breaking news
SPSR Nellore District News
-
కార్తీక మాసంలో ప్రత్యేక బస్సుల ఏర్పాటు
నెల్లూరు సిటీ: కార్తీక మాసం సందర్భంగా దైవక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. నెల్లూరులోని ప్రధాన బస్టాండ్లో గురువారం అధికారులు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్–1 జి.వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ ప్యాకేజీలో సూపర్ లగ్జరీ బస్సులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. యాగంటి, మహానంది, శ్రీశైలంకు ప్రధాన బస్టాండ్ నుంచి ఈనెల 25, 26, నవంబర్ 1, 2, 4, 7, 8, 9, 15, 16 తేదీల్లో రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరుతుందన్నారు. టికెట్ ధర రూ.1,800 అని చెప్పారు. అరుణాచలానికి ఆయా తేదీల్లో రాత్రి 9:30 గంటలు బస్సు ప్రారంభవుతుందన్నారు. టికెట్ ధర రూ.1,200గా నిర్ణయించారన్నారు. అమరావతిలోని అమరారామం, భీమవరంలోని సోమేశ్వరరామం, పాలకొల్లులోని క్షీరారామం, ద్రాక్షారామంలోని భీమేశ్వరారామం, సామర్లకోటలోని కొమరారామం ప్రాంతాలకు ఆయా తేదీల్లో రాత్రి 9 గంటలకు బస్సు బయలుదేరుతుందున్నారు. ధర రూ.2,500 అని చెప్పారు. శ్రీశైలం దర్శనానికి ఈనెల 22వ తేదీ నుంచి నవంబర్ 18వ తేదీ వరకు రోజు రాత్రి 8:30 నిమిషాలకు లగ్జరీ బస్సు నడుతున్నట్లు తెలిపారు. టికెట్ ధర రూ.670 అన్నారు. వివరాలకు 99592 25653, 0861 – 2323333, 94921 92238, 99592 25641 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు. -
కాంట్రాక్ట్ రద్దు చేయాలని ఆదేశం
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలోని జొన్నవాడ కామాక్షితాయి ఆలయం వద్దకెళ్లే వాహ నాల నుంచి అక్రమ వసూళ్లపై బుచ్చిరెడ్డిపాళెం ఇన్చార్జి ఎంపీడీఓ మంజులమ్మ తనిఖీలు చేప ట్టారు. గురువారం సాక్షిలో ‘జొన్నవాడలో అనధికార వసూళ్లు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో ఆలయం వద్ద తనిఖీ చేపట్టామని ఆమె తెలిపారు. తన వాహనానికి కూడా పంచాయతీ ముద్ర, ఎలాంటి సంతకం లేకుండా రసీదు ఇచ్చినట్లు చెప్పారు. కనీసం వాహన నంబర్ కూడా నమోదు చేయడం లేదన్నారు. నగదు వసూలు చేస్తున్న సదరు వ్యక్తుల కాంట్రాక్ట్ రద్దు చేయాలని జొన్నవాడ పంచాయతీ సెక్రటరీ కావేరిని ఆదేశించారు. వారి దగ్గర ఉన్న రసీదులను స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా వసూళ్లకు పాల్పడితే సహించబోమన్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. -
సివిల్ సప్లయ్స్లో బదిలీలు
● నెల్లూరు ఏఎస్ఓగా వాణి నెల్లూరు(పొగతోట): పేదల బియ్యం అక్రమ రవాణాలో కూటమి నేతల మధ్య గొడవలకు అధికారులు బలయ్యారు. పౌరసరఫరాల శాఖకు సంబంధించిన నెల్లూరు ఏఎస్ఓ అంకయ్యను అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు.. కావలి ఏఎస్ఓ రవికుమార్ను అన్నమయ్య జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులను ఆ శాఖ కమిషనర్ గురువారం జారీ చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న వాణిని నెల్లూరు ఏఎస్ఓగా నియమించారు. డీఎస్ఓ విజయ్కుమార్ను మాతృశాఖ రెవెన్యూ కు బదిలీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సివిల్ సప్లయ్స్ డీఎం అర్జున్రావును ఇన్చార్జి డీఎస్ఓగా నియమించే అవకాశం ఉందని సమాచారం. 10.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు నెల్లూరు(అర్బన్): జిల్లాలోని కొన్ని మండలాల్లో భారీ వర్షాలు గురువారం నమోదయ్యాయి. ఉదయం 8.30 నుంచి సాయంత్రం ఐదులోపు సరాసరి వర్షపాతం 10.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. పొదలకూరు మండలంలో అత్యధికంగా 66.8.. అనుమసముద్రంపేటలో అత్యల్పంగా ఒక మిల్లీమీటర్ వర్షం కురిసింది. బోగోలులో 58.4, బుచ్చిరెడ్డిపాళెంలో 40.2, చేజర్లలో 37.4, కావలిలో 29.2, కలువాయిలో 25, ఆత్మకూరులో 22.2, అల్లూరులో 15.6, వింజమూరులో 15.2, సైదాపురంలో 14.2, దగదర్తిలో 13.6, కందుకూరులో 8, కొడవలూరులో 7.4, వరికుంటపాడులో 6.2, దుత్తలూరులో 4.8, జలదంకి, సంగంలో 4.4, మర్రిపాడులో 4, ఉలవపాడులో 3.6, అనంతసాగరంలో 2.2, ఉదయగిరిలో 1.8, నెల్లూరు రూరల్, విడవలూరులో 1.2 మిల్లీమీటర్ల వర్షం పడింది. నేటి నుంచి యథావిధిగా విద్యాసంస్థలు నెల్లూరు రూరల్: జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, అంగన్వాడీ పాఠశాలలు శుక్రవారం నుంచి యథావిధిగా పనిచేయనున్నాయని కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విషయాన్ని గమనించాలని కోరారు. పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం నెల్లూరు (టౌన్): పల్లిపాడులోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థలో ఉపన్యాసకుల పోస్టులకు డిప్యుటేషన్పై పనిచేసేందుకు ఐదేళ్ల అనుభవం కలిగిన స్కూల్ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని డీఈఓ బాలాజీరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సీనియర్ లెక్చరర్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ – 1.. లెక్చరర్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్.. 1, లెక్చరర్ ఇన్ తెలుగు.. 1, లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్.. 1.. లెక్చరర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ – 1.. లెక్చరర్ ఇన్ ఇంగ్లిష్ – 1, సీనియర్ లెక్చరర్ ఇన్ ఈవీఎస్ – 1, లెక్చరర్ ఇన్ సోషల్ స్టడీస్ – 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. నోటిఫికేషన్లో పొందుపర్చిన గూగుల్ ఫారం ద్వారా ఆన్లైన్లో ఈ నెల 29లోపు సమర్పించాలని కోరారు. ఆఫ్లైన్ అప్లికేషన్లను పల్లిపాడు డైట్ కళాశాల ప్రిన్సిపల్కు అందజేయాలని కోరారు. లిఖిత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఉపన్యాసకులను ఎంపిక చేయనున్నామని, వివరాలకు 94404 58428 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
పొంగుతున్న వాగులు
● వర్షాలు తగ్గుముఖం నెల్లూరు(అర్బన్): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వాయువ్య దిశగా పయనిస్తుండటంతో జిల్లాపై ఉన్న తీవ్ర ప్రభావం తగ్గింది. జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి వర్షాలు దాదాపుగా ఆగిపోయాయి. అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. అయితే గురువారం సాయంత్రం నుంచి పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు ప్రారంభమయ్యాయి. బొగ్గేరు, సంగం వద్ద ఉన్న బీరాపేరు పొంగి ప్రవహిస్తున్నాయి. సోమశిల నుంచి విడుదల చేసిన నీటితో పాటు స్థానికంగా కురిసిన వర్షాలతో పెన్నాలో ప్రవాహం పెరిగింది. పలుచోట్ల చెరువులు నిండి కలుజులు ప్రవహిస్తున్నాయి. అనంతసాగరం, చేజర్ల, కందుకూరు తదితర ప్రాంతాల్లో కోతకొచ్చిన వరి పంట నీటిలో నానుతోంది. చిప్పలేరు, పిల్లాపేరు, మిడత వాగు, పైడేరు, పంబలేరు, కొమ్మలేరు, చేజర్ల నల్లవాగు తదితర ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తోంది. లింగసముద్రం మండలంలోని రాళ్లపాడు ప్రాజెక్ట్కు వరదనీరు పెద్ద ఎత్తున చేరుతోంది. పలు ప్రాంతాల్లోని లోతట్టు కాలనీలు నీటిలో నానుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వర్షాలు తగ్గుముఖం పట్టినా ముప్పు ఇంకా తొలగలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా కోరారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపిందన్నారు. అత్యవసరమైతే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 0861 – 2331261, 79955 76699 నంబర్లను 24 గంటల పాటు ఎప్పుడైనా సంప్రదించి సాయం పొందవచ్చని తెలిపారు. -
డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ధర్నా
నెల్లూరు(అర్బన్): ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న డాక్టర్ల సమస్యల ను పరిష్కరించేంత వర కు పోరాటం ఆగదని ఏపీ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్ల సంఘ జిల్లా అధ్యక్షుడు అమరేంద్రనాథ్రెడ్డి స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని పీహెచ్సీల్లో వైద్యసేవలను ఆపేసి వైద్యులు చేపట్టిన సమ్మె గురువారంతో 19వ రోజుకు చేరుకుంది. నగరంలోని డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. 20 నుంచి 25 ఏళ్లుగా ఎలాంటి ఉద్యోగోన్నతుల్లేకుండా ఒకే హోదాలో పనిచేస్తున్న డాక్టర్లకు టైమ్బౌండ్ ప్రమోషన్లను ఇవ్వాలని కోరారు. ఇన్ సర్వీస్ పీజీ కోటా పునరుద్ధరణ.. నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరు.. గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులకు 50 శాతం మూలవేతనాన్ని గిరిజన భత్యంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు రవీంద్రరెడ్డి, టాగూర్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ల ఆవిష్కరణ
నెల్లూరు(స్టోన్హౌస్పేట): మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 28న చేపట్టనున్న ప్రజా ఉద్యమం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను పార్టీ నేతలు గురువారం ఆవిష్కరించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు సీఎం చంద్రబాబు అప్పనంగా కట్టబెట్టడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రైవేట్కు అప్పగిస్తున్నామంటూ వాటిని మంత్రులు, ఎమ్మెల్యేలకు కారు చౌకగా విక్రయిస్తున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేశానని చెప్పుకొనే చంద్రబాబు.. రాష్ట్రానికి ఇప్పటివరకు ఒక్క మెడికల్ కళాశాలనూ తీసుకురాలేకపోయారని విమర్శించారు. పది మెడికల్ కళాశాలలను పూర్తి చేయాలంటే రూ.4800 కోట్ల ఖర్చవుతుందని.. రూ.మూడు లక్షల కోట్ల బడ్జెట్ గల రాష్ట్రంలో ప్రజారోగ్యానికి ఈ మొత్తాన్ని ఖర్చు చేయలేరానని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గానికి 60 వేల సంతకాలను సేకరించాలని ఆయన ఆదేశిస్తే.. లక్ష సంతకాలను చేపట్టే దిశగా కార్యక్రమాన్ని చేపడుతున్నామని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో తమ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలను ఈ నెల 28న చేపట్టి తహసీల్దార్, ఆర్డీఓ, డీఆర్వో కార్యాలయాల్లో అధికారులకు వినతిపత్రాలను అందజేయనున్నామని ప్రకటించారు. నిరసనలను ఉధృతం చేయాలి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలను మరింత ఉధృతం చేయనున్నామని పార్టీ రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత పేర్కొన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నా, పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం ముందుకెళ్లడం దారుణమన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు వైద్య విద్యనందించాలనే లక్ష్యంతో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు జగనన్న సంకల్పించారని వివరించారు. అయితే కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, తమ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ధ్వజమెత్తారు. తాము చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ఊహించని మద్దతు లభిస్తోందని వివరించారు. ప్రజా ఉద్యమం ర్యాలీకి భారీగా తరలిరావాలని కోరారు. చంద్రబాబు నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఎమ్మెల్సీ, పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ పేర్కొన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. అనంతరం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి మాట్లాడారు. ప్రజల అభిప్రాయాలు గవర్నర్కు తెలియజేసేలా, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ పేరుతో జరుగుతున్న దోపిడీని అడ్డుకునేలా ఒక ఉద్యమంతో సంతకాల సేకరణను చేపట్టామని వివరించారు. -
హోటల్లో పేకాటపై పోలీసుల సీరియస్
● హెడ్కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు ● కృష్ణసింగ్పై కఠిన చర్యలకు రంగం సిద్ధం?నెల్లూరు(క్రైమ్): నెల్లూరు శోధన్ నగర్లోని యష్పార్క్ హోటల్ గదిలో బుధవారం గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 18 మందిని పోలీసుల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జూదమాడిన వారిలో ఉన్న విడవలూరు హెడ్కానిస్టేబుల్ జీకేఎస్ పుల్లారెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఎస్పీ అజిత గురువారం ఉత్తర్వులు జారీచేశారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. కృష్ణసింగ్పై పీడీ యాక్ట్? ఇదిలా ఉండగా పట్టుబడిన వారిలో బెట్టింగ్ డాన్ కృష్ణసింగ్ ఉన్నాడు. అతనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే కృష్ణసింగ్పై జిల్లాలో పలు కేసులు ఉండగా దర్గామిట్ట పోలీసుస్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది. పలుమార్లు పోలీసులు అతడిని అరెస్ట్ చేసినా తీరులో మార్పురాలేదు. చిన్నబజారు పోలీస్స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పేకాటాడుతూ నెలరోజుల వ్యవధిలో రెండుసార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఆరాతీశారు. సస్పెక్ట్ షీట్ ఈ స్టేషన్కు ట్రాన్స్ఫర్ కానుంది. త్వరలో అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మేనేజర్పై కేసు జూద నిర్వాహకుడికి సహకరించిన హోటల్ మేనేజర్పై చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. నెల్లూరు నగరానికి చెందిన దేమునాయుడు వ్యసనాలకు బానిసయ్యాడు. వాటిని తీర్చుకునేందుకు సరిపడా నగదు కోసం అతను స్నేహితులతో కలిసి పేకాటాడుతూ ఆర్థికంగా నష్టపోయాడు. ఎలాగైనా నగదు సంపాదించాలని నిర్ణయించుకుని యష్ పార్క్ హోటల్ మేనేజర్ రత్నంతో పరిచయం చేసుకున్నాడు. హోటల్లో పేకాటకు అనుమతిస్తే కమీషన్ కింద రూ.2 వేలు ఇచ్చేలా మేనేజర్తో ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం దేమునాయుడు తన స్నేహితులు, పరిచయస్తులతో హోటల్లో పేకాటాడిస్తున్నాడు. బుధవారం పోలీసులు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా మేనేజర్ పాత్ర వెలుగులోకి వచ్చింది. దీంతో అతడిని అరెస్ట్ చేశారు. -
మొరాయిస్తున్న గేట్లు
● ప్రవహిస్తున్న వరద జలాలు ● కండలేరు కాలువ షట్టర్లు దించేందుకు అధికారుల యత్నం ● కానరాని ప్రయోజనం సోమశిల: సోమశిల నుంచి కండలేరుకు జలాలను సరఫరా చేసే వరద కాలువ పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రాజెక్ట్ దక్షిణ భాగంలో ఉన్న వరద కాలువ గేట్ల లీకేజీని అరికట్టేందుకు ఎన్ని యత్నాలు చేస్తున్నా, ఫలితం కానరావడంలేదని తెలుస్తోంది. కాలువకు మూడు గేట్లుండగా, రెండోది మరమ్మతులకు గురై మొరాయించింది. మిగిలిన 1, 3 ద్వారా కండలేరు జలాశయానికి నీటిని సరఫరా చేస్తున్నారు. ఇది పూర్తి సామర్థ్యానికి చేరుకోనున్న తరుణంలో ఇక నీటి సరఫరాను నిలిపేయాలనే అధికారుల ఆదేశాలతో 1, 3 గేట్లను దించే యత్నాలు చేపట్టారు. ఒకటో నంబర్ గేట్కు జాకీలు పెట్టి దించేందుకు యత్నించగా, ఒక అడుగులో ఇరుక్కుపోయింది. మూడో నంబర్ గేట్ను దించే పనులను గురువారం ప్రారంభించారు. ఇది పూర్తిగా దిగకపోతే భారీ స్థాయిలో వరద జలాలు లీకేజీ రూపంలో ప్రవహిస్తూనే ఉంటాయని పలువురు పేర్కొంటున్నారు. 20,960 క్యూసెక్కుల ఇన్ఫ్లో సోమశిల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల దృష్ట్యా జలాశయానికి 20,960 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. 69.442 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 7, 8, 9వ క్రస్ట్ గేట్ల నుంచి పెన్నాకు 42,460.. కండలేరు కాలువకు 560.. ఉత్తర కాలువకు 50 క్యూసెక్కుల మేర విడుదల చేస్తున్నారు. 99.408 మీటర్ల నీటిమట్టం నమోదైంది.దించేందుకు యత్నిస్తున్నాం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గేట్లను దించేందుకు కొన్ని రోజులుగా పనులు చేస్తున్నాం. ఒకటో నంబర్ గేట్ను సాధ్యమైనంత వరకు దించారు. మూడో నంబర్ గేట్ పనులను ప్రారంభించాం. త్వరలో పూర్తి చేసి నీటి లీకేజీని అరికట్టేందుకు యత్నిస్తాం. కాలువ ద్వారా 560 క్యూసెక్కులు ప్రస్తుతం విడుదలవుతున్నాయి. – శరత్, జేఈఈ, కండలేరు కాలువ -
1,580 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు
కోవూరు: జిల్లాకు 2,600 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినట్లు జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి తెలిపారు. గురువారం పడుగుపాడు రైల్వే స్టేషన్కు యూరియా బస్తాలు చేరుకోగా ఆమె వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు 1,580 మెట్రిక్ టన్నులు, తిరుపతి జిల్లాకు 1,020 మెట్రిక్ టన్నులు కేటాయించారన్నారు. కార్యక్రమంలో కోవూరు సహాయ వ్యవసాయ సంచాలకురాలు అనిత, మండల వ్యవసాయాధికారిణి టి.రజని, సహాయ వ్యవసాయాధికారి నర్సారావు, సిబ్బంది పాల్గొన్నారు. కత్తితో బెదిరించి నగదు దోపిడీ నెల్లూరు(క్రైమ్): ఓ వ్యక్తిని కత్తితో బెదిరించి నగదు దోచుకెళ్లిన ఘటన నెల్లూరు మెక్లిన్స్రోడ్డులో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కోటమిట్ట మెక్లిన్స్రోడ్డులో హయత్బాషా అనే దివ్యాంగుడు నివాసముంటున్నాడు. గురువారం అతను సైకిల్పై తన అన్న గౌస్బాషా ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో మినీఫంక్షన్ హాల్ వద్ద రౌడీషీటర్ సుల్తాన్ అతడిని అడ్డుకుని రూ.వెయ్యి నగదు ఇవ్వాలని లేకుంటే చంపుతామని కత్తితో బెదిరించాడు. భయపడిన హయత్బాషా తన వద్దనున్న రూ.500లు సుల్తాన్కు ఇచ్చాడు. దీంతో నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాధితుడు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.విద్యుత్ తీగలు తెగిపడి గేదె మృతి మనుబోలు: విద్యుదాఘాతానికి గురై గేదె మృతిచెందిన ఘటన మండలంలోని కొండూరుసత్రం పొలాల్లో గురువారం జరిగింది. వర్షాలు, ఈదురుగాలులకు పొలాల్లో విద్యుత్ స్తంభం ఒరిగిపోయింది. తీగలు తెగి అడ్డదిడ్డంగా పొలంలో పడిపోయాయి. యళ్లంబాక నందకుమార్ అనే రైతుకు చెందిన గేదె అటుగా వెళ్లగా విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురై చనిపోయింది. దీంతో సుమారు రూ.80 వేల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు చెప్పారు. బాధిత రైతును ఆదుకోవాలని ఉప సర్పంచ్ ఆవుల తులసీరామ్ కోరారు. రాళ్లపాడు ప్రాజెక్ట్కు వరద ప్రవాహం లింగసముద్రం: వర్షాలకు రాళ్లపాడు ప్రాజెక్ట్లో నీటిమట్టం గురువారం సాయంత్రానికి 16.5 అడుగులకు చేరింది. ఉప్పుటేరు, పిల్లాపేరుల నుంచి 1,000 క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రాజెక్ట్కు చేరుతున్నట్లు డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయకట్టుకు కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తామని డీఈ చెప్పారు.ప్రైవేట్ ఫైనాన్స్ సిబ్బంది వేధింపులు ● పురుగు మందు తాగిన వ్యక్తి ● చికిత్స పొందుతూ మృతి మనుబోలు: ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సిబ్బంది వేధింపులతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. గురువారం పోలీసులు వివరాలు వెల్లడించారు. మండలంలోని పిడూరుమిట్టకు చెందిన ఈగా సాయి (32) ప్రైవేట్ ఫైనాన్స్లో ఇల్లు తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు. ఇటీవల ఆ సిబ్బంది నగదు చెల్లించాలంటూ ఒత్తిడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈనెల 14వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు గుర్తించి నెల్లూరులోని ప్రభుత్వత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. -
వైఎస్సార్సీపీ నేతలపై కూటమి కక్ష సాధింపు
వెంకటాచలం: కూటమి ప్రభు త్వం వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో డీసీఎంఎస్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు గురువారం వెంకటాచలం మండలంలోని చెముడుగుంట వద్దనున్న జిల్లా సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ప్రసన్న ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చలపతిరావుపై అక్రమంగా కేసులు మోపిందన్నారు. కోర్టు బెయిల్ ఇవ్వడంతో 33 రోజుల తర్వాత చలపతిరావు విడుదలైనట్లు చెప్పారు. చలపతికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. -
పోలీసుల తీరుపై అనుమానాలు
సాక్షి నెట్వర్క్: గుడ్లూరు మండలం దారకానిపాడుకు చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు అనే కాపు యువకుడ్ని ఈ నెల రెండున హతమార్చారు. అదే గ్రామానికి చెందిన కాకర్ల హరిచంద్రప్రసాద్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తన సోదరులైన పవన్, భార్గవనాయుడితో కలిసి దసరా రోజున బైక్పై వస్తుండగా, హరిచంద్రప్రసాద్ తన కారుతో ఢీకొన్నారు. ఘటనలో లక్ష్మీనాయుడు అక్కడికక్కడే మరణించగా.. పవన్, భార్గవనాయుడు తీవ్రంగా గాయపడి గుంటూరులోని హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని హత్య కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఇందులో భాగంగా హరిచంద్రప్రసాద్తో పాటు సహకరించిన తండ్రి మాధవరావును అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. రెచ్చగొట్టిన వారిపై చర్యలేవీ..? హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఇద్దరు మహిళలను నిందితులుగా నేటికీ చేర్చలేదు. హరిచంద్రప్రసాద్ తీసుకెళ్లిన కారులోనే అతని భార్య, నానమ్మ కూడా ఉన్నారనేది ప్రత్యక్ష సాక్షుల కథనం. కారుతో ఢీకొన్నాక కిందపడిన వారిపై ఇనుపరాడ్తో దాడి చేస్తుంటే వీరిద్దరూ రెచ్చగొట్టి ప్రోత్సహించారని క్షతగాత్రులు పవన్, భార్గవనాయుడు సైతం చెప్తున్నారు. అయితే వీరిద్దర్ని మాత్రం నిందితులుగా చేర్చలేదు. లక్ష్మీనాయుడు బైక్పై వస్తున్న సమాచారాన్ని హరిచంద్రప్రసాద్కు గ్రామానికి చెందిన యువకులే ఫోన్లో తెలియజేశారని, ఈ విషయంలో ముగ్గురు కీలకపాత్ర పోషించారని మృతుడి భార్య సుజాత అనేక సందర్భాల్లో ఆరోపించారు. దాడి అనంతరం హరిచంద్రప్రసాద్తో పాటు ఆయనతో ఉన్న ఇద్దరు మహిళలు బైక్లపై దారకానిపాడులోకి వెళ్లారు. అసలు వీరిని బైక్లపై గ్రామంలోకి ఎవరు తీసుకెళ్లారనేదీ ప్రశ్నే. ఇలాంటి ఎన్నో కీలక అంశాలను ఈ కేసులో వదిలేశారు. కేవలం ఇద్దర్ని మాత్రమే అరెస్ట్ చూపించి కేసును క్లోజ్ చేసేందుకు పోలీసులు యత్నించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమాధానం కరువు లక్ష్మీనాయుడు హత్యను రాష్ట్ర వ్యాప్తంగా కాపు సంఘాలు, కాపు నేతలు తీవ్రంగా పరిగణించాయి. కేసులోని లోపాలపై అటు పోలీసులు, ఇటు ప్రభుత్వాన్ని వారు నిలదీస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కావడంతో పక్కా పథకం ప్రకారం కేసును నీరుగార్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసులో కాపు నేతలు లేవనెత్తుతున్న ఏ ఒక్క ప్రశ్నకూ పోలీసుల నుంచి సమాధానం రావడం లేదు. ఒత్తిడి తెచ్చిన ఆ నేత ఎవరు..? గుడ్లూరు పోలీసులపై అధికార పార్టీకి చెందిన కీలక నేత ఒత్తిడి చేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. గుడ్లూరు మండల బాధ్యతలు చూస్తున్న సదరు నేత సూచనలకు అనుగుణంగా ఖాకీలు నడుచుకున్నారని, ఇందులో భాగంగానే కేసును నీరుగార్చేందుకు యత్నించారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. చిన్న దొంగతనం కేసులో సైతం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించే వారు.. ఈ దారుణహత్యకు సంబంధించిన కేసులో ఇలా వ్యవహరించకుండా.. కేసు వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే కాపు సంఘాల ఎంట్రీతో సీన్ రివర్స్ అయింది. ఈ కేసు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా మారడంతో ఖాకీలు పది రోజులుగా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, మిగిలిన నిందితులను గుర్తిస్తామంటూ తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. ఏదేమైనా అధికార పార్టీ నేతల మెప్పు కోసం యత్నించి చివరికి ఇరుక్కుపోయామనే భావన పోలీస్ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. ఘటన స్థలంలోనే మృతి చెందిన లక్ష్మీనాయుడు హత్యకు ఉపయోగించిన కారు కాపు యువకుడి హత్య కేసు దర్యాప్తులో గుడ్లూరు ఖాకీల తీరిదీ.. ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న మహిళలు, సహకరించిన వారిని కావాలనే వదిలేశారా..? నిందితుడు హరిచంద్రప్రసాద్, అతని తండ్రిని మాత్రమే అరెస్ట్ చూపించిన వైనం ఇప్పటికీ బహిర్గతం కాని వాస్తవాలు అధికార పార్టీ నేతల ఒత్తిడే కారణమా..? గుడ్లూరు మండలం దారకానిపాడులో జరిగిన కాపు యువకుడు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్యోదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో పోలీసులు వ్యవహరించిన తీరే ఇందుకు కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. అధికార పార్టీ నేతల సూచనలకు అనుగుణంగా పక్కా ప్రణాళిక ప్రకారం కేసును నీరుగార్చే యత్నం జరిగిందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న మహిళలను అరెస్ట్ చేయకపోవడం.. నిందితుడికి అన్ని విధాలా సహకరించిన మరికొందర్ని వదిలేయడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. అయితే ఖాకీలు మాత్రం ఘటన జరిగిన వెంటనే స్పందించామని, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామని చెప్తూనే, కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలపడం గమనార్హం. -
అమ్మకు కన్నీటి వీడ్కోలు
● గుండెపోటుతో మృతిచెందిన తల్లి ● అంత్యక్రియలు చేసిన కుమార్తె సంగం: రాత్రి తల్లీకూతురు భోజనం చేసి నిద్రపోయారు. ఉదయానికి తల్లి మృతిచెందింది. తనను అల్లారుముద్దుగా చూసుకుంటున్న అమ్మ చనిపోవడంతో కుమార్తె కన్నీరుమున్నీరుగా రోదిస్తూ అంత్యక్రియలు చేసింది. స్థానికుల కథనం మేరకు.. మండల కేంద్రమైన సంగం నిమ్మతోపు సెంటర్కు చెందిన పెరుమాళ్ల గోపీ, ఆదిలక్ష్మి (45) దంపతులకు వెన్నెల, భార్గవి అనే ఇద్దరు కుమార్తెలున్నారు. కొన్నేళ్ల క్రితం కరోనాతో గోపీ మృతిచెందాడు. ఆదిలక్ష్మి కూలీ పనులకు వెళ్తూ పిల్లలను చూసుకుంంది. రెండు సంవత్సరాల క్రితం పెద్ద కుమార్తె వెన్నెలకు వివాహం చేసింది. కొంతకాలం క్రితం గేదెలు కొనుగోలు చేసి పాలు పోస్తోంది. భార్గవి తల్లి వద్ద ఉంటూ 9వ తరగతి చదువుతోంది. మంగళవారం రాత్రి తల్లీకుమార్తె ఇంట్లో నిద్రపోయారు. బుధవారం ఉదయం భార్గవి ఆదిలక్ష్మిని నిద్ర లేపేందుకు ప్రయత్నించింది. అయితే ఆమె చనిపోయింది. ఈ విషయాన్ని అక్క, బావ వినోద్కు చెప్పింది. బాలిక తల్లికి అంత్యక్రియలు నిర్వహించింది. ఆదిలక్ష్మి గుండెపోటుతో చనిపోయి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. -
మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేయొద్దు
● ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి ఉదయగిరి: ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేయొద్దు. అలా జరిగితే పేద రోగులకు వైద్యం అందదు’ అని వైఎస్సార్సీపీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి అన్నారు. మర్రిపాడు మండలం బ్రహ్మణపల్లిలోని తన నివాసంలో బుధవారం కోటి సంతకాల సేకరణ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టించలేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో కరోనా వంటి విపత్తు ఎదుర్కొని 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేయించి పనులు ప్రారంభించారు. నేటి ప్రభుత్వ పెద్దలు కాలేజీలను ప్రైవేటీకరించి ఆస్తులను తమ అనుచరులకు అప్పనంగా దోచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని విరమించుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలతోపాటు ఉద్యోగులను కూడా మోసం చేసిందన్నారు. ఒక డీఏ ఇస్తున్నట్లు ప్రకటించి, దానికి కూడా సవాలక్ష షరతులు పెట్టారన్నారు. పాత బకాయిలు, పీఆర్సీ విషయం మాట్లాడొద్దని చెప్పడం చూస్తే ఉద్యోగులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తేటతెల్లమవుతుందన్నారు. కార్యక్రమంలో పలు మండలాల కన్వీనర్లు రేవునూరి శ్రీనివాసరెడ్డి, కాటం రవీంద్రరెడ్డి, ఎం.తిరుపతినాయుడు, ఇస్కా మదన్, కొండా రాజగోపాల్రెడ్డి, చిమ్మిలి రవీంద్ర, మాజీ ఏఎంసీ చైర్మన్ షేక్ అలీ అహ్మద్, మాగంటి సిద్ధయ్య, మల్లికార్జునరెడ్డి, ముడియాల మరళీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వెంగమాంబ ఆలయాభివృద్ధికి చర్యలు
● మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దుత్తలూరు: నర్రవాడలోని వెంగమాంబ ఆలయాన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. బుధవారం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో కలిసి ఆయన వెంగమాంబ పేరంటాలు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం దేవదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, శాశ్వత కట్టడాలు తదితర నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లను పరిశీలించారు. ఇంజినీర్లు, స్థపతులు వీటిని నిర్మాణాలకు రూ.10 కోట్ల అంచనా వేసినట్లు ఆయన వివరించారు. రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులు ఆలయ పరిసరాల్లోని స్థలాలను సర్వే చేసి నివేదిక అందించాలన్నారు. కార్యక్రమంలో నేతలు కంభం విజయరామిరెడ్డి, చెంచలబాబు యాదవ్, దేవదాయ శాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ అజాద్, అసిస్టెంట్ కమిషనర్ జనార్దనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముంచెత్తిన వాన
పెన్నానదిలో వరద నీరు జిల్లాను వాన వీడలేదు. బుధవారం కూడా ముంచెత్తింది. దీంతో జనజీవనం స్తంభించింది. మండలాల్లోని పలు గ్రామాల్లో చెరువులు నిండాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. అసలే అధ్వానంగా ఉన్న రోడ్లపై వర్షపునీరు నిలిచి దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. అనేక ప్రాంతాల్లో రహదారులు ఛిద్రమయ్యాయి. పంట పొలాలు ముంపునకు గురై చెరువులను తలపిస్తున్నాయి. ఎడతెరపిలేని వర్షంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. – సాక్షి నెట్వర్క్ -
జొన్నవాడలో అనధికార వసూళ్లు
● పట్టించుకోని అధికారులు బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలోని జొన్నవాడ కామాక్షితాయి ఆలయం వద్దకు వాహనాలు వెళ్లాలంటే గ్రామ పంచాయతీకి రుసుము చెల్లించాలి. కారుకు రూ.50, ఆటోకు రూ.20, లారీకి రూ.100 ఇలా వసూలు చేస్తున్నారు. అయితే రసీదుపై పంచాయతీ సిబ్బంది సంతకం, కార్యాలయ అధికార ముద్ర ఉండదు. వాహనాల నంబర్ కూడా నమోదు చేయడం లేదు. పార్కింగ్ ఎక్కడో చూపించరు. సమాధానం చెప్పేవారు కరువయ్యారు. రసీదుపై మీ వాహనాలకు, వస్తువులకు మేము జవాబుదారీతనం కాదు, మాకు ఎలాంటి సంబంధం ఉండదు, కాంట్రాక్టర్ అని ఉంటుంది. ఆ కాంట్రాక్టర్ ఎవరు?, ఫోన్ నంబర్ వివరాలేవీ ఉండవు. భక్తుల నుంచి కేవలం నగదు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. -
స్వగ్రామానికి వెళ్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి, కుమారుడికి గాయాలు మనుబోలు: తల్లీకుమారుడు బైక్పై స్వగ్రామానికి వెళ్తున్నారు. రోడ్డు ప్రమాదంలో తల్లి మరణించగా కొడుకు గాయపడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని కాగితాలపూరు క్రాస్రోడ్డు వద్ద బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కాగితాలపూరు గ్రామంలో కొండూరు వెంకటేశ్వర్లు, సుప్రజ (40) దంపతులు నివాసముంటున్నారు. వీరికి రాకేష్ అనే కుమారుడున్నాడు. సుప్రజ తన అమ్మ ఊరైన గొట్లపాళేనికి రాకేష్తో బైక్పై వెళ్లింది. తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. క్రాస్రోడ్డు వద్ద హైవే దాటుతుండగా గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీకొనడంతో సుప్రజ అక్కడికక్కడే మృతిచెందింది. రాకేష్కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
హౌసింగ్ సామగ్రి అప్పగింత
ఉదయగిరి: పట్టణంలోని హౌసింగ్ గోదాము షట్టర్ తాళాలను అధికారుల సమక్షంలో పగలగొట్టి సిమెంట్, స్టీలు తదితర సామగ్రిని బుధవారం ఇన్చార్జి ఏఈ షరీఫ్కు అప్పగించినట్లు ఇన్చార్జి డీఈఈ పీరాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏఈ రామకృష్ణను ఇటీవల సస్పెండ్ చేశారన్నారు. ఆయన చార్జ్ అప్పగించలేదన్నారు. దీంతో రెవెన్యూ, పోలీసు, పంచాయతీ శాఖల అధికారులు, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో తాళాలు పగలగొట్టడం జరిగిందన్నారు. 10 బస్తాల సిమెంట్, 14 బాక్సుల ఫ్యాన్లు, 2,566 గడ్డ కట్టిన సిమెంట్ బస్తాలు, 10 ఎంఎం 597, 8 ఎంఎం 883 ఇనుప చువ్వలను ఇన్చార్జి ఏఈకి అప్పగించామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ కరిముల్లా, వీఆర్వో మాలకొండయ్య, వర్క్ ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్షణక్షణం టెన్షన్
పొదలకూరు : కండలేరు జలాశయం పూర్తి సామర్థ్యానికి చేరువుగా నీటి నిల్వలు ఉండడంతో అటు అధికారులు, ఇటు దిగువ ప్రాంత గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. జలాశయం రాపూరు మండలంలో ఉన్నా.. స్పిల్వే చేజర్ల మండలంలో ఉంది. జలాశయం ప్రమాదకర స్థాయికి చేరుకుంటే స్పిల్వే నుంచి నీటిని విడుదల చేస్తే పొదలకూరు మండలంలోని పర్వతాపురం, అంకుపల్లి, ఊసపల్లి, వావింటపర్తి గ్రామాల మీదుగా నీటి ఉధృతి కండలేరు ఏటికాలువలో కలిసి సముద్రానికి వెళతాయి. తాజాగా పరిణామాల్లో తెలుగుగంగ అధికారులు స్పిల్వే ద్వారా నీటిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సోమశిల నుంచి వరద ద్వారా కండలేరుకు నీరు విడుదల ఆగకుండా వస్తూనే ఉన్నందున కండలేరులో నీటి నిల్వలు ప్రమాదక స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. అటవీ అనుమతులు లేక ఆగిన కాలువ పనులు స్పిల్వే కాలువ 1.5 కి.మీ. నుంచి పనులు నిలిచిపోయాయి. ఇక్కడ అటవీ భూములు ఉండడంతో కాలువ పనులను చేయనీయకుండా సంబంధిత అధికారులు నిలిపివేశారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే ముందుగా అటవీ భూముల్లో అధికారులు కాలువను తవ్వించారు. తర్వాత అటవీశాఖ అధికారులు అనుమతులు లేవని కాలువను పూడ్పించారు. ఈ క్రమంలో స్పిల్వే నుంచి వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే కాలువ లేకుండా నీరు ఎలా వెళుతుందనే ఆందోళన గ్రామస్తుల్లో నెలకొంది. అయితే అటవీభూముల్లో తాత్కాలికంగా కాలువను తవ్వించి అవసరమైతే నీటిని విడుదల చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సాధ్యాసాధ్యాలను బుధవారం పరిశీలించినట్లు సమాచారం. గ్రామాల్లో దండోరా నీటిని విడుదల చేస్తే మండలంలోని పర్వతాపురం, అంకుపల్లి, ఊసపల్లి, వావింటపర్తి గ్రామాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో బుధవారం రెవెన్యూ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని దండోరా వేయించారు. స్పిల్వే మీదుగా కండలేరు వరద నీటిని విడుదల చేస్తే దిగువ గ్రామాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పశువులను వాగుల వెంట వదిలి వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. అవసరమైతే గ్రామస్తులను తరలించాల్సి వస్తుందని కూడా రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. గతంలో 50 టీఎంసీల పైబడి నీటి నిల్వలు ఉంటేనే కండలేరు మట్టికట్ట 5.50 కి.మీ వద్ద కట్ట మట్టి ఊడి కింద పడింది. దీంతో కట్టకు ప్రమాదం వాటిల్లిందని ప్రచారం జరిగి పొదలకూరు మండలం ఇనుకుర్తి, ముదిగేడు, డేగపూడి గ్రామస్తులు పొదలకూరు జెడ్పీ హైస్కూల్కు వచ్చి తలదాచుకున్నారు. తర్వాత అధికారులు ధైర్యం చెప్పడంతో ఊర్లకు వెళ్లారు. మట్టికట్ట ఊడిపడిన ప్రాంతంలో అధికారులు రివిట్మెంట్ చేపట్టి పటిష్టం చేశారు. స్పిల్ వే వెనుక వైపు ఉన్న కండలేరు నీరు జిల్లాలోని మరో జలనిధి కండలేరు నిండుకుండగా ఉంది. కొన్ని రోజులుగా సోమశిల నుంచి వరద కాలువ ద్వారా కండలేరుకు నీటి విడుదల చేస్తున్నారు. 68 టీఎంసీల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయం బుధవారానికి దాదాపు 60 టీఎంసీలకు చేరింది. అయితే సోమశిల నుంచి కండలేరుకు వరద జలాలు ఆపకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. సాంకేతిక సమస్య కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జలాశయం క్యాచ్మెంట్ ఏరియాతోపాటు ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాలకు వరద పెరిగే అవకాశం ఉండడంతో ప్రాజెక్ట్ భద్రత నేపథ్యంలో నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో దిగువ గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కండలేరులో 60 టీఎంసీలు దాటిన నీటి నిల్వ సోమశిల నుంచి కొనసాగుతున్న ఇన్ఫ్లో స్పిల్వే ద్వారా నీటి విడుదలకు సన్నాహాలు భయాందోళనలో దిగువ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లో దండోరా అటవీ అనుమతులు లేక పూర్తికాని స్పిల్వే కాలువ పనులు దండోరా వేయించాం తెలుగుగంగ అధికారుల సూచన మేరకు వారితో చర్చించి స్పిల్వే దిగువ గ్రామాల్లో దండోరా వేయించాం. స్పిల్వే గుండా నీటిని విడుదల చేసే పరిస్థితి తలెత్తదని ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు. అవసరమైతే ముందస్తుగా గ్రామస్తులను తరలించాల్సి ఉంటుంది. ఈ మేరకు గ్రామస్తులను అప్రమత్తం చేయడం జరిగింది. – బి.శివకృష్ణయ్య, తహసీల్దార్, పొదలకూరు -
జిల్లా అంతటా భారీ వర్షాలు
