breaking news
SPSR Nellore District News
-
పగాకుగా మారిన పొగాకు
ఒకప్పుడు బంగారు పంటగా రైతు ఇంట్లో సిరులు నింపిన పొగాకు.. ఇప్పుడు అదే కర్షకులకు కన్నీళ్ల వేదనగా మారింది. లక్షలాది రూపాయలను పెట్టుబడిగా పెట్టి, నెలల తరబడి చెమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ప్రతి కిలోపై నష్టాన్ని మూటగట్టుకుంటున్నారు. ఉత్పత్తి వ్యయం సైతం తిరిగి రాని పరిస్థితుల్లో వేలాది బేళ్లు కొనుగోలుకు నోచుకోకుండా కేంద్రాల్లోనే పేరుకుపోతున్నాయి. అప్పులు తీర్చే దారి కనిపించక, వడ్డీ భారం రోజురోజుకూ పెరుగుతుండటంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. గిట్టుబాటు ధర, వేగవంతమైన కొనుగోళ్లపై డిమాండ్లు కొనసాగుతున్నా, ఆశించిన స్థాయిలో మార్పు కానరావడంలేదు. ఖర్చులు అమాంతం పెరిగి, ధరలు కుప్పకూలిపోవడంతో వీరిలో ఆవేదన వ్యక్తమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే సీజన్లో పొగాకు సాగుకే దూరమయ్యే ప్రమాదం పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మర్రిపాడు: ఒకప్పుడు రైతుకు బంగారు భవిష్యత్తు చూపిన పొగాకు సాగు ఇప్పుడు అప్పుల ఊబిలోకి నెడుతోంది. పెట్టుబడులు పెరిగినా.. దిగుబడులు బాగున్నా.. గిట్టుబాటు ధరల్లేక కర్షకులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. కిలోకు కనీసం రూ.350 కల్పించాలని ఫార్మర్స్, రైతు సంఘాలు నెలలుగా ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు చేపట్టినా, పరిస్థితిలో ఎలాంటి మార్పూ కానరావడంలేదు. వేలం కేంద్రాల్లో కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో వేలాది బేళ్లు రోజుల తరబడి పేరుకుపోతున్నాయి. ఆశించిన స్థాయిలో పర్చేజెస్ను సంస్థలు చేపట్టకపోవడంతో నోబిడ్ బేళ్ల సంఖ్యా పెరుగుతోంది. ఫలితంగా వీటిని నిల్వ చేయడం, వేలానికి మరోసారి తీసుకురావడంతో అదనపు భారాన్ని భరించాల్సి వస్తోంది. మంగళవారం నాటికి కేంద్రానికి 34,228 బేళ్లు రాగా, అందులో 26,972ను మాత్రమే కొనుగోలు చేశారు. నోసేల్గా ఐదు, నోబిడ్గా 5241, ఆర్ఆర్గా 541, సీఆర్ కింద 1012 నిలిచిపోయాయి. ఇలా మొత్తం 6799 విక్రయానికి నోచుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పెట్టుబడేమో ఘనం.. ధరేమో శూన్యం పొగాకు సాగు వ్యయం ఏటా పెరుగుతూనే ఉంది. నారు తయారీ మొదలుకొని చివరి దశ వరకు ఎరువులు, పురుగుమందులు, కూలీల వేతనాలు, నీటి ఖర్చులు, రవాణా, బ్యారెన్ నిర్వహణ, క్యూరింగ్కు అవసరమైన ఇంధనం.. ఇలా అన్ని వ్యయాలు భారీగా పెరిగాయి. కిలో పొగాకు ఉత్పత్తికి ప్రస్తుతం సుమారు రూ.250 వరకు ఖర్చవుతోంది. అయితే వేలంలో సగటు ధర రూ.196.16గానే నమోదవుతోంది. ప్రభుత్వం అదనంగా రూ.20ను ప్రోత్సాహకంగా ఇచ్చినా, రైతు చేతికి చేరేది సుమారు రూ.216 మాత్రమే. అంటే ప్రతి కిలోపై రూ.30 నుంచి రూ.40 వరకు నష్టపోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఒక్కో బ్యారెన్పై రూ.మూడు లక్షల నుంచి రూ.నాలుగు లక్షల వరకు నష్టం తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలం కేంద్రంలో ఇప్పటి వరకు 37,52,475.30 కిలోల పొగాకును విక్రయించగా.. రూ.81,33,96,170.60 వ్యాపారం జరిగింది. కిలోకు గరిష్టంగా రూ.250.. కనిష్టంగా రూ.160 మాత్రమే లభించింది. ఈ రేట్లు ఉత్పత్తి వ్యయానికి ఏ మాత్రం సరిపోవడంలేదని రైతులు పేర్కొంటున్నారు. ధర్నాలు చేపట్టినా స్పందనేదీ..? వేలం కేంద్రాల వద్ద ధర్నాలను రైతులు, రైతు సంఘాల నేతలు కొద్ది వారాలుగా చేపట్టారు. కిలోకు కనీసం రూ.350 వచ్చేలా చర్యలు చేపట్టడం, కొనుగోలు సంస్థలపై పొగాకు బోర్డు ఒత్తిడి తీసుకురావడం, నోబిడ్ సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయినా ఆశించిన మార్పు లేకపోవడం గమనార్హం. అప్పుల ఊబిలో.. పొగాకు సాగు కోసం బ్యాంకులు, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసిన రైతులు ఇప్పుడు వాటినెలా తీర్చాలనే ఆందోళనలో ఉన్నారు. వేలం ఆలస్యం కావడంతో వడ్డీ భారం రోజురోజుకూ పెరుగుతోందని పేర్కొంటున్నారు. పరిస్థితి ఇదే తరహాలో కొనసాగితే వచ్చే ఏడాది పొగాకు సాగుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రేట్ల కోసం ఉద్యమించినా.. దక్కని గిట్టుబాటు కనీసంగా రూ.350 ఇవ్వాలనే డిమాండ్ బుట్టదాఖలు సగటు ధర రూ.196.16కే పరిమితం పెరిగిన సాగు వ్యయం.. మందగించిన కొనుగోళ్లు ఆక్షన్ కేంద్రాల్లో పేరుకుపోతున్న బేళ్లు -
భవనం పైనుంచి దూకిన మహిళ
● ఆర్థిక ఇబ్బందులే కారణం ● సకాలంలో రాని 108 ● ప్రైవేట్ అంబులెన్స్లో ఆస్పత్రికి తరలింపునెల్లూరు(క్రైమ్): ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఓ మహిళ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నెల్లూరులోని కొత్తహాల్ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి రాజేంద్రనగర్ సత్యనారాయణపురంలో టి.పుష్పలత, శివయ్య దంపతులు నివాసముంటున్నారు. వారికి ఇద్దరు కుమారులున్నారు. దంపతులు స్థానికంగా ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ఈ క్రమంలో నెల్లూరు ముత్తుకూరురోడ్డులోని ఓ ల్యాండ్ మీడియేటింగ్ పనుల నిమిత్తం వారు సుమా రు పదిరోజుల క్రితం నెల్లూరుకు వచ్చి ఓ లాడ్జిలో ఉంటున్నారు. మంగళవారం దంపతులు రాజరాజేశ్వరి ఆలయానికి వెళ్లారు. శివయ్యకు ఫోన్ రావడంతో పక్క కు వెళ్లి తిరిగొచ్చి చూడగా భార్య కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికాడు. పుష్పలత కొత్తహాల్ ఎదురుగా ఉన్న నాలుగంతస్తుల భవనం పైనుంచి కిందకు దూకడంతో రెండు కాళ్లు విరిగి తీవ్ర రక్తసావ్రమైంది. సమీపంలో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఏఎస్సై ఉమమహేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని సంతపేట పోలీసులకు సమాచారం అందించారు. 108 రాకపోవడంతో.. స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చినప్పటికి సకాలంలో రాకపోవడంతో బాధితురాలిని ప్రైవేట్ అంబులెన్స్లో చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. సంతపేట ఎస్సై బాలకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్షతగాత్రురాలి బ్యాగ్లో లభ్యమైన ఫోన్ నంబర్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి చేరుకున్న శివయ్య భార్యను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు. -
స్థానిక యువకులే హంతకులు
● హత్య కేసును ఛేదించిన పోలీసులు గూడూరు: యువకుడి హత్యను పోలీసులు ఛేదించారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. మంగళవారం గూ డూరు ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో గూడూరు రూరల్ సీఐ కిశోర్బాబు వివరాలు వెల్లడించారు. రూరల్ పరిధిలోని విందూరు గ్రామానికి చెందిన షేక్ షాహుల్ సెంట్రింగ్ పనులు చేసుకుంటూ అన్న ఇంట్లో ఉండేవాడు. అతడికి మద్యం అలవాటు ఉంది. తాగిన సమయంలో గ్రామస్తులను అసభ్యంగా దూషించేవాడు. దుస్తులు విప్పి రోడ్లపై తిరిగేవాడు. గత నెల 31వ తేదీన మద్యం తాగి ఒకచోట కూర్చొని ఉండగా గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు వెళ్లారు. మద్యం తాగుదా మని షాహుల్ను పిలిచారు. అతను వారితో వెళ్లగా అందరూ గ్రామంలోని పాఠశాల మిద్దైపెకి చేరి మద్యం తాగారు. మత్తులో షాహుల్ కులం పేరుతో వారిని దూషించడంతో వివాదం నెలకొంది. ఈ క్రమంలో షాహుల్ను దారా మహేంద్ర, పోలిపాటి కామేష్, కాకి వెంకటేశ్వర్లు బాగా కొట్టి అతని గొంతు, తర్వాత మర్మాంగాన్ని కోశారు. సాంకేతికత ఆధారంగా నిందితులను పట్టుకున్నారు. కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఒకటో, రెండో పట్టణ సీఐలు శేఖర్బాబు, మాలకొండయ్య, ఎస్సైలు మనోజ్కుమార్, సురేష్బాబు, తిరుపతయ్య పాల్గొన్నారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి రూ.వెయ్యి కోట్లను కేటాయించి పొగాకును కొనుగోలు చేయాలి. గిట్టుబాటు ధరల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజులుగా ఆందోళనలు చేస్తున్నా, ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 2020లో రూ.250 కోట్లతో 13 మిలియన్ కిలోల పొగాకును ఏపీ మార్క్ఫెడ్ ద్వారా అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి కొనుగోలు చేయించి ఆదుకున్నారు. – పూసాల అక్కపునాయుడు, రావులకొల్లు, కలిగిరి మండలం -
విద్యుత్ కోత.. అన్నదాతల ఆగ్రహం
● బోర్లకు సరఫరా నిలిపివేత ● సబ్స్టేషన్ను ముట్టడించిన రైతులుదగదర్తి: మండలంలోని కావలి కాలువ ఆయకట్టు పరిధిలో పంటలు సాగు చేస్తున్న రైతులు వినియోగిస్తున్న బోర్లకు అధికారులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో అన్నదాతలు కన్నెర్ర చేశారు. మంగళవారం కాట్రాయపాడు సబ్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించి అధికారులను నిలదీశారు. ఏం జరిగిందంటే.. ధర్మవరం, లింగాలపాడు, కాట్రాయపాడు, చెన్నూ రు, సిద్ధారెడ్డిపాళెం, బోడగుడిపాడు గ్రామాల పరిధిలోని రైతులు కావలి కాలువ కింద విద్యుత్ మోటార్లు, బోర్ల సహాయంతో సుమారు 5 వేల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పంట వెన్నుపొట్ట దశలో ఉంది. సోమవారం రాత్రి కావలి కాలువ పరిధిలో మూడు ఫేజ్ల విద్యుత్ సరఫరాను ఎలాంటి సమాచారం లేకుండా అధికారులు నిలిపివేశారు. దీంతో పంటలకు సాగునీరు అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఆగ్రహించిన రైతులు కాట్రాయపాడు సబ్స్టేషన్ను ముట్టడించి వెంటనే సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. తీవ్ర నష్టం ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇవ్వడంతోనే వరి సాగు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం పంట కీలకమైన వెన్నుపొట్ట దశలో ఉండగా విద్యుత్ నిలిపివేయడంతో తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే జోక్యం చేసుకుని విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. కావలి కాలువ చరిత్రలో ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ నిలిపివేయడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. మీదే బాధ్యత తమ పంటలు ఎండిపోతుంటే అధికారులు నిర్లక్ష్యంగా సమాధానాలు చెబుతున్నారని ఆగ్రహించిన రైతులు సబ్స్టేషన్లోకి దూసుకెళ్లారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి రైతులను శాంతింపజేశారు. అనంతరం ఏఈ, ఏడీఈ సబ్స్టేషన్కు చేరుకుని ఎస్సై మహేంద్ర సమక్షంలో రైతులతో మాట్లాడారు. కలెక్టర్, ఎస్ఈ ఆదేశాల మేరకే విద్యుత్ సరఫరా నిలిపివేశామని, దానిని పునరుద్ధరించే అధికారం తమ పరిధిలో లేదని తేల్చి చెప్పారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా కాలువ మోటార్లతోపాటు బోర్లకు కూడా విద్యుత్ ఎందుకు నిలిపివేశారని అన్నదాతలు ప్రశ్నించగా అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. పంటకు నష్టం జరిగితే అధికారులు బాధ్యత వహించాలని, సాగునీరు అందే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని రైతులు హెచ్చరించారు. -
కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
● కోట గురుకులాన్ని కొనసాగించాలని డిమాండ్నెల్లూరు(అర్బన్): కూటమి ప్రభుత్వం మండల కేంద్రమైన కోటలో మూసేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ గురుకుల పాఠశాలను కొనసాగించాలంటూ ఇన్సాఫ్ స్టూడెంట్ ఫెడరేషన్ (ఐఎస్ఎఫ్) డిమాండ్ చేసింది. గురుకులాన్ని పునఃప్రారంభించాలని కోరుతూ మంగళవారం ఆ సంఘం నేతలు, పలువురు విద్యార్థులు నెల్లూరులోని కలెక్టరేట్ను ముట్టడించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా కార్యదర్శి సురేష్రెడ్డి మాట్లాడుతూ 600 మంది చదువుతున్న గురుకుల పాఠశాలను టీడీపీ ప్రభుత్వం మూసేయడం దారుణమన్నారు. బలవంతంగా లాగేసి.. ధర్నా సందర్భంగా నేతలు, విద్యార్థులు ఉన్నతాధికారులకు వినతిపత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్లోకి ప్రవేశించబోయారు. దీంతో పోలీసులు గేట్లు మూసేసి అడ్డుకున్నారు. పలువురు గేట్లు నెట్టుకుని ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు విద్యార్థులను బలవంతంగా లాగేసి వాహనాల్లో ఎక్కించేందుకు ప్రయత్నించడంతో వారు కొంతసేపు ప్రతిఘటించారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కొంతమంది విద్యార్థులు తమను పోలీసులు కొట్టారంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పలువురు ఆందోళనకారులను చిన్నబజారు పోలీస్స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో శ్రీనివాసులు, రాజా తదితరులు పాల్గొన్నారు. -
సీబీఐ విచారణ జరిపించాలి
నెల్లూరు రూరల్: డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. చిల్డ్రన్స్ పార్కు సమీపంలోని శ్రీ కన్వెన్షన్ సమావేశ మందిరంలో యువత, డీఎస్సీ అభ్యర్థులతో మంగళవారం నిర్వహించిన టౌన్ హాల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మెగా డీఎస్సీలో జరిగిన అవినీతి, అక్రమాలకు బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి పదవికి లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని పేర్కొన్నారు. డీఎస్సీ అభ్యర్థులను వంచించి పోస్టులకు అమ్ముకొని, నిరుద్యోగుల జీవితాలను రోడ్డుపైకి ఈడ్చారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి హామీని నేటికీ నెరవేర్చకుండా మోసం చేశారని మండిపడ్డారు. ప్రశ్నపత్రాల తయారీ, అప్లోడింగ్, డిజిటల్ నిర్వహణ వంటి అత్యంత రహస్యమైన విధులను అవుట్సోర్సింగ్ ఉద్యోగి చేతుల్లో పెట్టి లీకేజీకి అవకాశం కల్పించారని విమర్శించారు. న్యాయం జరిగేంత వరకూ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. -
మాజీ స్నేహితుడే యముడు
● కర్రతో కొట్టి మహిళ హత్యనెల్లూరు(క్రైమ్): వివాహేతర సంబంధం కొనసాగించేందుకు నిరాకరించిన మహిళను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. పోలీసుల కథనం మేరకు.. పొదలకూరు మండలం బిరదవోలు గ్రామానికి చెందిన ఎం.వెన్నెల (25)కు భర్త, పిల్లలున్నారు. పిల్లలు నెల్లూరు రూరల్ మండలం మట్టెంపాడులో ఆమె తల్లి మంగమ్మ వద్ద ఉంటున్నారు. వెన్నెలకు గతంలో మట్టెంపాడుకు చెందిన కాకుమూరు శ్రీహరితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు మందలించడంతో పద్ధతి మార్చుకుంది. అప్పట్నుంచి శ్రీహరి తిరిగి సంబంధాన్ని కొనసాగించాలని ఆమైపె ఒత్తిడి తెచ్చాడు. ఈక్రమంలో సోమవారం రాత్రి పిల్లలను చూసి వస్తానని భర్తకు చెప్పి మట్టెంపాడుకు వచ్చిన ఆమె తల్లి వద్దకు వెళ్లలేదు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు వెన్నెల కోసం గాలించారు. బంధువులు తేజ, వెంకటకృష్ణ మంగళవారం తెల్లవారుజామున నెల్లూరు – పొదలకూరు రహదారిలోని ఎంఎస్ఎంఈ పార్కు సమీపంలో వెతుకుతుండగా మహిళ కేకలు వినిపించడంతో అక్కడికి వెళ్లి చూశారు. శ్రీహరి కర్రతో వెన్నెల తలపై దాడి చేస్తున్నాడు. వారిని గమనించిన నిందితుడు బైక్పై పరారయ్యాడు. వారు ఆమె వద్దకు చేరుకుని పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. మంగమ్మ నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ డీఎస్పీ జి.శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్ జి.వేణు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
మధ్యవర్తిత్వంతో పెండింగ్ కేసుల పరిష్కారం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ నెల్లూరు(లీగల్): మధ్యవర్తిత్వం ద్వారా వివిధ కోర్టుల్లోని పెండింగ్ కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి.శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలోని సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యవర్తిత్వ అవగాహన ర్యాలీని శ్రీనివాస్ ప్రారంభించి మాట్లాడారు. మధ్యవర్తిత్వ రాజీ మార్గాన్ని 2005లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రారంభించారని, ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా విజయవంతంగా నడుస్తోందని తెలిపారు. ర్యాలీ మద్రాస్ బస్టాండ్, మార్కెట్ వరకు సాగింది. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు ఆర్.శరత్బాబు, జి.గీత, పీజే.సుధ, శుభవాణి, షేక్.జానీబాషా, నిఖిత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వైజే పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
బెల్టు షాపుపై దాడులు
ఉదయగిరి రూరల్: మండలంలోని గండిపాళెం గ్రామంలో అనధికారికంగా నిర్వహిస్తున్న మద్యం బెల్టు షాపుపై ఉదయగిరి ఇన్చార్జి ఎకై ్స జ్ సీఐ దీప్తి కరంత్ సిబ్బందితో కలిసి మంగళవారం దాడులు నిర్వహించారు. 12 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నట్లు ఆమె తెలిపారు. సర్కిల్ పరిధిలోని గ్రామాల్లో ఎవరైనా అనధికారికంగా మద్యం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గొంతు కోసుకున్న వ్యక్తి క్షేమం గూడూరు: పట్టణంలోని టవర్ క్లాక్ వద్ద అందరూ చూస్తుండగా మద్యం మత్తులో గొంతు కోసుకున్న వ్యక్తి క్షేమంగా ఉన్నట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. వారి కథనం మేరకు.. పశ్చిమ బెంగాల్కు చెందిన అజయ్ అనే వ్యక్తి పనుల నిమిత్తం గూడూరుకు వచ్చాడు. అతను పూర్తి వివరాలు వెల్లడించలేని స్థితిలో ఉన్నాడు. నెల్లూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కోలుకున్న తర్వాత వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇస్తామని పోలీసులు తెలిపారు. 14 ద్విచక్ర వాహనాల స్వాధీనం నెల్లూరు(క్రైమ్): నెల్లూరు సుందరయ్యకాలనీ సీ బ్లాక్లో మంగళవారం రాత్రి వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎవరెవరు ఉంటున్నారు?, ఏం చేస్తుంటారు? తదితర వివరాలను సేకరించారు. పత్రాలు సక్రమంగా లేని 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. రోడ్డు భద్రత నియమాలు, సైబర్ నేరాలు, శక్తి యాప్, ఎల్హెచ్ఎంస్ సేవలు తదితరాలపై ప్రజలకు అవగాహన క ల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలను గుర్తిస్తే డయల్ 112 లేదా పోలీస్స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. ఎస్సై ప్రసాద్రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
నైతిక విలువలుంటే లోకేశ్ రాజీనామా చేయాలి
● డీఎస్సీలో అవకతవకలకు బాధ్యత వహించాలి ● పరీక్షల వ్యవస్థలో పనిచేసిన వ్యక్తికి టాప్ ర్యాంక్ ● ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పొదలకూరు: డీఎస్సీలో అవకతవకలు జరిగాయని, నైతిక విలువలుంటే విద్యాశాఖ మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. సర్వేపల్లి నియోజకవర్గ స్థాయిలో టౌన్హాల్ సమావేశాన్ని పొదలకూరులోని ఎమ్మార్ కల్యాణ మండపంలో పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై అవగాహన కల్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. పారదర్శకతను పాతిపెట్టారని, పరీక్షల వ్యవస్థలో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగికి టాప్ ర్యాంక్ రావడాన్ని చూస్తే స్కామ్ ఎంత పెద్ద స్థాయిలో జరిగిందో అర్థమవుతోందని చెప్పారు. నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోందని మండిపడ్డారు. పరీక్ష నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగియని, రాజీనామా చేయాలని లోకేశ్ను డిమాండ్ చేస్తే స్పందించడంలేదని విమర్శించారు. డీఎస్సీ కన్వీనర్ను సర్కార్ ఉద్దేశపూర్వకంగా పక్కనబెట్టి, ప్రశ్నపత్రాల తయారీ నుంచి నిర్వహణ బాధ్యత మొత్తాన్ని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్కు అప్పగించి, అక్రమాలకు శ్రీకారం చుట్టిందని మండిపడ్డారు. నిర్వహణ వ్యవస్థలో పనిచేసిన నవీన్ అనే అవుట్సోర్సింగ్ ఉద్యోగి సోషల్ స్టడీస్లో కృష్ణా జిల్లా టాపర్గా.. టీజీటీ తెలుగులో ఆరో ర్యాంక్ను సాధించడం సాధారణ విషయంకాదన్నారు. స్పోర్ట్స్ కోటా పేరిట నిరుద్యోగుల పొట్టకొట్టారని విమర్శించారు. రూ.20 లక్షల చొప్పున బేరం కుదుర్చుకొని ఉద్యోగ నియామకాల్లో తీవ్ర అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అధికారులు సైతం దందాను యథేచ్ఛగా కొనసాగించారని, ఇందులో దళారుల పాత్రా ఉందని తెలిపారు. క్రీడల్లో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్స్ను సాధించిన ప్రతిభావంతులను పక్కనబెట్టి, పాల్గొన్న వ్యక్తులకు ఉద్యోగాలిచ్చారని వివరించారు. ఏ హామీనీ నెరవేర్చలేదని, బూటకపు వాగ్దానాలతో కాలం గడుపుతోందని దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఇప్పటికీ చెల్లించలేదన్నారు. జీఓల మార్పుతో గందరగోళం డీఎస్సీ నియామకాల్లో జీఓల మార్పుతో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితారెడ్డి విమర్శించారు. స్పోర్ట్స్ కోటాను రెండు నుంచి మూడు శాతానికి పెంచుతూ.. జీఓ నంబర్లు 4, 47ను తీసుకొచ్చారని తెలిపారు. పోస్టులు భర్తీకాగానే వాటిని రద్దు చేసి జీఓ నంబర్ 56ను జారీ చేశారని మండిపడ్డారు. ఇవి సరైనవే అయితే ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ నేతలు చిల్లకూరు సుధీర్రెడ్డి, గోగిరెడ్డి గోపాల్రెడ్డి, పెదమల్లు రమణారెడ్డి, బచ్చల సురేష్కుమార్రెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, అంజద్, దాసరి భాస్కర్గౌడ్, ఆదూరు వెంకటసుబ్బయ్య, వెంకటశేషయ్య, శంకరయ్యగౌడ్, చంద్రశేఖర్రెడ్డి, మెట్టా విష్ణువర్ధన్రెడ్డి, రావుల ఇంద్రసేన్గౌడ్, కృష్ణవేణి, కోనం బ్రహ్మయ్య, సుగుణ పాల్గొన్నారు. దుత్తలూరులో.. ఉదయగిరి: దుత్తలూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టౌన్ హాల్ సమావేశాన్ని పార్టీ మండలాధ్యక్షుడు వాసుదేవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి మాట్లాడారు. డీఎస్సీలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
మాతృ మరణాలను అరికట్టాలి
నెల్లూరు(అర్బన్): జిల్లాలో మాతృ మరణాలు సంభవించకుండా వైద్యశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్ఓ సుజాత పేర్కొన్నారు. సంతపేటలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో మాతృ మరణాల నివారణ సబ్ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. మినగల్లుకు చెందిన ఓ మహిళ గర్భ సమయంలో ఎందుకు మృతి చెందిందనే వివరాలను సంబంధిత డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడారు. జిల్లాలో మహిళలు గర్భం దాల్చిన వెంటనే ఆశ వర్కర్, అంగన్వాడీ కార్యకర్త ద్వారా తెలుసుకొని వివరాలను ఏఎన్ఎం రిజిస్టర్ చేయాలని సూచించారు. కాన్పు జరిగేంత వరకు పౌష్టికాహారం అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. బీపీ ఉన్న గర్భిణులను జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రికి రెఫర్ చేయాలన్నారు. జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి పరిమళ, డీఐఓ బ్రిజిత, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ మాధవి, గైనకాలజిస్ట్ మేరీ స్నిగ్థ, డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గీత దాటితే వేటే ● కలెక్టర్ హిమాన్షు శుక్లా ● కలెక్టరేట్లో గేట్లేసి మరీ ఆకస్మిక తనిఖీలు నెల్లూరు(అర్బన్): కలెక్టరేట్కు కొంత మంది ఉద్యోగులు సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా వస్తున్నారని, వీరిపై వేటు తప్పదని కలెక్టర్ హిమాన్షు శుక్లా హెచ్చరించారు. కార్యాలయానికి మంగళవారం ఉదయం పదింటికి ఆయన వచ్చారు. వెంటనే ఆఫీస్ లోపలికొచ్చే గేట్లకు తాళమేయించారు. గేట్ వద్ద సెక్యూర్టీని ఉంచారు. అనంతరం వివిధ సెక్షన్లను పరిశీలించారు. సమయానికి విధుల్లోకి రాని వారు పేర్లను నోట్ చేసుకున్నారు. విషయం తెలిసిన కొందరు ఉద్యోగులు హడావుడిగా వచ్చినా, గేట్లకు తాళాలేసి ఉండటంతో బయటే ఉండిపోయారు. ఆపై తాళాలు తీయించి.. సకాలంలో విధులకు హాజరుకాని వారిని ఒక్కొక్కరిగా తన చాంబర్లోకి పిలిపించి క్లాస్ పీకారు. తొలి తప్పుగా భావించి వదిలేస్తున్నానని, మరోసారి జరిగితే ఉపేక్షించేదిలేదని స్పష్టం చేశారు. నేటి నుంచి టెట్ నెల్లూరు (టౌన్): ఏపీ టెట్ బుధవారం ప్రారంభం కానుంది. ఈ నెల 16 వరకు నిర్వహించనున్న ఈ పరీక్షలకు జిల్లాలో ఆరు కేంద్రాలను ఏర్పాటు చేశారు. నెల్లూరు రూరల్ పరిధిలోని పొట్టేపాళెం సమీపంలో గల అయాన్ డిజిటల్ సెంటర్, జై శ్రీరామ్ ఇన్ఫ్రా అండ్ ఐటీ సొల్యూషన్స్, కావలిలోని విశ్వోదయ, నెల్లూరు, గూడూరులోని నారాయణ, కోవూరు సమీపంలోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్ష జరగనుంది. రోజూ ఉదయం 9.30 నుంచి 12 వరకు.. మధ్యాహ్నం 2.30 నుంచి ఐదు వరకు నిర్వహించనున్న టెస్ట్కు 12,387 మంది హాజరుకానున్నారు. గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. హాల్ టికెట్తో పాటు ఫొటో గుర్తింపు కార్డును తప్పక చూపాల్సి ఉంటుంది. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 30 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 78,561 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. టైమ్ స్లాట్ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 15 గంటల సమయం పడుతోంది. జొన్నవాడలో హుండీ కానుకల లెక్కింపు బుచ్చిరెడ్డిపాళెం: జొన్నవాడలోని మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానంలో హుండీ కానుకలను లెక్కించారు. ఈ ఏడాది మే 18 నుంచి సోమవారం వరకు ప్రధాన హుండీల ద్వారా రూ.47,01,330 నగదు వచ్చిందని అధికారులు తెలిపారు. యూఎస్ డాలర్లు 20, చైనా యువాన్లు, నేపాల్ రూపాయి పది చొప్పున వచ్చాయని వివరించారు. 90 గ్రాముల బంగారు, 191 గ్రాముల వెండి వస్తువులున్నా యని వెల్లడించారు. అన్నప్రసాద హుండీలో రూ.2,33,771 మేర సమర్పించారు. దేవదాయ శాఖ కోవూరు పర్యవేక్షణాధికారి నాగ మల్లేశ్వరరాజు, ఆలయ చైర్మన్ అశోక్రెడ్డి, ఈఓ వెంకటశ్రీనివాసులురెడ్డి, ధర్మకర్త మండలి స భ్యుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
సమగ్రశిక్ష ఏపీసీగా వెంకటసుబ్బయ్య
● నిధుల గోల్మాల్లో పాత్ర లేదని ఆర్జేడీ నివేదిక ● డ్వామా అధికారులపైనే ఆరోపణలు ● కొనసాగుతున్న విజిలెన్స్ విచారణనెల్లూరు(టౌన్): సమగ్రశిక్ష ఏపీసీగా వెంకటసుబ్బయ్య రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. సమగ్రశిక్షలో పాఠశాలల ప్రహరీ నిర్మాణాల్లో నిధులు గోల్మాల్ జరిగినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏపీసీతోపాటు సూపరింటెండెంట్ అశోక్ను మాతృశాఖకు సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం రాష్ట్ర ఉన్నతాధికారులు నిధులు గోల్మాల్పై ఆర్జేడీ లోకేశ్వరరెడ్డిని విచారణ అధికారిగా నియమించి పూర్తి వివరాలు నివేదిక రూపంలో అందజేయాలని ఆదేశించారు. దీంతో ఆర్జేడీ నేతృత్వంలో పూర్తి స్థాయి విచారణ జరిగింది. ఇందులో వెంకటసుబ్బయ్య, అశోక్, సమగ్రశిక్షకు ఎలాంటి సంబంధం లేదని తేలింది. ఆ నివేదికను రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులకు అందజేశారు. దీంతో వారిద్దరికీ తిరిగి బాధ్యతలు అప్పగించారు. ప్రహరీల నిర్మాణాల నిధులు గోల్మాల్ వ్యవహారంలో డ్వామాకు చెందిన ఏపీఓలు, ఎంపీడీఓలు కీలకపాత్ర పోషించినట్లు తెలిసింది. కొన్ని పాఠశాలల్లో ఉపాధి నిధులతో ప్రహరీలు నిర్మించి బిల్లులు తీసుకుని, మరికొన్నిచోట్ల అసలు ప్రహరీలు నిర్మించకుండానే బిల్లులు తీసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం అంతా డ్వామాలో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి అధికారుల కనుసన్నుల్లో జరిగిందన్న ప్రచారం సాగుతోంది. నిధులు గోల్మాల్పై కలెక్టర్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ప్రస్తుతం అది కొనసాగుతోంది. వారు అందించే నివేదికలో ఎవరెవరి పాత్ర ఉంటుందనే చర్చ ఆ శాఖలో జరుగుతోంది. -
‘పాలిటెక్నిక్’లో వసతులపై భగ్గుమన్న విద్యార్థులు
● సంఘీభావం తెలిపిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి ● సీఎస్సార్ నిధులతో అభివృద్ధి అంటూ పబ్లిసిటీ స్టంట్ కళాశాల ఎదుట విద్యార్థుల ధర్నా ప్రిన్సిపల్తో మాట్లాడుతున్న చంద్రశేఖర్రెడ్డి నెల్లూరు (టౌన్): వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో నెలకొన్న సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని, వీటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కాలేజీ ఎదుట వందలాది మంది విద్యార్థులు మంగళవారం ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకొని వీరికి సంఘీభావాన్ని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తెలియజేశారు. సమస్యలపై విద్యార్థులను ఆరాతీశారు. వీటిని పరిష్కరించేంత వరకు పోరాడతామని స్పష్టం చేశారు. తాగునీరు అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించి వారిని అడిగి వివరాలను తెలుసుకున్నారు. కాలేజీలో ప్రహరీ లేకపోవడంతో బయటి వ్యక్తులు లోపలికొచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకొచ్చారు. పెచ్చులూడుతున్న తరగతి గదులు, నాసిరకం భోజనం, చీకటి పడితే పాములొస్తున్న విషయాన్ని ప్రిన్సిపల్ రామారావుకు తెలియజేశారు. సమస్యలను ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నాడంతా సాఫీగా.. గత ప్రభుత్వ హయాంలో నాడు – నేడుతో అన్ని పాఠశాలలు, కళాశాలలను అభివృద్ధి చేసిన ఘనత అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో 20 వేల స్కూళ్లు, కాలేజీలను ఆధునికీకరించిన అంశాన్ని గుర్తుచేశారు. రెండో దశలో 18 వేల స్కూళ్లలో పనులు 80 శాతం మేర పూర్తయ్యాయని, అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరాక వీటిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. సర్కారీ బడుల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తే, నూతన ప్రభుత్వమొచ్చాక నిర్వహణ లేక అవి పాడైపోయాయని ధ్వజమెత్తారు. కనీస ఖర్చుతో వీటిని బాగుచేసి తాగునీటిని అందించాలనే కనీస బాధ్యత లేకపోవడం బాధాకరమన్నారు. నాడు – నేడు పేరును మనబడి – మన భవిష్యత్తుగా మార్చడం మినహా రూపాయి నిధులను సైతం విడుదల చేయలేదని ధ్వజమెత్తారు. విద్యార్థులు, యువతను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు గతంలో మంచిపేరుండేదని, అయితే ఇప్పుడా పరిస్థితి లేకపోవడం విచారకరమని చెప్పారు. కలుషిత నీటిని తాగుతూ విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని, ఇదే పరిస్థితి నెల్లూరు నగర నియోజకవర్గంలోని అనేక విద్యా సంస్థల్లో నెలకొందని తెలిపారు. పార్టీ విద్యార్థి విభాగ నగర నియోజకవర్గ అధ్యక్షుడు తౌఫిక్, డివిజన్ల ఇన్చార్జీలు మహేష్యాదవ్, మహబూబ్బాషా, వెంగళ్రెడ్డి, మస్తాన్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బాలకృష్ణారెడ్డి, విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు ఆశ్రిత్రెడ్డి, నగరాధ్యక్షుడు చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు కనీస వసతులను కల్పించలేరానని చంద్రశేఖర్రెడ్డి ప్రశ్నించారు. సీఎస్సార్ నిధులతో పాఠశాలలను అభివృద్ది చేస్తున్నామంటూ రాష్ట్ర మంత్రులు లోకేశ్, నారాయణ పబ్లిసిటీకే పరిమితమవుతున్నారని విమర్శించారు. వీటితో నెల్లూరులో ఒకట్రెండింటిని డెవలప్ చేసి గొప్పలు చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల దుస్థితి వీరికి కనిపించడంలేదానని ప్రశ్నించారు. క్షేత్రస్థాయికొచ్చి వాస్తవ పరిస్థితులపై మాట్లాడాలని డిమాండ్ చేశారు. కనీస వసతులను కల్పించలేరా..? -
ఆర్టీసీని ప్రైవేట్పరం చేయొద్దు
నెల్లూరురూరల్: ఆర్టీసీని ప్రైవేట్పరం చేయొద్దని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరులో సోమవారం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా కన్వీనర్లు డి.రమణయ్య, కె.లుక్సన్, టీఎంఎం రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ బస్సులను ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించాలని కోరారు. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా నాలుగు వేలకుపైగా కొత్త బస్సులను కొనుగోలు చేయాలన్నారు. వేల సంఖ్యలో ఉన్న ఖాళీలను భర్తీ చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజల ఆస్తి అయిన ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా నెట్టే ప్రయత్నాలను ఉద్యోగుల పక్షాన జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని హెచ్చరించారు. షబ్బీర్, ఓవీ ప్రసాద్, చెంచయ్య తదితరులు పాల్గొన్నారు. -
కాలుష్యంతో బతకలేకున్నాం
● మా గ్రామాన్ని తరలించండి ● సెయిల్ ఎదుట నేలటూరుపాళెంవాసుల ఆందోళన ముత్తుకూరు(పొదలకూరు) : ముత్తకూరు మండలం నేలటూరులోని సెయిల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎదుట నేలటూరుపాళెం, ఎస్సీకాలనీవాసులు సోమవారం ఆందోళన చేపట్టారు. స్థానికులు పెద్దఎత్తున సెయిల్ ప్రధాన గేటు వద్దకు చేరుకుని కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమను సురక్షిత ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. పరిశ్రమ కాలుష్యం కారణంగా వ్యాధుల బారిన పడుతున్నామని, ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు సురక్షిత ప్రాంతంలో పునరావాసం కల్పించాలని కోరారు. గతంలో పలుమార్లు కాలుష్య సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. ఈసారి తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళనను కొనసాగిస్తామని హెచ్చరించారు. -
డాక్టర్ల నిర్లక్ష్యం..గాల్లో కలిసిన ప్రాణం
నెల్లూరు(అర్బన్): డాక్టర్ల నిర్లక్ష్యం.. అందని అత్యవసరమైన వైద్యం.. అందుబాటులో లేని డ్యూటీ డాక్టర్లు.. అరకొర వైద్యం అందించిన శిక్షణలో ఉన్న పీజీ డాక్టర్లు.. దీంతో అభంశుభం తెలియని ఓ బాలిక ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటన నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో (పెద్దాస్పత్రి) చోటుచేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యమే తమ బిడ్డ ప్రాణాలు బలి తీసుకుందంటూ బాలిక కుటుంబ సభ్యులతోపాటు బంధువులు ఆదివారం అర్ధరాత్రి దాటే వరకూ ఆందోళన చేపట్టారు. ఏం జరిగిందంటే.. ఊటుకూరు ప్రాంతానికి చెందిన హిమతేజ (16) బతుకుదెరువు నిమిత్తం అయ్యప్పగుడి సమీపంలోని దండోరా కాలనీలో ఉంటోంది. తల్లిదండ్రులు మత్స్యకారులు. వీరిది నిరుపేద కుటుంబం. బాలికకు శుక్రవారం వాంతులవుతుంటే నగరంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. ఇంజెక్షన్లు వేయడంతో వాంతులు తగ్గిపోయాయి. బాలిక నీరసంగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు ఆదివారం ఉదయం పెద్దాస్పత్రికి వైద్యం కోసం క్యాజువాలిటీకి తీసుకొచ్చారు. అక్కడ డాక్టర్లు లేరు. శిక్షణలో ఉన్న పీజీ వైద్యులు స్కానింగ్ చేయించి అంతా బాగుంది. ఇబ్బంది లేదని చెప్పి సైలెన్ పెట్టారు. సాయంత్రం 5 గంటల తర్వాత రక్తపరీక్షల కోసం బ్లడ్ శాంపిల్ తీశారు. అప్పటి వరకు పట్టించుకోలేదు. కనీసం క్యాజువాలిటీ నుంచి వార్డుకు కూడా తరలించలేదు. అయితే ఏమి జరిగిందో గానీ రాత్రి 8 నుంచి 8:30 గంటల మధ్యలో బాలిక చనిపోయింది. ఆస్పత్రి వద్ద బైఠాయింపు బాలిక మరణించిన విషయాన్ని కూడా తల్లిదండ్రులకు డాక్టర్లు తెలపలేదు. హిమతేజ నుంచి స్పందన లేకపోవడంతో బాధిత కుటుంబం నిలదీసింది. ఆ తర్వాత రక్తపరీక్షల రిపోర్టులు వచ్చాయి. అప్పుడు డాక్టర్లు బాలికకు కామెర్లు ఉన్నాయి. లివర్ చెడిపోయిందని దీంతో చనిపోయిందని చెప్పారు. అప్పటి వరకు నవ్వుతూ ఉన్న తమ బిడ్డ ఎలా మరణించింది. అంతా బాగుందని ఎందుకు చెప్పారు. సీరియస్ అయితే ముందుగా చెబితే తాము ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లేవారం కదా అని తల్లిదండ్రులు ప్రశ్నించారు. హిమతేజకు ఏం వైద్యం చేశారో రాసివ్వాలని ధర్నా చేపట్టారు. వారు లేరు బాలిక మృతి విషయంలో డాక్టర్ల నిర్లక్ష్యంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం, సెలవు దినాలు అయితే డ్యూటీ డాక్టర్లు, హెచ్ఓడీలు అందుబాటులో ఉండరు. నర్సులు, శిక్షణలో ఉన్న డాక్టర్లే వైద్యం చేయాల్సి వస్తోంది. సాధారణంగా క్యాజువాలిటీకి రోగిని తీసుకొస్తే గంట లేదా రెండు గంటలు మాత్రమే ఉంచి ప్రాథమికంగా వైద్యం చేసి తర్వాత వార్డులోకి మార్చాలి. సీరియస్ అయితే ఐసీయూకి తరలించారు. ఇంకా సీరియస్ అయి శ్వాస తీసుకోలేకపోతే ఆక్సిజన్ అందించాలి. అవసరమైతే ఇన్ట్యుబేట్ చేసి వెంటిలేటర్ను అమర్చాలి. ఆ బాలికకు ఇలాంటి ఎమర్జెన్సీ వైద్యం అందలేదు. పీజీల వైద్యం దిక్కవడంతో నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని మరికొంత మంది వైద్యులే పేర్కొంటున్నారు. కేస్షీట్ ఎవరు రాయాలి? బాలిక తల్లిదండ్రులు తమ బిడ్డకు జరిగిన వైద్యం గురించి రాసివ్వాలని పట్టుబట్టారు. ఎక్కడ పేషెంట్ అడ్మిషన్లో ఉంటే అక్కడి డాక్టర్లు మాత్రమే ఎలాంటి వైద్యం చేశారో కేస్షీట్లో రాయాలి. అయితే ఇక్కడ అందుకు విరుద్ధంగా జరిగినట్టు ఆరోపణలున్నాయి. రోగికి క్యాజువాలిటీలో వైద్యం జరిగినప్పటికీ ఎంఐసీయూ విభాగం వారు కేస్షీట్ నమోదు చేశారని ప్రచారం ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన బంధువులు మరింత ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల రంగ ప్రవేశం బాధిత బంధువులు తమకు న్యాయం చేయాలని క్యాజువాలిటీ బయట బైఠాయించారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు ఆందోళన చేశారు. దీంతో నాలుగో పట్టణ పోలీస్స్టేషన్ ఎస్సై, ఐదో పట్టణ స్టేషన్ సీఐ వచ్చి సర్దిచెప్పారు. అయినా వారు ఆందోళన విరమించ లేదు. దీంతో పోలీస్ అధికారులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం, నివేదికలో అంతా తెలుస్తుందని చెప్పారు. అయితే బంధువులు పోస్టుమార్టం వద్దని చెప్పారు. కేసు పెట్టబోమని, మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. స్పందించిన డీఎంఈ ఈ విషయంపై డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) స్పందించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్కు ఫోన్ చేసి ఏమి జరిగిందో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇదే విషయమై మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారని తెలిసింది. సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి వైద్యులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్కు సంబంధించి మొత్తం 8 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బాలిక మృతికి కారణాలు తెలుపుతూ వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.బాలికకు అందని ఎమర్జెన్సీ వైద్యం డ్యూటీ డాక్టర్ల డుమ్మా అరకొర వైద్యం అందించిన శిక్షణలో ఉన్న పీజీ డాక్టర్లు తెల్లవారుజాము వరకు నిరసనకు దిగిన బంధువులు నెల్లూరు సర్వజన ఆస్పత్రిలో దారుణం స్పందించిన డీఎంఈ, మహిళా కమిషన్ 8 మంది డాక్టర్లు, సిబ్బందికి షోకాజ్ నోటీసులుకలెక్టర్కు నివేదిక ఇస్తాం ఆస్పత్రిలో ఆదివారం డ్యూటీ డాక్టర్లున్నారు. వైద్యం కూడా చేశారు. అయితే ఆ బాలికకు అంతకు ముందు నుంచే ఏదో సమస్య ఉంది. బయట వైద్యం చేయించుకుని తీసుకొచ్చారు. ఇక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం ఏమి లేదు. ఇతర అనారోగ్య సమస్యలతో చనిపోయి ఉండొచ్చు. ఏమి జరిగిందో వివరణ ఇవ్వాలని డాక్టర్లకు, సిబ్బందికి షోకాజ్ నోటీసులిచ్చాం. వారి వివరణ తీసుకుని కలెక్టర్కు నివేదిక అందజేస్తాం. – డాక్టర్ కొండేటి మాధవి, సూపరింటెండెంట్, సర్వజన ఆస్పత్రి -
అంబేడ్కర్ వర్సిటీ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు (టౌన్): డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సర్వోదయ కళాశాల సెంటర్ రీజనల్ కోఆర్డినేటర్ పిచ్చయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ లేదా ఐటీఐ, డిప్లొమో లేదా ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా ఉత్తీర్ణులైన వారు www. braouap.org ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 94931 69101 నంబర్ను సంప్రదించాలని కోరారు. అంగన్వాడీ పోస్టులకు ఇంటర్వ్యూలు రేపు నెల్లూరు(పొగతోట): నెల్లూరు అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఈ నెల 5న ఉదయం 10 గంటల నుంచి నెల్లూరు ఆర్డీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించన్నుట్లు సీడీపీఓ అరుణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసుకుని కాల్లెటర్లు అందుకున్న అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరారు. కాల్లెటర్లు, ఒరిజినల్ ధ్రువీకరణపత్రాలు, జెరాక్స్ కాపీలను తప్పక తీసుకురావాలని సూచించారు. ఆక్రమిత స్థలాన్ని స్వాధీనం చేసుకుంటాం వింజమూరు(ఉదయగిరి): వింజమూరు కావలి–సీతారామపురం జాతీయ రహదారిని పక్కన సర్వేనంబర్లో 539/2 లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి షాపుల నిర్మాణం చేపడుతున్నారు. ఈ విషయమై ‘సాక్షి’లో ‘ప్రభుత్వ స్థలమే..మనల్ని ఎవరు అడిగేది’ శీర్షికన ఆదివారం కథనం వెలువడడంతో రెవెన్యూ అధికారులు స్పందించారు. సోమవారం వీఆర్వో శిరీష సర్వేయర్తో కలిసి అక్రమ కట్టడాన్ని పరిశీలించి స్థలాన్ని సర్వే చేపట్టారు. సుమారు 50 అంకణాల ప్రభుత్వ స్థలంలో ఐదు గదులు నిర్మించినట్లుగా గుర్తించారు. ఆక్రమిత స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. కిలో పొగాకు గరిష్ట ధర రూ.250 మర్రిపాడు: డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో సోమవారం కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.250 లభించింది. వేలానికి 472 బేళ్లు రాగా, 343 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు వేలం నిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. కిలో పొగాకు గరిష్టంగా రూ.250, కనిష్టంగా రూ.160, సగటున రూ.195.01 ధర పలికిందని వివరించారు. కోటితీర్థంలో అక్రమంగా చేపల గుంతల సాగు ● సీఎంఓకు టీడీపీ మహిళానేత ఫిర్యాదు ● రాష్ట్ర మత్స్యశాఖ అధికారుల రహస్య విచారణపై సందేహాలు చేజర్ల: మండలంలోని కోటితీర్థంలో అనధికారికంగా చేపల గుంతలను సాగు చేస్తున్నారు. ఈ కారణంగా చిన్న,సన్నకారు రైతులకు చెందిన సారవంతమైన మాగాణి భూములు దెబ్బతింటున్నాయి. ఈ విషయమై బాధితురాలైన టీడీపీ నాయకురాలు కొమ్మి విజయమ్మ గతేడాదిగా న్యాయం కోసం పోరాడుతోంది. పలుమార్లు కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గతంలో జాయింట్ కలెక్టర్ కార్తీక్ క్షేత్రస్థాయిలో పరిశీలించి చేపల గుంతలను తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జేసీ బదిలీపై వెళ్లిన తర్వాత స్థానిక కూటమి నాయకులు, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్, మత్స్యశాఖ అధికారులను చేపల గుంతల యజమానులు తమకు అనుకూలంగా మార్చుకుని అన్ని అనుమతులు ఉన్నాయని కలెక్టర్ను సైతం తప్పుదారి పట్టించారు. దీంతో జిల్లాలో న్యాయం జరగదని భావించిన విజయమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు రాష్ట్ర మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు శనివారం కోటితీర్థం వచ్చి చేపలగుంతలను పరిశీలించారు. కాగా రాష్ట్ర అధికారుల పర్యటనను స్థానిక అధికారులు గోప్యంగా ఉంచడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండల స్థాయి కమిటీ కోటితీర్థంలో చేపల సాగుకు అనుమతులు లేవని చెబుతుండగా, జిల్లా స్థాయి మత్స్య శాఖ అధికారులు మాత్రం అనుమతులు ఉన్నాయని పేర్కొంటున్నారు. మంత్రి ఆనం ఇలాకాలో అనుమతి లేకుండా చేపలగుంతలు సాగుచేస్తూ చికెన్ వ్యర్థాలు, ఇతర రసాయనాలను వినియోగిస్తూ పచ్చని పంట పొలాలను విషతుల్యంగా మార్చి రైతుల పొట్టకొడుతున్న చేపలగుంతల యజమానులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మత్స్యశాఖ అధికారుల రహస్య విచారణపై జిల్లా మత్స్య శాఖ జేడీ నాగేశ్వరరావును వివరణ కోరగా నేను కొత్తగా జిల్లాకు వచ్చానని నాకు విషయం తెలియదని బదులు ఇచ్చారు. -
నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం
● ఉద్యోగాలను తండ్రీకొడుకులు అమ్ముకున్నారు ● డీఎస్సీ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేయాల్సిందే ● లేదంటే ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తుంది ● కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి కావలి: డీఎస్సీ నియామకాల పేరుతో ప్రభుత్వ పెద్దలు నిరుద్యోగుల ఆశలతో అడ్డగోలుగా వ్యాపారం చేశారని, ఉద్యోగాలను తండ్రీకొడుకులు అమ్ముకుని, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని కూటమి ప్రభుత్వంపై కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి విరుచుకుపడ్డారు. డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలపై ప్రజల ఆగ్రహాన్ని ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేస్తామని హెచ్చరించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు డీఎస్సీ అక్రమాలపై దశల వారీ పోరాటంలో భాగంగా సోమవారం స్థానిక ఆర్ఎస్ఆర్ కల్యాణ మండపంలో కావలి నియోజకవర్గ వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తొలుత మహిళా నేతలతో కలిసి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. డీఎస్సీ నియామకాల్లో భారీ స్థాయిలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. దీనికి మంత్రి లోకేశ్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అవకతవకలపై ప్రజలు దుమ్మెత్తిపోస్తుంటే సమాధానం చెప్పలేక మౌనం వహిస్తున్నారని విమర్శించారు. స్పోర్ట్స్ కోటాలో నచ్చిన వారికి పోస్టులు కట్టబెట్టి దండుకోవాలనే ఉద్దేశంతో దొంగ జీఓలను జారీ చేశారని ఆరోపించారు. ఒక్కో పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేశారని ఆరోపించారు. దీనిపై ప్రశ్నిస్తే తప్పులు సరిదిద్దుకోకుండా ప్రశ్నించిన వారిపైనే ఎదురుదాడికి దిగడం టీడీపీ నైజంగా మారిందని దుయ్యబట్టారు. ఒక వైపు ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు గగ్గోలు పెడుతుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో మోసపూరిత వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన తర్వాత ప్రజలను మోసం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్యగా మారిందని ఎద్దేవా చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారని, రాజ్యాంగంపై ఏ మాత్రం విశ్వాసమున్నా లోకేశ్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి చెల్లింపులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో అంతా శూన్యంగానే కనిపిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్రెడ్డి, బోగోలు మండల కన్వీనర్ మద్దిబోయిన వీరరఘు, దగదర్తి కన్వీనర్ మహేష్నాయుడు, కావలి రూరల్ మండల అధ్యక్షుడు తిరుపతి, అల్లూరు మండల అధ్యక్షుడు బీద రమేష్, మాజీ ఏపీఎంసీ చైర్మన్ కొండూరు అనిల్, జిల్లా కార్యదర్శి గంధం ప్రస న్నాంజనేయులు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పందిటి కామరాజు, మాజీ కౌన్సిలర్ గుడ్లూరు మాల్యాద్రి, ద్రోణాదుల వెంకట్రావు, మాజీ ఎంపీపీ పర్రి మహేశ్వరి, కుందుర్తి శ్రీనివాసులు, పందిటి సుమలత, నెల్లూరు వెంకటేశ్వరరెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
కుమారుల నిర్దయపై వృద్ధుల ఆవేదన
● పోలీస్ అధికారుల దృష్టికి సమస్య ● పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● మొత్తం 179 వినతుల అందజేతనెల్లూరు(క్రైమ్): ‘నాకు ముగ్గురు కుమారులు. నేను, నా భార్య వృద్ధాప్యంలో ఉన్నాం. ఆమె అనారోగ్యంతో బాధపడుతోంది. కుమారులు మా బాగోగులు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. విచారించి న్యాయం చేయండి’ అని నవాబుపేట ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు కోరాడు. నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి 179 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్లకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె చట్టపరిధిలోని వాటిని పరిష్కరించాలని ఆయా ప్రాంత పోలీస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ కె.వేమారెడ్డి, మహిళా పోలీస్స్టేషన్, పీసీఆర్, ఎస్బీ ఇన్స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, భక్తవత్సలరెడ్డి, దశరథరామారావు, శ్రీనివాసరెడ్డి, పీజీఆర్ఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. తిరుపతికి చెందిన భానుప్రసాద్ ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మూడేళ్లు ఇద్దరం కలిసి తిరిగాం. ఇప్పుడు వివాహం చేసుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. అతడిపై చర్యలు తీసుకోవాలని సైదాపురం ప్రాంతానికి చెందిన ఓ యువతి కోరారు. ఆస్తుల కోసం బెదిరింపు నేను ఎన్ఆర్ఐని. నా భార్య మరొకరితో సన్నిహితంగా ఉంటోంది. వారిద్దరి నుంచి నాకు, నా పిల్లలకు ప్రాణహాని ఉంది. ఇప్పటికే నా నుంచి రూ.4 కోట్లు వాళ్ల అకౌంట్కు బదిలీ చేయించుకున్నారు. అదనపు ఆస్తుల కోసం బెదిరిస్తున్నారు. విచారణ జరిపించాలని కావలి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు. రూ.45 లక్షలు తీసుకుని మోసం ఏఎస్పేట మండలానికి చెందిన ఓ వ్యక్తి పొలం అమ్ముతానని నా వద్ద రూ.45 లక్షలు తీసుకున్నాడు. పొలం అమ్మకుండా తన భార్య పేరుపై రిజిస్టర్ చేయించాడు. మోసగించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఏఎస్పేట ప్రాంతానికి చెందిన వినతిపత్రం అందజేశాడు. -
భూమి పోతే... బతుకెందుకు?
