SPSR Nellore District News
-
అగ్రవర్ణ పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు
నెల్లూరు(బారకాసు): చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘లలితమ్మ విద్యా వికాస పథకం’ కింద ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ అత్యంత పేద, అనాథ విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేయనున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ చాగణం గౌరీశంకర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు www.chaganamlbmtrust.org వెబ్సైట్ను సందర్శించాలన్నారు. ఎంపికై న ప్రతి విద్యార్థికి రూ.25,000ల స్కాలర్షిప్ మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. 29.28 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ నెల్లూరురూరల్: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం కొనసాగుతోంది. శుక్రవారం నాటికి 19,74,240 మంది ఓటర్లలో 5,78,067 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు. 29.28 శాతంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. 7,976 ఫారాలను (0.40) డిజిటలైజ్ చేశారు. కావలి నియోజకవర్గంలో 2,41,702 మంది ఓటర్లకు గానూ 53,132 ఫారాలు పంపిణీ చేశారు. 21.98% నమోదైంది. 733 ఫారాల డిజిటలైజేషన్ (0.30%) జరిగింది. ఆత్మకూరులో 2,17,309 మంది ఓటర్లకు 84,274 ఫారాలు పంపిణీ (38.78%) చేశారు. 378 ఫారాల డిజిటలైజేషన్ (0.17%) జరిగింది. కోవూరులో 2,69,146 మంది ఓటర్లకు గానూ 53,916 ఫారాలు పంపిణీ (20.03%) చేశారు. 1,304 ఫారాల డిజిటలైజేషన్ (0.48%) జరిగింది. నెల్లూరు సిటీ పరిధిలో 2,39,870 మంది ఓటర్లకు 61,037 ఫారాలు పంపిణీ (25.45%) చేశారు. 1,371 ఫారాల డిజిటలైజేషన్ (0.57%) జరిగింది. నెల్లూరు రూరల్లో 2,82,312 మంది ఓటర్లకు గానూ 69,561 ఫారాలు పంపిణీ (24.64%) చేశారు. 1,515 ఫారాల డిజిటలైజేషన్ (0.54%) జరిగింది. సర్వేపల్లిలో 2,34,393 మంది ఓటర్లకు 66,900 ఫారాలు పంపిణీ (28.54%) చేయగా 1,168 ఫారాల డిజిటలైజేషన్ (0.50%) జరిగింది. గూడూరు (ఎస్సీ)లో 2,46,086 మంది ఓటర్లకు గానూ 96,509 ఫారాలు పంపిణీ (39.22%) చేయగా 702 ఫారాల డిజిటలైజేషన్ (0.29%) జరిగింది. ఉదయగిరిలో 2,43,422 మంది ఓటర్లకు 92,738 ఫారాలు పంపిణీ (38.10%) చేశారు. 805 ఫారాల డిజిటలైజేషన్ (0.33%) పూర్తయింది. ఓటర్లు తమ వివరాలను సరిచూసుకుని, ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిగా నింపి సంబంధిత బీఎల్ఓలకు త్వరితగతిన అందజేయాలని యంత్రాంగం విజ్ఞప్తి చేసింది. పనికి వెళ్లొచ్చేసరికి..● ఇంట్లో బంగారం చోరీ నెల్లూరు సిటీ: ఇంటి బయట పూలకుండీలో తాళాలు పెట్టి పనికి వెళ్లొచ్చే సరికి గుర్తుతెలియని వ్యక్తులు బంగారం చోరీ చేసిన ఘటన శుక్రవారం జరిగింది. రూరల్ పోలీసుల కథనం మేరకు.. పెద్ద చెరుకూరులోని శివాలయం వెనుక వీధిలో శ్రీనివాసులు కుటుంబం ఉంటోంది. అతను బేల్దారి పనిచేస్తుంటాడు. శుక్రవారం శ్రీనివాసులు, అతని భార్య పనికి, కుమార్తె బడికి వెళ్లారు. ఇంటి తాళాలు పూలకుండీలో పెట్టారు. గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు తీసి ఇంట్లోకి ప్రవేశించారు. బాధిత కుటుంబం వచ్చి తిరిగి వచ్చిచూసేసరికి బీరువాలో రెండున్నర సవర్ల బంగారు కమ్మలు, ఉంగరాలు చోరీకి గురయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించండినెల్లూరురూరల్: ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని వివిధ సంఘాల నాయకులు కోరారు. నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో ఎన్.విజయ్కుమార్ అధ్యక్షతన శుక్రవారం జిల్లా స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. సమస్యలపై ఉద్యోగ సంఘం నేత బండారుపల్లి వెంకటేశ్వర్లు తదితరులు వినతిపత్రాన్ని సమర్పించారు. ఇంకా ఈహెచ్ఎస్ నెట్వర్క్ ఆస్పత్రులు, ఆరోగ్యమిత్రల జాబితాను ఉద్యోగులు, పెన్షనర్లకు అందుబాటులో ఉంచాలని పలువురు కోరారు. నేతలు గాదిరాజు రామకృష్ణ, పి.కిరణ్కుమార్, ఆంజనేయ వర్మ, లక్కాకుల పెంచలయ్య, కె.సురేష్, టి.మల్లికార్జునరావు, ఏవీ కృష్ణకుమార్, సుధాకర్రెడ్డి, రామ్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కండలేరులో 34.67 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 34.670 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,900, హైలెవల్ కాలువకు 50, లోలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.60 సన్నవి : రూ.30 పండ్లు : రూ.15 -
దర్జాగా కబ్జా.. అడిగితే ఒట్టు
వెంకటాచలం: రెండు మండలాలకు సాగు, తాగునీరు అందించాల్సిన ప్రధానమైన సర్వేపల్లి రిజర్వాయర్ ఆక్రమణలకు గురవుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రిజర్వాయర్ భూముల్లో సాగు చేసుకునేందుకు ఏకంగా నీటినే అక్రమంగా తరలించేందుకు కాలువలు తవ్వుతున్న పరిస్థితి నెలకొంది. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో రిజర్వాయర్ భవిష్యత్పై ఆందోళన వ్యక్తమవుతోంది. రెండు మండలాలకు ఆధారం వెంకటాచలం, ముత్తుకూరు మండలాలకు సాగు, తాగునీరు అందించడంలో సర్వేపల్లి రిజర్వాయర్ కీలకంగా ఉంది. ఇక్కడి నుంచి ఆ రెండు మండలాల్లోని 64 గ్రామాలకు తాగునీరు, 15,300 ఎకరాలకు అధికారికంగా, అనధికారికంగా కలిపి సుమారు 30 వేల ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. రిజర్వాయర్ విస్తీర్ణం 15 వేల ఎకరాలు కాగా.. ఏటా పైభాగంలో జరుగుతున్న ఆక్రమణలతో విస్తీర్ణం క్రమంగా తగ్గిపోతోంది. చుట్టూ ఉన్న గ్రామాల్లోని ఆక్రమిత భూముల్లో ఆక్రమణదారులు వరి సాగు చేస్తున్నారు. ఫిర్యాదులు చేసినా.. రిజర్వాయర్ భూముల ఆక్రమణలపై ఆయకట్టు రైతులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు కనిపించడం లేదు. 2011లో ఆక్రమణలపై సర్వే నిర్వహించారు. అప్పట్లో 300 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురై వరి సాగు చేస్తున్నట్లు సర్వేలో తేలింది. ఆక్రమణదారులకు నోటీసులిచ్చి వదిలేశారు. ఆ తర్వాత నుంచి నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు దృష్టి పెట్టలేదు. ప్రస్తుతం100 నుంచి 150 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురై ఉంటుందని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మకాలు సాగిస్తూ.. సర్వేపల్లి రిజర్వాయర్ను ఆక్రమించి సాగు చేసుకుంటున్న భూములు చేతులు మారుతున్నాయి. అనికేపల్లి, గొలగమూడి, కంటేపల్లి, జోసఫ్పేట తదితర గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు కొన్నేళ్లుగా రిజర్వాయర్ భూముల్లో అక్రమ సాగు చేస్తున్నారు. యంత్రాలతో చుట్టూ గట్లు వేయించి, మోటార్ల ద్వారా రిజర్వాయర్ నీటినే తరలిస్తున్నారు. దీంతో ఎకరాకు నాలుగు పుట్లకు తగ్గకుండా దిగుబడి వస్తుండటంతో సెంటు భూమి లేని కొందరు వ్యక్తులు ఈ భూములను ఎకరా రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు కొనుగోలు చేసి సాగు చేసేందుకు ముందుకు వస్తున్నారు. కొంతమంది ఆక్రమిత భూములకు సాగునీరు అందించేందుకు రిజర్వాయర్ మధ్యలో నుంచే ఇష్టారాజ్యంగా కాలువలు తవ్వుతున్నారు. అధికారులు చూస్తే కదా.. ఆక్రమణలు పెరుగుతున్నా నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అనికేపల్లి, గొలగమూడి గ్రామాల పరిధిలోని రిజర్వాయర్ ప్రాంతంలో ఏటా ఆక్రమణలు కొనసాగుతున్నాయి. ఈ విషయం అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఆక్రమిత భూముల కారణంగా ఆయకట్టు పొలాలకు సాగునీరు సక్రమంగా అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వాయర్ మధ్యలో నుంచే యంత్రాలతో కాలువలు తవ్వుతున్నా చర్యలు తీసుకోకపోవడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని రిజర్వాయర్ ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై వివరణ కోసం సర్వేపల్లి రిజర్వాయర్ డీఈ అనిల్కుమార్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు. సర్వేపల్లి రిజర్వాయర్లో ఏటా పెరుగుతున్న ఆక్రమణలు చేతులు మారుతున్న ఆక్రమిత భూములు పట్టించుకోని అధికారులు ఇష్టారాజ్యంగా సాగు -
నిమ్మ ధరలు నేలముఖం
● నానాటికీ పతనమవుతున్న వైనం ● దిగులు పడుతున్న రైతులు చిల్లకూరు: అతి పెద్దదిగా పేరొందిన గూడూరు నిమ్మ మార్కెట్లో ధరలు రోజురోజుకూ పతనమవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కొనుగోళ్లు తగ్గిపోతుండటంతో ఇక్కడ ధరలు అమాంతం దిగజారుతున్నాయి. ఫలితంగా రైతులు ఆవేదన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి ఏ పంటకూ సరైన మద్దతు ధరల్లేపోవడంతో కర్షకులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. వేసవిలో మామిడి, నిమ్మ, చీని ధరలు తగ్గిపోతుండటంతో రైతులకు దిక్కుతోచడంలేదు. నెల్లోనే పతనం గూడూరు, పొదలకూరు ప్రాంతాల్లో కాయలు మార్కెట్లకు బాగానే వస్తున్నా, కిలో రూ.25 నుంచి రూ.50 వరకు పలుకుతోంది. గత సీజన్లో కిలో రూ.150 వరకు.. నెల క్రితం రూ.200 వరకు ఉండింది. అయితే ఒక్క నెల్లోనే రేట్లు అమాంతం పడిపోయాయి. వాస్తవానికి ఇక్కడి కాయలు మంచి రుచిగా ఉంటాయనే ఉద్దేశంతో ఉత్తరాది రాష్ట్రాల్లోని వారు బాగా కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో పలు రాష్ట్రాల్లో నిమ్మ సాగు ఎక్కువ కావడంతో అక్కడ్నుంచి కాయలు ఎగుమతవుతున్నాయి. దీంతో ధరలు అమాంతం తగ్గిపోతున్నాయి. తెలంగాణలోని నల్లగొండ, ఖమ్మం, నకిరేకల్లు, రాష్ట్రంలోని ఏలూరు, తెనాలి, కర్ణాటకలోని బిజాపూర్, మహారాష్ట్రలోని అకోలా తదితర ప్రాంతాల నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతవుతుండటంతో ఇక్కడ సమస్య తీవ్రమవుతోంది. పొదలకూరు మార్కెట్ నుంచి 20.. గూడూరు నిమ్మ మార్కెట్ నుంచి 30 నుంచి 50 లారీల వరకు ఇతర రాష్ట్రాలకు నిత్యం వెళ్లేవి. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితే లేదు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
పల్లె కాపులకు త్వరలో పట్టాల పంపిణీ
ముత్తుకూరు(పొదలకూరు): ఏడు దశాబ్దాలుగా భూములను సాగు చేసుకుంటున్న పల్లె కాపులకు పట్టాలను త్వరలో పంపిణీ చేయనున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. మండలంలోని పిడతాపోలూరులో పల్లె వీక్షణం కార్యక్రమానికి శుక్రవారం హాజరైన ఆయన మాట్లాడారు. సహజసిద్ధంగా ఎరువులను తయారు చేస్తున్న సహాయక గ్రూపులకు తోడ్పాటును అందించనున్నామని వివరించారు. పిడతాపోలూరు ఎస్టీ కాలనీలో లో ఓల్టేజీ సమస్యను అధిమించేందుకు త్రీ ఫేజ్ విద్యుత్ను ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. పల్లె వీక్షణం కార్యక్రమం ద్వారా స్థానిక సమస్యలను రెండు రోజులు ముందే గుర్తించి వాటిని పరిష్కరించేలా తగు చర్యలను చేపట్టనున్నామని పేర్కొన్నారు. పొదలకూరు మండలంలో కార్యక్రమాన్ని వచ్చే వారంలో నిర్వహించనున్నామని తెలిపారు. పిడతాపోలూరులో ప్రధాన సమస్యలను పరిష్కరించామని, మంచినీటిని రెండు వారాల్లో అందించనున్నామన్నారు. అనంతరం పలువురు లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు.. స్వయం సహాయక గ్రూపు సంఘాలకు రూ.నాలుగు లక్షల చెక్కులను అందజేశారు. ఉపాధి హామీ, జలజీవన్ మిషన్, అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాలు, డ్రిప్ ఇరిగేషన్, చెత్తతో సంపద తయారీ కేంద్రాలను పరిశీలించి గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడారు. గ్రామస్తులు వెల్లడించిన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆర్డీఓ నాగఅనూష, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు, డీఎంహెచ్ఓ సుజాత, వ్యవసాయ, ఉద్యానశాఖల జిల్లా అధికారులు సత్యవాణి, సుబ్బారెడ్డి, ఎస్పీడీసీఎల్ ఎస్ఈ రాఘవేంద్రం, డీఈఓ బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు. -
విద్యాలయం.. అపవిత్రం
● పాఠశాల ఆవరణలో మందుబాబుల హంగామా ● వంటగదిలోనే నివాసం ● రాత్రి, పగలు తాగుతూ. ● భయాందోళనలో విద్యార్ధులు, తల్లిదండ్రులువిడవలూరు: కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. మందుబాబుల ఆగడాలకు అడ్డు లేకుండా పోయింది. మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం పక్కన ఉన్న దళితవాడ ప్రాథమిక పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారింది. మధ్యాహ్న భోజనం వండేందుకు ఏర్పాటు చేసిన గదికి తలుపుల్లేవు. కొందరు స్థానిక యువకులు దీనిని అవకాశంగా తీసుకున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అక్కడ మద్యం తాగుతూ ఖాళీ బాటిళ్లను గదిలో పారేస్తున్నారు. అంతేకాకుండా ఫ్యాన్లు ఏర్పాటు చేసుకుని పాఠశాల విద్యుత్ను ఉపయోగిస్తూ అక్కడే నిద్రిస్తున్నారు. బడి వేళల్లోనూ మద్యం మత్తులో పడుకుని ఉండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికులు ప్రశ్నిస్తే దౌర్జన్యానికి దిగుతున్న ఘటనలు కూడా జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. కాగా మందుబాబులు వంటగదిని ఆక్రమించడంతో విద్యార్థులకు వంట చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఏజెన్సీ నిర్వాహకురాలు ఇంటి వద్ద భోజనం తయారు చేసి తీసుకువస్తోంది. భయాందోళనలో తల్లిదండ్రులు పాఠశాల పరిసరాలు ఇలా మారిపోవడంతో తమ పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ఉన్నారు. విద్యాశాఖ అధికారులు, పోలీసులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు. వంటగదికి తలుపులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల కుదింపు
● మొదటి ఏడాది ఎగనామం ● రెండో ఏడాదిలో గత ప్రభుత్వంలోని లబ్ధిదారుల్లో 18,801 మంది తొలగింపు ● మూడో ఏడాదిలో గతేడాది లబ్ధిదారుల్లో 18,321 మంది లబ్ధిదారులు కట్ ● ఈ దఫా తొలి విడతలో 1,77,545 మందికి మాత్రమే ● వైఎస్సార్సీపీ హయాంలో 2,14,667 మందికి రైతు భరోసా రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకుంటూ కూటమి ఆ రైతును సంక్షోభంలోకి నెట్టేస్తోంది. అప్పట్లో వ్యవసాయమే దండగన్న చంద్రబాబు.. ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని పథకం ప్రకారం కుప్పకూల్చేస్తున్నారు. రెండేళ్లకు ముందు అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి పంటకు అ‘ధర’హో అనే రీతిలో ధరలు లభించగా, కూటమి పాలనలో రెండేళ్లుగా ఏ పంటలకు కనీసం ‘మద్దతు’ ధర కూడా లభించడం లేదనేది నిర్వివాదాంశం. ఇక అన్నదాత సుఖీభవ పథకాన్ని చివరకు అన్నదాత దుఃఖీభవగా మార్చేసింది. తొలి ఏడాది ఎగనామం పెడితే.. రెండో ఏడాదిలో అమలు చేసినా గత ప్రభుత్వంలోని లబ్ధిదారులను భారీగా తొలగించింది. గతేడాది కూటమి పాలనలో లబ్ధిపొందిన లబ్ధిదారుల్లోనూ ఈ ఏడాదిలో మరింతగా కోత పెట్టింది. అన్నదాత సుఖీభవ నిధులురైతులుసాక్షి ప్రతినిధి, నెల్లూరు: చంద్రబాబు దగాకు అన్నదాత కన్నీరు పెడుతున్నాడు. కాడి కట్టి.. మేడి పట్టిన హలధారి ఉరితాళ్లకు వేలాడుతున్నాడు. అప్పులు చేసి ఆరుగాలం అష్టకష్టాలుపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర దక్కక.. అప్పుల ఊబిలో కూరుకుపోయి పాడెక్కుతున్నాడు. అన్నదాత సుఖీభవ పథకంతో ఆదుకుంటానని ఆశలు రేకెత్తించిన చంద్రబాబు సర్కారు అమల్లో కోతలు పెట్టి.. గుండె కోతను మిగిల్చింది. రెండేళ్లకు ముందు వైఎస్సార్సీపీ పాలనలో ఐదేళ్లు ముక్కారు పంటలతో ధాన్యసిరులతో విలసిల్లిన జిల్లాలో ఇప్పుడు అన్నదాతలు కుమిలి కుమిలి దుఃఖిస్తున్నారు. ‘వ్యవసాయం దండగ అని చిన్న చూపు చూసిన సీఎం చంద్రబాబు.. ఇప్పటికీ అదే పంథాను అనుసరిస్తున్నారు. చంద్రబాబు పాలనలో కరువు కాటకాలు, ధరాఘాతాలతో వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లిపోయింది. కాడి పట్టిన రైతులు.. చివరకు రాళ్లు, మట్టి మోసే కూలీలుగా మారారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంతి అయ్యాక వ్యవసాయాన్ని పండగ చేశారు. ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో నాలుగు అడుగులు ముందుకేసి అంతకు మించి రైతును ఆర్థిక సంక్షోభం నుంచి రారాజుగా చేశారు. రెండేళ్ల కూటమి పాలనలో రూ.274.21 కోట్ల లబ్ధి అధికారం కోసం అలవికాని హామీలిచ్చి.. దక్కాక వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఈ కోవలోనే అన్నదాతలు ఉన్నారు. ఎన్నికల ముందు గత ప్రభుత్వం కంటే మిన్నగా ఆదుకుంటానని నమ్మించి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడంతో అప్పుల ఊబిలోకి నెట్టేశారు. తొలి ఏడాది మంగళం పలికారు. రెండో ఏడాదిలో రెండో ఏడాదిలో 3.19 లక్షల మంది అర్హులు దరఖాస్తులు చేసుకుంటే.. చివరకు 1,95,866 మందికి ఇచ్చి చేతులు దలుపుకున్నారు. దాదాపు 84,134 మంది దరఖాస్తులను అకారణంగా తిరస్కరించారు. ఈకేవైసీ, ఆధార్లింక్, బ్యాంకు అకౌంట్ లింకు కాలేదంటూ తదితర కారణాలు చూపి మరో 14 వేల దరఖాస్తులు వివిధ రకాల కారణాలతో పెండింగ్ పెట్టారు. మొత్తంగా రెండేళ్లలో అన్నదాత సుఖీభవగా రూ.274.21 కోట్లు అందించింది. తాజా ఏడాది లబ్ధిదారుల జాబితాను పరిశీలిస్తే.. తొలి విడతలో 1,77,545 మందికి లబ్ధికి అన్నదాత సుఖీభవగా రూ.88.77 కోట్ల సాయం అందించనున్నట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. కూటమి కూతలు, కోతల ప్రభుత్వంగా మారిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సూపర్’ దగా జిల్లాలో అర్హులైన రైతులకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అడ్డదిడ్డంగా.. అలవి కాని హామీలిచ్చారు. గతంలో 9 ఏళ్లు, ఆ తర్వాత ఐదేళ్లు అధికారంలో ఉండీ కూడా ఏ నాడు రైతుల సంక్షేమానికి ఒక్క పథకాన్ని అమలు చేయని చంద్రబాబు సూపర్ సిక్స్లో భాగంగా పీఎం కిసాన్ సాయం కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఏటా ప్రతి రైతుకు రూ.20 వేలు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఇస్తామని హామీలిచ్చారు. తొలి ఏడాది ఎగ్గొట్టేశారు. ఆ తర్వాత పీఎం కిసాన్తో కలిపి అంటూ నాలిక మడతేసి.. రూ.14 వేలు మూడు విడతల్లో ఇస్తామన్నారు. రెండో ఏడాదిలో పథకాన్ని అమలు చేసినా.. గత ప్రభుత్వంలోని లబ్ధిదారుల సంఖ్యకు కోత పెట్టారు. రెండో ఏడాదిలో పథకాన్ని అమలు చేసినా.. వైఎస్సార్సీపీ పాలనలో ఉన్న లబ్ధిదారుల్లో 18,801 మందికి కోత పెట్టి 1,95,866 మందికి లబ్ధి చేకూర్చింది. మూడో ఏడాదికి వచ్చేసరికి 1,77,545 మంది ఇవ్వనున్నట్లు లబ్ధిదారుల జాబితాను విడుదల చేసింది. గతేడాది లబ్ధిపొందిన లబ్ధిదారుల్లో 18,321 మంది రైతులను జాబితా నుంచి తొలగించింది. ఇలా ఏటా సుమారు 18 వేల మంది రైతులను ఈ పథకం నుంచి తొలగిస్తూ వస్తోంది. అధికారంలోకి రాక ముందు కౌలు రైతులకు పథకాన్ని వర్తింప చేస్తామని చెప్పినా.. అమల్లోకి వచ్చే సరికి కౌలు రైతుల ఊసే ఎత్తకుండా.. అర్హులైన లబ్ధిదారుల సంఖ్యకు కోత పెట్టింది. అర్హత ఉండీ పథకం వర్తించని లబ్ధిదారులకు నెల రోజులు గడువు ఇస్తున్నామని అర్హతులతో తిరిగి దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి తిరిగి సాయం అందిస్తామని నిధుల విడుదల ప్రతిసారి చెబుతోంది. కానీ అర్హత ఉండీ లబ్ధి చేకూరని రైతులకు నేటికీ దిక్కులేదు. వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం టీడీపీ పాలనలో అన్నదాత సుఖీభవ వైఎస్సార్సీపీ ఐదేళ్లల్లో రూ.1510.70 కోట్లు జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2.15 లక్షల మంది రైతులకు ఏటా వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద ఏటా రూ.13,500 అందజేసింది. ఐదేళ్లలో మొత్తంగా రూ.1510.70 కోట్లు అందజేయగా, తొలి రెండేళ్లల్లోనే రూ.601.83 కోట్లు అందజేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆర్బీకేలో రైతుల జాబితాలను నోటీసు బోర్డుల్లో ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికి పారదర్శకతకు పాతరేసింది. -
అన్నదాతకు అడుగడుగునా అన్యాయం
● ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ● జిల్లా వ్యవసాయ కార్యాలయం ఎదుట ధర్నా నెల్లూరు(వేదాయపాళెం): వరి సాగుపై ఆధారపడిన అన్నదాతకు తీరని అన్యాయం చేసేందుకు సైతం చంద్రబాబు జమానా వెనుకాడటంలేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. రైతులకు సరిపడా యూరియాను ఇవ్వాలనే డిమాండ్తో నగరంలోని జిల్లా వ్యవసాయ కార్యాలయ ఎదుట శుక్రవారం చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ విధానంతో కౌలు రైతులు తీవ్ర అవస్థలు పడుతూ, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని తెలిపారు. భూ యజమాని అమెరికాలోనో లేదా ఇతర దేశాల్లో ఉంటే ఓటీపీ వారికే వెళ్తుందని, తిరిగి వారు దాన్ని తెలియజేయాలంటే ఇక్కడ రాత్రవుతోందని పేర్కొన్నారు. దీన్ని చెప్తే గానీ యూరియాను ఇవ్వకపోవడంతో కౌలు రైతులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని పేర్కొన్నారు. యూరియాను ఎగ్గొట్టేందుకు సర్కార్ యత్నించిందని, తమ పార్టీ పోరాటాల ఫలితంగా ప్రస్తుతం మూడు బస్తాల మేర ఇచ్చేందుకు దిగొచ్చిందని చెప్పారు. వరి పంటను నిర్వీర్యం చేసేందుకు సర్కార్ యత్నిస్తోందని మండిపడ్డారు. సంప్రదాయ పంటలు, ఆహార అలవాట్లను సైతం మార్చేసి ప్రజల జీవన విధానాన్నే శాసిస్తున్నారని విమర్శించారు. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను మార్చేస్తామని చెప్పినందుకు గానూ శ్రీలంకలో అక్కడి ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టారని, ఇక్కడ చంద్రబాబు సర్కార్కు సైతం ఇదే జరుగుతుందని చెప్పారు. వరి సాగును తగ్గించి ఆ భూములను పరిశ్రమల పేరుతో తక్కువ ధరలకు తమ అనుచరులకు కట్టబెట్టే యత్నంలో భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏడీకి వినతిపత్రమిస్తున్న కాకాణి, కిలివేటి, ఆనం తదితరులు నిరసన తెలియజేస్తున్న వైఎస్సార్సీపీ నేతలు -
ప్రతి ఓటును కాపాడుకుందాం
● దొంగ ఓట్లను అడ్డుకుందాం ● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కొడవలూరు: ‘వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే ప్రమాదం ఉంది. బీఎల్ఏలు ఈ విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ప్రతి ఓటును కాపాడుకుందాం’ అని మాజీ మంత్రి, ఆ పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని నార్తురాజుపాళెం వైఎస్సార్సీపీ కార్యాలయంలో బీఎల్ఏలతో మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డితో కలిసి శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ చంద్రబాబుకు దొంగ ఓట్లతో గెలిచిన చరిత్ర ఉందన్నారు. అందువల్ల దొంగ ఓట్ల చేరికపై కూడా బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధానంగా వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రమాదం ఎక్కువగా ఉందన్నారు. ఏ ఒక్క ఓటు తొలగింపునకు గురికాకుండా చూసుకోవల్సిన బాధ్యత బీఎల్ఏలపైనే ఉందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐర్లో ప్రతి ఓటు నూతనంగా నమోదు చేయడం జరుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గతంలో ఓటు ఉందిలే అని నిర్లక్ష్యంగా ఉంటే అది గల్లంతవుతుందని స్పష్టం చేశారు. పార్టీ నాయకులు సూచించిన వారినే బీఎల్ఏలుగా పెట్టడం జరిగిందన్నారు. వచ్చే నెల 14వ తేదీ వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. బీఎల్ఏలు ఏ మాత్రం ఏమరపాటుగా ఉండకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓట్లను కాపాడుకుంటూనే దొంగ ఓట్ల చేరికను అడ్డుకోవాలని కోరారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, ఎంపీపీ గాలి జ్యోతి, నాయకులు అడపాల మోహనకృష్ణ, కొట్టే మల్లికార్జున, ఎండీ కరిముల్లా, చక్కా మనోహర్, బి.సుప్రియ, కె.మోహన్రావు, సతీష్ రెడ్డి, షాహుల్, అనపల్లి ఉదయ్ భాస్కర్, బొచ్చు శ్రీనివాసులు, దేవనబోయిన శివకుమార్, వెంకటసతీష్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
కారుమూరి సునీల్ అరెస్ట్ దుర్మార్గం
● రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి బీవీ రమణయ్య చిట్టమూరు: మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ అరెస్ట్ దుర్మార్గమని వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి బీవీ రమణయ్య అన్నారు. చిట్టమూరులో పార్టీ బీసీ నాయకులతో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ నాయకుల ఎదుగుదలను అధికార టీడీపీ సహించలేక పోతోందన్నారు. సునీల్ భవిష్యత్ను అణగ దొక్కేందుకు అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. అక్రమ రవాణా కేసు పెట్టి రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారన్నారు. ప్రతిపక్ష నాయకులపై కుట్రపూరితంగా అక్రమ కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వ అరాచకాలను గమనిస్తున్నారని సరైన సమయంలో గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో కార్యక్రమంలో పట్టివానిపల్లి మాజీ సర్పంచ్ పిట్టి ప్రవీణ్, వైఎస్సార్సీపీ బీసీ నాయకులు కృష్ణమూర్తి, శోభన్, సురేష్, అక్కెం మునెయ్య, బద్ధిగ శ్రీనివాసులు, వినోద్, సునీల్ పాల్గొన్నారు. -
నీట్ – 26కు పకడ్బందీ ఏర్పాట్లు
● డీఆర్వో విజయ్కుమార్ నెల్లూరురూరల్: ‘ఈనెల 21వ తేదీన జరిగే నీట్ – 26కు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిర్వహించాలి’ అని డీఆర్వో విజయ్కుమార్ ఆదేశించారు. శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు నగర పరిధిలో 9, గూడూరు పట్టణ పరిధిలో 3 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి కేంద్రంలో రాష్ట్ర పోలీసు సిబ్బందితోపాటు కేంద్ర రక్షక పోలీసు దళాల పర్యవేక్షణలో భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు. అధికారులు తమకు కేటాయించిన కేంద్రాలను ముందుగానే తనిఖీ చేసి మౌలిక వసతులు ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో పాల్గొనే అధికారులు, సిబ్బంది సహా ఎవరూ మొబైల్ ఫోన్లు వినియోగించరాదని స్పష్టం చేశారు. సమావేశంలో చీఫ్ సూపరింటెండెంట్లు, పోలీసు, వైద్య, విద్యుత్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కేంద్రాల వివరాలు నెల్లూరు నగర పరిధిలో దర్గామిట్టలోని డీకే ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, డీకే ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలికలు), డీసీఆర్ జెడ్పీ హైస్కూల్ (బాలురు), డీసీఆర్ జెడ్పీ హైస్కూల్ (బాలికలు), కొత్తూరులోని పీఎంశ్రీ కేంద్రీయ విద్యాలయం, వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, స్టోన్హౌస్పేటలోని ఆర్ఎస్ఆర్ఎం సీహెచ్సీ స్కూల్, వైవీఎం మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్, ఏసీ నగర్లోని ఎంఎస్ఎంఎం హైస్కూల్, గూడూరు పట్టణ పరిధిలో తిలక్ నగర్లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎస్కేఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల, సనత్నగర్లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలు కేంద్రాలుగా ఉన్నాయి. -
ఇసుక టిప్పర్ మాయం
సాక్షి, టాస్క్ఫోర్స్: కొంతకాలంగా నకిలీ బిల్లులతో యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్న సైదాపురం మండల అధికార పార్టీ నాయకుడి టిప్పర్ను పొదలకూరు పోలీసులు పట్టుకున్నారు. అయితే అదే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి ఫోన్ కాల్తో దానిని వదిలివేసిన వైనం గురువారం చోటుచేసుకుంది. కలువాయి మండలం రాజుపాళెం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న నాయకుడి వ్యవహారం, టిప్పర్ను వదిలిలేసిన సమాచారం తెలుసుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. వెంకటగిరి ముఖ్యనేత పేరును అడ్డుపెట్టుకుని ఇసుకను తరలిస్తున్న సైదాపురం నాయకుడి టిప్పర్పై మైనింగ్ జిల్లా అధికారి నెల్లూరు వేదాయపాళెం పోలీస్స్టేషన్లో గతేడాది ఫిర్యాదు కూడా చేసినట్టు సమాచారం. అధికారం ఉందని.. నకిలీ బిల్లులతో కొంతకాలంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ను వదిలివేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారం ఉందని ఏమైనా చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇసుక మాఫియా పటిష్టంగా ఉన్నందున గంటల వ్యవధిలోనే టిప్పర్ను స్టేషన్ వెలుపల లేకుండా చేశారు. ఈ ఘటనపై పెద్ద చర్చ జరుగుతున్నట్టు సమాచారం. రెండు నియోజకవర్గాల పరిధిలో ఘటన జరగడంతో ప్రజాప్రతినిధుల మధ్య సరిహద్దు వివాదం నెలకొన్నట్టుగా తెలుస్తోంది. తన నియోజకవర్గంలో నకిలీ బిల్లులతో వెళ్తున్న ఇసుక టిప్పర్ను పట్టుకుని వదిలివేయడం ఏమిటని పోలీసులను సోమిరెడ్డి నిలదీసి వెంటనే కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే వదిలివేసిన టిప్పర్ తిరిగి తీసుకురావాలంటే పోలీసులకు సమస్యగా మారుతుందనే వాదన వినిపిస్తోంది. ఒకవేళ తీసుకొచ్చినా వెంకటగిరి ముఖ్యనేత సమ్మతించకుంటే పంచాయితీ పెద్దది అవుతుందనే ప్రచారం ఉంది. నకిలీ బిల్లులతో వెళ్తుండగా పట్టుకున్న పోలీసులు అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఫోన్ కాల్ గతంలో ఆ వాహనంపై మైనింగ్ అధికారి ఫిర్యాదు -
నడుచుకుంటూ ఇంటికెళ్తుండగా..
● మినీ ట్రక్కు ఢీకొని వ్యక్తి మృతి సీతారామపురం: మండలంలోని బోడసిద్ధాయపల్లి గ్రామ రోడ్డు సెంటర్లో మినీ ట్రక్కు ఢీకొని అదే గ్రామానికి చెందిన భూమనబోయిన నాగరాజు (36) అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నాగరాజుకు వివాహమై పిల్లలున్నారు. హైరర్స్ నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఉదయం నాగరాజు బోడసిద్ధాయపల్లి గ్రామ రోడ్డు సెంటర్లోని జాతీయ రహదారిపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు. మినీ ట్రక్కు మైదుకూరులో కూరగాయలు తీసుకుని మార్కాపురం జిల్లా చంద్రశేఖరపురంలో అన్లోడ్ చేసి తిరిగి వెళ్తోంది. ఈ క్రమంలో నాగరాజును ఢీకొట్టడంతో ఎగిరి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానికులు 108 అంబులెన్స్లో ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించేలోపు మార్గమధ్యలో మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
మాకు సంబంధం లేదు
జిల్లాలో ఇంటర్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు నిర్వహిస్తున్న హాస్టళ్లతో మాకెలాంటి సంబంధం ఉండదు. వాటిని పర్యవేక్షించే అధికారమూ లేదు. జిల్లాలో దేనికీ అనుమతుల్లేవు. పర్మిషన్లు ఎవరిస్తారో కూడా మాకు తెలీదు. – వరప్రసాదరావు, ఆర్ఐఓ ప్రభుత్వ హాస్టళ్లనే పర్యవేక్షిస్తాం ప్రభుత్వ హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యతే మాది. ఇంటర్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు నిర్వహిస్తున్న హాస్టళ్లతో మాకు సంబంధం లేదు. ఎవరూ చూస్తారో కూడా తెలీదు. – వెంకటలక్ష్మమ్మ, సోషల్ వెల్ఫేర్ అధికారి ● -
సర్దాగా మార్చేశారు..!
● అధికార పార్టీ బీఎల్ఏలుగా క్షేత్ర సహాయకులు ● ప్రభుత్వం నుంచి గౌరవవేతనం పొందుతూ.. ● విషయం తెలిసినా, మౌనం వహిస్తున్న అధికారులు ● ప్రక్రియ సజావుగా సాగడంపై అనుమానాలు సాక్షి టాస్క్ఫోర్స్: కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సర్ ప్రక్రియను టీడీపీ నేతలు అస్తవ్యస్తంగా మార్చారు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న పలువురు క్షేత్ర సహాయకులు, అక్రిడిటేషన్ పొందిన కొందరు మీడియా ప్రతినిధులు సైతం అధికార పార్టీ బూత్ స్థాయి ఏజెంట్లుగా (బీఎల్ఏ) రంగప్రవేశం చేశారు. ఈ క్రమంలో అధికార పార్టీకి అనుకూలంగా ఓట్ల నమోదు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వారివి తొలగించే కుట్రలో భాగస్వాములవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామస్థాయిలో అత్యంత కీలకంగా ఉన్న ఉపాధి హామీ ఎఫ్ఏలు ఇందులో చేరడం తీవ్ర ఆందోళనను కలిగిస్తోంది. ఏం జరుగుతోంది..? ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటు అత్యంత కీలకం. ఈ వ్యవస్థను అనేక సార్లు అపహాస్యం చేసిన చంద్రబాబు.. ప్రతిపక్ష ఓట్లను తొలగించే వ్యవహారానికి శ్రీకారం చుట్టారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే సర్ ప్రక్రియలో పచ్చ పార్టీ కార్యకర్తలు చొరబడి ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉండే బీఎల్ఓలను తమ గుప్పెట్లో పెట్టుకొని.. ప్రతిపక్ష పార్టీల బీఎల్ఏలకు సమాచారమివ్వకుండానే ఎన్యూమరేషన్ ఫారాలను ఇష్టానుసారంగా పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో తమకు వ్యతిరేకంగా ఓట్లు పడే కుటుంబాల్లో కొన్నింటిని తొలగించే కుతంత్రాన్ని పన్నుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారనే సాకుతో ఓట్ల సంఖ్యను తగ్గించే కుట్రకు పదును పెడుతున్నారనే మాట టీడీపీ వర్గాల్లోనే వినిపిస్తోంది. కాలనీల్లోని ప్రతి కుటుంబంపై పూర్తి అవగాహన ఉండి. అధికార పార్టీకి మద్దతుగా ఉన్న క్షేత్ర సహాయకులు, వెలుగు వీఓఏలను ఉపయోగించి తమకు అనుకూలంగా లేని ఓట్లను తొలగించే దుస్సాహసానికి తెరలేపారనే అంశం తాజా పరిణామాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. -
జిల్లాలో ఇలా..
రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్ విద్యాశాఖ ఉన్నతాధికారుల నిర్ణయాలు విద్యార్థులకు శాపాలుగా పరిణమిస్తున్నాయి. రూ.లక్షల్లో ఫీజులను వసూలు చేస్తూ.. అనుమతుల్లేకుండా హాస్టళ్లను నిర్వహిస్తూ.. వందలాది మంది స్టూడెంట్స్ను ఇరుకు గదుల్లో కుక్కుతున్నారు. అరకొర వసతులు, నాసిరకమైన భోజనాన్ని అందిస్తున్నా, తమకేమీ సంబంధంలేదనే రీతిలో ఇంటర్ బోర్డు అధికారులతో పాటు ఆయా శాఖల ఆఫీసర్లు తప్పించుకుంటున్నారు. చదువు ఒత్తిడి.. నామమాత్రపు ఫెసిలిటీస్.. అధ్వానమైన ఫుడ్ను తినలేక సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం శూన్యమవుతోంది. ఈ విషయమై తల్లిదండ్రులకు తెలియజేసినా, కొద్ది రోజులుంటే సర్దుకుపోతారులేనంటూ లైట్ తీసుకుంటున్నారు. ఈ తరుణంలో ఎవరికీ చెప్పుకోలేక స్టూడెంట్స్ బలవన్మరణాలకు పాల్పడుతున్న ఉదంతాలు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నాయి. నెల్లూరు (టౌన్): ఉజ్వల భవిష్యత్తుకు ఇంటర్ విద్య కీలకం కావడంతో దీనిపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. నీట్, జేఈఈ మెయిన్స్, ఐఐటీ, ఎంసెట్ తదితర పేర్లతో కోర్సులను కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ప్రారంభించి అందిన కాడికి దండుకుంటున్నాయి. రెగ్యులర్ కంటే హాస్టళ్లలో ఉండి చదువుకుంటే సీటు గ్యారెంటీని తామే ఇస్తామంటూ తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారు. దీంతో తమ పిల్లలను అక్కడే చేర్పించేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుంటూ.. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఉద్దేశంతో రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. అనుమతి లేకుండానే.. జిల్లాలో 185కుపైగా కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 35 వేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. అదే విధంగా 60కుపైగా కాలేజీలకు అనుబంధంగా హాస్టళ్లున్నాయి. ప్రధానంగా నారాయణ, శ్రీచైతన్య, ఆరెన్నార్, ఎస్సార్, ఓవెల్ తదితర జూనియర్ కాలేజీలకు సంబంధించిన బ్రాంచీల పేరుతో వసతిగృహాలను విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. ఏసీ, నాన్ ఏసీ, భోజన రకాలను బట్టి ఫీజులను నిర్ణయించారు. ఇలా రూ.1.5 లక్షల నుంచి రూ.రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అయితే వీటిలో దేనికీ అనుమతి లేకపోవడం గమనార్హం. ఇరుకు భవనాలు, చిన్న గదుల్లో నలుగురు లేదా ఆరుగురు విద్యార్థులను కుక్కుతూ ఇబ్బందులు పెడుతున్నారు. వీరి సంఖ్యకు అనుగుణంగా టాయ్లెట్లూ ఉండటంలేదు. ఇవి అపరిశుభ్ర వాతావరణంలో దర్శనమిస్తుండటంతో స్టూడెంట్స్ వెతలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. సరైన గాలి, వెలుతురు లభించడమూ కరువే. వారు పెట్టే భోజనాన్ని తినే పరిస్థితే లేదని వాపోతున్నారు. హాస్టళ్లు – 60కుపైగా వసూలు చేస్తోంది – రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలు (గది, భోజనం బట్టి) బాధ్యతెవరిదో అంతుచిక్కడంలేదుఇంటర్ జూనియర్ కళాశాలల హాస్టళ్ల అనుమతి, బాధ్యత ఎవరిదనే అంశంపై స్పష్టత లేదు. తమకు సంబంధం లేదని జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు చెప్తూ.. సంక్షేమాధికారులను అడగాలని సలహా ఇస్తున్నారు. వారిని సంప్రదిస్తే, ప్రభుత్వ వసతిగృహాల విషయంలోనే తమ ప్రమేయముంటుందని.. ప్రైవేట్ హాస్టళ్లలో ఏమీ ఉండదని బదులిస్తున్నారు. ఫలితంగా తమ సమస్యలను ఎవరికి తెలియజేయాలో పాలుపోక విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. ఒకవేళ ఎవరైనా యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే, తల్లిదండ్రులకు ఏదో సాకు చెప్పి విద్యార్థులను ఇక్కడ్నుంచి తీసుకెళ్లాలని సూచిస్తున్నారు. ఇంటర్ జూనియర్ కళాశాలల హాస్టళ్ల నిర్వహణపై కలెక్టర్ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బందీఖానాలుగా మారిన వైనం జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వసతిగృహాలు దేనికీ పర్మిషన్లు లేవంటున్న ఇంటర్ బోర్డు అధికారులు చేతులు దులుపుకొంటున్న ఆర్ఐఓ, బీసీ వెల్ఫేర్ అధికారి అరకొర వసతులు, నాసిరకమైన ఫుడ్తో విద్యార్థులకు తంటాలు అనుమతులు, పర్యవేక్షణ బాధ్యతెవరిదో..? ఒత్తిడి, వసతుల్లేమితో పలువురి బలవన్మరణాలు -
21న నీట్
నెల్లూరు (టౌన్): ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన నీట్ను ఆదివారం నిర్వహించనున్నారు. పరీక్షను మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5.15 వరకు జరపనున్నారు. గత నెల్లో జరిగిన పరీక్ష సమయానికంటే 15 నిమిషాలను అదనంగా పెంచారు. జిల్లా వ్యాప్తంగా 3005 మంది హాజరుకానున్న ఈ టెస్ట్ను మొత్తం 12 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. నగరంలోని డీకేడబ్ల్యూ, డీకేడబ్ల్యూ జూనియర్ కళాశాల, కేంద్రీయ విద్యాలయం, ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాల, దర్గామిట్టలోని జెడ్పీ బాలుర, బాలికోన్నత పాఠశాలలు, ఏసీనగర్లోని మల్లెల సంజీవయ్య మున్సిపల్, స్టోన్హౌస్పేటలోని ఆరెస్సార్, పప్పులవీధిలోని వైవీఎం మున్సిపల్ హైస్కూల్, గూడూరులోని పాలిటెక్నిక్, ప్రభుత్వ జూనియర్ కళాశాల, జెడ్పీ బాలికోన్నత పాఠశాలల్లో పరీక్షను జరపనున్నారు. శ్రీవారి దర్శనానికి పది గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 82,438 మంది బుధవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 39,948 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.24 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి పది గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ తనిఖీలు
చేజర్ల: మండలంలోని ఆదూరుపల్లిలో గల పలు ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం జరిపారు. నిబంధనలకు విరుద్ధంగా వీరాంజనేయ ఫర్టిలైజర్స్ దుకాణంలో రూ.12,89,847 విలువజేసే యూరియా, డీఏపీ ఇతర కాంప్లెక్స్ ఎరువులను నిల్వ చేశారని గుర్తించారు. అనంతరం దుకాణాన్ని సీజ్ చేసి, యజమానిపై కేసు నమోదు చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ సుభానీ, వ్యవసాయ శాఖ నిఘా విభాగాధికారి వేణుగోపాల్, చేజర్ల వ్యవసాయాధికారి హిమబిందు తదితరులు పాల్గొన్నారు. -
రిట్ పిటిషన్ దాఖలు
టీడీపీ ప్రభుత్వం కొలువుదీరిన ఈ రెండేళ్లలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ఎన్నిక ఏదైనా విజయమే పరమావధిగా చేయని కుట్రల్లేవు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. ప్రశ్నించే వారిని నిర్బంధించడం.. ఫిరాయింపులను ప్రోత్సహించడం.. ఎవరైనా లొంగకపోతే వారిని నయనో.. భయానో లొంగదీసుకోవడం వంటి చర్యలకు ఉపక్రమించింది. ఈ కోవలోనే నెల్లూరు నగరపాలక సంస్థను తమ హస్తగతం చేసుకోవాలనే ఉద్దేశంతో డివిజన్లను అడ్డగోలుగా విభజించేందుకు రంగం సిద్ధంగా చేసింది. జనగణన ప్రస్తుతం సాగుతున్న తరుణంలో ఈ ఒంటెత్తు పోకడలను అవలంబించడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించి.. హైకోర్టులో రిట్ పిటిషన్ను దాఖలు చేసింది. ఈ క్రమంలో ప్రక్రియపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఊహించని ఈ పరిణామంతో సైకిల్ పార్టీ, జనసేన నేతలు తీవ్ర నైరాశ్యంలో కూరుకుపోయారు. నెల్లూరు(బారకాసు): నిబంధనల మేరకు పునర్వి భజన ప్రక్రియ జరిగితే స్థానిక ఎన్నికల్లో గెలవడం కష్టమని భావించిన కూటమి నేతలు సరికొత్త కుట్రలకు తెరదీశారు. రూల్స్ను గాలికొదిలి అధికారులతో కలిసి అడ్డగోలు విభజనకు శ్రీకారం చుట్టారు. సరిహద్దులను చెరిపేసి.. డివిజన్లను చెల్లాచెదురు చేశారు. పారదర్శకత పూర్తిగా లోపించింది. అభ్యంతరాలు పెడచెవిన నగరంలో డివిజన్ల పునర్విభజన ప్రక్రియ అశాసీ్త్రయంగా సాగిందంటూ అభ్యంతరాలు వ్యక్తమైనా, పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఈ తీరును వ్యతిరేకిస్తూ హైకోర్టును నగర ప్రజలతో పాటు 13వ డివిజన్ కార్పొరేటర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున, ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తదితరులు ఆశ్రయించారు. ఈ తరుణంలో విచారణ జరిపిన న్యాయస్థానం.. పునర్విభజన ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీంతో అడ్డదారిలో విజయం సాధించాలనే టీడీపీ, జనసేన కుట్రలు బెడిసికొట్టాయి. 54 నుంచి 72కు.. వాస్తవానికి నెల్లూరు నగరపాలక సంస్థలో 54 డివిజన్లు ఉన్నాయి. వీటిని 72కు పెంచుతూ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ మేరకు పునర్విభజన చేయాలని ఆదేశాలిచ్చింది. దీన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా మార్చేలా కూటమి నేతలు ప్లాన్ చేశారు. టీడీపీ కీలక నేతల కనుసన్నల్లో.. నిబంధనలను కార్పొరేషన్ అధికారులు ఇష్టారాజ్యంగా ఉల్లంఘించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 20 డివిజన్ల నుంచి 250 అభ్యంతరాలొచ్చాయంటే ఆఫీసర్లు ఎలా వ్యవహరించారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇదే తరహాలో 13, 51, 43, 26వ డివిజన్లలోనూ స్థానికులు, కార్పొరేటర్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఓటమి తప్పదనే ఇలా.. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లయింది. హామీల విస్మరణ.. దిగజారిన శాంతిభద్రతలు.. నిరుద్యో గం.. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు.. ఇలా ఎన్నో కారణాలతో సర్కార్పై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తప్పదనే భావనతో కుట్రలకు పచ్చ నేతలు తెరదీశారు. డివిజన్ల పునర్విభజన ప్రక్రియను అడ్డం పెట్టుకొని అడ్డదారిలో విజయం సాధించేందుకు ప్లాన్ చేశారు. నిజానికి ఈ వ్యవహారంలో కొన్ని నిబంధనలను విధించారు. అయితే వీటన్నింటినీ ఉల్లంఘించి అస్తవ్యస్త విభజనకు నిర్ణయించారు. నగరపాలక సంస్థలో అడ్డగోలుగా డివిజన్ల పునర్విభజన గెలుపే లక్ష్యంగా టీడీపీ కుతంత్రాలు నిబంధనలను ఉల్లంఘిస్తూ మార్పులు, చేర్పులు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వైఎస్సార్సీపీ డీలిమిటేషన్ ప్రక్రియను నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు నైరాశ్యంలో టీడీపీ, జనసేన నెల్లూరు నగరపాలక సంస్థలో అధికార పార్టీ చేపట్టిన పునర్విభజన ప్రక్రియపై హైకోర్టులో రిట్ పిటిషన్ను 13వ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున దాఖలు చేశారు. 2027 జనాభా లెక్కల సేకరణ జరుగుతోందని, ఇది పూర్తికాక ముందే 2011 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలకు వెళ్లాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో అన్ని వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లనుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జనగణన నిబంధనల మేరకు 2025 డిసెంబర్ 31లోపు ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని, 2026 జనవరి 1 నుంచి 2027 ఏప్రిల్ 1 వరకు మొత్తం ప్రక్రియను ఫ్రీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల నుంచి అన్ని మున్సిపాల్టీ లు, కార్పొరేషన్లకు స్పష్టంగా తెలియజేసిందని పేర్కొన్నారు. అయినా నిబంధనలను ఉల్లంఘిస్తూ డివిజన్ల పునర్వభజన చేయడంపై అభ్యంతరం తెలిపారు. దీంతో డీలిమిటేషన్ ప్రక్రియపై ఉన్నత న్యాయస్థానం తాత్కాలిక స్టే విధించింది. సరిహద్దులా.. మేము చెప్పలేము..! -
ఫస్టియర్లో ఆరు.. సెకండియర్లో నాలుగు
● ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల నెల్లూరు (టౌన్): ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఇందులో ప్రథమ సంవత్సరంలో ఆరు.. సెకండియర్లో నాలుగో స్థానాన్ని జిల్లా సాధించింది. ఫస్టియర్కు సంబంధించి 4756 మంది హాజరుకాగా., వీరిలో 1998 మంది ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత 42 శాతంగా నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 4358 మందికి గానూ 2788 మంది పాసయ్యారు. ఇందులో పాస్ పర్సంటేజీ 64 శాతంగా ఉంది. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు.. ఫలితాలకు సంబంధించిన రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్కు ఈ నెల 26లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. రీ కౌంటింగ్లో సబ్జెకుకు రూ.260.. రీ వెరిఫికేషన్లో సబ్జెక్ట్కు రూ.1300 మేర ఫీజును ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంది. బీసీల పరిస్థితులపై సమగ్ర అధ్యయనం నెల్లూరు రూరల్: బీసీల సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనాన్ని నిర్వహించి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు డెడికేటెడ్ కమిషన్ కృషి చేస్తోందని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి గురువారం నిర్వహించారు. జిల్లాలోని బీసీల జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితులు, స్థానిక సంస్థల్లో ప్రాతినిధ్యానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. గణాంకాలు, రికార్డులను సమగ్రంగా సిద్ధం చేసి కమిషన్కు అందజేయాలని సూచించారు. అనంతరం వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు, నేతల నుంచి వినతిపత్రాలను స్వీక రించారు. డీఆర్వో విజయకుమార్, జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమాధికారి వెంకటలక్ష్మమ్మ, డీపీఓ వసుమతి, డీఈఓ బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నుంచి ఆరుగురు ఎంపీటీసీల సస్పెన్షన్ కోట: మండలానికి చెందిన ఆరుగురు ఎంపీటీసీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉత్తర్వులను విడుదల చేశారు. ఎంబేటి శశి (వంజివాక), మండి శివరావమ్మ (గూడలి – 2), మొబీన్బాషా (కోట – 2), కర్లపూడి సుబ్రహ్మణ్యం (తిన్నెలపూడి), దాసరి పోలమ్మ (సిద్ధవరం), ఎంబేటి హిమబిందు (కొక్కుపాడు)పై సస్పెన్షన్ వేటేశారు. ఈ నెల నాలుగున నిర్వహించిన కోట ఎంపీపీ ఎన్నిక సందర్భంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులొచ్చిన నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు వీరిని సస్పెండ్ చేశారు. గస్తీ బోటు రాకతో తమిళ జాలర్ల పరార్ వాకాడు: అక్రమ వేటను నివారించేందుకు సముద్రంపై గస్తీ తిరుగుతున్న అధికారుల బోటు సైరన్ను వాకాడు మండలం తూపిలిపాళెం తీరంలో మోగించడంతో తమళ జాలర్లు పరారయ్యారు. తూపిలిపాళెం తీరం వద్ద వేటను అక్రమంగా సాగిస్తున్న క్రమంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మైరెన్, మత్స్యశాఖ అధికారుల బోటు ఉనికిని పసిగట్టిన వీరు తమ ఖరీదైన వలను కత్తులతో కోసి అక్కడే వదిలేసి పరారయ్యారు. అధికారులు వెంబడించినా, పలాయనం చిత్తగించారు. నిరీక్షణ.. చివరికి వాయిదా సైదాపురం: అధికారులు గంట తరబడి నిరీక్షించారు. చివరికి కోరం లేక మండల సమావేశాన్ని వాయిదా వేస్తున్నామని ఎంపీడీఓ ప్రకటించారు. సైదాపురం మండల సర్వసభ్య సమావేశాన్ని గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభించాల్సి ఉంది. మండల, గ్రామ స్థాయి అధికారులు హాజరై సభ్యుల కోసం నిరీక్షించారు. అయితే ఎంపీపీ పలుగొటి పెంచలమ్మ, ఊటుకూరు, పాలూరు ఎంపీటీసీలు తిరకాల భాస్కర్, ఈశ్వరరాజు మాత్రమే హాజరయ్యారు. తమకు నిధులను కేటాయించడంలో పక్షపాత ధోరణిని పాటించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి సమావేశాన్ని వాయిదా వేశారు. -
విద్యార్థులకు యోగా పోటీలు
నెల్లూరు(బారకాసు): యోగా పోటీల విజేతలకు నెల్లూరు ఎన్ఎంసీ కార్యాలయంలోని సీసీసీ భవన సమావేశ మందిరంలో బుధవారం బహుమతులు ప్రదానం చేశారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో వివిధ విభాగాల్లో పోటీలు ఈనెల 14, 15, 16 తేదీల్లో నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగాయి. విజేతలను మేయర్ దేవరకొండ సుజాత, కమిషనర్ వైఓ నందన్, డిప్యూటీ డైరక్టర్ మాధురి, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్, ఆయుష్ డాక్టర్ ఎ.శారద హెప్సీబా ఘనంగా సత్కరించి బహుమతులను అందజేశారు. మేయర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలు రాజేంద్ర, ప్రసన్నకుమార్, స్వప్న, యోగా అబ్జర్వర్లు రమణయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
తహసీల్దార్ కార్యాలయంలో రైతు నిరసన
ఉదయగిరి రూరల్: మండల తహల్దార్ కార్యాలయంలో బుధవారం ఓ రైతు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గన్నేపల్లి రెవెన్యూ పరిధిలోని కొట్టాలపల్లికి చెందిన కే రామానాయుడుకు 135–3–2 సర్వేనంబరులో 60 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. వారసత్వంగా వచ్చిన ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో భూమిపై బ్యాంకులో వ్యవసాయ రుణం సైతం తీసుకుని చెల్లించి ఉన్నాడు. ప్రస్తుతం భూమిపై వ్యవసాయం రుణం పొందేందుకు బ్యాంకుకు వెళ్లగా నిషేధ జాబితాలో ఉందని తిరస్కరించారు. ఈ విషయమై రైతు వీఆర్వోను అడిగేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాడు. అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ సీట్లో ఉన్న వీఆర్వోకు సమస్యను విన్నవించే క్రమంలో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అంతలో గన్నేపల్లి వీఆర్వో కార్యాలయానికి రాగా తన భూమిని ఎలా మారుస్తారు అంటూ నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తహసీల్దార్ ఎల్ రామ్మోహన్రావు దృష్టికి తీసుకెళ్లగా లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేస్తే రికార్డులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
విభిన్న ప్రతిభావంతులకు స్కాలర్షిప్లు
నెల్లూరు(టౌన్): జిల్లాలో విభిన్న ప్రతిభావంతులు ప్రభుత్వం అందజేసే స్కాలర్షిప్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ తెలిపారు. ప్రత్యేక అవసరాల గల 394 మంది పిల్లలకు రూ.22.14 లక్షల విలువ చేసే సహాయక పరికరాలను నెల్లూరులోని ఏన్జీఓ హోంలో బుధవారం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 2025 – 26 విద్యా సంవత్సరంలో విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం ద్వారా ఎస్కార్ట్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, బాలికల స్టై ఫండ్, బేస్డ్ ఎడ్యుకేషన్ కలిపి రూ.71.82 లక్షలు అందజేయడం జరిగిందన్నారు. డీఈఓ బాలాజీరావు మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరంలో సీడబ్ల్యూసీఎన్ విద్యార్థులు కూడా ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు. ప్రత్యేక అవసరాల గల పిల్లలకు హియరింగ్ పరికరాలు, టీఎల్ఎం, బ్రెయిల్ కిట్లు, వీల్చైర్లు, ట్రై సైకిళ్లు తదితర వాటిని అందజేసినట్లు చెప్పారు. సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ 6 ఆటిజం కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. నెల్లూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఆత్మకూరు, కావలి, వింజమూరు, గూడూరు ప్రాంతాల్లో భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. వాటి ద్వారా పిల్లలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేట్ బొబ్బల శ్రీనివాస యాదవ్, ఏఎంఓ సుధీర్బాబు, ఐఈ కో ఆర్డినేటర్ ప్రసాద్రావు, ఎంఈఓ మురళి, అలింకో ప్రతినిధి సోని యాదవ్, సెక్టోరియల్ అధికారులు, ఐఈఆర్పీలు పాల్గొన్నారు. -
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 25 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 86,601 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 31,111 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.32 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ వినతుల స్వీకరణ నేడు నెల్లూరు(వేదాయపాళెం): డెడికేటెడ్ బీసీ కమిషన్ చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్రంజన్మిశ్రా కలెక్టరేట్ ఆవరణలోని తిక్కనభవన్లో గురువారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిణి పీ వెంకటలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరిస్తారని చెప్పారు. జిల్లాలోని కుల సంఘాలు, పౌరులు, ప్రజాప్రతినిధులు తమ వినతులను అందజేయాలని కోరారు. ఊనుగుంటపాళెంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కోట: మండలంలోని ఊనుగుంటపాళెం సమీపంలో 12 మెగా వాట్స్ సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్తెలిపారు. బుధవారం రాత్రి ఆయన సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కోసం సేకరించిన స్థలాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కోసం 40 ఎకరాలు సేకరించినట్లు తెలిపారు. మోహన్ స్పింటెక్స్ సంస్థ విద్యుత్ కేంద్రం పనులు చేపడుతుందని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్లోగా కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ను యూనిట్ రూ.3.09 వంతున ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఆయన వెంట టెక్నికల్ డైరెక్టర్ గురవయ్య, సీజీఎం రమణ, నెల్లూరు, తిరుపతి జిల్లాల ఎస్ఈలు రాఘవేంద్ర, చంద్రశేఖర్, గూడూరు ఈఈ నరేంద్రరెడ్డి ఉన్నారు. అవినీతిలో టీడీపీ నేతల కొత్తపుంతలు ● కాలువలో నీరు ప్రవహిస్తుండగానే పూడికతీత పనులు ● బిల్లుల కోసమే తూతూమంత్రంగా చేపడుతున్నారని రైతుల గగ్గోలు మనుబోలు: సర్వేపల్లి నియోజకవర్గ అధికార పార్టీ నాయకులు అవినీతిలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఇరిగేషన్ పనులు చేయకుండానే చేసినట్లుగా చూపిస్తూ బిల్లులు చేసుకున్న ఉదంతాలు మరవక ముందే మరో సరికొత్త అవినీతికి తెరతీశారు. మనుబోలు మండలంలోని వీరంపల్లి నుంచి చెర్లోపల్లి వరకు ఉన్న కండలేరు పంట కాలువలో నిండుగా నీరు ప్రవహిస్తుండగానే పూడికతీత పనులు పడుతున్నారు. సాధారణంగా పంట కాలువల్లో సాగునీటిని విడుదల చేయకముందే పూడికతీత పనులు చేపట్టాలి. కానీ టీడీపీ నాయకులు అందుకు విరుద్ధంగా కాలువకు నీరు వదిలాక పూడికతీత పనులు చేపట్టడంపై రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ధనాన్ని దోచుకునేందుకు తూతూ మంత్రంగా కాలువ గట్టుపై ఉన్న గడ్డిని తొలగిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. -
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
● జిల్లా మలేరియా నివారణాధికారి సింహాచలం నెల్లూరు(అర్బన్): మలేరియాతోపాటు డెంగీ, చికున్గున్యా, ఎన్సెఫలోపతి తదితర వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించి తగిన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా మలేరియా నివారణాధికారి సింహాచలం సూచించారు. బుధవారం నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో వివిధ సబ్ యూనిట్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూన్ నెలలో తొలకరి వర్షాలు పడుతున్నాయన్నారు. ఇందువల్ల దోమల ఉధృతి పెరిగే అవకాశం ఉందన్నారు. అవగాహన ర్యాలీలు నిర్వహిస్తూ దోమల నివారణ, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుత్రపై ప్రజలను చైతన్యం చేయాలన్నారు. కరపత్రాలు పంచుతూ ఆరోగ్య సూత్రాలు తెలియచేయాలన్నారు. సంక్షేమ హాస్టళ్లలో ఆల్ఫాసైఫోమెత్రిన్ లాంటి మందులను స్ప్రే చేసి బ్యాక్టీరియాలను నశింపజేయాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి జయరామ్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నెల్లూరు నుంచే పోరుబాట
● ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు నెల్లూరు (అర్బన్): పోరాటాల పురిటి గడ్డ.. ఎన్నో ఉద్యమాలకు నాంది పలికిన నెల్లూరు నుంచే ఉద్యోగుల హక్కుల సాధన కోసం ప్రభుత్వంపై పోరాడేందుకు శ్రీకారం చుడుతున్నామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. పీఆర్సీ ఐఆర్, డీఏ అరియర్స్, సరెండర్ లీవు, ఎర్న్ లీవులు తదితర ఆర్థిక అంశాలపై కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాల్సిన పోరాటంపై చర్చించేందుకు బుధవారం బొప్పరాజు వెంకటేశ్వర్లు నెల్లూరులో జేఏసీలో భాగస్వాములైన అన్ని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ ఉద్యోగులు ప్రభుత్వానికి వెన్నెముక వంటి వారన్నారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరువ చేసేది కూడా ఉద్యోగులేనన్నారు. ఉద్యోగులకు ఉన్న గౌరవ ప్రదమైన జీవితాన్ని ఆర్థిక పరంగా దిగజార్చవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని తీవ్రతరం చేయబోతున్నామన్నారు. ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ సిద్ధం ఇప్పటికే 28 జిల్లాల్లో ఉద్యమ కార్యాచరణపై కార్యవర్గ సమావేశాలు నిర్వహించామన్నారు. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా కలిసొచ్చే సంఘాలను కలుపుకుంటూ మంత్రులను కలుస్తూ ఉద్యమ అవసరాన్ని వివరిస్తున్నామన్నారు. రెండు లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అతి తక్కువ వేతనంతో పని చేస్తున్నారని, రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో 90 శాతం ఉద్యోగుల ఖర్చులకే సరిపోతున్నాయని చెబుతూ ప్రజల దృష్టిని ప్రభుత్వం మళ్లించడం అన్యాయమన్నారు. పెన్షనర్లకు, ఉద్యోగులకు పెట్టే ఖర్చుపై తమకు స్పష్టమైన అవగాహన ఉందని ప్రజలకు వాస్తవాలు వివరిస్తామన్నారు. ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇకనైనా ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెల సాధనకు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకత్వం చేపట్టే కార్యక్రమాలను వంద శాతం విజయవంతం చేస్తామని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఒక్కటంటే ఒక్క ఆర్థిక ప్రయోజనం చేకూర్చలేదని తెలిపారు. ఈ సమావేశంలో జేఏసీ రాష్ట్ర ఉద్యమ కమిటీ చైర్మన్ ఫణిపేర్రాజు, జిల్లా జనరల్ సెక్రటరీ ఓవీ ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుమార్రెడ్డి, వైస్ చైర్మన్ చంద్రశేఖర్, జిల్లా మహిళా చైర్మన్ సోమిశెట్టి వసంతకుమారి, మహిళా సెక్రటరీ చెన్నమ్మ, కార్యవర్గ సభ్యులు థామస్, చెంచురామయ్య, మురళి, మాల్యాద్రి, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు డానియేల్ పీటర్, గోపీకృష్ణ, బాలకోటమ్మ, వెంకట్, ప్రధానోపాధ్యాయుల సంఘం గౌరవాధ్యక్షుడు ఎమ్వీ చలపతి, బుజ్జయ్య, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, డేటా ఎంట్రీ ఆపరేటర్ల సంఘ నాయకులు, ఆర్టీసీ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొని ఉద్యమానికి మద్దతుగా సంఘీభావాన్ని ప్రకటించారు. -
అనుమతి ఒకచోట..తవ్వకాలు మరోచోట
చిట్టమూరు: తాగు, సాగు నీటి అవసరాలను తీర్చే స్వర్ణముఖి నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో నది పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని ఆరోపిస్తూ చిట్టమూరు మండలానికి చెందిన పలువురు రైతులు గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. వారి ఫిర్యాదులపై విచారణ చేపట్టిన ట్రిబ్యునల్ నదిలో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని తిరుపతి, నెల్లూరు జిల్లాల కలెక్టర్లకు నోటీసులిచ్చింది. అయినా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో రాత్రి, పగలు తేడా లేకుండా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ప్రశ్నిస్తే ఎదురు దాడి స్వర్ణముఖి నదిలో ఇసుక తవ్వకాలకు ఓ ప్రైవేటు సంస్థకు గనుల శాఖ ద్వారా అనుమతులిచ్చారు. కోట మండలం గూడలి ప్రాంతంలో మాత్రమే తవ్వకాలు చేపట్టాలని అనుమతులున్నప్పటికీ.. సదరు సంస్థ నిబంధనలను పట్టించుకోకుండా ఇతర ప్రాంతాల్లో కూడా తవ్వకాలు చేపడుతోందని ఆరోపణలున్నాయి. దీనిపై ప్రశ్నించేందుకు వెళ్లిన వారిపై అడిగేందుకు మీరు ఎవరంటూ ఎదురు దాడికి దిగుతున్నారని రైతులు వాపోతున్నారు. పరిధి దాటి తవ్వకాలు కోట మండలం గూడలి ప్రాంతంలో మాత్రమే ఇసుక రీచ్కు అనుమతులున్నాయి. అక్కడ నిబంధనలను తుంగలో తొక్కి అనుకున్న దాని కన్నా ఎక్కువగా తవ్వకాలు పూర్తి చేసుకుని.. ఇసుక లేదని నిర్ధారించుకున్న అనంతరం స్వర్ణముఖి నదిలో ఎగువ ప్రాంతంలోని చిట్టమూరు మండలంలో ఉన్న గునపాడు, మెట్టు, గునపాటి పాళెం గ్రామాలకు సమీపంలోని నదీ గర్భంలో లోతుగా తవ్వకాలు చేపడుతున్నారు. పగలు, రాత్రి సమయంలో తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నా కనీసం అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. 40 గ్రామాల ప్రజలకు ఇబ్బందులు చిట్టమూరు, వాకాడు, కోట మండలాలలోని సుమారు 40 గ్రామాలకు తాగు, సాగునీటి అవసరాలకు స్వర్ణముఖి నది ఎంతో ఉపయోగకరంగా ఉండేది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు సంవత్సరాలుగా ఒక పంట పూర్తిగా పండితే రెండో పంటకు నీరు లేని స్థితి ఏర్పడుతోంది. మూడు మండలాల్లో నది పరీవాహపక ప్రాంతాలతోపాటుగా స్వర్ణముఖి నదిని ఆధారంగా చేసుకుని ఉన్న చెరువుల కింద సుమారుగా 15 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తారు. వేసవి కాలంలో నీరు ప్రవహించకపోతే నదిలోనే బోర్లు వేసుకుని పంటలకు నీరు అందించేవారు. ఇలా రైతులు సుమారు 3 వేలకు పైగా బోర్లు నది పరీవాహక ప్రాంతంలో వేసుకుని సాగు చేస్తున్నారు. అలాగే తాగునీటి పథకాలకు చెందిన బోర్లు కూడా నదిలోనే ఉండటంతో భారీగా ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటి కష్టాలు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టిప్పర్లు, ట్రాక్టర్లతో తరలింపు ఉచిత ఇసుక పేరుతో కాంట్రాక్ట్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. పెద్ద యంత్రాలతో ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా నాయుడుపేట, గూడూరు ప్రాంతాలకు, టిప్పర్ల ద్వారా చైన్నె, బెంగళూరుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని చెబుతున్నారు. అయినా ఆగలేదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనుమతులు పొందిన గూడలి రీచ్ పరిధిని దాటి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలోని చిట్టమూరు మండలంలో ఉన్న గునపాడు, గునపాటిపాళెం, మెట్టు గ్రామాల పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్లో పరిస్థితులు తీవ్రంగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ చైన్నెలోని గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. రైతులు సమర్పించిన పత్రాలను పరిశీలించిన ట్రిబ్యునల్.. స్వర్ణముఖి నదిలో ఇసుక తవ్వకాలకు బ్రేక్ వేయాలని రెండు జిల్లాల కలెక్టర్లకు సూచించినట్లు రైతులు తెలిపారు. అయినా తవ్వకాలు కొనసాగుతున్నాయని, ఇకనైనా అధికారులు స్పందించి ఇసుక తవ్వకాలకు అడ్డుకట్ట వేసి రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఇష్టారాజ్యంగా స్వర్ణముఖి నది ఇసుక తరలింపు గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు బేఖాతరు భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతుల ఆందోళన రెండు జిల్లాల కలెక్టర్లు పట్టించుకోవడం లేదని ఆవేదన -
కాపలాదారుడి దారుణ హత్య
ముత్తుకూరు (పొదలకూరు): రొయ్యల గుంతల వద్ద దశాబ్ద కాలంగా కాపలాగా ఉన్న ఓ గిరిజన వృద్ధుడిని గుర్తుతెలియని వారు కర్రలు, కత్తులతో దాడి చేసి హతమార్చారు. మంగళవారం అర్ధరాత్రి వృద్ధుడిని పాశవికంగా హత్య చేయడం చుట్టుపక్కల గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని పొట్టెంపాడు నక్కల కాలువ సమీపంలో పోలంరాజు గుంటకు చెందిన దువ్వూరు సుబ్బరామిరెడ్డి రొయ్యల చెరువుల వద్ద అల్లూరి శేషయ్య (70) పది సంవత్సరాలుగా కాపలాదారుడిగా పనిచేస్తున్నాడు. ఆయనపై గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై మృతిచెందాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, కృష్ణపట్నం సీఐ రఘుబాబు, ఎస్సై కొండారెడ్డి, పోలీస్ సిబ్బందితో బుధవారం ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ నిర్వహించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు సీఐ వెల్లడించారు. సుబ్బరామిరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీ గార్డు మృతిముత్తుకూరు(పొదలకూరు): కృష్ణపట్నం పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సెక్యూరిటీ గార్డు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. కృష్ణపట్నం దళితవాడకు చెందిన దాసరి మహీధర్ (33) పంటపాళెంలోని పామాయిల్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం తన బావను ఫ్యాక్టరీ వద్ద వదిలిపెట్టి బైక్పై బయలుదేరిన మహీధర్ తిరిగి ఇంటికి వెళ్లలేదు. అర్ధరాత్రి గోపాలపురం సమీపంలోని తూము వద్ద పొలంలో బైక్ లైట్లు వెలుగుతుండటాన్ని గమనించిన స్థానికులు వెళ్లి పరిశీలించగా మహీధర్ హెల్మెట్తో బోర్లా పడి మృతిచెంది ఉండటాన్ని గమనించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మలుపు వద్ద బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న ఆరడుగుల దిగువనున్న పొలంలోకి దూసుకెళ్లడంతో ప్రమాదం జరిగి మృతిచెంది ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేశారు. పేకాట స్థావరంపై పోలీసుల దాడులునెల్లూరు సిటీ: నెల్లూరులోని ఎన్టీఆర్ నగర్కు ఎదురుగా చెరకు తోటలో కొందరు వ్యక్తులు గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్నారు. బుధవారం రూరల్ పోలీసులకు సమాచారం అందడంతో దాడులు చేశారు. ఎనిమిది మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. రూ.5,610 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు.కాలువలో మృతదేహం లభ్యంనెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ పరిధిలోని కేవీకే కల్యాణ మండపం వద్ద కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు బుధవారం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయసు 40 – 45 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. అతను చనిపోయి మూడు రోజులై ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. -
వసతి గృహ విద్యార్థులపై నిర్లక్ష్యం తగదు
నెల్లూరు(వేదాయపాళెం): వసతి గృహ విద్యార్థులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే మస్తాన్ షరీఫ్ అన్నారు. నెల్లూరులోని సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం బుధవారం నేతలు ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయ సూపరింటెండెంట్ అంకయ్యకు వినతిపత్రం సమర్పించారు. శివంవర్మ, సోహెల్, ఖాదర్బాషా, మౌళి, అశోక్, రమేష్, కుమార్, జగదీష్ పాల్గొన్నారు. -
వింజమూరులో భారీ వర్షం
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో సుమారు రెండు గంటల పాటు కురిసిన వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంగ్లా సెంటర్లోని ఇరిగేషన్ కార్యాలయం, ఎస్సీ వసతిగృహంలోకి సుమారు అడుగున్నర మేర వర్షపు నీరు చేరడంతో ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న పార్కులోకి భారీగా వర్షపు నీరు చేరింది. ఈదురుగాలులకు ఎమ్మెస్సార్ డిగ్రీ కళాశాల సమీపంలోని కాలనీలో చెట్లు విరిగి రోడ్డుపై పడడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన హోర్డింగులు, ఫ్లెక్సీలు నేలకొరిగాయి. పట్టణంలోని పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్ తీగలు తెగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మండలంలోని బొమ్మరాజుచెరువు ప్రాంతంలో ఇటుకబట్టీల్లోని ఇటుకలు వర్షానికి తడిసిపోయాయి. మామిడితోటల్లోని కాయలు నేలరాలడంతో రైతులు నష్టపోయారు. కలిగిరి, జలదంకి, వింజమూరు, కొండాపురం, దుత్తలూరు మండలాల్లోని పలు గ్రామాల్లో కూడా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు తీవ్ర ఎండవేడితో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం వేళ ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసి వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమనం పొందారు. -
కనుపూరు చెరువులో గ్రావెల్ తవ్వకాలు
● అడ్డుకునేందుకు ఇరిగేషన్ అధికారుల యత్నం ● వాగ్వాదానికి దిగిన టీడీపీ నేతలు వెంకటాచలం: మండల కేంద్రమైన వెంకటాచలంలోని కనుపూరు చెరువులో గ్రావెల్ అక్రమ తవ్వకాలకు టీడీపీ నేతలు తెరలేపారు. పలువురు నాయకులు బుధవారం పోటాపోటీగా ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీలతో గ్రావెల్ తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకున్నారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో అక్రమంగా గ్రావెల్ తరలించారు. దీనిపై స్థానికులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు అడ్డుకునేందుకు కనుపూరు చెరువు వద్దకు వెళ్లగా అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. అయితే అక్రమ గ్రావెల్ తవ్వకాలపై సోషల్ మీడియాలో వీడియోలు వైరలయ్యాయి. దీంతో తవ్వకాలను నిలిపివేసి జేసీబీ, ట్రాక్టర్లను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. -
ఏఐతో విప్లవాత్మక మార్పులు
నెల్లూరు(టౌన్): విద్య, వైద్యం, పరిశ్రమలు, వ్యవసాయం, బ్యాంకింగ్, పరిశోధన లాంటి అనేక రంగాల్లో ఏఐతో విప్లవాత్మక మార్పులు వస్తాయని నారాయణ ఇంజినీరింగ్ కళాశాల డీన్ గంగినేని ధనుంజయ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయాలు, ఇంజినీరింగ్, వైద్య, డిగ్రీ కళాశాలల్లో బోధన, పరిశోధన, మూల్యాంకనం తదితర కార్యకలాపాల్లో ఏఐ ఆధారిత విధానాలను అమలు చేస్తున్నారన్నారు. ఏఐ విద్యావ్యవస్థను పూర్తిగా మార్చగల శక్తిగా అవతరిస్తుందన్నారు. ఏఐ ప్రభావంతో ఉద్యోగ రంగంలో వేగవంతమైన మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. ప్రశ్నపత్రాల మూల్యాంకనంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. దివ్యాంగ విద్యార్థుల విద్యా ప్రగతికి ఏఐ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఎంబీఏ విద్య ద్వారా ఫైనాన్స్, మార్కెటింగ్, మానవవనరుల నిర్వహణ, కార్యకలాపాల నిర్వహణ, వ్యవస్థాపకత, ప్లేస్మెంట్లు తదితర వాటిల్లో ఉపాధి, ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఏఐ ద్వారా పలు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఉన్నత విద్యలో ఏఐను విజయవంతంగా అమలు చేయాలంటే దశల వారీ కార్యచరణ ప్రణాళిక అవసరమన్నారు. వృద్ధురాలి ఆత్మహత్యమర్రిపాడు: మండలంలోని అల్లంపాడు గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. డి.కొండమ్మ (75) బుధవారం పురుగు మందు తాగింది. గమనించిన కోడలు ఆమెను వెంటనే ఆత్మకూరు వైద్యశాలకు తరలించింది. పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరుకు తీసుకెళ్తుండగా కొండమ్మ మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కొండమ్మకు ఐదుగురు పిల్లలున్నారు. -
యాదవులపై టీడీపీ పైశాచిక ప్రచారం
కావలి: కావలి నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా యాదవ సామాజిక వర్గం రగిలిపోతుంది. కొంత కాలంగా అధికార పార్టీలోని యాదవ సామాజిక వర్గం అణిచివేతకు గురవుతోందని లోలోన మదనపడుతున్నారు. టీడీపీ అధికారంలో ఉండడంతో అవమానాలు జరుగుతున్నప్పటికీ ఏమీ చేయలేక పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. కొంతమంది అప్పుడప్పుడు బాహాటంగానే తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇటీవల యాదవ సామాజిక వర్గానికి చెందిన మురళీయాదవ్ పూర్తిగా అణిచి వేయబడుతూ తీవ్రంగా అవమానాలకు గురి చేస్తుండడంతో దాదాపు 25 ఏళ్ల సుదీర్ఘ టీడీపీతో అనుబంధాన్ని వీడి వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపారు. బతికున్న మనిషిని చంపేస్తూ పోస్టులు కావలికి చెందిన చిలకపాటి మధు అనే వ్యక్తి యూట్యూబ్ చానల్ నిర్వహిస్తూ ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డికి ప్రధాన అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆయనతో పాటు మరికొందరు ఎమ్మెల్యే అడుగులకు మడుగులు ఒత్తుతూ టీడీపీలోని యాదవ సామాజిక వర్గం నేతల నుంచి ప్రతిపక్ష నేతలనూ సైతం టార్గెట్ చేసి అభ్యంతరమైన రీతిలో కించపరుస్తూ పోస్టులు పెట్టించడంతో పాటు ఈ–పేపర్ మీడియాల్లో కథనాలు రాయించి, ఆ కథనాలను సైతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇటీవల వైఎస్సార్సీపీ బోగోలు మండలాధ్యక్షుడు మద్దిబోయిన వీర రఘు అకాలంగా మృతి చెందారంటూ పోస్టులు పెట్టిన వీరు.. తాజాగా గుండ్లపల్లి మురళీయాదవ్ టీడీపీని వీడిపోయాడని అతన్నే కాదు.. ఆ సామాజిక వర్గాన్ని మొత్తాన్ని కించపరుస్తూ ‘యాదవ నాయాళ్లారా’ అని సంభోదిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇదే సమయంలో టీడీపీ రాజ్యసభ సభ్యుడిగా కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్రావుకు ఇటీవల విక్రమసింహపురి యూనివర్సిటీ డాక్టరేట్ను ప్రదానం చేయడాన్ని కూడా తప్పు పడుతూ ఆయనపైనా దుష్ప్రచారం చేస్తూ పెయిడ్ ఈ–పేపర్ మీడియాల్లో కథనాలు రాయించారు. దీంతో ఆ సామాజిక వర్గంలో ఇప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి పెల్లుబికింది. ఈ క్రమంలో నియోజకవర్గంలోని ఆ సామాజిక వర్గం ఏకతాటిపైకి వచ్చి ఈ నెల 14న కావలిలోని జర్నలిస్టు క్లబ్లో మురళీయాదవ్ ఆధ్వర్యంలో నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు చైతన్య, మరికొంతమంది నాయకులు మీడియా సమావేశంలో చిలకపాటి మధు పైశాచిక పోస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిలకపాటి మధుని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తమ సామాజికవర్గాన్ని టార్గెట్ చేసి కించపరచడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. అనంతరం ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా వేదికగా నీచమైన పోస్టులు సొంత పార్టీ నేత బీద మస్తాన్రావునూ వదిలి పెట్టని వైనం అన్ని పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు చేయని పరిస్థితి రగిలిపోతున్న ఆ సామాజిక వర్గీయులు ఫిర్యాదులు బుట్టదాఖలు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నడిచే సోషల్ మీడియా ముసుగులో పెయిడ్ ఆర్టిస్ట్లు చిలకపాటి మధు, చిలకపాటి మనోహర్, మధు కిషోర్, తోకల శ్రీను, గొర్రెపాటి హరీష్ తదితరులు వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసి నిత్యం అభ్యంతరకరమైన రీతిలో పోస్టులు పెడుతుండడంతో ఇటీవల మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి కావలి ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో యాదవ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ పోస్టుల పెట్టడాన్ని నిరసిస్తూ కావలితోపాటు బోగోలు, దగదర్తి, అల్లూరు పోలీస్స్టేషన్లో ఆ సామాజికవర్గీయులు వరుసగా ఫిర్యాదులు చేశారు. అయినా ఇంత వరకు కేసులు నమోదు చేయకపోగా, పోలీసులు సదరు సోషల్ మీడియా వ్యక్తులకు వత్తాసు పలకడాన్ని పార్టీలకు అతీతంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని యాదవులు ఏకతాటిపైకి వచ్చి మండి పడుతున్నారు. కేసులు బుట్టదాఖలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు తాము ఇచ్చిన ఫిర్యాదులపై కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేయకపోతే జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరిస్తున్నారు.కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి అండతో కొంత మంది టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్లు యాదవ సామాజికవర్గాన్ని టార్గెట్ చేసి అభ్యంతరకరమైన రీతిలో పైశాచిక ప్రచారానికి తెగబడుతున్నారు. ఆ సామాజిక వర్గీయులను కించపరుస్తూ సోషల్ మీడియాతో పాటు ఈ–పేపర్ మీడియాల్లో కథనాలు రాయిస్తున్న వైనం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్టాపిక్గా మారింది. ఈ వ్యవహారంపై జిల్లా స్థాయిలో ఆ సామాజిక వర్గీయులు రగిలిపోతున్నారు. సదరు సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని పోలీస్స్టేషన్లలోనూ ఫిర్యాదులు చేసినా కేసులు నమోదు చేయకపోగా, వారికే వత్తాసు పలుకుతుండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. -
ప్రశాంతమ్మా.. విమర్శలు మాని అభివృద్ధిని చూపండి
● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి బుచ్చిరెడ్డిపాళెం: కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ కూటమి ప్రభుత్వ, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి విమర్శించారు. బుచ్చిరెడ్డిపాళెంలో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తనపై కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చేసిన విమర్శలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఇటీవల పెనుబల్లి, చెల్లాయపాళెం గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని విమర్శలు చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పెనుబల్లిలో రూ.60 లక్షలతో గ్రామ సచివాలయం, రూ.22లక్షలతో రైతుభరోసా కేంద్రం నిర్మించామని చెప్పారు. రూ.2.10 కోట్లతో ముంబై హైవే నుంచి పెనుబల్లి వరకు సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. జొన్నవాడ నుంచి బుచ్చిరెడ్డిపాళెం వరకు పెనుబల్లి మీదుగా రహదారి అభివృద్ధికి రూ.2.50 కోట్లు వెచ్చించామని తెలిపారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా మండల పరిషత్ పాఠశాలను రూ.15 లక్షలు, ఉన్నత పాఠశాలను రూ.35 లక్షలతో అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. తుపానుతో కూలిపోయిన పాఠశాల ప్రహరీని సహకార బ్యాంకుల ద్వారా రూ.45 లక్షలు సమీకరించి నిర్మించామని చెప్పారు. ఆనాడు డీసీఎమ్మెస్ చైర్మన్గా ఉన్న వీరి చలపతి రూ.25 లక్షలు, వవ్వేరు బ్యాంకు చైర్మన్గా ఉన్న సూరా శ్రీనివాసులురెడ్డి రూ.10 లక్షలు కేటాయించారని తెలిపారు అలాగే మరో బ్యాంకు చైర్మన్గా ఉన్న మేనకూరు సీతారామిరెడ్డి రూ.10 లక్షలు అందజేశారని చెప్పారు. ఈ విషయాలన్నీ ఎమ్మెల్యే తెలుసుకుని మాట్లాడాలన్నారు. తమ ప్రభుత్వంలో 33 సంక్షేమ పథకాలను అమలు చేసి పేదలకు అండగా నిలిచామని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం సూపర్సిక్స్ హామీలను కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. కనీసం ఒక్క కొత్త పెన్షన్ అయినా మంజూరు చేసిందా అని నిలదీశారు. మేము చేసిన అభివృద్ధిని సాక్షాధారాలతో సహా వెల్లడిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. కోవూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చాక రౌడీయుజం ఎక్కువైందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యర్థి పార్టీల ఫ్లెక్సీలు చించివేయడంతో పాటు కార్యకర్తలపై దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ వంశీపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ రాజకీయ భిన్నాభిప్రాయాలను హింసతో అణచివేయాలని చూడడం ప్రమాదకర ధోరణి అని అన్నారు. ప్రజాస్వామ్యంలో విమర్శలను ఎదుర్కోవాలి గానీ దాడులతో సమాధానం చెప్పడం సరికాదన్నారు. అధికార పార్టీ నాయకులు తమ వైఖరిని మార్చుకోకపోతే ప్రజలే తగిన సమయంలో సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు. -
రైతుల్ని ఆదుకోవడంలో ‘కూటమి’ విఫలం
● ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి ఆత్మకూరు: అన్నదాతలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులు కష్టపడి పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం యూరియా సైతం తగినంత సరఫరా చేయలేక ఏపీఏఐఎంఎస్ యాప్తో వారిని తీవ్ర గందరగోళానికి గురిచేస్తోందన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ప్రభుత్వం రైతులకు అవసరమైన ఎరువులను సమృద్ధిగా అందుబాటులో ఉంచడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. యాప్ను తీసుకొచ్చి కొత్త విధానం అమలు చేస్తున్నామని బుకాయిస్తూ అన్నదాతలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌలు రైతులు, పట్టాదారు పాస్పుస్తకాల్లేని రైతులు, చెరువు లోతట్టు ప్రాంతాల్లో సాగు చేస్తున్న వారికి ఈ ప్రభుత్వం ఎరువులు అందించక పంగనామం పెడుతుందని, దీంతో వారు ఎరువుల దుకాణాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పరిస్థితి నెలకొందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామాల్లో ఆర్బీకేలను ఏర్పాటు చేసి విత్తనాలు, ఎరువులు గుమ్మం ముందుకే చేర్చారన్నారు. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో సమృద్ధిగా సాగునీరు ఉన్న క్రమంలో లక్షల ఎకరాల్లో పైర్లు సాగవుతున్న విషయం ప్రభుత్వం ముందుగా గుర్తించక, ఎరువుల సరఫరా చేయడంలో విఫలమవ్వడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం అధికారుల ద్వారా ఎరువుల నిల్వలు పెంచి కొరత లేకుండా యూరియా, డీఏపీ, తదితర ఎరువులను డిమాండ్ మేరకు సరఫరా చేయడంలో చొరవచూపాలని కోరారు. కౌలు రైతులకు ప్రత్యేక విధానం ద్వారా ఎరువులు అందజేయాలని, పూర్తి పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. రైతులు మండిపడి రోడ్డెక్కే పరిస్థితులు తీసుకురావ్వొద్దని పేర్కొన్నారు. -
సాగరతీరంలో సామూహిక యోగా
విడవలూరు: మండలంలోని రామతీర్థం బీచ్లో మంగళవారం సామూహిక యోగా కార్యక్రమం జరిగింది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కలెక్టర్ హిమాన్షు శుక్లా, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు స్వయంగా యోగా సనాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా సంజీవని లాంటిదన్నారు. ముఖ్యంగా మహిళలు, యువత ఒత్తిడిని జయించి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడానికి నిత్యం యోగా సాధన చేయాలని కోరారు. యోగాంధ్ర స్ఫూర్తితో జిల్లాలో ప్రతి గ్రామంలోనూ ప్రజలు ఆరోగ్య చైతన్యంతో ముందుకు సాగాలని ఆకాంక్షిచారు. ప్రముఖ యోగా గురువు డాక్టర్ స్వప్న ఆధ్వర్యంలో ఈ యోగాసనాల ప్రదర్శన సాగింది. యోగాలోని ప్రతి ఆసనం ప్రాముఖ్యతను, అవి మానవ శరీరానికి చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాలను ఆమె వివరిస్తూ యోగాసనాలు చేయించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఏ లక్ష్మీప్రసన్న, ఎంపీడీఓ టి.నగేష్కుమారి, ఆయూష్, పర్యాటక, ఆరోగ్య, మత్స్య శాఖల అఽధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది, యోగా సాధకులు పాల్గొన్నారు. -
అపార్ట్మెంట్లో భారీ చోరీ
జిల్లాలో శాంతిభద్రతలు భ్రమగా మారాయి. పోలీస్ వ్యవస్థ రెడ్బుక్ రాజ్యాంగం మత్తులో తూగుతూ ఉండడంతో నేరస్తులు పంజా విసురుతూనే ఉన్నారు. వేకువ జామున ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వందల మంది పోలీసుల బూట్ల చప్పుళ్లతో హడావుడి చేసి కార్డెన్ సెర్చ్లంటూ ఇల్లిల్లూ జల్లెడ పడుతున్నా.. నాకాబందీ అంటూ ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నా.. నేరాలు మాత్రం రోజు రోజుకు పెరుగుతున్నాయి. నేరస్తుల పాలిట సింహస్వప్నంగా వ్యవహరించిన పోలీస్ వ్యవస్థ నిఘాను పూర్తిగా గాలికొదిలేసింది. ప్రజలు రాత్రి వేళే కాదు.. పగటి పూట కూడా ప్రశాంతంగా, భద్రతగా బతకలేని పరిస్థితి జిల్లాలో కనిపిస్తోంది. పట్టపగలు వరుస చైన్ స్నాచింగ్లే కాకుండా.. ఏకంగా భారీ చోరీలు, దోపిడీలకు తెగబడుతున్నారు. రాత్రయితే మద్యం మత్తులో రౌడీమూకలు రోడ్లపై చెలరేగుతున్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన చోరీలు, దోపిడీలే ఇందుకు అద్దం పడుతున్నాయి. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని పోలీసు అధికారులు పదే పదే ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఎలాంటి చర్యలు తీసుకున్నా దొంగలు బరితెగిస్తున్నారు. పట్టపగలే ప్రజల సొమ్మును ఇట్టే కొల్లగొడుతూ పట్టుకోండి చూద్దామంటూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఆరు నెలల వ్యవధిలో దుండగులు సుమారు రూ.3 కోట్లకు పైగా సొత్తును దోచుకెళ్లారు. వరుస దొంగతనాలు జిల్లా వాసులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. జిల్లాలో ప్రతి రోజు ఏదో ఒక పోలీసుస్టేషన్ పరిధిలో పోలీసు అధికారులు కార్డెన్ సెర్చ్లు నిర్వహిస్తున్నారు. పాతనేరస్తుల కదలికలపై నిఘాతోపాటు జైల్ మానిటరింగ్ వ్యవస్థను పటిష్టం చేశారు. అయినప్పటికీ నేరాలకు అడ్డుకట్ట పడటం లేదు. నేరస్తులు యథేచ్ఛగా నేరాలకు పాల్పడూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లు, దుకాణాలను లక్ష్యంగా చేసుకుని పంజా విసురుతున్నారు. రాత్రులే కాదు పట్టపగలే నిర్భయంగా ప్రజలు కూడబెట్టుకున్న ఽసొత్తును దోచుకెళుతున్నారు. శివారు ప్రాంతాల్లోని ఇళ్లలోనే కాకుండా అపార్ట్మెంట్ల్లోనూ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. దొంగతనాలకు కాదేది అనర్హమంటూ చోరులు దేవాలయాలను వదలడం లేదు. కొంతకాలంగా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో చోరీలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఓ కేసులో నిమగ్నమై ఉండగానే నేరస్తులు మరో చోట నేరాలకు పాల్పడుతూ పోలీస్ వ్యవస్థకు చాలెంజ్ విసురుతున్నారు. ఈ పరిణామాలతో ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. పసిడి ధరలు పెరగడమే.. రోజు రోజుకు బంగారం ధరలు రాకెట్లా దూసుకెళుతుండటంతో దొంగల కన్ను పసిడిపై పడింది. దీంతో దొంగతనాలు అధికమయ్యాయి. పోలీసు గస్తీ అంతంత మాత్రంగా ఉండడం, అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పని చేయకపోవడం చోరులకు కలిసి వస్తోంది. దొంగలు చిన్నపాటి ఆధారం దొరక్కుండా జాగ్రత్త పడుతున్నారు. గుర్తు పట్టకుండా ఉండేందుకు ముఖాలకు మాస్క్లు, తలకు హెల్మెట్లు ధరించి నంబర్ ప్లేట్లు లేని, దొంగిలించిన బైక్లపై సంచరిస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల సీసీ కెమెరాలను, డీవీఆర్లను అపహరించుకుని వెళుతున్నారు. రాత్రి వేళల్లో బైక్పై వెళుతున్న దంపతులను కత్తులతో బెదిరించి నగలు, నగదు దోచేస్తున్నారు. పసిడి కోసం హత్యలకు, హత్యాయత్నాలకు వెనుకాడడం లేదు. తాజాగా నెల్లూరు నగరంలోని వనంతోపు సెంటర్లో ఓ అపార్ట్మెంట్లో పట్టపగలు దుండగలు దాదాపు 30 సవర్ల బంగారం, 2 కేజీల వెండిని దోచుకెళ్లడం జిల్లాలో సంచనలనంగా మారింది. సెక్యూరిటీతోపాటు సీసీకెమెరాల నీడలో ఉండే అపార్ట్మెంట్లోనే దొంగలు దర్జాగా స్కూటీపై దోచుకెళ్లారంటే చోరుల బరితెగింపునకు, ఖాకీ వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. గొలుసు దొంగతనాలు జిల్లాలో గొలుసు దొంగలు రెచ్చిపోతున్నారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. గతంలో శివారు ప్రాంతాల్లో ఎక్కువగా చోటు చేసుకునేవి. ఇప్పుడు జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ గొలుసులను తెంపుకెళుతున్నారు. రోడ్లపై ఒంటరిగా వెళ్లే, ఇళ్ల ముందు శుభ్రం చేసుకునే, దుకాణాల్లో ఒంటరిగా ఉంటున్న మహిళల మెడల్లోని బంగారు గొలుసులను లాక్కెళుతున్నారు. మహిళలపై దాడిచేసి మరీ దోచుకెళుతున్నారు. ఇటీవల నెల్లూరు నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మహిళల మెడల్లోని బంగారు గొలుసులను దుండగులు తెంపుకెళ్లారు. గూడూ రుకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు ఆటలో పాఠశాలకు వెళుతుండగా ఆటో డ్రైవర్ ఆమైపె దాడి చేసి మెడలోని ఒకటిన్నర సవర బంగారు గొలుసును దోచుకున్నాడు నిఘా ఏదీ..? నిఘా, సాంకేతికత చోరీలను కట్టడి చేయలేకపోతున్నాయి. పగలు, రాత్రి గస్తీ అంతంత మాత్రంగానే మారింది. అనేక చోట్ల క్రైమ్ పార్టీలు మొక్కుబడి విధులకే పరిమితమైయ్యాయన్న విమర్శలున్నారు. జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికి సీసీ కెమెరాలు సక్రమంగా లేవు. ఉన్న ప్రాంతాల్లోనూ కొన్ని పనిచేయకపోవడం చోరులకు కలిసి వస్తోంది. పోలీసు అధికారులు స్పందించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు సీసీకెమెరాల నిఘా నీడలోకి జిల్లాను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇటీవల ఘటనలు మచ్చుకు కొన్ని.. రెండేళ్లుగా జిల్లాలో శాంతిభద్రతలు క్షీణత రెడ్బుక్ రాజ్యాంగంలో పోలీసు వ్యవస్థ నిత్యం కార్డెన్ సెర్చ్, నాకాబందీ అంటూ హడావుడి అయినా విచ్చలవిడిగా దొంగతనాలు, దోపిడీలు ఒక బ్యాచ్ పట్టపగలు 30 సవర్ల బంగారం, 2 కేజీల వెండి చోరీ దర్జాగా స్కూటీలో వచ్చారు.. పని కానిచ్చేశారు ఓ కారు తనిఖీల్లో రౌడీషీటర్ల వద్ద మారణాయుధాలు పట్టుబడిన వైనం ఫలితమివ్వని పోలీస్ చర్యలు బంగారం, వెండి అపహరణ నెల్లూరు (క్రైమ్): సీసీ కెమెరాల నీడలో ఉండే ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్లో గుర్తు తెలియని దుండగలు భారీ చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం మేరకు... వనంతోపు మూడో వీధిలోని కల్పతరువు అపార్ట్మెంట్ రెండో ఫ్లోర్లోని ఫ్లాట్లో యామిని నివాసం ఉంటున్నారు. ఆమె కుమార్తె హైదరాబాద్లో ఉంటోంది. కుమార్తె తన బంగారు ఆభరణాలను తల్లి వద్దే ఉంచి వెళ్లారు. ఇటీవల యామిని ప్లాట్కు తాళం వేసి కుమార్తె వద్దకు వెళ్లింది. సోమవారం ఇద్దరు దుండగులు స్కూటీపై అపార్ట్మెంట్కు వచ్చారు. ప్లాట్ తలుపును పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాను తెరచి అందులో ఉన్న బంగారు ఆభరణాలు, ఇంట్లోని వెండి వస్తువులను అపహరించుకుని వెళ్లారు. మంగళవారం ఉదయం ఫ్లాట్ తలుపులు తెరచి ఉండడాన్ని వాచ్మెన్ గమనించి అపార్ట్మెంట్ వాసులకు తెలియజేశారు. వారు ఈ విషయాన్ని బాధితురాలికి చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ నుంచి నెల్లూరుకు బయలుదేరడంతోపాటు వేదాయపాళెం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. ఇంట్లో 35 సవర్లకు బంగారు ఆభరణాలు ఉన్నట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం మేరకు సుమారు 20 సవర్లకు పైగా బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను అపహరించుకుని వెళ్లినట్లు తెలుస్తోంది. బాధితులు వస్తే ఎంత మేరకు సొత్తు అపహరణకు గురైందో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. పక్కా రెక్కీవేసి.. సోమవారం ఉదయం 10.49 గంటల ప్రాంతంలో దుండగులిద్దరూ హెల్మెట్లు ధరించి స్కూటీపై అపార్ట్మెంట్ లిఫ్ట్ వద్దకు వచ్చారు. అందులో వెనుక కూర్చొన్న వ్యక్తి స్కూటీ దిగి అపార్ట్మెంట్లోకి వెళ్లగా డ్రైవ్ చేస్తున్న వ్యక్తి సెల్లార్లో స్కూటీపై వేచి ఉన్నాడు. పైకి వెళ్లిన వ్యక్తి రెండు నిమిషాల తర్వాత కిందకు వచ్చాడు. అనంతరం ఇద్దరు కలిసి పైకి వెళ్లి చోరీ చేసి స్కూటీపై వెళ్లిపోయారు. చోరీ జరిగిన తీరు, నిందితుల వ్యవహార శైలిని బట్టి పక్కా రెక్కీ వేసి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం అపార్ట్మెంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. ఇద్దరు నిందితుల్లో ఒకరు ఢిల్లీకి చెందిన వాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మిగిలిన నిందితుడు ఎవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలంతోపాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
యాదవులను కించపరిచేలా పోస్టులు
● యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడిపై ఫిర్యాదు బిట్రగుంట: కావలి కేంద్రంగా సోషల్ మీడియాలో యాదవ సామాజికవర్గాన్ని కించపరిచేలా పోస్టులు పెడుతున్న యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడిపై బోగోలు జెడ్పీటీసీ సభ్యురాలు మద్దిబోయిన కీర్తన బిట్రగుంట పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. కావలికి చెందిన చిలకపాటి మధు అనే వ్యక్తి సీఎండీ న్యూస్ ఛానెల్ పేరుతో ఏర్పాటు చేసి యాదవులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు లో పేర్కొన్నారు. జర్నలిస్ట్ల పేరుతో కావలి కేంద్రంగా ఎన్నో యూట్యూబ్ ఛానెళ్లు, వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తూ యాదవ సామాజికవర్గాన్ని కించపరచడమే లక్ష్యంగా ఈ ముఠా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇటీవల వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘు యాదవ్పై సైతం ఇదే తరహాలో సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు వైరల్ చేశారని గుర్తుచేశారు. రఘు చనిపోయాడంటూ అర్ధరాత్రి సమయంలో వాట్సాప్లో తప్పుడు కథనాలు వైరల్ చేశారని, ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. పోలీసులు ఈ ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. కాగా అంతకుముందు కీర్తన నివాసం వద్ద వీరరఘు, స్థానిక యాదవ సామాజికవర్గ పెద్దలు, వైఎస్సార్సీపీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చిలకపాటి మధును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నకిలీ విలేకరులకు కూడా పోలీసులు వంతపాడటం విడ్డూరంగా ఉందన్నారు. గతంలోనూ ఈ ముఠా తప్పుడు వ్యవహరాలపై ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. -
అధికారుల అప్రమత్తం.. తనిఖీలు విస్తృతం
● రైల్వే స్టేషన్లలో భద్రతపై ప్రత్యేక దృష్టి ● కొనసాగుతున్న తనిఖీలు ● ప్రయాణికుల జాగ్రత్తగా ఉండాలి ● సూచించిన అధికారులు నెల్లూరు(క్రైమ్): జిల్లా రైల్వే పోలీసు యంత్రాగం అప్రమత్తమైంది. ఆదివారం అర్ధరాత్రి బాపట్ల సమీపంలో దొంగలు రైల్లోని మహిళల వద్ద బంగారు నగలు దోచుకుని పరావుతుండగా పోలీసులు కాల్పులు జరపడం కలకలం రేకెత్తించింది. ఈ నేపథ్యంలో రైల్వే డీఎస్పీ మురళీధర్ నేతృత్వంలో సీఐ ఎ.సుధాకర్, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ రమేష్గౌడ్ తమ సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి రైల్వేస్టేషన్లు, రైళ్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. నేరాలు జరిగిన/అవకాశమున్న శ్రీవెంకటేశ్వరపాళెం, బిట్రగుంట, అల్లూరు రోడ్డు, కొడవలూరు, వెంకటాచలసత్రం, గూడూరు చైన్నె ఔటర్, రేణిగుంట ఔటర్ పాయింట్లో సాయుద సిబ్బందితో పికెట్లు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక హైవే పోలీసులను సమన్వయం చేసుకుని రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న హైవే వెంబడి గస్తీని పెంచారు. పాత నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెంచారు. ఏం చేస్తున్నారంటే.. దొంగల కళ్లు బంగారంపైనే ఉంటున్నాయి. రైల్వేస్టేషన్లలో ప్లాట్ఫారంలపై సంచరిస్తూ ఏ బోగీల్లో మహిళలు ఎక్కువగా బంగారు ఆభరణాలు ధరించారో గుర్తిస్తున్నారు. ప్రయాణికుల్లా ఆ బోగీల్లో ఎక్కి అందరితో కలివిడిగా ఉంటున్నారు. అదును చూసి బ్యాగ్ లు, ల్యాప్టాప్లు, సెల్ఫోన్లు, బంగారు ఆభరణా లను తస్కరించి క్షణాల్లో మాయం అవుతున్నారు. సాంకేతికతను ఆయుధంగా మలుచుకుని సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి దోపిడీలకు పాల్పడుతున్నారు. గతంలో పలు ఘటనలు ● రెండేళ్ల క్రితం కావలి – శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ మధ్య దుండగులు సిగ్నల్ ట్యాంపర్ చేసి నరసాపురం నుంచి ధర్మవరం వెళ్తున్న రైల్లో ఎస్ – 13, ఎస్ – 11 బోగీల్లో దోపిడీ చేశారు. అడ్డువెళ్లిన ప్రయాణికుడిపై రాళ్లతో దాడిచేసి గాయపరిచారు. అదేరోజు షిర్డీ సాయినగర్ నుంచి తిరుపతి వెళ్తున్న రైల్లోని ఎస్ – 3, ఎస్ – 5 కోచ్ల్లోనూ చోరీ చేశారు. ● గతేడాది అల్లూరు రోడ్డు రైల్వేస్టేషన్ సమీపంలో దుండగులు హోమ్ సిగ్నల్స్ ట్యాంపర్ చేయడంతో హౌరా నుంచి బెంగళూరు వెళ్లే రైలు ఆగిపోయింది. అయితే సిగ్నల్ ట్యాంపర్ జరిగిన ప్రాంతానికి రైలు నిలిచిన ప్రాంతానికి మధ్య దూరం ఉండటంతో దోపిడీ విఫలమైంది. ● అదేరోజు గంట అనంతరం చండీఘర్ నుంచి మదురై వెళ్తున్న రైల్లో దుండగులు చైన్లాగి ఎస్ – 2, ఎస్ – 4, ఎస్ – 5 కోచ్ల్లోని ముగ్గురు మహిళా ప్రయాణికుల మెడల్లోని బంగారు చైన్లు, బ్యాగ్లు అపహరించారు. ● గతేడాది మేనెలలో శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ వద్ద నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో దొంగలు బీభత్సం చేశారు. జాగ్రత్తలు తప్పనిసరి ప్రయాణికులు రైళ్లలో ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అపరిచితులు ఇచ్చే తినుబండారాలు, పానీయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరాదు. మహిళలు సాధ్యమైనంత మేరకు ప్రయాణాల్లో బంగారు ఆభరణాలు ధరించకపోవడం మంచింది. రాత్రి వేళల్లో కిటికీ పక్కన ఉంటే నగలు, ఫోన్లు జాగ్రత్తగా ఉంచుకోవాలి. కిటికీ అద్దాలు మూసి ఉంచాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే టోల్ఫ్రీ నంబర్ 139కు లేదా బోగీల్లోని టీటీఈ, రైల్వే పోలీసులకు సమాచారం అందించాలి.చోరీల నివారణకు ప్రత్యేక చర్యలు రైళ్లలో చోరీల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాన్నాం. బీట్ వ్యవస్థను పటిష్టం చేశాం. నేరాలు జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేశాం. పాతనేరస్తులు, అంతర్ రాష్ట్ర ముఠాల కదలికలపై నిఘా పెంచాం. దొంగలు కనిపిస్తే కాల్చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయి. ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి. – ఎ. సుధాకర్, రైల్వే సీఐ -
రైల్లోంచి జారిపడి..