ఈశాన్య రుతుపవనాలకు తోడు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా జడివాన కురుస్తోంది. వారం రోజులుగా ముసురు వీడలేదు. బుధవారం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది. పలు లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొర్లుతుండటంతో కొన్ని గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అల్పపీడన ప్రభావంతో సముద్రం కసురుమీద ఉంది. ఎగసిపడుతున్న అలలతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. నెల్లూరు (అర్బన్): వాయుగుండం ప్రభావంగా జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరంతోపాటు గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే చెరువులు దాదాపుగా నిండాయి. మర్రిపాడు, ఆత్మకూరు మండలాల్లో ప్రవహించే బొగ్గేరులో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. వరికుంటపాడు, దుత్తలూరు మండలాల పరిధిలో ఉండే పిల్లాపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పొదలకూరు మండలంలోని నావూరు వద్ద పెద్దవాగు పొంగడంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది. కొండాపురంలో మిడతవాగు, ఉలవపాడు మండలంలో ఉప్పుటేరు , అనంతరసాగరం మండలంలోని కొమ్మలేరు, మనుబోలు–గూడూరు మధ్య ఉండే పంబలేరు, చేజర్ల మండలంలోని నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మనుబోలు కండలేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. సంగం వద్ద ఉండే బీరాపేరుకు వరద పెరిగింది. సైదాపురం మండలంలోని వాగులు పొంగుతున్నాయి. అక్కడి కై వల్యానది వర్షపు నీటితో పోటెత్తుతోంది. బుచ్చిరెడ్డిపాళెం నుంచి వెళ్లే మలిదేవి డ్రెయిన్, పైడేరుకు ప్రవాహం పెరిగింది. పలుచోట్ల చెరువులు కలుజులు పారుతున్నాయి. లింగసముద్రం మండలంలోని రాళ్లపాడు ప్రాజెక్ట్కు భారీగా వరదనీరు చేరుతోంది. సోమశిల–ఆత్మకూరు మధ్య రాకపోకలు బంద్ అనంతసాగరం మండలంలోని కొమ్మలేరు, కేతామన్నేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముత్తుకూరు వద్ద కొమ్మలేరు వాగుపై ఉన్న వంతెన స్వల్పంగా కుంగింది. రేవూరు వద్ద వంక, కమ్మవారిపల్లి వద్ద అలుగు పొంగి పొర్లుతున్న కారణంగా ఆత్మకూరు– సోమశిల– అనంతసాగరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెన్నానదికి పెరిగిన ప్రవాహం పెన్నానదిలో సోమశిల నుంచి విడుదల చేసే వరద జలాలతోపాటు, పెన్నా పరీవాహక ప్రాంతాల్లోని వాగుల నుంచి వచ్చే వరదతో కలిసి సుమారు 80 వేల క్యూసెక్కులకు పైగా నీరు ప్రవహిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద పెరగడంతో ఏక్షణంలోనైనా పెన్నానదిలోకి లక్షల క్యూసెక్కుల నీటిని అదనంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సుమారు 30 గ్రామాల ప్రజలు ఏక్షణంలోనైనా వరద తమ గ్రామాలపైకి వస్తుందోనని వణికి పోతున్నారు. సంగం బ్యారేజీ వద్ద బుధవారం సాయంత్రానికి సోమశిల ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీటితోపాటు వర్షాల వల్ల తోడైన వరదనీరు కలిసి 70 వేల క్యూసెక్కులకు చేరింది. దీంతో సంగం బ్యారేజీ వద్ద ఉన్న 79 గేట్లను ఒక్కసారిగా అధికారులు ఎత్తేసి నీటిని నదిలోకి విడుదల చేశారు. ఫలితంగా పెన్నానది పరవళ్లు తొక్కుగా నెల్లూరు వైపు ప్రవాహం పరుగెడుతోంది. లోతట్టు ప్రాంతాలైన తూర్పు కంభంపాడు, అప్పారావుపాళెం, వీర్లగుడిపాడు, కోలగట్ల, నెల్లూరు నగరంలోని ఆర్టీసీ కాలని, శివగిరికాలనీ, జనార్దన్రెడ్డినగర్, రాజీవ్ గృహకల్ప, కొత్తూరులోని శ్రీలంకకాలని, మనుమసిద్దినగర్, జయలలిత నగర్ తదితర అనేక ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 2,500 ఎకరాల్లో నీటమునిగిన పంటలు అనంతసాగరంలో 1500 ఎకరాలు, చేజర్ల మండలం కాకివాయిలో 100 ఎకరాల్లో వరి, కందుకూరు, కలువాయిలో కోతకొచ్చిన వరి పంట నీటమునిగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మిర్చి, కూరగాయలు తదితర వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లింది. ప్రాథమికంగా 2,500 ఎకరాల్లో పంట నష్టపోయినట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నష్టం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం వాయుగుండం ప్రభావంతో కొత్తకోడూరు, మైపాడు బీచ్తోపాటు రామతీర్థం, రామాయపట్నం తదితర ప్రాంతాల్లో సముద్రం సుమారు 6 మీటర్ల వరకు ముందుకు వచ్చింది. తీరం వెంబడి అలలు ఎగసి పడుతుండడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. దీంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. రామాయపట్నంలో తీరం కోత కొట్టుకుపోయిన డైవర్షన్ రోడ్డు పొంగుతున్న వాగులు, వంకలు రాకపోకలకు అంతరాయం చెరువులను తలపిస్తున్న లోతట్టు ప్రాంతాలు ముందుకొచ్చిన సముద్రం నేడూ విద్యా సంస్థలకు సెలవు కృష్ణపట్నంలో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక ముత్తుకూరు (పొదలకూరు) : అల్పపీడనం ద్రోణి నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టులో బుధవారం సాయంత్రం 3వ నంబరు ప్రమాద హెచ్చరికను అధికారులు ఎగుర వేశారు. జాలర్లు వేటకు వెళ్లరాదని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు, ఆక్వా రైతులు జాగ్రత్తగా ఉండాలి నెల్లూరు (పొగతోట): బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం నేపథ్యంలో భారీ వర్షాల కారణంగా మత్స్యకారులు, ఆక్వా రైతులు జాగ్రత్తగా ఉండాలని మత్స్యశాఖ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సముద్రంలో అలల తీవ్రత అధికంగా ఉందని, మత్స్యకారులు తమ వలలు, తెప్పలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పెద్దబోట్లను కృష్ణపట్నం, జువ్వలదిన్నె హార్బర్లల్లో నిలుపుదల చేయాలన్నారు. ఎప్పటికప్పుడు సాగర మిత్రలు, గ్రామ మత్స్యకారుల సహాయకులు, రెవెన్యూ, మైరెన్ పోలీసుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. ఆక్వా రైతులు భారీ వర్షాలకు గుంతలో నీటి మట్టం పెరిగి కట్టలు తెగకుండా నీరు పొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కువ సాంద్రత ఉంటే చేపలు, రొయ్యల సంఖ్య తగ్గించాలన్నారు. వాతావరణం ప్రభావంగా ఆకలి మందగిస్తుందని అనుగుణంగా దాణా తగ్గించాలన్నారు. రొయ్యల చెరువులో డీఓ సమస్య రాకుండా ఏయిరేటర్లు వాడాలన్నారు. రాపూరు: మండలంలోని పంగిలి గ్రామానికి వెళ్లే మార్గంలో కొండేరువాగుపై బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మట్టితో డైవర్షన్ రోడ్డు నిర్మించారు. బుధవారం కొండేరు ఉధృతంగా ప్రవహించడంతో ఈ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని సిద్ధేశ్వరకోన, పెంచలకోనలోని జలపాతం వద్దకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అక్కడ సిబ్బందిని ఉంచినట్లు రేంజర్ మాల్యాద్రి తెలిపారు.నేడూ పాఠశాలలు, కళాశాలలకు సెలవు నెల్లూరు (టౌన్): జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశాలతో గురువారం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు ఆర్ఐఓ వరప్రసాద్రావు, డీఈఓ ఆర్.బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆయా మండలాల్లోని డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు పాఠశాలల హెడ్మాస్టర్లకు సమాచారం పంపాలన్నారు. అత్యధికంగా లింగసముద్రంలో 179.2 మి.మీ. అత్యల్పంగా కావలిలో 50.8 మి.మీ. జిల్లాలో మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు భారీ వర్షపాతం నమోదైంది. లింగసముద్రం మండలంలో అత్యధికంగా 179.2 మి.మీ. వర్షం కురిసింది. ఆత్మకూరు 169.8, అనంతసాగరం 149.8, రాపూరు 147.6, దుత్తలూరు 134.8, గుడ్లూరు 133.6, మర్రిపాడు 133.6, కందుకూరు 132.4, సైదాపురం 130.4, ఉలవపాడులో 126.4, కొండాపురం 116.2, అనుమసముద్రంపేట 111, సంగం 105.4, కలువాయి 105, వింజమూరు 104.4, మనుబోలు 99.6, చేజర్ల 99, వరికుంటపాడు 98.6, ఉదయగిరి 97.4, వెంకటాచలం 94.2, పొదలకూరు 92.8, నెల్లూరు అర్బన్ 92.6, జలదంకి 90.4, నెల్లూరు రూరల్ 80.6, ముత్తుకూరు 79, కోవూరు 78.8, దగదర్తి 76.4, వలేటివారిపాళెం 75.8, కొడవలూరు 74.4, బుచ్చిరెడ్డిపాళెం 73.8, కలిగిరి 61.8, సీతారామపురం 59.8, విడవలూరు 59.6, ఇందుకూరుపేట 57.4, బోగోలు 57.4, అల్లూరు 54.6, తోటపల్లిగూడూరు 51, కావలి 50.8 మి.మీ. మేర వర్షపాతం నమోదైంది. -
అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
వర్షాలపై కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం ఆర్డీఓలు, రెవెన్యూ, స్పెషల్ ఆఫీసర్లతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాయుగుండం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులెవరూ సెలవులు పెట్టేందుకు వీలులేదని ఆదేశించారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తమ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు, వాగులు వంకలు పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 0861–2331261, 79955 76699 నంబర్లకు ప్రజలు అత్యవసరం పరిస్థితుల్లో సమాచారాన్ని అందించాలని కోరారు. -
జలాశయాన్ని పరిశీలించిన ఎస్ఈ, తహసీల్దార్
సోమశిల: సోమశిల జలాశయాన్ని ఎస్ఈ వెంకటరమణారెడ్డి, తహసీల్దార్ జయవర్ధన్ బుధవారం పరిశీలించారు. కండలేరు పూర్తి సామర్థ్యానికి చేరుకోనున్న నేపథ్యంలో కండలేరు వరద కాలువకు నీటి విడుదల నిలుపుదల చేసేందుకు ఎస్ఈ జలాశయానికి వచ్చారు. అనంతరం ప్రాజెక్ట్ క్రస్ట్గేట్లను పరిశీలించారు. ఎగువ నుంచి వస్తున్న వరదపై ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. తహసీల్దారు మాట్లాడుతూ పైతట్టు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల దృష్ట్యా జలాశయానికి వరద వచ్చే అవకాశం ఉన్నందున పెన్నా పరీవాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(క్రైమ్): ‘ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజా భద్రతా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి. అమరుల కుటుంబాలకు యావత్ భారతదేశం తోడుగా ఉంది’ అని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. నెల్లూరు పోలీసు కవాతు మైదానంలో మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది దేశవ్యాప్తంగా 191 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పి ంచారని, వారి త్యాగాలు మరువలేనివన్నారు. ఎస్పీ అజిత మాట్లాడుతూ దేశ రక్షణ విధుల్లో అమరులైన పోలీసులకు ఘన నివాళులర్పిస్తున్నామన్నారు. జిల్లాలో ఈ ఏడాది పదిమంది మృతిచెందారని వారి కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. తొలుత కలెక్టర్, ఎస్పీ, ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, పోలీసు అధికారులు, పోలీసు అధికారుల సంఘ నాయకులు తదితరులు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. పోలీసు సిబ్బంది స్మృతి పరేడ్ను నిర్వహించారు. అమరవీరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్, హ్యుమానిటీ కార్పస్ ఫండ్ చెక్కులు, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం పోలీసు కవాతు మైదానం నుంచి కేవీఆర్ పెట్రోల్ బంకు వరకు అమరవీరుల సంస్మరణ ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
కార్మికులతో సహపంక్తి భోజనం
నెల్లూరు(బృందావనం): చిన్నబజార్లోని సవరాల వీధిలో పారిశుధ్య కార్మికులతో కలిసి సహపంక్తి భోజనాన్ని ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచార ప్రముఖ్ బయ్యా వాసు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ పిలు పు మేరకు నగరపాలక సంస్థ కార్మికులు, వాహనాల డ్రైవర్లు, సిబ్బందితో కలిసి దీపావళి వేడుకను నిర్వహించామని చెప్పారు. అనంతరం వస్త్రాలు, బాణసంచాను అందజేసి సత్కరించారు. విభాగ్ ప్రచారక్ నవీన్, జిల్లా సంఘ్చాలక్ బయ్యా రవికుమార్, జిల్లా మహిళా సమన్వయ ప్రముఖ్ బయ్యా శైలజ, సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ప్రధాన కార్యదర్శి బయ్యా మల్లిక, పారిశుధ్య కార్మికురాలు ధనమ్మ తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధురాలిని అనాథలా వదిలేసి..
● అనారోగ్యంతో మృతి ● మంట కలిసిన మానవత్వంమనుబోలు: ఆ వృద్ధురాలికి కుటుంబం ఉంది. ఆమె బాగోగులు పట్టించుకోకుండా మనుమడు మరో ఊరిలో వదిలేశాడు. అనారోగ్యంతో చనిపోయిన వృద్ధురాలికి రెవెన్యూ సిబ్బంది అంత్యక్రియలు చేశారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. మండలంలోని మనుబోలు సచివాలయం – 2 వద్ద సర్వీస్ రోడ్డు ఆనుకుని నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్లో గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శివరాకేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి విచారణ చేశారు. మృతురాలిని కలువాయికి చెందిన సుబ్బమ్మగా గుర్తించారు. ఆమె వయసు 70 సంవత్సరాలు ఉండొచ్చని, ఇద్దరు కుమార్తెలున్నారని చెబుతున్నారు. పదిరోజుల క్రితం ఆమె మనుమడు బలవంతంగా ఇక్కడ వదిలివెళ్లగా యాచన చేస్తూ బతికింది. కాగా అనారోగ్యంతో మృతిచెందినట్లు చెబుతున్నారు. పోలీసులిచ్చిన సమాచారంతో బంధువు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో మనుబోలులో మృతదేహాన్ని ఖననం చేశారు. -
ఆర్టీసీ బస్సు బోల్తా
జలదంకి(కలిగిరి): మండలంలోని 9వ మైలు సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కావలి ఆర్టీసీ బస్టాండ్ నుంచి చామదలకు బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. 9వ మైలు సమీపంలో ఒక్కసారిగా ఎదురుగా లారీ రావడంతో బస్సును డ్రైవర్ పక్కకి తిప్పాడు. దీంతో అదుపుతప్పి పొలాల్లో బోల్తా పడింది. ఈ సమయంలో బస్సులో తక్కువ మంది ప్రయాణికులున్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న జలదంకి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
కూటమి పాలనంతా అవినీతిమయం
వెంకటాచలం: రాష్ట్రంలో కూటమి పాలనంతా అవినీతిమయం అయిపోయిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. మండలంలోని చెముడుగుంట పంచాయతీ బురాన్పూర్లో సోమవారం కాకాణి పర్యటించారు. ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో చంద్రబాబు, టీడీపీ నాయకులు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఎక్కడా అభివృద్ధిపై దృష్టి సారించిన పాపాన పోలేదన్నారు. జిల్లా అడ్డాగా పేదల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తూ నెల నెలా రూ.కోట్ల కొల్లగొట్టుతున్నా.. పట్టించుకునే పరిస్థితి లేకపోవడం దారుణమన్నారు. పేదల రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతుందని నిత్యం పత్రికల్లో, టీవీ చానళ్లలో కథనాలు వస్తున్నా, ప్రభుత్వం సీరియస్గా తీసుకోకపోవడం ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను పట్టించుకోకుండా పరిపాలన సాగించడంపై ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారని తెలియజేశారు. ఉద్యోగులకు దీపావళి కానుకగా ఆశించిన డీఏలు, పెండింగ్ బకాయిల విషయంలో ఊసురుమనిపించారని మండిపడ్డారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమంగా గ్రావెల్, మట్టి, ఇసుక తరలిస్తూ, కోట్లాది రూపాయల దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ఈ దోపిడీ గురించి ఆధారాలతో సహా బయటపడుతున్నా అధికారులు పట్టించుకోకపోడం సరికాదన్నారు. సోమిరెడ్డి, అతని కుమారుడుకు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు మేలు చేసే ఆలోచనే లేదని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ అధికారంలో లేకపోయినా తాము నిత్యం ప్రజల మధ్య తిరుగుతూ ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఇటీవల తండ్రిని కోల్పోయిన పాములూరు రామచంద్రారెడ్డి కుటుంబాన్ని, గాయపడిన మాజీ ఎంపీటీసీ సుందరరామిరెడ్డిని పరామర్శించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పేదల రేషన్ బియ్యం అక్రమ రవాణాపై చర్యలు శూన్యం గ్రావెల్, మట్టి, ఇసుక తరలిస్తూ కోట్లాది రూపాయల దోపిడీ దీపావళి కానుకగా ఉద్యోగులకు దగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
విద్యుత్ సిబ్బందికి సెలవులు రద్దు
● డివిజన్లలో కంట్రోల్ రూమ్ల ఏర్పాటు ● ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా ఎస్ఈ రాఘవేంద్రం నెల్లూరు (వీఆర్సీసెంటర్): వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో విద్యుత్ సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా ఎస్ఈ రాఘవేంద్రం అన్నారు. నగరంలోని విద్యుత్భవన్లోని స్కోడా కార్యాలయంలో మంగళవారం ఆయన జిల్లా విద్యుత్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని ప్రతి విద్యుత్ సిబ్బంది వారికి నిర్దేిశించిన హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. నూతన విద్యుత్ స్తంభాలు అందుబాటులో ఉంచాలని, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఐదు విద్యుత్ డివిజన్లలో 24 గంటలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వర్షాలు తగ్గే వరకు విద్యుత్ సబ్స్టేషన్లలో ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉంచి మిగిలిన వారిని అత్యవసర సేవలకు ఉపయెగించుకోవాలని సంబంధిత అధికారులకు అదేశాలు జారీ చేశారు. విద్యుత్ స్తంభాలు పడిపోయినా, లైన్లు తెగిపడినా వాటిని పునరుద్ధరించేందుకు సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. సెల్ఫోన్లకు ఫుల్ చార్జింగ్ పెట్టుకోవాలని, రోప్స్, డ్రిల్లింగ్ మెషిన్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. -
కాపుల హత్యలకు పవన్కళ్యాణ్దే బాధ్యత
● ఆయన మాట వినే కాపులంతా టీడీపీకి ఓట్లు వేశారు ● అదే కాపులను నడిరోడ్డుపై దారుణంగా చంపుతున్నా స్పందన లేదు ● లక్ష్మీనాయుడు కుటుంబాన్ని కనీసం పరామర్శించకపోవడం దారుణం ● దారకానిపాడు ఎవరూ వెళ్లకుండా పోలీస్ ఆంక్షలు విధించి అడ్డుకోవడమేంటి ● వైఎస్సార్సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళి కందుకూరు: డీసీఎం పవన్కళ్యాణ్ మాటవిని టీడీపీకి ఓట్లు వేసి అధికారంలోకి రావడానికి కారణమైన కాపులను కుల వివక్షతో నడిరోడ్డుపై చంపుతుంటే పవన్కళ్యాణ్ కనీసం స్పందించకపోవడం దారుణమని వైఎస్సార్సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళి ఆవేదన వ్యక్తం చేశారు. గుడ్లూరు మండలం దారకానిపాడులో దారుణ హత్యకు గురైన కాపు యువకుడు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం ఆయన వచ్చారు. అయితే దారకానిపాడు వెళ్లడానికి వీల్లేదంటూ కందుకూరు పట్టణ బైపాస్పైనే ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన భార్యను లైంగికంగా వేధిస్తుండడంతో అడిగినందుకు ముగ్గురు అన్నదమ్ములను కారుతో ఢీకొట్టి చంపడానికి ప్రయత్నించడంతో అందులో లక్ష్మీనాయుడు చనిపోయాడని, ఇది అత్యంత అరాచకమైన చర్య అన్నారు. లక్ష్మీనాయుడుకి పొన్నూరుతో బంధుత్వం ఉందన్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పొన్నూరులోని కాపు సామాజికవర్గ నాయకులంతా లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారన్నారు. అయితే ఇక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, దారకానిపాడు గ్రామానికి వెళ్లకుండా కందుకూరు పట్టణ సమీపంలోనే పోలీసులు ఆపేస్తున్నారన్నారు. భారీగా పోలీసులను మోహరించి గ్రామంలో అడుగు పెట్టే పరిస్థితి లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. దారకానిపాడు ఏమైనా పాకిస్తానా లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు పొన్నూరు నుంచి అంబటి మురళితోపాటు, పలువురు కాపు నేతలు పెద్ద ఎత్తున మంగళవారం తరలివచ్చారు. అయితే దారకానిపాడు వెళ్లడానికి వీల్లేదంటూ వీరిని కందుకూరు బైపాస్ వద్దనే డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సీఐలు అన్వర్బాషా, మంగారావు, పలువురు ఎస్సైలు, పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి అడ్డుకున్నారు. దీంతో పోలీస్ అధికారులకు, అంబటి మురళికి మధ్య వాగ్వాదం జరిగింది. దారుణ హత్యకు గురైన బాధితులను పరామర్శిస్తే తప్పేంటని, దారకానిపాడు ఏమైనా పాకిస్తాన్లో ఉందా అంటూ మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడే నిలబడిన కాపు నేతలు నిరసన వ్యక్తం చేశారు. మురళితో పాటు, ఇతర నేతలను దారకానిపాడు తీసుకెళ్తామంటూ పోలీస్ వాహనం ఎక్కించి అక్కడి నుంచి పామూరు పోలీస్స్టేషన్కు తరలించే ప్రయత్నం చేశారు. దీన్ని పసిగట్టిన నేతలు వాహనం దిగి పోలీసులతో వాదనకు దిగారు. తమ ప్రాథమిక హక్కును ఎందుకు అడ్డుకుంటున్నారని ఇది సరైన విధానం కాదంటూ నిలదీశారు. దాదాపు రెండు గంటల ఉద్రిక్తత వాతావరణం తరువాత పోలీస్ ఆంక్షలను నిరసిస్తూ కాపు నేతలు అక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చింది. టీడీపీ హయాంలోనే కాపుల హత్యలు రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంటే కాపుల హత్యలు జరుగుతుంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉండగానే వంగవీటి రంగాను అతిదారుణంగా చంపారన్నారు. రంగా స్ఫూర్తితో ముద్రగడ పద్మనాభం ఎదుగుతున్న సమయంలో 2014–19 మధ్యలో ఆయన్ను ఏ విధంగా ఇబ్బందులు గురి చేశారో అందరికీ తెలిసిన విషయమేనని వివరించారు. ప్రస్తుతం లక్ష్మీనాయుడు వంటి కాపు యువత పవన్కల్యాణ్ స్ఫూర్తితో టీడీపీకి ఓటు వేశారన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో కాపుల ఆశలు నెరవేరలేదు గానీ పవన్కళ్యాణ్ ఆశలు మాత్రం నెరవేరాయని చెప్పారు. డీసీఎంగా ఉన్న ఆయన కనీసం లక్ష్మీనాయుడు హత్యపై కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. -
జిల్లా అంతటా భారీ వర్షాలు
నెల్లూరు (అర్బన్): జిల్లాలో ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని మండలాల్లో భారీ వర్షాలు, మరికొన్ని మండలాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుండడంతో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు అర్బన్ 48.2ముత్తుకూరు 47.4తోటపల్లి గూడూరు 43.8వెంకటాచలం 55.4 కోవూరు 33.4నెల్లూరు రూరల్ 32.6విడవలూరు 53.6బుచ్చిరెడ్డిపాళెంలో 57.6అల్లూరు 32.4మి.మీ.చేజర్ల 32.4, కలువాయి 30.6, బోగోలు 30.4, ఇందుకూరుపేట 28.4, దుత్తలూరు 28.4, మనుబోలు 27.6, పొదలకూరు 26.4, రాపూరు 25.8, సైదాపురం 24.6, వింజమూరు 21.2, ఉదయగిరి 19.8, ఆత్మకూరు 19.8, సంగం 19.6, అనుమసముద్రంపేట 16.2, కలిగిరి 13.8, దగదర్తి 13.8, అనంతసాగరం 13.8, కొండాపురం 13.4, మర్రిపాడు 11.6, కందుకూరు 11.4, జలదంకి 8.6, సీతారామపురం 8.2, కావలి 6.8, వలేటివారిపాళెం 6.4, ఉలవపాడు 4.6, లింగసముద్రం 4.2 మి.మీ. వర్షం కురిసింది. అత్యల్పంగా కొడవలూరులో 74.2 మి.మీ. మంగళవారం అత్యధికంగా -
జర్నలిస్టులపై కేసుల నమోదు దారుణం
● ఏపీయూడబ్ల్యూజే జేఏసీ నిరసన ఆత్మకూరు: రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ, విక్రయాల నేపథ్యంలో షాపుతోపాటు బెల్టుషాపుల సమీపంలోనే మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడాన్ని వార్తగా రాసిన ‘సాక్షి’ బ్యూరోఇన్చార్జి, ఎడిటర్పై పోలీసు కేసులు నమోదు చేయడం దారుణమని ఏపీయూడబ్ల్యూజే జేఏసీ ఖండించింది. విచారణ పేరుతో వేధించడం గర్హనీయమని పేర్కొంది. సోమవారం ఆత్మకూరు డివిజన్ పరిధి లోని అన్ని పత్రికలు, చానళ్ల విలేకరులు ఇటీవల జరిగిన పరిణామాలపై సమావేశం నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమా వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ విలేకరుల ఎప్పుడూ ప్రజాపక్షానే ఉంటారని, ప్ర జల నుంచి తెలుసుకున్న సమాచారాన్నే వార్తలుగా ఇస్తున్నారన్నారు. వార్తల్లో తప్పిదాలు ఉంటే ఖండన ఇవ్వాలి తప్ప వెంటనే కేసులు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘సాక్షి’ విషయంలో పోలీసులు తదుపరి చర్యలకు దిగితే తాము మౌనంగా ఉండబోమని జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. -
దివ్య దీపావళి శుభాకాంక్షలు
నెల్లూరు(స్టోన్హౌస్పేట): చీకటిపై వెలుగు సాధించిన విజయంగా దీపావళి పర్వదినాన్ని లక్ష్మీదేవి దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఆకాంక్షించారు. ప్రజలందరికి దీపావళి శుభా కాంక్షలు తెలిపారు. అజ్ఞాన చీకట్లను పారద్రోలి మన జీవితంలో వెలుగులు నింపే దీపావళిని ఆనందంగా, జాగ్రత్తగా జరుపుకోవాలని కోరారు. వెలుగుల పండగ కావాలి అందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని, వెలుగు పండగ దీపావళి అందరిలో సంతోషాలు వెల్లివిరియాలని ఎమ్మెల్సీ సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబసభ్యులతో కలిసి సురక్షితంగా పండగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. పర్యావరణహితంగా దీపావళి జరుపుకోవాలి నెల్లూరురూరల్: జిల్లా ప్రజలందరూ పర్యావరణ హితంగా జరుపుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో కోరారు. పెద్దపెద్ద శబ్దాలు, కాలుష్యం వెదజల్లే టపాసులు కాకుండా వెలుగుదివ్వెలు విరజిమ్మే టపాసులు కాల్చాలన్నారు. తల్లిదండ్రులు, పెద్దల సమక్షంలోనే పిల్లలు టపాసులు కాల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జేసీ శుభాకాంక్షలు జిల్లా ప్రజలు ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలు, వెలుగుదివ్వెల కాంతులతో పండగను ఆనందంగా జరుపుకోవాలని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అంధకారంపై వెలుగు సాధించిన పండగ దీపావళి స్ఫూర్తితో నిర్వహించాలని కోరారు. నేడు పీజీఆర్ఎస్ రద్దు నెల్లూరు (క్రైమ్): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) దీపావళి పండగ సందర్భంగా రద్దు చేసినట్లు ఎస్పీ అజిత వేజెండ్ల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. -
రోడ్డుపై విరిగిపడిన కొండచరియలు
సంగం: సంగంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండ వద్ద ఉన్న నెల్లూరు– ముంబై జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న ఎస్సై రాజేష్ అర్ధరాత్రి వెంటనే స్పందించిన తన సిబ్బందితో కలిసి రహదారిపై పడిన కొండ చరియలను తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఎస్సై రాజేష్ మాట్లాడుతూ వాహనదారులు కొండ వద్ద జాతీయ రహదారిపై ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో కొండపై ఉన్న రాళ్లు విరిగిపడే ప్రమాదం ఉన్నందున రాత్రి సమయాల్లో వాహనదారులు మరెంతో జాగ్రత్తలు పాటించాలని, కొండ వద్ద వాహన వేగం తగ్గించి వెళ్లాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఉన్న సమయంలో వాహనదారులు వెంటనే 112 నంబర్కు కానీ తమకు కానీ ఫోన్ చేస్తే స్పందించి అక్కడికి చేరుకుని సహాయం చేస్తామని తెలియజేశారు. -
పత్రికా స్వేచ్ఛను హరించడమే
ప్రజాస్వామ్యానికి విఘాతం అక్రమ కేసులతో అణచివేయలేరుకక్ష సాధింపు చర్యలు తగవు తప్పులు సరిదిద్దుకోలేకనే వేధింపులు ‘సాక్షి’పై కక్ష కట్టి పోలీసు కేసులను నమోదు చేసి పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి, నెల్లూరు బ్యూరో ఇన్చార్జి మస్తాన్రెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం జర్నలిస్టుల గొంతు నొక్కడమే. నచ్చని వార్తలు పత్రికల్లో ప్రచురితమైతే న్యాయపరంగా ఎదుర్కోవాలే కాని ఇలా కేసులు నమోదు చేసి వేధించడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. – పెదమల్లు రమణారెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, సీనియర్ నాయకుడు, పొదలకూరు పత్రికలపై దాడులకు పాల్పడడం, కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడమే అవుతుంది. ‘సాక్షి’ పత్రిక ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక పాలనను బహిర్గతం చేస్తుందన్న అక్కసుతోనే ఎడిటర్ ధనంజయరెడ్డిపై వరుస కేసులు నమోదు చేయిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదు. – గోగిరెడ్డి గోపాల్రెడ్డి, సీనియర్ నాయకుడు, వైఎస్సార్సీపీ, మహ్మదాపురం, పొదలకూరు మండలం ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా వ్యవహరించే పత్రికా రంగం ప్రజాస్వామ్యంలోని నాలుగు స్తంభాల్లో ఒకటి. అలాంటి పత్రికా రంగాన్ని అణచివేసే ధోరణిలో వార్తలు రాసే విలేకరులు, ఎడిటర్లపై పోలీసులు బెదిరింపు ధోరణిలో వ్యవహరించడం సరికాదు. రాష్ట్రంలో ‘సాక్షి’ పత్రికపై ప్రభుత్వం అక్రమ కేసులతో కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తోంది. – డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, జిల్లా వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షుడు జర్నలిస్టులు రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా సమస్యలను వెలుగులోకి తెస్తారు. ‘సాక్షి’ పత్రికలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశారనే కోణంతో ఆ పత్రికను ప్రభుత్వం టార్గెట్ చేసింది. అందులో పనిచేసే జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మంచి పద్ధతి కాదు. ఈ విధానాన్ని ప్రభుత్వం మార్చుకోవాలి. – వి.నరసింహులు, జేఏసీ అధికార పార్టీ నేతలు చేస్తున్న తప్పులను సరిదిద్దుకోలేని ప్రభుత్వం ‘సాక్షి’ జర్నలిస్టులపై దాడులు చేస్తోంది. అర్ధరాత్రి పూట మహిళలని చూడకుండా ‘సాక్షి’ బ్యూరో ఇంటికి పోలీసులను పంపి నోటీసులు ఇవ్వడం దారుణం. సమస్యలను పక్కదారి పట్టించేందుకు ప్రభు త్వం ఇలాంటి సంస్కృతికి తెరతీయడం దుర్మార్గం. నోటీసులు, విచారణ, కేసుల పేరుతో వేధిస్తే ప్రజలే ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పుతారు. – సాగర్రెడ్డి, జేఏసీ -
కొండలు కరిగించి.. గ్రావెల్ దోచేసి
టీడీపీ నేతలు ధనదాహంతో ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు. గ్రామానికి సహజ సౌందర్యంగా ఉండే కొండలను గ్రావెల్ కోసం అనుమతుల్లేకుండా అక్రమంగా తవ్వేస్తున్నారు. పశువులకు మేతపోరంబోకు భూముల్లో గ్రావెల్ కొల్లగొట్టి రూ.కోట్లు మింగుతున్నారు. టీడీపీ నేతలు దాష్టీకంతో పశువులకు మేతలేకుండా పోతుందని పాడిరైతులు ఆందోళన చెందుతుంటే.. భారీ గోతుల్లో తమ పిల్లలకు ఎక్కడా ప్రాణాపాయం తలెత్తుతుందోనని ఆ గ్రామ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నా.. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలు కన్నెత్తి చూడకపోవడంపై, ముడుపులు తీసుకుని మౌనంగా ఉంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. యర్రబల్లి తిప్ప కింద ఏర్పడిన గ్రావెల్ గోతులు సాక్షి టాస్క్ఫోర్స్ : అధికార మదంతో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. ప్రజల కడుపులే కాదు.. చివరకు పశువుల కడుపులు కొడుతున్నారు. పశువుల మేతపోరంబోకు భూమిగా ఉండే యర్రబల్లి కొండను కొల్లగొడుతున్నారు. పొదలకూరు మండలం యర్రబల్లికే మణిహారంగా, ప్రకృతి సౌందర్యంగా ఉండే సహజ కొండ కింద భూముల్లో గ్రావెల్ను తవ్వి జేబులు నింపుకొంటున్నారు. నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేత అండతో ఆకాశమే హద్దుగా అవినీతికి పాల్పడుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రశ్నించే స్థానికులను పోలీసులతో బెదిరించి అడ్డూ అదుపు లేకుండా గ్రావెల్ దోపిడీకి పాల్పడుతున్నారు. సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా రాత్రి, పగలు తేడా లేకుండా కొండ కింద గ్రావెల్ను తరలించి గోతులను మిగుల్చుతున్నారు. పశువులు మేత మేసేందుకు సైతం ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఆయా గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. అధికారమే అండగా చెలరేగిపోతున్నా గ్రావెల్ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇక్కడి గ్రావెల్ తవ్వకాలపై ఇటీవల గ్రామానికి చెందిన అధికార పార్టీకు చెందిన నేతలే అక్రమ గ్రావెల్ తరలించేందుకు వీల్లేదని టిప్పర్లను అడ్డుకున్నారు. వర్షం వల్ల ప్రస్తుతం అక్రమ గ్రావెల్ను తరలించడం నిలిపివేసిన అక్రమార్కులు తిరిగి తరలించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అనుమతులు లేకుండా తరలింపు యర్రబల్లి తిప్ప కింద నుంచి జేసీబీలు ఏర్పాటు చేసి టిప్పర్లలో రాత్రి వేళ తరలిస్తున్నట్లు గ్రామస్తులు వెల్లడించారు. ఉదయం 6 గంటల వరకు గ్రావెల్ తరలింపు జరుగుతూనే ఉంది. నాలుగు రోజుల క్రితం అధికార పార్టీకి చెందిన నాయకులు గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లను నిలిపివేశారు. అక్రమంగా గ్రావెల్ తరలించి సొమ్ము చేసుకోవడంతో ఏర్పడిన గోతుల్లో వర్షాకాలంలో నీరు చేరి పిల్లలు అటుగా వెళితే ప్రమాదాలు ఏర్పడతాయని నిలదీశారు. అయితే మధ్యాహ్నం వరకు టిప్పర్లను నిలిపిన వారిని పోలీసు కేసులు పెడతామని బెదిరించడంతో వారు మిన్నకుండిపోయినట్లు తెలిసింది. ఎటువంటి అనుమతులు లేకుండా తమ గ్రామం నుంచి అక్రమంగా గ్రావెల్ తరలించడమే కాక గ్రామస్తులపైనే కేసులు పెట్టిస్తామని బెదిరించడం ఎంతవరకు సబబని గ్రామంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు మైనింగ్ అధికారులు స్పందించి కొండ విధ్వంసాన్ని అడ్డుకోవాలని స్థానికులులు కోరుతున్నారు. అనుమతుల్లేకుండా తవ్వకాలు ప్రమాదకర స్థాయిలో భారీ గోతులు రూ.కోట్లు మింగుతున్న టీడీపీ నేతలు పశువులకు మేత లేకుండా పోతుందని రైతుల ఆందోళన -
జల్లాకు భారీ వర్ష సూచన
నెల్లూరురూరల్: ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంగా జిల్లాకు భారీ వర్ష సూచన ఉందని జిల్లాలోని ప్రజలు, మత్స్య కా రులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం తెలిపారు. ఈ అల్పపీడనం 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతం, పశ్చి మ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. బుధవారం నుంచి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉంటుందని, ఈ ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొదు అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం నుంచి దక్షిణ మధ్య బంగాళాఖాతంలోకి సముద్రయాత్రలు చేయొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మత్స్యకారులు సము ద్రంలోకి వెళ్లకూడదని, సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు తప్పనిసరిగా అక్టోబర్ 21వ తేదీ లోపు తీరానికి చేరుకోవాలన్నారు. ముందుస్తు జాగ్రత్తలు పాటించాలి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు ప్రజలు చెట్ల కింద నిలబడరాదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీర ప్రాంతాల్లో గాలి వేగం గంటకు 4,565 కి.మీ. వరకు ఉండొచ్చన్నారు. తీర ప్రాంత గ్రామాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని కలెక్టర్ చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, జిల్లా అధికారుల సూచనలను పాటించాలని కలెక్టర్ సూచించారు. 49.1 మి.మీ. సగటు వర్షపాతం నెల్లూరు(అర్బన్): ఈశాన్య రుతుపవనాల ప్రారంభంలోనే జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయానికి జిల్లాలో సగటున 49.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సంగంలో 140.6 మి.మీ., అత్యల్పంగా సైదాపురంలో 1.4 మి.మీ. వర్షం కురిసింది. కోవూరులో 96.2, నెల్లూరు అర్బన్ 93.4, బోగోలు 93.2, నెల్లూరు రూరల్ 90.4, ఆత్మకూరు 82.2, కలువాయి 80.4, బుచ్చిరెడ్డిపాళెం 80.2, చేజర్ల 68.2, ఏఎస్పేట 65.2, ఇందుకూరుపేట 64.8, గుడ్లూరు 62.4, తోటపల్లిగూడూరు 61.8, మర్రిపాడు 58.4, కావలి 55.6, కలిగిరి 47.0, అల్లూరు 45.8, కొండాపురం 45.6, పొదలకూరు 45.4, జలదంకి 43.6, దగదర్తి 43.2, కొడవలూరు 42.4, లింగసముద్రం 42.2, ఉలవపాడు 41.4, వింజమూరు 40.6, దుత్తలూరు 37.4, ముత్తుకూరు 36.4, అనంతసాగరం 33.8, విడవలూరు 32.6, వెంకటాచలం 21.2, ఉదయగిరి 20.4, వలేటివారిపాళెం 16.8, సీతారామపురం 11.8, కందుకూరు 11.2, రాపూరు 5.8, మనుబోలు 3.6, వరికుంటపాడులో 3.4 మి.మీ. వర్షం కురిసింది. రెండు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దు కలెక్టర్ హిమాన్షు శుక్లా -
అమరులకు వందనం
● రేపు పోలీసు అమరవీరుల సంస్మరణ దినంనెల్లూరు(క్రైమ్): దేశభద్రతకు సరిహద్దుల్లో సైన్యం.. సమాజంలో అంతర్గత భద్రత.. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అనుక్షణం పోరాటం చేస్తున్నారు. వారులేని సమాజాన్ని ఊహించుకోలేం. సంపన్నులు మొదలు సామాన్యుడి వరకు అందరూ సాయం కోసం చూసేది పోలీస్ వైపే. ప్రజల మాన, ప్రాణాలను కాపాడే క్రమంలో చివరకు ప్రాణత్యాగానికి సైతం వెనుకాడరు. విధి నిర్వహణలో అసువులు బాసిన అమరుల త్యాగాలు చిరస్మరణీయం. 1959 అక్టోబర్ 21వ తేదీన దేశభద్రత కోసం భారత్, చైనా సరిహద్దుల్లో ఉన్న లడఖ్ అక్సాయ్ చిన్ వద్ద విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లపై చైనా సైనికులు భారీ సంఖ్యలో విరుచుకుపడ్డారు. భారత జవాన్లు ఆత్మస్థైర్యంతో విరోచితంగా పోరాడి చొరబాటుదారుల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఈ భీకరపోరులో అసువులు బాసిన అమరుల త్యాగాలకు గుర్తుగా ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా మావోయిస్టులు, ఉగ్రవాదులు, ఇతర అసాంఘిక శక్తులతోపాటు అల్లర్లు, అలజడులను అణిచివేసే క్రమంలో అమరులైన పోలీసు సిబ్బందిని స్మరిస్తూ సోమవారం నెల్లూరులోని పోలీసు కవాతు మైదానంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సమాజంలో పోలీసుల పాత్ర, విధులు, త్యాగాలపై ప్రజలను చైతన్యపరిచేలా వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది పదిమంది ఈ ఏడాది జిల్లాలో అనారోగ్యం, రోడ్డు ప్రమాదం తదితర కారణాలతో పదిమంది మృతిచెందారు. ఏఎస్సై కె.లక్ష్మీనరసయ్య, హెడ్కానిస్టేబుల్స్ ఎం.నాగయ్య, ఎం.చలపతిరావు, డి.రాజశేఖర్, ఏఆర్, సివిల్ కానిస్టేబుళ్లు యు.శివకుమార్, ఎస్.నాగరమేష్, ఎస్.అంకయ్య, జి.శివకుమార్, కె.రమేష్బాబు, వై.రమేష్లు చనిపోయారు. -
కాపులంతా కళ్లు తెరవాలి
కందుకూరు: ‘కాపు యువకుడు లక్ష్మీనాయుడు హత్యను పక్కదారి పట్టించేందుకు ఎల్లో మీడియా కట్టు కథలు అల్లుతోంది. కూటమి ప్రభుత్వంలో కాపులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఇప్పటికై నా కళ్లు తెరవాలి’ అని రాధా, రంగా మిత్ర మండలి రాష్ట్రాధ్యక్షుడు వంగవీటి నరేంద్ర అన్నారు. గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామంలో హత్యకు గురైన లక్ష్మీనాయుడి కుటుంబాన్ని ఆదివారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ లక్ష్మీనాయుడు, హంతకుడు కాకర్ల హరిచ్చంద్రప్రసాద్లు ప్రాణ స్నేహితులనే విధంగా చిత్రీకరిస్తున్నారన్నారు. ప్రాణ స్నేహితులైతే ప్రాణాలు తీస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీనాయుడి భార్యను లైంగికంగా వేధించి లొంగకపోయే సరికి అతడిని అడ్డు తొలగించేందుకు హత్య చేశారని వివరించారు. ఎన్నికల్లో వాడుకుని అన్యాయం కాపు కులాన్ని ఎన్నికల్లో వాడుకుని ఇంత అన్యాయం జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీనాయుడు హత్య కేసులో కేవలం ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేశారన్నారు. మరో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని, సహకరించిన వారిని కూడా అరెస్ట్ చేయాలన్నారు. ఈ ఘటనలో కులం ప్రస్తావన వచ్చినప్పుడు, ఇప్పుడు తమ కులం గురించి మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. మీరు ఒక్కరే మీ కులం ఓట్లతో గెలిచారా? అని ప్రశ్నించారు. అధికారంలోకి రావడానికి కాపులను వాడుకోలేదా అని నిలదీశారు. హరిచంద్రప్రసాద్ స్వతహాగానే నేర ప్రవృత్తిని కలిగి ఉన్నాడని, తన తల్లి చనిపోకముందే చనిపోయినట్లు బీమా క్లెయిమ్ చేశాడన్నారు. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న మహిళలను కేసులో చేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు. లక్ష్మీనాయుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడ తామన్నారు. వారికి కాపులంతా అండగా ఉంటారన్నారు. కూటమి ప్రభుత్వంలో న్యాయం జరిగే పరిస్థితి లేదు లక్ష్మీనాయుడి హత్యను పక్కదారి పట్టించే కుట్ర రాధా, రంగా మిత్రమండలి రాష్ట్రాధ్యక్షుడు వంగవీటి నరేంద్ర -
ఆగిన విద్యుత్ సరఫరా.. ఆస్పత్రిలో ఇక్కట్లు
చీకట్లో వార్డు ● పనిచేయని జనరేటర్లు ఆత్మకూరు: మున్సిపల్ పరిధిలో శనివారం రాత్రి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ సమయంలో జిల్లా ఆస్పత్రిలో చీకట్లు అలుముకున్నాయి. జనరేటర్ కూడా పనిచేయలేదు. దీంతో పలు వార్డుల్లో రోగులు ఇబ్బంది పడ్డారు. సుమారు గంటన్నరపాటు సరఫరా లేదు. నర్సులు సెల్ఫోన్ టార్చ్ వెలుగులోనే రోగులకు సైలెన్ పెట్టారు. జనరేటర్ కోసం సెక్యూరిటీ వారిని రోగుల బంధువులు సంప్రదించగా డీజిల్ లేక ఎయిర్ లాగడంతో పనిచేయడం లేదని చెప్పారు. జిల్లా ఆస్పత్రిలో ఇలాంటి దుస్థితి నెలకొనడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఇష్టారాజ్యంగా..