భూమి కోసం నాలుగు దశాబ్దాలుగా పోరాడిన ఓ రైతు కుటుంబం.. చివరకు న్యాయం కోసం కాదు, చావుకు అనుమతివ్వండని కోరుతూ కలెక్టర్ ఎదుట చేతులు జోడించింది. కాళ్లరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా, డజన్ల కొద్దీ వినతిపత్రాలు సమర్పించినా తమ గోడు వినిపించుకోలేదని ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ‘మా భూమిని కాపాడలేకపోతే.. కారుణ్య మరణానికి అనుమతించండి’ అంటూ చేసిన వేడుకోలు ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతలపై ప్రశ్నలు సంధించింది. ఒక కుటుంబం తన భూమిని కాపాడుకునేందుకు లక్షలు ఖర్చు పెట్టి, చివరకు బతకడమే భారమైందని చెప్పుకునే పరిస్థితి ఏర్పడడం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది. నెల్లూరు (అర్బన్): భూమిని కాపాడాల్సిన వ్యవస్థ కనికరించకపోవడంతో ఓ రైతు కుటుంబం బతికే హక్కు పై ఆశ వదిలేసింది. నాలుగు దశాబ్దాలుగా తమదేనంటున్న భూమిని కాపాడుకునేందుకు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగామని, కలెక్టరేట్లోనే 46 సార్లు వినతిపత్రాలు ఇచ్చినా న్యాయం దక్కలేదని కారుణ్య మరణానికై నా అనుమతించమంటూ సోమవారం కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసి వేడుకోవడం కలెక్టరేట్లో విషాద వాతావరణాన్ని నెలకొల్పింది. తమ భూమిని కాపాడుకునే పోరాటంలో ఇప్పటికే రూ.11 లక్షలు అప్పులపాలయ్యామని, ఇక చావు తప్ప మరో దారి కనిపించడం లేదంటూ కన్నీరు మున్నీరైంది. ఈ భావోద్వేగ విషయం కలెక్టరేట్లో చర్చనీయాంశంగా మారింది. జలదంకి మండలం కొత్తపాళెం గ్రామానికి చెందిన లోకిరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్కు అర్జీ ఇచ్చిన తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం తమ కుటుంబం బుచ్చిరెడ్డిపాళెంలో ఉంటుంది. తమ కుటుంబానికి కలిగిరి మండలంలో 12.02 ఎకరాల పట్టా భూమి 1975 సంవత్సరం నుంచి ఉందన్నారు. తమ భూమి ఆనుకుని 8 ఎకరాల అసైన్డ్ భూమి ఉందన్నారు. అయితే కొంత మంది వ్యక్తులు ఆ అసైన్డ్ భూములకు కలిగిరి తహసీల్దార్ సాయంతో దొంగ పట్టాలు సృష్టించి సాగు చేసుకుంటున్నారన్నారు. తర్వాత తమ పట్టా భూమిపై వారి కన్ను పడిందన్నారు. తమ భూమిని కూడా ఆక్రమించుకుంటున్నారన్నారు. ఈ విషయంలో గతంలో పని చేసిన ఓ తహసీల్దార్కు అర్జీలు ఇవ్వగా ఆయన సర్వేయర్ను తీసుకు వచ్చి కొలతలు వేసి తమ భూమిలోకి రావద్దని కబ్జాదారులను హెచ్చరించాడన్నారు. దీంతో తమ జోలికి రాబోమని అసైన్డును ఆక్రమించుకున్న కబ్జాదారులు లిఖిత పూర్వకంగా రాసిచ్చారన్నారు. కొంత కాలం తర్వాత మళ్లీ ఆక్రమణదారులను తమ భూమిని సాగు చేసుకోకుండా అడ్డు పడుతున్నారన్నారు. ప్రస్తుత తహసీల్దార్ కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నాడని ఆరోపించారు. తహసీల్దార్ మా పంటను ధ్వంసం చేయించారని, సీసీ కెమెరాలను పగులగొట్టించారని ఆరోపించారు. తహసీల్దార్ తమను చిత్రహింసలు పెట్టిస్తున్నారన్నారు. పోలీసులు, తహసీల్దార్ ఆక్రమణదారుల వైపు నిలబడడంతో తాము ఇప్పటికే రూ.11 లక్షలు నష్టపోయామన్నారు. అప్పుల పాలయ్యామన్నారు. ఇదే విషయమై కలెక్టరేట్లో 46 సార్లు వచ్చి అర్జీలు ఇచ్చినా న్యాయం జరగలేదన్నారు. కాబట్టి తమకు చావే పరిష్కారమన్నారు. కలెక్టర్ స్పందించి వారం రోజుల్లో న్యాయం చేస్తామని తెలిపారన్నారు. ఈ వారంలోపు న్యాయం జరగకపోతే తాము సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామని తెలిపారు. భూమిని కాపాడలేకపోతే చంపేయండి మా భూమి కోసం రూ.11 లక్షల ఖర్చు పెట్టుకున్నాం కలెక్టరేట్లో 46 సార్లు అర్జీలిచ్చినా.. న్యాయం జరగట్లేదు కలెక్టర్ను వేడుకున్న బాధిత రైతు కుటుంబం న్యాయం జరగకపోతే సామూహిక ఆత్మహత్యలే శరణ్యం -
అల్లుడి చేతిలో మామ హతం
ముత్తుకూరు(పొదలకూరు): పిల్లనిచ్చిన మామను అల్లుడు ఇష్టానుసారంగా కత్తితో పొడిచాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మృతిచెందిన ఘటన ఆదివారం అర్ధరాత్రి మండలంలోని బలిజపాళెం గ్రామంలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కుటుంబంలో ఏర్పడిన విభేదాల కారణంగా అల్లుడు కరకంబాక గురవయ్య (34) తన మామ గండవరపు ఏడుకొండలు (52)పై కత్తితో దాడికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఏడుకొండలు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు నెల్లూరు(పొగతోట): అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణులకు సేవలందించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ.సూర్యకుమారి తెలిపా రు. సోమవారం ఆమె నారాయణరెడ్డిపేట అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ చిన్నారుల ఎదుగుదలలో లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి వైద్యసేవలు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్, సీడీపీఓ అరుణ, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. -
మద్యం మత్తులో గొంతు కోసుకుని..
● గూడూరులో ఘటనగూడూరు: నిత్యం రద్దీగా ఉండే పట్టణంలోని టవర్ క్లాక్ ప్రాంతంలో అందరూ చూస్తుండగా చిన్నపాటి కత్తితో ఓ వ్యక్తి గొంతు కోసుకున్న ఘటన సోమవారం రాత్రి జరిగింది. ఒకటో పట్టణ పోలీసుల కథనం మేరకు.. ఉత్తర భారతదేశానికి చెందిన సుమారు 35 సంవత్సరాలకు పైగా వయసున్న వ్యక్తి టవర్ క్లాక్ ప్రాంతంలో తిరుగుతూ గట్టిగా అరవసాగాడు. కాసేపటికి తన జేబులో నుంచి కత్తి తీసి గొంతు, అలాగే పొట్టపై కోసుకున్నాడు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అతడిని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతను మద్యం సేవించి ఉన్నాడని సిబ్బంది చెబుతున్నారు. మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఏదైనా పరిశ్రమలో పని చేసేందుకు వచ్చాడా?, రైలు దిగి వచ్చాడా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఒకటో పట్టణ సీఐ శేఖర్బాబు, మహిళా ఎస్సై శిరీష పరిశీలించి వివరాలను సేకరించారు. థమ్సప్ ఏజెంట్ పేరుతో మోసం కలిగిరి: థమ్సప్ ఏజెంట్ పేరుతో ఓ కూల్డ్రింక్ షాపు నిర్వాహకుడి నుంచి నగదు కాజేసిన ఘటన కలిగిరి పంచాయతీలోని జిరావారిపాళెంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. కె.శ్రీనివాసులు కూల్డ్రింక్ షాపు ఉంది. ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి సంధ్య కూల్డ్రింక్ షాప్ నుంచి అంటూ ఫోన్ చేశాడు. నీకు థమ్సప్ కంపెనీ తరఫున ఫ్రిజ్ మంజూరైందని రూ.5 వేలు డిపాజిట్ చేస్తే సోమవారం మధ్యాహ్నం మీ షాపునకు మా ఏజెంట్లు ఫ్రిజ్, కూల్డ్రింక్స్ తెచ్చిస్తారని నమ్మబలికాడు. అలాగే డిపాజిట్ మొత్తం కంపెనీ తిరిగి చెల్లిస్తుందని చెప్పాడు. శ్రీనివాసులు నమ్మి ఫోన్పే ద్వారా రూ.5 వేలు పంపాడు. సదరు వ్యక్తి మళ్లీ ఫోన్ చేసి కంపెనీ బోర్డు ఏర్పాటు చేస్తామని రూ.600 పంపాలని అడిగాడు. దీంతో శ్రీనివాసులుకు అనుమానం వచ్చి తన డబ్బులు ఇచ్చేయాలని కోరాడు. నీ డబ్బులు కంపెనీకి వెళ్లిపోయాయి.. వాళ్లని అడుగు అంటూ ఆ వ్యక్తి ఫేక్ ఫోన్ నంబర్ ఇచ్చాడు. అలాగే కలిగిరికి చెందిన రమేష్ అనే మరో వ్యక్తికి సోమవారం ఉదయం ఫోన్ రావడంతో అనుమానం వచ్చి పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ఫోన్ నంబర్ లొకేషన్ ద్వారా అతడిని విజయవాడకు చెందిన వాడిగా గుర్తించారు.కండలేరులో 25.11 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 25.11 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 30, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 65 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
పుట్టిన రోజే అనంతలోకాలకు..
● కేక్ కోసం స్నేహితుడితో కలిసి వెళ్తుండగా.. ● డివైడర్ను ఢీకొన్న బైక్ ● ఒడిశాకు చెందిన ఇద్దరు యువకుల దుర్మరణం కొడవలూరు: జన్మదినాన్ని తన స్నేహితులతో కలిసి ఎంతో సంతోషంగా జరుపుకోవాలని భావించారు. దీని కోసం కేక్ను తెచ్చుకోవాలని తన స్నేహితుడితో కలిసి బైక్పై బయల్దేరారు. తాను కోరుకుంది ఒకటైతే.. విధి మరోలా తలచింది. ఈ క్రమంలో జరిగిన ప్రమాదంలో ఒడిశాకు చెందిన ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మండలంలోని రాచర్లపాడులో గల గమేశా ఫ్యాక్టరీ వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్సై కోటిరెడ్డి వివరాల మేరకు.. బీఎమ్మార్ సంస్థలో పనిచేస్తున్న ఒడిశాకు చెందిన సీతాకాంత్ (22) జన్మదినం ఆదివారం. ఈ క్రమంలో కేక్ నిమిత్తం నార్తురాజుపాళేనికి బైక్లో తన స్నేహితుడు బాదల్ మాలిక్ (24)తో కలిసి బయల్దేరారు. ఈ తరుణంలో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఎంతో ఉత్సాహంగా వెళ్లి.. వీరు విగతజీవులుగా మారడంతో స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. విగతజీవులుగా సీతాకాంత్, మాలిక్ -
రహదారినీ వదలని తమ్ముళ్లు
● ప్రభుత్వ నిధులతో నిర్మించిన రోడ్డు ధ్వంసం ● కలెక్టర్కు ఫిర్యాదు చేసినా, ఏదీ ప్రయోజనం ● కోటితీర్థంలో చెలరేగిపోతున్న టీడీపీ నేతలు చేజర్ల: మండలంలోని కోటితీర్థంలో ప్రభుత్వ భూమిని టీడీపీ నేతలు ఆక్రమించుకున్నారు. నిజానికి ఇక్కడ రహదారిని గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నిర్మించారు. ఈ క్రమంలో కబ్జా విషయమై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు వినతిపత్రాన్ని గ్రామస్తులు సమర్పించారు. ఈ క్రమంలో పరిష్కార నిమిత్తం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి అర్జీ వచ్చింది. ఈ తరుణంలో అధికారులు తమనేమి చేస్తారనే ధీమాతో ప్రభుత్వ భూమితో పాటు అందులో నిర్మించిన రహదారిని టీడీపీ నేతలు శనివారం తొలగించి మట్టిని పొలం చదునుకు ఉపయోగించారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో వీరి ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోరాటానికి గ్రామస్తులు సిద్ధమవుతున్నారు. -
లోన్ పేరుతో మోసం చేశారు
నా భర్త ఆటో నడుపుతాడు. రూ.10వేలు రుణం ఇప్పిస్తాను. తిరిగి కట్టాల్సిన అవసరం లేదని అరుణభవాని చెప్పింది. ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో ఇండియన్ బ్యాంక్కు వెళ్లాను. నా చేత సంతకాలు పెట్టించుకుని రూ.10 వేలిచ్చి పంపించేసింది. తీరా చూస్తే పొదుపులో రూ.లక్ష తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కట్టలేదు. మోసపోయామని తెలిసింది. ఈవిషయాన్ని అరుణభవానిని అడిగితే ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. – జొన్నలగడ్డ అమూల్య, బాధితురాలు ● -
రౌడీషీటర్లకు కౌన్సెలింగ్
నెల్లూరు(క్రైమ్): జిల్లా వ్యాప్తంగా ఆదివారం అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లు, కేడీలు, డీసీలకు పోలీస్ అధికారులు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేరాలకు స్వస్తి పలికి సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమానాస్పద ఘటనలు, అల్లర్లు, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై సమాచారం తెలిస్తే వెంటనే డయల్ 112, పోలీసు కంట్రోల్రూమ్ వాట్సప్ నంబర్ 9392903413కు సమాచారం అందించాలని పోలీసు అఽధికారులు కోరారు. ఏం కష్టమొచ్చిందో.. ● రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య నెల్లూరు(క్రైమ్): ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ చైన్నె వైపు వెళ్లే పట్టాలపై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతుడి వయసు 50 నుంచి 55 ఏళ్ల లోపు ఉంటుందని భావిస్తున్నారు. పింక్ అండ్ వైట్ చెక్స్ ఫుల్ హ్యాండ్స్ చొక్కా, గ్రే కలర్ నైట్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. ఎడమ చేతిపై కృష్ణయ్య అనే పచ్చబొట్టు ఉంది. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు నెల్లూరు రైల్వే పోలీసులకు, 92475 75628 నంబర్కు తెలియజేయాలని ఆమె కోరారు. పొలం పనులకు వెళ్లి.. ● విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి ఇందుకూరుపేట: పొలంలో పనుల కోసం వెళ్లిన ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన ఘటన మండలంలోని గంగపట్నంలో ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గంగపట్నం గ్రామానికి చెందిన తుపాకుల దయాకర్ (45) వ్యవసాయ పనుల నిమిత్తం కూలీలను తీసుకుని పొలానికి వెళ్లాడు. ఈ క్రమంలో పొలం సమీపంలో విద్యుత్ వైరు అడ్డుగా ఉండటంతో దానిని పక్కకు జరిపేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే దయాకర్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. సమాచారం అందుకున్న ఇందుకూరుపేట ఎస్సై నవీన్ కుమార్ కేసు నమోదు చేశారు.మద్యం తాగుతూ కాలువలో పడి.. ● వ్యక్తి మృతి విడవలూరు: ఓ వ్యక్తి వంతెనపై కూర్చొని మద్యం తాగుతూ ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని తుమ్మగుంట సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య (32) మండలంలోని పటేల్ నగర్ గ్రామానికి చెందిన అంకమ్మ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. శనివారం తన భార్యాపిల్లలతో కలిసి పటేల్ నగర్లోని తన అత్తమామల ఇంటికి వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం తుమ్మగుంట వద్ద గల పంట కాలువ వంతెనపై కూర్చొని మద్యం తాగుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి కాలువలో పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు అతడిని వెంటనే బయటకు తీసేందుకు తీశారు. అప్పటికే లక్ష్మయ్య మృతిచెందాడు. సమాచారం అందుకున్న సీఐ దుర్గాప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మద్యం మత్తువల్లే ఈ ఘటన జరిగిందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లుగా సీఐ తెలిపారు. -
నిబంధనలు మాకు కాదు..!
సాక్షి, టాస్క్ఫోర్స్: పేదలకు ఇసుక ఉచితమనే మాట కూటమి ప్రభుత్వంలో మచ్చుకై నా కానరావడంలేదు. టన్ను ఇసుకను రూ.500 వరకు చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గూడూరు నియోజకవర్గంలోని చిట్టమూరు, కోట, వాకాడు మండలాల్లో ప్రవహించే స్వర్ణముఖి నదీ పరీవాహక ప్రాంతాల్లో పలు గ్రామాల వద్ద ఇసుకను అక్రమంగా తవ్వేస్తున్నారు. తిష్ట వేసిన ప్రైవేట్ సంస్థ కోట మండలంలోని గూడలి ప్రాంతంలో రీచ్ను నామమాత్రంగా ఏర్పాటు చేశారు. అయితే టీడీపీలో అత్యంత కీలక నేతకు చెందిన ఓ ప్రైవేట్ సంస్థ ప్రతినిధులు ఇక్కడి రీచ్ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆపై చైన్నె, కర్ణాటకకు ఇసుకను రవాణా చేస్తున్నారు. ఇందులో స్థానికంగా ఉండే బడా నేతా భాగస్వామ్యం కావడంతో స్థానిక ప్రజాప్రతినిధి తన వాటా తనకొచ్చేస్తుందనే ఉద్దేశంతో స్వామిభక్తిని చాటుకుంటూ మిన్నకుండిపోతున్నారు. నెలవారీ మామూళ్లు అందుతుండడంతో పోలీస్, రెవెన్యూ, గనుల శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. విద్యానగర్ వద్ద డంపింగ్ స్వర్ణముఖికి వరదొస్తే ఇసుకకు ఇబ్బంది పడకుండా ఉండేలా ముందస్తుగానే రీచ్కు సమీపంలోని విద్యానగర్ వద్ద డంపింగ్ చేస్తున్నారు. చిట్టమూరు మండలంలోని గునపాడు, గునపాటిపాళెం, జంగాలపల్లి.. చిట్టమూరు మెట్టు సమీపంలోని రొయ్యల వాగు.. కోట మండలంలోని గూడలి, రుద్రవరం, పుచ్చలపల్లి నుంచి నిత్యం వంద ట్రాక్టర్లలో ఇసుకను బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు. 50 టిప్పర్లు, 16 టైర్ల పెద్ద లారీల్లో దీన్ని పరిశ్రమలు, చైన్నెకు తరలించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. బ్యారేజీకి చేరని తెలుగుగంగ జలాలు వాకాడు సమీపంలోని స్వర్ణముఖి బ్యారేజీకి తెలుగుగంగ నీటిని విడుదల చేసి రెండు నెలలవుతోంది. ఇలా వదలడం ద్వారా ఎడగారు సాగుచేసే వారికి బోర్లలో నీరు పుష్కలంగా అందే వీలుంటుంది. వాకాడు మండలంలోని పలు గ్రామాలకు తాగునీటికి ఇబ్బందులుండవు. అయితే స్వర్ణముఖి నదిలో ఇసుక తవ్వకాలకు అడ్డుగా ఉంటుందనే ఉద్దేశంతో తెలుగుగంగ నీరు బ్యారేజీకు వెళ్లకుండా నాయుడుపేట మండలం వేముగుంటపాళెం వద్ద అడ్డుకట్టేసి రొయ్యల వాగు, పులి కాలువలకు తరలిస్తున్నారు. దీంతో వాకాడు బ్యారేజీలో చుక్క నీరు కానరావడంలేదు. కోట మండలం గూడలి వద్ద ఇష్టానుసారంగా తవ్వకాలు యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు చినబాబు కనుసన్నల్లోనే.. రోజూ 40 టిప్పర్లు, 100 ట్రాక్టర్లలో తరలింపు నిషేధం కాగితాలకే పరిమితం గూడూరు నియోజకవర్గంలో ఇదీ దుస్థితి నదుల్లో ఇసుక తవ్వకాలను అక్టోబర్ వరకు జరపొద్దని ప్రభుత్వం ఆదేశించింది. అయితే జిల్లాలోని అధికార పార్టీ నేతలకు ఇది ఏ మాత్రం వర్తించడంలేదు. రీచ్లు దక్కించుకున్న వారితో చేతుల కలిపి ఇష్టానుసారంగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఫలితంగా ఆయా మండలాల్లోని పలు గ్రామాల్లో భూగర్బజలాలు అడుగంటి సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం పొంచి ఉంది. అక్రమ తవ్వకాలను గతంలో కొన్ని ప్రాంతాల్లో రైతులు అడ్డుకోవడంతో కొంతకాలం మిన్నకుండి.. తాజాగా పగలూ, రాత్రనే తేడా లేకుండా ఇష్టానుసారంగా కొల్లగొడుతున్నారు. -
ఆక్వా రైతుల ఆక్రందన
తోటపల్లిగూడూరు(పొదలకూరు): ఆక్వా రైతుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని.. కన్నీటి వేదన చూడలేకపోతున్నామని.. వారి కష్టం దళారులు, వ్యాపారుల పరమవుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. తోటపల్లిగూడూరు మండలంలోని ఈదూరులో రైతులతో కలిసి రొయ్యలు, చేపల చెరువులను ఆదివారం పరిశీలించారు. వారితో ముఖాముఖీ మాట్లాడి సమస్యలను ఆరాతీసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆక్వా రంగాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. కిలో మేత రూ.14 వరకు పెరగడాన్ని చూస్తే, సాగు కోలుకునే పరిస్థితి లేదని చెప్పారు. గత ప్రభుత్వంలో ఫీడ్ ధరలు పెరిగితే అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి వెంటనే సమీక్షలు నిర్వహించి రేట్లను అదుపు చేసిన అంశాన్ని గుర్తుచేశారు. ఫీడ్ తయారీదారులతో ప్రస్తుత సర్కార్ కుమ్మకై ్క, రైతులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. హేచరీస్ వైఫల్యంతోనే.. హేచరీస్పై ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషీ లేకపోవడంతో నాణ్యత లేని సీడ్ను సరఫరా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లక్ష పిల్లలను తీసుకుంటే బోనస్గా మరో 30 వేల నుంచి 40 వేల మేర ఉచితంగా అందజేసినా, చివరికి 50 వేలు కూడా బతికే పరిస్థితి లేదని చెప్పారు. నాసిరకం సీడ్తో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. హార్వెస్టింగ్ సమయంలో ఆదుకోవడంలేదని.. ఆక్వా ఉత్పత్తులను దళారులు, వ్యాపారులు దారుణంగా తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు విసిగి వేసారి ఎంతో కొంతకు వారికే విక్రయిస్తున్నారని వివరించారు. ఫీడ్ తయారీదారులు దోపిడీ చేస్తున్నా, ప్రభుత్వం మౌనంగా ఉందంటే ఏమి అర్ధం చేసుకోవాలని ప్రశ్నించారు. వారితో లాలూచీ పడటంతోనే రెండుసార్లు మొత్తంగా కలిపి కిలోకు రూ.14 మేర పెంచారని తెలిపారు. ఫీడ్ ధరలు ఏటా పెరుగుతున్నా, చేపల రేట్లు మాత్రం తగ్గిపోతున్నాయని పేర్కొన్నారు. రొయ్యల సాగు రైతులకు యూనిట్ను రూ.1.50కు అమలు చేయాలని, సాగు విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఈ మేరకు అందజేయాలని డిమాండ్ చేశారు. శ్రమ ఒకరిది.. ఫలితం మరొకరిది.. వరిసాగు మార్చి, ఏప్రిల్లో కోతలు పూర్తి కాగా, అప్పట్లో బీపీటీలు పుట్టి రూ.16 వేలు నుంచి రూ.17 వేలు.. షుగర్ లెస్ రూ.18 వేల మేరే పలికాయని తెలిపారు. ఆరుగాలం శ్రమించి అనేక కష్టనష్టాలకోర్చిన అన్నదాతలకు గిట్టుబాటు ధరలు లభించడంలేదన్నారు. మూడు నెలల వ్యవధిలో పుట్టి రూ.37 వేల నుంచి రూ.38 వేలకు పెరిగిందని చెప్పారు. పంటలకు సరైన మద్దతు ధరలు లభించడంలేదని.. వీరి నుంచి దళారులు, మిల్లర్లు తక్కువకు కొనుగోలు చేసి ధాన్యాన్ని నిల్వ ఉంచుకొని అధిక ధరలకు విక్రయిస్తున్నారని వివరించారు. ధరల స్థిరీకరణ నిధి లేకపోవడంతోనే ఇలాంటి నష్టాలను రైతులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆరోపించారు. కోతల సమయంలో సేకరించిన ధాన్యానికి సంబంధించిన నగదును ఇప్పటికీ కొందరు దళారులు చెల్లించలేదన్నారు. ధరల స్థిరీకరణ నిధికి రూ.మూడు వేల కోట్లను తమ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి కేటాయించారని, వాణిజ్య పంటల ధరలు తగ్గకుండా మార్క్ఫెడ్, సివిల్ సప్లయ్స్ శాఖలను రంగంలోకి దించి కొనుగోలు చేయించిన అంశాన్ని ప్రస్తావించారు. నేతలు చిల్లకూరు సుధీర్రెడ్డి, శంకరయ్యగౌడ్, టంగుటూరు శ్రీనివాసులురెడ్డి, వంశీధర్రెడ్డి, సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. వారి కష్టం దళారులు, వ్యాపారుల పరం కోలుకోలేని విధంగా దెబ్బతీసిన కూటమి సర్కార్ మండిపడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
శ్రామికుల హాహాకారాలు
పనుల కల్పనా గగనమే ●నెల్లూరు(పొగతోట): కూటమి పాలనలో వీబీ జీరామ్జీ శ్రామికులకు కష్టాలు తప్పడంలేదు. పనులు కల్పించడమే గగనంగా మారుతోంది. చేసిన వర్కులకు వేతనాలను ఇవ్వడంలోనూ జాప్యం చోటుచేసుకుంటోంది. దాదాపు రెండు నెలలుగా వీరికి ఇవ్వని పరిస్థితి నెలకొంది. సుమారు రూ.60 కోట్లకుపైగా బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. పనులకు ముఖం చాటేస్తూ.. బకాయిలను చెల్లించకపోవడంతో పనులకు వచ్చేందుకు శ్రామికులు ఏ మాత్రం ఆసక్తి చూపడంలేదు. మూడేళ్ల క్రితం వరకు నిత్యం లక్ష మందికిపైగా కూలీలు హాజరయ్యే వారు. అయితే ప్రస్తుతం ఈ సంఖ్య 38 వేలకు మించి దాటడంలేదు. రెండు నెలల క్రితం వరకు కూడా దాదాపు 50 వేల మంది వచ్చేవారు. ఎండల తీవ్రత, పని ప్రదేశాల్లో సౌకర్యాలను కల్పించకపోవడం, వేతనాలు అందకపోవడం.. ఇలా పలు కారణాలతో వ్యవసాయ, ఇతర వర్కులకు అధిక శాతం మంది వెళ్తున్నారని తెలుస్తోంది. నిబంధనలు బేఖాతర్ వాస్తవానికి వీబీ జీరామ్జీ పథకం నిబంధనల మేరకు పనులు చేసిన వారికి 15 రోజులకోసారి వారి బ్యాంక్ ఖాతాల్లో వేతనాలను జమ చేయాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియలో అంతులేని జాప్యం చోటుచేసుకుంటోంది. పాత బకాయిలు రూ.36 కోట్లు.. వీబీ జీరామ్జీకి సంబంధించి రూ.24 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. కూలిలు అందక వీరు పస్తులుండాల్సిన పరిస్థితి దాపురించింది. ఉద్యోగుల పరిస్థితీ ఇంతే.. వీబీ జీరామ్జీలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ఎఫ్ఏలకూ జీతాలు రెండు నెలలుగా లేవు. ఈ పథకం అమల్లో డ్వామా పీడీ, ఏపీడీ, ఎఫ్ఎం, ఏఓలు, సూపరింటెండెంట్లు, టీఏలు, ఈసీలు, ఏపీఓలు, బీఎఫ్టీలు, ఎఫ్ఏలు పనిచేస్తున్నారు. వీరందరికీ జీతాలు అందలేదు. కార్యాలయాల నుంచి క్షేత్రస్థాయి వరకు సుమారు 1400 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ పరిణామాల క్రమంలో పిల్లల ఫీజులు, ఈఎమ్ఐలు, ఇలా ప్రతి దానికీ వీరు అగచాట్లు పడాల్సి వస్తోంది. వేతనాలను త్వరితగతిన అందజేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. చెల్లించేలా చర్యలు వీబీ జీరామ్జీ పథకంలో పనిచేస్తున్న శ్రామికులకు వేతన బకాయిల రూపంలో దాదాపు రూ.60 కోట్లను చెల్లించాల్సి ఉంది. వీటిని మంజూరు చేయించేలా చర్యలు చేపడతాం. ఉన్నతాధికారులతో మాట్లాడుతూ... సాధ్యమైనంత త్వరగా చెల్లించేలా చూస్తాం. శ్రామికులందరూ పనులకు హాజరుకావాలి. – శ్రీనివాసప్రసాద్, పీడీ, డ్వామా రెండు నెలలుగా అందని వేతనాలు రూ.60 కోట్లకుపైగా బకాయిలు పథకాన్ని మార్పు చేసినా అదే తీరు వీబీ జీరామ్జీకి వచ్చే వారి సంఖ్య తగ్గుముఖంవికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ (వీబీ జీరామ్జీ) పథకానికి హాజరవుతున్న శ్రామికులకు కష్టాలు ఏ మాత్రం తీరడంలేదు. గతంలో అమలవుతున్న పథకాన్ని మార్పు చేసినా, ఎలాంటి పురోగతి లేకపోవడం వీరిని కలవరానికి గురిచేస్తోంది. రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో వీరికి ఆకలి కేకలు తప్పడంలేదు. దాదాపు రూ.60కుపైగా కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఫలితంగా దీనికి వచ్చేందుకు ముఖం చాటేస్తున్న పరిస్థితి నెలకొంది. వీబీ జీరామ్జీ రూల్స్ మేరకు శ్రామికులకు నూతన పనులను చూపాల్సి ఉంది. పంట కాలువలకు సంబంధించిన వర్కులను గతంలో అధికంగా చేసేవారు. అయితే ప్రస్తుతం ఇవి లేకపోవడంతో పంచాయతీల్లో పనులు కల్పించడమే గగనంగా మారుతోంది. ఫలితంగా వీరిని తీసుకొచ్చేందుకు నానా అవస్థ పడాల్సి వస్తోంది. జిల్లాలో జాబ్ కార్డులు కలిగిన శ్రామికులు దాదాపు నాలుగు లక్షల మంది ఉన్నారు. -
ముగిసిన రాష్ట్ర స్థాయి క్యారమ్ టోర్నమెంట్
● విజేతలకు బహుమతుల ప్రదానం నెల్లూరు(టౌన్): రాష్ట్ర ప్రథమ ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్ – 2026 ఆదివారంతో ముగిసింది. నగరంలోని దర్గామిట్టలో ఉన్న నెల్లూరు క్లబ్లో మూడు రోజులపాటు జరిగాయి. పురుషుల విభాగంలో సీహెచ్ జనార్దనరెడ్డి (విశాఖ) ప్రథమ స్థానం, యు.శరత్బాబు (నెల్లూరు) ద్వితీయ స్థానం, బి.రవీంద్రారెడ్డి (గుంటూరు) తృతీయ స్థానం, జి.రమేష్ (నెల్లూరు) నాలుగో స్థానంలో నిలిచారు. మహిళా విభాగంలో ఎల్.హరిప్రియ (విశాఖ) ప్రథమ స్థానం, బి.శోభిక (తిరుపతి) ద్వితీయ స్థానం, ఎంఎస్ హారిక (విశాఖ) తృతీయ స్థానం, ఎస్కే హుస్నా సమీరా (విశాఖ) నాలుగో స్థానం సాధించారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్ర జట్టును ఎంపిక చేశారు. విజేతలకు సరయూ హీరో మేనేజింగ్ డైరెక్టర్ రాజకుమార్ చేతుల మీదుగా నగదు బహుమతులు, ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ కో చైర్మన్ మలిరెడ్డి కోటారెడ్డి మాట్లాడుతూ యువ క్రీడాకారులు లక్ష్య సాధనకు కృషి చేసి రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాష్ట్ర క్యారమ్ సంఘం ప్రధాన కార్యదర్శి అబ్దుల్ జలీల్, విద్యుత్ శాఖ విశ్రాంత ఎస్ఈ శేషారెడ్డి, అపోలో ఆస్పత్రి సీఈఓ విశ్వేశ్వరరెడ్డి, జిల్లా క్యార మ్ సంఘం అధ్యక్షుడు శ్రీమన్నారాయణ, కార్యదర్శి పి.శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ సంస్థ కార్మికుల పోరుబాట
నెల్లూరు(వీఆర్సీసెంటర్): సమస్యలు పరిష్కరించాలంటూ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు పోరుబాట పట్టారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీన ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనిని విజయవంతం చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, స్ట్రగుల్ కమిటీ నాయకులు హజరత్తయ్య, జాకీర్హుస్సేన్ పిలుపునిచ్చారు. నెల్లూరులోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వీరు మాట్లాడారు. విద్యుత్ సంస్థల్లో అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను నేటికీ ఇవ్వలేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదన్నారు. చలో విజయవాడ కార్యక్రమంలో జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, కార్మికులు హాజరుకావాలని కోరారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకులు పెంచలప్రసా ద్, రామయ్య, మహేష్, హరినారాయణ, నాగయ్య, విజయరామిరెడ్డి, దయాకర్, రసూల్, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. -
సాగరమాల... సాగదీత
● నత్తనడకన సాగుతున్న జాతీయ రహదారి పనులు ● పరిహారం పంపిణీలో జాప్యం ● అడ్డంకులతో నిలిచిన నిర్మాణం ● 2027 నాటికై నా పూర్తవుతుందా? ● ప్రమాదాలకు నిలయంగా వరగలి క్రాస్రోడ్డుకేంద్ర ప్రభుత్వం చేపట్టిన సాగరమాల రహదారి ప్రాజెక్ట్ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. కృష్ణపట్నం పోర్టును బెంగళూరుతో అనుసంధానించే ఈ రహదారి నిర్మాణం అంతులేని జాప్యానికి గురవుతుండటంతో చిల్లకూరు మండలంలోని వరగలి క్రాస్రోడ్డు ప్రమాదాలకు కేంద్రంగా మారింది. ఫ్లై ఓవర్ నిర్మాణం కొనసాగుతుండటంతో తాత్కాలిక అప్రోచ్ రోడ్లపై వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఈ క్రమంలో తరచూ ప్రమాదాలకు జరుగుతున్నాయి.చిల్లకూరు: కృష్ణపట్నం పోర్టు నుంచి జాతీయ రహదారికి అనుసంధానంగా చిల్లకూరు, కోట, నాయుడుపేట మండలాల మీదుగా నాలుగు లేన్ల రహదారి నిర్మాణాన్ని సుమారు రూ.1,000 కోట్ల వ్యయంతో చేపట్టారు. కాంట్రాక్టర్లు ముందుగా స్థానికులకు రోడ్డు ఎలా వస్తుందనే విషయాలను తెలియజేయకుండా చేపట్టడంతో పలు ప్రాంతాల్లో అడ్డంకులు ఎదురవుతున్నాయి. వరగలి క్రాస్రోడ్డు నుంచి తూర్పు కనుపూరు వరకు నిర్మించాల్సిన నాలుగు లేన్ల రహదారి పనులు ఈ కారణాలతో తీవ్రంగా ఆలస్యమవుతున్నాయి. ముత్యాలపాడు – పారిచెర్లవారిపాళెం మధ్య వర్షాకాలంలో ఉప్పుటేరు పొంగి రోడ్డుపైకి ఐదడుగుల మేర నీరు చేరుతుందనే విషయాన్ని ముందుగానే గుర్తించకుండా పనులు ప్రారంభించారని స్థానికులు పేర్కొంటున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రైతులు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తికి వినతి అందజేయగా, ఆయన కేంద్ర మంత్రితో మాట్లాడి వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఇతర ప్రాంతాల్లో కూడా తలెత్తిన సమస్యలను సకాలంలో పరిష్కరించకపోవడంతో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పరిహారం ఎక్కడ? వరగలి క్రాస్రోడ్డు నుంచి తూర్పు కనుపూరు వరకు 36 కిలోమీటర్లు, అక్కడి నుంచి నాయుడుపేట వరకు మరో 34 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్ట్కు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి 2024లో పనులు ప్రారంభించి ఏడాదిలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. అయితే రెండేళ్లు గడిచినా పనులు పూర్తికాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ రహదారి చిల్లకూరు, కోట మండలాల్లోని సుమారు 24 గ్రామాల మీదుగా వెళ్తుంది. పలుచోట్ల పట్టా భూములు సేకరించినప్పటికీ యజమానులకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారం అందకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయిన ప్రాంతాలున్నాయి. భూసేకరణ సమస్యలు పరిష్కారం కాకపోవడం కూడా పనుల జాప్యానికి ప్రధాన కారణంగా మారింది. ఎన్నో ప్రమాదాలు సాగరమాల ప్రాజెక్ట్లో భాగంగా జాతీయ రహదారి నుంచి వరగలి మీదుగా తీర ప్రాంతానికి భారీ వాహనాలు సులభంగా రాకపోకలు సాగించేలా వరగలి క్రాస్రోడ్డు వద్ద ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారు. ఈ పనుల కారణంగా రెండు వైపులా అప్రోచ్ రోడ్ల ద్వారా ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. దీంతో రహదారి ఇరుకుగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సాయంత్రం వేళల్లో వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోతోంది. రాత్రి సమయాల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు అప్రోచ్ రోడ్డును గుర్తించలేక ప్రమాదాలకు గురవుతున్నారు. అప్పటికి పూర్తవుతుందా? ప్రభుత్వం తొలుత ఈ ప్రాజెక్ట్ను 2025 డిసెంబరు నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యంతో 2027 చివరి నాటికై నా పూర్తవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం దృష్టి సారించి త్వరగా పనులు జరిగేలా చర్యలు తీసుకోవాల్సింది. వరగలి క్రాస్రోడ్డు వద్ద నిలిచిపోయిన ఫ్లై ఓవర్ పనులుజాతీయ రహదారిపై కల్వర్టు నిర్మాణంపార్లమెంట్లో ప్రస్తావిస్తా పోర్టులను అనుసంధానం చేసేలా రూపుదిద్దుకుంటున్న సాగరమాల రహదారి పనులు నత్తనడకన సాగుతున్న విషయాన్ని చిల్లకూరు, కోట మండలాలకు చెందిన ఆయా గ్రామాల ప్రజలు నా దృష్టికి తెచ్చారు. అలాగే నిర్మాణ సంస్థ ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు అవసరమైన సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయడంలోనూ, బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఆలస్యం చేస్తోంది. ఈ విషయాలపై ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తా. పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపడతా. – మద్దిల గురుమూర్తి, ఎంపీ, తిరుపతి -
వేంపాడులో చోరీల కలకలం
● అదుపులో అనుమానితులు వరికుంటపాడు: మండలంలోని వేంపాడు గ్రామంలో శనివారం పట్టపగలే దేవాలయానికి చెందిన సామగ్రి, ఓ ఇంట్లో చోరీలు జరగ్గా, గ్రామస్తులు ఐదుగురు అనుమానితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. గ్రామంలోని రామాలయానికి చెందిన ఇత్తడి చెంబు, బిందె, రెండు గంటలు, తదితర సామగ్రిని పంచాయతీ భవనంలో భద్రపరచగా, వాటిని దుండగులు అపహరించారు. దీనికి సమీపంలోనే పోలిచెర్ల షాజిదా నివాసంలో సుమారు ఐదు సవర్ల బంగారు ఆభరణాలు, గొలుసు, ఉంగరం, గుండ్లకమ్మలు తదితర నగలను చోరీ చేసినట్లు బాధితులు గుర్తించి కేకలు వేయగా గ్రామస్తులు వెంటనే స్పందించారు. అదే సమయంలో ఆటోలో వెళ్తున్న అనుమానితులను అడ్డుకుని తనిఖీ చేయగా, వారి వద్ద దేవాలయానికి చెందిన సామగ్రి లభించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, నలుగురు మహిళలు, ఓ పురుషుడు సహా మొత్తం ఐదుగురిని ఆటోతో పాటు వరికుంటపాడు పోలీస్స్టేషన్కు తరలించారు. ఎస్సై మధుసూదన్రావు ఆధ్వర్యంలో విచారిస్తున్నారు. దేవాలయానికి చెందిన సామగ్రి స్వాధీనం అయినప్పటికీ, ఇంట్లో చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్న బంగారు ఆభరణాలు లభించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సోమిరెడ్డీ.. సీబీఐ విచారణకు సిద్ధమా..?
నెల్లూరు రూరల్: అవినీతి, అక్రమాలు, బినామీ ఆస్తుల సంపాదనలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు. నీతి, నిజాయతీకి బ్రాండ్ అని చెప్పుకొనే సోమిరెడ్డి బతుకు అందరికీ తెలుసునని చెప్పారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి గ్రావెల్, ఇసుక, బూడిద, క్వార్ట్జ్, భూ దందాలు, లేఅవుట్ సెటిల్మెంట్లు, మహిళా ఉద్యోగులకు వేధింపులు ఇలా అన్ని రాస్తే పుస్తకం సైతం సరిపోదని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేసే ముందు ఆయన అవినీతి, ఆస్తులు, భూ వ్యవహారాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో తనపై వచ్చిన ఆరోపణలపై విచారణను సీబీఐ జరిపి ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైన నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. నార్కో, పాలిగ్రాఫ్ పరీక్షల ఆధారంగా ఈ కేసుతో సంబంధంలేదనే విషయం తేలిందన్నారు. నిజాయతీ నిరూపించుకో..! సోమిరెడ్డికి ధైర్యముంటే ఆరోపణలపై సీబీఐ విచారణకు అంగీకరించాలని.. లేని పక్షంలో తనతో బహిరంగ చర్చకు తేదీ, సమయాన్ని నిర్ణయించాలని సవాల్ విసిరారు. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరి ఆస్తుల వివరాలను ప్రజల ముందుంచి చర్చించేందుకు తాను సిద్ధమని చెప్పారు. బూడిద బల్కర్లు, గ్రావెల్, క్వార్ట్జ్ తవ్వకాలు, గోవధ, స్లాటర్ హౌస్లు, దేవాలయ, ఏపీఐఐసీ భూములు, బండేపల్లి కాలువ, లేఅవుట్ సెటిల్మెంట్లు, మహిళా ఉద్యోగులపై వేధింపులు, అక్రమ వసూళ్లతో నెలకు రూ.లక్షల్లో దోచుకుంటోంది నిజం కాదానని నిలదీశారు. మీ తండ్రి ఇచ్చిన ఆస్తి ఎంత.. ఈ రోజు నీ వద్ద ఉన్న ఆస్తెంతో బహిరంగ చర్చకు సిద్ధమానని సవాల్ విసిరారు. తాను కొనుగోలు చేసిన.. విక్రయించిన ఆస్తులను సేల్ డీడ్లతో సహా బయటపెడతానని.. అలాగే సోమిరెడ్డికి ధైర్యముంటే బెంగళూరులో కొన్న గ్రానైట్ ఆస్తులు, బినామీ పేర్లతో ఉన్న వాటి వివరాలను చూపాలని డిమాండ్ చేశారు. గతంలో మీ హయాంలో ఏపీఐఐసీ భూములను కారుచౌకగా కొట్టేసేందుకు యత్నించింది నువ్వు కాదా.. పెద్దలే గద్దలు అని ఈనాడులో వార్తలు రావడం నిజం కాదానని ప్రశ్నించారు. అభివృద్ధి నిరోధకుడు.. దోపిడీదారుడు తాను మంత్రిగా ఉన్న సమయంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ప్రాంతంలో ఈఎస్ఐ హాస్పిటల్కు స్థలాన్ని ఎంపిక చేసి ఎంపీ గురుమూర్తి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపామని, అయితే మీరు అధికారంలోకి వచ్చాక వద్దని చెప్పి దాన్ని కాజేయాలని చూసిన దానిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇడిమేపల్లి వద్ద డిస్టిలరీస్ వారికి ఊళ్లో ఉన్న స్థలాన్ని విక్రయిస్తే, దానిపై కేసులు పెట్టించి సంబంధం లేని స్థలాన్ని స్వయంగా రిజిస్టర్ చేసిన చరిత్ర నీదే కదానని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు క్రీడా మంత్రి పదవినివ్వగా, ఉచిత క్రికెట్ కిట్లను తెచ్చి రూ.వెయ్యికి విక్రయించిన దౌర్భాగ్యుడివని విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో ఇంటి వద్దే నకిలీ విత్తనాల దుకాణాన్ని పెట్టారని ఆరోపించారు. తోటపల్లిగూడూరు మండలంలో పనికి ఆహార పథకం కింద వచ్చిన బియ్యాన్ని అమ్ముకున్నారంటూ అప్పట్లో జమీన్రైతు పత్రికలో ఆ బస్తాల ఫొటోలతో సహా ఆధారాలు ప్రచురితమైన అంశాన్ని గుర్తుచేశారు. అల్లీపురంలో నీ బతుకేంటో, తన గ్రామంలో తన స్థాయేంటో ప్రజలకు తెలుసునన్నారు. మీ అక్రమాలకు సంబంధించిన ఆధారాలను దశలవారీగా ప్రజల ముందుంచుతామని ప్రకటించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై నిష్పాక్షిక విచారణను జరిపించాలని, మీడియాపై బెదిరింపులు, అక్రమ వసూళ్లపై పోలీస్ శాఖ స్పందించాలని డిమాండ్ చేశారు. ఇంటర్వెల్ సమయంలో పిల్లలు బయటకెళ్తే దొంగతనంగా పుస్తకాలను తీసుకెళ్లి శనగలు, బెల్లానికి అమ్ముకున్న చరిత్ర నీదని.. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలనైనా కోర్టులో నిరూపించాలని సవాల్ చేశారు. సోమిరెడ్డి రాజకీయ, వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన వివరాలతో సోమిరెడ్డి కథలు పేరుతో పుస్తకాన్ని తీసుకొచ్చి ప్రజలకు పంపిణీ చేస్తామని తెలిపారు. నీ అవినీతి, అక్రమాలకు హద్దే లేదు నాపై వచ్చిన ఆరోపణల్లో సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది బెంగళూరు కేంద్రంగా కొన్న బినామీ ఆస్తులు వెల్లడిస్తావా..? నీదీ ఓ బతుకేనా.. సిగ్గుండాలి ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
విధులకు డుమ్మా కొట్టి టీడీపీ సేవలో..
