాలు కురిస్తే పంట పడిపోకుండా నిలబడుతుందని ఆయన చెబుతున్నారు. కేఎన్ఎం, ఇతర వరి రకాలను సకాలంలో సాగు చేయాలి. సకాలంలో నాట్లు వేయకపోతే పంట దెబ్బతింటుంది. అయితే ఎన్ఎల్ఆర్ 3648 రకాన్ని ఏ కాలంలో అయినా సాగు చేయొచ్చు. బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన రంగయ్య రెండెకరాల్లో సాగు చేయగా 8 పుట్లకుపైగా దిగుబడి రావడంతో శాస్త్రవేత్తలు నూతన వంగడం సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో రబీ సీజన్లో అధికంగా సాగు చేసేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. అందుకనుగుణంగా రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తుపాన్లు.. తెగుళ్లను తట్టుకునేలా.. నూతన వరి వంగడం ఎన్ఎల్ఆర్–3648 సృష్టి నెల్లూరు శాస్త్రవేత్తల ఘనత అన్ని వాతావరణ పరిస్థితులకు అనుకూలం 130 నుంచి 135 రోజుల్లో చేతికి పంట ఎకరాకు నాలుగు పుట్ల వరకు దిగుబడులు ప్రతికూల వాతావరణంలోనూ సాగు చేయొచ్చు నూతనంగా రూపొందించిన ఎన్ఎల్ఆర్–3648 రకాన్ని అన్ని సీజన్లలో సాగు చేయొచ్చు. ఈ రకం ప్రతికూల వాతావరణ పరిస్థితులు, తెగుళ్లను తట్టుకుని అధిక దిగుబడులు ఇస్తుంది. గత ఖరీఫ్ సీజన్లో ప్రయోగాత్మకంగా కొందరి రైతులతో సాగు చేయించగా మంచి దిగుబడులు వచ్చాయి. రబీసీజన్లో సాగుచేసేందుకు ఎవరైనా రైతులు ముందుకొస్తే విత్తనాలు అందజేస్తాం. – శ్రీలక్ష్మి, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధన క్షేత్రం అధికారిణి -
యాక్టివ్ రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
● నగరంలో రోడ్లపై నడిపించిన పోలీసులు నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలోని యాక్టివ్ రౌడీషీటర్లను పోలీసులు రహదారులపై నడిపించారు. నేరాలకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తనతో జీవిస్తామని వారిచే ప్రతిజ్ఞ చేయించారు. వరుస ఘటనలతో జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడుతోంది. దీంతో సోమవారం నగరంలోని చిన్నబజారు, వేదాయపాళెం, బాలాజీ నగర్ పోలీస్స్టేషన్ల పరిధిలోని 45 మంది యాక్టివ్ రౌడీషీటర్లకు పోలీసు అధికారులు తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. వారిని వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీబొమ్మ కూడలి వరకు ప్రధాన రహదారిపై నడిపించారు. నగర ఇన్చార్జి డీఎస్పీ ఎం.గిరిధర్ గాంఽధీబొమ్మ వద్ద ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీషీటర్లు, సస్పెక్ట్లు, ట్రబుల్ మాంగర్స్ కదలికలపై నిఘా ఉంచామన్నారు. వారు పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే పీడీ యాక్ట్లు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు చిట్టెం కోటేశ్వరరావు, కె.శ్రీనివాసరావు, కె.సాంబశివరావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
యూరియా మాకే.. మీకు లేదు
తెలుగు తమ్ముళ్ల ఇష్టారాజ్యం ● కొత్తవంగల్లులో ఏకపక్షంగా పంపిణీ ● అధికారుల స్థానంలో టీడీపీ నాయకులే పంచిన వైనంకొడవలూరు: మండలంలోని కొత్తవంగల్లులో వ్యవసాయాధికారులు లేకుండానే టీడీపీ నాయకులు రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఈ ప్రక్రియ ఏకపక్షంగా జరిగిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని రైతు సేవా కేంద్రానికి సోమవారం యూరియా లోడు వచ్చింది. సాధారణ రోజుల్లో అయితే నిరుపయోగంగా ఉన్న కమ్యూనిటీ హాల్లో దించి ఆ తర్వాత రైతులకు పంపిణీ చేస్తారు. కానీ ఈసారి యూరియాను లారీలోనే ఉంచి హడావుడిగా పంపిణీ చేశారు. ఇదంతా నిబంధనల ప్రకారం జరిగిందా అంటే అదీ లేదు. గ్రామ వ్యవసాయ సహాయకుడి ద్వారా పంపిణీ చేయాల్సి ఉంది. వీఏఏ పింఛన్ల అందజేతకు వెళ్లారన్న సాకు చూపి స్థానిక టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. మళ్లీ ఇస్తామంటూ..తమ పార్టీ వర్గీయులకే సమాచారాన్ని చేరవేసి వారికే పంపిణీ చేశారు. ప్రతిపక్ష పార్టీ వర్గానికి చెందిన వారు వెళ్లినా ప్రస్తుతానికి ఈ లోడు సరిపోదని, మళ్లీ వస్తే ఇస్తామంటూ తిప్పి పంపారు. వైఎస్సార్సీపీ చెందిన చక్కా రామయ్య అనే రైతుకు ఇదే అనుభవం ఎదురు కావడంతో వాగ్వాదానికి దిగారు. ఏ మాత్రం ఖాతరు చేయకపోవడంతో వ్యవసాయ శాఖ జేడీకి ఫోన్లో ఫిర్యాదు చేశారు. వీఏఏ సమక్షంలోనే పంపిణీ జరగాలని, నాయకుల చేత చేయించడం నిబంధనలకు వ్యతిరేకమని జేడీ తెలిపారు. విచారించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. -
పెంచలయ్య హత్యకు నిరసనగా ర్యాలీ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): సీపీఎం నాయకుడు, ప్రజా నాట్యమండలి కళాకారుడు పెంచలయ్య హత్యను నిరసిస్తూ నెల్లూరులోని 17, 53, 54 డివిజన్లతోపాటు ఇనమడుగు సెంటర్లో సోమవారం రాత్రి కొవ్వొత్తులతో ర్యాలీ జరిగింది. పార్టీ కార్యాలయాల్లో పెంచలయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. ఆ పార్టీ నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పెంచలయ్య చేసిన కృషి మరువలేనిదన్నారు. అతడిని ఆదర్శంగా తీసుకుని నగరంలో గంజాయిని నిషేధించేలా యువత కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మంగళవారం నిర్వహించనున్న జిల్లా బంద్లో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు కట్టా సతీష్, మూలం ప్రసాద్, గడ్డం శ్రీనివాసులురెడ్డి, కత్తి పద్మ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ మాగుంటకు ఘన నివాళినెల్లూరు(బారకాసు): ఒంగోలు మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామిరెడ్డి 30వ వర్ధంతి నగరంలోని పొగతోటలో ఉన్న ఎం1 థియేటర్లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సీవీ శేషారెడ్డి మాట్లాడుతూ సుబ్బరామిరెడ్డికి ఒంగోలు, నెల్లూరు జిల్లాలు రెండు కళ్లు లాంటివన్నారు. ఒంగోలు ఎంపీగా ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. నెల్లూరు నగరంలో మినీ బైపాస్ రోడ్డు ఏర్పాటుకు అప్పటి కేంద్ర మంత్రితో చర్చించి కృషి చేశారని గుర్తు చేశారు. నెల్లూరులో ఎన్నడూ లేని విధంగా హత్యలు, దోపిడీలు, గంజాయి విక్రయం సిగ్గుచేటని చెప్పారు. ప్రభుత్వం దృష్టి సారించి ప్రజలకు మేలు చేసే విధంగా వ్యవహరించాలని హితవు పలికారు. కార్యక్రమంలో నేతలు కొండ్రెడ్డి రంగారెడ్డి, స్వర్ణా వెంకయ్య, బాల సుధాకర్, ఏసు నాయుడు, రఘురామ్ ముదిరాజ్, మాగుంట మమతమ్మ, మాగుంట సుబ్బరామ్, వరిదిరెడ్డి రవీందర్రెడ్డి, వీఎంవీ సుబ్బారావు, ఎల్లా విజయభాస్కర్రెడ్డి, కె.విజయభాస్కర్రెడ్డి, ప్రమిదల శ్రీనివాసులు, పలువురు సుబ్బరామిరెడ్డి అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
సీఎండీకి ఎనిమిది ఫిర్యాదులు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి నెల్లూరు జిల్లా నుంచి 8 మంది ఫిర్యాదులు అందాయి. కాగా ఇప్పటి వరకు 34 ఫిర్యాదులు రాగా.. 28 ఫిర్యాదులను పరిష్కరించారు. తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంబడాలన్నారు. సరఫరాలో సమస్యలుంటే 1912, 1800 – 425 – 15533, వాట్సాప్ నంబర్ 91333 31912కు సమాచారం ఇవ్వాలని వినియోగదారులకు సూచించారు. డిపాజిట్ల పేరుతో మోసంనెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని ఓ సంస్థ ఫ్రాంచైజీల పేరిట డిపాజిట్లు తీసుకుని మోసగించిందని పలువురు ఆరోపించారు. ఈ మేరకు బాధితులు సోమవారం రాత్రి దర్గామిట్ట ఇన్స్పెక్టర్ కళ్యాణరాజుకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తెలిపారు.కండలేరులో 58.330 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 58.330 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 4,480 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 850, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 100, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
లైసెన్స్డ్ సర్వేయర్లకు ఉద్యోగభద్రత కల్పించాలి
నెల్లూరు(అర్బన్): ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు రాష్ట్రంలో ఉన్న లైసెన్స్డ్ సర్వేయర్లను రెన్యూవల్ చేయడంతోపాటు ఉద్యోగభద్రత కల్పించాలని ఏపీ లైసెన్స్డ్ సర్వేయర్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలోని ధర్నా చౌక్లో జరిగిన రాష్ట్ర ధర్నాకు సోమవారం నెల్లూరు నుంచి పెద్ద ఎత్తున హాజరయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడు నడవడి ముత్యంగౌడ్ మాట్లాడుతూ 2003 సంవత్సరంలో ఈ వ్యవస్థను తీసుకొచ్చారన్నారు. అప్పటి నుంచి అన్ని మండలాల్లో వివిధ సర్వే పనులు చేస్తూ రైతులు, ప్రభుత్వానికి వారధిలా పని చేశామన్నారు. తర్వాత కాలంలో విలేజ్ సర్వేయర్లను నియమించారన్నారు. ఆదుకుంటామన్న కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం స్పందించి గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న స్థానాల్లో తమను సర్వేయర్లుగా, రిజిస్ట్రార్ ఆఫీసులు, మున్సిపాలిటీ కార్యాలయాల్లోనూ లైసెన్స్డ్ సర్వేయర్లుగా నియమించాలని కోరారు. రాష్ట్ర స్థాయి అధికారులు కూడా తమ వద్ద లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. న్యాయం చేయాలన్నారు. -
టీడీపీ అరాచకాలకు పరాకాష్ట
● ఆనం విజయకుమార్రెడ్డి నెల్లూరు(స్టోన్హౌస్పేట): గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు పెంచలయ్యను ఆయన బిడ్డ చూస్తుండగానే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అను చరులు అతి కిరాతకంగా హతమార్చారని వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి అన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడారు. గంజాయి విక్రయాలకు అడ్డుగా ఉన్నారని పెంచలయ్యను హతమార్చిన నిందితులు అరవ కామాక్షి, పాలకీర్తి రవి టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అనుచరులే అని స్పష్టం చేశారు. వారు తమ పార్టీ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయించారని విమర్శించారు. గంజాయిని పెంచి పోషించింది, సూత్రధారులకు రక్షణ కల్పించింది ఎవరంటూ తమ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రశ్నించారని, దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాత్రయితే బయటకు రావాలంటే పురుషులు సైతం జంకే పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. దుర్మార్గపు ఆలోచనలను తమ పార్టీకి అంటగట్టొద్దని హితవు పలికారు. -
నెల్లూరు.. కన్నీరు..
దక్షిణ భారతదేశంలో కాంచీపురం నుంచి అమరావతి వరకు విస్తరించిన నగరాల్లో ‘విక్రమ సింహపురి’ చరిత్రాత్మక నగరంగా విరాజిల్లింది. పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, తెలుగు చోడ, పాండ్య, సంగమ, సాళువ, తుళువ, ఆరవీటి వంశాల పాలనల్లో రాజ్య కేంద్రంగా విలసిల్లింది. ఇంత చరిత్ర కలిగిన ఈ సింహపురి కాలక్రమేణా నెల్లూరుగా నామాంతరం చెందింది. అంగ్లేయులు ప్రాంతాల వారీగా విభజించి విచ్ఛిన్నం చేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో నెల్లూరు మరికొంత భూభాగాలను కోల్పోయింది. పెరుగుతున్న జనాభా కనుగుణంగా పాలనా సౌలభ్యం కోసం భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం ప్రజల అభ్యంతరాల నేపథ్యంలో వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధిని సమాంతరం చేస్తూ విభజన చేపట్టింది. తాజాగా టీడీపీ ప్రజాభిప్రాయానికి భిన్నంగా ప్రాంతాలు, ప్రజల మధ్య చిచ్చు రేపుతూ, భవిష్యత్లో జల వివాదాలకు ఆజ్యం పోస్తూ మరోసారి పునర్విభజనకు సిద్ధపడింది. మంత్రుల మౌనం.. నెల్లూరుకు శాపం రామాయపట్నం పోర్టుఉదయగిరి దుర్గంసాక్షి, ప్రతినిధి, నెల్లూరు: జిల్లాను విచ్ఛిన్నం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నెల్లూరు తల తెగిన మొండెంగా మిగిలిపోనుంది. తాజా పునర్విభజన నిర్ణయం చారిత్రాత్మక తప్పిందంగా మిగిలిపోనుంది. జిల్లాకే తలమానికంగా నిలిచిన వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి చిన్నాభిన్నం కానుంది. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో సింహపురికి ప్రత్యేక స్థానం ఉండేది. బెజవాడ గోపాలరెడ్డి, ఏసీ సుబ్బారెడ్డి, నేదురుమల్లి జనార్దనరెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, ముప్పవరపు వెంకయ్యనాయుడు వరకు చట్టసభల్లో కీలక పాత్ర పోషించి రాజకీయాలను శాసించి, ఆ రాజకీయాలకు వన్నె తెచ్చారు. ఒకానొక సమయంలో పార్లమెంటులో జిల్లాకు చెందిన 11 మంది రాజకీయ ఉద్దండులు సభ్యులు ఉండేవారు. వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి సమాంతరంగా విభజన రాచరిక పాలనలో విశాల విక్రమ సింహపురిగా ఉన్న నెల్లూరు బ్రిటిష్ పాలకుల నుంచి, స్వరాష్ట్ర పాలకుల వరకు నానాటికి విచ్ఛిన్నమవుతోంది. నానాటికి పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా గతంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గం ప్రామాణికంగా కొత్త జిల్లాల పునర్విభన చేపట్టింది. ఆనాటి ప్రభుత్వం భౌగోళిక పరిస్థితులతోపాటు జిల్లా అభివృద్ధికి గీటురాయిగా మారే పారిశ్రామికాభివృద్ధిని, వ్యవసాయ అభివృద్ధికి ఎక్కడా విఘాతం ఏర్పడకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలను పూర్తిగా, వెంకటగిరిలోని మూడు మండలాలను తిరుపతి జిల్లాలో కలుపుతూ పునర్విభజించింది. పూర్వం నెల్లూరు జిల్లాలోనే ఉండి ప్రకాశం జిల్లాలో విలీనమైన కందుకూరును తిరిగి నెల్లూరు జిల్లాలో చేర్చారు. అయితే జిల్లాకే తలమానికమైన షార్తోపాటు ప్రపంచస్థాయి పారిశ్రామికవాడ శ్రీసిటీ, గూడూరులోని సిలికా మైన్లు నెల్లూరు కోల్పోయింది. వెంకటగిరిలోని కీలకమైన మైకా గనులు విస్తారంగా ఉన్న సైదాపురంతోపాటు జల నిధి కండలేరు ఉన్న రాపూరు, భౌగోళికంగా నెల్లూరు జిల్లాలో కలిసిపోయిన కలువాయిని నెల్లూరునే ఉండేలా నిర్ణయం తీసుకోవడంతో విజభన జిల్లాకు ఎంతో ఉపయోక్తంగా మారింది. ప్రపంచ స్థాయి పారిశ్రామికవాడ శ్రీసిటీకి ప్రత్యామ్నాయంగా కందుకూరు నియోజకవర్గంలోని రామాయపట్నంలో తొలి దశలో పది బెర్త్లతో సీపోర్టు నిర్మాణానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రజల ఆకాంక్షలకు వెన్నుపోటు గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపాలన్న డిమాండ్ బలంగా ఉంది. ఇదే తరుణంలో గూడూరు తమకు కావాలని తిరుపతి జిల్లా వాసులెవరూ కోరడం లేదు. మరో వైపు వెంకటగిరిలో సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలను సైతం తిరుపతిలో విలీనం చేయాలని ఎవరూ కోరుకోవడం లేదు. భౌగోళికంగా కూడా గూడూరుకు జిల్లా కేంద్రం నెల్లూరు అత్యంత దగ్గరగా ఉంటుంది. ఈ ప్రకారం కందుకూరును ప్రకాశంలో కలిపినప్పుడు గూడూరును నెల్లూరులో కలుపుతామని హామీ ఇచ్చి చంద్రబాబు ప్రజల ఆకాంక్షలకు వెన్నుపోటు పొడిచారు. కండలేరు జలాశయంకృష్ణపట్నం పోర్టు నెల్లూరు జిల్లా పునర్విభజనతో ప్రాంతాలు, ప్రజల మధ్య రేగిన చిచ్చు గతంలో వెంకటగిరిలోని రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను సైతం తిరుపతి జిల్లాలో విలీనం చేయాలనే ప్రతిపాదన జరిగినప్పుడు అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి గట్టిగా విభేదించారు. కండలేరు, సోమశిల నీటి పంపకాల్లో సమస్యలు వస్తాయని, ఈ మూడు మండలాల రైతులకు అన్యాయం జరుగుతుందని తన వాదన వినిపించారు. జిల్లాలో వ్యవసాయ రంగ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్లోనూ జల వివాదాలకు తావు లేకుండా ఉండే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మూడు మండలాలను నెల్లూరు జిల్లాలోనే ఉండే విధంగా పునర్విభజన చేపట్టారు. ఇప్పుడు అదే ఆనం మంత్రిగా ఉండీ కూడా ఈ మూడు మండలాలను తిరుపతిలో విలీనం చేస్తుంటే మౌనంగా ఉండిపోవడం తమ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిన నెల్లూరుకు ద్రోహం చేయడమే అనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. భవిష్యత్ విజనరీ అని చెప్పుకునే మరో మంత్రి నారాయణ కానీ, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అభ్యంతరాలు చెప్పకపోవడంపై జిల్లా ప్రజలు మండి పడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునసమీక్షంచకపోతే రాష్ట్ర విభజన ఉద్యమ స్థాయిలో జిల్లా విభజన ఉద్యమం ఊపందుకోనుంది. ఇప్పటికే మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు సన్నద్ధమవుతున్నారు. చంద్రబాబు నిర్ణయంతో జల విభేదాలు గతంలో భౌగోళిక పరిస్థితులు, ప్రజల అభ్యంతరాల తర్వాతే విభజన కందుకూరును తిరిగి ప్రకాశంలోకి.. గూడూరును నెల్లూరులో విలీనం విస్మరణ వెంకటగిరిలోని మూడు కీలక మండలాలు తిరుపతిలో కలపడంపై తీవ్ర అభ్యంతరం నెల్లూరుకు అన్యాయం చేస్తున్నా నోరు మెదపని టీడీపీ ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో ఆ మూడు మండలాల కోసం కన్నెర్ర చేసిన మంత్రి ఆనం.. ఇప్పుడు మౌనమేలా జిల్లా వాసులు మనోభావాలను పట్టించుకోని మంత్రి నారాయణ ఆది నుంచి రాజకీయ చైతన్యం కలిగిన నెల్లూరు జిల్లా ఒక రాజకీయ పార్టీ పక్షాన నిలబడుతోంది. అటువంటి జిల్లాను విచ్ఛిన్నం చేయాలనే రాజకీయ కుట్రలతో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న పునర్విభజన నిర్ణయం ఇప్పుడు నెల్లూరును కన్నీరు పెట్టిస్తోంది. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల్లో కందుకూరును తిరిగి ప్రకాశంలో, గూడూరును నెల్లూరులో విలీనం చేస్తామని హామీలు గుప్పించారు. అయితే ఇప్పుడు కందుకూరును తీసుకెళ్లి ప్రకాశంలో విలీనం చేస్తుండడంతో జిల్లాకే తలమానికం అవుతుందనుకున్న రామాయపట్నం మరోసారి సింహపురి కోల్పోయింది. గూడూరును తిరిగి నెల్లూరులో కలుపుతామనే హామీని విస్మరించడంతోపాటు జిల్లా వ్యవసాయ రంగానికి ఆయుపట్టుగా ఉండే కండలేరు, ఆర్థిక ఆయుపట్టుగా నిలిచే మైకా గనులు ఉండే వెంకటగిరి లోని సైదాపురం, రాపూరు, కలువాయి మండలాలను సైతం తిరుపతిలో విలీనం చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి
నెల్లూరు సిటీ: దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే, పునరుద్ధరణకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తీగలు తెగిపోయినా.. స్తంభాలు కూలిపోయినా వెంటనే అధికారులు లేదా సిబ్బందికి సమాచారమివ్వాలని కోరారు. 1912 లేదా 1800 – 425 – 155333 నంబర్లను సంప్రదించాలని సూచించారు. డయల్ యువర్ సీఎండీ నేడు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నామని ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తెలిపారు. ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12 వరకు 89777 16661 నంబర్ను సంప్రదించి సమస్యలను తెలియజేయాలని కోరారు. పొదలకూరు నిమ్మధరలు(కిలో) పెద్దవి: రూ.12 సన్నవి: రూ.6 పండ్లు: రూ.3 -
ఇదీ పరిస్థితి..