● వృద్ధుడి మృతి నెల్లూరు(క్రైమ్): రైల్లోంచి ప్రమాదవశాత్తు జారి కిందపడి గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరు కొండాయపాళెం గేటు సమీపంలో చైన్నె వైపు వెళ్లే పట్టాలపై మంగళవారం చోటుచేసుకుంది. మృతుడి వయసు 60 నుంచి 65 ఏళ్లలోపు ఉంటుందని భావిస్తున్నారు. గ్రే కలర్ హాఫ్ హ్యాండ్స్ టీషర్టు ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 92475 75628 ఫోన్ నంబర్కు తెలియజేయాలని ఆమె కోరారు. గూడ్స్ రైలు కిందపడి..● గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య రాపూరు: ఓబులవారిపల్లి – కృష్ణపట్నం పోర్టు రైల్వే మార్గమధ్యలో రాపూరు సమీపంలో గుర్తుతెలియని యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం జరిగింది. అతని వయసు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. కాఫీ కలర్ షర్ట్, గ్రే కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. కేసు నమోదు చేశామని రైల్వే ఎస్సై హరిచందన తెలిపారు.వీధికుక్క దాడిలో బాలుడికి తీవ్రగాయాలుమర్రిపాడు: మండలంలోని ఇర్లపాడు గ్రామంలో వీధికుక్క దాడిలో 9 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. భరత్ కృష్ణ మంగళవారం ఆడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వీధికుక్క దాడి చేసి పలుచోట్ల కరిచినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ సభ్యులు వెంటనే బాలుడిని మర్రిపాడు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, వైద్యుడు గోపీనాథ్ చికిత్స అందించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఇదిలా ఉండగా గ్రామాల్లో వీధికుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నా రులు, వృద్ధులు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి వీధికుక్కల సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఐస్ ఫ్యాక్టరీలో మృతదేహంకోవూరు: కోవూరు సమీపంలోని రామన్నపాళెం గేటు వద్ద ఉన్న పాడుబడిన ఐస్ ఫ్యాక్టరీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అతని వయసు, మరణానికి గల కారణాలపై ప్రాథమిక వివరాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. ఆపేవారేరీ?● ఆగని ఇసుక అక్రమ రవాణా ● పట్టించుకోని అధికారులు కావలి: జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ఇసుక రీచ్లను మూసి వేసినా యథేచ్ఛగా అక్రమ రవాణా సాగుతోంది. అధికార పార్టీ నాయకుల అండదండలతోపాటు అధికారులు మామూళ్ల మత్తులో మునిగిపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఈనెల 8వ తేదీ నుంచి రీచ్లను మూసివేయగా డంపింగ్ యార్డ్ల నుంచి ఇసుక తరలించాల్సి ఉంది. అయితే పగలు, రాత్రి అనే తేడా లేకుండా రీచ్ల నుంచే ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. పొట్టకూటి కోసం ట్రాక్టర్లు, ఆటోలు నడుపుకొని జీవనం సాగించే వారిపై జులుం ప్రదర్శించే అధికారులు అధికలోడుతో ఇసుక తరలిస్తుంటే ఏమి చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. గుండెపోటుతో వ్యవసాయాధికారి మృతిబుచ్చిరెడ్డిపాళెం: మండల వ్యవసాయాధికారి నడవాటి శ్రీహరి (46) గుండెపోటుతో మృతిచెందారు. సోమవారం ఆయన బుచ్చి మండలంలో జరిగిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పర్యటనలో పాల్గొన్నాడు. సాయంత్రం అధికారిక కార్యక్రమాలను పూర్తి చేసుకుని తన నివాసానికి చేరుకున్నాడు. అనంతరం అకస్మాత్తుగా గుండెలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా రాత్రి మృతిచెందాడు. శ్రీహరికి భార్య, పిల్లలున్నారు. మృతి విషయం తెలిసిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల ఉద్యోగులు, రైతు సంఘాల నాయకులు ఆయన నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
హుండీ కానుకల లెక్కింపు
ఇందుకూరుపేట: మండలంలోని గంగపట్నంలో కొలువైన చాముండేశ్వరి దేవస్థానంలో హుండీ కానుకలను మంగళవారం లెక్కించారు. మూడు నెలల కాలానికి గానూ ప్రధాన హుండీ ద్వారా రూ.5,93,784.. అన్నదాన హుండీ ద్వారా రూ.28,363 మొత్తం లభించింది. గత త్రైమాసికంతో పోలిస్తే ఈసారి రూ.53,330 మేర పెరిగిందని ఆలయాధికారులు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ గుండాల కృష్ణారెడ్డి మాట్లాడారు. భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే లక్ష్యంగా దేవస్థానం కృషి చేస్తోందని వెల్లడించారు. హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయాభివృద్ధి, భక్తులకు సౌకర్యాల కల్పనకు వినియోగించనున్నామని పేర్కొన్నారు. కోవూరు గ్రూప్ దేవస్థానాల ఈఓ కృష్ణప్రసాద్, ఈఓ తాతా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఓఆర్బీ–ఈ స్కూటర్ డిజైన్కు పేటెంట్
గూడూరురూరల్: ఆదిశంకర కమ్యూనిటీ ఇంకుబేషన్ సెంటర్ (ఏసీఐసీ), అటల్ ఇన్నోవేషన్ మిషన్ (నీతి ఆయోగ్)లో ఇంకుబేషన్ పొందుతున్న భారత్ ఆల్ట్ ఫ్యూయెల్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించి విప్లవాత్మక ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఓఆర్బీ–ఈ’కి డిజైన్కు పేటెంట్ను అధికారికంగా మంజూరు చేసినట్లు ఆదిశంకర డీమ్డ్ టు బీ యూనివర్సిటీ చాన్సలర్ అరవింద వంకి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశీయ స్టార్టప్లు, అంతర్జాతీయ స్థాయిలో ఆవిష్కరణలు చేయగలవని ఈ పేటెంట్ నిరూపిస్తోందన్నారు. దీని ద్వారా ప్రధాని నరేంద్రమోదీ ప్రోత్సహించే మేక్ ఇన్ ఇండియా దృష్టిని బలంగా ధ్రువపరుస్తోందన్నారు. ఓఆర్బీ–ఈను ఆధునిక డిజైన్తో పట్టణ ప్రయాణ అవసరాలకు అనుగుణంగా రూపొందించినట్లు వెల్లడించారు. ఆదిశంకర ఏసీఐసీ కేంద్రం ద్వారా మొబిలిటీ, క్లీన్టెక్, అధునాతన ఇంజినీరింగ్ రంగాల్లో స్టార్టప్లకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. ఆదిశంకర చైర్మన్ డాక్టర్ వంకి పెంచలయ్య ప్రారంభించిన ఈ సదుపాయం ద్వారా నూతన ఆవిష్కరణలకు, భారతీయ తయారీ రంగానికి మద్దతు అందిస్తున్నట్లు తెలియజేశారు. -
మొదలైన చేపల వేట
ముత్తుకూరు(పొదలకూరు): రెండునెలలపాటు కొనసాగిన చేపల వేట నిషేధ కాలం ముగిసింది. ముత్తుకూరు మండల తీర ప్రాంతాల మత్స్యకారులు పడవలు, వలలు, వేట సామగ్రితో వేటకు బయలుదేరారు. నేలటూరుపాళెం, కృష్ణపట్న ం గ్రామాలకు చెందిన మత్స్యకారులు వేటను పునః ప్రారంభించారు. సముద్రంలో చేపల సంతానోత్పత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఏడాది ఏప్రిల్ 15 నుంచి జూన్ 14వ తేదీ వరకు ప్రభుత్వం వేటపై నిషేధం విధిస్తుంది. ఈ సమయంలో మత్స్యకారులు బోట్ల మరమ్మతులు, ఇంజిన్లను సరిచేయడం, వలల తయారీ, ఇతర సామగ్రి సిద్ధం చేసుకోవడం వంటి పనులు పూర్తి చేసుకున్నారు. నిషేధ సమయం పూర్తవుతుందునగా బోట్లకు డీజిల్, ఐస్, ఆహార సామగ్రిని సమకూర్చుకున్నారు. తీరానికి చేరుకున్న మత్స్యకారులు సముద్ర దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొందరు రోజువారీ వేటకు వెళ్లగా, మరికొందరు రెండు నుంచి నాలుగు వారాల పాటు సముద్రంలోనే ఉండి వేట సాగించనున్నారు. రెండు నెలలుగా ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొన్న మత్స్యకార కుటుంబాలు వేట ప్రారంభంతో ఊరట చెందుతున్నాయి. వాతావరణం అనుకూలిస్తే పీతలు, రొయ్యలు, వివిధ రకాల చేపలు అధికంగా లభించే అవకాశం ఉందని చెబుతున్నారు. రెండు నెలల విరామం తర్వాత తీర ప్రాంతాల్లో మళ్లీ బోట్ల శబ్దాలతో సందడి నెలకొంది. -
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం
● వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్రాధ్యక్షుడు జాన్ వెస్లీ నెల్లూరురూరల్: ‘రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యంగా మారింది. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజల స్వేచ్ఛను హరిస్తున్నారు’ అని వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్రాధ్యక్షుడు జాన్ వెస్లీ విమర్శించారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశం జరిగింది. తొలుత ఆ పార్టీ నెల్లూరు రూరల్ సమన్వయకర్త ఆనం విజయ్కుమార్రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి అన్ని సంఘాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి నేతలు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ ప్రచారం చేసి.. అధికారంలోకి వచ్చాక చేసిందేమీ లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి విశ్వసనీయత, చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలన్నారు. జాన్ వెస్లీ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రిస్టియన్లు, మైనార్టీలపై విపరీతమైన దాడులు జరుగుతున్నాయన్నారు. గతంలో ఏ ప్రభుత్వంలోనూ ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. కార్పొరేట్, మతతత్వ, కులతత్వ విధానాలతో ప్రభుత్వ వ్యవస్థలను బలహీనపరుస్తున్నారని విమర్శించారు. భూ, ఇసుక, మద్యం, గంజాయి మాఫియాలు పెట్రేగిపోతున్నాయన్నారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తులు కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారన్నారు. క్రిస్టియన్ మైనార్టీ కమిషన్ను ఇప్పటివరకు ఎందుకు నియమించలేదని ప్రశ్నించారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైఎస్ జగన్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందన్నారు. పాస్టర్లకు గౌరవ వేతనం అందించడంతో పాటు పేద క్రైస్తవులకు జెరూసలేం యాత్ర అవకాశాలు కల్పించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్లలో ఒక్కరినైనా జెరూసలేం యాత్రకు పంపిందా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటారన్నారు. కార్యక్రమంలో క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అనుదీప్, సిటీ అధ్యక్షురాలు సులోచన, రూరల్ అధ్యక్షుడు దాసరి రాజేష్, విభాగ నాయకులు పాల్గొన్నారు. -
అగ్రిగోడు
ఉదయగిరి: అగ్రిగోల్డ్ సంస్థ.. ఆకర్షణీమైన వడ్డీని ఆశ చూపింది. కోట్లాది రూపాయలను ప్రజల నుంచి వసూలు చేసింది. ఆ తర్వాత బోర్డు తిప్పేసి డిపాజిటర్లకు కుచ్చుటోపీ పెట్టింది. లక్షలాది మంది డిపాజిటర్లకు తీరని శోకాన్ని మిగిల్చింది. గతంలో అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని పెద్దలే కుటల్రు చేసి అగ్రిగోల్డ్ సంస్థను మింగేసే ప్రయత్నం చేశారు. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు బాధితులకు న్యాయం చేయకపోగా అగ్రిగోల్డ్ సంస్థ ప్రతినిధుల ద్వారా ఆస్తులను కాజేసే ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో గత టీడీపీ ప్రభుత్వంలో బాధితులకు న్యాయం జరగలేదు. రూ.కోట్ల విలువైన సంపద స్వాహా జిల్లాలో అగ్రిగోల్డ్కు చెందిన భూములు, అందులోని సంపదను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వాహా చేసే ప్రక్రియను ప్రారంభించింది. జిల్లాలోని ఉదయగిరి, కలిగిరి, వరికుంటపాడు, దుత్తలూరు, గూడూరు, మనుబోలు తదితర మండలాల్లో 3,200 ఎకరాల భూములు ఉన్నాయి. అందులో విలువైన జామాయిల్, మామిడి, ఎర్రచందనం చెట్లు సాగులో ఉన్నాయి. వాటిపై కూటమి నేతలు కన్నేసి సంపదను కొల్లగొట్టారు. వరికుంటపాడులోని అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న జామాయిల్ను అక్రమంగా తరలిస్తుండగా అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నేతలు అడ్డుకున్నారు. వారిపైన అక్రమార్కులు దాడులకు సైతం పాల్పడ్డారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అగ్రిగోల్డ్ భూముల్లోని రూ.కోట్ల విలువ చేసే సంపదను స్వాహా చేశారు. న్యాయం జరిగేనా..? గత వైఎస్సార్పీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలని సంకల్పించింది. రూ.కోట్ల విలువ చేసే ఆస్తులను ప్రభుత్వ ఆధీనంలో ఉంచి భవిష్యత్ అవసరాలకు వినియోగించుకోవాలని భావించింది. కానీ కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా ఆలోచిస్తోంది. ఆస్తులను వేలం వేసి వచ్చిన సొమ్మును బాధితులకు ఇవ్వాలని సంకల్పించింది. ఈ వ్యవహారంలో విలువైన భూములు, ఆస్తులను కాజేసే ప్రయత్నాలు జరగుతున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీని కోసం కూటమి ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. మరి బాధితులకు ఎప్పుడు న్యాయం చేస్తుందో తెలియని పరిస్థితి. పదేళ్లుగా బాధితులు మాత్రం న్యాయం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. పాదయాత్రలో జగన్ దృష్టికి.. జిల్లాలో 1.20 లక్షల మంది బాధితులు అందాల్సిన సొమ్ము రూ.150 కోట్లు న్యాయం కోసం పదేళ్లకుపైగా పోరాటం జగన్ ప్రభుత్వంలో ఊరట బాధితుల గోడును పట్టించుకోని కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర సందర్భంగా లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. అధికారంలోకి వస్తే న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన ఆయన కొంత మేర నిలబెట్టుకున్నారు. జిల్లాలో 1.20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. వీరు గతంలో ప్రజాప్రతిధులు, ఆధికారుల చుట్టూ న్యాయం కోసం తిరిగి అలసిపోయారు. గత చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. 2019లో అధికారం చేపట్టిన వెంటనే జగన్మోహన్రెడ్డి బాధితులకు న్యాయం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా జిల్లాలో మొదటి విడతలో రూ.10వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్ చేసిన బాధితులకు రూ.50 కోట్లు చెల్లించారు. కానీ జిల్లాలో ఇంకా రూ.150 కోట్లకు పైగా చెల్లింపులు చేయాల్సి ఉంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారడంతో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో చెల్లింపులు చేయలేకపోయింది. ఇంతలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం రావడంతో అగ్రిగోల్డ్ బాధితుల పరిస్థితి తలకిందులైంది. -
టీడీపీ నేత నుంచి ప్రాణహాని ఉంది
● పోలీస్స్టేషన్లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేజర్ల: మండలంలోని పెరుమాళ్లపాడుకు చెందిన తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి తల్లపనేని జయంతులు నాయుడి నుంచి ప్రాణహాని ఉందంటూ అదే గ్రామానికి చెందిన గట్టుపల్లి జయరామయ్య నాయు డు మంగళవారం చేజర్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామంలో సర్వే నంబర్ 591లో తనకు పొలం ఉందని, అందులో చెట్లు తొలగించేందుకు కూలీలను తీసుకువెళ్లగా జయంతులు నాయుడు మరి కొంతమంది అటకాయించి చంపేస్తామంటూ బూతులు తిడుతూ దౌర్జన్యం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. భార్యపై ఇటుకతో దాడి● అదనపు కట్నం కోసమే.. నెల్లూరు సిటీ: అదనపు కట్నం కోసం భర్త దాడి చేశాడంటూ ఓ మహిళ నెల్లూరు రూరల్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులోని వివరాల మేరకు.. మాదరాజుగూడూరు గ్రామంలోని దళితవాడలో పి.ప్రశాంత్, మానస దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. అదనపు కట్నం కోసం ప్రశాంత్ కొంతకాలంగా భార్యను వేధిస్తున్నాడు. సోమవారం రాత్రి అతను భార్యను తిట్టాడు. అంతటితో ఆగకుండా ఇటుకతో దాడి చేశాడు. దీంతో ఆమె తల, ఎడమ చేతికి గాయాలయ్యాయి. కుటుంబ సభ్యుల సహకారంతో హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రశాంత్ కుటుంబ సభ్యులు సహకరించారని ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు కేసు నమోదు చేశారు. -
108 అంబులెన్స్ల తనిఖీ
నెల్లూరు(అర్బన్): భవ్య హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నడుస్తున్న 108 అంబులెన్స్లను రాష్ట్ర ప్రోగ్రాం మేనేజర్ మోహన్బాబు మంగళవారం నెల్లూరులో ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంతోపాటు రూరల్ ప్రాంతాల్లో వాహనాలను చూశారు. పైలట్లకు సూచనలిచ్చారు. రోగులను సకాలంలో ఆస్పత్రులకు చేర్చాలని పేర్కొన్నారు. గుండెపోటు కేసులకు సంబంధించి గోల్డెన్ అవర్గా పేర్కొనే మొదటి గంటలోనే ఆస్పత్రికి చేర్చితే వారికి చికిత్స అందుతుందన్నారు. వాహనాల్లో ఉన్న పరికరాలు, టెక్నాలజీని పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్ఓ సుజాత, ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ సుధీర్కుమార్ను కలిసి రోగులకు 108 వాహనాల ద్వారా మెరుగైన వసతులు కల్పించే విధానం గురించి చర్చించారు. కార్యక్రమంలో జిల్లా మేనేజర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
భూ సమస్యను పరిష్కరించాలని ఆందోళన
● ఆర్డీఓ కార్యాలయంలో బైఠాయించిన డ్వాక్రా మహిళలు కావలి రూరల్: భూ సమస్యను పరిష్కరించాలని ఆరు నెలలుగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని చెన్నాయపాళెం పంచాయతీ పరిధిలోని ఆరు గ్రామాలకు చెందిన డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వారు భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కావలి ఆర్డీఓ కార్యాలయంలోని గ్రీవెన్స్హాల్లో బైఠాయించి ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1998లో ప్రభుత్వం ఆరు గ్రామాల డ్వాక్రా మహిళల ఉపాధికి 190 ఎకరాల భూమిని కేటాయించిందని తెలిపారు. 1998లో గ్రామంలో చోటు చేసుకున్న గొడవల నేపథ్యంలో తాము ఊర్లను, భూమిని వదిలి వలస వెళ్లినట్లు చెప్పారు. గొడవలు సద్దుమణిగిన తర్వాత తిరిగి వచ్చి ప్రభుత్వ అనుమతితో జామాయిల్ సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. అయితే తమ భూములపై కన్నేసిన కొందరు రాజకీయ నాయకులు రికార్డుల్లో పేర్లు మార్చుకుని కబ్జా చేశారని ఆరోపించారు. ఇటీవల బీపీసీఎల్ కంపెనీకి కేటాయించిన భూములకు సంబంధించి నష్టపరిహారం చెల్లిస్తుండగా కబ్జా విషయం తెలిసిందన్నారు. ఈ విషయమై న్యాయం చేయాలని మంత్రులు, ఎమ్మెల్యే, కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్కు మొరపెట్టుకున్నా ఫలితం లేదని వాపోయారు. తమ సమస్యను పరిష్కరించాలని ఆర్డీఓ ఎలీషా, తహసీల్దార్ శ్రావణ్కుమార్ను వేడుకున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు పెద్దపట్టపుపాళేనికి వచ్చి భూ సమస్యను పరిష్కరిస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో వెనుదిరిగారు. మంగళవారం 12 గంటల వరకు ఎదురుచూస్తామని తహసీల్దార్ వచ్చి సమస్యను పరిష్కరించకపోతే కావలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగేందుకు వెనుకాడబోమని డ్వాక్రా మహిళలు హెచ్చరించారు. -
వారే కీలకం
ప్రతి నెలా ఆర్టీఏ అధికారులకు మామూళ్లు ఆరు టైర్ల వాహనాలు 450 X 12,000 = 54,00,000 పది టైర్ల వాహనాలు 550 X 16,000 = 90,75,000 రవాణా శాఖాధికారులు రాబందుల కంటే దారుణంగా తయారయ్యారు. జిల్లాలోనూ, జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు నిత్యం వేలాది లారీలు, టిప్పర్లు, ట్రాలీ వాహనాల్లో అధిక టన్నేజీతో గ్రానైట్, ఇసుక, సిలికా, క్వార్ట్జ్తో పాటు రేషన్ బియ్యం లారీలు యథేచ్ఛగా వెళ్తున్నాయి. ఇలాంటి ఏ వాహనాలపై ఒక్క కేసు నమోదు చేసిన దాఖలాలైతే లేవు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంటలకు స్థానికంగా గిట్టుబాటు ధరలు రాక పక్క రాష్ట్రాలకు తీసుకెళ్తుంటే టార్గెట్ చేసి వేలకు వేలు జరిమానాలు విధించి తమలోని అవినీతి రక్కసిని చాటుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీల పేరుతో ఓవర్ టన్నేజీలకు రూ.లక్షల్లో టర్నోవర్ చేసున్నారు. జిల్లా నుంచి వెళ్లే ధాన్యం లారీలే కాకుండా.. పండ్లు, రొయ్య ల, చేపల వాహనాలే లక్ష్యంగా రవాణాశాఖాధికారులు ఒకటి.. రెండు.. టన్నులు అధికంగా ఉంటే పెద్దనేరంగా భారీ మొత్తంలో చలాన్లు విధించి దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కోల్కతా–చైన్నె నేషనల్ హైవేపై మనుబోలు సమీపంలో ప్రతి నిత్యం సాయంత్రం రవాణాశాఖాధికారులు తనిఖీలు నిర్వహిస్తుంటారు. ప్రతి వాహనాన్ని నిలిపి తనిఖీలు చేస్తారనుకుంటే పొరపాటే. నెల మామూళ్లు చెల్లించే వాహనాలకు రవాణాశాఖ పోస్ట్పెయిడ్ కార్డులు ఇస్తోంది. తమ వద్ద ఉండే జాబితాలో ఆ వాహన నంబర్లు ఉంటే పంపిస్తారు. లేదంటే అధిక టన్నేజీ చూపి టన్నుకు రూ.2 వేలు లెక్కన అనధికారికంగా వసూలు చేస్తున్నారు. నెల్లూరు రవాణాశాఖ ఎంవీఐ తన డ్రైవర్తో నిత్యం దందా చేస్తూ రోజుకు రూ.లక్ష లేనిదే ఇంటికి వెళ్లడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన ఉన్నతాధికారులకు వాటాలు పంచుతూ.. మిగిలింది తన జేబులో వేసుకుంటున్నారని ఆ శాఖాధికారులే చెబుతున్నారు. ఇటీవల నెల్లూరు నుంచి చైన్నెకు బియ్యం లోడుతో వెళ్తున్న నాలుగు వాహనాలను నిలిపివేశారు. ఒక్కో వాహనంలో 3 టన్నులు అధికలోడు ఉందని, టన్నుకు రూ.5 వేలు వంతున వసూలు చేసుకుని పంపించేశారు. లంచం పర్మిట్ ఉంటే.. సరి జిల్లా నుంచి నిత్యం వందలాది లారీలు, టిప్పర్లు, ట్రాలీల్లో పక్క రాష్ట్రాలకు ఇసుక, రేషన్ బియ్యం, గ్రానైట్, క్వార్ట్జ్, మైకా, సిలికా తరలిస్తున్నారు. స్థానికంగా తిరిగే టిప్పర్లు, లారీలు సైతం అధిక టన్నేజీతో రవాణా చేస్తున్నాయి. ఒక్కో టిప్పర్కు 36 టన్నుల కెపాసిటీ ఉంటే.. 50 నుంచి 60 టన్నుల వరకు ఇసుక, సిలికా, క్వార్ట్జ్, మైకా లోడ్ చేసుకుని వెళ్తున్నా.. 70 టన్నుల కెపాసిటీ ఉన్న ట్రాలీల్లో 100 నుంచి 130 టన్నుల వరకు గ్రానైట్ బండలను రవాణా చేస్తున్నా.. అటువంటి వాహనాలపై ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం గమనార్హం. అధిక టన్నేజీ వాహనాలకు నెల మామూళ్లు చెల్లిస్తుండడంతో టన్నేజీ సంగతి పక్కన పెడితే.. సరైనా పత్రాలు లేకున్నా రైట్ రైట్ అంటూ పంపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక వేళ నెల మామూలు చెల్లింపుల్లో ఆలస్యమైనా చాలు రహదారిపై కాపు కాసి వాహనాలను నిలిపి ముక్కు పిండి వసూళ్లు చేసుకుంటున్నారు. ముడుపులు చెల్లించని వాహనాలను పట్టుకొని కేసులు నమోదు చేసి ముప్పతిప్పలు పెడుతున్నారు. దీంతో వాహన యజమానులు మాత్రం అధిక లోడింగ్ ఉన్నా.. లేకున్నా నెల మామూళ్లు సమర్పించుకుని వెళుతున్నారు. జిల్లా పరిధిలో సుమారు 1000 పైగా లారీలు, టిప్పర్లు, ట్రాలీలు ఉన్నాయి. జిల్లాలో జరిగే రహదారుల నిర్మాణాలు, భవన నిర్మాణ రంగం, సాగునీటి ప్రాజెక్టులు, ఇతరత్రా అవసరాలతో మట్టి, కంకర, ఇసుక, రవాణా చేస్తున్నాయి. పలు ప్రాంతాల నుంచి క్రషర్స్ నుంచి కంకర తోలకాలు సాగిస్తున్నారు. బిల్లులు లేకుండా పలు రకాల సరుకులు ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పశువులు, గ్రానైట్ రవాణా సాగుతోంది. కృష్ణపట్నం పోర్టుకు వివిధ రకాల సరుకులు, వస్తు సామగ్రి కూడా ఎగుమతుల కోసం తరలిస్తున్నారు. ఆయా వాహనాలు నిబంధనలకు విరుద్ధంగా యథేచ్ఛగా రవాణా సాగిస్తున్నాయంటే.. ఆ శాఖాధికారులకు నెల మామూళ్లు చేరుతున్నాయని అర్థమవుతోంది. రవాణా శాఖ అధికారుల అక్రమ వసూళ్లు నెల మామూళ్లు రూ.1.45 కోట్ల్లు దళారులను పెట్టి మరీ దండకాలు ఇవ్వని వాహనాలను టార్గెట్ చేసి దాడులు ధాన్యం, బియ్యం లారీలే ప్రధాన లక్ష్యం ఓవర్ టన్నేజీతో నిత్యం వందల వాహనాల్లో గ్రానైట్, ఇసుక, రేషన్ బియ్యం రవాణా మంత్లీ కార్డు ఉంటే.. ఓవర్ టన్నేజీ ఉన్నా సరైన పత్రాలు లేకున్నా రైట్ రైట్ నెలకు రూ.లక్షల్లో వసూళ్లు ఉమ్మడి నెల్లూరు ఆర్టీఏ పరిధిలోని 12 మంది మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్లతోపాటు స్పెషల్ స్క్వాడ్, ఎన్ఫోర్స్మెంట్ టీమ్లు ఉన్నాయి. జిల్లాలో ఆత్మకూరు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల వెహికల్ ఇన్స్పెక్టర్లు నెలవారీ వచ్చే దండకాలు సమానంగా పంచుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రత్యేకించి వసూళ్ల కోసం దళారులను పెట్టుకున్నారు. ఆ దళారులే వాహన యజమానులు వద్ద వసూలు చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఆరు టైర్ల వాహనానికి నెలకు రూ.12 వేలు, పది టైర్ల వాహనానికి రూ.16 వేలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెలా 10వ తేదీలోగా చెల్లించకపోతే.. భారీ చలాన్లు పడక తప్పదు. నెల మామూళ్లు తీసుకొనేందుకు ఆర్టీఏ కార్యాలయంలోని ఇద్దరు కీలకంగా వ్యవహరిస్తారు. వారు ప్రతి వాహనదారుడితో లావాదేవీలు జరిపి నెలవారీగా వసూళ్లు చేసి అందరికి పంపకాలు చేస్తారు. ఇక పోలీసులకు మాత్రం ఒక్కో స్టేషన్ పరిధిలోని ఎస్ఐకు సన్నిహితంగా మెలిగే ఓ కానిస్టేబుల్ ద్వారా వసూళ్ల ప్రక్రియ చేపడతారు. ఇలా వసూళ్లు చేసినందుకు వారికి ప్రత్యేకంగా కొంత నగదు ఇస్తుంటారు. -
యూరియా పంపిణీపై టీడీపీ వర్గాల ఘర్షణ
కొడవలూరు: యూరియా పంపిణీ విషయంలో టీడీపీ వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఒక నాయకుడి ఇంటి వద్ద యూరియా బస్తాలు ఉంచి పంపిణీ చేయాలని యత్నించగా, మరో నాయకుడు వ్యతిరేకించడంతో ఇరువర్గాల మధ్య గొడవ నెలకొని ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటన మండలంలోని పెమ్మారెడ్డిపాళెంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన సూర్య అనే టీడీపీ వర్గీయుడు సచివాలయంలోని వ్యవసాయ సిబ్బందిని అడిగితే స్పందించకపోవడంతో ఆవేదన చెందిన ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ వ్యవహారం స్థానిక ఎమ్మెల్యే దృష్టికి పోవడంతో గ్రామానికి ప్రత్యేకంగా సోమవారం యూరియా లోడు పంపారు. అయితే ఆ యూరియాను టీడీపీ నాయకుడు విజయ్కుమార్రెడ్డి ఇంటి వద్ద పంపిణీ చేస్తుండగా సూర్య తండ్రి ప్రేమ్కుమార్ కోపోద్రిక్తుడయ్యారు. తన కుమారుడు యూరియా సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి గ్రామానికి యూరియా వచ్చేలా చేస్తే ఆ నాయకుడు పెత్తనం చేస్తూ ఇంటి వద్ద నుంచి పంపిణీ చేయడమేమిటంటూ గొడవకు దిగారు. దీంతో ఇరువర్గాల వారు దుర్భాషలాడుకున్నారు. దీంతో గ్రామంలో గంటపాటు ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయం తెలుసుకొన్న ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు రంగంలోకి దిగి ఇరువర్గాలతో మాట్లాడి గొడవ తీవ్రరూపం దాల్చకుండా సర్దుబాటు చేశారు. ఇప్పటికే యూరియాను యాప్ ద్వారా పంపిణీ చేస్తుంటే.. మరో వైపు భారీ మొత్తంలో యూరియాను టీడీపీ నేతల ఇళ్లకు తరలించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బీసీ వెల్ఫేర్ ఉద్యోగులకు పదోన్నతులు
నెల్లూరు(వేదాయపాళెం): బీసీ సంక్షేమ శాఖలో నాల్గో తరగతి ఉద్యోగులుగా పనిచేస్తున్న బీ సురేష్, యూ రత్నకుమారికి పదోన్నతులు లభించాయి. వారి అర్హతలను అనుసరించి గ్రేడ్–2 హాస్టల్వెల్ఫేర్ ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించినట్లు ఆ శాఖ జిల్లా సాధికారిత అధికారిణి పీ వెంకటలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్లోని తిక్కనభవన్లో కలెక్టర్ హిమాన్షు శుక్లా పదోన్నతుల ఉత్తర్వులను అందజేశారని చెప్పారు. పదోన్నతులు పొందిన ఉద్యోగులు మరింత బాధ్యతాయుతంగా, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ఉపకారవేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం నెల్లూరు(వీఆర్సీసెంటర్): 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్ర కార్మిక శాఖ ఒకటో తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్న కార్మికుల పిల్లల నుంచి ఉపకారవేతనాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోందని జిల్లా బీడీ కార్మిక సంక్షేమ అస్పత్రి సీనియర్ మెడికల్ ఆఫీసర్ కేవీ భాస్కర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐరన్, మాంగనీస్, లైమ్స్టోన్, డోలామైట్, మైకా గనులతో పాటు బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల పిల్లలు ఉపకారవేతనాలకు అర్హులని చెప్పారు. 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు ఆగస్ట్ 31వ తేదీలోగా, ఇంటర్ నుంచి ఆపై తరగతులు చదువుతున్న వారు అక్టోబరు 31వ తేదీలోగా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. రామతీర్థం బీచ్లో సామూహిక యోగా నేడు నెల్లూరురూరల్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విడవలూరు మండలం రామతీర్థం బీచ్లో మంగళవారం ఉదయం 6 గంటలకు సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే స్వర్ణాల చెరువు, రామతీర్థం బీచ్తో పాటు రెసిడెన్షియల్ అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో నిర్వహించిన యోగా కార్యక్రమాలు విజయవంతమయ్యాయని తెలిపారు. యోగా మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తుందని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాపై అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 95,094 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 35,909 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.93 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
చంపుతామంటున్నారు.. రక్షించండి
● బండి శిల్పారెడ్డి ఆవేదన సంగం: ‘నన్ను చంపుతామంటూ బెదిరింపులు వస్తున్నాయి. రక్షణ కల్పించాలి’ అని బండి శిల్పారెడ్డి కోరారు. సంగం పంచాయతీ పరిధిలోని అమరపునాయుడుకండ్రిక గ్రామంలో ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నామని తెలిపారు. అనంతరం గ్రామంలో పదుల సంఖ్యలో ఇళ్ల నిర్మాణాలు జరిగాయన్నారు. సర్వే నంబర్ 285లో 48.03 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అందులో 40 మందికి పైగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. టీడీపీ నాయకుడు బాణా శ్రీనివాసులురెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపై అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇరిగేషన్ శాఖ అవినీతికి పాల్పడిందంటూ బంకా రామకృష్ణారెడ్డి లోకాయుక్తను ఆశ్రయించారని తెలిపారు. అక్కడి నుంచి ఒక ఇంటి నిర్మాణాన్ని తొలగించాలంటూ తీర్పు వచ్చిందన్నారు. దీనిపై ఇరిగేషన్ శాఖ అధికారులిచ్చిన నోటీసులకు సమాధానాలు ఇచ్చానన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ బాణా శ్రీనివాసులురెడ్డి పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి తనపై ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. గ్రామానికి చెందిన కొంకాల రామకృష్ణారెడ్డి తన బంధువులకు ఫోన్ చేసి బిహార్ నుంచి హంతకులను తీసుకొచ్చి శిల్పారెడ్డిని చంపిస్తామని బెదిరించారని ఆరోపించారు. అలాగే నెల్లూరుకు చెందిన కొందరు మహిళలు ఫోన్లు చేసి బెదిరించారన్నారు. అప్పట్లో సంగం ఎస్సైలుగా పనిచేసిన నాగార్జునరెడ్డి, రాజేష్కు ఫిర్యాదులు చేసినా అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. -
డోంట్ కేర్
గత నెలలో వెంకటాచలం టోల్ప్లాజా వద్ద 33 టన్నుల బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక బృందాల తనిఖీల్లో సుమారు 600 టన్నులకు పైగా పేదల బియ్యాన్ని పట్టుకున్నారు. బృందాల తనిఖీల సమయంలో డీలర్లు భయపడినట్లు నటించారు. ప్రస్తుతం మాత్రం డోంట్ కేర్ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. డీలర్లు పేదల నుంచి కేజీ బియ్యం రూ.12కు బియ్యం కొనుగోలు చేస్తున్నారు. మాఫియా లీడర్ వారికి కేజీకి రూ.15లు ఇస్తున్నాడు. చౌకదుకాణాల్లో అక్రమాలను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇవి నిత్యం క్షేత్రస్థాయికి వెళ్లి రేషన్ విక్రయాలు, నిల్వలను పరిశీలించాయి. దీంతో రెండు నెలలు చాటుమాటుగా బియ్యం అక్రమ తరలింపు సాగింది. ప్రస్తుతం బృందాలు లేకపోవడంతో మాఫియా లారీలకు బ్రేక్లు లేకుండా జాతీయ రహదారిపై దూసుకుపోతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు మాఫియా లారీలను అధికారులు పట్టుకున్న సందర్భాల్లేవు. దీనిని బట్టి లీడర్కు అధికార పార్టీ నేతల సహకారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతి నెలా రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. నెల్లూరు బియ్యానికి బహిరంగ మార్కెట్లో మంచి పేరు ఉండటంతో ఇతర దేశాలకు కూడా అక్రమంగా ఎగుమతులు జరుగుతున్నాయి. పెద్దఎత్తున అక్రమ మార్గంలో బియ్యం తరలిపోతున్నా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. రెండు నెలలు నటన -
అన్నదాత ఆక్రందన
గత ప్రభుత్వంలో అన్నదాతకు ధీమా నెల్లూరు (వేదాయపాళెం): ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే అన్నదాతకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ.. ఎన్నడూ లేని విధంగా ఆంక్షలను విధిస్తూ రైతులను ప్రభుత్వం దగా చేస్తోంది. ఎల్నినో ప్రభావం, వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో పంట దిగుబడి తగ్గి ఆదాయ వనరులపై వ్యతిరేక పరిస్థితి ఉంటుందని ఇప్పటికే వాతావరణ నిపుణులు, వ్యవసా య, పర్యావరణ శాస్త్రవేత్తలు పదేపదే హెచ్చరిస్తు న్నారు. అయినా జిల్లా రైతాంగం తమకున్న పొ లాల్లో సాగుచేసేందుకు ఉపక్రమిస్తున్నా, ప్ర భు త్వం దగాకోరు చర్యలను అవలంబిస్తోంది. ఈ పరిణామాల క్రమంలో కర్షకులు నిరాశ, నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఓటీపీ వస్తేనే యూరియా అంట..! వివిధ పథకాల్లో అర్హులను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ఇదే కోవలో అన్నదాతను వంచించేందుకు స్కెచ్ వేస్తోంది. వీరికందాల్సిన మూడు బస్తాల యూరియాను ఇచ్చేందుకూ కొర్రీలు పెడుతోంది. ఇందులో భాగంగా ఏపీఏఐఎమ్మెస్ యాప్ను రూపొందించింది. దీన్ని తమ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకొని.. సంబంధిత అధికారి కార్యాలయంలో లాగినవ్వాలని హుకుం జారీ చేసింది. అయితే సమస్యలు ఇక్కడితో తీరిపోతాయనుకుంటే పొరపాటే. యారియా కోసమో లేక మరే ఇతర అవసరానికో సంబంధిత ఆర్ఎస్కే, సొసైటీ కార్యాలయానికెళ్లినప్పుడు తమ ఫోన్లను వెంట తీసుకెళ్లి.. సంబంధిత సిబ్బందికి ఓటీపీ చెప్పాలనే విచిత్ర ఉత్తర్వులను జారీ చేసింది. వాస్తవానికి మొబైల్ ఫోన్లు లేని వారు.. ఉన్నా వాటిపై పరిజ్ఞానం లేని రైతులు కోకొల్లలు. పొలం తమ పేరుపై ఉన్న వృద్ధుల పరిస్థితి మరింత ఘోరంగా మారింది. సంబంధిత పత్రాలు, ఫోన్ను తమ వెంట తీసుకొని మండుటెండల్లో ఆయా కార్యాలయాల చుట్టూ తిరగలేక విసిగి వేసారిపోతున్నారు. భారీ స్థాయిలో కోత ఖరీఫ్ సీజన్కు సంబంధించిన యారియా సరఫరాలో ఈ ఏడాది ప్రభుత్వం భారీ స్థాయిలో కోత విధించిందని తెలుస్తొంది. జిల్లా వ్యాప్తంగా 80 వేల మెట్రిక్ టన్నుల మేర అవసరం కాగా, ఇప్పటి వరకు 30 వేల టన్నులనే పంపి చేతులు దులుపుకొంది. అయితే క్షేత్రస్థాయిలో ఇదీ సక్రమంగా అందడంలేదని తెలుస్తోంది. సర్కార్ తీరుపై అన్నదాతలు భగ్గుమంటున్నారు. జిల్లాలో ఇలా.. అవసరమైన యూరియా 16 లక్షల బస్తాలు వరినాట్లు 4 లక్షల ఎకరాల్లో.. గత ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలా భరోసా లభించింది. గత సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో తమకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పంట బీమా, కొనుగోలు, మార్కెటింగ్ తదితర ఎన్నో ప్రయోజనాలు చేకూరాయని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. ఎలాంటి ఆంక్షల్లేకుండా.. పార్టీలకతీతంగా అన్ని పథకాలు తమకు అందేవనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. సింగిల్ విండో విధానంలో అవసరమైన అన్ని ప్రయాజనాలు రైతు భరోసా కేంద్రాల్లో నే లభించేవని, అయితే ప్రస్తుతం ఇవేవీ మచ్చుకై నా కానరావడంలేదని పేర్కొంటున్నారు. అవసరానికి మించి అందుబాటులో.. జిల్లాలో ఈ ఖరీఫ్కు 49 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. ఇప్పటికే 30 వేల మెట్రిక్ టన్నుల మేర దిగుమతి చేసుకొని పంపిణీ చేస్తున్నాం. మరో 21 వేల మెట్రిక్ టన్నులు త్వరలోనే రానున్నాయి. జిల్లాలో ఎక్కడా కొరత లేదు. అర్హులైన రైతులు అధైర్యపడాల్సిన అవసరం లేదు. యాప్ రిజిస్ట్రేషన్ అనేది నిరంతర ప్రక్రియ. అవగాహన లేని కర్షకులు తమ సిబ్బందిని సంప్రదిస్తే రిజిస్ట్రేషన్ చేస్తారు. – సత్యవాణి, జిల్లా వ్యవసాయాధికారిణి -
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
● ముగ్గురికి గాయాలు ఉదయగిరి: ఉదయగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం తెల్లవారుజామున కర్ణాటక రాష్ట్రంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. పామూరు నుంచి ఉదయగిరి, కడప మీదుగా బెంగళూరుకు శనివారం రాత్రి ఆర్టీసీ బస్సు బయలుదేరింది. చింతామణి సిగ్నల్ సమీపంలో ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టింది. ఈ సమయంలో 23 మంది ప్రయాణికులున్నారు. వీరిలో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో వరికుంటపాడు మండలం కృష్ణాగాంధీపురానికి చెందిన చిన్న కేశవులు, పెద్దిరెడ్డిపల్లికి చెందిన యోబు, ఉదయగిరి మండంల వెంట్రావుపల్లికు చెందిన సునీల్ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంపై ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్పీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు బాధితులను ఫోన్లో పరామర్శించారు. -
ఆ సైకోలపై కేసు నమోదు చేయండి
● మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి కావలి: ‘కావలి నియోజకవర్గంలో టీడీపీకి చెందిన కొంతమంది సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అసభ్యకరమైన పోస్టులు పెడుతూ తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారు. వెంటనే వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి’ అని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన నేతలతో కలిసి కావలి ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో ఎస్సై సుమన్కు ఆదివారం ఫిర్యాదు చేశారు. అనంతరం రామిరెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా ముసుగులో చిలకపాటి మధు, చిలకపాటి మనోహర్, మధు కిశోర్, తోకల శ్రీను, గొర్రెపాటి హరీష్ తదితరులు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారన్నారు. హద్దులు దాటి ప్రవర్తించడం వారి నైజమన్నారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాలిపోయి అధికారులను, ప్రజలను బ్లాక్ మెయిల్ చేయడమే వారి పని అన్నారు. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అన్యాయాలు, అక్రమాలను పక్కదోవ పట్టించేందుకు ఇలా చేయిస్తున్నట్లు విమర్శించారు. ఆర్ఎస్ఆర్ విద్యాసంస్థలపై బురద చల్లడం మంచి పద్ధతి కాదన్నారు. ఎమ్మెల్యే కనుసన్నల్లో గ్రావెల్, ఇసుక అక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని, వీటిని ప్రశ్నించేవారిపై సోషల్ మీడియా వేదికగా దాడిచేయడంతోపాటు వ్యక్తిగతంగా బెదిరించడం జరుగుతోందన్నారు. కొన్నిరోజుల క్రితం తాను మాట్లాడకపోయినా కూటమి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే ఆగమేఘాలపైన కేసు నమోదు చేయడమే కాకుండా నోటీసులు అందజేశారన్నారు. అసత్య ప్రచారాలు చేస్తున్న టీడీపీ నేతలపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోరా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలకు భయపడే ప్రసక్తే లేదన్నారు. వారం రోజుల్లో వారిపై చర్యలు తీసుకోకపోతే తదుపరి కార్యాచరణ తీవ్రంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయు లు, పందిటి కామరాజు, ద్రోణాదుల వెంకట్రావు, కుందుర్తి శ్రీనివాసులు, కుందుర్తి కామయ్య, నాగేశ్వరమ్మ, ఇరుముడి వెంకటేశ్వరరెడ్డి, పరుసు మాల్యాద్రి, కనమర్లపూడి వెంకటనారాయణ, ఆర్కే కృష్ణారెడ్డి, గుడ్లూరు మాల్యాద్రి పాల్గొన్నారు. -
తమ్ముళ్ల భూ దాహం
ఆక్రమణలో వందలెకరాలు చేజర్ల: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే చందంగా తెలుగు తమ్ముళ్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ భూములపై కన్నేసి ఇప్పటికే వందలాది ఎకరాలను కబ్జా చేశారు. అయినా వీరి భూ దాహం తీరడంలేదు. అధికారులను నయానో.. భయానో భయపెట్టి ఏదో విధంగా వాటిని ఆన్లైన్ చేయించుకోని హస్తగతం చేసుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా కోటితీర్థంలో దళితుల భూములకెళ్లే దారితో పాటు ప్రభుత్వ అనాధీన భూమిని మంత్రి ఆనం ముఖ్య అనుచరులు యథేచ్ఛగా ఆక్రమించుకొని కబ్జా చేశారు. జరిగిందిదీ.. చేజర్ల మండలం కోటితీర్థంలో గల సర్వే నంబర్ 876, 877లో ప్రభుత్వ అనాధీన భూమిని తెలుగు తమ్ముళ్లు రాత్రికి రాత్రే యంత్రంతో చదును చేసి దర్జాగా ఆక్రమించారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి గ్రామానికి చెందిన మంత్రి ఆనం అనుచరులు కొమ్మి పార్థసారథినాయుడు, కొమ్మి రత్నయ్యనాయుడునాయుడు పెత్తనం చెలాయిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన రైతులను పలు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రభుత్వం ద్వారా అన్ని అనుమతులు పొంది ఎప్పట్నుంచో సాగు చేసుకుంటున్నా కొద్దిపాటి భూములపై సైతం వీరు కన్నేశారు. అధికారులను అడ్డుపెట్టుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇలా గ్రామ సమీపంలోని సుమారు ఐదెకరాల ప్రభుత్వ అనాధీన భూమిని శుక్ర, శనివారాల్లో చదును చేసి ఆక్రమించారు. చెరువు కుంట, పొరంబోకు భూములను ఇప్పటికే వీరు ఆక్రమించి చేపలు రొయ్యల చెరువులుగా లీజుకూ ఇచ్చారు. ఇంత జరుగుతున్నా, రెవెన్యూ అధికారులు మాత్రం కన్నెత్తి చూడటంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వీరు ప్రస్తుతం ఆక్రమించిన ఈ భూమిలో గత ప్రభుత్వ హయాంలో చెత్తతో సంపద తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆక్రమణకు గురైన భూమి కోటితీర్థంలో ప్రభుత్వ ల్యాండ్స్ కబ్జా దళితుల పొలాలకు వెళ్లే దారి సైతం ఆక్రమణ తమ ప్రభుత్వమే కదా మమ్మల్నేమి చేస్తారనే ధీమా ఇప్పటికే వందలెకరాలు కబంధహస్తాల్లో ప్రేక్షకపాత్ర పోషిస్తున్న రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కూటమి సర్కార్ వచ్చాక ప్రభుత్వ భూములకు రక్షణ కరువైంది. ఎవరు పడితే వారు చట్టవిరుద్ధంగా ఆక్రమించి సొంతం చేసుకుంటున్నారు. దీనిపై ఉక్కుపాదం మోపాలి. – గోతం రమేష్, మాజీ సర్పంచ్, కోటితీర్థం దారిని సైతం ఆక్రమించారు దళితులకు ప్రభుత్వమిచ్చిన భూమిలోకి వెళ్లేందుకు సంబంధించిన శాశ్వత రహదారిని సైతం ఆక్రమించారు. ఈ సౌకర్యం లేకపోతే మాకు ఇబ్బందులు తప్పవు. రెవెన్యూ అధికారులు స్పందించి న్యాయం చేయాలి. – నూలు చెన్నయ్య, రైతు, కోటితీర్థం విచారణ జరిపి చర్యలు చేపడతాం కోటితీర్థంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న విషయమై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపడతాం. వీటిని కబ్జా చేయడం చట్ట విరుద్ధం. – మస్తానయ్య, తహసీల్దార్, చేజర్ల మండలంమంత్రి ఆనం రామనారాయణరెడ్డి అండ చూసుకొని చేజర్ల మండలంలోని పలు గ్రామాల్లో వందలెకరాల ప్రభుత్వ భూములను టీడీపీ నేతలు కబ్జా చేశారు. మడపల్లి, నాగులవెల్లటూరు, పెరుమాళ్లపాడు, నూతక్కివారి కండ్రిక, తిమ్మాయపాళెం తదితర గ్రామాల్లో ఈ పరిస్థితి నెలకొంది. మండలంలోని కోటితీర్థంలో వివాదాస్పద భూమికి కోర్టు స్టే విధించినా, ఆదేశాలను ధిక్కరిస్తూ వాటి చుట్టూ కంచెను వేసి మరీ నియోజకవర్గ స్థాయి నేత తన ఆధీనంలోకి తీసుకున్నారు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ బాధితులు ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. కలెక్టర్ స్పందించి ఆక్రమణదారులపై చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. -
సామాన్యులపై పచ్చనేతల జులుం
● నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి వాకాడు: గ్రామీణ ప్రాంతాల్లో మాట వినని సామాన్యులపై పచ్చనేతలు జులం ప్రదర్శిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి విమర్శించారు. మండల కేంద్రమైన వాకాడులోని తన నివాసంలో ఆదివారం కోట, వాకాడు, చిట్టమూరు మండలాల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హామీలను తుంగలో తొక్కి స్వప్రయోజనాల కోసం అరాచకాలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు కంకణబద్ధులై ఉన్నారని తెలిపారు. ఎక్కడ చూసినా కూటమి నేతలు గ్రావెల్, ఇసుక దందాలతో తమకు అడ్డేలేదని విర్రవీగుతున్నారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని అటకెక్కించిందని విమర్శించారు. సూపర్సిక్స్ అంటూ ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. వ్యవసాయం దండగన్న బాబు తాజాగా యూరియా యాప్లతో కొరత సృష్టించి రైతు ద్రోహిగా మిగిలారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అభివృద్ధిపై ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం, నిజాలు తెలుసుకోకుండా అరెస్టులు చేస్తున్న పోలీస్ శాఖపై మండిపడ్డారు. -
జెట్టి శేషారెడ్డి ఆశయసాధనకు కృషి
● ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ నెల్లూరు(అర్బన్): ‘సమాజంలోని ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం, మౌలిక వసతులు అందాలనే లక్ష్యంతో డాక్టర్ జెట్టి శేషారెడ్డి పనిచేశారు. సారా వ్యతిరేక ఉద్యమం, అక్షరాస్యత, పొదుపు ఉద్యమాలకు వెనుక ఉండి పూర్తి సహకారం అందించిన శేషారెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషిచేయాలి’ అని ప్రముఖ ఆర్థిక, రాజకీయ విశ్లేషకుడు డా.పరకాల ప్రభాకర్ పిలుపునిచ్చారు. డాక్టర్ రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల ఆధ్వర్యంలో నెల్లూరు హరనాథపురంలోని డాక్టర్ జేఎస్ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం శేషారెడ్డి 18వ స్మారక సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభాకర్ మాట్లాడుతూ డాక్టర్ శేషారెడ్డి అతి తక్కువ ఖర్చుతో పేదలకు వైద్యం అందించేవారన్నారు. పాలకుల వల్ల సమాజం వర్గాలుగా విడిపోయిందన్నారు. నాలుగు మంచి మాటలు మాట్లాడుకుంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. అందువల్ల డాక్టర్ శేషారెడ్డి లక్ష్యాలను సాధించేందుకు ప్రజలు పోరాటాల్లోకి రావాలన్నారు. ● మాజీ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జనవిజ్ఞానవేదిక లాంటి సైన్సు సంస్థను స్థాపించిన వ్యక్తి డాక్టర్ శేషారెడ్డి అన్నారు. ఆయన సాంస్కృతి ఉద్యమాలకు పునాది వంటి వారన్నారు. పేదలు, సమాజ పురోభివృద్ధి పట్ల ఆయన ఎంతో ప్రేమ చూపేవారన్నారు. డాక్టర్ జేఎస్ విజ్ఞాన కేంద్రం ట్రస్ట్ చైర్మన్ చండ్ర రాజగోపాల్ మాట్లాడారు. పాలకులకు గుణపాఠం చెప్పాలి ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దేవరాజు మహరాజు ఆధునిక భారతదేశం– – శాసీ్త్రయ దృక్పథం అనే అంశంపై మాట్లాడారు. నేటి పాలకులు చరిత్రను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారికి గుణపాఠం చెప్పాలన్నారు. యూనివర్సిటీల్లో చిలుక జోస్యాన్ని కూడా పాఠ్యాంశాలుగా చేర్చే పరిస్థితి వచ్చిందన్నారు. డాక్టర్ అజయ్కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రామచంద్రారెడ్డి ప్రజా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రాజేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవకోటేశ్వరరావు, ప్రజారోగ్యవేదిక రాష్ట్ర నాయకులు డా.ఎంవీ రమణయ్య, యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు నరమాల సతీష్, జేవీవీ జిల్లా అధ్యక్షుడు ఎంవీ చలపతి, ఉపాధ్యాయులు, డాక్టర్లు పాల్గొన్నారు. -
చేపల అక్రమ వేట నివారణకు నిరంతర గస్తీ
నెల్లూరు(వేదాయపాళెం): జిల్లాలోని తీరంలో చేపల అక్రమ వేటను నివారించేందుకు గానూ రెండు మెకనైజ్డ్ బోట్లతో నిరంతర గస్తీని సోమవారం నుంచి నిర్వహించనున్నామని మత్స్యశాఖ సహాయ సంచాలకుడు చాంద్బాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేటపై నిషేధం ముగియడంతో జిల్లా పరిధిలోని సముద్ర జలాల్లోకి తమిళనాడు బోట్లు అనధికారికంగా ప్రవేశించే అవకాశముందని చెప్పారు. ఈ క్రమంలో రెండు బోట్లతో గస్తీని మత్స్య, అటవీ శాఖలు, మైరెన్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించనున్నారని పేర్కొన్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, కృష్ణపట్నం పోర్టు నుంచి ఇవి బయల్దేరి గస్తీని నిర్వహించనున్నాయని వెల్లడించారు. నేటి నుంచి ఎస్ఐఆర్ నెల్లూరు రూరల్: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని జిల్లాలో సోమవారం ప్రారంభించనున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై ఒకటిని అర్హత తేదీగా పరిగణిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని చెప్పారు. జిల్లాలో 19,74,240 మంది ఓటర్ల వివరాల పరిశీలన కోసం 2352 మంది బూత్ స్థాయి అధికారులు నియమించామని తెలిపారు. ఇంటింటి సర్వేను బీఎల్వోలు జూలై 14 వరకు నిర్వహించి ఓటర్ల వివరాలను సేకరించనున్నారని వివరించారు. దీని ఆధారంగా ముసాయిదా జాబితాను వచ్చే నెల 21న ప్రచురించనున్నామని వెల్లడించారు. క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరించేందుకు ఆగస్ట్ 20 వరకు అవకాశాన్ని కల్పించనున్నామని పేర్కొన్నారు. అభ్యంతరాల పరిష్కార ప్రక్రియను సెప్టెంబర్ 18 వరకు కొనసాగింది, తుది జాబితాను అదే నెల 22న విడుదల చేయనున్నామని ప్రకటించారు. ఓటర్లు తమ వివరాలను ధ్రువీకరించుకొని పేర్ల చేర్పు, తొలగింపు, సవరణల కోసం బీఎల్వోలకు సహకరించాలని కోరారు. జాబితాకు సంబంధించిన సేవల కోసం నియోజకవర్గ స్థాయిలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్నికల సంఘం హెల్ప్లైన్ 1950ను సంప్రదించి సమాచారాన్ని పొందొచ్చని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గానూ రాజకీయ పార్టీలు, బూత్ లెవల్ ఏజెంట్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ పోస్టులకు 17 నుంచి ఇంటర్వ్యూలు నెల్లూరు(అర్బన్): ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, సివిల్ అసిస్టెంట్ జనరల్ పోస్టుల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించేందుకు గానూ ఇంటర్వ్యూలను ఈ నెల 17, 18న నిర్వహించనున్నామని జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి పరిమళ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత అర్హత పత్రాలతో మద్రాస్ బస్టాండ్ సమీపంలోని డీసీహెచ్ఎస్ కార్యాలయానికి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల్లోపు హాజరుకావాలని కోరారు. వివరాలకు spsnellore. ap. gov. in/ notice/ recruitmentను పరిశీలించాలని సూచించారు. రెవెన్యూ డే విజయవంతానికి కృషి నెల్లూరు(అర్బన్): జిల్లాలో ఈ నెల 20న నిర్వహించనున్న రెవెన్యూ డే విజయవంతానికి రెవెన్యూ ఉద్యోగులందరూ కృషి చేయాలని ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు అల్లంపాటి పెంచలరెడ్డి కోరారు. కలెక్టరేట్ ఆవరణలోని అసోసియేషన్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని తీర్మానించారు. రెవెన్యూ శాఖలోని అన్ని క్యాడర్లలో ఉద్యోగోన్నతులు, డిప్యూటీ తహసీల్దార్ల సీనియార్టీ జాబితాను రూపొందించాలని కోరారు. నెల్లూరుకు ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ నెల 17న రానున్నారని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్లు, కార్మికుల సమస్యలపై చర్చించి వాటిని పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారని వెల్లడించారు. తమ సమస్యలను ఉద్యోగులు వివరించాలని కోరారు. ఏపీఆర్ఎస్ఏ జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్ల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు శేషయ్య, హేమంత్కుమార్, మల్లికార్జున, బాలకోటమ్మ, రమాదేవి, డానియెల్ పీటర్, శివయ్య తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్ బస్సుల తనిఖీలు
నెల్లూరు(క్రైమ్): పాఠశాలలు పునః ప్రారంభం నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా ఆదివారం పోలీస్, రవాణా శాఖలు సంయుక్తంగా జిల్లాలోని ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీలు చేశారు. వాహనాల ఫిట్నెస్, బ్రేకుల పనితీరు, టైర్ల పరిస్థితి, అత్యవసర నిష్క్రమణ ద్వారాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్నిమాపక పరికరాలు, సీసీ కెమెరాలు, జీపీఎస్ తదితర వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యాలు విద్యార్థుల భద్రత విషయంలో రాజీ పడరాదన్నారు. రోజూ వాహనాల పరిస్థితిని, డ్రైవర్లు విధులకు హాజరయ్యే ముందు వారి ఆరోగ్య, మానసిక స్థితి, మద్యం లేదా ఇతర పదార్థాల వినియోగం వంటి అంశాలను పరిశీలించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను రవాణా చేసే వాహనాల పరిస్థితి, డ్రైవర్ల ప్రవర్తనను చూస్తుండాలని ఏవైనా లోపాలు గుర్తిస్తే వెంటనే సంబంధిత పాఠశాలల యాజమాన్యాలు, పోలీసులకు తెలియజేయాలని కోరారు. జిల్లావ్యాప్తంగా నిరంతర తనిఖీలు కొనసాగుతాయన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై, నిర్లక్ష్యంగా వ్యవహరించే విద్యాసంస్థలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): ఓ మహిళ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం నెల్లూరు వేదాయపాళెం పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. నెల్లూరు రూరల్ మండలం కనుపర్తిపాడుకు చెందిన కడప శ్రీకాంత్ ఆటో నడుపుతుంటాడు. అతను అదే ప్రాంతానికి చెందిన రేవతితో సన్నిహితంగా ఉన్నాడు. ఈ విషయమై ఆమె భర్త ఐదేళ్ల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమెను వదిలేశాడు. శ్రీకాంత్ ఆమెతో సహజీవనం సాగిస్తున్నాడు. ఏడాదిగా ఆమె నగరంలోని ఓ దుస్తుల దుకాణంలో పనిచేస్తూ వేరేవారితో ఫోన్లో మాట్లాడుతోంది. దీంతో శ్రీకాంత్కు ఆమె మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఈక్రమంలో జరిగిన గొడవలో శ్రీకాంత్ ఆమైపె చేయిచేసుకున్నాడు. దీంతో రేవతి నెల్లూరు రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ కేసు వెనక్కి తీసుకోవాలని అతను అడిగినా ఆమె వినిపించుకోకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. ఈనెల 9వ తేదీన రేవతి తన తండ్రికి భోజనం ఇచ్చి స్కూటీపై తిరిగి వస్తోంది. శ్రీకాంత్ ఆమెను మాటల్లో దించి పడారుపల్లి చెరువుకట్ట వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఫోన్ కాల్ విషయమై వారి మధ్య గొడవ జరిగింది. నిందితుడు తన వెంట తెచ్చుకున్న కత్తితో రేవతిని దారుణంగా పొడిచి చంపాడు. ఆ సమయంలోనే అతని కుడితొడకు సైతం గాయమైంది. అక్కడి నుంచి ఆయన నేరుగా వేదాయపాళెం పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. గాయాలతో ఉన్న శ్రీకాంత్ను చికిత్స నిమిత్తం పోలీసులు జీజీహెచ్లో చేర్పించారు. 13వ తేదీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశామని ఇన్స్పెక్టర్ చెప్పారు. -
ఎస్పీబీ విగ్రహ ఏర్పాటు సంతోషకరం..