– గంగమిట్ట అంగన్వాడీ కార్యకర్త నిర్వాకం వింజమూరు (ఉదయగిరి): విధులకు డుమ్మా కొట్టి.. చిన్నారులను గాలికి వదిలేసిన ఓ అంగన్వాడీ కార్యకర్త కొద్ది రోజులుగా టీడీపీ ఇంటింటి ప్రచారంలో నిమగ్నమైన వైనం వింజమూరులోని పాతూరు గంగమిట్టలో జరుగుతోంది. వివరాల్లోకి వెళ్తే.. గంగమిట్ట అంగన్వాడీ కేంద్రంలో భాగ్యమ్మ కార్యకర్తగా పని చేస్తోంది. అయితే ఆమె ఇటీవల టీడీపీ ముఖ్య నేత తన బంధువని చెప్పుకుంటూ ఉద్యోగులు, అధికారులను బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా ఆమైపె చర్యలు తీసుకునేందుకు సంబంధిత ఐసీడీఎస్ అధికారులు సాహసించకపోవడంతో బహిరంగంగానే ఆమె టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా శనివారం ఆ పార్టీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వింజమూరులో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో భాగ్యమ్మ పాల్గొనడంపై స్థానికులు ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. విధులకు హాజరు కాకుండా.. టీడీపీ ప్రచారంలో పాల్గొనడం ఏమిటని నిలదీశారు. ఈ విషయమై సీడీపీఓ పద్మజాకుమారిని వివరణ కోరగా.. వేరే ఊర్లో ఉన్నందున మధ్యాహ్నం వరకు విధులకు రాలేనని పర్మిషన్ కోరగా అనుమతించామని, కానీ ఆమె రోజంతా రాకుండా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఫిర్యాదులొచ్చాయన్నారు. దీనిపై విచారించి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని చెప్పారు. -
వంటకు ఇండక్షన్ టెన్షన్
చిల్లకూరు: కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు ఇండక్షన్ స్టౌల రూపంలో కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. అంగన్వాడీల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నట్లుగా ప్రకటిస్తూ వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. పశ్చిమాసియాలో యుద్ధవాతావరణం కారణంగా గ్యాస్కు కొరత ఏర్పడడాన్ని సాకుగా చూపుతూ ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఆధారిత ఇండక్షన్ స్టౌలను పంపిణీ చేసింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే అంగన్వాడీల పరిస్థితి పొయ్యిలో నుంచి పెనంపై పడినట్లుగా తయారైంది. కరెంట్ పోతే ఇండక్షన్ స్టౌలు పనిచేయకపోతుండడంతో వంటకు ఆటంకం ఎదురవుతోందని, విద్యుత్ బిల్లులు తడిసిమోపెడవుతున్నాయని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ పోతే వంట బంద్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు విడతల వారీగా ఇండక్షన్ స్టౌలను పంపిణీ చేయడం ఆరంభించింది. ఈ నెలతో స్టౌల పంపిణీని పూర్తి చేసింది. ఇకపై జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ ఆధారిత ఇండక్షన్ స్టౌలపైనే వంట చేసి పోషకాహారం వడ్డించాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ముందస్తు సమాచారం లేకుండానే కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు. సరిగ్గా చిన్నారులకు వంట చేసే సమయంలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తుండడంతో సకాలంలో పిల్లలకు భోజనాలు వడ్డించలేక అంగన్వాడీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంట పాత్రలతోనూ అగచాట్లే గ్యాస్ స్టౌపైన అయితే ఏ పాత్రలైనా పనిచేస్తాయి. ఇండక్షన్ స్టౌపై అన్ని పాత్రలు పనిచేయవు. ఇండక్షన్ బేస్ లేదా అడుగు భాగంలో కాపర్ ఉన్న పాత్రలు మాత్రమే ఉపయోగించాలి. గ్యాస్ స్టౌపై ఎంత పెద్ద పాత్రలైనా పెట్టి వంట చేసే వారు. ఇండక్షన్ స్టౌలపై భారీ పాత్రలు పెట్టి వంట చేసే పరిస్థితి లేకపోవడంతో అంగన్వాడీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు స్టౌవ్పై వంట చేస్తున్న సమయంలో సరఫరా నిలిచిపోతే మళ్లీ కట్టెల పొయ్యిలపై కుస్తీ పట్టాల్సిందేనని అంగన్వాడీలు వాపోతున్నారు. మరోవైపు ఇండక్షన్ స్టౌలు పాడైతే గ్రామీణ ప్రాంతాల్లో మరమ్మతులు చేసే నాథుడే లేడు. పట్టణాలకు తీసుకెళ్లి బాగు చేయించాలంటే కనీసం రెండు, మూడు రోజులు పడుతుంది. ఆ సమయంలో పిల్లల ఆకలి ఎలా తీర్చాలని అంగన్వాడీలు ప్రశ్నిస్తున్నారు. అందని బిల్లులు గతేడాది నుంచి అంగన్వాడీ కార్యకర్తలకు వంటచెరుకు బిల్లులను అందజేయడాన్ని ఐసీడీఎస్ పూర్తిగా మరిచిపోయింది. ఏడాదిగా గ్యాస్ సిలిండర్లు నిలిపివేసిన ఐసీడీఎస్.. కేంద్రంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రూ.0.24 పైసలు చొప్పున వంటచెరుకు ఖర్చులు చెల్లిస్తామని ప్రకటించింది. అయితే నేటికి కూడా బిల్లులు అందజేయలేదు. అయినా అంగన్వాడీలు తమ ఇంట్లో బిడ్డలకే వడ్డిస్తున్నామనుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. విద్యుత్ బిల్లుల భారం ఇండక్షన్ స్టౌలు పంపిణీ చేసిన తరువాత ప్రతి అంగన్వాడీ కేంద్రానికి విద్యుత్ బిల్లుల కోసం నెలకు రూ.500 ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే అంగన్వాడీ కేంద్రంలో ఒక ఫ్యాన్, ట్యూబ్లైట్ ఉంటే నెలకు కనీసం రూ.400 నుంచి రూ.500 వరకు బిల్లు వస్తుంది. ప్రస్తుతం ఇండక్షన్ స్టౌపై వంట చేస్తే రోజుకు కనీసం అరగంట పాటు వినియోగిస్తే విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవుతాయని, వాటిని తామే చెల్లించుకోవాలంటే కష్టమవుతుందని అంగన్వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇచ్చిన రీతిలో అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఉచిత విద్యుత్ను అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో ఐసీడీఎస్ ప్రాజెక్ట్లు – 12 అంగన్వాడీ కేంద్రాలు – 2,934 చిన్నారులు – 1.17 లక్షల మంది బాలింతలు – 11,850 మంది గర్భిణులు – 14,600 మంది పంపిణీ చేసిన ఇండక్షన్ స్టౌలు – 2934గ్యాస్ సిలిండర్లు ఏమైనట్లు? గతంలో జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు వంట గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసేవారు. ఇందుకు గాను ఆయా కేంద్రాల్లో పని చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల పేరుతో సిలిండర్లు బుక్ చేసి డెలివరీ చేసేవారు. నేడు ఆ పరిస్థితి లేదు. గతేడాది నుంచి గ్యాస్సిలిండర్లను సరఫరా చేయడం లేదు. గ్యాస్ సిలిండర్లను బుక్ చేయకపోతే ఏజెన్సీలు కనెక్షన్లను రద్దు చేశాయా లేక కార్యకర్తలే సొంతానికి వినియోగించుకుంటున్నారా అనే విషయం కూడా గోప్యంగా ఉంచేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 2,934 గ్యాస్ సిలిండర్లు ఏమయ్యాయనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అంగన్వాడీ కేంద్రాలకు స్టౌల పంపిణీ గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిపివేత కరెంట్ పోతే వంటకు ఆటంకాలు తడిసిమోపెడవుతున్న విద్యుత్ బిల్లులు పట్టించుకోని ఐసీడీఎస్ అధికారులు -
కారు బోల్తా– మహిళకు గాయాలు
వెంకటాచలం: వేగంగా వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడి మహిళ గాయపడిన ఘటన మండల కేంద్రమైన వెంకటాచలంలో శనివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. హైదరాబాద్ నుంచి తిరుమలకు దైవదర్శనం నిమిత్తం ఓ కుటుంబం కారులో బయలుదేరింది. అయితే కారు వెంకటాచలం సమీపంలోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకోగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగిలిన వారికి ఎలాంటి గాయాలు కాలేదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బైక్ అదుపుతప్పి.. మోటార్ బైక్ అదుపుతప్పి పడి యువకుడు గాయపడిన ఘటన మండలంలోని కాకుటూరు సమీపంలో శనివారం జరిగింది. గూడూరు నుంచి శ్రీనివాస్ అనే వ్యక్తి బైక్పై నెల్లూరుకి వెళ్తుండగా కాకుటూరు సమీపంలో అదుపుతప్పి పడింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్కు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. -
ధర్మవరంలో దర్జాగా..
వరికుంటపాడు: మండలంలోని కొండాయపాళెం పంచాయతీ ధర్మవరంలో ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు తమ్ముళ్లు రంగంలోకి దిగారు. సర్వే నంబర్ 148 / 1లో ఉన్న సుమారు 3.3 ఎకరాల ల్యాండ్ను కొందరు టీడీపీ నేతలు ఆక్రమించి జేసీబీలతో చెట్లను తొలగించి చదును చేశారు. ఆపై చుట్టూ ముళ్ల తీగలతో ఫెన్సింగ్ వేసి, బోరును శనివారం వేయించడం గమనార్హం. సదరు స్థలం ప్రభుత్వానికి చెందిందంటూ ఇక్కడ బోర్డును ఏర్పాటు చేసినా, దాన్ని తొలగించి మరీ పని కానిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం కరువవుతోందని పేర్కొన్నారు. కాగా ఈ అంశమై వీఆర్వో, తహసీల్దార్ను సంప్రదించేందుకు సాక్షి యత్నించగా, వారు స్పందించలేదు. -
నగదు బ్యాగ్ అప్పగింత
సంగం: ఆర్టీసీ బస్సులో పోగొట్టుకున్న రూ.4 లక్షల నగదు ఉన్న బ్యాగును సంగం పోలీసులు శనివారం గంటల వ్యవధిలో గుర్తించి బాధితురాలికి అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. కడప నుంచి నెల్లూరుకు వస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న భవాని అనే మహిళ రూ.4 లక్షల నగదు ఉన్న బ్యాగు కనపడకపోవడంతో కంగారు పడి బుచ్చిరెడ్డిపాళెంలో దిగింది. వెంటనే ఆర్టీసీ సిబ్బందిని ఆశ్రయించింది. వారి సూచనల మేరకు సంగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా సంగంలో ఆరుగురు ప్రయాణికులు బస్సు నుంచి దిగుతూ పొరపాటున ఆ మహిళ బ్యాగును తీసుకెళ్లినట్లు గుర్తించారు. సదరు వ్యక్తులు ఆ బ్యాగ్ తమది కాదని సంగంలో వదిలి వెళ్లిపోయారు. టెంకాయల వ్యాపారి కృష్ణ అందించిన సమాచారంతో హోంగార్డులు అంకమ్మ, వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. రూ.4 లక్షల నగదు ఉన్నట్లు నిర్ధారించి బాధితురాలికి అప్పగించారు. -
చలో ఢిల్లీ విజయవంతానికి పిలుపు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1వ తేదీన సీపీఐ ఆధ్వర్వంలో ‘మార్పు అవసరం’ పేరుతో చేపట్టే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, వర్గ సభ్యుడు జంగాల అజయ్కుమార్, జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి పిలుపునిచ్చారు. ఈ మేరకు నగరంలోని గాంధీబొమ్మ సెంటర్లో శనివారం పోస్టర్లను ఆవిష్కరించారు. మోదీ ప్రధానిగా అధికారం చేపట్టాక దేశంలో నిరాశ, ఆందోళనలు నెలకొన్నాయని, నిరుద్యోగం పెరిగిపోయిందని, ఆర్థిక అసమానతలు విస్తరించడంతో పాటు సామాజిక ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయన్నారు. చివరకు నీట్ లాంటి జాతీయ స్థాయి పేపర్లు లీక్ కావడం సిగ్గుచేటన్నారు. ఈనెల 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పాదయాత్రలు, 17వ తేదీ నుంచి 28 వరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి సెప్టెంబర్ 1న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. నాయకులు దామా అంకయ్య, నందిపోగు రమణయ్య, మధు, సిరాజ్, మున్నా, షాన్వాజ్, సోఫియా, జిలానీఖాన్, ఖాదర్బాషా తదితరులు పాల్గొన్నారు. -
అయ్యోరిలా.. చదువులెలా?
● మధ్యాహ్నం వరకు విద్యార్థుల ఎదురుచూపులు ● ప్రభుత్వ చర్యలతో నలుగురే మిగిలారు చిట్టమూరు: మండల పరిధిలోని ఆరూరు పంచాయతీ తంబుగారిపాళెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు నాలుగు రోజులుగా ఉపాధ్యాయుడు రాకపోవడంతో విద్యార్థులు మధ్యాహ్నం వరకు ఉండి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలో శనివారం కూడా ఉపాధ్యాయుడు రాకపోవడంతో విద్యార్థులు మధ్యాహ్నం పాఠశాలలోనే ఉండి మధ్యాహ్న భోజనం చేసి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఈ విద్యాసంవ్సతరం నుంచి తమ గ్రామంలోని పాఠశాలకు రెగ్యులర్ ఉపాధ్యాయుడు లేకపోవడంతో డిప్యుటేషన్పై వచ్చిన వారు సక్రమంగా హాజరు కావడం లేదన్నారు. అదేమని అడిగితే బదిలీపై ఉపాధ్యాయులు వెళ్లడంతో రోజుకో ఉపాధ్యాయుడు వస్తున్నాడన్నారు. మరీ దారుణంగా వారం రోజులు నుంచి బడికి పిల్లలు వెళ్లి మధ్యాహ్నం వరకు బడిలోనే ఉండి భోజనం చేసుకుని ఏమీ చేయలేక ఇంటికి వచ్చేస్తున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మిగతా పిల్లలు ఇతర పాఠశాలల్లో చేర్పించుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో 25 మందికిపైగా విద్యార్థులు గత ప్రభుత్వ హయాం వరకు ఇక్కడి పాఠశాలలో సుమారు 25 మందికి పైగా విద్యార్థులు చదువుకునేవారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను గాలికి వదిలేయడంతో ఇక్కడ కేవలం నలుగురు విద్యార్థులు మాత్రమే మిగిలారు. ఆ చిన్నారుల తల్లిదండ్రులు కూడా ఇతర పాఠశాలలకు పంపే వసతి లేక ఇక్కడికి పంపుతున్నారు. దీనిపై ఎంఈఓ బీవీ కృష్ణయ్యను వివరణ కోరగా ఉపాధ్యాయుల కొరత ఎక్కువగా ఉందన్నారు. అసలు ఉపాధ్యాయుల్లేని పాఠశాలలకు సీఆర్పీలను పంపుతున్నామన్నారు. ఈ క్రమంలోనే తంబుగారిపాళెం పాఠశాలకు సీఆర్పీని పంపామన్నారు. ఎందుకు పాఠశాలకు వెళ్లలేదో తెలుసుకుని చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు. ఉపాధ్యాయుడు రాకపోవడంతో ఖాళీగా కూర్చుని ఉన్న విద్యార్థులు ఉపాధ్యాయుడు రాకపోవడంతో పాఠశాల గదిలో ఖాళీగా ఉన్న కుర్చీకూటమి ప్రభుత్వ చర్యలతో ప్రాథమిక పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయి. శాశ్వత ఉపాధ్యాయుల నియామకం చేపట్టకపోవడంతో జిల్లాలోని అనేక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. జిల్లాలోని తంబుగారిపాళెం ప్రాథమిక పాఠశాలకు నాలుగు రోజులుగా ఉపాధ్యాయుడు డుమ్మా కొడుతున్నా పట్టించుకునేవారు లేకుండాపోయారు. -
మేనేజర్ వైఖరి వల్లే తమ బిడ్డ మృతి
● న్యాయం చేయాలని కుటుంబీకుల ఆవేదన కొడవలూరు: మండలంలోని బొడ్డువారిపాళెం పెట్రోల్ బంకు మేనేజర్ వైఖరి వల్లే తమ బిడ్డ సురేష్ మృతిచెందాడని తల్లి గుండ్రి పోలీసుల వద్ద వాపోయారు. బొడ్డువారిపాళెం వద్ద హైవేపై ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొని అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీ గిరిజన తండాకు చెందిన యువకుడు కె.సురేష్ శుక్రవారం మృతి చెందడం తెలిసిందే. ఈ క్రమంలో సురేష్ తల్లి, ఇతర కుటుంబ సభ్యులు శనివారం కొడవలూరు పోలీసులను ఆశ్రయించారు. తమ బిడ్డ బొడ్డువారిపాళెం పెట్రోల్ బంకులో ఫిల్లింగ్ బాయ్గా చేరితే సంబంధం లేని బంకు మేనేజర్ తీసుకెళ్లారని, పని పూర్తయ్యాక మార్గమధ్యలో సురేష్కు బైక్ ఇచ్చి పంపడం వల్లే ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేదలమైన తమకు న్యాయం చేయాలని వారు పోలీసులను వేడుకున్నారు. సీఐ దుర్గాప్రసాద్రావు జోక్యం చేసుకుని పెట్రోల్ బంకు మేనేజర్తో మాట్లాడి మృతుని కుటుంబీకులకు రూ.2.20 లక్షల పరిహారం చెల్లించేలా ఒప్పించారు. -
కల్యాణ లక్ష్మి.. కటాక్షమెప్పుడో..?
ఆత్మకూరు: తాము అధికారంలోకి వచ్చాక డ్వాక్రా, పొదుపు సంఘాల మహిళల కుమార్తెలకు వివాహాలు నిశ్చయమైతే పావలా వడ్డీకి రూ.లక్ష రుణాన్ని కల్యాణ లక్ష్మి పథకం ద్వారా అందజేస్తామని గత ఎన్నికలకు ముందు టీడీపీ హామీ ఇచ్చింది. అయితే వీరు గద్దెనెక్కి రెండేళ్లు దాటినా దీని అమలుపై ఏ మాత్రం దృష్టి సారించడంలేదు. వాస్తవానికి జిల్లాలో 39,505 స్వయం సహాయక సంఘాలు (పొదుపు సంఘాలు) ఉన్నాయి. ఇందులో 4,06,145 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. పలు ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో వీరు కీలక పాత్రను పోషిస్తున్నారు. అప్పులే దిక్కు.. అప్పట్లో రూ.250 కోట్లను విడుదల చేసి తొలుత 25 వేల మందికి ప్రయోజనం కల్పిస్తామని ఘనంగా ప్రకటించారు. అయితే ఇప్పటికీ అతీగతీ లేదు. ఫలితంగా పొదుపు మహిళలు తమ కుమార్తెల వివాహ సమయంలో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద రూ.రెండు నుంచి రూ.ఐదు వడ్డీకి అప్పులు తేవాల్సి వస్తోంది. బ్యాంక్ లింకేజీతో సున్నా వడ్డీ పథకంలో తీవ్ర జాప్యం జరుగుతున్న తరుణంలో కల్యాణ లక్ష్మి పథకం కూడా ప్రకటనగానే మిగిలిపోనుందాననే అనుమానాలు వీరిలో వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు. స్వయం సహాయక సంఘాలు 39,505 సభ్యుల సంఖ్య 4,06,145 మంది మండల సమాఖ్యలు 37 గ్రామ సమాఖ్యలు 1215 జిల్లాలో ఇలా.. హామీ ఇచ్చి రెండేళ్లు దాటినా.. ఏదీ ప్రయోజనం పథకం అమలును విస్మరించిన చంద్రబాబు నిరీక్షిస్తున్న డ్వాక్రా, పొదుపు మహిళలు అన్నీ బూటకపు హామీలే చంద్రబాబు అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో బూటకపు హామీలిచ్చారు. కల్యాణ లక్ష్మి పథకం సైతం ఇదే కోవలోకి చేరుతుందాననే అనుమానం కలుగుతోంది. గత సీఎం జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు ప్రకటించిన ప్రతి పథకాన్నీ అమలు చేశారు. అయితే ప్రస్తుతం ఇలాంటివేవీ లేవు. – పెమ్మసాని ప్రసన్నలక్ష్మి, జెడ్పీటీసీ -
హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిపై కేసు
కోట: స్థానిక నార్త్ గిరిజన కాలనీలో సుధా అనే మహిళపై గురువారం రాత్రి పెట్రోల్ పోసి నిప్పుపెట్టిన ఘటనపై పోలీసులు విచారణ జరిపారు. నిందితుడు శివప్రసాద్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పవన్కుమార్ శనివారం తెలిపారు. కాలిన గాయాలతో ఆమె తిరుపతిలో చికిత్స పొందుతోంది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపామని ఎస్సై తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. ట్రాక్టర్ను ఢీకొన్న బైక్ ● ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు మర్రిపాడు: ట్రాక్టర్ను వెనుక నుంచి బైక్ ఢీకొన్న ఘటన మండల పరిధిలోని జిల్లా సరిహద్దు సమీపంలో శనివారం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి బద్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలో ఓ వ్యక్తి మృతిచెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. పూర్తి వివరాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీధిదీపాల నిర్వహణలో అలసత్వం వద్దు తిరుపతి రూరల్: ఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో వీధిదీపాల నిర్వహణలో అలసత్వం వీడాలని ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి శనివారం ఒక ప్రకటనలో సూచించారు. తొమ్మిది జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో వీధిదీపాల విద్యుత్ సర్వీసులు 13,568, పంచాయతీల పరిధిలో 41,918 సర్వీసులు ఉన్నాయన్నారు. వీధిదీపాల నిర్వహణకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసినప్పటికీ పలు ప్రాంతాల్లో నిర్వహణా లోపం కారణంగా పగటిపూట వీధి దీపాలు వెలుగుతూ విద్యుత్ వృథా అవుతోందన్నారు. వీధిదీపాల నిర్వహణ పూర్తిగా ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో ఉన్నప్పటికీ విద్యుత్ శాఖ సిబ్బంది సమన్వయంతో సమస్యను అధిగమించాలన్నారు. ఈ అంశంలో నిర్లక్ష్యం వహిస్తే క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నృసింహునికి గరుడసేవ గూడూరు: గూడూరు రూరల్ పరిధి కుందకూరు సమీపంలో ఉన్న కనుమరాయి కొండలో కొలువైన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం సాయంత్రం గరుడసేవ వైభవంగా జరిగింది. పౌర్ణమి అనంతరం శనివారం కావడంతో తొలుత సుదర్శన యాగం చేపట్టారు. అమ్మవారికి విశేషాలంకరణ గావించారు. అలాగే ఆలయంలో సుదర్శన, నరసింహ యాగం చేపట్టి వేద మంత్రోచ్ఛారణల మధ్య పూర్ణాహుతి గావించారు. భక్తులు భారీగా తరలివచ్చి గరుడసేవను తిలకించారు. పొదలకూరు నిమ్మధరలు(కిలో) పెద్దవి: రూ.65 సన్నవి: రూ.30 పండ్లు: రూ.15 -
బరువైన బాధలు.. తెంచుకున్న బంధాలు
జీవితంలో ఎదురైన విభేదాలు, ఆర్థిక కష్టాలు ముగ్గురి ప్రాణాలను బలిగొన్నాయి. మనోవేదన.. క్షణిక నిర్ణయం విషాదాంతంగా మారింది. జీవితంలో ఓడిపోవడంతో బరువైన బాధలు బంధాలను తెంచుకున్నాయి. తమనే నమ్ముకున్న కుటుంబ ఆశలు ఆవిరి చేస్తూ కన్నీళ్లు మిగిల్చారు. దంపతుల మధ్య నెలకొన్న విభేదాలతో ఓ భర్త, సోదరుడితో ఆర్థిక వివాదాల నేపథ్యంలో ఓ తమ్ముడు, షేర్ మార్కెట్లో భారీ నష్టాలు ఎదుర్కొన్న ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడ్డారు. వేర్వేరు కారణాలైనా, మూడు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. కుటుంబ కలహాలతో.. గూడూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకటో పట్టణ పోలీసుల కథనం మేరకు.. పీఎస్సార్ పార్కు సమీపంలో పాలెం నాగేంద్ర (33) తన భార్య హేమలతతో కలిసి నివసిస్తున్నారు. వీరికి సంతానం లేరు. నాగేంద్ర స్థానిక కోడిగుడ్ల ఏజెన్సీలో ఆటో డ్రైవర్గా పనిచేస్తుండగా, భార్య నెల్లూరులోని ఓ ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కొంతకాలంగా వీరి మధ్య విభేదాలున్నాయి. ఈ నేపథ్యంలో నాగేంద్ర మనస్తాపానికి గురై గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న ఒకటో పట్టణ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. కేసును శుక్రవారం నమోదు చేశారు. చెరువులో దూకి.. మనుబోలు: చెరువులో దూకి ఓ గిరిజన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మనుబోలు మండలంలోని జట్ల కొండూరులో శుక్రవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. వెంకటాచలం మండలం ఈదగాలికి చెందిన వెందోటి వెంకటేశ్వర్లు (27) నాలుగు నెలల క్రితం డబ్బుల విషయమై తన అన్నతో గొడవపడ్డారు. అప్పటి నుంచి మనుబోలు మండలం కొండూరుసత్రంలో భార్య చిన వెంకమ్మతో ఉంటున్నారు. ఈ క్రమంలో ఏమి జరిగిందో తెలియదు గానీ మద్యం తాగి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వెంకమ్మ కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై హనీఫ్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. షేర్లలో పెట్టుబడి పెట్టి.. నష్టపోయి.. పొదలకూరు: బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తూ షేర్స్లో భారీగా పెట్టుబడులు పెట్టి నష్టపోయిన మహిళ ఆత్మహత్య చేసుకోవడంతో శుక్రవారం స్వగ్రామం కొత్తకంభాలపల్లిలో విషాదం నెలకొంది. చేజర్ల మండలం ఆదూరుపల్లికి చెందిన రాధను తల్లిదండ్రులు కొత్తకంభాలపల్లిలో సమీప బంధువుకు ఇచ్చి వివాహం జరిపించారు. ఆమెతో పాటు భర్త కూడా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా, రాధ షేర్స్లో భారీగా పెట్టుబడులు పెట్టి నష్టపోయారు. ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోవడంతో ఆమె భర్త ఫోన్ నంబర్ను రాసి కుప్పం రైల్వేస్టేషన్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతదేహాన్ని కొత్తకంభాలపల్లికి తీసుకురావడంతో విషాదఛాయలు అలముకున్నాయి. -
ఓటర్ల సమగ్ర సవరణ జాబితా (సర్) ప్రక్రియ విషయంలో అందరూ ఏ అంశంపై అయితే భయపడ్డారో అదే జరిగింది. తాజాగా విడుదల చేసిన ముసాయిదా జాబితా ద్వారా ఈ అంశం తేటతెల్లమైంది. జిల్లాలో 2,90,064 ఓట్లు మాయమయ్యాయి. నమోదు కాని ఓట్లలో అత్యధికంగా ప్రతిపక్షాలకు చెందిన వారివే ఉద్ద
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సర్ ప్రక్రియ జిల్లాలో సజావుగా సాగలేదనే ఆరోపణలు మొదట్నుంచీ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తమ పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగిస్తున్నారంటూ అధికారులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పలుమార్లు తెలియజేసినా, వారు పెడచెవిన పెడుతూ వచ్చారు. ఏ విషయంపై ఆందోళన వ్యక్తమైందో అదే చివరికి నిజమైంది. ఓట్లకు భారీగా కోతేసి, ప్రక్రియ నిర్వహణపైనే నీలినీడలు కమ్ముకునేలా ఆఫీసర్లు వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ తంతు.. వాస్తవానికి జూన్ 15 నుంచి జూలై 24 వరకు సర్ ప్రక్రియ జరిగింది. దీనికి సంబంధించిన ముసాయిదా జాబితాను అధికారులు శుక్రవారం ప్రచురించారు. దీన్ని చూడటంతోనే అసలు సత్యం వెల్లడైంది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో గల 2460 పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 19,74,240 మంది ఓటర్లుండేవారు. అయితే ప్రస్తుతం ప్రకటించిన ముసాయిదా జాబితా మేరకు 2,90,064 ఓట్లు గల్లంతయ్యాయి. ప్రస్తుతం మహిళా ఓటర్లు 8,58,567.. పురుషులు 8,25,447.. ఇతరులు 162 మంది ఉన్నారు. మొత్తమ్మీద ప్రతిపక్షాలకు చెందిన ఓటర్లు ఎక్కువగా మిస్సయ్యాయనే ప్రచారం జరుగుతోంది. నేటి నుంచి క్లెయిమ్లు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను శనివారం నుంచి స్వీకరించి క్లెయిమ్లను పరిష్కరించేలా ఏర్పాట్లను అధికారులు చేశారు. నియోజకవర్గ ఎన్నికల అధికారి (ఈఆర్వో) / ఏఈఆర్వోకు తమ అభ్యంతరాలను తెలిపి క్లెయిమ్లను పరిష్కరించుకోవచ్చు. ఫారం – 6, 6ఏ, 7, 8 ద్వారా కొత్తగా పేరు నమోదు, మార్పు, తొలగింపు, చిరునామా సవరణ, ఎపిక్ వివరాల సవరణ వంటి అభ్యర్థనలను స్వీకరించనున్నారు. voters. eci. gov. in ద్వారా సైతం అభ్యంతరాలను సమర్పించవచ్చు. గడువు ముగిసేలోపు ఓటును తిరిగి పొందకపోతే ఇక శాశ్వతంగా పోయినట్టే. అందుకే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడోలా.. ఇక్కడోలా..! మరోవైపు రాష్ట్ర కమిషన్ ప్రకటించిన జాబితాకు.. జిల్లా జాబితాకు మధ్య తేడా ఉంది. జిల్లాలో తొలగించిన ఓటర్లకు.. అధికారులు విడుదల చేసిన వివరాల్లో కొంత వ్యత్యాసముంది. ఒకవేళ ఇదే వాస్తవమైతే ఇది పారదర్శక జాబితా ఎలా అవుతుందనే ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. మిగిలింది 16,84,176 మందే సర్ ముసాయిదా జాబితా విడుదల అభ్యంతరాలు, క్లెయిమ్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి -
పక్కా ప్లాన్తోనే డీఎస్సీ స్కామ్
● లోకేశ్ రిజైన్ చేయాల్సిందే ● సీబీఐ విచారణకు డిమాండ్ ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు(అర్బన్): పక్కా ప్రణాళికతోనే డీఎస్సీలో అక్రమాలు చేసి తామనుకున్న వారికి టీచర్ పోస్టులను ప్రభుత్వం ఇప్పించుకుందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. డీఎస్సీలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ ఎమ్మెల్సీ మేరిగ మురళి, పార్టీ కావలి నియోజకవర్గ ఇన్చార్జి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్తలు గురవయ్య, కిలివేటి సంజీవయ్య తదితరులతో క లిసి కలెక్టరేట్లో డీఆర్వో విజయ్కుమార్కు వినతిపత్రాన్ని శుక్రవారం అందజేశారు. అక్రమాలకు సంబంధించి అభ్యర్థులు మాట్లాడుకున్న ఆడియోలను పెన్డ్రైవ్ ద్వారా సమర్పించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. ప్రభుత్వ నిర్ణయాలతో అర్హత ఉన్న ఎంతో మంది నిరుద్యోగులు టీచర్ పోస్టుల ను కోల్పోయారని చెప్పారు. తమ పార్టీ నేతలతో పాటు లక్షలాది మంది యువత ఇదే అంశాన్ని ప్రశ్నిస్తున్నారని వివరించారు. అవుట్సోర్సింగ్ వ్యక్తికి డీఎస్సీలో కీలక బాధ్యతలను అప్పగించగా, ఆయనకే ప్రథమ ర్యాంక్ వచ్చిందని తెలిపారు. వెరిఫికేషన్కు హాజరుకాలేదనే నెపంతో సదరు వ్యక్తికి పోస్టును ఇవ్వలేమంటూ మసిపూసి మారేడు కాయ చేశారని విమర్శించారు. నిబంధనలను తుంగలో తొక్కి స్పోర్ట్స్ కోటాను రెండు నుంచి మూడు శాతానికి పెంచారని ధ్వజమెత్తారు. సర్వీస్ రూల్స్ను సవరించి క్రీడల్లో పాల్గొన్న వారు పోటీ పరీక్షలు రాయాల్సిన అవసరంలేదనే జీఓను తెచ్చి అనేక మందికి పోస్టులను కట్టబెట్టారని ధ్వజమెత్తారు. 29 రకాల ఆటలను 64కు పెంచి, చివరికి పేకాట, టగ్ ఆఫ్ వార్ను సైతం క్రీడలుగా ప్రకటించి ఉద్యోగాలను కట్టబెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. తమ్ముళ్లకు పోస్టులను కట్టబెట్టాక, ఇక పొరపాట్లు జరగకూడదంటూ క్రీడాకారులు సైతం పోటీ పరీక్షలు రాయాల్సిందేనంటూ ఇప్పుడు జీఓ నంబర్ 56ను తెచ్చారని పేర్కొన్నారు. ఇలా 400 పోస్టులను అమ్ముకున్నారని మండిపడ్డారు. సమాధానం చెప్పలేక.. నీట్ లీకేజీ విషయమై కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేసిన విధంగానే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. తాము సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని లోకేశ్ తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని చర్చకు రావాలనడం సిగ్గుచేటన్నారు. నీ స్థాయెక్కడ.. జగన్మోహన్రెడ్డి స్థాయేంటో తెలుసుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డితో చర్చకు రావాలని లోకేశ్కు పిలుపునిచ్చామని, దమ్ముంటే ఎక్కడికి.. ఎప్పుడు రావాలో చెప్తే వస్తారని సవాల్ విసిరారు. దొంగ సర్టిఫికెట్లతో టీడీపీ వారికి పోస్టులిప్పించిన లోకేశ్, ఆయన కుటుంబసభ్యులకు నైతిక విలువల్లేవని మండిపడ్డారు. మెగా కాదు.. దగా డీఎస్సీ సూపర్ సిక్స్ పేరుతో సూపర్ మోసాలను చంద్రబాబు ప్రభుత్వం చేస్తోందని విమర్శించారు. మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చి నిరుద్యోగుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడిందని మండిపడ్డారు. వసతి, విద్యాదీవెనలకు నిధులివ్వడంలేదని ధ్వజమెత్తారు. ఈ రెండు పథకాలకు రూ.9500 కోట్ల బకాయిలను పెట్టారని విమర్శించారు. నిరుద్యోగ భృతి విషయాన్నే విస్మరించారని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి, విద్యార్థులకు తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులను నిర్వహించి టీడీపీ అక్రమాలపై నిరుద్యోగులు, ప్రజలను చైతన్యం చేయనున్నామని ప్రకటించారు. లోకేశ్ రాజీనామా చేసేంత వరకూ పోరాటాలను ఉధృతం చేయనున్నామని స్పష్టం చేశారు. పార్టీ మహిళా విభాగ జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీసునంద, రాష్ట్ర కార్యదర్శి పేర్నేటి కోటేశ్వరరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కామరాజు, వైఎస్సార్టీయూసీ అధ్యక్షుడు జయకుమార్రెడ్డి, ఐటీ వింగ్ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డయల్ యువర్ ఎస్పీకి వినతులు
నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 15 మంది సిబ్బంది ఫోన్ ద్వారా తమ సమస్యలను తెలియజేశారు. ప్రధానంగా బదిలీలు, సస్పెన్షన్ రద్దు, ఇతర పరిపాలన అంశాలకు సంబంధించిన అభ్యర్థనలున్నాయి. పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాల్సిందిగా సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఏఓ చంద్రమౌళి, ఏఏఓ సావిత్రమ్మ, సూపరింటెండెంట్లు సురేష్, మస్తాన్రావు, ఎస్బీ – 2 ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి దర్శనానికి 20 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి.. కృష్ణతేజ అతిథిగృహం వద్దకు క్యూ చేరుకుంది. స్వామివారిని 67,063 మంది గురువారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 25,565 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.81 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టిక్కెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
ఆక్వా చెరువులను నమోదు చేయించుకోవాలి
నెల్లూరు(వేదాయపాళెం): జిల్లాలోని ఉప్పు, మంచినీటి ఆక్వా రైతులు ఆప్సడా చట్టం మేరకు తమ చెరువులను నమోదు చేయించుకొని లైసెన్స్ను పొందాలని మత్స్యశాఖ ఏడీ చాంద్బాషా శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. గ్రామ, వార్డు సచివాలయంలోని మత్స్య సహాయ పరిశీలకుడ్ని సంప్రదించాలని పేర్కొన్నారు. లైసెన్స్ పొందిన రైతులు మాత్రమే విద్యుత్ సబ్సిడీకి అర్హులని చెప్పారు. ఉప్పునీటి ఆక్వా రైతులు కోస్టల్ ఆక్వా అథారిటీ (సీఏఏ) అనుమతులను తప్పక కలిగి ఉండాలని పేర్కొన్నారు. జిల్లాలోని 11 తీర మండలాలకు చెందిన సుమారు 3100 మంది వీటిని పొందాల్సి ఉందని వివరించారు. అనుమతుల్లేకుండా సాగు చేస్తే హెక్టార్కు రూ.పది వేల చొప్పున జరిమానాతో పాటు విద్యుత్ సబ్సిడీని రద్దు చేయనున్నామని పేర్కొన్నారు. క్లాస్ – ఐఐ సభ్యుల పదవీ కాలం రద్దు వెంకటాచలం: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోని క్లాస్ – ఐఐ, ఇతర సభ్యుల పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు జీఓ నంబర్ 67ను ఉన్నత విద్యాశాఖ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల చట్టం, 1991లోని సెక్షన్ 18 (2) మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఉత్తర్వుల్లో పేర్కొంది. 2023, ఆగస్ట్ 31న జారీ చేసిన జీఓ నంబర్ 55 ద్వారా ఏర్పాటైన క్లాస్ – ఐఐ, ఇతర సభ్యుల నియామకాలను తక్షణమే రద్దు చేస్తున్నామని ప్రకటించారు. అనంతరం గెజిట్ ప్రచురణ నిమిత్తం సంబంధిత అధికారులు, వీఎస్యూ రిజిస్ట్రార్, ఉన్నత విద్య కమిషనర్, తదితర అధికారులకు ఉత్తర్వుల ప్రతులను పంపారు. స్కానింగ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు నెల్లూరు(అర్బన్): నగరంలోని పలు స్కానింగ్ సెంటర్లను పీసీ పీఎన్డీటీ చట్టం అమలు నోడల్ ఆఫీసర్ బ్రిజిత ఆధ్వర్యంలో అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విజయా డ యాగ్నొస్టిక్స్ సెంటర్, ఆండాళ్ భాస్కర్ ఆస్ప్రత్రి, జీవీపీ, కాసా స్కానింగ్ కేంద్రాల్లో తనిఖీలను చేపట్టారు. స్కానింగ్ యంత్రాలు, రికార్డులు, రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడారు. స్కానింగ్ ద్వారా లింగ నిర్ధారణ చేశారని తెలిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఏమైనా ఫిర్యాదులుంటే టోల్ ఫ్రీ నంబర్ 1800 233 2447ను సంప్రదించాలని సూచించారు. డెమో అధికారి కనకరత్నం, డిప్యూటీ డెమో అధికారి సునీత తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు నెల్లూరు(పొగతోట): జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల పరిధిలో శనివారం నుంచి ఈ నెల ఏడు వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహించనున్నామని, విజయవంతానికి సీడీపీఓలు చర్యలు చేపట్టాలని ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రత్యేక అంశాలతో కార్యక్రమాలను రోజూ నిర్వహించాలని సూచించారు. ర్యాలీలు, ప్రతిజ్ఞలను నిర్వహించి.. వీటి ఫొటోలను జిల్లా కార్యాలయానికి పంపాలని కోరారు. నిబంధనల మేరకు నిర్వహించాలని ఆదేశించారు. అథ్లెటిక్స్ మీట్లో అకార్డ్ స్కూల్ ప్రతిభ తిరుపతి రూరల్: సీబీఎస్ఈ క్లస్టర్ – 7 అథ్లెటిక్స్ మీట్లో తిరుపతికి చెందిన అకార్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ మరోసారి సత్తా చాటింది. వరుసగా రెండో ఏడాదీ ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. హైదరాబాద్లోని మల్లారెడ్డి ఫౌండేషన్ స్కూల్ ఆవరణలో నిర్వహించిన మీట్లో ఇక్కడి విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబర్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 280 పాఠశాలల నుంచి ఆరు వేల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. 33 స్వర్ణ, రజత, కాంస్య పతకాలను మూడు చొప్పున సాధించారని ప్రిన్సిపల్ నీరజారెడ్డి తెలిపారు. 168 చాంపియన్షిప్ పాయింట్లను సాధించి, పదేళ్లలో ఏ పాఠశాల నమోదు చేయని అత్యధిక స్కోరును సాధించి కొత్త రికార్డును సృష్టించామని వివరించారు. విజేతలను స్కూల్ డైరెక్టర్లు ప్రశాంత్రెడ్డి, వివేక్రెడ్డి తదితరులు అభినందించారు. -
వేతనాలను పెంచేంత వరకూ ఉద్యమిస్తాం
● స్కీమ్ వర్కర్లతో వెట్టిచాకిరీ చేయిస్తున్న ప్రభుత్వం ● కలెక్టరేట్ వద్ద బైఠాయింపునెల్లూరు(అర్బన్): అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, వెలుగు వీఓఏలు, స్కూల్ ఆయాలు తదితర స్కీమ్ వర్కర్లకు వేతనాలను పెంచేంత వరకూ ఉద్యమిస్తామని అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షురాలు రెహనాబేగం, ఆశ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి దుగ్గిరాల అన్నపూర్ణమ్మ స్పష్టం చేశారు. తమకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయడంతో పాటు పనిభారాన్ని తగ్గించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం బైఠాయించి ధర్నా జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆయాలకు రూ.వెయ్యి నుంచి రూ.రెండు వేలను అందజేస్తూ వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని ఆరోపించారు. మధ్యాహ్న భోజనాన్ని వండే కార్మికులకు రూ.మూడు వేలనే ఇస్తున్నారని ధ్వజమెత్తారు. 15 ఏళ్లలో ధరలు పెరిగినా, స్కీమ్ వర్కర్లకు వేతనాలను పెంచకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇప్పటికై నా మధ్యాహ్న భోజన కార్మికులకు ఒక్కో విద్యార్థికి మెనూ చార్జీలుగా కనీసం రూ.20 ఇవ్వడంతో పాటు బిల్లులను ప్రతి నెలా ఐదులోపే చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఆయాలు, వర్కర్లకు కనీస వేతన చట్టం ప్రకారం రూ.26 వేలను ఇవ్వాలని పేర్కొన్నారు. నవ చేతన యాప్ల ద్వారా ఇంటింటి ఆరోగ్య సర్వే చేయించడం సరికాదన్నారు. గతంలో తాము సమ్మె చేపట్టిన సమయంలో చంద్రబాబు వచ్చి ఎన్నికల్లో గెలిస్తే జీతాలను పెంచుతానని నమ్మబలికి ఇప్పుడు పత్తాలేకుండాపోయారని విమర్శించారు. జేసీకి వ్యతిరేకంగా నినాదాలు ధర్నా జరుగుతున్న సమయంలో కలెక్టరేట్లోకి వచ్చేందుకు జేసీ వెంకటేశ్వర్లు యత్నించారు. అక్కడ ధర్నా చేస్తున్న మహిళలు కారును చుట్టుముట్టి.. తమ బాధలను వినాలని డిమాండ్ చేశారు. అయితే ఆయన వాహనం దిగకపోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసుల సహకారంతో కలెక్టరేట్లోకి వెళ్తుండగా, కనీసం వాహనం దిగి అర్జీ తీసుకోవచ్చు కదా అంటూ మహిళలు ప్రశ్నించారు. అయినా ముందుకు సాగడంతో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఐటీయూ నేతలు గోగుల శ్రీనివాసులు, ప్రసాద్, పెంచలనరసయ్య, అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సుజాతమ్మ తదితరులు పాల్గొన్నారు. -
సాగరమాల... సాగతీత