● పెన్నానదిలో ఇసుక తవ్వకాలు ఆత్మకూరు రూరల్: మండలంలోని బండారుపల్లి వద్ద పెన్నానదిలో ఆదివారం అక్రమంగా ఇసుక తవ్వకాలు ప్రారంభించారు. మహిమలూరు, దేపూరు గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో నదిలో తాగునీటి బావుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనులు జరిగే ప్రదేశానికి వెళ్లేలా తాత్కాలికంగా రోడ్డు నిర్మాణం చేశారు. అయితే దేపూరుకు చెందిన కొందరు ఈ రోడ్డుపై జేసీబీలను నిలిపి నదిలో అక్రమంగా ఇసుకను ట్రాక్టర్లకు లోడ్ చేస్తున్నారు. ఈ సమాచారం అందడంతో సంబంధిత అధికారులు అడ్డుకున్నారు. అయినా అక్రమార్కులు లెక్క చేయకపోవడంతో పలువురు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆత్మకూరు ఎస్సై జిలానీ వెళ్లడంతో అక్రమార్కులు వెళ్లిపోయారు. -
నేను ఆత్మహత్య చేసుకుంటున్నా
దుత్తలూరు: ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నా’ అంటూ వెలుగు వీఓఏ వాట్సాప్ గ్రూపులో సెల్ఫీ వీడియో పెట్టింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆమెతో మాట్లాడారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని నందిపాడులో వెలుగు వీఓఏగా రజియా పనిచేస్తోంది. ఆమె ఆదివారం ఆత్మహత్య చేసుకుంటున్నాంటూ వాట్సాప్ గ్రూపుల్లో సెల్ఫీ వీడియో పెట్టింది. సీసీ తనను విధుల నుంచి తప్పించి మరొకరిని పెట్టుకోవాలని చూస్తున్నారని అందులో ఆరోపించింది. కొందరు పొదుపు మహిళలు, మరో వ్యక్తి వేధిస్తున్నారని చెప్పుకొచ్చింది. విషయం తెలుసుకున్న ఎస్సై ఆదిలక్ష్మి సకాలంలో స్పందించి రజియాతో మాట్లాడి పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఎస్సై మాట్లాడుతూ వెలుగు అధికారులు వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో విచారించి తగిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేస్తామన్నారు.నేడు కోనలో రథోత్సవంరాపూరు: దీపావళి వేడుకలకు పెంచలకోన ముస్తాబవుతోంది. సోమవారం మూలమూర్తికి పూజలు నిర్వహిస్తామని ఆలయ అధికారులు ఆదివారం తెలిపారు. పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మిదేవి, చెంచులక్ష్మి ఉత్సవ విగ్రహాలను శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవి, సత్యభామగా అలంకరించి రథంపై కొలువుదీర్చి కోన మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహిస్తారు. నరకాసునివధ తదితర కార్యక్రమాలు జరుగుతాయి.● వాట్సాప్ గ్రూపులో పెట్టిన వీఓఏ ● వెంటనే స్పందించిన పోలీసులు -
దీపావళి కాంతులు
● అప్రమత్తతతోనే ఆనందం ● సంబరాల్లో జాగ్రత్తలు తప్పనిసరి నెల్లూరు(క్రైమ్): దీపావళి.. ఈ పండగంటే ప్రతి ఒక్కరికీ ఆనందం. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా, కులమతాలకు అతీతంగా అందరూ ఆనందోత్సాహాలతో పండగ చేసుకుంటారు. దీపావళి అంటే ముందుగా గుర్తుకొచ్చేది టపాసులే. పల్లె నుంచి పట్నం వరకూ మతాబుల మోతతో దద్దరిల్లాల్సిందే. ఇంటిల్లిపాది మతాబులు కాలుస్తూ సంతోషంగా గడుపుతారు. రంగురంగుల వెలుగుల్లో దీపావళి కాంతుల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉంటే చాలా ప్రమాదమే. వెలుగుల ఆనందం కాస్తా అంధకారంగా మారుతుంది. చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే పండగను సంతోషంగా జరుపుకోవచ్చు. ఇవి పాటించాలి లైసెన్స్ షాపుల్లోనే బాణసంచా కొనుగోలు చేయాలి. వాటిని వంటగది, పొయ్యి ఉన్న ప్రాంతాల్లో ఉంచరాదు. సురక్షిత ప్రదేశంలో పెట్టాలి. ఇంటి బయట, మైదానాల్లో మాత్రమే కాల్చాలి. ఈ సమయంలో దగ్గరగా నీరు, ఇసుక అందుబాటులో ఉంచుకోవాలి. తల్లిదండ్రుల సమక్షంలోనే పిల్లలు టపాసులు కాల్చాలి. కాటన్ దుస్తులు, పొడుగు చేతుల వస్త్రాలను మాత్రమే ధరించాలి. కాళ్లకు బూట్లు, కళ్లజోడు ధరించడం మంచిది. తారాజువ్వలను బాటిళ్లలో పెట్టి నిటారుగా ఉండేలా సరిచూసుకోవాలి. ఈ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్త వహించినా అవి ఇళ్లలోకి దూసుకుపోయే ప్రమాదముంది. గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలు, గడ్డివాములు, పూరిగుడిసెలు ఉండే ప్రదేశాల్లో చిచ్చుబుడ్లు, రాకెట్లు, తారాజువ్వలు వంటివి కాల్చ రాదు. సగం కాలిన వాటిని చేతులతో పట్టుకోవడం తగదు. బాణసంచా పూర్తిగా కాలలేదనుకుంటే పొరపాటే. అకస్మాత్తుగా పేలి గాయాలకు గురయ్యే పరిస్థితి. బాణసంచా కాల్చే సమయంలో వెలువడే వాయువును పీల్చడం హానికరం. గంధం, జింకు, మెగ్నీషియం, నైట్రేట్ వంటి పదార్థాలతో తయారైన టపాకాయలతో వచ్చే వాయువు పీల్చడంతో ఊపిరితిత్తుతులు దెబ్బతినడం, శ్వాసకోశ, ఆస్తమా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులు, గర్భిణులు, రెండేళ్లలోపు చిన్నారులకు దూరంగా టపాకాయలను కాల్చడం మంచిది. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో బాణసంచా వల్ల గాయపడితే సొంత వైద్యం కాకుండా వైద్యులను సంప్రదించాలి. అనుకోని ప్రమాదం జరిగినప్పుడు 101కు సమాచారం అందించాలి. -
సమ్మె విరమణ శోచనీయం
● డిమాండ్లు నెరవేర్చేంత వరకు దశలవారీ పోరాటాలు నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ప్రధాన డిమాండ్లను నెరవేర్చకుండానే సమ్మెను విరమించడం శోచనీయమని పలువురు పేర్కొన్నారు. నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో విలేకరులతో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దుగ్గిరాల సూరిబాబు, జిల్లా కార్యదర్శులు హజరత్తయ్య, జాకీర్హుస్సేన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూని యన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొజ్జా సుమన్ విలేకరులతో శనివారం మాట్లాడారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికుల క్రమబద్ధీకరణ, గ్రేడ్ – 2 జేఎల్ఎంల సమస్యల పరిష్కారం తదితరాలపై సమ్మెకు విద్యుత్ జేఏసీ పిలుపునిచ్చిందని చెప్పారు. ఈ క్రమంలో యాజమాన్యం, ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో డిమాండ్లను నెరవేర్చకుండానే మధ్యలో సమ్మెను విరమించడం శోచనీయమని చెప్పారు. కార్మికుల డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తోందని ఆరోపించారు. దశలవారీ పోరాటాలు, ఆందోళనలు చేసేందుకు విద్యుత్ స్ట్రగుల్ కమిటీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. యూనియన్ ఆఫీస్ బేరర్స్ పెంచలప్రసాద్, జిల్లా నేతలు సురేంద్ర, కొండయ్య, జనార్దన్, దయాకర్, నారాయణ, రామయ్య, మస్తాన్, ప్రసన్నకుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్టు సంఘాల నిరసన
మనుబోలు: ‘సాక్షి’ మీడియాపై పోలీసుల వేధింపులు అప్రజాస్వామికమని జర్నలిస్టు సంఘం నేత బాబూ మోహన్దాస్ అన్నారు. ఎడిటర్ ధనుంజయరెడ్డి, బ్యూరో ఇన్చార్జిలను కేసుల పేరుతో వేధించడాన్ని నిరసిస్తూ శనివారం మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో ఆర్ఐ అరుణ్తేజ్కు మీడియా ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ తమకు గిట్టని వార్తలు రాసే జర్నలిస్టులను పోలీసులు కేసుల పేరుతో వేధించడం దుర్మార్గమన్నారు. జర్నలిస్టులు స్వేచ్ఛగా తమ విధులను నిర్వర్తించుకునే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు రవీంద్ర బాషా, శ్రీనివాసులు, జగదీష్, జయకర్, సుధాకర్, శంకర్, సునీల్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్రే లక్ష్యం కావాలి
నెల్లూరు(బారకాసు): స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రే లక్ష్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా నగరంలోని బట్వాడిపాళెం నుంచి సారాయంగడి సెంటర్, అక్కడి నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు సైకిల్ ర్యాలీని శనివారం నిర్వహించారు. దీన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. స్వచ్ఛతలో జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలని కోరారు. నూరు శాతం చెత్త సేకరణ జరగాలని చెప్పారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలను తెలియజేశారు. కమిషనర్ నందన్ తదితరులు పాల్గొన్నారు . కండలేరులో 60 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో శనివారం నాటికి 60 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి 3,060 క్యూసెక్కుల నీరు చేరుతోందని చెప్పారు. సత్యసాయి గంగకు 1900, పిన్నేరుకు 850, లోలెవల్కు 40, హైలెవల్కు 200, మొదటి బ్రాంచ్ కాలువలకు ఐదు క్యూసెక్కు లను విడుదల చేస్తున్నామని వివరించారు. -
‘తుంగభద్రకు పట్టిన గతి తప్పదు’
సోమశిల: నెల్లూరు జిల్లా రైతాంగానికి తాగు, చైన్నె, తిరుపతి నగరాలకు తాగునీరందించే సోమశిల జలాశయం భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రాజెక్ట్ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం గండం పొంచి ఉందని తెలుస్తోంది. ప్రాజెక్ట్ నిర్వహణకు గతంలో సుమారు 30 మంది వరకు సిబ్బంది విధుల్లో ఉండేవారు. అయితే ప్రస్తుతం కేవలం నలుగురికే పరిమితం కావడంతో జలాశయం నిర్వహణ లోపం కనిపిస్తోంది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 74 టీఎంసీలు ఉన్నాయి. ఎందుకీ భయం.. ఏమానుమానాలు? సోమశిల జలాశయానికి 12 క్రస్ట్ గేట్లు ఉన్నాయి. అన్ని క్రస్ట్ గేట్ల ద్వారా ఒకేసారి నీటిని విడుదల చేస్తే 24 గంటల వ్యవధిలో గరిష్టంగా 6 లక్షల నుంచి 6.50 లక్షల నీటి విడుదల చేసే అవకాశం ఉందని ప్రాజెక్ట్ ఇంజినీర్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం జలాశయంలో 11, 12వ క్రస్ట్ గేట్లు పూర్తిగా బ్లాక్ అయ్యాయి. గేట్లు లిఫ్ట్ చేసే రోప్లు పూర్తిగా దెబ్బతినడంతో అవి లిఫ్ట్ అయ్యే సమయంలో తెగిపోయే అవకాశం ఉండడంతో రోప్లు మార్చే ప్రక్రియ విషయంలో సంబంధిత అధికార యంత్రాంగం ఆది నుంచి అలవికాని నిర్లక్ష్యం ప్రదర్శించింది. జలాశయంలో నీటి సామర్థ్యం తక్కువగా ఉన్న సమయంలోనే చేయాల్సి ఉన్నా.. వేసవి కాలం అంతా పట్టించుకోలేదు. తాజాగా ఎగువ నుంచి ఇటీవల వరద రావడంతో ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. ఈ క్రమంలో ప్రాజెక్ట్ నుంచి కేవలం 5, 6, 7 క్రస్ట్ గేట్ల నుంచి మాత్రమే నీటిని దిగువకు విడుదల చేయడంతో మిగతా గేట్ల లిఫ్ట్పై అనేక అనుమానాలు ఉన్నాయి. 1, 2, 3, 4, 8, 9, 10 గేట్ల రోప్లు సైతం తుప్పు పట్టి ఉన్నాయి. దాదాపుగా నాలుగేళ్లుగా ఈ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన సందర్భం లేదు. ప్రధానంగా సిబ్బంది కొరత కారణంగా ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్ల నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. భారీ స్థాయిలో వరదలు వస్తే పరిస్థితి ఏమిటనే భయం జిల్లా వాసులను వెంటాడుతోంది. వణికించిన 2021 నవంబర్ వరదలు సోమశిలకు నాలుగున్నర దశాబ్దాల కాలంలో ఎన్నడూ భారీ స్థాయిలో వరదలు వచ్చిన సందర్భం లేదు. 2021 నవంబర్లో ఎగువన అన్నమయ్య డ్యామ్ తెగి ప్రాజెక్ట్కు ఊహించని స్థాయిలో వరద వచ్చింది. రాత్రికి రాత్రే ఒక్కసారిగా ప్రాజెక్ట్ 12 క్రస్ట్ గేట్లు ఎత్తి సుమారుగా 6 లక్షల క్యూసెక్కులు విడుదల చేయడంతో దిగువన పెన్నానది తీరం వెంబడి అనేక ప్రాంతాల ముంపునకు గురయ్యాయి. ఎగువ నుంచి వచ్చిన వరదను ఆ స్థాయిలో దిగువకు విడుదల చేయకపోతే ప్రాజెక్ట్ ప్రమాదంలో పడేదని జలవనరుల నిపుణులు అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో గండం గడిచిపోయింది. ఆ తర్వాత ఆ స్థాయిలో గత మూడేళ్లుగా వరదలు రాలేదు. నూతన రోప్లు వచ్చి నాలుగు నెలలు రాష్ట్ర జలవనరుల సాంకేతిక సలహాదారు కన్నయ్యనాయుడు పరిశీలించిన రెండు నెలలకు కాంట్రాక్ట్ అప్పగించి నూతన రోప్లను ప్రాజెక్ట్ వద్దకు చేర్చారు. అప్పట్నుంచి సుమారు నాలుగు నెలలు అవుతున్న రోప్ల మరమ్మతులు చేయలేదు, ఇటీవల ఒకటో నంబర్ క్రస్ట్ గేటుకు స్టాప్ లాక్ అమర్చి మరమ్మతు చేయాలని ముందుకు వచ్చారు. ఈ తరుణంలో వరదలు వచ్చి జలాశయం పూర్తిగా నిండిపోయింది. ప్రస్తుతం నీటిలో రోప్లో మార్చేందుకు సంబంధిత వర్కర్లు రావడం లేదని జలాశయ అధికారులే చెబున్నారని సమాచారం. పొంచి ఉన్న ప్రమాదం గ్రేటర్ రాయలసీమపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంటుంది. నైరుతి రుతుపవనాలు విస్తరించిన సమయంలో అడపాదడపా వర్షాలు కురిసినా రాయలసీమ జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై పెద్దగా వర్ష ప్రభావం ఉండదు. తాజాగా ఈశాన్య రుతుపవనాలు రాకతో వాతావరణ మార్పులు సంభవించాయి. ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడ ఆకస్మిక వర్షాలు, వరదలు వస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో వర్షాలు పడుతాయో ఎవరూ ఊహించలేని పరిస్థితి. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఈశాన్య రుతుపవనాల ప్రభావంగా ఎగువ ప్రాంతాల్లో, జలాశయ ప్రాంతంలో కురిసే ప్రతి వర్షపు చుక్క నేరుగా సోమశిల జలాశయానికి చేరుతోంది. ఇప్పటికే నిండుకుండగా ఉన్న జలాశయానికి వచ్చే వరద జలాలను నిల్వ ఉంచేందుకు వీలులేనందున దిగువకు విడుదల చేయాల్సి పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో గతంలో వచ్చిన స్థాయిలో వరద వస్తే.. క్రస్ట్ గేట్లను లిఫ్ట్ చేసి వరద దిగువకు విడుదల చేయాలంటే.. 11, 12 క్రస్ట్ గేట్లు పూర్తిగా బ్లాక్ అయిపోవడంతో మిగిలిన పది గేట్లలో ప్రస్తుతం 5, 6, 7 క్రస్ట్ గేట్లు సేఫ్గానే ఉన్నాయని ఇటీవల స్పష్టమైంది. మిగతా గేట్ల విషయంలో జలాశయం అధికారులకే స్పష్టత లేదని సంబంధిత అధికార వర్గాల ద్వారా స్పష్టమవుతోంది. ఎనిమిది నెలల క్రితం రాష్ట్ర జలవనరుల సాంకేతిక సలహాదారు కన్నయ్యనాయుడు జలాశయ స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రాజెక్ట్ పరిశీలనకు వచ్చారు. జలాశయ ఎస్ఈ, ఈఈ, డీఈ, సిబ్బందితో కలిసి జలాశయ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన క్రస్ట్ గేట్ల దుస్థితి చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్ల విషయంపై కనీస నిర్వహణ చేయకపోవడంతో ఆయన మండి పడ్డారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్ గేట్లకున్న రోప్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.. ఇలానే మార్చకుండా మరమ్మతులు చేయకుండా వదిలేస్తే గతంలో తుంగభద్రకు పట్టిన గతి ఈ ప్రాజెక్ట్కు పడుతుందన్నారు. -
పత్రికా స్వేచ్ఛను హరించడమే
ఉదయగిరి: ప్రజాస్వామ్య వ్యవస్థకు పత్రికా రంగం మూల స్తంభం. వార్తల విషయంలో ప్రతికలకు ఎంతో స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛపై కూటమి ప్రభుత్వం దాడి చేస్తోందంటూ ఉదయగిరి నియోజకవర్గంలోని పలువురు విలేకరులు ధ్వజమెత్తారు. ‘సాక్షి’ మీడియాపై ప్రభుత్వం కేసులు బనాయించడం, పోలీసులతో కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తూ భయభ్రాంతులకు గురి చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద జర్నలిస్టుల ఐక్య సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి, నెల్లూరు బ్యూరో మస్తాన్రెడ్డిలకు అర్ధరాత్రి నోటీసులు జారీ చేయడం, విచారణ పేరుతో వేధించడం తగదన్నారు. పత్రికలు ప్రజల తరపున పోరాడే వ్యవస్థ అని, ప్రచురించే వార్తలో సందేహాలుంటే న్యాయబద్ధ రీతిలో వ్యవహరించాలి తప్ప అక్రమంగా కేసులు పెట్టడం తగదన్నారు. ఈ ధోరణితో ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
అమరావతికి రేషన్ పంచాయితీ
నెల్లూరు సిటీ: జిల్లాలో టీడీపీ నేతలు విచ్చలవిడిగా సాగిస్తున్న రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం ఆ పార్టీని ఇరకాటంలో పెట్టింది. నెలకు రూ.కోట్లల్లో ఈ దందా జరుగుతోంది. అయితే తమకు అందాల్సిన వాటాలు అందకపోవడమో.. మరేదో తెలియదు కానీ.. ఆ పార్టీ నేత, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఇటీవల మంత్రి నారాయణ కీలక అనుచరుడు, సివిల్సప్లయ్స్ శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని ప్రత్యక్షంగా, జనసేన పార్టీని పరోక్షంగా డీసీఎం పవన్కల్యాణ్, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను టార్గెట్ చేసి రేషన్ మాఫియా దందాపై బహిరంగంగా ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ పరిణామాలు రెండు పార్టీల్లోనూ కాక పుట్టించింది. టీడీపీ నేత బహిరంగ విమర్శలు ఆ పార్టీకి తలనొప్పిగా పరిణమించాయి. మంత్రి నారాయణ నియోజకవర్గ పరిధిలోని నేతలు పార్టీ పరువును బజారుకీడ్చడంతో సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లు సమాచారం. మరో వైపు నాదెండ్ల మనోహర్ సైతం మంత్రి నారాయణపై తీవ్రస్థాయిలో అసహానం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈక్రమంలో నారాయణ సదరు నేతలపై టెలికాన్ఫరెన్స్లో తీవ్ర స్థాయిలో మండిపడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వరుస పరిణామాలు కూటమి పార్టీలను ఇరకాటంలో పెట్టడంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిలను శనివారం అమరావతికి పిలిపించిన పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చీవాట్లు పెట్టారని సమాచారం. బహిరంగ విమర్శలు ఎందుకు చేసుకున్నారు? రేషన్ బియ్యంలో పాత్ర ఎవరిది ఉంది? మీడియా ముందు ఎందుకు విమర్శలు చేశారు? అంటూ పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ఈ విషయంపై ఆగ్రహంగా ఉన్నారని చెప్పినట్లు సమాచారం. మరోసారి ఇటువంటి చర్యలకు పాల్పడితే వారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలిసింది. వీరిద్దరితోపాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, వక్ఫ్బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కూడా పాల్గొన్నారు. టీడీపీ నేతల మధ్య రేషన్ బియ్యం విభేదాలు నుడా చైర్మన్ కోటంరెడ్డి బహిరంగ విమర్శలపై అధిష్టానం సీరియస్ మంత్రి నారాయణ టెలి కాన్ఫరెన్స్ పెట్టి ఆగ్రహం జిల్లా నేతలకు చీవాట్లు పెట్టిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా -
జర్నలిస్టులను వేధించడం తగదు
సమాజంలో జరుగుతున్న విషయాలను ప్రజలకు చేరవేడం జర్నలిస్టుల విధి. మూడో మైలు దగ్గర మద్యం షాపు వద్ద ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయంపై స్థానికుల సమాచారం మేరకు ‘సాక్షి’ బ్యూరో మస్తాన్రెడ్డి వార్తను రాశారు. దీనిపై కక్ష కట్టిన ప్రభుత్వం అక్రమ కేసులతో అర్ధరాత్రి నోటీసులతో భయపెడుతూ వేధించడం తగదు. – జయరాజు, జర్నలిస్టు సంఘాల జేఏసీ పత్రికల గొంతు నొక్కకండి జర్నలిస్టులకు పార్టీలను ఆపాదించడం సరికాదు. ఏ పార్టీ అయినా రాజకీయంగానే పోరాడాలే తప్ప జర్నలిస్టులపై కక్ష సాధించడం, పత్రికల గొంతు నొక్కడం ప్రజాస్వామ్య హితం కాదు. ఏదైనా అభ్యంతరకరమైన వార్త ప్రచురితమైతే వివరణ కోరాలే కానీ, ‘సాక్షి’ ఎడిటర్, బ్యూరో చీఫ్, రిపోర్టర్లపై కేసులు పెట్టి పోలీసుల ద్వారా నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో బెదిరించడం దుర్మార్గం – పర్రి బాలకృష్ణ, జర్నలిస్టు సంఘాల జేఏసీ -
లక్కీడిప్.. గందరగోళం
నెల్లూరు సిటీ: బాణసంచా దుకాణాల కేటాయింపునకు సంబంధించిన లక్కీడిప్ ఈ ఏడాది గందరగోళంగా మారింది. ప్రక్రియను నెల్లూరు ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం రాత్రి నిర్వహించారు. అయితే ఇందులో తమకు అన్యాయం జరిగిందంటూ అధికారులపై కొందరు లైసెన్స్దారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి లైసెన్స్దారులకు నచ్చజెప్పి ప్రక్రియను పూర్తి చేశారు. వీఆర్సీ గ్రౌండ్స్లో 41.. వైఎమ్సీఏ గ్రౌండ్స్లో 36.. చిల్డ్రన్స్పార్క్ సమీపంలో 25.. గోషాస్పత్రి ప్రాంతంలో 11.. ఆరెస్సార్లో 27, బీవీఎస్ గర్ల్స్ హైస్కూల్ వద్ద ఒక దుకాణానికి అనుమతిచ్చారు. ఈసారి కుదింపు వాస్తవానికి వీఆర్సీ గ్రౌండ్స్లో ఏటా 60 నుంచి 65 దుకాణాలకు అనుమతులిచ్చేవారు. అయితే ఈ ఏడాది ఓ ప్రైవేట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో స్టేజ్ ఏర్పాటును ప్రారంభించారు. దీంతో అక్కడ 41 దుకాణాలకే అనుమతులను మంజూరు చేశారు. దీనిపై లైసెన్స్దారులు మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఏర్పాటు చేసుకుంటున్నామని, ఇప్పుడు మరోచోట పెట్టుకోవాలని అధికారులు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 42వ నంబర్ నుంచి వచ్చే దుకాణాలను ఇతర చోట్ల ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మ్యాప్లో పొరపాటు వీఆర్సీ గ్రౌండ్స్లో 41వ దుకాణాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలం లేకపోవడంతో లైసెన్స్దారుడు మండిపడ్డారు. తానెక్కడ పెట్టాలని ప్రశ్నించారు. ఫైరింజిన్ ప్రవేశానికి వీఆర్సీ కళాశాల నుంచి దారిని ఏర్పాటు చేయడంతో ఈ మార్పు జరిగింది. చివరికి ఓ దుకాణాన్ని కుదించి దీని ఏర్పాటుకు వీలు కల్పించారు. మరోవైపు భారీ వర్షాలతో ఇక్కడి మైదానం చిత్తడిగా మారడం ఇబ్బందిగా పరిణమించింది. బాణసంచా దుకాణాల కేటాయింపునకు ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహణ ఏటా 60కు అనుమతి.. ఈసారి మాత్రం 41 అధికారులను ప్రశ్నించిన లైసెన్స్దారులు -
లక్ష్మీనగర్లో చోరీ
నెల్లూరు(క్రైమ్): ఇంటి కిటికీ గ్రిల్స్ తొలగించి వెండి వస్తువులు, టీవీని గుర్తుతెలియని దుండగులు అపహరించుకెళ్లారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు బాలాజీ నగర్ పరిధిలోని లక్ష్మీనగర్లో రవీంద్రశర్మ, వసంతలక్ష్మి దంపతులు నివాసముంటున్నారు. కుమారుడు, బంధువులు హైదరాబాద్లో ఉన్నారు. వారిని కలిసేందుకు ఈనెల మూడో తేదీన దంపతులు హైదరాబాద్కు వెళ్లారు. ఈక్రమంలో గుర్తుతెలియని దుండగులు ఇంటి కిటికీ గ్రిల్స్ తొలగించి లోనికి ప్రవేశించారు. అర కేజీ వెండి వస్తువులు, ఒక టీవీని చోరీ చేశారు. శుక్రవారం ఇంటికొచ్చిన బాధితులు బాలాజీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.వ్యక్తిపై హత్యాయత్నం నెల్లూరు(క్రైమ్): ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు ఖాళీ మద్యం బాటిళ్లతో ఓ వ్యక్తి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారు. విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటన నెల్లూరు త్యాగరాజనగర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. త్యాగరాజనగర్ మూడో వీధిలోని ఓ అపార్ట్మెంట్లో వి.కిశోర్కుమార్, అరుణ దంపతులు నివాసముంటున్నారు. వారికి ఎనిమిదేళ్ల వయసున్న కుమారుడు, ఏడేళ్ల వయసున్న కుమార్తె ఉన్నారు. కిశోర్ జేసీబీ కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని ముగ్గురు దండుగులు అతని ఇంటికెళ్లారు. కిశోర్ తలుపు తీశారు. ముగ్గురూ లోనికెళ్లి చంపండిరా అంటూ తమ చేతిలో ఉన్న ఖాళీ మద్యం బాటిళ్లతో కిశోర్పై దాడిచేయడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. భార్య అనూష పెద్దగా కేకలు వేయడంతో నిందితులు పారిపోయారు. ఆమె స్థానికుల సహకారంతో భర్తను 108 అంబులెన్స్లో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిశోర్ ప్రస్తుతం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. కోలుకుంటే దాడికి గల కారణాలు తెలిసే అవకాశం ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.వర్షం.. అన్నదాతలకు నష్టం సోమశిల: అనంతసాగరం మండలంలో కురిసిన వర్షాలతో వందల ఎకరాల్లో వరి పంట నేలవాలింది. పాతదేవరాయపల్లి, కొత్తపల్లి తదితర గ్రామాల్లో చేతికొచ్చిన పంట నీట మునిగి నష్టం వాటిల్లినట్టు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి సాయం చేయాలని కోరుతున్నారు. కండలేరులో 59.990 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 59.990 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 3,790 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,950, పిన్నేరు కాలువకు 500, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 200, మొదటి బ్రాంచ్ కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.పాముకాటుకు వ్యక్తి మృతి కలువాయి(సైదాపురం): పాముకాటుకు ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కలువాయి మండలం మాదన్నగారిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసు లు, స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన దండు పెంచలయ్య (48) కూలీ పనులు చే సుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. భార్య, ముగ్గు రు పిల్లలున్నారు. అతను గురువారం రాత్రి బహిర్భూమికెళ్లి తిరిగి ఇంటికి వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. నోటినుంచి నురగ రావడంతో కు టుంబ సభ్యులు గమనించి కలువాయిలోని ప్రైవే ట్ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న ఎస్సై కోటయ్య కేసు నమోదు చేశారు. 20న కోనలో దీపావళి వేడుకలు రాపూరు: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో 20వ తేదీ దీపావళి వేడుకలు నిర్వహించనున్నట్లు దేవస్థాన అధికారులు శుక్రవారం తెలిపారు. కోన పురవీధుల్లో రథోత్సవం, ఆర్టీసీ బస్టాండ్ వద్ద నరకాసుర వధ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలియజేశారు. ఉదయం 9 గంటలకు పెనుశిల లక్ష్మీనరసింహ స్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి ఉత్సవ విగ్రహాలను రథంపై కొలువుదీర్చి కోన మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో 30 కంపార్టుమెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 61,521 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 25,101 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.66 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమ యం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని, ముందుగా వెళ్తే అనుమతించరని టీటీడీ స్పష్టం చేసింది. బీఎస్ఎన్ఎల్ దీపావళి ఆఫర్లు నెల్లూరురూరల్: బీఎస్ఎన్ఎల్ కొత్త వినియోగదారులకు దీపావళి పండగ సందర్భంగా కానుక ప్రకటించిందని ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ అమరేందర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్యాకేజీలో రూ.1కే సిమ్, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2.5 జేబీ హైస్పీడ్ డేటా, 100 ఎస్ఎంఎస్లు ఉపయోగించుకోవచ్చు అని తెలిపారు. ఈ సిమ్ కోసం ఆధార్ ధ్రువీకరణతో దగ్గరలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్, రిటైలర్ వద్దకు గాని లేదా డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్లను సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశం నవంబరు 15 వరకు కొనసాగుతుందన్నారు. రెవెన్యూ జోన్–3 క్రీడలు వాయిదా నెల్లూరు (అర్బన్): ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీల్లో ఒంగోలులో జరగాల్సిన జోన్–3 (నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు) క్రీడలను వర్షాల నేపథ్యంలో ఈ నెల 23, 24 తేదీలకు వాయిదా వేశామని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, అమరావతి జేఏసీ చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి శుక్రవారం నెల్లూరులో ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి మూడేళ్లకు ఒక దఫా రెవెన్యూ క్రీడలను అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుతున్నామన్నారు. జోన్ల స్థాయిలో పోటీలు పూర్తి చేసుకుని వచ్చే నెల 7 నుంచి 3 రోజులపాటు అనంతపురంలో రాష్ట్ర స్థాయి పోటీలను అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహిస్తామన్నారు. రెవెన్యూ ఉద్యోగులు క్రీడా పోటీలను విజయవంతం చేయాలని కోరారు. సంగం తహసీల్దార్కు డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగోన్నతి సంగం: రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జాబితాలో ఉన్న సంగం తహసీల్దార్ సోమ్లానాయక్ డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొందారు. దీంతో శుక్రవారం కార్యాలయంలో సిబ్బంది పూలమాలలు, శాలువాలతో సోమ్లానాయక్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ జ్యోతి, ఆర్ఐ సల్మా, వీఆర్వోలు సిబ్బంది పాల్గొన్నారు. సమష్టి కృషితో వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన● జేసీ ఎం. వెంకటేశ్వర్లు నెల్లూరురూరల్: సమష్టి కృషితోనే వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన సాధ్యమని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ స మావేశం జరిగింది. ఇప్పటి వరకు వెట్టిచాకిరీ నిర్మూలన, ప్రయత్నాయ ఉపాధి, పునరావాస కల్పనకు తీసుకున్న చర్యలను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సీహెచ్ విజయ్కుమారరెడ్డి కమిటీ సభ్యులకు వివరించారు. జేసీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో ఇటుక బట్టీలు, పరిశ్రమలు, వ్యాపార దుకాణాలు, రొయ్యలు, చేపల గుంతలు, రైసు మిల్లులు, హోటళ్ల మొదలైన ప్రదేశాల్లో కమిటీ సభ్యులు ఆకస్మిక తనిఖీలు చేసి వెట్టిచాకిరి బాధితులను గుర్తించాలన్నారు. విముక్తి పొందిన బాలురకు ఒక సర్టిఫికెట్ అందించి పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలతో తోడ్పాటు అందిస్తున్నాయని వివరించారు. సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి, డీఎంహెచ్ఓ సుజాత, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, ఐటీడీఏ పీఓ మల్లికార్జునరెడ్డి, ఏఎస్ఐ వై శ్రీహరి, సభ్యులు బషీర్, సుదర్శన్, దాసరి పోలయ్య, సత్యవతమ్మ, పాపయ్య పాల్గొన్నారు. -
బాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వెంకటగిరి(సైదాపురం): సీఎం చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని నేదురుమల్లి నివాసంలోని ఎన్జేఆర్ భవనంలో వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్య, ప్రజలకు వైద్యం అందేలా గత ప్రభుత్వం మెడికల్ కళాశాలను నిర్మించారన్నారు. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ సంస్థలకు అప్పనంగా అప్పగించే కుట్రకు తెరలేపిందని మండిపడ్డారు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబును మించిన వారు దేశంలో ఇంకెవరూ లేరని ఎద్దేవా చేశారు. తప్పు చేసిన ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని మరోసారి స్పష్టం చేశారు. రామ్కుమార్రెడ్డి మాట్లాడుతూ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై పార్టీలతో సంబంధం లేకుండా కోటి సంతకాల కార్యక్రమానికి స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు రావాలన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. దీనికి అధికారులు కూడా సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నట్లు చెప్పారు. జనసేన నేత గూడూరు వెంకటేశ్వర్లు తప్పును ఎత్తిచూపించినందుకు ఆయనపై కూడా కేసు నమోదు చేశారన్నారు. అనంతరం రామ్కుమార్రెడ్డి మొదటి సంతకం చేసి కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, స్టేట్ ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ మెంబర్ బొలిగర్ల మస్తాన్ యాదవ్, పాపకన్ను మధుసూదన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ, మండల కన్వీనర్లు, రాష్ట్ర విభాగాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. -
శ్లాబ్ కూలి.. కన్నీళ్లు మిగిలి..