● సినీ నటుడు శుభలేఖ సుధాకర్ నెల్లూరు(వీఆర్సీసెంటర్): నెల్లూరులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని ప్రముఖ సినీ నటుడు శుభలేఖ సుధాకర్ అన్నారు. ఆదిత్యా నగర్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్కును ఆదివారం ఆయన సందర్శించారు. ఎస్పీబీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేరుతో పార్కులు ఏర్పాటు చేసి, అందులో విగ్రహాలు ప్రతిష్టించడం ఎంతో సంతోషకరమని తెలిపారు. బాలసుబ్రహ్మణ్యం పేరిట నిర్వహించే ఏ కార్యక్రమానికై నా తాను తప్పకుండా హాజరవుతానని చెప్పారు. బాలుపై నెల్లూరు ప్రజలకు ఉన్న అభిమానం మాటల్లో చెప్పలేనిదని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నాకాబందీ నెల్లూరు(క్రైమ్): నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా శనివారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు నాకాబందీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, శివారు ప్రాంతాలు, అనుమానిత నివాసాలు, వాణిజ్య సముదాయాలు, హైవేల వద్ద వాహన తనిఖీలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న 21 మందిపై కేసులు నమోదు చేశారు. నిబంధనల ఉల్లంఘనులపై ఎంవీ యాక్ట్ కింద 432 కేసులు నమోదు చేసి రూ.1,67,800ల జరిమానా విధించారు. బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై 32 కేసులు నమోదు చేశారు. లాడ్జీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్కడ బసచేసిన వ్యక్తుల వివరాలను సేకరించారు. అసాంఘిక కార్యకలాపాలు, రౌడీయిజం, ఈవ్టీజింగ్, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, గంజాయి విక్రయాలు, అక్రమ రవాణాను గుర్తిస్తే సమీప పోలీస్స్టేషన్ లేదా డయల్ 100/112, పోలీస్ కంట్రోల్రూమ్ నంబర్ 93929 03143కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేటి నుంచి యోగా పోస్టర్ తయారీ పోటీలు● జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లో నిర్వహణ నెల్లూరు(టౌన్): అంతర్జాతీయ యోగాదినాన్ని పురస్కరించుకుని విద్యాశాఖ, జాతీయ జనాభా విద్యా కార్యక్రమం, డైట్ల ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు అన్ని యాజమాన్య ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో యోగా పోస్టర్ తయారీ పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ ఆర్.బాలాజీరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్యం కోసం యోగా, పాఠశాలల్లో యోగా (యోగా ఫర్ హెల్త్, యోగా ఎట్ స్కూల్) అనే అంశాలపై ఈ పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. పాఠశాల స్ధాయిలో నిర్వహించిన పోటీలకు సంబంధించి అన్ని పోస్టర్లను స్కాన్ చేసి dietpallipadu@gmail. comకు ఈ–మెయిల్ చేయాలన్నారు. తద్వారా పాఠశాల స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఉత్తమ పోస్టర్లు ఎంపిక చేస్తామని వివరించారు. జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు రూ.1,000, రూ.750, రూ.500 నగదు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. అన్ని డివిజన్ల డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు, హెడ్మాస్టర్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. వివరాలకు 90100 85011 ఫోన్ నంబర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.60 సన్నవి : రూ.25 పండ్లు : రూ.10 -
సేంద్రియ వ్యవసాయంపై మొగ్గు
● 90 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం ● మిల్లెట్లు, పప్పుధాన్యాల సాగుపై రైతుల ఆసక్తి నెల్లూరు(వేదాయపాళెం): కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరితో విసుగు చెందిన జిల్లా రైతాంగం ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయంవైపు మొగ్గు చూపుతున్నారు. వ్యయభారం, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల లభ్యతలో ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో జిల్లా రైతాంగం ప్రత్యామ్నాయంగా సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తోంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా తక్కువ పెట్టుబడితో మెరుగైన ఆదాయం సాధించవచ్చనే అవగాహన పెరగడంతో రైతులు ఈ విధానంపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లావ్యాప్తంగా సుమారు 90 వేల ఎకరాల్లో మినుము, పెసర, అలసంద, కొర్రలు, సామలు తదితర పంటలను సేంద్రియ పద్ధతిలో సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఒకప్పుడు ప్రకృతి వ్యవసాయంలో దిగుబడులు తక్కువగా ఉంటాయనే అభిప్రాయం కారణంగా అన్నదాత దీనిపై పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే కాలక్రమంలో వ్యవసాయ వ్యయాలు పెరగడం, మార్కెట్లో సేంద్రియ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం వంటి కారణాలతో ప్రత్యామ్నాయ పంటల సాగువైపు మొగ్గు చూపుతున్నారు. పెరుగుతున్న గిరాకీ కరోనా అనంతరం ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో సేంద్రియ పద్ధతిలో పండించిన ఆహార పదార్థాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. రాగులు, సజ్జలు, కొర్రలు, సామలు వంటి మిల్లెట్ ఉత్పత్తులకు వినియోగదారుల ఆదరణ పెరుగుతోంది. సేంద్రియ పద్ధతిలో పండించిన బియ్యం కిలో రూ.125 వరకు విక్రయమవుతుండగా, కొన్ని మిల్లెట్ ఉత్పత్తులు కిలో రూ.200 నుంచి రూ.250 వరకు ధర పలుకుతున్నాయి. బహిరంగ మార్కెట్లతోపాటు ప్రతి సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ప్రత్యేక విక్రయ కేంద్రాల ద్వారా కూడా ఈ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తోంది. పెరిగిన సాగు విస్తీర్ణం వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ముందు జిల్లాలో కేవలం 10 వేల ఎకరాల్లో మాత్రమే ప్రకృతి వ్యవసాయ సాగు జరిగేది. అయితే కరోనా విపత్తు వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అన్నదాతను సర్కారు అన్నివిధాలా ఆదుకోవడం, డెల్టా రైతులతోపాటు, మెట్ట ప్రాంత రైతులకు సహాయ, సహకారాలు అందించడం, మార్కెట్లో లభిస్తున్న ప్రోత్సాహం కారణంగా జిల్లాలో క్రమంగా సేంద్రియ వ్యవసాయ సాగు విస్తీర్ణం 90 వేల ఎకరాలకు చేరుకుంది. దీంతో జిల్లాలో ప్రకృతి వ్యవసాయం క్రమంగా విస్తరిస్తూ రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా మారుతోంది. అధిక లాభం రైతులు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన పెంచుకుని పంటలు సాగుచేస్తే అధిక లాభం పొందవచ్చు. ప్రస్తుతం ఆ ఉత్పత్తులకు గిరాకీ ఉంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చిన్నపాటి మెళకువలతో అధిక దిగుబడులు సాధించవచ్చు. అన్నదాతలకు సూచనలిచ్చేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. – కన్నయ్య, ప్రకృతి వ్యవసాయం, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ -
ఖరీఫ్లోనూ కష్టాలే
పొదలకూరు: ఎడగారు (ఖరీఫ్)లోను యూరియా కష్టాలు రైతులకు తప్పడం లేదు. కొన్ని మండలాల్లో సరిపడా ఉన్నా, తీసుకెళ్లేందుకు వీరికి ఇక్కట్లు ఎదురవుతూనే ఉన్నాయి. అలివికాని నిబంధనలు, సాంకేతికత కారణంగా వీటిని పొందేందుకు తిప్పలు పడుతున్నారు. ఎరువుల దుకాణ యజమానులు సైతం తమకు కష్టాలు తప్పడంలేదని వ్యాఖ్యానిస్తున్నారు. యూరియాను ప్రభుత్వం సకాలంలో సరిపడా అందజేసేందుకే యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. అయితే కర్షకులు మాత్రం యూరియాను అందించలేకే ఇలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. తమకు యాప్లంటే తెలియవని.. ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకోవడం కష్టంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇదీ పరిస్థితి.. ఖరీఫ్లో వరిసాగు 3.75 లక్షలెకరాల్లో ఉంటుందనే అంచనాలతో సాగునీటిని అందజేసేందుకు ఐఏబీ సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్ణయం తీసుకున్నారు. అనధికారికంగా మరో 25 వేల ఎకరాల్లో పడే అవకాశముంది. జిల్లాలో 60 వేలకుపైగా ఎకరాల్లో నాట్లను ఇప్పటికే పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ లెక్కన ఎకరాకు నాలుగు కోటాల వంతున నాలుగు బస్తాల మేర యూరియాను సర్కార్ అందజేయాల్సి ఉంటుంది. జిల్లాలో వరి సాగును బట్టి సుమారు 16 లక్షల బస్తాలు అవసరమవుతాయి. కొందరైతే ఐదు కోటాల మేర వినియోగిస్తుంటారు. ఇలా మొదటి కోటా కింద నాలుగు లక్షలెకరాల్లో యూరియా అవసరం కాగా, ఆ స్థాయిలో ఇవ్వలేకపోతున్నారని అన్నదాతలు పేర్కొంటున్నారు. ఇలా పొందాలి.. ఖరీఫ్ సీజన్లో పంటలను సాగుచేసే రైతులు యూరియాతో పాటు డీఏపీ కావాలంటే రైతు సేవా కేంద్రంలోని వీఏఏకు వివరాలను అందజేయాల్పి ఉంటుంది. వీటిని యాప్లో నమోదు చేస్తారు. పంటల విస్తీర్ణం, ఆధార్ కార్డు, పట్టాదారు పాస్పుస్తకం లేదా 1బీ నమునాను తీసుకొని వెరిఫికేషన్ను పూర్తి చేస్తే.. సొసైటీ, రైతు సేవా కేంద్రాలు, ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా, డీఏపీ ఎరువులను పొందేందుకు వీలుంటుంది. ఇవి అవసరమైన రైతులు ఆర్ఎస్కే, గ్రామ వ్యవసాయ సహాయకుడి వద్ద వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసుకొని ఆధార్ అనుసంధానమైన మొబైల్ నంబర్ గల ఫోన్ను ఎరువుల దుకాణానికి తీసుకెళ్లి పొందాల్సి ఉంటుంది. కౌలుకు సాగు చేస్తున్న వారు పొలం యజమాని పట్టాదారు పాస్పుస్తకం లేదా 1బీ.. యజమాని ఆధార్ లింకై న మొబైల్ నంబర్ను తీసుకొని ఎరువుల దుకాణం వద్దకెళ్లి పొందే అవకాశముంది. డీలర్కు ఓటీపీని పొలం యజమాని చెప్పాల్సి ఉంటుంది. వెబ్ ల్యాండ్లో వివరాల్లేని రైతుల భూముల సాగుకు సంబంధించిన వివరాలను మండల వ్యవసాయాధికారి నిర్ధారించాల్సి ఉంటుంది. అయితే కౌలు రైతు పొలం యజమాని విదేశాల్లో ఉన్నా.. అందుబాటులో లేకపోయినా, ఓటీపీ వెల్లడించేందుకు వీలుండదని రైతులు పేర్కొంటున్నారు. ఇలాంటి అలివికాని నిబంధనలను ఎందుకు విధించారో అంతుచిక్కడంలేదని వాపోతున్నారు. -
జీవన్దాన్వుడు
నెల్లూరు (అర్బన్): జీవ.. తన జీవితాన్ని త్యాగం చేసి ‘జీవన్దాన్’వుడు అయ్యారు. కుటుంబానికి ఆదరువుగా ఉన్న ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిడ్ డెడ్కు గురయ్యారు. పుట్టెడు దుఃఖంలోనూ తమ బిడ్డ అవయవాలను మరికొందరికి దానం చేసి ధన్యజీవులయ్యారు. వివరాలు.. దర్గామిట్టలోని బ్రహ్మానందపురానికి చెందిన ఉలవపాటి వెంకటాద్రి, గీత దంపతులకు కుమారుడు జీవ (24)తో పాటు అంజలి, మరో కుమార్తె ఉన్నారు. హృద్రోగ సమస్యతో తండ్రి ఏ పనీ చేయలేక ఇంటికే పరిమితమయ్యారు. కుటుంబాన్ని పోషించేందుకు కుమారుడితో పాటు కుమార్తెలు చిన్న వయస్సులోనే బాధ్యతలను తమ భుజాలపైకెత్తుకున్నారు. కారు డ్రైవర్గా జీవ.. వస్త్ర దుకాణాల్లో కుమార్తెలు పనిచేస్తూ కుటుంబానికి ఆదరువుగా ఉన్నారు. విధి వక్రీకరించి.. ఆడుతూ.. పాడుతూ జీవితాన్ని ఆస్వాదించాల్సిన వయస్సులోనే కుటుంబభారాన్ని మోస్తున్న జీవను విధి వక్రీకరించింది. బైక్పై ఈ నెల పదిన వెళ్తుండగా, హఠాత్తుగా అడ్డం వచ్చిన వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపుతప్పి పడిపోయారు. వైద్యం నిమిత్తం జీజీహెచ్కు.. ఆపై కిమ్స్ స్పెషాల్టీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో జీవ ఉన్నారు. ఐసీయూలో వెంటిలేటర్పై ఉంచి వైద్యం చేశారు. 24 గంటల తర్వాతా అతని ఆరోగ్యం మెరుగుపడకపోగా, మరింత క్షీణించింది. ఈ నేపథ్యంలో జీవకు అన్ని రకాల పరీక్షలు చేయగా, బ్రెయి న్ డెడ్ అని తేలింది. ఆరు గంటల తర్వాత బయట్నుంచి వచ్చిన డాక్టర్లు సైతం పరీక్ష చేయగా, ఇదే అంశాన్ని నిర్ధారించారు. విషయాన్ని తల్లిదండ్రులకు ఆస్పత్రి యూనిట్ హెడ్ రోహిణి ప్రియలక్ష్మి, వైద్యులు శనివారం తెలిపారు. ఈ మాట విని తల్లి గీత ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బంధుమిత్రుల కన్నీటి ఆర్తనాదాలు, రోదనలు మిన్నంటాయి. మీ బిడ్డను మరికొందరిలో చూడండి.. అవయవాలను దానం చేస్తే మరో ఏడుగురు బతుకుతారని, వీరిలో మీ బిడ్డను చూసుకోమని, వారి గుండెల్లో మీ బిడ్డ ఎన్నటికీ బతికుంటారని, అవయవదానంపై కుటుంబసభ్యులకు రోహిణి ప్రియలక్ష్మి చెప్పారు. దీంతో పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని కన్నీటి సుడుల నడుమ అవయవదానానికి వారు మనస్ఫూర్తిగా అంగీకరించారు. దీంతో జీవన్దాన్ ట్రస్ట్కు ఆస్పత్రి యాజమాన్యం సమాచారమిచ్చింది. గ్రీన్ చానల్లో తరలింపు జీవన్దాన్ ట్రస్ట్ సూచించిన మేరకు జీవకు ఆపరేషన్ చేసిన కిమ్స్ వైద్యులు రెండు ఊపిరితిత్తులను చైన్నెలోని అపోలో.. గుండెను తిరుపతిలోని పద్మావతి హార్ట్ హాస్పిటల్కు.. లివర్ను కర్నూలు ఆస్పత్రికి ప్రత్యేక బాక్సుల్లో భద్రపర్చి.. గ్రీన్ చానల్ను పోలీసులు ఏర్పాటు చేసి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూశారు. దీంతో అత్యంత వేగంగా అంబులెన్స్ల ద్వారా అవయవాలను తీసుకెళ్లి ఆయా ఆస్పత్రుల్లోని రోగులకు అమర్చారు. రెండు నేత్రాలను నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. రెండు కిడ్నీలను కిమ్స్ ఆస్పత్రిలోని రోగులకు అమర్చారు. వారిలో నా బిడ్డను చూసుకుంటా.. నా బిడ్డ బతకడని తెలుసుకొని కుమిలిపోయాను. అయితే మరో ఏడుగురికి జీవితాన్నిస్తుండటంతో అవయవాలను దానం చేస్తున్నాం. వీరిలో నా బిడ్డను చూసుకుంటా. – గీత -
టీడీపీ నేతల అరాచకం
● వైఎస్సార్సీపీ ఫ్ల్లెక్సీల ధ్వంసం కోవూరు: టీడీపీ నేతల అరాచకాలు, దాష్టీకాలు రోజురోజుకూ హద్దు మీరుతున్నాయి. ప్రజాపాలనను గాలికొదిలి.. సంక్షేమాన్ని అటకెక్కించారు. సూపర్ సిక్స్ వంటి పథకాలపై హామీలిచ్చి ప్రజలకు టీడీపీ వెన్నుపోటు పొడిచింది. ఈ క్రమంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమాన్ని ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోవూరులో శుక్రవారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీలను ఆ పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. దీనికి తగినట్లుగానే మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం ఊహించని విధంగా సూపర్ సక్సెస్ అయింది. నియోజకవర్గ నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీన్ని తట్టుకోలేకపోయిన టీడీపీ పట్టణాధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి, నేతలు అసహనానికి గురయ్యారు. కార్యక్రమం ముగిసిన కొద్ది సేపటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మల్లారెడ్డి సమక్షంలో పచ్చ పార్టీ నేతలు కొందరు మద్యం మత్తులో ధ్వంసం చేశారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా నియోజకవర్గంలో భారీ ఎత్తున ప్రజలు తరలిరావడాన్ని స్థానిక నేతల మొదలుకొని టీడీపీ ఎమ్మెల్యే వరకు జీర్ణించుకోలేకపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను చూసినా తట్టుకోలేకపోతున్నారు. రాజకీయంగా ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక, ఇలాంటి నీచపు పనులకు టీడీపీ నేతలు పాల్పడుతుంటే.. ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా భేదాభిప్రాయాలున్నా, పరస్పర గౌరవం పాటించాలని.. ఫ్లెక్సీలు చించడం, పోస్టర్లు తొలగించడం వంటి చర్యలు ప్రజాస్వామ్యంలో మంచి పరిణామాలు కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హితవు పలికారు. -
పరిహారం ఇవ్వకుండానే పొమ్మంటున్నారు
చిల్లకూరు: తీర ప్రాంతంలోని తమ్మినపట్నం రెవెన్యూ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న క్రిస్ సిటీలో మౌలిక వసతులను కల్పించే కాంట్రాక్ట్ సంస్థ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలపై నిరసన కార్యక్రమాలను రెండు రోజులుగా గ్రామస్తులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా రోడ్ల నిర్మాణం, ఇతర పనులకు వినియోగించే వాహనాలను శనివారం అడ్డుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటుకు గ్రామస్తులెవరూ వ్యతిరేకం కాదని, అయితే తమకు పరిహారమిచ్చాకే పనులను కొనసాగించాలంటూ కాంట్రాక్ట్ సంస్థతో పాటు రెవెన్యూ అధికారులకు పలుమార్లు తెలియజేశామన్నారు. సదరు సంస్థతో స్థానిక వీఆర్వో కుమ్మకై ్క తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రామంలో సుమారు 40 కుటుంబాలు నివసిస్తుంటే, 14 ఇళ్లను ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేశారని ఆరోపించారు. గ్రామానికి సమీపంలో ఉన్న గిరిజనుల ఇళ్లను పూర్తిగా తొలగించి, వారికి ప్రత్యామ్నాయం చూపుతామని చెప్పడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పక్కా గృహాన్ని నిర్మించివ్వడంతో పాటు పూర్తి స్థాయిలో నష్ట పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. వాహనాల రాకపోకలను దాదాపు రెండు గంటల పాటు అడ్డుకోవడంతో, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులు అక్కడికి చేరుకొని వారికి సర్దిచెప్పి పునరుద్ధరించారు. ఉద్యమ కార్యాచరణ కోసం 17న బొప్పరాజు రాక నెల్లూరు(అర్బన్): ఎన్నికల సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులకు కూటమి ప్రభుత్వమిచ్చిన హామీలను అమలు చేసేలా ఉద్యమ కార్యాచరణను రూపొందించేందుకు గానూ నెల్లూరుకు ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ నెల 17న రానున్నారని సంఘ జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలోని ఏపీఆర్ఎస్ఏ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సంఘ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్సీ కమిషన్ నియామకం, ఐఆర్ ప్రకటన, పెండింగ్ బకాయిల విడుదల తదితర డిమాండ్ల సాధన కోసం ఉద్యమించేందుకు అన్ని శాఖల్లోని ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని కోరారు. సచివాలయ, ఆర్టీసీ, రెవెన్యూ, ఉపాధ్యాయ ఇలా అన్ని రంగాల్లోని ఉద్యోగులు తమ సమస్యలను బొప్పరాజుకు వివరించి వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ఏపీ జేఏసీ జిల్లా జనరల్ సెక్రటరీ ప్రసాద్, మహిళా జిల్లా జనరల్ సెక్రటరీ చెన్నమ్మ, ఫైర్ డిపార్ట్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్ర, సిటీ జనరల్ సెక్రటరీ మాల్యాద్రి, ప్రధానోపాధ్యాయుల సంఘ నేత చెంచురామయ్య, గ్రామ / వార్డు సచివాలయ సంఘ నేత ఽఽథామస్, అవుట్సోర్సింగ్ కార్మిక సంఘ నేత జానీ తదితరులు పాల్గొన్నారు. -
రక్తదానం.. ప్రాణదానం
వ సారి● జిల్లాలో వేలాది మంది రక్తదాతలు ● స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహిద్దాం ● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం నెల్లూరు(అర్బన్): అన్ని దానాల్లో రక్తదానం గొప్పదంటారు. ఒక్క యూనిట్ రక్తం ముగ్గురి ప్రాణాలను కాపాడగలదు. దీనివల్ల ఇతరుల ప్రాణాలు నిలపడమే కాకుండా దాతలకు కూడా అనేక ఆరోగ్య లాభాలున్నాయి. రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు, రక్తహీనత ఉన్న వారికి, ఆపరేషన్ చేసే వారికి అవసరమైన రక్తం ఎవరైనా దానం చేస్తేనే ప్రాణాలు నిలబడుతాయి. ఈవిషయాన్ని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ రక్త వర్గాలను కనుగొన్న కార్ల్ ల్యాండ్ స్టీనర్ జయంతిని పురస్కరించుకుని 2004 నుంచి అధికారికంగా ప్రపంచ స్వచ్ఛంద రక్తదాతల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. రక్తదానంపై అవగాహన కలిగిస్తోంది. వేలాది మంది రక్తదాతలకు సలాం జిల్లాలో వేలాది మంది రక్తదాతలుగా ఉన్నారు. ఆపద వచ్చినప్పుడు స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. జిల్లాలో రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంకు రోగుల అవసరాలను ఎక్కువగా తీరుస్తోంది. కావలిలో కూడా రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంకు బ్రాంచ్ ఉంది. తర్వాత నోవా బ్లడ్ బ్యాంకు రోగులకు రక్తం అందిండంలో ఆదర్శంగా నిలుస్తోంది. నెల్లూరు సర్వజన ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంకు ఉన్నా అది రోగుల అవసరాలు తీర్చడంలో విఫలమైంది. రెడ్క్రాస్ బ్లడ్బ్యాంకు ప్రతి సంవత్సరం 16 వేల నుంచి 17 వేల యూనిట్ల రక్తాన్ని సేకరిస్తోంది. అయితే ఈ సంవత్సరం వేసవిలో రక్తకొరత తీర్చడంలో రెడ్క్రాస్ బ్లడ్ బ్యాంకు కొంత వెనకబాటు పట్టింది. ఇందుకు పాలకవర్గం సరిగా పట్టించుకోకపోవడం ఒక కారణం. గత నెలలో పాలకవర్గ పదవీకాలం తీరిపోవడంతో ఎన్నికలు జరగలేదు. కొత్త పాలకవర్గం లేకపోవడంతో కూడా రక్తకొరతకు మరొక కారణంగా చెప్పవచ్చు. రక్తదానంతో ఎన్నో ప్రయోజనాలు రక్తదానంతో గుండెపోటు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. ఐరన్ స్థాయిలు సమతుల్యంగా ఉంటాయి. కొత్త రక్తకణాలు ఉత్పత్తయ్యేందుకు రక్తదానం ఎంతో అవసరం. 18 ఏళ్లు నిండి 65 ఏళ్లలో ఉన్న ఆరోగ్యవంతులైన ప్రతిఒక్కరూ రక్తదానం చేయవచ్చు. ఒక్కరు ఒక్క యూనిట్ రక్తం దానం చేస్తే దానిని మూడు రకాల కాంపొనెంట్లుగా విభజిస్తారు. అలా ముగ్గురు రోగులకు ఇచ్చి ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చు. అందువల్ల యువత రక్తదానానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నేడు అవగాహన కార్యక్రమాలు స్వచ్ఛంద రక్తదానంపై జిల్లాలో పెద్ద ఎత్తున ఆదివారం అవగాహన కార్యక్రమాలు జరగబోతున్నాయి. రెడ్క్రాస్ బ్లడ్బ్యాంకులో ఎక్కువ దఫాలు రక్తదానం చేసిన వారిని సన్మానించబోతున్నారు. వైద్యశాఖ, ఇతర అధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ ఫొటోలోని వ్యక్తి చంద్రగిరి అజయ్బాబు. రెడ్క్రాస్లో జీవిత కాల సభ్యుడిగా ఉన్నాడు. బ్లడ్బ్యాంకు మాజీ కన్వీనర్. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. పాఠశాల సమయం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లకుండా బ్లడ్బ్యాంకు కార్యక్రమాల్లో పాల్గొనే వారు. పాఠాలు ఎంత చిత్తశుద్ధితో చెబుతాడో సామాజిక సేవలో అంతే నిబద్ధతతో పని చేస్తారు. ఇప్పటికే 119 సార్లు రక్తదానం చేశారు. ఆదివారం 120వ దఫా రక్తదానం చేయబోతున్నట్టు తెలిపారు. ఈయన తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచాడు. -
పేకాట స్థావరంపై దాడి
అనుమసముద్రంపేట: ఏఎస్పేట గ్రామ శివారు పంటచేల వద్ద పేకాట స్థావరంపై ఎస్సై జిలానీ శనివారం దాడులు నిర్వహించారు. ముగ్గురు జూదరులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.2,640ల నగదును స్వాధీనం చేసుకున్నారు. గల్లంతైన వ్యక్తి మృతి చేజర్ల: కండలేరు జలాశయంలో చేపలవేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతైన వ్యక్తి మరణించారు. పోలీసులు జాలర్ల సాయంతో శనివారం మృతదేహాన్ని వెలికితీశారు. కొల్లపనాయుడు పల్లి అరుంధతీయవాడకు చెందిన కొమ్మల శివకోటయ్య(30) శుక్రవారం చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయిన ఘటన తెలిసిందే. గ్రామస్తుల సమాచారంతో శుక్రవారం చేజర్ల పోలీసులు జలాశయంలో శివకోటయ్య కోసం గాలించగా సాయంత్రం వర్షం ఆటంకం కలిగించి చీకటి పడటంతో వెతకడం నిలిపివేశారు. శనివారం ఉదయం పోలీసులు ఆధ్వర్యంలో జాలర్లు ఇసురు వలల సహాయంతో శివకోటయ్య మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. -
మట్టి అక్రమ తరలింపుపై రామిరెడ్డి ఫైర్
● స్వయంగా రంగంలోకి దిగి అడ్డుకున్న వైనం కావలి: కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి కావలి నియోజకవర్గంలో గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికార అండతో టీడీపీ, కూటమి నేతలు చెలరేగిపోతూ రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములతో పాటు చెరువులు, వాగులు, వంకలను సైతం వీరు కొల్లగొడుతున్నారు. చెరువుల్లో ఏర్పడిన పెద్ద గుంతలు ప్రాణసంకటంగా మారాయి. పట్టణంలోని కావలి పెద్దచెరువు, మన్నంగిదిన్నె, చెన్నాయపాళెం, రుద్రకోట తదితర చెరువుల్లో పరిస్థితి ఘోరంగా మారింది. చెన్నాయపాళెం చెరువులో పగలూ రాత్రనే తేడా లేకుండా సాగుతున్న ఈ వ్యవహారంపై స్థానికులు అడ్డుకోగా, వీరిపై దాడులకూ తెగబడ్డారు. విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ప్రెస్మీట్లను మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి పలుమార్లు నిర్వహించినా, వారి నుంచి కనీస స్పందన కరువైంది. గ్రావెల్ తరలింపును ఆపకపోతే తమ పార్టీ శ్రేణులతో కలిసి అడ్డుకుంటామని హెచ్చరించారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో చివరికి ఆయనే రంగంలోకి దిగారు. కొనదిన్నెలోని ఇరిగేషన్ భూమిలో మట్టిని తవ్వి లేఅవుట్లకు తరలిస్తుండటంతో స్వయంగా వెళ్లి అడ్డుకున్నారు. నియోజకవర్గంలో ఇక నుంచి ఇలాంటి వాటిని ఉపేక్షించేదిలేదని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కనుసన్నల్లో కోట్లాది రూపాయల అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. -
తవ్వేది కొండంత
అనుమతులు గోరంత.. ● ఊనుగుంటపాళెంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు ● పేదల భూములే టార్గెట్గా చెలరేగిపోతున్న అక్రమార్కులు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో భారీగా గ్రావెల్ భూములు ఉండడంతో ఆయా ప్రాంతాల్లోని కూటమి నేతలు తమ గుప్పిట్లోకి తీసుకుని మూడు జేసీబీలు, ఆరు టిప్పర్లు అనే రీతిగా అక్రమ వ్యాపారానికి తెరతీశారు. పేరుకు గుత్తేదారులు గోరంత అనుమతులు తీసుకొని కొండంత తవ్వకాలు చేపడుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. కోట మండలం ఊనుగుంటపాళెం రెవెన్యూ పరిధిలోని పేదల భూములపై కన్నెసిన కూటమి నాయకులు అక్కడ సుమారు 30 నుంచి 40 అడుగుల గ్రావెల్ను మేర తవ్వి తరలించేస్తున్నారు. చిల్లకూరు: సాగరమాల పేరుతో జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా రోడ్డు నిర్మాణ పనులు చేసే కాంట్రాక్టర్లకు గ్రావెల్ అవసరం ఉంది. గత ప్రభుత్వ హయాంలో సాగరమాల కాంట్రాక్టర్లే ఎక్కడైనా ఎత్తుగా ఉన్న భూములను చూసి వాటిని ఎత్తు తగ్గించేలా మూడు అడుగుల మేర తవ్వకాలు చేసే వారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత స్థానిక నాయకులు రంగంలోకి దిగి సాగరమాల కాంట్రాక్టర్లతో తామే గ్రావెల్ సప్లయ్ చేస్తామని స్థానిక ప్రజా ప్రతినిధి ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో రహదారి నిర్మాణం జరిగే ఆయా మార్గాల్లో ఉన్న పేదల భూములపై కన్నేసి చదును పేరుతో కారు చౌకగా కొనుగోలు చేసి అందులో 30 అడుగుల మేర తవ్వకాలు చేసి మట్టి, గ్రావెల్ తరలించుకుపోతున్నారు. అలాగే అనధికార లేఅవుట్లకు మట్టి, గ్రావెల్ను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో నిత్యం వందల టిప్పర్ల మట్టి, గ్రావెల్ తరలిపోతూ ఉంది. మార్గమధ్యలో ఏ అధికారైనా అడిగితే సాగరమాల రహదారి కాంట్రాక్టు సంస్థకు చెందిన వాహనాలని చెప్పి తప్పించుకుపోతున్నారు. ఒక్కరూ చూడరు కోట మండలం ఊనుగుంటపాళెంలోని పేదల భూముల నుంచి అక్రమంగా గ్రావెల్ తవ్వకాలపై ఏ శాఖాధికారి కూడా కన్నెత్తి చూడరు. అనుమతుల్లేకుండా గ్రావెల్ తరలించుకు పోతున్నారని ఫిర్యాదులు అందించినా మనకు ఎందుకు అని మిన్నకుండిపోతున్నారు. కళ్ల ముందే ప్రభుత్వ భూమిలో మట్టి, గ్రావెల్ తవ్వేస్తున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే అది పట్టా భూమి, దాంతో మాకేమి పని అని రెవెన్యూ, గనుల శాఖాధికారులు తప్పించుకుంటున్నారు. ఇక నీటి పారుదల అధికారులు చెరువుల్లో మట్టి తవ్వకాలకు గోరంత అనుమతి ఇస్తే దానిని కొండంతగా తవ్వి తరలించేస్తుంటారు. అడ్డుకుంటే బెదిరింపులు రోజు మొత్తం గ్రావెల్ టిప్పర్లతో రాత్రి పూట నిద్ర పట్టడం లేదని గ్రామాల ప్రజలు టిప్పర్లను అడ్డుకుంటే వారిపై కూటమి నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీనికి తోడు సాగరమాల రహదారి నిర్మాణ పనులకు గ్రామస్తులు అడ్డుపడుతున్నారని కాంట్రాక్టర్లతో కలిసి అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లోని రెవెన్యూ, పోలీస్ అధికారులు రహదారి నిర్మాణ పనులను అడ్డుకుంటే అభివృద్ధి ఆగిపోతుందని, ఇలాగే కొనసాగితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. దీంతో గ్రామస్తులు తమ మీద ఎక్కడ కేసులు బనాయిస్తారోనని మిన్నికుండి పోతున్నారు. ఊనుగుంటపాళెంలోని పేదల భూముల్లో తవ్వకాలు చేపడుతున్న భారీ యంత్రాలు తవ్వకాలతో ఏర్పడిన భారీ గుంతల మధ్య వెళ్తున్న టిప్పర్ -
రైతు ద్రోహి చంద్రబాబు
● వెన్నుపోటుపై నిరసనలు విజయవంతం ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పొదలకూరు: వ్యవసాయం దండగన్న చంద్రబాబు రైతు ద్రోహిగా మారారని.. ప్రజలకు ఇచ్చిన హామీల్లో దేన్నీ నెరవేర్చడంలేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. పొదలకూరులోని పార్టీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం నిర్వహించిన చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు కార్యక్రమాలను విజయవంతం చేశామని తెలిపారు. ఫలితాలు వెల్లడైన జూన్ నాలుగు నుంచి.. ప్రభుత్వం కొలువుదీరిన 12 వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టామని వివరించారు. వీటికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని, బోగస్ హామీలను నమ్మి తాము మోసపోయామనే వాస్తవాన్ని తెలుసుకున్నారని పేర్కొన్నారు. తిరుపతిలో సభను చంద్రబాబు నిర్వహించి ఆత్మస్తుతి.. పరనింద అనే చందాన రకరకాల మాటలను వల్లెవేశారని విమర్శించారు. ఆయన ప్రసంగమంతా తడబాటుతోనే సాగిందని, సూపర్ సిక్స్.. సూపర్ హిట్ అంటూనే ఆడబిడ్డ నిధిని ఇవ్వలేకపోయానన్నారని పేర్కొన్నారు. యాప్తో ఇబ్బందులు యాప్ల పేరుతో యూరియాను ఇవ్వకుండా అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ పద్ధతితో కౌలు రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. యాప్లో వివరాలను వీరు నమోదు చేస్తే.. ఓటీపీ భూ యజమానికి వెళ్తోందని, ఆయన అమెరికాలో ఉంటే అక్కడ రాత్రి.. ఇక్కడ పగలని.. ఈ క్రమంలో వీటిని ఎప్పుడు చెప్పి యూరియాను తీసుకెళ్లాలని ప్రశ్నించారు. పట్టాదారు పాస్పుస్తకం, ఈ – క్రాప్, యాప్ నిబంధనలతో అర్హులైన కర్షకులు సైతం యూరియాను పొందే పరిస్థితి లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి సందర్భాలు ఉన్నాయానని నిలదీశారు. నేతలు పెదమల్లు రమణారెడ్డి, బచ్చల సురేష్కుమార్రెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, లక్ష్మీకల్యాణి, వూకోటి లక్ష్మీనారాయణ, వాకాటి శ్రీనివాసులురెడ్డి, వెన్నపూస దయాకర్రెడ్డి, వెన్నపూస కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
● కార్పొరేట్ పాఠశాలల్లో మోత మోగిస్తున్న వైనం
నూతన విద్యాసంవత్సర ప్రారంభం.. విద్యార్థుల తల్లిదండ్రులకు షాకిస్తోంది. కార్పొరేట్ పాఠశాలల్లో మోత మోగిస్తున్న ఫీజులను చూసి వీరు అయోమయానికి గురవుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 30 శాతం మేర అదనంగా చెల్లించాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. రూ.ముప్పై వేల నుంచి రూ.మూడు లక్షల వరకు ముక్కుపిండి వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మార్చారు. ఇవన్నీ ఓ ఎత్తయితే నామమాత్రంగా క్వాలిఫైడ్ టీచర్లను ఏర్పాటు చేసి చదువు చెప్తున్నారు. వసతులు సైతం అంతంతమాత్రంగా ఉంటున్నాయి. ఇంత జరుగుతున్నా, చర్యలు చేపట్టాల్సిన విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. నెల్లూరు (టౌన్): జిల్లాలోని కార్పొరేట్ పాఠశాలల్లో ఫీ‘జులుం’ కొనసాగుతోంది. విద్యా ప్రమాణాల మాట అటుంచితే ఎంత దండుకుందామాననే రీతిలో యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. వాస్తవానికి స్కూళ్లు శుక్రవారం పునఃప్రారంభమయ్యాయి. అయితే రెండో శనివారం, ఆదివారం రావడంతో ఎక్కువ మంది సోమవారం నుంచి పంపేందుకు డిసైడ్ ఆయ్యారు. జిల్లాలోని 1050కుపైగా కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో 2.1 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. దీపం ఉండగానే.. ఈ పరిణామాల క్రమంలో తల్లిదండ్రుల ఆశలను క్యాష్ చేసుకోవాలనే రీతిలో యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. ఫీజులను అమాంతంగా పెంచేసి దోపిడీ పర్వానికి తెరలేపారు. ఒకటో తరగతి నుంచే ఐఐటీ, నీట్, సివిల్ సర్వీస్ పేరుతో ఫీజులను నిర్ణయిస్తున్నారు. దీంతో పాటు స్కూళ్లకు ఆకర్షణీయమైన పేర్లు పెట్టి మభ్యపెడుతున్నారు. జిల్లాలో స్కూల్ను బట్టి రూ.30 వేల నుంచి రూ.మూడు లక్షల వరకు వసూలు చేస్తున్నారంటే దోపిడీ పర్వం ఏ స్థాయిలో జరుగుతోందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఫీజుల పట్టికను నోటీస్ బోర్డులో ప్రదర్శించాలనే నిబంధన ఎక్కడా అమలు కావడంలేదు. వ్యాపార కేంద్రాలుగా.. ● స్కూళ్లను ఆయా యాజమాన్యాలు వ్యాపార కేంద్రాలుగా మార్చేశాయి. బడుల్లో పుస్తకాలు, యూనిఫారం, స్టేషనరీ తదితరాలను విక్రయించకూడదనే రూల్ ఉన్నా, దాన్నెవరూ పట్టించుకోవడంలేదు. ● పాఠశాల బట్టి వీటికి రూ.ఐదు వేల నుంచి రూ.15 వేల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. లైబ్రరీ, పరీక్ష ఫీజులంటూ ప్రత్యేకంగా లాక్కుంటున్నారు. ● క్యాంటిన్ను ఏర్పాటు చేశామని చెప్తూ, ఆయా రకాల తినుబండారాలకు బయట కంటే రెండింతలను వసూలు చేస్తున్నారు. ● పాఠ్య పుస్తకాలతో సంబంధం లేకుండా సొంత మెటీరియల్ను రూపొందించి వాటితోనే బోధన సాగిస్తున్నారు. ● డీజిల్ ధరలు పెరిగాయనే సాకుతో స్కూల్ బస్సుల రవాణా చార్జీలను రూ.ఐదు వేల నుంచి రూ.ఏడు వేల వరకు పెంచారు. కిలోమీటర్ దూరానికి సైతం ఒక్కొక్కరి నుంచి రూ.ఆరు వేలకుపైగా వసూలు చేస్తున్నారు. అన్క్వాలిఫైడ్ టీచర్లతో బోధన జిల్లాలోని అత్యధిక పాఠశాలల్లో అన్క్వాలిఫైడ్ టీచర్లతోనే బోధనను సాగిస్తున్నారు. వాస్తవానికి ఈ హోదా ఉండాలంటే బీఈడీని తప్పక పూర్తి చేయాలి. అయితే రికార్డుల్లో మాత్రం అందరూ క్వాలిఫైడ్ అనే తరహాలో చూపుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు విద్యార్థులతో బట్టీ పట్టించడమే తప్ప అర్థమయ్యే రీతిలో బోధించడంలేదు. ఈ ఒత్తిడ్ని స్టూడెంట్స్ భరించలేకపోతున్నారు. జిల్లాలో ఇలా.. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు – 1050 విద్యార్థులు – 2.1 లక్షలకుపైగా.. ప్రభుత్వ పరోక్ష కుట్ర నిజానికి గత సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో సర్కార్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ సిలబస్, టోఫెల్, డిజిటల్ విద్య తదితరాలను ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో వసతుల కల్పన కోసం నాడు – నేడు పథకాన్ని అమలు చేసి వాటి రూపురేఖలను సమూలంగా మార్చారు. ఈ క్రమంలో ఇందులో చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపారు. అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరాక వీటిన్నింటికీ మంగళం పాడింది. ఫలితంగా స్టూడెంట్స్ కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల బాట పట్టేలా పరోక్ష సహకారాన్ని సర్కార్ అందించింది. వసతులు మృగ్యం విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో ఫీజులను వసూలు చేస్తున్న యాజమాన్యాలు, స్కూళ్లలో వసతులను కల్పించడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నారు. గాలి, వెలుతురు లేని ఇరుకు గదుల్లోనే బోధనను సాగిస్తున్నారు. సరిపడా టాయ్లెట్లు లేని పరిస్థితి నెలకొంది. అక్కడ అపరిశుభ్రత తాండవిస్తోంది. అపార్ట్మెంట్లలోనూ తరగతి గదులను నిర్వహిస్తున్నారు. మైదానమనేది ఎక్కడా కానరాదు. ఇండోర్ పేరుతో ఒక గదిని కేటాయించి రికార్డుల్లో మాత్రం ఇది ఉందని చూపుతున్నారు. కార్పొరేట్ పాఠశాలల్లో మానసిక ఒత్తిడి తప్ప శారీరక వ్యాయామం లేదు. హాస్టళ్లలో నాసిరక భోజనాన్ని పెడుతున్నారు. మెస్ ధరలను ఎక్కువగా వసూలు చేస్తున్నా, మెనూ ప్రకారం పెట్టడంలేదు. ఆకర్షణీయమైన పేర్లతో స్కూళ్ల ఏర్పాటు గతేడాదితో పోలిస్తే ఈ దఫా 30 శాతం పెంపు రూ.ముప్పై వేల నుంచి రూ.మూడు లక్షల వరకు వసూలు యూనిఫారం, పుస్తకాలు, స్టేషనరీతో అదనపు దోపిడీ క్వాలిఫైడ్ టీచర్లు తక్కువ బెంబేలెత్తుతున్న తల్లిదండ్రులు తన కుమార్తెకు అడ్మిషన్ నిమిత్తం నగరానికి చెందిన రాజేష్.. కార్పొరేట్కు సంబంధించిన సీబీఎస్ఈ స్కూల్కెళ్లారు. ఒకటో తరగతిలో అడ్మిషన్ కావాలంటూ అక్కడ రిసెప్షన్లో ఉన్న సిబ్బందిని సంప్రదించారు. ఐఐటీ ఫౌండేషనా.. నీట్ ఫౌండేషనానని వారు అడగ్గా, ఇదేమీ ఆయనకు అర్థం కాలేదు. ఒకటో తరగతిలో ఇవేంటానని తనకు తానే ప్రశ్నించుకున్నారు. ఎందులో ఎంత ఫీజుంటుందో చెప్పాలని కోరగా, ఐఐటీకి రూ.1.5 లక్షలు.. నీట్కై తే రూ.1.75 లక్షలని వారు సెలవిచ్చారు. యూనిఫారం, పుస్తకాలు, స్టేషనరీకి అదనపు మొత్తాన్ని కట్టాలని వారు చెప్పడంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోవడం ఈయన వంతైంది. జిల్లాలోని అన్ని సూళ్లలో ఇదే పరిస్థితి నెలకొంది. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు ప్రభుత్వ నిబంధనలను కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు చేపడతాం. అధిక ఫీజుల వసూలు.. పుస్తకాలు, యూనిఫారాలను విక్రయించకూడదు. వాట్సాప్ ద్వారా నోటీసులను ఇప్పటికే రెండు, మూడుసార్లు పంపాం. రూల్స్ను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. స్కూళ్లను మానిటరింగ్ చేసి నిబంధనలను అతిక్రమించారని గుర్తిస్తే చర్యలు చేపడతాం. – బాలాజీరావు, డీఈఓ -
అన్ని వర్గాలను మోసం చేశారు
కావలి: కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిందని, అయినా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ రెండేళ్ల అరాచక పాలనకు నిరసనగా కావలిలో భారీ బైక్ ర్యాలీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. రామిరెడ్డి నేతృత్వంలో తన ఇంటి నుంచి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ వరకు ర్యాలీని పార్టీ శ్రేణులు చేపట్టారు. అనంతరం కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. -
పోలీసుల పిల్లలకు కార్పొరేట్ విద్య
నెల్లూరు(క్రైమ్): పోలీసుల పిల్లలకు కార్పొరేట్ విద్య అందించడమే లక్ష్యమని ఏఎస్పీ సీహెచ్ సౌజన్య అన్నారు. నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థల కరస్పాండెంట్లు, ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పదోతరగతి ఉత్తీర్ణులైన పోలీసు సిబ్బంది పిల్లలకు కౌన్సెలింగ్ నిర్వహించి 65 మందికి ఉచితంగా, 40 మందికి 50 శాతం రాయితీపై కార్పొరేట్ కళాశాలల్లో సీట్లు కేటాయించారు. కార్యక్రమంలో ఏఆర్ ఏఎస్పీ పీవీ అప్పారావు, ఏఆర్ డీఎస్పీ చంద్రమోహన్, ఏఓ చంద్రమౌళి, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. కత్తులతో బెదిరించి.. ● బంగారు గొలుసు దోపిడీ నెల్లూరు సిటీ: రూరల్ మండలంలోని ఇందిరమ్మకాలనీ వద్ద గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు వార్డు సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ బంగారు గొలుసును దోపిడీ చేశారు. పోలీసుల కథనం మేరకు.. వెంకటాచలం మండలంలోని అనికేపల్లి సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీగా సురేంద్ర పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి విధులు పూర్తిచేసుకుని నెల్లూరులోని తన ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఇందిరమ్మ కాలనీ వద్ద ముగ్గురు యువకులు స్కూటీపై వచ్చి సురేంద్ర బైక్ను అడ్డగించారు. కత్తులతో బెదిరించి అతని మెడలోని రెండు సవర్లు బంగారు గొలుసు దోపిడీ చేశారు. బాధితుడు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూరల్ ఇన్స్పెక్టర్ వేణు కేసు నమోదు చేశారు. -
ఏఆర్ ఏఎస్పీ బాధ్యతల స్వీకరణ
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు ఏఆర్ ఏఎస్పీగా పీవీ అప్పారావు శుక్రవారం స్థానిక కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు సిబ్బంది పుష్పగుచ్ఛాలిచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అప్పారావు ఏఎస్పీ సీహెచ్ సౌజన్యను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఆయన గతంలో అక్టోపస్ విభాగం, విజయనగరం జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో విధులు నిర్వహించారు. రైల్వేస్టేషన్లో జీఎం తనిఖీలునెల్లూరు సిటీ: నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను విశాఖ జోన్ జీఎం సందీప్ మాధూర్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. బాలిక బలవన్మరణం● కోరుకున్న కళాశాలలో చేర్పించలేదని.. నెల్లూరు (క్రైమ్): తాను కోరుకున్న కళాశాలలో చేర్పించలేదన్న మనస్తాపంతో ఓ బాలిక ఇంట్లోనే ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని జ్యోతినగర్లో శేషగిరిరావు కుటుంబం నివాసం ఉంటోంది. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె లావణ్య (17) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఎంసెట్ రాసింది. స్నేహితులు విజయవాడలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో బీటెక్ చేరుతున్నారని, అక్కడే తనను చేర్పించాలని ఆమె పలుమార్లు తండ్రిని అడిగింది. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అంత పెద్ద కళాశాలలో చేర్చలేనని అతను సర్దిచెబుతూ వచ్చాడు. దీంతో ఆమె కొద్ది రోజులుగా ఎవరితో మాట్లాడకుండా ముభావంగా ఉంటోంది. శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్కు చీరతో ఉరేసుకుంది. కుమార్తెకు టిఫిన్ తీసుకుని శేషగిరిరావు ఇంటికి వచ్చాడు. తలుపులు లోపల గడియ పెట్టి ఉండటంతో అనుమానంతో కిటికీలో నుంచి చూడగా కుమార్తె ఉరేసుకుని కనిపించింది. బంధువుల సాయంతో తలుపులు తెరిచి కుమార్తెను కిందికి దించి చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. వేదాయపాళెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గాడి తప్పిన పాలన
చిల్లకూరు: సీఎం చంద్రబాబు తీరుతో రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ ధ్వజమెత్తారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమాన్ని నియోజకవర్గ పరిశీలకుడు బీరేంద్ర వర్మ పర్యవేక్షణలో నిర్వహించారు. స్థానిక టవర్ క్లాక్ సెంటర్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీని నిర్వహించి.. ఆర్డీఓ అరుణకుమారికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మురళీధర్ మాట్లాడారు. ఇచ్చిన హామీలే కాకుండా మరిన్ని పథకాలను నాటి సీఎం జగన్మోహన్రెడ్డి అమలు చేశారని గుర్తుచేశారు. తొలుత టీడీపీ హామీ ప్రతులను దహనం చేశారు. -
మినీబైపాస్లో కారు బీభత్సం
● ఓ వ్యక్తికి తీవ్రగాయాలు నెల్లూరు(క్రైమ్): నెల్లూరు మినీబైపాస్లో కారు బీభత్సం సృష్టించింది. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నార్త్ ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలం యలమవారిదిన్నెకు చెందిన ధనుష్ కుమార్ ఈవెంట్స్లో డ్రోన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. అతను గురువారం మాగుంట లే అవుట్లోని హెచ్ఎన్ఆర్ కల్యాణ మండపంలో ప్రోగ్రామ్కు వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున డేటా కాపీ చేసుకునేందుకు బాలాజీ నగర్లోని రూమ్కు మోటార్బైక్పై బయలుదేరాడు. పూలే బొమ్మ సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద యూటర్ను తీసుకుంటున్నాడు. ఆత్మకూరు బస్టాండ్ వైపు నుంచి రామలింగాపురం వైపు వెళ్తున్న కారు మీతిమీరిన వేగంతో బైక్ను ఢీకొట్టింది. దీంతో ధనుష్ రోడ్డుపై పడ్డాడు. కారు వేగనియంత్రణ కాక రోడ్డు మార్జిన్లో ఉన్న ట్రక్కు ఆటో, గూడ్సు ఆటో, వెల్డింగ్షాపు ముందున్న ఇనుపగేట్లను ఢీకొంది. తర్వాత సిమెంట్ కరెంట్ పోల్ను ఢీకొంది. అందులో ఉన్న ఇద్దరు యువకులు పరారయ్యారు. ధనుష్ను కుటుంబ సభ్యులు తిరుపతిలోని బర్డ్స్ ట్రస్ట్ హాస్పిటల్ల్లో చేర్పించారు. బాధిత కుటుంబం నార్త్ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై ఎ.సైదులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి మితిమీరిన వేగమా?, మద్యం మత్తా? అనేది కారణం తెలియరావాల్సి ఉంది. ప్రమాదం వల్ల కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకున్నాయి. అందులో ఉన్న వ్యక్తులు ఎవరనే విషయంపై ఎస్సై ఆరా తీస్తున్నారు. -
సూపర్సిక్స్ పేరుతో వెన్నుపోటు
కోవూరు: ఎన్నికల్లో విజయమే పరమావధిగా సూపర్ సిక్స్ హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చినా, వాటిని చంద్రబాబు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కోవూరులో భారీ నిరసన ర్యాలీని మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. స్థానిక రుక్మిణి కల్యాణ మండపం నుంచి బజార్ సెంటర్ వరకు ర్యాలీ సాగింది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. మెగా డీఎస్సీని నిర్వహిస్తామని చెప్పి.. దాన్ని దగా డీఎస్సీగా మార్చారని మండిపడ్డారు. చంద్రబాబు అడ్మినిస్ట్రేటర్ కాదు.. మేనిప్యులేటర్ అని విమర్శించారు. ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి.. నిజమని నమ్మించడంలో ఆరితేరారని ఎద్దేవా చేశారు. కుప్పంలో 30 వేల నకిలీ ఓట్లతో గెలుపొందుతున్నారని ఆరోపించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి పుట్టా శివశంకర్రెడ్డి, సర్వేపల్లి, కోవూరు నియోజకవర్గాల పరిశీలకులు వీరి చలపతి, కొండూరు అనిల్బాబు తదితరులు పాల్గొన్నారు. -
కండలేరు డ్యామ్లో వ్యక్తి గల్లంతు
చేజర్ల: కండలేరు జలాశయంలో ఓ వ్యక్తి గల్లంతైన ఘటన శుక్రవారం జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. కొల్లపనాయుడుపల్లి దళితవాడకు చెందిన కొమ్మల శివకోటయ్య గ్రామ సమీపంలో కండలేరు జలాశయంలో చేపల వేటకు సహచరులతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ప్రమాదవశాత్తు అతను నీటిలో మునిగిపోయాడు. సహచర కాలనీవాసులు కోటయ్యను కాపాడే ప్రయత్నం చేయగా ఫలితం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో శివకోటయ్య కోసం గాలిస్తున్నారు. వృత్తిరీత్యా కోటయ్య డ్రైవర్. వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.60 సన్నవి : రూ.25 పండ్లు : రూ.10 -
విద్యార్థులకు సమస్యల స్వాగతం
నెల్లూరు(టౌన్): వేసవి సెలవుల అనంతరం శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలికాయి. మొండిగోడలు, అపరిశుభ్ర వాతావరణంలో టాయ్లెట్లు దర్శనమిచ్చాయి. చాలాచోట్ల ఆర్వో ప్లాంట్లు పనిచేయకపోవడంతో ఇంటి నుంచి తెచ్చుకున్న వాటర్ బాటిళ్లే వారికి దిక్కయ్యాయి. తొలిరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు ఇస్తారని ఆశించిన విద్యార్థులకు ఆశాభంగం కలిగింది. జిల్లాలోని మెజార్టీ పాఠశాలల్లో పుస్తకాలు తప్ప ఇతర వస్తువులు అందజేయలేదు. ‘మన బడి – మన పండగ’ కార్యక్రమం మొక్కుబడిగా సాగిందనే విమర్శలు ఉన్నాయి. ఖర్చుతో కూడుకున్న పని కావడంతో ఉపాధ్యాయులు సైతం ఆసక్తి చూపలేదని తెలిసింది. సగం మంది విద్యార్థులే హాజరు పాఠశాలల పునఃప్రారంభం రోజు సగం మంది విద్యార్థులే హాజరయ్యారు. మంచిరోజు చూసి పంపాలని తల్లిదండ్రులు భావించడంతో ప్రైవేట్ స్కూళ్లకు సైతం తక్కువ సంఖ్యలో వచ్చారు. జిల్లాలో 3,225 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 1,62,262 మంది విద్యార్థులు హాజరయ్యారు. 1,48,291 మంది గైర్హాజరయ్యారు. ఉపాధ్యాయుల్లో 10,511 మందికి 10,334 మంది హాజరైనట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. ఏ తరగతి విద్యార్థులకు కూడా పాఠాలు బోధించని పరిస్థితి నెలకొంది. దృష్టి పెట్టలేదు పాఠశాలలు పునఃప్రారంభించిన రోజే విద్యార్థులకు కిట్లు ఇవ్వాల్సి ఉన్నా విద్యాశాఖాధికారులు పట్టించుకోలేదు. కొద్దిమందికి మాత్రమే పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ పంపిణీ చేశారు. యూనిఫాం, బ్యాగ్లు, బెల్టులు, బూట్లు, సాక్స్లు ఇంకా అందించలేదు. మధ్యాహ్న భోజనం కూడా నాణ్యంగా లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. మధ్యాహ్నం తర్వాత విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. పాత కిట్లతోనే.. కొంతమంది విద్యార్థులు చినిగిపోయిన బ్యాగ్లతో రాగా, మరికొందరు సొంత వాటిలో పుస్తకాలు తెచ్చుకున్నారు. ఎక్కువ మందిచెప్పులతోనే పాఠశాలలకు వచ్చారు. యూనిఫాం లేకుండానే హాజరైన విద్యార్థుల సంఖ్య అధికంగా ఉంది. పాఠశాలల్లో వసతులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. అపరిశుభ్రంగా మరుగుదొడ్లు, తొలిరోజు సగం మందికి పైగా హాజరుకాని బాలబాలికలు పుస్తకాలతో సరిపెట్టిన విద్యాశాఖ అధికారులు యూనిఫాం, బూట్లు, బ్యాగ్లు ఇవ్వని వైనం -