● నత్తనడకన సాగుతున్న జాతీయ రహదారి పనులు ● పరిహారం పంపిణీలో జాప్యం ● అడ్డంకులతో నిలిచిన నిర్మాణం ● 2027 నాటికై నా పూర్తవుతుందా? ● ప్రమాదాలకు నిలయంగా వరగలి క్రాస్రోడ్డు చిల్లకూరు: కృష్ణపట్నం పోర్టు నుంచి జాతీయ రహదారికి అనుసంధానంగా చిల్లకూరు, కోట, నాయుడుపేట మండలాల మీదుగా నాలుగు లేన్ల రహదారి నిర్మాణాన్ని సుమారు రూ.1,000 కోట్ల వ్యయంతో చేపట్టారు. కాంట్రాక్టర్లు ముందుగా స్థానికులకు రోడ్డు ఎలా వస్తుందనే విషయాలను తెలియజేయకుండా చేపట్టడంతో పలు ప్రాంతాల్లో అడ్డంకులు ఎదురవుతున్నాయి. వరగలి క్రాస్రోడ్డు నుంచి తూర్పు కనుపూరు వరకు నిర్మించాల్సిన నాలుగు లేన్ల రహదారి పనులు ఈ కారణాలతో తీవ్రంగా ఆలస్యమవుతున్నాయి. ముత్యాలపాడు – పారిచెర్లవారిపాళెం మధ్య వర్షాకాలంలో ఉప్పుటేరు పొంగి రోడ్డుపైకి ఐదడుగుల మేర నీరు చేరుతుందనే విషయాన్ని ముందుగానే గుర్తించకుండా పనులు ప్రారంభించారని స్థానికులు పేర్కొంటున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రైతులు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తికి వినతి అందజేయగా, ఆయన కేంద్ర మంత్రితో మాట్లాడి వంతెన నిర్మాణానికి చర్యలు చేపట్టారు. అయినప్పటికీ ఇతర ప్రాంతాల్లో కూడా తలెత్తిన సమస్యలను సకాలంలో పరిష్కరించకపోవడంతో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పరిహారం ఎక్కడ? వరగలి క్రాస్రోడ్డు నుంచి తూర్పు కనుపూరు వరకు 36 కిలోమీటర్లు, అక్కడి నుంచి నాయుడుపేట వరకు మరో 34 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్ట్కు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి 2024లో పనులు ప్రారంభించి ఏడాదిలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. అయితే రెండేళ్లు గడిచినా పనులు పూర్తికాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ రహదారి చిల్లకూరు, కోట మండలాల్లోని సుమారు 24 గ్రామాల మీదుగా వెళ్తుంది. పలుచోట్ల పట్టా భూములు సేకరించినప్పటికీ యజమానులకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో పరిహారం అందకపోవడంతో నిర్మాణ పనులు నిలిచిపోయిన ప్రాంతాలున్నాయి. భూసేకరణ సమస్యలు పరిష్కారం కాకపోవడం కూడా పనుల జాప్యానికి ప్రధాన కారణంగా మారింది. ఎన్నో ప్రమాదాలు సాగరమాల ప్రాజెక్ట్లో భాగంగా జాతీయ రహదారి నుంచి వరగలి మీదుగా తీర ప్రాంతానికి భారీ వాహనాలు సులభంగా రాకపోకలు సాగించేలా వరగలి క్రాస్రోడ్డు వద్ద ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారు. ఈ పనుల కారణంగా రెండు వైపులా అప్రోచ్ రోడ్ల ద్వారా ట్రాఫిక్ను మళ్లిస్తున్నారు. దీంతో రహదారి ఇరుకుగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సాయంత్రం వేళల్లో వాహనాల రద్దీ అధికంగా ఉండటంతో ట్రాఫిక్ గంటల తరబడి నిలిచిపోతోంది. రాత్రి సమయాల్లో దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు అప్రోచ్ రోడ్డును గుర్తించలేక ప్రమాదాలకు గురవుతున్నారు. అప్పటికి పూర్తవుతుందా? ప్రభుత్వం తొలుత ఈ ప్రాజెక్ట్ను 2025 డిసెంబరు నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యంతో 2027 చివరి నాటికై నా పూర్తవుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం దృష్టి సారించి త్వరగా పనులు జరిగేలా చర్యలు తీసుకోవాల్సింది. వరగలి క్రాస్రోడ్డు వద్ద పనులు నిలిచిపోయిన ఫ్లై ఓవర్ పనులు జాతీయ రహదారిపై నత్తనడకన సాగుతున్న కల్వర్టు నిర్మాణం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సాగరమాల రహదారి ప్రాజెక్ట్ జిల్లాలో నత్తనడకన సాగుతోంది. కృష్ణపట్నం పోర్టును బెంగళూరుతో అనుసంధానించే ఈ రహదారి నిర్మాణం అంతులేని జాప్యానికి గురవుతుండటంతో చిల్లకూరు మండలంలోని వరగలి క్రాస్రోడ్డు ప్రమాదాలకు కేంద్రంగా మారింది. ఫ్లై ఓవర్ నిర్మాణం కొనసాగుతుండటంతో తాత్కాలిక అప్రోచ్ రోడ్లపై వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. ఈ క్రమంలో తరచూ ప్రమాదాలకు జరుగుతున్నాయి. పార్లమెంట్లో ప్రస్తావిస్తా పోర్టులను అనుసంధానం చేసేలా రూపుదిద్దుకుంటున్న సాగరమాల రహదారి పనులు నత్తనడకన సాగుతున్న విషయాన్ని చిల్లకూరు, కోట మండలాలకు చెందిన ఆయా గ్రామాల ప్రజలు నా దృష్టికి తెచ్చారు. అలాగే నిర్మాణ సంస్థ ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలు సాగించేందుకు అవసరమైన సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయడంలోనూ, బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఆలస్యం చేస్తోంది. ఈ విషయాలపై ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తా. పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపడతా. – మద్దిల గురుమూర్తి, ఎంపీ, తిరుపతి -
మద్యం వ్యాపారుల బాహాబాహీ
● బెల్ట్ షాపుల వాటాల పంపకం వివాదంతో ఉద్రిక్తత ● పోలీసుల రంగప్రవేశంతో ఆగిన గొడవ ఉదయగిరి: మద్యం బెల్టు షాపుల వాటాల విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో మద్యం దుకాణాల యజమానులు బాహాబాహీకి దిగిన వైనం ఉదయగిరిలో గురువారం జరిగింది. అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతంలో మద్యం వ్యాపారులు వీధి రౌడీల్లా కొట్లాటకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ దృశ్యాలను కొంతమంది సెల్ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. ఉదయగిరి మండలంలో మూడు అధికారిక మద్యం షాపులు ఉన్నాయి. వీటిలో కొన్ని షాపులకు వ్యాపారం జరుగుతుండగా, మరికొన్ని షాపులకు వ్యాపారం లేదు. మూడు షాపుల యాజమానులు ఒక ఒప్పదానికి వచ్చి ఓ షాపు యజమాని గ్రామాల్లో బెల్ట్ షాపులకు మద్యం సరఫరా చేసుకునే విధంగా నిర్ణయించుకున్నారు. దీని కోసం ప్రతి నెల కొంత మొత్తం మిగితా షాపులకు చెల్లించే ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో ఉల్లంఘనలు జరుగుతున్నాయని, దొంగ చాటుగా బెల్ట్ వ్యాపారం చేస్తున్నారని ఎస్ఎల్వీ, ఎంఆర్ఎస్ దుకాణాల యజమానుల మధ్య వివాదం నెలకొంది. బెల్ట్ షాపుల నుంచి చెల్లింపులు సక్రమంగా ఇవ్వడం లేదనే సమస్య కూడా ఉంది. దీంతో ఈ రెండు దుకాణాల యజమానుల మధ్య వివాదం తారస్థాయికి చేరి దాడి చేసే వరకు వచ్చింది. స్థానికుల సమాచారం అందుకున్న ఎస్సై ఆళ్ల శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలకు సర్ధి చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. గొడవలో ప్రమేయం ఉన్న వారిని స్టేషన్కు తరలించారు. అయితే ఈ వ్యవవహారంపై పోలీసులకు ఫిర్యాదు అందలేదని, ఇంత వరకు కేసు నమోదు చేయలేదని ఎస్సై మహేంద్ర తెలిపారు. చోద్యం చూస్తున్న అధికారులు గ్రామాల్లో బెల్ట్ దుకాణాలకు యథేచ్ఛగా మద్యం సరఫరా అవుతున్నా.. ఎకై ్సజ్ పోలీసులు పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామాల్లో బెల్ట్ దుకాణాల వ్యవహారంపై గొడవలు జరుగుతున్నా సివిల్ పోలీసులు చర్యలు చేపట్టలేదనే ఆరోపణలు ఉన్నాయి. నెల మామూళ్ల మత్తులో అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని ప్రజలు చెబుతున్నారు. ప్రభుత్వం పైకి బెల్ట్ దుకాణాలు లేవని చెబుతున్నా, పరోక్షంగా పబ్లిక్గా గ్రామాల్లో గొలుసు దుకాణాలు నడుస్తున్నా.. చర్యలు లేవని మహిళలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామాల్లో బెల్ట్ దుకాణాలు నిర్వహకులపై కఠన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
భక్తిశ్రద్ధలతో అఖండ పారాయణం
నెల్లూరు(బృందావనం): గురుపూర్ణిమ మహోత్సవాలను పురస్కరించుకుని బాలాజీనగర్ చివర పద్మావతి నగర్లోని సాయిదర్బార్ అద్దాల మందిరంలో మూడో రోజు గురువారం శ్రీసాయి సచ్ఛరిత్ర అఖండ పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయినాథుని స్మరిస్తూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పారాయణం గా వించారు. శాస్త్రోక్తంగా సాయినాథుడికి అభిషేకార్చనలు, పూజలు జరిపారు. విశేషాలంకారంలో కొలువైన షిరిడీ వాసుడ్ని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆ మందిర మేనేజింగ్ ట్రస్టీ మధుసాయి మాట్లాడుతూ శ్రీసాయి సచ్చరిత్ర నిత్య పారాయణంతో సాయినాథుని పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందన్నారు. కార్యక్రమాలను అద్దాల మందిరం గౌరవ సలహాదారు పాబోలు రామసుబ్బయ్య, శ్రీసాయిదర్బార్ భజన, సత్సంగ సేవాదళ్ సభ్యులు, భక్తబృందం పర్యవేక్షించింది. ఆగస్టు 2వ తేదీ ఉదయం 9 గంటలకు సాయిమాత నిత్య అన్నప్రసాదాలయం ద్వారకామాయిలో మెగా ఉచిత నేత్ర వైద్య శిబిరం జరుగనుందని, బాలాజీనగర్, ఏసీనగర్ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మధుసాయి గురువారం కోరారు. డాక్టర్ పీఎల్రావు మోడరన్ ఐ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్ వైద్యబృందం సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 2న నేత్ర వైద్య శిబిరం -
నిమ్మ రైతులకు గిట్టుబాటు ధరలు అందించేందుకు ఈసారి పూత దశనే మార్చే దిశగా అధికారులు, శాస్త్రవేత్తలు కసరత్తు ప్రారంభించారు. జూలైలో చెట్లకు పూత రాకుండా, అక్టోబరులో పూత వచ్చేలా శాసీ్త్రయ పద్ధతుల్లో మందులు పిచికారీ చేస్తే ఫిబ్రవరి సీజన్ సమయంలో దిగుబడి లభించి రై
పొదలకూరు : ఏటా నిమ్మ ధరలు జూదంగా మారుతున్నాయి. ధరలు ఉంటే.. కాయలు ఉండక, కాయలు ఉంటే.. ధరలు ఉండక రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. సాధారణంగా ఉద్యాన పంటల్లో ప్రతి పంటకు ఒక సీజన్ ఉంటుంది. కానీ జిల్లాలో నిమ్మ అన్ సీజన్లోనే అత్యధిక దిగుబడులు వస్తుండగా అన్ సీజన్లో తక్కువగా దిగుబడులు వస్తున్నాయి. ఫలితంగా మార్కెట్లో ధరలు ఉండక రైతులు ఆర్థికంగా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో పూత దశను శాసీ్త్రయంగా మార్పు చేసి.. సీజన్లో కాయల దిగుబడి వచ్చే విధంగా ఉద్యాన శాస్త్రవేత్తలు, అధికారులు సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. భవిష్యత్లో దీని ఫలితాలు ధరల ఆశలను రేకెత్తిస్తున్నాయి. జిల్లాలో 30 వేల ఎకరాల్లో సాగు నెల్లూరు జిల్లాలో ఉద్యాన పంటల కింద నిమ్మతోటలు సుమారు 30 వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. ఒక్క పొదలకూరు మండలంలోనే 10,700 ఎకరాల్లో నిమ్మ సాగవుతున్నట్టు ఉద్యానాధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో నిమ్మకు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే ధరలు ఉంటాయి. మిగిలిన మాసాల్లో గిట్టుబాటు ధరలు కూడా లభించడం కష్టంగా ఉంటుంది. వాతావరణం అనుకూలించకపోతే కిలో నిమ్మకాయలు రూ.20లకు అమ్మడం కూడా ఇబ్బందిగా మారుతోంది. గతేడాది నవంబరు, డిసెంబరు మాసాల్లో కిలో నిమ్మ కాయలు రూ.10 నుంచి రూ.15 మాత్రమే ధరలు పలికి రైతులు తీవ్రంగా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు, ఉద్యానాధికారులు రైతులు తోటల సాగును మార్చుకుంటే సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని కలెక్టర్ హిమాన్షు శుక్లా దృష్టికి తీసుకువచ్చారు. కలెక్టర్ జేసీ ద్వారా మార్కెటింగ్, ఉద్యానాధికారులు కలిసి రైతులకు అవగాహన కల్పించాల్సిందిగా ఆదేశించారు. తోటల్లో పూత దశల్లో మార్పు చేసే పద్ధతి నిమ్మ రైతులు నష్టపోకుండా ఉండాలంటే తోటల్లో చెట్లకు పూత దశల్లో మార్పులు చేసుకుంటే చాలా వరకు నష్ట నివారణ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలతోపాటు ఉద్యానాధికారులు వెల్లడించారు. ఫలితంగా జూన్, జూలై మాసాల్లో చెట్లకు పూత పూస్తే నవంబరు, డిసెంబరులో దిగుబడి వచ్చి రైతులు నష్టపోతారని, ఇందుకోసం ఈ మాసాల్లో పూతరాకుండా మందులను పిచికారీ చేసుకోవాలంటున్నారు. అక్టోబరులో తిరిగి పూత వచ్చేందుకు మందులను పిచికారీ చేసుకుంటే ఫిబ్రవరిలో ధరలు పలికే సీజన్లో కాయలు దిగుబడినిచ్చి రైతులు నష్టపోకుండా ఉంటారని సూచించారు. మందుల పిచికారీకి సూచనలు జిబ్బరెల్లిక్ యాసిడ్ 500 పీపీఎంను 200 లీటర్ల నీటిలో 10 గ్రాములు కలిపి జూన్, జూలై మాసాల్లో పిచికారీ చేస్తే చెట్లు శాఖీయ పెరుగుదల ఉంటుందన్నారు. రెండో పర్యాయం సెప్టెంబరులో సైకోసెల్ 1000 పీపీఎం, లెహోసిన్ 2 మి.లీ/లీటరు నీటిలో కలిపి పిచికారీ చేస్తే పెరుగుదల నియంత్రించేందుకు ఉపయోగ పడుతుందన్నారు. మూడో దశ అక్టోబరులో 13:00:45 ను 10 గ్రాముల లీటర్ నీటిలో పిచికారీ చేస్తే చెట్ల పూతను ప్రేరేపిస్తుందన్నారు. నిమ్మ సాగులో సీజన్ మార్చే ప్రయత్నం నవంబరు, డిసెంబరులో దిగుబడితో గిట్టుబాటు కాని ధరలు జూలైలో పూత రాకుండా, అక్టోబరులో పూత వచ్చేందుకు మందుల పిచికారీ శాస్త్రవేత్తలు, ఉద్యానాధికారుల కృషి ఫలితాలపై సందేహాలు జిల్లాలో 30 వేల ఎకరాల్లో నిమ్మ తోటల సాగు జూన్లో పిచికారీ చేస్తే మంచిది సాధారణంగా జూన్లో తాము సూచించిన మందులను చెట్లకు పిచికారీ చేస్తే మంచిది. ఇప్పుడు సమయం మించిపోయినట్టుగా ఉంటుంది. ఇప్పటి వరకు పూత రాని రైతులు సెప్టెంబరు, అక్టోబరు మాసంలో పూత వచ్చేందుకు సైకోసెల్ పిచికారీ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి ఏడాది జూన్ నుంచే పూత లేకుండా ఉండేందుకు జిబ్బరెల్లిక్ యాసిడ్ను పిచికారీ చేసుకోవాలి. – ఆనంద్, ఉద్యానాధికారి, పొదలకూరు జూలైలో పూత రాలేదు జూలై నెలలో చెట్లకు పూత రాలేదు. సెప్టెంబరులో, అక్టోబరులో పూత వచ్చేందుకు ఉద్యానాధికారులు వెల్లడించిన విధంగా మందులను పిచికారీ చేసి చూడాలి. ఇప్పటి వరకు ఇలాంటి విధానం రైతులకు తెలియదు. ప్రయోగాత్మకంగా ఉన్నందున పిచికారీ చేసి చూసి ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుంటాం. – జీ నారాయణరెడ్డి, రైతు, పులికల్లు -
ఐటీడీఏ అధికారుల దిద్దుబాటు చర్యలు
నెల్లూరు(వేదాయపాళెం): నగరంలోని పొదలకూరు రోడ్డులో గల బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న వసతి, భోజన సౌకర్యాలను మెరుగుపర్చే చర్యలను ఐటీడీఏ అధికారులు ప్రారంభించారు. తమకు పెట్టే అన్నంలో పురుగులుంటున్నాయని.. నీళ్ల సాంబార్ను పోస్తున్నారంటూ అక్కడి ఫిర్యాదుల పెట్టెలో తమ సమస్యను విద్యార్థులు తెలియజేశారు. ఈ క్రమంలో బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర చైర్మన్ సూర్యనారాయణరాజు అక్కడ పరిశీలించి ప్రిన్సిపల్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులను మందలించి.. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు. ఈ తరుణంలో దిద్దుబాటు చర్యలను ఐటీడీఏ అధికారులు ప్రారంభించారు. పాఠశాలలో అందుతున్న రక్షణ, వసతి, భోజన సదుపాయాలను పరిశీలించాల్సిందిగా డీటీడబ్ల్యూఓ సుజాత, అడ్మినిస్ట్రేటివ్ మానిటరింగ్ ఆఫీసర్ శాంతిని పీఓ శ్రీనివాసరావు ఆదేశించారు. అక్కడ పరిస్థితులను పరిశీలించి, నివేదికలను ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. నాలుగు నుంచి జుడాల సమ్మె నెల్లూరు(అర్బన్): జూనియర్ డాక్టర్లకు స్టయ్పండ్ను పెంచడంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆగస్ట్ నాలుగు నుంచి సమ్మె చేయనున్నామని ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జుడా) జిల్లా అధ్యక్షుడు హనీష్ తెలిపారు. స్టయ్పండ్ సవరణ తక్షణమే జరగకపోతే ఆ రోజు నుంచి విధులను బహిష్కరించి సమ్మె చేస్తామంటూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్.. వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీస్ను విజయవాడలో ఏపీ జుడాల సంఘ ఆధ్వర్యంలో గురువారం అందజేశారు. ఈ క్రమంలో నగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆయన మాట్లాడారు. అతి తక్కువ స్టయ్పండ్తో పనిచేస్తూనే అధికారులకు పలుమార్లు వినతిపత్రాలను సమర్పించామని చెప్పారు. చివరి అవకాశంగా చూస్తామని, అప్పటికీ స్పందించకపోతే సమ్మె తప్పదని స్పష్టం చేశారు. ఇంటి స్థలాల ఆక్రమణలపై సర్వే చిట్టమూరు: మండల పరిధి లోని నార్త్ వరత్తూరు గ్రామంలో గిరిజనుల ఇంటి స్థలాలను రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగించి బాధితులకు హద్దులు చూపి అప్పగించారు. ‘యథేచ్ఛగా ఇంటి స్థలాల ఆక్రమణ’ అనే శీర్షికన సాక్షిలో గురువారం ప్రచురితమైన కథనానికి తహసీల్దార్ రామయ్య స్పందించారు. సర్వేయర్ శ్రీకాంత్, వీఆర్వో వెంటకరమణను గ్రామానికి పంపి ఇంటి స్థలాల వద్ద సర్వే నిర్వహించి హద్దులు చూపించారు. అలాగే మరోసారి ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రజత్కుమార్రెడ్డి కోవూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి తనయుడు రజత్కుమార్రెడ్డిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటనను గురువారం విడుదల చేసింది. ఆయన నియామకంపై కోవూరు నియోజకవర్గంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆయనకు అభినందనలను తెలియజేశారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని కాంక్షించారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి.. శిలాతోరణం వద్దకు క్యూ చేరుకుంది. స్వామివారిని 74,471 మంది బుధవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 35,361 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.68 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టిక్కెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టిక్కెట్లు గల వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
లోకేశ్ రాజీనామా చేసేంత వరకూ పోరాటం ఆగదు
● డీఎస్సీ నియామక ప్రక్రియ, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు (పొగతోట): విద్యాశాఖ మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా చేసేంత వరకు తమ పోరాటం ఆగదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని, దీనికి లోకేశ్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మీ హయాంలో విద్యాశాఖ విఫలమైందని, దీనికి సమాధానాలను చెప్పలేకపోతున్నారని విమర్శించారు. లోకేశ్ స్థాయికి తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి రావాల్సిన అవసరం లేదని... ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డిని పంపుతామని, ఆయన సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే.. విద్యాశాఖ మంత్రిగా కొనసాగేందుకు అర్హుడివేనని ఎద్దేవా చేశారు. కనీసం క్రీడా మైదానంలో అడుగు పెట్టనివారికి, ఆట చేతగాని వారికి సైతం డీఎస్సీలో ఉద్యోగం లభించిందని మండిపడ్డారు. దొడ్డిదారిన కోటాలు పెంచడం, జీఓలను జారీ చేయడం, పోస్టులను భర్తీ చేయడంపై తాము ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పడంలేదని ధ్వజమెత్తారు. డీఎస్సీని కనుగొన్నది టీడీపీ అనే విధంగా ఊదరగొట్టేందుకు, ఎదురుదాడి చేసేందుకు సిగ్గుండాలన్నారు. కలెక్టర్కు వినతిపత్రం నేడు డీఎస్సీలో అవకతవకలపై కలెక్టరేట్కు శనివారం తమ పార్టీ ఆధ్వర్యంలో వెళ్లి కలెక్టర్కు వినతిపత్రాన్ని సమర్పించనున్నామని చెప్పారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై తీవ్ర ఆరోపణలొచ్చిన తరుణంలో రాజీనామా చేశారని, అయితే రాష్ట్రంలో లోకేశ్ రిజైన్ చేయకుండా సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిరుద్యోగ యువత, విద్యార్థులకు అన్యాయం జరిగిందని, దీనిపై మేధావులు, విద్యావేత్తలు, కోచింగ్ నిర్వాహకులతో కలిసి సదస్సులను నిర్వహించనున్నామని వెల్లడించారు. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా ర్యాలీలు, రౌండ్ టేబుల్ సమావేశాలు, నిరసన కార్యక్రమాలను చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనున్నామని చెప్పారు. మోసాలపై ఛీదరిస్తున్న ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికలను జరపాలనే నిర్ణయంతో రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరిట కరపత్రాలు పట్టుకొని ప్రజలకు ముఖం చూపించలేక.. ఒకవేళ చూపిస్తే ఛీదరించుకోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని ఎద్దేవా చేశారు. అమరావతిలోని సచివాలయంలో చంద్రబాబు, లోకేశ్ కూర్చొని, రోజూ ఒక గ్రామానికి ఎమ్మెల్యే వెళ్లాలనే నిబంధన పెట్టారని చెప్పారు. ఆ కాగితాలతో ఊళ్లలోకెళ్తే తలుపులు మూసేసే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. గ్రామం, ప్రజలకు ఏమి చేశామో చెప్పుకోలేక ఎమ్మెల్యేలు పాట్లు పడుతున్నారని చెప్పారు. ప్రతి పథకంలో లబ్ధిదారుల సంఖ్యకు కోతేస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు పేరుతో బస్సుల్లో తీవ్ర తోపులాటలు జరుగుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కండక్టర్లు, డ్రైవర్లు సైతం సమస్యను తాళలేక తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఉద్యోగులు తీవ్ర మానసిక ఆందోళన, ఆగ్రహావేశాలకు గురవుతున్నారని తెలిపారు. మాయమాటలు చెప్పి అన్ని వర్గాలను మోసం చేసిన విధంగానే ఉద్యోగులను కూడా ప్రభుత్వం వంచించిందని మండిపడ్డారు. పొగాకు రైతులపై నిర్దయ గిట్టుబాటు ధరల్లేవంటూ రోడ్డెక్కి నిరసనను పొగాకు రైతులు తెలియజేస్తుంటే, పోలీసుల్ని వారిళ్ల వద్దకు పంపి బయటకొస్తే కేసులు పెడతామని బెదిరించడం దారుణమన్నారు. ఎవరైనా వస్తే వారిపై కేసులు నమోదు చేయడాన్ని దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. తమ ప్రభుత్వ హయాంలో సంగం వద్ద రైతులు ధర్నా చేయగా, వారిపై అప్పటి ఎస్పీ కేసు నమోదు చేస్తే, ఆ అంశం అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డికి దృష్టికి వెళ్లిందని, అదే రోజు సాయంత్రానికల్లా వీటిని విత్డ్రా చేయించిన అంశాన్ని గుర్తుచేశారు. -
నేటి నుంచి ర్యాంకింగ్ క్యారమ్ టోర్నీ
నెల్లూరు (టౌన్): జిల్లా క్యారమ్ సంఘం సహకారంతో శుక్రవారం నుంచి వచ్చేనెల 2వ తేదీ వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రథమ ర్యాంకింగ్ క్యారమ్ టోర్నమెంట్–2026ను నెల్లూరు క్లబ్లో నిర్వహించనున్నట్లు ఆ సంఘ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ జలీల్, టోర్నమెంట్ కమిటీ కో–చైర్మన్ మలిరెడ్డి కోటారెడ్డి తెలిపారు. దర్గామిట్టలోని నెల్లూరు క్లబ్లో టోర్నమెంట్ నిర్వహణపై ఏర్పాట్లను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 15 జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు టోర్నమెంట్లో పాల్గొననున్నట్లు చెప్పారు. చీఫ్ రిఫరీగా డీఎస్సార్ మూర్తి, అసిస్టెంట్ రిఫరీగా ఎస్కే సాజిదా వ్యవహరిస్తారన్నారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన అంతర్జాతీయ క్రీడాకారుడు సీహెచ్ జనార్దనరెడ్డి, క్రీడాకారిణి బి.శోభిక, గిన్నిస్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్ ఎస్కే హుస్నా సమీరా తదితర క్రీడాకారులు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. పురుషుల సింగిల్స్, మహిళల సింగిల్స్ విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. నాకౌట్ విధానంలో పోటీలు జరుగుతాయని చెప్పారు. ఇక్కడి ర్యాంకింగ్ పాయింట్లు రాష్ట్ర జట్టు ఎంపికకు కీలకం కానున్నాయన్నారు. క్రీడాకారులకు భోజన, వసతి సౌకర్యాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో క్యారమ్ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీమన్నారయణ, కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన కార్మికులు
● కనీస వేతనంగా రూ.26 వేలివ్వాలని డిమాండ్ ● సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా నెల్లూరు(అర్బన్): కనీస వేతన చట్టం మేరకు రూ.26 వేల జీతాన్ని అవుట్సోర్సింగ్, ఆప్కాస్ కార్మికులకు అమలు చేయడంతో పాటు వీరిని క్రమబద్ధీకరించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రసాద్, గోగుల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. కనీస వేతనాన్ని అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనమివ్వాలనే డిమాండ్తో ట్రంక్ రోడ్డు, వీఆర్సీ కూడలి మీదుగా కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శనను కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్, ఆప్కాస్, షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ కార్మికులు.. సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నాలో నేతలు మాట్లాడారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ విధానాలను తెచ్చి కార్మికుల కడుపుగొట్టింది చంద్రబాబేనని మండిపడ్డారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వీరు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ పేరుతో వీరితో 12 నుంచి 15 గంటల మేర సర్కార్ పనిచేయించుకుంటోందని ఆరోపించారు. ఓటీ చేయించుకున్నా అదనంగా జీతాలివ్వడంలేదని, అయినా పెట్టుబడిదారులకే గవర్నమెంట్ అండగా ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో కార్మిక వేతన సవరణ జరిగి 15 ఏళ్లు దాటినా పట్టించుకోవడంలేదని విమర్శించారు. కాంట్రాక్ట్, ఆప్కాస్, అవుట్సోర్సింగ్ కార్మికులకు జీతాలను ఏడేళ్లుగా పెంచలేదని ధ్వజమెత్తారు. పరిశ్రమల అధిపతులు అతి తక్కువ వేతనాలను చెల్లిస్తున్నా, అడిగే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. జీతాలను పెంచకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ధర్నాకు మద్దతుగా ఎల్ఐసీ ఏఓఐ, కాంట్రాక్ట్ ఏఎన్ఎం అసోసియేషన్, పెద్దాస్పత్రిలోని ఆప్కాస్, మున్సిపల్ పారిశుధ్య కార్మిక సంఘాల తరఫున కార్యకర్తలు బ్యానర్లు ప్రదర్శించారు. వీరి వద్దకు డీఆర్వో విజయ్కుమార్ వచ్చి వినతిపత్రాన్ని స్వీకరించి.. డిమాండ్లను ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, పెంచలనరసయ్య, రెహనాబేగం, అల్లాడి గోపాల్, గడ్డం అంకయ్య, సతీష్కుమార్, సురేష్ రాజా, ఎల్ఐసీ ఏఓఐ రాష్ట్ర నేతలు మేకల నరసింహరావు, హజరత్రెడ్డి, ఆప్కాస్ జేఏసీ నేత చేమూరు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా ఇంటి స్థలాల ఆక్రమణ
● టీడీపీ నేతల అండతోనే.. చిట్టమూరు: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిరుపేదలకు కేటాయించిన ఇంటి స్థలాలను ఆక్రమించారని ఆరోపిస్తూ మండలంలోని నార్తువరత్తూరు గ్రామానికి చెందిన గిరిజన కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నాటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 20 మంది నిరుపేద కుటుంబాలకు ఇంటి స్థలాలు కేటాయించింది. వీరిలో 13 మంది గిరిజనులు, ముగ్గురు బీసీలు, నలుగురు దళితులకు రెవెన్యూ అధికారులు హద్దులు చూపించి పట్టాలు అందజేశారు. స్థలాలను లెవలింగ్ చేశారు. అయితే మంగళవారం గ్రామంలోని కొందరు టీడీపీ నేతల అండతో నాలుగు ప్లాట్లలో మట్టిని తోలించి ఆక్రమించారని బాధితులు ఆరోపించారు. గిరిజన కాలనీకి చెందిన ఈగా కావేరి, అద్దూరు సునీతతోపాటు మరో ఇద్దరి స్థలాల్లో మట్టి తోలారని చెబుతున్నారు. ఈ విషయంపై ప్రశ్నించగా ‘మీకు దిక్కున చెప్పుకోండి’ అంటూ బెదిరింపులకు దిగారని వారు వాపోయారు. ప్రభుత్వం మారిన తర్వాత తమకు పక్కా ఇళ్ల నిర్మాణం జరగకపోవడంతో, ఆర్థిక స్థోమత లేక ఇళ్లు నిర్మించుకోలేకపోయామని, అదే అవకాశంగా భావించి ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తహసీల్దార్ రామయ్యను వివరణ కోరగా, క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. -
ట్రాఫిక్.. నిత్య నరకం
నెల్లూరు (క్రైమ్): నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. విస్తరణకు నోచుకోని రహదారులు, రోడ్లపైకి చొచ్చుకొచ్చిన ఆక్రమణలు, ఇష్టానుసారంగా చేసే పార్కింగ్లు, ఎక్కడపడితే అక్కడ ఆగే ఆటోలు, సిటీ బస్సులు, ప్రధాన రహదారులపైనే ఏర్పడిన ఆటో స్టాండ్లు, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారుల నిర్లక్ష్యం నగర ట్రాఫిక్ను అస్తవ్యస్తంగా మార్చుతున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రహదారుల అభివృద్ధి జరగకపోవడంతో నగరవాసులు రోజూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రధాన జంక్షన్లు వాహనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్, మద్రాస్ బస్టాండ్, వీఆర్సీ సెంటర్, ట్రంక్ రోడ్డు, హరనాథపురం జంక్షన్, ఆత్మకూరు బస్టాండ్ పరిసరాల్లో ట్రాఫిక్ రద్దీ సాధారణంగా మారింది. చిన్న ఆటంకం ఏర్పడినా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్న పరిస్థితి నెలకొంటోంది. ప్రమాదాల ముప్పు వ్యాపార కేంద్రమైన స్టోన్హౌస్పేట, పప్పులవీధితో పాటు ప్రధాన వ్యాపార సముదాయాలు, ఆస్పత్రులు, విద్యాసంస్థలు, హోటళ్లు, మద్యం దుకాణాల వద్ద రోడ్లపైనే వాహనాలు పార్కింగ్ చేయడం వల్ల ఇప్పటికే ఇరుకుగా ఉన్న రహదారులు మరింత కుంచించుకుపోతున్నాయి. ఫుట్పాత్లు కూడా ఆక్రమణలకు గురికావడంతో పాదచారులు రోడ్డుపైనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణలోనూ పలు లోపాలు కనిపిస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. కొన్ని కీలక కూడళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు విధుల్లో ఉన్నప్పటికీ రద్దీని సమర్థంగా నియంత్రించలేకపోతున్నారని అంటున్నారు. మరోవైపు కొందరు వాహనదారుల నిర్లక్ష్యం కూడా సమస్యను మరింత జఠిలం చేస్తోంది. రాంగ్రూట్లో రాకపోకలు, హెల్మెట్, సీట్బెల్ట్ నిబంధనలను పాటించకపోవడం, నడిరోడ్డుపైనే ప్రయాణికులను ఎక్కించడం, దించడం వంటి చర్యలు ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి.ట్రాఫిక్ రద్దీ కారణంగా ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, అత్యవసర సేవల కోసం ప్రయాణించే వారు రోజూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అంబులెన్స్లు సైతం ట్రాఫిక్లో చిక్కుకుపోతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో విలువైన సమయం వృథా కావడంతో రోగుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. ట్రాఫిక్ను సమర్థంగా నియంత్రించేందుకు అవసరమైన స్థాయిలో సిబ్బంది లేకపోవడం మరో సమస్యగా మారింది. ఉన్నవారిపైనే అధిక పనిభారం పడుతుండటంతో అన్ని ప్రాంతాల్లో సమర్థవంతమైన పర్యవేక్షణ సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. నగరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటే రోడ్లపై ఉన్న ఆక్రమణలను తొలగించడం, ప్రధాన రహదారులను విస్తరించడం, అక్రమ పార్కింగ్పై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించడం, ఆటోలు, సిటీ బస్సులకు ప్రత్యేక పాయింట్లు ఏర్పాటు చేయడం, ట్రాఫిక్ పోలీస్ సిబ్బందిని పెంచడం, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరమని నగరవాసులు కోరుతున్నారు. పెరుగుతున్న నగర అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్ నిర్వహణపై సమగ్ర కార్యాచరణ చేపట్టాలని వారు ప్రభు త్వాన్ని, సంబంధిత అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.నెల్లూరులో రోడ్ల ఆక్రమణలు ఇష్టారాజ్యంగా చేస్తున్న పార్కింగ్తో తీవ్ర ఇబ్బందులు రద్దీలో చిక్కుకుంటున్న అంబులెన్స్లు శాశ్వత పరిష్కారం కోరుతున్న నగరవాసులు సిబ్బంది లేక.. -
ట్రాక్టర్ దగ్ధం
● రైతుకు తీవ్ర గాయాలు కలిగిరి: మండలంలోని కృష్ణారెడ్డిపాళెం గ్రామంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్కు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ఆ వాహనాన్ని నడుపుతున్న రైతు కూనం నరసారెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నరసారెడ్డి రైతుల వద్ద పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నాడు. ఇటీవల పొలంలోని కంపచెట్లను తొలగించి, వాటిని ట్రాక్టర్తో నెట్టుకుంటూ పాడుబడ్డ బావిలోకి తోసి నిప్పంటించాడు. అనంతరం మిగిలిన కంపను బావివైపు నెడుతుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. నరసారెడ్డికి కూడా మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన అతను తీవ్ర గాయాలతో కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. అయితే ట్రాక్టర్ పూర్తిగా దగ్ధమైంది. తీవ్రంగా గాయపడిన నరసారెడ్డి బంధువులకు ఫోన్ ద్వారా తెలియజేయగా వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అతడిని 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం కలిగిరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
బాలల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణ
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు రూరల్: జిల్లాలో బాలల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. బాలల పరిరక్షణ వ్యవస్థపై ఐసీడీఎస్, వైద్య, పోలీస్, సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష, అవగాహన సమావేశాన్ని కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై శాఖల వారీగా కమిషన్ చైర్మన్ సూర్యనారాయణరాజు, కమిషన్ సభ్యురాలు వెంకటపద్మలత, కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా హిమాన్షు శుక్లా మాట్లాడారు. పిల్లల సమగ్రాభివృద్ధికి ఐసీడీఎస్, వైద్య, విద్య, పోలీస్, కార్మిక శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. గిరిజనులు, అనాథ పిల్లల సంక్షేమానికి ప్రత్యేక చర్యలతో పాటు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రత్యేక తనిఖీలను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో బాల కార్మికులుగా ఉన్న వారిని జిల్లాకు సురక్షితంగా తీసుకొచ్చి, వారిని ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న నెట్వర్క్లపై చర్యలు చేపట్టామని వివరించారు. అనంతరం సూర్యనారాయణరాజు మాట్లాడారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టళ్లలో గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని సూచించారు. జిల్లాలను మూడ్నెల్లకోసారి సందర్శించి బాలల హక్కుల అమలుపై సమీక్షించనున్నామని ప్రకటించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు పవర్పాయింట్ ప్రజంటేషన్ను నిర్వహించారు. ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్, జిల్లా బాలల సంరక్షణాధికారి సురేష్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 1098కు సమాచారమివ్వండి పిల్లల హక్కుల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని, బాలలపై వేధింపులు, బాల కార్మిక వ్యవస్థ తదితరాలు ఎక్కడ జరిగినా వెంటనే 1098 చైల్డ్ హెల్ప్ లైన్కు సమాచారమివ్వాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర చైర్మన్ సూర్యనారాయణరాజు కోరారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పిల్లల్లో పెరుగుతున్న చెడు అలవాట్లు, సోషల్ మీడియా దుష్ప్రభావాలు, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, చిన్నారులను నేర కార్యకలాపాలకు వినియోగించే ధోరణిపై కమిషన్ సభ్యులు, నిపుణులతో కలిసి విస్తృత అధ్యయనం చేసి సమగ్ర నివేదికను సిద్ధం చేశామని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలోనే అందజేయనున్నామని వెల్లడించారు. సోషల్ మీడియా ప్రభావంపై పిల్లలు, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించేలా రాష్ట్ర వ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నామని ప్రకటించారు. విద్యకు చిన్నారులు దూరం కాకుండా చర్యలు చేపట్టనున్నామని పేర్కొన్నారు. -
డివైడర్ను ఢీకొట్టిన బైక్
● యువకుడి మృతి నెల్లూరు(క్రైమ్): రోడ్డు దాటుతున్న మహిళను తప్పించే క్రమంలో మోటార్బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. నెల్లూరు సౌత్ ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు.. నగరంలోని మిలటరీ కాలనీకి చెందిన సాయికుమార్ (29) అవివాహితుడు. అతను పడారుపల్లిలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. బుధవారం ఉదయం కూరగాయలు కొనుగోలు చేసేందుకు బైక్పై మార్కెట్కు బయలుదేరాడు. ఫత్తేఖాన్పేట వద్ద ఓ మహిళ అకస్మాత్తుగా రోడ్డు దాటేందుకు బైక్కు అడ్డం వచ్చింది. ఆమెను తప్పించే ప్రయత్నంలో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. గాయాలపాలైన సాయికుమార్ను స్థానికులు చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే యువకుడు మృతిచెందాడని నిర్ధారించారు. బాధిత కుటుంబ సభ్యులు సౌత్ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.ఉదయం నిద్రలేచి చూసేసరికి.. ● ఉరేసుకుని యువకుడి బలవన్మరణం నెల్లూరు(క్రైమ్): అనారోగ్యమో?, పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడనో స్పష్టమైన కారణం తెలియదు గానీ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలం నిర్మలా నగర్కు చెందిన అనుదీప్ సాయి (22) ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అతడికి చిన్నతనం నుంచి వినికిడి లోపం ఉంది. ఇటీవల పరీక్షల్లో పలు సబ్జెక్ట్ల్లో ఫెయిల్ అయ్యాడు. మంగళవారం రాత్రి స్నేహితుడిని కలిసి 11 గంటలకు ఇంటికి చేరుకుని తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. బుధవారం తెల్లవారుజామున తల్లి నిద్రలేచి కుమారుడి గదిలో లైట్లు వెలుగుతుండటాన్ని గమనించింది. వెళ్లి చూడగా కుమారుడు సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. ఈ విషయాన్ని ఆమె తన భర్తకు తెలియజేసింది. ఇద్దరూ కలిసి సాయిని కిందకు దించి 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది అనుదీప్ సాయిని పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు.మార్కెట్లోకి బ్రెజ్జా కారు విడుదల నెల్లూరు(బృందావనం): వాహనాల తయారీలో ఎంతో పేరు, ప్రతిష్టలు కలిగిన మారుతి సుజుకి ది న్యూ బ్రెజ్జా నూతన కారును నెల్లూరు మార్కెట్లోకి బుధవారం విడుదల చేసింది. నగర సమీపంలోని విష్ణు కార్స్ మోటార్లో స్థానికులు, బ్యాంకింగ్ ఫైనాన్స్ కస్టమర్లు దీనిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ షోరూం ఏజీఎం గిరిష్ మాట్లాడుతూ మారుతి నుంచి అతితక్కువ ప్రారంభ ధర రూ.7,39,000లతో కారు వచ్చిందన్నారు. 5 స్టార్ రేటింగ్, సూపర్టర్బో బూస్ట్ జెట్ ఇంజిన్, 6 గేర్ల ఫీచర్లతో విడుదల చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మారుతి సుజుకి అరేనా షోరూం ఎస్ఎం మస్తానయ్య, ఏఎస్ఎం కృష్ణ, విష్ణు కార్స్ షోరూమ్, టీం సిబ్బంది, నగరంలోని ప్రముఖులు, బ్యాంక్ ఫైనాన్షియర్లు, వినియోగదారులు పాల్గొన్నారు. -
పొగాకు రైతులకు పోలీస్ సంకెళ్లు
● గిట్టుబాటు ధర కోసం పోరాడుతున్న కర్షకుల ముందస్తు నిర్బంధాలు ● అడ్డుకోవడమేనా సమస్యకు పరిష్కారం..? ● ప్రభుత్వ తీరుపై భగ్గుమన్న నేతలు మర్రిపాడు: గిట్టుబాటు ధర కోసం నెలలుగా వేడుకుంటున్నా, ప్రయోజనం లేకపోవడంతో చివరికి రోడ్డెక్కాలని నిర్ణయించుకున్న పొగాకు రైతులకు పోలీసులు అడ్డుకట్టేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రహదారుల ముట్టడికి రైతు సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో డీసీపల్లి పొగాకు కొనుగోలు కేంద్రం వద్ద బుధవారం నిర్వహించాల్సిన నిరసనను ఖాకీలు అడ్డుకున్నారు. పలువురు రైతు నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఉదయం నుంచే నిఘా రాస్తారోకోలో పాల్గొనకుండా చేయాలనే ఉద్దేశంతో డీసీపల్లిలోని వేలం కేంద్రం వద్ద పోలీసులను ఆత్మకూరు సీఐ గంగాధర్, మర్రిపాడు, ఏఎస్పేట ఎస్సైలు బలరామ్రెడ్డి ఉదయం నుంచే మోహరించారు. కార్యక్రమంలో పాల్గొనొద్దంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు సంఘ నేత చండ్రా నారాయణస్వామితో పాటు పలువురు నేతల ఇళ్లకెళ్లి నోటీసులను అందజేశారు. అనంతరం వారిని స్టేషన్కు తరలించారు. స్పష్టమైన హామీ ఏదీ..? గిట్టుబాటు ధర కోసం రెండు నెలలుగా వినతిపత్రాలిస్తూ.. ధర్నాలు, బైక్ ర్యాలీలు, అధికారులతో సమావేశాలను నిర్వహిస్తూ.. సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నామని చండ్రా నారాయణస్వామి తెలిపారు. అయినా సర్కార్ నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోకు పిలుపునిచ్చారని వివరించారు. ఈ క్రమంలో నేతలను నిర్బంధించడం బాధాకరమన్నారు. పొగాకు రైతులు నష్టపోకుండా కిలోకు రూ.300కుపైగా ధర లభించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొనుగోళ్లను వేగవంతం చేసి రైతుల వద్ద నిల్వ ఉన్న మొత్తాన్నీ సేకరించాలని పేర్కొన్నారు. ఆందోళనను అణిచేసే యత్నం ఆందోళనను అణిచేయాలనే ఉద్దేశంతో జిల్లాలో రైతు సంఘ నేతలను గృహ నిర్బంధం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని సంఘ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. కార్యదర్శి మూలి వెంగయ్య, జిల్లా సహాయ కార్యదర్శి లక్కు ప్రసాద్, నేత లక్ష్మీపతి తదితరులను హౌస్ అరెస్ట్ చేయడాన్ని తప్పుబట్టింది. తమది రైతు ప్రభుత్వమని చెప్పుకొనే సర్కార్ ఇలా వ్యవహరించడమేమిటని ప్రశ్నించారు. -
రోడ్లు దారుణం.. ప్రయాణమెలా?