ఎయిడ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు కృషి● జిల్లాలో 13 వేల మందికిపైగా రోగులు ● తగ్గుముఖం పట్టినా.. అక్కడక్కడా నమోదు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం నేడు మానవత్వంతో ఆదరించాలి హెచ్ఐవీ, ఎయిడ్స్ సోకిన వారిని మానవత్వంతో ప్రజలు ఆదరించాలని ప్రభుత్వం చెప్తోంది. వ్యాధి సోకిన వారు కలిసి తిన్నా.. ఒకే మరుగుదొడ్లను వినియోగించినా.. కలిసి ఉద్యోగాలు చేసినా.. ఒకరి దుస్తులు మరొకరు వేసుకున్నా.., స్విమ్మింగ్ పూల్ ద్వారా గానీ సంక్రమించదు. కేవలం అనైతిక కార్యకలాపాల ద్వారానే సోకుతుంది. నెల్లూరు(అర్బన్): క్షణికావేశంలోనో.. పొరపాటుగానో చేసే తప్పులతో 95 శాతం మందికి.. సురక్షిత పద్ధతి పాటించని సూదులు, రక్త మార్పిడి, మత్తు ఇంజెక్షన్లు తదితరాల ద్వారా మరో ఐదు శాతం మందికి ఎయిడ్స్ వ్యాధి సోకుతోంది. పాతికేళ్ల క్రితం వరకు ఎయిడ్స్ వ్యాధి ఉన్న వ్యక్తిని అంటరానివారిగా చూసేవారు. దహన సంస్కారాలకు బంధుమిత్రులు సైతం హాజరయ్యేవారు కాదు. ఈ అమానవీయ స్థితిని గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా డిసెంబర్ ఒకటిని ఎయిడ్స్ నివారణ దినోత్సవంగా ప్రకటించి.. ప్రజలను చైతన్యం చేస్తోంది. అంతరాయాలను అధగమించడం – ఎయిడ్స్ ప్రతిస్పందనను మార్చడం అనే థీమ్ను ఈ ఏడాది ప్రకటించింది. ఇందులో భాగంగా జిల్లాలో అవగాహన ర్యాలీలు, సదస్సులను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించనున్నారు. జిల్లాలో ఇలా.. నగరంలోని ప్రభుత్వ పెద్దాస్పత్రి ఏఆర్టీ సెంటర్లో 2007 డిసెంబర్ నుంచి రిజిస్ట్రేషన్ చేయించుకున్న హెచ్ఐవీ రోగులు 18,979 మంది ఉన్నారు. పెద్దాస్పత్రిలో మందులను ప్రతి నెలా క్రమం తప్పకుండా 8676 మంది పొందుతున్నారు. వివిధ ఏఆర్టీ సెంటర్లు, ప్రైవేట్గా మందులను మరో ఐదు వేల మందికిపైగా కొనుగోలు చేస్తున్నారు. కొంత మంది పెద్దలు, ఆర్థికంగా ఉన్న వారు కార్పొరేట్ ఆస్పత్రులతో పాటు చైన్నె వెళ్లి ప్రైవేట్గా వైద్యం చేయించుకుంటున్నారు. ఎయిడ్స్ రోగులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో రాష్ట్రంలో ఎనిమిదో స్థానంలో నెల్లూరు ఉంది. మరోవైపు జిల్లాలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా, ఏటా కొంతమేర నమోదవుతూనే ఉన్నాయి. ఉచితంగా పరీక్షలు గర్భిణుల్లో 2002లో 2.7 శాతం మందికి హెచ్ఐవీ ఉండగా, ఇప్పుడు అది 0.1 శాతంగా ఉంది. ప్రభుత్వం మొదట్లో చేపట్టిన చర్యలు ఇప్పుడు లేకపోవడంతో కేసుల సంఖ్య చాపకిందనీరులా పెరుగుతోంది. కొంతమంది వివరాలు అధికారిక లెక్కల్లో ఉండటంలేదని తెలుస్తోంది. జిల్లాలోని 52 పీహెచ్సీలు, 28 అర్బన్ హెల్త్ సెంటర్లు, ఒక జిల్లా ఆస్పత్రి, రెండు ఏరియా ఆస్పత్రులు, పది ఐసీటీసీ కేంద్రాలు, ఒక బోధానాస్పత్రి (పెద్దాస్పత్రి) ద్వారా రోగులకు ఉచితంగా పరీక్షలు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచి వారికి మందులను అందజేస్తున్నారు. పింఛన్ల కోసం ఎదురుచూపులే జిల్లాలోని ప్రభుత్వ పెద్దాస్పత్రి ఏఆర్టీ సెంటర్కు మందుల నిమిత్తం 8676 మంది ప్రతి నెలా వస్తున్నారు. వీరిలో కేవలం 2240 మందికే పింఛన్లను ప్రభుత్వం అందిస్తోంది. టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువుదీరాక ఒక్కరికీ సైతం పింఛన్ను మంజూరు చేయలేదు. కొత్తవారికి పింఛన్లు కల్పించకపోవడం శోచనీయమని రోగులు బాధపడుతున్నారు. అధికారిక లెక్కలిలా.. ఏడాది చేసిన నమోదైన శాతం పరీక్షలు పాజిటివ్ కేసులు 2017 – 18 1,33,766 1347 1 2018 – 19 1,34,397 1174 0.9 2019 – 20 1,35,914 1007 0.7 2020 – 21 73,966 577 0.8 2021 – 22 1,50467 710 0.5 2022 – 23 1,91,042 811 0.4 2023 – 24 1,76,515 782 0.4 2024 – 25 1,79,588 730 0.4 2025 1,02,929 358 –– -
మేయర్ పీఠంపై రాజకీయ డ్రామా
● కొత్త మేయర్గా తెరపైకి దేవరకొండ సుజాత ● మరుసటి రోజుకు రూప్కుమార్కే ఇన్చార్జి మేయర్ పదవి అంటూ ప్రచారం నెల్లూరు (బారకాసు): నెల్లూరు మేయర్ పీఠంపై మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి రాజకీయ డ్రామాకు తెర తీశారు. నగరపాలక సంస్థను తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు ఇద్దరూ ఎవరి వారు వ్యూహ రచన చేస్తూ.. వీరిని నమ్ముకున్న కార్పొరేటర్లను బకరాలను చేస్తున్నారు. ప్రస్తుతం మేయర్గా ఉన్న పోట్లూరు స్రవంతిని పీఠంపై నుంచి దించాలనేది మంత్రి, ఎమ్మెల్యే ఉమ్మడి లక్ష్యం కాగా, ఈ పీఠాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలనేది ఎవరి వ్యూహం వారికి ఉంది. ప్రస్తుత మేయర్ స్రవంతిపై డిసెంబరు 15వ తేదీలోపు అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఇప్పటికే టీడీపీ కార్పొరేటర్లు జాయింట్ కలెక్టర్కు నోటీసు అందజేశారు. అయితే కొత్త మేయర్ను ఎన్నుకోవాలన్నా.. చేయాలన్నా.. ఇన్చార్జి మేయర్ను ఎంపిక చేయాలన్నా కొంత సమయం పడుతుంది. మంత్రి నారాయణ వ్యూహం ఇదే.. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నగర పాలక సంస్థపై పట్టుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మంత్రి నారాయణతో విభేదించడంతోపాటు కార్పొరేషన్ అధికారులపై పెత్తనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఇద్దరి మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న మేయర్ డమ్మీ కావడంతో కొంత కాలంగా నడిచిపోయింది. అయితే మేయర్ పీఠంపై తన అనుచరుడైన డిప్యూటీ మేయర్ను ఇన్చార్జిగా నియమించి తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వ్యూహరచన చేశారు. దీంతో మేయర్పై అవిశ్వాసం పెట్టాలనే ప్రతిపాదనను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు మంత్రి నారాయణ సైతం అంతర్గత వ్యూహంతో అంగీకరించడంతో ఉమ్మడిగా సమీక్షించి అవిశ్వాసానికి వ్యూహరచన చేశారని సమాచారం. ప్రస్తుత తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు కాబట్టి.. మైనార్టీ మహిళ డిప్యూటీ మేయర్గా ఉండడంతో ఆమెను ఇన్చార్జిగా పెట్టే ప్రతిపాదన చేయడం ద్వారా కోటంరెడ్డికి చెక్ పెట్టాలన్నది మంత్రి వ్యూహంగా తెలుస్తోంది. రూప్కుమార్కు ఇన్చార్జి మేయర్ పదవి ఇచ్చే ఉద్దేశం మంత్రికి లేదని ఆయన సన్నిహితుల సమాచారం. అయితే టీడీపీ గిరిజన మహిళకు ద్రోహం చేస్తుందనే ప్రచారంతో ఆ మరకను తుడుచుకునేందుకే దేవరకొండ సుజాత పేరును తెరపైకి తెచ్చారు. దీంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శిబిరంలో అలజడి రేగడంతో మరో సరికొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. దేవరకొండ సుజాతను మేయర్గా చేసి, ఆమెకు కొంత మొత్తం ముట్టజెప్పి దీర్ఘకాలిక సెలవు పెట్టించి.. అప్పుడు రూప్కుమార్ను ఇన్చార్జి మేయర్గా కూర్చొబెట్టాలని తమ వ్యూహం అంటూ చెప్పడం ద్వారా రాజకీయ డ్రామాకు తెర తీశారని స్పష్టమవుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి కార్పొరేషన్లో పనులు కావడం లేదని, కమిషనర్ కూడా ఆయనకు సహకరించడం లేదని తెలుస్తోంది. మరో వైపు మంత్రి నారాయణ తన పని తాను చేసుకుంటూ సిటీ నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే తాను వ్యూహాత్మకంగా పన్నుతున్న పన్నాగ ఉచ్చులో మంత్రి నారాయణ పడ్డారని కొందరు చర్చించుకుంటున్నారు. ఆడేది ఎవరు?.. ఆడించేది ఎవరు? అంటే.. ఇద్దరుకు ఇద్దరు ఎవరికి వారు ఆడుతున్నారని రోజుకో మలుపు తిరుగుతున్న మేయర్ పీఠం చెబుతోంది. -
రామిరెడ్డికి ఫోన్లో వైఎస్ జగన్ పరామర్శ
అల్లూరు: ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఫోన్లో పరామర్శించారు. రామిరెడ్డి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. త్వరగా కోలుకోని ప్రజా సేవలోకి రావాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు నెల్లూరు (దర్గామిట్ట): సోమవారం జరగాల్సిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని దిత్వా తుఫాన్తో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జేసీ మొగిలి వెంకటేశ్వర్లు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. ప్రజలు సైతం అత్యవసరమైతే తప్ప.. బయటకు రావొద్దని తెలియజేశారు. పోలీస్ పీజీఆర్ఎస్ కూడా.. నెల్లూరు (క్రైమ్): దిత్వా తుఫాను కారణంగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశమున్నందున పోలీసు కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ అజిత వేజెండ్ల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ వినతులను మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేడు పాఠశాలలు, కళాశాలలకు సెలవు నెల్లూరు (టౌన్): దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ సమాచారం మేరకు జేసీ వెంకటేశ్వర్లు ఆదేశాలతో సోమవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు డీఈఓ బాలాజీరావు, ఆర్ఐఓ వరప్రసాదరావు ఆది వారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. జిల్లా లోని డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు, హెడ్మాస్టర్లు ఈ సమాచారాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులకు తెలియజేయాలన్నారు. 27 లోపు ఓపెన్ డిగ్రీ సెమిస్టర్ ఫీజుకు గడువు ఆత్మకూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ (ఎస్ఆర్జే డిగ్రీ కళాశాల)లో డిగ్రీ చేస్తున్న బీఏ, బీకాం, బీఎస్సీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ కోర్సులకు సెమిస్టర్ విధానంలో 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలకు డిసెంబరు 27వ తేదీలోపు ఫీజులు చెల్లించాలని కోఆర్డినేటర్ శ్రీకాంత్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 7382929793, 8125407933 నంబర్లలో సంప్రదించాలన్నారు. కాకాణితో ప్రసన్న భేటీ నెల్లూరు (స్టోన్హౌస్పేట): మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆదివారం జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపే విషయమై చర్చించారు. గూడూరు సమన్వయకర్త మేరిగ మురళీధర్ ఆరోగ్య రీత్యా ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటూ ఉండడంతో ఆయనతో ఫోన్లో ప్రసన్న, కాకాణి చర్చించారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డితో కూడా మాట్లాడారు. గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపే విషయంపై చంద్రబాబు నిర్ణయంపై మాజీ సీఎం జగన్మోహన్రెడ్డితో చర్చించిన అనంతరం తమ కార్యాచరణ తెలియజేస్తామని తెలిపారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి మాట్లాడుతూ ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వ నిర్ణయం లేకుంటే తాను ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతానని, గూడూరు నియోజకవర్గంలోని అన్ని పార్టీల వారితోనూ, మేధావులతో కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళతామన్నారు. ఈ సమావేశంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి, కలువ బాలాశంకర్ రెడ్డి పాల్గొన్నారు. -
నిరసనల జయప్రదానికి పిలుపు
నెల్లూరు సిటీ: రైతుల సమస్యలపై ఈ నెల పదిన.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 18న చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అజయ్కుమార్ పేర్కొన్నారు. నగరంలోని రామకోటయ్య భవన్లో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోందని చెప్పారు. వీటిపై చేపట్టనున్న నిరసన కార్యక్రమాలకు భారీగా తరలిరావాలని కోరారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి, జిల్లా సహాయ కార్యదర్శి నందిపోగు రమణయ్య కార్యవర్గ సభ్యులు మాలకొండయ్య, వినోదమ్మ తదితరులు పాల్గొన్నారు. తుఫాన్ను సమర్థంగా ఎదుర్కోవాలి నెల్లూరు(దర్గామిట్ట): దిత్వా తుఫాన్ను సమర్థంగా ఎదుర్కొనేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ప్రత్యేకాధికారి యువరాజ్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా అధికారులతో ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లాలోని అన్ని రిజర్వాయర్లలో నీరు సమృద్ధిగా ఉందని, వర్షాలతో ఎక్కడా గండిపడకుండా చూడాలని సూచించారు. జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. విద్యుత్కు అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు. తీర ప్రాంతాల్లో చౌక దుకాణాల ద్వారా ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. ఎస్పీ అజిత, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్కుమార్, ఏఎస్పీ సౌజన్య పాల్గొన్నారు. నగరంలో మంత్రి పర్యటన నెల్లూరు సిటీ: దిత్వా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఆయన పర్యటించారు. ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జిని పరిశీలించారు. నిర్ణీత గడువులోపు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాల్టీల్లో రూ.150 కోట్లతో కాలువల పూడికతీత పనులను చేపట్టామన్నారు. కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్కుమార్యాదవ్, తాళ్లపాక అనూరాధ తదితరులు పాల్గొన్నారు. -
రోగులను ఆదరించాలి
ఎయిడ్స్ రహిత జిల్లాగా నెల్లూరును మార్చేందుకు కృషి చేస్తున్నాం. ఇందులో భాగంగా డాక్టర్లు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాం. యువతకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఒకసారి హెచ్ఐవీ సోకితే నిండు జీవితం బుగ్గిపాలవుతుందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. జిల్లాలో వ్యాధి తీవ్రత గణనీయంగా తగ్గింది. : ఖాదర్వలీ, జిల్లా ఎయిడ్స్, టీబీ, లెప్రసీ నియంత్రణాధికారి హెచ్ఐవీ బారినపడిన రోగులను ప్రజలు ఆదరించాలి. వ్యాధి సోకిన వారికి మంచి మందులున్నాయి. క్రమం తప్పకుండా సీడీ 4 కౌంట్, వైరల్ లోడ్ పరీక్షలు చేయించుకోవాలి. పెద్దాస్పత్రిలో ఉచిత పరీక్షలు, మందులను అందిస్తున్నాం. రోగులకు అవసరమైన బేస్లైన్ ఇతర పరీక్షలు చేస్తున్నాం. : డాక్టర్ సుబ్రహ్మణ్యం, పెద్దాస్పత్రి ఏఆర్టీ సెంటర్ ● -
నా భర్త దారిలోనే నేనూ వెళ్తా
● ఆర్టీడీ కాలనీలో మార్పు తేవాలని బలయ్యాడు ● పెంచలయ్య భార్య దుర్గా నెల్లూరు సిటీ: నా భర్త ఏ మార్పును తీసుకుని రావాలని అనుకున్నారో.. అదే దారిలో తానూ నడుస్తానంటూ గంజాయి కిరాతకుల చేతిలో బలైపోయిన పెంచల య్య భార్య దుర్గా అలియాస్ రమ్య స్పష్టం చేసింది. నగరంలోని ఆర్టీడీ కాలనీలోని ఆమె నివాసంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తన భర్త ఐటీఐ చదివారని, పిల్లలను మంచి చదువులు చదివించాలని అనుకున్నాడు. ఆర్టీడీ కాలనీలో తమ పాటికి తాము ఉన్నామని, ఇక్కడ దౌర్జన్యాలు ఎక్కువ అయ్యాయన్నారు. బోడిగాడితోటలో ఉన్పప్పుడు అక్కడి వాళ్లమని చెప్పుకోలేకపోయామని, ఇప్పుడు ఆర్టీడీ కాలనీకి చెందిన వాళ్లమని కూడా చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. స్థానికంగా గంజాయి విక్రయాలపై తన భర్త వారికి వ్యక్తిగతంగా చెప్పారు. కానీ ఆగలేదన్నారు. సీఐ, ఎస్సైల సహకారంతో బోర్డులు కూడా ఏర్పాటు చేశారన్నారు. దీంతో వాళ్ల వ్యాపారం పడిపోయిందని భయం పుట్టిందన్నారు. స్థానికంగా ఉన్న ముత్యాలమ్మ అమ్మవారికి చెందిన డబ్బులు, నగలు కూడా అరవ కామాక్షి తినేశారన్నారు. ఎవరితోనూ తన భర్తకు విభేదాలు లేవన్నారు. కాలనీలో మార్పు తీసుకుని రావాలని ప్రయత్నించి నా భర్త వారిలో చేతిలో అత్యంత దారుణంగా హత్యకు గురైనా, వీరమరణం పొందారని భావిస్తున్నట్లు తెలిపారు. -
భూ వివాదంతోనే ప్రసాద్నాయుడి హత్య
● నిందితుల అరెస్ట్ కావలి (అల్లూరు): జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాళెంలో సంచలనం సృష్టించిన టీడీపీ నేత గొట్టిపాటి ప్రసాద్నాయుడి హత్య కేసులో ఆరుగురు నిందితులను కావలిలోని మద్దూరుపాడు హైవే అండర్పాస్ వద్ద ఆదివారం అరెస్ట్ చేశారు. కావలిలోని డీఎస్పీ కార్యాలయంలో వివరాలను డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. గట్టుపల్లి చింతలపాళెంలో ఇద్దరి మధ్య జరిగిన భూ వివాదమే హత్యకు దారితీసిందన్నారు. గట్టుపల్లి చింతలపాళెంలో మామిడి తోటకు సంబంధించి గారపాటి సదాశివరావు, తలసిల వెంకటనరసింహరావు మధ్య కొన్నేళ్లుగా వివాదం జరుగుతోంది. సదాశివరావుకు ప్రసాద్నాయుడు స్థానికంగా మద్దతిచ్చి తనపై కేసులు పెట్టిస్తున్నారని వెంకటనరసింహరావు కక్ష పెంచుకున్నారు. ఆయన్ను అడ్డు తొలగించుకుంటే తనకు ఎదురుండదని, భూ సమస్య పరిష్కారమవుతుందనే నిర్ణయానికొచ్చారు. ఈ తరుణంలో ప్రసాద్నాయుడి హత్యకు వెంకటనరసింహరావు ప్లాన్ వేశారు. కృష్ణా జిల్లా పులిగడ్డకు చెందిన రౌడీషీటర్ కొక్కిలిగడ్డ వెంకట్రావును సంప్రదించి పథక రచన చేశారు. నిందితులకు రూ.లక్ష నగదు, ఎకరా పొలమిచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. వెంకట్రావు స్నేహితుడు, మరో రౌడీషీటర్ ద్వారా కృష్ణా, బాపట్ల జిల్లాలకు చెందిన పాత నేరస్తులు డానియెల్, ప్రవీణ్కుమార్, నర్సింగరాజుతో ప్రసాద్నాయుడ్ని హతమార్చాలని నిర్ణయించుకున్నారు. గత రెండు నెలల్లో మూడు సార్లు రెక్కీ నిర్వహించి విఫలమయ్యారు. గత నెల 26న పక్కా ప్రణాళికతో తన కోళ్ల ఫారంలో ఒంటరిగా ఉన్న ప్రసాద్నాయుడ్ని కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చి పరారయ్యారు. కేసును దర్యాప్తు చేసి నిందితులను నెల్లూరు సీసీఎస్ సీఐ సీతారామయ్య పట్టుకున్నారు. హత్య కేసులో నిందితులను నాలుగు రోజుల్లోనే అరెస్ట్ చేసిన పోలీసులను ఎస్పీ అజిత అభినందించారు. -
పెంచలయ్య హత్యకు నిరసనగా బంద్ రేపు
నెల్లూరు సిటీ: గంజాయి మాఫియా, అరాచక శక్తుల చేతుల్లో ప్రజానాట్య మండలి కళాకారుడు పెంచలయ్య హత్యకు గురికావడం బాధాకరమని, దీన్ని నిరసిస్తూ జిల్లా బంద్ను మంగళవారం చేపట్టనున్నామని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మూలం రమేష్, సీపీఐ నేత రామరాజు మాట్లాడారు. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలో గంజాయి మాఫియా ఆగడాలకు అడ్డుకట్టేయాలని, దీనికి ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని పేర్కొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లు, మోహన్రావు, సీఐటీయూ నేతలు అజయ్కుమార్, ప్రసాద్, పౌర హక్కుల సంఘ నేతలు శివశంకర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఈఈలతో టెలి కాన్ఫరెన్స్
నెల్లూరు సిటీ: దిత్వా తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని ఈఈలు, డీఈఈలతో టెలి కాన్ఫరెన్స్ను ఎస్ఈ రాఘవేంద్రం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని విద్యుత్ సిబ్బంది నిర్దేశించిన హెడ్ క్వార్టర్లోనే ఉండాలని ఆదేశించారు. సిబ్బందికి సెలవులను రద్దు చేశామని చెప్పారు. జిల్లాలోని ఐదు డివిజన్లలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామని, ఇవి 24 గంటలూ పనిచేయనున్నాయని వివరించారు. వర్షాలు తగ్గేంత వరకు ప్రతి సబ్స్టేషన్లో ఇద్దర్ని ఉంచి, మిగిలిన వారిని అత్యవసర సేవలకు వినియోగించాలని సూచించారు. సర్వే ఉద్యోగుల సంఘ నూతన కార్యవర్గం నెల్లూరు(దర్గామిట్ట): సర్వే ఉద్యోగుల సంఘ జిల్లా నూతన కార్యవర్గాన్ని నగరంలోని జిల్లా సర్వే, భూ రికార్డుల కార్యాలయంలో ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రామ్కుమార్, కార్యదర్శిగా అంకయ్య, ఉపాధ్యక్షుడిగా మహేష్రెడ్డి, జాయింట్ సెక్రటరీగా శ్రీనివాసులు, ట్రెజరర్గా యామిని జ్యోత్స్న, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా ప్రసన్నకుమార్, జయచంద్ర, మన్సూర్, శ్రీనివాసులు, ముక్తారుద్దీన్, వింధ్యను ఎన్నుకున్నారు. గేదెను ఢీకొన్న బైక్ ● ఇద్దరికి గాయాలు మర్రిపాడు: గేదెను బైక్ ఢీకొనడంతో ఇద్దరు గాయపడిన ఘటన మర్రిపాడుకు కూతవేటు దూరంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. పడమటినాయుడుపల్లికి చెందిన ఇద్దరు యువకులు పని నిమిత్తం బైక్పై మర్రిపాడు వచ్చారు. అనంతరం తిరిగి బయల్దేరిన వీరు మర్రిపాడు సమీపంలో గేదె అడ్డు రావడంతో దాన్ని ఢీకొన్నారు. గాయపడిన వారిని 108లో ఆత్మకూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలతో వ్యక్తి బలవన్మరణం ఉలవపాడు: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరేడు పంచాయతీ పరిధిలోని చిల్లకాల్వ సమీపంలో గల రొయ్యల చెరువుల వద్ద ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. వేటపాళెం మండలం జగన్నాథపురానికి చెందిన రావూరి సాంబశివరావు (52) ఉలవపాడులోని ఓగుబోయిన ప్రసాద్కు చెందిన చెరువుల వద్ద పనిచేస్తున్నారు. భార్య కోటేశ్వరమ్మతో ఏర్పడిన విభేదాలతో రొయ్యల చెరువుల వద్ద ఉన్న రేకుల షెడ్లోనే ఉంటున్నారు. కుటుంబ కలహాలతో మనస్తాపంతో రేకుల షెడ్కు ఉన్న ఇనుప కమ్మికి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటన స్థలాన్ని సీఐ అన్వర్బాషా, ఎస్సై అంకమ్మ పరిశీలించారు. భార్య కోటేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాలువలో పడి వాహన చోదకుడి దుర్మరణం కొడవలూరు: కాలువలో పడి వాహనచోదకుడు మృతి చెందిన ఘటన మండలంలోని ఆలూరుపాడు మజరా రెడ్డిపాళెం వద్ద ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు.. ఆలూరుపాడు ఎస్సీ కాలనీకి చెందిన వంశీకృష్ణ (30) పని నిమిత్తం బయటకెళ్లారు. ఈ క్రమంలో ఇంటికొస్తూ రెడ్డిపాళెం వద్ద బైక్తో సహా కాలువలో శుక్రవారం రాత్రి పడ్డారు. అతనిపై బైక్ పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయం స్థానికుల ద్వారా కుటుంబసభ్యులకు తెలిసింది. ఘటన స్థలానికి కుటుంబసభ్యులు చేరుకొని మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. గ్రామంలో చిల్లర దుకాణాన్ని నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కాగా మృతుడికి మూర్ఛ వ్యాధి ఉందని, కాపాడేవారు లేక మృతి చెంది ఉండొచ్చని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. కాగా ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. కండలేరులో 58 టీఎంసీల నీటి నిల్వ రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 58.006 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 2,300 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి వివిధ కాలువకు నీటి విడుదల జరుగుతున్నట్లు వివరించారు. -
పారా లీగల్ వలంటీర్ల పాత్ర కీలకం
నెల్లూరు (లీగల్): ప్రజలకు చట్ట పరమైన సహాయంపై అవగాహన కల్పించడంలో పారా లీగల్ వలంటీర్ల (న్యాయ సేవా సహాయకులు) పాత్ర కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. శ్రీనివాస్ అన్నారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవ సదన్లో శనివారం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సంస్థలకు ముఖ్య వారధిగా ఉంటూ బాధ్యతతో మెలగాలని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే వాణి మాట్లాడుతూ ప్రతి వలంటీర్ బాధ్యతతో విధులు నిర్వహిస్తూ ప్రజల సమస్యలను పరిష్కారించడంలో ముందు ఉండాలని తెలిపారు. వివిధ రకాల చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యప రెడ్డి, సీనియర్ న్యాయవాది గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 7న ఎన్ఎంఎంఎస్ పరీక్ష నెల్లూరు (టౌన్): 2025–26కు సంబంధించి జాతీయ ఉపకార వేతన పరీక్ష డిసెంబర్ 7వ తేదీన నిర్వహించనున్నట్లు డీఈఓ బాలాజీరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 18 కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని, 3685 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను ప్రభుత్వ పరీక్షల కార్యాలయం వెబ్సైట్ www. bse. ap. gov. in, వాట్సాప్– మన మిత్రలో అందుబాటులో ఉన్నాయన్నారు. హెచ్ఎంలు పాఠశాల యూడైస్ కోడ్ను ఉపయోగించి లాగిన్ అయి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందజేయాలన్నారు. 13న జెడ్పీ సర్వసభ్య సమావేశం నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం డిసెంబర్ 13వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ ఎల్. శ్రీధర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన జరుగుతుందన్నారు. వ్యవసాయ శాఖ, నీటి పారుదల, వైద్య ఆరోగ్య శాఖ, సాంఘిక సంక్షేమం, ఆర్ అండ్ బీ, జెడ్పీ 2026–27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు తదితర శాఖలపై సమీక్ష సమావేశం జరుగుతుందన్నారు. ఆయా శాఖల జిల్లా అధికారులు, జెడ్పీ సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. -
2న జిల్లా బంద్
● గంజాయి ముఠా హత్యాకాండకు నిరసనగా.. ● రాష్ట్రంలో మితిమీరిన ఆగడాలు ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు నెల్లూరు (వీఆర్సీ సెంటర్): నెల్లూరు రూరల్ నియోజకవర్గం కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో గంజాయి ముఠా చేతిలో సీపీఎం నాయకుడు పెంచలయ్య హత్యకు నిరసనగా డిసెంబరు 2న జిల్లా బంద్కు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శనివారం ఆయన హుటాహుటినా నెల్లూరుకు చేరుకుని జీజీహెచ్లో ఉన్న పెంచలయ్య మృతదేహానికి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆయన మాట్లాడుతూ గంజాయి ముఠా హత్యాకాండకు నిరసనగా చేపట్టే బంద్కు అన్ని పార్టీలు, ప్రజలు మద్దతు ఇచ్చి సహకరించాలని కోరారు. ఈ బంద్ గంజాయి ముఠా మాఫియా అంతానికి నాంది కావాలని కోరారు. రాష్ట్రం, జిల్లాలో మత్తు పదార్థాలు, గంజాయి వినియోగం, అక్రమ రవాణాను అధికారులు అరి కట్టలేకపోతున్నారన్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతోనే గంజాయి ముఠా ఆగడాలు సాగుతున్నాయని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థ సైతం నిర్వీర్యమై పోయిందన్నారు. యువత గంజాయి తాగి విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. గంజాయి ముఠా ఆగడాలను అరికట్టాలని, హత్యలను నిలువరించాలన్న ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, మాదాల వెంకటేశ్వర్లు, జిల్లా, నగర, రూరల్ నియోజకవర్గ సీపీఎం నేతలు పాల్గొన్నారు. -
చంద్రబాబు మోసంపై ఆమరణ నిరాహార దీక్ష
● గూడూరును నెల్లూరులో కలపాలి ● మాజీ మంత్రి ప్రసన్నకుమార్రెడ్డి ఇందుకూరుపేట: ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు గూడూరును నెల్లూరు జిల్లాలో కలపాలని, లేదంటే అదే గూడూరు పట్టణ నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్రెడ్డి హెచ్చరిచారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండలంలోని కుడితిపాళెంలో శనివారం కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో గూడూరును నెల్లూరులో కలుపుతానని చంద్రబాబు మాట్లాడిన మాటలను మీడియాకు వినిపించారు. ఇచ్చిన హామీని విస్మరించి, మాట తప్పారంటూ విమర్శించారు. మీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కోసమే గూడూరు తిరిగి నెల్లూరులో కలపాలనే నిర్ణయాన్ని విస్మరించారన్నారు. ప్రజల ఆకాంక్షల కన్నా మీ సామాజిక వర్గ నేతలు ముఖ్యమా అని ప్రశ్నించారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటే పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా అదనంగా మరో 13 జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలిసిందేనన్నారు. అప్పట్లో కందుకూరును నెల్లూరుకు, గూడూరును తిరుపతికి మార్చారని గుర్తు చేశారు. గూడూరును నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని తాను కూడా వైఎస్ జగన్ దృష్టికి చాలా సార్లు తీసుకెళ్లామన్నారు. కొంత మంది ఐఏఎస్ అధికారులు ఆ విషయాన్ని పక్కదారి పట్టించారన్నారు. గూడూరును నెల్లూరులో కలపకుంటే రాజకీయాలను విరమించుకొంటానని స్థానిక ఎమ్మెల్యే సునీల్ చెప్పారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆ ప్రయత్నాన్ని విరమించుకోవడం ఏమిటని నిలదీశారు. తమ పార్టీ అధ్యక్షుడు కాకాణి, గూడూరు సమన్వయకర్త మేరిగ మురళీతో కలిసి మా అధినేత జగన్మోహన్రెడ్డిని కలిసి ఆ తర్వాత ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొంటానన్నారు. చంద్రబాబు మెడలు వంచి సాధించేలా ప్రజలు, వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు, మండల కన్వీనర్ మావులూరు శ్రీనివాసులురెడ్డి, డీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్కుమార్, బుచ్చిరెడ్డిపాళెం పట్టణం, రూరల్ అధ్యక్షుడు షేక్ షాహుల్, చెర్లో సతీష్రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి బట్టేపాటి నరేంద్రరెడ్డి, సీనియర్ నాయకులు కలువ బాలశంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అడ్డొస్తే.. అంతమే
సాక్షి టాస్క్ఫోర్స్: జిల్లాలో గంజాయి బ్యాచ్ చేసిన హత్య.. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థత.. పోలీస్ శాఖ నిఘా యంత్రాంగం వైఫల్యానికి అద్దం పడుతోంది. అధికార పార్టీలోని ముఖ్య నేతల అండదండలతో ఒక సాధారణ మహిళ గంజాయి విక్రేత స్థాయి నుంచి గంజాయిన్ డాన్ స్థాయికి ఎదిగింది. రూ.కోట్లల్లో గంజాయి వ్యాపారం చేస్తూ.. కిరాయి బ్యాచ్లను మెయింటెన్ చేస్తున్నా.. నిఘా యంత్రాంగం పసిగట్ట లేకపోవడం ఒక వ్యక్తి హత్యకు దారి తీసింది. గంజాయి డాన్ వ్యవహారం తెలిసినా.. పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో మౌనం దాల్చారా? అనే అనుమానులు కూడా వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా గంజాయి పంట నుంచి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టి ఉక్కుపాదంతో అణచివేసింది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లా గంజాయి, డ్రగ్స్, నకిలీ మద్యానికి అడ్డాగా మారింది. విశాఖ, ఒడిశా సరిహద్దుల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున గంజాయిని దిగుమతి చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు సాగిస్తున్నారు. విద్యార్థులు, యువతే లక్ష్యంగా వ్యాపా రం సాగుతోంది. ఇక్కడి నుంచి కేరళ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు పెద్ద ఎత్తున గంజాయి తరలివెళుతోంది. గంజాయిని కట్టడి చేయాల్సిన పోలీసులు, ఎకై ్సజ్, ఈగల్ టీమ్లు మొక్కుబడి చర్యలకే పరిమితమయ్యారు. దీంతో గంజాయి స్మగ్లర్లు బరితెగిస్తున్నారు. గంజాయి తరలింపు సమయంలో అడ్డుపడిన వారిని అడ్డుతొలగించేందుకు స్మగ్లర్లు వెనుకాడటం లేదు. ఈ ఏడాది ఆగస్టు 17న.. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా నుంచి కారులో 22 కేజీల గంజాయిని నెల్లూరులోని వ్యాపారికి ఇచ్చేందుకు తీసుకు వస్తున్నారని పక్కా సమాచారం పోలీసు బాస్కు అందింది. ఆయన ఆదేశాల మేరకు బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ జాతీయ రహదారిపై తన సిబ్బందితో కలిసి కాపు కాశారు. పెన్నాబ్రిడ్జి వద్ద నుంచి గంజాయి తరలిస్తున్న కారును వెంబడించారు. ఎస్వీజీఎస్ కళాళాల వద్ద కారు యూటర్న్ తీసుకుంటున్న సమయంలో పోలీసులు కారును చుట్టుముట్టారు. గంజాయి కోసం అక్కడికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. కారు డ్రైవర్ తప్పించుకునేందుకు కారును పోలీసులపైకి దూకించారు. ఈగల్ టీమ్ కానిస్టేబుల్కు గాయాలయ్యాయి. ఇన్స్పెక్టర్ సాంబశివరావు కారును వెంబడిస్తూ కారుపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. పరారవుతున్న నిందితుడిని పట్టుకున్నారు. హెడ్ కానిస్టేబుల్పై కత్తితో దాడి.. పోలీసుల కాల్పులు పెంచలయ్య హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో నిందితుల కోసం పోలీసు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితులు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్నారన్న పక్కా సమాచారంతో నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్ జి. వేణు, కోవూరు ఎస్ఐ తమ స్బిందితో కలిసి శనివారం తెల్లవారు జామున షుగర్ ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు ఉన్న ప్రాంతాన్ని చుట్టు ముట్టారు. ఈ క్రమంలో నిందితులు తప్పించుకునేందుకు నెల్లూరు రూరల్ హెడ్కానిస్టేబుల్ ఆదినారాయణపై హత్య కేసులో కీలక నిందితుడైన జేమ్స్ కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆత్మ రక్షణ కోసం ఇన్స్పెక్టర్ వేణు తొలుత గాలిలోకి, అనంతరం నిందితుడి ఎడమ కాలిపై గన్తో కాల్చారు. అడ్డొస్తే.. హత్యలకు వెనుకాడని వైనం టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లా నేరాలకు అడ్డాగా మరింది. ఇందులో గంజాయి బ్యాచ్ బరి తెగిస్తోంది. అధికార పార్టీ అండదండలతోనే వీరు చెలరేగిపోతున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అధికార పార్టీ సహకారం, పోలీసుల నిఘా వైఫల్యంతో సాధారణ గంజాయి విక్రేత స్థాయి నుంచి డాన్గా వ్యవహరించే స్థాయికి ఎదిగిన మహిళ నేతృత్వంలో ఈ గంజాయి బ్యాచ్ అరాచకాలు, ఘాతుకాలతో పేట్రేగిపోతోంది. తమ అక్రమ వ్యాపారానికి అడ్డొస్తే.. ఎంతటి వారైనా సరే అంతమొందించేందుకు సైతం వెనుకాడడం లేదు. గతంలో నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావుతోపాటు పోలీస్ సిబ్బందిని, మరో ఘటనలో ఓ కానిస్టేబుల్ను కారు ఢీకొట్టి తప్పించుకున్నారు. తాజాగా గంజాయి వ్యతిరేక ఉద్యమకారుడు కొట్టివిడి పెంచలయ్యను సినిమా సీన్ తలపించే రీతితో వెంటాడి.. వెంటాడి దారుణంగా హతమార్చారు. పోలీసులపైనా దాడులకు తెగబడుతూ గతంలో డీఎస్పీని కారుతో ఢీకొట్టి పరారైన ఘటన ఓ కానిస్టేబుల్పైనా అదే తరహాలో అటాక్ తాజాగా గంజాయిని అరికట్టేందుకు కృషి చేస్తున్న వ్యక్తిని వెంటాడి వెంటాడి చంపారు ఓ మహిళా డాన్ నేతృత్వంలో నెలకు రూ.కోట్లల్లో బిజినెస్ బ్యాచ్లను నడిపిస్తున్న వైనం అయినా కనిపెట్టలేకపోయిన పోలీసు నిఘా యంత్రాంగం వరుస ఘటనలతో ఉలిక్కి పడుతున్న జిల్లా గతేడాది ఆగస్టులో విశాఖ ఏజెన్సీ నుంచి తిరుపతికి కారులో ముగ్గురు దుండగులు పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్నారని జిల్లా పోలీసులకు సమాచారం అందింది. దీంతో నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వెంకటాచలం, మనుబోలు పోలీసులు వెంకటాచలం టోల్ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. గంజాయి తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా నిందితులు కారును ఆపినట్లు ఆపి వేగంగా ముందుకు దూసుకెళ్లారు. వాహనాన్ని ఆపేందుకు యత్నించిన డీఎస్పీతోపాటు పలువురు పోలీసు అధికారులకు గాయాలయ్యాయి. అప్పట్లో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆ తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేతులు దులుపుకున్నారు. తాజాగా.. పెంచలయ్య హత్య నగరంలోని హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన కొట్టివిడి పెంచలయ్య (35)సీపీఎం నాయకుడిగా, ఆర్టీడీ కాలనీ ముత్యాలమ్మ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యునిగా ఉన్నారు. అదే ప్రాంతానికి చెందిన అరవ కామాక్షి నేరచరితులకు ఆశ్రయం ఇచ్చి, దొంగతనాలకు పాల్పడే వారితో అసాంఘిక కార్యకలాపాలు చేయించడం గమనించిన పెంచలయ్య పద్ధతి మార్చుకోవాలని చెప్పి చూశాడు. గంజాయి విక్రయాలను అడ్డుకున్నాడు. పోలీసులతో కలిసి చైతన్య కార్యక్రమాన్ని చేపట్టాడు. గతంలో రూ.కోట్లల్లో జరిగిన గంజాయి వ్యాపారం.. ఇప్పుడు పూర్తిగా ఆగిపోయింది. దీంతో తన ముఠాతో కలిసి స్కెచ్ వేసి పెంచలయ్య హత్యకు తెగబడినట్లు పోలీసులే చెబుతున్నారు. -