చంద్రబాబువన్నీ బూటకపు హామీలే
ముత్తుకూరు (పొదలకూరు): బూటకపు హామీలిచ్చి అధికారంలోకి చంద్రబాబు వచ్చారని.. ప్రజలకు వెన్నుపోటు పొడిచి ఈ రెండేళ్ల పాలనలో ఏ వాగ్దానాన్నీ అమలు చేయలేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు వెన్నుపోటు పాలనకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరులో భారీ ర్యాలీని పార్టీ శ్రేణులు, ప్రజలు, మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, పరిశీలకుడు వీరి చలపతిరావుతో కలిసి శుక్రవారం నిర్వహించారు. డీఎస్సీలో జరిగిన అవకతవకలకు నిరసనగా నోటిఫికేషన్ ప్రతులను దహనం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు నిరసన ర్యాలీని చేపట్టారు. చంద్రబాబు పాలనపై వ్యతిరేకతతోనే తమ పార్టీ చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారని తెలిపారు. తమ పార్టీ శ్రేణులపై దౌర్జన్యాలకు సహకరించే అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ప్రతి ఒక్కరికీ గుణపాఠాన్ని చెప్తామని స్పష్టం చేశారు. డీఆర్సీ సమావేశంలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా.. ప్రభుత్వాస్తులకు తమ కుటుంబసభ్యుల పేర్లు పెట్టుకునే అంశాలపై చర్చించడం సర్కార్ చిత్తశుద్ధికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందని.. దీని కోసం జిల్లా వ్యాప్తంగా నిరసనలను రైతులు చేపడుతున్నారని ఆరోపించారు. -
హమ్మయ్య.. వాన కురిసింది
● జిల్లా వ్యాప్తంగా వర్షం నెల్లూరు(అర్బన్): జిల్లాలో ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. శుక్రవారం పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. కొన్నిచోట్ల చెట్లు నేలకూలాయి. మధ్యాహ్నం వరకు నెల్లూరులో 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 3 గంటల తర్వాత మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. 4 గంటల ప్రాంతంలో పలు మండలాల్లో ఈదురుగాలులు వీచాయి. కొన్నిచోట్ల భారీ వర్షం కురిసింది. ఆత్మకూరు, సంగం, పొదలకూరు, వెంకటాచలం, కోవూరు, నెల్లూరు, కొడవలూరు, ఇందుకూరుపేట, టీపీ గూడూరు, వివిధ మండలాల్లో మంచి వాన పడింది. -
ప్రజలకు నయవంచన
ఆత్మకూరు: ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను సీఎం చంద్రబాబు తుంగలో తొక్కారని, సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ఈ రెండేళ్లలో ప్రజలను ఆయన వంచించారని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనను నిరసిస్తూ పట్టణంలో ర్యాలీని పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మున్సిపల్ బస్టాండ్ నుంచి ఆర్టీసీ డిపో వరకు నిరసన ర్యాలీని చేపట్టారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పంటలకు గిట్టుబాటు ధరల్లేక.. యూరియా కొరత.. తదితర సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడంలేదని మండిపడ్డారు. -
పాలనంతా స్కామ్లు, మోసాలే
ఉదయగిరి: రెండేళ్ల కూటమి పాలనంతా స్కామ్లు, మోసాలే తప్ప ప్రజలకు చేసిన మేలేమీ లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ రెండేళ్ల ప్రజావ్యతిరేక పాలనకు నిరసనగా పట్టణంలో భారీ ర్యాలీని పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. యువనేత మేకపాటి అభినవ్రెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు నల్ల దుస్తులు, నల్ల కండువాలను ధరించి నిరసన ర్యాలీకి హాజరయ్యారు. ట్యాంక్ బండ్ నుంచి పంచాయతీ బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీని జరిపారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో టీడీపీ మేనిఫెస్టో ప్రతులను దహనం చేసి.. ప్రజావ్యతిరేక విధానాలను ఖండిస్తూ నినాదాలు చేశారు. -
రెండేళ్లుగా మోసం.. రోడ్డెక్కిన ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చంద్రబాబు వెన్నుపోటు రెండేళ్ల పాలనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులతోపాటు వేలాదిగా ప్రజలు కదిలొచ్చి.. కదం తొక్కారు. ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు నిప్పులు చెరిగిన మండుటెండను సైతం లెక్క చేయకుండా తరలివచ్చిన జనం కూటమి సర్కారు రెండేళ్ల నిరంకుశ పాలనపై ప్ల్లకార్డులు పట్టుకుని నిరసన గళాలతో గర్జించారు. బైక్ ర్యాలీలతో హోరెత్తించారు. మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో ఎనిమిది నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, ఎమ్మెల్సీలతో కలిసి బూటకపు హామీలు, బాబు ష్యూరిటీ.. భవిష్యత్ గ్యారెంటీ పత్రాలను, మేనిఫెస్టోలను దహనం చేశారు. సూపర్ సిక్స్ హామీలు, బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారెంటీతో రెండేళ్లుగా అన్ని వర్గాలను వంచనకు గురి చేయడంపై నిరసనల్లో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి, రాజకీయ కక్షలు, రెడ్బుక్ రాజ్యాంగంతో ప్రతిపక్షం అణచివేతపై సాగించిన అరాచక పాలనపై నిప్పులు చెరిగారు. ప్రజలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో రోడ్లపైకి రావడంతో రెండేళ్లలోనే ప్రభుత్వంపై ప్రజాగ్రహానికి అద్దం పట్టింది. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ, సూపర్ సిక్స్ కాదు.. సూపర్ మోసం, రెడ్బుక్ పాలన.. ప్రజలకు నరకయాతన, టీడీపీ బాండ్లు.. ప్రజలను మభ్యపెట్టిన హామీలు, రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లిపోయిందనే విధంగా ఏపీ మ్యాప్ చిత్రంతో కన్నీరు పెట్టుకుంటున్నట్లు వినూత్న నిరసనలు ప్రజలను ఆలోచింపజేశాయి. సాయంత్రం ఆత్మకూరు, కోవూరుల్లో జరిగిన నిరసనల్లో ఉరుములు, మెరుపులు, భారీ వర్షంలో సైతం ప్రజాగ్రహం పెల్లుబికింది. వైఎస్సార్సీపీ ర్యాలీలను కట్టడి చేసేందుకు పోలీసులు కొన్ని చోట్ల అత్యుత్సాహం ప్రదర్శించారు. కావలిలో బ్రిడ్జి సెంటర్లో వైఎస్సార్సీపీ నిరసనను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గూడూరులో ర్యాలీలకు అనుమతి లేదంటూ ముందస్తు నోటీసులు ఇచ్చారు. సూపర్ సిక్స్ హామీలు, బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ, మేనిఫెస్టో దహనం వివిధ హామీలు, దగాలపై ఫ్లకార్డులతో వినూత్న ప్రదర్శన మండుటెండను సైతం.. ఉరుముల వర్షాన్నీ లెక్క చేయని వైనం -
ప్రజలే తగిన బుద్ధి చెప్తారు
నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక్క హామీని సైతం నెరవేర్చలేదని, రానున్న రోజుల్లో వీరికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. నగరంలోని కరెంటాఫీస్ సెంటర్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు భారీ మోటార్ బైక్ ర్యాలీని నిర్వహించారు. బాబు మోసాలపై నినాదాలు చేశారు. సూపర్ సిక్స్.. సూపర్ ఫ్లాప్.. మోసాల బాబు.. డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డికి పోలీసుల నోటీసులు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డికి పోలీసులు శుక్రవారం నోటీసులు అందజేశారు. ఇటీవల నిర్వహించిన విలేకరుల సమావేశంలో చేసిన రాజకీయ విమర్శల నేపథ్యంలో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ కావలి ఒకటో పట్టణ ఎస్సై సుమన్ నోటీసులు జారీ చేశారు. సోషల్ మీడి యాలో విపరీతంగా మాట్లాడలేని భాషలో తమను, తమ నేతలపై అభ్యంతరకరమైన రీతిలో పోస్టులు చేస్తున్న వారిపై ఫిర్యాదు చేస్తే ఆ కేసులు మాత్రం కట్టకుండా రెడ్బుక్ రాజ్యాంగం లో భాగంగా మా మీద కేసులు కట్టి వేధింపులకు గురి చేస్తున్నారంటూ ప్రతాప్కుమార్రెడ్డి నోటీసులు అందజేసిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో అందరికీ తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందేలా ప్రణాళికలు నెల్లూరు(పొగతోట): గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందేలా పనుల ప్రణాళికలను సిద్ధం చేయాలని జెడ్పీ డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ (జీపీడీపీ)పై జెడ్పీ సమావేశ మందిరంలో మండలాధికారులకు శుక్రవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిధులకు అనుగుణంగా పనుల ప్రణాళికలను రూపొందించాలని కోరారు. గ్రామసభలను నిర్వహించి ప్రజలను ఆహ్వానించాలని సూచించారు. విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత తదితర అంశాలకు సంబంధించిన పనులను గుర్తించాలన్నారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా సభలను నిర్వహించి ప్రణాళికలను రూపొందించాలని పేర్కొన్నారు. గిరిజన మార్కెటింగ్ సొసైటీకి ఐదుగురు డైరెక్టర్ల ఎన్నిక నెల్లూరు(వేదాయపాళెం): నగరంలోని కొండాయపాళెం గేట్ సమీపంలో గల ఐటీడీఏ కార్యాలయంలో గిరిజన ప్రాథమిక సహకార మార్కెటింగ్ సొసైటీ డైరెక్టర్ల ఎన్నికలను శుక్రవారం నిర్వహించారు. ప్రక్రియను జిల్లా కో ఆపరేటివ్ ఆఫీసర్ కోటేశ్వరరావు జరిపారు. ఐదు డైరెక్టర్ స్థానాలకు ఐదుగురే నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అనంతరం వీరికి పత్రాలను అందజేశారు. పెంచలయ్య, కత్తి ఆదిశేషయ్య, పెంచలయ్య, భూపతి జయరామయ్య, మోపూరు అడివయ్యను యానాదుల సంక్షేమ సంఘ నేతలు సత్కరించారు. -
ఆప్తులను చూసి.. భావోద్వేగానికి లోనై
● స్వస్థలాలకు చేరిన క్షతగాత్రులు సంగం: కాశీ యాత్రకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు గురువారం సంగం చేరుకున్నారు. ఉత్తరభారత పుణ్యక్షేత్రాల యాత్రకు వెళ్తూ ఈ నెల 8వ తేదీన బుద్ధగయా నుంచి కాశీకి వెళ్తున్న సమయంలో అర్ధరాత్రి 12.10 గంటలకు రోడ్డు పక్కన ఆగున్న లారీని యాత్రికుల బస్సు ఢీకొని నలుగురు మృతిచెంది, పలువురు గాయపడిన విషయం విదితమే. ఇందులో గురవయ్య, నీలం శీను, నీలం పద్మ, వింజమూరు లక్ష్మమ్మ గాయపడి కట్లతో దిగడాన్ని చూసి స్థానికులు భావోద్వేగానికి గురయ్యారు. శ్రీదేవమ్మ, రమణమ్మ, నారే పద్మ, చెంచు పోలమ్మతో పాటు మరికొంత మందికి స్వల్ప గాయాలయ్యాయని వారు తెలిపారు. ప్రమాదం నుంచి గట్టెక్కి వచ్చిన వారిని చూసేందుకు వారి బంధువులు, మిత్రులు భారీగా వచ్చారు. వస్తామనుకోలేదు తీవ్రంగా గాయపడి వచ్చిన పద్మను చుట్టుపక్కల మహిళలు పలకరించి కన్నీటి పర్యంతమయ్యారు. పక్కింటి వారందరూ ఒక్కసారిగా వచ్చి ఆప్యాయంగా పలకరించి గుండెలకు హత్తుకొని ఆకలితో ఉన్న ఆమెకు వారే అన్నం తినిపించారు. సంగం నుంచి బయల్దేరిన రోజు అన్నం తిన్నామని, మళ్లీ ఇప్పుడు తింటున్నామని, అసలు వస్తామన్న నమ్మకం లేదని పెట్టిన కన్నీరు అక్కడి మహిళలను కలచివేసింది. దేవుడి దయతో బయటపడ్డాం ప్రమాదం జరిగినప్పటి నుంచి అందరం ఆందోళనకు గురయ్యాం. తిరిగి సంగం వెళ్తామన్న నమ్మ కమే లేదు. ఆహా రం సక్రమంగా లేక పస్తులుండాల్సి వచ్చింది. దేవుని దయతోనే బయటపడ్డాం. -
పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలివ్వాలి
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ముత్తుకూరు(పొదలకూరు): పరిశ్రమల స్థాపనలో స్థానికులు కీలక పాత్ర పోషిస్తున్నారని, ఉద్యోగావకాశాల్లో వీరికే ప్రాధాన్యమివ్వాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. ముత్తుకూరుకు గురువారం విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పరిశ్రమల యాజమాన్యాలు స్థానిక యువతకు 75 శాతం ఉద్యోగాలను కేటాయించాల్సిందేనంటూ చట్టాన్ని నాటి సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన అంశాన్ని గుర్తుచేశారు. అయితే వీటిని అతిక్రమించి స్థానిక యువతకు ఉద్యోగాలను సక్రమంగా ఇవ్వడంలేదని ఆరోపించారు. సీఎస్సార్ నిధులను కొందరికి ఎరవేసి ఉద్యోగులకు కనీస వేతనాన్ని చెల్లించకుండా వెట్టి చాకిరీ చేయించుకుంటుంటున్నారని తెలిపారు. వేతనాలను పెంచాలంటూ సర్వేపల్లి నియోజకవర్గంలోని ఎస్ఈఐఎల్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు నెల పాటు సమ్మె చేసిన అంశాన్ని ప్రస్తావించారు. కొందరు కార్మికులు తన వద్దకొచ్చి కలెక్టర్తో మాట్లాడి కార్మిక చట్టం మేరకు వేతనాలను చెల్లించేలా చూడాలని కోరారని తెలిపారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి.. కార్మిక శాఖ అధికారులను పంపి విచారణ చేయించి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారన్నారు. ఎట్టకేలకు యాజమాన్యం దిగొచ్చి వేతనాలను పెంచడం ఆహ్వానించదగ్గ పరిణామమని తెలిపారు. సీఎస్సార్ నిధుల పేరిట ఆస్పత్రుల నిర్మాణమంటూ ప్రకటనలు చేసి కాంట్రాక్టులు దక్కించుకొని రూ.కోట్లు కూడబెట్టకుంటున్నారని ధ్వజమెత్తారు. ఏపీ జెన్కోలో మూడో యూనిట్ను నాటి సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన సందర్భంగా భూములిచ్చిన రైతుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని కోరారని తెలిపారు. అప్పట్లో సానుకూలంగా స్పందించిన ఆయన 200 మందికి ఉద్యోగావకాశాలు కల్పించారని గుర్తుచేశారు. సర్వేపల్లిలో సోమిరెడ్డి ఆయన కుమారుడు చిన్నపాటి ఉద్యోగాలకు సైతం రూ.నాలుగైదు లక్షలను వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అనంతరం బాపనపాటి ప్రకాష్, సృజన వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. పార్టీ మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్రెడ్డి, నెల్లూరు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అంతా లోపభూయిష్టం
నెల్లూరు(టౌన్): ప్రభుత్వ పాఠశాలలను సర్కార్ గాలికొదిలేసింది. పాఠశాలలు శుక్రవారం పునఃప్రారంభం కానున్నా, అక్కడ మౌలిక వసతులను కల్పించే దిశగా ఎలాంటి చొరవ చూపడంలేదు. మరోవైపు వీటిపై సీఎం చంద్రబాబు హడావుడి చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ప్రభుత్వం ఏటా చెప్పే మాటలే కావడంతో జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు లైట్ తీసుకున్నారని సమాచారం. వీటి కోసం రూ.55 కోట్లను మంజూరు చేశామని చెప్తున్నా, ఒక్కపైసానూ ఇవ్వలేదని తెలుస్తోంది. ఎక్కడి పనులక్కడే.. ● కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతోంది. అయితే సర్కార్ బడుల్లో నిలిచిపోయిన నిర్మాణ పనులు ఈ కాలంలో ఒక్క అడుగు సైతం ముందుకెళ్లలేదు. ● నాడు – నేడు రెండో విడతలో అసంపూర్తిగా ఉన్న పనులకు ఒక్క పైసాను సైతం విదిల్చకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ● గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన 727 ఆర్వో ప్లాంట్లలో, ప్రస్తుతం 342 మరమ్మతులకు గురయ్యాయి. వీటిని బాగు చేసే దిశగా ఎలాంటి చొరవ చూపడంలేదు. ● 919 పాఠశాలల్లో 342 టాయ్లెట్లను గతంలో పూర్తి చేశారు. 554 మరుగుదొడ్లలో కేవలం తలుపులనే బిగించాల్సి ఉంది. ● 412 కిచెన్ షెడ్లకు గానూ 158 నిర్మాణాలను పూర్తి చేశారు. మరో 229 చోట్ల తలుపులను ఏర్పాటు చేయాల్సి ఉన్నా, ప్రస్తుతం అతీగతీ లేదు. 20 షెడ్ల నిర్మాణ పనులు పూర్తి కాలేదు. ● 882 తరగతి గదుల నిర్మాణాలను చేపట్టగా, ఇందులో 385 పూర్తయ్యాయి. మరో 485 గదులకు తలుపులను బిగించాల్సి ఉంది. 12 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ● 696 టాయ్లెట్లకు మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించగా, ఇందులో 371 మేర పూర్తి చేశారు. మరో 319 మరుగుదొడ్లకు తలుపులను రిపేర్ చేయాల్సి ఉంది. ఆరు మరమ్మతులు వివిధ దశల్లో ఉన్నాయి. ● 579 ఇంగ్లిష్ ల్యాబ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, 353ను పూర్తి చేశారు. ఇంకా 226ను ఏర్పాటు చేయాల్సి ఉంది. నాడంతా సాఫీగా.. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నాటి సీఎం జగన్మోహన్రెడ్డి.. సర్కార్ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నాడు – నేడు పథకానికి శ్రీకారం చుట్టారు. తొలి విడతలో రూ.231.6 కోట్లతో 1059 పాఠశాలల్లో పది రకాల మౌలిక వసతులను కల్పించారు. అనంతరం రెండో విడతలో భాగంగా రూ.466.94 కోట్లతో 1356 స్కూళ్లలో సౌకర్యాల కల్పనకు నిర్ణయించారు. దీనికి గానూ రూ.190.45 కోట్లను విడుదల చేశారు. పేద విద్యార్థుల కోసం ఇంగ్లిష్ మీడియం అమలు, టోఫెల్ విధానం, సీబీఎస్ఈ సిలబస్, ఎనిమిదో తరగతి స్టూడెంట్స్కు ట్యాబ్ల పంపిణీ తదితరాలకు శ్రీకారం చుట్టారు. అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో ఎన్నికలు రావడం.. అందులో గెలిచి కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో కథ మొదటికొచ్చింది. కొన్ని పాఠశాలల్లో కనీసం లైట్లు, ఫ్యాన్లు, బల్లలూ పూర్తి స్థాయిలో లేవు. రూ.20 కోట్లతో తాత్కాలిక మరమ్మతులను పూర్తి చేసే అవకాశం ఉన్నా, ప్రభుత్వం ఆసక్తి చూపడంలేదు. పేరెంట్స్ కమిటీ అకౌంట్లలో రూ.తొమ్మిది కోట్లున్నా, వాటిని వినియోగించిన దాఖలాల్లేవు. పాఠశాలల పునఃప్రారంభం నేడు మొండిగోడలు, వసతుల లేమితో దర్శనం అసంపూర్తిగా పనులు నిధుల్లేక ఎక్కడికక్కడే నిలిచిపోయిన వైనం తొలుత హడావుడి.. ఆపై విస్మరిస్తున్న ప్రభుత్వం -
కిట్లు ఎప్పుడిస్తారో..?
సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ల సరఫరాలోనూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోంది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పాఠశాలల పునఃప్రారంభ రోజునే జగనన్న విద్యాకానుక కిట్లను అందజేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అరకొరగా, నాసిరకంగా వీటిని ఇస్తున్నారు. కిట్లు సైతం జిల్లాకు స్వల్పంగానే వచ్చాయి. వీటిని మండల కేంద్రాలకు సరఫరా చేసామని చెప్తున్నా, అక్కడ్నుంచి పాఠశాలలకు ఎప్పుడెళ్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఇలా.. జిల్లాలో 3221 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 968 ఫౌండేషన్.. 1187 బేసిక్.. 594 మోడల్.. 79 అప్పర్ ప్రైమరీ.. 288 హైస్కూళ్లు.. 74 హైస్కూళ్లు ప్లస్ బీపీఎస్.. 31 హైస్కూల్స్ ప్లస్ ఎంపీఎస్లు ఉన్నాయి. 1,62,127 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ తొమ్మిది రకాలతో కూడిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను అందజేస్తున్నారు. యూనిఫారం, బ్యాగ్లు, బూట్లు, సాక్సులు, నోట్ పుస్తకాలు, బెల్టులు, పాఠ్య పుస్తకాలు, వర్క్బుక్స్, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, పిక్టోరియల్ డిక్షనరీలను అందజేయాల్సి ఉంది. పాఠశాలల పునఃప్రారంభ రోజే వీటిని అందజేయాల్సి ఉన్నా, ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. అంతా నాసిరకమే.. కిట్లు నాసిరకంగా ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా యూనిఫారం, బ్యాగ్లు, బూట్లు, బెల్టులు ఇలా ఉన్నాయని తెలుస్తోంది. ఏడాది పాటు ఉండాల్సిన వస్తువులు, రెండు మూడు నెలలకే చినిగిపోవడమో లేదా కుట్లు ఊడిపోతున్నాయి. గతేడాది అందిజేసిన కిట్లను విద్యార్థులు మధ్యలోనే వదిలేసి సొంతంగా బ్యాగులు, బూట్లు కొనుగోలు చేసిన పరిస్థితి నెలకొంది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అందజేసిన కిట్లు ఏడాది పొడవునా నాణ్యతగా ఉండేవి. అయితే ప్రస్తుతం ఈ పరిస్థితి మచ్చుకై నా కానరావడంలేదు. మరోవైపు విద్యార్థులందరికీ యూనిఫారాన్ని అందజేయాలంటే రెండు లేదా మూడు నెలలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదొచ్చాక వారు కుట్టించుకొని వినియోగించే సరికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. త్వరలో పూర్తి స్థాయిలో వస్తాయి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు జిల్లాకు పూర్తి స్థాయిలో త్వరలో రానున్నాయి. కొన్ని రకాల వస్తువులు వంద శాతం వచ్చాయి. వీటిని వెంటనే ఆయా మండల కేంద్రాలకు సరఫరా చేశాం. అక్కడ్నుంచి ఆయా పాఠశాలల హెడ్మాస్టర్లు వీటిని తీసుకెళ్లాల్సి ఉంది. విద్యార్థులందరికీ పూర్తి స్థాయిలో అందజేయనున్నాం. – వెంకటసుబ్బయ్య, ఏపీసీ, సమగ్రశిక్షవస్తువులు కావాల్సినవి వచ్చినవి శాతం ఎన్ని మండలాలకు సరఫరా యూనిఫారం 1,62,127 22,012 13.58 ఐదు బూట్లు 1,62,127 –– –– –– బ్యాగ్లు 1,62,127 –– –– –– నోట్బుక్స్ 8,47,716 5,65,117 66.66 27 బెల్టులు 1,15,283 92,762 80.46 30 పాఠ్యపుస్తకాలు 8,49,614 8,45,783 99.55 47 వర్క్బుక్స్ 1,93,460 1,91,447 98.96 47 ఆక్స్ఫర్డ్ డిక్షనరీ 14,077 14,077 100 38 పిక్టోరియల్ డిక్షనరీ 18,012 18,012 100 47 -
వెన్నుపోటుకు రెండేళ్లు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి ప్రభుత్వ మోసాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలను ఈ నెల నాలుగు నుంచి చేపట్టింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా నియోజవర్గ కేంద్రాల్లో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలను శుక్రవారం చేపట్టాలని పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నిరసన ర్యాలీలను భారీగా చేపట్టేందుకు ఇన్చార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు సమాయత్తమవుతున్నారు. ప్రజలను కలుపుకొని చంద్రబాబు చేసిన మోసాలపై గళం విప్పనున్నారు. ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలు అధికారమే పరమావధిగా గత ఎన్నికలకు ముందు అలివికాని హామీలను చంద్రబాబు గుప్పించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా, వీటిని ఏ మాత్రం నెరవేర్చలేదు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఇంట్లో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ నెలకు రూ.1500 చొప్పున.. నిరుద్యోగ భృతి కింద డిగ్రీ చేసిన యువతకు నెలకు రూ.మూడు వేల చొప్పున.. 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పింఛన్ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తామని చెప్పి, ఈ రెండేళ్ల కాలంలో కొద్దిమందికే అందజేసి చేతులు దులుపుకొన్నారు. జాబ్ క్యాలెండర్ను ఏటా ప్రకటిస్తామని చెప్పి, ఇంత వరకు ఒక్కటంటే ఒక్కటీ ప్రకటించలేదు. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలను ఇస్తామని చెప్పి వంచించారు. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులనూ అరకొరగా విడుదల చేశారు. ఆరోగ్యశ్రీని ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పజెప్పేందుకు అడుగులేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి, బస్సులను ప్రైవేట్పరం చేసే యత్నాలూ సాగుతున్నాయి. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు వెన్నుదన్నుగా నిలుస్తూ, ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేస్తున్నారు. తల్లికి వందనం కింద ఎంత మంది బిడ్డలు చదువుతుంటే అందరికీ ఏడాదికి రూ.15 వేలిస్తామని చెప్పి, ఆ తర్వాత లబ్ధిదారులను కుదించడంతో పాటు ఒక్కో విద్యార్థికి రూ.13 వేలనే ఖాతాల్లో జమ చేశారు. పట్టణ ప్రాంతాల్లో 12.. గ్రామీణ ప్రాంతాల్లో 18 అంకణాల ఇంటి స్థలాన్ని ఇస్తామని చెప్పి విస్మరించారు. హామీలను నెరవేర్చకుండా కల్లిబొల్లి కబుర్లు చెప్తూ కాలం వెళ్లదీస్తున్నారు. అమలు చేయాల్సిందే.. హామీలను కూటమి ప్రభుత్వం తప్పకుండా అమలు చేయాల్సిందేని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై జనపోరు బాట పట్టింది. చంద్రబాబు చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ పిలుపునిచ్చింది. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసిన ప్రతి పథకాన్నీ ప్రజలకు వివరించాలని స్పష్టం చేసింది. ప్రజల పక్షాన పోరాడేందుకు పార్టీ శ్రేణులు సంసిద్ధమయ్యారు. నియోజకవర్గ కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల సమయంలో అలివికాని హామీలు అధికారంలోకి వచ్చాక విస్మరణ కూటమి ప్రభుత్వ మోసాలపై వైఎస్సార్సీపీ పోరుబాట నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నేడు -
కన్నీటి వీడ్కోలు
● స్వస్థలాలకు చేరిన మృతదేహాలు ● చికిత్స పొందుతూ మరో మహిళ మృతిసంగం: బిహార్ రాష్ట్రంలోని బుద్ధగయా వద్ద జరిగిన టూరిస్టు బస్సు ప్రమాదంలో గాయపడిన బొమ్మిశెట్టి లక్ష్మమ్మ (52) బుధవారం చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. స్థానికుల కథనం మేరకు.. సంగంకు చెందిన లక్ష్మమ్మ, ఆమె భర్త వెంకటేశ్వర్లు కాశీ యాత్రకు బయలుదేరిన టూరిస్టు బస్సులో ఉన్నారు. ప్రమాదంలో భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా గాయపడటంతో మగధ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. వెంకటేశ్వర్లును చూసుకునేందుకు కుమారుడు శ్రీను వెళ్లాడు. కాగా లక్ష్మమ్మ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని, చికిత్స పొందుతూ కోలుకుంటున్న వెంకటేశ్వర్లును కుమారుడు అంబులెన్స్లో స్వగ్రామానికి తీసుకొస్తున్నాడు. ● పసుపులేటి వెంకటేశ్వర్లు, చవడం హజరత్తయ్య మృతదేహాలను బుధవారం ఇన్చార్జి తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు, ఎస్సై భోజ్యానాయక్, రెవెన్యూ సిబ్బంది తీసుకొచ్చారు. వెంకటేశ్వర్లు నివాసం నెల్లూరులో ఉండటంతో మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అక్కడే అప్పగించారు. హజరత్తయ్యను విగతజీవిగా చూసిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. భార్య గోవిందమ్మ, కుమార్తె, కుమారుడు, బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు. మిన్నంటిన రోదనలు ఆత్మకూరు: ప్రమాదంలో చనిపోయిన సోమా పద్మావతి మృతదేహాన్ని బుధవారం ఆత్మకూరు పట్టణంలోని వీవర్స్ కాలనీకి తీసుకొచ్చారు. పద్మావతికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. భర్త ప్రసాద్ ఓ ప్రైవేట్ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. వీరిది పేద కుటుంబం. పిల్లలను చదివించుకుంటున్నాడు. బంధువులు, స్నేహితులు కాశీ యాత్రకు వెళ్తున్నాం.. రమ్మనడంతో వెళ్లిన ఆమె ప్రమాదంలో చనిపోయింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగానే పిల్లలు, సమీప బంధువులు రోదనలు మిన్నంటాయి. తాను చిన్న ఉద్యోగం చేస్తున్నా.. భార్య సంసారాన్ని ఎలాగోలా నెట్టుకొస్తోందని భర్త ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. ● కాగా తొలుత పద్మావతి మృతదేహాన్ని సంగంలో దించారు. ఆత్మకూరుకు హజరత్తయ్య మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు గుర్తించడంతో అధికారులు తేరుకుని మృతదేహాలను అదే వాహనంలో వారి ఇళ్లకు తరలించారు. -
రహదారులు దారుణంగా ఉన్నాయి
నెల్లూరు(పొగతోట): ‘మర్రిపాడు మండలంలో రోడ్లు దారుణంగా ఉన్నాయి. వాటికి మరమ్మతులు చేయించాలి. ప్రమదాలు జరుగుతున్నాయి. బస్సులు కూడా రావడం లేదు. రెండు సంవత్సరాల నుంచి అడుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు’ అని జెడ్పీటీసీ సభ్యుడు మల్లు సుధాకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నెల్లూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో సభ్యులు వివిధ సమస్యలను వెల్లడించారు. ఏఎస్పేట ఎంపీపీ బోయళ్ల పద్మజారెడ్డి మాట్లాడుతూ మండలంలోని అనేక గ్రామాల్లో పంచాయతీ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. శ్రీకొలనులో హెల్త్ సెంటర్ నిర్మాణం పూర్తై రెండు సంవత్సరాలవుతుందని, త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సంగం – కలిగిరి రోడ్డు అధ్వానంగా ఉందని ఎంపీపీ తెలిపారు. ఇంకా ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేయలేదని సభ్యులు సభ దృష్టి తెచ్చారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే దరఖాస్తులు తీసుకుంటామని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు. సచివాలయాల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయని, బిల్లులు చెల్లించలేదని మంత్రుల దృష్టికి సభ్యులు తీసుకెళ్లారు. నాడు – నేడు పనులు మధ్యలో నిలిచిపోయాయన్నారు. ● పంచాయతీరాజ్ ఎస్ఈ కోటేశ్వర్రావు ప్రగతి నివేదిక చదువుతుండగా రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కలుగజేసుకుని సమావేశాలు ఎప్పడు పెట్టినా ఆవు కథలా పుస్తకంలో ఉండేది చదువుకుంటూ పోవడమేనా, ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాదా అని అసహనం వ్యక్తం చేశారు. రహదారుల మరమ్మతులు, అభివృద్ధి కార్యక్రమాలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంకా మంత్రి నారాయణ మాట్లాడారు. ● ఆనం అరుణమ్మ మాట్లాడుతూ సభ్యులు చెప్పిన సమస్యలను ఆయా శాఖల అధికారులు వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్ల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ● కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రఽశాంతిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తినేందుకు సరైన సౌకర్యాల్లేక విద్యాద్యార్థులు అవస్థలు పడుతున్నట్లు చెప్పారు. సమావేశంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సర్వసభ్య సమావేశంలో చెప్పిన మర్రిపాడు జెడ్పీటీసీ ఎప్పుడూ ఆవు కథ చదువుకుంటూ పోవడమేనా? ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాదా? పీఆర్ ఎస్ఈపై మంత్రి ఆనం అసహనం -
యూరియా కోసం మళ్లీ తిప్పలు
● రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకమే ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ముత్తుకూరు(పొదలకూరు): ఎడగారులో వరి సాగు చేస్తున్న రైతులు యూరియా కోసం మళ్లీ తిప్పలు పడుతున్నారని.. సవాలక్ష ఆంక్షలు విధించి వీటిని అందజేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. ముత్తుకూరు మండలంలోని పంటపాళెం, ఈదర్లవారిపాళెం, కోవెరపాళెం.. తోటపల్లిగూడూరు మండలం వరిగొండ గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా యూరియా, డీఏపీ ఇబ్బందులను రైతులు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆరాచక పాలనను సాగిస్తూ.. కర్షకుల సంక్షేమాన్ని విస్మరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వముందా.. సీఎం ఉన్నారాననే అనుమానం కలుగుతోందని విమర్శించారు. ఎక్కడ చూసినా అవకతవకలు, అవినీతి రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తారు. రెండేళ్ల చంద్రబాబు వెన్నుపోటు పాలనపై జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను వారం రోజులుగా చేపట్టామని చెప్పారు. వెన్నుపోటు పాలనపై ర్యాలీలు, సమావేశాలు, సదస్సులను ఏర్పాటు చేసి చంద్రబాబు ఏ విధంగా వంచించారో ప్రజలకు వివరించామన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలను శుక్రవారం నిర్వహించనున్నామని వెల్లడించారు. సవాల్ చేసి పారిపోయిన సోమిరెడ్డి పొదలకూరు అభివృద్ధిపై సవాల్ చేసిన సోమిరెడ్డి ఆ తర్వాత పారిపోయారని ధ్వజమెత్తారు. సోమిరెడ్డి సవాల్ను తాను స్వీకరించి.. పొదలకూరు మండలంతో పాటు సర్వేపల్లి నియోజకవర్గంలో ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో మీడియా సమక్షంలో చర్చించేందుకు రావాలంటే తోకముడిచి పలాయనం చిత్తగించారని విమర్శించారు. అభివృద్ధి, అవినీతిపై ఎక్కడ బహిరంగ చర్చకు రమ్మన్నా, తాను సిద్ధంగా ఉన్నానని మరోసారి సవాల్ విసిరారు. ఇప్పటికై నా ఏజెంట్లు, చెంచాలను పంపకుండా నేరుగా చర్చకు రావాలని డిమాండ్ చేశారు. గతంలో ఈ ప్రాంతంలో సోమిరెడ్డి ఎలాంటి అభివృద్ధి చేశారో చెప్పాలని పది రోజులుగా ఎదురుచూస్తున్నా, రావడంలేదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా గ్రామాల్లో తాను చేసిన అభివృద్ధి కనిపిస్తోందని, ఏ చిన్నపాటి అవసరమొచ్చినా అందుబాటులో ఉంటున్నానని తెలిపారు. పేడూరు, ఇస్కపాళెం, కోవెరపాళెం గ్రామాల్లో అభివృద్ధిని చూసి మాట్లాడాలని సూచించారు. ఈ ప్రాంతంలో రోడ్లు సక్రమంగా లేకపోతే, తాను చొరవ చూపి వేయించానని గుర్తుచేశారు. గ్రామాల్లో సాగు, తాగునీటి వసతులను కల్పించామని.. పట్టణాలు, గ్రామాల్లో ప్రభుత్వ లేఅవుట్లను నిర్మించి ఊళ్లనే ఏర్పాటు చేశామని తెలిపారు. తాము మంజూరు చేసిన ఇళ్లకు కూటమి ప్రభుత్వంలో బిల్లులు ఆపించి ఆనందపడుతున్నారని దుయ్యబట్టారు. పంటపాళెంలో మృతి చెందిన రావి రవీంద్రబాబురెడ్డి.. ఈదర్లవారిపాళెంలో దామవరపు రామచంద్రారెడ్డి.. కోవెరపాళెంలో కుడుముల శేషమ్మకు నివాళులర్పించారు. వరిగొండలో మృతి చెందిన గండవరపు పట్టాభిరామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నేతలు మెట్టా విష్ణువర్ధన్రెడ్డి, ఆలపాక శ్రీనివాసులు, ఎంపీటీసీ రవికుమార్రెడ్డి, చెంగారెడ్డి, హేమంత్రెడ్డి, ఉప్పల శంకరయ్యగౌడ్, తలమంచి సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
పెన్నానదిలో కాసుల వేట
కోవూరు: నియోజకవర్గ పరిధిలోని పెన్నా నది నుంచి ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని జొన్నవాడ, కోవూరు మండలంలోని జమ్మిపాళెం, వేగూరు, ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు, ముదివర్తిపాళెం, విడవలూరు మండలంలోని ముదివర్తి పరిసర ప్రాంతాల్లో అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు. ఒక్కో ప్రాంతం నుంచి రోజూ సుమారు 50 నుంచి వందలోపు ట్రాక్టర్లలో తరలిస్తున్నట్లు తెలిసింది. రాత్రి వేళల్లో.. నది పరీవాహక ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయి. నది అడుగు భాగాన్ని లోతుగా తవ్వి ఇసుకను ట్రాక్టర్లు, టిప్పర్లలో నింపి తరలిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పగటి వేళల్లో కూడా ఇసుక రవాణా జరుగుతున్నా సంబంధిత శాఖలు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. నదిలో భారీ గుంతలు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో మరోలా.. ఇసుక తవ్వకాలకు అనుమతి లేవని రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖల అధికారులు ప్రకటించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం భిన్న పరిస్థితులున్నాయి. అనుమతి లేకపోతే నదిలో తిరుగుతున్న ట్రాక్టర్లు, టిప్పర్లు ఎవరివి?, రోజూ వందల ట్రిప్పుల ఇసుక ఎలా తరలుతోందని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇంత పెద్దఎత్తున కార్యకలాపాలు జరుగుతున్నా అధికారులకు తెలియకపోవడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా అక్రమంగా తరలిస్తున్న ఇసుక విలువ రూ.కోట్లలో ఉంటుందని అంచనా. అక్రమ రవాణా ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా పెన్నా పరీవాహక ప్రాంతమంతా విస్తరించిందని విమర్శలు ఉన్నాయి. రాజకీయ అండతో.. ఇసుక మాఫియా ఇంత ధైర్యంగా వ్యవహరించడానికి రాజకీయ అండదండలే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొందరు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం సాగుతోందని విమర్శిస్తున్నాయి. ఫిర్యాదులు చేసినా చర్యలు కనిపించడం లేదని చెబుతున్నారు. ఈ ఆరోపణలపై జిల్లా యంత్రాంగం స్పష్టత ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా నదిలో విచక్షణారహితంగా ఇసుక తవ్వకాలు జరగడంతో భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో నీటి సమస్యలున్నాయని, ఇసుక తవ్వకాలు కొనసాగితే భవిష్యత్లో తాగు, సాగునీటి సమస్యలు మరింత తీవ్రం అవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.పెన్నా నదిలో ఇసుక తవ్వకాలకు అనుమతి లేదు. ఇదీ అధికారులు చెప్పే మాట. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. అసలు నదీ గర్భంలో భారీ యంత్రాలు పనిచేస్తూ ఇసుకను వెలికితీస్తున్నాయి. ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా ఇసుక తరలింపు జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసం కోవూరు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. రెచ్చిపోతున్న ఇసుక మాఫియా రాత్రింబవళ్లు సాగుతున్న అక్రమ తవ్వకాలు అనుమతి లేదంటున్న యంత్రాంగం మరి నదిలో తిరుగుతున్న వాహనాలు ఎవరివో?సహజ స్వరూపానికి ముప్పు అక్రమ తవ్వకాలతో పెన్నా నది సహజ ప్రవాహ వ్యవస్థ దెబ్బతింటోందని స్థానికులు చెబుతున్నారు. నది అడుగు భాగంలో భారీ గుంతలు ఏర్పడటంతో వరదల సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నదిని పరిరక్షించేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జొన్నవాడ, జమ్మిపాళెం, వేగూరు, పల్లిపాడు, ముదివర్తిపాళెం, ముదివర్తి ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు, ఈ వ్యవహారం వెనుక ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
యూరియా యాప్లతో వెతలు
వాకాడు: యూరియా పంపిణీకి సంబంధించి వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టిన నూతన యాప్లతో మండల రైతులు బుధవారం తీవ్ర అవస్థలు పడ్డారు. ఒకప్పుడు సులువుగా లభించే యూరియా నేడు అందని ద్రాక్షలా మారింది. నూతనంగా ప్రవేశపెట్టిన ఏపీఏఐఎమ్మెస్ యాప్లో తమ పొలం వివరాలు, ఖాతా నంబర్ తప్పనిసరిగా నమోదై ఉంటేనే ఎరువులను అందజేయనున్నామని అధికారులు కొర్రీలు పెడుతుండటంతో కార్యాలయ ఎదుట నిరసనను రైతులు బుధవారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లడారు. యూరియా కోసం ప్రైవేట్ డీలర్ల చుట్టూ వారం రోజులుగా ప్రదక్షిణలు చేస్తున్నా, ఒక్క బస్తా సైతం లభించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేవుని మాన్యాలు, సీజేఎఫ్ఎస్, పొరంబోకు భూములను సాగు చేస్తున్న రైతులకు ఖాతా నంబర్ లేక, ఆన్లైన్ యాప్లో నమోదు కావడంలేదంటూ అధికారులను నిలదీశారు. దీన్ని అదునుగా తీసుకున్న కొందరు ప్రైవేట్ షాపుల యజమానులు.. స్థానిక వ్యవసాయాధికారులతో కుమ్మకై ్క నకిలీ డాక్యుమెంట్లను ఆన్లైన్లో నమోదు చేసి తద్వారా వచ్చిన యూరియాను పక్కదారి పట్టిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. -
భారీ కుంభకోణం వెలుగులోకి
అల్లూరు: జిల్లాలో అమాయక మహిళల అజ్ఞానం.. ప్రభుత్వ కార్యాలయాల రికార్డులను ఆసరాగా చేసుకొని సాగుతున్న ఒక భారీ బ్యాంక్ లోన్ కుంభకోణం వెలుగుచూసింది. బాధితురాలికి తెలియకుండానే ఆమె ఆధార్, రేషన్ కార్డులను దొంగలించి, సంతకాలను ఫోర్జరీ చేసి రూ. 20 లక్షల మేర బ్యాంక్ నిధులను కొల్లగొట్టిన వ్యవస్థీకృత ఆర్థిక నేరం స్థానికంగా తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తోంది. అసలేం జరిగిందంటే..? అల్లూరు మండలం, బట్రకాగొళ్లుకు చెందిన విమలకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బృందావనం బ్రాంచ్ నుంచి రికవరీ నోటీస్ ఇటీవల రావడంతో ఆమె ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తానెప్పుడూ వెళ్లని బ్యాంక్లో, తనకు సంబంధం లేని కొండ్లపూడికి చెందిన స్వాతి పొదుపు లక్ష్మి గ్రూప్ పేరిట రూ. 20 లక్షల లోన్ (అకౌంట్ నంబర్ 0384 15090000018) మంజూరైందని.. ఇందులో తనకు రూ.రెండు లక్షలు ఇచ్చారని తెలుసుకొని నిర్ఘాంతపోయారు. వెలుగు ఆఫీస్ డేటా చోరీ బాధితురాలు విమల, కుటుంబసభ్యులు బ్యాంక్కు వెళ్లి రికార్డులను పరిశీలించగా, విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అల్లూరు పొదుపు సంఘం వెలుగు ఆఫీస్లో భద్రంగా ఉండాల్సిన ఆమె ఆధార్, రేషన్ కార్డుల రికార్డులను స్వాతి పొదుపు లక్ష్మి గ్రూప్, కొండ్లపూడి, నెల్లూరు రూరల్ మండలానికి చెందిన నిందితులు అక్రమంగా దొంగలించారు. సదరు గ్రూప్ ప్రెసిడెంట్ కీర్తి సునీత, వైస్ ప్రెసిడెంట్ పోలా వైష్ణవి మరికొందరితో కలిసి ఈ కుట్రకు తెరలేపారు. తన రికార్డులు ఎలా వచ్చాయని విమల ప్రశ్నించగా, అల్లూరు వెలుగు ఆఫీస్ నుంచి సేకరించామని తెలిపారు. అధికారుల అండదండలతోనే..? ఈ కుంభకోణంలో నిందితులు వాడిన పద్ధతి చూసి పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. లోన్ అప్లికేషన్ ఫైల్లో ఉన్న గ్రూప్ ఫోటో, పాస్ ఫొటోల్లో నిందితుల ముఖాలు క్లియర్గా ఉన్నాయి. అయితే ఆ ఫొటోల కింద ఉన్న పేర్లు, ఆధార్ నంబర్లు మాత్రం బాధితురాలు విమలవి కావడం గమనార్హం. అంటే బ్యాంక్కు వెళ్లిన నిందితులు తమ ఫొటోలు ఉంచుకొని, ఐడెంటిటీ కార్డులను మాత్రం అమాయక ప్రజలవి జతపర్చారు. ఆర్బీఐ నిబంధనల మేరకు కేవైసీ వెరిఫికేషన్ చేయకుండా, భారీ లోన్ మొత్తాన్ని లైన్ ట్రాన్స్ఫర్ చేయకుండా లీడర్లకు బై హ్యాండ్ నగదు రూపంలో అప్పగించడం వెనుక నాటి బ్యాంక్ అధికారుల పాత్ర ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత మేనేజర్ సైతం సిస్టమ్లో లాగినై ఇదంతా ఫోర్జరీ, మోసమేనని ప్రాథమికంగా నిర్ధారించారు. ఎస్పీని ఆశ్రయించగా, కేసును అల్లూరు పోలీస్స్టేషన్కు పంపారు. కారకులపై కఠిన చర్యలు చేపట్టి తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు. గ్రూప్ లీడర్ల ఫోర్జరీతో రూ.20 లక్షలకు టోకరా అల్లూరు వెలుగు ఆఫీస్ నుంచి ఆధార్ కార్డుల అపహరణ బాధితురాలి పేరుతో రూ.రెండు లక్షల లోన్ స్వాహా ఫొటోలు నిందితులవి.. ఐడెంటిటీలు అమాయకులవి -
ప్రసన్నతో కాకాణి భేటీ
నెల్లూరు రూరల్: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డితో నగరంలోని ఆయన నివాసంలో మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. పార్టీ బలోపేతానికి చేపట్టనున్న కార్యాచరణపై సమీక్షించారు. త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై బూత్ లెవల్ ఏజెంట్లకు అవగాహన కల్పించే చర్యలపై చర్చించారు. కోవూరులో శుక్రవారం నిర్వహించనున్న వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అనుసరించాల్సిన చర్యలు, స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ శ్రేణుల సమన్వయంపై మాట్లాడారు. జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ల నియామకం నెల్లూరు (లీగల్): స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్లను నియమిస్తూ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జారీ చేసింది. నెల్లూరులోని వేదాయపాళేనికి చెందిన రిటైర్డ్ న్యాయశాఖ ఉద్యోగి కొల్లూరి నరసింహరావును నెల్లూరు స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్గా.. ఒంగోలుకు చెందిన నాన్ ప్రాక్టీస్ న్యాయవాది కోలా ఉమామహేశ్వరరావును కోవూరు జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్గా నియమించారు. కాగా వీరు ఏడాది పాటు కొనసాగనున్నారు. వడ్డెర్లకు త్వరలో పరికరాల పంపిణీనెల్లూరు(వేదాయపాళెం): వడ్డెర్ల జీవనశైలికి అవసరమైన పరికరాలను త్వరలో అందజేయనున్నామని జిల్లా వెనుకబడిన తరుగతుల సేవా సహకార సంఘ లిమిటెడ్ ఈడీ నిర్మలాదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు గానూ వీటిని అందజేయనున్నామని వివరించారు. ఆదరణ పథకం అమలుకు సమావేశాలను ప్రభుత్వం నిర్వహించనుందని, విధివిధానాలు ఖరారైన అనంతరం వీటిని పంపిణీ చేయనున్నామని వెల్లడించారు. కండలేరులో 36.66 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో బుధవారానికి 36.660 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1900, హై లెవల్, లోలెవల్ కాలువలకు 50 చొప్పున, పిన్నేరు కాలువకు ఐదు, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల మేర విడుదల చేస్తున్నామని వెల్లడించారు. వైఎస్సార్సీపీ నుంచి సస్పెన్షన్ నెల్లూరు రూరల్: పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనల నేపథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ హంషీద్ అలీని సస్పెండ్ చేశామని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ ఆదేశాలు, క్రమశిక్షణ నియమావళిని పాటించకుండా పార్టీ నేతలపై సోషల్ మీడియా వేదికగా అసభ్య పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయాన్ని తీవ్రంగా పరిగణించామని పేర్కొన్నారు. ఈ క్రమంలో సస్పెన్షన్ వేటేశామని వెల్లడించారు. -
సమస్యలపై ఏకరువు
● డీఆర్సీ సమావేశంలో ఇదీ పరిస్థితి ● వివిధ అంశాలను లేవనెత్తిన ప్రజాప్రతినిధులు ● రెండున్నర గంటల్లో మీటింగ్ పూర్తి నెల్లూరు(పొగతోట): జిల్లాలో పొగాకు సాగు చేస్తున్న రైతులు ధరల్లేక తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో డీఆర్సీ మీట్ను జిల్లా ఇన్చార్జి మంత్రి ఫరూక్ అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. దీనికి ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ హాజరయ్యారు. గంటకుపైగా ఆలస్యంగా ప్రారంభమైన మీటింగ్ను మధ్యాహ్నం 1.30కు ముగించారు. వ్యవసాయం, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, జాతీయ రహదారులు తదితర శాఖలతో సమీక్షించి మమ అనిపించారు. యూరియా అందక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యేలు తెలియజేశారు. ఎకరాకు ఐదు బస్తాల యూరియాను వినియోగించే అన్నదాతలకు మూడు బస్తాలను సైతం ఇవ్వకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారని వివరించారు. మూడు బస్తాల మేరే సరఫరా చేసేందుకు సర్కార్ చర్యలు చేపట్టిందని మంత్రులు బదులిచ్చారు. పనులను త్వరగా ప్రారంభించాలి చింతారెడ్డిపాళెం అండర్ పాస్ పనులను త్వరగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ కోరారు. పాఠశాలల్లో పనులనూ పూర్తి చేయాలని చెప్పారు. ఇక్కడ పరిశుభ్రత అధ్వానంగా మారిందన్నారు. మత్స్యకారులకు బోట్లను అందజేయాలని పేర్కొన్నారు. పొగాకు బోర్డులో జిల్లాకు సంబంఽధించిన రైతు సంఘాల నేతలు, ప్రజాప్రతినిధుల సభ్యత్వం ఉండేలా డీఆర్సీలో తీర్మానం చేశామని ఇన్చార్జి మంత్రి తెలిపారు. జొన్న పంటకు ప్రభుత్వ మద్దతు ధర అధికంగా ఉందని.. ఎమ్మెస్సెమ్ఈలో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లాను ఆదేశించారు. తక్కువకు కొనుగోలు చేస్తున్నారు.. డీసీపల్లి పొగాకు బోర్డులో కిలో ప్రారంభ ధరను రూ.280గా నమోదు చేశారని, అయితే పెద్ద కంపెనీల్లేకపోవడంతో రూ.180 నుంచి రూ.185కే కొనుగోలు చేస్తున్నారని మంత్రి ఆనం తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది గ్రేడ్ – 1 రకం పొగాకును సాగు చేశారని, నాణ్యతగా ఉన్నా, ధరలను నీరుగారుస్తున్నారని పేర్కొన్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు. పశువుల కోసం 2500 ఎకరాల్లో చింతలదేవి బ్రీడింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, ఇక్కడ బ్రీడింగ్ అద్భుతంగా ఉందని పశుసంవర్థక శాఖ అధికారులు చెప్తున్నా, అది వాస్తవం కాదని చెప్పారు. అసలు నీటి వసతి పూర్తి స్థాయిలో లేకపోతే ఇవన్నీ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఎవరెవరు ఏమి మాట్లాడారంటే..? ● ఆక్వా రంగానికి సంబంధించిన రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ అందడంలేదని ఎంపీ బీద మస్తాన్రావు తెలిపారు. ● పరిశ్రమలను పెట్టకుండా భూములను ఏ విధంగా కేటాయించారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ప్రశ్నించారు. ఎకరా రూ.లక్షకు వందెకరాలను కేటాయించాలని కోరారు. ● లష్కర్లకు వేతనాలివ్వాలని కోరుతున్నా, నేటికీ సమస్య పరిష్కారం కాలేదని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పేర్కొన్నారు. ● మత్స్యకారుల సేవ అందరికీ జమకాలేదని, దీనిపై సాంకేతిక కారణాలంటున్నారని కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలియజేశారు. గూడూరు, వెంకటగిరి ఎమ్మెల్యేలు పాశం సునీల్, కురుగొండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వంపై సమరానికి ఉద్యోగులు సిద్ధం