● నెల్లూరులో వ్యక్తి దుర్మరణం నెల్లూరు(క్రైమ్): అతను కుటుంబ సోషణ నిమిత్తం పనికెళ్లేందుకు తెల్లవారుజామునే నిద్ర లేచాడు. సిద్ధమై ఇంటి నుంచి బయటకు రాగా శ్లాబ్ రూపంలో మృత్యువు కబళించింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్లాబ్ కూలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరులోని రంగనాయకులపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సోమిశెట్టి కల్యాణ మండపం సమీపంలో ఎన్.వెంకటేశ్వర్లుకు చెందిన గృహ సముదాయంలో బొమ్మా దయాకర్ (47), లక్ష్మి దంపతులు అద్దెకుంటున్నారు. దయాకర్ స్థానికంగా టీ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోడ్డు మార్జిన్లో దుకాణం తొలగించడంతో కొంత కాలంగా తోపుడు బండిపై టీ విక్రయిస్తున్నాడు. రోజూ తెల్లవారుజామునే టీ తయారు చేసుకుని బండిపై పెట్టుకుని అమ్ముకునేవాడు. శుక్రవారం తెల్లవారుజామున సిద్ధమై బయటికొచ్చాడు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రెండో అంతస్తు సైడ్ శ్లాబ్ నానిపోయి ఉండగా అది విరిగి దయాకర్పై పడింది. పెద్ద శబ్దం రావడంతో భార్య, పక్క ఇళ్లలో ఉన్నవారు బయటికొచ్చిచూడగా అప్పటికే దయాకర్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. దీంతో వారు 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని దయాకర్ను పరీక్షించి అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. కాసేటి క్రితం వరకు ఇంట్లో తిరిగిన భర్త విగతజీవిగా పడి ఉండటాన్ని చూసిన లక్ష్మి కన్నీరుమున్నీరుగా రోదించింది. బాధితురాలు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ వైవీ సోమయ్య, ఎస్సై సుల్తాన్బాషాలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జర్నలిస్టుల హక్కులను హరించడమే
ఆత్మకూరు: ప్రజాస్వామ్య వ్యవస్థకు పత్రికారంగం ఓ స్తంభం. బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తూ ప్రభుత్వం ఎడిటర్లు, బ్యూరోలు, విలేకర్లపై అక్రమ కేసులు బనాయించడం సరికాదని ఆత్మకూరు డివిజన్ పరిధిలోని విలేకరులు ఎలుగెత్తి చాటారు. ‘సాక్షి’ మీడియాపై ప్రభుత్వం కేసులు బనాయించడం, పోలీసులతో కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తుండడాన్ని నిరసిస్తూ ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం వద్ద పలు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా విలేకర్లు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, విలేకర్లపై అక్రమ కేసులు ఎత్తివేయాలని నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ డిప్యూటీ తహసీల్దారు సంధ్యారాణికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరుతో పాటు రూరల్, ఏఎస్పేట, చేజర్ల, సంగం, అనంతసాగరం, మర్రిపాడు మండలాల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల పాల్గొన్నారు. -
టీచర్లను రిలీవ్ చేయాలి
నెల్లూరు(టౌన్): ఈ ఏడాది జూన్లో ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయా లని పలువురు డిమాండ్ చేశారు. నెల్లూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద టీచర్లు చేస్తున్న ధర్నాకు మద్దతుగా ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ హజరత్ 48 గంటల ఆమరణ నిరాహార దీక్షను శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సుమారు 450 మంది ఉపాధ్యాయులు రిలీవర్లు లేని కారణంగా బదిలీ కాలేదన్నారు. ఎంటీఎస్ టీచర్లతో, ఆ తర్వాత డీఎస్సీ నూతన ఉపాధ్యాయులతో రిలీవ్ చేస్తామని చెప్పినా ఇంత వరకు చర్యలు తీసుకోలేదన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు తిరుమలేష్, వెంకటరావు, మాధవి, సుమ, కుసుమ, భార్గవి, వహీదా, సర్వసతి, బ్యూలా పాల్గొన్నారు. -
పత్రికా స్వేచ్ఛపై దాడి
నెల్లూరురూరల్ : ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధంగా ‘సాక్షి’ జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం, పత్రికా స్వేచ్ఛపై కక్ష పూరిత దాడులు చేయడం దారుణమని, జర్నలిస్టు సంఘాల ఐక్యవేదిక (జేఏసీ) నాయకులు దయాశంకర్, ‘సాక్షి’ టీవీ బ్యూరో ఇన్చార్జి లోకేశ్ అన్నారు. ‘సాక్షి’ పత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి, నెల్లూరు జిల్లా బ్యూరో ఇన్చార్జి సీహెచ్ మస్తాన్రెడ్డి, అర్ధరాత్రి పూట నోటీసులు, కలిరిగి రిపోర్టర్ ఇంట్లో సోదాలు చేయడం, వేధించడాన్ని నిరసిస్తూ శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు నిరసన నినాదాలు చేశారు. కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసి జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు వినతి పత్రం ఇచ్చారు. కలెక్టర్తో నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులకు పార్టీలతో సంబంధం ఉండదన్నారు. ప్రజా సమస్యలపై కథనాలు, వార్తలు మాత్రమే రాస్తారన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే జర్నలిస్టుల విధి అన్నారు. ఈనెల 8న నకిలీ మద్యానికి సంబంధించి స్థానికులు అనుకుంటున్న సమాచారాన్ని వార్త రూపంలో ‘సాక్షి’ ప్రచురించిందన్నారు. ఈ వార్తలో ఏమైనా అభ్యంతరాలున్నాయని భావిస్తే ఖండన పంపొచ్చని లేదా చట్టపరంగా చర్యలు చేపట్టవచ్చన్నారు. అయితే అందుకు విరుద్ధంగా ప్రజా సమస్యలను పరిష్కరించడం చేతకాని ప్రభుత్వం ‘సాక్షి’ పత్రిక బ్యూరో ఇన్చారి్జ్ ఇంటికి అర్ధరాత్రి పూట పోలీసులను పంపి నోటీసులు ఇవ్వడం ఎంత వరకు సమంజనమన్నారు. చుట్టుపక్కల వారిని భయభ్రాంతులకు గురి చేయడం. ఇళ్లలోని మహిళలలను భయపడేలా చేయడం వంటి ఘటనలు చట్టానికి విరుద్ధంగా చేశారన్నారు. ‘సాక్షి’ పత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డికి కూడా అర్ధరాత్రి హైదరాబాద్లో నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. మాటి మాటికి విచారణ పేరుతో పోలీసుస్టేషన్కు పిలిపించడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభం జర్నలిజం అనేది మరిచారా అంటూ నిగ్గదీశారు. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే కాకుండా వార్తలు రాయకుండా అక్రమ కేసులతో జర్నలిస్టులను భయపెట్టే ప్రయత్నం చేయడమేనని ఆరోపించారు. దీనిని తాము ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం తమ చర్యలు మానుకోకుంటే ఐక్య ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ‘సాక్షి’ బ్యూరో మస్తాన్రెడ్డి, ‘సాక్షి’ యోగానందరెడ్డి, సాంబశివరావు, ధనలక్ష్మి, హజరత్తయ్య, కృష్ణారెడ్డి, శ్రీధర్, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు. పోలీసుల విచారణకు ‘సాక్షి’ బ్యూరో హాజరు సంఘీభావం తెలిపిన జర్నలిస్టులు నెల్లూరు(క్రైమ్): ‘సాక్షి’ పత్రికలో వచ్చిన వార్త కథనాలపై నెల్లూరు రూరల్, కలిగిరి పోలీసుస్టేషన్లలో నమోదైన కేసుల్లో ‘సాక్షి’ బ్యూరో ఇన్చార్జి సీహెచ్ మస్తాన్రెడ్డి శుక్రవారం పోలీసు విచారణకు హాజరయ్యారు. అత్యవసర పనుల దృష్ట్యా ఈ నెల 24న విచారణకు హాజరవుతానని ఆయన లిఖిత పూర్వకంగా నెల్లూరు రూరల్ ఎస్ఐ లక్ష్మణ్, కలిగిరి ఎస్ఐ ఉమాశంకర్లను కోరారు. అందుకు వారు సమ్మతించారు. జర్నలిస్టులు పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ పోలీసుస్టేషన్ వద్దకు చేరుకుని మస్తాన్రెడ్డికి సంఘీభావం ప్రకటించారు. ‘సాక్షి’ మీడియాపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలనీ, వేధింపులు ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘సాక్షి’ జర్నలిస్టులపై అక్రమ కేసులు దారుణం వాస్తవాలు రాస్తే వేధిస్తారా? అర్ధరాత్రి పోలీసుల ద్వారా నోటీసులిచ్చి భయభ్రాంతులకు గురి చేస్తారా? ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభం జర్నలిజం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు జర్నలిస్టుల ఐక్యసంఘాల వేదిక వినతిపత్రం అందజేత -
నకిలీ మద్యంపై పోరాటమే
● ప్రభుత్వ పెద్దల భరోసాతో టీడీపీ నేతలు ఈ స్థాయిలో మద్యం తయారీ చేశారు ● 16 నెలలుగా నకిలీ మద్యం తయారవుతుంటే.. గుర్తించలేని గుడ్డి ప్రభుత్వం ● ఈ కేసును నీరుగార్చేందుకే సిట్ పేరుతో విచారణ ● సీబీఐ విచారణ జరిగితే నకిలీ మద్యం వెనుక ఎవరున్నారనేది నిగ్గుతేలుతుంది ● రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత నెల్లూరు (స్టోన్హౌస్పేట): రాష్ట్రంలో నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు కోల్పోతున్నా కూటమి ప్రభుత్వం పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత అన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులంతా ప్రభుత్వ పెద్దల వాటాదారులు కావడంతో మొక్కుబడిగా కేసులు నమోదు చేసి, టీడీపీ నేతలను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఈ కేసులో ప్రధాన పాత్రధారులను రక్షించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ కుంభకోణాన్ని వైఎస్సార్సీపీకి ఆపాదించడం హాస్యాస్పదన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం నకిలీ మద్యం కేసును సీబీఐతో విచారణ కోరకుండా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సిట్ అధికారులతో విచారణకు ఆదేశించి పక్కదారి పట్టిస్తున్నట్లు ప్రజల్లో అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వ పెద్దల పాత్రే కీలకం ఈ నకిలీ మద్యం తయారీలో ప్రభుత్వ పెద్దల పాత్ర కీలకంగా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. వీరి అనుమతి లేకుండానే ఈ స్థాయిలో మద్యం తయారు చేయడం అంటే సాధ్యం కాదన్నారు. 16 నెలలుగా నకిలీ మద్యం తయారు అవుతుంటే ఈ ప్రభుత్వం ఏమి చేస్తుందని నిలదీశారు. ప్రభుత్వ ఇంటెలిజెన్స్, నిఘా వర్గాలు, ఎకై ్సజ్, ఎన్ఫోర్స్మెంట్, పోలీస్ శాఖలు ఏమీ చేస్తున్నాయని నిలదీశారు. దీన్ని బట్టి అసమర్థ ప్రభుత్వమా?. గుడ్డి ప్రభుత్వమా? అని నిలదీశారు. గత ప్రభుత్వంలో అసలు జరగని మద్యం స్కామ్పై సిట్ విచారణ జరుగుతున్నా, కూటమి ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ఎందుకు అరికట్టలేకపోతుందన్నారు. డైవర్షన్ రాజకీయాలు సిట్ విచారణ పేరుతో కేసులో సంబంధం లేని జోగి రమేష్పై కేసును ఆపాదించడం సరికాదని, కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతూ, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నకిలీ మద్యంపై వార్తలు రాసే మీడియాపై కూడా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. ‘సాక్షి’ మీడియా ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూ, నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రయత్నిస్తుంటే, కూటమి ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకొని కేసులు పెట్టి, విచారణ పేరుతో నానా యాగి చేస్తున్నారు. రాజ్యాంగంలోని ప్రధాన పాత్ర పోషించే మీడియాపై కూటమి ప్రభుత్వ చర్యలను వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఖండిస్తుందన్నారు. ఈ ప్రభుత్వంలో గ్రామాల్లో నకిలీ మద్యం తయారీ ఒక కుటీర పరిశ్రమగా తయారైందన్నారు. నకిలీ మద్యం మన రాష్ట్రంలో తయారయ్యి పక్క రాష్ట్రాలకు కూడా సరఫరా చేస్తుంటే, ప్రభుత్వం ఎందుకు నిరోధించడానికి చర్యలు తీసుకోవడం లేదని, ప్రతి మద్యం షాపులో నాలుగు బాటిళ్లలో ఒక నకిలీ బాటిల్ అమ్ముతుంటే, అధికారులు ఎందుకు గుర్తించి, ప్రజల ప్రాణాలను కాపాడలేకున్నారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వ పాలనంతా, కక్ష సాధింపు చర్యలు, ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, దాడులు చేయించడంతో సరిపోయిందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర జోనల్ విభాగం మహిళా అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, నెల్లూరు జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కాకుటూరు లక్ష్మీ సునంద, నెల్లూరు నగర నియోజకవర్గ మహిళా అధ్యక్షురారాలు తనూజారెడ్డి, నెల్లూరురూరల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు రమాదేవి పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలంటూ..
● విద్యుత్ భవన్ వద్ద ధర్నా నెల్లూరు(వీఆర్సీసెంటర్): కాంట్రాక్ట్ కార్మికులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నెల్లూరులోని విద్యుత్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్రాధ్యక్షుడు దుగ్గిరాల సూరిబాబు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్య క్ష, కార్యదర్శులు హజరత్తయ్య, జాకీర్ హుస్సేన్ పాల్గొని మాట్లాడారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను విద్యుత్ సంస్థలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను నేరుగా వేతనాలివ్వడం ద్వారా సంస్థకు రూ.192 కోట్లు మిగులుతాయని, కానీ అందుకు భిన్నంగా యాజమాన్యం కాంట్రాక్టర్ ద్వారా చెల్లిస్తోందన్నారు. సంస్థకు నష్టమొచ్చేలా యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకుంటుందో అర్థం కావడం లేదని విమర్శించారు. గ్రేడ్ – 2 జేఎల్ఎంలను సర్వీసు రెగ్యులేషన్ చేయాలన్నారు. ఉద్యోగులకు పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. సంస్థను దశల వారీగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. సమస్యలను పరిష్కరించకపోతే విద్యుత్ జేఏసీ నిర్వహించే సమ్మెకు తమ మద్దతు ఉంటుందన్నారు. సమ్మె సమయంలో కొత్త వారితో పనిచేయించుకుంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు పెంచలప్రసాద్, గిరిబాబు, నాగయ్య, హరినారాయణ, విజయరామిరెడ్డి, నాగరాజు, మహేంద్ర, రఘు, మౌలాలి, వసంత్, మహేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు టీవీవీ ప్రసాద్, ఆటో యూనియన్ నాయకులు రాజా తదితరులు పాల్గొన్నారు. -
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ● వీరి చలపతితో ములాఖత్ వెంకటాచలం: అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని కూటమి నేతలు గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి హితవు పలికారు. కూటమి ప్రభుత్వం మోపిన అక్రమ కేసులతో చెముడుగుంట సమీపంలోని జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ వీరి చలపతితో గురువారం ములాఖత్ అయ్యారు. అనంతరం విలేకరులతో కాకాణి మాట్లాడారు. ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకొని అక్రమ కేసులు పెడుతూ జైలుకు పంపడం ఆనవాయితీగా మారిందని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళిత నేతగా వీరి చలపతి ఎదగడాన్ని ఓర్వలేక అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని ఆరోపించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసేతత్వం గల ఆయనపై అన్యాయంగా కేసులు పెట్టడం దారుణమన్నారు. చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్న చలపతి.. జైల్లో ధైర్యంగా ఉన్నారని పేర్కొన్నారు. కోవూరు నియోజకవర్గంలోని ప్రధాన నేతలతోపాటు మాజీ మంత్రి ప్రసన్నకుమార్రెడ్డిని కేసుల్లో ముద్దాయిలుగా చేర్చడం హేయమైన చర్యగా అభివర్ణించారు. తమ పార్టీ నేతలపై కేసులు పెట్టి వేధించడం, సహజ వనరులను దోపిడీ చేయడం మినహా అభివృద్ధి చేస్తున్న దాఖలాల్లేవని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు పోటారాలను ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. అక్రమ కేసులు, జైళ్లు తమను ఆపలేవనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. తమ పార్టీ శ్రేణులపై జరిగే అన్యాయాలు, దాడులను నమోదు చేసేందుకు గానూ డిజిటల్ బుక్ను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారని వివరించారు. కూటమి ప్రభుత్వంలో తమ పార్టీకి చెందిన కుటుంబాలను మానసిక వేదనకు గురిచేస్తున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతకు రెండింతలు అనుభవించే పరిస్థితులు ఏర్పడతాయని స్పష్టం చేశారు. వీరి చలపతి కేసులో న్యాయస్థానాన్ని ప్రసన్నకుమార్రెడ్డి ఇప్పటికే ఆశ్రయించి, అన్ని సహాయ, సహకారాలను అందిస్తున్నారని చెప్పారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, బచ్చుల సురేష్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోజుకో అవినీతి బాగోతం
● నిన్న నకిలీ మద్యం.. నేడు రేషన్ బియ్యం అక్రమ రవాణా ● ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు(స్టోన్హౌస్పేట): నిన్న నకిలీ మద్యం.. నేడు రేషన్ బియ్యం అక్రమ రవాణా దందా.. ఇలా టీడీపీ నేతల బాగోతాలు రోజుకొకటి బయటపడుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. రేషన్ మాఫియాలో వాటాల పంపకాల్లో తేడాలు రావడంతో ఈ వ్యవహారాన్ని టీడీపీ నేత, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డే స్వయంగా బయటపెట్టారని చెప్పారు. మంత్రి నారాయణ అనుచరులే ఇందులో కీలకపాత్ర పోషిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో విచారణ చేయించాల్సింది పోయి.. మన తప్పులను మనమే బయటపెట్టుకుంటామా అంటూ ఆయన మండిపడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పారు. అవినీతి సొమ్మును పంచుకోవాలే గానీ అల్లరి చేసుకోవద్దంటూ ఆయన కూటమి ధర్మంపై ఉపదేశాలిస్తుండటాన్ని చూస్తున్న జిల్లా ప్రజలు నివ్వెరపోతున్నారని చెప్పారు. జిల్లా కేంద్రంగా పచ్చ పార్టీ నేతలు సాగిస్తున్న ఈ దందాను తమ పార్టీ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయించగలరా..? రేషన్ మాఫియా వెనుక అధికార పార్టీకి చెందిన నేతలున్నారని, వీరికి సివిల్ సప్లయ్స్ అధికారులు వంతపాడుతున్నారని, వీటిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ను కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి డిమాండ్ చేశారన్నారు. మంత్రి నారాయణకు చెందిన ముఖ్య అనుచరులున్నారని ఆరోపించారని, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థం చేసుకోవచ్చని చెప్పారు. అనంతసాగరానికి చెందిన వారు, నగరానికి చెందిన ముగ్గురు కలిసి నడిపిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జిల్లాలో రేషన్ మాఫియా చెలరేగిపోతోందని, దీనికి అధికార పార్టీ నేతలే సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. యథేచ్ఛగా విదేశాలకు తరలింపు జిల్లాలో దాదాపు తొమ్మిది వేల టన్నుల బియ్యం.. మాఫియా చేతుల్లోకి వెళ్లి అక్రమంగా రవాణా అవుతోందని ఆరోపించారు. జిల్లాలోని పలు రైస్మిల్లుల్లో నేరుగా రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి.. చైన్నె మార్కెట్కు.. కృష్ణపట్నం పోర్టు నుంచి విదేశాలకు తరలిస్తున్నారని చెప్పారు. ప్రజల పొట్టగొట్టి, అక్రమంగా తరలిద్దామనుకుంటే సహించేదిలేదని స్పష్టం చేశారు. నారాయణా... ఏమిటీ బెదిరింపులు..? టీడీపీ నేతలతో మంత్రి నారాయణ మాట్లాడిన ఆడియో రికార్డును వినిపించారు. ఆయన సొంత జిల్లాలో రేషన్ మాఫియా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందనేది బహిరంగ రహస్యమని పేర్కొన్నారు. బాధ్యత గల హోదాలో ఉన్న ఆయన రేషన్ బియ్యం మాఫియాపై తనకు సమాచారమివ్వండి.. నిరోధిద్దాం అని చెప్పాల్సింది పోయి అందుకు విరుద్ధంగా వ్యవహరించారని విమర్శించారు. ఈ బెదిరింపులు ఏమిటని ప్రశ్నించారు. నెల్లూరు, వైఎస్సార్ కడప, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని మిల్లులను కూటమి పార్టీల నేతలు అద్దెకు తీసుకొని నడిపిస్తున్నారని, రేషన్ డీలర్ల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేసి, అక్రమంగా సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. -
రైతు ఉత్పత్తి సంఘాలను బలోపేతం చేయాలి
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు రూరల్: జిల్లాలో వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత, యాంత్రీకరణను సమ్మిళతం చేసుకుంటూ.. సరికొత్త ఆలోచనలతో రైతు ఉత్పత్తి సంఘాలను బలోపేతం చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పిలుపునిచ్చారు. రైతు ఉత్పత్తి సంఘాల పురోగతిపై గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో రైతు ఉత్పత్తి సంఘాలు 108 ఉన్నాయని, దీన్ని 150కు పెంచాలని ఆదేశించారు. ప్రతి ఎఫ్పీఓ పరిధిలో రైతుల అవసరాల మేరకు వ్యవసాయ యంత్ర పరికరాలను కొనుగోలు చేయాలని, దీనికి బ్యాంకులు సహకారం అందించాలని కోరారు. వరితో పాటు కూరగాయలు, పండ్లు, పూల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపర్చేందుకు, ఉత్తమమైన ప్యాకింగ్ విధానాలను అవలంబించేందుకు శిక్షణను ఇవ్వాలన్నారు. అనంతరం రైతు ఉత్పత్తి సంఘాలు తయారు చేసిన కొబ్బరి నూనె, తినుబండారాలను పరిశీలించారు. జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, మత్స్య, పశుసంవర్థక శాఖల జేడీలు శాంతి, రమేష్నాయక్, నాబార్డు డీడీఎం బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఖనిజ సంపద.. కొట్టేసేందుకు పెద్ద స్కెచ్
ఖనిజ సంపద.. కొట్టేసేందుకు పెద్ద స్కెచ్ ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అనే సామెతలా అధికారంలో ఉండగానే అడ్డగోలుగా సంపాదించేందుకు కూటమి పెద్దలు రకరకాల స్కెచ్లు వేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ గనుల శాఖ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన రాయల్టీ బాధ్యతను ‘ప్రైవేటు’పరం చేశారు. సాక్షి టాస్క్ఫోర్స్: తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోట, చిల్లకూరు, చిట్టమూరు, వాకాడు పరిధిలో సిలికా, గ్రావెల్, బ్లూమెటల్, ఇసుక సంపద పుష్కలంగా దొరుకుతాయి. దీనిపై కన్నేసిన కూటమి పెద్దలు ప్రైవేట్ సైన్యాన్ని రంగంలోకి దింపారు. అక్రమాలను అరికట్టేందుకు రాయల్టీ వసూళ్లను ప్రైవేట్ సంస్థలకు అప్పగించామని సాకు చెబుతూ దొడ్డి దారిలో రూ.కోట్లు కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ సంపదంతా ఎక్కువ శాతం ప్రభుత్వ భూముల్లో ఉండటంతో చిన్నపాటి అనుమతి తీసుకుంటే చాలు. వాటిని చూపించి పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి నుంచి తవ్వకాలు చేపట్టి రూ.కోట్లు కొట్టేయొచ్చు. ఇందులో భాగంగా ఏడాది కాలంగా కూటమి బ్యాచ్ గూడూరులో తిష్టవేసి ఖనిజ సంపద గురించి అన్వేషించారు. అయితే తెల్లరాయి, సిలికా తరలింపులు వివాదాస్పదంగా మారడంతో దీనిపై కూటమి ప్రభుత్వం తమకు అనుకూలంగా ఎవరైతే ఉంటారో వారికే సిలికా, ఇసుక, గ్రావెల్ (మైనర్ మినరల్) తరలించేలా అనుమతిచ్చింది. గనుల శాఖ నిర్వీర్యం ప్రభుత్వం ఎప్పటికప్పుడు గనుల శాఖ ఆధ్వర్యంలో మైనర్ మినరల్ తవ్వకాలు, తరలింపులకు సంబంధించి అన్ని అనుమతులిచ్చేది. అయితే కూటమి అధికారం చేపట్టిన తర్వాత ఆ శాఖను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా రాయిల్టీ వసూళ్లకు అనుమతులను ఇచ్చింది. రెండేళ్లలో ప్రభుత్వానికి రూ.340 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఇక దొరికిందే తడవు నిబంధనలకు విరుద్ధంగా ఆ ఏజెన్సీ అంతకు రెండింతలు వసూలు చేయడం మొదలు పెట్టింది. అనుచరుల ద్వారా ప్రభుత్వ భూముల్లో అక్రమంగా తవ్వకాలు జరిపి తరలించేలా పక్కా ప్రణాళికలు రూపొందించుకున్నారు. సాధారణంగా సిలికా టన్నుకు రూ.307లు వసూలు చేసేవారు. ఇదే బయటి మార్కెట్లో రూ.3 వేలకుపైనే ఉంటుంది. మిగిలిన గ్రావెల్, ఇసుక, బ్లూమెటల్ పరిస్థితి కూడా దాదాపు అంతే. బయటి మార్కెట్ని దృష్టిలో ఉంచుకుని ఒక రాయల్టీ రసీదును చూపించి ఖనిజాన్ని అక్రమంగా తరలించి సొమ్ముచేసుకోవడం ప్రారంభించారు. అనధికారిక చెక్ పోస్టులు ప్రైవేట్ సైన్యం కన్నుగప్పి ఒక్క టన్ను కూడా బయటకు వెళ్లకుండా గూడూరు నియోజకవర్గ పరిధిలోని గొల్లపల్లి, తిప్పవరప్పాడు, చిల్లకూరు మండలంలోని నల్లయగారిపాళెం, చేడిమాల, అంకులపాటూరు, చింతవరం, వరగలి, కోట క్రాస్రోడ్డు, బూదనం రోడ్డు, కోట మండలం గూడలి, మెట్టు, కర్లపూడి, కేసవరం, రాఘవాపురం, కోట క్రాస్ రోడ్డు, వాకాడు మండలంలో బాలిరెడ్డిపాళెం, వాకాడు బ్యారేజ్, చిట్టమూరు మండలంలో మెట్టు, చిట్టమూరులో అనధికారిక చెక్ పోస్టులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా పొందిన రాయల్టీ రసీదు చూపిస్తే వాహనాలకు అనుమతి ఉంటుంది. లేదంటే ఫైన్, కేసులు ఇతరత్రా వేధింపులు తప్పవు. చిల్లకూరులో పోటీ కార్యాలయం గనులకు సంబంధించి అధికారిక కార్యాలయాలు, చెక్పోస్టులు ఉంటాయి. ప్రైవేట్ ఏజెన్సీల పుణ్యమా అని వారే చెక్పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉంటే గూడూరు నెల్లూరు జిల్లాలో ఉన్న సమయంలో గనుల శాఖ కార్యాలయం పూర్తిగా అక్కడే ఉండేది. జిల్లాల మార్పుతో గూడూరు నియోజకవర్గంలో ఎక్కువగా మైనర్, మేజర్ మినరల్ దొరుకుతుండటంతో చిల్లకూరులో గనుల శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మైనర్ మినరల్ రాయల్టీ వసూళ్లను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించడంతో వారు చిల్లకూరులో అనధికారికంగా గనుల శాఖ కార్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇకపై ఎవరైనా సిలికా, ఇసుక, గ్రావెల్, నల్ల, బ్లూ కంకరను తరలించాలంటే ఇక్కడ రాయిల్టీ చెల్లించి అనుమతులు తీసుకున్న తర్వాతనే తరలించాల్సి ఉంటుంది.రాయల్టీ బాధ్యత ప్రైవేట్కు అప్పగింత గనుల శాఖకు ఇకపై ఎటువంటి సంబంధం ఉండదు వసూళ్ల కోసం గూడూరులో అనధికారిక చెక్పోస్టులు ప్రైవేట్ సైన్యం గుప్పెట్లో సిలికా, గ్రావెల్, ఇసుక సంపదఏజెన్సీలే చెక్పోస్టులు ఏర్పాటు చేయాలి మైనర్ మినరల్ తవ్వకాలు, తరలింపులకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం ఏఎంఆర్ అనే ఏజెన్సీతో ప్రతి టన్నుకు రాయిల్టీ చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. దీంతో ఏజెన్సీకి చెందిన వారు పలు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసుకుని తనిఖీలు చేస్తూ అనుమతులున్న వాహనాలకు మాత్రమే పంపేలా చేస్తున్నారు. ఇది మొత్తంగా ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన విషయం. – శ్రీనివాసరావు, గనుల శాఖ ఏడీ -
సేవాసదన్లో లోటుపాట్లు సరిచేయండి
నెల్లూరు(పొగతోట): జిల్లాలోని సేవాసదన్లలో లోటుపాట్లను సరిచేసి పిల్లల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్ ఆదేశించారు. నగరంలోని సేవాసదన్లో పిల్లలకిస్తున్న ఆహారం, నివాసం, ఆరోగ్యం, విద్యా తదితర సదుపాయాలను గురువారం పర్యవేక్షించారు. భద్రత చర్యలు, రికార్డులను పరిశీలించిన అనంతరం ఆమె మాట్లాడారు. పిల్లల సంక్షేమం, భద్రత, ఆరోగ్యం, శారీరక, మానసికాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. డిస్ట్రిక్ట్ మిషన్ నోడల్ ఆఫీసర్ అనూరాధ, మహిళా ప్రాంగణ మేనేజర్ మాధవి, సేవా సదన్ ఇన్చార్జి అరుణ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీగంధం చెట్ల నరికివేత
ఉదయగిరి రూరల్: మండలంలోని కొండాయపాళెం పంచాయతీ మాసాయిపేట బీసీ కాలనీ సమీపంలో ఉన్న గానుగపెంటపల్లి గ్రామానికి చెందిన నారాయణరెడ్డి అనే రైతు పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు శ్రీగంధం చెట్టు నరికి తీసుకెళ్లారు. గురువారం ఆయన మాట్లాడుతూ తన వ్యవసాయ పొలంలో 35 ఏళ్ల నుంచి శ్రీగంధం చెట్లు సాగు చేస్తున్నట్లు చెప్పారు. మూడేళ్ల క్రితం కూడా తోటలో 16 చెట్లు నరికి తీసుకెళ్లారన్నారు. అలాగే ఈనెల 8న ఒక చెట్టును నరికి తీసుకెళ్లగా పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. తాజాగా బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు రెండు చెట్లను నరికారని, ఒక చెట్టు దుంగను తీసుకెళ్లినట్లు చెప్పారు. పోలీసులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. అదుపుతప్పి.. రోడ్డుకు అడ్డుగా నిలిచి.. ● డివైడర్ కోసం పెట్టిన రాళ్లను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ● తప్పిన ప్రమాదం ● 2 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్ దగదర్తి: మండలంలోని అల్లూరు రోడ్డు రైల్వే బ్రిడ్జి జాతీయ రహదారిపై గురువారం వేగంగా వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్ కోసం ఏర్పాటు చేసిన రాళ్లను ఢీకొంది. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బోల్తా పడకుండా రహదారికి అడ్డుగా నిలిచిపోయింది. అందులో ఉన్న ప్రయాణికులకు ఏమీ కాలేదు. రెండు లేన్ల రహదారి కావడం.. అడ్డు గా బస్సు నిలిచిపోవడంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న ఎస్సై జంపాని కుమార్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. క్రేన్ సాయంతో బస్సును పక్కకు తొలగించారు. ఈ ప్రదేశంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా హైవే అధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని వాహనచోదకులు ఆరోపిస్తున్నారు. డివైడర్ కోసం ఏర్పాటు చేసిన రాళ్లు రాత్రి వేళల్లో కనిపించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. 19న ఎల్ఐసీ ఏఓఐ డివిజన్ మహాసభ నెల్లూరు(అర్బన్): ఎల్ఐసీ ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా నెల్లూరు డివిజన్ (నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు) 6వ మహాసభ ఈనెల 19వ తేదీన కందుకూరులోని యూటీఎఫ్ భవన్లో జరుగుతుందని ఆ సంఘం రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫ్లెక్సీలను గురువారం నెల్లూరు దర్గామిట్టలోని డివిజన్ కార్యాలయం వద్ద, అలాగే సిటీ బ్రాంచ్ – 1 కార్యాలయం వద్ద ఆవిష్కరించారు. రాజశేఖర్ మాట్లాడుతూ ఎల్ఐసీలో జీఎస్టీ ఎత్తేయడానికి ప్రధాన కారణం ఏఓఐ చేసిన పోరాటాలేనన్నారు. అలాగే ఎల్ఐసీలో పెట్టుబడులు ఉపసంహరించుకోవడానికి వ్యతిరేకంగా, ఏజెంట్ల కమీషన్ తగ్గించడం ఒప్పుకోమంటూ చిత్తశుద్ధితో పోరాటాలు చేసింది తమ ఏఓఐ సంఘమన్నారు. ప్రజల ప్రీమియానికి భద్రత ఉండాలంటే ఎల్ఐసీ ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలన్నారు. నాయకులు హజరత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కండలేరులో 59.910 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 59.910 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 4,000 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కాగా కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,050, పిన్నేరు కాలువకు 300, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 200, మొదటి బ్రాంచ్ కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
రిలీవ్ చేయాలంటూ ధర్నా
నెల్లూరు(టౌన్): ఈ ఏడాది జూన్లో నిర్వహించిన బదిలీల్లో పక్క పాఠశాలలకు ట్రాన్స్ఫర్ అయినా నేటికీ రిలీవ్ చేయలేదని పలువురు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నెల్లూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం డీఈఓ బాలాజీరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిలీవ్ చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఎంటీఎస్ ఉపాధ్యాయులు కేటాయిస్తామని, డీఎస్సీ నుంచి వచ్చిన టీచర్లను కేటాయిస్తామని 5 నెలల నుంచి చెబుతూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు భారతి, సుష్మా, బ్యూలా, సుభాషిణి, సుమ, శోభారాణి పాల్గొన్నారు. -
ఒకటే వాన
నెల్లూరు(అర్బన్): జిల్లాలో గురువారం భారీ వర్షాలు నమోదయ్యాయి. మర్రిపాడు, ఆత్మకూరు, కలువాయి, పొదలకూరు, కలిగిరి, వింజమూరు, సంగం, బుచ్చి, కోవూరు, విడవలూరు, కొడవలూరు, వెంకటాచలం, మనుబోలు, తోటపల్లిగూడూరు, ఇందుకూరుపేట తదితర మండలాలతోపాటు నెల్లూరులో వానలు కురుస్తున్నాయి. కొన్ని మండలాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు నమోదు కాగా మరికొన్నిచోట్ల తేలికపాటి, మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఆకాశం మేఘావృతమై ముసురు పట్టింది. మరో రెండురోజులుపాటు జిల్లాలో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు నగరంలో.. జిల్లా కేంద్రం నెల్లూరు నగరంలో బుధవారం అర్ధరాత్రి నుంచే వానలు మొదలయ్యాయి. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు విడతల వారీగా భారీ వర్షం నమోదైంది. దీంతో రోడ్లు జలమయమయ్యాయి. ఆర్టీసీ కాలనీ, చంద్రబాబునగర్, కొత్తూరు, జనార్దనరెడ్డి నగర్, కల్యాణి నగర్, మనుమసిద్ధి నగర్, శివగిరి కాలనీ, రాజీవ్గాంధీ గృహకల్ప తదితర పలు పల్లపు ప్రాంతాల్లో నీరు చేరిపోయింది. ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జి, మాగుంట లేఅవుట్ అండర్బ్రిడ్జి, విజయమహల్ గేటు బాక్సు టైపు బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో నీరు చేరింది. పొగతోట, ట్రంకురోడ్డు, గాంధీబొమ్మ, ఆచారివీధి తదితర ప్రాంతాల్లో డ్రెయినేజీ కూడిన వర్షపు నీరు పొంగి ప్రవహించింది. దీంతో పాదచారులు, వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. కార్మికులకు పనులు దొరక్క అవస్థలు ఎదుర్కొన్నారు. ఇబ్బంది పడ్డారు. -
ఇద్దరికి ప్రాణం పోసి..
ఇందుకూరుపేట: బ్రెయిన్ డెడ్కు గురై తిరిగి రాని లోకాలకు వెళ్లి కుటుంబాన్ని శోక సముద్రంలో నింపిన ఆయన ఇద్దరు జీవితాల్లో వెలుగునింపి సజీవంగా నిలిచారు. మరణానంతరం మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. ఇందుకూరుపేటకు చెందిన మాచవరం మల్లికార్జున (53) టైల్స్ పని చేసుకొంటూ జీవనం సాగించేవాడు. భార్య అమరావతి ఇంట్లోనే ఉంటుంది. పెద్ద కొడుకు కార్తీక్, ఎంసీఏ (ఎస్వీ యూనివర్సిటీ, తిరుపతి) మొదటి సంవత్సరం చదువుతుండగా, చిన్నకొడుకు వివేక్ ఐటీఐ పూర్తి చేసి నెల్లూరులో కారు మెకానిక్ పని నేర్చుకొంటున్నాడు. పేద కుటుంబం అయిన మల్లికార్జున ఉన్న దాంట్లో బిడ్డలను చదివించుకొంటూ బతుకీడుస్తున్నాడు. ఈ నెల 12న నిద్ర లేచే సరికే కాళ్లు చేతులు సరిగా కదిలించలేకపోవడంతో కుటుంబ సభ్యులు నెల్లూరులోని పీపీసీకి తరలించారు. అక్కడ ఒక రోజు పాటు వైద్యం అందించి బ్రెయిన్ స్ట్రోక్ అని పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని చెప్పడంతో హుటాహుటిన కిమ్స్ వైద్యశాలకు తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు మల్లికార్జునకు సీవీఏ ఇస్కిమిక్ స్ట్రోక్, ఎడమ వైపు ఉన్న మిడిల్ సెరిబ్రల్ అర్జరీ (ఎంసీఏ)లో పెద్ద స్ట్రోక్, పెరిగిన ఇంట్రాక్రానియల్ ప్రెజర్ లేదా పుర్రె లోపల ఒత్తిడి పెరగడం, మెదడు ఽమధ్య రేఖ నుంచి పక్కకు జరగడం, ఎడమ వైపు డీకంప్రెనిసివ్ క్రానియోటమీ, అధిక రక్తపోటు ఉన్నట్లు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయినా చివరి ఆశగా కుటుంబ సభ్యులు సర్జీరీ చేయాలని కోరారు. దీంతో డాక్టర్ ఉదయ్కిరణ్ సర్జరీ చేశారు. అనంతరం అబ్జర్వేషన్లో ఉన్న సమయంలో బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. వైద్య బృందం అవయవదాన ప్రాముఖ్యతను కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో వారు మనస్ఫూర్తిగా అంగీకరించడంతో విషయాన్ని జీవన్దాస్ సంస్థకు తెలియజేశారు. ప్రోటోకాల్ ప్రకారం అవయవాల కేటాయింపునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జీవన్దాస్ సంస్థ అవయవాలను కర్నూల్లోని హాస్పటిల్కు లివర్, ఒక కిడ్నీని నెల్లూరులోని హాస్పిటల్కు తరలించారు. మరణించిన పలువురు జీవితాల్లో వెలుగును నింపిని మల్లికార్జున మృతదేహానికి కిమ్స్ వైద్యశాల వైద్య బృందం, సిబ్బంది ఘనంగా వీడ్కొలు పలికారు. మృతదేహం స్వగ్రామం ఇందుకూరుపేటకు చేరడంతో పలువురు ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. మల్లికార్జున అవయువాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులను మండల వాసులు, జిల్లా వాసులు అభినందించారు. బ్రెయిన్ డెడ్తో మల్లికార్జున మృతి అవయవదానంతో రెండు కుటుంబాల్లో ఆనందం మరణాంతరం మానవత్వానికి మల్లికార్జున నిలువెత్తు నిదర్శనం -
వేగం రాక్షసమై.. క్షణం నిశ్శబ్దమై..