● వాహనాలను అడ్డుకున్న ఏరూరు గ్రామస్తులుచిల్లకూరు: తీర ప్రాంతంలో చేపడుతున్న సాగరమాల రహదారి, క్రిస్సిటీలో మౌలిక వసతుల పనుల కోసం మట్టి, గ్రావెల్, ఇసుక, బూడిద తరలించే భారీ వాహనాల వల్ల వరగలి క్రాస్ రోడ్డు నుంచి గుమ్మళ్లదిబ్బ వరకు ఉన్న ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసమైంది. చిన్నపాటి వర్షం కురిసినా రోడ్డు బురదమయం అవుతోంది. ఈ క్రమంలో ఏరూరు గ్రామానికి చెందిన మహిళలు బుధవారం రహదారిపై రాకపోకలు సాగిస్తున్న వాహనాలను అడ్డుకున్నారు. వారు మాట్లాడుతూ రెండేళ్ల నుంచి ఆర్అండ్బీ అధికారులు కనీసం ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టకపోవడం దారుణమన్నారు. దీంతో అడుగుకో గుంత ఉందని, ప్రయాణం నరకప్రాయంగా మారిందన్నారు. ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో దుమ్ము లేచి శ్వాసకోశ వ్యాధులు బారిన పడుతుండగా, వర్షాలు కురిస్తే గుంతల్లో నీరు నిలుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు గతంలో గుమ్మళ్లదిబ్బ వరకు గూడూరు ఆర్డీసీ డిపో నుంచి ఐదు బస్సులుండగా నేడు ఒకదానితో నాలుగు ట్రిప్పులు వేస్తున్నారన్నారు. పలుమార్లు వాహనాలను అడ్డుకుంటే నాయకులు వచ్చి దుమ్ము లేవకుండా నీరు చల్లుతామని చెప్పడం ఆ తర్వాత పట్టించుకోపోవడం సర్వ సాధారణంగా మారిందన్నారు. సాగరమాల రహదారి నిర్మాణం చేపడుతున్న మూడు కాంట్రాక్ట్ సంస్థల ద్వారా ఈ రోడ్డును బాగు చేయాలని డిమాండ్ చేశారు. -
తీరు మార్చుకోకపోతే గుణపాఠం తప్పదు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): పొగాకుకు కనీస మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించాలనే డిమాండ్తో రాష్ట్ర వ్యాప్త ఆందోళనల్లో భాగంగా డీసీపల్లి పొగాకు బోర్డు కార్యాలయం వద్ద నిరసన చేపట్టేందుకు సిద్ధమైన వారిని అరెస్ట్ చేయడం.. కొందర్ని గృహ నిర్బంధంలో ఉంచడం దారుణమని, తీరు మార్చుకోకపోతే సర్కార్కు గుణపాఠం తప్పదని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ పేర్కొన్నారు. బాలాజీనగర్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. గతేడాది కిలో పొగాకును రూ.320కు కొనుగోలు చేయగా, ఈ ఏడాది రూ.200కు కూడా సేకరించడంలేదని మండిపడ్డారు. మద్దతు ధర కోసం కర్షకులు శాంతియుతంగా నిరసన చేస్తుంటే కూటమి ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీరాములు, నేతలు మెహన్రావు, మాదాల వెంకటేశ్వర్లు, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
ఛత్రపతి శివాజీ విగ్రహం ధ్వంసం
● టీడీపీ నేతల పనిగా ఆరోపణలు ఇందుకూరుపేట: మండలంలోని యాగర్ల సెంటర్లో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ధ్వంసం చేసి తొలగించారు. స్థానికుల కథనం మేరకు.. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి శివాజీ విగ్రహాన్ని పెట్టారు. బుధవారం ఉదయం దానిని ధ్వంసం చేసి పక్కన పడేశారు. విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన సిమెంట్ దిమ్మెను పగులగొట్టారు. కాగా టీడీపీ నాయకులే దీనికి ఒడిగట్టారని ఆరోపణలుస్తున్నాయి. ఆ ప్రాంతంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకే ఇలా చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. -
రెండేళ్ల నమ్మకం కాదు.. రెండేళ్ల మోసం
● అమలు కాని సూపర్సిక్స్ ● గ్రామాల్లో నిలిచిన అభివృద్ధి ● ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్రెడ్డి తోటపల్లిగూడూరు(పొదలకూరు): టీడీపీ చేపట్టిన కార్యక్రమం రెండేళ్ల నమ్మకం కాదనీ.. రెండేళ్ల మోసమని, వాగ్దానాలను సక్రమంగా అమలు చేయకుండా ప్రజల్లోకి ఎలా వెళ్తారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. తోటపల్లిగూడూరు మండలంలోని మాచర్లవారిపాళెం, చింతోపు గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా గురువులకు వందనాలు సమర్పించి.. గురుపూర్ణిమ శుభాకాంక్షలను తెలియజేశారు. మాచర్లవారిపాళెంలోని సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక గ్రామాల్లో అభివృద్ధి స్తంభించిందని ఆరోపించారు. సూపర్సిక్స్ హామీలకు విలువ లేకుండాపోయిందని విమర్శించారు. ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవను అరకొరగా అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పింఛన్లను కొత్తగా మంజూరు చేయకపోవడంతో పేదలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. వితంతువులు, దివ్యాంగులు, వృద్ధులు దీని కోసం నిరీక్షిస్తున్నారని చెప్పారు. నమ్మకాన్ని కోల్పోయిన చంద్రబాబు ఈ రెండేళ్లలో ప్రజల నమ్మకాన్ని చంద్రబాబు కోల్పోయారని దుయ్యబట్టారు. మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండేళ్ల నమ్మకం పేరుతో గ్రామాల్లో ఎమ్మెల్యేలు ముందుగానే పర్యటించి ప్రజల వద్ద తిట్లు తినాల్సిందిగా పురమాయించారని ఎద్దేవా చేశారు. సంక్షేమం, అభివృద్ధి లేకపోవడంతో అధికారులు, ఎమ్మెల్యేలు ఎక్కడికెళ్లినా ప్రజల నుంచి స్పందన రావడంలేదన్నారు. దివ్యాంగులకు స్లాట్లిచ్చి స్థానిక ఎన్నికల్లోపు ఏదో రకంగా పింఛన్లను అందజేసి ఆ తర్వాత మళ్లీ ఎగ్గొట్టే ఆలోచనలో ఉన్నారని ఆరోపించారు. ఇళ్ల నిర్మాణంతో 97 శాతం మంది సంతోషంగా ఉన్నారంటూ గూడూరులో చంద్రబాబు ప్రకటించారని.. ఇంటి నివేశన స్థలాలివ్వకుండా, గృహాలు కట్టించకుండా వీరెలా ఆనందంగా ఉంటారని ప్రశ్నించారు. డీఎస్సీలో జరిగిన అన్యాయంపై నెల్లూరులో యువత భారీ ర్యాలీని జరిపి విజయవంతం చేసిందని తెలిపారు. ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలను తెలియజేశారు. లోకేశ్ నైతిక బాధ్యత వహించాలి డీఎస్సీ దగాపై లోకేశ్ నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ లీకేజీకు సంబంధించి కేంద్ర మంత్రి రాజీనామా చేసిన విధానాన్ని ఈయనా పాటించాలని పేర్కొన్నారు. లోకేశ్ రిజైన్ చేయకపోతే ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. అధికారం ఉన్నా.. లేకపోయినా ప్రజల మధ్యే తమ పార్టీ ఉంటుందని తెలిపారు. చింతోపు మాజీ సర్పంచ్ లేబూరు మల్లికార్జున్కు మాతృవియోగం కలగడంతో కుటుంబసభ్యులను పరామర్శించారు. చిల్లకూరు సుధీర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
● ఎస్పీ అజిత వేజెండ్ల నెల్లూరు(బృందావనం): ‘నేటి డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ లక్ష్యంగా మారుతున్నారు. ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు సైబర్ భద్రత రాయబారలుగా మారాలి’ అని ఎస్పీ అజిత వేజెండ్ల పిలుపునిచ్చారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నెల్లూరులోని పురమందిరంలో ‘సైబర్ భద్రత – సైబర్ సేఫ్టీ’ అనే అంశంపై బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. డిజిటల్ అరెస్ట్, లోన్యాప్, ఓటీపీ మోసాలు, ఫేక్ ఇన్విస్టెమెంట్ స్కీమ్లు, పార్ట్టైమ్ జాబ్ స్కామ్స్, క్యూఆర్ కోడ్, యూపీఐ, ఏపీకే మోసాలు, ఏఐ డీప్ఫేక్, వాయిస్ క్లోనింగ్ తదితర సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని ఫొటోలు మార్ఫింగ్ చేసి బెదిరించడం, సోషల్ మీడియా ద్వారా బ్లాక్మెయిల్ చేయడం ఘటనలు పెరుగుతున్నాయన్నారు. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 జాతీయ సైబర్ హెల్ప్లైన్, 112 అత్యవసర సేవలు, సమీప పోలీస్స్టేషన్లను సంప్రదించాలన్నారు. ‘స్టాప్.. థింక్.. వెరిఫై.. దెన్ యాక్ట్’ సూత్రాన్ని పాటించాలని వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలో నిరంతరం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. ● అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సీహెచ్ సౌజన్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ రకాల సైబర్ మోసాలు,వాటి నుంచి రక్షణమార్గాలను వివరించారు. నగర ఏఎస్పీ దీక్ష మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల నమోదైన సైబర్ కేసులను వివరిస్తూ విద్యార్థినులు, మహిళలు, ఉద్యోగులు, వృద్ధులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. తొలుత పురమందిరం నుంచి వీఆర్సీ సెంటర్ వరకు సైబర్ భద్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వాకాటి విజయకుమార్రెడ్డి, నారాయణ ఇంజినీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఎ.హజరత్తయ్య, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎం.చంద్రమోహన్రెడ్డి, ఇన్స్పెక్టర్లు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. -
న్యాయవాదుల రక్షణ చట్టం అమలుకు డిమాండ్
నెల్లూరు, (లీగల్): న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ జోనల్ ప్రెసిడెంట్, సీనియర్ న్యాయవాది రామిరెడ్డి రోజారెడ్డి డిమాండ్ చేశారు. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించాలంటూ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని బుధవారం చేపట్టారు. ఆవరణ నుంచి బయల్దేరి మద్రాస్, ఆర్టీసీ బస్టాండ్ల మీదుగా కోర్టు వద్దకు ర్యాలీ చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లా నేస్తం ద్వారా జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెల రూ.ఐదు వేల భృతిని గత ప్రభుత్వం అందజేసిందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే రూ.పది వేలు, ఇంటి స్థలంతో పాటు 16 అంశాలపై టీడీపీ హామీ ఇచ్చినా, దేన్నీ అమలు చేయలేదని ఆరోపించారు. న్యాయవాదులు, వారి కుటుంబసభ్యులకు ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని కోరారు. కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఏపీపీ నియామకాలను వెంటనే జరపాలన్నారు. లీగల్ సెల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సిద్దన సుబ్బారెడ్డి, నెల్లూరు బార్ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ ఉమామహేశ్వర్రెడ్డి, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, ప్రధాన కార్యదర్శి విక్రమ్రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర సెక్రటరీ రమాదేవి, జాయింట్ సెక్రటరీ శ్రీధర్, నెల్లూరు టౌన్, రూరల్, కోవూరు, సర్వేపల్లి ప్రెసిడెంట్లు కమలాకర్రెడ్డి, విద్యాధర్రెడ్డి, చెంచురెడ్డి, శ్రీనివాసులు, జిల్లా నేతలు శ్యామాచార్యులు, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్జీటీ ఆదేశాలు తుస్.. వరద ప్రవాహానికి అడ్డుకట్ట
పెన్నమ్మ గుండెల్లో యంత్రాలు గర్జిస్తున్నాయి. అధికార యంత్రాంగాలు చేవ చచ్చి.. చేష్టలుడిగి చూస్తున్నాయి. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) విధించిన నిషేధాన్ని ధిక్కరించి ఇసుక మాఫియా వికటాట్టహాసం చేస్తోంది. పర్యావరణ నిబంధనలు గాలికి వదిలేసి ప్రకృతిని పణంగా పెట్టి నదిని చెరబట్టుతున్నారు. వరద ముప్పు, జిల్లా జలనిధి సోమశిల ప్రాజెక్ట్ భద్రత, ప్రజల ప్రాణాలు అన్నింటినీ పక్కన బెట్టి ధనార్జనే ధ్యేయంగా యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల కళ్ల ముందే వందలాది టిప్పర్లు తిరుగుతున్నా, రహదారులు ధ్వంసమవుతున్నా, నదిలోనే రహదారులు నిర్మిస్తున్నా, సంబంధిత శాఖలు మౌనం దాల్చాయి. అనధికార ఇసుక రీచ్ నుంచి వెళ్లే వాహనాలతో ప్రధాన రహదారులు చిఽధ్రం అవుతున్నాయి. ఓవర్ లోడుతో వాహనాలు వెళ్తుండడంతో రోడ్లు కుంగిపోతున్నాయి. ఆ రోడ్లు సామర్థ్యానికి మించి లోడింగ్తో వెళ్తుండడంతో గుల్లగుల్లగా మారుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేల ధనదాహానికి రోడ్లు చిధ్రమయి ప్రజాజీవనానికి తీవ్ర ఆటంకం కలుగుతున్నా అధికారులకు చీమకుట్టినట్లు లేదు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో టీడీపీ నేతల ధనదాహం.. అధికార యంత్రాంగాల అక్రమార్జనకు పెన్నమ్మ గర్భశోకంతో విలపిస్తోంది. పర్యావరణ పరిరక్షణ నిబంధనల్లో భాగంగా జూలై నుంచి అక్టోబరు వరకు మూడు నెలల పాటు నదుల్లో ఇసుక తవ్వకాలపై జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం విధించింది. ఈ కాలంలో ఒక్క ట్రాక్టర్ కూడా నదిలోకి దిగకూడదనే నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ సోమశిల దిగువ కలువాయి నుంచి ఇందుకూరుపేట వరకు అడుగడుగునా భారీ యంత్రాలు పెట్టి నదీ గర్భాన్ని కుళ్ల బొడుస్తున్నారు. చట్టంలో ఉన్న ‘డీ–సిల్టింగ్’ వెసులుబాటును అడ్డు పెట్టుకుని పరిమిత అనుమతి ఉన్న ప్రాంతాన్ని దాటి ఓపెన్ రీచ్లు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని కలువాయి మండలం రాజుపాళెం సమీపంలోని సోమశిల ప్రాజెక్ట్కు అతి సమీపంలోనే పర్యావరణ అనుమతుల్లేని ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక దందా ఆపే దమ్ము ఎవరికుందని టీడీపీ ఎమ్మెల్యేలు జిల్లా అధికార యంత్రాంగానికి సవాల్ విసురుతున్నారు. నిషేధం.. అయినా మాకేం భయం పర్యావరణ పరిరక్షణ సంస్థ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు ధిక్కరించి పెన్నానదిలో అనధికార రీచ్లు ఏర్పాటు చేసుకుని రేయింబవళ్లు బహిరంగంగానే ఇసుక దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన రహదారుల వెంబడే ఇసుక వాహనాలు వెళ్తున్నాయి. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన రహదారులను చిధ్రం చేస్తూ ఇసుక దందా సాగిస్తున్నారు. ఆ ఇసుక మాఫియాకు రాచబాటలు వేస్తూ అధికార యంత్రాంగాలు సాగిలపడి గులాంగిరి చేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా జలనిధి సోమశిలకు దిగువన అతి సమీపంలో కి.మీ. దూరంలోని రాజుపాళెం సమీపంలో స్థానిక ప్రజాప్రతినిధి అండతో పెన్నానదిలో భారీ యంత్రాలు పెట్టి ఇసుక తోడేసి నిత్యం వందలాది టిప్పర్లు, టర్బోలారీల్లో తరలిస్తున్నారు. అక్కడ ఇసుక ఇసుక తవ్వకాలు చేపట్టకూడదనే నిబంధనలు ఉన్నాయి. డీసిల్టింగ్ అనుమతే చట్టవిరుద్ధం వాస్తవానికి నదిలో డీసిల్టింగ్ చేపట్టాలంటే.. నదిలో బ్యారేజీలకు ఎగువ ప్రాంతంలోనే అనుమతి ఇవ్వాల్సి ఉంది. ‘ఎద్దు ఈనిందంటే.. దూడను గాటన కట్టేయండి’ చందంగా టీడీపీ నేతలు దరఖాస్తు చేయడం, అధికారులు అనుమతి ఇచ్చేయడం చకచకా జరిగిపోయాయి. రాజుపాళెం సమీపంలో ఎటువంటి బ్యారేజీ లేదు. కానీ సంగం బ్యారేజీకి ఎగువ ప్రాంతంలో డీసిల్టింగ్ పేరుతో అనుమతులు తీసుకుని బ్యారేజీకి 50 కి.మీ. దూరంలోని రాజుపాళెం వద్ద ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. డీసిల్టింగ్ అనుమతి పేరుతో ఓపెన్ రీచ్నే నిర్వహిస్తున్నారు. నేరుగా నది మధ్యలో యంత్రాలు పెట్టి రేయింబవళ్లు ఇసుక తవ్వి రవాణా చేస్తున్నారు. ఒక్కో వాహనానికి రూ.12 వేలు వంతున వసూలు చేస్తున్నారు. రోజుకు సగటున 100 ఇక్కడి నుంచి ఇసుక రవాణా జరుగుతోంది. రోజుకు సరాసరిగా రూ.12 లక్షల రాబడిలో షాడో ఎమ్మెల్యేగా ఉన్న కీలక నేతకు రూ.8 లక్షలు, మిగిలిన సొమ్ము ఖర్చులతోపాటు తమ్ముళ్లకు పంపకాలు చేసుకుంటున్నారు. నిషేధం కాలంలో తమ్ముళ్లు బరితెగించి తవ్వకాలు చేస్తున్నా.. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. యంత్రాలతో తవ్వకాలుకుల్లూరులో డంపింగ్ తెలుగురాయపురం అనధికార ఇసుక రీచ్ నుంచి సమీపంలో ఉన్న కుల్లూరు నేషనల్ హైవే (565) పక్కనే ఇసుకను డంపింగ్ చేస్తున్నారు. అక్కడి నుంచి విక్రయాలు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంత పక్కాగా బరితెగించి ఇసుక దందా చేస్తున్నా అధికారయంత్రాంగం కళ్లకు గంతలు కట్టుకున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మాఫియా ఇసుక దందా అప్రతిహతం కలువాయి మండలం రాజుపాళెంలో బరితెగిస్తున్న తమ్ముళ్లు అక్టోబర్ 15 వరకు నిషేధాన్ని ధిక్కరించి ఇసుక తోడేస్తున్న తోడేళ్లు అధిక లోడుతో టిప్పర్లతో గుల్లగుల్లగా రహదారులు ప్రజాప్రతినిధులకు రూ. కోట్లలో నెల మామూళ్లు సోమశిల ప్రాజెక్ట్కు పొంచి ఉన్న ముప్పు మామూళ్ల మత్తులో అధికారుల కళ్లకు గంతలు రోడ్లు గుల్ల చేస్తూ.. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను తమ్ముళ్లు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నేతల ఆదేశాలే చట్టాలుగా మార్చేశారు. నది మధ్యలో నుంచి ఇసుక రవాణాకు వీలుగా అడ్డంగా పట్టిష్టమైన రోడ్డు నిర్మాణం చేయడంతో స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒక వేళ వర్షం కురిసి నీటి ప్రవాహం వస్తే అడ్డుకట్ట వల్ల గ్రామాల వైపు వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉంది. సమీప గ్రామాలు మునిగిపోయి ప్రాణ, ఆస్తి నష్టం కలిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. కానీ అధికార యంత్రాంగానికి మాత్రం మాఫియా ఇచ్చే కాసులతో ప్రజాజీవనానికి ముప్పు ఉందని తెలిసీ కూడా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. -
ఒంటరి మహిళలే టార్గెట్
● రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు పొదలకూరు: చైన్ స్నాచర్లు చెలరేగిపోతున్నారు. ఒంటరి మహిళల మె డల్లోని బంగారు గొలుసులను లాక్కెడం నగర, పట్టణ ప్రాంతాల్లో జరిగేవి. ఇప్పుడు గ్రామాల్లోనూ దొంగలు పంజా విసురుతున్నారు. తాజా గా మంగళవారం రాత్రి మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో ఇద్దరు యువకులు మోటార్బైక్పై వెళ్లి మహిళ మెడలోని బంగారు సరుడు లాక్కెడంతో కలకలం రేగింది. ఈ ఏడాది ఏప్రిల్లో నరసింహకండ్రిక గ్రామం మెయిన్ రోడ్డులో దుకాణం నిర్వహిస్తున్న ఓ మహిళ మెడలోని గొలుసును ఇద్దరు యువకులు తెంపుకెళ్లారు. సరుకులు కొనుగోలు చేస్తునట్టు నటిస్తూ ఈ దారుణానికి ఒడిగట్టారు. తొగలవీధిలో చిన్న బంకు పెట్టుకుని వ్యాపారం చేస్తున్న వృద్ధ మహిళ మెడలోని బంగారు చైన్ను ఏడాదిన్నర క్రితం గుర్తుతెలియని దుండగుడు లాక్కెళ్లాడు. ఈ క్రమంలో ఆమెకు గాయాలయ్యాయి. అంతకుముందు కూడా పట్టణంలో చైన్ స్నాచింగ్లు జరిగాయి. పోలీసులు కొన్ని కేసులను ఛేదించి బంగారు రికవరీ చేయగా మరికొన్ని ఇప్పటికీ తేలకుండా ఉన్నా యి. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. విలువైన ఆభరణాలను ధరించవద్దని చెబుతున్నారు. పథకం ప్రకారం బైక్లపై వచ్చి ఇలాంటి నేరాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ముఖ్యంగా పొలం పనులు, తోటల్లోకి వెళ్లే మహిళలు మెడల్లో బంగారు నగలను ధరించొద్దని తెలిపారు. -
సమర్థంగా హరిత కార్యక్రమాల అమలు
నెల్లూరు రూరల్: జిల్లాలో 2047 నాటికి 50 శాతం హరితవరణాన్ని సాధించడమే లక్ష్యంగా అన్ని ప్రభుత్వ శాఖలు సమష్టిగా కృషి చేసి హరిత కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. హరిత కార్యక్రమాల అమలుపై కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జిల్లా అటవీ కమిటీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యాన, వ్యవసాయ, పంచాయతీరాజ్, విద్య, పరిశ్రమలు, నీటిపారుదల శాఖ, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తదితర అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వీటిని జిల్లాలో విజయవంతంగా అమలు చేయాలని సూచించారు. తమ పరిధిలోని రహదారులు, కాలువలు, చెరువులు, ప్రభుత్వ ఖాళీ భూములు తదితరాల్లో నర్సరీల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలు, నమోవనాల స్థలాల ఏర్పాటుకు అనుకూల భూములను పరిశీలించి వివరాలను జిల్లా అటవీ శాఖకు త్వరితగతిన అందజేయాలని ఆదేశించారు. జిల్లా అటవీ అధికారి మహబూబ్బాషా, సోషల్ ఫారెస్ట్రీ జిల్లా అటవీ అధికారి నాగార్జునరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వసుమతి, డీఆర్డీఏ పీడీ శ్రీనివాస ప్రసాద్, డీఈఓ బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు. -
కార్మికులకు కనీస వేతనం ఇవ్వాలంటూ..
● నెల్లూరులో సీఐటీయూ బైక్ ర్యాలీ నెల్లూరు(వీఆర్సీసెంటర్): ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, పరిశ్రమలు, షాపింగ్ మాల్స్, విద్య, వైద్యశాఖల్లో పనిచేస్తున్న కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాల్సిందేనని సీఐటీయూ నెల్లూరు నగర కార్యదర్శి జి.నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. దీనిని నగరాధ్యక్షుడు అత్తిమూరు శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు. శెట్టిగుంటరోడ్డు సెంటర్లోని సీపీఎం కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పప్పులవీధి, స్టోన్హౌస్పేట, ఆత్మకూరు బస్టాండ్, మినీబైపాస్ రోడ్డు, ముత్తుకూరు గేటు మీదుగా వీఆర్సీసెంటర్, గాంధీబొమ్మ సెంటర్, ఏబీఎం కాంపౌడ్ వరకు సాగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ దుకాణాలు, షాపింగ్ మాల్స్, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన పథకం, 104, 108, ఆరోగ్యశ్రీ, ఆరోగ్యమిత్ర, అర్బన్హెల్త్, ఆయూష్ తదితర చోట్ల పనిచేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ప్రభుత్వ శాఖలో విధులు నిర్వహిస్తున్న అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులకు మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేసి వాటి స్థానంలో పాత కార్మిక చట్టాలను అమలు చేయాలన్నారు. కార్మికుల సమస్యలపై ఈనెల 30వ తేదీన వీఆర్సీ మైదానం నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి మహాధర్నా నిర్వహిస్తామన్నారు. ఇందులో కార్మికలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ, డీవైఎఫ్ఐ నాయకులు రాంబాబు, మూలం ప్రసాద్, సుధాకర్, కామాక్షి, అశోక్, నరసింహ, అంకయ్య, సూర్యనారాయణ, మల్లెమ్మ, మధు, వెంకటేశ్వర్లు, మాలకొండేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వీఎస్యూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరసన
వెంకటాచలం: తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విక్రమ సింహపురి యూనివర్సిటీ అసోసియేషన్ ఆఫ్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆన్ కాంట్రాక్ట్ ఆధ్వర్యంలో కాకుటూరు వద్దనున్న వర్సిటీ క్యాంపస్లో చేపట్టిన నిరవధిక నిరసన దీక్ష మంగళవారం రెండో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు వర్సిటీ క్యాంపస్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పరిపాలన భవనం ఎదుట ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మినిమం టైమ్ స్కేల్ అమలు, రెగ్యులరైజేషన్, సర్వీస్ పరిగణన తదితర అంశాలతో కూడిన వినతిపత్రాన్ని యూనివర్సిటీ వీసీ ఆచార్య అల్లం శ్రీనివాసరావు, రిజిస్ట్రార్ కె.సునీతకు అందజేశారు. అనంతరం నిరసన దీక్షా శిబిరం వద్దకు యూనివర్సిటీ కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ అసోసియేషన్ సభ్యులు చేరుకుని మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాకుటూరు, కావలి యూనివర్సిటీ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు, కాంట్రాక్ట్ నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.45 సన్నవి : రూ.25 పండ్లు : రూ.10 -
డాక్యుమెంట్ రైటర్ల వినూత్న నిరసన
ఉదయగిరి: జీఓ నంబర్ 396ను రద్దు చేయాలని కోరుతూ స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఎదుట ఒంటి కాలిపై నిలిచి వినూత్న నిరసనను డాక్యుమెంట్ రైటర్లు మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పీపీపీ విధానంలో సేవా కేంద్రాల ఏర్పాటును రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం తమ జీవనోపాధికి గండి కొట్టేందుకే ఇలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పట్టించుకోకపోతే ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. డీసీపల్లిలో 320 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 320 బేళ్లను మంగళవారం విక్రయించారని నిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. వేలానికి 528 బేళ్లు రాగా, వీటిలో 320ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. 44,169 కిలోల పొగాకును విక్రయించగా, రూ.84,88,476.80 వ్యాపారం జరిగిందని వివరించారు. గరిష్టంగా రూ.250.. కనిష్టంగా రూ.160.. సగటు ధర రూ.192.18గా నమోదైందని చెప్పారు. ఎనిమిది కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారన్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 80,003 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 32,918 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.59 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టిక్కెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. బాలల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు నెల్లూరు(పొగతోట): బాలల హక్కులకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు చేపట్టనున్నామని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ రాష్ట్ర చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు పేర్కొన్నారు. నగరంలోని అంగన్వాడీ కేంద్రాలు, చిల్డ్రన్స్ హోమ్ను మంగళవారం పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. బాలలకు నాణ్యమైన సేవలను అందించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులను పూర్తి స్థాయిలో కల్పించాలని పేర్కొన్నారు. నిబంధనలను పాటించకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం వాత్సల్య చిల్డ్రన్స్ హోమ్ను సందర్శించి, అక్కడి పిల్లలతో మాట్లాడారు. బాలల సంరక్షణ, పరిరక్షణ చట్టం – 2015 మేరకు హోమ్ను నిర్వహిస్తున్నారాననే అంశాన్ని ఆరాతీశారు. కమిషన్ సభ్యురాలు వెంకటపద్మలత, ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్, డీసీపీఓ సురేష్, సీడీపీఓ అరుణ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ కార్గో పాయింట్లో వానపాముల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు ఆర్టీసీ ప్రధాన బస్టాండ్ ఆవరణలోని కార్గో పాయింట్లో విజిలెన్స్ అధికారులు మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో సుమారు 35 కిలోల వానపాములను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. విచారణలో అవి అనంతసాగరం మండలంలోని ఓ ఎరువుల తయారీ సంస్థకు చెందినవిగా ప్రాథమికంగా గుర్తించారు. అయితే నిబంధనల ప్రకారం అనుమతులతోనే వాటిని రవాణా చేశారా?, లేదా అనే అంశంపై డీఎఫ్ఓ మహబూబ్బాషా ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడి కానున్నాయి. సదరు పార్శిల్స్ విజయవాడ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. తనిఖీల్లో ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు జి.వెంకటేశ్వర్లు, పీవీ ప్రసాద్, కేఎన్రావు తదితరులు పాల్గొన్నారు. -
మానసిక, శారీరక దివ్యాంగ చిన్నారులకు ఉచిత ప్రవేశాలు
నెల్లూరు(అర్బన్): ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నెల్లూరులో నిర్వహిస్తున్న ఎంఎస్ఆర్ స్పాస్టిక్స్ సెంటర్లో 14 ఏళ్లలోపు మానసిక, శారీరక దివ్యాంగ చిన్నారులకు ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఉదయభాస్కర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక విద్యతోపాటు స్కూలు బస్సు సౌకర్యాన్ని కూడా ఉచితంగా అందజేస్తామన్నారు. ప్రవేశాలకు ఎలాంటి ఫీజు లేదన్నారు. ఆసక్తి గల తల్లిదండ్రులు వివరాల కోసం మద్రాస్ బస్టాండ్ సమీపంలోని రెడ్క్రాస్ స్పాస్టిక్స్ సెంటర్ను లేదా 86399 34861 ఫోన్ నంబర్ను సంప్రదించాలని సూచించారు. నిధుల దుర్వినియోగంజరగలేదు : ఆర్జేడీ నెల్లూరు(టౌన్): జిల్లాలో సమగ్రశిక్షకు సంబంధించి ఆయా పాఠశాలల్లో ప్రహరీ నిర్మాణాల్లో నిధుల దుర్వినియోగం జరగలేదని విద్యాశాఖ ఆర్జేడీ బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన నెల్లూరులోని సమగ్రశిక్ష కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉపాధి నిధులతో ఆయా పాఠశాలల్లో ప్రహరీ నిర్మాణాలు జరిగాయన్నారు. వీటికి సంబంధించి డబుల్ పేమెంట్ జరిగిందన్న ఆరోపణలు వచ్చినా, విచారణలో అలాంటిదేమీ లేదని స్పష్టమైందన్నారు. సమగ్రశిక్షలో ఇంజినీర్లు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. దీనిపై రాష్ట్ర కార్యాలయంలో వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. 2014 – 19వ సంవత్సరంలో స్పిల్ ఓవర్ వర్క్స్లో రూ.1.93 కోట్లు నిధులు గోల్మాల్ చేశారని పత్రికల్లో కథనాలు వచ్చాయన్నారు. ఈ నిధులను నేరుగా రాష్ట్ర కార్యాలయం నుంచే చెల్లించినట్లు పేర్కొన్నారు. ఉపాధ్యాయుల శిక్షణ నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. ఇది కూడా రాష్ట్ర కార్యాలయం నుంచే పేమెంట్ జరిగిందన్నారు. సమగ్రశిక్షలో నిధులు దుర్వినియోగం ఆరోపణలపై కలెక్టర్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారని, ప్రస్తుతం వారు విచారణ చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో డీఈఓ ఆర్.బాలాజీరావు, మాజీ ఏపీసీ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. కుష్టు వ్యాధి సర్వే వేగవంతం● అడిషనల్ డీఎంహెచ్ఓ ఖాదర్వలీ నెల్లూరు(అర్బన్): కుష్టు వ్యాధి గుర్తింపు సర్వేను వేగవంతంగా నిర్వహించాలని అడిషనల్ డీఎంహెచ్ఓ ఖాదర్వలీ ఆదేశించారు. మంగళవారం సంతపేటలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స ద్వారా పూర్తిగా నయం చేయొచ్చన్నారు. ప్రధానంగా రొయ్యల గుంతలు, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాల్లో సర్వేను మరింత జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు. కొత్తగా నమోదైన రోగులతో సన్నిహితంగా ఉన్నవారికి వ్యాధి సోకకుండా పెప్ మాత్రలు అందించాలని ఆదేశించారు. ప్రతినెలా 11వ తేదీన అంగవైకల్యం ఉన్న కుష్టు బాధితుల కోసం ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పీఓడీ శిబిరాలు నిర్వహించి, వారికి అవసరమైన ఎంసీఆర్ చెప్పులతోపాటు ఇతర సహాయక వస్తువులు అందించాలని సూచించారు. సమావేశంలో జిల్లా న్యూక్లియస్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమేష్, టీహెచ్ వార్డు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షాలిని, ఫిజియోథెరపిస్టులు నరసింహులు, జోబు, పీఎంఓ మల్లమ్మ, డీపీఎంలు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు● డీపీఓ వసుమతి నెల్లూరు(పొగతోట): గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డీపీఓ, జిల్లా స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల అధికారి, జెడ్పీ సీఈఓ వసుమతి ఆదేశించారు. మంగళవారం నెల్లూరులోని హరనాథపురం, లేక్వ్యూ కాలనీ, గౌతమ్ నగర్ తదితర ప్రాంతాల్లోని సచివాలయాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ సర్వేలను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈకేవైసీ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆధార్కార్డు ల్లేని పిల్లల వివరాలు సేకరించాలన్నారు. అర్హులైన వారికి పథకాలు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. సిబ్బంది అంకితభావంతో పని చేయాలని సూచించారు. -
ప్రసన్న నివాసంలో వైఎస్సార్సీపీ నేతల భేటీ
కోవూరు: వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని మంగళవారం నెల్లూరులోని నివాసంలో పలువురు నేతలు కలిశారు. మాజీ మంత్రి డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ, మేరిగ మురళీధర్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఊటుకూరు మహేందర్రెడ్డి, కోవూరు నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు నల్లపరెడ్డి రజత్కుమార్రెడ్డి, ఆ నియోజకవర్గ పరిశీలకుడు కొండూరు అనిల్బాబు తదితరులు పార్టీ బలోపేతంపై చర్చించారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటిపై పోరాటాలు నిర్వహించడంపై చర్చించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. -
15 రోజుల్లోగా 22ఏ కేసుల పరిష్కారం
● కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశం నెల్లూరురూరల్: జిల్లాలో 22ఏ, చుక్కల భూములు, రీ సర్వే కేసులను 15 రోజుల్లోగా పరిష్కరించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను పూర్తిగా తెలుసుకుని, నిర్దేశిత గడువులోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనసాగుతున్న రీ సర్వే పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, పెండింగ్ లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇకపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తానని, అధికారులు తమ పరిధిలో స్పష్టమైన పురోగతి చూపించాలని స్పష్టం చేశారు. సమావేశంలో జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కండలేరు క్రీక్లో పడి వ్యక్తి మృతి
చిల్లకూరు: మండల తీర ప్రాంతంలోని కండలేరు క్రీక్లో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. మండలంలోని మోమిడి గ్రామ సమీపంలోని పడవల రేవు వద్ద క్రీక్లో ఓ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని క్రీక్లో నుంచి బయటకు తీయించి పరిశీలించారు. మృతుడి కుడి కాలు పాదం సరిగ్గా లేకపోవడంతో క్రీక్ పరిసర గ్రామాల్లో ఆరా తీశారు. అతను చిల్లకూరు మండలానికి చెందిన వ్యక్తి కాదని తేలడంతో, క్రీక్కు అవతల ఉన్న వెంకటాచలం మండలంలోని గ్రామాల్లో విచారణ చేపట్టారు. వెంకటాచలం మండలం వెంకటరెడ్డిపాళెం గ్రామానికి చెందిన నడవల నాగరాజు (47)గా గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. నాగరాజు కుడి కాలు పాదం సరిగ్గా లేకపోవడంతో కండలేరు క్రీక్ వద్ద పట్టు తప్పి నీటిలో పడి చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సముద్రంలో పోటు కారణంగా మృతదేహం మోమిడి సమీపంలోని క్రీక్లోకి వచ్చి ఉంటుందని తెలిపారు. అయితే మృతికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో కూడా కుటుంబ సభ్యులను విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
సీబీఐతో విచారణ జరిపించాలి
మెగా డీఎస్సీ నియామకాల పేరుతో టీచర్ ఉద్యోగాలను అమ్ముకున్న చరిత్ర లోకేశ్దేనని ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆరోపించారు. ఎలాంటి అర్హతల్లేని వారికి టీచర్ ఉద్యోగాలను కట్టబెట్టి విద్యావ్యవస్థ విలువలను దిగజార్చారని విమర్శించారు. స్పోర్ట్స్ కోటాలో ఇచ్చిన టీచర్ ఉద్యోగాలన్నీ అక్రమమని.. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ పేరుతో లక్షలాది మంది నిరుద్యోగులను సర్కార్ మోసం చేసి వారి భవిష్యత్తుతో చెలగాటమాడిందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, వసతి దీవెన నిధుల విషయాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతిగా నెలకు రూ.మూడు వేలను అందిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటి వరకు ఒక్కరికీ దీన్ని అమలు చేయలేదని దుయ్యబట్టారు. తల్లికి వందనం పథకంలో అర్హత పేరుతో అనేక మంది మాతృమూర్తులను మోసం చేశారని ఆరోపించారు. విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో ఈ అంశాలపై రానున్న రోజుల్లో తమ పార్టీ ఆధ్వర్యంలో మరింత ఉద్యమించనున్నామని స్పష్టం చేశారు. -
అంతా అవినీతిమయం
400కుపైగా ఉద్యోగాల భర్తీలో అవినీతి జరిగిందని.. ఒక్కో జాబ్కు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బేరసారాలు జరిగాయని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆడియోలు బయటకొచ్చినా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిపై లోకేష్ వ్యాఖ్యలను ఖండించారు. విద్యావ్యవస్థపై మాట్లాడే హక్కు స్టూడెంట్స్కు ఉందని, వీరి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత సర్కార్పై ఉందని స్పష్టం చేశారు. స్పోర్ట్స్ కోటా పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అసలైన క్రీడాకారులకు అవకాశాలను కల్పించకుండా అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకు నిబంధనలనే మార్చారని విమర్శించారు. జీఓ నంబర్ 4, 47 ద్వారా స్పోర్ట్స్ కోటాను రెండు శాతం నుంచి మూడు శాతానికి పెంచడమే కాకుండా, పోటీ పరీక్షలు రాయకుండానే ఉద్యోగాలు పొందేలా నిబంధనలను సవరించారని ధ్వజమెత్తారు. -
అడవిలో మైనింగ్ అలజడి
● అటవీ అధికారులు, పోలీసుల దాడులు ● అదుపులో మేస్త్రి ● తవ్వకం చేసిన వారిపై విచారణ ● బాధ్యులపై చర్యలు ఉండేనా? సైదాపురం: మండల కేంద్రమైన సైదాపురానికి కూతవేటు దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో పురాతన పల్లిమిట్ట మైన్ల్లో అలజడి చెలరేగింది. అక్కడ అపారమైన ఖనిజ నిక్షేపాలున్నాయి. ఈక్రమంలో కొందరు కళ్లు ఇటీవల దానిపై పడింది. మంగళవారం ఆ మైన్లో కూలీల చేత పనులు చేయిస్తున్నారంటూ అధికారులకు సమాచారం అందింది. అటవీ, స్థానిక పోలీసులతోపాటు పలువురు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మైన్లోని ఓ ప్రాంతంలో ఖనిజాన్ని వెలికి తీస్తుండగా అధికారులు వస్తున్నారని తెలుసుకున్న కూలీలు ఉడాయించారు. దీంతో పనులు చేయించే మేస్త్రిని అదుపులోకి తీసుకున్నారు. పారలు, ఇతర సామగ్రి, ఆటోను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లీజుకు దరఖాస్తు ఈ మైన్ను కొందరు స్వాధీనం చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఈక్రమంలో గూడూరు ప్రాంతానికి ఓ వ్యక్తి మైనింగ్కు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. గనికి లీజు వేసిన వ్యక్తులే పనులు చేసి ఉంటారనే అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా అనుమతి రాకముందే పట్టపగలే అక్రమ మార్గంలో కూలీలచే బాహాటంగా పనులు చేయించారు. మేస్త్రిని అధికారులు విచారణ చేసి అక్రమ మైనింగ్ పాల్పడిన వారెవరు అనే అంశంపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కఠిన చర్యలు తీసుకుంటాం అటవీ ప్రాంతంలో అనుమతి లేకుండా పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని నెల్లూరు అటవీ శాఖ రేంజర్ మాల్యాద్రి స్పష్టం చేశారు. సైదాపురం సమీపంలోని పల్లెమిట్ట మైన్లో కూలీలచే పనులు జరుగుతున్న సమయంలో తమ సిబ్బంది దాడులు చేశారన్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. సమగ్ర విచారణ చేస్తున్నట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడేవారు ఎంతటివారిౖపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.తవ్వకాలు సాగించిన ప్రాంతం స్వాధీనం చేసుకున్న పరికరాలు -
ఎదురుదాడికి దిగడమే నైజం
తప్పులను సరిదిద్దుకోకుండా.. ప్రశ్నించిన వారిపై ఎదురుదాడికి దిగడమే టీడీపీ నైజంగా మారిందని పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మండిపడ్డారు. ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు మోసానికి గురై అవస్థలు పడుతుంటే, సర్కార్కు చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. మాయమాటలు చెప్పడం.. గద్దెనెక్కాక మోసం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్యగా మారిందని ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ను అరకొరగా ఇచ్చారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మారాక సీబీఐతో విచారణను జరిపిస్తామని తెలిపారు. -
విమానాశ్రయ ప్రారంభోత్సవానికి అంత ఖర్చా?
● కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ నెల్లూరు రూరల్: భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటాలు, ప్రజాధన వృథాను వెంటనే నిలిపివేయాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్ డిమాండ్ చేశారు. మంగళవారం నెల్లూరు ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విమానాశ్రయం ప్రారంభానికి రూ.30 కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. ఓవైపు పొదుపు మంత్రం చెబుతూ, మరోవైపు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చినప్పుడు కేవలం రూ.లక్షతో, 500 మందితో సాదాసీదాగా సభ నిర్వహించామని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని మార్చి అమిత్ షా రాజ్యాంగాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నెల్లూరు కలెక్టర్ ముత్తుకూరు ప్రాంతాన్ని సందర్శించి అక్కడి పర్యావరణ సమస్యలను పరిశీలించాలని కోరారు. కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు చందనమూడి శివ, ఎస్వీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
దండుకోవడానికే జీఓలు
స్పోర్ట్స్ కోటాలో దండుకోవాలనే ఉద్దేశంతో.. నచ్చిన వారికి పోస్టులివ్వాలనే ఉద్దేశంతో దొంగ జీఓలను జారీ చేశారని పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య ఆరోపించారు. నీట్ పరీక్షలో అవకతవకలపై కేంద్ర మంత్రి రాజీనామా చేశారని, రాజ్యాంగంపై విశ్వాసముంటే లోకేశ్ సైతం రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ అవకతవకలకు నారా లోకేశ్ బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త గురవయ్య డిమాండ్ చేశారు. ఈ విషయంలో చంద్రబాబు స్పందించాలన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. స్టూడెంట్స్ అంటే అంత చులకన తగదని, లోకేశ్ తప్పుకొనేంత వరకూ ఈ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. లోకేశ్ బాధ్యత వహించాలి -
హెపటైటిస్తో లివర్కు ముప్పు
● ఆహార అలవాట్లు, వైరస్లతో దెబ్బతినే ప్రమాదం ● నిర్లక్ష్యం చేస్తే ఫ్యాటీ లివర్, సిర్రోసిస్, కేన్సర్కు దారి ● జిల్లాలో 25 వేల మందికిపైగా బాధితులున్నట్లు అంచనా ● నేడు వరల్డ్ హెపటైటిస్ డేనెల్లూరు(అర్బన్): హెపటైటిస్ బీ, సీ వైరస్లు లివర్ను నిశ్శబ్దంగా దెబ్బతీస్తూ ప్రాణాంతక వ్యాధులుగా మారుతున్నాయి. ముందుగా గుర్తించకపోతే లివర్ దెబ్బతిని సిర్రోసిస్, కేన్సర్కు దారితీసే ప్రమాదం ఉంది. వ్యాధి ముదిరే వరకు చాలామందికి లక్షణాలు కనిపించవు. హెచ్బీఎస్ఏజీ వంటి రక్తపరీక్షల ద్వారా మాత్రమే వైరస్ను గుర్తించగలరు. ఈలోపు సంవత్సరాలపాటు నెమ్మదిగా లివర్ను దెబ్బతీస్తుంది. వ్యాధి తీవ్రతను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి ఏడాది జూలై 28ను వరల్డ్ హెపటైటిస్ డేను నిర్వహిస్తోంది. మంగళవారం జిల్లాలో వైద్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు జరుగుతాయి. జిల్లాలో ఇలా.. జిల్లా వైద్యశాఖ వద్ద పూర్తిస్థాయి గణాంకాలు లేకపోయినా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), సీనియర్ వైద్యుల అంచనా ప్రకారం జిల్లాలో 25 వేల మందికిపైగా హెపటైటిస్ బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో నమోదైన వివరాల ప్రకారం 2022లో 14,684 మందికి పరీక్షలు నిర్వహించగా 205 మందికి బీ రకం వైరస్ నిర్ధారణ అయింది. 2023లో 21,837 మందికి పరీక్షలు చేయగా 404 మంది, 2024లో 23 వేల మందికి పరీక్షలు చేయగా 457 మంది, 2025లో సుమారు 64 వేల మందికి పరీక్షలు నిర్వహించగా 600 మందికి బీ రకం ఉన్నట్లు తేలింది. ఇక సీ రకం వైరస్ విషయంలో 2022 నుంచి 2024 మధ్య 73 మందికి పాజిటివ్గా నిర్ధారణ కాగా, 2025లో మరో 200 మందికి ఉన్నట్లు తేలింది. వీరంతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. డయాలసిస్ రోగులు, ఖైదీలు, ఏఆర్టీ చికిత్స పొందుతున్న వారికి నిర్వహించిన పరీక్షల్లో మరో 500 మంది వరకు వైరస్ల బారినపడినట్లు గుర్తించారు. జిల్లాలోని 52 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 10 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, 28 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఒక జిల్లా ఆస్పత్రి, రెండు ఏరియా ఆస్పత్రితోపాటు ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్ల వివరాలను పరిగణనలోకి తీసుకుంటే జిల్లాలో 25 వేల మందికిపైగా వ్యాధితో బాధపడుతున్నట్లు అంచనా.ఎలా సోకుతుంది? రక్షణలేని లైంగిక సంబంధాలు, ప్రసవ సమయంలో తల్లి నుంచి శిశువుకు హెపటైటిస్ బీ సోకే అవకాశం ఉంది. రక్తమార్పిడి, కలుషిత సూదుల ద్వారా బీ, సీ వైరస్లు వ్యాపిస్తాయి. కలుషిత ఆహారం, తాగునీటి ద్వారా ఏ, ఈ రకాలు ఎక్కువగా వస్తాయి. జ్వరం, అలసట, ఆకలి లేకపోవడం, వాంతులు, కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారడం (కామెర్లు), ముదురు రంగు మూత్రం లక్షణాలుగా ఉన్నాయి. అవగాహన తప్పనిసరి హెపటైటిస్ వైరస్లు ప్రాణాంతకం. ఇవి లివర్ను ప్రధానంగా దెబ్బతీస్తాయి. అందువల్ల ఈ జబ్బులపై అవగాహన పెంచుకుని తగిన జాగ్రత్తలు పాటించాలి. బీ రకం రాకుండా ముందస్తుగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. నవజాత శిశువులకు 24 గంటల్లోపే వ్యాక్సిన్ వేయించాలి. ప్రతి ఒక్కరూ హెపటైటిస్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుని ఒకవేళ వైరస్ ఉంటే డాక్టర్ల పర్యవేక్షణలో మూడు నుంచి నాలుగేళ్లపాటు మందులు వాడాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయి నుంచే హెపటైటిస్ పరీక్షలు నిర్వహించాలి. – డాక్టర్ సునీల్కుమార్, సీనియర్ ఫిజీషియన్, సర్వజన ఆస్పత్రి వాటితోనే ఎక్కువగా.. హెపటైటిస్లో మొత్తం ఐదు రకాల వైరస్లున్నాయి. ఏ రకం వైరస్ సాధారణంగా కామెర్ల రూపంలో కనిపించి మూడు వారాల విశ్రాంతితో తగ్గిపోతుంది. డీ, ఈ రకాలు అరుదుగా వస్తాయి. అయితే బీ, సీ వైరస్లు సోకితే తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. హెపటైటిస్ బీ వైరస్కు పూర్తిస్థాయి చికిత్స లేదు. జీవితాంతం శరీరంలోనే ఉంటుంది. వైరస్ లోడ్ను తగ్గించే మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే సీ రకానికి ప్రస్తుతం చికిత్స అందుబాటులో ఉంది. జిల్లాలో బీ, సీ రకాలు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయి. నివారణే ఉత్తమ మార్గం హెపటైటిస్ బీ నివారణకు ముందస్తుగా టీకా వేయించుకోవడం అత్యంత ప్రభావవంతమైన మార్గం. సురక్షిత రక్తాన్ని మాత్రమే వినియోగించాలి. ఒక్కసారి ఉపయోగించిన సూదులను మళ్లీ వాడకూడదు. పరిశుభ్రమైన ఆహారం, తాగునీరు తీసుకోవాలి. వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే మందులతో నియంత్రించవచ్చు. -
డీఎస్సీ స్కామ్పై సీబీఐ విచారణ చేపట్టాలి
నెల్లూరురూరల్: రాష్ట్రంలో మెగా డీఎస్సీ నియామకాల పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందని, ఈ వ్యవహారంపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 28న నెల్లూరులో చేపడుతున్న వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి నిరసన ర్యాలీ పోస్టర్లను నెల్లూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, గూడూరు పార్టీ సమన్వయకర్త బూదూరు గురవయ్య, యువజన, విద్యార్థి విభాగ నాయకులతో కలిసి కాకాణి సోమవారం ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. తొలుత కాకాణి మాట్లాడుతూ విద్యార్థులు, యువత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 28న నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపారు. మెగా డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత పూర్తిగా లోపించిందని, ప్రభుత్వం జీఓలను వరుసగా మార్చుతూ నిరుద్యోగులను తీవ్ర గందరగోళానికి గురిచేసిందని ఆరోపించారు. స్పోర్ట్స్ కోటా విషయంలో జీఓ ఎంఎస్4, 47, 56లను వరుసగా సవరించడం ద్వారా భారీ అవకతవకలకు తావిచ్చారని విమర్శించారు. సుమారు 420 మందికి పైగా స్పోర్ట్స్ కోటా పేరుతో అక్రమంగా ఉద్యోగాలు కట్టబెట్టారని ఆరోపిస్తూ దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని కాకాణి అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని అమలు చేయాలని కోరారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనపై విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు వైఎస్సార్సీపీ పూర్తి సంఘీభావం ప్రకటిస్తోందన్నారు. డీఎస్సీ అవకతవకలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పకుండా అధికారులతో ప్రెస్మీట్లు పెట్టించి తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోల వల్లే డీఎస్సీ నియామక ప్రక్రియ వివాదాస్పదంగా మారిందని, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిందని మండిపడ్డారు. దేశంలో నీట్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అదే విధంగా రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ స్కామ్కు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ కూడా నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ మెగా డీఎస్సీ కాస్త దగా డీఎస్సీగా మారిందని, డీఎస్సీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని చెబుతున్న ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. డీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ హామీని అమలు చేయకుండా యువతను మోసం చేశారని ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత హక్కుల సాధన కోసం, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ, మంత్రి నారా లోకేశ్ రాజీనామా, ఫీజురీయింబర్స్మెంట్ బకాయిల విడుదల వంటి డిమాండ్లతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు భారీ విద్యార్థి, యువత నిరసన ర్యాలీ చేపడుతున్నామని తెలిపారు. యువత, విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. డీఎస్సీ అవకతవకలపై మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలి విద్యార్థి, యువత సమస్యలపై పోరుబాట నేడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి విద్యార్థి, యువత నిరసన ర్యాలీ పోస్టర్ల ఆవిష్కరణ -
జిల్లాలో సర్ ప్రక్రియ విజయవంతం
● మ్యాపింగ్ కాని ఓటర్లకు మరో అవకాశం ● 31న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల ● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(అర్బన్): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్లకు సంబంధించి చేపట్టిన సర్ ప్రక్రియ 100 శాతం విజయవంతం అయిందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. సోమవారం సర్ ప్రక్రియపై కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. జూన్ 15 నుంచి ఈ నెల 24 వరకు ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించడానికి అధికారులు, సచివాలయ సిబ్బంది, బీఎల్వో లు అహర్నిశలు శ్రమించారన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. జిల్లాలో గతంలో 19,74,240 మంది ఓటర్లు ఉండగా, 16,83,557 మంది ఎన్యూమరేషన్ ఫారాలు సేకరించి 85.28శాతం మ్యాపింగ్ పూర్తి చేశామన్నారు. వారిని 2002 ఓటర్ల జాబితాలోని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల వివరాల ఆధారంగా అనుసంధానం చేశామన్నారు. మ్యాపింగ్ కాని 1.8 శాతం ఓటర్లకు నోటీసులు జారీ చేస్తామన్నారు. ప్రభుత్వం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదోకటి ఈఆర్ఓకు సమర్పిస్తే వారి ఓటు హక్కు కొనసాగుతుందన్నారు. వారికి ఇంకో అవకాశం కల్పించామన్నారు. 38,645 డూప్లికేట్ ఓట్లను తొలగించడం జరిగిందన్నారు. శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన 1,13,421 మంది ఓటర్లు, మృతి చెందిన 80,699 మంది ఓట్లను పక్కన పెట్టేశామన్నా రు. 57,077 మంది ఓటర్లు అందుబాటులో లేని వారిగా గుర్తించామన్నారు. ఈ నెల 31న ఓటర్ల ముసాయిదా జాబితా(డ్రాప్ట్)ను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచురిస్తామన్నారు. అనంతరం 30 రోజల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. అర్హులైన వారి పేర్లు లేకపోతే ఈఆర్వోలను సంప్రదించి ఓటు వివరాలను సవరించుకోవచ్చని తెలిపా రు. కాగా అధికారులతో కలిసి సర్ ప్రక్రియ నిర్వహించిన వారిపై ఏమి చర్యలు తీసుకున్నారని విలేకరులు నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ నందన్ను ఉద్దేశించి ప్రశ్నించగా ఈ విషయమై ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చామన్నారు. సీఈఓ దృష్టికి తీసుకెళ్లామన్నారు. చట్టపరంగా పరిశీలించి చర్యలు తీసుకుంటారన్నారు. ఈ సమావేశంలో జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు. -
దస్తావేజు లేఖరుల జీవనోపాధిపై కూటమి దెబ్బ
● నిరసనకు కాకాణి, పర్వతరెడ్డి సంఘీభావం నెల్లూరురూరల్: జీఓ నంబర్ 396 పేరుతో కూటమి ప్రభుత్వం వేలాది మంది దస్తావేజు లేఖరుల జీవనోపాధిపై దెబ్బకొట్టిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి విమర్శించారు. జీఓను వ్యతిరేకిస్తూ నెల్లూరులోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఆవరణలో సోమవారం నల్లరిబ్బన్లు ధరించి నిరసన చేపట్టిన డాక్యుమెంట్ రైటర్లను వారు కలిసి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్న దస్తావేజు లేఖరులు ఉపాధి కోల్పోయే పరిస్థితికి నెట్టడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. జీఓను తక్షణమే రద్దు చేసి వారి ఉపాధికి భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. ● ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ సేవలను, ఆస్తులను ప్రైవేట్పరం చేసే విధానాన్ని అమలు చేస్తోందని విమర్శించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సేవలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుందన్నారు. ఇప్పటి వరకు డాక్యుమెంట్ రైటర్ల వల్ల ప్రజలు రిజిస్ట్రే షన్ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకుంటున్నారని, అలాంటి వ్యవస్థను నిర్వీర్యం చేయడం సమంజసం కాదన్నారు. 396 నంబర్ జీఓ వారి పాలిట శాపంగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త బూదూరు గురవయ్య, నాయకులు, డాక్యుమెంట్ రైటర్ల సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు. -
నెలకు పది కాన్పులు చేయాలి
మనుబోలు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు కనీసం పది కాన్పులు అయినా చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్కుమార్ ఆదేశించారు. సోమవారం ఆయన మనుబోలు పీహెచ్సీని స్టేట్ వ్యాక్సిన్ కోఆర్డినేటర్ డాక్టర్ దేవదానం, జిల్లా మేనేజర్ రమేష్తో కలిసి ఆకస్మికంగా సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై వైద్యసిబ్బందిని ఆరా తీశారు. ఆస్పత్రిలో కాన్పులు సక్రమంగా జరగడం లేదని తెలుసుకుని, కనీసం నెలకు పది అయినా చేయాలని, లేని పక్షంలో మెమో జారీ చేస్తామని హెచ్చరించారు. పీహెచ్సీల్లోనే కాన్పులు చేయించుకునేలా క్షేత్ర స్థాయిలో గర్భిణులకు అవగాహన కల్పించాలని సూచించారు. వారి వెంట పీహెచ్సీ డాక్టర్ గేయ పూజిత, సీహెచ్ఓ రాజయ్య, పీహెచ్ఎన్ జయలక్ష్మి, సూపర్వైజర్ రమణయ్య ఉన్నారు. పొగాకు రైతుల జాతీయ రహదారి దిగ్బంధం రేపు మర్రిపాడు : రాష్ట్ర పొగాకు రైతుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈ నెల 29న చేపడుతున్న జాతీయ రహదారి దిగ్బంధనాన్ని జయప్రదం చేయాలని రైతు సంఘ నాయకులు పిలుపునిచ్చారు. డీసీపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద పొగాకు రైతు సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పొగాకుకు గిట్టుబాటు ధరలు కల్పించాలని చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం నాల్గో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి, డీసీపల్లి పొగాకు రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు మూలి వెంగయ్య, వైఎస్సార్సీపీ రైతు సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు చండ్ర నారాయణస్వామి, రైతు సంఘ మండల నాయకుడు గంగినేని నారాయణ మాట్లాడుతూ పొగాకు రైతులకు న్యాయమైన మద్దతు ధర లభించే వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం, పొగాకు బోర్డు వెంటనే పరిష్కరించాలని, లేదంటే ఉద్య మాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చ రించారు. రైతు నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాకర్లను నిలదీసిన కార్యకర్తలు కొండాపురం: తమను పట్టించుకోకపోవడంపై టీడీపీ కార్యకర్తలు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ను నిలదీశారు. సోమవారం ఆయన సాయిపేట పంచాయతీలో పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీలోని రెండు వర్గాల మధ్యన నెలకొన్న విభేదాల నేపథ్యంలో అడుగడుగునా కార్యకర్తలు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. పార్టీ కోసం కష్టపడిన తమకు పార్టీలో గుర్తింపు లేకుండా పంచాయతీకి చెందిన నాయకులు చేస్తున్నారని, మీరు కూడా వారికి వత్తాసు పలుకుతూ పనులు కట్టబెట్టడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. మేము ఓట్లు వేస్తేనే మీరు గెలిచారని, మా ఓట్లు కూడా ముఖ్యమేనని, చాలా కాలంగా పార్టీని కనిపెట్టుకుని ఉన్నామని, తమకు ఈ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగలేదని వాపోయారు. తమను పార్టీలో గుర్తిస్తేనే పార్టీకి సేవలందిస్తామని, లేదంటే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటామని తెగేసి చెప్పారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 23 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 90,012 మంది స్వామివారిని దర్శించుకున్నారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
మార్కెట్లోకి న్యూ బ్రెజ్జా కారు విడుదల
నెల్లూరు(టౌన్): మారుతి సుజుకి న్యూ బ్రెజ్జా కారును సోమవారం యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ శ్రీనివాస్, భార్గవి ఆటోమొబైల్స్ ఫౌండర్, చైర్మన్ కొండా బలరామిరెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ కొండా నిరంజన్రెడ్డి మార్కెట్లోకి విడుదల చేశారు. భార్గవి ఆటోమొబైల్స్ షోరూంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఈ వాహనం ఎక్స్ షోరూం ధర రూ.7.39 లక్షల నుంచి ప్రారంభం అవుతుందన్నారు. కారు 1.5 లీటరు ఆస్పిరేటెడ్ ఇంజిన్తోపాటు సరికొత్త టర్బో ఇంజిన్ ఆప్షనర్ ఉందన్నారు. 7 సింగిల్, 3 డ్యూయల్ టోన్ రంగుల్లో లభిస్తుందన్నారు. ఫ్రంట్ వార్నింగ్ సెన్సార్లు, ఎమర్జెన్సీ స్టాఫ్ సిగ్నల్, సేఫ్ ఎగ్జిట్ వార్నింగ్, 360 డిగ్రీల కెమెరా, తదితర ఫీచర్లు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ రాధాకృష్ణ, డీజీఎం రమేష్బాబు, మహేష్ , చీఫ్ జనరల్ మేనేజర్ రవికుమార్, సిబ్బంది పాల్గొన్నారు. నిస్సాన్ టెక్టాన్ కారు ఆవిష్కరణ నెల్లూరు(టౌన్): నెల్లూరులోని ఎంజీబీ మాల్లో హైటెక్ నిస్సాన్ షోరూం నిర్వాహకులు సోమవారం నూతన టెక్టాన్ కారును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ జగన్నాఽథ్రెడ్డి మాట్లాడుతూ ఈ కారులో వైర్లెస్ చార్జర్, వెంటిలేటర్ ఫ్రంట్ సీట్స్, డ్యూయల్ జోన్ ఏసీ, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ లాంటి సదుపాయాలు ఉన్నాయన్నారు. ఎక్స్ షోరూం ప్రారంభ ధర రూ.10.49 లక్షలన్నారు. బుకింగ్ కోసం 90142 11044 నంబర్ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్లు నిరంజన్, భారతి, హోషిమా రెడ్డి, ఆశీష్రెడ్డి, శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత భయ్యా వాసు, ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ హరికృష్ణ, హెచ్డీఎఫ్సీ ఏరియా మేనేజర్ వెంకట్, హైటెక్ నిస్సాన్ జనరల్ మేనేజర్ ఎన్వీఎస్ శాస్త్రి, సేల్స్ మేనేజర్ బ్రహ్మకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. కండలేరులో 26.46 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 26.46 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 30, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 65 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.45 సన్నవి : రూ.25 పండ్లు : రూ.10 -
అర్జీలతో కలెక్టరేట్ బాట
నెల్లూరురూరల్: జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అర్జీలతో నెల్లూరులోని కలెక్టరేట్ బాట పట్టారు. సోమవారం తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, మెప్మా పీడీ కిరణ్కుమార్, డిప్యూటీ కలెక్టర్లు వంశీకృష్ణ, కేశవర్ధన్రెడ్డి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అర్జీని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. భూ సమస్యలు, ఇతర రెవెన్యూ అంశాలకు సంబంధించి వినతులు ఎక్కువగా వస్తున్నాయని, వాటిపై దృష్టి సారించాలన్నారు. 40 ఏళ్ల సేవలకు గుర్తింపు ఇవ్వాలి కోవూరు కో ఆపరేటివ్ చక్కెర కర్మాగారంలో సుమారు 40 ఏళ్లపాటు కన్సాలిడేటెడ్ ఎన్ఎంఆర్/ఎన్ఎంఆర్ కార్మికులుగా పనిచేసిన 243 మందికి న్యాయం చేయాలంటూ అధికారులకు వినతిపత్రం అందింది. బాధితులు మాట్లాడుతూ పర్మినెంట్ ఉద్యోగులకు లభించే సెలవులు, గ్రాట్యుటీ, పెన్షన్ వంటి ప్రయోజనాలు తమకు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఫ్యాక్టరీ పునరుద్ధరణ జరగక జీవనోపాధి కోల్పోయామని తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏర్పాటు చేసిన కమిటీ ఒక్కో కార్మికుడికి సుమారు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ ప్రభుత్వం మారడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. కలెక్టర్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కోట గురుకులాన్ని కొనసాగించాలంటూ బీఎస్పీ ధర్నా హామీలు నెరవేర్చాలని ఐద్వా డిమాండ్ -
చివరి డెలివరీ.. ముగిసిన జీవితం
● రాంగ్రూట్లో దూసుకొచ్చిన ఆటో ● బైక్ను ఢీకొట్టడంతో యువకుడి మృతి నెల్లూరు(క్రైమ్): ఆ యువకుడు ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడు. కష్టపడి పనిచేసి విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. కానీ ఆ ప్రయాణం మధ్యలోనే ముగిసింది. రాంగ్రూట్లో మితిమీరిన వేగంతో దూసుకొచ్చిన ఆటో ఢీకొనడంతో కోవూరు మండలం ఇనుమడుగు గ్రామానికి చెందిన కె.హేమంత్ (21) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. నార్త్ ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు.. హేమంత్ నెల్లూరు రైల్వే స్టేషన్లో ఐఆర్సీటీసీ స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం విధుల నిమిత్తం నెల్లూరుకు వచ్చాడు. రాత్రి సుమారు 10:30 గంటలకు పని ముగించుకుని బైక్పై ఇంటికి బయలుదేరాడు. పాత పెన్నా బ్రిడ్జి మధ్యలోకి చేరుకోగానే వెంకటేశ్వరపురం వైపు నుంచి రాంగ్రూట్లో మితిమీరిన వేగంతో వచ్చిన ఆటో బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హేమంత్కు తలకు, కుడి మోకాలికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది హేమంత్తోపాటు ఆటోలో గాయపడిన ఇద్దరిని జీజీహెచ్కు తరలించారు. అయితే హేమంత్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. కొడుకు మృతి వార్త తెలుసుకున్న తల్లి మల్లేశ్వరి, కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. నార్త్ ట్రాఫిక్ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, మల్లేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఇదిలా ఉండగా హేమంత్ మృతితో ఆగ్రహానికి గురైన అతని బంధువులు, స్నేహితులు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న ఆటోలోని ఇద్దరిపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై కూడా ట్రాఫిక్ పోలీసులు విచారణ చేపట్టారు. -
జీతాలివ్వండయ్యా..