నెల్లూరు(అర్బన్): ‘కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా ఉద్యోగ, ఉపాధ్యాయ, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్స్కు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. దీంతో ప్రభుత్వంపై సమరానికి సిద్ధంగా ఉండాలి’ ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు అల్లంపాటి పెంచలరెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నెల్లూరు కలెక్టరేట్ ఆవరణలోని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యాలయంలో ఏపీ జేఏసీ అమరావతి నాయకుల అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెంచలరెడ్డి మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్కు చైర్మన్ను నియమించకపోవడం సిగ్గు చేటన్నారు. ఆకాశాన్నింటిన ధరలు, ఆర్థిక సంక్షోభంతో అనేక చిరుద్యోగ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మధ్యంతర భృతి ప్రకటిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకపోవడం అన్యాయమన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, ఆర్టీసీ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను గాలికొదిలేసిందన్నారు. దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించి, తక్షణమే ఐఆర్ను ప్రకటించాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను పునరుద్ధరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు ఇస్తున్న రెండు సంవత్సరాల చైల్డ్ కేర్ లీవ్ను రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు అమలు చేయాలన్నారు. సరెండర్ లీవులు ఎప్పటికప్పుడు చెల్లించాలని కోరారు. ఆర్టీసీ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. లేకుంటే తమ సంఘం రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిరంతర ఆందోళనలు చేస్తామన్నారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా కార్యదర్శి ఓవీ ప్రసాద్, కో చైర్మన్ మునీంద్ర, మహిళా విభాగం కన్వీనర్ సోమిశెట్టి వసంతకుమార్, చైతన్య కిశోర్ తదితరులు పాల్గొన్నారు. పీఆర్సీ లేదు.. డీఏ అరియర్స్ ఇవ్వడం లేదు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు తీరని అన్యాయం ఏపీ జేఏసీ అమరావతి నేతలు -
అధిక ఫీజుల వసూళ్లపై చర్యలు చేపట్టాలి
కార్పొరేట్ విద్యాసంస్థలు వసూలు చేస్తున్న అధిక ఫీజులపై కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ఫీజులపై గతంలో రెగ్యులేటరీ కమిషన్ను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఇది ఉందాననే సందేహం తలెత్తుతోంది. పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో వసతులు అధ్వానంగా మారాయి. భోజనం సైతం నాణ్యాతగా ఉండటం లేదు. ఇప్పటికే డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు కార్పొరేట్ ఫీజులు చూసి భయపడుతున్నారు. – నరహరి, అధ్యక్షుడు, పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
నెల్లూరు సిటీ: భార్య కాపురానికి రాలేదని మనస్తాపం చెంది పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కార్తీక్ (40) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి చనిపోయాడు. బుధవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. కొత్తూరులో కార్తీక్, జ్యోతి దంపతులు నివాసం ఉంటున్నారు. కార్తీక్ అప్పులపాలు కావడంతో మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో జ్యోతి తాగొద్దని ఎంత చెప్పినా భర్త వినలేదు. భార్య ఇటీవల సౌత్మోపూరులోని తన పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో మంగళవారం కార్తీక్.. ఆమె ఇంటి వద్దకు వెళ్లి తనతో రావాలని అడిగాడు. జ్యోతి రానని చెప్పడంతో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని తిరుపతిలోని రుయా హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.అందుబాటులోకి టోల్ఫ్రీ నంబర్నెల్లూరు(అర్బన్): లింగ నిర్ధారణ తదితరాలను అరికట్టే పీసీ పీఎన్డీటీ చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే తెలియపరిచేందుకు టోల్ఫ్రీ 1800 233 2447 నంబర్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చినట్లు డీఎంహెచ్ఓ సుజాత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆడశిశువుల హక్కుల పరిరక్షణ, లింగ వివక్ష నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే పీసీ పీఎన్డీటీ చట్టాన్ని విజయవంతంగా అమలు చేయగలమన్నారు. అందువల్ల గర్భస్త శిశువు లింగ నిర్ధారణకు సంబంధించి అక్రమ కార్యకలాపాలు, లింగ నిర్ధారణ సేవల ప్రకటనలు, అనుమతి లేని స్కానింగ్, డయాగ్నోస్టిక్ కేంద్రాలు, లింగ ఎంపికను ప్రోత్సహించే ఏ విధమైన చర్యలనైనా గుర్తించి ప్రజలు టోల్ఫ్రీ నంబర్కి ఫోన్ చేయాలని కోరారు. ఆడపిల్లను కాపాడుకునేందుకు, సమానత్వ సమాజాన్ని నిర్మించేందుకు ప్రజలు ఈ చట్టం ద్వారా భాగస్వామ్యులు కావాలని కోరారు.వేణుగోపాల్ నగర్లో కార్డెన్ సెర్చ్నెల్లూరు(క్రైమ్): నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నవాబుపేట ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్రెడ్డి తన సిబ్బందితో కలిసి బుధవారం వేణుగోపాల్ నగర్లో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. సరైన పత్రాల్లేని 11 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇన్స్పెక్టర్ రహదారి భద్రతా నియమాలు, శక్తి యాప్, ఎల్హెచ్ఎంఎస్ సేవలు, సైబర్ నేరాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి విక్రయాలను గుర్తిస్తే డయల్ 112 లేదా పోలీసుస్టేషన్కు తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో నవాబుపేట పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రక్త పరీక్షల కేంద్రంలో సిబ్బంది రుబాబు
● ఇబ్బందులు పడుతున్న గర్భిణులు, ఆశా కార్యకర్తలు ● ఖాళీ కుర్చీలు ఉన్నా కూర్చోనివ్వలేదని ఆరోపణలు ఆత్మకూరు: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో రక్త పరీక్షల కేంద్రం వద్ద సిబ్బంది తీరుపై గర్భిణులు, ఆశా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల కోసం వచ్చిన వారితో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, తీవ్ర స్వరంతో మాట్లాడుతున్నారనే ఆరోణలున్నాయి. ఆరోగ్య సంరక్షణలో భాగంగా ప్రభుత్వం ప్రతి నెలా గర్భిణులకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఇందులో భాగంగా 9, 10 తేదీల్లో ఆశా కార్యకర్తలు తమ పరిధిలోని గ్రామాల నుంచి గర్భిణులను ఆస్పత్రికి తీసుకొస్తున్నారు. ఇక్కడ రక్తపరీక్షలు నిర్వహిస్తుంటారు. పంపేశారు బుధవారం పదిమందికి పైగా ఆశా కార్యకర్తలు తమ గ్రామాలకు చెందిన గర్భిణులను పరీక్షల కోసం తీసుకొచ్చారు. రక్త నమూనాలు తీసుకున్న అనంతరం రిపోర్టులు వచ్చిన తర్వాత రావాలని చెబుతూ గర్భిణులు, ఆశా కార్యకర్తలను అక్కడి నుంచి పంపేశారు. కుర్చీలు ఖాళీగా ఉన్నప్పటికీ కూర్చోనివ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఓపీ సమీపంలోని కుర్చీల్లో రోగులు కూర్చుని ఉండటంతో ఖాళీ లేక గర్భిణులు, ఆశా కార్యకర్తలు ఆస్పత్రి వరండాలో నేలపై కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రక్త పరీక్షల కేంద్రంలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగిని తరచూ తీవ్ర స్వరంతో మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంపై రక్త పరీక్షల కేంద్రం డాక్టర్ స్పందిస్తూ భవిష్యత్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూస్తామని తెలిపారు. రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న సమయంలో సమస్యలు ఎదురవుతున్నాయేమో పరిశీలిస్తామని పేర్కొన్నారు. -
యూరియా కోసం అన్నదాతల ఆందోళన
కోవూరు: ఖరీఫ్ సాగు కీలక దశలో ఉన్న సమయంలో యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ క్రమంలో విసిగి వేసారిన రైతులు స్థానిక పడుగుపాడు సొసైటీ కార్యాలయం వద్ద ఆందోళనను మంగళవారం చేపట్టారు. ఒక బస్తా యూరియా కోసం సొసైటీల చుట్టూ రోజుల తరబడి తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన కొత్త యాప్ నిబంధనలు మరింత భారంగా మారాయని తెలిపారు. తమకు అవసరమైనంత మేర అందజేయాలని డిమాండ్ చేశారు. 1న డీసెట్ నెల్లూరు (టౌన్): డీసెట్ను వచ్చే నెల ఒకటిన నిర్వహించనున్నామని డీఈఓ బాలాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్లు ఈ నెల పది నుంచి అందుబాటులో ఉంటాయని.. ఫలితాలను వచ్చే నెల నాలుగున విడుదల చేయనున్నారని వివరించారు. అర్హత సాధించిన విద్యార్థులకు వచ్చే నెల పది నుంచి 15లోపు వెబ్ ఆప్షన్లు.. 16న సీట్ల అలాట్మెంట్.. 19 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. 25న తరగతులు ప్రారంభంకానున్నాయని వెల్లడించారు. -
స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి
నెల్లూరురూరల్: రాష్ట్రంలో బీసీల జనాభా నిష్పత్తికి అనుగుణంగా స్థానిక సంస్థల్లో 44 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం నెల్లూరులోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2027లో సమగ్ర బీసీ కులాల జనగణన పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించరాదని ఆయన కోరారు. బీసీ కులవృత్తిదారులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు బ్యాంక్ లింకేజ్ రుణాల కోసం ప్రభుత్వం రూ.430 కోట్లు విడుదల చేయాలన్నారు. ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాథోడ్ సుజాన్ సింగ్ మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు 50 సంవత్సరాల వయస్సు నిండిన బీసీలకు పింఛన్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఓబీసీ విద్యార్థి, యువజన సంఘం రాష్ట్ర కన్వీనర్ ఉల్లిపాయల మురళీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు సుమారు రూ.2,000 కోట్లను ఇవ్వాలన్నారు. లేకపోతే ఈనెల 27న విద్యాశాఖ కమిషనరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో నేతలు ఉన్నవ సుబ్బారావు, పేరయ్య, రమాదేవి, ప్రదీప్ యాదవ్, సుధీర్, రవి, హరికష్ణ, సునీల్ పాల్గొన్నారు. -
రైల్లోంచి జారిపడి..
● గుర్తుతెలియని వ్యక్తి మృత్యువాత వెంకటాచలం: రైల్లోంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని గొలగమూడి రైల్వేగేట్ సమీపంలో మంగళవారం గుర్తించారు. రైల్వే ఎస్సై హరిచందన కథనం మేరకు.. గొలగమూడి రైల్వేగేట్ సమీపంలో అప్లైన్ పక్కన మృతదేహం ఉందని నెల్లూరు రైల్వేస్టేషన్ మాస్టర్ ఫిర్యాదు చేయడంతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. అతని వయస్సు 30 నుంచి 35 ఏళ్లలోపు ఉంటుందని తెలిపారు. కేసు నమోదు చేశారు. -
టీడీపీ సర్కార్ ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వ భూములకు రక్షణ కొరవడుతోంది. ఎక్కడ జాగా కనిపిస్తే.. అక్కడ పాగా వేసేలా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కుంట, డొంకా ఇలా దేన్నీ వదలకుండా స్వాహా చేస్తున్నారు. తాజాగా పొదలకూరు మండలం మరుపూరు సమీపంలో లేఅవుట్ను నిర్మిస్తు
డొంక పొరంబోకు భూమిని ఆక్రమించి నిర్మించిన ఆర్చి పొదలకూరు: అధికారాన్ని అడ్డం పెట్టుకొని పట్టా ల్యాండ్స్తో పాటు కుంట, డొంక పొరంబోకు భూములను కొందరు పెద్ద మనుషులు ఆక్రమించి భారీ లేఅవుట్ను ఏర్పాటు చేస్తున్నారు. భారీ ప్రచారంతో దీని నిర్మాణాన్ని చేపట్టిన నిర్వాహకులు.. సుమారు రూ.పది కోట్ల విలువజేసే పొరంబోకు భూములను కలిపేసుకున్నారు. అధికారం ముసుగులో ఎస్టీలకు చెందిన భూముల నుంచి యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలు జరిపి సదరు వెంచర్కు వినియోగించారు. ముందున్న ఆర్ అండ్ బీ మెయిన్ రోడ్డుపై అనుమతుల్లేకుండా రహదారిని విస్తరించారు. పెద్ద ఆర్చిలను డొంక పొరంబోకు భూముల్లో నిర్మించి ఇదే రహదారి అంటూ చూపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. లేఅవుట్లో ఉన్న కుంట పొరంబోకు భూమి సుమారు ఎనిమిదెకరాలను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. గ్రామస్తులు దీనికి ఏ మాత్రం సమ్మతించడం లేదు. రూ.కోట్ల విలువైన ల్యాండ్స్ మాయం సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండలంలో గల మరుపూరు రెవెన్యూ పరిధిలో సుమారు 120 ఎకరాల్లో లేఅవుట్ను మనభూమి యాజమాన్యం చేపడుతోంది. నుడా నుంచి పదెకరాల్లోపే అనుమతులను ప్రస్తుతం పొందారు. విడతల వారీగా పర్మిషన్లు పొందేందుకు యత్నిస్తున్నారు. ఇక్కడ విల్లాల నిర్మాణంతో పాటు ప్లాట్ల వ్యాపారాన్నీ చేస్తున్నారు. అయితే మరుపూరు రెవెన్యూ విలేజ్ ఎల్పీఎం నంబర్ 830లో 5.02.. ఎల్పీఎం నంబర్ 83 లో 2.96.. డొంక, కుంట పొరంబోకు రెవెన్యూ భూములను కలిపేసుకున్నారు. డొంక దారికి సంబంధించిన సుమారు 150 అడుగుల స్థలంలో ఆర్చీనీ నిర్మించారు. కుంటలోని నీటిని చుట్టుపక్కల మేతకొచ్చే పశువులు ఎప్పట్నుంచో తాగుతుంటాయి. దీన్ని పూడ్చేసి దేవాలయ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ మొత్తం భూముల విలువ సుమారు రూ.10 కోట్లకుపైగానే ఉంటుంది. పక్కనే తూర్పువైపు పాలిచెర్లపాడు రోడ్డుకు ఆనుకుని ఉన్న అసైన్డ్ భూములను సైతం కొనుగోలు చేశారు. లేఅవుట్కు ముందున్న ఆర్ అండ్ బీ మెయిన్ రోడ్డు పక్కనే ఇష్టానుసారం తవ్వేసి అనుమతుల్లేకుండా రోడ్లను విస్తరించారు. రాజకీయ పలుకుబడి, అధికారం వెన్నుదన్నుగా ఉండటంతోనే లేఅవుట్ యజమానులు ఇలా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాలి మరుపూరు వద్ద నిర్మిస్తున్న మనభూమి లేఅవుట్లో కలిపేసుకున్న రూ.కోట్ల విలువైన సుమారు ఎనిమిదెకరాల ప్రభుత్వ భూములను కాపాడాలి. ఈ విషయమై కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశాం. భవిష్యత్తులో పశువులు, రైతులు నడిచేందుకు దారి.. నీరు తాగేందుకు కుంటా ఉండదు. అధికారులు చర్యలు చేపట్టకపోతే ఆందోళనకు సిద్ధంగా ఉన్నాం. – కలిచేటి రామిరెడ్డి, గ్రామస్తుడు, మరుపూరు డొంకదారి కబ్జా పొలాలకు రైతులు దశాబ్దాలుగా వెళ్లే డొంక దారిని కబ్జా చేశారు. ప్రశ్నిస్తే కొత్త రోడ్డుపై వెళ్లొచ్చని బదులిస్తున్నారు. లేఅవుట్ను కలుపుకొన్న దారిలో భవిష్యత్తులో వెళ్లనిస్తారంటే ఎవరూ నమ్మరు. కుంటను కబ్జాను చేసి దేవాలయ నిర్మాణానికి పనులు చేపట్టారు. – ఏనుగు అనిల్రెడ్డి, గ్రామస్తుడు, మరుపూరు సర్వే చేపట్టాం గతంలో విచారణను ఒక సారి జరిపి, కుంటను వదిలేయాలని లేఅవుట్ యజమానులకు సూచించాం. తాజాగా వీఆర్వో, సర్వేయర్ను పంపి భూములను సర్వే చేయిస్తున్నాం. కబ్జాకు గురై ఉంటే చర్యలు చేపట్టి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నాం. – శివకృష్ణయ్య, తహసీల్దార్, పొదలకూరు కుంట, డొంకా.. గుటకాయ స్వాహా అధికారమే అండగా మరుపూరుకు సమీపంలో అతిపెద్ద లేఅవుట్ రూ.పది కోట్ల విలువైన పొరంబోకు ల్యాండ్స్ కబ్జా కలెక్టర్కు వినతిపత్రమిచ్చిన గ్రామస్తులు -
సర్టిఫికెట్లు ఇస్తేనే వెళ్తాం
● ప్రభుత్వాస్పత్రిలో బాధితుల ఆందోళన ● దిగొచ్చిన అధికారులునెల్లూరు(అర్బన్): పదిరోజలుగా బర్త్, డెత్ సర్టిఫికెట్లు పంపిణీ నిలిచిపోవడంతో మంగళవారం బాధితులు పెద్దసంఖ్యలో నెల్లూరులోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. కాళ్లరిగేలా తిరుగుతున్నామని, వీటి కోసం ఇంకెన్ని రోజులు తిప్పుకొంటారని ఆందోళనకు దిగారు. ఆస్పత్రి ఎదుట పలువురు బైఠాయించారు. మంగళవారం ఇస్తామని ఆపరేటర్ చెప్పారని, ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దీంతో మధ్యాహ్నం 12 గంటలకు ఆపరేటర్ వస్తారని, అప్పుడు సర్టిఫికెట్లు ఇస్తామని ఉద్యోగులు చెప్పడంతో శాంతించారు. అయితే మధ్యాహ్నం దాటినా అతను రాకపోవడంతో బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లు ఇస్తేనే వెళ్తామని భీష్మించుకున్నారు. ఉద్యోగులతో వాగ్వాదానికి దిగారు. దీంతో జీజీహెచ్ సూపరింటెండెంట్ మాధవి, ఏడీ ఏడుకొండలు, అభివృద్ధి కమిటీ సభ్యులు శ్రీనివాసులు, బ్రహ్మారెడ్డి, మల్లికార్జున్లు బాధితులతో మాట్లాడారు. తాత్కాలికంగా ఇద్దరు ఆపరేటర్లను ఏర్పాటు చేసి బర్త్, డెత్ సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. -
అనర్హులకు అందలం..!
నెల్లూరు(టౌన్): క్రీడా రంగంలో అనర్హులను అందలం ఎక్కిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జాతీయ విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు 3 శాతం రిజర్వేషన్ కల్పించడంతో క్రీడా సర్టిఫికెట్లకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. తాజాగా నెల్లూరు జిల్లా క్రికెట్ జట్టు ఎంపికల్లోనూ ప్రతిభావంతులైన క్రీడాకారులకు అన్యాయం జరిగిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలను మొక్కుబడిగా నిర్వహించారని సమాచారం. జట్టు ఎంపికలో వయస్సు తక్కువ, ప్రతిభ లేని క్రీడాకారులను ఎంపిక చేశారంటూ పలువురు ఆరోపిస్తున్నారు. రాజకీయ పలుకుబడి, రూ.లక్షల లావాదేవీల కారణంగా ప్రతిభ లేకున్నా కొందరికి జిల్లా జట్టులో స్థానం కల్పించారని ప్రచారం జరుగుతోంది. క్రికెట్ జట్ల ఎంపికల్లో ఓ అజ్ఞాత వ్యక్తి కీలక పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గత నెలలో జట్టు ఎంపికలు నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వివిధ విభాగాల క్రికెట్ జట్ల ఎంపికలు జరుగుతున్నాయి. గత నెల 10వ తేదీన అండర్ – 16 బాలుర జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించారు. దీనికి సంబంధించి గత నెల 5వ తేదీన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. అందులో 2010 సెప్టెంబర్ ఒకటి నుంచి 2011 సెప్టెంబర్ ఒకటో తేదీ మధ్య జన్మించిన వారే అర్హులని పేర్కొన్నారు. క్రీడాకారులు ఆధార్కార్డు, జనన ధ్రువీకరణ పత్రం (ఫారం 5) తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. ఎంపికల అనంతరం 16 మంది ప్రధాన జట్టుకు, మరో నలుగురిని స్టాండ్బైగా ఎంపిక చేసి మొత్తం 20 మంది క్రీడాకారులతో జిల్లా జట్టును ఖరారు చేశారు. ఇది బుధవారం నుంచి చిత్తూరు జిల్లా వాయల్పాడులో జరిగే అంతర్ జిల్లాల పోటీల్లో పాల్గొననుంది. వారికి మొండిచేయి జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలను మొక్కుబడిగా నిర్వహించి ప్రతిభావంతులైన క్రీడాకారులను పక్కనపెట్టి, అర్హత లేని వారిని ఎంపిక చేశారన్న విమర్శలున్నాయి. అంతేకాకుండా అర్హత నిబంధనలకు విరుద్ధంగా వయసు తక్కువ ఉన్న క్రీడాకారులను ఎంపిక చేయడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా జట్టులో సీహెచ్ వెంకటకార్తి (12–04–2012), బి.సనత్రెడ్డి (29–01–2012), జి.శ్రేయాన్స్రెడ్డి (29–03–2012)ను ఎంపిక చేయడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం అర్హత లేకపోయినా వీరిని అండర్ 16 జట్టుకు ఎలా ఎంపిక చేశారనే అంశంపై క్రీడావర్గాల్లో చర్చ జరుగుతోంది. డబ్బు, రాజకీయ పలుకుబడితో.. వయస్సు తక్కువతోపాటు ప్రతిభ లేని, రాజకీయ పలుకబడి గల క్రీడాకారులను ఎంపిక చేశారన్న విమర్శలున్నాయి. అధికార పార్టీకి చెందిన వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేల ప్రోద్బలం ఉందన్న ప్రచారం జరుగుతోంది. జట్టులోకి తీసుకోవాలని నేరుగా అసోసియేషన్ నేతలకు ఫోన్ చేసినట్లు తెలిసింది. ఎంపికై న కొందరి నుంచి నుంచి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల చొప్పున తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. జట్టులో కూడా వారికి ప్రాధ్యనత ఇచ్చేలా హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఒకరిద్దరు క్రీడాకారులను ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల సిఫార్సుతో జట్టులో తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పలువురు క్రీడాకారుల తల్లిదండ్రులు నేరుగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఎన్నో ఏళ్లుగా ఆటనే నమ్ముకుని రేయింబవళ్లు ప్రాక్టీస్ చేసి తీరా జట్టులో ఎంపిక కాకపోవడంతో పలువురు క్రీడాకారులు చేసేదేమీలేక లోలోన మదనపడుతున్న పరిస్థితి ఉంది. ఎంపికలను అసోసియేషన్లకు వదిలిపెట్టకుండా కలెక్టర్ కూడా దృష్టి సారిస్తే ప్రతిభ గల వారికి న్యాంయ జరుగుతుందని చెబుతున్నారు. ఇప్పటికై నా అన్ని రకాల క్రీడా విభాగాల్లో నిజాయితీగా ఎంపికలు నిర్వహించి అర్హులకు అవకాశం కల్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ● దీనిపై నెల్లూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి స్పందిస్తూ ఎంపికలు సక్రమంగా నిర్వహించామన్నారు. ● కోచ్ జుల్కర్ మాట్లాడుతూ జిల్లా జట్టు ఎంపికలో వయస్సు ఎక్కువ గలవారు ఉండకూడదని, తక్కువ ఉన్నా ఎంపిక చేసుకోవచ్చన్నారు. అయితే ప్రెస్నోట్లో వయస్సుకు సంబంధిత తేదీలు ప్రకటించారని అడగ్గా ఒకసారి పరిశీలిస్తానని సమాధానమిచ్చారు. గత నెలలో అండర్ – 16 బాలుర జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలు వయసు తక్కువ ఉన్నవారికి అవకాశం డబ్బులు, రాజకీయ ప్రోద్బలంతో ఎంపిక చేశారన్న విమర్శలు ప్రతిభలేని క్రీడాకారుల ఎంపికకు రూ.5 లక్షల వసూలు? ఏసీఏకి తల్లిదండ్రుల ఫిర్యాదు నేటి నుంచి అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు -
ప్రకృతి వనరులపై తమ్ముళ్ల కన్ను
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు తమ్ముళ్లు ప్రకృతి వనరులను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వీరికి ప్రజాప్రతినిధుల అండ ఉండటంతో ఉన్నతాధికారులు కూడా చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొందనే ఆరోపణలున్నాయి.ఉదయగిరి: కూటమి ప్రభుత్వంలో ఉదయగిరి నియోజకవర్గంలో పచ్చ నేతలు బరితెగిస్తున్నారు. రూ.కోట్ల విలువ చేసే ప్రకృతి సంపదను అక్రమంగా తరలిస్తున్నారు. నిబంధనలు ఖాతరు చేయకుండా మట్టి, గ్రావెల్, ఇసుక, క్వార్ట్ ్జను స్వాహా చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఒకవేళ ప్రజల నుంచి ఒత్తిడి వచ్చిన సందర్భాల్లో ఎక్కడైనా పట్టుకున్నా జరిమానాలతో సరిపెట్టి వదిలేస్తున్నారు. దీంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతూ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రకృతి వనరుల అక్రమ తరలింపు జరుగుతోందనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. ఇరిగేషన్ చెరువులను సైతం వదలకుండా రాత్రింబవళ్లు తేడా లేకుండా జేసీబీలు, ట్రాక్టర్లతో గ్రావెల్, మట్టిని తరలిస్తున్నారు. యథేచ్ఛగా ఇసుక, మట్టి, గ్రావెల్, తెల్లరాయి తరలింపు రూ.కోట్ల విలువైన సంపద లూటీ ఉదయగిరి నియోజకవర్గంలో ఇదీ పరిస్థితిఏం చేశారంటే.. మంగళవారం కలిగిరి మండలం తెల్లపాడు ఇరిగేషన్ చెరువు నుంచి జేసీబీలతో ట్రాక్టర్ల ద్వారా మట్టి, గ్రావెల్ తరలిస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. వింజమూరు, ఉదయగిరి, దుత్తలూరు, కలిగిరి మండలాల్లో గ్రావెల్ దోపిడీ కొనసాగుతోంది. దీని వెనుక అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందనే విమర్శలతో అధికారులు మౌనం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వింజమూరు మండలం జనార్ధనపురంలో సోమవారం అక్రమంగా తరలిస్తున్న క్వార్ట్ ్జ లారీని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే నామమాత్రపు కేసు నమోదు చేసి మైనింగ్ అధికారులకు అప్పగించారు. స్వల్ప జరిమానాతో తప్పించుకునే అవకాశం ఏర్పడిందనే ఆరోపణలున్నాయి. పిల్లాపేరు నుంచి నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్టర్ల ద్వారా అక్రమ రవాణా జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఆ ప్రాంతం గుల్లగా మారుతోంది. నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల్లో ఇదే తరహా అక్రమ దోపిడీ జరుగుతున్నా అడ్డుకునే ధైర్యం అధికారులకు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
వెన్నుపోటుకు ఆద్యుడు చంద్రబాబు
● హామీలివ్వడం.. గాలికొదిలేయడం ఆయనకు అలవాటే ● ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్రెడ్డి మనుబోలు: సీఎం చంద్రబాబుకు వెన్నుపోటు పొడవడం వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా మనుబోలులో ర్యాలీని మంగళవారం నిర్వహించారు. అనంతరం పద్మావతి కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు సూపర్సిక్స్ అని, ఆపై మరొకటి కలిపి సూపర్ సెవన్ అని హామిలిచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఒక్క దాన్నీ సక్రమంగా అమలు చేయడంలేదని ధ్వజమెత్తారు. ఆడబిడ్డ నిధి.. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు.. నెలకు రూ.మూడు వేల నిరుద్యోగ భృతిని ఇస్తానని చెప్పి గెలిచాక కుచ్చుటోపీ పెట్టారని విమర్శించారు. దగా డీఎస్సీ మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను దగా చేశారని మండిపడ్డారు. స్పోర్ట్స్ కోటా పేరుతో గతంలో 29 క్రీడలుండగా, ఇప్పుడు దాన్ని 65 చేశారని తెలిపారు. ఇందులో పేకాట, టగ్ ఆఫ్ వార్, యోగా లాంటి వాటిని చేర్చారని చెప్పారు. క్రీడా అసోసియేషన్లను అప్పటికప్పుడు పెట్టించి, వాటి ద్వారా నకిలీ సర్టిఫికెట్లను సృష్టించి తమకు అనుకూలమైన వారికి అడ్డదారిలో ఉద్యోగాలను కట్టిబెట్టారని ఆరోపించారు. ఇలా 421 ఉద్యోగాలను చంద్రబాబు, లోకేశ్ అమ్ముకున్న విషయమై వాస్తవాలను చెప్పాలని నిలదీశారు. కేసులు పెడతామని తమను బెదిరించినంత మాత్రాన, డీఎస్సీలో జరిగిన దగా, అవినీతిపై మాట్లాడకుండా ఉండబోమని స్పష్టం చేశారు. ఉచిత బస్సులు అవసరమైన చోట ఆగడంలేదంటూ మహిళలు వాపోతున్నారని తెలిపారు. మూడు గ్యాస్ సిలిండర్లు.. తల్లికి వందనం పేరిట వంచించారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ధాన్యం ధరలు రూ.24 వేల నుంచి రూ.26 వేలుంటే, ఇప్పుడు రూ.20 వేలు సైతం పలకడంలేదని విమర్శించారు. రైతులకు యూరియాను సైతం సక్రమంగా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. కనీసం ఒక్కరికై నా కొత్త పింఛన్ను ఇచ్చారానని ప్రశ్నించారు. గద్దర్కు కారిచ్చా.. భగత్సింగ్కు నేనే తుపాకీ ఇచ్చా నంటూ డబ్బాలు కొట్టుకోవడం తప్ప ప్రజలకు పవన్ కల్యాణ్ చేసిందేమీలేదని ఎద్దేవా చేశారు. గతంలో 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమయ్యారని ఆరోపించి, ఇప్పుడేమి చేస్తున్నారని ప్రశ్నించారు. దెబ్బకు దెబ్బ తప్పదు తమ పార్టీ శ్రేణులపై దాడులకు పాల్పడుతూ.. తప్పుడు కేసులతో ఎవరైతే ఇబ్బందులకు గురిచేస్తున్నారో.. తాము అధికారంలోకి వచ్చాక వారికి దెబ్బకు దెబ్బ తప్పదని హెచ్చరించారు. తనపై ఆరోపణలు చేస్తున్న సోమిరెడ్డి తన సవాల్ను స్వీకరించి బహరంగ చర్చకు రావాలని డిమాండ్ చేస్తే, తోకముడిచి పారిపోతున్నారని విమర్శించారు. మహిళలకు కనీస మర్యాద లేదు ప్రస్తుత ప్రభుత్వంలో మహిళలకు కనీస మర్యాదలేదని పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆరోపించారు. సూపర్సిక్స్ లో నాలుగు హామీలు మహిళలకు అని చెప్పి, వారికి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. నేతలు బొమ్మిరెడ్డి హరగోపాల్రెడ్డి గుండాల ఆదినారాయణ, కడివేటి చంద్రశేఖర్రెడ్డి, ముంగర రవీందర్రెడ్డి, మారంరెడ్డి ప్రదీప్రెడ్డి, చిట్టమూరు అజయ్రెడ్డి, దాసరి భాస్కర్గౌడ్, గుండాల వజ్రమ్మ, చిట్టమూ రు అనితమ్మ, గుమ్మడి వెంకటసుబ్బయ్య, చేడిమా ల బుజ్జిరెడ్డి, ఆవుల తులసీరామ్, గుంజి రమేష్, జానకిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్నాతకోత్సవ సంబరం
అంతా గందరగోళం నెల్లూరు (టౌన్): విద్యార్థులు తమ విద్యను వ్యక్తిగత అభివృద్ధికే కాకుండా సమాజ శ్రేయస్సుకు వినియోగించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. కనుపర్తిపాడు సమీపంలోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన విక్రమ సింహపురి యూనివర్సిటీ 10, 11, 12వ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. నాక్ నుంచి 3.23 సీజీపీతో ఏ గ్రేడ్ను ఇటీవల పొందడం గర్వకారణమన్నారు. ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్ష అభియాన్ కింద రూ.20 కోట్ల గ్రాంట్ మంజూరు కావడం, డీప్ ఓషన్ మిషన్ కార్యక్రమం కింద మైరెన్ బయాలజీ విభాగానికి రూ.4.12 కోట్లు లభించడం వర్సిటీ అభివృద్ధికి దోహదపడుతుందని కాంక్షించారు. వీటి ద్వారా పరిశోధన, డిజిటల్ విద్య, విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి మరింత ఊతం లభించనుందని చెప్పారు. జాతీయ సేవా పథకం ద్వారా కార్యక్రమాలు, గ్రామీణాభివృద్ధి, కమ్యూనిటీ డెవలప్మెంట్, కాలేజీ టు విలేజ్, ల్యాబ్ టు ల్యాండ్ లాంటి వాటిని అభినందించారు. సవాళ్లకు సన్నద్ధం చేయాలి ప్రస్తుత కాలంలో ఏఐ ప్రాధన్యం రోజురోజుకూ పెరుగుతోందని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉన్నత విద్యాసంస్థలు స్వీకరించి భవిష్యత్తు సవాళ్లకు విద్యార్థులను సంసిద్ధం చేయాలని పిలుపునిచ్చారు. డిజిటల్ విద్యను విస్తృతంగా వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు తమ వృత్తి జీవితంలో కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాస నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని సూచించారు. పట్టాలు అందుకున్న విద్యార్థులకు శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం పద్మభూషణ్, శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు వరప్రసాద్రెడ్డి మాట్లాడారు. నెల్లూరు మట్టిలో పుట్టిన బిడ్డగా తనకు దక్కిన ఈ గౌరవం.. తల్లి ఒడిలో దక్కిన ఆశీస్సుగా భావిస్తున్నానని చెప్పారు. విద్య, వైద్యానికి ప్రభుత్వాలు ప్రాధన్యమి వ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలు కేవలం ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా స్వయం సమృద్ధిని సాధించాలని సూచించారు. విద్యార్థులు ఉద్యోగాల వెంటపడకుండా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కాంక్షించారు. డాక్టరేట్లు, గోల్డ్ మెడళ్ల ప్రదానం శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు వరప్రసాద్రెడ్డి, నీతి ఆయోగ్ సభ్యుడు, ప్రముఖ మాలిక్యులర్ శాస్త్రవేత్త గోవర్ధన్దాస్, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావుకు గౌరవ డాక్టరేట్లను గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు. అనంతరం 45 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలు.. 21 మందికి డాక్టరేట్లు.. డిగ్రీ, పీజీ విద్యార్థులకు పట్టాలను అందజేశారు. తొలుత వర్సిటీ పురోగతిని వీసీ శ్రీనివాసరావు వివరించారు. అనంతరం గవర్నర్ను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, సర్వేపల్లి, కోవూరు ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, వర్సిటీ మాజీ వీసీలు విశ్వేశ్వరరావు, సుదర్శనరావు, రిజిస్ట్రార్ సునీత తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో ఉల్లాసంగా.. ఉత్సాహంగా ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ ముగ్గురికి గౌరవ డాక్టరేట్ల ప్రదానం 45 మందికి స్వర్ణ పతకాలు.. 21 మందికి పీహెచ్డీ పట్టాల అందజేత గవర్నర్ కార్యక్రమం ముగిసిన అనంతరం భోజన సమయంలో అంతా గందరగోళం నెలకొంది. స్నాతకోత్సవానికి విద్యార్థులు, తల్లిదండ్రులే కాకుండా సంబంధం లేని వ్యక్తులు ఎక్కువ మంది వచ్చారు. మరోవైపు పాస్లను ఎవరికి అంటే వారికి వర్సిటీ అధికారులు ఇచ్చారని తెలుస్తోంది. బయట్నుంచి వచ్చిన వ్యక్తులను వీఐపీ లైన్లో అక్కడున్న పోలీసులు, సెక్యూరిటీ పంపారు. మీడియా ప్రతినిధులను మాత్రం లోపలికి అనుమతించలేదు. మధ్యాహ్నం రెండు గంటలు దాటినా భోజనం పెట్టకపోవవడంతో గందరగోళం నెలకొంది. అక్కడ ఏర్పాటు చేసిన పోలీసులు, సెక్యూర్టీ సైతం ఓవరాక్షన్ చేశారు. ఏర్పాట్లూ అంతంతమాత్రంగా ఉండటంతో అందరూ అసహనం వ్యక్తం చేశారు. -
రెండేళ్ల కూటమి పాలనలో విధ్వంసం
● వైఎస్సార్సీపీ సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి నెల్లూరురూరల్: ‘కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో విధ్వంసం తప్ప ఏమీ లేదు. చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారు’ అని వైఎస్సార్సీపీ సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ జగదీష్ నగర్లో ఉన్న శ్రీకన్వెన్షన్ హాల్లో మంగళవారం ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. మహిళలకు నెలకు రూ.1,500, యువతకు నిరుద్యోగ భృతి వంటి పథకాలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కూడా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎరువులు, పురుగు మందుల సరఫరాలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఈనెల 12న రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ● నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకుడు కొండ్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ రెండేళ్ల పాలనలో ప్రజలను నిరాశపరిచే విధానాలను కూటమి అమలు చేసిందన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలు, నాడు – నేడు పనులు, గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జిలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డిపై అక్రమ కేసు
కావలి: మంత్రి లోకేశ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ ఎమ్మె ల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్చార్జి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిపై పట్టణ పోలీస్స్టేషన్లో టీడీపీ నేతలు సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమ కేసును పోలీసులు మంగళవారం నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి కావలి నియోజకవర్గంలో అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో చెరువులు, గుంటలు, వాగులు, వంకలు ఇలా ఎక్కడపడితే అక్కడ గ్రావెల్, మట్టి అక్రమ తవ్వకాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులను బనాయించడమే కాకుండా దాడులకు తెగబడుతున్నారు. కూటమి నేతలు కొందరు స్థానిక ఎమ్మెల్యే అండదండలతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా అక్రమ లేఅవుట్లు వేసి అందులో ఉన్న ప్రభుత్వ భూములు, కాలువలను ఆక్రమిస్తున్నారు. దీంతో నియోజకవర్గంలో సభలు, సమావేశాలను మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి కొన్ని రోజులుగా ఏర్పాటు చేసి అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏమి చేయాలో పాలుపోక మంత్రి లోకేశ్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో కేసును నమోదు చేశారు. ఇదే సమయంలో ప్రతాప్కుమార్రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలు, కార్యకర్తలు అసభ్యంగా వ్యవహరిస్తూ పోస్టులు పెడుతున్నారు. కవ్వింపు చర్యలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. నియోజకవర్గంలోని కావలి, అల్లూరు, దగదర్తి, బోగోలు మండలాల్లో టీడీపీ నేతలపై మంగళవారం ఫిర్యాదు చేసినా, ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ తరుణంలో మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయడమేమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు టీడీపీ నేత, ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ డైరెక్టర్ చవల రామకృష్ణ.. విజిలెన్స్ అధికారుల విధులకు ఆటంకం కలిగించి వారిపై దురుసుగా వ్యవహరించడంతో విజిలెన్స్ సీఐ స్వయంగా వెళ్లి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటన జరిగి వారమైనా, నిందితుడు రామకృష్ణ నిర్భయంగా సభలు, సమావేశాల్లో పాల్గొంటున్నారు. కూటమి ప్రభుత్వానికో న్యాయం, ప్రతిపక్షానికో న్యాయమా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జెడ్పీ సర్వసభ్య సమావేశం నేడు నెల్లూరు(పొగతోట): జెడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నగరంలోని జెడ్పీ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం 2.30కు నిర్వహించనున్నామని సీఈఓ శ్రీధర్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించనున్నామని వివరించారు. జెడ్పీ సభ్యులు, ఆయా శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని కోరారు. డీఆర్సీ మీటింగ్ నేడు నెల్లూరు రూరల్: జిల్లా ఇన్చార్జి మంత్రి ఫరూక్ నెల్లూరులో బుధవారం పర్యటించనున్నారని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. జెడ్పీ కార్యాలయంలో ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు వరకు నిర్వహించనున్న డీఆర్సీ సమావేశానికి మంత్రి హాజరుకానున్నారని చెప్పారు. సంబంధిత శాఖల అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని సూచించారు. విమానంలో మృతదేహాల తరలింపు ఆత్మకూరు: వారణాశితో పాటు పలు పుణ్యక్షేత్రాలకు బస్సులో వెళ్తూ బిహార్లోని ఔరంగాబాద్ వద్ద ఆత్మకూరు, సంగం, తదితర ప్రాంతాలకు చెందిన వారు ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. ఈ క్రమంలో అక్కడి ప్రభుత్వాధికారులతో రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి మృతదేహాలు, యాత్రలోని మిగిలిన ప్రయాణికులను స్వస్థలాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. ముగ్గురి మృతదేహాలను విమానాల్లో చైన్నెకు.. ఆపై స్వస్థలాలకు చేరేలా ఏర్పాట్లు చేశారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కార్యాలయం పేర్కొంది. తీవ్రంగా గాయపడిన వారికి పట్నా మెడికల్ కళాశాల ఆస్పత్రిలో మెరుగైన చికిత్సను అందిస్తున్నారని చెప్పారు. చైన్నె విమానాశ్రయానికి అధికారులు సంగం: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగానికి చెందిన వెంకటేశ్వర్లు, హజరత్తయ్య భౌతికకాయాలను స్వగ్రామానికి తీసుకొచ్చేలా చర్యలను వేగవంతం చేశారు. మృతదేహాలను స్వీకరించి సంగం మండలానికి తరలించేందుకు గానూ చైన్నె విమానాశ్రయానికి తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు, ఎస్సై భోజ్యా నాయక్ చేరుకున్నారు. అన్ని ప్రక్రియలు పూర్తయిన అనంతరం ప్రత్యేక వాహనంలో తరలించనున్నారు. -
డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి
నెల్లూరురూరల్: మెగా డీఎస్సీ–2025 పరీక్షల నిర్వహణలో అవినీతి ఆరోపణలు, లీకేజీలు, అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కలెక్టర్ హిమాన్షు శుక్లాకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం వినతిపత్రం అందజేశారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పందిటి కామరాజు మాట్లాడుతూ డీఎస్సీ 2025 నిరుద్యోగ యువత భవిష్యత్కు సంబంధించి కీలక పరీక్ష డీఎస్సీలో ప్రశ్నపత్రాల భద్రత, పరీక్షల నిర్వహణ, స్పోర్ట్స్ కోటా ఎంపికలు, సర్టిఫికెట్ల పరిశీలన వంటి అంశాలపై నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయ ఉద్యోగులపై పనిభారం నెల్లూరు(పొగతోట): సర్వేలు, ఇంటింటా కార్యక్రమాలు, కేవైసీలు తదితర అదనపు బాధ్యతలతో సచివాలయ ఉద్యోగులపై తీవ్ర పనిభారం పడుతోందని యునైటెడ్ వెల్ఫేర్ జీఎస్డబ్ల్యూఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి తెలిపారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో జేసీ మొగిలి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించిన అనంతరం ఆమె మాట్లాడారు. సచివాలయ ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్ ప్రమోషన్లు, ఆర్థిక ప్రయోజనాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. గతేడాది అక్టోబర్లో ఆరు సంవత్సరాల సర్వీసు పూర్తయిన ఉద్యోగులకు ఇప్పటి వరకు స్పష్టమైన ఆదేశాలు వెలువడలేదని తెలిపారు. పదోన్నతులకు బదులుగా డిప్యుటేషన్లు చూపించడం శాశ్వత పరిష్కారం కాదని, ఉద్యోగుల అభిప్రాయాలను గౌరవిస్తూ పదోన్నతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ లీగల్ అడ్వైజర్ దారా సురేష్బాబు, కన్వీనర్ మురళీధర్, శశికిరణ్, అధ్యక్షుడు శ్రీనివాసులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ లోకేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ షాహినా, భానుప్రకాశ్, సంధ్య, పవన్కుమార్, కోటి, బాలరాజు, స్వాతి, దీపిక, సుమన్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 93,230 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 41,754 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో శుక్రవారం రూ.3.83 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
వైఎస్సార్సీపీ పాలన స్వర్ణయుగం
వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలన మహిళలకు స్వర్ణయుగంగా మారింది. సంక్షేమ పథకాలతోపాటు ప్రభుత్వ ప్రోత్సాహంతో ఎంతో మంది వ్యాపార, పారిశ్రామిక వేత్తలుగా అవతరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అప్పటి వరకు ఉన్న పొదుపు మహిళల రుణాల మొత్తాన్ని నాలుగేళ్లలో తిరిగి వారి ఖాతాల్లోనే జమ చేశారు. గతంలో టీడీపీ చేసిన మోసానికి డీఫాల్టర్లు అయిన పొదుపు గ్రూపులను పునరుద్ధరించి బ్యాంకుల ద్వారా తిరిగి రుణాలిప్పించి.. ఆయా గ్రూపుల్లోని మహిళలను ఆర్థిక స్వావలంబన దిశగా ఎదిగేందుకు దోహదపడ్డారు. విస్తృతంగా పొదుపు రుణాలు, సీ్త్ర నిధి రుణాలు కల్పించి అత్యధిక మంది జీవితాలను మెరుగుపర్చారు. సున్నావడ్డీ, చేయూత, ఆసరా, జగనన్నతోడు వంటి పథకాలతో వారి ఆర్థిక స్వాతంత్య్రానికి దన్నుగా నిలిచారు. అమ్మఒడి వంటి పథకంతోపాటు ప్రతి కుటుంబానికి జగనన్న కాలనీల్లో రూ.లక్షల విలువైన ఆస్తిని సొంతం చేశారు. -
కాశీ యాత్ర మిగిల్చిన శోకం
వారంతా కాశీ విశ్వనాథుని కనులారా చూసి తరించాలనుకున్నారు. గంగమ్మ ఒడిలో స్నాన మాచరించి పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసి జన్మధన్యం చేసుకోవాలని ఆశ పడ్డారు. ప్రత్యేక బస్సులో కాశీయాత్రకు బయల్దేరారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ కాశీ సమీపానికి చేరుకున్నారు. ఆదివారం రాత్రి బిహార్ రాష్ట్రంలో బుద్ధగయాను దర్శించుకుని బయల్దేరారు. సోమవారం ఉదయానికి కాశీకి చేరుకుంటున్నామనే సంతోషంతో శివనామస్మరణ చేసుకుంటూ నిద్రలోకి జారుకున్నారు. కానీ విధి మరోలా తలచింది. లారీ రూపంలో మృత్యువు ముగ్గురిని శాశ్వతంగా శివయ్య వద్దకు చేర్చింది. మరికొందరికి విషాదాన్ని మిగిల్చింది.బంధువులు వెళ్తున్నారని.. ఆత్మకూరు: పట్టణంలోని వీవర్స్కాలనీకి చెందిన తూమా ప్రసాద్, పద్మావతి (43) దంపతులు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. వ్యాపారరీత్యా కోవూరులో ఉంటున్నారు. టూర్ నిర్వాహకుడు వెంకటేశ్వర్లు కూడా బాగా తెలిసిన వ్యక్తి కావడం.. బంధువులు వెళ్తున్నామని చెప్పడంతో పద్మావతి భర్తను ఒప్పించి కాశీయాత్రకు బయలుదేరి వెళ్లింది. శివయ్యను దర్శించుకోకుండానే బస్సు ప్రమాదంలో ఆమె మృత్యువాత పడడంతో వీవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న అత్తా, మామలు తమ మనవడు, మనవరాలిని ఎవరు చూసుకోవాలని గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. వంట సహాయకుడిగా వెళ్లి.. సంగానికి చెందిన హజరత్తయ్య, గోవిందమ్మ దంపతులు. వారికి ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహమైంది. కుమారుడికి ఇంకా వివాహం కాలేదు. మృతుడు హజరత్తయ్య వంట సహా యకుడిగా బస్సులో వెళ్లి ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. మృతుడు వంట పనులు లేని సమయంలో బస్టాండ్లో సమోసాలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుటుంబానికి పెద్దదిక్కు అయిన హజరత్తయ్య మృత్యువాత పడిన విషయం తెలుసుకుని భార్య గోవిందమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సంగం: సంగంలోని ఆంజనేయస్వామి దేవస్థానం నుంచి ఈ నెల 1న టూరిస్ట్ బస్సు 15 రోజుల కాశీయాత్రకు బయలుదేరింది. సంగం, ఆత్మకూరు, దుత్తలూరు ప్రాంతాలకు చెందిన 39 మంది యాత్రికులు, యాత్ర నిర్వాహకుడు, ఇద్దరు డ్రైవర్లు, వంట సిబ్బంది కలిపి మొత్తం 43 మందితో బస్సు అన్నవరం, సింహాచలం, పూరి, భువనేశ్వర్ మీదుగా ఆదివారం రాత్రి బిహార్ రాష్ట్రం బుద్ధగయాకు చేరుకుంది. అక్కడ బుద్ధగయా క్షేత్రాన్ని దర్శించుకున్నారు. రాత్రి భోజనాల అనంతరం కాశీకి బయలు దేరారు. అర్ధరాత్రి 12.10 గంటల సమయంలో ఔరంగాబాద్ జిల్లాలో రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని బస్సును అదుపుతప్పి ఢీకొంది. ఈ ఘటనలో ఆత్మకూరు, సంగానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలవగా, మరో 10 మందికి పైగా తీవ్రంగా, మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. మృతుల్లో సంగానికి చెందిన యాత్ర నిర్వాహకుడు, విశ్రాంత ఆర్టీసీ కండక్టర్ పసుపులేటి వెంకటేశ్వర్లు (64), వంట మాస్టర్ చవడం హజరత్తయ్య (57), ఆత్మకూరుకు చెందిన సోమా పద్మావతి (43) ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో సంగానికి చెందిన బొమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, లక్ష్మమ్మ, నీలం శీనయ్య, పద్మ, వింజమూరు శివరంగయ్య, లక్ష్మమ్మ, దంపతులు, కంటాబత్తిన సంపూర్ణమ్మ, కంటాబత్తిన కామాక్షమ్మ, గురవయ్య, డీ రమణ మ్మ, జీ శ్రీదేవి, డీ మల్లేశ్వరి ఉన్నారు. ఆత్మకూరు, దుత్తలూరుకు చెందిన పలువురు యాత్రికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కాగా వెంకటేశ్వర్లు, హజరత్తయ్య, సోమా పద్మావతి మృతదేహాలకు పోస్టుమార్టంను అక్కడి అధికారులు పూర్తి చేశారు. భాష రాక ఇబ్బందులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గయాలోని మగధ మెడికల్ కళాశాలకు తరలించారు. క్షతగాత్రులకు హిందీ భాష రాకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. అయినా వైద్యులు క్షతగాత్రులకు చికిత్స అందించి ప్రాణాలను కాపాడారు. ఆహారం లేక ఇబ్బందులు క్షతగాత్రులను అర్ధరాత్రి ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ సరైన ఆహారం దొరక్క ఆకలితో అలమటించారు. కొందరు పండ్లు తిని ఆకలి తీర్చుకున్నారు. సంగంలో విషాద ఛాయలు కాశీయాత్రకు వెళ్లిన వారిలో సంగం వాసులు 20 మందికి పైగా ఉన్నారు. సోమవారం వేకువజామున బస్సు ప్రమాద విషయం తెలియడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సంగం వాసులు ఇద్దరు మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. సంగం నుంచి బయలుదేరిన వారు గాయపడడం కలిచివేసింది. విహారయాత్రలు నిర్వహిస్తూ.. సంగానికి చెందిన పసుపులేటి వెంకటేశ్వర్లుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఒక కుమార్తెకు వివాహామైంది. కుమారుడు, కుమార్తెకు వివాహాం కావాల్సి ఉంది. ప్రస్తుతం కుటుంబంతో కలిసి నెల్లూరులోని దర్గామిట్టలో నివాసం ఉంటున్నారు. మృతుడు టూరిస్ట్ బస్సుతో విహార యాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రమాదంలో వెంకటేశ్వర్లు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. విక్రమ్రెడ్డి, రాజారెడ్డి దిగ్భ్రాంతి కాశీయాత్రకు బయలుదేరిన టూరిస్ట్ బస్సు బిహార్ రాష్ట్రంలోని ఔరంగబాద్ జిల్లాలో ప్రమాదానికి గురై ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలకు చెందిన ముగ్గురు మృతి చెందడంతో పాటు మరో 15 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి, ఉదయగిరి వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం క్షతగాత్రులకు మెరుగైన వైద్యంతో పాటు మిగిలిన యాత్రికులను క్షేమంగా స్వస్థలాలకు చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సంగం నుంచి వెళ్లిన 43 మంది యాత్రికులు బిహార్లో ఆగిఉన్న లారీని ఢీకొన్న బస్సు జిల్లా వాసులు ముగ్గురు దుర్మరణం మృతుల్లో సంగం, ఆత్మకూరు వాసులు మరో 15 మందికి తీవ్ర గాయాలు స్వల్ప గాయాలతో బయటపడిన పలువురు స్వల్పగాయాలతో.. దుత్తలూరు: బిహార్లో జరిగిన బస్సు ప్రమాదంలో మండలంలోని రాచవారిపల్లి గ్రామానికి చెందిన 8 మంది స్వల్పగాయాలతో బయటపడ్డారు. గ్రామానికి చెందిన చలంచర్ల అలివేలమ్మ, షేక్ కాశింబీ, మోత్కూరు లలితమ్మ, మోత్కూరు కాంతమ్మ, ముసుర్ల జయమ్మ, అండ్రా రాధా, షేక్ ఖాజమ్మ, కొంకల సుబ్బరత్నమ్మకు గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరి పరిస్థితి నిలకడగా ఉంది. బస్సు ప్రమాదం విషయం తెలుసుకుని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఫోన్ ద్వారా సమాచారాన్ని తెలుసుకుని ఊరట చెందారు. -
ప్రజల గోడుకు స్పందనేదీ?