భీతావహ పరిస్థితి కుటుంబాన్ని కబళించిన అతివేగం ● భార్యాభర్తలతో ఓ కుమార్తె దుర్మరణం ● తీవ్రగాయాలతో అనాథగా మిగిలిన చిన్న కుమార్తె రోడ్డుపై రాక్షసం.. మమతల బంధాన్ని మింగేసింది. రోడ్డుపై చెల్లా చెదురుగా పడి ఉన్న తల్లి, తండ్రి, బిడ్డ మృతదేహాలు. లారీ ఈడ్చుకుపోవడంతో నుజ్జైన శరీర భాగాలు. పక్కనే గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారి. మృతదేహాల పక్కనే చిన్నారుల తినుబండారాలు, పెన్ను చూసిన ప్రతి ఒక్కరి గుండె బరువెక్కింది. ఆ దృశ్యం భీతావహంగా మారింది. ఒక్క క్షణంలోనే.. ఓ కుటుంబం చిదిమిపోయింది. అతివేగం ఆ ప్రాణాలను కబళించింది. బతుకుదెరువు కోసం హైదరాబాద్లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. బంధువుల వివాహానికి వచ్చి, తిరిగి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కలిగిరి: భార్య, భర్త, ఇద్దరు బిడ్డలు. ఉన్నంతలో ఆనందంగా సాగిపోతున్న ఆ కుటుంబాన్ని విధి వేటాడింది. మరి కొద్ది సేపట్లో ఇంటికి చేరుతారనే సమయంలో మితిమీరిన వేగంతో ఎదురుగా రాంగ్రూట్లో దూసుకొచ్చిన బోర్వెల్ లారీ ముగ్గురిని కబళించింది. ఇంటికి సరుకులు, చిన్నారులకు తినుబండారాలు తీసుకుని బైక్పై వెళ్తున్నారు. మండలంలోని తూర్పుదూబగుంట ఎస్సీ కాలనీకి చెందిన చవలముడి బాబు (30) బతుకుదెరువు నిమిత్తం భవన నిర్మాణ పనులు చేస్తూ కొన్నేళ్లుగా హైదరాబాద్లో ఉంటున్నాడు. బంధువుల వివాహం ఉండడంతో గత నెలలో స్వగ్రామానికి వచ్చాడు. మళ్లీ పనులకు వెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం సరుకులు కొనేందుకు భార్య మమత (27), పెద్ద కుమార్తె వైభ (6), చిన్న కుమార్తె మేఘనతో కలిసి బైక్పై కలిగిరికి వెళ్లి తిరిగి స్వగ్రామం వెళ్తున్నాడు. కుడుములదిన్నెపాడులోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ప్రధాన రహదారిపై ఎదురుగా వచ్చిన బోర్ వైల్స్ లారీ రాంగ్రూట్లో బైక్ ఢీకొట్టింది. దీంతో బైక్పై నుంచి జారి కింద పడడంతో లారీ చక్రాలు వారిని ఈడ్చుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో దంపతులు బాబు, మమత, పెద్ద కుమార్తె వైభ అక్కడికక్కడే మృతి చెందారు. చిన్న కుమార్తె మేఘన తీవ్రంగా గాయపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాద స్థలాన్ని ఉదయగిరి సీఐ వెంకటరావు, వింజమూరు ఎస్సై వీరాప్రతాప్, కలిగిరి ఏఎస్సై రామచంద్రయ్య సందర్శించారు. మృతదేహాలను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాదానికి కారణమైన బోర్వెల్స్ లారీ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీతావహంగా ఉన్న ఘటనా స్థలం ఒకే స్ట్రెచర్పై తల్లికుమార్తె మమత, వైభ మృతదేహాలు లారీ ఈడ్చుకెళ్లడంతో మృతుల శరీర భాగాలు నుజ్జునుజ్జు కావడతో భీతావహ పరిస్థితి నెలకొంది. తీవ్రంగా గాయపడిన చిన్నారి మేఘనను 108 వాహనంలో కావలికి తరలించారు. బాబు ఇంటికి తీసుకెళ్తున్న నిత్యావసర సరుకులు, చిన్నారుల తినుబండరాలు మృతదేహాల పక్కనే పడి ఉన్నాయి. ప్రమాదం విషయం తెలుసుకుని తూర్పుదూబగుంట నుంచి మృతుల బంధువులు, గ్రామస్తులు, చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలు పడి ఉన్న తీరు చూసి అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని కలిచి వేసింది. చిన్నారి వైభ మృతదేహం పక్కనే పెన్ను పడి ఉండడం చూసి బంధువులు రోదించారు. పోస్టుమార్టం నిమిత్తం ఒకే స్ట్రెచర్పై తల్లి, కుమార్తె మృతదేహాలను అంబులెన్స్లో తరలించడం హృదయవిధారకంగా కనిపించింది. -
తాడేపల్లికి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, కాకాణి పూజిత
నెల్లూరు (పొగతోట): వైఎస్సార్సీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, రాష్ట్ర మహిళ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత హాజరయ్యారు. కిలో సగటు పొగాకు రూ.146.97 మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో కిలో సగటు పొగాకు ధర రూ.146.97గా నమోదైంది. బుధవారం 622 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 975 బేళ్లు రాగా 622 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో 72981.8 కిలోల పొగాకును విక్రయించగా రూ.10726174 వ్యాపారం జరిగింది. కిలోకు గరిష్టంగా రూ.315, కనిష్టంగా ధర రూ.65 లభించింది. వేలంలో 10 కంపెనీల వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. -
కృష్ణపట్నం పోర్టుకు ‘రైజింగ్ స్టార్’ అవార్డు
ముత్తుకూరు (పొదలకూరు): క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా తిరుపతిలో బుధవారం నిర్వహించిన 11వ సదస్సులో అదానీ కృష్ణపట్నం పోర్టు లిమిటెడ్కు రైజింగ్ స్టార్ ఆర్గనైజేషన్ అవార్డును బుధవారం ప్రదానం చేసింది. ఆత్మ నిర్భర్ వికాస్ భారత్పై నాణ్యమైన భావనలు, వినూత్న పరిష్కారాలను సమర్పించిన పోర్టు మొత్తం 8 జట్లు బంగారు అవార్డులను గెలుచుకున్నట్లు సీఈఓ జగదీష్పటేల్ పేర్కొన్నారు. కన్వెన్షన్లో దేశ వ్యాప్తంగా 85 సంస్థలకు చెందిన 300 జట్లు పాల్గొన్నాయి. కృష్ణపట్నం పోర్టు లిమిటెడ్ హెల్త్ సేప్టీ అండ్ ఎన్విరాన్మెంట్, ఇంజినీరింగ్ ఉద్యోగులు ముగ్గురు వ్యక్తిగత అవార్డులు సాధించారు. కౌశల్కుమార్ సింగ్కు అత్యుత్తమ నాయకత్వం, నాణ్యతపై నిబద్ధత కోసం చాంపియన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు అభించినట్లు వెల్లడించారు. నైపుణ్యంలో మధుసూదనరావుకు స్కిల్ చాంపియన్ అవార్డు, మణికంఠకు మార్గదర్శకత్వానికి ఉత్తమ ఫెసిలిటేటర్ అవార్డు అభించాయి. నుడా వైస్ చైర్మన్గా జేసీ నెల్లూరురూరల్: నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) వైస్ చైర్మన్గా జాయింట్ కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో నుడా వైస్ చైర్మన్గా అప్పటి నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ (ఐఏఎస్) వ్యవహరించారు. అయితే ఆయన ఆర్నెల్ల క్రితం బదిలీపై వెళ్లడంతో ఆ స్థానంలో ఇప్పటి వరకు ఎవరినీ నియమించలేదు. తాజాగా జాయింట్ కలెక్టర్ను నియమించింది. డీఎస్డీఓగా యతిరాజ్ కొనసాగింపు నెల్లూరు (బృందావనం): జిల్లా క్రీడాభివృద్ధి అధికారిగా ఆర్కే యతిరాజ్ను కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ (శాప్) ద్వారా ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శాప్ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్ ఎస్.భరణి ఉత్తర్వులు జారీ చేశారు. యతిరాజ్ ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయన ఉద్యోగ విరమణ తర్వాత జిల్లా క్రీడాప్రాధికార సంస్థలో ఫుట్బాల్ కోచ్గా విధులు నిర్వహిస్తున్న పాండు రంగారావును జిల్లా క్రీడాభివృద్ధి అధికారిగా నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటూ ప్రభుత్వం డీఎస్డీఓగా ఎతిరాజ్నే నియామకం చేసింది. అడహాక్ పద్ధతిలో పదోన్నతులు నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాల్లో పనిచేస్తున్న సీనియర్ సహాయకులకు అడహాక్ పద్ధతిలో డిప్యూటీ ఎంపీడీఓలుగా పదోన్నతులు కల్పించారు. బుధవారం జెడ్పీ సమావేశ మందిరంలో పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియను జెడ్పీ సీఈఓ మోహన్రావు, డీపీఓ శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. -
సీనియర్ అసిస్టెంట్కు పదోన్నతి
నెల్లూరు రూరల్: జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న గుండాబత్తిన సువర్ణ సూపరింటెండెంట్గా పదోన్నతి పొంది ఒంగోలు ప్రాంతీయ కార్యాలయానికి బదిలీ అయ్యారు. బుధవారం నెల్లూరులోని కార్యాలయంలో ఆత్మీయ అభినందన సభను ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ వేణుగోపాల్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సువర్ణ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో డీఈ శివశంకర్రావు, డివిజనల్ పీఆర్వో రవికుమార్, ఏపీఆర్వో రవీంద్రబాబు, సీనియర్ అసిస్టెంట్ ఖాదర్మస్తాన్, పీఆర్వో వినోద్కుమార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రసన్న సంఘీభావం
కోవూరు: కల్తీ మద్యంపై ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురితమైన నేపథ్యంలో నమోదైన కేసుల్లో నోటీసులు అందుకుని పోలీసుల విచారణకు హాజరైన నెల్లూరు బ్యూరో ఇన్చార్జి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి చిలకా మస్తాన్రెడ్డిని ఆయన నివాసంలో బుధవారం మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కలిసి సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు పాత్రికేయులు కృషి చేస్తారన్నారు. వారిపై ఒత్తిళ్లు, కేసులు నమోదు చేయడం తగదని అభిప్రాయపడ్డారు. ఎల్లప్పుడూ ‘సాక్షి’ ప్రజల పక్షాన, వారికి అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. ప్రసన్న వెంట సీనియర్ నాయకుడు కలువ బాలశంకర్రెడ్డి, అనుబంధ సంఘాల నాయకుడు చేజర్ల సుధాకర్రెడ్డి ఉన్నారు. -
గ్యాస్ సిలిండర్ పేలి పూరిల్లు దగ్ధం
● రూ.2 లక్షల ఆస్తి నష్టం పొదలకూరు: మండలంలోని విరువూరు గ్రామంలో బుధవారం వంట గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తు పేలి పూరిల్లు దగ్ధమైంది. మంటలు పక్క ఇళ్లకు వ్యాపించకుండా అగ్నిమాపక అధికారులు ఆర్పివేశారు. వివరాలు.. కొండమ్మ పూరింట్లో నివాసముంటున్నారు. ఆమె గ్యాస్ స్టౌ అంటించి సక్రమంగా ఆర్పలేదు. గ్యాస్ లీకై మండుకుని సిలిండర్ పేలింది. ఆ సమయంలో కొండమ్మ ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మంటలకు ఇల్లు పూర్తిగా కాలిపోయింది. సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని చెబుతున్నారు. బాధితురాలు కట్టుబట్టలతో మిగిలినట్టు కన్నీంటి పర్యంతమైంది. పొదలకూరు అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. -
స్కాన్ చేశాకే విక్రయించాలి
● ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డీసీ శంకరయ్య నెల్లూరు(క్రైమ్): బార్, మద్యం దుకాణాల యజమానులు ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్ ద్వారా బాటిళ్లను స్కాన్ చేసిన అనంతరమే విక్రయించాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శంకరయ్య తెలిపారు. బుధవారం ఎకై ్సజ్ నెల్లూరు – 1 స్టేషన్లో నగరంలోని బార్లు, మద్యం దుకాణాల యజమానులతో ఆయన సమావేశం నిర్వహించి యాప్ పనితీరుపై అవగాహన కల్పించారు. స్కాన్ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం విక్రయించరాదని స్పష్టం చేశారు. బెల్టు షాపులు నిర్వహించడం, ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమన్నారు. అలాంటి చర్యలు గుర్తిస్తే లైసెన్సు రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం నగరంలోని లక్కీ వైన్ షాపులో యాప్ వినియోగంను పరిశీలించారు. సమావేశంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఏఈఎస్ రమేష్, నెల్లూరు – 1 ఇన్స్పెక్టర్ పి.రమేష్బాబు, ఎస్సైలు ప్రభాకర్రావు, డి.శ్రీధర్, జేకేవీఎన్ మురళీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ..
● జిల్లా వ్యాప్తంగా పోలీసుల తనిఖీలు ● 30 మందిపై కేసుల నమోదునెల్లూరు(క్రైమ్): మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎస్పీ అజిత ఆదేశాలతో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు లాడ్జీలు, వాహన తనిఖీలు నిర్వహించారు. బహిరంగ మద్యసేవనం చేస్తున్న వారిపై 27 కేసులు నమోదు చేశారు. 2,139 వాహనాలు తనిఖీ చేశారు. మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న 30 మందిపై కేసులు పెట్టారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులపై 258 కేసులు నమోదు చేసి రూ.1,43,810ల అపరాధరుసుము విధించారు. 13 వాహనాలు సీజ్ చేశారు. 63 లాడ్జీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బసచేసిన వారి వివరాలను సేకరించారు. రికార్డులను పరిశీలించారు. లాడ్జీ పరిసరాలు స్పష్టంగా కనిపించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. బసచేసే వారి వివరాలను క్రమం తప్పకుండా స్థానిక పోలీసులకు అందజేయాలన్నారు. అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. నేర నియంత్రణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు. ప్రజలు తమ ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గుర్తిసే డయల్ 112 లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని కోరారు. -
వినతులిచ్చినా పట్టించుకోలేదు
● తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా సోమశిల: అనంతసాగరం మండలం సంజీవనగరం గ్రామానికి చెందిన గంగు నారాయణ, అతని తమ్ముడు ఎర్రగంగు, కుటుంబ సభ్యులు బుధవారం అనంతసాగరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం తమకు జగనన్న లేఅవుట్లో 20వ నంబర్ ప్లాట్ను కేటాయించిందన్నారు. తమ ప్లాట్ నంబర్తో ఫాతిమా అనే మహిళకు అధికారులు పట్టా ఇచ్చారని ఆరోపించారు. దీనిపై ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయంలో వినతులిచ్చినా పట్టించుకోలేదన్నారు. దీనిపై తహసీల్దార్ జయవర్ధన్ మాట్లాడుతూ సాంకేతిక సమస్య వల్ల ఇలా జరిగిందన్నారు. హౌసింగ్లో ఇద్దరి లబ్ధిదారుల పేర్లు నమోదైనట్లు చెప్పారు. ఫాతిమా కుటుంబం ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేస్తున్నందున నారాయణ ఒప్పుకొంటే మరో ప్లాట్ను ఇస్తామన్నారు. -
ప్రయాణికులకు నరకం
నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. సభలంటే చాలు ఆర్టీసీ బస్సుల్ని తరలించేస్తున్నారు. దీంతో బస్టాండ్లలో జనం ఎదురుచూపుల్లో ఉండిపోతున్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఎవరైనా వినియోగించాలంటే అద్దె తప్పనిసరిగా ముందుగా చెల్లించాలి. అయితే కూటమి పెద్దలు ఆర్టీసీని తమ సొంత సంస్థగా భావించి బస్సులను యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. అద్దె చెల్లింపులు బకాయిలు పెట్టడంతో ఆ ర్టీసీకి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పెద్ద సంఖ్యలో.. జిల్లాలో మొత్తం 7 డిపోలున్నాయి. నెల్లూరు 1 డిపో, 2 డిపో, ఆత్మకూరు, కందుకూరు, కావలి, రాపూరు, ఉదయగిరి డిపోలున్నాయి. అన్నింట్లో 642 బస్సులున్నాయి. కూటమి ప్రభుత్వం నిర్వహించే సభలకు పెద్ద సంఖ్యలో వాహనాలను తరలిస్తున్నారు. ఇప్పటికి నాలుగు పర్యాయాలు కూటమి ప్రభుత్వం వివిధ సభలకు బస్సులను తీసుకెళ్లింది. అందులో మహానాడు సభకు మాత్రమే నగదు చెల్లించినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మిగిలిన వాటికి సంబంధించి నగదు చెల్లింపులపై స్పందన లేదు. ప్రైవేట్ వాహనాలే దిక్కు ప్రధాని నరేంద్రమోదీ గురువారం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తారు. ఓర్వకల్లు మండలం నన్నూరు సమీపంలో జరిగే జీఎస్టీ.. సూపర్ సేవింగ్ సభలో ప్రధాని పాల్గొంటారు. దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం బుధవారం 250 బస్సులను తరలించారు. దీంతో ఆర్టీసీ డిపోల్లో స్వల్ప సంఖ్యలో బస్సులు కనిపించాయి. గ్రామాల నుంచి నెల్లూరుకు, నగరం నుంచి పట్టణాలు, ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించే విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. అడపాదడపా వచ్చే బస్సుల కోసం గంటల తరబడి డిపోల్లో వేచిచూడాల్సి వచ్చింది. వచ్చిన వాటిని ఎక్కేందుకు అష్టకష్టాలు పడ్డారు. ఓవైపు వర్షం, మరోవైపు ఊర్లకు వెళ్లేందుకు ఆలస్యం కావడంతో ఆటోలు, ఇతర వాహనాలను ఆశ్రయించారు. దూర ప్రాంతవాసులు రెండు, మూడు ఆటోలు మారి గమ్యస్థానం చేరుకోవాల్సి వచ్చింది. ముందు జాగ్రత్తలు తప్పనిసరి ఈ ఏడాది మే 4వ తేదీన అమరావతి రాజధాని పునఃప్రారంభ సభకు జిల్లా నుంచి 290 బస్సులను తరలించారు. మే 30వ తేదీన కడపలో జరిగిన టీడీపీ మహానాడుకు 263 బస్సులను, సెప్టెంబర్ 10వ తేదీన అనంతపురంలో సూపర్ సిక్స్ – సూపర్హిట్ బహిరంగ సభకు 260 బస్సులను తీసుకెళ్లారు. తాజాగా కర్నూలు జిల్లాలో జరిగే సభకు 250 బస్సులు పంపారు. కూటమి ప్రభుత్వం సభలు నిర్వహిస్తోందంటే ప్రయాణికులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సభ నిర్వహించే ముందురోజు, ఆరోజు ప్రయాణాలు పెట్టుకోకుండా ఉండాల్సిందే. విద్యార్థులు, ఉద్యోగులు ప్రత్యామ్నాయ మార్గం చూసుకోవాల్సిన స్థితి వచ్చింది. జీఎస్టీ సూపర్ సేవింగ్స్ సభకు బస్సుల తరలింపు అవస్థలు పడుతున్న జనం కూటమి ప్రభుత్వంలో ఇది మామూలే.. నాలుగు పర్యాయాలు సభలకు బస్సుల వినియోగం ఇప్పటికి ఒక్కదానికే అద్దె చెల్లింపు -
ఐదు షాపులపై కేసుల నమోదు
నెల్లూరు(అర్బన్): తూనికలు, కొలతల శాఖాధికారులు బుధవారం నెల్లూరు నగరంలోని పలు రకాల వ్యాపార దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ శాఖకు చెందిన నెల్లూరు ఇన్స్పెక్టర్ షేక్ రియాజ్ అహ్మద్, కావలి ఇన్స్పెక్టర్ మొహిసిన్, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీకాంత్తోపాటు సిబ్బంది మైపాడు గేట్ సెంటర్లోని చేపల మార్కెట్, ఏసీ కూరగాయల మార్కెట్, కోనేరు ప్రాంతంలోని కూరగాయల మార్కెట్, పలు చికెన్ షాపుల్లో తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ఐదు షాపులపై కేసులు నమోదు చేశారు. చేపల వ్యాపారులు ఉపయోగిస్తున్న తక్కెడలో తేడాలుండటంతో స్వాధీనం చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులు కాపాడేందుకు కృషి చేస్తున్నామన్నారు. -
టీచర్లను రిలీవ్ చేయాలని డిమాండ్
నెల్లూరు(టౌన్): ‘ఈ ఏడాది జూన్లో బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయని కారణంగా మానసిక వేదనకు గురవుతున్నారు. వారిని వెంటనే రిలీవ్ చేయాలి’ అని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ హజరత్ డిమాండ్ చేశారు. మంగళవారం నెల్లూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీచర్లను రిలీవ్ చేయకుంటే ఈనెల 17న జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట 48 గంటల నిరహార దీక్ష చేయనున్నట్లు తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అన్ని మండలాల్లో టీచర్లను రిలీవ్ చేయాలని, లేకుంటే జరగబోయే పరిణామాలకు జిల్లా విద్యాశాఖాధికారి పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు. అంతర్ జిల్లాల బదిలీల్లో కమిషనర్, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇచ్చిన జీఓలను బేఖాతరు చేసి కొన్ని ఖాళీలపై వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుని చూపడం జరిగిందన్నారు. డీఎస్సీ 2025 నూతన ఉపాధ్యాయులు ప్రవేశం పొందిన సందర్భంగా వారికి 1ః1 రేషియోలో ఖాళీలను చూపించారన్నారు. నూతన టీచర్లకు ఎస్జీటీ వేకెన్సీల్లో 15 కంటే తక్కువ రోల్ ఉన్న పాఠశాలలను వేకెన్సీలో చూపించారన్నారు. ఉదాహరణకు తడ మండలం ఇరకం ఎంపీపీఎస్లో – 4, వాకాడు మండలం మాధవరం ఎంపీపీఎస్లో – 5, రెడ్డిపాళెం ఎంపీపీఎస్లో – 10, డక్కిలి మండలం పాతనాలపాడు ఎంపీపీఎస్లో – నలుగురు ఉన్నారన్నారు. సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దశరథరాములు, నాయకులు పాల్గొన్నారు. -
పర్యాటక రంగంపై పుస్తకావిష్కరణ
వెంకటాచలం: టూరిజం ఇన్నోవేటివ్ పాత్వేస్ టు సస్టైనబుల్ లైవ్లీహుడ్స్ – డైవర్సిఫయింగ్ రూరల్ ఆక్యుపేషన్స్ అనే పుస్తకాన్ని మండలంలోని కాకుటూరు వద్దనున్న విక్రమ సింహపురి యూనివర్సిటీలో వీసీ అల్లం శ్రీనివాసరావు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో పర్యాటక రంగం చాలా కీలకమైందన్నారు. యువత సృజనాత్మక ఆలోచనలతో ఈ రంగంలోకి రావాలని పిలుపునిచ్చారు. పుస్తక రచయిత డాక్టర్ మైల త్యాగరాజు మాట్లాడుతూ గ్రామీణ సమాజాల్లో ఉపాధి వైవిధ్యానికి పర్యాటకం ఎలా దోహదపడుతుందో ఈ పుస్తకంలో విశ్లేషించామని చెప్పారు. సుస్థిర పర్యాటక పద్ధతులు భారతదేశం వంటి దేశాలకు అత్యంత అవసరమన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి రిజస్ట్రార్ డాక్టర్ కె.సునీత, ప్రిన్సిపల్ సీహెచ్ విజయ, పర్యటక విభాగాధిపతి డాక్టర్ పి.సుజాత తదితరులు పాల్గొన్నారు. రైతులకు అధిక ఆదాయం వచ్చేలా చర్యలు ● హార్టికల్చర్ ఏడీ సుబ్బారెడ్డి నెల్లూరు(పొగతోట): నిమ్మతోటలు సాగు చేస్తున్న రైతులకు అధిక ఆదాయం వచ్చేలా చర్యలు చేపడుతున్నామని హార్టికల్చర్ ఏడీ సుబ్బారెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక వ్యవసాయ పరిశోధన క్షేత్రంలో నిమ్మ రైతులకు నిర్వహించిన జిల్లా స్థాయి సదస్సులో ఏడీ మాట్లాడారు. రైతులు శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పాటించాలన్నారు. కేవీకే శాస్త్రవేత్త డి.తిరుపాల్, డాక్టర్ కవిత, ఏడీహెచ్ అనురాధ మాట్లాడారు. పంట కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరించారు. సదస్సులో డాక్టర్ కె.వెంకటసతీష్, అధికారులు, రైతులు పాల్గొన్నారు. మద్యం బాటిళ్లు తరలిస్తుండగా.. ● గేదెను ఢీకొని బొలెరో ట్రక్కు బోల్తా కొడవలూరు: మద్యం లోడుతో ఉన్న బొలెరో ట్రక్కు గేదెను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటన జాతీయ రహదారిపై గండవరం ఫ్లై ఓవర్పై మంగళవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలంలోని మద్యం డిపో నుంచి కావలిలోని మద్యం దుకాణాలకు ట్రక్కు బయలుదేరింది. గండవరం ఫ్లై వర్పై గేదె కనిపించక దాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనం తిరగబడింది. గేదెకు తీవ్ర గాయాలై నడవలేని స్థితికి చేరుకుంది. ట్రక్కు డ్రైవర్కూ గాయాలయ్యాయి. అట్టపెట్టెల్లో ఉన్న కొన్ని మద్యం బాటిళ్లు రోడ్డుపై పడ్డాయి. అందులో కొన్ని పగిలిపోయాయి. గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యనెల్లూరు(క్రైమ్): ఆర్థిక సమస్యలో, కుటుంబ కలహాలో, మరే ఇతర కారణాలో తెలియదు గానీ ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెల్లూరు నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్ – వేదాయపాళెం మధ్యలోని కొండాయపాళెం గేటు సమీపంలో మంగళవారం జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. సుమారు 50 సంవత్సరాల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం మెమూ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై హరిచందన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు తెలుపు రంగు షర్ట్, బులుగు రంగు చెక్స్ లుంగీ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాఠాలు చెప్పి ఇంటికెళ్తుండగా..
● రైలు ఢీకొని టీచర్ మృతి నెల్లూరు(క్రైమ్): ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. బడిలో విద్యార్థులకు పాఠాలు చెప్పి ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మృతిచెందింది. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా తయారైంది. అతికష్టంపై రైల్వే పోలీసులు మృతురాలు ఎవరనే విషయాన్ని గుర్తించి బాధిత కుటుంబానికి సమాచారం అందించారు. ఈ ఘటన నెల్లూరు వేదాయపాళెం రైల్వేగేటు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. వేదాయపాళెం జనశక్తినగర్లో విశ్రాంత బ్యాంక్ మేనేజర్ రామాంజనేయులు, పద్మావతి (50) దంపతులు నివాసముంటున్నారు. ఇద్దరు కుమార్తెలున్నారు. వారికి వివాహమైంది. ఒకరు బెంగళూరులో, మరొకరు హైదరాబాద్లో ఉంటున్నారు. పద్మావతి మనుబోలు మండలం కొలనకుదురు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆమె రోజూ ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లి వచ్చేవారు. మంగళవారం కూడా బడిలో విధులు ముగించుకుని వేదాయపాళెంలో దిగి ఇంటికి బయలుదేరారు. రైల్వే గేటు వేసి ఉంది. కొద్దిదూరంలో పట్టాలపై గూడ్సు రైలు ఆగి ఉండటాన్ని చూసింది. పట్టాలు దాటుతుండగా మరోరైలు వేగంగా వచ్చి ఆమెను ఢీకొంది. దీంతో అక్కడికక్కడే చనిపోయింది. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై ఎన్.హరిచందన తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి బాధిత కుటుంబానికి సమాచారం అందించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. ఎస్సై హరిచందన కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ధరలు భారీగా తగ్గించారు
వారం, పదిరోజుల వ్యవధిలో పొగాకు ధరలు బాగా తగ్గించారు. హైగ్రేడ్ పొగాకు క్వింటాకు రూ.30 వేలు కూడా ఇవ్వడం లేదు. ఇక లోగ్రేడ్ను అసలు కొనుగోలు చేయడం లేదు. దీంతో ఈ ఏడాది భారీగా నష్టాలొచ్చే అవకాశం ఉంది. ధరలు మరింత తగ్గుతాయని చెబుతున్నారు. ఇంకెంత తగ్గిస్తారో అర్థం కావడం లేదు. మొత్తంగా బ్యారన్కు రూ.2 లక్షల వరకు కచ్చితంగా నష్టం వస్తుంది. – నలగర్ల రవి, పొగాకు రైతు, పోలినేనిపాళెం రైతులను ఆదుకోవాలి ఈ సంవత్సరం మొదటి నుంచి పొగాకు ధరలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ ధరలు ఒక్కసారిగా తగ్గించారు. ఇలా ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. పొగాకు బోర్డు వద్ద రైతుల కార్పస్ఫండ్ రూ.వేల కోట్లు ఉంది. ఆ డబ్బులతో ఇటువంటి కష్టసమయంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. – కట్టా హనుమంతరావు, పొగాకు రైతు, వలేటివారిపాళెం -
బాధిత కుటుంబాలకు నగదు బాండ్ల అందజేత
● ప్రభుత్వం నుంచి ఇంకా అందని పరిహారం నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆత్మకూరు నియోజకవర్గం పెరమన గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై కారును ఇసుక టిప్పర్ ఢీకొట్టిన ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇందుకూరుపేట, నెల్లూరు నగరం గుర్రాలమడుగు సంఘం ప్రాంతానికి చెందిన ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. దీంతో సీపీఎం నేతలు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చేందుకు స్పష్టమైన హామీ ఇవ్వాలని నిరసన కార్యక్రమం చేపట్టారు. కాగా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి మృతుల కుటుంబాలకు ఒక్క రూపాయి నష్టపరిహారం అందలేదు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించి ఆర్థిక భరోసా కల్పించాలని నాయకులు టిప్పర్ యజమాని రవీంద్రారెడ్డితో మాట్లాడారు. అతను అంగీకరించి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్కు సంబంధించి రూ.2,30,000 చొప్పున బాండ్లను అందజేశారు. మంగళవారం రాత్రి గుర్రాలమడుగు సంఘం ప్రాంతంలో నాయకులు చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, నాయకులు కాయం శ్రీనివాసులు, సుధాకర్, బాబు, నారాయణ, సంపూర్ణమ్మ, వెంకటేశ్వర్లు, కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నగరంలో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు
● బహిరంగ మద్య సేవనంపై 52, డ్రంక్ అండ్ డ్రైవ్పై 17 కేసుల నమోదు నెల్లూరు(క్రైమ్): ఎస్పీ డాక్టర్ అజిత సోమవారం అర్ధరాత్రి నెల్లూరు నగరంలో పర్యటించారు. నాలుగుకాళ్ల మండపం, ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం, నెల్లూరు బ్యారేజ్, మెడికవర్ వైద్యశాల, బుజబుజనెల్లూరు, అయ్యప్ప గుడి సెంటర్, కరెంటాఫీస్ సెంటర్, ఆర్టీసీ బస్టాండ్, వీఆర్సీ తదితర ప్రాంతాల్లో ఎస్పీ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అనంతరం బీట్స్ను పరిశీలించి బీట్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నేర నియంత్రణలో భాగంగా రాత్రిపూట వాహనాల తనఖీలు ముమ్మరం చేశామన్నారు. రౌడీయిజం, దౌర్జన్యాలు, దోపిడీ, దొంగతనాల కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అదే విధంగా రోడ్డు ప్రమాదాల నివారణ, అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకట్ట వేసేందుకు నాకా బందీని జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు. ● జిల్లాలో సోమవారం అర్ధరాత్రి 1,580 వాహనాలను తనిఖీ చేశారు. కాగా బహిరంగ మద్య సేవనానికి సంబంధించి 52 కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్కు సంబంధించి 17 కేసులు నమోదు చేశారు. 3 వాహనాలు సీజ్ చేశారు. ఎంవీ యాక్ట్ కేసులు 179 నమోదు చేసి రూ.58,795 అపరాధ రుసుము విధించారు. -
కోళ్ల వ్యర్థాల వాహనం సీజ్
పొదలకూరు: తమిళనాడు రాష్ట్రం సేలం నుంచి జిల్లాలోని జొన్నవాడ చేపల చెరువుల వద్దకు కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్న మినీ వ్యాన్ను పొదలకూరు పోలీసులు మంగళవారం సీజ్ చేశారు. వ్యర్థాలను తరలిస్తున్న మణికంఠపై కేసు నమోదు చేశారు. రెవెన్యూ, మత్స్య, పోలీసు శాఖలు కలిసి వ్యర్థాలను అటవీ ప్రాంతంలో పాతిపెట్టారు.కండలేరులో 59.880 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 59.880 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 3,400 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,500, పిన్నేరు కాలువకు 300, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 200, మొదటి బ్రాంచ్ కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
నేటి నుంచి విద్యుత్ ఉద్యోగుల ‘పవర్’
● సమ్మెలో 8 వేల మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు ● అర్ధరాత్రి వరకు చర్చలు.. ఆఖరివరకు సస్పెన్స్నెల్లూరు (వీఆర్సీ సెంటర్): విద్యుత్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతుండడంతో తమ ‘పవర్’ ఏమిటో చూపించేందుకు సమ్మె బాట పట్టనున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ ఉద్యోగులు జేఏసీగా ఏర్పడి విద్యుత్ యాజమాన్యం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయెజనం లేకపోవడంతో నెల రోజుల నుంచి దశల వారీ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. విద్యుత్ ఉద్యోగుల ఆందోళనలు, నిరసనలను పట్టించుకోక పోవడంతో బుధవారం నుంచి సమ్మెలోకి వెళ్లేందుకు జేఏసీ పిలుపు నిచ్చింది. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి వరకు ప్రభుత్వ పెద్దలతో జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమైంది. జిల్లాలో ఏపీ ట్రాన్స్కో, ఏపీ డిస్కం, ఏపీ జెన్కోల్లో 8 వేల మందికి పైగా శాశ్వత ఉద్యోగులు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన విద్యుత్ సంస్థల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థల్లో ఉన్న రెండు యూనియన్లు మినహా దాదాపు అన్ని యూనియన్లు, అసోసియేషన్లు సమ్మెకు సిద్ధపడ్డాయి. దీంతో విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న 90 శాతం మంది ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె లోకి వెళ్లనున్నారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్న లైన్మన్లు, అసిస్టెంట్ లైన్మన్లు, జూనియర్ లైన్మన్లు, లైన్ ఇన్స్పెక్టర్లు, షిప్టు ఆపరేటర్లు సమ్మెలో పాల్గొంటే ప్రజలకు విద్యుత్ కష్టాలు తప్పవనే చెప్పాలి. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడిన సందర్భాల్లో మరమ్మతు పనులు చేసేవారు లేక, విద్యుత్ సబ్ స్టేషన్లలో విధులు నిర్వహించే వారు లేకపోవడంతో దీని ప్రభావం నేరుగా విద్యుత్ వినియోగదారులు, ప్రజలపై పడే అవకాశం ఉంది. అయితే విజయవాడలోని విద్యుత్సౌదలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీతో మంగళవారం సాయంత్రం పలు యూనియన్ల నాయకులు చర్చలకు హాజరయ్యారు. ఈ చర్చలు విఫలమైతే బుధవారం నుంచి సమ్మె తప్పదు. విద్యుత్ కార్మికుల ప్రధాన డిమాండ్లు ఇవే ● విద్యుత్ సంస్థల్లో పనిచేసే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులను విద్యుత్ సంస్థల్లో విలీనం చేయాలి. ● పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలి. ● ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్హత కలిగిన జూనియర్ ఇంజినీర్లను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా పదోన్నతి కల్పించాలి. ● విద్యుత్ సంస్థలో కారుణ్య నియమాకాలను పాత పద్ధతిలో చేపట్టాలి. ● 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లను కాంట్రాక్ట్కు ఇవ్వకుండా విద్యుత్ యాజమాన్యాలే నిర్వహించాలి. ● జూనియర్ లైన్మన్ గ్రేడ్–2లను అసిస్టెంట్ లైన్మన్లుగా పదోన్నతి కల్పించాలి. ● విద్యుత్ ఉద్యోగులు, పింఛనర్లకు అపరిమిత నగదు రహిత వైద్య సౌకర్యం అందించాలి. -
జాతీయ మానవహక్కుల కమిషన్ విచారణ
బిట్రగుంట: బోగోలు మండలం కడనూతలలో రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల నిర్వహణకు స్థానిక అధికారులు అడ్డంకులు సృష్టిస్తుండడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ అధికారులు మంగళవారం సమగ్ర విచారణ చేపట్టారు. కళాశాల వసతి గృహం నుంచి పంట పొలాల్లోకి వస్తున్న వృథానీరు కారణంగా ఇబ్బందులు పడుతున్నామని స్థానిక టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో పంచాయతీ అధికారులు ప్రాథమిక విచారణ కూడా చేపట్టకుండా, ప్రత్యామ్నాయం చూపించకుండా వృథా నీటిని బయటకు రాకుండా అడ్డుగా గ్రావెల్తో కట్టపోయించారు. దీంతో కళాశాలలోని సుమారు 2500 మంది విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిపై కళాశాల అధికారులు, స్థానిక అధికారులతో పాటు జాతీయ మానవహక్కుల కమిషన్కు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో మానవహక్కుల కమిషన్ విచార ణ విభాగానికి చెందిన అధికారులు కుల్బీర్సింగ్, యతిప్రకాశ్ శర్మ, సంజయ్కుమార్తో కూడిన బృందం కళాశాలను సందర్శించి వివరాలు సేకరించారు. వివిధ శాఖల అధికారులతో కలిసి విచారణ చేపట్టారు. కళాశాల నుంచి వృథా నీరు బయటకు వెళ్లే మార్గాలు, గ్రామస్తుల అభ్యంతరాలపై విచారణ నిర్వహించారు. కళాశాల కరస్పాండెంట్, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, అధ్యాపకులు వాస్తవ పరిస్థితిని వివరించారు. స్థానిక టీడీపీ నాయకులు కూడా తమ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో విచారణ కొనసాగిస్తున్నారు. -
నకిలీ మద్యంపై సీబీఐ విచారణ చేపట్టాలి
● వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట నిరసన ఆత్మకూరు: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు నకిలీ మద్యాన్ని కుటీర పరిశ్రమగా మార్చేసి ఊరూరా బెల్టుషాపుల సరఫరా చేశారని, ఇప్పటికీ జరుగుతుందనే అనుమానాలు ఉన్నాయని సీబీఐతో విచారణ చేపడితే ఎక్కడెక్కడ మూలాలు ఉన్నాయో తెలుస్తాయని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఊరూరా మద్యం దుకాణాలు, వీధికో బెల్టు షాపు చొప్పున ఏర్పాటు చేసి నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తూ ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలను హరిస్తున్న కూటమి ప్రభుత్వ మద్యం విధానాలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ అధిష్టానం పిలుపు మేరకు, మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి సూచనలతో మంగళవారం నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు ఆత్మకూరులోని ఎకై ్సజ్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎకై ్సజ్ సీఐ బి వెంకటరమణమ్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి పాలనలో నకిలీ మద్యం తయారు కుటీర పరిశ్రమగా మారిందని, మద్యపానప్రియుల ఆరోగ్యానికి తూట్లు పొడిచేలా మద్యం రాష్ట్రంలో ఏరులై పారుతుందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీ పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో నాటి సీఎం జగన్మోహన్రెడ్డి అబ్కారీ శాఖ ద్వారానే కొనసాగించి దఫదఫాలుగా మద్యం షాపులను నియంత్రించేలా చర్యలు తీసుకున్నారన్నారు. అయితే కూటమి పాలన ఏర్పడ్డాక ఏడాదిన్నర కాలంలో పుట్టగొడుగుల్లా మద్యం దుకాణాలు, బెల్టుషాపులు ఏర్పాటయ్యాయని దుయ్యబట్టారు. నకిలీ మద్యం కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి కుటుంబాలకు దిక్కెవరని ప్రశ్నించారు. ప్రస్తుతం బయట పడిన నకిలీ మద్యం కుటీర పరిశ్రమపై ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు సిట్ విచారణకు ఆదేశించామని చెబుతున్నారని, ఈ సిట్ చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటూ ఆరోపించారు. సీబీఐతో విచారణ చేపట్టాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్రెడ్డి, బూత్ కమిటీ జిల్లా అధ్యక్షుడు బాలిరెడ్డి సుధాకర్రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు, మండలాల కన్వీనర్లు పులగం శంకర్రెడ్డి, బిజివేముల పిచ్చిరెడ్డి, చెన్ను వెంకటేశ్వరరెడ్డి, కంటాబత్తిన రఘునాథరెడ్డి, పార్టీ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పులిమి రమేష్రెడ్డి, కౌన్సిలర్ కొండా స్వరూపరాణి, పార్టీ నాయకులు బట్రెడ్డి జనార్దన్రెడ్డి, నోటి వినయ్కుమార్రెడ్డి, బి.రవికుమార్రెడ్డి, ఎ.సుబ్బారెడ్డి, కల్పనారెడ్డి, ఎన్. ప్రసాద్, మీరామొహిద్దీన్, మునీర్, రహీం, జమ్రు, ఎన్.ప్రతాప్, గడ్డం శ్రీనివాసులురెడ్డి, హరిబాబు, బాలచెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఎంఐహెచ్ఎం కన్వెన్షన్ హాల్ సీజ్
నెల్లూరు (బారకాసు): నెల్లూరు నగర పాలక సంస్థ (42/3 సచివాలయం) పరిధిలోని డైకస్రోడ్డు, కోటమిట్ట షాదీమంజిల్ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఎంఐహెచ్ఎం కన్వెన్షన్ హాల్ (కల్యాణ మండపం)ను మంగళవారం ఎన్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కల్యాణ మండపం విషయమై ఆనుకుని ఉన్న గృహ యజమాని కార్పొరేషన్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఫిర్యాదును పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఎంఐహెచ్ఎం కన్వెన్షన్ హాల్పై తగు చర్యలు తీసుకోవాలని నగర పాలక కమిషనర్ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయినా సంబంధిత ఎన్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహించడంతో సదరు కల్యాణ మండపంలో శుభ కార్యాలయాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ నెల 4న ‘సాక్షి’లో ‘కట్టుకో.. పైసలిచ్చుకో..! శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన నగర పాలక సంస్థ కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ప్లానింగ్ డీసీపీ ఇన్చార్జి రఘునందనరావు, టీపీఓ సతీష్కుమార్, అధికారులు తమ సిబ్బందితోపాటు రెవెన్యూ, విద్యుత్ శాఖల సిబ్బందితో కలిసి ఎంఐహెచ్ఎం కన్వెన్షన్ హాల్ను ప్రస్తుతానికి సీజ్ చేశారు. విద్యుత్ కనెక్షన్ కూడా తొలగించేలా చర్యలు చేపట్టారు. తదుపరి చర్యలు కమిషనర్ ఆదేశాల మేరకు చేపట్టనున్నామని డీసీపీ ఇన్చార్జి రఘునందనరావు తెలియజేశారు. 19న సీనియర్ బాస్కెట్బాల్ జట్టు ఎంపిక కందుకూరు రూరల్: ఉమ్మడి ప్రకాశం జిల్లా సీనియర్ మహిళలు, పురుషుల బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక టీఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ వలేటి రవీంద్ర, సెక్రటరీ తొట్టెంపూడి సుబ్బారావు మంగళవారం తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే సీ్త్రలు, పురుషులకు వయసు పరిమితి లేదన్నారు. ఎంపికలకు వచ్చే వారు ఆధార్కార్డు తీసుకురావాలన్నారు. ఎంపికై న జట్లు విశాఖపట్నంలో జరిగే 11వ సీనియర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చాంపియన్షిప్లో పాల్గొంటారని తెలిపారు. నవంబర్ 7 నుంచి 10వ తేదీ వరకు పోటీలు జరుగుతాయని తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఎంపికలకు హాజరుకావాలని కోరారు. కర్నూలు సభకు 250 బస్సుల కేటాయింపు నెల్లూరు సిటీ: ఈ నెల16న కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని నన్నూరు వద్ద నిర్వహించే ప్రధానమంత్రి భారీ బహిరంగ సభకు నెల్లూరు జిల్లా నుంచి ఏపీఎస్ఆర్టీసీ 250 బస్సులు కేటాయించారు. ఆత్మకూరు డిపో నుంచి 31, కందుకూరు 35, కావలి 40, నెల్లూరు డిపో–1 నుంచి 40, నెల్లూరు డిపో–2 నుంచి 50, రాపూరు 25, ఉదయగిరి డిపో నుంచి 29 బస్సులు సభకు వెళ్లనున్నాయి. ఈ బస్సుల్లో పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు ఎక్కువగా ఉండడంతో నేడు, రేపు ప్రయాణికులు, మహిళా ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో 23 కంపార్ట్మెంట్లు నిండాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 78,569 మంది స్వామి వారిని దర్శించుకోగా 27,482 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.93 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు (అర్బన్): భవిష్యత్ తరాల మనుగడకు ఆడ బిడ్డలను కాపాడుకోవడం మనందరి బాధ్యతని, లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హిమాన్షుశుక్లా అన్నారు. అంతర్జాతీయ బాలికాదినోత్సవాన్ని పురస్కరించుకుని వారోత్సవాల్లో భాగంగా మంగళవారం ఐసీడీఎస్, వైద్యశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు, మహిళా ఉద్యోగులతో భారీ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీని నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాల వద్ద కలెక్టర్ హిమాన్షు శుక్లా జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ కేవీఆర్ పెట్రోల్ బంకు మీదుగా ట్రంకు రోడ్డులో కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ బిడ్డలను పుట్టినప్పటి నుంచే ఆడైనా.. మగైనా సమానమే అనే భావంతో పెంచాలన్నారు. స్కానింగ్ ద్వారా ఆడబిడ్డ అని తెలుసుకుని అబార్షన్ చేయించి బ్రూణ హత్యలకు పాల్పడం అమానుషమన్నారు. ఎక్కడైనా లింగ నిర్ధారణ చేసినట్టు తేలితే అలాంటి డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపటి తరాల ఆశాజ్యోతి, ఇంటికి కానుక, వెలుగు ఆడ పిల్ల అన్నారు. ఆడ బిడ్డ చదువుకుంటే కుటుంబంతో పాటు సమాజం ఎంతో వృద్ధి చెందుతుందన్నారు. మహిళలు మగ వారితో సమానంగా అన్ని పనులు చేస్తున్నారన్నారు. ఆమె ఔన్నత్యం గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్, డీఎంహెచ్ఓ సుజాత, బాలల సంరక్షణ అధికారి సురేష్, ఇంటర్మీడియట్ ప్రాంతీయ అధికారి వరప్రసాద్, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్యశాఖల సిబ్బంది, విద్యార్ధినిలు పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులు, విద్యార్థినులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న హిమాన్షు శుక్లా జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్ హిమాన్షు శుక్లా -
నిజాలు రాస్తే ‘సాక్షి’పై కక్ష సాధింపా?