● పెద్దాస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికుల ధర్నా నెల్లూరు(అర్బన్): మూడు నెలలుగా రావాల్సిన జీతాలు వెంటనే ఇప్పించాలంటూ నెల్లూరులోని ప్రభుత్వ పెద్దాస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికులు తమకు సోమవారం విధులు బహిష్కరించి ఆకస్మికంగా ధర్నా చేశారు. పనులు ఆపేయడంతో రోగులను పట్టేందుకు దిక్కులేకుండా పోయింది. పారిశుద్ధ్య పనులు ఆగిపోయాయి. దీంతో ఆస్పత్రి ఏడీ ఏడుకొండలు కార్మికులతో చర్చించారు. నెల జీతం ఒక్కరోజులోనే ఇచ్చేలా సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడారు. మరోనెల జీతం పదిరోజుల తర్వాత ఇప్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అయినా కార్మికులు తగ్గలేదు. దీంతో సీఐటీయూ రూరల్ కార్యదర్శి కె.పెంచల నరసయ్య, యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు సతీష్, ప్రధాన కార్యదర్శి సందానీబాషా వచ్చి చర్చించారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు మాట్లాడుతూ జీతాల కోసం కాంట్రాక్టర్తో మాట్లాడాలని సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి వద్దకు వెళ్లగా తమను చులకన చేసి మాట్లాడారన్నారు. మూడు నెలలకే తొందరపడితే ఎలా అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తనను ఎందుకు కలవాలని వస్తున్నారంటూ చిరాకు పడ్డారన్నారు. డాక్టర్లు విధులకు వచ్చినా, రాకపోయినా జీతాలు తీసుకుంటున్నారన్నారు. తమ జీతాలు అడగడం తప్పా అని నిలదీశారు. దీంతో సీఐటీయూ నాయకులు ఏడీతో మాట్లాడారు. కాంట్రాక్టర్ను, కార్మికులను ఒకచోట చేర్చి సమావేశాన్ని నిర్వహించాలన్నారు. పెండింగ్లో ఉన్న పీఎఫ్, ఈఎస్సై చెల్లించాలని కోరారు. ప్రతినెలా జీతాలు సకాలంలో ఇవ్వకుంటే సమ్మె చేస్తామని హెచ్చరించారు. వీటికి అధికారులు ఒప్పుకోవడంతో కార్మికులు ధర్నాను విరమించారు. -
వీఎస్యూలో నాలుగు కొత్త బీటెక్ కోర్సులు
● వీసీ అల్లం శ్రీనివాసరావు వెంకటాచలం: విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా నాలుగు సెల్ప్ఫైనాన్స్ బీటెక్ కోర్సులను ప్రారంభిస్తున్నామని వైస్చాన్స్లర్ అల్లం శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం ఆయన వీఎస్యూలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ కోర్సులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ప్రతి కోర్సుకు 60 చొప్పున మొత్తం 240 సీట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఆధునిక సాంకేతిక విద్యకు ప్రాధాన్యం ఇస్తూ ఈ కోర్సులకు అనుమతి ఇవ్వడం సంతోషకరమన్నారు. భవిష్యత్ పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ కోర్సులు విద్యార్థులకు అత్యుత్తమ ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నా రు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని రకాల ఆధునిక సౌకర్యాలను విశ్వవిద్యాలయం కల్పిస్త్తుందని తెలిపారు. విద్యార్థులు, విద్యార్థినులకు ప్రత్యేక హాస్టల్ వసతి, ప్రభుత్వ నిబంధనల మేరకు ఫీజురీయింబర్స్మెంట్, బస్సు రవాణా సౌకర్యం, స్మార్ట్ క్లాస్రూమ్లు, అత్యాధునిక కంప్యూటర్ సెంటర్, అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రయోగశాలలు (ల్యాబ్లు), విశాలమైన క్రీడా మైదానాలు, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందంతో కూడిన ఉత్తమ విద్యా వాతావరణం అందుబాటులో ఉంటుందని వివ రించారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలతో అనుసంధానమైన శిక్షణ, ఇంటర్న్ షిప్లు, ప్లేస్మెంట్ అవకాశాల కల్పనపై విశ్వవిద్యాలయం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో తక్కువ వ్యయంతో నాణ్యమైన ఇంజినీరింగ్ విద్యను అభ్యసించే అరుదైన అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
స్వామిచెరువులో గ్రావెల్ డంప్
● నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న హైవే కాంట్రాక్టర్ ● చెరువు పూడిపోతుందని ఆయకట్టు రైతుల ఆందోళనసీతారామపురం : సీతారామపురం–పోరుమామిళ్ల ఘాట్రోడ్డు సమీపంలో ఆరులైన్ల జాతీయ రహదారి 544 నిర్మాణం చేపడుతున్న కాంట్రాక్టర నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. హైవే నిర్మాణంలో భాగంగా తవ్విన మట్టిని సమీపంలోని స్వామి చెరువులో పెద్దఎత్తున డంప్ చేస్తున్నారు. స్వామిచెరువు కింద వందలాది ఎకరాల ఆయకట్టు ఉంది. జాతీయ రహదారి నిర్మాణ పనులకు సంబంధించిన మట్టిని తోలడం వల్ల చెరువు పూడిపోయి నిల్వ సామర్థ్యం తగ్గిపోయే ప్రమాదం ఉందని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు పడి చెరువులోకి నీరు వచ్చినా గండిపడే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. స్వామి చెరువుపై ఆధారపడి వ్యవసాయం చేస్తూ ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నాయని, చెరువులో గ్రావెల్ డంప్ చేయడం వల్ల నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఈ విషయమై హైవే నిర్మాణదారులను పలుమార్లు హెచ్చరించినా వారు పెడచెవిన పెట్టడమే గాకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆరోపి స్తున్నారు. టిప్పర్ల ద్వారా పెద్ద ఎత్తున మట్టి తరలించి డంప్ చేసే క్రమంలో ఇప్పటికే ప్రధాన కాలువ పూడిపోయింది. దీంతో వర్షాకాలంలో ముంపు సమస్య తలెత్తడంతో పాటు ఆయకట్టుకు సాగునీరు అందకుండాపోయే ప్రమాదం ఉందని రైతులు తెలిపారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ శాఖ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయమై ఆయకట్టు రైతులు తహసీల్దార్ ఫజిహాను సోమవారం కలిసి ఫిర్యాదు చేశారు. గ్రావెల్ డంపింగ్ చేయడాన్ని నిలుపుదల చేసి చెరువును కాపాడాలని కోరారు. -
తల్లికి వందనం ఇవ్వాలి
‘నాకు ముగ్గురు పిల్లలు. భర్త చనిపోయాడు. గత ప్రభుత్వంలో అమ్మఒడి వచ్చేది. ఈ ప్రభుత్వం వచ్చాక రెండుసార్లు తల్లికి వందనం పడలేదు’ అని అనంతసాగరం మండలం పాత దేవరాయపల్లికి చెందిన షేక్ నస్రీన్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె మాట్లాడుతూ గతంలో మార్కాపురం జిల్లా సీఎస్పురంలో తన భర్తతో కలిసి నివసించేవారమని చెప్పారు. భర్త చనిపోయిన తర్వాత పిల్లలతో కలిసి తన తండ్రి వద్దకు వచ్చి పాతదేవరాయపల్లిలోని గవర్నమెంట్ స్కూల్లో పిల్లలను చదివించుకుంటున్నానని తెలిపింది. సచివాలయం వద్దకు వెళ్తే మా హౌస్హోల్డ్డ్ మ్యాపింగ్లో హోంగార్డు అయిన మరిది పేరు ఉందని చెబుతున్నారన్నారు. ఎన్నిసార్లు సచివాలయాల చుట్టూ తిరిగిన సమస్యను పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. సమస్యను పరిష్కరించి తల్లికి వందనం వచ్చేలా చూడాలని కోరారు. -
రూ.కోట్లు కొల్లగొట్టి
రెండేళ్ల టీడీపీ పరిపాలనలో ఇరిగేషన్శాఖ పనితీరు అస్తవ్యస్తంగా మారింది. కేవలం నేతల జేబులు నింపేందుకే అధికారులు పనిచేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రకృతి విలయతాండవాన్ని సైతం కాసులుగా మార్చుకుంటూ జిల్లా రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారు. గత ఏడాదిలో చూస్తే ఎఫ్డీఆర్ కింద దాదాపు రూ.100 కోట్లు, ఆర్ఆర్ఆర్ (రిపేర్స్ అండ్ రెన్యువేషన్ రీస్టోరేషన్) ద్వారా దాదాపు రూ.30 కోట్లు, ఓఅండ్ఎం ( ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ ) ద్వారా దాదాపు రూ.100 కోట్ల వరకు నిధులు మంజూరు చేశారు. ఆయా పనులు సర్వేపల్లి, ఆత్మకూరు, నెల్లూరు రూరల్, కోవూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల అధికార పార్టీ నేతలకు భోజ్యంగా మారాయి. పనులు చేయకుండానే బిల్లులు పెట్టుకుంటున్నారు. అధికారులకు మాత్రం 20 శాతం కమీషన్ ఇస్తే చాలు బిల్లులు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కాలువలకు గండ్లు కలువాయి మండలంలోని కుల్లూరు డీపీ–3 డిస్ట్రిబ్యూటరీ కాలువకు మూడు రోజుల క్రితం గండిపడింది. ఇటీవలే ఆ కాలువకు ఎఫ్డీఆర్ ద్వారా రూ, 4.5 లక్షలతో మరమ్మతులు చేసినట్లు చూపి బిల్లులు డ్రా చేసినట్లుగా ఆరోపణలున్నాయి. కానీ నీరు విడుదల చేయగానే గండిపడడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ కాలువ కింద దాదాపు 600 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. కాలువకు గండిపడడంతో అధికారులు ప్రస్తుతం ఇసుకబస్తాలతో తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. ఇసుక బస్తాలకు కూడా మళ్లీ బిల్లులు పెట్టే అవకాశం లేకపోలేదు. అధికారులు, టీడీపీ నేతలతో కుమ్మకై ్క సొంత జేబులు నింపుకొనే ప్రయత్నాలు చేస్తుండడంపై రైతాంగం మండిపడుతోంది. ఇటీవలే సోమశిల దక్షణ కాలువ పరిధిలో ఎఫ్డీఆర్ నిధులు రూ.7 కోట్లతో దాదాపు 112 పనులు చేసినట్లుగా చూపి బిల్లులు డ్రా చేశారన్న ఆరోపణలున్నాయి. అలాగే బెజవాడ పాపిరెడ్డి కాలువ(కావలి కాలువ)కు భారీ గండి పడింది. సంగం మండలంలోని మర్రిపాడు గ్రామం వద్ద ఈ కాలువ సైఫన్ అక్విడెక్ట్ కొట్టుకుపోయింది. దీంతో కాలువలో వెళ్లాల్సిన సాగునీరు దువ్వూరు చెరువులోకి ప్రవహిస్తోంది. అక్కడ కూడా అధికారులు తాత్కాలికంగా ఇసుక బస్తాలు నింపి బిల్లులు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో కావలి కాలువ ఆధునికీకరణలో భాగంగా చేపట్టిన ప్యాకేజీ 94 పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్న విషయం తెల్సిందే. అప్పట్లో అక్రమాలకు పాల్పడిన అధికారే ప్రస్తుతం ఆ కాలువ బాధ్యతలు చూస్తుండడం విశేషం. నెల్లూరు ఇరిగేషన్ శాఖ అవినీతికి అడ్డాగా మారింది. టీడీపీ ఎమ్మెల్యేల కనుసన్నల్లో ఆ శాఖ ఇంజినీర్లు పనిచేస్తున్నారు. వర్కులు చేయకున్నా 20 శాతం కమీషన్లతో బిల్లులు చేస్తున్నారు. దీంతో సాగునీటి కాలువలకు గండ్లు పడి ఆయకట్టుకు సాగునీరు సక్రమంగా అందని పరిస్థితి నెలకొంది. తాజాగా జిల్లాలోని కుల్లూరు డీపీ–3 డిస్ట్రిబ్యూటరీ కాలువ, కావలి కాలువకు గండ్లు పడడంతో వందలాది ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం లేక రైతాంగం ఆందోళన చెందుతోంది. కేవలం తాము చెప్పినట్లుగా వినే అధికారులను నిబంధలకు విరుద్ధంగా ఇన్చార్జ్జిలుగా నియమించుకుని అధికార పార్టీ నేతలు ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. –సాక్షి ప్రతినిధి, నెల్లూరు ఇన్చార్జిల పాలనలో ఇరిగేషన్ శాఖ ఎఫ్డీఆర్, ఆర్ఆర్ఆర్, ఓఎండ్ఎం పనుల్లో చేతివాటం పనులు చేయకుండానే నిధుల ఆరగింత అధికారులకు 20 శాతం కమీషన్లు కార్యాలయాలకే పరిమితమవుతున్న ఇంజినీర్లు కుల్లూరులో డీపీ–3 డిస్ట్రిబ్యూటరీ కాలువకు గండి సంగంలో కావలి కాలువకు గండి ఆందోళనలో అన్నదాతలు ఇన్చార్జిల పాలనతో..జిల్లాలో ఇరిగేషన్ శాఖ అంతా ఇన్చార్జి అధికారుల పాలనలోనే కొనసాగుతోంది. రెగ్యులర్ అధికారులు ఉంటే ఎక్కడ తమ జేబులు నింపరోనని టీడీపీ ఎమ్మెల్యేలు తమ చెప్పుచేతుల్లో ఉండే అధికారులను నిబంధనలకు విరుద్ధంగా ఇన్చార్జులుగా పోస్టుల్లో కూర్చోబెట్టి బిల్లులు చేయించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం తెలుగుగంగ, సోమశిల ఎస్ఈ పోస్టుల్లో సైతం ఇన్చార్జిలే కొనసాగుతున్నారు. అలాగే వెంకటగిరి డీఈగా పనిచేసే అధికారికి గూడూరు డివిజన్ ఈఈ పోస్టులో కూర్చోబెట్టారు. కావలి ఈఈతో పాటు డీఈ పోస్టుల్లో కూడా ఇన్చార్జిలే కొనసాగుతున్నారు. ఉదయగిరి డీఈని నెల్లూరు డ్రైనేజీ ఈఈగా, నెల్లూరు డివిజన్ డీఈగా ఉన్న అధికారికి తెలుగుగంగ ఈఈగా అదనపు బాధ్యతలను అప్పగించి జేబులు నింపుకొనే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ శాఖ మరో అడుగు ముందుకేసి పలనాడు జిల్లాలో పనిచేసే అధికారికి డైవర్షన్ కింద ఉదయగిరి, ఆత్మకూరు డీఈగా బాధ్యతలు అప్పగించారంటే ఆ శాఖలోని పరిస్థితి తేటతెల్లం అవుతుంది. అలాగే వైఎస్సార్ జిల్లా బ్రహ్మంగారిమఠం లో పనిచేసే అధికారిని ఆత్మకూరుకు డైవర్షన్ చేశారు. అలాగే పొదలకూరులో ఏఈగా పనిచేసే అధికారిని ఇన్చార్జి డీఈ నియమించుకుని అధికార పార్టీ నేతలు తమ జేబులు నింపుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. నాణ్యత చూడకుండానే.. జిల్లా ఇరిగేషన్ శాఖలో క్వాలిటీ కంట్రోల్ అధికారులు కేవలం పర్సెంటేజీల కోసమే పనిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఈఈ తిరుపతికి పరిమితం కావడం, డీఈ, ఏఈ స్థాయి అధికారులు కార్యాలయాలకే పరిమితమై 5 శాతం కమీషన్తో పనులు పరిశీలన చేయకుండానే సర్టిఫై చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. -
దొంగ పట్టాలను రద్దు చేయండి
గ్రామ దేవతల భూములకు సంబంధించి దొంగ పట్టాలు సృష్టించారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కలువాయి మండలం ఉయ్యాలపల్లికి చెందిన ఎం.చిన్న వెంకటేశ్వర్లు, ఎన్.రమణయ్య, ఎం.సోమయ్య వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ సర్వే నంబర్ 591లో 2.31, 592లో 2.31 ఎకరాలు భూమికి దండు కృష్ణయ్య, చేజర్ల తిరుపాలు దొంగ పట్టాలను సృష్టించారన్నారు. ఆ భూమిలోకి ప్రవేశిస్తే అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు. సంబంధిత అధికారులు విచారణ జరిపి అక్రమ పట్టాలను రద్దు చేసి దేవాలయ భూములను యథావిధిగా కొనసాగించాలని కోరారు. -
మనస్తాపంతో వ్యక్తి బలవన్మరణం
ఉదయగిరి: పట్టణంలోని కోళ్లవీధికి చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. ఉదయగిరికి చెందిన షేక్ అలీ అక్బర్ (60) గతంలో దుబాయిలో డ్రైవర్గా పనిచేశాడు. కొంతకాలం క్రితం స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. అతని భార్య హబీబా అనారోగ్యంతో బాధపడుతుండగా, వీరికి సంతానం లేదు. నెలరోజుల క్రితం హబీబాకు గుండెపోటు రావడంతో చికిత్స చేయించాడు. అప్పటి నుంచి ఆమెకు సంబంధించిన అన్ని పనులను అలీ చూసుకుంటూ ఉండేవాడు. ఈ క్రమంలో అతను కొంతకాలంగా మనస్తాపానికి గురయ్యేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం హబీబా ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో అలీ ఇంట్లో తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొంతసేపటి తర్వాత భార్య ఇంట్లోకి వెళ్లి చూసి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి వెంటనే అతడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అలీ మృతిచెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై మహేంద్ర ఘటనా స్థలాన్ని పరిశీలించి, బంధువుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్పై 15 కేసులు
● జిల్లా వ్యాప్తంగా నాకాబందీ ● బహిరంగ మద్యసేవనంపై 28 కేసులు నెల్లూరు(క్రైమ్): జిల్లా వ్యాప్తంగా పోలీసులు శనివారం అర్ధరాత్రి వరకు నాకాబందీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జాతీయ రహదారులు, జిల్లా ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్పై 15 కేసులు నమోదు చేశారు. అలాగే మోటార్ వాహనాల చట్టం (ఎంవీ యాక్ట్) కింద 389 కేసులు నమోదు చేసి రూ.1,39,700 జరిమానా విధించారు. బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై 28 కేసులు పెట్టారు. అనంతరం పలు లాడ్జీలను కూడా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ నేరాలకు అవకాశం ఉన్న ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, చెక్పోస్టుల వద్ద పహారా మరింత పెంచామని తెలిపారు. ప్రజలు తమ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నా, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తించినా వెంటనే సమీప పోలీస్స్టేషన్కు, డయల్ 100/112కు లేదా జిల్లా కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 93929 03143కు సమాచారం అందించాలని కోరారు. -
పట్టా భూమిలో పచ్చముఠా మట్టి దోపిడీ
● యథేచ్ఛగా తరలింపు ● అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమని హుకుం కావలి: అధికార మదంతో పచ్చ ముఠా బరి తెగింపు పతాక స్థాయికి చేరింది. ఇప్పటి వరకు చెరువులు, ప్రభుత్వ భూముల్లో మట్టిని కొల్లగొట్టిన టీడీపీ నేతలు ఇప్పుడు ఏకంగా రైతుల పట్టా భూమిలోకి చొరబడి మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. అడిగితే దిక్కున్న చోట చెప్పుకోమని బాహాటంగానే దౌర్జన్యానికి తెగబడుతున్నారు. మా భూమిలో మా అనుమతి లేకుండా తవ్వడానికి నీకెవడు అనుమతిచ్చాడని సదరు రైతు నిలదీస్తే.. నేను టీడీపీ వాడిని.. నాకెవడు అనుమతులివ్వాల్సిన అవసరం లేదంటూ తలకెక్కిన గర్వధోరణితో మాట్లాడటం చూసి స్థానికులు నివ్వెరపోయారు. వివరాల్లోకి వెళ్తే.. కావలి మండల కొత్తసత్రం పంచాయతీ రెడ్డిపాళేనికి చెందిన పుల్లా సోమయ్యకు గతంలో ప్రభుత్వం సర్వే నంబర్ 1800–1లో 40 సెట్లు, 1789–2లో 55 సెంట్లు భూమిని మంజూరు చేసింది. దానికి సంబంధించి పట్టాదార్ పాసుపుస్తకం, వన్బీ అడంగళ్ కూడా ఆయన పేరిటనే ఉన్నాయి. ఈ భూమిలో కూరగాయలు, మెట్ట పైర్లు సాగు చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో సోమయ్య అనారోగ్యంతో మరణించడంతో భార్య తిరుపతమ్మ తన కుమారుడుతో కలిసి అష్టకష్టాలు పడుతూ ఆ భూమిని సాగు చేసుకుంటూ బతుకు జీవనం సాగిస్తున్నారు. తిరుపతమ్మ సైతం అనారోగ్యానికి గురికావడంతో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటుంది. ఆమె కుమారుడు కూడా తల్లికి అండగా ఆస్పత్రిలోనే ఉన్నాడు. ఇదే అదునుగా భావించిన అధికార పార్టీకి చెందిన గోవిందరెడ్డి కన్ను ఆ పేద కుటుంబం సాగు చేసుకునే భూమిపై పడింది. ఈ క్రమంలో పేద రైతు భూమిలో ఆదివారం జేసీబీ పెట్టి ట్రాక్టర్ల ద్వారా మట్టిని తవ్వేసి తరలిస్తుండగా స్థానికులు ఇదేం అన్యాయమని నిలదీస్తే మీరెవరు.. మీకేంటి సంబంధం.. భూమి నాది.. నా ఇష్టం ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండంటూ బెదిరింపులకు దిగాడు. ఆ కుటుంబానికి ఆ పొలమే జీవనాధారమైతే.. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగాలేక ఆస్పత్రిలో ఉంటే.. ఈ సమయంలో ఇంతటి దౌర్జన్యానికి తెగబడటంపై స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా.. వారిని లెక్క చేయకుండా మట్టిని తరలించాడు. దీంతో టీడీపీ నేత దౌర్జన్యంపై స్థానిక వీఆర్వోకు ఫిర్యాదు చేసి, ఆ పేద కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. -
సాగునీటికి దుర్భిక్ష ఘంటికలు
జిల్లాలో సాగునీటి భవిష్యత్పై దుర్భిక్ష మేఘాలు కమ్ముకుంటున్నాయి. కండలేరు, సోమశిల జలాశయాల్లో రోజు రోజుకూ క్షీణిస్తున్న నీటి నిల్వలు ఖరీఫ్ సాగుతోపాటు తాగునీటి భద్రతపైనా ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలపై ఆశలు సన్నగిల్లగా, మరో వైపు చైన్నెతోపాటు జిల్లాలోని తాగునీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించకపోతే రానున్న రోజుల్లో సాగునీటికే కాదు.. తాగునీటికీ తీవ్ర సంక్షోభం తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. కండలేరు జలాశయం పొదలకూరు: మెట్ట ప్రాంత వరప్రసాదిని కండలేరు జలాశయంలో నీటి మట్టం పడిపోతున్న కొద్దీ జిల్లా వ్యవసాయ భవిష్యత్ కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కరువై, జలాశయాలకు వరద ప్రవాహాలు నిలిచిపోవడంతో సాగునీటి సరఫరాపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. సకాలంలో వర్షాలు కురవకున్నా పైతట్టు నుంచి వరద ప్రవాహం లేకున్నా వ్యవసాయ రంగానికి నీటి విడుదల అటుంచి తాగునీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జిల్లాకే తలమానికమైన సోమశిల జలాశయానికి ఇన్ఫ్లో పూర్తిగా ఆగిపోయింది. ప్రస్తుతం 31 టీఎంసీల నీటి నిల్వలు ఉండగా అందులో 8 టీఎంసీల వరకు డెడ్ స్టోరేజీ కింద నిల్వ ఉంచాలి. మిగిలిన నీటిని సాగు, తాగునీటికి వినియోగించాల్సి ఉంటుంది. కండలేరులో 6 టీఎంసీల డెడ్ స్టోరేజీ ఉంచాల్సి ఉండగా చైన్నె తాగునీటి అవసరాలకు నీటి విడుదలను పెంపొందించాల్సిందిగా ఆ రాష్ట్ర ఉన్నత స్థాయి అధికారుల బృందం కండలేరుకు వచ్చి కోరింది. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా సోమశిల, కండలేరు జలాలను తాగునీటికి వినియోగిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ల కింద సమగ్ర రక్షిత మంచి నీటి సరఫరా (సీపీడబ్ల్యూఎస్ స్కీమ్స్) పథకాల ఉన్నాయి. ఎల్నినో కారణంగా విపరీతమైన భూతాపం పెరుగుతోంది. ఫలితంగా వర్షాలు, వరదలపై నమ్మకం పెట్టుకోవాల్సిన పనిలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. వ్యవసాయశాఖ అధికారులు ముందస్తుగానే గ్రామాల్లో తక్కువ నీటి వినియోగంతో పండే పంటలను సాగు చేయాల్సిందిగా సూచిస్తున్నారు. రెండు ప్రాజెక్ట్ల కింద రబీలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సుమారు 7 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తుంటారు. పొదలకూరు, మనుబోలు మండలాల్లోని కొన్ని గ్రామాలకు కండలేరు ఏటి కాలువకు ప్రాజెక్ట్ లోలెవల్ స్లూయిజ్ ద్వారా నిరంతరాయంగా స్వల్పంగానైనా సాగునీటిని విడుదల చేస్తుంటారు. రాపూరు మండలం సంక్రాంతిపల్లి పికప్ ఆనకట్ట నుంచి పిన్నేరు వాగు ద్వారా మనుబోలు మండలంలోని మరికొన్ని గ్రామాలకు తాగు, సాగునీరు అందుతుంది. 30 టీఎంసీలు ఉంటేనే గ్రావిటీ నీరు కండలేరు ఎడమ కాలువ మెట్టరైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ కాలువకు 300 క్యూసెక్కుల వరకు నీటిని విడుదల చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కాలువ వెంబడి చాలా మంది రైతులు ఖరీఫ్ కింద పంటల సాగు చేస్తున్నారు. కాలువకు గ్రావిటీ వాటర్ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. కండలేరుకు సోమశిల నుంచే ఇన్ఫ్లో రావాలి. కండలేరు జలాశయంలో 30 టీఎంసీల నీటి నిల్వ ఉంటేనే హైలెవల్ స్లూయిజ్ ద్వారా గ్రావిటీ నీరు అందుతుంది. అయితే జలాశయంలో ఇప్పుడు 26 టీఎంసీలు నీటి నిల్వ ఉన్నా సత్యసాయి గంగ కాలువకు 2 వేల క్యూసెక్కులు, ఒకటో బ్రాంచి కాలువకు 70, పిన్నేరు వాగుకు 5 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఎడమగట్టు కాలువకు గ్రావిటీ నీరు అందే పరిస్థితి లేదు. ఫలితంగా ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అవసరమైతే విడుదల చేయాల్సి ఉంటుంది. ఎల్నినో కారణంగా వేసవి తాపం పెరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే నైరుతి రుతుపవనాలు ముఖం చాటేస్తున్నాయి. జిల్లాలోనే కాక పైతట్టు ప్రాంతాల్లో వర్షం కురిసి ప్రాజెక్ట్లకు నీరు అందే పరిస్థితి ఉండదని అంచనా వేస్తున్నారు. కండలేరు జలాశయం కింద పొదలకూరు మండలంలో రెండు సీపీడబ్ల్యూఎస్ స్కీములు ఉన్నాయి. రాపూరు, గూడూరు తాగునీటి అవసరాలను కండలేరు జలాశయమే తీర్చుతోంది. చైన్నె మహా నగరానికి కండలేరు నుంచే తాగునీటిని అందిస్తున్నారు. వారు మరో 500 క్యూసెక్కుల నీటి విడుదల పెంచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్తగా నీటిని పొదుపుగా వినియోగించుకుంటేనే తాగునీటి ఇబ్బందులను అధిగమించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రతి నీటి బొట్టు విలువైనదిగా భావించి వృథా చేయకుండా ఉంటే రబీ సీజన్లో వర్షాలు కురువకున్నా కొంత వరకు కండలేరు ఎడమగట్టు కాలువ కింద పంపింగ్ స్కీమ్ ద్వారానైనా పంటలు పండించేందుకు వీలుకలుగుతుంది. కండలేరులో తగ్గుతున్న నీటి మట్టం నీటి పొదుపు పాటించకుంటే తాగునీటికి కష్టాలే ఎడమగట్టు కాలువకు గ్రావిటీ ద్వారా కొద్ది రోజులే ఎల్నినో ప్రభావంతో విపరీతమైన భూతాపం ముందుచూపు లేకుంటే ఇబ్బందే నీటిని పొదుపు చేయాలి ప్రాజెక్ట్ల్లో నీటిని పొదుపు చేయాలి. కరువు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు వెల్లడిస్తున్న తరుణంలో ప్రాజెక్ట్ల్లో నీటి నిల్వలను పొదుపుగా వినియోగించి రైతులకు సాగు నీటిని అందివ్వాలి. లేకుంటే ప్రజల తాగునీటి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతోంది. – వై. పెంచలరెడ్డి, రైతు నాయకుడు, పులికల్లు -
నేడు ‘డయల్ యువర్ ఎస్ఈ’
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ వినియోగదారులు సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ పరిధిలో ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని ఎస్ఈ రాఘవేంద్రం సోమవారం నిర్వహించనున్నారు. నెల్లూరు విద్యుత్ భవన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. వినియోగదారులు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య 0861 – 2320427 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు. ● తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం సీఎండీ శివశంకర్ ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వినియోగదారులు 89777 16661 నంబర్కు ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు. రాష్ట్ర స్థాయి రోయింగ్ పోటీల్లో జిల్లాకు పతకాలు నెల్లూరు (టౌన్): రాష్ట్ర స్థాయి రోయింగ్ చాంపియన్షిప్ పోటీల్లో నెల్లూరు క్రీడాకారులు సత్తా చాటారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఎర్రకాలువ వాటర్ స్పోర్ట్స్ సెంటర్లో ఆదివారం స్కల్లింగ్ అండ్ రోయింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో సింగిల్, డబుల్ స్కల్స్ అంశాలపై పోటీలు జరిగాయి. సబ్ జూనియర్ బాలుర విభాగంలో ఎం.కుశాల్ (బంగారు పతకం), బాలికల విభాగంలో ఎం.జాగృతి (కాంస్య పతకం) సాధించారు. బీసీ కాలనీలో నగదు, బంగారం చోరీవింజమూరు(ఉదయగిరి): వింజమూరు పట్టణంలోని బీసీ కాలనీలో ఓ ఇంట్లో చోరీ జరిగిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం మేరకు.. కాలనీకి చెందిన ఉప్పు కృష్ణంరాజు, పద్మ దంపతులు శనివారం ఉదయం మాలకొండకు వెళ్లి స్వామిని దర్శించుకుని సాయంత్రం ఇంటికి వచ్చారు. అప్పటికే ఇంటికి వేసి ఉన్న తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. లోనికి వెళ్లి పరిశీలించగా బీరువా తాళం తీసి అందులో ఉన్న రూ.15 వేల నగదు, రెండు బంగారు ఉంగరాలు, జత కమ్మలు, కొన్ని వెండి వస్తువులు తీసుకెళ్లినట్లు గుర్తించారు.28, 29 తేదీల్లో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పర్యటననెల్లూరు రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ ఏవీఎస్ సూర్యనారాయణ రాజు, సభ్యురాలు కేజీ వెంకట పద్మలత ఈనెల 28, 29 తేదీల్లో జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొదటిరోజు పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, స్కాన్ సెంటర్లు, బాలల గృహాలు, పరిశ్రమలు తదితరాల్లో పరిస్థితులను పరిశీలిస్తారన్నారు. 29న కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో బాలల, రక్షణ, బాల్య వివాహాల నివారణ, పోక్సో చట్టం అమలు, బాల కార్మిక నిర్మూలన, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థుల భద్రత, శిశు ఆరోగ్యం, హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహిస్తారన్నారు. అనంతరం స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలతో సమావేశమై వినతులు స్వీకరిస్తారని తెలియజేశారు.నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.45 సన్నవి : రూ.25 పండ్లు : రూ.10 -
లోకేశ్ రాజీనామా చేయాలి
● మేకపాటి రాజగోపాల్రెడ్డి ఉదయగిరి: డీఎస్సీ పరీక్షల్లో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని ఉదయగిరి వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. డీఎస్సీలో అక్రమాలతో ఎంతో మంది ప్రతిభ ఉన్న విద్యార్థులు ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో ఆ కుటుంబాలు రోదిస్తున్నాయన్నారు. ఏళ్ల తరబడి కోచింగ్లు తీసుకొని ఎంతో ఖర్చు చేసి కష్టపడి చదివి, పరీక్షలు రాస్తే ప్రతిభ ఉన్న వారిని కాదని, అర్హత లేని వారికి ఉద్యోగాలు కట్టబెట్టారన్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ విభాగంలో అక్రమా లు జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నా.. బాధ్యులపై ఇంత వరకు ప్రభు త్వం చర్యలు తీసుకోకపోవడంతో విద్యాశాఖ మంత్రిగా లోకేశ్ అనర్హుడన్నారు. -
మినీ మార్టులుగా చౌకదుకాణాలు
● డీఎస్ఓ పుల్లయ్య నెల్లూరు (పొగతోట): జిల్లాలో 150 చౌకదుకాణాలను మినీమార్టులుగా మార్పులు చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని డీఎస్ఓ పుల్లయ్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1513 చౌకదుకాణాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం మండలానికి ఐదు చొప్పున మినీ మార్టులుగా మార్చేందుకు తహసీల్దార్లు, సీఎస్డీటీలు సమన్వయంతో ఎంపిక చేస్తారన్నారు. మినీ మార్టులుగా మార్పు చేయడానికి ఫ్రంటీర్ మార్కెట్ సంస్థకు రేషన్ షాపు డీలర్ రూ.10 వేలు డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. చౌకదుకాణంలో అన్ని ఏర్పాట్లు చేసి మొబైల్ అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి నెలా 24వ తేదీలోపు డీలర్ అవసరమైన సరుకులు సరఫరా చేయడానికి ఇండెంట్ పెట్టాల్సి ఉంటుందన్నారు. సరుకుల కోసం డీలర్ ముందుగానే నగదు చెల్లించాలన్నారు. అవసరమైన డీలర్లకు బ్యాంకుల ద్వారా రూ.లక్ష వరకు రుణం మంజూరు చేయిస్తామన్నారు. డీలర్ ప్రతి నెలా రూ.800 లేదా ఒకే పర్యాయం నగదు బ్యాంకులకు తిరిగి రుణాన్ని కంతులుగా చెల్లించాలన్నారు. బీజేపీతో వ్యవస్థలు చిన్నాభిన్నం ● సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ గూడూరు: కేంద్రంలో బీజేపీ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ దేశంలో వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తోందని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ విమర్శించారు. గూడూరులో ఆదివారం జరిగిన సీపీఐ నేత ప్రభాకర్ సంతాప సభకు హాజరైన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దేశంలో అన్ని వ్యవస్థలను విచ్ఛి న్నం చేస్తూ పాలన కొనసాగిస్తున్న బీజేపీ విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించిందన్నారు. నీట్ ప్రశ్న పత్రం లీక్ చేసి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ను అగాధంలోకి నెట్టిందన్నారు. దీనిపై నిరసనలకు తలొగ్గి కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం విద్యార్థులు సాధించిన గొప్ప విజయమన్నారు. ఇలానే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలా ప్రతి విషయంలో యువత పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడాలని పిలుపు నిచ్చారు. కార్మిక, ప్రజా వ్యతిరేక పోరాటలకు సిద్ధమవ్వాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో కూడా సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనపై పోరాటం సాగించాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, నాయకులు జమాలుల్లా, సునీల్, నారాయణ, రమేష్ బీకేఎంయూ నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు. ఎయిర్ రైఫిల్లో గోల్డ్ మెడల్ మనుబోలు: మండలంలోని పిడూరు గ్రామానికి చెందిన ఒరువూరు నైనిక అండర్–14 ఎయిర్ రైఫిల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. నర్సయ్య, రజిని దంపతుల కుమార్తె నైనిక కృష్ణపట్నంలోని అదానీ వరల్డ్ స్కూల్లో ఏడో తరగతి చదువుతోంది. ఇటీవల తమిళనాడులోని తిరుచ్చిలో నిర్వహించిన సౌత్ జోన్ అండర్–14 విభాగం ఎయిర్ రైఫిల్ షూటింగ్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది. దీంతో నైనికను ఆదివారం పలువురు అభినందించారు. -
బెజవాడ పాపిరెడ్డి కాలువకు భారీ గండి
● సైఫన్ ఆక్విడెక్ట్ కొట్టుకుపోయి దువ్వూరు చెరువులోకి సాగునీరు సంగం: జలవనరుల శాఖ నిర్వహణా లోపం, నిర్లక్ష్యానికి బెజవాడ పాపిరెడ్డి (కావలి) కాలువపై మండలంలోని మర్రిపాడు సమీపంలో నిర్మించిన సైఫన్ అక్విడెక్ట్ కొట్టుకుపోయింది. దీంతో కావలి కాలువకు గండి పడడంతో ఆ కాలువలో వెళ్లాల్సిన సాగునీరంతా దువ్వూరు చెరువులోకి ప్రవహిస్తోంది. అధికారుల నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణమని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుల కథనం ప్రకారం, సైఫన్ అక్విడెక్ట్కు కొద్ది రోజుల క్రితమే స్వల్పంగా గండి పడింది. అప్పుడే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి, కాలువలో నీటి మట్టాన్ని తగ్గించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు ఆరోపించారు. సమస్యను ముందుగానే పరిష్కరించి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు మండిపడుతున్నారు. శనివారం గండిపడిన ప్రాంతంలో ఇసుక బస్తాలు వేసి చేతులు దులుపుకున్న అధికారులు, అసలు సమస్యను పరిష్కరించకుండా తాత్కాలిక చర్యలకే పరిమితమయ్యారని రైతులు విమర్శించారు. దీంతో కాలువలో నీటి ఒత్తిడి మరింత పెరిగి ఆదివారం సైఫన్ అక్విడెక్ట్ పూర్తిగా కూలిపోయిందని తెలిపారు. ఫలితంగా భారీగా నీరు బయటకు వెళ్లిపోతూ దువ్వూరు చెరువులోకి చేరుతోంది. ఈ ఘటనతో మర్రిపాడు రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. వ్యవసాయ పొలాలకు వెళ్లే దారి పూర్తిగా దెబ్బతినడంతో వందలాది ఎకరాల్లో సాగు పనులు నిలిచిపోయాయి. ఇప్పటికే సాగులో ఉన్న పంటల సంరక్షణకు కూడా పొలాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే బెజవాడ పాపిరెడ్డి కాలువలో నీటి మట్టాన్ని తగ్గించి అత్యవసర రక్షణ చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. లేకుంటే మరింత పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. -
జగన్ నాయకత్వాన్ని జనం కోరుకుంటున్నారు
● అధికారం లేకున్నా వైఎస్సార్సీపీలో చేరికలు ● మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిముత్తుకూరు(పొదలకూరు): ‘ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అధికారం లేకున్నా టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరికలే ఇందుకు నిదర్శనం’ అని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. ముత్తుకూరు మండలం తాళ్లపూడి గ్రామానికి చెందిన 20 కుటుంబాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం మండల పార్టీ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో కాకాణి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, గూడూరు సమన్వయకర్త గురవయ్య సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా కాకాణి వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. కాకాణి మాట్లాడుతూ అధికార పార్టీని వీడి ప్రతిపక్షంలో ఉన్న తమ పార్టీలో చేరడం చూస్తే కూటమి ప్రభుత్వంపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి వైఎస్సార్సీపీకే సాధ్యమన్నారు. తాళ్లపూడిలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని అధికారంలో ఉన్న టీడీపీ కనీసం మంచినీటిని కూడా గ్రామస్తులకు అందించకపోతున్నట్టు ఆరోపించారు. హైకోర్టుకు వెళ్లి గ్రామస్తులకు గుక్కెడు మంచినీటిని అందివ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టు తెలిపారు. కక్షసాధింపులు తప్పించి అభివృద్ధి పనులు లేవన్నారు. తమ నాయకత్వంపై నమ్మకంతో అధికారం వీడి వైఎస్సార్సీపీలోకి రావడం సాహసోపేతమైన చర్యగా తెలిపారు. పా ర్టీలోకి వచ్చిన వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామన్నారు. చేరికల పేరుతో టీడీపీ డ్రామాలకు తెరలేపినట్టు కాకాణి విమర్శించారు. ఆ పార్టీలోకి కొత్తవారు చేరకపోవడంతో ఉన్నవారినే చేర్చుకుంటూ డ్రామాలు ఆడుతున్నట్టు ఆరోపించారు. -
ఇసుక టిప్పర్ల అడ్డగింత
సంగం: బీరాపేరు బ్రిడ్జి సమీపంలోని అనధికారికంగా నిర్వహిస్తున్న ఇసుక రీచ్ వద్ద టిప్పర్ల రాకపోకలపై రైతుల ఆగ్రహం భగ్గుమంది. ఆదివారం బైక్లను రోడ్డుకు అడ్డంగా నిలిపి రీచ్కు వెళ్లే టిప్పర్లను అడ్డుకుని నిరసన చేపట్టారు. ఇసుక టిప్పర్ల రాకపోకలతో రేగుతున్న దుమ్ముతో తమ పంటలు తీవ్ర నష్టం కలుగుతున్నా.. అధికారులు, రీచ్ నిర్వాహకులు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. ప్రతి రోజూ వందల టిప్పర్లు రాక పోకలు సాగిస్తుండడంతో పంటలు దుమ్ముతో నిండిపోతున్నాయని, దీంతో తీవ్ర నష్టం కలుగుతోందని తెలిపారు. దుమ్ము కారణంగా గ్రామస్తులు శ్వాస సంబంధిత ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారన్నారు. ఇసుక తరలింపుతో కోట్లా ది రూపాయల ఆదాయం వస్తున్నా, రైతుల సమస్యలపై మాత్రం అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక రవాణాను పూర్తిగా నిలిపివేసి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 84,488 మంది దర్శించుకున్నారు. 37,061 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.78 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
యంత్ర భాగ్యం.. రైతులకు దక్కేనా?