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● వినతులు స్వీకరించిన అధికారులు నెల్లూరురూరల్: నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్కుమార్, తెలుగుగంగ ప్రత్యేక అధికారి మహేశ్వరరెడ్డి, మెప్మా పీడీ కిరణ్ కుమార్, ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్ తదితరులు స్వీకరించారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారుడికి సంతృప్తికరంగా పరిష్కారం చూపాలని జేసీ అధికారులను ఆదేశించారు. భోజన పథకాన్ని ప్రైవేట్కు ఇవ్వొద్దు రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించే నిర్ణయాన్ని విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. కలెక్టరేట్ వద్ద వారు ప్రదర్శన చేపట్టారు. యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె.విజయమ్మ, జిల్లా కార్యదర్శి షేక్ రెహానా బేగం మాట్లాడుతూ ప్రైవేట్కు ఆ పథకాన్ని అప్పగిస్తే వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలంటే స్థానికంగా వంట చేసే విధానాన్నే కొనసాగించాలని కోరారు. అలాగేకార్మికులకు నెలకు రూ.10 వేల వేతనం చెల్లించాలన్నారు. హామీలు నెరవేర్చాలంటూ.. ఎన్నికల సమయంలో వడ్డెర సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. కలెక్టరేట్ వద్ద ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుంజి దయాకర్ మాట్లాడుతూ వడ్డెర కార్పొరేషన్కు తగిన నిధులు కేటాయించి ఆధునిక పనిముట్లు, యంత్రాలను సబ్సిడీపై అందించాలని కోరారు. మైన్స్ అండ్ మినరల్స్ క్వారీల్లో రిజర్వేషన్లు కల్పించడంతో పాటు సీనరేజ్ చార్జీల్లో రాయితీలివ్వాలని డిమాండ్ చేశారు. వడ్డెరలకు 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల్ని పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కోటకొండ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి బెల్లంకొండ బాల వెంకటేశ్వర్లు తదితర నాయకులు పాల్గొన్నారు. -
కూటమి పాలన మోసాల మయం
బాబూ షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ అంటూ అబద్ధపు ప్రచారంతో అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు మహిళలకు తీరని అన్యాయం చేసింది. బాబు బురిడీతో మహిళల భవిష్యత్ ఛిన్నాభిన్నమైంది. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 సాయం అందిస్తానని చెప్పిన హామీలు నెరవేర్చకపోగా, పొదుపు, సీ్త్ర నిధి రుణాలకు కొర్రీలు పెట్టారు. కొత్త రుణాలివ్వడం లేదు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను అటకెక్కించారు. సకాలంలో పొదుపు చెల్లించిన మహిళలకు సున్నా వడ్డీ ఊసే లేదు. మహిళలను కోటీశ్వరులను చేస్తానంటూ పీ–4 పథకంతో కొత్త గారడీ చేసిన చంద్రబాబు.. ఇటీవల మహానాడులో లక్ష మంది మహిళలను లక్షాధికారులను చేసినట్లు చెప్పేశారు. వాస్తవానికి పీ–4 పథకానికి ఆశించిన స్థాయిలో ప్రజాస్పందన కరువైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్యాంకర్లు మహిళలకు కొత్త రుణాలిచ్చేందుకు విముఖత చూపుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు అంటూ ఏడాది పాటూ ఊరించి.. ఊరించి గతేడాది ఆగస్టులో ప్రారంభించారు. -
పంచాయతీల సమగ్రాభివృద్ధే లక్ష్యం ● జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ
నెల్లూరు(పొగతోట): గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ సూచించారు. సోమవారం నెల్లూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో జీపీడీపీ (గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక)పై డివిజనల్, మండల స్థాయి అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సభలు నిర్వహించకుండా, ప్రజల అభిప్రాయాలు సేకరించకుండా రూపొందించే ప్రణాళికలు నాణ్యతగా ఉండవన్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, యువజన అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ ప్రజలు సూచించిన పనులను ప్రణాళికల్లో పొందుపరచాలని, నిధుల లభ్యతను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులను గుర్తించాలని సూచించారు. మంగళవారం మండల స్థాయిలో శిక్షణ నిర్వహించి, నెలాఖరులోపు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీపీఓ వసుమతి, డ్వామా పీడీ స్వరూప్, డీడీఓ వాణి, ఎన్ఆర్డీఐ కో ఆర్డినేటర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ హయాంలో మహిళలకు పెద్దపీట
చంద్రబాబు మోసానికి రెండేళ్లుగా నష్టపోయిన మొత్తం రూ.3,128.40 కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు అందిన సాయం రూ.8,143.45 కోట్లు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆడబిడ్డలను వంచించి అధికారంలోకి రావడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. గతంలో పొదుపు రుణాల మాఫీ, తాజా ఎన్నికల్లో ఆడబిడ్డ నిధి వంటి బూటకపు హామీలతో అధికారం దక్కించుకుని వెన్నుపోటు పొడవడం ఆయన నైజం. ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను పీఠమెక్కాక తుంగలో తొక్కారు. కుటుంబంలో ఎంత మంది మహిళలు ఉంటే అంత మందికి ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెలా రూ.1,500 చొప్పున అందిస్తానంటూ చంద్రబాబు వేదికలెక్కి ఉపన్యసిస్తూ ఊగిపోయారు. రెండేళ్లు ఒక్క ఆడబిడ్డకు రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. చంద్రబాబు మోసానికి బ్రాండ్ అంబాసిడర్ అనేది మరోసారి రుజువైంది. గతంలో అధికారంలోకి రాక ముందు ప్రతి పొదుపు మహిళ రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదు. మీ అన్నగా నేనే చెల్లిస్తానంటూ సెంటిమెంట్తో ఓట్లు వేయించుకుని.. ఆ తర్వాత కర్రుకాల్చి వాత పెట్టారు. ఒక్కొక్క మహిళ అప్పట్లో రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పొదుపు బకాయిలు ఉంటే పూర్తిగా ఎగ్గొట్టి ఎన్నికల ముందు రూ.10 వేలు పసుపు కుంకుమ అంటూ మోసం చేశారు. రెండేళ్లుగా రూ.3,128.40 కోట్ల బాకీ చంద్రబాబు ఎన్నికల హామీల్లో ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు రూ.1,500 ఇస్తామన్నారు. జిల్లాలో 18 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలు 8.69 లక్షల మంది ఉన్నారు. ఈ లెక్కన ప్రతి నెలా రూ.130.35 కోట్లు, ఏడాదికి రూ.1564.20 కోట్లు మహిళల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. రెండేళ్లుగా రూ.3,128.40 కోట్లు మహిళలకు చంద్రబాబు బాకీ పడ్డారు. అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ చేయూత, ఆసరా వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2020–21 ఏడాది నుంచి ఈ రెండు పథకాలను అమల్లోకి తెచ్చారు. 45 ఏళ్లు నిండిన 60 ఏళ్లలోపు అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ చేయూత కింది ఏటా రూ.18,750 ఇస్తామని నాలుగేళ్లు క్రమం తప్పకుండా రూ.934.83 కోట్లు అందజేశారు. అలాగే గతంలో పొదుపు రుణాలు తీసుకున్న వారికి పూర్తిగా రుణమాఫీ చేస్తానని, ఈ మొత్తాన్ని నాలుగు దఫాలుగా నాలుగేళ్ల పాటు అందిస్తానని చెప్పిన విధంగా 2020–21 ఏడాది నుంచి అమలు చేశారు. మొత్తం రూ.853.69 కోట్లు పొదుపు మహిళల ఖాతాల్లో జమ చేశారు. వ్యాపారి నుంచి పారిశ్రామికవేత్త వరకు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళలకు అందించిన ఆర్థిక సహకారంతో ఎంతో మంది వ్యాపారి నుంచి పారిశ్రామికవేత్తలుగా మారారు. సుమారు 1.20 లక్షల మంది మహిళలు కుటీర పరిశ్రమలు స్థాపించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందారు. కూటమి సర్కార్ నయవంచన వల్ల మహిళలు తీవ్రంగా నష్టపోయారు. గతంలో ప్రతి నెలా ఏదోక పథకం పేరుతో మహిళల బ్యాంకు ఖాతాల్లో నగదు జమయ్యేది. ప్రస్తుతం కూటమి పాలనలో రెండేళ్లుగా మహిళలకు ఎటువంటి నగదు అందడం లేదు. ఫలితంగా గ్రామీణ ప్రాంత మహిళలు సూక్ష్మ సంస్థల్లో రుణాలు తీసుకుని అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. విడత లబ్ధిదారులు నగదు రూ.కోట్లలో మొదటి 16,151 16.15 రెండో 18,052 18.05 మూడో 29,957 29.96 నాల్గో 16,923 16.92 ఐదో 27,007 27.01 ఆరో 15,138 14.42 జగనన్నతోడు (రూ.122.51 కోట్లు) జిల్లాలో ఆడబిడ్డ నిధికి అర్హులైన మహిళలు 8.69 లక్షల మంది నెలకు రూ.1500 సాయం రెండేళ్లుగా ఎగనామం జిల్లాలో 4.30 లక్షల మంది పొదుపు మహిళలు వైఎస్సార్సీపీ పాలనలో ఐదేళ్లూ అందిన సంక్షేమ పథకాలు పొదుపు, సీ్త్రనిధి, సున్నావడ్డీ, చేయూత, ఆసరా, జగనన్నతోడుతో మహిళల ఆర్థిక స్వావలంబన మహిళల సాధికారతను పట్టించుకోని కూటమి కాగితాలకే పరిమితమైన కోటీశ్వరులను చేసే ప్రచారం జిల్లాలో 4.30 లక్షల మంది స్వయం సహాయక గ్రూపు మహిళలు ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పొదుపు మహిళలే కాదు.. ప్రతి మహిళకు పెద్దపీట వేసింది. ప్రతి నెలా ఏదోక సంక్షేమ కార్యక్రమంతో మహిళలకు గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. జిల్లాలో ప్రతి కార్యక్రమం మహిళల పేరుతో అమలు చేశారు. ఇంటి పట్టాలు, ఇతర రుణాలు, ప్రతి సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు అందజేశారు. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి, వారి అభివృద్ధికి పెద్దపీట వేసింది. స్వయం సహాయక గ్రూపు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వందల కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేసింది. తీసు కున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రత్యేక దృష్టి సారించింది. మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి కుటీర పరిశ్రమల స్థాపనకు భారీ స్థాయిలో ప్రోత్సా హాలను ఇచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో క్రమం తప్పకుండా మహిళలు బ్యాంకు లింకేజీ, సీ్త్ర నిధి, సున్నా వడ్డీ, చేదోడు, చేయూత, జగనన్న తోడు, తదితర సంక్షేమ పథకాల ద్వారా తీసుకున్న రుణాలు చెల్లించడంతో ప్రతిఫలంగా రూ.8,143.45 కోట్ల అందజేశారు. సున్నా వడ్డీ కింద నాలుగేళ్లలో రూ.202.35 కోట్లు తిరిగి అక్క చెల్లెమ్మలకు చెల్లించారు. ఐదో ఏడాది ఎన్నికలు రావడంతో అప్పటికే సిద్ధం చేసిన సున్నావడ్డీ చెల్లింపులను కూటమి ప్రభుత్వం ఎగనామం పెట్టడడమే కాకుండా.. కూటమి పాలనలో రెండేళ్లుగా సున్నా వడ్డీకి దిక్కులేకుండా పోయింది. -
తల్లి ఆశలకు సమాధి
● విద్యుదాఘాతానికి గురై కుమారుడి మృతివింజమూరు(ఉదయగిరి): ఆ పిల్లాడు అప్పటి వరకూ తల్లి ముందు ఎంతో సరదాగా గడిపాడు. అయితే కాసేపటికే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వింజమూరు పట్టణంలోని చల్లావారి వీధిలో సోమవారం విద్యుదాఘాతానికి గురై మహేంద్రరెడ్డి (13) మృత్యువాత పడ్డాడు. పోలీసులు, బంధువుల కథనం మేరకు.. స్థానికంగా పేర్నేటి మమత అనే మహిళ నివాసముంటోంది. భర్త కొన్నేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఆమె కూలీ పనులకు వెళ్తూ పెద్ద కుమారుడు మహేంద్రరెడ్డి, కుమార్తెను చదివిస్తోంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న మహేంద్రరెడ్డి ఇంటి పక్కనే పాత భవనాన్ని కూల్చివేస్తుండగా కుతూహలంతో వెళ్లి చూస్తున్నాడు. ఆ సమయంలో డ్రిల్లింగ్ మెషీన్కు విద్యుత్ సరఫరా అవుతున్న తీగ నేలపై ఉంది. చెప్పుల్లేకుండా అతను పొరపాటున ఆ తీగను తొక్కడంతో షాక్కు గురై కుప్పకూలాడు. వెంటనే కూలీలు బాలుడిని స్థానిక ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లుగా నిర్ధారించారు. ఊహించని ఈ ఘటనతో మమత గుండెలవిసేలా రోదించడం అక్కడున్న వారిని కలిచివేసింది. కుమారుడు ప్రయోజకుడై కుటుంబానికి అండగా ఉంటాడని కలలుగన్న తల్లిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు. ఎస్సై ఉమామమేశ్వరరావు వివరాలు సేకరించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రబాబు అరాచకాలకు రెండేళ్లు
● అన్ని వర్గాలను మోసగించారు ● వెన్నుపోటు పాలనపై ప్రజలు నిరసన ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితోటపల్లిగూడూరు(పొదలకూరు): ‘చంద్రబాబు అరాచక పాలనకు రెండేళ్లు నిండాయి. సూపర్సిక్స్ పేరుతో హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన ఆయన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారు. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమంలో భాగంగా తోటపల్లిగూడూరు మండలం నరుకూరులోని రుషి కల్యాణ మండపంలో సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో సోమవారం ఆయన ముఖాముఖి నిర్వహించారు. తొలుత పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితారెడ్డి, పార్టీ శ్రేణులతో కలిసి నరుకూరు సెంటరు నుంచి కల్యాణ మండపం వరకు నల్ల బెలూన్లతో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాయకులు, కార్యకర్తల ముఖాముఖిలో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా ఎందరో ముఖ్యమంత్రులు ఉన్నా చంద్రబాబు వంటి అబద్ధాల కోరు ఎక్కడా లేరన్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకొనే బాబు సొంత మేధస్సుతో ఒక్క ప్రజాసంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టిన దాఖలాలు లేవన్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన పథకాలన్నీ కాపీ కొట్టినవేనన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు భరోసా పథకం కింద ఏడాదికి రూ.13,500 అందజేస్తే దాన్ని కాపీ కొట్టి అన్నదాత సుఖీభవ పేరుతో రూ.20 వేలు ఇస్తానని రైతులను ఏ మార్చారని ఆరోపించారు. జగన్ అమ్మఒడి, డీఎంకే ఉచిత బస్సు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాలను కాపీ కొట్టి అమలు చేస్తానని ప్రకటించి ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, తదితర హామీలను పూర్తిగా అమలు నెరవేర్చలేదన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి పేరుతో బీసీ డిక్లరేషన్ చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత పక్కన పెట్టారన్నారు. జగన్మోహన్రెడ్డి జనరంజక పాలనను ప్రజలు గుర్తుచేసుకుని తిరిగి ఆయన అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. చంద్రబాబు నిర్ణయాలు నిరుద్యోగులకు శాపంగా మారాయని ధ్వజమెత్తారు. సర్వేపల్లిలో చంద్రమోహన్రెడ్డి చేసిందేమి లేదని, అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరాడని, స్వీకరించి రమ్మంటే పలాయం చిత్తగించాడని విమర్శించారు. సోమిరెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే విసిరిన సవాల్కు కట్టుబడి ఉండాలన్నారు. కాకాణి పూజిత మాట్లాడుతూ చంద్రబాబు అన్ని వర్గాలను మోసగించారన్నారు. కూటమి పాలనలో దాడులు, అరాచకాలు తప్పించి సుపరిపాలన అందించిన దాఖలాలు లేవని విమర్శించారు. కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు చిల్లకూరు సుధీర్రెడ్డి, ఉప్పల శంకరయ్యగౌడ్, ఎం.చిరంజీవిగౌడ్, తలమంచి సురేంద్రబాబు, పద్మనాభరెడ్డి, రమేష్రెడ్డి, శేషమ్మ, సుబ్రహ్మణ్యంరెడ్డి, మల్లికార్జున, గంగాధర్రెడ్డి, మణి, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ పాలనలో వ్యవసాయాభివృద్ధి
సంవత్సరం రైతులు నగదు (కోట్లల్లో రూ.) 2020–21 10,495 రూ.1.99 2021–22 1,291 రూ. 2.69 2022–23 25,695 రూ. 5.75 ధాన్యం ధరలు పాతాళానికి పతనం రైతు భరోసా లబ్ధిదారుల రైతులు 9,31,943 మంది ఐదేళ్లలో వైఎస్సార్ రైతు భరోసా సాయం రూ.1,510.70 కోట్లు ఒక్కొక్క భవన నిర్మాణానికి నిధులు రూ. 21.80 లక్షలు రైతు భరోసా కేంద్రాలు 656 చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ధాన్యం ధరలే కాదు.. ఏ పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కాదు కదా.. కనీసం ప్రకటించిన మద్దతు ధర కూడా దక్కే పరిస్థితి లేదు. చంద్రబాబు సీఎంగా దిగిపోయే 2004లో కూడా పుట్టి ధాన్యం రూ.4 వేలు దాటిన చరిత్ర లేదు. ఆ తర్వాత వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లల్లో ధాన్యం ధరలు ఊహించని విధంగా ఏటా పెరిగాయి. వైఎస్సార్ హయాంలో పుట్టి ధాన్యం రూ.13 వేల వరకు ఎగబాకాయి. ఇక ప్రత్యేకించి జిలకర మసూరి రకం అయితే ఏకంగా రూ.17 వేల వరకు అప్పట్లోనే పలికాయి. తిరిగి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2014–19 మధ్య కాలంలో మద్దతు ధరలు బాగా పెరిగినప్పటికీ.. పుట్టి రూ.10 వేల నుంచి రూ.11 వేలకు కొనే పరిస్థితి లేకుండా పోయింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న జిలకర మసూరి రకాన్ని సైతం మిల్లర్లకు మేలు చేకూర్చేందుకు ‘ఏ’గ్రేడ్ రకంగా ముద్ర వేసి ఆ రకం ధాన్యం ధరలను గుట్ట కూల్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్న ఐదేళ్లూ మద్దతు ధరలు లభించేలా అనేక చర్యలు తీసుకున్నారు. ఆ ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది పుట్టి మద్దతు ధరకు మించి రూ.25 వేల వరకు రైతులు అమ్ముకున్నారు. తాజాగా పూర్తయిన ఖరీఫ్ సీజన్లో పుట్టి ధాన్యం రూ.15 వేల నుంచి రూ.17 వేల లోపే కొనుగోలు చేసిన పరిస్థితి తెలిసిందే. ఒక్క ధాన్యం ధరలే కాకుండా గతేడాదితో పోల్చితే.. పసుపు రైతు పుట్టి ముంచారు. పొగాకు ధరలు అయితే కేజీకి రూ.100 తగ్గిపోయింది. మిర్చి ధరలు అయితే నేలచూ పులు చూస్తున్నాయి. మామిడి, సపోటా, నిమ్మ, బత్తాయి ధరలు కూడా ఇదే రీతిలో ఉన్నాయి. రైతులకు గిట్టుబాటు కల్పించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. పంటలకు ధరలు లేకపోతే ఎందుకు సాగు చేయడం అని సాక్షాత్తు వ్యవసాయశాఖ మంత్రి అంటారు. అసలు పంటలే సాగు చేయొద్దని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెబుతారు. మరి ప్రభుత్వం ఉండేది ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సింహపురి వ్యవసాయాధారిత జిల్లాగా పేరుగాంచింది. ముక్కారు పంటలతో ధాన్యసిరులతో విలసిల్లిన జిల్లాలో ఇప్పుడు అన్నదాతలు కుమిలి కుమిలి దుఃఖిస్తున్నారు. ‘వ్యవసాయం దండగ అని చిన్న చూపు చూసిన సీఎం చంద్రబాబు.. ఇప్పటికీ అదే పంథాను అనుసరిస్తున్నారు. చంద్రబాబు పాలనలో కరువు కాటకాలు, ధరాఘాతాలతో వ్యవసాయం సంక్షోభంలోకి వెళ్లిపోయింది. కాడిపట్టిన రైతులు.. చివరకు రాళ్లు, మట్టి మోసే కూలీలుగా మారారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంతి అయ్యాక వ్యవసాయాన్ని పండగ చేశారు. ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో నాలుగు అడుగులు ముందుకేసి అంతకు మించి రైతును ఆర్థిక సంక్షోభం నుంచి రారాజుగా చేశారు. ఆదుకుంటానని.. అప్పుల ఊబిలోకి.. జిల్లాలో సుమారు 30 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా అత్యధికంగా దాదాపు 9 లక్షల నుంచి 9.5 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుండగా, మిగతా మెట్ట పంటలు సాగవుతున్నాయి. ఇందులో సన్న, చిన్నకారు రైతులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సుమారు 2.15 లక్షల మంది రైతులకు ఏటా వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద ఏటా రూ.13,500 అందజేసింది. అయితే ఎన్నికల ముందు చంద్రబాబు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏటా రూ.20 వేల లెక్కన ‘అన్నదాత సుఖీభవ’ ఇస్తామని హామీలిచ్చారు. తొలి ఏడాది ఈ పథకానికి మంగళం పలికారు. రెండో ఏడాదిలో 3.19 లక్షల మంది అర్హులు దరఖాస్తులు చేసుకుంటే.. చివరకు 1,95,866 మందికి ఇచ్చి చేతులు దలుపుకున్నారు. దాదాపు 84,134 మంది దరఖాస్తులను అకారణంగా తిరస్కరించినట్లు సమాచారం. ఈకేవైసీ, ఆధార్లింక్, బ్యాంకు అకౌంట్ లింకు కాలేదంటూ తదితర కారణాలు చూపి మరో 14 వేల దరఖాస్తులు వివిధ రకాల కారణాలతో పెండింగ్ పెట్టినట్లు వ్యవసాయశాఖ అధికారిక తెలుస్తోంది. ‘సూపర్’ మోసం జిల్లాలో అర్హులైన రైతులకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అడ్డదిడ్డంగా.. అలవి కాని హామీలిచ్చారు. గతంలో 9 ఏళ్లు, ఆ తర్వాత ఐదేళ్లు అధికారంలో ఉండీ కూడా ఏ నాడు రైతుల సంక్షేమానికి ఒక్క పథకాన్ని అమలు చేయని చంద్రబాబు సూపర్ సిక్స్లో భాగంగా పీఎం కిసాన్ సాయం కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఏటా ప్రతి రైతుకు రూ.20 వేలు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఇస్తామని హామీలిచ్చారు. తొలి ఏడాది ఎగనామం పెట్టితే.. మలి ఏడాదిలో 1,95,866 మందికే ఇచ్చి సరిపుచ్చారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోని లబ్ధిదారులను అనేక కారణాలు చూపించి ఏరివేసింది. అధికారంలోకి రాక ముందు కౌలు రైతులకు పథకాన్ని వర్తింప చేస్తామని చెప్పినా.. అమల్లోకి వచ్చే సరికి కౌలు రైతుల ఊసే ఎత్తకుండా.. అర్హులైన లబ్ధిదారుల సంఖ్యకు కోత పెట్టింది. అర్హత ఉండీ పథకం వర్తించని లబ్ధిదారులకు నెల రోజులు గడువు ఇస్తున్నామని అర్హతులతో తిరిగి దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి తిరిగి సాయం అందిస్తామని నిధుల విడుదల ప్రతిసారి చెబుతోంది. కానీ అర్హత ఉండీ లబ్ధి చేకూరని 84,134 మంది రైతులకు నేటికీ దిక్కులేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆర్బీకేలో రైతుల జాబితాలను నోటీసు బోర్డుల్లో ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికి పారదర్శకతకు పాతరేసింది. సంవత్సరం దరఖాస్తు చేసుకున్న లబ్ధి చేకూరిన ఆర్థిక సాయం రైతులు రైతులు (రూ.కోట్లల్లో) 2024–25 3,19,000 – – 2025–26 3,19,000 1,95,866 289.05 2026–27 (ఈ ఏడాదికి ఇంకా ఎప్పుడు జమ చేసేది స్పష్టత లేదు.) వైఎస్సార్సీపీ పాలనలో సున్నా వడ్డీ అర్హులు తిరిగి దరఖాస్తు చేసుకుంటే సాయమందిస్తామని చెప్పినా.. ఫలితం శూన్యం 84,134 మంది రైతుల దరఖాస్తులు పెండింగ్ కౌలు రైతులకు పంగనామాలు సున్నా వడ్డీ చెల్లింపులకు దిక్కులేదు ఉచిత పంటల బీమాకు చెల్లుచీటి రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ ఊసేలేదు వైఎస్సార్ రైతు భరోసా పథకం టీడీపీ పాలనలో అన్నదాత సుఖీభవ రైతు భరోసా పడేది.. సుఖీభవ పడట్లేదు నాకు ఒక ఎకరం మాగాణి భూమి ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయంలో నాకు క్రమం తప్పకుండా వైఎస్సార్ రైతు భరోసా జమయ్యేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి ఏడాది అసలు వేయలేదు. రెండో ఏడాదిలో కూడా పడకపోవడంతో వెళ్లి అడిగితే.. సాంకేతిక కారణంతో నగదు జమ కాలేదని అధికారులు చెప్పారు. రెండో సారి వెళ్తే.. ఆధార్ లింక్ కాలేదని చెప్పారు. సరి చేస్తామని చెప్పినా.. ఇంత వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మూడో ఏడాదైనా ప్రభుత్వం అన్నదాత సుఖీభవ ఇస్తుందో లేదో తెలియదు. – పిల్లి బాలమ్మ, బల్లవోలు, చిల్లకూరు మండలం -
కొనేశారు.. ఇలా పడేశారు
ఇక ఎందుకూ పనికిరావేమో.. రోడ్లను శుభ్రం చేసే యంత్రాలు దెబ్బతింటున్న వాహనాలు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ప్రజల సొమ్ముతో కొనుగోలు చేసిన ఆస్తుల సంరక్షణలో నెల్లూరు నగరపాలక సంస్థ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.కోట్ల వ్యయంతో కొన్న వాహనాలు, యంత్రాలు, ఇతర వస్తువులు ప్రస్తుతం పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నిరుపయోగంగా పడి ఉన్నాయి. నగరంలో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనుల కోసం తెచ్చిన ఈ వాహనాలు నిర్వహణ లేకపోవడంతో తుప్పుపట్టి దెబ్బతింటున్నాయి. సాక్షాత్తు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నగరంలోనే ఈ పరిస్థితి నెలకొనడం గమనార్హం. నిరుపయోగంగా ఉన్న వాహనాలపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
కొమ్మి సోదరుడి అక్రమ దందా
● కూటమి ప్రభుత్వం వచ్చాక రెచ్చిపోతున్న తెలుగు తమ్ముడు ● పెన్నా పోరంబోకు భూముల్లో ఇసుక దోపిడీ ● ఆయన గుప్పెట్లో వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ● తహసీల్దార్కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులుచేజర్ల: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగు తమ్ముళ్ల అవినీతికి అడ్డు లేకుండా పోయింది. ప్రకృతి వనరులు దోచుకుంటున్నారు. ఓ మాజీ ఎమ్మెల్యే సోదరుడు యథేచ్ఛగా పెన్నా పోరంబోకు భూమిలో ఉన్న ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇప్పటికే వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి నిబంధనలకు విరుద్ధంగా అతడి ఆధీనంలో ఉన్నాయి. అది చాలుదన్నట్టుగా పెన్నా పరివాహక ప్రాంతం నుండి ఇసుకను దోచే కార్యక్రమం చేపట్టాడు. కాగా 6వ తేదీన గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారం ఉందని.. తెలుగుదేశం రాష్ట్ర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు స్వగ్రామమైన చేజర్ల మండలం, పుల్లనీళ్ల్లపల్లి గ్రామంలో ఆయన సోదరుడు కొమ్మి సిద్ధులు నాయుడు పెన్నా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఇసుకను భారీ యంత్రాల సహాయంతో లోడేస్తున్నాడు. పెల్లేరు రెవెన్యూ గ్రామ పరిధిలోని 235 – 2లో 10 ఎకరాలకు పైగా అనాధీన భూమి ఉండగా దానిని సిద్ధులు నాయుడు ఆక్రమించుకుని ఉన్నాడు. ఈ పొలం చదును చేసేందుకు ఇసుకను తరలిస్తున్నారు. అతను ఆక్రమించిన భూమి నుంచి ఎగువ వైపున పొలాల్లోకి అధికారికంగా రహదారి ఉన్నా దానిని సైతం ఆక్రమించి ఇబ్బందులు పెడుతున్నారని బాధిత రైతులు, గ్రామస్తులు చెబుతున్నారు. తహసీల్దార్ దృష్టికి.. మా ప్రభుత్వం ఇది.. ఏం చేస్తారంటూ రాజకీయ, కుల బలంతో ఇబ్బందులకు గురిచేస్తున్న మాజీ ఎమ్మెల్యే సోదరుడి చేష్టలకు గ్రామస్తులు విసిగిపోయారు. ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకుని శనివారం చేజర్ల తహసీల్దార్ ఆర్.మస్తానయ్యకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని సిద్ధులు నాయుడు ఆక్రమించుకుని అనుభవిస్తున్నట్లు చెప్పారు. తాజాగా పెన్నా పోరంబోకు భూముల్లోని ఇసుకను సైతం దోచేస్తూ పొలాలకు వెళ్లే దారిని సైతం ఆక్రమించాడన్నారు. రాజకీయ బలంతోనే లక్ష్మయ్య నాయుడి సోదరుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, బలహీన వర్గాలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను దౌర్జన్యంగా ఆక్రమించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పెన్నా పరీవాహక ప్రాంతంలోని వందలాది ఎకరాలు ఏటి పోరంబోకు భూముల్లో బోర్ పాయింట్లు, విద్యుత్ సర్వీసులు అక్రమంగా ఏర్పాటు చేసి నెల్లూరుకు చెందిన ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇచ్చి ఏటా రూ.లక్షలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నాడని తెలిపారు. కలెక్టర్ స్పందించి సదరు మాజీ ఎమ్మెల్యే సోదరుడి ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూములను వెలికి తీసి బాధ్యులకు అందజేయాలన్నారు. అలాగే కబ్జాకు గురైన భూములను అతని చెర నుంచి విడిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ● ఇసుక అక్రమ దందా విషయంపై తహసీల్దార్ను సాక్షి వివరణ కోరగా ప్రభుత్వ భూముల్లో నుంచి ఇసుకను తరలించడం చట్టరీత్యా నేరమని, విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.పెన్నా ప్రాంతంలో ట్రాక్టర్లో ఇసుక లోడింగ్ట్రాక్టర్ ద్వారా ఇసుక డంప్ చేస్తూ.. -
రాష్ట్ర గవర్నర్ రాక రేపు
నెల్లూరురూరల్: రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్నజీర్ మంగళవారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గవర్నర్ ఉదయం 10.50 గంటలకు హెలికాప్టర్లో నెల్లూరులోని పోలీస్ పరేడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 11.15 గంటలకు కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న 10, 11, 12వ స్నాతకోత్సవాల కార్యక్రమంలో పాల్గొంటారు. గ్రాడ్యుయేట్స్కు పట్టాలు, గౌరవ డాక్టరేట్స్లు ప్రదానం చేయనున్నారు. అనంతరం తిరుపతికి బయలుదేరుతారు. పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి వరికుంటపాడు: మండలంలోని పెద్దిరెడ్డిపల్లిలో పిడుగుపాటుకు అరవ రమణయ్య (45) మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. రమణయ్య గ్రామ శివారులో గొర్రెలను మేపుతుండగా ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది. ఈ క్రమంలో సమీపంలో పిడుగు పడడంతో రమణయ్య తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు రమణయ్యకు భార్యతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం నెల్లూరు(వేదాయపాళెం): వ్యవసాయ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ జీఎల్ శివజ్యోతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో నిర్వహించే సేంద్రియ వ్యవసాయం, మిద్దె తోటల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం కోర్సులకు ఆసక్తి గల యువత, రైతులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఒక్కో కోర్సుకు రూ.1500 రుసుం చెల్లించాల్సి ఉంటుందరు. ఇతర వివరాలకు భక్తవత్సలనగర్లోని కృషి విజ్ఞాన కేంద్ర కార్యాలయంలో సంప్రదించాలన్నారు. పశువుల ప్రాణాంతక వ్యాధులకు ఉచిత టీకాలు నెల్లూరు (వేదాయపాళెం): పశువులు, మూగజీవాలను ప్రాణాంతక సాంక్రమిత వ్యాధుల నుంచి కాపాడేందుకు ఉచిత టీకాల కార్యక్రమం చేపడుతున్నామని పశువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ చైతన్య కిషోర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జబ్బవాపు నివారణకు ఈ నెల 10 నుంచి 30వ తేదీ వరకు, చిటిక వ్యాధి నివారణకు ఈ నెల 15 నుంచి జూలై 15 వరకు, గొంతువాపు వ్యాధి నివారణకు ఈ నెల 25 నుంచి జూలై 25 వరకు, నీలి నాలుక వ్యాధి నివారణకు జూలై 1 నుంచి 30 వరకు టీకాలు ఉచితంగా వేస్తామని ఆయన తెలిపారు. వర్షాకాలం ప్రారంభమవుతున్న ప్రస్తుత తరుణంలో పశువులు, మేకలు, గొర్రెల్లో సంక్రమించే వ్యాధులు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని తెలిపారు. ముందస్తు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్దేశిత గడువులోపు మాత్రమే నిర్వహిస్తామన్నారు. అందువల్ల రైతులు పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సకాలంలో టీకాలు వేయించాలని తెలిపారు. శ్రీవారి దర్శనానికి 20 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుతుంది. శనివారం అర్ధరాత్రి వరకు 90,107 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 52,236 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.23 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామి వారిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామివారిని దర్శించుకోగలుగుతున్నారు. -
‘నేతన్న నేస్తం’ పథకం అమలుకు డిమాండ్
● 22న కలెక్టరేట్ ఎదుట ధర్నా నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘నేతన్న నేస్తం’ పథకం అమలు చేయాలని ఏపీ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నేతలు డిమాండ్ చేశారు. నగరంలోని మన హాస్పిటల్లో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ రాష్ట్ర కన్వీనర్లు బండారు ఆనంద్ ప్రసాద్, బాలకృష్ణ, పూర్ణచంద్రరావు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చేనేతలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. 50 సంవత్సరాల వయసు నిండిన ప్రతి కార్మికుడికి పింఛన్ ఇవ్వాలన్నారు. చేనేత పరిశ్రమకు విధిస్తున్న జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం చేనేతలపై సవతితల్లి ప్రేమ చూపిస్తోందని ఆరోపించారు. న్యాయమైన కోర్కెల సాధన కోసం ఈనెల 22వ తేదీన కలెక్టరేట్ వద్ద శాంతియుత ధర్నా నిర్వహిస్తామన్నారు. జిల్లాకు చెందిన చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, శంకరయ్య, పముజుల దశరథరామయ్య, బూదాటి రాధయ్య, రామసుబ్బయ్య, పడవల వెంకటశేషయ్య, వైఎస్సార్సీపీ చేనేత విభాగం అధ్యక్షుడు రాజా, రవి, హరి తదితరులు పాల్గొన్నారు. -
అడగలేరని.. చిన్నచూపా
గతంలోనూ ఘటనలు● పురిటి బిడ్డలకు రక్షణ కరువు ● ఎలక్ట్రానిక్ ట్యాగ్ను తీసేసిన కూటమి ప్రభుత్వం ● సర్వజన ఆస్పత్రిలో శిశువును విక్రయించిన తండ్రి ● తల్లి కేకలతో బిడ్డను కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది ● నిందితుడిని వదిలేసిన పోలీసులు నెల్లూరు(అర్బన్): కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు పసిబిడ్డల పాలిట శాపంగా మారాయి. అప్పుడే పుట్టిన శిశువులు లేదా కొద్దిరోజుల వయసున్న బిడ్డలను అపహరణల నుంచి రక్షించేందుకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల ప్రసూతి విభాగాల్లో శిశువుల చేతికి లేదా కాలికి ప్రత్యేక ఎలక్ట్రానిక్ ట్యాగ్ను అమర్చేవారు. దీనిని ఆర్ఎఫ్ఐడీ (రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్) ఆధారిత బేబీ ట్యాగింగ్ సిస్టమ్ లేదా ఎలక్ట్రానిక్ ఇన్ఫాంట్ ప్రొటెక్షన్ సిస్టమ్ అని పిలుస్తారు. ఈ ట్యాగ్ ఆస్పత్రి భద్రతా వ్యవస్థతో అనుసంధానమై ఉంటుంది. అనుమతి లేకుండా శిశువును వార్డు లేదా నిర్దేశిత ప్రాంతం నుంచి బయటకు తీసుకెళ్లేందుకు ప్రయ త్నిస్తే వెంటనే అలారం మోగుతుంది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై శిశువును కాపాడే అవకాశం ఉంటుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని సర్వజన, జిల్లా ఆస్పత్రుల్లో ఈ విధానం అమల్లో ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శిశువులకు ట్యాగ్లు అమర్చే విధానాన్ని నిలిపివేసింది. దీంతో అలారంలు అలంకారప్రాయంగా మారిపోయాయి. పురిటి బిడ్డల భద్రత ప్రశ్నార్థకంగా మారిందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి నిదర్శనంగా 5వ తేదీన నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ప్రసూతి విభాగంలో చోటుచేసుకున్న ఘటన నిలిచింది. రూ.50 వేల కోసం.. అనంతసాగరం ప్రాంతానికి చెందిన ముక్తియార్, లక్ష్మీకాంత దంపతులకు ఇప్పటికే ఇద్దరు కుమారులున్నారు. ఇటీవల లక్ష్మీకాంత ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మూడోసారి మగబిడ్డకు జన్మనిచ్చింది. మద్యానికి బానిసైన భర్త తన భార్యకు తెలియకుండా నవజాత శిశువును విక్రయించేందుకు ప్రయ త్నించాడు. శిశువును రూ.50 వేలకే విక్రయించేందుకు ఓ వ్యక్తితో బేరం కుదుర్చుకున్నాడు. భార్య మరుగుదొడ్డికి వెళ్లిన సమయంలో బురఖా ధరించి బిడ్డను తీసుకుని ఆస్పత్రి బయటకు వచ్చాడు. ఆస్పత్రి ఎదురుగా కారులో వేచి ఉన్న వ్యక్తులకు శిశువును అప్పగించాడు. అయితే మంచంపై బిడ్డ కనిపించకపోవడంతో తల్లి లక్ష్మీకాంత ఆందోళనకు గురై ఏడుస్తూ బయటకు వచ్చింది. ఆమె కేకలు విన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై కారును చుట్టుముట్టి శిశువును సురక్షితంగా తిరిగి తల్లికి అప్పగించారు. ట్యాగ్ ఉంటే ఘటనే జరిగేది కాదు శిశువుకు ఎలక్ట్రానిక్ ట్యాగ్ అమర్చివుంటే, వార్డు పరిధి దాటిన వెంటనే అలారం మోగేది. దీంతో శిశువును బయటకు తీసుకెళ్లడం సాధ్యమయ్యేది కాదు. ఈ ఘటన మరోసారి బేబీ ట్యాగింగ్ విధానం అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. తండ్రే నిందితుడు కావడంతో.. ఘటన అనంతరం సెక్యూరిటీ సిబ్బంది ముక్తియార్ను నాలుగో నగర పోలీసులకు అప్పగించారు. విచారణలో తాను బిడ్డను పోషించలేక విక్రయించేందుకు ప్రయత్నించానని, కొనుగోలు చేసిన వ్యక్తులు దర్గా ప్రాంతంలో పరిచయమైన వారేనని ముక్తియార్ చెప్పినట్లు సమాచారం. అయితే పోలీసులు అతడిపై కేసు నమోదు చేయకుండా హెచ్చరించి వదిలేసినట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. దీంతో 6వ తేదీన ఉదయం ముక్తియార్ తిరిగి ఆస్పత్రికి వచ్చి, మూడో బిడ్డను తాను పోషించలేను, ఎలాగైనా అమ్మేస్తాను అంటూ నిర్భయంగా మాట్లాడినట్లు అక్కడి వారు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడమే అతడికి ధైర్యం ఇచ్చిందని ఆస్పత్రి పరిసరాల్లో చర్చ సాగింది.గతంలో కూడా నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో తల్లితో ఉన్న నాలుగేళ్ల చిన్నారిని అపహరించిన ఘటన చోటుచేసుకుంది. అనంతరం పోలీసులు చిన్నారిని గుర్తించి రక్షించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు, వైద్యారోగ్య శాఖలపై ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నవజాత శిశువుల భద్రత కోసం తిరిగి బేబీ ట్యాగింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. -
రెండు సార్లు తిరిగా.. జవాబు లేదు
నా కుమార్తె 11 నెలల క్రితం పెద్దాస్పత్రిలో పురుడు పోసుకుంది. మగబిడ్డ పుట్టాడు. బర్త్ సర్టిఫికెట్ కోసం ఇప్పటికే రెండుసార్లు తిరిగా. సమాధానం లేదు. త్వరగా సర్టిఫికెట్ ఇప్పించాలి. – మొద్దు శోభ, యామాలపాడు, కావలి మండలం అవకాశం కోల్పోతాంనా తండ్రి మహబూబ్జాన్ పెద్దాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెంది నెలరోజులు కావొస్తోంది. డెత్ సర్టిఫికెట్ కోసం మూడు దఫాలుగా తిరుగుతున్నా. మళ్లీ రా అంటున్నారు. ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదు. ఈనెల 12వ తేదీలోపు మా అమ్మ విడో పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఆ తర్వాత డెత్ సర్టిఫికెట్ ఇస్తే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోతాం. కలెక్టర్ స్పందించి వెంటనే సర్టిఫికెట్ ఇప్పించాలి. – మక్సూద్, గాంధీ నగర్, నెల్లూరు -
దమ్ముంటే విజిలెన్స్ విచారణ జరిపించు
● రియల్టర్లను బెదిరించడం నిజం కాదా? ● ఆక్రమణలు ఉన్నాయని హడావుడి చేయడం నిజం కాదా? ● అవినీతి, దోపిడీ, మనీ స్కామ్లే కావ్య చరిత్ర ● మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి ఆరోపణలుకావలి : కావలి పట్టణం చుట్టు పక్కల ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ లేఅవుట్లలో 126 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమించారని హడావుడి చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. దమ్ము, ధైర్యం ఉంటే.. విజిలెన్స్ విచారణ జరిపించి ఆ భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేయాలని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి సవాల్ విసిరారు. ఆదివారం కావలిలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వెంచర్లలో ప్రభుత్వ భూమి, కాలువ పోరంబోకు భూమి ఉందని పురపాలక సంఘ అధికారులతో తనిఖీ చేయించి రియల్టర్లను బెదిరించడమే కాకుండా వెంచర్లలో గుంటలు తీయించడం నిజం కాదా? అని నిలదీశారు. ఏకంగా విజిలెన్స్ విచారణ చేయాలంటూ లేఖలు రాసి మా పార్టీలో ఉన్న రియల్టర్లు భూముల ఆక్రమణల పేరుతో వేధించి, ముడుపులు దండుకుని విచారణను ఆపడం నిజం కాదా? అని ప్రశ్నించారు. మీ పార్టీలోని ఒక వ్యక్తి ప్రోద్బలంతో విజిలెన్స్ అధికారులు విచారణకు రావడంతో నీకు నచ్చని వారి వెంచర్లను తనిఖీ చేయాలంటూ ఆంక్షలు విధించలేదా అని నిలదీశారు. విచారణను ఎదుర్కోలేక.. అధికారులపై దౌర్జన్యాలా? మీ పార్టీలోని ఒక నాయకుడు గట్టిగా పట్టుబట్టడంతో విజిలెన్స్ అధికారులు కావలిలోని రియల్ ఎస్టేట్లలో భూ ఆక్రమణలపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టడంలో భాగంగా వివిధ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తుంటే ఎమ్మెల్యే అనుచరులు విజిలెన్స్ అధికారులపై దౌర్జన్యం చేయించడం వెనుక నీ పాత్ర ఉందని, విచారణను ఎదుర్కోలేకనే ఇలా బరితెగించారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యేకు దమ్ము ధైర్యం ఉంటే విజిలెన్స్ విచారణ కాదు సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రియల్టర్ల వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేసుకొని విచారణ అడ్డుకుంటున్న ఘనత నీదన్నారు. మట్టి, గ్రావెల్ కొల్లగొట్టేస్తున్నారు.. నియోజకవర్గంలో అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లోనూ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు యథేచ్ఛగా గ్రావెల్, మట్టి అక్రమంగా తవ్వుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారని ప్రతాప్కుమార్రెడ్డి ఆరోపించారు. తాను గెలుపొందిన ఆరు నెలల్లోనే తుమ్మలపెంట రోడ్డును పూర్తిస్థాయిలో నిర్మించి 2025 జనవరిలో నూతన సంవత్సరం వేడుకలను నిర్వహిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. నేటికి అసంపూర్తిగా ఉందని, చేసిన పనుల్లోనూ అనేక అక్రమాలు ఉన్నాయని వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలన్నారు. ఫిషింగ్ హార్బర్ మా ఘనత తీర ప్రాంత మత్స్యకారుల సంక్షేమం ఆర్ధికాభివృద్ధిని కాంక్షించి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిధులు మంజూరు చేసి 90 శాతానికిపైగా పూర్తి చేసిన ఘనత మాది అన్నారు. హార్బర్ కాంట్రాక్ట్ పనులు చేసిందీ కూడా ఇప్పటి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అని గుర్తు చేశారు. అయితే అదేదో కూటమి ప్రభుత్వం మంజూరు చేసి నిర్మాణం చేసినట్లు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 35 ఎకరాల భూమిని ప్రైవేట్ సంస్థకు ధారాదత్తం చేసిన మీకు మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధిపై చిత్తశుద్ధి ఎక్కడ అని ప్రశ్నించారు. రూ.600 కోట్ల మనీస్కామ్ కావలి మర్రిచెట్టు కాలనీలో ఒక వ్యక్తి మనీ లాండరింగ్ పేరుతో రూ.వంద కోట్లు మనీస్కామ్కు పాల్పడ్డాడని, రూ.600 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించిన కావ్య కృష్ణారెడ్డి.. ఇందులో ఒక్క రూపాయి అయినా బాధితులకు తిరిగి ఇప్పించగలిగావా? అని ప్రతాప్కుమార్రెడ్డి ప్రశ్నించారు. బాధితులు తమ వద్దకు వస్తే ప్రతి ఒక్కరికి ప్రతి పైసా అందించే బాధ్యత నాది అని చెప్పావే.. ఇప్పుడు ఆ ఊసే లేదంటే.. వారితో లాలూచీ పడ్డావా? అని నిలదీశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ అల్లూరు మండల కన్వీనర్ దండా కృష్ణారెడ్డి, బోగోలు కన్వీనర్ మద్దిబోయిన వీర రఘు, నాయకులు గంధం ప్రసన్నాంజనేయులు, పద్మనాభరెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