జిల్లాకు భారీ వర్షాలు
నెల్లూరు (దర్గామిట్ట): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 30, డిసెంబర్ 1వ తేదీ వరకు రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండా లని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తెలియజేశారు. శనివారం ఆయన ఛాంబర్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలు, తీరా ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే ముందస్తుగా ఏర్పాట్లు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని ఆయన సూచించారు. నీటిపారుదల, ఆర్ డబ్ల్యూఎస్, విద్యుత్, ఆర్ అండ్ బీ, పీఆర్, వ్యవసాయ, పశుసంవర్థక, పంచాయతీ రాజ్, మున్సిపల్, శాఖలతో పాటు అన్ని శాఖలు 24/7 అప్రమత్తంగా ఉంటూ తగు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు కలెక్టరేట్లో కంట్రోలు రూంను ఏర్పాటుచేసినట్లు జేసి మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తితే కంట్రోలు రూం నంబర్లు 0861–2331261, 7995576699కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదు ప్రజల సహాయార్థం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు జేసీ మొగిలి వెంకటేశ్వర్లు -
మహిళల తడాఖా చూపిస్తాం
● వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత నెల్లూరు (స్టోన్హౌస్పేట): రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో మహిళలకు రక్షణ కరువైందని, అధికార పార్టీ నేతలు మహిళలను అనేక విధాలుగా వేధింపులకు గురి చేస్తున్నారని, ప్రభుత్వానికి మా తడాఖా చూపిస్తామని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత హెచ్చరించారు. నగరంలోని జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. కాకాణి పూజిత మాట్లా డుతూ రాష్ట్ర సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వద్ద పనిచేస్తున్న అనధికార వ్యక్తిగత సలహాదారుడు సతీష్కుమార్ ఒంటరి మహిళను వేధించడం బాధాకరమన్నారు. కోవిడ్లో భర్తను కోల్పోయి, ఉద్యోగం కోసం వచ్చిన బాధిత మహిళను డబ్బులు డిమాండ్ చేయడంతోపాటు, లైంగిక వేధింపులకు గురి చేయడం అధికార పార్టీ నేతల దుర్మార్గాలకు పరాకాష్ట అన్నారు. సహాయం కోరి వస్తే రక్షకులే భక్షకులుగా వ్యవహరిస్తున్నారని, ఇంటి పరువు కోసం పాకులాడుతూ కొందరు మహిళలు మౌనంగా రోదిస్తున్నా, కొందరు మహిళలు బహిరంగంగా మొర పెట్టుకుంటున్నా, వారికి న్యాయం చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదన్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు మహిళలపై అత్యాచారాలు చేస్తుంటే మొక్కుబడిగా కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారన్నారు. జగనన్న పాలనలో మహిళలను గౌరవించి, పెద్ద పీట వేశారన్నారు. మహిళల సాధికారతకు ఆయన పాలనలో ప్రతి పథకాన్ని మహిళల పేరిట అందించి అభివృద్ధి వైపు నడిపారన్నారు. మహిళలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారని, మహిళాభివృద్ధి, సంక్షేమం చూసిన మహిళలు, టీడీపీ పాలనలో మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలు, అత్యాచారాలను చూసి ఆవేదన చెందుతున్నారన్నారు. మహిళల భద్రత కోసం దిశా యాప్ తీసుకొని వచ్చి, మహిళలకు ధైర్యాన్ని కల్పించిన వ్యక్తి జగనన్న అన్నారు. రాష్ట్రంలోని మహిళా శక్తి ఉద్యమిస్తే కూటమి ప్రభుత్వం తట్టుకోలేదన్నారు. మహిళలతో తప్పుగా ప్రవర్తించే వాళ్లు, ఎంతటి వారైనా తప్పించుకోలేరన్న భయాన్ని కల్పించాలన్నారు. చంద్రబాబు తక్షణమే స్పందించి, పటిష్టమైన చర్యలు చేపట్టి, మహిళలను వేధిస్తున్న కీచకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మీడియా సమావేశంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జోనల్–4 అధ్యక్షురాలు మొయిళ్ల గౌరీ, తోటపల్లి గూడూరు జెడ్పీటీసీ సభ్యులు ఎంబెటి శేషమ్మ, పొదలకూరు ఎంపీటీసీ సభ్యులు లక్ష్మీ కళ్యాణి, దువ్వూరువారిపాళెం సర్పంచ్ కృష్ణవేణమ్మ, వైఎస్సార్సీపీ జిల్లా అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు లావణ్య, నెల్లూరు నగర మహిళా విభా గం అధ్యక్షురాలు ధనుజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆటోను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
● ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు ఉలవపాడు: ఆటోను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో మహిళ మృతి చెందగా, ఆరుగురు గాయపడిన ఘటన జాతీయ రహదారిపై రాజుపాళెం జంక్షన్ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. ఉలవపాడు మండలంలోని టెంకాయచెట్లపాళేనికి చెందిన కూలీలు రాజుపాళెం వద్ద జామాయిల్ చెట్ల ఆకులను మెషీన్లో వేసే పొట్టు పనికి బయల్దేరారు. ఈ క్రమంలో రాజుపాళెం జంక్షన్ సమీపంలోకి వచ్చేసరికి ఆటోను హైదరాబాద్ నుంచి చైన్నె వెళ్తున్న వీ కా వేరి ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీకొంది. ఘటన లో ఆటోలో ఉన్న లక్ష్మి (35) అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయ్, పోలమ్మకు కాళ్లు విరగ్గా.. సురేష్, పద్మ, అంజమ్మ, సుజాత స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 ద్వారా ఉలవపాడు వైద్యశాలకు.. ఆపై మెరుగైన వైద్యం నిమిత్తం కావలిలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. మృతదేహానికి ఉలవపాడు సీహెచ్సీలో పోస్ట్మార్టాన్ని నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఘటన స్థలాన్ని ఎస్సై అంకమ్మ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫెన్సింగ్ రాయే కారణమా..? ఆటోను బస్సు ఢీకొన్న సమయంలో లక్ష్మి మృతికి ఫెన్సింగ్ రాయి సైతం కారణమని తెలుస్తోంది. బస్సు ఢీకొనడంతో ఫెన్సింగ్ వద్దకు ఆటో వచ్చేసింది. అందులో ఉన్న లక్ష్మి బయటపడిపోయి ఫెన్సింగ్ రాయికి తల కొట్టుకోవడంతో మృతి చెంది ఉండొచ్చని బంధువులు భావిస్తున్నారు. -
మహిళలపై గొడ్డలితో దాడి
ఉదయగిరి: ఇద్దరు మహిళలపై గొడ్డలితో వ్యక్తి దాడి చేసిన ఘటన మండలంలోని పుల్లాయపల్లి ఎస్సీ కాలనీలో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కట్టెల కోసం సమీపంలోని అడవికి ఎస్సీ కాలనీకి చెందిన లక్ష్మీనరసమ్మ, కవిత వెళ్లారు. ఈ క్రమంలో కవితకు వరుసకు బావ.. లక్ష్మీనరసమ్మ భర్తకు మరిదైన ఆదినారాయణ తారసపడ్డారు. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన ఆదినారాయణ తన వద్ద ఉన్న గొడ్డలితో వీరిపై దాడి చేశారు. కాగా వ్యసనాలకు బానిసై కాలనీలో చిన్న దొంగతనాలకు పాల్పడుతుండటంతో గతంలో వీరిద్దరూ మందలించారనే విషయాన్ని మనస్సులో పెట్టుకొని దాడికి పాల్పడ్డారని కాలనీ వాసులు చెప్పారు. తీవ్రంగా గాయపడిన మహిళలను ఉదయగిరి సీహెచ్సీకి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వైద్యశాలకు ఎస్సై ఇంద్రసేనారెడ్డి చేరుకొని దాడి ఘటనపై వివరాలను సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడు పరారీలో ఉన్నారు. -
పీహెచ్సీని ఏ గ్రేడ్కు తీసుకురావాలి
పొదలకూరు: ప్రస్తుతం బీ గ్రేడ్లో ఉన్న స్థానిక పీహెచ్సీని ఏ గ్రేడ్కు తీసుకొచ్చేలా కృషి చేయాలని డీఎంహెచ్ఓ సుజాత పేర్కొన్నారు. మండలంలోని మహ్మదాపురం పీహెచ్సీని శనివారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడారు. అన్ని కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించడంతో పాటు లక్ష్యాలను పూర్తి చేయాలని సూచించారు. తాటిపర్తిలో నిర్వహిస్తున్న ఎఫ్డీపీ కార్యక్రమాన్ని సందర్శించి వివరాలను ఆరాతీశారు. పీహెచ్సీ వైద్యాధికారులు నరసింహరావు, శ్రీకావ్య తదితరులు పాల్గొన్నారు. బడి మూతపై విచారణ వింజమూరు (ఉదయగిరి): మండలంలోని జనార్దనపురంలో గల ప్రాథమిక పాఠశాలను శుక్రవారం మూసేశారు. ఇదే విషయమై మూత బడి అనే శీర్షికన సాక్షిలో కథనం శనివారం ప్రచురితమైంది. దీనిపై కావలి డిప్యూటీ డీఈఓ హరిప్రసాద్ స్పందించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు చేపడతామని చెప్పారు. కాగా ఇంత జరిగినా ఎంఈఓలు స్పందించకపోవడంపై గ్రామస్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుడు రాజుకు సంబంధించిన ఆన్లైన్ రికార్డులు, హాజరు పట్టిక, ఎస్సార్ను పరిశీలిస్తే అనేక అంశాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. -
‘మా కడుపులు కొట్టొద్దు’
వింజమూరు (ఉదయగిరి): అయ్యా.. మీ వ్యాపారాలకు మా భూములే దొరికాయా.. దయచేసి మా భూములు లాక్కొని, మా కడుపులు కొట్టొద్దు.. అంటూ ఎమ్మెల్యే కాకర్ల సురేష్, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు వద్ద గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. వింజమూరు మండల కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న జీబీకేఆర్ ఎస్టీ కాలనీ సమీపంలో ఉన్న 94 ఎకరాల ప్రభుత్వ భూమిని నుడాకు కేటాయింపుపకు సంబంధించి శుక్రవారం జేసీ, ఎమ్మెల్యే ఆ భూముల పరిశీలనకు వచ్చారు. ఈ క్రమంలో అక్కడ సాగు చేస్తున్న ఎస్టీ కాలనీ వాసులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ భూములు నుడాకు ఇచ్చి మా భవిష్యత్తు అంధకారంలోకి నెట్టొద్దు అని వేడుకున్నారు. కాగా ఒకపక్క మీకు న్యాయం చేస్తామని చెబుతునే మరోపక్క అందరూ సహకరించాలి అని ఎమ్మెల్యే సురేష్ చెప్పడం పట్ల గిరిజనులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వంశీకృష్ణ, తహసీల్దార్ హమీద్, ఎంపీడీఓ కె.శ్రీనివాసరెడ్డి ఉన్నారు. -
జిల్లాలో సాగు ఇలా..
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో వ్యవసాయ రంగం కుప్పకూలిపోతోంది. రైతులకు రాయితీతో విత్తనాల సరఫరా నుంచి తప్పుకుంది. విత్తనం కొనుగోలు నుంచి పంట ఉత్పత్తుల విక్రయం వరకు రైతులను ఖర్మకు వదిలేసింది. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దేవుడెరుగు.. కనీసం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను అమలు చేయడంలో చేతులెత్తేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పంట ఉత్పత్తులకు ధరలు ఆకాశం వైపు సూచికలు ఉంటే.. టీడీపీ పాలనలో పాతాళానికి సూచిస్తున్నాయి. మరో వైపు సాగు పెట్టుబడులు పెరుగుతుంటే.. ధరలు దిగజారిపోవడంతో రైతులు సాగుకు సెలవు ప్రకటిస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో మినుము సాగు ఇందుకు అద్దం పడుతోంది. ఉదయగిరి: టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో వ్యవసాయ రంగం పూర్తిగా కుదేలైపోయింది. వ్యవసాయ, ఉద్యాన పంట ఉత్పత్తుల పరిస్థితి చూస్తే దారుణంగా పతనమై రైతులు అల్లల్లాడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడంతో సూచికలు ఆకాశం వైపు పరుగులు తీశాయి. టీడీపీ ఏడాదిన్నర పాలనలో ధరలు ఏ స్థాయికి పతనమయ్యాయో చూస్తే.. పథకం ప్రకారం వ్యవసాయ రంగాన్ని కనుమరుగు చేసే కుట్ర కనిపిస్తోంది. రైతులు ఒక్కొక్కరుగా సేద్యం నుంచి తప్పుకుంటున్న పరిస్థితి అనివార్యమవుతోంది. జిల్లాలో 38 మండలాలు ఉండగా దాదాపు 25 మండలాల్లో మినుము సాగు జరుగుతోంది. ప్రధానంగా ఉదయగిరి, వింజమూరు, ఆత్మకూరు, పొదలకూరు, కందుకూరు వ్యవసాయ సబ్ డివిజన్ల్లో ఎక్కువగా ఖరీఫ్, రబీ సీజన్లో మినుము సాగు చేస్తున్న పరిస్థితి ఉంది. డెల్టా ప్రాంతాల రైతులు సైతం మెట్ట ప్రాంతంలో భూములు కౌలుకు తీసుకొని సాగు చేసేవారు. గతంలో పెట్టుబడులు తక్కువగా ఉండడం, దిగుబడి బాగా ఉండడంతో లాభాలు గడించేవారు. దీంతో మినుము పంట రైతుల ఇంట కాసులు పండించింది. ఖరీఫ్లో చాలా తక్కువ సాగు చేస్తుండగా, వర్షాధారం కింద రబీలో అత్యధిక విస్తీరణంలో సాగు జరుగుతోంది. గడిచిన నాలుగేళ్లలో సాగు పరిశీలిస్తే.. జిల్లాలో సాధారణ సాగు విస్తీరణం 14,333 ఎకరాలు కాక 2022–23లో 18,788 ఎకరాలు సాగు చేశారు. అప్పుడు క్వింటా ధర రూ.9 వేలు వరకు పలికింది. 2023–24లో సకాలంలో వర్షాలు కురకపోవడంతో 10 వేల ఎకరాల్లోనే సాగు చేశారు. ఆ ఏడాది కూడా ఽక్వింటా ధర రూ.8 వేలకు పైబడి పలికింది. 2024–25లో టీడీపీ అధికారంలోకి రావడం, ప్రభుత్వ ప్రోత్సాహకం కొరవడింది. కనీసం రాయితీతో మినుములు సరఫరా చేయకుండా చేతులెత్తేసింది. దీంతో సాగు విస్తీరణం గనీయంగా పడిపోయింది. కేవలం 3 వేల ఎకరాల్లో మాత్రమే సాగు చేపట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పంట ఉత్పత్తులకు ధరలు కల్పించడంలో చేతులెత్తేయడంతో ధరలు పూర్తిగా పతనమయ్యాయి. క్వింటా రూ.5ే వేలకు కొనే దిక్కు లేకుండా పోయింది. దీనికి తోడు దిగుబడులు తగ్గడంతో రైతులు అనాసక్తత వ్యక్తం చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారు. ఈ సీజన్లో కూడా కేవలం 4 వేల ఎకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నారు. క్రాప్ హాలిడే దిశగా అన్నదాతలు కూటమి ప్రభుత్వం కొలువు తీరిన వెంటనే రైతు వ్యతిరేక విధానాలకు శ్రీకారం చుట్టింది. గ్రామ స్థాయిలో ఉన్న రైతుసేవా కేంద్రాలు (గతంలో ఆర్బీకే)లను నిర్వీర్యం చేస్తూ అక్కడ ఉన్న సిబ్బందిని క్రమబద్ధీకరణ పేరుతో డెల్టా ప్రాంతాలకు బదిలీ చేశారు. దీంతో అనేక ఆర్బీకేల్లో సిబ్బంది లేక మూతపడ్డాయి. ఎరువులు, పురుగు మందులు సరఫరా పూర్తిగా ఆగిపోయింది. రాయితీతో విత్తనాల సరఫరాకు మంగళం పలికింది. ఉచిత పంట బీమా అటకెక్కింది. ప్రకృతి విపత్తల సమయంలో ఇచ్చే పెట్టుబడి సహాయం ఊసేలేదు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర కొనుగోలు చేసే పరిస్థితులు లేవు. పోనీ ప్రభుత్వ ఆధ్యర్యంలో కొనుగోలు కేంద్రాల ఊసే లేదు. రైతులు పంటల సాగు కోసం కేంద్రంతో సంబంధం లేకుండా ప్రతి ఏడాది ఇస్తామన్న రూ.20 వేలు గతేడాదిలో ఇవ్వలేదు. ఈ ఏడాదిలో వరి సాగు రైతులకు మాత్రమే అందజేసింది. దీంతో మినుము సాగుతో నష్టాలు తప్పు వని భావించిన రైతులు మినుము సాగుపై క్రాప్ హాలిడే ప్రకటించే దిశలో ఆలోచన చేస్తున్నారు. గతంలో 18,788 ఎకరాలు ప్రస్తుతం 3 వేల ఎకరాల్లోపే.. భారీగా పెరిగిన పెట్టుబడి వ్యయం దొరకని గిట్టుబాటు ధరలు వైఎస్సార్సీపీ పాలనలో క్వింటా రూ.9 వేలు ప్రస్తుతం రూ.5 వేల లోపే! గతంలో రాయితీ విత్తనాలు సరఫరా ఇప్పుడా ఊసే లేదు ధరల స్థిరీకరణకు చర్యలు చేపట్టని ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులు గతంలో రాయితీతో మినుము విత్తనాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మినుము సాగు చేసే రైతులకు అవసరం మేరకు రాయితీపై విత్తనాలు ఆర్బీకేల ద్వారా సరఫరా చేసింది. దుక్కిల్లో వేసేందుకు రసాయనిక ఎరువులు, తెగుళ్లు, చీడ పీడల నివారణకు ఉపయోగించే మందులు స్థానిక ఆర్బీకేల్లో తక్కువ ధరకుల అందించింది. పైగా ప్రకృతి విపత్తుల నేపథ్యంలో పంట నష్టం జరిగితే ఉచిత పంట బీమా పథకం ద్వారా రైతులకు నష్ట పరిహారం అందజేసింది. కేంద్రం ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. దీంతో రైతులకు కొంతమేర సాగు భారం తగ్గేది. దీంతో సొంత భూములు ఉన్న రైతులు సాగు చేసి ఎంతో కొంత లాభాలు గడించేవారు. గతేడాది మినుములో తీవ్ర నష్టాలు గతేడాది 15 ఎక రాల్లో మినుము సాగు చేశాను. ఒక ఎకరానికి సాగుకు పెట్టుబడి రూ.20 వేలు వరకు అయింది. కానీ దిగుబడి కేవలం 2 క్వింటాలు వచ్చింది. ఒక క్వింటా ధర రూ.4 వేలకు మాత్రమే కొన్నారు. నాకు రూ.1.5 లక్షలు నష్టం వచ్చింది. ఈ ఏడాది మినుము సాగు చేయలేదు. మెట్ట భూమి అంతా బీడుగా వదిలివేశాం. అనేక మంది రైతులు క్రాప్హాలిడే ప్రకటించి, సాగు చేపట్ట లేదు. – మాధవరెడ్డి, వరికుంటపాడు భారీగా నష్టాలు ఒక ఎకరం మినుము సాగు చేయాలంటే కనీసం రూ.20 వేలు పెట్టుబడి అవుతోంది. ఎకరానికి సగటున 2.5 క్వింటాలు మాత్రమే దిగుబడి వస్తోంది. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ రూ.7800)కు ఉంటే అసలైన వచ్చే అవకాశం ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్దతు ధర కంటే అదనంగా ఉండడంతో రైతులు ఆర్థికంగా బలపడ్డారు. టీడీపీ పాలనలో మద్దతు ధర కంటే తక్కువగా రూ. 5 వేలు మాత్రమే కొనుగోలు చేయడంతో బాగా నష్టాపోయారు. దీంతో రైతులు మినుము సాగుపై ఆసక్తి చూపడం లేదు. -
పూలే ఆశయానికి అనుగుణంగా వైఎస్ జగన్ పాలన
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ● మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళి నెల్లూరు (స్టోన్హౌస్పేట): మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిభాయి పూలే తమ జీవిత కాలం పాటు మహిళల అభ్యున్నతికి కృషి చేశారని, వారి ఆశయానికి అనుగుణంగా రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన సాగించారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి గుర్తు చేశారు. నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాకాణి మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, జ్యోతిరావుపూలే వంటి మహనీయులు ఆశయాలు, విలువలకు టీడీపీ ప్రభుత్వం పాతరేస్తుందన్నారు. మహిళలకు సంక్షేమ పథకాలిస్తామని నమ్మించి ఓట్లు వేయించుకుని దగా చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే కృషి ఫలితంగా నేడు మహిళలు విద్యను అభ్యసించడంతో పాటు, అన్ని రంగాల్లో రాణించగలుగుతున్నారన్నారు. టీడీపీ పాలనలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగడం లేదని, మహాత్ముల ఆశయ సాధన జగనన్నతోనే సాధమన్నారు. -
మూత‘బడి’
● ఆ స్కూల్కు నిత్యం సెలవులే.. ● తరచూ విధులకు టీచర్ ఎగనామం ● డిప్యుటేషన్ పేరుతో నెట్టుకొస్తున్న వైనం ● పట్టించుకోని అధికారులువిచారణ చేయాలి టీచర్ రాజు నెలలో సగం రోజులు బడికి రారు. పక్క ఊరు నుంచి వేరేవారిని వేస్తారు. పిల్లల చదువులు పాడయ్యాయి. మా ఊరి నుంచి 25 మంది పైగా 5వ తరగతిలోపు పిల్లలు ప్రైవేట్ బడులకు వెళ్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఆయన బడికి రాకున్నా అధికారులు మాత్రం జీతం ఇస్తున్నారు. విచారణ జరిపి వాస్తవాలు తెలుస్తాయి. – రవి, గ్రామస్తుడు నాడు ఎంతో బాగుండేది నేను ఈ పాఠశాలలో ఆరేళ్ల క్రితం చదువుకున్నాను. అప్పుడు వంద మందితో కళకళలాడేది. చదువు బాగా చెప్పేవారు. కానీ 2021లో రాజు రాకతో బడిలో పరిస్థితులు మారాయి. – మనోజ్ కుమార్, పూర్వ విద్యార్థి ●వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండలంలోని జనార్దనపురం ప్రాథమిక పాఠశాలను శుక్రవారం మధ్యాహ్నం 1:30 తర్వాత మూసేశారు. వచ్చిన ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు ఇంటికి వెళ్లిపోగా, మరొకరు మెట్లపై కుర్చొన్నారు. నెలలో పది నుంది 15 రోజులు ఇలాగే జరుగుతుందని పలువురు గ్రామస్తులు ‘సాక్షి’ దృష్టికి తెచ్చారు. ప్రైవేట్ స్కూల్కు.. 844 మంది జనాభా ఉండే జనార్దనపురం మారుమూలన ఉంటుంది. ఇక్కడ ఉన్నతాధికారుల తనిఖీలు అరుదు. గతంలో ప్రాథమిక పాఠశాల పిల్లలతో కళకళలాడుతుండేది. కానీ 2021లో ఆవుల రాజు అనే వ్యక్తి టీచర్గా చేరాడు. అప్పటికి ఇక్కడ 40 మంది విద్యార్థులున్నారు. ఉపాధ్యాయుడు సక్రమంగా బడికి రాకపోవడం, వచ్చినా చదువు చెప్పకపోవడంతో ప్రస్తుతం నలుగురు మాత్రమే మిగిలారు. ఇదే గ్రామం నుంచి ప్రాథమిక విద్య కోసం ప్రైవేట్ స్కూళ్లకు 26 మంది పిల్లలు వెళ్తుంటారు. ఎన్ని సెలవులు పెట్టినా.. సదరు టీచర్ ఎన్ని సెలువులు పెట్టినా అధికారుల అండతో జీతంలో కోత ఉండదని ఆరోపణలున్నాయి. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో అతను జలదంకి మండలం వేములపాడుకు వెళ్లాడు. అయితే ఇక్కడికి మరో టీచర్ రాకపోవడంతో రిలీవ్ చేయలేదు. దీంతో జనార్దనపురంలో విధులు.. జలదంకి మండలంలో జీతం తీసుకుంటున్నాడు. స్కూల్కు తరచూ సెలవులు పెడుతుండటంతో పక్క పాఠశాలలకు చెందిన వారిని డిప్యుటేషన్ వేస్తున్నారు. వాస్తవానికి రాజు డ్యూటీ సర్టిఫికెట్ ఆధారంగా జలదంకి మండలంలో వేతనం పెట్టాలి. కానీ అలా జరగడం లేదు. పైగా అతడికి సంబంఽధించి కమ్యుటేషన్ సెలవులు ఎస్సార్లో నమోదు చేయడం లేదనే ఆరోపణలున్నాయి. ఇటీవల వెబ్ మీటింగ్లో సదరు టీచర్ హాజరు నమోదు లేదని, పాఠశాల మూసేశారంటూ డీఈఓ మండలాధికారులను అడిగినా సమాధానం చెప్పకుండా దాట వేసినట్లు సమాచారం. ఆగస్ట్ 15వ తేదీ ఆ టీచర్ జాతీయ జెండాను తిరగేసి ఎగుర వేయడం మీడియాలో రావడం వివాదాస్పదంగా మారింది. అయినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. -
డిసెంబర్ 6 లోపు ఓపెన్ స్కూల్ పరీక్ష ఫీజు చెల్లించాలి
నెల్లూరు (టౌన్): ఏపీ ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే అభ్యాసకులు పరీక్ష ఫీజును డిసెంబరు 6వ తేదీ లోపు చెల్లించాలని డీఈఓ బాలాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.50 అపరాధ రుసుంతో వచ్చే నెల 7వ తేదీ వరకు రూ.200 అపరాధ రుసుంతో 10వ తేదీ వరకు, రూ.500 అపరాధ రుసుంతో 13వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. అభ్యాసకులు పరీక్ష ఫీజును నేరుగా https:// bse. ap. gov. in వెబ్సైట్లో చెల్లించాలన్నారు. శ్రామికుల సంఖ్య పెంచండి ● డ్వామా పీడీ గంగాభవాని నెల్లూరు (పొగతోట): ఉపాధి హామీ పనులకు హాజరయ్యే శ్రామికుల సంఖ్యను పెంచేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ గంగాభవాని మండల సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం డ్వామా కార్యాలయం నుంచి వివిధమండలాల ఏపీఓలు, ఈసీలు, టీఏలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో పీడీ మాట్లాడారు. ప్రతి రోజు 50 వేల నుంచి 60 వేల మంది శ్రామికులు పనులకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. శ్రామికులు పని ప్రదేశం నుంచి పనులు చేస్తున్న ఫొటోలను అప్లోడ్ చేయాలన్నారు. గోకులాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. సోప్పిట్ల నిర్మాణాలు వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. అక్రిడిటేషన్ కాలపరిమితి రెండు నెలలు పొడిగింపు నెల్లూరు (దర్గామిట్ట): జిల్లాలోని జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువు నవంబర్ 30వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో కాలపరిమితిని మరో రెండు నెలల పాటు 2025 డిసెంబర్ 01 నుంచి 2026 జనవరి 31వ తేదీ వరకు లేదా కొత్త కార్డులు జారీ ప్రక్రియ ఏది ముందు జరిగితే అప్పటి వరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ప్రస్తుతం నవంబర్ 30 నాటికి అక్రిడిటేషన్ కార్డులు కలిగి పనిచేయుచున్న పాత్రికేయులకు మాత్రమే మరో రెండు నెలల పాటు ఈ పొడిగింపు సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు. పెన్నానదికి 30 వేల క్యూసెక్కుల విడుదల సోమశిల: జలాశయం నుంచి పెన్నాడెల్టాకు శుక్రవారం 6, 7, 8 క్రస్ట్గేట్ల ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశామని ప్రాజెక్ట్ ఈఈ శ్రీనివాసులు తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జలాశయానికి లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశాలు ఉన్నాయనే సమాచారంతో నీటిని విడుదల చేశామన్నారు. ప్రస్తుతం జలాశయంలో 71.835 టీఎంసీలు నీరు నిల్వ ఉండగా, పైతట్టు ప్రాంతాల నుంచి 14,451 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా ఉత్తర కాలువకు 40, దక్షిణ కాలువకు 200, కండలేరుకు 2 వేల క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నామన్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 59,548 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 25,548 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.54 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. -
ఏకగ్రీవంగా హంస ఎన్నికలు
నెల్లూరు(అర్బన్): ఏపీ హెల్త్ అడ్మినిస్ట్రేషన్, మెడికల్ సర్వీ సెస్ అసోసియేషన్ (ఏపీ హంస)లో పలు తాలూకాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయి. శుక్రవారం నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో ఉన్న ఓ ప్రైవేట్ కార్యాలయంలో అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఉదయగిరి తాలూకా హంస ప్రెసిడెంట్గా గాజుల నౌషాద్బాబు, సెక్రటరీగా ఖాజామొహిద్దీన్, మహిళా వింగ్ సెక్రటరీగా ఎం.చంద్రావతి, ఉపాధ్యక్షులుగా రబ్బానీబాషా, లావణ్య, జాయింట్ సెక్రటరీలుగా శైలజ, జయమ్మ వింజమూరు తాలూకా ఉపాధ్యక్షులుగా వి.ఝాన్సీరాణి, డి.శ్రీవిద్య, మహిళా వింగ్ సెక్రటరీగా సుహాసిని, జాయింట్ సెక్రటరీలుగా కృష్ణవేణి, రమణమ్మ, మంజులవాణి, బుచ్చిరెడ్డిపాళెం తాలూకా ట్రెజరర్గా ఆరోగ్యమేరీ, ఉపాధ్యక్షురాలిగా పార్వతి, జాయింట్ సెక్రటరీలుగా వాణి, అరుణ, కావలి తాలూకా ట్రెజరర్గా నూర్బాషా, ఉపాధ్యక్షురాలిగా భార్గవి, జాయింట్ సెక్రటరీగా శాంతకుమారి నియమితులయ్యారు. – ఈ సందర్భంగా హంస జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్రావు మాట్లాడుతూ తొలగించబడిన హెల్త్ అసిస్టెంట్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలన్నారు. తొలగించబడిన సమయంలో బాధతో మృతిచెందిన హెల్త్ అసిస్టెంట్ల కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని కోరారు. ఏఎన్ఎంలకు యాప్లు తగ్గించాలని, 25 సంవత్సరాలు దాటిన ఏఎన్ఎంలకు పదోన్నతులు కల్పించాలని కోరారు. కాగా ఎన్నికల ప్రొసీజర్స్ను జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ నారాయణరాజు, ఆర్గనైజింగ్ సెక్రటరీ జలీల్ అహ్మద్, పబ్లిసిటీ సెక్రటరీ మజార్, సిటీ అధ్యక్ష కార్యదర్శులు గౌస్బాషా, మంజరి, రూరల్ తాలూకా అధ్యక్షుడు సుధాకర్రెడ్డి తదితరులు నిర్వహించారు. -
రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలు ప్రారంభం
పొదలకూరు: ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ – 17 బాలబాలికల రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలను పొదలకూరు డీఎన్నార్ జెడ్పీ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో శుక్రవారం డీఈఓ బాలాజీరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడా వందనం స్వీకరించి క్రీడా జ్యోతిని వెలిగించారు. డీఈఓ మాట్లాడుతూ జిల్లాకు నాలుగు రకాల రాష్ట్ర స్థాయి గేమ్స్ను కేటాయించడం జరిగిందన్నారు. 13 జిల్లాల నుంచి 26 టీంలు వచ్చాయన్నారు. పోటీలు నిర్వహించేందుకు రగ్బీ అసోసియేషన్ కృషి చేసినట్టు తెలిపారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ తలచీరు మస్తాన్బాబు, ఎంఈఓలు శోభనాద్రి, రేణుక, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు రమే ష్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి హాజరైన క్రీడాకారులకు స్థానికంగా వసతి సదుపాయాలను కల్పించారు. కండలేరులో నీటి నిల్వరాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 57.930 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 1,900 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 850, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 100, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
భూ ఆక్రమణలకు యత్నిస్తున్నారని ఫిర్యాదు
మర్రిపాడు: తమ గ్రామాల్లో అసైన్మెంట్ ద్వారా అందజేసిన భూములను కొందరు వ్యక్తులు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలంటూ మండలంలోని చాబోలు, వెంకటాపురం గ్రామస్తులు శుక్రవారం మండల తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పి ంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరో విడత భూ పంపిణీలో 392, 393 సర్వే నంబర్లలో తమకు పట్టాలు ఇచ్చారన్నారు. తమ ఆధీ నంలో ఉన్న భూమిని గ్రామానికి చెందిన వెంగళరావు ఇంకా కొంతమంది వ్యక్తులు కలిసి ఆక్రమించి జామాయిల్ చెట్లను నాటడానికి చదును చేస్తున్నారని చెప్పారు. గతంలో ఇచ్చిన భూ పంపిణీ పట్టాలను పరిశీలించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా సర్వే నంబర్ 388, 389, 390, 391, 400, 401, 402, 405, 406, 407, 408, 409లలో పట్టాలిచ్చి ఆన్లైన్ కూడా చేశారని, అయితే కొందరు ప్రైవేట్ సర్వేయర్లను పిలిపించుకుని సర్వే చేయించుకుని హద్దులు వేసుకుంటున్నారని తెలిపారు. -
ఘనంగా అధ్యయన కేంద్రం వ్యవస్థాపక దినోత్సవం
వెంకటాచలం: మండలంలోని సరస్వతీనగర్ వద్దనున్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుభాష గొప్పదనం, నేటి భాషా స్థితిగతుల గురించి కేంద్ర సాహిత అకాడమీ పురస్కార గ్రహీత గంగిశెట్టి శివకుమార్ మాట్లాడారు. కేంద్రం డైరెక్టర్ మాడభూషి సంపత్కుమార్ రచించిన రెప్పవాలని రాత్రి కవితా సంపుటిని విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు చేతులు మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో సమీక్షకులు డాక్టర్ మాలకొండయ్య పాల్గొన్నారు. -
ముడుపుల మత్తులో జోగుతూ..