● యాంత్రీకరణ పథకం అమలులో జాప్యం ● జిల్లాకు కేటాయించింది తక్కువ మొత్తమే.. ● 2025 – 26 నిధులు ఇప్పటికీ ఖర్చు కాని పరిస్థితి ● కూలీల కొరత, పెరిగిన వ్యయంతో ఇబ్బందులునెల్లూరు(వేదాయపాళెం): రైతులకు సబ్సిడీపై అందించాల్సిన వ్యవసాయ యంత్రాల పంపిణీ విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో యాంత్రీకరణ లక్ష్యమే ప్రశ్నార్థకంగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యయాన్ని తగ్గించి, అధిక దిగుబడులు సాధించేందుకు ఉద్దేశించిన సబ్ మెషీన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (ఎస్ఎంఏఎం) పథకం అమలులో జాప్యం కారణంగా రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఏం చేయాలంటే.. ఈ పథకం కింద మినీ ట్రాక్టర్లు, 40 హెచ్పీ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, రోటావేటర్లు, విత్తన గొర్రులు, గుంతలు తీసే యంత్రాలు, స్ప్రేయర్లు తదితర వ్యవసాయ పనిముట్లను సబ్సిడీపై అర్హులైన రైతులకు అందించాల్సి ఉంది. అయితే జిల్లాలకు నిధులిచ్చినా.. లబ్ధిదారుల ఎంపిక, యంత్రాల పంపిణీపై స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధులు కేటాయించినప్పటికీ, 2026 – 27 ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలలు గడిచినా యంత్రాల పంపిణీ ప్రారంభం కాకపోవడం రైతుల్లో అసంతృప్తి పెంచుతోంది. ప్రభుత్వం ప్రకటించిన పథకం అమలులో జాప్యం వల్ల నిధులు వినియోగం కాకుండానే మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. కేవలం రూ.4 కోట్లే.. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో సుమారు 4.48 లక్షల ఎకరాల సాగు భూమి, 3.75 లక్షల మంది రైతులున్నారు. ఇంత పెద్ద వ్యవసాయ విస్తీర్ణం ఉన్న జిల్లాకు మెకనైజేషన్ కింద కేవలం రూ.4.1 కోట్లు మాత్రమే కేటాయించారు. సమీప జిల్లాలకు రూ.7 కోట్ల నుంచి రూ.9 కోట్ల వరకు నిధులు మంజూరు చేసినట్లు చెబుతున్నారు. కానీ కూటమి ప్రభుత్వం నెల్లూరు జిల్లాకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు, వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావంతో వ్యవసాయం సవాళ్లను ఎదుర్కొంటోంది. మరోవైపు కూలీల కొరత, పెరిగిన వ్యయం రైతులపై అదనపు భారం మోపుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో యంత్రాలు అందుబాటులోకి వస్తే సాగు ఖర్చు తగ్గడంతోపాటు పనులు వేగంగా పూర్తై దిగుబడులు మెరుగుపడే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. సకాలంలో యంత్రాల పంపిణీ చేపట్టి మెకనైజేషన్ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.త్వరలో అర్హుల జాబితా ప్రకటిస్తాంజిల్లా వ్యాప్తంగా 250 మంది దరఖాస్తు చేసుకున్నారు. అతి త్వరలో అర్హుల జాబితా ప్రకటించి యంత్ర సామగ్రిని అప్పగిస్తాం. – పి.సత్యవాణి, జిల్లా వ్యవసాయాధికారిణి -
కోటయ్య సేవలు చిరస్మరణీయం
● డీఆర్వో విజయకుమార్ నెల్లూరురూరల్: ‘ప్రగడ కోటయ్య చేనేత కార్మికులు, రైతులు, బలహీనవర్గాల సంక్షేమానికి జీవితాంతం అంకితభావంతో కృషి చేశారు. ఆయన సేవలు చిరస్మరణీయం’ అని డీఆర్వో విజయకుమార్ అన్నారు. కోటయ్య జయంతిని ఆదివారం నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ కోటయ్య చేనేత కార్మికుల సమస్యలపై అధ్యయనం చేసి, రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించడం ద్వారా మరిన్ని సహకార సంఘాల ఏర్పాటుకు ప్రోత్సాహం అందించారని చెప్పారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని పేర్కొన్నారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించిన కోటయ్య వంటి మహనీయుల జీవితాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. మాజీ ఎమ్మెల్సీ బూదాటి రాధయ్య మాట్లాడుతూ కోటయ్య యుక్త వయసు నుంచే చేనేత, వ్యవసాయ కార్మికుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేశారని తెలిపారు. వ్యవసాయ కార్మికుల కోసం కూడా భూ పోరాటాలు నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా నేతన్నలు బైన ఏడుకొండలు (పాటూరు), పొనగంటి సింహబలుడు నారాయణరెడ్డి, కుండా సుబ్బారావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా చేనేత, జౌళి శాఖాధికారి దావులూరి ఐజయ్య, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ తల్లా నరసింహస్వామి, రాష్ట్ర చేనేత సంఘాల నాయకులు కేవీ శేషయ్య, కాటికాల వెంకటేశ్వర్లు, బి.బాలాజీ, జె.రామసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
కన్నపేగుకే కన్నీటి శిక్ష
● ఆస్తి కోసం వృద్ధ తండ్రిని రోడ్డున పడేసిన కుమారులు ఆత్మకూరురూరల్: కన్నప్రేమ కడతేరిపోతోంది. అనురాగాల పందిరి కింద ఆస్తుల చిచ్చు రగులుతోంది. వృద్ధాప్యంలో ఆసరాగా నిలవాల్సిన కన్న కొడుకులే, ఆస్తి పంపకాల కోసం కన్న తండ్రిని వీధుల పాలు చేసిన దయనీయ ఉదంతమిది. రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లలను పెంచి పెద్ద చేసి, వారి భవిష్యత్ కోసం ఆస్తిని సమకూర్చిన ఆ తండ్రికి ఇప్పుడు అశ్రునయనాలు, అనాథ బతుకు మిగిలింది. రామస్వామిపల్లి గ్రామానికి చెందిన వద్ది రమణయ్య తన జీవితకాలంలో కష్టపడి 8 ఎకరాల పొలం, రెండిళ్లను సంపాదించాడు. కొడుకులిద్దరికీ ఏ లోటు రాకూడదని భావించిన ఆ తండ్రి స్వేదమే ఆ ఆస్తులకు పునాది. పెద్ద కుమారుడు కరెంట్ పని చేస్తూ, ఇటీవల పక్షవాతం బారిన పడ్డాడు. చిన్న కొడుకు ఓ సబ్స్టేషన్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. అయితే వృద్ధాప్యంలో ఉన్న ఆ తండ్రికి విశ్రాంతినివ్వాల్సిన కొడుకులు, కోడళ్లు, అతడు కష్టపడి సంపాదించిన ఆస్తులపై కన్నేశారు. ఆస్తి నాకంటే నాకే రాయాలి అని ఒకరు, నాకు అనుకూలంగా ఇవ్వాలి అని మరొకరు నరకాన్ని చూపుతున్నారు. వయసు మళ్లడంతో రమణయ్యకు వినికిడి శక్తి బాగా తగ్గింది. ఎదుటి వారు గట్టిగా చెబితే తప్ప మాటలు వినపడవు. కానీ ఆ అశక్తతను కూడా కనికరించకుండా, కొడుకులతోపాటు ఆయన కోడళ్లు కూడా కలిసి వృద్ధుడిపై భౌతిక దాడులకు, తీవ్ర మానసిక వేధింపులకు పాల్పడుతుండడం మానవత్వానికే మచ్చ. ఆస్తులను తమ పేరిట రాయించుకోవడానికి ఆ వృద్ధుడిని సొంత ఇంటి నుంచే తరిమేశారు. విధి లేక ఆ తండ్రి ఆత్మకూరు వీధుల్లో, ప్రభుత్వాస్పత్రి, మున్సిపల్ కార్యాలయాల సమీపంలో కాలం వెళ్లదీస్తున్నాడు. తనను కన్న బిడ్డలు, కోడళ్లే కలిసి వేధిస్తున్నారని, తనకు రక్షణ కల్పించాలని ఆ వృద్ధుడు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. ఇది కుటుంబ పంచాయితీ, కోర్టులోనే తేల్చుకోండని అధికారులు చేతులెత్తేయడంతో ఆ తండ్రి ఆవేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. ఇతని కన్నీటి గాధ తెలిసిన ప్రతి ఒక్కరి మనసు చలించిపోతుందే కానీ కన్న కుమారులు, కోడళ్ల మనసులు మాత్రం కరగడం లేదు. చట్టాలు, సివిల్ నిబంధనల కంటే ముందు మానవతా ధృక్పథంతో స్పందించి, ఆ వృద్ధుడికి తగిన రక్షణ, ప్రశాంతమైన జీవితం లభించేలా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఉద్యోగుల విభజన.. అంతా గందరగోళం
నెల్లూరు(అర్బన్): పరిపాలనా సౌలభ్యం కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2022లో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించింది. అప్పట్లో కొత్త జిల్లాల్లో పరిపాలనకు ఇబ్బంది లేకుండా పాత జిల్లాల నుంచి ఉద్యోగులను సర్దుబాటు ప్రక్రియలో నియమించారు. స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ఉద్యోగులను విభజించేందుకు 2025 డిసెంబర్ 15న రాష్ట్రపతి ఉత్తర్వులు (ప్రెసిడెన్షియల్ ఆర్డర్) జారీ అయ్యాయి. కొత్త జిల్లాలకు అనుగుణంగా స్థానిక కేడర్లను పునర్వ్యవస్థీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం కల్పించారు. ఈ ప్రక్రియను 18 నెలల్లోపు పూర్తి చేయాలని పేర్కొన్నారు. అయితే గడువు ముగియడానికి ఇంకా దాదాపు ఏడాది సమయం ఉన్నప్పటికీ, వచ్చే నెలలోపు ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోనూ కలెక్టర్ ఆధ్వర్యంలో హడావుడిగా ఈ తంతు కొనసాగుతోంది. ఈ తొందరపాటు వల్ల తమకు తీవ్ర నష్టం జరుగుతుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రణాళిక లేకుండానే.. ఉద్యోగులకు సంబంధించి టీఏ, డీఏ, ఐఆర్, పీఆర్సీ బకాయిలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు అవుతోంది. ఉద్యోగుల బదిలీలపై ఫ్రీజింగ్ కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో విభజన చేపడితే పిల్లల చదువుకు ఆటంకం కలుగుతుంది. కొత్త జిల్లాల్లో ఇల్లు వెతుక్కోవడం, అద్దెలు చెల్లించడం, పిల్లల్ని కొత్త పాఠశాలల్లో చేర్పించడం, రవాణా ఖర్చులు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ కూడా ఇబ్బందిగా మారుతుంది. ఫలితంగా ఉద్యోగులపై అదనపు ఆర్థిక భారం పడుతుంది. తొందరపాటు విభజనతో సీనియర్, జూనియర్ ఉద్యోగుల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి. కొత్త జిల్లాల ప్రకారం.. గతంలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో గూడూరును తిరుపతి జిల్లాలో, కందుకూరును నెల్లూరు జిల్లాలో కలిపారు. ఆ మేరకే రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే అనంతరం కూటమి ప్రభుత్వం గూడూరును తిరిగి నెల్లూరులో, కందుకూరును ప్రకాశం జిల్లాలో విలీనం చేసింది. దీంతో అప్పటి కొత్త జిల్లాల ఆధారంగా జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రస్తుతం గూడూరు, కందుకూరుకు వర్తిస్తాయా? లేదా? అనే సందిగ్ధత నెలకొంది. అయినప్పటికీ విభజన ప్రక్రియ కొనసాగుతుండటంపై ఉద్యోగులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. జూనియర్లకే ఎక్కువ నష్టమా? విభజనకు సంబంధించి ఇప్పటికే ఆప్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉద్యోగులు తమ ఆప్షన్లు నమోదు చేస్తున్నారు. అయితే స్థానికతకు పెద్దపీట వేయకుండా సీనియార్టీని మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటున్నారని జూనియర్ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు తడకు చెందిన ఓ వ్యక్తి నెల్లూరు కోరుకుంటాడు. నెల్లూరులో ఉండే జూనియర్ ఇక్కడ నుంచి పక్క జిల్లాలోని సుదూర ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. అంతేకాకుండా పదోన్నతులు, ఇంక్రిమెంట్లలో కూడా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. విభజనతో సీనియర్లు, జూనియర్లు అనే రెండు వర్గాలుగా ఉద్యోగులు విడిపోయే పరిస్థితి నెలకొంది. జిల్లాలో అన్ని శాఖల్లో కలిపి సుమారు 18 వేల మంది ఉద్యోగులున్నారు. వీరిలో కనీసం 4,300 మంది వరకు తిరుపతి జిల్లాకు వెళ్లాల్సి ఉంటుంది. రెవెన్యూ, వైద్య, పోలీసు, ఉపాధ్యాయ తదితర 50కి పైగా శాఖల్లోని ఉద్యోగులు వేరే జిల్లాలకు వెళ్లిపోవాల్సి వస్తుంది. జోన్ కేడర్ నుంచి జిల్లా కేడర్ వరకు ఇలా జరుగుతుంది. దీంతో తాము తీవ్రంగా నష్టపోనున్నామని కొందరు పేర్కొంటున్నారు. ఇలా చేస్తే.. జిల్లాల వారీగా అన్ని ప్రభుత్వ శాఖల్లో కొత్త జోన్లు, జిల్లా, డివిజన్ల వారీగా ఉద్యోగుల భర్తీ, కేటాయింపుల కోసం తగిన గడువు ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇప్పటికీ అనేక శాఖల్లో సీనియారిటీ జాబితాలు సిద్ధం కాలేదు. ఇతర జిల్లాలకు కేటాయింపులపై అభ్యంతరాలు తెలిపేందుకు కనీసం 30 రోజుల గడువు ఇవ్వాలని, అప్పీళ్లను పరిశీలించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈలోపు పెండింగ్లో ఉన్న పదోన్నతులు కల్పించి, బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తొందరపాటు కాకుండా వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేయాలని, లేదంటే న్యాయపరమైన, కోర్టు సంబంధిత సమస్యలతో పాటు సీనియర్, జూనియర్ ఉద్యోగుల మధ్య వివాదాలు తలెత్తే అవకాశం ఉందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. గడువున్నా రాష్ట్రపతి ఉత్తర్వుల పేరుతో హడావుడి కొంతమందికి తీవ్ర అన్యాయం? తొందరపాటు నిర్ణయాలు వద్దంటున్న ఉద్యోగులు గడువు ఇచ్చి అభ్యంతరాలు స్వీకరించాలని విజ్ఞప్తి -
విజృంభిస్తున్న మట్టి మాఫియా
● పల్లిపాడు చెరువులో ఇదీ తంతు ● మూడు జేసీబీలు, 30కుపైగా ట్రాక్టర్లలో యథేచ్ఛగా తరలింపు ● 20 వేల క్యూబిక్ మీటర్ల మేర కొల్లగొట్టి మర్రిపాడు: మండలంలోని పల్లిపాడు చెరువులో మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ అనుమతులు, అధికారిక పర్మిట్లు లేకుండానే మూడు జేసీబీలు, 30కుపైగా ట్రాక్టర్లతో చెరువు నుంచి మట్టిని పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఇప్పటికే సుమారు 50 ఎకరాల మేర విస్తీర్ణంలో తవ్వకాలు చేపట్టి, 20 వేల క్యూబిక్ మీటర్లకుపైగా మట్టిని తరలించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాజకీయ అండదండలతో ఈ వ్యవహారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో దందా నడుస్తున్నా.. ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ అధికారులు సమర్థంగా వ్యవహరించడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా దీనిపై సమాచారం అందుకున్న మర్రిపాడు పోలీసులు శనివారం రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. మట్టి లోడుతో వెళ్తున్న ఆరు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పొరంబోకు భూముల్లో సాగు
దగదర్తి: మండలంలోని ఐతంపాడులో ప్రభుత్వ భూములను కొందరు యథేచ్ఛగా ఆక్రమించి.. జామాయిల్తో పాటు ఇతర పంటలను సాగుచేస్తున్నారు. ఒక్కొక్కరూ సుమారు పదెకరాలకు తగ్గకుండా చదును చేసి సాగు జరుపుతున్నా, సంబంధిత రెవెన్యూ అధికారులకు ఏ మాత్రం పట్టడంలేదు. ఫలితంగా అర్హులకు ల్యాండ్స్ అందని ద్రాక్షలా మారుతోంది. నిజానికి గ్రామంలోని సర్వే నంబర్ ఒకటిలో సుమారు 29 ఎకరాల అనాధీన.. సర్వే నంబర్ నాలుగులో సుమారు 150 ఎకరాల మేత పొరంబోకు భూమి ఉంది. వీటితో పాటు చెరువు పొరంబోకు, దేవదాయ శాఖ ల్యాండ్స్ సైతం ఆక్రమణకు గురవుతున్నాయి. గ్రామంలో దాదాపు 150 కుటుంబాలు నివాసముంటున్నా, వీరిలో భూమిలేని వారే ఎక్కువగా ఉన్నారు. రాజకీయ, అధికార పలుకుబడి ఉన్నవారు పెద్ద ఎత్తున ఆక్రమించి చదును చేసి సాగు చేస్తున్నారు. గ్రామంలో వందెకరాలకుపైగా భూములు 25 మంది కబంధహస్తాల్లో చిక్కుకున్నాయని గతంలో రెవెన్యూ అధికారులు చేసిన సర్వేలో తేల్చారు. కబ్జాదారులను హెచ్చరించినా, పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేకపోవడం గమనార్హం. -
పశువుల ఆస్పత్రి స్థలాన్నీ వదల్లేదు
కావలి రూరల్: మండలంలోని తుమ్మలపెంట బీచ్ రోడ్డులో పశువుల ఆస్పత్రికి కేటాయించిన స్థలం కబ్జాకు గురైంది. ఆపై పక్కా భవనాలుగా నిర్మించి అద్దెలకిస్తున్న వైనం వెలుగు చూసింది. వాస్తవానికి మన్నంగిదిన్నె, తుమ్మలపెంట, అన్నగారిపాళెం పంచాయతీలకు చెందిన రైతుల సౌకర్యార్థం తుమ్మలపెంట పంచాయతీ పరిధిలో పశువుల ఆస్పత్రికి 20 సెంట్ల స్థలాన్ని 1994లో కేటాయించారు. అప్పట్నుంచీ ఇక్కడ పశువులకు వైద్యసేవలందిస్తూ వచ్చారు. అయితే దీనికి బిల్డింగ్ లేకపోవడంతో మాగుంట పార్వతమ్మ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిర్మించారు. మిగిలిన 15 సెంట్ల స్థలాన్ని ఖాళీగా ఉంచారు. కాలక్రమంలో ఆ ప్రాంతంలో పశువులు ఎక్కువగా లేకపోవడం, గొల్లపాళెంలో ఉండటంతో గోపాలమిత్ర స్కీమ్ను అక్కడికి మార్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఈ స్థలంలో ఏడు రూమ్లను షాపులుగా నిర్మించి, విద్యుత్ మీటర్లను సైతం బిగించి అద్దెకిచ్చారు. పాత భవన పైభాగాన పశువుల వైద్యశాల, అన్నగారిపాళెం పంచాయతీ అనే బోర్డు నేటకీ కనిపిస్తూనే ఉంది. ఈ విషయమై పంచాయతీ సెక్రటరీని సంప్రదించగా, అది తమ పరిధిలో లేదని చెప్పారు. రోడ్డు నిర్మాణానికి ఆర్ అండ్ బీ ఉపక్రమించగా, విస్తరణకు ఇబ్బందిగా ఉండడంతో సదరు షాపుల యజమానులకు నోటీసులను జారీ చేశారు. పొరంబోకు స్థలాన్ని ఆక్రమించడంతో రోడ్డు నిర్మాణం ప్రస్తుతం నిలిచిపోయింది. కబ్జా చేసి రూమ్లు కట్టిన స్థలం ఆర్ అండ్ బీ పరిధిలో ఉంది. ఆక్రమించిన భూమిలో నిర్మించిన షాపులు -
టెన్జింగ్ నార్గే అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు రూరల్: కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రదానం చేసే టెన్జింగ్ నార్గే జాతీయ సాహస అవార్డుల కోసం అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించారు. 2023, 24, 25 సంవత్సరాల్లో భూమి, నీరు, గాలి విభాగాల్లో విశేష సాహస విజయాలు సాధించిన వారికి ఒక్కో అవార్డు.. సాహస రంగంలో విశిష్ట సేవలందించిన వారికి లైఫ్టైమ్ అచీవ్మెంట్ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారని చెప్పారు. అవార్డు గ్రహీతలకు టెన్జింగ్ నార్గే కాంస్య విగ్రహం, ప్రశంసపత్రం, బ్లేజర్తో పాటు రూ.15 లక్షల నగదు బహుమతిని అందజేయనున్నారని వివరించారు. అర్హులు వచ్చే నెల 20లోపు awards.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం సదరు ప్రతితో పాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అదే రోజు సాయంత్రం ఐదు గంటల్లోపు ఏకేనగర్లోని సెట్నెల్ కార్యాలయంలో అందజేయాలని కోరారు. కలెక్టర్, సెట్నెల్ చైర్మన్ ఆమోదం అనంతరం దరఖాస్తులను కమిషనర్, యువజన సర్వీసుల శాఖకు పంపనున్నామన్నారు. వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలని కోరారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయమే నెల్లూరు(వీఆర్సీసెంటర్): కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడం విద్యార్థి ఉద్యమం సాధించిన అతిపెద్ద విజయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బాలాజీనగర్లోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. నీట్ పేపర్ లీక్ కావడంతో విద్యార్థులు చేసిన ఉద్యమం దేశం మొత్తాన్నీ ప్రభావితం చేసిందన్నారు. ఇది బీజేపీ ప్రభుత్వాన్ని కదిలించిందని, తప్పనిసరి పరిస్థితిల్లో ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని చెప్పారు. అయితే ఇది సమస్యకు పరిష్కారం కాదని, విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసి ఆ శాఖను ఆయా రాష్ట్రాలకు అప్పజెప్పడంతో పాటు నీట్ విధానాన్ని వికేంద్రీకరించాలని డిమాండ్ చేశారు. చోద్యం చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను కేంద్రం భ్రష్టు పట్టిస్తుంటే, చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోందని విమర్శించారు. ఇటీవల నిర్వహించిన పేరెంట్స్ టీచర్ మీటింగ్లో పిల్లలను కనాలని, వారే సంపద అని సీఎం చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. భూములను బలవంతంగా లాక్కొని కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ, పౌరులను సంపదతో పోల్చడం, పిల్లలను లాభాలు ఆర్జించే యంత్రాల్లా చూడటం సరికాదని హితవు పలికారు. పాలన విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చుకోకపోతే కేంద్రంలో మోదీ సర్కార్ ఏ విధంగా దెబ్బతింటుందో, అదే తరహా పరిస్థితి ఇక్కడా ఏర్పడుతుందని చెప్పారు. పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్, కార్యదర్శివర్గ సభ్యురాలు రెహనాబేగం పాల్గొన్నారు. పారిశుధ్య మెరుగునకు ప్రత్యేక చర్యలు నెల్లూరు(పొగతోట): గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చేలా చర్యలు చేపట్టాలని డీపీఓ వసుమతి ఆదేశించారు. నగరంలోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి వివిధ మండలాల ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలతో శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. గతంలో నిర్మించిన వర్మికంపోస్ట్ యానిట్లను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఇంటి పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పంచాయతీల ఆదాయం పెరిగేలా చూడాలన్నారు. ఉద్యోగుల విభజనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాలని సూచించారు. -
హద్దుల్లేక వివాదాలు
దగదర్తి: మండలంలోని కొత్తపల్లి కౌరుగుంటలో ఏపీఐఐసీ భూమిలో హద్దులను స్పష్టంగా నిర్ణయించకపోవడంతో ఈ ప్రాంతంలో వివాదాలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి గ్రామంలోని సర్వే నంబర్ 279లో సుమారు ఏడెకరాలను ఇండస్ట్రియల్ పార్కు కోసం ఏపీఐఐసీ సేకరించింది. ఈ భూమికి ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 309, 279లో సుమారు ఆరెకరాల మేర శ్మశాన భూమి 50 ఏళ్లుగా ఉందని గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో సర్వే నంబర్ 279లో ఎకరాను చిన్న పరిశ్రమ కోసం ప్రైవేట్ వ్యక్తి కొనుగోలు చేశారు. భూమిని చదును చేసే సమయంలో శ్మశానంగా వినియోగిస్తున్న ప్రాంతంలో సైతం జరుపుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై గతంలో వివాదాలు చోటుచేసుకోగా, కలెక్టర్కు వినతిపత్రాన్ని గ్రామస్తులు అందజేశారు. హామీ విస్మరణ భూములను ఏపీఐఐసీ సేకరించే సమయంలోనే అక్కడ శ్మశానం ఉందని అధికారులు గుర్తించారు. దీన్ని గ్రామస్తులకే అప్పగిస్తామని, భూసేకరణ చేయబోమని ఆ శాఖతో పాటు రెవెన్యూ ఆఫీసర్లు హామీ ఇచ్చారు. అయితే దీన్ని నేటికీ నెరవేర్చలేని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా శ్మశాన భూమికి స్పష్టమైన హద్దులను ఏర్పాటు చేసి, అధికారిక రికార్డుల్లో నమోదు చేసి తమకు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
పేద రైతుల పొట్టగొడుతూ..
ఆత్మకూరు రూరల్: మండలంలోని రామస్వామిపల్లిలో పేద రైతులకు చెందిన భూముల ఆక్రమణల పర్వాన్ని కొందరు యథేచ్ఛగా సాగిస్తున్నారు. ల్యాండ్స్ను కొనుగోలు చేసిన కొందరు సమీపంలోని పేదలకు చెందిన వాటినీ తమ ఆధీనంలోకి తీసుకునేందుకు యత్నిస్తున్నారు. వీరికి తెలియకుండా జామాయిల్ చెట్లను నరికి విక్రయించి తీవ్ర నష్టాన్ని కలిగించారు. ఇదే అంశంపై గతంలో ఫిర్యాదు చేసినా, సమస్య ఏ మాత్రం పరిష్కారం కాలేదనే ఆవేదన వీరిలో వ్యక్తమవుతోంది. వాస్తవానికి గ్రామానికి చెందిన పల్లాల లక్ష్మమ్మ కుటుంబానికి సర్వే నంబర్లు 1567 – 2ఏ, 2బీలో భూములను ప్రభుత్వం కేటాయించింది. ఈమె భర్త మాలకొండయ్యకు 1.44.. కుమారుడు మస్తాన్కు 1.13 ఎకరాల సీజేఎఫ్ఎస్ పట్టా మంజూరైంది. జామాయిల్ మొక్కలు, నాటేందుకు అవసరమైన వ్యయం, నీటి సరఫరా తదితర సౌకర్యాలను సర్కార్ 2011లో కల్పించడంతో ఇందులో సాగు చేపట్టారు. తదనంతరం భర్త, కుమారుడ్ని కోల్పోయిన లక్ష్మమ్మ ప్రస్తుతం వృద్ధాప్యంతో నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇదే సమయంలో పక్కనే కొనుగోలు చేసిన నెల్లూరుకు చెందిన పసుపులేటి సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు తమ వాటితో పాటు లక్ష్మమ్మ భూమినీ కలుపుకొని ఆమెకు తెలియకుండానే జామాయిల్ చెట్లను నరికి విక్రయించారు. హైదరాబాద్లో పనిచేస్తున్న తన మనవడు వచ్చాక పంటను విక్రయించాలని భావించామని, అయితే వీరిలా వ్యవహరించారని ఈమె ఆరోపించారు. ఫోర్జరీ సంతకాలతో రిజిస్ట్రేషన్లు..? గ్రామానికి చెందిన పొడమేకల సుందరయ్యకు సంబంధించిన భూ వ్యవహారం సైతం వివాదాస్పదంగా మారింది. సర్వే నంబర్ 380 – 2లో 1.8 ఎకరాలను 2003లో అగ్రిమెంట్ ద్వారా కొనుగోలు చేశారు. వ్యవసాయ బోరును ఇటీవల వేసి ఆయిల్పామ్ను సాగు చేసేందుకు సిద్ధమవుతుండగా, భూ రికార్డుల్లో మార్పులు జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. భూములను పసుపులేటి సుబ్రహ్మణ్యం కొనుగోలు చేసే క్రమంలో పలువురు రైతుల ల్యాండ్స్ను సంబంధం లేని వ్యక్తులతో ఫోర్జరీ సంతకాలు చేయించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. బ్యాంక్ రుణాల కోసం ఈసీలు తీసుకున్న సమయంలో విషయం బయటపడింది. దీనిపై తహసీల్దార్, కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కొందరికి న్యాయం.. మరికొందరికి నిరీక్షణ కోర్టును కొందరు రైతులు ఆశ్రయించడంతో వారికి తిరిగి రిజిస్ట్రేషన్ చేశారు. అయితే తాము మాత్రం న్యాయం కోసం ఇప్పటికీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపులేటి సుబ్రహ్మణ్యం కుటుంబానికి రాజకీయ అండదండలుండటంతో అధికారులు తమ సమస్యలను పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. -
రెండు ఓట్లు ఇక కుదరవోయ్..!
● సర్తో సమగ్ర ప్రక్షాళన ● అందుబాటులో అధునాతన టెక్నాలజీ ● ఏమీ కాదనుకుంటే పొరపాటే ● చట్టపరమైన చర్యలకు అవకాశం ఉదయగిరి: ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటు దుర్వినియోగానికి గురవుతున్న వైనంపై సర్ ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఒకే వ్యక్తికి వేర్వేరు చోట్ల ఓట్లుండటం.. ఎన్నికల సమయంలో ఇలా వేయడాన్ని నివారించాలనే లక్ష్యంతో స్క్రీనింగ్ అండ్ వెరిఫికేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో అమల్లోకి తీసుకొచ్చింది. తీవ్ర ప్రభావం నగరాల్లో స్థిరపడిన నిపుణులు, ఉద్యోగులు.. తాత, ముత్తాతల నాటి సెంటిమెంట్ పేరుతో సొంతూళ్లలో ఒక ఓటు ఉంచుకుంటూ.. నివాసం ఉంటున్న చోట మరో దాన్ని కొనసాగించుకుంటున్నారు. అక్కడా.. ఇక్కడా రెండు ప్రాంతాల్లోనూ వేసి గెలుపోటములను శాసిస్తున్నారు. తమ బంధువులో లేదో అనుచరులో సర్పంచ్లు, వార్డు సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్గా పోటీలో ఉంటే ఓటు హక్కును ఉపయోగించుకుంటూ ఆ ప్రాంతాల్లో అభ్యర్థుల రాజకీయ భవిష్యత్తును మార్చేస్తున్నారు. నిమిషాల్లో పసిగట్టేస్తూ.. జిల్లాలో ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, పారదర్శకమైన పోలింగ్ను నిర్వహించడమే లక్ష్యంగా సర్ ప్రక్రియను చేపట్టారు. అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. దీని ద్వారా దేశంలో ఎక్కడైనా ఒకే వ్యక్తి వివరాలతో రెండు ఓట్లుంటే ఈ సిస్టమ్ నిమిషాల్లోనే పసిగట్టేస్తుంది. గతంలో మాదిరిగా రెండు చోట్లా అంటే కుదరదు. కచ్చితంగా ఏదో ఒక ప్రాంతంలో రద్దు చేసుకోవాల్సిందే. ఉద్దేశపూర్వకంగా దాచిపెడితే కఠిన చర్యలు చేపట్టే అవకాశం ఉంది. -
విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దు
నెల్లూరు(టౌన్): కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆటలాడొద్దని పలు విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలంటూ శుక్రవారం వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఐక్యవేదిక చేపట్టిన బంద్ విజయవంతమైంది. నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నాయకులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు స్వచ్ఛందంగా మూసివేశారన్నారు. దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా ఉందని విమర్శించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన వారిపై లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. నీట్ ప్రశ్నపత్ర లీక్ అంశంపై కేంద్రం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయడంతోపాటు విద్యార్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మస్తాన్ షరీఫ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేంద్ర, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి షారుఖ్, ఏవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మున్నా, డీవైఎఫ్ఐ నాయకుడు రమణ, వివిధ సంఘాలకు చెందిన శివం వర్మ, యస్దానీ, సొహైల్, సర్దార్, జీవన్, కోటి, గోవర్ధన్, మున్నా, ధీరజ్, ఆదిత్య, త్రివిక్రమ్, హర్ష తదితరులు పాల్గొన్నారు. సీపీఐ సీనియర్ నేత పముజుల కన్నుమూత నెల్లూరు (వీఆర్సీసెంటర్): సీపీఐ జిల్లా కార్య దర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన సీనియర్ నేత, చేనేత కార్మిక సంఘ రాష్ట్ర నేత పముజుల దశరథరామయ్య (94) వయోభారం, అనారోగ్యంతో కన్నుమూశారు. అస్వస్థతకు శుక్రవారం గురికావడంతో ఆయన్ను నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నెల్లూరు రూరల్ మండలంలోని సౌత్మోపూరుకు చెందిన ఈయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. సీపీఐలో 70 ఏళ్లుగా ఉంటూ పార్టీ కోసం విశేష కృషి చేశారు. సౌత్మోపూరుకు 40 ఏళ్ల పాటు సర్పంచ్గా, నెల్లూరు రూరల్ ఎంపీపీగా, పార్టీ జిల్లా కార్యదర్శిగా పలు పదవుల్లో కొనసాగారు. కాగా ఈయన మృతిపై సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ, పార్టీ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, జాతీయ సభ్యుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, నేతలు హరినాథ్రెడ్డి, జంగాల అజయ్కుమార్, జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి తదితరులు సంతాపం తెలియజేశారు. -
సమగ్ర శిక్షలో సర్టిఫికేటుగాళ్లు
అంతులేని నిర్లక్ష్యం ● పలువురు సైట్ ఇంజినీర్లపై ఆరోపణలు ● విచారణ పేరుతో చర్యల్లో జాప్యం ● ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో వేతనాల రూపంలో ప్రజాధనం స్వాహా ఉదయగిరి: నెల్లూరులోని సమగ్ర శిక్ష కార్యాలయ పరిధిలో పలువురు ఉద్యోగులు ఫేక్ విద్యార్హత పత్రాలను సమర్పించి విధులను నిర్వర్తిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ విషయమై ఉన్నతాధికారులకు పలువురు ఫిర్యాదు చేయగా, విచారణ పేరుతో వారిని కాపాడుతూ వేతనాల రూపంలో రూ.కోట్ల మేర స్వాహా చేస్తున్నారని తెలుస్తోంది. వివాదాల ఛట్రంలో.. జిల్లా సమగ్ర శిక్షలో 14 మంది సైట్ ఇంజినీర్లు పనిచేస్తున్నారు. వీరిలో ఎనిమిది మంది నకిలీ విదార్హత పత్రాలతో విధుల్లో చేరారని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల్లో చేరిన వీరిలో కొందరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. వివిధ పనులను చేయకుండానే రూ.లక్షల్లో నిధులను మింగేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరిపై విజి లెన్స్ విచారణ ప్రస్తుతం జరుగుతోంది. కార్యాలయంలో జేటీఓగా విధులు నిర్వర్తిస్తున్న అహ్మద్ బాషా (సైట్ ఇంజినీర్) నకిలీ సర్టిఫికెట్తో ఉద్యోగంలో చేరారని, ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాలని కోరుతూ కలెక్టర్కు నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి గతేడాది డిసెంబర్లో ఫిర్యాదు చేశారు. అయినా నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. పంజాబ్లో పొందిన బీటెక్ సర్టిఫికెట్లో ఇక్కడ పనిచేస్తున్నారని, అయితే అది నకిలీదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అపాయింట్మెంట్ ఆర్డర్ సైతం నిబంధనల మేరకు లేదని తెలిపారు. మరికొన్ని ఉదాహరణలు.. ● సమగ్ర శిక్షలో సైట్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న రాయదుర్గం మహేశ్వరి (ప్రస్తుతం మానేశారు), దావులూరి రవి, అహ్మద్ బాషా, వేలూరి బలరామ్, మస్తానయ్య.. తప్పుడు విద్యార్హత పత్రాలతో డిప్లొమా ఇంజినీరింగ్తో ఉద్యోగాల్లో చేరారనే ఆరోపణలున్నాయి. పరిశీలన నిమిత్తం సర్టిఫికెట్లను వీరు చదువుకున్న నెల్లూరు పాలిటెక్నిక్ కళాశాలకు 2021లో అప్పటి ఏపీసీ పంపారు. అయితే అక్కడ్నుంచీ నేటికీ సమాధానం రాలేదని తెలుస్తోంది. ఈ ఉదంతంలో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారిందనే ఆరోపణలున్నాయి. ఆరోపణలను ఎదుర్కొంటున్న సైట్ ఇంజినీర్లపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టి ఉంటే ఈ కుంభకోణం జరిగి ఉండేది కాదు. సమగ్ర శిక్షలో తవ్వేకొద్దీ అనేక అక్రమాలు, అవినీతి వ్యవహారాలు వెలుగుచూస్తున్నా, చిన్నపాటి చర్యలకే పరిమితం కావడంపై దుమారం రేగుతోంది. కాగా ఈ అంశమై డీఈఓ బాలజీరావును సంప్రదించగా, ఏపీసీగా తాను ఇంకా బాధ్యతలను చేపట్టలేదని బదులిచ్చారు. -
పెద్దాస్పత్రిలో ఎక్స్రే సేవలకు విఘాతం
● డిజిటల్ రీడర్ దొంగలపాలు ● అవస్థలు పడుతున్న రోగులు ● సేవలను పునరుద్ధరించాలని డిమాండ్నెల్లూరు (అర్బన్): నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో డిజిటల్ ఎక్స్రేకు సంబంధించిన డిజిటల్ రీడర్ (డీఆర్)ను సుమారు రెండున్నర నెలల క్రితం దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో ఆ సేవలు రోగులకు అందడం లేదు. ఏకంగా డీఆర్ గదికి తాళం వేశారు. ఈ విషయమై దర్గామిట్ట పోలీస్స్టేషన్లో అధికారులు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటి వరకు పోలీసులు దొంగను పట్టుకునే ప్రయత్నం చేయలేదు. మాన్యువల్గా ఎక్స్రే సేవలు అందిస్తున్నప్పటికీ డిజిటల్ ఎక్స్రే సేవలు నిలిచిపోవడంతో ఆ విభాగంలో తీవ్ర రద్దీ ఏర్పడింది. దీంతో రోగులకు సకాలంలో సేవలు అందడం లేదు. 120 నుంచి 150 మంది వరకు.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో గత సంవత్సరమే వైద్యశాఖ అధికారులు డిజిటల్ ఎక్స్రే మెషీన్ను ఏర్పాటు చేశారు. ఇది నాణ్యమైన ఎక్స్రే సేవలను అందించే యంత్రం. జిల్లా వ్యాప్తంగా సర్వజన ఆస్పత్రికి (పెద్దాస్పత్రి) వచ్చే రోగులకు ఇది ఎంతగానో ఉపయోగపడేది. రోజుకు కనీసం 120 నుంచి 150 మంది వరకు ఎక్స్రేలు తీస్తుంటారు. డిజిటల్ మెషీన్తోపాటు మరో రెండు మాన్యువల్ ఎక్స్రే మెషీన్లు కూడా ఉన్నాయి. మాన్యువల్గా తీయాలంటే క్యాసెట్లు ఉండాలి. ఎక్స్రే తీసిన తర్వాత వాటిని మళ్లీ సాధారణ రీడర్లో ఉంచిన తర్వాతే చిత్రం కనిపిస్తుంది. ఇందువల్ల సమయం ఎక్కువ పడుతుంది. పైగా అంత నాణ్యత కూడా ఉండదు. డిజిటల్ ఎక్స్రేలో అయితే నాణ్యత మెరుగ్గా ఉంటుంది. ఫొటో తీసిన భాగాలు స్పష్టంగా కనిపిస్తాయి. క్యాసెట్లు కూడా అవసరం ఉండదు. కొత్తగా డిజిటల్ మెషీన్ను ఏర్పాటు చేసినప్పటికీ తక్కువ కాలంలోనే దానికి సంబంధించిన డీఆర్ దొంగతనానికి గురైంది. అది లేకపోతే ఎక్స్రే తీసినా చిత్రం కనిపించదు. దొంగలెవరో.. డిజిటల్ డీఆర్ అనేది చిన్న పరికరం. పెన్డ్రైవ్ కంటే కొద్దిగా పెద్దదిగా ఉంటుంది. దీని ఖరీదు కూడా సుమారు రూ.2 లక్షలు. డీఆర్ రూములో టెక్నీషియన్ మాత్రమే ఉంటారు. అయినప్పటికీ దొంగతనం జరిగింది. దీంతో అప్పటి నుంచి డిజిటల్ ఎక్స్రే సేవలు నిలిచిపోయాయి. చోరీ జరిగిన రోజు విధుల్లో ఉన్న వారిని పోలీసులు విచారించాల్సి ఉంది. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించాలి. అనుమానితులను ప్రశ్నించాలి. అయితే ఈ ప్రక్రియ సక్రమంగా జరగలేదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటి దొంగల పాత్ర ఏమైనా ఉందా అనే ప్రచా రం కూడా జరుగుతోంది. ఎవరో చేసిన తప్పునకు రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు పక్కాగా విచారణ జరిపి డీఆర్ను రికవరీ చేయించాలి. లేకుంటే కొత్త డీఆర్ను కొనుగోలు చేసి డిజిటల్ ఎక్స్రే సేవలను పునరుద్ధరించాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు. -
ఆర్టీసీ డిపోలను ప్రైవేటీకరించొద్దు
నెల్లూరు సిటీ: ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ తప్పదని మంత్రులు సంకేతాలు ఇవ్వడం సరికాదని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామా అంకయ్య అన్నారు. నెల్లూరులోని ఆర్టీసీ డిపో ఎదుట గురువారం నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రూ.300 కోట్ల విలువైన ఆర్టీసీ 2 డిపో ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం సరికాదన్నారు. కాలుష్యం పేరుతో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడాన్ని అందరూ స్వాగతిస్తున్నారని, అయితే వాటిని ప్రైవేట్ వ్యక్తులతో కాకుండా ఆర్టీసీ డ్రైవర్లతో నడిపించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు, నాయకులు సుధాకర్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు. -
పాస్పోర్టు సేవలను వేగవంతంగా అందించాలి
నెల్లూరు రూరల్: పాస్పోర్టు సేవలను ప్రజలకు మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు అధికారులు కృషి చేయాలని విజయవాడ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయాధికారి నందుల భూక్య సూచించారు. నగరంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో గల పాస్పోర్టు సేవా కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛాన్ని నెల్లూరు పోస్టల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సేవా కేంద్రంలో దరఖాస్తుల స్వీకరణ, పత్రాల ధ్రువీకరణ, బయోమెట్రిక్ నమోదు, అపాయింట్మెంట్ నిర్వహణ తదితరాలను పరిశీలించి.. ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్షించారు. ఈ సందర్భంగా నందుల భూక్య మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పాస్పోర్టు సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించడం అధికారుల బాధ్యతని చెప్పారు. దరఖాస్తుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, సమయపాలనతో సేవలందేలా అధికారులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు. -
బల్కర్లకు పగటిపూట నో ఎంట్రీ
ముత్తుకూరు(పొదలకూరు): రెండేళ్లుగా బూడిద బల్కర్ల కారణంగా నరకయాతన అనుభవిస్తున్న ముత్తుకూరు ప్రజలకు ఊరట లభించింది. నెల్లూరు – ముత్తుకూరు, ముత్తుకూరు – పంటపాళెం మార్గాల్లో పగటివేళల్లో బల్కర్ల రవాణాను పూర్తిగా నిలిపివేయాలని జరిగిన చర్చల్లో ట్రాన్స్పోర్టర్ల ప్రతినిధులు అంగీకరించారు. భారీ లోడుతో అధిక వేగంతో ఎలాంటి సమయ నియంత్రణ లేకుండా ఇష్టారాజ్యంగా తిరుగుతున్న బల్కర్లు రోడ్లపై బూడిద దుమ్ము వెదజల్లుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఇదే మార్గాల్లో జరిగిన ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరెందరో శాశ్వత వైకల్యానికి గురయ్యారు. బల్కర్ల రవాణాపై పరిమితులు విధించాలని, నిబంధనలు కఠినతరం చేయాలని కోరుతూ టీడీపీ, బీజేపీ నాయకులు రెండు రోజులుగా నిరసన చేపట్టారు. గురువారం నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్టర్ల ప్రతినిధులు, కూటమి నాయకుల మధ్య చర్చలు జరిగాయి. పగటిపూట బూడిద బల్కర్ల రవాణాను పూర్తిగా నిలిపివేయడానికి అంగీకరించారు. -
తల్లులకు తిప్పలు
గూడూరు: క్యూలో నిలవలేక అవస్థ ఆత్మకూరులోని పోస్టాఫీస్ వద్ద ఇలా.. తల్లికి వందనం పేరిట మాతృమూర్తుల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేసింది. ఈ మొత్తాన్ని డ్రా చేసే వారు కొందరైతే.. అసలు డబ్బు పడిందో లేదో తెలుసుకోవాలనే ఉద్దేశంతో బ్యాంకులు, పోస్టాఫీసుల వద్ద మహిళలు గురువారం బారులుదీరారు. కొన్ని చోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తడంతో నగదు ఉపసంహరణకు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఎండ తీవ్రత తట్టుకోలేక పలువురు ఇబ్బంది పడ్డారు. – ఆత్మకూరు / గూడూరు -
27 నుంచి క్రీడా పోటీలు : డీఎస్డీఓ
నెల్లూరు(టౌన్): జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని శాప్ ఆధ్వర్యంలో అమరావతి చాంపియన్షిప్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పాండు తెలిపారు. గురువారం నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం కాంప్లెక్స్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అండర్ 17, 23 విభాగాల్లో పురుషులు, మహిళలకు ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్బాల్, చెస్, హాకీ, కబడ్డీ, ఖోఖో, వెయిట్ లిఫ్టింగ్, వాలీబాల్, యోగా తదితర క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ఈనెల 27, 28 తేదీల్లో కోవూరు నియోజకవర్గానికి సంబంధించి పల్లిపాడులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, 29, 30 తేదీల్లో సర్వేపల్లి వారికి విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో, ఆత్మకూరు వారికి స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ఉదయగిరికి వింజమూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పోటీలు జరగనున్నాయి. 30, 31 తేదీల్లో కందుకూరుకు స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల, 31, వచ్చే నెల ఒకటో తేదీన కావలికి స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో, నెల్లూరు సిటీకి ఏసీ స్టేడియంలో, వచ్చే నెల 3, 4 తేదీల్లో నెల్లూరు రూరల్కు స్టేడియంలో పోటీలు జరుగుతాయని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని చెప్పారు. అండర్ 17 విభాగానికి 2009 ఆగస్ట్ 31 లేదా ఆ తర్వాత జన్మించిన వారు, అండర్ 23 విభాగానికి 2003 ఆగస్టు 31 లేదా ఆ తర్వాత జన్మించిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తిగల వారు క్రీడా యాప్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఆయా నియోజకవర్గాల్లో పోటీల నిర్వహణకు ముందస్తుగా రూ.5 వేల అడ్వాన్స్ మంజూరు చేయనున్నట్లు చెప్పారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం చార్జీల రాయితీ కల్పిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో సెట్నెల్ సీఈఓ నాగేశ్వరరావు, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి గురుప్రసాద్, ఎస్జీఎఫ్ గేమ్స్ కార్యదర్శి బీవీ రమణయ్య, ఎం.దేవిక తదితరులు పాల్గొన్నారు. -
పెద్దాస్పత్రిలో సీసీయూకు ఆధునిక పరికరాలు
నెల్లూరు(అర్బన్): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్ (సీసీయూ), పరికరాలకు రూ.25 కోట్లను ప్రభుత్వం గతంలో మంజూరు చేసింది. మూడంతస్తుల భవన పనులు కొన్ని నెలల క్రితమే పూర్తయ్యాయి. అయితే అందులో ఆపరేషన్ థియేటర్కు సంబంధించిన పరికరాలు, యంత్రాలు, మంచాలు, ర్యాకులు, కుర్చీలు, ఇతర పరికరాలను ప్రస్తుతం సరఫరా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఎక్విప్మెంట్ రెండు లారీల్లో వచ్చాయి. వీటిని నూతన క్రిటికల్ కేర్ భవనంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఎమర్జెన్సీ వార్డుతో పాటు గైనకాలజీ విభాగాన్ని వచ్చే నెల్లో ప్రారంభించనున్నారు. ఎస్సీ బాలుర హాస్టల్ వార్డెన్పై విచారణ వింజమూరు(ఉదయగిరి): స్థానిక సాంఘిక సంక్షేమ బాలుర వసతిగృహ వార్డెన్ భాస్కర్రావుపై ఆరోపణలొచ్చిన నేపథ్యంలో విచారణను ఐటీటీఏ పీఓ శ్రీనివాసరావు గురువారం జరిపారు. విద్యార్థులు, వార్డెన్ను వేర్వేరుగా విచారించి లిఖితపూర్వకంగా వివరాలను తీసుకున్నారు. అనంతరం రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వార్డెన్ వ్యవహరించిన తీరుపై విద్యార్థులు తెలియజేసిన పలు అంశాలను పరిశీలించారు. కొన్ని లోపాలను గుర్తించామని, సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నామని వెల్లడించారు. ఉదయగిరి ఏఎస్డబ్ల్యూఓ గీతాదేవి పాల్గొన్నారు. గురుకులంలో డీసీఓ తనిఖీలు వాకాడు: స్థానిక బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ గురుకులాన్ని తిరుపతి జిల్లా కోఆర్డినేటర్ ప్రభావతమ్మ గురువారం తనిఖీ చేశారు. విద్యతో పాటు మౌలిక వసతులపై ఆరాతీశారు. కోట నుంచి అదనంగా వచ్చిన 207 మంది విద్యార్థులతో పాఠశాలలో కనీస సౌకర్యాల్లేకపోవడంతో వారి తల్లిదండ్రులు చేసిన ఆరోపణలపై స్పందించారు. వసతులను త్వరలోనే కల్పించనున్నామని తెలిపారు. సరిపడా బాత్రూమ్లు, కొన్ని గదుల్లో ఫ్యాన్ల కొరత ఉందని, అదనపు గదులను ఏర్పాటు చేయనున్నామని వివరించారు. ఇన్చార్జి ప్రిన్సిపల్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. చికెన్ వ్యర్థాల లారీ పట్టివేత బుచ్చిరెడ్డిపాళెం: చేపల చెరువుల్లో ఆహారంగా వినియోగించేందుకు భారీ మొత్తంలో తరలిస్తున్న చికెన్ వ్యర్థాలను పోలీసులు గురువారం పట్టుకున్నారు. వివరాలు.. చికెన్ వ్యర్థాలను డ్రమ్ముల్లో నింపి లారీలో తరలిస్తున్నారనే సమాచారంతో జొన్నవాడ వద్ద తనిఖీలను ఎస్సై ఉమాశంకర్, సిబ్బందితో గురువారం రాత్రి నిర్వహించారు. ఓ లారీని ఆపి తనిఖీ చేయగా, అందులో 68 డ్రమ్ముల్లో చికెన్ వ్యర్థా లుండటాన్ని కనుగొన్నారు. లారీని సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ఓ ద్విచక్రవాహనాన్నీ స్వాధీనం చేసుకున్నారు. ఆరుగుర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
గ్రావెల్ కొల్లగొట్టి.. సొమ్ము చేసుకుంటూ..