కోవూరు: ప్రజా సమస్యలతోపాటు అధికార పార్టీ నేతల అవినీతి, అక్రమాలను వెలుగులోకి తెచ్చే విధంగా నిజాలు రాస్తే ‘సాక్షి’ పత్రికపై కక్ష సాధించడం విచారకరమని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కోవూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వాస్తవాలను రాసిన విలేకరుల ఇళ్లల్లో మద్యం అమ్మకాలు చేస్తున్నారంటూ సోదాలు చేయడం, విచారణ పేరుతో అర్ధరాత్రి, తెల్లవారు జామున ఇళ్లకు వెళ్లి నోటీసుల పేరుతో అలజడి సృష్టించడం ఏమిటని ప్రసన్న ప్రశ్నించారు. చంద్రబాబూ.. మీ పార్టీ నేతలు నకిలీ మద్యం తయారు చేయడం నిజం కాదా? నీ గ్యాంగ్తో రాష్ట్రం మొత్తం విక్రయించింది అబద్ధమా? అని నిలదీశారు. ఇవే నిజాలు కాబట్టే మీ పార్టీ నేతలపై కేసులు పెట్టారు. ఇవన్నీ నిజాలు కాబట్టే ‘సాక్షి’ పత్రిక నకిలీ మద్యం వ్యాపారం గురించి, అది తాగి చనిపోయిన వారి గురించి వాస్తవాలు వెల్లడించిందని గ్రామాల్లో, పట్టణాల్లో విషపూరిత మద్యం వ్యాపారాలు ఎలా సాగుతున్నాయో ప్రజలకు చూపించింది. నిజాలను జీర్ణించుకోలేకనే.. విచారణ పేరుతో వేధింపులకు దిగుతుందని ధ్వజమెత్తారు. నకిలీ మద్యం తయారీకి కారణమైన పార్టీ నేతలతోపాటు పోలీసులు, ఎకై ్సజ్ అధికారులపై చర్యలు తీసుకోవడం మాని, వాస్తవాలను రాసిన ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి, జిల్లా బ్యూరో ఇన్చార్జి మస్తాన్రెడ్డికి నోటీసులు జారీ చేయడం, మండల రిపోర్టర్ ఇంట్లో సోదాలు చేయడం మంచిది కాదన్నారు. నకిలీ మద్యం మాఫియాలు ఎవరి రక్షణలో పనిచేస్తున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఈ దుర్మార్గాన్ని బయట పెట్టిన పత్రికను బెదిరించడం అంటే ప్రజల గొంతును నొక్కడమే అన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా నాల్గో స్తంభం. ఆ స్తంభాన్నే కూలగొట్టే ప్రయత్నం జరుగుతోందని ప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరుల ఇళ్లల్లో సోదాలు చేయడం అప్రజాస్వామ్యం అర్ధరాత్రి పూట, తెల్లవారు జామున వెళ్లి నోటీసులా? నకిలీ మద్యం తయారు చేసింది నిజం కాదా? నీ గ్యాంగ్తో అమ్మించింది అబద్ధమా? వైఎస్సార్సీ పీఏసీ సభ్యుడు ప్రసన్నకుమార్రెడ్డి -
వినూత్నంగా చాంపియన్ ఫార్మర్ విధానం
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరురూరల్: ఆధునిక వ్యవసాయంలో పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గిపోతున్న ఆదాయాల నేపథ్యంలో జిల్లాలో వినూత్నంగా చాంపియన్ ఫార్మర్ (వ్యవసాయ విజేతలు) అనే నూతన విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో వివిధ అంశాలపై సబ్కలెక్టర్, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండలంలోని ఒక గ్రామంలో నెలలో ఒక రోజు సివిల్ రైట్స్ డే నిర్వహించాలన్నారు. యానాదులు ఎక్కువగా ఉన్నందున వారికి అధిక ప్రాధాన్యత నివ్వాలన్నారు. కేవలం భూ సంబంధ విషయాలే కాకుండా మిగిలిన అన్ని సమస్యలపై చర్చించాలన్నారు. మండల, డివిజనల్ స్థాయిలో పరిష్కారమయ్యే కేసులను జిల్లా కేంద్రం వరకు తీసుకురాకూడదన్నారు. జిల్లాలోని అర్హత కలిగిన ప్రతి ఒక్క కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు అందజేయాలన్నారు. వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నూతన వ్యవసాయ విధానంలో భాగంగా జిల్లాలోని 722 గ్రామ పంచాయతీల నుంచి ఔత్సాహిక రైతులను ఎంపిక చేసి వారిని వ్యవసాయ విజేతలుగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రస్తుత కాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు, డీఆర్ఓ విజయ్కుమార్, జెడ్పీ సీఈఓ మోహన్రావు, జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి, సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి తదితరులు పాల్గొన్నారు. -
వాయిగుండ్ల వెంకట్ ప్రమాణస్వీకారం
నెల్లూరు(బృందావనం): ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం దేవస్థానం ఆలయ పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులుగా వర్చ్యూసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ వాయిగుండ్ల వెంకట్తో సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సత్యకుమార్యాదవ్, కొలుసు పార్థసారథి హాజరయ్యారు. తమ సంస్థ అధినేతకు శ్రీశైలంలో భక్తులు సేవ చేసే అవకాశం లభించడంపై ఆ కంపెనీ సీజీఎంలు అభినవరాజు, సుధాకర్, సత్తార్, విజయకుమార్, కాంచన ప్రసాద్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. నేడు చైన్నె–నెల్లూరు మెమూ రైళ్ల రద్దు నాయుడుపేటటౌన్: చైన్నె–నెల్లూరు మధ్య నడిచే మెమూ (నంబరు 66035, 66036) రైళ్లు మంగళవారం పూర్తిగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. తడ, సూళ్లూరుపేట ప్రాంతాల్లో రైల్వే లైన్ల మరమ్మతుల కారణంగా రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మెమూ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు. -
బైక్ను ఢీకొట్టిన కారు
● రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్సీపీ నాయకుడి మృతి కావలి(అల్లూరు): రోడ్డు ప్రమాదంలో కావలికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు పాలవల్లి పద్మనాభరెడ్డి (58) మృతిచెందిన ఘటన ముంగమూరు జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డికి ముఖ్య అనుచరుడైన పద్మనాభరెడ్డి వైఎస్సార్సీపీలో కీలకంగా ఉన్నారు. అల్లూరు నుంచి పద్మనాభరెడ్డి, రామకోటారెడ్డి మోటార్బైక్పై బయలుదేరారు. కొంత దూరం వెళ్లి యూటర్న్ తీసుకుంటున్న తరుణంలో వెనుక నుంచి కారు ఢీకొట్టింది. స్థానికులు వెంటనే వారిని నెల్లూరు అపోలో ఆస్పత్రికి తరలించగా పద్మనాభరెడ్డి మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. రామకోటారెడ్డికి కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. -
రోడ్డు దాటుతుండగా..
● కారు ఢీకొని వ్యక్తి మృతివెంకటాచలం: రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని కాకుటూరు వద్ద సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కాకుటూరు గ్రామానికి చెందిన కొండలరావు (47) విక్రమ సింహపురి యూనివర్సిటీలో సెక్యూరిటీ గార్డు పనిచేస్తున్నాడు. పని నిమిత్తం తన నివాసం నుంచి జాతీయ రహదారి దాటుతుండగా గూడూరు వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న గుర్తుతెలియని కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. కొండలరావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. -
ఆస్తి కోసం వేధింపులు
● పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన బాధితులు నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆస్తి కోసం పిల్లలు వేధిస్తున్నారని పలువురు వృద్ధులు ఫిర్యాదు చేశారు. సోమవారం నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 125 మంది విచ్చేసి ఫిర్యాదులను ఎస్పీ అజితకు అందజేశారు. ఆమె స్వయంగా అర్జీదారుల వద్దకెళ్లి మాట్లాడారు. న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, పీసీఆర్ సీఐ భక్తవత్సలరెడ్డి, ఎస్బీ సీఐ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● నా వయసు 73 సంవత్సరాలు. చిన్న కుమారుడు బాగోగులు పట్టించుకోవడం లేదు. ఇంటికి తాళం వేసి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నాడని ఆత్మకూరు ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడు ఫిర్యాదు చేశాడు. ● నాకు పిల్లల్లేరు. సోదరి కుమారుడైన కాకర్ల పెంచలయ్యను పెంచాను. అతను నా ఇల్లు, ఆస్తి ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేస్తున్నాడని చేజర్ల ప్రాంతానికి చెందిన 85 సంవత్సరాల వృద్ధుడు వినతిపత్రమిచ్చాడు. ● టెలిగ్రామ్ యాప్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి బిట్కాయిన్ ట్రేడింగ్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించాడు. అతడికి రూ.6 లక్షలు పంపాను. ఇప్పుడు స్పందించడం లేదని ఇందుకూరుపేట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి వెల్లడించాడు. ● పుత్తూరు ప్రాంతానికి చెందిన హేమంత్ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.4.50 లక్షలు తీసుకుని మోసగించాడని రాపూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ● తన కుమార్తె ఆగస్టు నెల నుంచి కనిపించడం లేదని, ఆచూకీ కనుక్కోవాలని నెల్లూరు నగరానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ● భర్త, అత్తమామలు, ఆడపడుచులు అదనపు క ట్నం కోసం వేధిస్తున్నారు. భర్త మద్యం తాగొచ్చి ఇంట్లో బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని, కౌన్సెలింగ్ చేసి కాపురాన్ని చక్కదిద్దాలని కందుకూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళ వినతిపత్రం అందజేసింది. ● భర్త చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. దగదర్తి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాను. భర్తతో కలిసి మరిది బెదిరిస్తున్నాడు. నా కుమారుడిని తీసుకెళ్లేందుకు అత్త ప్రయత్నిస్తోంది. రక్షణ కల్పించాలని దగదర్తి ప్రాంతానికి చెందిన ఓ మహిళ వేడుకుంది. -
పిల్లలకు అండగా ఉంటాం
● సీనియర్ సివిల్ జడ్జి కె.వాణినెల్లూరు(అర్బన్): బాలభవిత (అర్లీ ఇంటర్వెన్షన్) కేంద్రంలోని పిల్లలకు అండగా ఉంటామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వాణి తెలిపారు. నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఆవరణలో ఉన్న కేంద్రాన్ని సోమవారం ఆమె తనిఖీ చేశారు. న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వాణి మాట్లాడుతూ పుట్టుకతో లోపాలున్న వారికి, గ్రహణమొర్రి, గ్రహణ శూల, సకాలంలో మాట్లాడలేకపోవడం, వినలేకపోవడం సమస్యలున్న పిల్లలకు కేంద్రం అండగా ఉంటుందన్నారు. పిల్లలకు గుండె ఆపరేషన్లు, రూ.లక్షల విలువ చేసే కాక్టెయిల్ ఇంప్లాంట్ ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయిస్తున్నారన్నారు. పిల్లలకు ఏమి అవసరమైనా సంస్థ తరఫున అండగా ఉంటామన్నారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ 15100 ద్వారా తమను సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో కేంద్రం నోడల్ అధికారి డాక్టర్ యశ్వంత్, చిన్నపిల్లల డాక్టర్ సురేష్బాబు, డాక్టర్ పావని, మేనేజర్ జమీర్, పారా లీగల్ వలంటీర్ శ్రీనివాసులు, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
దూర ప్రాంతాల నుంచి తరలివచ్చి..
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● 500 దాటిన అర్జీల సంఖ్యనెల్లూరు రూరల్: ‘అయ్యా చాలాదూరం నుంచి వచ్చాం. మా వినతులు పరిశీలించి న్యాయం చేయండి’ అంటూ ప్రజలు అధికారులను కోరారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, డీపీఓ శ్రీధర్రెడ్డి, హౌసింగ్ పీడీ వేణుగోపాల్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రికార్డు స్థాయిలో 505 అర్జీలు వచ్చాయి. అందులో అధికంగా రెవెన్యూ శాఖవి ఉన్నాయి. చర్యలకు డిమాండ్ కండలేరు జలాశయంలో అక్రమంగా చేపల వేట సాగిస్తూ యానాదుల పొట్టకొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని యానాదుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్రాధ్యక్షుడు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ కొందరు ముఠాగా ఏర్పడి చేపల వేట సాగిస్తున్నట్లు ఆరోపించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, వెంటనే చర్యలు తీసుకోవాలని మత్స్య శాఖ జేడీని ఆదేశించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మానికల మురళి, చెంబేటి ఉష, బిట్రా ప్రసాద్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు. ఎమ్మార్పీఎస్ నిరసన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడికి యత్నించడాన్ని ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ నేతలు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షుడు అంబేడ్కర్ మాదిగ, ఉపాధ్యక్షుడు ఉదయకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బిల్లులు విడుదల చేయాలంటూ.. మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులకు పెండింగ్లో ఉన్న బిల్లులు, వేతనాలను వెంటనే విడుదల చేయాలంటూ ఆ యూనియన్ అధ్యక్షురాలు తుమ్మారెడ్డి రేవతి, కార్యదర్శి రెహానా బేగం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ బిల్లులు పెండింగ్లో ఉండటంతో భోజనం పెట్టడం కష్టమవుతోందన్నారు. సుహాసిని తదితరులు పాల్గొన్నారు. జీతాలు అందించాలి జిల్లాలో సీహెచ్సీల్లో పనిచేసే శానిటేషన్ సిబ్బందికి ఆరునెలలుగా జీతాలు అందడం లేదంటూ ఎస్టీ, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు చేమూరు రవికుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఫస్ట్ ఆబ్జెక్ట్ అనే సంస్థ టెండర్ దక్కించుకుందన్నారు. ఇది ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు బినామీగా తెలుస్తోందన్నారు. పలుమార్లు జిల్లా అధికారులను సంప్రదించిన ఫలితం లేదన్నారు. కార్యక్రమంలో సురేఖ, కీర్తి, మౌనిక, సుమ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. భూ ఆక్రమణపై ఫిర్యాదు తమకు పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని కొందరు బెదిరించి ఆక్రమించారని వలేటివారిపాళెం మండలం తూర్పు పోలినేనిపాళెం గ్రామస్తులు పోకూరు కోటయ్య కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. తాను పుట్టు మూగవాడినని, భార్యకు పక్షవాతం వచ్చిందని అర్జీలో పేర్కొన్నారు. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, కొండయ్య, సింహాద్రి, పాపారావు, సింగయ్య, ముసలయ్య మమ్మల్ని కొట్టి భూమిని ఆక్రమించినట్లు చెప్పారు. కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. వీఆర్వో, సర్వేయర్ తప్పుడు రిపోర్టులు ఇచ్చారన్నారు. ఎస్సై దగ్గరికి వెళితే స్టేషన్ పరిధిలో కనిపిస్తే జైల్లో వేస్తానని చెప్పారన్నారు. రక్షణ కల్పించాలని వేడుకున్నారు. వేలం నిర్వహించకుండానే.. బహిరంగ వేలం నిర్వహించకుండా విష్ణు ఆలయానికి సంబంధించిన టేకుతో సహా దాదాపు రూ.40 లక్షలకు సంబంధించిన మెటీరియల్ను అమ్ముకున్నారని తోటపల్లిగూడూరు మండలం వరిగొండ గ్రామానికి చెందిన గండవరపు వెంకటరామిరెడ్డి కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ జ్వాలాముఖి దేవస్థానం చైర్మన్ భర్త కోడూరు శ్రీనివాసులురెడ్డి అలియాస్ బాబిరెడ్డి ప్రజలను భయపెట్టి టేకుతో తయారుచేసిన తలుపులు, కిటికీలు, చెక్కలు తదితరాలు అమ్ముకుని దోచేస్తున్నారన్నారు. ఈఓ తాతా శ్రీనివాసరావు చిన్న ఘటనలపై ప్రజలపై కేసులు పెడుతుంటారని, కుంభకోణం జరిగినా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై పోరుబాట
● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కోవూరు: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నట్లు మాజీ మంత్రి, ఆ పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి తెలిపారు. కోవూరులోని ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి వైద్యానికి పెద్దపీట వేశారన్నారు. పేద విద్యార్థులు వైద్య విద్యనభ్యసించేందుకు 17 వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారన్నారు. అయితే సీఎం చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనతో కళాశాలలను ప్రైవేట్పరం చేస్తున్నారన్నారు. ఎంబీబీఎస్ చదవాలంటే రూ.కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. పులివెందుల మెడికల్ కళాశాలకు 50 సీట్లు మంజూరైతే, తమకొద్దంటూ ఎన్ఎంసీకి లేఖ రాసిన ఘనుడు చంద్రబాబు అని చెప్పారు. కూటమి ప్రభుత్వం రూ.2 లక్షల కోట్లు అప్పు చేసిందని, ఆ డబ్బంతా ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.5 వేల కోట్లతో కళాశాలలకు జీవం వస్తుందన్నారు. వైద్య కళాశాలలు కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీల బిడ్డలు వైద్య విద్య చదువుకోలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈనెల 28న నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు జరుగుతాయన్నారు. పోరుబాటలో భాగంగా కోటి సంతకాల సేకరణతోపాటు దశల వారీగా నిరసన కార్యక్రమాలను చేపడతామన్నారు. యువత, మేధావులు, వామపక్షాలు తదితరులు ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. రౌడీయిజం, దౌర్జన్యాలు చేస్తే జనం ఊరుకోరన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ పరిశీలకుడు కొండూరు అనిల్బాబు, ఏపీఎల్డీఏ చైర్మన్ విజయకుమార్, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు నరసింహారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు శ్రీలత, సీనియర్ నాయకులు రాధాకృష్ణారెడ్డి, మల్లికార్జునరెడ్డి, మండల కన్వీనర్లు అనూప్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, సతీష్రెడ్డి, నవీన్కుమార్రెడ్డి, శేషగిరిరావు, షాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
పేదల ఇళ్ల స్థలాల జోలికి వస్తే ఉపేక్షించం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వెంకటాచలం: పేదల ఇళ్ల స్థలాలు, ఇళ్ల జోలికి వస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి హెచ్చరించారు. మండలంలోని చవటపాళెంలో ఆదివారం కాకాణి పర్యటించారు. ఈ సందర్భంగా కాకాణి స్థానికులతో కలిసి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ భూముల్లో లేఅవుట్లు వేసి పారదర్శకంగా ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలు రద్దు చేయించి ఆ స్థలాలను అప్పనంగా టీడీపీకి చెందిన వారికి కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. అర్హత కలిగిన పేదలకు చెందిన ఇళ్ల స్థలాల జోలికి వస్తే అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. పేదలకు చెందిన ఇళ్ల స్థలాలను కబ్జా చేయాలని ఎవరు ప్రయత్నించినా క్షమించబోమన్నారు. అధికారులు అత్యుత్సాహంతో పేదల ఇళ్ల పట్టాలు రద్దు చేసేందుకు నోటీసులు ఇస్తే న్యాయ స్థానాన్ని ఆశ్రయించి పేదల పక్షాన పోరాడతామని తెలియజేశారు. దోపిడీపైనే సోమిరెడ్డికి శ్రద్ధ సర్వేపల్లి నియోజకవర్గాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా దోచుకోవడంపైనే సోమిరెడ్డి, అతని కుమారుడు రాజగోపాల్రెడ్డి శ్రద్ధ చూపుతున్నారని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటినా ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సర్వేపల్లిలో గ్రావెల్, ఇసుక, మట్టి బూడిద మాఫియా రోజు రోజుకు పెరిగిపోతుందని ఆరోపించారు. ఎక్కడా లేని విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని అన్నీ గ్రామాల్లో బెల్టు షాపుల్లో మద్యం అమ్మకాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇరిగేషన్ పనులపై విచారణ జరిపితే సర్వేపల్లిలో జరిగిన దోపిడీ బట్టబయలవుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతాంగం అన్నీ విధాలా ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదని, పండించిన పంటకు గిట్టుబాటు లభించక రైతులు ఆగ్రహంతో ఉన్నారని తెలియజేశారు. నకిలీ మద్యం బారిన పడి పేద ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే కూటమి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
కాకాణితో చంద్రశేఖర్రెడ్డి భేటీ
నెల్లూరు (స్టోన్హౌస్పేట): నెల్లూరు పొదలకూరురోడ్డులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితో ఆదివారం ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాల కార్యాచరణ, భవిష్యత్ రాజకీయ వ్యవహారాలపై చర్చించారు. నేడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నెల్లూరురూరల్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం కలెక్టరేట్లోని తిక్క న ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హి మాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు తమ అర్జీ స్థితి సమాచారం కోసం నేరుగా 1100 కాల్ సెంటర్ను సంప్రదించాలని కోరారు. అర్జీదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ నిండాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరింది. శనివారం అర్ధరాత్రి వరకు 84,571 మంది స్వామి వారిని దర్శించుకోగా 36, 711 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.70 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 24 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
అనర్హుడికి ‘ఆటోడ్రైవర్ల సేవలో’
● సొంత ఆటో లేకుండానే టీడీపీ కార్యకర్తకు పథకం వర్తింపు ● ఆయన స్వతహాగా వ్యవసాయదారుడు ● అర్హులకు దక్కని వైనం మర్రిపాడు: కూటమి ప్రభుత్వ పాలనలో పథకాలు అర్హత లేకపోయినా తమ్ముళ్లకే దక్కుతున్నాయనేందుకు ‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకం దర్పణంగా నిలుస్తోంది. జిల్లాలో సొంత ఆటోలు కలిగిన డ్రైవర్లు సుమారు 40 వేల మంది వరకు ఉన్నారు. వీరందరూ ఈ పథకం లబ్ధి కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అనేక కొర్రీలు వేసి చివరకు 17,406 మందికి ఈ పథకాన్ని వర్తింప చేశారు. అనర్హుడైన పక్కా టీడీపీ కార్యకర్తకు ఏ విధంగా లబ్ధి చేకూర్చారో అధికారులే సెలవివ్వాల్సి ఉంది. నిరుపేద ఆటోడ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు అంటూ ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పినా.. అమల్లో మాత్రం రాజకీయ సిఫారసులకు ప్రాధాన్యత లభించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మర్రిపాడు మండలంలోని పల్లవోలు గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త ముప్పాళ్ల జయవర్ధన్కు అసలు ఆటోనే లేదు. అతను ఆటోడ్రైవర్ కూడా కాదు. జయవర్ధన్ వ్యవసాయం చేస్తుంటాడు. అయినా ‘ఆటోడ్రైవర్ల సేవలో’ లబ్ధిదారుడిగా ఎంపిక కావడం స్థానికుల్లో చర్చనీయాంశమైంది. జయవర్ధన్కు AP39 UX3918 నంబరుతో ఆటో ఉన్నట్లు లబ్ధిదారుల జాబితాలో చూపించారు. రవాణాశాఖ రికార్డుల ప్రకారం ఈ ఆటోకు మర్రిపాడు మండలం వెంగంపల్లి పంచాయతీలోని భీమవరం గ్రామానికి చెందిన గోవిందు కృష్ణారెడ్డి యజమానిగా ఉన్నారు. జయవర్ధన్ ఎవరిదో ఆటోలో కూర్చొని ఫొటో తీసుకుని ‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకం దరఖాస్తుతో జతచేసి, ఆటోడ్రైవర్లా చూపించి పథకాన్ని పొందినట్లు తెలుస్తోంది. దీనిపై గ్రామస్తులు సైతం ఎంపీడీఓకు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఇదే గ్రామానికి చెందిన అర్హుడైన షేక్ అజామ్ అనే ఆటోడ్రైవర్కు లబ్ధి చేకూరలేదు. అర్హులైన ఆటోడ్రైవర్లకు చేకూరాల్సిన పథకాన్ని టీడీపీ నేతలు తప్పుడు ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకుని లబ్ధిపొందుతున్నారని అర్హులైన లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. విచారించి చర్యలు తీసుకుంటాం ‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకం కింద అనర్హులు లబ్ధిపొంది ఉంటే వారిపై చర్యలు తీసుకుంటాం. లబ్ధి చేకూరని అర్హులకు న్యాయం జరిగేలా మరోసారి ప్రభుత్వానికి ప్రతిపాదిస్తాం. అర్హులందరికీ పథకం ద్వారా నిధులు మంజూరయ్యేలా చూస్తాం. – మనోహర్రాజ్, ఎంపీడీఓ, మర్రిపాడు -
శిక్షణ సరే.. కుట్టు మెషీన్లేవీ..?
దుత్తలూరు: ఉచిత శిక్షణ...పూర్తి చేసుకున్న వారికి కుట్టుమెషీన్లతో పాటు సర్టిఫికెట్లను అందజేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి నేతలు ప్రగల్భాలు పలికారు. దీంతో జిల్లాలోని 31 కేంద్రాల్లో 1250 మంది మహిళలు శిక్షణ పొందారు. ట్రెయినింగ్ పూర్తయినా, మెషీన్లు పంపిణీకి నోచుకోవడంలేదు. మూడు నెలలు గడుస్తున్నా, ఇదే పరిస్థితి. బీసీ కార్పొరేషన్ ద్వారా జిల్లాలోని బీసీ, ఈబీసీ, కాపు వర్గాలకు చెందిన పేద మహిళలకు శిక్షణ పేరిట హడావుడి చేశారు. మెషీన్లు వస్తాయి.. ఉపాధి పొందొచ్చని ఆశపడిన మహిళలకు నిరాశే ఎదురవుతోంది. వాస్తవానికి శిక్షణకు సంబంధించిన అర్హులు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీటిని మున్సిపల్ కమిషనర్లతో పాటు ఎంపీడీఓలకు పంపారు. నిబంధనల మేరకు 18 నుంచి 60 ఏళ్లలోపు వారిని శిక్షణకు ఎంపిక చేశారు. సిబ్బందికి అందని వేతనాలు ఒక్కో శిక్షణ కేంద్రానికి ఒక టీచర్తో పాటు కంప్యూటర్ ఆపరేటర్ను నియమించారు. టీచర్కు నెలకు రూ.15 వేలు.. కంప్యూటర్ ఆపరేటర్కు రూ.12 వేల చొప్పున వేతనాన్ని మంజూరు చేయాలి. మూడు నెలలకు గానూ ఒక నెలకే వేతనాలను అందజేశారని సమాచారం. మిగిలిన మొత్తం ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 1250 మంది మహిళలకు ట్రెయినింగ్ నేటికీ ఎదురుచూపులు ప్రగల్భాలకే కూటమి నేతల పరిమితం పంపిణీ చేస్తాం జిల్లాలోని 31 కేంద్రాల్లో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఐదు చోట్ల ట్రెయినింగ్ జరుగుతోంది. ఇది పూర్తయిన వెంటనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కుట్టుమెషీన్లను అందజేస్తాం. సిబ్బంది వేతనాలకు సంబంధించిన బిల్లులను అప్లోడ్ చేస్తున్నాం. – నిర్మలాదేవి, బీసీ కార్పొరేషన్ ఈడీ -
మహిళల ఆరోగ్యాన్ని కాపాడాలి
నెల్లూరు(అర్బన్): మహిళల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా డాక్టర్లు కృషి చేయాలని పలువురు వైద్యులు పేర్కొన్నారు. విష్ 2025 ఉమెన్స్ ఇన్ఫెర్టిలిటీ సర్జరీ హార్మోన్ అనే అంశంపై చెముడుగుంట సమీపంలోని స్రిడ్స్ ఫంక్షన్ హాల్లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సదస్సు ఆదివారంతో ముగిసింది. నెల్లూరు మెనోపాజ్ సొసైటీ, ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజీ సొసైటీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లైవ్ ఎండోస్కోపీ వర్క్షాపును నిర్వహించారు. నగరంలోని ఓ ఆస్పత్రిలో సీ్త్రలకు సంబంధించిన అత్యంత క్లిష్టతరమైన ఆపరేషన్లను సదస్సుకు హాజరైన డాక్టర్లు స్క్రీన్ ద్వారా పరిశీలించి పలు అంశాలపై చర్చించారు. జాతీయ స్థాయి డాక్టర్లు పరీక్షిత్ టాంక్, ప్రతాప్, పళని అప్పన్, అర్చనాబేసర్, అంజూసోనీ, అనితాషా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు పల్లంరెడ్డి యశోదర మాట్లాడారు. సీ్త్రల ఆరోగ్య రక్షణ, ఆధునిక చికిత్సలను నాణ్యమైన విధంగా అందించేలా నెల్లూరులో జాతీయ స్థాయి సదస్సును నిర్వహించడాన్ని అభినందించారు. ఆర్గనైజింగ్ టీమ్ డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్లు ఉషా, అపూర్వ, మిథిలశ్రీ, సాయిదీప్తి తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ తరలింపును అడ్డుకునేదెవరు..?
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంతో పాటు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇసుకను రాత్రీ, పగలనే తేడా లేకుండా స్థానిక టీడీపీ నేతల ఆధ్వర్యంలో యథేచ్ఛగా తరలిస్తున్నారు. అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను జొన్నవాడ వద్ద ఎస్సై సంతోష్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం వేకువజామున పట్టుకొని పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. దామరమడుగులోని పెన్నా నుంచి టిప్పర్లు, ట్రాక్టర్ల సాయంతో నిత్యం భారీగా తరలిస్తున్నారు. మామూళ్లు అందుతుండటంతో అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ రూరల్ అధ్యక్షుడు జగదీష్ అనుచరుల ఆధ్వర్యంలో ఈ వ్యవహారం సాగుతోందని సమాచారం. ఇప్పటికై నా అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
లారీని అధిగమించే క్రమంలో..
మర్రిపాడు: లారీని అధిగమించే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని కారు ఢీకొనడంతో ఇద్దరు గాయపడిన ఘటన మర్రిపాడు సమీపంలోని నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాలు.. కర్ణాటకలోని బెళగావికి చెందిన స్క్రాప్ వ్యాపారులు ఉమర్ ఫరూఖ్, ముజహర్, ఇర్షాద్ నెల్లూరు బయల్దేరారు. మార్గమధ్యలోని కండ్రిక సమీపంలో లారీని కారు ఢీకొనడంతో ఫరూఖ్, ముజహర్ గాయపడ్డారు. హైవే అంబులెన్స్ సిబ్బంది సమయానికి రాలేదు. దీంతో చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆస్పత్రికి ఆటోలో తరలించారు. కాగా కారుకు సంబంధించిన వస్తువులు రోడ్డుపై పడిపోవడంతో రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. మర్రిపాడు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
లాడ్జిలో అగ్నిప్రమాదం
● నెల్లూరులో అర్ధరాత్రి ఘటన ● 15 మందిని రక్షించిన పోలీస్, ఫైర్ సిబ్బంది ● తప్పిన పెనుముప్పు నెల్లూరు(వీఆర్సీసెంటర్): అందరూ గాఢ నిద్రలో ఉండగా, లాడ్జిలో అగ్నిప్రమాదం శనివారం అర్ధరాత్రి సంభవించింది. ఈ హఠాత్పరిణామంతో గదుల్లో ఉన్న వారు ఆందోళనకు గురయ్యారు. దర్గామిట్ట పోలీసుల కథనం మేరకు.. కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలోని బ్లూ మూన్ లాడ్జి రెండో అంతస్తులో గల 102వ గదిలో ఏసీ షార్ట్ సర్క్యూటైంది. శనివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో జరిగిన ఘటనలో గదిలోని ఫర్నిచర్, పరుపులు, దిండ్లు దగ్ధమయ్యాయి. మంటలతో అదే అంతస్తులోని మిగిలిన గదుల్లోకి పొగ దట్టంగా వ్యాపించింది. ఇదే సమయంలో వివిధ గదుల్లో 15 మంది ఉన్నారు. సెన్సార్ సిస్టమ్ ఉండటంతో తలుపులు తెరుచుకోకపోవడంతో కిటికిల్లోంచి చేతులు ఊపుతూ పెద్దగా కేకలేశారు. గమనించిన కొందరు.. పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్ వెంటనే చేరుకొని, మంటలు ఆర్పి.. కిటికీ అద్దాలు, తలుపులను పగలగొట్టి 15 మందిని ఎమర్జెన్సీ ద్వారం మీదుగా తీసుకొచ్చారు. ఓ బాలుడ్ని అంబులెన్స్లో కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రెస్క్యూ ఆపరేషన్ను ఎస్పీ అజిత స్వయంగా పర్యవేక్షించారు. పొగను పీల్చడంతో ఆస్పత్రుల్లో పలువురు చికిత్స పొందుతున్నారు. కాగా లాడ్జిని విశ్రాంత ఏఎస్పీ పమిడి మధుసూదన్రావుకు చెందిందిగా గుర్తించారు. ఫైర్, రెస్కూ టీమ్ అధికారులు చంద్రశేఖర్, శ్రీనివాసులు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని..