నిండా నిర్లక్ష్యం.. తీరని నష్టం
నెల్లూరు(అర్బన్): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో పదిరోజులుగా జనన, మరణ ధ్రువపత్రాల జారీ నిలిచిపోయింది. అదే విధంగా పక్షవాతం బాధితులకు జారీ చేసే దివ్యాంగుల సర్టిఫికెట్ల ప్రక్రియ కూడా మార్చి 31వ తేదీ నుంచి ఆగిపోయింది. దీంతో బాధితులు రోజూ ఆస్పత్రి చుట్టూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యపై స్పష్టమైన సమాధానం చెప్పే అధికారులు లేకపోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలువురు ప్రభుత్వ పథకాల లబ్ధిని కోల్పోయే పరిస్థితి నెలకొంది. ఓటీపీ రాకపోవడంతో.. పెద్దాస్పత్రిలో జనన, మరణ ధ్రువపత్రాల జారీ బాధ్యత అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా ఉన్న డాక్టర్ కళారాణి పర్యవేక్షణలో కొనసాగేది. స ర్టిఫికెట్ల జారీకి అవసరమైన కంప్యూటర్ లాగిన్ ప్రక్రియలో మొదట డాక్టర్ కళారాణి మొబైల్కు ఓటీపీ వచ్చేది. ఆ ఓటీపీని కంప్యూటర్ ఆపరేటర్కు అందజేసిన తర్వాత సర్టిఫికెట్ ప్రాసెస్ చేసేవారు. అయితే ఇటీవల ప్రభుత్వం ఆమెను వేరే జిల్లాకు బదిలీ చేయడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. బదిలీ అనంతరం వెంటనే మరొక అధికారికి బాధ్యతలు అప్పగించి, సంబంధిత ఓటీపీ వ్యవస్థను బదిలీ చేసే చర్యలు చేపట్టాల్సి ఉండగా ఆస్పత్రి యాజమాన్యం అలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా రోజూ 50 మందికి పైగా ధ్రువపత్రాల కోసం ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నారు. అయినప్పటికీ సమస్య పరిష్కారంపై ఎవరూ స్పందించడం లేదని బాధితులు వాపోతున్నారు. అందని సదరం సర్టిఫికెట్లు పక్షవాతంతో నడవలేని, కదల్లేని రోగులకు జారీ చేసే దివ్యాంగుల సర్టిఫికెట్ల ప్రక్రియ కూడా మార్చి 31వ తేదీ నుంచి నిలిచిపోయింది. ఇప్పటి వరకు ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు రోగులను పరిశీలించి న్యూరో ఫిజీషియన్కు రిఫర్ చేసేవారు. న్యూరో వైద్యుడు తన అభిప్రాయాన్ని నమోదు చేసిన అనంతరం ఆర్థోపెడిక్ విభాగం అధికారులు వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసేవారు. దీంతో సర్టిఫికెట్ వయ్యేది. అయితే ప్రభుత్వం నిబంధనలు మార్చిందంటూ ఆర్థోపెడిక్ విభాగం వైద్యులు వివరాలను అప్లోడ్ చేయడం నిలిపివేసినట్లు తెలుస్తోంది. మరోవైపు న్యూరో ఫిజీషియన్ మాత్రం తాను నిబంధనల ప్రకారమే పని చేస్తున్నానని పేర్కొంటూ సంబంధిత ఉత్తర్వులను సూపరింటెండెంట్కు అందజేసినట్లు సమాచారం. రెండు విభాగాల మధ్య నెలకొన్న విభేదాల కారణంగా పక్షవాతం బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారు. పరిస్థితిని సూపరింటెండెంట్ ఇప్పటి వరకు సరిచేయకపోవడంతో దివ్యాంగుల సర్టిఫికెట్లు అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పింఛన్లు వచ్చేనా? మరణించిన వారి కుటుంబ సభ్యులు, పక్షవాతం వంటి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారు ప్రభుత్వ పింఛన్ల కోసం తప్పనిసరిగా వైద్యులు జారీ చేసే ధ్రువపత్రాలపై ఆధారపడాల్సి ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. ప్రజల నుంచి వచ్చిన విమర్శల నేపథ్యంలో దాదాపు రెండేళ్ల తర్వాత ఈనెల 12వ తేదీ వరకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అవసరమైన ధ్రువపత్రాలు అందకపోతే అర్హులైన లబ్ధిదారులు పింఛన్లకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. దీంతో అభాగ్యులు తీవ్రంగా నష్టపోతారు. చిన్నారుల ధ్రువపత్రాలకూ ఆటంకం ఆస్పత్రిలో జన్మించిన శిశువులకు జనన ధ్రువపత్రాలు అత్యంత కీలకం. ఆధార్ నమోదు, జనగణన, బీమా పాలసీలు, విద్యా ప్రవేశాలు తదితర అనేక అవసరాలకు జనన ధ్రువపత్రం తప్పనిసరి. ప్రస్తుతం జనన ధ్రువపత్రాల జారీ నిలిచిపోవడంతో కొత్తగా జన్మించిన శిశువుల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు వెంటనే జనన, మరణ ధ్రువపత్రాలు, దివ్యాంగుల సర్టిఫికెట్లు జారీ చేయాలని బాధితులు కోరుతున్నారు. కలెక్టర్ జోక్యం చేసుకుని సమస్యను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పెద్దాస్పత్రిలో ఆగిన జనన, మరణ ధ్రువపత్రాల మంజూరు వితంతు పింఛన్కు భర్త మరణ ధ్రువపత్రం తప్పనిసరి దివ్యాంగుల సర్టిఫికెట్ల మంజూరులో నిర్లక్ష్యం ఈనెల 12తో ముగియనున్న దరఖాస్తుల గడువు పట్టించుకోని అధికారులు -
నాడు స్వర్ణయుగం.. నేడు తిరోగమనం
ఇది పొగాకు రైతుల దుస్థితి వైఎస్సార్సీపీ హయాంలో క్వింటా కూటమి పాలనలో క్వింటా రూ.37,000 రూ.23,900 జిల్లాలో కలిగిరి, డీసీపల్లి వేలం కేంద్రాల్లో వర్జీనియా పొగాకు పంటను రైతులు విస్తృతంగా సాగు చేస్తున్నారు. వేల మంది పొగాకు పంట సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో పొగాకు రైతులకు స్వర్ణయుగంలా సాగింది. పొగాకు ధరలు పతనమైన సమయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వెంటనే మార్క్ఫెడ్ను రంగంలోకి దించి నేరుగా వేలం ప్రక్రియలో పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంది. దీంతో పొగాకు వ్యాపారుల మధ్య పోటీ పెరిగి ధరలు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు లాభాల బాట పట్టారు. ఐదేళ్లూ కాసుల పంటలు పండాయి. 2022–23, 2023–24 సీజన్లు అయితే రికార్డు ధరలు పొగాకు రైతు లకు వచ్చాయి. ఇక బ్రైట్ గ్రేడ్ పొగాకు అయితే ఏకంగా క్వింటా రూ.37 వేల వరకు పలికింది. పొగాకు రైతులకు మరో మేలు చేసే చర్యలు కూడా గత ప్రభు త్వం తీసుకుంది. అప్పటి వరకు అధికంగా పండించిన పొగాకుపై 5 శాతం వరకు జరిమానా విధించి పొగాకు కొనుగోలు చేసేవారు. అయితే కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అధిక పొగాకు ఉత్పత్తులపై ఉన్న జరిమానాలు పూర్తిగా రద్దు చేయించారు. దీంతో రైతులు ఎటువంటి జరిమానాలు లేకుండానే అధికంగా పండించిన పొగాకును వేలం కేంద్రాల్లో అమ్ముకునే అవకాశం లభించింది. దీంతోపాటు పొగాకు చూర, ముక్క వంటివి కూడా వేలం కేంద్రాల్లోనే అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. దీంతో రైతులకు అన్ని విధాలా లాభాలు చేకూర్చి ఆదాయాలు రెట్టింపయ్యాయి. కూటమి పాలనలో క్వింటాకు రూ.13,100 నష్టం ప్రస్తుతం కూటమి ప్రభుత్వ పాలనలో పొగాకు రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. 2024–25, 2025–26 సీజన్లలో పొగాకు అమ్మకాల ధరలు దారుణంగా ఉన్నాయి. వైఎస్సార్సీపీ పాలనలో బ్రైట్ గ్రేడ్ కేజీ పొగాకు రూ.365 పలికితే అదే పొగాకు కూటమి పాలనలో రూ.239లకు కొనుగో లు చేస్తున్నారు. అంటే క్వింటా పొగాకు మీద ఒక రైతుకు రూ.13,100 వరకు నష్టపోతున్నారు. -
10న జిల్లాస్థాయి చెస్ ఎంపికలు
నెల్లూరు (టౌన్): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈనెల 10వ తేదీన జిల్లా స్థాయి అండర్–15 బాల, బాలికల చెస్ చాంపియన్షిప్ పోటీలను నిర్వహించనున్నట్లు జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ మస్తాన్బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా చెస్ అసోసియేషన్, రాయ్ చెస్ అకాడమి సంయుక్తంగా జరిపే పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఈనెల 8వ తేదీలోపు 80963 28326, 96033 45326 నంబర్లకు ఫోన్ చేసి పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. మొదటి నాలుగు స్థానాలు సాధించిన క్రీడాకారులు విజయవాడలో ఈనెల 13, 14వ తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధిస్తారన్నారు. ఊరెళ్లారు.. దోచేశారు● 30 సవర్ల బంగారు నగల అపహరణ వెంకటాచలం: ఇంట్లోని వారు బంధువుల ఊరికి వెళ్లగా గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన ఘటన మండలంలోని చెముడుగుంట గ్రామంలో శనివారం గుర్తించారు. వళ్లూరు లతమ్మ మూడు రోజుల క్రితం ఇంటికి తాళాలు వేసి బంధువుల గ్రామానికి వెళ్లింది. శనివారం ఉదయం లతమ్మ నివాసంలో పనిచేసే మహిళ ఇంటి వద్దకు రాగా తాళాలు పగులగొట్టి ఉండటంతో వెంటనే లతమ్మకు సమాచారం ఇవ్వడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంకటాచలం సీఐ సురేంద్రబాబు, ఎస్సై ఆంజనేయులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సిబ్బందిని రప్పించి వేలు ముద్రలు సేకరించారు. బీరువాలో 30 సవర్ల బంగారు నగలు, రూ.40 వేల నగదు చోరీకి గురైనట్లు లతమ్మ బంధువులు పోలీసులకు తెలియజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అగ్నికి ఆహుతైన కారు మర్రిపాడు: మండలంలోని నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై శనివారం కదిరినాయుడుపల్లి అటవీ ప్రాంతంలో ఓ కారు అగ్నికి ఆహుతైంది. ప్రొద్దుటూరు నుంచి పెంచలకోన వెళ్తున్న సమయంలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే వాహనాన్ని నిలిపివేసి అందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కొద్ది సేపటికే మంటలు మరింత వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అధిక ఉష్ణోగ్రతలు, సాంకేతిక లోపాల కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయని, వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని ఎస్సై బలరాంరెడ్డి సూచించారు. రైలు కిందపడి వృద్ధుడి ఆత్మహత్య నెల్లూరు(క్రైమ్): గూడ్స్ రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కల్లూరుపల్లి హౌసింగ్బోర్డు కాలనీ సమీపంలో చైన్నె వైపు వెళ్లే రైలు పట్టాలపై శనివారం చోటుచేసుకుంది. మృతుడు సుమారు 55 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండొచ్చు. కాఫీ రంగు హాఫ్ హ్యాండ్స్ షర్ట్, గ్రే రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. జీజీహెచ్ మార్చురీకి మృతదేహాన్ని తరలించి కేసు నమోదు చేశారు. మృతుని వివరాలు తెలిసిన వారు 92475 75628 నంబర్కు తెలియజేయాలని కోరారు. కండలేరులో 37.540 టీఎంసీల నీరు రాపూరు: కండలేరు జలాశయంలో శనివారం నాటికి 37.540 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,900, హైలెవల్ కాలువకు 50, లోలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. -
పీడీఏ నిర్లక్ష్యం.. వృద్ధులకు అగచాట్లు
● 17 మందికి అందని పింఛన్ నగదు వరికుంటపాడు: మండలంలోని యర్రంరెడ్డిపల్లి గ్రామంలో సామాజిక పింఛన్ల పంపిణీలో పీడీఏ నిర్లక్ష్యం.. పింఛన్దారులకు అగచాట్లు మిగిల్చింది. దివ్యాంగులు, వితంతువులు, వృద్ధులకు ప్రభుత్వం ప్రతినెలా 1వ తేదీన అందించే పింఛన్లను పంచాయతీ అభివృద్ధి అధికారి (పీడీఓ) తిరుమల నారాయణ గ్రామంలో కొంతమందికి అందించగా, 17 మందికి అందజేయకుండా వెళ్లిపోయినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీనిని పలువురు మీడియా దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే ఎంపీడీఓ రమణారెడ్డి స్పందించారు. ఘటనపై సంబంధిత అధికారికి నోటీసులు జారీ చేసి, నగదును రికవరీ చేసి, వచ్చే నెల పింఛన్తో కలిపి అందజేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే ఈనెల పింఛన్ నగదు కోసం ఆశగా ఎదురుచూస్తున్న వృద్ధులకు నిరాశే ఎదురైంది. -
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
నెల్లూరు (టౌన్): విద్యాశాఖలో జరుగుతున్న వరుస వైఫల్యాలపై పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం స్థానిక వీఆర్సీ సెంటర్లో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో ఎన్టీయే పూర్తిగా విఫలమైందన్నారు. నీట్ పరీక్ష పత్రం లీకేజీ, యూజీసీ నెట్ దరఖాస్తుల నిర్వహణ, సీబీఎస్ఈ పరీక్షల మూల్యాంకనంలో లోపాలు, సీయూఈటీ యూజీ పరీక్షలను చివరి నిమిషంలో రద్దు చేయడం లాంటి ఘటనలు జరిగాయన్నారు. నీట్ పేపరు లీక్పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి స్పందన లేదన్నారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్.మస్తాన్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేంద్ర, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహం, విద్యార్థి సంఘాల నాయకులు శివం, యస్దానీ, సోహిల్, మౌళి, నాగేంద్ర, దినేష్, అమర్ తదితరులు పాల్గొన్నారు. -
లారీ రూపంలో కబళించిన మృత్యువు
● ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు కావలి: లారీ ఢీకొట్టి ఓ యువకుడు మృతిచెందగా, మరో యువకుడికి తీవ్రగాయాలైన ఘటన శనివారం ఉదయం పట్టణంలోని ఏరియా వైద్యశాల సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. దగదర్తి మండలం ఉలవపాళ్ల గ్రామానికి చెందిన పొట్లూరి నాగేంద్ర (19), ఎద్దల సాయి గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలో జరిగే తిరునాళ్ల సందర్భంగా కావలిలో దుస్తులను కొనుగోలు చేసేందుకు ద్విచక్ర వాహనంపై వచ్చారు. పట్టణంలోని ఏరియా వైద్యశాల సమీపంలో వీరి బైక్ను వెనుక నుంచి లారీ ఢీకొనడంతో నాగేంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. సాయి తీవ్రంగా గాయపడటంతో ఏరియా వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. నాగేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. తిరునాళ్ల సమయంలో ఇలాంటి ఘటన జరగడంతో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
హామీలను అమలు చేయాలి
మోసపోయాం నిరుద్యోగ భృతిపై ఆశలు పెట్టుకు న్న యువకులు మోసపోయారు. నెలకు రూ.మూడు వేల చొప్పున ఈ రెండేళ్లలో రూ.72 వేలను ఇవ్వాల్సి ఉంది. అయితే నేటికీ పైసాను సైతం విదిల్చలేదు. హామీలను అమలు చేసి అండగా నిలవాలి. – దేవకుమార్, నిరుద్యోగి, కృష్ణపట్నం ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయాలి. సర్కార్ కొలువుదీరి రెండేళ్లు పూర్తవుతున్నా, భృతిపై ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు లభించక యువత నిరాశతో ఉన్నారు. చాలా మంది పక్క రాష్ట్రాలకు వలసెళ్లి జీవించాల్సిన పరిస్థితి నెలకొంది. నెలకు రూ.మూడు వేలను అందజేస్తే కొంతమేరైనా ఆసరాగా ఉంటుంది. – షంషుద్దీన్, నిరుద్యోగి, ముత్తుకూరు -
అ.. గౌరవ డాక్టరేట్
వివాదాస్పద రాజకీయ నేత బీదకు ప్రదానం ● పచ్చ నేతలను ప్రసన్నం చేసుకునేలా దిగజారిన వీఎస్యూనెల్లూరు (టౌన్): వీఎస్యూ స్నాతకోత్సవాన్ని ఈ నెల 9వ తేదీన స్థానిక వీపీఆర్ కన్వెన్షన్లో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏడాదికి 15 చొప్పున మూడేళ్లకు 45 గోల్డ్ మెడల్స్, 21 మందికి పీహెచ్డీ పట్టాలు, వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ముగ్గురికి గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయనున్నారు. కాగా గౌరవ డాక్టరేట్లకు ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కేఐ వరప్రసాద్రెడ్డి, సైన్స్, ఉన్నత విద్యారంగంలో విశిష్ట పరిశోధనలు చేసిన ప్రొఫెసర్ గోబర్ధన్ దాస్తోపాటు రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావును ఎంపిక చేశారు. బీద ఎంపికపై విమర్శలు రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావును గౌరవ డాక్టరేట్కు ఎంపిక చేయడంపై పలు విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఆయన వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభకు ఎంపికై ఆ తర్వాత నైతిక విలువలకు పాతరేస్తూ పార్టీ ఫిరాయించి అనైతిక రాజకీయ నేతగా అప్రతిష్ట మూటగట్టుకున్నారు. ఇటీవల కావలి తీర ప్రాంతానికి అక్రమంగా వచ్చిన పుదుచ్చేరి బోట్లను స్థానికంగా ఉండే మత్స్యకారులు ప్రాణాలు తెగించి పట్టుకున్నారు. అయితే ఆ బోటును మత్స్యకారులకు సమాచారం లేకుండానే సదరు బీద అర్ధరాత్రి కుట్రలకు తెరలేపి వదిలేసి ద్రోహానికి పాల్పడ్డారు. దీని వెనుక బీద మస్తాన్రావు హస్తం ఉందని ఆరోపణలు కాల్ డేటా ఆధారంగా బయటపడన విషయం విదితమే. పెద్ద మొత్తంలో నగదు తీసుకుని బోటును పంపించారన్న ఆరోపణలు వెలువెత్తాయి. అలాంటి వ్యక్తిని గౌరవ డాక్టరేట్కు ఎంపిక చేయడమేమిటని ప్రశ్నించగా ఆక్వా రంగంలో విశేష కృషి చేసినందుకే అని వర్సిటీ అధికారులు సమాధానం చెప్పారు. వివరాలను చెప్పేందుకు వర్సిటీ నిరాకరణ విక్రమ సింహపురి యూనివర్సిటీని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటు చేశారు. ఏడాదికి ఒకసారి నిర్వహించాల్సిన స్నాతకోత్సవాన్ని రెండేళ్లు, లేదా మూడేళ్లకు ఒకసారి వర్సిటీ అధికారులు నిర్వహిస్తున్నారు. ఎన్నేళ్లకు జరిగినా ఒకరికే గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే గతంలో వర్సిటీ స్నాతకోత్సవాలు, గౌరవ డాక్టరేట్కు ఎంపిక చేసిన వ్యక్తుల వివరాల కోసం వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ను సంప్రదించగా అందరూ చర్చించుకుని చెబుతామని మెసేజ్ పంపించారు. తొలుత వివరాలు చెబుతామని చెప్పిన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారి తరువాత మనస్సు మార్చుకున్నారు. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుండా ఉన్నారు. గతంలో జరిగిన స్నాతకోత్సవాలు, గౌరవ డాక్టరేట్లు గోప్యంగా ఎందుకు ఉంచుతున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉంది. రాజకీయాలకతీతంగా వ్యవహరించాల్సిన వీఎస్యూ అధికారులు వివాదాస్పద రాజకీయ నేత, టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావుకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు విక్రమ సింహపురి యూనివర్సిటీ దిగజారుడుతనంగా వ్యవహరిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక వర్సిటీలు సైతం రాజకీయాలకు వేదికలుగా మారాయి. ఈ క్రమంలో అర్హత, స్థాయి లేని అధికార పార్టీ నేతకు డాక్టరేట్ కట్టబెడుతోంది. రాజకీయ కోణంలో చూడటం లేదు ఆక్వారంగంలో విప్లవాత్మక మార్పులు, విశేష కృషి చేసినందుకు రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావును గౌరవ డాక్టరేట్కు ఎంపిక చేశాం. ఆయన ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. ఆయనను రాజకీయ కోణంలో చూడడం లేదు. గౌరవ డాక్టరేట్లకు ఎంతమందినైనా ఎంపిక చేసుకోవచ్చు. ఇంతమంది అనే నిబంధన లేదు. – అల్లం శ్రీనివాసరావు, వైస్ చాన్సలర్, వీఎస్యూ -
బీఎస్ఎన్ఎల్ శుభవార్త
నెల్లూరురూరల్: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ కార్డు వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్ను ప్రకటించింది. కొత్తగా బీఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకునే వారు రూ.249 విలువైన తొలి రీచార్జ్ను కేవలం రూ.51లకే పొందవచ్చునని జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక ఆఫర్ ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ రీచార్జ్తో వినియోగదారులు ప్రతి రోజు అపరిమిత వాయిస్ కాల్స్తోపాటు రోజుకు 2 జీబీ డేటా ప్రయోజనాన్ని పొందవచ్చునని తెలిపారు. కొత్త సిమ్లను బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్లు, ఫ్రాంచైజీలు, అధీకృత రిటైలర్ల, డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్ల వద్ద పొందవచ్చని అధికారులు తెలిపారు. వినియోగదారుల సౌకర్యార్థం ఇంటి వద్దకే సిమ్ డెలివరీ సేవను కూడా అందుబాటులోకి తెచ్చామన్నారు. వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా సిమ్ బుకింగ్ చేసుకుని ఈ సేవను పొందవచ్చని సంస్థ వెల్లడించింది. ఈ ప్రత్యేక అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజరాజేశ్వరి అమ్మవారి సేవలో.. నెల్లూరు(బృందావనం): నగరంలో కొలువైన రాజరాజేశ్వరి అమ్మవారిని రాష్ట్ర విపత్తుల స్పందన, అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ మురళీమోహన్ కుటుంబసమేతంగా శనివారం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ప్రధానార్చకుడు, వేదపండితులు, అర్చకులు ఆహ్వానించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆశీర్వచనాలను అందజేశారు. శేష వస్త్రాలను బహూకరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈఓ కోవూరు జనార్దన్రెడ్డి, ధర్మకర్తల మండలి చైర్మన్ ఏలూరు శిరీష తదితరులు పాల్గొన్నారు. పదిన జెడ్పీ సర్వసభ్య సమావేశం నెల్లూరు(పొగతోట): డీఆర్సీ మీటింగ్ను ఈ నెల పదో తేదీ ఉదయం పది గంటలకు నిర్వహించనున్న తరుణంలో, జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని జెడ్పీ సమావేశ మందిరంలో మధ్యాహ్నం 2.30 నుంచి నిర్వహించనున్నామని సీఈఓ శ్రీధర్రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాత అజెండా మేరకు సమావేశాన్ని నిర్వహించనున్నామని, జెడ్పీ సభ్యులు, ఆయా శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని కోరారు. ఆర్టీసీ బస్సులో గంజాయి అక్రమ రవాణా ● బిహార్ వాసులు ఇద్దరి అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): ఆర్టీసీ బస్సులో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న బిహార్ వాసులు ఇద్దర్ని ఎకై ్స జ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నెల్లూరు – 1 ఇన్స్పెక్టర్ రమేష్బాబు తన సిబ్బందితో కలిసి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం సమీపంలో వాహన తనిఖీలను శనివారం నిర్వహించారు. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో అనుమానాస్పదంగా ఉన్న బిహార్లోని శరణ్ జిల్లాకు చెందిన అనీష్కుమార్, అమిత్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. వీరి బ్యాగుల్లో 8.798 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుల ను ఎకై ్సజ్ స్టేషన్కు తరలించి విచారించారు. రాజమహేంద్రవరంలో గుర్తుతెలియని వ్యక్తుల వద్ద గంజాయిని కొనుగోలు చేసి తిరుపతిలో అధిక ధరలకు విక్రయించేందుకు తీసుకెళ్తున్నామని నిందితులు వెల్లడించారు. దీంతో వీరిని అరెస్ట్ చేశామని ఇన్స్పెక్టర్ తెలిపారు. ఎకై ్సజ్ ఎస్సై మురళీకృష్ణ, హెచ్సీలు కృష్ణయ్య, కానిస్టేబుళ్లు రఫీ, అజీజ్బాషా తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి శిలాతోరణం వద్దకు చేరుకుంది. స్వామివారిని 84,468 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 40,203 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.48 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 15 గంటల సమయం పడుతోంది. -
తవ్వుకో.. దోచుకో..!
● సర్వేపల్లిలో ఆగని గ్రావెల్ దందా ● నిద్రావస్థలో అధికారులు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ దందా విచ్చలవిడిగా సాగుతోంది. అక్రమ రవాణాకు సంబంధించి సోషల్ మీడియా, పత్రికల్లో నిత్యం కథనాలొస్తున్నా, అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో అంతా ఇష్టారాజ్యంగా సాగుతోంది. ప్రభుత్వ, పేదలకు పంచిన అసైన్మెంట్ భూములు, చెరువులు ఇలా దేన్నీ వదలకుండా రూ.కోట్ల విలువజేసే గ్రావెల్ సంపదను కొల్లగొడుతున్నారు. ఎర్ర నేల భూములపై కన్ను సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం, పొదలకూరు, ముత్తుకూరు మండలాల్లో ఎర్ర నేల భూములు అధికంగా ఉన్నాయి. వీటిని తవ్వితే వచ్చే గ్రావెల్, మట్టికి మంచి గిరాకీ ఉంది. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రావెల్ మాఫియా ఇక్కడ రెచ్చిపోతోంది. వాస్తవానికి భూగర్భ, గనుల శాఖ అనుమతులతో ప్రభుత్వానికి రాయల్టీని చెల్లించి, తవ్వకాలను జరపాల్సి ఉంది. అయితే సర్వేపల్లి ముఖ్యనేత అండదండలతో ఎలాంటి అనుమతుల్లేకుండానే తవ్వకాలను రేయింబవళ్లూ చేపడుతున్నారు. నిత్యం వందలాది టిప్పర్లలో తరలిస్తున్నారు. వీటిని నెల్లూరు నగరం చుట్టూ వెలిసే లేఅవుట్లకు పంపుతూ భారీ మొత్తంలో దోచుకుంటున్నారు. దందా ఇలా.. ● వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి, నాగంభొట్ల కండ్రిగ, శ్రీకాంత్కాలనీ, రామదాసుకండ్రిగ గ్రామాల్లోని ప్రభుత్వ, అటవీ పొరంబోకు, పేదలకు పంపిణీ చేసిన అసైన్మెంట్ భూముల్లో ఎలాంటి అనుమతుల్లేకపోయినా, గ్రావెల్ను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ● పొదలకూరు మండలంలోని మరుపూరు, ప్రభగిరిపట్నం, చిట్టేపల్లి తదితర గ్రామాల్లో టిప్పర్లలో రేయింబవళ్లూ రవాణా చేస్తున్నారు. ● ముత్తుకూరు మండలంలోని పలు గ్రామాల్లోనూ ఇదే పరిస్థతి నెలకొంది. దిక్కున్న చోట చెప్పుకోండి వెంకటాచలం మండలం రామదాసుకండ్రిగలో పేదలకు పంపిణీ చేసిన అసైన్మెంట్ భూముల్లో తవ్వకాలను శనివారం ప్రారంభించారు. ఈ గుంతుల్లో పడి తమ గేదెలు చనిపోతాయని, తమ గ్రామంలో గ్రావెల్ను తవ్వొద్దని స్థానికులు అడ్డుకునేందుకు యత్నించగా, తమకు అన్ని అనుమతులున్నాయంటూ వాగ్వాదానికి దిగారు. ఆపే ప్రసక్తే లేదని, దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరించడంతో చేసేదేమీలేక గ్రామస్తులు వెనుదిరిగారు. రామదాసుకండ్రిగలో యంత్రంతో తవ్వకాలు ఆఫీసర్ల మొద్దు నిద్ర సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ను అక్రమంగా తవ్వి దోపిడీకి పాల్పడుతున్నా, మొద్దు నిద్రను అధికారులు వీడటంలేదు. అదే సామాన్య రైతులు తమ పొలాల్లోకి మట్టిని తరలించుకోవాలంటే, అనుమతులను ఆఫీసర్లు ఇవ్వడం లేదు. ట్రాక్టర్ల ద్వారా పొలాలు, నివాసాల వద్దకు మట్టిని తరలించేందుకు యత్నిస్తుంటే, ఏఎమ్మార్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని, తమ సంస్థకు నగదు చెల్లించనిదే తవ్వకాలు చేయొద్దంటూ అడ్డుకుంటున్నారని రైతులు మండిపడుతున్నారు. అయితే సర్వేపల్లి ముఖ్యనేత అండతో ప్రభుత్వ భూముల్లో భారీ యంత్రాలతో గ్రావెల్ను తవ్వి టిప్పర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పగలు, రాత్రనే తేడా లేకుండా దందా కొనసాగుతున్నా, జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి కఠిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
భద్రతా ప్రమాణాలు పాటించాలి
నెల్లూరు (టౌన్): విద్యాసంస్థలకు చెందిన బస్సుల్లో భద్రతా ప్రమాణాలను పాటించాలని నెల్లూరు ఆర్టీఓ మదాని తెలిపారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యాసంస్థలకు చెందిన బస్సులను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బస్సుల్లో వీఎల్టీడీ, డ్యాష్బోర్డు కెమెరాలు అమర్చడం, 60 ఏళ్ల వయస్సు మించని, అనుభవం కలిగిన డ్రైవర్లను నియమించాలన్నారు. విద్యాసంస్థల యాజమాన్యాలు బ్రీత్ ఎనలైజర్లను ఏర్పాటు చేసుకోవాలని, రవాణాశాఖ చెక్లిస్టులో పేర్కొన్న భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 642 బస్సులను తనిఖీ చేసి ప్రమాణాలు సక్రమంగా లేని 337 బస్సులకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. బస్సులకు ఏటీఎస్ ద్వారా ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలని, లేకుంటే కేసులు నమోదు చేసి సీజ్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నెల్లూరు, కావలి రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. -
అవుట్సోర్సింగ్ ద్వారా 12,150 శాశ్వత ఉద్యోగాలు 13,580 ప్రత్యేక కేటగిరీల్లో 2640 వలంటీర్లు 12,793 ప్రైవేట్ రంగాల్లో 8600కుపైగా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఉద్యోగాలను కల్పించకపోగా, ఉన్న కొలువులనూ పీకుతూ టీడీపీ వికటాట్టహాసం చేస్తోంది. నిజానికి యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలను కల్పిస్తామని.. లేకపోతే వచ్చేంత వరకు నెలకు రూ.మూడు వేల నిరుద్యోగ భృతిని అందిస్తామంటూ నాడు ఆర్భాటంగా చంద్రబాబు ప్రకటించారు. అయితే ఇది నెరవేరకపోవడంతో యువత అయోమయానికి గురవుతోంది. సర్కార్ నుంచి స్పష్టమైన ప్రకటన నేటికీ రాకపోవడంతో జిల్లాలోని దాదాపు ఐదు లక్షల మంది ఆవేదనకు గురవుతున్నారు. అందరి ఆశలూ భృతిపైనే.. కూటమి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు రెండేళ్లవుతున్నా, నిరుద్యోగ భృతి ఊసే ఎత్తడంలేదు. డిగ్రీ, ఇంజినీరింగ్, ఇంటర్, పదో తరగతి అర్హతతో జిల్లాలోని ఎంతో మంది ఉద్యోగావకాశాల కోసం నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వ కొలువుల కోసం కష్టపడుతూనే.. ఇంటి వద్దే వ్యవసాయం చేసుకుంటున్న వారూ ఉన్నారు. మరికొందరు ఆర్థిక వెసులుబాటు లేక పట్టణాల్లో చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లభించక కాయకష్టంపైనే ఆధారపడిన వారి సంఖ్య కోకొల్లలు. అప్పులు చేస్తూ.. మెగా డీఎస్సీ ద్వారా జిల్లాలో దాదాపు 650 పోస్టులు మాత్రమే వచ్చాయి. ఒకవేళ నోటిఫికేషన్లు ఏమైనా వస్తే శిక్షణ పొందేందుకు రూ.వేలల్లో ఫీజులను చెల్లించాల్సి ఉంది. ఆర్థికంగా భారమైనా అప్పులు చేసి మరీ వీటిని పొందుతున్నారు. ఫీజులతో పాటు ప్రైవేట్ వసతిగృహాల్లో ఉండేందుకు ప్రతి నెలా రూ.ఆరు వేలకుపైగా ఖర్చవుతోంది. నిరుద్యోగ భృతి ఇస్తే వీరికి కొంత మేరకై నా వెసులుబాటు లభించే అవకాశం ఉంటుంది. గతంలో మాదిరిగా మోసం చేస్తారా..? గతంలో తరహాలో ప్రస్తుతం సైతం మోసం చేస్తారాననే అనుమానాలూ లేకపోలేదు. నిజానికి 2014 – 19 మధ్యలోనూ నిరుద్యోగ భృతి అంటూ చంద్రబాబు దగా చేశారు. అప్పట్లో నాలుగేళ్ల పాటు ఈ అంశంపై మౌనవ్రతం వహించారు. చివర్లో సవాలక్ష సాకులు చూపి కొద్ది మందికి కొన్ని నెలల పాటు రూ.రెండు వేలను వేశారు. ఏది ఏమైనా చంద్రబాబు మార్కు రాజకీయాలకు నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. జగనన్న హయాంలో సాఫీగా.. నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా గత సీఎం జగన్మోహన్రెడ్డి అడుగులేశారు. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్ (ఆప్కాస్)ను ఏర్పాటు చేసి ఎంతో పారదర్శకంగా ఉద్యోగావశాకాలను కల్పించారు. శాశ్వతంగా.. ప్రత్యేక కేటగిరీల్లో.. ప్రైవేట్ రంగాల్లో.. వలంటీర్లు.. సచివాలయాలు.. ఇలా ఎంతో మందికి ఉపాధి కల్పించి వారి కళ్లల్లో వెలుగులు నింపారు. అయితే ఆయనకు మంచి పేరు రావడాన్ని సహించలేని కూటమి సర్కార్ నాడు ఏర్పాటు చేసిన సంస్కరణలకు చరమగీతం పాడి యువతకు శోకాన్ని మిగిల్చింది. ఉపాధి లేదు.. భృతీ రాదు బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ అంటూ గత ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ హామీలను టీడీపీ ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది. ఇందులో ప్రథమ వాగ్దానం ఉద్యోగాల కల్పన. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు.. లేకపోతే వచ్చేంత వరకు నెలకు రూ.మూడు వేల నిరుద్యోగ భృతిని అందిస్తామంటూ జిల్లాలోని నెల్లూరు, కావలి ఉదయగిరి సభల్లో అప్పటి ప్రతిపక్ష నేత.. ప్రస్తుత సీఎం చంద్రబాబు ఊకదంపుడు ఉపన్యానాలు చేశారు. ఆయన వ్యవహార శైలిపై అనేక అపోహలున్నా, ఈసారైనా మారుతారేమోననే భావనతో సైకిల్ పార్టీకి యువత ఓట్లేసి పట్టం కట్టారు. ఇంకేముంది.. విజయం సాధించి ఈ నెల 12తో రెండేళ్లు పూర్తవుతున్నా, నిరుద్యోగులకు ఆయన రిక్తహస్తం చూపుతున్నారు. ఈ క్రమంలో ఉపాధి రాక.. భృతీ అందక జిల్లాలోని ఎంతో మంది అల్లాడుతున్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకు రూ.మూడు వేలిస్తామని హామీ నమ్మి ఓట్లేసినందుకు దగా రెండేళ్లవుతున్నా, దీనిపై ప్రకటన చేయని సర్కార్ జిల్లాలో గంపెడాశలతో నిరీక్షిస్తున్న ఎంతో మంది వైఎస్సార్సీపీ హయాంలో లభించిన కొలువులు జిల్లాలో ఇలా.. కుటుంబాలు – దాదాపు 7.2 లక్షలు నిరుద్యోగులు – ఐదు లక్షలకుపైగా -
వెన్నుపోటు చంద్రబాబుకు కొత్తకాదు
● ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వం ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పొదలకూరు: వెన్నుపోటు పొడవడం సీఎం చంద్రబాబుకు కొత్తకాదని.. ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటి ప్రజల వరకు ఆయన పోటుకు బలైన వారేనని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాన్ని పట్టణంలోని సంగం రోడ్డు సెంటర్లో గల కాకాణి రమణారెడ్డి విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి శుక్రవారం ఆయన నిర్వహించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీల ప్రతులను దహనం చేశారు. సంగం రోడ్డు సెంటర్ నుంచి పంచాయతీ బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీని జరిపారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. అసెంబ్లీలో మూడు బడ్జెట్లను చంద్రబాబు ప్రవేశపెట్టినా, ఏ హామీనీ నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. గతంలో ఎన్టీఆర్కు ఏ విధంగా వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారో.. అదే తరహాలో ప్రజలకు అబద్ధపు హామీలిచ్చి పాలనను సాగిస్తున్నారని మండిపడ్డారు. సూపర్ సిక్స్ను పూర్తిగా విస్మరించారని, ఆడబిడ్డ నిధి ద్వారా రెండేళ్లలో ఒక్కో మహిళకు రూ.36 వేల మేర బాకీ పడ్డారని విమర్శించారు. మరోవైపు సూపర్ సిక్స్.. హిట్ అంటూ సభలు, సమావేశాలను పెడుతున్నారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణంలో కొర్రీలు, గ్యాస్ సిలిండర్ల హామీలో నాలుక మడతపెట్టడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. కౌలు రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి, అన్నదాత సుఖీభవలో ఏడు లక్షల మంది అన్నదాతల పేర్లను తొలగించారని ఆరోపించారు. 50 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ పింఛన్ను ఇస్తానని చెప్పి మోసం చేశారని, మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీగా మార్చారని ధ్వజమెత్తారు. దీనిపై ఎవరైనా మాట్లాడితే కేసులు పెట్టమని చెప్పి హిట్లర్ను తలపిస్తున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధిపై సవాల్కు జవాబేదీ..? పొదలకూరు మండలాభివృద్ధిపై సోమిరెడ్డి చేసిన సవాల్కు ప్రతి సవాల్ చేస్తే ఇప్పటి వరకు జవాబు లేదని విరుచుకుపడ్డారు. తన చోటా నేతలను పంపి ఇరిగేషన్లో జరిగిన అవినీతిని కప్పిపుచ్చేందుకు యత్నిస్తే కుదరదని, సోమిరెడ్డే చర్చకు రావాలని డిమాండ్ చేశారు. పొదలకూరు బస్టాండ్లో ప్రయాణికులు, బస్సులు నడుస్తున్న రోడ్డు మొదలుకొని గ్రామాల్లో జరిగిన పనులపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఇరిగేషన్ అధికారులు త్వరలో అన్ని రకాల విచారణలను ఎదుర్కోక తప్పదని చెప్పారు. సోమిరెడ్డి చెప్పిన విధంగా వ్యవహరించిన అధికారులు ఇప్పుడు డబ్బుల కట్టలను లెక్క పెట్టుకుంటున్నారని, భవిష్యత్తులో ఊచలు లెక్కపెట్టుకోవాల్సి వస్తుందని తెలిపారు. ప్రతి గ్రామానికీ ఇద్దరం వెళ్లి.. ఎవరి హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో తేల్చుకుందామని సవాల్ విసిరారు. సోమిరెడ్డి హయాంలో తిప్పలు కరిగిపోతున్నాయని, లేఅవుట్ల యజమానుల వద్ద వసూలు చేసుకుంటూ ప్రభుత్వ స్థలాలను దోచుకుంటున్నారని ఆరోపించారు. కనుపూరు కాలువ పనులను మనుషులతో చేయించాలని, అయితే సోమిరెడ్డి మాత్రం రూ.పది లక్షల వంతున బిట్లుగా మార్చి మెషీన్లతో చేయించి స్వాహా చేశారని విమర్శించారు. నేతలు గోగిరెడ్డి గోపాల్రెడ్డి, బచ్చల సురేష్కుమార్రెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, తెనాలి నిర్మలమ్మ, లక్ష్మీకల్యాణి, షాకీరాబేగం, వాకాటి శ్రీనివాసులురెడ్డి, చిల్లకూరు వెంకురెడ్డి, వేణుగోపాల్రెడ్డి, రావుల ఇంద్రసేన్గౌడ్, హరిశ్చంద్రారెడ్డి, శ్రీనివాసులు, అంజద్, లచ్చారెడ్డి, దయాకర్రెడ్డి, రామిరెడ్డి, శ్రీనివాసులురెడ్డి, బాలకొండారెడ్డి, రమణారెడ్డి, పెంచలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉలవపాళ్లలో శ్మశాన భూమిపై సర్వే
దగదర్తి: ఉలవపాళ్లలో దళితుల శ్మశాన భూమిని కొందరు ఆక్రమించేందుకు యత్నించిన నేపథ్యంలో సర్వేను రెవెన్యూ అధికారులు శుక్రవారం నిర్వహించారు. వివాదాస్పద భూమి హద్దులను పరిశీలించారు. దళితుల శ్మశాన భూమి ఆక్రమణకు యత్నం అనే శీర్షికన సాక్షిలో కథనం గురువారం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా దళితులు మాట్లాడారు. గ్రామంలోని కొందరు వ్యక్తులు తమ స్వలాభం కోసం శ్మశాన భూమిని కబ్జాదారులకు అప్పగించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. తామంతా ఏకమై అడ్డుకోవడంతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. రెవెన్యూ అధికారుల సహకారంతో కొందరు వ్యక్తులు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సర్వే వివరాలను తహసీల్దార్కు నివేదిక రూపంలో అందజేయనున్నామని అధికారులు తెలిపారు. -
9న వీఎస్యూ స్నాతకోత్సవ వేడుకలు
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ 10, 11, 12వ స్నాతకోత్సవ వేడుకలను నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల తొమ్మిదిన నిర్వహించనున్నామని వీసీ అల్లం శ్రీనివాసరావు చెప్పారు. కాకుటూరు సమీపంలోని వర్సిటీలో విలేకరుల సమావేశంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిఽథిగా హాజరై, విద్యార్థులకు పట్టాలు, స్వర్ణ పతకాలను అందజేయనున్నారని వివరించారు. స్నాతకోత్సవానికి సంబంధించి 6017 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో డిగ్రీ కోర్సుల నుంచి 4921 మంది.. పీజీ అండ్ ప్రొఫెషనల్ కోర్సుల నుంచి 1075 మంది.. 21 మంది పరిశోధక విద్యార్థులు పీహెచ్డీ పట్టాలను అందుకోనున్నారని తెలిపారు. పీజీ విద్యార్థుల్లో సైన్స్ విభాగం నుంచి 331.. ఆర్ట్స్ నుంచి 37.. కామర్స్ అండ్ మేనేజ్మెంట్ నుంచి 67 మంది పట్టాలను స్వీకరించనున్నారని పేర్కొన్నా రు. వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన క్రీడాకారులు, విద్యార్థులకు కలిపి మొత్తం 45 స్వర్ణ పతకాలను గవర్నర్ చేతుల మీదుగా అందజేయనున్నామని తెలిపారు. దేశానికి సేవలందించిన ముగ్గురు ప్రముఖులకు వీఎస్యూ తరఫున ప్రతిష్టాత్మక గౌరవ డాక్టరేట్ పురస్కారాలను అందజేయనున్నామని వెల్లడించారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ సునీత, వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ విజయ, పరీక్షల విభాగ డీన్ వెంకట్రాయులు, పరీక్షల నిర్వహణాధికారి మధుమతి తదితరులు పాల్గొన్నారు. -
పర్యావరణ పరిరక్షణతోనే మనుగడ
నెల్లూరు(అర్బన్): పర్యావరణాన్ని కాపాడుకుంటేనే జీవరాశుల మనుగడ సజావుగా సాగుతుందని, లేని పక్షంలో అనర్థాలు తప్పవని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వీఆర్సీ గ్రౌండ్స్ నుంచి మద్రాస్ బస్టాండ్ వరకు హరిత ర్యాలీని జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. డప్పుల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించడంతో పాటు చెట్లను పెంచాలని పిలుపునిచ్చారు. వివిధ పాఠశాలల విద్యార్థులకు ఇటీవల నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. కాలుష్య నియంత్రణ బోర్డు ఈఈ అశోక్కుమార్, కమిషనర్ నందన్ తదితరులు పాల్గొన్నారు. జూనియర్ కళాశాలల పునఃప్రారంభం నేడు నెల్లూరు (టౌన్): వేసవి సెలవుల అనంతరం జూనియర్ కళాశాలలను శనివారం పునఃప్రారంభించనున్నారు. దీంతో విద్యార్థులు కాలేజీల బాట పట్టనున్నారు. కాగా శని, ఆదివారాలు రావడంతో జిల్లాలోని మెజార్టీ కళాశాలలను సోమవారం ప్రారంభించే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఉచిత ప్రవేశానికి ఫీజులు వసూలు చేస్తే చర్యలు నెల్లూరు (టౌన్): జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో 12 (1సీ) కింద ఒకటో తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని డీఈఓ బాలాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉచిత ప్రవేశం కల్పించిన విద్యార్థులందరికీ ఆయా పాఠశాలల్లో ఆడ్మిషన్ను తప్పక ఇవ్వాలని ఆదేశించారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 75,691 మంది గురువారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 39,050 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.16 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.