● 50 ట్రాక్టర్లలో లేఅవుట్కు తరలింపు ● విలేకరులపై దౌర్జన్యం చేసిన టీడీపీ నేతలు ఆత్మకూరు: కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని జగనన్న కాలనీ సమీపంలో కొండను తవ్వి గ్రావెల్ను టిడ్కో గృహాల సమీపంలోని ఓ వెంచర్కు గురువారం అక్రమంగా తరలించారు. సుమారు 50 ట్రాక్టర్లలో 23వ వార్డు నెల్లూరుపాళేనికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఈ తంతు జరిగింది. కాగా నెల్లూరుపాళెంలోని టీడీపీకి చెందిన మరో వర్గం వారు ఆ ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురు విలేకరులు ఘటనా స్థలానికి చేరుకుని వీడియోలు తీస్తున్నారు. మాదాల హరీష్ నాయుడు, మాదాల విష్ణు నాయుడు అనే టీడీపీ నేతలు ఓ విలేకరిని అడ్డుకుని సెల్ఫోన్ను లాక్కున్నారు. అంతటితో ఆగకుండా రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారుల కు మామూళ్లిచ్చి వారి అనుమతితో గ్రావెల్ తరలిస్తున్నామని ఏమి చేసుకుంటారో, చేసుకోండంటూ బెదిరించారు. ఓ విలేకరిని నెట్టేయడంతో అతని చొక్కా చినిగింది. దీంతో పలువురు జర్నలిస్టులు ఎస్సై జంపాని కుమార్కు లిఖితపూర్వకంగా ఫిర్యా దు చేశారు. ఈ విషయం తెలుసుకున్న అక్రమ రవాణాదారులు ట్రాక్టర్లను గంటల వ్యవధిలో ఘటనా స్థలం నుంచి తీసుకెళ్లిపోయారు. ఉత్తరకాలువ గట్టు నుంచి.. కలిగిరి: కలిగిరి – కొండాపురం మార్గంలో చిన్నచెరువు సమీపంలో హెచ్పీ పెట్రోల్ బంక్ వెనుక ఉన్న సోమశిల ఉత్తరకాలువ గట్టు నుంచి అనుమతి లేకుండా గురువారం టిప్పర్ల ద్వారా గ్రావెల్ తరలించారు. ఈ విషయాన్ని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సోమశిల కెనాల్ ఏఈ మధుసూదన్ గ్రావెల్ తరలింపును నిలిపి వేస్తామని చెప్పినప్పటికీ ఆగలేదు. కలిగిరి చిన్నచెరువులో నుంచి కూడా రాత్రి టిప్పర్లు తిరిగాయి. కలిగిరి సమీపంలో మాగాణి పొలాలకు రోడ్డు వేయడానికి గ్రావెల్ను తరలిస్తున్నారు. -
పల్లె వీక్షణతో సమస్యలకు సత్వర పరిష్కారం
● కలెక్టర్ హిమాన్షు శుక్లా వెంకటాచలం: గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ.. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించడం పల్లె వీక్షణ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. వెంకటాచలంలో పల్లె వీక్షణ కార్యక్రమాన్ని వివిధ శాఖల అధికారులతో కలిసి గురువారం నిర్వహించారు. తొలుత వడ్డిపాళెంలో చేపడుతున్న వీబీజీ – రాంజీ ఉపాధి హామీ పనులను పరిశీలించి.. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి.. చిన్నారులతో ముచ్చటించి వారి అభ్యసన సామర్థ్యాలను పర్యవేక్షించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్య సేవలు, మౌలిక వసతులను తనిఖీ చేశారు. గతేడాది సంభవించిన తుఫాన్లతో దెబ్బతిన్న వీరన్న కనుపూరు చెరువులో రూ.47 లక్షలతో చేపట్టిన పునరుద్ధరణ పనులను పరిశీలించారు. పశుసంవర్థక శాఖ నిర్వహించిన కృత్రిమ గర్భధారణ ప్రత్యేక శిబిరాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం నిర్వహించిన గ్రామసభలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. నిర్ణీత గడువులోపు పరిష్కారం పల్లె వీక్షణలో అందిన ప్రతి అర్జీనీ ప్రత్యేక పోర్టల్లో నమోదు చేసి 30 రోజుల్లో పరిష్కరించేలా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను సీఎస్సార్ నిధులతో అభివృద్ధి చేస్తున్నామని.. పీడియాట్రీషియన్, జనరల్ వైద్యుల కొరతను తీర్చేందుకు చర్యలు చేపట్టనున్నామని ప్రకటించారు. జిల్లాలో శుక్రవారం నిర్వహించనున్న మెగా పీటీఎం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్థిరాస్తి వ్యాపారం మందగించడంతో దిక్కులేక
సర్కారీ కొలువు.. ఇది ఎంతో మంది ఆశ. దీన్ని ఎలాగైనా సాధించాలనే లక్ష్యంతో అహర్నిశలూ పాటుపడుతుంటారు. అయితే వీరిలో ఉద్యోగం లభించేది అతి కొద్ది మందికే. అలా దక్కించుకున్న కొందరు అత్యంత నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ విధులకు డుమ్మా కొడుతున్నారు. రోజులకే పరిమితం కాకుండా ఏకంగా ఏళ్ల తరబడి డ్యూటీలకు గైర్హాజరవు తూ.. ఇతర వ్యాపకాల్లో మునిగి తేలుతున్నారు. జాబ్ పేరు చెప్పుకొని రియల్ ఎస్టేట్.. ఇతర వ్యాపారాలను కొందరు చేస్తుండగా, మరికొందరు మద్యం మత్తులో ఉంటూ ఇలా వ్యవహరిస్తున్నారు. అక్కడితో ఆగిపోకుండా సంవత్సరాల తర్వాత వచ్చి తమను కొలువుల్లోకి తీసుకోవాలని అభ్యర్థిస్తున్నారు. జిల్లాలోని దాదాపు ప్రతి శాఖలో ఇదే పరిస్థితి నెలకొనడం విస్మయానికి గురిచేస్తోంది. పలుకుబడి ఉన్న కొందరు ఉద్యోగులు బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో పొలాలను కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. మద్యానికి బానిసలైన కొందరు అప్పులు చేసి, వాటిని తీర్చలేక ఎక్కడో తలదాచుకుంటున్నారు. కుటుంబకలహాల నేపథ్యంలో కొందరు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం రియల్ రంగం కుదేలవడంతో పలువురికి ఉద్యోగమనే విషయం ఉన్నట్లుండి గుర్తొచ్చింది. దీంతో అధికారులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఏది ఏమైనా ఇలాంటి వారిపై కఠిన చర్యలు చేపట్టకపోతే ఇదే దారిలో మరికొందరు నడిచే అవకాశం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వీరిపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగుల నిర్లక్ష్యం తారస్థాయికి చేరుకుంటోంది. ఏళ్ల తరబడి విధుల నుంచి అదృశ్యమై.. వ్యవస్థకే సవాల్ విసురుతున్నారు. ఆపై తీరిగ్గా వచ్చి.. వివిధ కారణాలను చూపి ఉన్నతాధికారులను మచ్చిక చేసుకొని విధుల్లోకి చేరుతున్నారు. అప్పటికై నా నిబద్ధతతో పనిచేస్తారానంటే అదీ లేదనే చెప్పొచ్చు. తమ పాత పంథానే కొనసాగిస్తూ, మరోసారి అదే బాట పడుతున్నారు. ఎంత వెనుకేద్దాం..! ప్రస్తుతం సర్కార్ కొలువులను సాధించడమే గగనంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్లను విడుదల చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతోంది. అయితే ఉద్యోగాలు చేస్తున్న వారు తమ విధులను గాలికొదిలి.. ఎంత సంపాదిద్దామాననే దిశగా ఆలోచిస్తున్నారు. విధులకు రాకుండా స్నేహితులతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కొందరు భారీగా సంపాదిస్తున్నారు. రెండు లగ్జరీ కార్లు.. నాలుగు భవంతులను నిర్మించి ఇక తమకు తిరుగులేదనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. అధికారుల అవసరాలను తీరుస్తూ తమ పనిని యథేచ్ఛగా కానిచ్చేస్తున్నారు. దాదాపు అన్ని శాఖల్లోనూ ఇంతే.. రెవెన్యూ, విద్య, వైద్యారోగ్య తదితర శాఖల్లో ఇదే తంతు నడుస్తోంది. ఒక్క రెవెన్యూలోనే సుమారు 60 మందికిపైగా వీఆర్వోలు, 15 మంది జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు తమ విధులకు ఏళ్లుగా హాజరుకావడంలేదు. నెల్లూరు రూరల్ మండలంలో వీఆర్వోలుగా పనిచేసిన ఇద్దరు దాదాపు ఆరేళ్లుగా తమ ఉద్యోగంవైపు కన్నెత్తి చూడటంలేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఇలా సాగిస్తున్నారు. తీరా తన పరిస్థితి బాగొలేదని.. ఈ కారణంతో విధులకు హాజరుకాలేకపోయానని మభ్యపెడుతూ.. కొలువొచ్చేలా చూడాలని కోరుతూ కలెక్టరేట్లోని అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిబంధనలకు తూట్లు వాస్తవానికి ప్రభుత్వోద్యోగులు ఒక్కరోజు సెలవుపై వెళ్లాలన్నా, సంబంధిత అధికారి అనుమతిని విధిగా పొందాలి. లీవ్ లెటర్పై ఆఫీసర్లు సంతకం చేశాకే సెలవు తీసుకోవాలి. అయితే ఈ ప్రక్రియేమీ లేకుండానే ఉద్యోగులు ఏళ్ల తరబడి కార్యాలయ ముఖం చూడటంలేదు. మరోవైపు రూల్స్ మేరకు ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఏడాది పాటు విధులకు గైర్హాజరైతే సర్వీస్ నుంచి పూర్తిగా తొలగించాలి. అయితే ఇలాంటివేవీ జిల్లాలో అమలు కావడంలేదు. పరిస్థితులను పరిశీలించి తిరిగి విధుల్లోకి తీసుకుంటుండటంతో వీరు ఆడిందే ఆట.. పాడిందే పాట అనే చందంగా వ్యవహారం మారింది. పత్తా లేకుండా పోతున్న ప్రభుత్వోద్యోగులు ఏళ్ల తరబడి విధులకు రారు ఆ తర్వాత కొలువు ఇవ్వాలని వేడుకోలు ఇదే కోవలో 60 మందికిపైగా వీఆర్వోలు జిల్లాలో ఇదీ దుస్థితి -
సమగ్ర విచారణ ఎప్పుడో..?
● నిధుల స్వాహాలో సైట్ ఇంజినీర్లపై చర్యలేవీ..? ● పూర్తి ఎంకై ్వరీ జరిగితే వెలుగులోకి తిమింగలాలు ఉదయగిరి: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జరిగిన పనుల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిలో కొందరిపై వేటుపడగా, మిగిలిన వారిపై చర్యల్లేకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. అన్ని పనులను సమగ్రంగా పరిశీలిస్తే, రూ.కోట్ల ప్రభుత్వ నిధులను దిగమింగిన తిమింగలాల బాగోతం బట్టబయలయ్యే అవకాశముంది. ఇందులో విధులు నిర్వర్తిస్తున్న పలువురు సైట్ ఇంజినీర్లు.. లేని పనులకు రికార్డులను తయారు చేసి ఫండ్స్ను పక్కదారి పట్టించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు చోట్ల వెలుగులోకి ఈ అవినీతి బాగోతం ఇప్పటికే పలు మండలాల్లో వెలుగులోకి వచ్చింది. ఉదయగిరి, దుత్తలూరు, వింజమూరు, దగదర్తి, కొడవలూరు, కోవూరు, నెల్లూరు రూరల్ తదితర మండలాల్లో జరిగిన వర్కుల్లో అక్రమాల అంశాలు బయటపడుతున్నాయి. ఈ వ్యవహారంలో సైట్ ఇంజినీర్లుగా పనిచేసిన బలరామ్, కృష్ణారెడ్డి, అహ్మద్బాషా, ప్రవీణ్కుమార్, రవీంద్ర, మల్లేశ్వరి ప్రమేయముందనే ప్రచారం జరుగుతోంది. తీగలాగితే కదిలిన డొంక సమగ్ర శిక్షలో జరిగిన అవినీతి అంతా ఇంతా కాదు. తీగ లాగితే డొంక కదిలిన చందంగా లోతుకెళ్లి కొద్దీ అవినీతి వెలుగుచూస్తోంది. వింజమూరు మండలం నల్లగొండ్ల, శంఖవరం మండల ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో ప్రహరీలను నిర్మించకుండానే నిధులను పక్కదారి పట్టించిన వైనంపై కథనాలను సాక్షి ప్రచురించింది. ఆ తర్వాత పలు మండలాల్లో ఇదే అంశాలు బట్టబయలయ్యాయి. ఈ క్రమంలోనే సమగ్ర శిక్షలో స్పిల్ ఓవర్ పనుల్లో అక్రమాలు వెల్లడయ్యాయి. ఉపాధ్యాయ శిక్షణ పేరుతో నిధులను భక్షించిన వైనంపై కథనాలను ప్రచురించారు. ప్రవీణ్కుమార్పై యాక్షనేదీ..? సమగ్ర శిక్షలో కోవూరులో సైట్ ఇంజినీర్గా విధులు నిర్వర్తిస్తున్న ప్రవీణ్కుమార్ పనులు చేయకుండానే బిల్లులను స్వాహా చేసే యత్నంలో తనకు సహకరించని ఉన్నత స్థాయి అధికారిపై చేయి చేసుకున్న ఉదంతంపై విచారణ జరిపి నివేదికను కలెక్టర్కు పీఆర్ ఎస్ఈ పంపారు. దీని ఆధారంగా సదరు వ్యక్తిపై చర్యలు చేపట్టారు. అయితే దీనికి సంబంధించిన ఆర్డర్ కాపీని కలెక్టర్ నుంచి తీసుకొని ప్రవీణ్కుమార్కు ఇవ్వకుండా ఏపీసీ మూడు నెలలు జాప్యం చేశారనే విషయం తాజాగా వెలుగుచూసింది. ఉదయగిరి: నెల్లూరులోని సమగ్ర శిక్ష కార్యాలయ కేంద్రంగా జరిగిన పనుల్లో అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న పలువురు ఆధికారులపై ఆ శాఖ రాష్ట్ర పీడీ శ్రీనివాసరావు కొరడా ఝళిపించారు. పనులు చేయకుండానే నిధులను స్వాహా చేయడం, పలు పనులకు ఫేక్ ఐడీలను సృష్టించడం తదితరాలపై ’తిలాపాపం.. తలా పిడికెడు’ అనే శీర్షికన సాక్షిలో కథనం ఈ నెల ఏడున ప్రచురితమైంది. ఈ వ్యవహారంలో ప్రమేయమున్న సమగ్ర శిక్ష అధికారి వెంకటసుబ్బయ్యను తక్షణమే మాతృ సంస్థకు సరెండర్ చేస్తూ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీసీగా ఏఫ్ఏసీ బాధ్యతలను డీఈఓ బాలజీరావుకు అప్పగించారు. కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్ను తక్షణమే మాతృ సంస్థకు బదిలీ చేశారు. టీసీఎస్ తరఫున విధులు నిర్వర్తిస్తూ అక్రమాలకు పాల్పడిన నేతాజీని ఉద్యోగం నుంచి తొలగిస్తూ క్రిమినల్ చర్యలకు సిఫార్సు చేశారు. జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రతి పనినీ పరిశీలించి, తేడాలను గుర్తించి ప్రమేయమున్న వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. -
పొగాకు రైతుల నిరసన
● గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ ● డీసీపల్లి వేలం కేంద్రంలో నిరవధిక ఆందోళన ప్రారంభం మర్రిపాడు: పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్తో మండలంలోని డీసీపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద నిరవధిక నిరసనను ఆంధ్రప్రదేశ్ రైతు, పొగాకు బోర్డు సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ప్రస్తుత ధరలతో కర్షకులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని కనీస గిట్టుబాటు ధరగా కిలోకు రూ.350ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. వేలంలో అమలవుతున్న నోబిడ్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు రూ.రెండు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని కోరారు. తిరస్కరించిన బేళ్ల కొనుగోలుకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు రైతుల ప్రయోజనాల పరిరక్షణలో టొబాకో బోర్డు ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవాలని పేర్కొన్నారు. డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. రైతు సంఘ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్రసాద్, జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీపతి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మర్రిపాడు కన్వీనర్ చెన్ను వెంకటేశ్వరరెడ్డి, చండ్రా నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. -
లారీ చక్రాల కింద నలిగిన ప్రాణం
బుచ్చిరెడ్డిపాళెం: పట్టణంలోని ముంబై జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు నుంచి ఆత్మకూరుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి వేణుగోపాల స్వామి ఆలయ సమీపంలో అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ అతడి తలపై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ శివరామకష్ణారెడ్డి తెలిపారు. మృతుడిని ఆత్మకూరు జేఆర్ పేటకు చెందిన అశోక్కుమార్ (35)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అశోక్ హెల్మెట్ పెట్టుకుని బైక్ నడుపుతున్నాడు. కానీ ప్రమాదం వల్ల అది పూర్తిగా నలిగిపోయింది. జేఆర్పేటలో విషాదం ఆత్మకూరు: కంభంశెట్టి అశోక్కుమార్ మృతితో జేఆర్పేటలో విషాదం నెలకొంది. అతను ఆత్మకూరులోని ఎస్ఎస్వీ కళాశాల కరస్పాండెంట్గా వ్య వహరిస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అశోక్ అందరితో కలివిడిగా ఉంటూ విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహించేవాడు. అతని మృతితో విద్యార్థులు, అధ్యాపకులు సంతాపం వ్యక్తం చేశారు. వ్యక్తి బలవన్మరణం కొండాపురం: మండలంలోని గొట్టిగుండాల ఎస్టీ కాలనీకి చెందిన రాపూరి అంజయ్య (52) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. అంజయ్య కొంతకాలంగా నెమ్ము సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. గురువారం ఉదయం అతను మద్యం తాగి ఇంటికి రాగా భార్య కోటేశ్వరమ్మ మందలించింది. దీంతో మనస్తాపం చెంది స్థానికంగా ఉన్న పంట పొలాల్లోకి వెళ్లి మద్యం తాగాడు. విష గుళికలు మింగి అకస్మారక స్థితికి చేరాడు. స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. వారు 108 అంబులెన్స్లో అంజయ్యను వింజమూరు హాస్పిటల్ తరలించారు. అప్పటికే చనిపోయినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కొండాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. మద్యం మత్తులో భార్య, అత్తపై దాడి కావలి రూరల్: ఓ వ్యక్తి మద్యం మత్తులో భార్య, అత్తపై దాడి చేశాడు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కావలి ముసునూరు శివయ్య రైస్మిల్లు సమీపంలో చలంచర్ల వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నివాసముంటున్నాడు. అతను అద్దె ఆటో నడుపుతుంటాడు. రోజూ మద్యం తాగి భార్య సుజాతను ఇబ్బంది పెట్టేవాడు. బుధవారం రాత్రి గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. గురువారం ఉదయం మద్యం తాగొచ్చి భార్యతో మళ్లీ గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ముందుగానే సిద్ధం చేసుకున్న కూరగాయలు కోసే కత్తితో సుజాత చేతులు, తలపై దాడి చేశాడు. ఆమె కేకలు వేయగా పక్క ఇంట్లో ఉన్న తల్లి రాధమ్మ వచ్చి అడ్డుపడింది. దీంతో వెంకటేశ్వర్లు రాధమ్మపై కూడా దాడి చేశాడు. రక్తగాయాలు కావడంతో ఇద్దరూ 108 అంబులెన్స్లో కావలి ఏరియా వైద్యశాలకు వెళ్లి చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఉపాధి పనులకెళ్లి.. ● తీవ్ర అస్వస్థతకు గురై కూలీ మృతి సీతారామపురం: మండలంలోని అయ్యవారిపల్లి గ్రామ వేపలవాగు సమీపాన కొత్త చెరువులో గురువారం పూడికతీత పనులకు వెళ్లిన షేక్ దాదాపీర్ (64) అనే ఉపాధి కూలీ తీవ్ర అస్వస్థతకు గురై మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు.. రోజూలానే దాదాపీర్ అందరితో కలిసి పనులకు వెళ్లాడు. అతను గునపంతో మట్టిని తవ్వుతూ తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలాడు. సహచర కూలీలు 108 అంబులెన్స్కు ఫోన్ చేయగా వాహనం వచ్చేలోపే చనిపోయాడు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు. -
‘ఎస్ఐఆర్’లో రాజకీయ పార్టీల సహకారం కీలకం
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరురూరల్: ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా కోరారు. బుధవారం నెల్లూరు కలెక్టరేట్లో డీఆర్వో విజయకుమార్తో కలిసి ఆయన గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 19,74,240 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వీరిలో 9,62,575 మంది పురుషులు, 10,11,452 మంది మహిళలు, 213 మంది ఇతరులు ఉన్నట్లు చెప్పారు. ఎస్ఐఆర్ ప్రీమ్యాపింగ్ ప్రక్రియలో ప్రారంభంలో 66 శాతం పూర్తవగా, ప్రస్తుతం 82.62 శాతానికి చేరిందన్నారు. ప్రస్తుతం 45,890 (2.32 శాతం) కేసులు మాత్రమే మ్యాపింగ్ కాలేదన్నారు. 2,44,874 (12.40 శాతం) ట్రేస్ కాని కేసులు ఉన్నాయని తెలిపారు. మ్యాపింగ్ కాని, ట్రేస్ కాని కేసులకు మాత్రమే సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు చెప్పారు. 80,405 మంది ఓటర్లు మరణించినట్లుగా గుర్తించామన్నారు. వీరికి సంబంధించి మరణ ధ్రువీకరణ పత్రం లేదా ఇతర ఆధారపత్రాలతో జాబితా నుంచి తొలగింపు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అలాగే 37,484 డూప్లికేట్, 67,384 గైర్హాజరు, 1,10,273 శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్లను గుర్తించామన్నారు. 24న బీఎల్వోలు, బీఎల్ఏలతో మరో సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. మ్యాపింగ్ స్థితి, అనామక కేసులు, ఇతర ఏఎస్డీడీ అంశాలపై చర్చిస్తామన్నారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బి.శ్రీరాం, బైరి శ్రీనివాస్, వై.రాజేష్, కె.శ్రీనివాసులు, టి.బాలసుధాకర్, వి.భువనేశ్వర ప్రసాద్, వి.సురేంద్రబాబు, ఎంవీ శేషయ్య పాల్గొన్నారు. -
విద్యాశాఖపై అయ్యోరి పెత్తనం
● ఏడాది తిరగకుండానే సైన్స్ అధికారి బదిలీ ● ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే కొత్త వ్యక్తికి డిప్యుటేషన్ ● మంత్రి నారాయణ ఒత్తిడితోనే అంతా.. ● గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త సిత్రాలు నెల్లూరు (టౌన్): వడ్డించే వ్యక్తి మనోడైతే బంతి చివర కూర్చున్నా, అన్ని సమకూరుతాయనే సామెత జిల్లా విద్యాశాఖకు చక్కగా సరిపోతుంది. ఎలాంటి ఆరోపణల్లేకపోయినా, ఏడాది తిరగకుండానే నిబంధనలకు విరుద్ధంగా జిల్లా సైన్స్ అధికారిని నియమించారు. మంత్రి నారాయణ ఒత్తిడితో ఆగమేఘాలపై ఇలా వ్యవహరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు తుంగలో.. వాస్తవానికి సైన్స్ అధికారి నియామకానికి గానూ నోటిఫికేషన్ను జిల్లా విద్యాశాఖ జారీ చేయాల్సి ఉంది. పాఠశాలలో సంబంధిత సబ్జెక్ట్కు రెండో టీచర్ ఉన్నప్పుడే జిల్లా సైన్స్ అధికారిగా డిప్యుటేషన్ వేయాలని నిబంధనలు తెలియజేస్తున్నాయి. అయితే ఇలాంటివేవీ లేకుండానే అనంతసాగరం మండలం జే కాలనీలోని జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మూర్తిని డిప్యుటేషన్పై నియమించారు. ఇంత హడావుడిగా మార్చడంపై జిల్లా విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తే, వారు నోరే మెదపడం లేదు. ఇదే అంశం విద్యాశాఖలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏడాదిలో ఎంతో మంచి పేరు విడవలూరు మండలం రామతీర్థం జెడ్పీ హైస్కూల్లో బయాలజీ టీచర్గా పనిచేస్తున్న శివారెడ్డిని జిల్లా సైన్స్ అధికారిగా డిప్యుటేషన్పై గతేడాది ఆగస్ట్ 14న నియమించారు. ఈయన వచ్చాక సైన్స్ కేంద్రాన్ని అభివృద్ధి చేశారని ఉపాధ్యాయులే చెప్తున్నారు. గడిచిన విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో జిల్లా సైన్స్ కేంద్రానికి ఉత్తమ అవార్డూ లభించింది. దాదాపు 17 వేల మందికిపైగా విద్యార్ధులు కేంద్రాన్ని సందర్శించారు. తిరుపతి. ప్రకాశం, బాపట్ల జిల్లాల నుంచీ స్టూడెంట్స్ వచ్చారు. ఈ పరిణామాల క్రమంలో విజయకుమార్ ట్రస్ట్ నుంచి కేంద్రానికి ఒక బస్సును ఉచితంగా అందజేశారు. దీని ద్వారా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి విద్యార్థులను రోజూ తీసుకొచ్చి అవగాహన కల్పిస్తున్నారు. అనుకున్నారు.. మార్చేశారు..! సాధారణంగా జిల్లా సైన్స్ అధికారిగా పనిచేస్తున్న వ్యక్తిపై అవినీతి ఆరోపణలు వస్తేనో.. లేదా రెండేళ్లు పూర్తి చేసుకున్నారనే కారణంతో బదిలీ చేస్తుంటారు. అయితే ఇలాంటివేవీ లేకుండానే మార్చేశారు. కాగా మూర్తి పనిచేస్తున్న జే కాలనీలోని స్కూల్లో రెండో టీచర్ లేరు. ఈ క్రమంలో అక్కడి విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. అమాత్యుడు పట్టుబట్టడంతోనే.. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఒత్తిడితోనే జిల్లా సైన్స్ అధికారిని మార్చారనే విమర్శలు విద్యాశాఖలో వినిపిస్తున్నాయి. మూర్తి నియామక విషయమై కలెక్టర్పై బాగా ప్రెజర్ చేశారని తెలుస్తోంది. ఈ తరుణంలో ఈ మేరకు డీఈఓను కలెక్టర్ ఆదేశించారని సమాచారం. మరోవైపు జిల్లా కేంద్రంలో నోడల్ అధికారిగా మూర్తి గతంలో పనిచేశారు. పాఠశాలకు సక్రమంగా వెళ్లారని.. జిల్లా కేంద్రానికే ఎక్కువ భాగం పరిమితమవుతారని ఉపాధ్యాయులే వ్యాఖ్యానిస్తుండటం విశేషం. ఇన్నేళ్లనే ఆర్డర్ ఉండదు జిల్లా సైన్స్ అధికారిగా డిప్యుటేషన్పై వచ్చిన వ్యక్తికి ఇన్నేళ్లనే ఆర్డరేమీ ఉండదు. ఎప్పుడైనా మార్చే అవకాశం ఉంటుంది. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే మార్పు చేశాం. – బాలాజీరావు, డీఈఓ తాను గతంలో అయ్యోరినేనంటూ ఎక్కడ అవకాశం లభిస్తే.. అక్కడ మంత్రి నారాయణ చెప్తుంటారు. ఇప్పటికీ అదే అనుకున్నారో.. ఏమో.. గానీ తాజాగా ఆయన పెత్తనం విద్యాశాఖపై పడింది. ఈ విమర్శలకు బలం చేకూరుస్తూ ఏకంగా సైన్స్ అధికారినే బదిలీ చేయించి.. నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్ను కల్పించడంలో ఆయన సఫలీకృతులయ్యారు. అనంతసాగరం మండలంలోని జే కాలనీలో ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్న జేవీఆర్ మూర్తిని ఈ స్థానంలో నియమించారు. ఈ పరిణామాల క్రమంలో సదరు స్కూల్లో పీఎస్ ఉపాధ్యాయుడే కరువయ్యారు. -
రీ సర్వేను వేగవంతం చేయండి
సంగం: జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళనకు అత్యంత ప్రాధాన్యమిస్తూ చేపట్టిన రీ సర్వే ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం సందర్శించిన ఆయన రీ సర్వే పురోగతిపై సమీక్షించారు. రికార్డులు, మ్యాపులు, సాంకేతిక వివరాలను పరిశీలించారు. పనుల్లో పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, పరిష్కార చర్యలపై వివరాలను ఆరాతీసిన అనంతరం ఆయన మాట్లాడారు. జిల్లాలోని 690 రెవెన్యూ గ్రామాల్లో రీ సర్వే దశల వారీగా సాగుతోందని చెప్పారు. 2024కు ముందు 314 గ్రామాల్లో పూర్తయిందని, మిగిలిన ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉందన్నారు. పూర్తయిన గ్రామాల రైతులకు పట్టాదారు పాస్పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని, వచ్చే నెల మొదటి వారానికి మరో విడత పూర్తి కానుందని వెల్లడించారు. సాంకేతిక పొరపాట్లు అక్కడక్కడా వెలుగుచూస్తున్నాయని, వీటిని వెంటనే సరిదిద్దేలా ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. తొలుత స్థానిక బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యత, రుచి, పరిశుభ్రతపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ సారంగపాణి, ఎంపీడీఓ షాలెట్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ట్రాన్స్పోర్టు కనెక్ట్ యాప్లో నమోదు చేయాలి నెల్లూరు (టౌన్): రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ మారిటైమ్ బోర్డు, యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ ఫేస్ ప్లాట్ఫామ్ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన ఏపీ ట్రాన్స్పోర్టు కనెక్ట్ యాప్లో వాహన యజమానుల వివరాలు నమోదు చేసుకోవాలని డీటీసీ చందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని లారీ యజమానులు, ట్రాన్స్పోర్టు ఆపరేటర్లు, ఫ్లీట్ ఓనర్లు, ఇతర రవాణా సంస్థలను ఒకే డిజిటల్ లాజిస్టిక్స్ వేదికపైకి తీసుకురావడమే లక్ష్యమని వివరించారు. జాతీయ లాజిస్టిక్స్ వ్యవస్థతో అనుసంధానమై రవాణా రంగంలో పారదర్శకత, వేగం, సౌలభ్యాన్ని పెంపొందించడమే దీని ఉద్దేశమన్నారు. ఏపీ ట్రాన్స్పోర్టు కనెక్ట్ యాప్లో లారీ నంబర్, ఓనరు పేరు, అడ్రస్, మొబైల్ నంబర్, డ్రైవరు పేరు తదితర వివరాలను నమోదు చేసుకోవడం ద్వార భవిష్యత్తులో డిజిటల్ సేవలు, వేగవంతమైన ధ్రువీకరణ, తక్కువ పేపర్ వర్క్, సులభమైన సమాచార మార్పిడి, విస్తృత వ్యాపార అవకాశాలను పొందేందుకు అవకాశం ఉంటుందన్నారు. జిల్లాలోని లారీ యజమానులు, ట్రాన్స్పోర్టు సంస్థలు, ఫ్లీట్ ఓనర్లు, అన్ని రంగాల వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు transportconnect. ap.gov.inను సంప్రదించాలని సూచించారు.నేటి నుంచి ఐటీఐ రెండో విడత ప్రవేశాలు నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో రెండో విడత ప్రవేశాల కోసం గురువారం నుంచి వచ్చే మూడులోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కన్వీనర్ శ్రీధర్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్న ఐటీఐలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను వచ్చే నెల నాలుగున చేయించుకోవాలని కోరారు. ప్రభుత్వ ఐటీఐలో ఆరున.. ప్రైవేట్ ఐటీఐల్లో కౌన్సెలింగ్కు ఎనిమిదిన హాజరుకావాలని కోరారు. వివరాలకు సమీపంలోని ప్రభుత్వ కళాశాలను సంప్రదించాలని సూచించారు. -
అస్వస్థతలోనూ అప్రమత్తమై..
● అనారోగ్యానికి గురైన డ్రైవర్ ● రోడ్డు పక్కన బస్సు నిలిపివేత ● 45 మంది ప్రయాణికుల క్షేమంసంగం: మండలంలోని సంగం సమీపంలో ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్ అప్రమత్తమవడంతో ఘోర ప్రమాదం తప్పింది. వివరాలిలా ఉన్నాయి. బుధవారం పామూరు నుంచి 45 మంది ప్రయాణికులతో నెల్లూరుకు ఆర్టీసీ బస్సు వస్తోంది. డ్రైవర్ త్రిమోటి ప్రయాణ మధ్యలో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. అతను స్టీరింగ్పై వాలిపోయేలోపు బస్సును రోడ్డు పక్కకు సురక్షితంగా నిలిపివేశాడు. ప్రయాణికులు వెంటనే డ్రైవర్ను సంగం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించగా ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని తెలిపారు. డ్రైవర్ కర్తవ్యదీక్షతో వ్యవహరించడంతో 45 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. కండక్టర్ ప్రత్యామ్నాయ బస్సును ఏర్పాటు చేయగా, ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. -
సమస్యల పరిష్కారానికి సీజీఆర్ఎఫ్ను ఆశ్రయించండి
● చైర్మన్, రిటైర్డ్ జస్టిస్ శ్రీనివాస ఆంజనేయమూర్తినెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ సమస్యలు అధికారుల వద్ద పరిష్కారం కాకపోతే సీజీఆర్ఎఫ్ను ఆశ్రయించాలని చైర్మన్, రిటైర్డ్ జస్టిస్ శ్రీనివాస ఆంజనేయమూర్తి కోరారు. బుధవారం ఆయన నెల్లూరుకు విచ్చేశారు. విద్యుత్ భవన్లోని గెస్ట్హౌస్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యుత్ వినియోగదారులు ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. నూతన సర్వీసులు, ట్రాన్స్ఫార్మర్లు, మీటర్లలో లోపాలు, మార్పు, లోడ్ పెంపు, తగ్గింపు, కేటగిరీల మార్పు, బిల్లుల్లో లోపాలు లాంటి సమస్యలకు పరిష్కారం లభించకపోతే సీజీఆర్ఎఫ్ను సంప్రదించాలని కోరారు. అంతకుముందు ఫిర్యాదులను సెక్షన్ కార్యాలయం, ఏఈ, ఏడీఈ, ఈఈ స్థాయి అధికారుల వద్ద నమోదు చేయాలని సూచించారు. ప్రత్యక్షంగా, పోస్ట్కార్డు, వాట్సాప్, ఏపీఎస్పీడీసీఎల్ వెబ్సైట్లోని పోర్టల్ ద్వారా కూడా సమస్యలు చెప్పొచ్చన్నారు. 2023 నుంచి ఈ ఏడాది జూన్ వరకు 1,291 ఫిర్యాదులు అందగా 1,234 ఫిర్యాదులను పరిష్కరించినట్లు తెలిపారు. వివరాలకు 0877 – 2284118, 94408 12154 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. సమావేశంలో సభ్యులు మధుకుమార్, శ్రీనివాసబాబు, జిల్లా ఎస్ఈ రాఘవేంద్రం, ఈఈలు శ్రీధర్, ప్రసాద్, డీఈఈ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టుల రక్షణకు జేపీఎఫ్ ఆవిర్భావం
నెల్లూరు రూరల్: జిల్లాలో పాత్రికేయులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు, వేధింపులను ఎదుర్కొనేందుకు గానూ జర్నలిస్ట్ ప్రొటెక్షన్ ఫోర్స్ పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. నగరంలోని కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో గల ఓ హోటల్లో బుధవారం నిర్వహించిన సమావేశంలో జిల్లా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా స్టాఫ్ రిపోర్టర్లు హాజరై ఈ నిర్ణయం తీసుకున్నారు. కమిటీ గౌరవాధ్యక్షుడిగా డెక్కన్ క్రానికల్ కరస్పాండెంట్ రాజశేఖర్, కన్వీనర్గా ఛానల్ – 9 ఎండీ జయరాజు, కో కన్వీనర్లుగా విశాలాంధ్ర బ్యూరో దయాశంకర్, హెచ్ఎంటీవీ బ్యూరో ఇనన్చార్జి నరసింహులు, 99 టీవీ బ్యూరో ఇన్చార్జి మురళీకృష్ణ, వార్త జిల్లా ఇనన్చార్జి నరేంద్ర, ఎన్ – 3 ఛానల్ ఎండీ సునీల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభ్యులుగా టీవీ 9కు చెందిన మురళి, ప్రజాశక్తి బాలకృష్ణ, సాక్షి మస్తానన్రెడ్డి, ఆంధ్రప్రభ వెంకటేశ్వర్లు, ఈటీవీ రాజారావు, ఆర్టీవీ గయాజ్, సీవీఆర్ న్యూస్ రమేష్, ఏబీఎన్ మహేష్, టీవీ 5 రాజేష్, మహాన్యూస్ దినకర్, ఆంధ్రజ్యోతి అమర్, వీ 6 ఖాజా, 10 టీవీ దేవ, ప్రైమ్ 9 నరేష్, జీటీవీ మునీంద్ర, బీఆర్కే మల్లికార్జున్, ఎన్టీవీ వెంకటనారాయణ, బిగ్ టీవీ సురేంద్ర, స్వతంత్ర టీవీ మల్లి, సాక్షి టీవీ లోకేశ్, ఇండియన్ ఎక్స్ప్రెస్ సురేంద్ర, ఐ న్యూస్ సాగర్ నియమితులయ్యారు. నెల్లూరులో ఆత్మహత్యకు పాల్పడిన జర్నలిస్ట్ దినేష్కు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి.. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేశారు. -
ఎలక్ట్రిక్ కారు ఢీకొని స్కూటీ దగ్ధం
● జంగాలకండ్రిగ వద్ద రోడ్డు ప్రమాదం ● ఇద్దరికి తీవ్ర గాయాలు ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని జంగాలకండ్రిగ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. నెల్లూరు నుంచి ముత్తుకూరు వైపు వస్తున్న ఓ ఎలక్ట్రిక్ కారు ముత్తుకూరు వెళ్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టింది. అదుపు తప్పిన కారు రోడ్డుపక్కన ఉన్న ఆటోను ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కారు ఢీకొన్న వెంటనే స్కూటీలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు స్పందించి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నాయుడుపేట మండలం యాకసిరి గ్రామానికి చెందిన పూండ్ల పవన్కుమార్, స్కూటీపై ప్రయాణిస్తున్న నార్తురాజుపాళెం సమీపంలోని రామన్నపాళేనికి చెందిన ఉదయగిరి కృష్ణయ్య తీవ్ర గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ సిబ్బంది నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు వివరాలు తెలియాల్సి ఉంది. ఆక్వా మందుల దుకాణంలో తనిఖీలు ● రూ.లక్ష జరిమానా ఇందుకూరుపేట: మత్స్య శాఖ అధికారులు మండలంలోని కుడితిపాళెంలో ఆక్వా దుకాణంలో బుధవారం తనిఖీలు చేపట్టారు. సీఏఏ అనుమతుల్లేని నాలుగు రకాల మందులను గుర్తించి రూ.లక్ష జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆ శాఖ ఏడీ చాన్బాషా, ఎఫ్డీఓ సురేష్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా గుర్తింపు లేని మందులను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆక్వా రైతులు మందులను పరిశీలించి సక్రమంగా ఉంటేనే వాటిని వినియోగించుకోవాలన్నారు. లేకుంటే నష్టాలు పాలవుతారని వాపోయారు. వ్యక్తి అనుమానాస్పద మృతి చిల్లకూరు: మండలంలోని తిప్పగుంటపాళెం గ్రామంలో ఓ వ్యక్తి బుధవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. తిప్పగుంటపాళెం సమీపంలో ఉన్న రొయ్యల గుంతలను విజయవాడకు చెందిన సుబ్బారావు అనే వ్యక్తి లీజుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. వాటి వద్ద స్థానిక గిరిజన కాలనీకి చెందిన రాపూరు వెంకటేశ్వర్లు (42) కాపలాగా ఉంటున్నాడు. ఏమైందో తెలియదు గానీ అతను గుంతల వద్ద పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికంగా ఉన్నవారు గుర్తించి తాగిన మందును కక్కించి ఇంటికి పంపారు. అయితే కాసేపటికి వెంకటేశ్వర్లు మృతిచెందాడు. దీనిపై గిరిజన కాలనీవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.60 సన్నవి : రూ.30 పండ్లు : రూ.15 -
పేరు మహిళలది..పెత్తనం డీలర్లది
నెల్లూరు(పొగతోట): జిల్లాలో ఖాళీగా ఉన్న చౌకదుకాణాల నిర్వహణలో నిబంధనలు అమలు కావడం లేదన్న విమర్శలున్నాయి. డీలర్లు లేని వాటిని స్వయం సహాయక సంఘాల (పొదుపు మహిళల) పేరుతో కేటాయించినప్పటికీ, వాస్తవానికి వాటిని మాజీ డీలర్లు లేదా ఇతరులే నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో సుమారు 160కిపైగా రేషన్ షాపులు డీలర్లు లేక ఖాళీగా ఉన్నాయి. రాజీనామాలు, 6ఏ కేసులు తదితర కారణాలతో ఖాళీ అయిన వాటిని తాత్కాలికంగా స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. నిబంధనల ప్రకారం మూడు నెలల్లో కొత్త డీలర్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉన్నప్పటికీ, ఏళ్లుగా ఆ ప్రక్రియ చేపట్టలేదు. నెల్లూరు, కావలి, గూడూరు తదితర ప్రాంతాల్లో ఒకే డీలర్ మూడు నుంచి ఐదు వరకు షాపులను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నెల్లూరులో ఓ వ్యక్తి ఆధ్వర్యంలో ఏకంగా ఎనిమిది దుకాణాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసినా రెవెన్యూ, సివిల్ సప్లయీస్ అధికారులు పట్టించుకోవడం లేదు. నెలనెలా లంచాలు తీసుకుని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రిజైన్ చేసిన చౌకదుదకాణాల వివరాలు ఆర్డీఓ వద్ద ఉంటాయి. వారు పరిశీలించి నోటిఫికేషన్లు ఇవ్వాలి. కానీ సంవత్సరాల తరబడి ఇలా జరగడం లేదు. అక్రమాలెన్నో.. ఖాళీలను భర్తీ చేయకపోవడంతో రేషన్ పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు అవకాశం ఏర్పడుతోంది. కొన్ని చౌకదుకాణాల్లో రేషన్ను లబ్ధిదారులకు పూర్తిగా పంపిణీ చేయకుండా, కార్డుదారుల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని మాఫియాకు, రైస్మిల్లులకు, హోటళ్లకు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కార్డుదారుల నుంచి కిలో సుమారు రూ.12కు కొనుగోలు చేసిన బియ్యాన్ని హోటళ్లకు రూ.22కు, మాఫియాకు సుమారు రూ.17కు విక్రయిస్తున్నట్లు సమాచారం. జిల్లాలో మొత్తం 1,513 చౌకదుకాణాలు ఉండగా, ప్రతినెలా సుమారు 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ అవుతోంది. ఇంత పెద్ద వ్యవస్థపై పర్యవేక్షణ లోపిస్తోందనే విమర్శలున్నాయి. 5వ తేదీకే నో స్టాక్ నిబంధనల ప్రకారం ప్రతినెలా సాధారణ కార్డుదారులకు 1 నుంచి 15వ తేదీ వరకు చౌకదుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేయాలి. 26 నుంచి 31వ తేదీ వరకు దివ్యాంగులు, వృద్ధులకు ఇంటి వద్ద అందజేయాలి. అయితే పోర్టబిలిటీ పేరుతో కొందరు డీలర్లు నెలలో 4 లేదా 5వ తేదీకే దుకాణాల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారని విమర్శలున్నాయి. రేషన్ కోసం వెళ్లిన వారికి బియ్యం అయిపోయింది.. వచ్చే నెల తీసుకోండని వెనక్కి పంపుతున్నారు. 26 నుంచి 31వ తేదీ వరకు దివ్యాంగులు, వృద్ధులకు మాత్రమే బియ్యం ఇంటి వద్ద ఇవ్వాల్సి ఉంది. డీలర్లు వారికి కాకుండా బోగస్ కార్డులకు పంపిణీ చేస్తున్నారు. పోర్టబిలిటీ విధానాన్ని దుర్వినియోగం చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలున్నాయి. వీఆర్ఏలు, స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొన్ని చౌకదుకాణాల్లో రేషన్ పంపిణీ అస్తవ్యస్తంగా సాగుతోంది. దీనిపై రెవెన్యూ, సివిల్ సప్లైస్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, ఖాళీ డీలర్ పోస్టులను భర్తీ చేయాలని కార్డుదారులు కోరుతున్నారు. చౌకదుకాణాలపై పర్యవేక్షణ కరువు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం డీలర్లకు వరం జిల్లాలో 160కి పైగా దుకాణాలు ఖాళీ పోర్టబిలిటీ పేరుతో అక్రమాలు పక్కదారి పడుతున్న పేదల బియ్యం -
మాతృశాఖకు సరెండర్
నెల్లూరు (టౌన్): సమగ్రశిక్షలో జరిగిన అవినీతిపై ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. వింజమూరు, దుత్తలూరు ప్రాంతాల్లోని పాఠశాలల్లో ప్రహరీలను ఉపాధి హామీ నిధులతో నిర్మించి నాడు – నేడు కింద డ్రా చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో విజిలెన్స్ విచారణకు కలెక్టర్ ఆదేశించారు. ఎంకై ్వరీ అనంతరం నివేదికను అందజేశారు. దీంతో సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, సూపరింటెండెంట్ అశోక్ను మాతృశాఖకు సరెండర్ చేస్తూ ఉత్తర్వులను ఆ శాఖ ఎస్పీడీ శ్రీనివాసులు జారీ చేశారు. వెంకటసుబ్బయ్యను హయ్యర్ ఎడ్యుకేషన్కు.. అశోక్ను విద్యాశాఖ ఆర్జేడీకి గురువారం రిపోర్టు చేయాల్సిందిగా అందులో పేర్కొన్నారు. టీసీఎస్ ప్రతినిధిగా పనిచేస్తున్న నేతాజీని తొలగించారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయి.. శిలాతోరణం వద్దకు క్యూ చేరుకుంది. స్వామివారిని 82,105 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 34,484 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.17 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టిక్కెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
గిరిజన బిడ్డల ఆకలి కేకలు
● ఉపాధ్యాయుడు రాక మూతబడిన పాఠశాల చిల్లకూరు: తమ పిల్లలను బడికి పంపితే మధ్యాహ్నం ఓ ముద్ద బువ్వైనా తింటారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు వదిలెళ్తుంటారు. అయితే పాఠశాలకు సకాలంలో రావాల్సిన అయ్యోర్లు.. అందుకు విరుద్ధంగా వ్యవహరించడంతో చిన్నారులకు ఆకలి కేకలు తప్పడం లేదు. ఇలాంటి ఘటనే గూడూరు రూరల్ పరిధిలోని కుందకూరు గిరిజన కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. డిప్యుటేషన్పై రోజుకొకరు.. గిరిజన కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి నుంచి డిప్యుటేషన్పై రోజుకొకర్ని విద్యాశాఖ పంపుతోంది. ఈ క్రమంలో ఒకరికి ఆదేశాలివ్వాల్సిన అధికారులు, అందుకు భిన్నంగా మరొకరికి ఇవ్వడంతో ఆయన బడికే వెళ్లలేదు. దీంతో బడి తెరుచుకోకపోవడంతో ఉన్న ఆరుగురు గిరిజన పిల్లలు ఆకలితో అలమటించిపోయారు. అటకెక్కుతున్న చదువులు మారుమూల ఉన్న గిరిజన కాలనీలోని పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తున్నారు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ అంశమై గూడూరు ఎంఈఓ మాధవరావును సంప్రదించగా, డిప్యుటేషన్ పంపే విషయంలో కొద్దిగా మార్పులు చోటుచేసుకోవడంతో పొరపాటు జరిగిందని, ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని బదులిచ్చారు. -
జ్యుడీషియల్ విచారణకు డిమాండ్
నెల్లూరురూరల్: మనుబోలు పోలీస్స్టేషన్లో దళిత యువకుడు ఏడుకొండలు కస్టడీలో మృతిచెందిన ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పందిటి కామరాజు డిమాండ్ చేశారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆ ఘటన జరిగి రోజులు గడిచినా ఇప్పటివరకు బాధ్యులపై శాఖాపరమైన లేదా క్రిమినల్ చర్యలు తీసుకోలేదన్నారు. పోలీస్ కస్టడీలో దళితుడు మృతిచెందడం అత్యంత దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. తెలుగుదేశం నాయకులు చేస్తున్న ఆరోపణలను ఖండించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారున్నారు. కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు అనేకం జరుగుతున్నాయని ఇది దారుణమన్నారు. సమావేశంలో ఎస్సీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ దొంతాల రఘు, సర్వేపల్లి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పాముల శ్రీనివాసులు, నెల్లూరు సిటీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాహుల్, ఇంకా బద్దేపూడి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.