జిల్లాలో ఇలా.. నెల్లూరు(టౌన్): విద్యార్థి జీవితాన్ని నిర్ణయించేది ఇంటర్ విద్యే. ఇందులో ఎంత బాగా చదివి.. అంత బాగా విద్యను ఆకళింపు చేసుకుంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవడం సులభమవుతుంది. అయితే ప్రస్తుతం మార్కులు.. ర్యాంకులే పరమావధిగా భావిస్తున్న యాజమాన్యాలు వీటిని ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. రోజుకో రకంగా వ్యవహరిస్తూ తమ సంస్థల పేరు ప్రతిష్టలు పెంచుకునేందుకే పెద్దపీటేస్తున్నాయి. బయటే రాయించుకోండి..! ఇంటర్లో పాఠ్యాంశాలను చదవడం ఓ ఎత్తయితే.. ఫిజిక్స్, కెమిస్ట్రీ.. బోటనీ.. జువాలజీకి సంబంధించిన రికార్డులు రాయాల్సి ఉండటం మరో చాలెంజ్. దీని ద్వారా సదరు సబ్జెక్టుల్లో మంచి పట్టు సాధించేందుకు అవకాశం ఉంటుంది. గతంలో ఈ వ్యవహారం పక్కాగా సాగేది. అయితే ప్రస్తుతం యాజమాన్యాలు తమ తీరును మార్చుకుంటున్నాయి. రికార్డులను బయటే రాయించుకోవాలంటూ వీరు పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ పరిణామాల క్రమంలో వీటిని రాసే దుకాణాలు, వ్యక్తుల వద్దకు విద్యార్థులు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. రసాయనాలా.. అంటే..? ప్రాక్టికల్స్లో ఏయే రసాయనాలు ఉంటాయనే అంశం చాలా మంది విద్యార్థులకు తెలియదంటే అతిశయోక్తి కాదు. ఇందులో ఏదో ఒక తరహాలో ప్రలోభాలు పెట్టి మార్కులేయించ్చొనే ధీమాతో థియరీపైనే యాజమాన్యాలూ దృష్టి సారిస్తున్నాయి. నైపుణ్యాలు, విలువలతో కూడి విద్యను విస్మరించి.. బట్టీ కొట్టుడు విధానాలకే జై కొడుతున్నాయి. ఇదీ పరిస్థితి.. జిల్లాలో 185 జూనియర్ కళాశాలలుండగా.. కార్పొరేట్, ప్రైవేట్కు సంబంధించనవే 119 ఉన్నాయి. ఇందులో ఎంపీసీకి సంబంధించి 18 వేలు.. బైపీసీ చదువుతున్న వారు ఏడు వేల మంది ఉన్నారు. మరోవైపు ప్రాక్టికల్స్ను ఫిబ్రవరి ఒకటి నుంచి నిర్వహించనున్నామంటూ షెడ్యూల్ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. రికార్డులను డిసెంబర్ నెలాఖరులోపు అందజేయాల్సి ఉంది. ప్రాక్టికల్స్లో రికార్డులనూ పరిగణనలోకి తీసుకోనున్నారు. ఫిజిక్స్లో 20.. కెమిస్ట్రీలో 35.. బోటనీలో 65.. జువాలజీలో 50 ప్రయోగాలకు సంబంధించి రికార్డులు రాయాల్సి ఉంది. అయితే బయట ఎవరితోనైనా రాయించుకోవాలంటూ యాజమాన్యాలు ప్రోత్సహిస్తున్నాయి. దీంతో విద్యార్థులు సైతం దానికే మొగ్గు చూపాల్సి వస్తోంది. యాజమాన్యాల అదనపు వసూళ్లు కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు మాత్రం ప్రాక్టికల్స్ పేరుతో విద్యార్థుల వద్ద రూ.1500 నుంచి రూ.రెండు వేల వరకు వసూలు చేస్తున్నాయి. రికార్డులెవరు రాసినా.. సక్రమంగా లేకపోయినా.. ప్రాక్టికల్స్లో మార్కులేయించేందుకు ఈ మొత్తాన్ని తీసుకుంటున్నామని బహి రంగంగానే చెప్తున్నారు. జూనియర్ కళాశాలలు – 185 విద్యార్థులు – 30 వేల మందికిపైగా ఎంపీసీ, బైపీసీ – 25 వేల మంది ఇదే అంశమై వెలసిన బోర్డులు ఇంటర్ విద్య.. పరీక్షలు ప్రహసనంలా మారుతున్నాయి. ర్యాంకులే పరమావధిగా భావిస్తున్న యాజమాన్యాలు.. విద్యార్థుల్లో నైపుణ్యాలను తీర్చిదిద్దేలా ఏ మాత్రం చొరవ చూపలేకపోతున్నాయి. తాజాగా జరుగుతున్న పరిణామాలే ఈ ఉదంతాలకు అద్దం పడుతున్నాయి. వాస్తవానికి ఇందులో రికార్డులు రాయడాన్ని పెద్ద ప్రాజెక్టుగా గతంలో భావించేవారు. దీంతో సబ్జెక్టుల్లో ప్రావీణ్యాన్ని సాధించేవారు. అయితే ప్రస్తుతం రికార్డులు అనే అర్థాన్నే సమూలంగా మార్చేశారు. అద్దె ప్రాతిపదికన రికార్డులు రాసేందుకు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో బోర్డులు వెలియడం గమనార్హం. మరికొందరు గ్రూపులుగా ఏర్పడి ఒక్కో దానికి ఒక్కో ధరను నిర్ణయించి.. సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది. సోషల్ మీడియాలో ప్రచారం ప్రోత్సహిస్తున్న కళాశాలల నిర్వాహకులు క్యూ కడుతున్న విద్యార్థులు ర్యాంకులే తప్ప నైపుణ్యాలపై దృష్టి సారించని యాజమాన్యాలు ప్రహసనంలా మారిన ఇంటర్ పరీక్షలు కార్పొరేట్ యాజమాన్యాల ఆగడాలు జిల్లా ఇంటర్ బోర్డు అధికారులకు తెలిసినా, వారి నుంచి ముడుపులు పుచ్చుకొని మిన్నకుండిపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఏ కార్పొరేట్ కళాశాలలోనూ విద్యార్థులకు ప్రాక్టికల్స్ క్లాసులను నిర్వహిస్తున్న పరిస్థితి లేదు. రికార్డులను బయట రాయిస్తున్నారనే విషయం తెలిసినా ఏ మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మా దృష్టికొచ్చింది రికార్డులను బయట రాయిస్తున్నారనే విషయం నా దృష్టికొచ్చింది. ఆయా కళాశాలల నుంచి కొన్ని రికార్డులను తెప్పించి పరిశీలిస్తా. వీటిని విద్యార్థులే స్వయంగా రాయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిని యాజమాన్యాలు ప్రోత్సహించకూడదు. ప్రతి కళాశాలలో ప్రాక్టికల్స్ తరగతులను నిర్వహించేలా చర్యలు చేపట్టాం. – వరప్రసాద్రావు, ఆర్ఐఓ -
భూగర్భ డ్రైనేజీ పనులు గజిబిజి
● నత్తనడకన పైప్లైన్ వర్కులు ● సర్వీస్ రోడ్డులో తవ్వకాలు ● రోడ్డుపై మట్టిని వదిలేయడంతో సమస్య ● స్తంభిస్తున్న ట్రాఫిక్ నెల్లూరు(బారకాసు): భూగర్భ డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణ పనులు.. గజిబిజిగా మారుతున్నాయి. నత్తనడకన సాగుతుండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రాకపోకలు సాగించే వారు, దుకాణదారులకు ఇబ్బందులు తప్పడంలేదు. గుంతలు తవ్వి వదిలేయడంతో అసలే ఇరుగ్గా ఉండే సర్వీస్ రోడ్లు మరింత కుచించుకుపోతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభిస్తోంది. ఆగుతూ.. సాగుతూ..! నగరంలో 430 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ పనులను రూ.580 కోట్లతో చేపట్టారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర నిధులతో చేపట్టిన ఇవి నేటికీ సాగుతూనే ఉన్నాయి. 400 కిలోమీటర్ల మేర చేపట్టిన ఇవి మరో 30 కిలోమీటర్ల మేర జరగాల్సి ఉంది. కాంట్రాక్టర్కు బకాయిల చెల్లింపులో జాప్యం.. ఇలా అనేక అవరోధాలు ఏర్పడుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక పనులను ప్రారంభించినా, అవి నత్తనడకన సాగుతున్నాయి. వర్కులు జరిగిన ప్రాంతాల్లో రోడ్లు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. రహదారులు గుంతలమయం కావడంతో వాహనదారులు ప్రమాదాలకు గురై గాయపడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో పనులు జరిగిన మారుతినగర్, శ్రీనివాసనగర్, అపోలో హాస్పిటల్ రోడ్డు, పరుచూరువారివీధి తదితర ప్రాంతాల్లోని అంతర్గత రోడ్లు దుర్భరంగా మారాయి. నిర్మాణమెప్పటికో..? అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరిగిన ప్రాంతాల్లో సిమెంట్ రోడ్డు నిర్మాణం ఎప్పటికి ప్రారంభమవుతుందానని ప్రజలు నిరీక్షిస్తున్నారు. నవాబుపేట, బాలాజీనగర్, మూలాపేట, పప్పులవీధి తదితర ప్రాంతాల్లో ఇంకా చేపట్టాల్సి ఉంది. ఆయా ప్రాంతాల్లో పనులు పూర్తయ్యాకే సిమెంట్ రోడ్డును చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఈ విషయమై పబ్లిక్ హెల్త్ డీఈఈ జానకిరామ్ను ఫోన్లో సంప్రదించగా.. యూజీడీ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసేందుకు యత్నిస్తున్నామని, మరో ఐదారు నెలల్లో కంప్లీట్ చేసి సిమెంట్ రోడ్డును నిర్మించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. ఇబ్బందికరంగా ఉన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపడతామని బదులిచ్చారు. ప్రమాదాలు జరుగుతున్నాయి పరుచూరువారివీధి, అపోలో హాస్పిటల్ మార్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం తవ్వి రోడ్డు నిర్మాణాలు చేపట్టకుండా అలానే వదిలేశారు. దీంతో రాత్రివేళ వాహనాలు అదుపుతప్పి పలువురు గాయపడుతున్నారు. త్వరగా పూర్తి చేసేలా చూడాలి. – సుబ్బారెడ్డి, బంగ్లాతోటఉదయం వేళ మరింత ఇబ్బంది నగరంలోని శ్రీనివాసనగర్, మైపాడు రోడ్డులో యూజీడీ తవ్వకాల పనులతో చాలా ఇబ్బందిగా ఉంటోంది. దీంతో బయటకెళ్లాలంటే ఆలస్యమవుతోంది. అధికారులు స్పందించి త్వరగా పూర్తి చేయాలి. – మల్లికార్జునరెడ్డి, సత్యనారాయణపురం -
గ్రామాల్లో సోమిరెడ్డి అవినీతి కంపు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మనుబోలు: సర్వేపల్లి నియోజకవర్గంలోని గ్రామాల్లో సోమిరెడ్డి అవినీతి కంపు కొడుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని మడమనూరు, చెర్లోపల్లికి గురువారం వచ్చిన ఆయనకు పలు సమస్యలను ప్రజలు తెలియజేశారు. నాట్లేసే సమయం ఆసన్నమైనా యూరి యా అందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే వెంటనే బిగించేవారని, అయితే ప్రస్తుతం నెలలు గడుస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు. దీంతో నారుమడులను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోందంటూ తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. సోమిరెడ్డి అవినీతి కథలను నియోజకవర్గ ప్రజలు చెప్తుంటే, వినలేక చెవులు మూసుకోవాల్సి వస్తోందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో తాను మంజూరు చేయించిన పనులు.. ఎన్నికల కోడ్ కారణంగా ప్రారంభోత్సవాలు చేయలేక ఆగిపోయిన వాటిని సోమిరెడ్డి ఆయన ఖాతాలో వేసుకోవడం దిగజారుడుతనానికి నిదర్శనమని అభివర్ణించారు. గతంలోనే పూర్తయి, తొమ్మిది నెలలుగా తాగునీటిని అందిస్తున్న వాటర్ ట్యాంకులను ఇప్పుడు ప్రారంభిస్తున్న సోమిరెడ్డిని అందరూ జోకర్లా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. అవినీతికి అలవాటు పడిన సోమిరెడ్డిని ప్రశ్నిస్తే, తనకు కొవ్వు పట్టిందంటూ వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఆయన అవినీతి, అక్రమాలను ఎదిరిస్తానే తప్ప భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్టీ నేతలు బుజ్జిరెడ్డి, మారంరెడ్డి ప్రదీప్రెడ్డి, బొమ్మిరెడ్డి హరగోపాల్రెడ్డి, దాసరి భాస్కర్గౌడ్, కొండూరు రామచంద్రారెడ్డి, జనార్దన్రెడ్డి, మంగళపూడి శ్రీనివాసులురెడ్డి, వరదారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఒత్తిడ్ని జయిస్తే విజయమే
నెల్లూరు(అర్బన్): మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే మార్గాలను పాటిస్తూ.. ఒత్తిడ్ని జయిస్తే విద్యార్థులకు విజయం సొంతమవుతుందని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ మాధవి పేర్కొన్నారు. డాక్టర్ కోర్సులో చేరిన ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఎమోషనల్ అసెస్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ బై ఎడ్యుకేటర్ అనే అంశంపై నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సమావేశ మందిరంలో మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వైద్య వృత్తి సేవాభావంతో కూడుకుందని చెప్పారు. డాక్టర్గా మారేందుకు విద్యార్థులు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుందన్నారు. సున్నితత్వాన్ని వీడి.. ఏమైనా ఇబ్బందులొస్తే ప్రొఫెసర్లు, సహ విద్యార్థులతో చర్చించాలని సూచించారు. ధూమపానం, మద్యపానం, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు. మనోబలానికి అవసరమైన చిట్కాలను బెంగళూరు నుంచి వచ్చిన అధ్యాపకుడు నెల్సన్ తెలియజేశారు. సైకియాట్రీ విభాగ హెచ్ఓడీ లక్ష్మీప్రసన్న, వైస్ ప్రిన్సిపల్ మస్తాన్బాషా, డాక్టర్లు బెన్హర్, శరత్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీధర్రెడ్డి అక్రమాలపై సీబీసీఐడీ విచారణ జరపాలి
నెల్లూరు రూరల్: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అక్రమాస్తులపై సీబీసీఐడీతో విచారణ జరిపించాలని మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ డిమాండ్ చేశారు. నగరంలోని జర్నలిస్ట్ భవన్లో విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. గతంలో మీ కుటుంబంపై మాట్లాడితే అభ్యంతరం తెలిపారని, అయితే ప్రస్తుతం తమ కుటుంబంపై ఎందుకు మాట్లాడుతున్నారో తెలపాలని ప్రశ్నించారు. తన నాలుకను కోయిస్తారంటున్నారని, దీనికి తాను సిద్ధమని, ప్రాణాలు పోయేంత వరకు మీ దాష్టీకాలను ఎండగడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. వేల కోట్లు ఎక్కడ్నుంచొచ్చాయి..? మా తాతలు రాజకీయ నాయకులు కారని.. తండ్రి జమీందార్ కాదని పదేపదే చెప్పే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తనకు ఇన్ని వేల కోట్లు ఎక్కడ్నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. మాగుంట లేఅవుట్లో రూ.20 కోట్ల ఇల్లు.. బెంగళూరులో రూ.100 కోట్ల షాపింగ్ మాల్.. హైదరాబాద్లో రూ.30 కోట్ల విల్లా ఎలా వచ్చిందో తెలపాలని సవాల్ విసిరారు. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని అడ్డుపెట్టుకొని రెవెన్యూ, అటవీ భూములు, కాలువల ను ఆక్రమించడం.. మరో బిల్డర్ను అడ్డుపెట్టుకొని అపార్ట్మెంట్లలో ఫ్లాట్లను కొట్టేసిన విషయం వాస్తవం కాదానని ప్రశ్నించారు. వారెన్ని బిల్డింగులు కడితే అన్ని ఫ్లాట్లు రాసిచ్చిన విషయాన్ని తెలపాలని డిమాండ్ చేశారు. లంబోదర సెంటర్లో వసూలు చేసిన రూ.10 కోట్లు ఎటుపోయాయని ప్రశ్నించారు. ప్రాణాలు పోయినా.. పోరాటం ఆగదు తమకు రాజకీయ భిక్ష పెట్టామంటున్నారని, అయితే అడుగడుగునా ఇబ్బందులకు గురిచేసింది.. తమపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా ప్రచారం చేయించింది వాస్తవం కాదానని ప్రశ్నించారు. నరసింహకొండ వద్ద గ్రావెల్ను దోచారని ఆరోపించారు. శ్రీధర్రెడ్డి, ఆయన సోదరుడు గిరిధర్రెడ్డి చేసిన పాపాలను వెలుగులోకి తెస్తూనే ఉంటామని, తన ప్రాణాలు పోయినా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవ చూపి, ఈ దాష్టీకానికి ముగింపు పలకాలని కోరారు. ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన కోటంరెడ్డి సోదరులు నరసింహకొండలో గ్రావెల్ దోపిడీ లంబోదర సెంటర్లో రూ.పది కోట్లు ఎటుపోయాయి..? మేయర్ భర్త జయవర్ధన్ -
వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
దగదర్తి: పీహెచ్సీలకు వచ్చే రోగులకు వైద్యసేవలను అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ సుజాత పేర్కొన్నారు. దగదర్తి పీహెచ్సీని గురువారం ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆమె.. రోగులకు అందుతున్న వైద్యసేవలపై సమీక్షించారు. ఓపీ సేవలపై వైద్యాధికారులను ఆరాతీశారు. ల్యాబ్ను సందర్శించి వైద్య పరీక్షలు ఎలా జరుగుతున్నాయో టెక్నీషియన్లను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వైద్యులు అఖిల, అలేఖ్య, సీహెచ్ఓ కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అభ్యసన మెరుగులో పాల్ ల్యాబ్ల పాత్ర కీలకం నెల్లూరు (టౌన్): తరగతి గదిలో అభ్యసన మెరుగునకు పర్సనాల్టీ అడాప్ట్ లెర్నింగ్ ( పా ల్) ల్యాబ్లు ఎంతో ఉపయోగపడతాయని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. పాల్ ల్యాబ్లపై దర్గామిట్టలోని జెడ్పీ హైస్కూల్లో శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు గణితం, తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టుల్లో బోధనకు సంబంధించిన పూర్తి సమాచారం నిక్షిప్తమైన 330 ట్యాబ్లను ఆయా పాఠశాలల హెడ్మాస్టర్లకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలో తొలి విడతలో 33 పాల్ ల్యాబ్లొచ్చాయని, నూతనంగా పీఎంశ్రీ పాఠశాలలకు మరో 11 మంజూరయ్యాయని వివరించారు. డిప్యూటీ డీఈఓ నాయక్, పాల్ డీఎన్ఓ సుధీర్బాబు, ఎంఈఓ మురళీధర్, ఏపీఓ ప్రసాద్, ఏఎస్ఓ ప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెన్నాకు నేటి నుంచి 30 వేల క్యూసెక్కులు సోమశిల: సోమశిల క్రస్ట్ గేట్ల ద్వారా పెన్నాకు 30 వేల క్యూసెక్కులను శుక్రవారం నుంచి విడుదల చేయనున్నామని జలాశయాధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెన్నా పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. రానున్న రోజుల్లో ఎగువ ప్రాంతాల నుంచి మూడు లక్షల క్యూసెక్కుల వరదొచ్చే అవకాశాలున్నాయనే అంచనా మేరకు ప్రాజెక్ట్ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. 72.73 టీఎంసీల నీరు సోమశిల జలాశయంలో 72.737 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 9856 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. జలాశయంలో 99.862 మీటర్ల నీటిమట్టం నమోదైంది. అర్హులకే పక్కాగృహాలునెల్లూరు(అర్బన్): ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0 ద్వారా జిల్లాలో జరుగుతున్న ఆవాస్ ప్లస్ సర్వేలో ఇల్లు లేని అర్హత ఉన్న నిరుపేదలకే పక్కా గృహాలను ముందుగా మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ అరుణ్బాబు సూచించారు. జిల్లా పర్యటనకు గురువారం వచ్చిన ఆయన నగరంలోని వెంకటేశ్వరపురంలో నిర్మాణంలో ఉన్న పక్కాగృహాలు, పూర్తయిన వాటిని తనిఖీ చేశారు. అనంతరం హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో డీఈలు, ఏఈలతో సమావేశాన్ని నిర్వహించారు. హౌసింగ్ కార్పొరేషన్ జిల్లా పీడీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
కార్డన్ సెర్చ్లో 22 వాహనాల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు సంతపేట పోలీస్స్టేషన్ పరిధిలోని కపాడిపాళెంలో గురువారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నగర ఇన్చార్జి డీఎస్పీ ఎం.గిరిధర్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇంటి యజమానితోపాటు కుటుంబ సభ్యుల పూర్తి వివరాలను సేకరించారు. వాహనపత్రాల్లేని 19 మోటార్బైక్లు, ఒక ఆటో, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. నేర నియంత్రణ, అసాంఘిక కార్యక్రమాల కట్టడే లక్ష్యంగా నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్లకు ప్రజలు సహకరించాలని పోలీస్ అధికారులు కోరారు. ప్రజలు తమవంతు బాధ్యతగా అనుమానాస్పద వ్యక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, మత్తు, మాదకద్రవ్యాల వినియోగంపై డయల్ 112, స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. కార్యక్రమంలో సంతపేట, చిన్నబజారు, నవాబుపేట, దర్గామిట్ట, బాలాజీనగర్ ఇన్స్పెక్టర్లు వైవీ సోమయ్య, చిట్టెం కోటేశ్వరరావు, జి.వేణుగోపాల్రెడ్డి, బి.కల్యాణరాజు, కె.సాంబశివరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అది ప్రభుత్వ భూమే..
ఆత్మకూరు: ఆత్మకూరు మండలంలోని బట్టేపాడు గ్రామ నడిబొడ్డున దివ్యమాంబ దేవాలయం ఎదురుగా ఉన్న కోటమిట్ట, దొరువు ప్రాంతాలు ప్రభుత్వానికి చెందినవి బోర్డు ఏర్పాటు చేశారు. ‘అడిగేదెవరు ఆపేదెవరు’ అనే శీర్షికతో సాక్షి దినపత్రికలో బుధవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. తహసీల్దార్ పద్మజాకుమారి చర్యలు చేపట్టారు. దీంతో గురువారం ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు పెట్టారు. అయితే కేవలం దొరువు, దాని సమీపంలోని గుడి వద్ద మాత్రమే (సర్వే నంబర్లు 898, 900) ఏర్పాటు చేశారని వాస్తవానికి 897, 899 సర్వే నంబర్లు కూడా ప్రభుత్వ భూమేనని, అక్కడ కూడా బోర్డు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
అప్రమత్తంగా ఉండాలి
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సోషల్ మీడియాలో గుర్తుతెలియని వ్యక్తుల మెసేజ్లకు స్పందించరాదు. బ్యాంకుల పేరుతో వచ్చే కాల్స్కు ఓటీపీలు చెప్పొద్దు. అనవసర యాప్లు డౌన్లోడ్ చేసుకోరాదు. ఆన్లైన్లో వచ్చే ఉద్యోగ ప్రకటనలు చూసి మోసపోవద్దు. అనవసర యాప్లు డౌన్లోడ్ చేసుకోరాదు. కస్టమ్స్, సీబీఐ, ఈడీ సంస్థల అధికారులు వీడియో కాల్ చేసి విచారణ చేయరు. అలా చేశారంటే మోసం చేస్తున్నారని గుర్తించాలి. డిజిటల్ అరెస్ట్ల్లేవు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలి. – చిట్టెం కోటేశ్వరరావు, ఇన్స్పెక్టర్, చిన్నబజారు పోలీస్స్టేషన్ -
పొట్టకూటి కోసం వచ్చి..
● రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృతి జలదంకి(కలిగిరి): వారంత వలస కూలీలు. కుటుంబాలను పోషించేందుకు రాష్ట్రాలు దాటి వచ్చారు. కష్టపడి పనిచేస్తూ పొట్ట నింపుకొంటున్నారు. ఈ క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకతను ప్రాణాలు విడిచాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఉత్తరాఖండ్కు చెందిన 21 మంది వలస కూలీలు వరినాట్లు వేసేందుకు వచ్చారు. గురువారం జలదంకి మండలంలో 9వ మైలు వద్ద పనికెళ్లారు. ఒక పొలంలో నాట్లు వేసి మరో పొలంలో వేసేందుకు జాతీయ రహదారి దాటుతున్నారు. ఈ క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో రామ్రాయ్ (45) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో సహచర కూలీలు కన్నీరుమున్నీరుగా రోదించారు. దిక్కుతోచని స్థితిలో ఉన్నవారిని స్థానికులు, రైతులు ఓదార్చారు. సమాచారం అందుకున్న జలదంకి పోలీసులు కేసు నమోదు చేశారు. -
నిమ్మ ధరలు పతనం
● మాకొద్దంటున్న ఢిల్లీ మార్కెట్ వ్యాపారులు పొదలకూరు: నిమ్మకాయలను అడిగే వారు లేరు. ఇక్కడి వ్యాపారులు ఎగుమతులు చేస్తామంటే ఢిల్లీ మార్కెట్ వ్యాపారులు వద్దంటున్నారు. దీంతో పూర్తిగా డిమాండ్ పడిపోయి రైతులు ఆవేదన చెందుతున్నారు. నిమ్మపై ఆధారపడి జీవిస్తున్న మెట్టప్రాంత రైతులు ఢీలా పడిపోయారు. రుణాలు తెచ్చుకుని తోటలకు పెట్టుబడులు పెడుతున్న వారు అప్పులు ఎలా తీర్చాలో అర్ధం కావడం లేదని బాధలో ఉన్నారు. ఓవైపు చలికాలం, మరోవైపు పోటీ పెరగడంతో పొదలకూరు, గూడూరు మార్కెట్ల నుంచి కాయలు ఎగుమతి కావడం లేదు. లూజు (బస్తా) రూ.400 నుంచి రూ.600 మాత్రమే ఉంది. కిలో రూ.10 కూడా ధరలు పలకడం లేదని వ్యాపారులు వెల్లడిస్తున్నారు. పొదలకూరు పరిసర ప్రాంతాల్లో నిమ్మపై జీవిస్తున్న రైతులు సుమారు 2 వేల మంది వరకు ఉంటారు. 5 వేల ఎకరాల్లో తోటలు సాగవుతున్నాయి. కొన్ని గ్రామాల్లో తోటలు తప్పించి ఇతర వ్యవసాయ పనులు కూడా రైతులకు తెలియదు. పంట మార్పిడికి సైతం విముఖత చూపుతారు. ధరలు పతనం కావడంతో రైతులు దిగులు పడుతున్నారు. తోటల సంఖ్య అధికం కావడంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎగుమతులు పెరగడంతో ఇక్కడి నిమ్మకు క్రమంగా డిమాండ్ తగ్గుతున్నట్టు తెలుస్తోంది. -
మన్నేరు వాగులో పడి వ్యక్తి మృతి
ఉలవపాడు: ప్రమాదవశాత్తు మన్నేరు వాగులో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని మన్నేటికోట సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మన్నేటికోట గ్రామానికి చెందిన బక్కా ప్రభుదాస్ (48) మూడు రోజుల నుంచి కనిపించడం లేదు. ఈ విషయాన్ని స్థానికులు హైదరాబాద్లో ఉంటున్న అతని కుమారుడు కోటయ్యకు తెలిపారు. గురువారం అతను వచ్చి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు, కోటయ్య కలిసి గ్రామం, పరిసర ప్రాంతాల్లో విచారించగా మన్నేరు వాగు సమీపంలో ప్రభుదాస్ తిరిగినట్లుగా తెలిసింది. మృతదేహం వాగులో కనిపించింది. ఈ విషయం రెవెన్యూ అధికారులకు కూడా తెలియజేసి పోలీ సులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉలవపాడు సీహెచ్సీ వైద్యశాలకు తరలించారు. కోటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
జీవితాలు విలవిల
సైబర్ వల.. ● పోర్టల్ : డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సైబర్క్రైమ్.జీఓవీ.ఇన్ తక్షణ ఫిర్యాదుతో బాధితులు కోల్పోయిన డబ్బులు తిరిగి పొందే అవకాశాలున్నాయి.నెల్లూరు(క్రైమ్): సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని, అత్యాశను ఆసరాగా చేసుకుని నయా మోసాలతో బ్యాంక్ ఖాతాల్లోని నగదును దోచేస్తున్నారు. ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఈ తరహా మోసాలపై ఫిర్యాదులు అందుతున్నాయి. సైబర్ నేరగాళ్లపై ప్రజలు అవగాహన పెంపొందించుకుని అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఇదే ఎక్కువగా.. డిజిటల్ అరెస్ట్లు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. సైబర్ నేరాల్లో ప్రస్తుతం ఈ తరహా మోసాలే అధికంగా జరుగుతున్నాయి. సీబీఐ, ఈడీ, నార్కోటిక్స్ అధికారుల పేరిట సంపన్న వర్గాలు, విద్యావంతులు, ఉద్యోగులు, వైద్యులు, పిల్లలకు దూరంగా ఉంటున్న తల్లిదండ్రులు తదితరులకు వీడియోకాల్ చేస్తున్నారు. వారు ఆయా డిపార్ట్మెంట్ యూనిఫారాల్లో కనిపిస్తారు. పరిసరాలు ఆఫీస్ను తలపించేలా చేస్తారు. నిజమైన అధికారులని భ్రమ కల్పిస్తారు. విదేశాల నుంచి వచ్చిన కొరియర్లో డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలున్నాయని, విదేశాల నుంచి మీ ఖాతాల్లో రూ.కోట్ల నగదు జమైందని, మీపేరుపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందంటూ నకిలీ పత్రాలను చూపిస్తారు. విచారణ పూర్తయ్యే వరకు ఇంట్లో నుంచి కదలనివ్వకుండా నిర్భందిస్తున్నారు. వివరాలు సేకరిస్తున్నట్లు నటిస్తూ కేసు నుంచి బయట పడాలంటే తాము చెప్పినంత మొత్తాన్ని చెల్లించాలని లేకుంటే అరెస్ట్ తప్పదని కంగారుపెట్టి వారు అడిగినంత ఖాతాల్లో జమయ్యాక వదిలేస్తున్నారు. మోసాలెన్నో.. ● బ్యాంక్ నుంచి ఫోన్ చేసి మీ ఖాతా బ్లాక్ చేశామని చెబుతారు. మళ్లీ ఖాతాను పునః ప్రారంభించాలంటూ వివరాలు సేకరిస్తారు. ఖాతాకు లింకై న ఫోన్ నంబర్కు వచ్చిన ఓటీపీని చెప్పాలని అడుగుతారు. నగదు లావాదేవీలకు సంబంధించిందే కదా అని ఓటీపీ చెప్పగానే క్షణాల్లో ఖాతాల్లోని నగదు మాయమవుతుంది. ● ట్రేడింగ్ల్లో పెట్టుబడులు పెట్టండి కళ్లు చెదిరే ఆదాయం పొందండంటూ సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ఆకర్షిస్తారు. నకిలీ వెబ్సైట్లకు మళ్లిస్తారు. స్కామర్లు తొలుత తక్కువ మొత్తంలో చాలా ఎక్కువ రాబడి వచ్చేలా చేసి మిమ్మల్ని మరింత పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తారు. అనంతరం పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టించి దోచేస్తారు. ● ఎక్కువమంది ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో ఫొటోలతో సహా తమ బయోడేటాను నమోదు చేసుకుంటున్నారు. మోసగాళ్లు ఈ వివరాలను తీసుకుని ఫోన్ లేదా ఈ–మెయిల్లో సంప్రదిస్తున్నారు. వధువు లేదా వరుడితో మాటలు కలిపి అవతలి వైపు నుంచి నమ్మకం పొందాక తమ ప్రణాళికలను అమలు చేస్తున్నారు. ఏదో ఒక అవసరం ఉందని చెప్పి అందినకాడికి దోచుకుంటున్నారు. మరికొందరు వరుడులను నమ్మించి ఆన్లైన్ ట్రేడింగ్ల్లో పెట్టుబడులు పేరిట మోసగిస్తున్నారు. ● ఈ చలానా బకాయిలను వెంటనే చెల్లించాలంటూ ఆర్టీఓ కార్యాలయం పేరిట ఫోన్కు ఏపీకే ఫైల్ పంపుతారు. దానిపై క్లిక్ చేయగానే ఫోన్ నంబర్ను బ్లాక్ చేసి బ్యాంక్ ఖాతాలోని నగదు కాజేస్తున్నారు. ● బ్యాంక్ల పేరిట ఏపీకే ఫైల్స్ రూపంలో వాట్సాప్లకు సందేశాలు పంపి, మీ ఆధార్ నంబర్ను అప్డేట్ చేసుకోవాలని లేదంటే ఖాతా క్లోజ్ అవుతుందని పేర్కొంటారు. ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు వెంటనే బ్యాంక్ ఽఆధార్ అప్డేట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తారు. ఏపీకే ఫైల్ను తెరిచిన వెంటనే ఫోన్ హ్యాక్ అవుతుంది. ఖాతాల్లోని సొమ్మును సైబర్ నేరగాళ్లు దోచేస్తున్నారు. ● వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట యువతను లక్ష్యంగా చేసుకుని జాబ్ స్కామర్లు రెచ్చిపోతున్నారు. తక్కువ సమయం, తక్కువ శ్రమతో నెలకు రూ.వేలు సంపాదించే ఉద్యోగాలు తమ వద్ద ఉన్నాయంటూ తరచూ ఆన్లైన్లో ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇవి నమ్మి సంప్రదిస్తే ఫీజుల రూపంలో నగదు కట్టించుకుని తర్వాత బోర్డు తిప్పేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు (ఫైల్) ఇటీవల జరిగినవి నెల్లూరు రూరల్ పరిధిలోని వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తకు సీబీఐ అధికారుల పేరిట సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి రూ.23 లక్షల నగదు దోచేశారు. కావలి పట్టణంలోని ఓ వ్యక్తికి ఆర్టీఓ చలానా పేరుతో ఏపీకే ఫైల్ పంపించి అతని ఖాతాలోని సుమారు రూ.24 లక్షల నగదును కాజేశారు. నెల్లూరు చైతన్యపురి కాలనీకి చెందిన విశ్రాంత ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ చేశారు. రూ.1.02 కోట్లను దోచేశారు. నగరానికి చెందిన ఓ మహిళకు ఆన్లైన్ ట్రేడింగ్లో ఆదాయం వస్తుందని నమ్మించి రూ.2.46 కోట్లు పెట్టుబడులు పెట్టించి మోసగించారు. టెలిగ్రామ్ యాప్లో వర్క్ ఫ్రం హోం ద్వారా నగదు సంపాదించవచ్చని నమ్మించి దుత్తలూరు మండలంలోని ఓ వ్యక్తి నుంచి రూ.22 లక్షలు కాజేశారు. మ్యారేజీ బ్యూరో ద్వారా పరిచయమైన ఇద్దరు యువతులు నెల్లూరు నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పెళ్లి చేసుకుంటామని నమ్మించి ఆన్లైన్ ట్రేడింగ్లో పెట్టుబడుల పేరిట రూ.12 లక్షలు దోచేశారు. సైదాపురానికి చెందిన ఓ వ్యక్తికి ఆధార్కార్డు అప్డేట్ కాకపోవడంతో నెట్ బ్యాకింగ్ సేవలు నిలిచిపోయాయని ఖాతా సైతం శాశ్వతంగా పనిచేయకుండా పోతుందంటూ సైబర్ నేరగాళ్లు అతని వాట్సాప్ నంబర్కు సందేశం పంపారు.మోసాలు.. ఎన్నో కోణాలు జిల్లాలో పెరుగుతున్న బాధితుల సంఖ్య రూ.లక్షల్లో పోగొట్టుకుంటున్న వైనం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుల వెల్లువ అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు సైబర్ మోసానికి గురైతే.. ఫోన్ చేయాల్సిన టోల్ఫ్రీ నంబర్ : 1930 -
జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
ఉలవపాడు: జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు విద్యార్థులు ఎంపికయ్యారని రామాయపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం లక్ష్మాజీ పేర్కొన్నారు. గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. ఇటీవల వినుకొండలో 69వ స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ మీట్ జరిగిందన్నారు. హ్యామర్ త్రోలో అండర్–17 విభాగంలో ఎస్కే ఆసీఫ్, టి.అశ్వని ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని చెప్పారు. వీరు డిసెంబర్ 10వ తేదీన బిహార్లో జరిగే జాతీయ స్కూల్ గేమ్స్ అథ్లెటిక్స్ మీట్లో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొంటారన్నారు. విద్యార్థులను, పీడీ జీవన్కుమార్ను ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. తీరంలో మృతదేహంముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని కృష్ణపట్నం సముద్ర తీరానికి గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. స్థానికులు గురువారం గుర్తించి పోర్టు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శ్రీనివాసులురెడ్డి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయసు సుమారు 45 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. శరీరంపై దుస్తుల్లేవు. నాలుగు రోజుల క్రితం చనిపోయినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మృతదేహం కుడిచేతికి రబ్బర్ బ్యాండ్ ఉంది. సముద్రపు నీటిలో నానడంతోపాటు చేపలు మృతదేహాన్ని కొరుక్కు తినడంతో గుర్తుపట్టలేని విధంగా ఉంది. కేసు నమోదు చేశారు. -
వినియోగదారులతో మమేకమవ్వాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ సరఫరాపై వినియోగదారుల్లో నెలకొన్న అభిప్రాయాలను తెలుసుకునేందుకు గానూ అధికారులు, సిబ్బంది మమేకమయ్యేలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం పేర్కొన్నారు. నగరంలోని విద్యుత్ భవన్లో గల తన చాంబర్లో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. నిరంతర విద్యుత్ సరఫరా, లో ఓల్టేజీ సమస్య, ఉద్యోగుల పనితీరెలా ఉందనే అంశాలపై వినియోగదారులకు ఎస్ఈ నుంచి జేఎల్ఎం స్థాయి వరకు ఫోన్ చేసి వారి నుంచి ఫీడ్బ్యాక్ను తీసుకుంటున్నామని వివరించారు. డయల్ యువర్ సీఎండీ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నామని వివరించారు. రూరల్ డెవలప్మెంట్ స్కీమ్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటలూ విద్యుత్ను అందించేందుకు త్రీ ఫేజ్ లైన్లను ఏర్పాటు చేస్తున్న తరుణంలో సరఫరాకు అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ పనులను జిల్లా సర్కిల్లో వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తి చేయనున్నామని వెల్లడించారు. ఈఈ (టెక్నికల్) శేషాద్రి బాలచంద్ర పాల్గొన్నారు. -
అటల్ టింకరింగ్ ల్యాబ్లతో ఉపయోగం
నెల్లూరు (టౌన్): ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పేద విద్యార్థులను శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దేందుకు అటల్ టింకరింగ్ ల్యాబ్లు ఎంతో ఉపయోగపడతాయని డీఈఓ బాలాజీరావు పేర్కొన్నారు. దర్గామిట్టలోని జెడ్పీ హైస్కూల్లో ల్యాబ్ ఇన్చార్జీలు, హెడ్మాస్టర్లతో బుధవారం నిర్వహించిన వర్క్షాపులో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు నైపుణ్యాలను పాఠశాల స్థాయి నుంచే నేర్పాలని సూచించారు. సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, ఏఎంఓ సుధీర్బాబు, డీఎస్ఓ శివారెడ్డి, మెంటార్లు కల్యాణ్కుమార్, కార్తీక్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
టీబీ నివారణకు కృషి
నెల్లూరు(అర్బన్): టీబీ ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా జిల్లాలో టీబీ నివారణకు వైద్య శాఖ అధికారులు కృషి చేయాలని ఏడీఎంహెచ్ఓ ఖాదర్వలీ పేర్కొన్నారు. టీబీ నివారణపై నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో బుధవారం నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనికి గానూ జిల్లా వైద్యశాఖ, మెడికల్ కళాశాల, సర్వజన ఆస్పత్రి అధికారులు సంయుక్తంగా పనిచేయాలని సూచించారు. జిల్లాలో టీబీ కేసులు, వారికి అందజేస్తున్న మందులపై చర్చించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, పల్మనాలజీ హెచ్ఓడీ అరుణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ రేవతి తదితరులు పాల్గొన్నారు. గుర్తుతెలియని మృతదేహం లభ్యం కోవూరు: పట్టణంలోని సత్రంవీధిలో గుర్తుతెలియని మృతదేహం బుధవారం లభ్యమైంది. వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని కోరారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. సివిల్ సప్లయ్స్ గోదాములో తనిఖీలు ఉదయగిరి: స్థానిక సివిల్ సప్లయ్స్ గోదాములో రికార్డులను పరిశీలించి, స్టాక్ వివరాలను విజయవాడ, నెల్లూరు నుంచి వచ్చిన ప్రత్యేక తనిఖీ బృందాలు బుధవారం నమోదు చేశాయి. తనిఖీలు ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు వరకు కొనసాగాయి. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్కు సంబంధించిన స్టాక్, రికార్డుల్లో నమోదైన వివరాలను సరిచూశారు. దాదాపు 200 మెట్రిక్ టన్నుల బియ్యం స్వాహా అయిందని తేల్చారు. నవంబర్కు సంబంధించిన రికార్డులను పరిశీలించాల్సి ఉంది. మరో రెండు రోజుల పాటు తనిఖీలు జరిపిన అనంతరం పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నామని తెలిపారు. విజేతలకు బహుమతుల ప్రదానం నెల్లూరు(దర్గామిట్ట): భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల, నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులను జేసీ వెంకటేశ్వర్లు అందజేశారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో డీఈఓ బాలాజీరావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముగ్గురు చిన్నారుల్లో ఒకర్ని మాక్ అసెంబ్లీకి ఎంపిక చేయగా, మిగిలిన వారికి ప్రశంసపత్రాలు, మెడళ్లను అందజేశారు. ఉద్యోగోన్నతులకు కౌన్సెలింగ్ నెల్లూరు(వీఆర్సీసెంటర్): నగరంలోని గాంధీబొమ్మ సెంటర్లో గల జిల్లా కేంద్ర సహకార బ్యాంక్లో ఉద్యోగోన్నతులకు సంబంధించిన కౌన్సెలింగ్ను బుధవారం నిర్వహించారు. అనంతరం అర్హులకు ఉద్యోగోన్నతులను కల్పించారు. డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి, సీఈఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కానిస్టేబుల్కు అభినందన నెల్లూరు(క్రైమ్): శ్రీనగర్లో ఈ ఏడాది అక్టోబర్లో జమ్మూ, కశ్మీర్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆలిండియా పోలీస్ జూడో క్లస్టర్ గేమ్స్లో పెన్కాక్ సిలాట్ విభాగంలో నెల్లూరు ఏఆర్ కానిస్టేబుల్ చరణ్తేజ స్వర్ణ పతకాన్ని సాధించారు. ఈ క్రమంలో ఆయన్ను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అజిత బుధవారం అభినందించారు. -
మహిళా రైతులకు రుణాలివ్వండి
నెల్లూరు(పొగతోట): మహిళా రైతులకు రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు రుణాలను మంజూరు చేయాలని డీఆర్డీఏ నాగరాజకుమారి సూచించారు. యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏపీఎంలతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బ్యాంక్ లింకేజీ, పీఎంఈజీపీ, పీఎమ్మెఫ్ఎంఈ రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలని సూచించారు. యూనియన్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ శ్యామ్ప్రసాద్, అగ్రి లోన్ చీఫ్ మేనేజర్ ఉదయ్, సీనియర్ మేనేజర్ రవితేజ, డీపీఎంలు మధుసూదన్, మురళి, రవికుమార్, దుర్గా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఆపరేషన్ కగార్ పేరుతో నరమేధం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం నరమేధం సృష్టిస్తోందని పలువురు ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. ఆపరేషన్ కగార్పై బాలాజీనగర్లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్పై హైకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ చేయించి.. మావోయిస్టులతో శాంతి చర్చలను జరపాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి, నేతలు సాగర్, అబ్బాయిరెడ్డి, ఎల్లంకి వెంకటేశ్వర్లు, మాదాల వెంకటేశ్వర్లు, మోహన్రావు, అజయ్కుమార్, కత్తి శ్రీనివాసులు, ప్రసాద్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సారీ.. అమాత్యుడికి తీరిక లేదంట..!
నెల్లూరు (అర్బన్): జిల్లా ఔషధ నియంత్రణ శాఖ భవన నిర్మాణం పూర్తయినా దాన్ని ప్రారంభించడంలో అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వాస్తవానికి గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నిధులను మంజూరు చేసి.. నిర్మాణాలను ప్రారంభించారు. ఆపై ఎన్నికల్లో గెలిచి కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అయితే వైద్యశాఖ మంత్రికి తీరిక లేదనే కారణంతో నూతన భవనాలు ప్రారంభానికి నోచుకోవడంలేదు. ఫలితంగా జిల్లా ఔషధ నియంత్రణ శాఖ (డ్రగ్ కంట్రోల్ ఏడీ) కార్యాలయం అద్దె భవనంలోనే నడుస్తోంది. ఉన్నత సంకల్పంతో.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జిల్లా ఔషధ నియంత్రణ శాఖ కార్యాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో వైద్య రంగానికి నాటి సీఎం జగన్మోహన్రెడ్డి పెద్దపీటేశారు. ఇందులో భాగంగా అద్దెలను వృథాగా చెల్లించకుండా ఉండేందుకు గానూ సొంత కార్యాలయాల నిర్మాణానికి సంకల్పించారు. ఇలా రాష్ట్రంలో ఎనిమిది మంజూరయ్యాయి. జిల్లాలో కార్యాలయ నిర్మాణానికి రూ.90 లక్షలు మంజూరయ్యాయి. జిల్లా సర్వజన ఆస్పత్రి ఆవరణలో దిశ పోలీస్స్టేషన్ పక్కనే స్థలాన్ని కేటాయించారు. ఆపై నిర్మాణాలను ప్రారంభించారు. నేటికీ అతీగతీ లేదు.. నిర్మాణాలు పూర్తయి ఏడు నెలలు దాటినా సొంత భవనంలోకి నేటికీ మారలేదు. మరోవైపు దీని చుట్టూ పెరిగిన పిచ్చిమొక్కలను ఇటీవల వేలాది రూపాయలను వెచ్చించి తొలగించారు. ఇవి మరోసారి పెరిగే అవకాశమూ లేకపోలేదు. బిల్డింగులు కళావిహీనంగా మారుతున్నాయి. సొంత భవనం ఉండీ అద్దె బిల్డింగుకు అద్దె చెల్లించాల్సి వస్తోంది. వీటిని ఎందుకు ప్రారంభించలేదనే అంశాన్ని ఆరాతీయగా, తేదీని రాష్ట్ర వైద్యశాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ నెలలుగా ప్రకటించకపోవడమేనని తెలిసింది. కాగా ఈ విషయమై జిల్లా ఔషధ నియంత్రణ అధికారులను సంప్రదించగా, అతి త్వరలో ప్రారంభిస్తామని బదులిచ్చారు. రూ.90 లక్షలతో డ్రగ్ కంట్రోల్ ఏడీ నూతన కార్యాలయం ప్రారంభ తేదీని ప్రకటించడంలో జాప్యం గత ప్రభుత్వ హయాంలో నిధులు.. నిర్మాణం పిచ్చిమొక్కలతో ప్రస్తుతం కళావిహీనంగా -
గాయపడిన వ్యక్తి మృతి
కలిగిరి: కలిగిరి – కొండాపురం మార్గంలోని చిన్నచెరువు వద్ద ఈ నెల 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. వివరాలు.. చిన్నఅన్నలూరు పంచాయతీ తొగురువారిపాళేనికి చెందిన నల్లపనేని చంద్రమోళి (63) ఆటోలో వెళ్తుండగా, కలిగిరికి వస్తున్న ట్రాక్టర్ గొర్రు తగలడంతో వాహనం బోల్తాపడింది. ఘటనలో చంద్రమోళి తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో నెల్లూరులో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మృతదేహాన్ని పోలీస్స్టేషన్ వద్దకు తీసుకొచ్చి.. తమకు న్యాయం చేయాలంటూ కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై ఉమాశంకర్ మాట్లాడారు. ట్రాక్టర్ యజమానిపై చర్యలు చేపడతామని చెప్పారు. కాగా నష్టపరిహారాన్ని అందించేందుకు యజమాని అంగీకరించారు. చికిత్స పొందుతూ వ్యక్తి.. ఆత్మకూరు: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ సుమారు 55 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి బుధవారం మృతి చెందారు. తన పేరు సుధాకర్ అని మాత్రమే తెలియజేశారని సమాచారం. ఇతర వివరాలు తెలియరాలేదు. ఎరుపు రంగు టీ షర్ట్, సిమెంట్ రంగు ప్యాంట్ను ధరించి ఉన్నారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. వివరాలు తెలిసిన వారు సీఐ గంగాధర్ (94407 96371), ఎస్సై జిలానీ (94407 96390) నంబర్లను సంప్రదించాలని కోరారు. -
ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి సారథ్యంలోనే దాడులు
● డిప్యూటీ మేయర్ రూప్కుమార్ ఆరోపణల్లో నిజం లేదు ● పదవి కోసం నాలుగేళ్లుగా కుట్రలు ● ఆగ్రహం వ్యక్తం చేసిన స్రవంతి నెల్లూరు(బారకాసు): నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సారథ్యంలోనే దాడులు జరుగుతున్నాయని, అభివృద్ధికి తాను ఆటంకంగా ఉంటే నగరంలో 339 పనులు, పార్కులు తదితర డెవలప్మెంట్ వర్క్స్ ఎలా జరిగాయని మేయర్ స్రవంతి ప్రశ్నించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన చాంబర్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తన భర్త జయవర్ధన్తో కలిసి ఆమె మాట్లాడారు. డిప్యూటీ మేయర్ రూప్కుమార్యాదవ్ తనపై చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని చెప్పారు. మేయర్ పదవి కోసం నాలుగేళ్లుగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆయనకు సంబంధించిన ఫైళ్లు తన వద్దకొస్తే, ఎప్పటికప్పుడు సంతకాలు చేసి పంపుతున్నానని, ఈ వివరాలను లెడ్జర్ బుక్లో నమోదు చేశారని వివరించారు. అవిశ్వాస తీర్మానం పెట్టిన కార్పొరేటర్ల మనస్సాక్షికి తానేమిటో స్పష్టంగా తెలుసునన్నారు. నగరంలో గిరిజన సంఘాలు తనకు మద్దతు తెలియజేస్తే.. అక్కడ మీడియా ఇన్చార్జి సిరాజ్పై దాడులు చేయించారని, ఇదంతా శ్రీధర్రెడ్డి సారథ్యంలో జరిగిందని ఆరోపించారు. ఆయన తన మనుషులను పంపి సిరాజ్ను బెదిరించారని, అప్పటి నుంచి అతను కనిపించడంలేదని చెప్పారు. సిరాజ్ ఇంటికి మూడు జీపుల్లో పోలీసులు వెళ్లి బెదిరించడం, కొందరు భయభ్రాంతులకు గురిచేయడం లాంటిని ఎమ్మెల్యే జరపడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తనను, తన భర్తను కొంతకాలంగా అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రౌడీ రాజకీయాలను ప్రోత్సహించొద్దని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ను కోరారు. పదేళ్లుగా దాష్టీకాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గత పదేళ్లుగా దాష్టీకాలు జరుగుతున్నాయని జయవర్ధన్ ఆరోపించారు. గతంలో జర్నలిస్ట్ రహీమ్, టీడీపీ నేతలు తిరుమలనాయుడు, మాతంగి కృష్ణ, కార్పొరేటర్ సుధాకర్, రూరల్ ఎమ్మెల్యే వద్ద పదేళ్ల పాటు వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న వి ష్ణువర్థన్రెడ్డిని హతమార్చేందుకు యత్నించారని, దాష్టీకానికి బలయ్యేందుకు తనతో పాటు తన సతీమణి స్రవంతి సిద్ధంగా ఉన్నామన్నారు. 13 ఏళ్ల పాటు ఆయన వద్ద ఊడిగం చేశానని, దీనికి ప్రతిఫలంగా తమపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో కీచక పాలన సాగుతోందని, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని ఎదుర్కొనేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. ఆయన అరాచక పాలన అంతం తమ నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. ఎమ్మెల్యే బాధితులు ఏకం కావాలని కోరారు. -