ఆత్మకూరు: మలుపు తిరిగే క్రమంలో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వ్యక్తి గాయపడిన ఘటన పట్టణంలోని ఎమ్జీఆర్ మున్సిపల్ బస్టాండ్ వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. ఏఎస్పేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మలుపు తిరిగే సమయంలో గడ్డం నాగరాజును ఢీకొంది. టైరు కింద ఆయన కాలుపడటంతో నుజ్జునుజ్జయింది. వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై జిలానీ ఘటన స్థలాన్ని పరిశీలించారు. నాగరాజు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పేదల ఆరోగ్యానికి ఆపద
● రెండో రోజూ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ ● ఇబ్బందుల్లో రోగులు నెల్లూరు (టౌన్): పేదల ఆరోగ్యానికి ఆపద వచ్చి పడింది. ప్రభుత్వం ఏడాది కాలానికి పైగా ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ)లకు బకాయిలు విడుదల చేయకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు వైద్య సేవలు నిలిపివేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా శనివారం జిల్లాలోని అన్ని నెట్ వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు నిలిపివేశారు. ప్రతి ఆస్పత్రి వద్ద ఆరోగ్యశ్రీ కింద వేద్య సేవలు నిలిపివేశామని బ్యానర్లు ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి స్పెషాలిటీ ఆస్పత్రులకు వైద్యం చేయించుకునేందుకు వచ్చారు. రోగులు ఎంత బతిమాలాడినా ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించకపోవడంతో నిరాశ, నిస్పృహలతో వెనుతిరిగారు. జిల్లాలోని 35 నెట్వర్క్ ఆస్పత్రులు ఉండగా 30 ఆస్పత్రుల్లో వైద్యసేవలు నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అరవింద్ కిడ్నీ వైద్యశాల అధినేత డాక్టర్ ఎస్వీఎల్ నారాయణరావు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినా ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదని, కనీసం చర్చలకు పిలవకపోవడం దారుణమన్నారు. బకాయిలు విడుదల చేసేంత వరకు సేవలు కొనసాగించే ప్రసక్తే లేదన్నారు. -
ఆర్థరైటిస్పై నిర్లక్ష్యం వహిస్తే ముప్పే
నెల్లూరు (టౌన్): ఆర్థరైటిస్ సమస్యను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో శరీర వైకల్యాలొచ్చే ప్రమాదం ఉందని బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ సాంబశివరావు పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థరైటిస్ డేను పురస్కరించుకొని వాకథాన్ను అపోలో సూపర్స్పెషాల్టీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఆర్థరైటిస్కు అపోలోలో తక్కువ ఫీజుతో అందించే స్క్రీనింగ్ పరీక్షల బ్రోచర్లను వైద్యులతో కలిసి డైరెక్టర్ ఆ్ఫ్ మెడికల్ సర్వీసెస్ శ్రీరామ్ సతీష్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రూ.4590 విలువగల తొమ్మిది రకాల ఆర్థరైటిస్ స్క్రీనింగ్ పరీక్షలను రూ.1999కే అందించనున్నామని వివరించారు. రూ.8590 విలువగల మరో స్క్రీనింగ్ పరీక్షను రూ.3999కే చేయనున్నామని, ఈ అవకాశం డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఆర్థోపెడిక్ సీనియర్ సర్జన్లు వివేకానందరెడ్డి, శశిధర్రెడ్డి, విక్రమ్రెడ్డి, యూనిట్ హెడ్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
● ఎస్పీ అజిత నెల్లూరు (క్రైమ్): బాణసంచా అక్ర మ తయారీ, విక్రయదారులపై కఠి న చర్యలు తప్ప వని ఎస్పీ అజిత వేజెండ్ల ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలు, స్టోరేజ్ గోడౌన్స్, విక్రయ దుకాణాల్లో సరైన భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా అనే విషయాలపై క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అక్రమ నిల్వలపై ఇందుకూరుపేటలో రెండు కేసులు, విడవలూరులో ఒకటి, కందుకూరులో ఒక కేసు నమోదు చేశామన్నారు. లైసెన్సులు కలిగిన వారే బాణసంచా తయారీ, విక్రయాలు నిర్వహించాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాణసంచా అక్రమ విక్రయాలు, తయారీ, నిల్వలను గుర్తిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 11కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. -
పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలి
● హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్శ్రీనివాసరెడ్డి ● జిల్లాలోని న్యాయమూర్తులకు ఒక రోజు శిక్షణ నెల్లూరు (లీగల్): కోర్టుల్లో పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు న్యాయమూర్తులు చొరవ తీసుకోవాలని ఏపీ హైకోర్టు జడ్జి, జిల్లా న్యాయపాలన వ్యవహారాల జడ్జి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి సూచించారు. జిల్లా కోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి కోర్టు హల్లో జిల్లా స్థాయి న్యాయమూర్తులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ సీ ప్రవీణ్కుమార్, జి. సీతాపతి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ కోర్టుల్లో పెండింగ్ కేసులు, కేసుల సత్వర పరిష్కారానికి చర్యలపై న్యాయమూర్తులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. న్యాయమూర్తుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు గీత, సరస్వతి, తేజోవతి, శ్రీనివాసరావు, సోమశేఖర్, నికిత వోర, పలు కోర్టుల సీనియర్, జూనియర్ సివిల్ జడ్జిలు పాల్గొన్నారు. న్యాయమూర్తులకు ఘన స్వాగతం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులు సీ ప్రవీణ్కుమార్, జి సీతాపతిలకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్, కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వై.ఓ నందన్ ఘన స్వాగతం పలికారు. తొలుత జస్టిస్ శ్రీనివాసరెడ్డి కోర్టు ప్రాంగణంలో మొక్కలను నాటారు. ఆయన మాట్లాడుతూ పర్యవరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరు బాధ్యత అని గుర్తు చేశారు. కోర్టు ఆవరణ సుందరీకరణలో నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ వైఓ నందన్ చేస్తున్న కృషిని జస్టిస్ శ్రీనివాసరెడ్డి అభినందించి సన్మానించారు. -
బోల్తాపడిన ప్రైవేట్ బస్సు
కోవూరు: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తాపడిన ఘటన పట్టణంలోని ఆర్కే పెట్రోల్ బంక్ వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాలు.. ఒడిశాలోని భువనేశ్వర్ నుంచి బెంగళూరుకు 40 మంది ప్రయాణికులతో నవీన్ ట్రావెల్స్ బస్సు బయల్దేరింది. ఈ తరుణంలో నిద్రమత్తులోకి డ్రైవర్ జారుకోవడంతో వాహనం నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ హఠాత్పరిణామంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదంలో పది మంది స్వల్పంగా గాయపడగా, తిరుపతికి చెందిన చిన్నారి సమ్విక తీవ్రంగా గాయపడింది. చిన్నారిని నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారు స్థానిక ప్రైవేట్ ఆస్పత్రుల్లో ప్రాథమిక చికిత్స పొందారు. ఆపై గమ్యస్థానాలకు బయల్దేరారు. ప్రమాదం జరిగే సమయానికి బస్సు అతివేగంతో వస్తోందని సమాచారం. విషయం తెలుసుకున్న కోవూరు ఇన్స్పెక్టర్ సుధాకర్రెడ్డి, ఎస్సై రంగనాథ్గౌడ్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. వాహనాన్ని క్రేన్ సాయంతో రోడ్డుపైకి లాగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. భువనేశ్వర్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఘటన చిన్నారికి తీవ్రగాయాలు స్వల్ప గాయాలతో బయటపడిన ప్రయాణికులు -
అక్రమ నిర్మాణం తొలగింపు షురూ
నెల్లూరు (బృందావనం): నెల్లూ రు నగరపాలక సంస్థ పరిధిలో గుప్తాపార్కు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాన్ని తొలగించే చర్యలు షురూ అయ్యాయి. ఆ భవన యజమాని నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల నిర్మాణం చేశారంటూ స్థానికులు నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఫిర్యాదుదారుడు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో స్పందించిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బహుళ అంతస్తుల నిర్మా ణంపై చర్యలు తీసుకోవాలంటూ నగరపాలక సంస్థ కమిషనర్ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించలేదు. ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీన ‘సాక్షి’ పత్రికలో ‘కట్టుకో.. పైసలిచ్చుకో..! శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలకు ఉపక్రమించారు. దీంతో సదరు భవన యజమాని స్వయంగా తానే తొలగిస్తానని అధికారులకు విజ్ఞప్తి చేసి తన సొంత ఖర్చుతో కూలీలను పెట్టుకొని అక్రమ నిర్మాణాన్ని తొలగించే పనులు ప్రారంభించారు. ఇప్పటికే 50 శాతం పైగా నిర్మాణాన్ని తొలగించారు. -
శుభకార్యానికెళ్తూ.. అనంతలోకాలకు
మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు నుజ్జునుజ్జయిన కారు ఆత్మకూరు: కారు నడుపుతూ ఫోన్లో మాట్లాడే క్రమంలో ఏమరుపాటుగా వ్యవహరించడంతో డివైడర్ను వాహనం ఢీకొని తాత, మనవరాలు మృతి చెందిన ఘటన మండలంలోని కరటంపాడు సమీపంలో గల నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. ఎస్సై జిలానీ వివరాల మేరకు.. నెల్లూరులోని బీవీనగర్కు చెందిన జలసత్రం వేమయ్య (54), తమ సమీప బంధువుల శుభకార్యం నిమిత్తం బద్వేల్కు కుమార్తె మొగిలి మౌనిక, మనవరాలు సహస్ర (2), మనవడు యశ్వంత్తో కలిసి కారులో బయల్దేరారు. ఈ తరుణంలో ఆత్మకూరు మండలం కరటంపాడు సమీపంలోని గిరిజన కాలనీ వద్ద వేమయ్యకు ఫోన్ రావడంతో మాట్లాడే యత్నంలో ఎదురుగా ట్యాంకర్ వస్తుండటంతో దానికి దారిచ్చే క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్ను వేగంగా ఢీకొంది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న వేమయ్య అక్కడికక్కడే మృతి చెందారు. మౌనిక, చిన్నారి సహస్ర తీవ్రంగా, యశ్వంత్ స్వల్పంగా గాయపడ్డారు. సమీపంలోని గిరిజన కాలనీ వారు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108లో ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడికెళ్లిన పది నిమిషాలకే సహస్ర మృతి చెందింది. మౌనికకు చికిత్సను అందిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్లో మాట్లాడే క్రమంలో ఏమరుపాటు డివైడర్ను వేగంగా ఢీకొన్న కారు రోడ్డు ప్రమాదంలో తాత, మనవరాలి మృతి -
రోడ్డు ప్రమాదాలను అరికట్టాలి
● ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి మనుబోలు: రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదేశించారు. స్థానిక పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా శనివారం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. స్థానిక పరిస్థితులపై సిబ్బందిని ఆరాతీసిన అనంతరం ఆయన మాట్లాడారు. హైవేపై ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. ధాభాలు , ఇతర చోట్ల జాతీయ రహదారిని ఆనుకొని లారీలను ఆపకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. యూటర్న్లు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న క్రాస్రోడ్లను గుర్తించాలని సూచించారు. మండలంలోని 19 గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని ఎస్సై శివరాకేష్ తెలిపారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ శివరామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాజకీయంగా ఎదుర్కోలేకే తప్పుడు కేసులు
● దర్గామిట్ట పోలీస్స్టేషన్కు ప్రసన్న హాజరు కోవూరు: మాకు న్యాయ వ్యవస్థపై అపార నమ్మకం ఉందని, ప్రజా నాయకుడిగా తానెప్పుడూ చట్టాన్ని ధిక్కరించలేదని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. అయితే తనను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక నా ప్రత్యర్థులు పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని నాపై తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు. జూలై 31న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసన్నను పరామర్శించేందుకు వచ్చిన సందర్భంలో పోలీసులు ఆయనపై తప్పుడు కేసు బనాయించారు. ఈ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఆయన నెల్లూరులోని దర్గామిట్ట పోలీస్స్టేషన్కు హాజరయ్యారు. సీఐ రోశయ్య, ఎస్ఐ సుబ్బారావు సమక్షంలో సంతకం చేశారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ ఈ కేసులో తనకు హైకోర్టు నుంచి బెయిల్ మంజూరు కావడంతో కోర్టు షరతుల ప్రకారం పోలీస్స్టేషన్కు హాజరైనట్లు తెలిపారు. తనపై రాజకీయ ప్రేరేపిత కేసులు మోపారని, ఈ కేసుల నుంచి కోర్టు ద్వారానే న్యా యం జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. -
అసమర్థ, అబద్ధాల పాలకులు
నెల్లూరు (స్టోన్హౌస్పేట): ఈ రాష్ట్రంలో అసమర్థ, అబద్ధాల పాలకులు రాజ్యమేలుతున్నారని, మెడికల్ కళాశాలల విషయంలో ఇది ప్రస్ఫుటం అవుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి దుయ్యబట్టారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ పోస్టర్ను ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, అనుబంధ సంఘాల అధ్యక్షులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ర్డెడి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టామన్నారు. తొలిరోజు ఉదయగిరి నియోజకవర్గంలో లాంఛనంగా ప్రారంభించామన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా, చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నా రు. ప్రజల సొమ్మును ప్రభుత్వ ఆస్తులను కొల్ల గొట్టే విధంగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడన్నారు. జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి తీసుకుని వచ్చిన 17 మెడికల్ కాలేజీల్లో 10 మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నాడన్నారు. పేద విద్యార్థులు వైద్య విద్య దూరం కావడంతోపాటు, పేదల కోసం ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు కాబోవన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం మెడికల్ కళాశాలకు సంబంధించి అబద్ధాలు మాట్లాడడం దారుణమని, జగన్మోహన్రెడ్డి నర్సీపట్నం మెడికల్ కళాశాల వద్ద కూటమి నేతలు మాట్లాడే అబద్ధాలను ప్రజలకు తెలిసేలా చేశారన్నారు. కూటమి నేతలు చేస్తున్న తప్పులను ఒప్పుకోకుండా, జగన్మోహన్ రెడ్డిపై నిందలు వేస్తున్నారన్నారు. ఆయన తెచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను చంద్రబాబు ప్రైవేట్ సంస్థలకు అమ్ముకుంటూ, సొమ్ము చేసుకోవడం దుర్మార్గమన్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను ప్రైవేటు పరం చేయడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని, అక్టోబర్ 10 నుంచి నవంబర్ 22వ తేదీ వరకు 42 రోజుల పాటు అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుంచి సంతకాలు సేకరిస్తామన్నారు. అక్టోబర్ 28వ తేదీన నియోజకవర్గ స్థాయిలో, నవంబర్ 12వ తేదీన జిల్లా స్థాయిలో ర్యాలీ నిర్వహించి, ప్రజలలో అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజల నుంచి 60 వేల సంతకాల సేకరించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, నవంబర్ 26వ తేదీ సేకరించిన కోటి సంతకాలను జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో గవర్నర్కు వినతి పత్రంగా అందజేస్తామన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతాం కోటి సంతకాల ఉద్యమంతో కూటమిని కూకటి వేళ్లతో సహా పెకలిస్తాం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
కూటమి పాలనలో..
పేదల వైద్య సేవలపై కూటమి ప్రభుత్వ నిర్దయ కొనసాగుతోంది. 2014–19 మధ్య ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్లక్ష్యం చేసింది. అంతకు ముందుకు 3500పైగా ప్రొసీజర్స్ ఉంటే.. వాటిని సగానికి పైగా తగ్గించడంతోపాటు అత్యంత అవసరమైన ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీ నుంచి తొలగించింది. తాజాగా మరోసారి అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం పేద వైద్య సేవలను నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రభుత్వ వైద్య సేవలతోపాటు ఆరోగ్యశ్రీ విషయంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్సీ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో పేదలకు ఎటువంటి వైద్య సేవలు అందే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుత ప్రభుత్వ వైఖరి చూస్తుంటే.. కరోనా వచ్చినప్పుడు ఈ ప్రభుత్వమే ఉండి ఉంటే.. ఊర్లకు ఊర్లు శ్మశానాలు అయ్యేవంటూ గ్రామీణ ప్రజలు, పేదలు అప్పటి పరిస్థితులు తలుచుకుని ఒక్కసారిగా వణికిపోతున్నారు. -
సూపర్ సిక్స్ పథకాలు.. డూపర్ మోసాలు
వరికుంటపాడు: చంద్రబాబు చెప్పిన పథకాలు కొన్ని అరకొర మందికి అందితే.. మరి కొన్ని అమలే చేయకుండా.. సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అంటూ ప్రచారం చేసుకోవడానికి సిగ్గు లేదా? అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ కాకాణి గోవర్ధన్రెడ్డి దుయ్యబట్టారు. కూటమి సూపర్ సిక్స్ పథకాలు.. డూపర్ మోసాలపై ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి తెలియజేయాలని కోరారు. శుక్రవారం వరికుంటపాడు మండలం ఇరువురులో నిర్వహించిన వైఎస్సార్సీపీ ఆత్మీయ సభలో పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు నిన్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలను జూన్ 2024 నుంచి అమలు చేస్తానని మొదటి ఏడాది ఎగ్గొట్టారన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద చంద్రబాబు రైతులకు శఠగోపం పెట్టారన్నారు. ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం పథకంగా రూ.15 వేలు ఇస్తానని అరకొరగా నిధులు జమ చేశాడన్నారు. నిరుద్యోగ భతి, మహిళలకు ఆడబిడ్డ నిధి పథకాల ఊసేలేకుండా మంగళం పాడేశారన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా, రైతులను నష్టాల ఊబిలోకి నెట్టేశారన్నారు. చంద్రబాబు తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు ప్రశ్నించే వారిపై పోలీసులను ఉసిగొల్పి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం, జైలుకు పంపుతున్నారన్నారు. చంద్రబాబు కాపీ కొట్టడం తప్ప, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు సొంత ఆలోచన ఉండదని, జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలు, ఇతర రాష్ట్రాల్లో అమలు చేసిన పథకాలకు పేర్లు మార్చి, అంతా తన గొప్పేనంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చారని, దేశ చరిత్రలో రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో చంద్రబాబు రూ.కోట్ల విలువ చేసే భూములను ఎకరా వంద రూపాయలకు ప్రైవేట్ పరం చేస్తున్నాడని ఆరోపించారు. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టామన్నారు. కూటమి నేతలు కల్తీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారన్నారు. చంద్రబాబు అనుచరులే కల్తీ మద్యం తయారీలో ప్రధాన సూత్రధారులుగా నిలిచారని, వీరి అండదండలు లేకపోతే చంద్రబాబు సొంత జిల్లాలో కల్తీ మద్యాన్ని స్వేచ్ఛగా తయారు చేయడం సాధ్యమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్సీపీపై మీకున్న ప్రేమాభిమానాలు వెలకట్టలేనివని, కష్టకాలంలో పార్టీ జెండాను మోసిన ప్రతి ఒక్క కార్యకర్తను మా భుజాలపై మోసేందుకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమావేశంలో నెల్లూరు పార్లమెంటరీ పరిశీలకులు జంకె వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకులు ధనుంజయరెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ యువనాయకులు మేకపాటి అభినవ్రెడ్డి, జెడ్పీటీసీలు, గణపం బాలకృష్ణారెడ్డి, మేదరమెట్ల శివ లీల, చెరుకుపల్లి రమణారెడ్డి, మోడీ రామాంజనేయులు, అన్ని మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలను ప్రతి కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలి 17 నెలల పాలనలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
పొదల్లో విగతజీవిగా..
● వృద్ధుడిని ఢీకొట్టిన కారు ● డ్రైవర్ నిద్రమత్తే కారణం ● సాయంత్రం గుర్తించే సరికి ప్రాణాలు విడిచి..దుత్తలూరు: కారు ఢీకొట్టడంతో ఓ వృద్ధుడు పొదల్లో పడ్డాడు. ఆయన్ను ఎవరూ గుర్తించలేదు. సాయంత్రం చూసేసరికి చనిపోయి ఉన్నాడు. ఈ ఘటన శుక్రవారం దుత్తలూరు పంచాయతీ చింతలగుంట సమీపంలో 565వ జాతీయ రహదారిపై జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన దుగ్గినబోయిన పెదబాల నరసింహులు (70) రహదారి పక్కన నడిచి వెళ్తున్నాడు. వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ నుంచి పామూరు వైపు కారు వెళ్తుండగా డ్రైవర్ నిద్రమత్తులో నరసింహుల్ని ఢీకొట్టాడు. దీంతో కారు రోడ్డు మార్జిన్ దిగి పొదల్లోకి దూసుకెళ్లింది. స్థానికులు అక్కడికి చేరుకుని కారును ట్రాక్టర్తో బయటకు తీశారు. అయితే నరసింహులును కారు ఢీకొట్టిన విషయం ఎవరూ గమనించలేదు. సాయంత్రమైనా ఆయన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది గ్రామ పరిసర ప్రాంతాల్లో గాలించారు. అనుమానం వచ్చి కారు ప్రమాదం జరిగిన ప్రదేశంలో చూడగా చెప్పులు కనిపించాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో చూశారు. పొదల్లో నరిసింహులు విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే గ్రామస్తులు బయటకు తీయగా చనిపోయి ఉన్నాడు. గ్రామస్తులు సమాచారాన్ని పోలీసులకు అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
మంత్రివర్యా.. చూస్తున్నారా?
కాలువలో పేరుకుపోయిన వ్యర్థాలుఇలా ఉంటే రోగాలు రావా? కాలువ మొత్తం ఇదే దుస్థితినెల్లూరు సిటీ.. ఇది సాక్షాత్తు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇక్కడ పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. నెల్లూరును రాష్ట్రంలోనే రోల్మోడల్గా తీర్చిదిద్దుతానని నిత్యం మంత్రి చెబుతుంటారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు జనం రోగాల బారిన పడేలా ఉన్నాయి. సర్వేపల్లి, జాఫర్సాహెబ్ కాలువల్లో చెత్త పేరుకుపోయింది. ప్లాస్టిక్ వ్యర్థాలు అలాగే ఉన్నాయి. దుర్వాసనతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా దీని గురించి పట్టించుకునే వారు లేకుండా పోయారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
యూరియా అమ్మకాల నిలిపివేత
మనుబోలు: పిడూరుపాళెంలో శ్రీ వెంకటేశ్వర ఫర్టిలైజర్స్లో సరైన అనుమతి పత్రాలు లేకపోవడంతో రూ.75,400 విలువైన యూరియాను విక్రయించడానికి వీల్లేదంటూ (స్టాప్ సేల్) ఆదేశాలు జారీ చేశామని ఏడీఏ కె.కన్నయ్య తెలిపారు. మండలంలోని ఎల్ఎన్పురం, కాగితాలపూరు, మనుబోలు, పిడూరుపాళెం, బద్దెవోలు గ్రామాల్లోని విత్తన, ఎరువుల దుకాణాలను శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లు, బిల్ పుస్తకాలు, ఎరువుల నిల్వలను పరిశీలించారు. మన్నారు. ఆయన వెంట మనుబోలు మండల వ్యవసాయాధికారి వెంకటకృష్ణ, సిబ్బంది ఉన్నారు. -
ఐఎంఏ అధ్యక్షుడిగా మస్తాన్బాషా
నెల్లూరు(అర్బన్): ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ మస్తాన్బాషా, కార్యదర్శిగా నగరంలోని ఎండోక్రైనాలజిస్ట్ రామ్మోహన్రావును ఎన్నుకున్నారు. నెల్లూరు సరస్వతి నగర్లోని ఐఎంఏ హాల్లో గురువారం రాత్రి జరిగిన సభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కోశాధికారిగా డాక్టర్ హర్షవర్ధన్, నెల్లూరు మెడికల్ సొసైటీ చైర్మన్గా డాక్టర్ ఉమామహేశ్వరరెడ్డి, సెక్రటరీగా డాక్టర్ ప్రదీప్ను, కోశాధికారిగా డాక్టర్ వెంకటేశ్వర్లును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడు మస్తాన్బాషా మాట్లాడుతూ అందరి సహకారంతో డాక్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తనను ఎన్నుకున్నవారికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పూర్వ అధ్యక్షుడు డాక్టర్ అమరేంద్రనాథ్రెడ్డి, గౌరవ కార్యదర్శి డా.రాహుల్బాబు తదితరులు పాల్గొన్నారు.మస్తాన్బాషా రామ్మోహన్రావు -
ప్రయాణం.. నరకప్రాయం
● అల్లూరు రోడ్డుపై ఇదీ పరిస్థితి ● కొంతమేర వేసి వదిలేసిన వైనం కొడవలూరు: అల్లూరు రోడ్డు ప్రయాణికులకు నరకం చూపుతోంది. కొడవలూరు నుంచి అల్లూరు వెళ్లే రోడ్డుకు ఎంతో ప్రాధాన్యముంది. దీని మీదుగానే విడవలూరు, రామతీర్థం, అల్లూరుకు వెళ్లాల్సి ఉంది. మండల పరిధిలో 5 కి.మీ. మేర విస్తరించి ఉంది. ఇది పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారింది. ఇటీవల నిర్మాణం చేశారు. కానీ కొడవలూరు నుంచి గుండాలమ్మపాళెం వరకూ ఒక కిలోమీటర్ మేర వదిలేశారు. అక్కడి నుంచి పద్మనాభసత్రం వరకూ వేశారు. పద్మనాభసత్రం నుంచి తలమంచి రోడ్డు వరకూ వేయలేదు. ఇరువైపులా కిలోమీటర్ వంతున రోడ్డు వేయకపోవడం వల్ల పెద్దగా ప్రయాజనం కనిపించడం లేదు. ఈ రెండు కిలోమీటర్ల రహదారి బాగా దెబ్బతిని గుంతలమయమై ఉంది. ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో బస్సులు ఎక్కువ సంఖ్యలో తిరుగుతున్నాయి. రాకపోకలు సాగించే ప్రయాణికుల బాధలు వర్ణనాతీతం. రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారులు గుంతల్లో పడి ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్నారు. నెల క్రితం ఓ వ్యక్తి పడిపోయి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పైగా గుంతలమయంగా ఉన్న ఈ రోడ్డు మలుపులుగా ఉండటంతో మరింత ప్రమాదాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో రోడ్డు బాగు పడుతుందని అందరూ భావించారు. కానీ పూర్తిగా వేయకుండా ఇరువైపులా వదిలేయడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే స్పందించి రోడ్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు కుట్ర
● మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి కావలి(అల్లూరు): ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆయన నివాసంలో వైఎస్సార్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ కావలి నియోజకవర్గం నుంచి 60 వేల సంతకాల సేకరణే లక్ష్యంగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. నవంబర్ 25న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో గవర్నర్కు కోటి సంతకాలు అందజేస్తామన్నారు. ఈనెల 28న కావలి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రాన్ని అందజేయడం జరుగుతుందన్నారు. పేదల కోసం జగన్ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారన్నారు. ఎక్కడా లేని విధంగా వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. ఇది పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడమేనన్నారు. ప్రైవేటీకరణ ఆపకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు కేతిరెడ్డి శివకుమార్రెడ్డి, దండా కృష్ణారెడ్డి, వాయిల తిరపతి, కనమర్లపూడి నారాయణ, చెన్ను ప్రసాద్రెడ్డి, గుడ్లూరు మాల్రాద్రి, దామిశెట్టి సుధీర్ నాయుడు, కుందుర్తి కామయ్య, గంధం ప్రసన్నాంజనేయులు, వెంకటేశ్వర్ రెడ్డి, షాహుల్ హమీద్, కె.శ్రీనివాసులురెడ్డి, కె.శ్రీనివాసులు, అబ్దుల్లా, మునీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధిలో అక్రమాలకు కళ్లెం పడేనా?
● ఈకేవైసీ ప్రవేశపెట్టిన కేంద్రం ● యాప్లో వివరాల నమోదుఉదయగిరి: జాతీయ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో కూలీలు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. కూలీలు తమ జాబ్కార్డుతో ఆధార్కార్డును అనుసంధానం చేసుకుంటేనే పనికి వెళ్లే వెసులుబాటు ఉంటుంది. ఈకేవైసీ నమోదు ప్రక్రియ కోసం కేంద్రం ప్రత్యేక యాప్ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఈ ప్రక్రియ సాగుతోంది. కూలీలు ఉపాధి సిబ్బందిని సంప్రదించాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేయించుకోకపోతే పనిచేసే అర్హత కోల్పోతారని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉపాధి పనుల్లో పారదర్శకత కొరవడటం, అవినీతి ఆరోపణలు, నిధుల దు ర్వినియోగం తదితర అంశాలపై తరచూ ఆరోపణలు వెల్లువెత్తడం, సోషల్ ఆడిట్లో వెలుగు చూస్తుండటంతో కేంద్రం ఈ చర్యకు ఉపక్రమించింది. క్షేత్రస్థాయిలో జరిగే అవినీతికి చెక్ పెట్టేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని నిర్ణయించింది.పనులు చేస్తున్న కూలీలు ఈకేవైసీ చేస్తున్న సిబ్బంది -
28న కోవూరులో భారీ ప్రదర్శన
● నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కోవూరు: ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం చేస్తాం. ఈనెల 28వ తేదీన కోవూరులో భారీ ప్రదర్శన జరుగుతుంది’ అని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ కోవూరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం గురువారం నెల్లూరులోని ప్రసన్న నివాసంలో జరిగింది. దీనికి కోవూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల కన్వీనర్లు, సీనియర్ నాయకులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి పదవుల్లో ఉన్న వారు హాజరయ్యారు. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజా సమస్యలు, రాబోయే కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు చెప్పారు. పేదలు, మధ్య తరగతి కుటుంబాల కోసం విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి వైద్య విద్యను సామాన్యులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఆ కాలేజీలను ప్రైవేట్పరం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. పేదలకు వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదన్నారు. ప్రజలు, విద్యార్థులు, భవిష్యత్ తరాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం ముమ్మరం చేస్తామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక పేదలకు ఆనందం కరువైందన్నారు. ప్రజా సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని చెప్పారు. ప్రజలకు ఉపాధి, భద్రత లభించడం లేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం చెరిపేయాలని ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 28వ తేదీన కోవూరు మండలంలో చేపట్టే భారీ ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు. -
మినీ ట్రక్కు ఢీకొని..