కార్మికులు, రైతులను వంచించిన ప్రభుత్వం
నెలూరు(దర్గామిట్ట): కార్మికులు, కర్షకులను కేంద్ర ప్రభుత్వం దగా చేసిందని.. కార్మికుల హక్కులను కాలరాసేలా తీసుకొచ్చిన లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. నగరంలో భారీ ప్రదర్శనను కార్మిక, రైతు సంఘాలు బుధవారం చేపట్టాయి. గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నాలో వారు మాట్లాడారు. పంటలకు గిట్టుబాటు ధరలు లభించడంలేదని ఆరోపించారు. టమాటో, ఉల్లి, పసుపు, మిర్చి, అరటి రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్లపై పారబోసి నిరసన తెలిపారన్నారు. అనంతరం జేసీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రాన్ని అందజేశారు. రైతు సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు చిరసాని కోటిరెడ్డి, జిల్లా కార్యదర్శి మూలె వెంగయ్య, నేతలు రమణయ్య, గంగపట్నం రమణయ్య, అజయ్కుమార్, మోహన్రావు, గోగుల శ్రీనివాసులు, యానాదయ్య, సాగర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
నోబిడ్పై రైతుల ఆగ్రహం
● లోగ్రేడ్ పొగాకు కొనుగోలు తిరస్కరణపై ఆరోపణలు ● ఒకటో వేలం కేంద్రంలో వేలాన్ని ఆపేసి నిరసన ● రైతులు, వ్యాపారులతో చర్చించి కొనసాగించిన అధికారులు కందుకూరు: లోగ్రేడ్ పొగాకును వేలం కేంద్రంలో కొనుగోలు చేయడం లేదంటూ కనిగిరి రోడ్డులోని ఒకటో వేలం కేంద్రంలో బుధవారం రైతులు ఆందోళనకు దిగారు. పొన్నలూరు మండలం ముండ్లమూరివారిపాళెం క్లస్టర్కు చెందిన రైతులు పొగాకు బేళ్లను వేలానికి తెచ్చారు. వీటిలో అధికంగా లోగ్రేడ్ పొగాకు బేళ్లు ఉన్నాయి. అయితే వేలం ప్రారంభమైన తర్వాత లోగ్రేడ్ పొగాకు కొనుగోలు చేయకుండా వ్యాపారులు తిరస్కరించడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వేలం చివరికి చేరిందని, ఇప్పుడు కూడా లోగ్రేడ్ ఉత్పత్తులు కొనుగోలు చేయకపోతే ఈ పొగాకును ఏం చేయాలంటూ నిలదీశారు. వేలాన్ని నిలిపి వేసి వేలం కేంద్రం బయట నిరసనకు దిగారు. పొగాకు బేళ్లను దహనం చేసే ప్రయత్నం చేశారు. రంగంలోకి దిగిన వేలం నిర్వహణాధికారి శివకుమార్ రైతులు, వ్యాపారులతో చర్చించారు. రైతుల వద్ద ఉన్న లోగ్రేడ్ పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయాలని కోరారు. దీనికి వ్యాపారులు సమ్మతించడంతో అత్యంత తక్కువ ధర కేజీ రూ. 50 చొప్పున పొగాకును కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చారు. అప్పటికే వందల బేళ్లను తిరస్కరించడంతో రైతులు తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. రైతులకు నోబిడ్.. దళారులకు ఒకే వేలం కేంద్రంలో లోగ్రేడ్ పొగాకును కొనుగోలు చేసే విషయంలో వ్యాపారులు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారని రైతులు ఆరోపించారు. వేలం ప్రక్రియ చివరి దశకు చేరడంతో రైతులు అధికంగా లోగ్రేడ్ పొగాకునే వేలం కేంద్రానికి తెస్తున్నారు. అయితే వేలంలో పెడితే కొనుగోలుకు వ్యాపారులు తిరస్కరిస్తున్నారు. ఆ బేళ్లను రైతులు తిరిగి ఇంటికి తీసుకెళ్లాల్సి వస్తోంది. దీంతో ఎంత వస్తే అంత రేటుకు విక్రయిస్తున్నారు. రైతుల బలహీనతను ఆసరాగా చేసుకుంటున్న కొందరు దళారులు వేలం కేంద్రం వద్దే మాటు వేసి తిరస్కరించిన బేళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఇదే పొగాకును రూ.700 నుంచి 1000 వరకు కొనుగోలు చేస్తుండడం గమనార్హం. దళారులు ముందుగానే వేలం ప్రక్రియలో పాల్గొనే కంపెనీల ప్రతినిధులతో కొంత కమీషన్ ఇచ్చే విధంగా బేరం కుదుర్చుకుని వేలంలో బేళ్లు ఉంచుతున్నారు. రైతులు ఉన్నప్పుడు తిరస్కరించిన బేళ్లనే తిరిగి దళారులు వేలంలో పెడితే మాత్రం క్వింటా పొగాకును రూ.5 వేలకు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీల ప్రతినిధుల తమ స్వలాభం కోసం అవినీతికి పాల్పడుతున్నారని రైతులు విమర్శిస్తున్నారు. -
సర్వేపల్లిలో అంతులేని అవినీతి
● వైఎస్సార్సీపీ హయాంలోనే అభివృద్ధి ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ముత్తుకూరు (పొదలకూరు): సర్వేపల్లి నియోజకవర్గంలో అంతులేని అవినీతి రాజ్యమేలుతోందని, అభివృద్ధి గాలికి వదిలేసి సంపాదనే ధ్యేయంగా అక్రమాలు కొనసాగుతున్నాయని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. అభివృద్ధి అంటూ జరిగిందంటే అది వైఎస్సార్సీపీ హయాంలోనే అన్నారు. మండలంలోని తాళ్లపూడి పంచాయతీ కప్పలదొరువులో బుధవారం కాకాణి పర్యటించారు. ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో గ్రా మాల్లో సంపూర్ణంగా సీసీరోడ్లు, సైడ్ డ్రెయిన్లను నిర్మించామన్నారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మత్స్యకారేత ప్యాకేజీని అన్ని గ్రామాలకు అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి సహకారంతో అందజేశామన్నారు. ఏపీ జెన్కో 3వ యూనిట్ ప్రారంభోత్సవానికి జగన్మోహన్రెడ్డి విచ్చేసిన సందర్భంగా 200 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించినట్టు గుర్తు చేశారు. ప్రస్తుతం సర్వేపల్లిలో అవినీతి వరద పారుతున్నట్టు విమర్శించారు. ఏపీ జెన్కోలో బూడిదను అక్రమంగా తరలిస్తూ ప్రతి నెల రూ.లక్షలు దోచుకుంటున్నారని, టీడీపీ నాయకులు జెన్కో కార్యాలయంపై దాడికి పాల్పడడమే ఇందుకు నిదర్శనమన్నారు. పామాయిల్ యూనియన్ పేరుతో స్థానిక ట్యాంకర్ల యజమానుల అవసరాలను పక్కన పెట్టి ధనార్జనే ధ్యేయంగా ఇష్టానుసారం దోచుకుంటున్నట్లు ఆరోపించారు. ఫిషింగ్ జెట్టి పనులపై పోరాటం మత్స్యకారులకు ఎంతో ఉపయోగపడే ఫిషింగ్ జెట్టి పనులను నిలిపివేసి వారికి సోమిరెడ్డి తీరని ద్రోహం చేస్తున్నారని కాకాణి విమర్శించారు. జెట్టి పనులు ప్రారంభించకుంటే మత్స్యకారులతో కలిసి పోరాటం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలతో జనాలు బాగా విసిగి వేసారిపోయారని జగన్మోహన్రెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. గ్రామంలో పార్టీ నాయకుడు శ్రీనివాసులురెడ్డి కుమారుడి వివాహానికి కాకాణి హాజరయ్యారు. ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారు. -
సరఫరాకు సర్కారు పంగనామం
దుక్కి చేస్తుంటే దుఃఖం వస్తోంది.● స్టాక్ ఉందంటున్నా.. సీజన్ దాటిపోతున్నా.. ఎక్కడా ఇవ్వని వైనం ● ప్రైవేట్ సీడ్దుకాణాలకు పరుగులు పెడుతున్న రైతులు ● విత్తన వ్యాపారులకు మేలు చేకూర్చేందుకేనా? ● డిమాండ్ ఉన్న రకాల్లేవు చంద్రబాబు సర్కారు వ్యవసాయానికి, వరికి ‘ఉరి’ వేస్తోందా? అంటే ప్రస్తుత పరిణామాలు అవుననే చెబుతున్నాయి. వరి ధాన్యం వల్ల డయాబెటిస్ రోగ గ్రస్తులు పెరుగుతున్నారంటూ వరి సాగు చేయొద్దనే రీతిలో నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు ఇప్పటికే ధరల స్థిరీకరణ నిధిని ఎత్తేశారు. అన్ని రకాల పంటల ధరలు పాతాళానికి పడిపోతున్నా.. కట్టడికి చర్యలు చేపట్టడం లేదు. రైతులు పండించిన పంటలను రోడ్ల మీద, కాలువల్లో పారబోస్తున్నా.. చలనం లేదు. ప్రకృతి విపత్తుల్లో అండగా ఆదుకునే ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేశారు. గతంలో ఆదుకున్న పెట్టుబడి సాయానికి కోతలు విధించారు. యూరియా సరఫరాపై చేతులెత్తేశారు. తాజాగా ‘వరి’ విత్తనాల సరఫరాకు పంగనామం పెట్టేశారు. నెల్లూరు (పొగతోట): రబీ సీజన్లో నారుమడులు పోసుకునే అదను దాటిపోతున్నా.. అన్నదాతలను ప్రభుత్వ సరఫరా చేసే విత్తనం వరించలేదు. జిల్లాలో 38 మండలాల్లో 7.30 లక్షల ఎకరాల్లో వరి సాగుకు నీటి విడుదల చేయాలని ఇటీవల ఐఏబీ నిర్ణయించింది. చెరువులు, డెల్టా కాలువల కింద అనధికారికంగా సుమారు మరో 1.50 లక్షల ఎకరాల్లో కూడా సాగు జరుగుతోంది. సుమారుగా 9 లక్షల ఎకరాల్లో రబీ సీజన్లో ఏటా వరి సాగు జరుగుతోంది. ఈ ప్రకారం రైతులకు సుమారు 24,600 మెట్రిక్ టన్నుల విత్తనాలు అవసరం కాగా జిల్లా వ్యవసాయశాఖ దగ్గర కేవలం 35.51 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉంచడాన్ని బట్టి రైతులపై చంద్రబాబు సర్కారుకు చిత్తశుద్ధి ఎంతో విస్పష్టమవుతోంది. ఆది నుంచి రైతు వ్యతిరేకిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు. ఆయన పాలనలో ఎప్పుడూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కిన చరిత్ర లేదు. విత్తనాలకు, ఎరువులకు వ్యవసాయశాఖ కార్యాలయాల ముందు బారులు తీరిన దృశ్యాలు కనిపించేవి. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ స్థాయిలోనే ఆర్బీకే వ్యవస్థను సృష్టించి విత్తనం నుంచి విక్రయం వరకు అండగా నిలిచారు. సబ్సిడీ విత్తన సరఫరాకు పంగనామం గత సార్వత్రిక ఎన్నిక తర్వాత టీడీపీ పాలనలో 2024–25 రబీ, 2025 ఖరీఫ్ పంట కాలాలు పూర్తిగా ప్రస్తుతం 2025–26 రబీ సీజన్ నడుస్తోంది. ఈ మూడు సీజన్లకు సంబంధించి రైతులకు విత్తనాలు సరఫరా చేయడంలో చేతులెత్తేసింది. జిల్లాలో అత్యధిక విస్తీర్ణంలో రబీ సీజన్లోనే వరి పంట సాగవుతోంది. ఈ సమయంలో జిల్లాలో వ్యవసాయశాఖ అధికారులు కేఎన్ఎం 1638, బీపీటీ 5204, ఆర్ఎన్ఆర్ 15048, ఎంటీయూ 1010, కేఎన్ఎం 733 రకాల విత్తనాలు మొత్తం 35.51 టన్నులు మాత్రమే అందుబాటులో ఉంచారు. కేవలం 35.51 మెట్రిక్ టన్నుల విత్తనాలు నిల్వలు ఉంచిందంటే వ్యవసాయంపై, రైతుల సంక్షేమంపై ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా, బాధ్యతగా వ్యవహరిస్తోందో అర్థమవుతోంది. గతంలో ప్రభుత్వాలు కేజీకి రూ.5 సబ్సిడీతో వరి విత్తనాలను సరఫరా చేశాయి. ప్రస్తుతం సబ్సిడీతో విత్తనాలు సరఫరాకు పంగనామం పెట్టేసింది. అవసరమైన విత్తనాలు24,400 మెట్రిక్ టన్నులు జిల్లాలో వరి సాగు విస్తీర్ణం: 7.30 లక్షల ఎకరాలుజిల్లాలో వ్యవసాయశాఖ వద్ద అందుబాటులో ఉన్న విత్తనాలు: 35.51 మెట్రిక్ టన్నులుఅనధికార ఆయకట్టు కింద: 1.50 లక్షల ఎకరాలు ఆర్బీకే వ్యవస్థతో ఊర్లోకే విత్తనాలు, ఎరువులు గతంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ రైతు విత్తనాలకు, ఎరువులకు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రతి ఊరిలోనే ఆర్బీకేలను ఏర్పాటు చేశారు. సీజన్ ప్రారంభానికి నెల ముందు నుంచే ఏ గ్రామంలో ఏ రైతుకు ఎన్ని విత్తనాలు, ఎంత ఎరువులు అవసరం అవుతాయో ఆ మేరకు సిద్ధంగా ఉంచారు. ప్రధానంగా ఏ ప్రాంతంలో ఏ రకం వరి సాగు చేస్తున్నారో ఆ రకాలను అవసరమైన మేరకు సిద్ధంగా ఉంచడమే కాకుండా, అవసరమైతే అప్పటికప్పుడు సరఫరా చేసేందుకు కూడా వ్యవస్థను సిద్ధంగా ఉంచారు. ప్రకృతి విపత్తులతో వరి నారుమడులు దెబ్బతింటే తిరిగి పోసుకునేందుకు పూర్తి సబ్సిడీతో కూడా విత్తనాలు సరఫరా చేసిన చరిత్ర వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని రైతులు గుర్తు చేస్తున్నారు. ఇలాంటి ఆర్బీకే వ్యవస్థను చంద్రబాబు నిర్వీర్యం చేశారు. గత ఖరీఫ్ సీజన్లో యూరియా కోసం రైతులు పడిన పాట్లు ఇందుకు అద్దం పడుతోంది. గతంలో వ్యవసాయశాఖ నుంచి సబ్సిడీతో అందించిన వైనం డిమాండ్ ఉన్న విత్తనాల్లేవు.. రబీ సీజన్ ప్రారంభమై దాదాపు నెల అవుతోంది. వ్యవసాయశాఖ వద్ద సమృద్ధిగా విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో జిల్లా వ్యవసాయశాఖాధికారులు సైతం తాము రైతులకు అవసరమైన విత్తనాలు సరఫరా చేస్తున్నామని కానీ, తమ వద్ద ఇంత స్టాక్ ఉందని కానీ ఎక్కడా ప్రచారం చేసిన దాఖలాలు కూడా లేవు. గతంలో ప్రతి మండలంలో ఏఓలు రైతులకు కేజీకి రూ.5 సబ్సిడీతో పలానా వరి విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని ప్రచారం చేసే వారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా లేదు. దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించి అత్యధిక ధరలకు కొనుగోలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 95 శాతం మేర వరి నారు మడులు పోసుకున్నారు. మొత్తానికి విత్తనాలు ఇవ్వకుండానే వ్యవసాయశాఖ చేతులెత్తేస్తే.. ప్రభుత్వం ముఖం చాటేసింది. కాగా ఈ విషయమై జిల్లా వ్యవసాయశాఖాధికారిణి సత్యవాణిని సంప్రదించగా, రైతులకు అవసరమైన వరి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. -
ప్రైవేట్ పార్శిల్ సర్వీస్లో తనిఖీలు
● బిల్లుల్లేని రూ.20 లక్షల విలువైన సిగరెట్లు, పాన్ మసాలాలు స్వాధీనం నెల్లూరు (క్రైమ్): ఓ ప్రైవేట్ పార్శిల్ సర్వీసులో బిల్లులు లేకుండా అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న రూ.20 లక్షలు విలువ చేసే సిగరెట్లు, పాన్ మసాలాలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం బుధవారం స్వాధీనం చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. కొందరు అక్రమార్కులు ప్రభుత్వ ఖజానాకు గండికొడుతూ వివిధ రాష్ట్రాల నుంచి సిగరెట్లు, పాన్మసాలాలు దిగుమతి చేసుకుంటున్నారు. నెల్లూరు వెంకటరామపురంలోని బీఎంపీఎస్ పార్శిల్ సర్వీస్లో పెద్ద ఎత్తున సిగిరెట్లు, పాన్మసాలాలు అక్రమ రవాణా అవుతున్నాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు బుధవారం పక్కా సమాచారం అందింది. విజిలెన్స్ ఇన్స్పెక్టర్ కె. నరసింహరావు, డీసీటీఓ కె. విష్ణురావు, డీసీటీఓ(జీఎస్టీ)ఎన్వీ సుబ్బారావు తమ సిబ్బందితో కలిసి పార్శిల్ సర్వీస్ కార్యాలయంలో ఆకస్మిక దాడులు చేశారు. కార్యాలయంలోని 27 బాక్స్లను తనిఖీ చేయగా అందులో 24 బాక్సుల్లో సిగరెట్లు, మూడు బాక్స్ల్లో పాన్మసాలా ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అవి ఎవరు? ఎక్కడికి? ఎవరి పేరుపై బుక్ చేశారనే వివరాలపై అధికారులు ట్రాన్స్పోర్టు కార్యాలయ సిబ్బందిని ఆరా తీశారు. వారు తమ వద్ద ఫోన్ నంబరు మాత్రమే ఉందని ఇతర వివరాలు ఏమిలేవని చెప్పారు. పట్టుబడినవి నకిలీవా? అసలైనావా అని గుర్తించేందుకు శాంపిల్స్ను సేకరించి ల్యాబ్కు పంపుతున్నారు. ఫోన్నంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. చైన్నె నుంచి నర్సారావుపేటకు గుర్తు తెలియని వ్యక్తి బుక్ చేసినట్లు అధికారులు గుర్తించారు. పార్శిల్ కార్యాలయంలో ఏదైనా వస్తువు పార్శిల్ చేసే సమయంలో అక్కడి సిబ్బంది ఎవరు? ఎవరికి? ఎక్కడికి పంపుతున్నారు.. వారి చిరునామా, ఫోన్ నంబర్లను సేకరించిన తర్వాతే బుకింగ్ చేసుకుంటారు. అవేమి లేకుండా కేవలం ఫోన్ నంబర్ ఆధారంగా పాన్మసాలాలు, సిగరెట్లు తరలింపుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్శిల్ రవాణా సిబ్బంది ప్రమేయం ఏమైనా ఉందానే అనుమానాలు ఉండడంతో అన్నీ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు చెప్పారు. -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 73,677 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 24,732 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.26 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శన టికెట్లు ఉంటే 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. నూతన విద్యా విధానం కేంద్రీకృత విద్యకు మార్గం ● వీఎస్యూ వీసీ అల్లం శ్రీనివాసరావు వెంకటాచలం: నూతన విద్యా విధానంతో విద్యార్థుల కేంద్రీకృత విద్యకు మార్గం సుగమం అవుతుందని విక్రమ సింహపురి యూనివర్శిటీ (వీఎస్యూ) వీసీ అల్లం శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని కాకుటూరులో ఉన్న వీఎస్యూలో బుధవారం నూతన జాతీయ విద్యా విధానంలో కీలక సంస్కరణ అయిన అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ (ఏబీసీ) వ్యవస్థ ప్రాముఖ్యతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ అల్లం శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అమలవుతున్న ఏబీసీ వ్యవస్థ వల్ల విద్యార్థులకు చాలా ప్రయోజనాలు కలుగనున్నాయని చెప్పారు. విద్యార్థులు తమ విద్యాభ్యాసానికి అనుగుణంగా క్రెడిట్లు సంపాదించుకోవచ్చునని, వాటిని వివిధ సంస్థల్లో డిజిటల్గా భద్రపరచుకునే అవకాశం ఉందన్నారు. క్రెడిట్ ట్రాన్స్ఫర్ సౌకర్యం కూడా ఉందని చెప్పారు. ఎన్సీఆర్టీ ఫ్రొఫెసర్ అండ్ ఓఎస్డీ బి.రమేష్బాబు ఏబీసీ అమలు, ప్రాధాన్యతపై లోతైన సూచనలు అందించారు. ఈ సదస్సులో ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, ప్రిన్సిపాల్ సీహెచ్ విజయ, పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ ఆర్.మధుమతి తదితరులు పాల్గొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్, యాక్సిడెంట్కు ౖలెసెన్స్ సస్పెన్షన్ నెల్లూరు (టౌన్): వాహనదారులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడితే 3 నెలలు, యాక్సిడెంట్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ 6 నెలల పాటు సస్పెండ్ చేస్తామని రవాణాశాఖ డీటీసీ బి.చందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2021లో 197, 2022లో 108, 2023లో105, 2024లో 103, 2025లో ఇప్పటి వరకు 90 లైసెన్స్లు సస్పెండ్ చేసినట్లు చెప్పారు. రెండు కంటే ఎక్కువ సార్లు పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి వాహనదారుడు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ వాహనాన్ని నడపాలన్నారు. ప్రజాస్వామ్య విలువలకు రాజ్యాంగం మూల స్తంభం నెల్లూరు (దరామిట్ట): దేశ ప్రజల హక్కులు, బాధ్యతలు, ప్రజాస్వామ్య విలువలకు భారత రాజ్యాంగం మూల స్తంభమని, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి శాశ్వత విలువలను ప్రతి పౌరుడికి హామీ ఇస్తుందని జేసీ ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కార్యక్రమాలను నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దూరదృష్టి వల్లే భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా నిలిచిందన్నారు. యువత, విద్యార్థులు రాజ్యాంగంపై అవగాహన పెంపొందించుకుని దేశాభివృద్ధిలో చురుకై న పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం, శాంతి, సామరస్యం, జాతీయ ఐక్యతను కాపాడుతూ రాజ్యాంగ విలువలను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. తొలుత ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీఆర్వో విజయకుమా,ర్ కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
కొనడం తప్ప.. గెలిచే దమ్ము లేదు
నెల్లూరు (స్టోన్హౌస్పేట): ‘టీడీపీ నేతలకు ఒంటరిగా పోటీ చేసి గెలిచే దమ్ము లేదు. పక్క పార్టీలో గెలిచినోళ్లకు నోట్ల కట్టలిచ్చి కొనడం తప్ప. వేరే పార్టీలో గెలిచిన 41 మంది కార్పొరేటర్లకు పచ్చ కండువాలు వేసి తమ పార్టీ అని చెప్పుకోవడం టీడీపీ అధినేత నుంచి అలవాటే. నెల్లూరు నగర మేయర్ ఎప్పుడో మా పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. వైఎస్సార్సీపీకి షాక్ అంటూ ప్రచారం చేసుకోవడానికి టీడీపీ నేతలకు, పచ్చ మీడియాకు సిగ్గుండాలి’ అని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆనం విజయకుమార్ రెడ్డి, కార్పొరేటర్లు, నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. కాకాణి మాట్లాడుతూ నెల్లూరు నగర మేయర్పై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో వైఎస్సార్సీపీపై టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నెల్లూరు నగరంలోని 54 డివిజన్లలో వైఎస్సార్సీపీ క్లీన్ స్విప్ చేసిందని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో వైఎస్సార్సీపీ బీఫాంపై గెలిచిన గిరిజన మహిళ పొట్లూరి స్రవంతిని నెల్లూరు నగర మేయర్గా చేశామన్నారు. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి టీడీపీలోకి వెళ్లడంతో మేయర్ కూడా ఆయన వెంట నడిచారని, వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం అందరికీ తెలుసన్నారు. అటువంటిది ఇప్పుడు షాక్ అంటూ ప్రచారం చేసుకుంటూ శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. నిజంగా టీడీపీకి ప్రజాక్షేత్రంలో గెలిచే దమ్ము ధైర్యం ఉంటే.. మా పార్టీ బీఫాంపై గెలిచిన కార్పొరేటర్లతో రాజీ నామా చేయించి ఎన్నికలకు సిద్ధమా అని సవాల్ విసిరారు. గిరిజన మహిళను గద్దె దించడానికి అవినీతి నిందలు వేయడం తగదన్నారు. మంత్రి నారాయణకు ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్నడూ అనుభవం లేదని, తమ పార్టీ నాయకులను గెలిపించుకోవడం చేతకాక, వేరే పార్టీలో గెలిచిన వారిని అధికారాన్ని ఉపయోగించి, పోలీసులను పెట్టి లాక్కోవడం అలవాటన్నారు. అమ్ముడుపోయిన కార్పొరేటర్లు చరిత్రహీనులు అధికారానికి.. కాసుకులకు అమ్ముడుపోయిన కార్పొరేటర్లు చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. నెల్లూరు నగర మేయర్గా ఒక గిరిజన మహిళకు అవకాశం కల్పించామన్నారు. అధికార పార్టీ నాయకులు ఎన్ని చిత్రహింసలు పెట్టినా చాలా మంది కార్పొరేటర్లు వేధింపులన్నింటిని తట్టుకొని గట్టిగా నిలబడ్డారన్నారు. జిల్లాలో జెడ్పీ చైర్పర్సన్తోపాటు, జెడ్పీటీసీ సభ్యులు నెల్లూరు కార్పొరేటర్లు మాదిరిగా టీడీపీకి అమ్ముడు పోలేదన్నారు. వారంతా వైఎస్సార్సీపీకి విధేయులుగా ఉండడంతో టీడీపీ అధికారంలో ఉన్నా.. ఏమీ చేయలేక తోక ముడిచిందన్నారు. అధికారంలో ఉంటే తప్ప.. కానరాడు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ మంత్రి నారాయణ అధికారంలో ఉంటే తప్ప.. ప్రతిపక్షంలో ఉంటే ప్రజల్లో కనిపించరని ఎద్దేవా చేశారు. మంత్రిగా ఎప్పుడు పనిచేసినా ఫ్యాన్ గుర్తుపై గెలిచిన వారిని మభ్యపెట్టి లాక్కునేందుకు తాపత్రయ పడతారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏ ఒక్క అభివృద్ధి నెల్లూరు నగరంలో జరగడం లేదన్నారు. 2014–19 మధ్య కాలంలో మంత్రిగా నారాయణ జెడ్పీటీసీలను కార్పొరేటర్లను కొనుక్కునే ప్రయత్నం చేశారని, 2024లో కూడా చంద్రబాబు, లోకేశ్ వద్ద తన ఘనతగా చూపించుకునేందుకు మా పార్టీ కార్పొరేటర్లను కొనడాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. నెల్లూరు నగరంలో వెనుకబడిన యానాది కులానికి చెందిన మహిళకు మేయర్గా, మైనార్టీ నేతకు డిప్యూటీ మేయర్గా అవకాశం కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదన్నారు. ● నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి ఆనం విజయకుమార్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో ఒక గిరిజన మహిళకు మేయర్ పదవితోపాటు, 54 మందికి కార్పొరేటర్లుగా అవకాశం వచ్చిందేన్నారు. అధికార పార్టీ నాయకులు, ప్రలోభాలకు గురైన కార్పొరేటర్ల సహాయంతో ఒక గిరిజన మహిళ గొంతు కోయడానికి ప్రయత్నిస్తున్నారని, అధికార పార్టీని నమ్ముకున్న గిరిజన మహిళకు అవినీతి మరకను అంటించి, గద్దే దించేందుకు అవిశ్వాసం పెట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. మా పార్టీలో గెలిచిన కార్పొరేటర్లకు అనైతికంగా పచ్చకండువాలేశారు మేయర్ పొట్లూరి స్రవంతి ఎప్పుడో తమ పార్టీకి రాజీనామా చేశారు ఆమెకు మా పార్టీతో ఎటువంటి సంబంధం లేదు వైఎస్సార్సీపీకి ఎలాంటి షాక్ తగలలేదు మంత్రి నారాయణకు బేరసారాలు చేయడం అలవాటే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
అరటి కేజీ రూపాయే..
అన్నదాతల ఆశలను చంద్రబాబు ప్రభుత్వం చిదిమేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో సర్కారు నిర్ణయించిన మద్దతు ధరను కూడా అమలు చేయకపోగా ముఖం చాటేసింది. పంటలకు బీమా లేదు.. ధరల ధీమా లేదు. వరి, మిర్చి, పత్తి, మినుము, వేరుశనగ ధరలు సగానికి పతనమైతే.. మామిడి, అరటి, బత్తాయి, బొప్పాయి పంటలు పాతాళానికి పడిపోయాయి. పెట్టుబడి సాయంలోనూ దగా. ఇన్ఫుట్ సబ్సిడీకి పంగనామం పెట్టింది. నెల్లూరు(పొగతోట)/ఉదయగిరి/ఆత్మకూరు రూరల్/పొదలకూరు/కోవూరు/కలిగిరి: జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగు చేసే అన్నదాత లు ధరల పతనంతో ఆక్రోశిస్తున్నారు. గతంలో ఏ పంటకు చూసినా ధరలు ఆకాశాన్ని తాకితే.. చంద్రబాబు పాలనలో పాతాళానికి పడిపోయాయి. ఇంత దారు ణంగా ధరల్లేక రైతులు విలవిలలాడుతున్నా.. కనీస స్పందన కరువైంది. గతంలో ఏ పంట అయినా.. సగటున కేజీ రూ.25– రూ.30 ఉంటే.. ఇప్పుడు రూపా యి కూడా పలకడం లేదు. జిల్లాలో వరి, పత్తి, మామి డి, సపోటా, అరటి, వేరుశనగ, మినుము, నిమ్మ, బత్తాయి తదితర పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయి.. అప్పుల ఊబిలో కూరుకుపోయారు. పెట్టుబడి వ్యయం పెరుగుతున్నా.. ఉత్పత్తి ధరలు మాత్రం దిగజారుతున్నాయి. మరో వైపు ప్రకృతి విపత్తులు అన్నదాతను నిలువునా ముంచేసింది. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఎప్పుడు ఏ పంటకు ధర లేకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేయడం ద్వారా మార్కెట్లో డిమాండ్ను పెంచి ధరలు కల్పించింది. ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసి ప్రకృతి విపత్తుల్లో నష్టపోతే ఆ సీజన్లోనే పరిహారం చెల్లించి రైతు కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంది. చంద్రబాబు ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసి, వారికి అందించాల్సిన సంక్షేమ పథకాలను ఎత్తేసి నిస్సిగ్గుగా రైతన్న.. మీ కోసమంటూ కార్యక్రమాన్ని చేపడుతుందంటూ రైతులు మండిపడుతున్నారు. ఎక్కడ రైతులు నిలదీస్తారో అని.. అధికారులు టీడీపీ సానుభూతిపరులు ఇళ్లకు వెళ్లి ఫొట్ షూట్తో మమ అనిపిస్తున్నారు. మోంథా తుఫాన్కు నష్టపోయినా.. సరే ఇటీవల వచ్చిన మోంథా తుఫాన్కు జిల్లాలో పంటలకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లితే.. దాన్ని కూడా మూడింతలు తగ్గించి.. అరకొరగా ఎన్యుమరేషన్ చేశారు. 594.98 హెక్టార్లలో వరి, 30.49 హెక్టార్లలో సజ్జ, 14.51 హెక్టార్లల్లో వేరుశనగ, 2.74 హెక్టార్లల్లో మొక్కజొన్న, 1.13 హెక్టార్లల్లో అలసంద పంటలు దెబ్బతిన్నాయని, 1065 మంది రైతులు పంటలు నష్టపోయారని ఎన్యుమరేషన్ చేసినా.. కనీసం వారికి ఇన్ఫుట్ సబ్సిడీ అందించే విషయంలో కూడా నేటికీ స్పష్టత లేదు. వరి ధాన్యం.. రూ.12 వేలు పతనం వైఎస్సార్సీపీ హయాంలో పుట్టి ధాన్యం సీజన్ ప్రారంభంలో రూ.24 వేల నుంచి చివరకు రూ.22 వేలకు కొనుగోలు చేశారు. గతేడాది ఖరీఫ్, రబీ, ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లలో సాగు చేసిన వరి ధాన్యానికి పుట్టికి రూ.12 వేల వరకు ధరలు తగ్గిపోయాయి. రైతులకు ధరలు కల్పించడంలో కీలకపాత్ర పోషించిన ఆర్బీకేలను నిర్వీర్యం చేయడం, ధాన్యం కొనుగోలు కేంద్రాలను మొక్కుబడిగా నిర్వహించడంతో దళారులు, మిల్లర్లు దోచుకుంటున్నారు. పంటలకు బీమా రాదు.. ధరలకు ధీమా లేదు వరి, మిర్చి, పత్తి, మినుము, వేరుశనగ ధరలు సగానికి పతనం మామిడి, అరటి, బత్తాయి, బొప్పాయి రేట్లు పాతాళానికి.. గతంలో సగటున కేజీ రూ.25– రూ.30 ఉంటే.. ఇప్పుడు రూపాయే ధరలు పతనమవుతున్నా.. నిర్లక్ష్యం రైతన్న మీ కోసం.. మాయా వేషం టీడీపీ సానుభూతిపరుల్లో ఫొటో షూట్స్ జిల్లాలో 1750 హెక్టార్లలో అరటి సాగు చేసిన రైతులు పంటను పశువులకు వదిలేశారు. గతంలో కేజీ రూ.20 నుంచి రూ.25 వరకు ఉండడంతో అదే ధరలు ఉంటాయని ఆశించిన రైతులకు ప్రస్తుత పంట కాలం శరాఘాతమైంది. కిలో రూపాయికి కూడా కొనే దిక్కులేక.. పంటను వదిలేశారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో అరటి పండ్లు కేజీ రూ.25 నుంచి రూ.30లకు విక్రయిస్తున్నారు.పొగాకు ధరలకు పొగబెట్టారు వైఎస్సార్సీపీ హయాంలో ఊహించని స్థాయిలో ధరలు పలికాయి. 2022– 23లో బ్యారనుకు రూ. 2 లక్షల వరకు ఆదాయం రాగా, 2023–24లో రూ.3 లక్షల పైగా ఆదాయం పొందాను. ప్రస్తుతం 2024– 25 పంట కాలానికి ధరలు గణనీయంగా తగ్గాయి. లోగ్రేడ్ పొగాకును కొనుగోలు కూడా చేయలేదు. దిగుబడులు బాగా రావడంతో పెట్టుబడులు వచ్చాయి. ఏడాదికి ఏడాదికి పెట్టుబడులు పెరుగుతున్నాయి గానీ ధరలు పెరగడం లేదు. – వంటేరు మహేంద్ర, పొగాకు రైతు, కృష్ణారెడ్డిపాళెం, కలిగిరి మండలంఅరటి ధర అమాంతం పడిపోయింది నాకున్న 4.5 ఎకరాల్లో అరటి సాగు చేశా. గతంలో కిలో రూ.20 నుంచి రూ.25 వరకు ఉండేది. గతేడాది రూ.13 పలికింది. ఈ ఏడాది రూ.10 అయినా దక్కుతుందని లక్షల్లో పెట్టుబడి పెట్టా. పంట దిగుబడి సుమారుగా ఉన్నప్పటికీ ధరలు పాతాళానికి అంటాయి. కిలో రెండు రూపాయలకు కూడా కొనడం లేదు. అది కూడా గెలలు కోసి, లోడింగ్ ఖర్చులు కూడా మేమే భరించాలంట. వైఎస్సార్సీపీ హయాంలో ప్రతి పంటకు మద్దతు ధర ఉండేది. – ఆలూరి వెంకటేశ్వర్లు , ఆత్మకూరు మండలం వెంకట్రావుపల్లి వేరుశనగ క్వింటాకు రూ.వెయ్యి పతనం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్ని పంటలతోపాటు వేరుశనగ పంటకు మంచి ధర ఉండేది. క్వింటా 3,600 వరకు పలికితే.. ఇప్పుడు రూ.2600లకు కూడా కొనడం లేదు. ఖర్చులు చూస్తే.. ఎకరానికి రూ.20 వేలు అవుతుంది. దిగుబడి తగ్గింది. 6 క్వింటాళ్ల దిగుబడి వస్తే..రూ.15,600 వచ్చింది. పెట్టుబడిలోనే రూ.4 వేల నష్టపోయాను. – తిరుపతయ్య , రామచంద్రపురం, విడవలూరు మండలంనిమ్మ రైతు కంట చెమ్మ నిమ్మ తోటలు ఉన్న రైతుల కంట చెమ్మ కనిపిస్తోంది. రెండు నెలలుగా ధరలు పతనమయ్యాయి. కోసిన కాయలను మార్కెట్కు తరలిస్తే బస్తాకు రూ.100 నుంచి రూ.150 కూడా రావడం లేదు. గతంలో ఎన్నడూ ఇంత దారుణమైన ధరలు లేవు. తోటల్లో కాయలను కోసినా రైతుకు ప్రయోజనం ఉండడం లేదు. – ఎం.శంకర్రెడ్డి, రైతు, ముదిగేడు. -
శనగ సాగు చేస్తే.. ఎకరానికి రూ.35 వేల నష్టం
కొండాపురం మండలం పార్లపల్లికి చెందిన చీకర్ల చంద్రారెడ్డి తనకున్న భూమిలో 5 ఎకరాల్లో శనగ పంట సాగు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో శనగ విత్తనాలు సబ్సిడీతో ఆర్బీకేలు ద్వారా అందజేశారు. దీంతో పెట్టుబడి తగ్గింది. టీడీపీ ప్రభుత్వం వచ్చాక శనగలు రాయితీపై ఇవ్వడం లేదు. గతంలో క్వింటా ధర రూ.8 వేలు పలికితే.. ఇప్పుడు రూ.5 వేలకు కూడా కొనడం లేదని వాపోయాడు. గతంలో దిగుబడి 10 క్వింటాళ్లు వస్తే.. ఇప్పుడు 4–5 క్వింటాళ్లు కూడా రాలేదు. ఎకరానికి రూ.60 వేలు వరకు ఖర్చు అయితే.. దిగుబడులు, ధరలు లేక ఎకరానికి రూ.35 వేల వరకు నష్టం వచ్చిందని కన్నీటి పర్యంతం అయ్యాడు. బత్తాయి టన్ను రూ.15 వేలే.. ఈ చిత్రంలో ఉన్న రైతు పేరు జక్కం శ్రీనివాసరెడ్డి. వరికుంటపాడు మండలం టి.కొండారెడ్డిపల్లి. ఈ రైతు తనకు ఉన్న 10 ఎకరాల భూమిలో బత్తాయి సాగు చేస్తున్నారు. ఏటా ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు చేస్తున్నాడు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించక కాపు సరిగా రాలేదు. దీనికి తోడు టన్ను ధర రూ.15 వేలకు మాత్రమే కొనుగోలు చేయడంతో ఎకరానికి రూ.25 వేల వరకు నష్టం వచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టన్ను ధర రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు ఉండేదని ఆ రైతు చెబుతున్నాడు. ఈ ఏడాది బత్తాయి సాగులో తాను సుమారు రూ.2 లక్షలు వరకు నష్టపోయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. -
అలా తిరిగేస్తూ..
నెల్లూరు నగరంలో వీఆర్సీ ప్రధాన కూడలి వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ను ఏర్పాటు చేశారు. అయితే కొందరు వాటిని పట్టించుకోకుండా రాకపోకలు సాగిస్తున్నారు. అంతేకాక రోడ్డు మార్జిన్, జీబ్రా క్రాసింగ్ సక్రమంగా లేకపోవడంతో సిగ్నల్ పడిన తర్వాత వాహనాలు ఎంత దూరంలో ఆపాలో అర్థం కాక వాహనదారులు అవస్థలు పడుతున్నారు. అదే సమయంలో కొందరు అడ్డదిడ్డంగా వెళ్తూ ఇబ్బంది కలిగిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులున్న సమయంలో వాహనాలను ఆపి రూల్స్ పాటిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు వీఆర్సీ సెంటర్లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సక్రమంగా లేని జీబ్రా క్రాసింగ్ ఇష్టానుసారంగా వెళ్తూ.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద పోలీస్ను చూసి వాహనాలను ఆపారిలా.. వీఆర్సీ వద్ద ఆగకుండా వెళ్లిపోతున్న వాహనాలు -
చంద్రబాబు రైతు ద్రోహి
● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కొడవలూరు: చంద్రబాబు రైతుల ద్రోహి అని, వారిపై పోలీసులతో కాల్పులు చేయించి హత్య చేయించిన ఘనుడని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి విమర్శించారు. మండలంలోని ఆలూరుపాడు, మానేగుంటపాడుల్లో కోటి సంతకాల కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఆలూరుపాడులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతన్నా మీ కోసమంటూ చంద్రబాబు కొత్త నాటకాలకు సోమవారం నుంచి తెరలేపారన్నారు. ముఖ్యమంత్రిగా రైతులకు ఏం మేలు చేశారో ఒక్కటి చెప్పాలని నిలదీశారు. ఉచిత కరెంట్ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న చంద్రబాబు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎదుట రైతులు ధర్నా చేస్తే వారిపై కాల్పులు జరిపించి ప్రాణాలు బలి తీసుకున్నట్లు చెప్పారు. రైతు భరోసా కేంద్రాలను ఎందుకు నిర్వీ ర్యం చేశావు బాబూ అని ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పుట్టి ధాన్యం రూ.24 వే లకు రైతులు అమ్ముకున్నట్లు చెప్పారు. ఇప్పుడు రూ.14 వేలకే తెగనమ్ముకుంటూ కన్నీరు కారుస్తుంటే చంద్రబాబు సర్కస్ వేషాలు వేస్తున్నాడని మండిపడ్డారు. పొగాకు, మిర్చి, ఉల్లి, జొన్న, బత్తాయి, మామిడి, మొక్కజొన్న, టమోటా, అరటి రైతులు గిట్టుబాటు ధర లేక రోడ్డున పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. రుణమాఫీలోనూ మోసమే.. 2014లో రైతులకు రూ.84 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా, కేవలం రూ.14 వేల కోట్లు మాత్రమే చేసి మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. సమావేశంలో డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు, ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్కుమార్, వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు చిమటా శేషగిరి, సర్పంచ్ మోచర్ల రమేష్, ఎంపీటీసీ కామేశ్వరి, ఇన్చార్జి సర్పంచ్ రాజవర్ధన్, నాయకులు కలువ బాలశంకర్రెడ్డి, అడపాల మోహనకృష్ణ, ఇందూరు బాలభాస్కర్రెడ్డి, కారంపూడి సుబ్బరామిరెడ్డి, అనపల్లి ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
తెరుచుకున్న గోదాము తలుపులు
● వాస్తవాలు బయటకు చెప్పని అధికారులు ● బియ్యం మాయంపై ఫిర్యాదు తీసుకోని పోలీసులుఉదయగిరి: ఉదయగిరి సివిల్ సప్లయ్స్ గోదాము తలుపులు తెరుచుకున్నాయి. మంగళవారం జిల్లా సివిల్ సప్లయ్స్ కార్యాలయ అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్ విభాగం) లక్ష్మీనారాయణ వాటిని తెరిచారు. తాత్కాలికంగా గోదాము బాధ్యతలు ఆత్మకూరు కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగికి అప్పగించారు. ఆయన బియ్యం స్వాహాపై ఫిర్యాదు చేసేందుకు స్థానిక పోలీస్స్టేషన్కు వెళ్లారు. అయితే ఫిర్యాదు పత్రంలో వివరాలు సమగ్రంగా లేవంటూ పోలీసులు తీసుకోలేదు. దీంతో రెండుగంటలపాటు అక్కడే ఉండి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం సీజ్ చేసిన గోదాము వద్దకు వెళ్లి షట్టర్లు తెరిపించారు. అనుమానాలు అక్కడికి వెళ్లిన విలేకరులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా దాటవేశారు. ఫొటోలు తీయొద్దని చెప్పారు. రూ.కోట్ల విలువైన పేదల బియ్యం స్వాహా అయితే దాని వివరాలు దాచిపెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఎంతమేర రేషన్ బియ్యం, ఇతర సరుకులు పక్కదారి పట్టాయని మీడియా ప్రతినిధులు అడిగినా సమాధానం దాటవేస్తూ జిల్లా మేనేజర్ను అడగాలన్నారు. ఓవైపు పోలీసులు ఫిర్యాదు తీసుకోకపోవడం, మరోవైపు మాయమైన బియ్యం వివరాలు గోప్యంగా ఉంచడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో కుంభకోణం జరిగితే జిల్లా స్థాయి అఽధికారులు రంగంలోకి దిగి దీని వెనుక ఉన్న వారి పాత్రను నిగ్గు తే ల్చి, క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సింది పోయి సిబ్బందిని పంపి చేతులు దులుపుకోవడంపై విమర్శలున్నాయి. ప్రజల డిమాండ్ గతంలో పౌరసరఫరాల కార్యాలయంలో అవినీతి వెలుగు చూసిన వెంటనే ప్రభుత్వం రంగంలోకి విచారణకు ఆదేశాలిచ్చింది. అందులో ప్రమేయం ఉన్న వ్యక్తులను సస్పెండ్ చేశారు. క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అప్పుట్లో ఓ జిల్లా స్థాయి అధికారిపై సైతం చర్యలు తీసుకున్నారు. నేడు నోరు మెదపడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్ర పౌరసఫరాల శాఖ మంత్రి మనోహర్, కలెక్టర్ జోక్యం చేసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
విద్యార్థులే కూలీలుగా..
సోమశిల: మండల కేంద్రమైన అనంతసాగరంలోని టీజేఎన్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు హమాలీలుగా మారిన వైనం మంగళవారం వెలుగులోకి వచ్చింది. స్కూల్లో ఎన్నో ఏళ్లుగా ఉన్న బల్లలు మరమ్మతులకు గురయ్యాయి. వాటిని షెడ్ వద్ద మరమ్మతులు చేయించేందుకు సంబంధిత యాజమాన్యం ఆటోని పిలిపించింది. విద్యార్థులను కూలీలుగా మార్చి ప్రధాన రహదారిపై ఉన్న ఆటో వద్దకు బల్లల్ని మోయించారు. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. కాగా గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెల నుంచి పేద పిల్లలను చదివించేందుకు మండల కేంద్రంలో ఉన్న పాఠశాలలో చేర్పిస్తే పనులు చేయించడం తగదని చెబుతున్నారు. యువకుడి ఆత్మహత్య కేసులో పలువురి అరెస్ట్నెల్లూరు(క్రైమ్): యువకుడి ఆత్మహత్య కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు నవాబుపేట పోలీస్స్టేషన్లో మంగళవారం నగర ఇన్చార్జి డీఎస్పీ ఎం.గిరిధర్ కేసు పూర్వాపరాలను వెల్లడించారు. వెంకటేశ్వరపురం ప్రాంతంలో రోహిత్ (17) నివాసముంటున్నాడు. ప్రేమ వ్యవహారం నేపథ్యంలో యువకుడిపై ఈనెల 4వ తేదీన అదే ప్రాంతానికి చెందిన కరిముల్లా, ఉమేరా, ఆసీఫ్, మహబూబ్బాషాతోపాటు మరో ఇద్దరు బాలలు దాడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత తండ్రి వెంకయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్చార్జి డీఎస్పీ ఎం.గిరిధర్ కేసు దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆత్మహత్యకు కారకులైన నలుగురిని అరెస్ట్ చేశారు. ఇద్దరు బాలలను అదుపులోకి తీసుకుని జువనైల్ హోమ్కు తరలించారు. కుటుంబ కలహాలతో వ్యక్తి బలవన్మరణంనెల్లూరు సిటీ: కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన రూరల్ మండలంలోని కోడూరుపాడు గ్రామం ఎస్టీ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కాలనీలో నివాసం ఉండే పొట్లపూడి చెంచయ్య (21) కూలీ పనులు చేస్తుంటాడు. అతను భార్య అఫ్రిన్తో తరచూ గొడవ పడేవాడు. ఈనెల 23వ తేదీన ఉదయం భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చెంచయ్య ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. భార్య కొంతసేపటి తర్వాత గమనించి స్థానికుల సాయంతో వెంటనే 108 అంబులెన్స్లో ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ చెంచయ్య మంగళవారం మృతిచెందాడు. మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబానికి అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో గొలుసు దొంగలువింజమూరు(ఉదయగిరి): ఈనెల 21న వింజమూరు మండలం చాకలికొండలో పట్టపగలు వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును అపహరించిన కేసులో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. దొంగతనం చేసి బైక్లో వింజమూరు వైపు పారిపోతున్న దృశ్యాలు పలుచోట్ల సీపీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరికి గతంలో వేరే చోరీ, ఇతర కేసుల్లో ప్రమేయం ఉందా? అనే కోణంలో విచారిస్తున్నట్లు సమాచారం. గొలుసును వింజమూరులోని ఓ కుదువ వ్యాపార సంస్థలో పెట్టి నగదు తీసుకున్నట్లు చెబుతున్నారు. ● ఇటీవల వింజమూరు స్టేట్ బ్యాంక్ పక్కన ఓ ఇంట్లో 14 సవర్ల బంగారం దోచుకున్నారు. ఎమ్మాస్సార్ డిగ్రీ కాలేజీ సమీపంలో ఓ సైనికుడి ఇంట్లో దొంగతనం జరిగింది. ఉదయగిరి బీసీ కాలనీలో 37 సవర్ల బంగారం ఎత్తుకెళ్లారు. ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నారు. నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.18 సన్నవి : రూ.8 పండ్లు : రూ.5 -
అడిగేదెవరు.. ఆపేదెవరు
భూమి విలువ సుమారు రూ.కోటి పైనే.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏకంగా రాజుల కాలం నాటి కోటమిట్టనే ఆక్రమించి పొలాలుగా చేస్తున్నారు. గ్రామంలోని నట్టనడుమ ఆత్మకూరు – చేజర్ల రహదారి పక్కనే రూ.కోటి పైనే విలువైన సుమారు 5.5 ఎకరాలకుపైగా స్థలాన్ని ఆక్రమించి చదును చేస్తున్నారు.ఆత్మకూరు: పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న బట్టేపాడు గ్రామ నడిబొడ్డున దివ్యమాంబ (దియ్యమ్మ) దేవాలయం ఎదురుగా కోటమిట్ట ప్రాంతం ఉంది. స్థానిక ఎంపీటీసీ సమీప బంధువులు ఆ స్థలంలో మట్టిని తరలించి జేసీబీలతో చదును చేసి పొలంగా మారుస్తున్నారు. వాస్తవానికి సర్వే నంబర్ 898, 899లో కోటమిట్ట ఉంది. రాజుల కాలంలో భటులకు ఇచ్చిన గ్రామంగా భటులవాడ అని పిలిచేవారు. ఇది కాలక్రమేణా బట్టేపాడుగా మారింది. కాగా భటుల కోసం మట్టితో కోటను నిర్మించారు. ఇది పెన్నానదికి సమీపంలో మిట్టపై ఉంటుంది. దీనిని నేడు కోటమిట్టగా పిలుస్తున్నారు. ఆక్రమించి.. అప్పటి స్థలాలు, కోటలను పురావస్తు శాఖ స్వాధీ నం చేసుకోవడం పరిపాటి. గతంలోనే ఆ శాఖ వారికి రెవెన్యూ అధికారులు తెలిపినా పట్టించుకోలేదని చెబుతున్నారు. కోటమిట్ట ప్రాంతాన్ని గ్రామానికి చెందిన కొందరు ఆక్రమించి రెవెన్యూ అధికారుల సాయంతో 2012లో తమ పేర్లు నమోదు చేయించున్నట్లు సమాచారం. దీనికి ఆనుకుని ఉన్న దొరువుగా పిలిచే ప్రాంతం రికార్డుల మేరకు సర్వే నంబర్ 900లో 3.63 ఎకరాలు విస్తీర్ణంలో ఉండాలి. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే దొరువును నలువైపులా ఆక్రమించడంతో చిన్నపాటి గుంతగా మారిపోయింది. అప్పట్లో గ్రామ అవసరాలతోపాటు పశువులకు తాగునీటికి ఈ దొరువే ఆధారంగా ఉండేది. ఇంతటి విలువైన కోటమిట్ట, దొరువు ప్రాంతాలు ఆక్రమణకు గురైతే పరిశీలించాల్సిన రెవెన్యూ, పురావస్తు శాఖ అధికారులు అటువైపు చూడటం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన వీఆర్వో సహకారంతోనే ఆక్రమణల పర్వం చేశారని ఆరోపిస్తున్నారు. దీనికితోడు కోటమిట్టకు సమీపంలోనే ఉన్న మరో మిట్ట ప్రాంతాన్ని ఆక్రమించారు. అక్కడి మట్టిని ఆక్రమిత పొలాలకు తరలిస్తున్నారు. దర్జాగా కోటమిట్ట ప్రాంతం ఆక్రమణ టీడీపీ నాయకుల నిర్వాకం ట్రాన్స్ఫార్మర్లకు అనుమతులు ఒకచోట, ఏర్పాటు మరోచోట పట్టించుకోని పలు ప్రభుత్వ శాఖలు పరిశీలిస్తాం రైతుల విషయంలో చూసీచూడనట్లు పోవాలి. అయినా ఈ విషయాన్ని పరిశీలిస్తాం. – నాయక్, విద్యుత్ శాఖ ఆత్మకూరు డివిజన్ ఏడీఈ -
రైతులు ఇబ్బందులు పడుతున్నారు
● స్థాయీ సంఘాల సమావేశంలో లేవనెత్తిన జెడ్పీటీసీ సభ్యులు ● రోడ్లకు మరమ్మతులు చేయించాలి ● జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ఆదేశంనెల్లూరు(పొగతోట): ‘రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లభించడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదు. దీంతో నష్టపోతున్నారు’ అని పలువురు జెడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నెల్లూరులోని జెడ్పీ కార్యాలయంలో స్థాయీ సంఘాల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ భవన నిర్మాణ పనుల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మంజూరు చేసిన పనులను పూర్తి చేయడంలో జాప్యం జరుగుతోందని అసహనం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని వాటికి మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. సమస్యలు చెప్పి.. రోడ్లు దెబ్బతిన్నాయని ప్రతి సమావేశంలో చర్చిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మర్రిపాడు జెడ్పీటీసీ సభ్యుడు మల్లు సుధాకర్రెడ్డి ప్రశ్నించారు. వివిధ సమస్యలపై సభ్యులు వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నించారు. సజ్జ, జొన్న పంటలు సాగు చేయించారని, వాటిని కొనుగోలు చేసే పరిస్థితి లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అన్నదాతలు నష్టపోకుండా పంటలకు మద్దతు ధరలు కల్పించాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో వెటర్నరీ డాక్టర్లను నియమించాలన్నారు. సచివాలయాల్లో సిబ్బంది అందుబాటులో ఉండటం లేదని, ప్రజలు అవస్థలు పడుతున్నారని సభ్యులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మండలాల్లో పర్యవేక్షణకు డిప్యూటీ ఎంపీడీఓలను నియమించారని అధికారులు వెల్లడించారు. ప్రతి సమావేశంలో పాత నివేదికలనే ప్రస్తావిస్తున్నారని, అభివృద్ధి పనులు జరగడం లేదా అని కలువాయి జెడ్పీటీసీ అనిల్కుమార్రెడ్డి ప్రశ్నించారు. రెండు నెలలకు పెద్దగా మార్పులుండవని పీఆర్ అధికారులు సమాధానమిచ్చారు. అనంతరం విద్య, వైద్యారోగ్య శాఖ, ఐసీడీఎస్ తదితర శాఖలతో సమీక్షించారు. సమావేశాల్లో జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి, డిప్యూటీ సీఈఓ మోహన్రావు పాల్గొన్నారు. -
ఇదెలా సాధ్యమైందో..