● ఉద్యాన శాఖ విస్తరణాధికారిణి మృతి నెల్లూరు(క్రైమ్): జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉద్యాన విస్తరణాధికారిణి మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు నవాబుపేట కృష్ణానగర్లో డి.ప్రియాంక (34), బాలవిశ్వనాథ్ దంపతులు నివాసముంటున్నారు. ప్రియాంక కోవూరులో ఉద్యాన విస్తరణాధికారిణిగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం ఆమె వేదాయపాళెంలోని ఆ శాఖ జిల్లా కార్యాలయానికి స్కూటీపై బయలుదేరారు. సౌత్రాజుపాళెం జంక్షన్ వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి మినీ ట్రక్కు స్కూటీని వేగంగా ఢీకొంది. గాయాలపాలైన ఆమెను స్థానికులు సమీపంలోని మెడికవర్ హాస్పిటల్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ప్రియాంక మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు నార్త్ ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందింది. వారు హాస్పిటల్కు చేరుకుని మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. రెండు పెట్రోలు పంపుల సీజ్ పొదలకూరు: పట్టణంలోని సంగం రోడ్డు సెంటర్లో ఉన్న దామోదరం పెట్రోలు బంక్లో గురువారం లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి రెండు పంపులను సీజ్ చేశారు. ఈ సందర్భంగా మూడు జిల్లాల లీగల్ మెట్రాలజీ అధికారి ఐజాక్ మాట్లాడుతూ పెట్రోలు బంక్లో కొలతలు తేడా ఉన్నట్టు వెల్లడించారు. 5 లీటర్ల పెట్రోలు, డీజిల్ పట్టుకుంటే 100 ఎంఎల్ నుంచి 140 ఎంఎల్ తేడా చూపుతున్నట్టు పేర్కొన్నారు. తనిఖీల్లో జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి రియాజ్బాషా, ఏఎస్ఓ అంకయ్య, సివిల్ సప్లయ్స్ డీటీ ఐ.రవి పాల్గొన్నారు. నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు బ్రాయిలర్: రూ.118 లేయర్ రూ.122 బ్రాయిలర్ చికెన్: రూ.214 స్కిన్లెస్ చికెన్: రూ.236 లేయర్ చికెన్: రూ.207 -
సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు
నెల్లూరు(క్రైమ్): సీఎం చంద్రబాబు శుక్రవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్పీ అజిత 1,250 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ గురువారం నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో బందోబస్తు విధులకు హాజరైన పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహనాలను నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాల్లోనే నిలిపేలా చూడాలన్నారు. ప్రధాన కూడళ్లలో మూవబుల్ బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. వీవీఐపీ వెళ్లే మార్గంలో వ్యతిరేక దిశలో వాహనాల కదలికల్ని పూర్తిగా నిరోధించాలన్నారు. అనంతరం ఆమె సీఎం పర్యటించే ప్రాంతాల్లో ట్రయల్ కాన్వాయ్ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు పాల్గొన్నారు. రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణంనెల్లూరు(క్రైమ్): పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరు సౌత్ రైల్వే స్టేషన్ సమీపంలో చైన్నె వైపు వెళ్లే రైలు పట్టాలపై గురువారం చోటుచేసుకుంది. మృతుడి వయసు 55 నుంచి 60 ఏళ్ల లోపు ఉండొచ్చని భావిస్తున్నారు. గోధుమ రంగు ఫుల్ హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నారు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. వేట సాగక.. పూట గడవక.. తోటపల్లిగూడూరు: మండలంలోని తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులకు ఇబ్బందుల్లో ఉన్నారు. కోడూరు పంచాయతీలోని 8 మత్స్యకార గ్రామాలతోపాటు వెంకన్నపాళెం పట్టపుపాళెంలోని సుమారు 3 వేల మంది వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. కొంత కాలంగా వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో సముద్రంలోని మత్స్య సంపద దరికి చేరడం లేదు. దీంతో ఇప్పటి వరకు అంతంతమాత్రంగా సాగుతున్న వేట పూర్తిగా నిలిచిపోయే పరిసిత్థి ఏర్పడింది. తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. పోటు కారణంగా సముద్రం కాస్త ఉగ్రరూపంగా మారుతోంది. దీంతో వేటకు వెళ్లేందుకు మత్స్యకారులు భయపడుతున్నారు. ఒకవేళ ధైర్యం చేసి వెళ్లినా చేపలు లభ్యం కాక ఖాళీ పడవులతో తిరిగి రావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అనేకమంది తమ వేట సామగ్రి, పడవులను తీరంలో కట్టేసి ఇతర పనులను చూసుకుంటున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. -
చికిత్స అందిస్తే కోలుకుంటారు
సమాజంలో మానసిక సమస్యలున్న వారి సంఖ్య పెరగడం బాధాకరం. ఇలాంటి వారికి ప్రాథమిక లక్షణాలున్నప్పుడే గుర్తించి తగిన చికిత్స అందిస్తే కోలుకుంటారు. చికిత్సతోపాటు ఒత్తిడిని జయించేలా కౌన్సెలింగ్ ఇప్పించాలి. లేకుంటే చిన్న సమస్యలకే కోపం, ఆత్మన్యూనత, ఆత్మహత్య లాంటి ఆలోచనలు వస్తాయి. ఇలాంటి వారికి హిప్పో థెరపీ, బిహేవియర్ థెరపీ, సైకో థెరపీ చికిత్సలు అవసరం. ప్రస్తుతం ఇతర శారీరక అనారోగ్యాలకు చికిత్స అందిస్తున్నట్టుగానే మానసిక జబ్బులకు చికిత్స అందిస్తున్నాం. – డాక్టర్ లక్ష్మీప్రసూన, మానసిక వైద్య విభాగం హెచ్ఓడీ, సర్వజన ఆస్పత్రి, నెల్లూరు -
కండలేరులో 59.206 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 59.206 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 3,400 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. ఇక్కడి నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,200, పిన్నేరు కాలువకు 80, లోలెవల్ కాలువకు 40, హైలెవల్ కాలువకు 150, మొదటి బ్రాంచ్ కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.40 సన్నవి : రూ.25 పండ్లు : రూ.15 -
మానసిక ఆరోగ్యం.. అవగాహన కీలకం
నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం● నిర్లక్ష్యం చేస్తే మతిస్థిమితం కోల్పోవడం ఖాయం ● రోజూ వైద్యం కోసం వెళ్తున్న మూడు వేలమంది ● ఒత్తిడి, అవహేళనతో కుంగుబాటు ● ప్రాథమిక దశలో చికిత్సతో సాధారణ జీవితం జిల్లాలో రోజూ సుమారు 15 వేల మంది వరకు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలల్లో చికిత్స కోసం వస్తున్నారు. వీరిలో మూడు వేల మంది రోగులు మానసిక సమస్యలతో డాక్టర్ల వద్దకు వైద్యం కోసం వెళ్తున్నారు. గతంలో నెల్లూరులో కేవలం ఇద్దరు మానసిక వైద్య నిపుణులుండగా ఇప్పుడు పదిమంది వరకు చికిత్స అందిస్తున్నారు. అలాగే ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రత్యేకంగా పలువురు మానసిక వైద్య నిపుణులతో విభాగం ఉంది. నెల్లూరు(అర్బన్): మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధిస్తాడు. శారీరక ఆరోగ్యమే కాదు. మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమే. చదువు పేరుతో విద్యార్థుల్లో విపరీతమైన ఒత్తిడి పెంచడం, ఉద్యోగులను టార్గెట్ల పేరుతో వేధించడం, సీ్త్రలకు పిల్లలు సకాలంలో పుట్టకపోతే తక్కువ చేసి చూడటం, కొన్ని శారీరక అనారోగ్యాలు, సామాజికంగా తక్కువ చేసి చూడటం.. ఇవన్నీ మనిషి మెదడుపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఏమి చేయలేమనే ఆత్మన్యూనత భావంతో అనేకమంది మానసిక రోగులుగా మారుతున్నారు. వీరికి సకాలంలో కౌన్సెలింగ్ ఇచ్చి ప్రాథమిక దశలోనే వైద్య చికిత్స చేస్తే కోలుకుంటారు. లేకుంటే జీవితం నరకప్రాయంగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో మతిస్థిమితం కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 1992 నుంచి అక్టోబర్ 10వ తేదీని ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా నిర్వహిస్తోంది. మానసిక ఒత్తిడే ప్రధాన కారణం హడావుడి జీవితం, ఒత్తిడితో బతకడం నేటి సమాజంలో మామూలైంది. ఉమ్మడి కుటుంబాలు చిన్నాభిన్నమై, సమస్య వచ్చినప్పుడు సరిదిద్దే పెద్దలు లేకపోవడంతో చిన్న విషయాలకు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విద్యార్థి దశ నుంచే పోటీతత్వం పెరిగిపోయింది. ర్యాంక్ల పేరుతో ఇంట్లో తల్లిదండ్రులు, విద్యాలయాల్లో అధ్యాపకులు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఆటపాటలు, ఆనందాల్లేవు. చదువు.. చదువు అంటూ ప్రాణాలు తోడేస్తున్నారు. ఇటీవల వనంతోపు సెంటర్లో ఓ కళాశాలలో రెండు నెలల్లోనే ఇద్దరు విద్యార్థులు హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అలాగే ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ తొలి సంవత్సరం విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డారు. మరో ప్రైవేట్ మెడికల్ కళాశాలలోనూ ఇలాగే జరిగింది. సామాజికంగా చిన్నచూపు చూస్తూ ఇబ్బంది పెట్టిన ఘటనలో కొందరు మానసిక సమస్యలకు గురవుతున్నారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కౌన్సెలింగ్ తప్పనిసరి. స్వచ్ఛంద సంస్థల సభ్యులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, డాక్టర్లు యువతతోపాటు ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. జిల్లాలో ఇలా.. -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై పోరాటం ఆగదు
● సంక్షేమ పథకాల అమలు అస్తవ్యస్తం ● ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్రెడ్డి ముత్తుకూరు(పొదలకూరు): మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై పోరాటాన్ని తమ పార్టీ కొనసాగించనుందని, సంక్షేమ పథకాలు పేదలకు అందేంత వరకు ఉద్యమాలను చేస్తూనే ఉంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. ముత్తుకూరులోని పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో గురువారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాబు ష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ అంటూ ప్రచారం చేసిన టీడీపీ శ్రేణులు ఇప్పుడు ప్రజలకు ముఖం చూపలేకపోతున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాలను తొలి ఏడాది ఎగ్గొట్టి.. తర్వాతి ఏడాది అరకొరగా అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సర్వీసులను పెంచకుండా ఉచిత బస్సుల పేరిట ప్రజలకు నరకం చూపుతున్నారని చెప్పారు. నాటి సీఎం జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన 17 మెడికల్ కళాశాలల్లో పదింటిని విక్రయించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని మండిపడ్డారు. దీన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం నుంచి నవంబర్ 22 వరకు కోటి సంతకాలను సేకరించనున్నామని వెల్లడించారు. కల్తీ మద్యంపై సోమిరెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం కల్తీ మద్యం మూలాలు కూటమి ప్రభుత్వంలో బయటపడుతుంటే.. తమపై బురదజల్లేందుకు సోమిరెడ్డి యత్నించడం దారుణంగా ఉందని కాకాణి విమర్శించారు. ఆయనకు డబ్బులిస్తే దేనికై నా సై అంటారని, గతంలో తనపై మోపిన కల్తీ మద్యం కేసుపై సీబీఐ విచారణ వేయించేందుకు సిద్ధమానని ప్రశ్నించారు. అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబును ఇదే విషయమై అసెంబ్లీలో తాను కోరానని గుర్తుచేశారు. కల్తీ మద్యం బయటపడిన కేసులో కూటమి నేతలే ప్రధాన సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్కు అత్యంత సన్నిహితులే ప్రధాన పాత్రను పోషించారన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో కూటమి నేతలు కల్తీ మద్యాన్ని విక్రయిస్తున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిపై విచారణ జరిపిస్తామని తెలిపారు. కృష్ణపట్నంలో టెర్మినల్ను తెప్పిస్తానన్న సోమిరెడ్డి ఎంత దూరం తీసుకొచ్చారో ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు. పార్టీ మండల కన్వీనర్ మెట్టా విష్ణువర్ధన్రెడ్డి, నెల్లూరు శివప్రసాద్, ఎంపీపీ గండవరపు సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పారా లీగల్ వలంటీర్ల పాత్ర కీలకం
నెల్లూరు (లీగల్): పారా లీగల్ వలంటీర్ల పాత్ర కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ పేర్కొన్నారు, ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్లో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలు.. ప్రభుత్వ సంస్థలకు వారధిగా ఉంటూ బాధ్యతతో మెలగాలని పేర్కొన్నారు. న్యాయసేవ విధులు, పలు చట్టాలపై అవగాహన కల్పించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వాణి, లోక్అదాలత్ ప్యానల్ న్యాయవాదులు టంగుటూరి గోపాల్రెడ్డి, కోటేశ్వరరావు, లక్ష్మీప్రసాద్, కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
6.7 కిలోల గంజాయి స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): గంజాయిని చిన్న ప్యాకెట్లుగా చేసి గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు నగర పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలపై ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ అనిత తన సిబ్బందితో కలిసి దాడులను గురువారం చేపట్టారు. నారాయణ వైద్యకళాశాల సమీపంలో రామును అదుపులోకి తీసుకొని అతని నుంచి 700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాము సమాచారం మేరకు సమీప కాలనీలో ఉంటున్న దండుమారిని అదుపులోకి తీసుకొని ఇంట్లో సోదాలు చేశారు. ఆరు కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయానికి వీరిని తరలించి తమదైన శైలిలో విచారించారు. సూళ్లూరుపేటకు చెందిన ప్రసాద్ నుంచి గంజాయిని కొనుగోలు చేసి చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తున్నామని నిందితులు చెప్పారు. వీరితో పాటు స్వాధీనం చేసుకున్న గంజాయిని తదుపరి విచారణ నిమిత్తం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నెల్లూరు – 1 స్టేషన్లో అప్పగించారు. ఒడిశా నుంచి తీసుకొచ్చి జిల్లాలోని పలువురికి ప్రసాద్ విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు పూర్ణకుమార్, కాలేషావలీ, హెడ్ కానిస్టేబుళ్లు ప్రసాద్, రమేష్కుమార్, కానిస్టేబుళ్లు మునిరాజ్కుమార్, గిరిబాబు, రమణయ్య పాల్గొన్నారు. -
అటవీ ప్రాంతంలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు
సీతారామపురం: మండలంలోని పండ్రంగి బీట్ అటవీ ప్రాంతాన్ని గుంటూరు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం గురువారం తనిఖీ చేసింది. ఈ సందర్భంగా స్క్వాడ్ బృంద ఎఫ్ఆర్వో సుబ్బారావు మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై అటవీ శాఖ సిబ్బంది డేగకన్ను వేయాలని సూచించారు. అడవుల సంరక్షణపై అంకితభావంతో పనిచేయాలని కోరారు. అటవీ సంపదను ఎవరైనా అక్రమంగా నరికి తరలిస్తున్నారనే అంశాలపై క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. డీఆర్వో ప్రసాద్, ఎఫ్ఎస్వో అశోక్, ఎఫ్బీఓలు గౌతమ్, సాయి, ప్రసాద్, రమణ తదితరులు పాల్గొన్నారు. -
లైట్స్.. కెమెరా.. యాక్షన్
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఎత్తుగడ ● తన అనుయాయులకు కట్టబెట్టేందుకే స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ● మైపాడు రోడ్డును ఆక్రమించి దుకాణాల ఏర్పాటు ● నేడు ప్రారంభించాల్సి ఉన్నా, చివరి నిమిషంలో వాయిదాచిరు వ్యాపారుల పొట్టగొట్టి తన అనుయాయులకు లబ్ధి చేకూర్చేలా మంత్రి నారాయణ అడుగులేస్తున్నారు. అనుకున్నదే తడవుగా మైపాడు గేట్ సెంటర్లో స్మార్ట్ స్ట్రీట్ పేరుతో కంటైనర్లలో దుకాణాలను ఏర్పాటు చేశారు. స్ట్రీట్ వెండింగ్ పేరుతో మున్సిపల్ నిధులతో అన్ని సౌకర్యాలను కల్పించి షాపులను అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. దీనికి గానూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నెల్లూరు నగరాన్ని తొలి దశలో ఎంచుకున్నారు. ప్లగ్ అండ్ ప్లే విధానంలో వీటిని వ్యాపారులకు అప్పగిస్తామని చెప్తున్నా, టీడీపీ వారికే ఇచ్చేలా చర్యలు చేపడుతున్నారు. ఆయన కలలను సీఎం చంద్రబాబు సాకారం చేస్తూ.. దీన్ని శుక్రవారం ప్రారంభించాల్సి ఉన్నా, వాయిదా పడింది. సాక్షి ప్రతినిఽధి,నెల్లూరు: నగరాభివృద్ధిని విస్మరిస్తూ.. చిరు వ్యాపారుల పొట్టగొట్టి.. తమ్ముళ్ల జేబులు నింపుతూ.. కొత్త పథకాలతో తమ వారికి ఉపాధి కల్పించడంలో మంత్రి నారాయణ నూతన పోకడలను అవలంబిస్తున్నారు. దీనికి చక్కటి ఉదాహరణగా మైపాడు గేట్ సెంటర్లోని స్మార్ట్ స్ట్రీట్ నిలుస్తోంది. ఇంటికి అవసరమైన వస్తువులు ఒకే చోట లభించేలా.. వినియోగదారుల సౌలభ్యం కోసమంటూ దీన్ని తెరపైకి తెచ్చారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఈ వ్యాపార సముదాయాలను మున్సి పల్ శాఖ ఆధ్వర్యంలో అప్పగించే యత్నాలను ప్రారంభించారు. చిరు వ్యాపారులను చిదిమేస్తూ.. వాస్తవానికి నగరాల్లో వీధి వ్యాపారులు ఫుట్పాత్లపైనే బిజినెస్ను సాగిస్తుంటారు. అయితే వీరి పొట్టగొట్టేందుకు స్కెచ్ వేశారు. స్ట్రీట్ వెండింగ్ పేరుతో మున్సిపల్ నిధులతో అన్ని సౌకర్యాలను కల్పించి షాపులను అప్పగించేందుకు రంగం సిద్ధం చేశారు. ప్లగ్ అండ్ ప్లే విధానంలో వీటిని వ్యాపారులకు అప్పగిస్తామని చెప్తున్నా, అందుకు భిన్నంగా జరుగుతోంది. తమ్ముళ్ల కళ్లలో ఆనందం కోసం.. గత ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నారాయణ గెలుపొందారు. ఆ సమయంలో ఓ టీమ్ను ఏర్పాటు చేసి మూడు నెలల పాటు జీతాలిచ్చారు. డివిజన్ల వారీగా వారితో ఎన్నికల పనులు చేయించుకున్నారు. అధికారంలోకి వస్తే తప్పకుండా జీవనోపాధి కల్పిస్తామంటూ వారికి హామీనీ ఇచ్చారని టాక్. ఇంకేముంది పురపాలక మంత్రిగా బాధ్యతలను స్వీకరించాక స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ను తెరపైకి తెచ్చారు. నెల్లూరులోనే అయితే చెడ్డ పేరొస్తుందని భావించి.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాల్టీల్లో అమలు చేసేందుకు యత్నించారు. టీడీపీ నేతలిచ్చిన జాబితా మేరకే దుకాణాలను కేటాయించేలా అధికారులను ఆదేశించారు. ఫుట్పాత్లపై వ్యాపారాలు చేసేవారు ఖాళీ చేయాలంటూ కమిషనర్ ద్వారా హెచ్చరికలూ జారీ చేయించారు. బతుకుదెరువెలా..? ప్రధాన నగరాల్లో స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ఏర్పాటైతే వేలాది మంది చిరు వ్యాపారులు రోడ్డునపడే అవకాశం ఉంది. ఒక్క నెల్లూరులోనే ఫుట్పాత్లపై నాలుగు వేల మంది బిజినెస్ చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ తరుణంలో తమ పరిస్థితి ఏమిటాననే ఆందోళన వీరిలో వ్యక్తమవుతోంది. నాడు విస్తరిస్తే.. నేడు ఆక్రమిస్తున్నారు..! వాస్తవానికి నగరంలోని పాత చెక్పోస్ట్ నుంచి వేణుగోపాల్నగర్ (చేపల మార్కెట్) వరకు మైపాడు రోడ్డును దాదాపు 2.7 కిలోమీటర్ల మేర రూ.20 కోట్లను వెచ్చించి.. 60 అడుగుల వరకు నాలుగు వరుసల రహదారిగా గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో విస్తరించారు. ఈ దారిలో నిత్యం దాదాపు 15 వేల వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. సిమెంట్ రోడ్లు, డివైడర్లలో పచ్చదనం, సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేసి సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. రహదారికి ఇరువైపులా వాకింగ్ ట్రాక్, పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలనూ సిద్ధం చేశారు. ఈ తరుణంలో ఎన్నికలు రావడంతో వీటికి బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం రహదారికి ఇరువైపులా స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ పేరుతో 30 కంటైనర్లను పెట్టించి 120 మంది తెలుగు మహిళలకు మంత్రి నారాయణ అప్పగించారు. సమర్పయామీ.. నెల్లూరులో స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ తెలుగు మహిళలకు లాభసాటిగా మారింది. ఒక్కో దుకాణానికి రూ.నాలుగు లక్షలను కేటాయించనున్నామని మంత్రి తెలిపారు. ఇందులో మెప్మా, కార్పొరేషన్ నుంచి రూ.రెండు లక్షలు.. మరో రూ.రెండు లక్షల రుణ సదుపాయాన్ని కల్పించనున్నారు. మొత్తమ్మీద ఎన్నికల్లో పనిచేసిన వారికి రూ.8.4 కోట్లను వెచ్చించారు. ఎన్జీటీ నిబంధనలు బేఖాతర్ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ఏర్పాటుకు కొన్ని నిబంధనలను అమలు చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించినా.. మంత్రి, నగరపాలక సంస్థ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ అంశంపై ఎన్జీటీ దృష్టికి ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తీసుకెళ్లడంతో నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. పేరుకుపోయే చెత్త పక్కనే ఉన్న కాలువలో చేరి నీరు కలుషితమవుతుందని.. కాలువ పొరంబోకు స్థలాలు ఆక్రమణకు గురవుతాయనే వాదనతో ఏకీభవించింది. దీంతో పనులను తాత్కాలికంగా నిలిపేసి, నిబంధనలు పాటించాకే ప్రారంభించాలని పేర్కొంది. భూగర్భ డ్రైనేజీని పూర్తి చేసి కాలువకు కంచె వేస్తే, ఆ తర్వాతే షాపుల ఏర్పాటుకు అనుమతిస్తామని తెలిపింది. మరోవైపు ఈ పనులు పూర్తి కావాలంటే మరో పదేళ్లు పట్టే అవకాశం ఉంది. దీంతో ఎన్జీటీ మార్గదర్శకాలను పాటించకుండానే స్ట్రీట్ వెండింగ్ను హడావుడిగా ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపడుతుండటం గమనార్హం. బాబొస్తున్నారు.. సుందరంగా మార్చండి మంత్రి నారాయణ ఆదేశాలు పర్యటనలో హడావుడిగా నెల్లూరును చేర్చినా.. చివరి నిమిషంలో రద్దు నెల్లూరు సిటీ: బాబొస్తున్నారు.. దుకాణ యజమానులు సిద్ధంగా ఉండండి.. సరుకులను సిద్ధం చేయండి.. స్మార్ట్ స్ట్రీట్ను శుభ్రం చేసి సుందరంగా మార్చండంటూ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి వెంకటాచలం మండలంలో పర్యటనకు సీఎం చంద్రబాబు శుక్రవారం రానున్నారు. ఇందులో భాగంగా తొలుత ఖరారు చేసిన రూట్మ్యాప్లో మైపాడు గేట్ సెంటర్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ ప్రారంభోత్సవమే లేదు. అయితే బుధవారం సా యంత్రానికి దీన్ని మంత్రి ఖరారు చేశారు. మరో వైపు దుకాణ నిర్వాహకులు, ఆ ప్రాంతం ప్రారంభానికి సిద్ధంగా లేదు. ఈ తరుణంలో మంత్రి హడావుడిగా నెల్లూరు చేరుకొని ఆదేశాలు జారీ చేశారు. అయితే చివరి నిమిషంలో పర్యటన రద్దవడంతో ఈ ప్రయాస వృథా అయింది. హడావుడిగా శుభ్రం మైపాడు గేట్ సెంటర్లోని స్మార్ట్ స్ట్రీట్ దుకాణాల వెనుక వైపు కాలువ మురికి కూపంలా మారింది. మురుగు నిలిచిపోయి తీవ్ర దుర్గంధం వచ్చేది. అయితే హడావుడిగా శుభ్రపర్చే యత్నాలను అధికారులు ప్రారంభించారు. అయినా అదే పరిస్థితి నెలకొంది. ఆయా దుకాణాల్లో ఫుడ్ కోర్టులున్న తరుణంలో తామక్కడ ఆహారాన్ని ఎలా తీసుకోగలమని పలువురు ప్రశ్నిస్తున్నారు. అప్పటికప్పుడు చెట్లు ప్రత్యక్షం మైపాడు గేట్ సెంటర్లోని డివైడర్ల మధ్యలో అప్ప టికప్పుడు చెట్లు గురువారం మొలిచాయి. ట్రాక్టర్లలో తీసుకొచ్చి నాటడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. నిన్నామొన్నటి వరకు దుమ్ము, ధూళిలో ఉన్న ప్రాంతం ఒక్కసారిగా సుందరవనంగా మారిపోయింది. ఈ శ్రద్ధ రోజూ ఉంటే ఎంతో బాగుండేదనే అభిప్రాయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. అక్కడ నో.. ఇక్కడ మాత్రం సై..! నగరంలో హత్యలు, చోరీలు నానాటికీ ఎక్కువవుతున్నాయి. వీటిని కట్టడి చేసేందుకు.. నిందితులను త్వరితగతిన పట్టుకునే అంశంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఎన్నో చోట్ల ఇవి పనిచేయకపోయినా, వాటిని బాగుచేసే దిశగా చొరవ చూపని పాలకులు.. స్మార్ట్ స్ట్రీట్లో మాత్రం అన్ని దుకాణాలకు ఏర్పాటు చేయడం గమనార్హం. -
ఏయ్.. మీ అంతు చూస్తా
● మా హాస్పిటల్ ముందే చెత్త ట్రాక్టర్లను ఆపుతారా..? ● పారిశుధ్య కార్మికులను దుర్భాషలాడిన టీడీపీ నేత కుమారుడు బుచ్చిరెడ్డిపాళెం రూరల్: అధికారముందనే ధీమాతో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా బుచ్చిరెడ్డిపాళెంలోని మున్సిపల్ కార్మికులపై టీడీపీ పట్టణాధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు కుమారుడు శంతన్ హర్ష బూతులతో చెలరేగిపోయారు. మున్సిపల్ కార్మికులు, స్థానికుల వివరాల మేరకు.. పట్టణ పరిధిలోని బస్టాండ్ కూడలి సమీపంలో గల పాత పెట్రోల్ బంక్ పక్కన శ్రీనివాసులు కుమారుడికి ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. ఈ క్రమంలో దాని ఎదురుగా ట్రాక్టర్లను నిలిపి అందులో చెత్తను కార్మి కులు వేయసాగారు. ఈ తరుణంలో అక్కడికి చేరుకున్న శంతన్ హర్ష తమ హాస్పిటల్ ముందు ఎందుకు నిలిపారని ప్రశ్నించారు. పని అయిపోగానే వెళ్లిపోతామని కార్మికులు చెప్పినా వినకుండా.. ట్రాక్టర్లను నిలిపేందుకు ఎంత ధైర్యమంటూ బూతులతో రెచ్చిపోయారు. ట్రాక్టర్లకు గాలి తీసేసి.. దిక్కున్న చోట చెప్పుకోండంటూ జులుం ప్రదర్శించారు. నిరసన చెత్త ట్రాక్టర్లను హాస్పిటల్ ఎదుటే నిలిపి నిరసనను కార్మికులు వ్యక్తం చేశారు. తమను దూషించిన వ్యక్తిపై చర్యలు చేపట్టాలంటూ నినాదాలు చేశారు. మున్సిపాల్టీలోని ఇతర విభాగాల నేతలు సంఘీభావం తెలిపారు. విషయం తెలుసుకున్న కమిషనర్ బాలకృష్ణ, మున్సిపల్ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని కార్మికులు.. టీడీపీ నేత కుమారుడితో మాట్లాడటంతో గొడవ సద్దుమణిగింది. విధులకు ఆటంకం కలిగించడం సరికాదు మున్సిపల్ కార్మికులను దూషించడం, ట్రాక్టర్లకు గాలితీసి విధులకు భంగం కలిగించడం చట్టరీత్యా నేరం. తప్పును శంతన్ అంగీకరించడంతో విధుల్లో కార్మికులు చేరారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు చేపడతాం. – బాలకృష్ణ, కమిషనర్ -
దళితులపై పెరుగుతున్న దాడులు
నెల్లూరు రూరల్: రాష్ట్రంలో దళితులపై దాడులు ఎక్కువవుతున్నాయని మాజీ ఎంపీ చింతా మోహన్ ఆరోపించారు. నగరంలోని ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. ఇటీవలి కాలంలో సామాజిక న్యాయమంటూ సీఎం చంద్రబాబు తరచూ చెప్తున్నారని, ఇది దళితులను రెండు వర్గాలుగా చీల్చడమానని ప్రశ్నించారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా అతి తక్కువ సేకరించి మిల్లర్లకు ప్రభుత్వం మేలు చేసిందని విమర్శించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి యత్నించిన ఘటన ప్రజాస్వామ్యానికే మాయని మచ్చని చెప్పారు. -
చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పాలి
వెంకటాచలం: విద్యాలయాలు చదువుతో పాటు సంస్కారం పెంచే కేంద్రాలుగా పనిచేయాలని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు కాంక్షించారు. మాట మంచి కార్యక్రమం ద్వారా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్లో అక్షర విద్యాలయ విద్యార్థులతో బుధవారం సమావేశమైన ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఉదయాన్నే నిద్ర లేవడం, యోగా, నడక వంటి వ్యాయామాలకు అలవాటు పడాలని సూచించా రు. క్రమశిక్షణతో కూడిన చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎస్ఈఐఎల్ ఎనర్జీకి గోల్డెన్ పీకాక్ అవార్డు ముత్తుకూరు (పొదలకూ రు) : దేశంలో అతిపెద్ద స్వతంత్ర విద్యుత్ ఉత్పాదకత సంస్థల్లో ఒకటైన ఎస్ఈఐఎల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్కు 2025 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమై న గోల్డెన్ పీకాక్ అవార్డు లభించింది. ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విజేతగా నిలిచినట్లు సీఈఓ జనమేజయ మహాపాత్ర వెల్లడించారు. ఈ అవార్డు కార్పొరేట్ సంస్థల అత్యుత్తమ పాత్రను వెల్లడిస్తుందన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం, బాధ్యతాయుతమైన వ్యాపార పద్ధతులతోనే అవార్డు లభించిందన్నారు. వాటాదారులతో పాటు దేశ వృద్ధి రేటును సూచిస్తోందని పేర్కొన్నారు. ఈ అవార్డును లండన్లో వచ్చే నెల్లో అందజేయనున్నారని వెల్లడించారు. -
ఇరిగేషన్ కతలు ఇంతింత కాదయా..!
● అంతా ఇష్టారాజ్యం ● ఏ పనైనా.. కాసులిస్తేనే ● యథేచ్ఛగా దందాలునెల్లూరు(స్టోన్హౌస్పేట): ఇరిగేషన్ శాఖలో అవినీతి పరవళ్లు తొక్కుతోంది. కాసులిస్తేనే ఏ పనైనా జరుగుతుంది. ఉద్యోగోన్నతులు రావాలంటే మంత్రులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు సిఫార్సులు చేయాల్సిందే. అలా జరిగినా సీనియర్ అసిస్టెంట్ నుంచి మేనేజర్ వరకు నగదును ముట్టజెప్పాల్సిందే. ఒకవేళ అలా కాని పక్షంలో వ్యవహారం ఎక్కడికక్కడ ఆగిపోతుంది. ఉద్యోగోన్నతులకు ఇంతా..? ఇరిగేషన్ శాఖలో ఉద్యోగోన్నతులకు నిబంధనలను నిర్దేశించారు. అయితే అటెండర్ (ఆఫీస్ సబార్డినేట్) నుంచి జూనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ కావాలంటే రూ.10 వేలు నుంచి రూ.15 వేలు.. జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్కు రూ.15 వేల నుంచి రూ.20 వేలు.. ఆపై వీరు మంచి ప్రాంతానికి వెళ్లాలంటే రూ.20 వేల నుంచి రూ.30 వేలను ముట్టజెప్పాల్సిందే. కారుణ్య నియామకాలకు సైతం నగదును సమర్పించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. చీపుర్లకు రూ.వేలల్లో బిల్లులు చీపుర్లు, నీళ్లకు నెలకు రూ.20 వేల బిల్లులను కార్యాలయంలోని ఒక సూపరింటెండెంట్ పెడుతున్నారని సమాచారం. హెచ్డీలు ఏళ్ల తరబడి ఒకే స్థానంలో పాతుకుపోయారు. అసోసియేషన్ నేతలుగా ప్రకటించుకుంటూ వారి స్థానాలు మారకుండా చూసుకుంటున్నారు. అనుమతుల కోసం ప్రతిపాదనలను పంపేందుకు గానూ పనిని బట్టి వారికి పర్సంటేజీలను సమర్పించాలి. సంబంధిత ఏఈఈ, డీఈఈల ద్వారా వీరికి సదరు కాంట్రాక్టర్ అందించాల్సి వస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరైనా నిరాకరిస్తే ప్రతిపాదనలు టేబుళ్లకే పరిమితమైపోతున్నాయి. ఇరిగేషన్ ప్రధాన కార్యాలయం, సెంట్రల్.. ఆత్మకూరు డివిజన్లు, ఆరు సబ్ డివిజన్లుండగా, ప్రతి చోట ఈ వ్యాపారం ఒకే రకంగా జరగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రశ్నించేవారేరీ..? రహస్య టెండర్ల ప్రతిపాదనలను కాంట్రాక్టర్లకు అందించడం.. కుమ్మకై ్క వారందించిన డబ్బుతో అర్హత లేని వారికి టెండర్లను ఆమోదించడంలో ఓ మేనేజర్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇరిగేషన్ శాఖలో ప్రశ్నించే వారే లేకపోవడంతో ఆయన చెప్పిందే వేదమని కాంట్రాక్టర్లు, ఉద్యోగులు పేర్కొంటున్నారు. డైవర్షన్లలోనూ ఇదే తీరు.. ఈ శాఖలో డిప్యుటేషన్లపై పనిచేయడాన్ని డైవర్షన్ అంటారు. తాము పనిచేస్తున్న ప్రాంతం నుంచి డైవర్షన్ పొందేందుకు సుమారు రూ.మూడు వేల నుంచి రూ.ఐదు వేల వరకు చెల్లించాల్సి ఉంటోంది. డీఈఈ స్థాయి వారూ ఈ పనిచేయాల్సి వస్తోంది. లేఅవుట్లు, కల్వర్టులు, బ్రిడ్జిల అనుమతులకు సంబంధిత వ్యక్తుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తూ సంపాదనను పెంచుకోవచ్చనే ఉద్దేశంతో ఈ శాఖలో అధిక శాతం మంది డైవర్షన్లోనే ఉంటున్నారు. మరికొంత మంది మరో అడుగు ముందుకేసి సదరు లేఅవుట్కు సంబంధించిన వ్యక్తులు బ్రిడ్జిలను నిర్మిస్తే వాటిని ఎం బుక్లో నమోదు చేసి ఇరిగేషన్ శాఖే సొంతంగా కట్టించినట్లూ చూపుతున్నారు. మరోవైపు సాధారణ సమయానికీ ఆఫీసులకు రారు. ఒక ఎన్టీపీఏ వేరే జిల్లా నుంచి మధ్యాహ్నం 12 గంటలకు సైతం వస్తారు. వీరిపై ఎలాంటి చర్యల్లేకపోవడంతో ఇష్టారాజ్యంగా తమ పనులను జరుపుకొంటున్నారు. జిల్లా ఇరిగేషన్ శాఖలో వ్యవహారం అంతా ఇష్టారాజ్యంగా సాగుతోంది. ఏ పని జరగాలన్నా వారు చెప్పినంత క్యాష్ కొట్టాల్సిందే. కాలువల్లో నీరు పారుతుందో లేదో తెలియదు గానీ డబ్బులిస్తే మాత్రం ఆఫీస్లో అటెండర్ల మొదలుకొని డీఈల వరకు పనులు ఇట్టే జరిగిపోతాయి. ఉద్యోగోన్నతులు, అంచనాలు, ప్లాన్ ప్రతిపాదనలు, ఎల్ఓసీలు, ఉద్యోగుల డిప్యుటేషన్లు ఇలా ఏది కావాలన్నా.. సీనియర్ అసిస్టెంట్లు, సూపరిండెంటెంట్లు, ఎన్టీపీఏలు, హెచ్డీలు, మేనేజర్లకు మొత్తాన్ని కక్కాల్సిందే. ఆ శాఖలో పనులకు నిధులు రాకపోవడంతో ఉద్యోగుల మధ్య ఈ దందా పెరిగిపోతోంది. చర్యలు చేపడతాం ఈ వ్యవహారాలపై ఎలాంటి ఫిర్యాదు అందలేదు. సంబంధిత విభాగాల్లో విచారణ జరిపిస్తాం. బాధితులెవరైనా ఉంటే నేరుగా కలవొచ్చు. విచారణ జరిపి నిబంధనలను అనుసరించి ఆయా ఉద్యోగులపై చర్యలు చేపడతాం. – దేశ్నాయక్, సూపరింటెండెంట్ ఇంజినీర్, ఇరిగేషన్ శాఖ -
బ్రహ్మోస్ క్షిపణితో పాక్పై విజయం
● సాంకేతిక పురోగాభివృద్ధి అంశాలపై అవగాహన సదస్సు ● డీఆర్డీఓ మాజీ చైర్మన్, ఏపీ ప్రభుత్వ గౌరవ సలహాదారుడు డాక్టర్ జి.సతీష్రెడ్డి నెల్లూరు (బారకాసు): బ్రహ్మోస్ క్షిపణిని రష్యాతో కలిసి తయారు చేశామని, బ్రహ్మోస్లో సొంతంగా రూపొందించిన సాఫ్ట్వేర్ ఉందని, బ్రహ్మోస్ క్షిపణితో పాక్పై విజయం సాధించామని డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్రెడ్డి తెలియజేశారు. భారతదేశంలో క్షిపణులకు అబ్దుల్ కలాం ఆధ్యుడని, ఈ నెల అక్టోబర్ 15న ఆయన జయంతి వేడుకలను అన్ని పాఠశాలలో ఘనంగా నిర్వహించాలని సతీష్రెడ్డి ఆకాంక్షించారు. స్థానిక కస్తూర్బా కళాక్షేత్రంలో బుధవారం నగర పాలక సంస్థ పరిధిలోని 23 మున్సిపల్ పాఠశాలల పదో తరగతి విద్యార్థుల శాస్త్ర సాంకేతిక పురోగాభివృద్ధి అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సతీష్రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రామేశ్వరంలోని చిన్న గ్రామంలో ప్రభుత్వ పాఠశాల చదివారని, విద్యతోనే గొప్ప శాస్త్రవేత్తగా, భారత రాష్ట్రపతి అయ్యారని తెలిపారు. తాను కూడా గవర్నమెంట్ స్కూల్ మహిమలూరు పాఠశాల, వీఆర్ కాలేజీలో చదివానని, అబ్దుల్ కలాం వేసిన బీజం వల్ల ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిందని విద్యార్థులకు వివరించారు. స్వదేశీ ఆలోచనలతో రూపొందించిన ఆత్మ నిర్భర్ భారత్ ఆయుధాలతో భారత్ వివిధ యుద్ధాలలో గొప్ప విజయం సాధించిందని తెలియజేశారు. ప్రతి విద్యార్థి రాత్రింబవళ్లు కష్టపడి చదవాలని, స్కూల్కు, జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ వైఓ నందన్, డీఈఓ బాలాజీరావు, డిప్యూటీ డైరెక్టర్ మాధురి, డిప్యూటీ డీఈఓ నాయక్, నెల్లూరు అర్బన్ ఎంఈఓలు తిరపాల్, హమీద్, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. -
మద్యాంధ్రప్రదేశ్గా మార్చారు
● నకిలీ మద్యంతో రూ.వేల కోట్లు దోచేశారు ● ప్రభుత్వ పెద్దల అండతోనే మద్యం తయారీ కేంద్రాల ఏర్పాటు ● వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ● ఎకై ్సజ్ డీసీ కార్యాలయం ఎదుట మహిళలతో కలిసి నిరసన నెల్లూరు (క్రైమ్): రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా చేస్తానన్న చంద్రబాబు మద్యాంధ్రప్రదేశ్గా మార్చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత విమర్శించారు. బుధవారం బీవీనగర్లోని ఎకై ్సజ్ డీసీ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. రాష్ట్రంలో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ ఘటనలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి సూత్ర, పాత్రధారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ శంకరయ్యకు వినతిపత్రం అందజేశారు. కాకాణి పూజిత మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. 24 గంటలు మద్యం దొరుకుతుండడంతో నేరాలు పెరిగాయని, ప్రధానంగా మహిళలు తీవ్ర వేధింపులకు గురవుతున్నారన్నారు. కల్తీ మద్యం ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోందన్నారు. వైఎస్ జగన్మోన్రెడ్డి ప్రభుత్వం పారదర్శక విధానంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం షాపులు నిర్వహించిందని, జగనన్న ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని అందించిందనీ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసి బెల్టు షాపులు, నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పడకుండా పటిష్ట చర్యలు చేపట్టింద న్నారు. ఇంత పారదర్శకంగా జరిగినా మద్యం విధా నంలో స్కామ్ జరిగిందంటూ చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారానికి తెరలేపిందన్నారు. లేని మద్యం స్కామ్ను సృష్టించిన చంద్రబాబు నేడు రాష్ట్రంలో నకిలీ మద్యం స్కామ్కు తెర తీశారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల అండలేకపోతే.. ఈ స్థాయిలో నకిలీ మద్యం తయారు చేసి యథేచ్ఛగా విక్రయాలు చేసేవా రా? అని ప్రశ్నించారు. నకిలీ మద్యం తయారీ వెనుక ఎకై ్సజ్ అధికారుల పాత్రపై విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. కూటమి పాలనలో ప్రతి నాలుగు బాటిళ్లలో ఒక నకిలీ మద్యం బాటిల్ ఉంటోందని ఆరోపించారు. ప్రతి నిత్యం ఎకై ్సజ్ దాడుల్లో వేలకొలది నకిలీ మద్యం బాటిళ్లు గుర్తిస్తున్నారని, మాఫియాకు ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. నకిలీ మద్యం తయా రీపై ఉక్కు పాదం మోపాలని, తయారీదారులు ఎంతటి వారైనా కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. జిల్లాలోనూ నకిలీ మద్యంతో మరణాలు సంభవించాయని, వీటిపైనా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జోనల్ మహిళా అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
రెడ్బుక్ రాజ్యాంగం అమలుపైనే శ్రద్ధ
శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన పోలీసులు రెడ్బుక్ రాజ్యాంగం అమలులో తలమునకలయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న ప్రతిపక్షనేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో నేరస్తులు, అసాంఘిక శక్తులు విజృంభిస్తున్నారు. దీంతో నేరస్తులు చెలరేగిపోతున్నారు. అయితే పోలీసులు మాత్రం ప్రజల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకున్నామనీ, బీట్లు పెంచామనీ, డ్రోన్లతో నిఘా పెట్టామని చెబుతున్నప్పటికి ఏ మాత్రం తగినంత భరోసా దొరకడం లేదు. ఇప్పటికై నా పోలీసు అధికారులు స్పందించి నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
మాజీ ఉపరాష్ట్రపతితో కలెక్టర్ మర్యాద పూర్వక భేటీ
వెంకటాచలం: మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు జిల్లా పర్యటనలో భాగంగా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం మర్వాద పూర్వకంగా కలిశారు. జిల్లాలో పరిస్థితులు, పాలనాంశాలు, ఇతర అంశాలపై కొద్ది సేపు చర్చించారు. జగన్ సమీక్షలో కాకాణి నెల్లూరు (స్టోన్హౌస్పేట): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రీజనల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పాల్గొన్నారు. నేరాలను కట్టడి చేయాలి ● పోలీసు అఽధికారులను ఆదేశించిన ఐజీ నెల్లూరు (క్రైమ్): నేరాలను కట్టడి చేసి ప్రజలకు మెరుగైన శాంతి భద్రతలు అందించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఆయన ఎస్పీ అజితతో కలిసి పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. రౌడీషీటర్లను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించరాదని, వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. గంజాయిని పూర్తిగా కట్టడి చేయాలని, మహిళలు, చిన్నారుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నేర నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయని, వాటి ఆవశ్యకతను ప్రజలకు తెలియజేసి ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చొరవ చూపాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పారు. రోడ్డు ప్రమాదాలను విశ్లేషించి బ్లాక్ స్పాట్ల్లో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. నేడు న్యాయవాదుల కోర్టు విధుల బహిష్కరణ నెల్లూరు (లీగల్): సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్పై కోర్టు హాల్లో న్యాయవాది షూ విసిరిన ఘటనను ఖండిస్తూ బుధవారం కోర్టు విధులను బహిష్కరిస్తున్నామని బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అయ్యప రెడ్డి, నాగరాజయాదవ్ తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కమిటీ సమావేశంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్పై జరిగిన అమానవీయ ఘటన పూర్తిగా న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా భావిస్తున్నామన్నారు. ఈ ఘటనను ఖండిస్తూ అందుకు నిరసనగా బుధవారం కోర్టు విధులను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు సహకరించాలని కోరారు. శ్రీవారి దర్శనానికి 20 గంటలు తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. సోమవారం అర్ధరాత్రి వరకు 76,773 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,100 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.16 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. టైంస్లాట్ దర్శన టికెట్లు లేని వారికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. -
ఉపాధిలో అవినీతిపై పునర్విచారణ
కలువాయి(సైదాపురం): కలువాయి మండలంలో జరిగిన ఉపాధి పనుల్లో అవినీతిపై పున ర్విచారణకు ఆదేశిస్తూ కలెక్టర్ హిమాన్హు శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు.. ఉపాధి పనుల్లో అవినీతిపై ఇటీవల చిన్నగోపవరం పంచాయతీలో చీఫ్ విజిలెన్స్ అధికారి సమగ్ర విచారణ చేశారు. ఎనిమిది మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అయితే డ్వామా అధికారులు మాత్రం ఆరుగురు సిబ్బందిపై కేసులు పెట్టి ఇద్దరు ఏపీఓలను తప్పించారు. ఈ వ్యవహారంలో అధికారులకు ముడుపులు ముట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యుడు రఘు నేరుగా జాతీయ ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మండలంలోని 20 పంచాయతీల్లో జరిగిన అవినీతిపై పునర్విచారణ చేపట్టాలని కమిషన్ ఆదేశించింది. దీంతో కలెక్టర్ సైతం పూర్తి స్థాయిలో పునర్విచారణ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో డ్వామా అధికారులు, ఉపాధి సిబ్బందిలో గుబులు మొదలైంది.యువకుడి ఆత్మహత్యనెల్లూరు(క్రైమ్): ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ క్షణికావేశంలో ఓ యువకుడు శబరి ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెన్నానది ఎల్సీ గేటు సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగింది. మృతుడి వయసు 25 నుంచి 30 ఏళ్ల లోపు ఉండొచ్చని భావిస్తున్నారు. నలుపు రంగు ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్, నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు నమోదు చేశారు. మృతుడిని వివరాలు తెలిసిన వారు తెలియజేయాలని ఆమె మంగళవారం విజ్ఞప్తి చేశారు. -
ప్రైవేట్ ఆస్పత్రిలో చోరీ
● మహిళ బ్యాగ్లోని 10 సవర్ల బంగారం అపహరణ నెల్లూరు(క్రైమ్): నెల్లూరు శ్రీనివాస అగ్రహారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మహిళ బ్యాగ్లోని బంగారు ఆభరణాలు, నగదును దొంగ అపహరించుకెళ్లాడు. పోలీసుల కథనం మేరకు.. శెట్టిగుంటరోడ్డు వెంగమాంబ సెంటర్లో శైలజ, రామయ్య దంపతులు ఉంటున్నారు. శైలజ తల్లి మస్తానమ్మ సర్జరీ నిమిత్తం గతనెల 29వ తేదీన శ్రీనివాస అగ్రహారంలోని జీకే హాస్పిటల్లో చేరారు. ఆమె వద్ద కుమార్తె, అల్లుడు ఉంటున్నారు. ఇంట్లోని 10 సవర్ల బంగారు ఆభరణాలను శైలజ తీసుకొచ్చి ఆస్పత్రిలోని తన బ్యాగ్లో భద్రపరిచింది. మస్తానమ్మ ఆరోగ్యం కుదుటపడటంతో సోమవారం రాత్రి ఆస్పత్రి సిబ్బంది డిశ్చార్జ్ చేశారు. అయితే రాత్రి కావడంతో పక్కరోజు ఉదయం వెళ్లాలని నిర్ణయించుకుని నిద్రపోయారు. మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగుడు వారి గదిలోకి ప్రవేశించి బ్యాగ్ను అపహరించాడు. నిద్ర లేచిన శైలజ బ్యాగ్ కనిపించకపోవడంతో అంతా గాలించింది. మొదటి అంతస్తులో బ్యాగ్ కిందపడి ఉంది. అందులోని 10 సవర్ల బంగారు ఆభరణాలు, రూ.5 వేలు నగదు కనిపించకపోవడంతో యాజమాన్యానికి చెప్పింది. వారు సీసీ టీవీ ఫుటేజ్ను పరిశీలించగా ఓ దుండగుడు శైలజ ఉన్న గదిలోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. బాధితురాలు బాలాజీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై పుల్లారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