ఆక్రమిత కోటమిట్ట ప్రాంతాన్ని పొలంగా తయారు చేసే క్రమంలో సాగునీటి కోసం మండలంలోని అప్పారావుపాళెం పెన్నానది ఒడ్డున ఫారెస్ట్ అధికారుల ఆధీనంలో ఉన్న ప్లాంటేషన్ స్థలంలో బోర్లు వేసి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. బోర్ల నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఆర్అండ్బీ ఆధీనంలోని రోడ్డు పక్కనే పైపులైన్ ఏర్పాటు చేశారు. ఆక్రమిత స్థలాన్ని పొలాలుగా మార్చకముందే పక్కాగా పైపులైన్లు, సాగునీటి వసతి ఏర్పాటు చేశారంటే ఏ స్థాయిలో ఈ తంతు జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కాగా బోర్లకు విద్యుత్ అనుమతులు బట్టేపాడు గ్రామంలో తీసుకుని అప్పారావుపాళెం పెన్నానది ఒడ్డున ఏర్పాటు చేయడం విశేషం. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వీటికి అనుమతి ఎలా ఇచ్చారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. -
మరణంలోనూ వీడని అనుబంధం
● రోజు వ్యవధిలో మృతిచెందిన దంపతులు ● గ్రామంలో విషాదంఆత్మకూరు: వారి వివాహమై దశాబ్దాలు గడిచాయి. ఎంతో అన్యోన్యంగా జీవించారు. మరణం వారి బంధాన్ని విడదీయలేదు. రోజు వ్యవధిలో భార్యాభర్త తనువు చాలించారు. స్థానికుల కథనం మేరకు.. ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల మండలం నడిగడ్డ అగ్రహారం గ్రామానికి చెందిన నరాల వెంగయ్య (95), వెంకటమ్మ (90) దంపతులకు ముగ్గురు సంతానం. 70 ఏళ్ల క్రితం వివాహంతో ఒక్కటైన వారిద్దరూ ఒకరికొకరు తోడుగా ఎంతో అన్యోన్యంగా జీవించారు. గ్రామంలో పలువురికి సహాయంగా ఉంటూ వ్యవసాయ పనులు చేసుకునేవారు. కొద్దిరోజుల క్రితం వెంగయ్య అనారోగ్యానికి గురయ్యాడు. వెంకటమ్మ పలుమార్లు చేజర్లలోని ఆస్పత్రికి భర్తను తీసుకెళ్లి చూపించుకొని వచ్చేది. ఆదివారం అర్ధరాత్రి ఆయన మృతిచెందాడు. అంత్యక్రియలు సోమ వారం సాయంత్రం నిర్వహించారు. దశాబ్దాలకుపైగా తోడుగా ఉన్న భర్త మృతిచెందడంతో వెంకటమ్మ తీరని బాధతో మంగళవారం తెల్లవారుజామున చనిపోయినట్లు బంధువులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. -
హాకీ పోటీల్లో విజేతగా నెల్లూరు
నక్కపల్లి: రాష్ట్ర స్థాయి హాకీ పోటీల్లో (అండర్– 19) బాలుర విభాగంలో నెల్లూరు, బాలికల విభాగంలో తూర్పు గోదావరి జిల్లా జట్లు విజేతలుగా నిలిచాయి. ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నక్కపల్లిలో మూడురోజులపాటు జరిగిన ఈ పోటీలు సోమవారం ముగిశాయి. రాష్ట్రంలో అన్ని ఉమ్మడి జిల్లాల నుంచి హాకీ క్రీడాకారులు విచ్చేశారు. బాలుర విభాగంలో హోరాహోరీగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో తూర్పుగోదావరి జిల్లా జట్టుపై నెల్లూరు జట్టు విజయం సాధించి విజేతగా నిలిచింది. మరో పోటీలో వైఎస్సార్ కడపపై విశాఖ జిల్లా జట్టు గెలుపొంది తృతీయ స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో విశాఖపట్నంపై తూర్పుగోదావరి జట్టు విజయం సాధించింది. మరో పోటీలో చిత్తూరుపై గెలిచి అనంతపురం జిల్లా జట్టు తృతీయ స్థానంలో వచ్చింది. ముగింపు కార్యక్రమానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీలు వీసం నానాజీ, వెలగా ఈశ్వరరావు, ఏపీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి పుష్పలత, బీఎస్ హాకీ క్లబ్ ఫౌండర్ సూరిబాబు, కార్యదర్శి తాతాజీ, స్థానిక నాయకులు మేడేటి శంకర్, వీసం రాజు, నానాజీ, చిన అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. -
ఇబ్బంది పడుతున్నాం.. ఆదుకోండి
● ఎస్పీని కోరిన వృద్ధులు ● పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● 113 వినతుల అందజేత నెల్లూరు(క్రైమ్): ‘నా వయస్సు 85 సంవత్సరాలు. నా పేరుపై ఉన్న పొలాన్ని తమ పేరుపై రాసివ్వాలని కొడుకు, కోడలు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. విచారించి చర్యలు తీసుకోవాలి’ అని ఇందుకూరుపేటకు చెందిన ఓ వృద్ధుడు కోరాడు. ‘నా వయస్సు 80 సంవత్సరాలు. నా పొలాన్ని, ఇంటిని రెండో కుమారుడు బలవంతంగా తీసుకుని ఇంట్లోంచి గెంటేశాడు. జీవనం కష్టతరంగా మారింది’ అని దగదర్తికి చెందిన ఓ వృద్ధురాలు వినతిపత్రం అందజేశారు. సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 113 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజితకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె ఆయా ప్రాంత పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, రూరల్, ఎస్బీ డీఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, ఎ.శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, పీసీఆర్, ఎస్బీ ఇన్స్పెక్టర్లు భక్తవత్సలరెడ్డి, బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● హైదరాబాద్కు చెందిన హరికృష్ణ, అనంతసాగరానికి చెందిన ఓ వ్యక్తి వర్క్ ఫ్రం హోం ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.12 లక్షలు తీసుకుని మోసగించాడు. నగదు అడిగితే ఇబ్బందులు గురిచేస్తున్నాడని వింజమూరుకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ● వింజమూరు గ్రామానికి చెందిన హజరతయ్య పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. నా వద్దనున్న బంగారం, వెండి, రూ.6 లక్షల నగదు తీసుకుని పెళ్లిచేసుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని విజయవాడకు చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు. ● విభేదాలతో నేను భర్త నుంచి దూరంగా పుట్టింట్లో ఉంటున్నాను. నా వదిన వేరే ఫోన్ల నుంచి అసభ్యకరంగా మెసేజ్లు, అశ్లీల చిత్రాలు పెడుతూ మానసికంగా ఇబ్బందులు పెడుతోంది. విచారించి చర్యలు తీసుకోవాలని బాలాజీనగర్కు చెందిన ఓ మహిళ కోరారు. ● నా కుమార్తె ఓ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. ఈనెల 16న స్కూల్కు వెళ్లి తిరిగిరాలేదు. కందుకూరు రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాను. ఆమె ఆచూకీ కనుక్కోవాలని కందుకూరు రూరల్ ప్రాంతానికి చెందిన ఓ తల్లి వినతిపత్రమిచ్చారు. ● భర్త, అత్తమామలు అదనపుకట్నం కోసం వేధిస్తున్నారు. ఇంట్లోంచి గెంటేశారు. ఎనిమిది నెలలుగా పుట్టింట్లో ఉంటున్నాను. విచారించి కాపురాన్ని చక్కదిద్దాలని బిట్రగుంటకు చెందిన ఓ వివాహిత విజ్ఞప్తి చేశారు. ● మాది ప్రేమ వివాహం. భర్త మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడు. కౌన్సెలింగ్ చేసి కాపురాన్ని చక్కదిద్దాలని ముత్తుకూరుకు చెందిన ఓ మహిళ కోరారు. -
బైక్ మెకానిక్.. దొంగగా మారి
● మద్యానికి బానిసై చోరీలు ● 8 ద్విచక్ర వాహనాల స్వాధీనం నెల్లూరు(క్రైమ్): బైక్ మెకానిక్ మద్యానికి బానిసయ్యాడు. వ్యసనం తీర్చుచుకునేందుకు సంపాదన చాలకపోవడంతో దొంగగా మారాడు. రోడ్లపై పార్క్ చేసిన బైక్లను చోరీ చేసి పోలీసుల కళ్లుగప్పి తిరగసాగాడు. అతని కదలికలపై నిఘా ఉంచిన నెల్లూరు బాలాజీ నగర్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. బాలాజీ నగర్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ కె.సాంబశివరావు వివరాలను వెల్లడించారు. కోవూరు మండలం ఇనుమడుగు గ్రామం మిక్స్డ్ కాలనీకి చెందిన గూడూరు చిరంజీవి బైక్ మెకానిక్. ఈనెల 8వ తేదీన పూలేబొమ్మ వద్ద మైపాడుగేటుకు చెందిన రవి బైక్ను అపహరించాడు. రవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో ఎస్సై విజయ్ శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి సాంకేతికత ఆధారంగా నిందితుడిని చిరంజీవిగా గుర్తించారు. సోమవారం ఇనుమడుగు వద్ద అదుపులోకి తీసుకుని విచారించారు. బాలాజీ నగర్ స్టేషన్ పరిధిలో నాలుగు బైక్లు, నవాబుపేట పరిధిలో 2, చిన్నబజారు, కోవూరు పోలీసుస్టేషన్ల పరిధిలో చెరో ఒక బైక్ను చోరీ చేసినట్లు నిందితుడు అంగీకరించడంతో అరెస్ట్ చేశారు. చోరీ సొత్తును స్వాధీ నం చేసుకున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. బైక్ దొంగను అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన ఇన్స్పెక్టర్, ఎస్సై, సిబ్బంది కేవీ సుధాకర్, రమేష్, వెంకటరావు, జయరామయ్య, శివకుమార్, కానిస్టేబుళ్లు శ్రీహరి, తిరుపతి, సాయికిశోర్ను ఉన్నతాధికారులు అభినందించారు. -
అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల అరెస్ట్
● రూ 21.90 లక్షల రికవరీ నెల్లూరు(క్రైమ్): అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసి నగదు రికవరీతోపాటు ఖాతాలోని నగదును పోలీస్ అధికారులు ఫ్రీజ్ చేశారు. సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అజిత అధికారులను అభినందించి ప్రశంసాపత్రాలను అందజేశారు. వివరాలిలా ఉన్నాయి. కావలి పట్టణంలోని ఓ వ్యక్తికి ఆర్టీఓ చలానా పేరుతో ఏపీకే ఫైల్ పంపించి అతని ఖాతాలోని సుమారు రూ.24 లక్షలను సైబర్ నేరగాళ్లు దోచుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కావలి ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. సాంకేతికత ఆధారంగా నిందితులను జార్ఖండ్ రాష్ట్రం జమ్మారా జిల్లాకు చెందిన వివేక్కుమార్ మండల్, రాకేష్కుమార్ మండల్, సంజయ్ మండల్గా గుర్తించారు. ప్రత్యేక బృందం ఈనెల 14వ తేదీన ఆ రాష్ట్రంలో నిందితులను అరెస్ట్ చేసి అక్కడి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్పై కావలికి తీసుకొచ్చారు. 18వ తేదీన కావలి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించింది. పోలీసులు కావలి సబ్ జైలులో ఉన్న నిందితులను కోర్టు అనుమతితో ఈనెల 20వ తేదీన కస్టడీకి తీసుకున్నారు. విచారించి రూ.21.90 లక్షల నగదు, సెల్ఫోన్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా బ్యాంక్ ఖాతాల్లోని రూ.1,23,855లను ఫ్రీజ్ చేశామని ఎస్పీ తెలిపారు. సోమవారం కస్టడీ ముగియడంతో కోర్టులో నిందితులను హాజరుపరిచి జైలుకు తరలించారు. కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన కావలి ఒకటో పట్టణ ఇన్స్పెక్టర్ ఎండీ ఫిరోజ్, సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎ.వెంకటేశ్వర్లు, కావలి ఎస్సై ఎస్.సుమన్, సిబ్బంది పి.శ్రీనివాసులురెడ్డి, రవీంద్ర, కావలి సిబ్బంది వి.మధుసూదన్, శ్రీరామ్, శ్రీహరి, శివకుమార్ను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
రైతులను నిలువునా దగా చేసి ఇప్పుడు మీకోసం
● టీడీపీ కార్యకర్తలకే రైతుల వేషం ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తోటపల్లిగూడూరు: చంద్రబాబు రైతులను సంక్షేమ పథకాలను ఎగ్గొట్టి, పంటలకు గిట్టుబాటు ధరలు పక్కన పెట్టి కనీసం పెట్టుబడులు దక్కకుండా ధరలు పతనమవుతుంటే మౌనంగా ఉంటూ నిలువునా ముంచేశారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. ఇంకా ఏ ముఖం పెట్టుకుని రైతన్న–మీ కోసం కార్యక్రమం నిర్వహిస్తున్నారో చెప్పాలని, ఇది మరో మోసమన్నారు. మండలంలోని ఈదూరు, మాచర్లవారిపాళెం, వెంకటాచలంలో సోమవారం కాకాణి పర్యటించారు. కాకాణి మాట్లాడుతూ రైతులను అన్ని విధాలా ముంచిన కూటమి ప్రభుత్వం రైతన్న–మీ కోసం అనే సినిమా టైటిల్ పేరుతో మరో ప్రచార ఆర్భాటానికి పూనుకొందన్నారు. రాష్ట్రంలోని రైతులు ఓ వైపు సరిపడా యూరియా అందక మరో వైపు నకిలీ విత్తనాల బెడదతో సతమతమవుతున్నారన్నారు. గడిచిన రెండేళ్లలో చంద్రబాబు రైతులకు రూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా రూ.10 వేలు ఇచ్చి రూ.30 వేలు ఎగ్గొట్టాడన్నారు. ఉచిత పంటల బీమాకు మంగళం పాడి రైతులకు తీరని ద్రోహం చేశాడన్నారు. ధరల స్థిరీకరణ నిధి లేక రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. నాణ్యమైన విత్తనాలు దొరక్క, కట్ట యూరియా కోసం రైతన్నలు అగచాట్లు వర్ణణాతీతమన్నారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతును చేయిపట్టి నడిపించిన ఆర్బీకే వ్యవస్థను నిర్వీర్యం చేశాడన్నారు. ఐదేళ్ల జగనన్న పాలనలో రైతులు సుభిక్షంగా, సంతోషంగా ఉన్న విషయం అందరికి గుర్తే ఉంటుందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు అన్నదాతల ప్రతి అడుగులో జగనన్న సహకారం మర్చిపోలేనిదన్నారు. రైతన్నల శ్రేయస్సు కోసం జగనన్న అమలు చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలు వారి జీవితాలను మార్చేసిందన్నారు. జగనన్న నాయకత్వంలో ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రైతులకు అండగా ఎల్లవేళలా వైఎస్సార్సీపీ అండగా నిలుస్తోందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గి రైతులు అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమాల్లో అసలైన రైతులు ముఖం చాటేయడంతో టీడీపీ నాయకులే రైతుల వేషాల్లో కనబడడం రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమన్నారు. చంద్రబాబు ఇకనైనా డ్రామాలు ఆపి వ్యవసాయాభివృద్ధికి, రైతు సంక్షేమానికి కృషి చేయాలని కాకాణి హితవు పలికారు. -
యథేచ్ఛగా గ్రావెల్ తరలింపు
● జగనన్న లేఅవుట్లో బేస్మెంట్ల మధ్య తోలింది అపహరణ ● విద్యుత్ స్తంభాల చుట్టూ ఉన్నది కూడా.. ● పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్న ఏఈ పొదలకూరు: కొండలు, గుట్టలను కరిగించి గ్రావెల్, మట్టిని తరలిస్తున్న అక్రమార్కుల కన్ను ఇప్పుడు గత ప్రభుత్వంలో నిర్మించిన జగనన్న లేఅవుట్పై పడింది. లేఅవుట్ను చదును చేసేందుకు తోలిన గ్రావెల్ను రాత్రి వేళల్లో తరలించి అమ్ముకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వందల ట్రిప్పులు తరలినట్లు హౌసింగ్ అధికారులు గుర్తించారు. పొదలకూరు పట్టణానికి సమీపంలో చిట్టేపల్లి తిప్ప వద్ద 1,400 ప్లాట్లతో అతిపెద్ద లేఅవుట్ను నిర్మించారు. ఇందుకోసం కొండ కింద చదును చేసేందుకు గ్రావెల్ను పెద్ద ఎత్తున తోలారు. ప్రస్తుతం లేఅవుట్పై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. కాగా ఇందులో 400 పక్కా ఇళ్లను కూడా నిర్మించారు. వివిధ దశల్లో ఉండగా కొన్ని శ్లాబులు కూడా వేశారు. ఇళ్ల బేస్మెంట్ను నింపేందుకు గ్రావెల్ను తోలారు. లేఅవుట్ కొండకు సమీపంలో చాలాకాలంగా గ్రావెల్ను కొల్లకొడుతున్నారు. ఇప్పుడు శ్రమ లేకుండా లేఅవుట్ గ్రావెల్నే అపహరించుకెళ్తున్నారు. రాత్రి వేళల్లోనే తరలింపు పగటి పూట తరలిస్తే గుర్తిస్తారని గ్రావెల్ను రాత్రి వేళల్లో పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. దీంతో గోతులు ఏర్పడినట్టు అధికారులు గుర్తించారు. లేఅవుట్లో విద్యుత్ సౌకర్యం కోసం స్తంభాలు నాటి తీగలను కూడా ఏర్పాటు చేశారు. అక్రమార్కులు స్తంభాల చుట్టూ ఉన్న గ్రావెల్ను కూడా వదిలి పెట్టకుండా తరలిస్తున్నారు. హౌసింగ్ అధికారులు ఒకటి, రెండు పర్యాయాలు మీడియా ముఖంగా హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. చుట్టుపక్కల నివాసాలున్న కాలనీవారు సైతం అధికారుల దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్తున్నారు. విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందంటున్నారు. రాత్రి వేళల్లో నిఘా ఏర్పాటు చేస్తే ఎవరు తరలిస్తున్నారో గుర్తించవచ్చని చెబుతున్నారు.పోలీసులకు ఫిర్యాదు చేస్తాం లేఅవుట్లో గ్రావెల్ అపహరించుకుని వెళ్తున్న మాట వాస్తమే. ఎవరు తరలిస్తున్నారో గుర్తించలేకపోతున్నాం. ఇటీవల తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన ఆదేశాల మేరకు పోలీసులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరుగుతుంది. రాత్రివేళ నిఘా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాం. – మహేష్, హౌసింగ్ ఏఈ, పొదలకూరు -
డయల్ యువర్ సీఎండీకి 9 ఫిర్యాదులు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నుంచి తొమ్మిది మంది తమ సమస్యలను చెప్పారు. విద్యుత్ లైన్ల మార్పు, లో ఓల్టేజీ సమస్య, ట్రాన్స్ఫార్మర్ల చోరీ జరిగిన స్థానంలో కొత్తవి ఏర్పాటు, వ్యవసాయ సర్వీసుల మంజూరు, ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు తదితర అంశాలపై ఫిర్యాదు చేశారు. వాటిని పరిష్కరించాలని అధికారులను సీఎండీ ఆదేశించారు. బాధ్యతలు స్వీకరించిన డీపీఓ నెల్లూరు(పొగతోట): జిల్లా పంచాయతీ అధికారిగా డి వసుమతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు డీడీఓగా విధులు నిర్వహిస్తున్న వసుమతికి డీపీఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. జీజీహెచ్లో అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్స● కేన్సర్ నుంచి కాపాడిన డాక్టర్లు నెల్లూరు(అర్బన్): ఓ మహిళకు అరుదైన ఆపరేషన్ చేసి కేన్సర్ నుంచి కాపాడిన ఘటన పెద్దాస్పత్రిలో చోటుచేసుకుంది. వివరాలను సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి సోమవారం వెల్లడించారు. నెల్లూరుకు చెందిన ఇ.వేళాంగిణి వారం క్రితం వైద్యం కోసం వచ్చింది. ఈఎన్టీ విభాగానికి చెందిన హెచ్ఓడీ డాక్టర్ సంపత్కుమార్ ఆధ్వర్యంలో ఆమెకు సీటీ స్కాన్ చేసి ఎడమ ముక్కు లోపలి పైభాగంలోని సైనస్ ప్రాంతంలో గడ్డ ఉన్నట్టు తేలింది. చిన్న ముక్కను బయాప్సీకి పంపగా అడినోకార్సినోమా అనే కేన్సర్ గడ్డ స్టేజ్ 3లో ఉన్నట్టు గుర్తించారు. ఇది సైనస్లో కనిపించే అరుదైన ట్యూమర్. సంపత్కుమార్ ఆధ్వర్యంలో ఈఎన్టీ డాక్టర్ సుకుమార్ తదితరులతోపాటు అనస్థీషియా డాక్టర్ల టీమ్ కలిసి ఆ మహిళకు విజయవంతంగా ఆపరేషన్ చేసి ట్యూమర్ను తొలగించారు. కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు. ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ల బృందాన్ని మాధవి అభినందించారు. అడిగేదెవరు!● కార్యాలయంలో ఎలక్ట్రిక్ స్కూటీలకు చార్జింగ్దగదర్తి: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో కొందరు సిబ్బంది ఎలక్ట్రిక్ స్కూటీలకు ఉచితంగా చార్జింగ్ పెట్టుకుంటున్నారు. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు విధులు నిర్వహించే గదిలో సోమవారం స్కూటీలకు చార్జింగ్ పెట్టడం సాక్షి కెమెరాకు చిక్కింది. సిబ్బంది వెంటనే తలుపు మూసివేసి వెళ్లిపోయారు. ప్రభుత్వ కార్యాలయాలను సొంతానికి వినియోగించుకోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెదిరించిన కేసులో ముగ్గురిపై చర్యలునెల్లూరు సిటీ: ఓ వ్యక్తిని బెదిరించిన కేసులో ముగ్గురు వ్యక్తులపై నెల్లూరు రూరల్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. సోమవారం వివరాలు వెల్లడించారు. బాలాజీ నగర్లో మహేష్బాబు అనే వ్యక్తి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నడుపుతున్నాడు. ఈ క్రమంలో కొడవలూరుకు చెందిన వికే ష్కు మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.2 లక్షలు తీసుకున్నాడు. అలాగే మహేష్కు తెలియకుండా నాగరాజు అనే వ్యక్తి వికేష్ నుంచి రూ.లక్ష తీసుకున్నాడు. అయితే ఉద్యోగం ఇప్పించకపోవడంతో డబ్బులు తిరిగివ్వాలని మహేష్ను వికేష్ అడిగాడు. ఇవ్వకపోవడంతో బాలాజీ నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా రూ.2 లక్షలు తిరిగిచ్చాడు. కాగా నాగరాజు మాత్రం నగదు ఇవ్వలేదు. దీంతో వికేష్ అతని అడ్రస్ చెప్పాలని మహేష్ను అడిగితే స్పందించలేదు. ఈనెల 21వ తేదీన మహేష్ను వికేష్ తన స్నేహితులు వంశీ, మోహన్తో కలిసి అడ్డగించి ఆటోలో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. నాగరాజు అడ్రస్ చెప్పాలని లేకపోతే చంపేస్తామని బెదిరించారు. దీంతో మహేష్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేశారు. విచారించిన పోలీసులు వికేష్తోపాటు ఇద్దరు స్నేహితుల్ని అదుపులోకి తీసుకున్నారు. మరోసారి నేరం చేయకుండా తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. -
జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపిక
ఉలవపాడు: జాతీయ స్థాయి యోగా పోటీలకు రామాయపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయుడు కేదారి కొండలరావు ఎంపికయ్యారు. ఈనెల 22న విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సివిల్ సర్వీసెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ క్రీడా పోటీల్లో ప్రతిభ చూపడంతో ఎంపిక చేశారు. వచ్చే ఏడాది జనవరిలో చండీగఢ్లో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో వ్యక్తిగత విభాగంలో పాల్గొంటానని సోమవారం ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న వారికి కనీస సౌకర్యాలు కల్పించలేదని కొండలరావు ఆవేదన వ్యక్తం చేశారు. సెలవు ఇవ్వడం మినహా రవాణా, భోజనం, వసతి ఖర్చులకు పైసా ఇవ్వలేదన్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్రలో తమ పాత్ర అందరికీ తెలుసు కానీ ఆ శ్రమకు కనీస గుర్తింపు, విలువ లేదన్నారు. 55 ఏళ్ల వయసులో శరీరాన్ని నియంత్రించుకుని యోగాలో పతకాలు సాధిస్తున్న తమకు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. -
వినతులిచ్చి.. పరిష్కారం కోరి
● జేసీ మొగిలి వెంకటేశ్వర్లు నెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. దీనికి సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేశారు. వినతులిచ్చి పరిష్కరించాలని కోరారు. డీఆర్వో విజయకుమార్, జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి, డీఆర్ డీఏ పీడీ నాగరాజకుమారి, డ్వామా పీడీ గంగా భవాని, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు రఘురామరాజు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. విచారణ జరపాలని వినతి మర్రిపాడు మండలం జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థిని బలవన్మరణంపై, అదే విధంగా ఆత్మహత్యలపై సమగ్ర విచారణ జరపాలంటూ ఆంధ్రప్రదేశ్ తల్లిదండ్రుల సంఘం నాయకులు జేసీకి వినతిపత్రం సమర్పించారు. విద్యాలయంలో నెలకొన్న భయానక వాతావరణాన్ని తొలగించేందుకు కలెక్టర్ చైర్మన్ హోదాలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘానికి చెందిన ఉడతా రాజశేఖర్ యాదవ్, దాసరి కమలాకర్, ఆదిత్యసాయి, పి.లీలామోహన్, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు. వినతులిలా.. ● కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానమైన బీసీల కుల వర్గీకరణ చట్టబద్ధంగా జరపాలని జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీహరి రావు వినతిపత్రం అందజేశారు. ● పొదలకూరులో ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని రామ్నగర్ వాసులు అర్జీ ఇచ్చారు. ● నెల్లూరులోని తడికలబజార్ సమీపంలో రైస్మిల్లు కారణంగా విడుదలవుతున్న పొట్టుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తగిన చర్యలు చేపట్టాలని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ వినతిపత్రం ఇచ్చారు.పింఛన్ కోసం.. పింఛన్ కోసం షేక్ మౌలాలీ అనే వ్యక్తి అధికారులకు వినతిపత్రమిచ్చాడు. ఈయనకు రెండు చేతులకు వేళ్లు లేవు, నడవలేడు. రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలని కోరాడు. సదరం క్యాంపులో ఆధార్ నమోదులో వేళ్లు లేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై అమరావతిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను కలిసినట్లు చెప్పారు. తనకు ఇద్దరు కుమారులున్నారని, కుటుంబ పోషణ కోసం కష్టంగా ఉందన్నారు. -
చంద్రబాబు అన్ని వర్గాల వ్యతిరేకి
● ప్రభుత్వం నడపడం లేదు.. వ్యాపారం చేస్తున్నాడు ● చుట్టూ ఉన్నవారంతా బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లే ● పార్టీకి మూల స్తంభాలు నాయకులు, కార్యకర్తలే ● వచ్చేది జగనన్న ప్రభుత్వమే ● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కొడవలూరు: సీఎం చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల వ్యతిరేకి అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి విమర్శించారు. ఆయన ప్రభుత్వాన్ని నడపడం లేదని, ప్రభుత్వంతో వ్యాపారం చేస్తున్నాడని దుయ్యబట్టారు. ఆయన చుట్టూ ఉన్న వారంతా బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పెట్టే పెట్టుబడులన్నీ నారా కుటుంబానికి లాభం చేకూరేలా పాలన సాగుతోందన్నారు. మండలంలోని తాటాకులదిన్నెలో సోమవారం సర్పంచ్ మారంరెడ్డి రంగారెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు పేద ప్రజల అభ్యన్నతి కంటే నారా సామ్రాజ్యం విస్తరణ కోసమే నిర్ణయాలు తీసుకొంటారని ఆరోపించారు. ఇన్నేళ్లు సీఎంగా ఉండి ఏనాడు పేదల భవిష్యత్కు ఒక్క ప్రయోజనాన్ని కల్పించారా? అని నిలదీశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ఏమాత్రం పునరాలోచన చేయడం లేదన్నారు. రాష్ట్రంలోని 17 కళాశాలలను ప్రైవేట్ పరాన్ని వ్యతిరేకిస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఎక్కడ కార్యక్రమం నిర్వహించినా ప్రజలు పార్టీలకతీతంగా తండోపతండాలుగా తరలి వచ్చి నిరసన తెలుపుతున్నారని తెలిపారు. వలంటీర్ల వ్యవస్థతోనే పార్టీకి నష్టం వలంటీర్ల వ్యవస్థ వల్లే పార్టీ తీవ్రంగా నష్టపోయిందని ప్రసన్నకుమార్రెడ్డి అభిప్రాయపడ్డారు. 50 శాతం వలంటీర్లు గత ఎన్నికల్లో తమకు సహకరించలేదని తేల్చి చెప్పారు. కోవూరు నియోజకవర్గంలో 1,744 మంది వలంటీర్లు ఉంటే వారిలో 400 మంది రూ.20 వేల వంతున తీసుకొని ఇతర పార్టీలకు అమ్ముడుపోయారన్నారు. నాయకులు, కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని అభివర్ణించారు. ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధించి జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. గడిచిన 18 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం చేశారు. ఒక్క సంక్షేమ పధకం సక్రమంగా అమలు చేయడం లేదని, హామీలన్నీ మోస పూరితమేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎంపీపీ గాలి జ్యోతి, డీసీఎమ్మెస్, ఆఫ్కాఫ్ మాజీ చైర్మన్లు వీరి చలపతిరావు, కొండూరు అనిల్బాబు, ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్, పార్టీ మండల అధ్యక్షులు చిమటా శేషగిరిరావు, మావులూరు శ్రీనివాసులురెడ్డి, కె.నవీన్రెడ్డి, సీహెచ్ సతీష్రెడ్డి, షాహుల్, శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. -
పేదల బియ్యాన్ని బొక్కేస్తూ..
ఉదయగిరి: స్థానిక ఎమ్మెల్ఎస్ పాయింట్ నుంచి బియ్యం పెద్ద మొత్తంలో పక్కదారి పట్టిన ఉదంతం కలకలం సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి కీలకపాత్ర పోషించగా, దీని వెనుక రెవెన్యూ అధికారులు ప్రమేయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి నెలా సరఫరా ఇలా.. జిల్లాలోని రాపూరు, నెల్లూరు, ఇందుకూరుపేట, కోవూరు, పొదలకూరు, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి, వింజమూరు, కందుకూరు, బుచ్చిరెడ్డిపాళెం మండల కేంద్రాలల్లో సివిల్ సప్లయ్స్ స్టాక్ పాయింట్లున్నాయి. ఇందులో ఉండే గోదాములకు ప్రతి నెల 11 వేల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తారు. అనంతరం ఇక్కడి నుంచే మండలాల్లోని చౌక దుకాణాలకు సరుకులు చేరుతాయి. రూ.కోట్ల విలువజేసే బియ్యం పంపిణీ వ్యవస్థ సక్రమంగా సాగాలంటే ప్రభుత్వోద్యోగులుండాలి. అయితే స్టాక్ పాయింట్లపై సర్వాధికారాన్ని అక్కడ పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగుల చేతుల్లో ఉంచి అవినీతికి ఆస్కారం కల్పిస్తున్నారు. అక్రమ రవాణాకు గేట్లెత్తారు టీడీపీ ప్రభుత్వం కొలువుదీరాక బియ్యం అక్రమ రవాణాకు ప్రతి నియోజకవర్గంలో గేట్లు తెరిచారు. స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధులు తమ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని అక్రమంగా తరలిస్తూ రూ.కోట్లు గడిస్తున్నా రు. ఈ తంతు బహిరంగంగానే జరుగుతున్నా, అధికారులు పట్టించుకోవడం లేదు. తమ పని సజావుగా సాగేందుకు గానూ ముఖ్య అధికారులకు మామూళ్లు ముట్టజెప్తున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. అన్నీ అనుమానాలే.. గోదాముల్లో సరుకుల బ్యాలెన్స్ షీట్ను ఉన్నతాధికారులు తనిఖీ చేయాల్సి ఉంది. అయితే అక్రమాలకు గుర్తించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ఉదయగిరి స్టాక్ పాయింట్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు 200 మెట్రిక్ టన్నులు బియ్యం స్వాహా అయిందనే అంశాన్ని గుర్తించి గోదాముకు గత శుక్రవారం రాత్రి సీలేశారు. డిసెంబర్కు సంబంధించిన బియ్యాన్ని దించేందుకు మూడు రోజుల క్రితం వచ్చిన లారీ అక్కడే ఉంది. వింజమూరు నుంచి ఓ కాంట్రాక్ట్ ఉద్యోగిని పంపినా, గోదాములకు సీలేయడంతో బియ్యాన్ని దింపే పరిస్థితి లేదు. నెల్లూరులోని సివిల్ సప్లయ్స్ కార్యాలయ సిబ్బంది ఉదయగిరికి ఆదివారం వచ్చి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం గోడౌన్ సిబ్బంది విధులకు హాజరైనా సీల్ వేయడంతో బయటే ఉండిపోయారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులును గోదాము ఇన్చార్జిగా నియమించారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 26 నుంచి 31 వరకు వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ సరఫరా చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి బియ్యం కేటాయించాల్సి ఉంది. సీల్వేయడంతో పరిస్థితి అయోమయం ఏర్పడిండి.నాలుగు వేల బస్తాల స్వాహా ఉదయగిరి ఎమ్మెల్ఎస్ పాయింట్కు ప్రతి నెలా 600 టన్నుల రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తారు. మర్రిపాడు, ఉదయగిరి, సీతారామపురం, వరికుంటపాడు మండలాల్లో ఉన్న 120 చౌక దుకాణాలకు సరఫరా అవుతాయి. వీటి పరిధిలో సుమారు 40 వేల మంది లబ్ధిదారులు.. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు చేరుస్తారు. స్టాక్ పాయింట్ నిర్వహణ బాధ్యతల పర్యవేక్షణకు రెగ్యులర్ ఉద్యోగి లేరు. దీంతో అక్కడ పనిచేసే ఓ కాంట్రాక్ట్ ఉద్యోగికి పూర్తి బాధ్యతలను అప్పజెప్పారు. దీన్ని ఆసరాగా చేసుకున్న సదరు వ్యక్తి పేదల బియ్యాన్ని నేరుగా బ్లాక్ మార్కెట్కు తరలించే ఎత్తుగడకు తెరలేపారు. దీని వెనుక కొంతమంది అధికార పార్టీ పెద్దల ప్రమేయముందనే ఆరోపణలున్నాయి. రేషన్ షాపులకు సరఫరా చేయాల్సిన సరుకుల్లో కొంతమేర కోత విధించి.. అంగన్వాడీ కేంద్రాలకు అందాల్సిన బియ్యం, నూనె, కందిపప్పు ఇతర సరుకులనూ మింగేశారు. ఇలా పక్కదారి పట్టించిన నాలుగు వేల బస్తాలు (200 మెట్రిక్ టన్నులు) విలువ బహిరంగ మార్కెట్లో రూ.కోటికిపైగానే ఉంటుంది. ఎమ్మెల్ఎస్ పాయింట్ల నుంచి పక్కదారి అధికార పార్టీ నేతల అండదండలతో అక్రమాలు కాంట్రాక్ట్ ఉద్యోగులదే పెత్తనం తనిఖీలను విస్మరించిన అధికారులు ఉదయగిరి కేంద్రంలో రూ.కోటి విలువజేసే రైస్ స్వాహా పేదల బియ్యాన్ని బొక్కేయడంలో అక్రమార్కులు తలమునకలై ఉన్నారు. ఎమ్మెల్ఎస్ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది, అధికార పార్టీ పెద్దలు కుమ్మకై ్క రేషన్ షాపులకు చేరకుండానే బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నారు. సివిల్ సప్లయ్స్ శాఖ పెద్దలకు ఈ వ్యవహారం తెలిసినా నోరు మెదపడంలేదు. జిల్లాలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పట్టబడుతుండటం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది.


