SPSR Nellore District News
-
ధాన్యం సేకరణపై దృష్టి సారించండి
నెల్లూరు(దర్గామిట్ట): రబీ సీజన్లో అన్నదాతలు పండించిన ధాన్యం సేకరణపై మండల ప్రత్యేకాధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో మండల ప్రత్యేకాధికారులతో జేసీ వెంకటేశ్వర్లుతో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంట నష్టంపై వ్యవసాయ శాఖ చేపడుతున్న సర్వేపై ప్రత్యేకాధికారులు దృష్టి సారించాలన్నారు. రైస్మిల్లులను తనిఖీ చేయాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల్లోని వసతులను పర్యవేక్షించాలన్నారు. రైతులకు గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని, ఈ సమావేశంలో డీఆర్వో విజయకుమార్, డీఎస్ఓ లీలారాణి, డీపీఓ వసుమతి, తదితరులు పాల్గొన్నారు. పది పరీక్షలకు 457 మంది గైర్హాజరు నెల్లూరు (టౌన్): జిల్లాలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం పది విద్యార్థులకు గణిత పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 28,295 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 27,838 మంది రాశారు. 457 మంది గైర్హాజరయ్యారు. డీఈఓ బాలాజీరావు ఆరు కేంద్రాలను తనిఖీ చేయగా, 53 కేంద్రాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేశారు. ఓపెన్ పరీక్షకు 183 మంది గైర్హాజరు ఏపీ ఓపెన్ పదో తరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 183 మంది అభ్యాసకులు గైర్హాజరయ్యారు. సోమవారం నిర్వహించిన సైన్స్ అండ్ టెక్నాలజీ పరీక్షకు జిల్లాలో వ్యాప్తంగా 1172 మంది పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా, 989 మంది హాజరయ్యారు. సముద్ర అన్వేషణపై దృష్టి సారించాలి వెంకటాచలం: సముద్ర అన్వేషణ, ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి సారించాలని డీప్ ఓషన్ మిషన్ డైరెక్టర్ ఎంవీ రమణమూర్తి సూచించారు. కాకుటూరు వద్దనున్న విక్రమసింహపురి వర్శిటీ(వీఎస్యూ)లో ఎమ్మెస్సీ మైరెన్ బయాలజీ విద్యార్థులకు ఫెలోషిప్లను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రమణమూర్తి మాట్లాడుతూ డీప్ ఓషన్ మిషన్ ద్వారా భారతదేశం సముద్ర అన్వేషణ, వనరుల వినియోగం, స్థిరమైన అభివృద్ధిలో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. అనంతరం రమణమూర్తి, ఎన్ఐఓటీ బృందం వీఎస్యూను సందర్శించి పలు అంశాలపై అధ్యాపకులు, విద్యార్థులతో చర్చలు జరిపారు. వీఎస్యూ ప్రాంగణంలో మొక్కలు నాటారు. వీఎస్యూ వీసీ అల్లం శ్రీనివాసరావు, ఎన్ఐఓటీ ప్రొఫెసర్ బాలాజీ రామకృష్ణన్, డాక్టర్ వినీత్కుమార్ పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 86,091 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 29,664 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.21 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. కాగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
నెల్లూరు (టౌన్): ఇంటర్మీడియట్ స్పాట్లో అధ్యాపకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనంలో జవాబుదారీతనంగా ఉండాల్సిన వారు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. గుంపులు గుంపులుగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ జవాబు పత్రాలను దిద్దుతుండడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. స్పాట్లోకి సెల్ఫోన్ తీసుకెళ్లకూడదన్న నిబంధనను ఉల్లంఘిస్తున్నారు. మూల్యాంకన ప్రాంగణంలో యథేచ్ఛగా సెల్ఫోన్ను వినియోగిస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్నా, ఉన్నతాధికారి పర్యవేక్షిస్తున్నా ఏ మాత్రం లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మూల్యాంకన ప్రక్రియలో ఎగ్జామినర్లు, ఏసీఓలు, స్క్రూటినైజర్లు బాధ్యతారహితంగా వ్యవహరిస్తుండడంపై పలువురు మండిపడుతున్నారు. జవాబు పత్రాలు దిద్దే సమయంలో ఏకాగ్రత లేకపోతే తక్కువ మార్కులు వేయడం లేదా కౌంటింగ్లో తప్పులు దొర్లడం జరుగుతుంది. విద్యార్థులు రీవాల్యూయేషన్, రీ కౌంటింగ్ చేయించుకున్న సమయంలో ఈ తప్పులు బయటపడుతాయి. మూల్యాంకనంలో కఠినంగా వ్యవహరించాల్సిన స్పాట్ వాల్యూయేషన్ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అధ్యాపకులు ఇష్టమెచ్చినట్లుగా ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 22 నుంచి ప్రారంభం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం స్టోన్హౌస్పేటలోని కేఏసీ జూనియర్ కళాశాలలో ఈ నెల 22వ తేదీ నుంచి మొదటి స్పెల్ జరుగుతోంది. రెండో స్పెల్ ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మొదటి స్పెల్లో ఇతర జిల్లాలకు సంబంధించి 3,30,628 జవాబు పత్రాలు జిల్లాకు వచ్చాయి. వీటిల్లో ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, తెలుగు, హిందీ, సంస్కృతం, హిస్టరీ సబ్జెక్టులకు సంబంధించిన జవాబు పత్రాలు ఉన్నాయి. మొదటి స్పెల్లో 594 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 41 మంది స్క్రూటినైజర్లు, 12 ఏసీఓలతో కలిపి మొత్తం 647 మంది విధులు నిర్వహిస్తున్నారు. రెండో స్పెల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బొటని, జువాలజీ తదితర సబ్జెక్టులకు సంబంధించి మూల్యాంకనం జరగనుంది. ఇందుకు 766 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 51 మంది స్క్రూటినైజర్లు, 16 మంది ఏసీఓలు విధులు నిర్వహించనున్నారు. అయితే వీరిలో చాలా మంది అధ్యాపకులు రకరకాల సమస్యలు చెప్పి మూల్యాంకనానికి డుమ్మా కొడుతున్నారు. రీకౌంటింగ్కు విద్యార్థులు ఇంటర్ ఫలితాలు వచ్చిన తరువాత ఎక్కువ మంది విద్యార్థులు తమకు తక్కువ మార్కులు వచ్చాయని రీవాల్యూయేషన్, రీ కౌంటింగ్కు దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో వారికి గతంలో వచ్చిన మార్కుల కంటే అదనంగా పెరుగుతున్న పరిస్థితి ఉంది. అసిస్టెంట్ ఎగ్జామినర్ పేపరు దిద్దిన తరువాత స్క్రూటినైజర్ మళ్లీ పరిశీలించి కౌంటింగ్ చేసిన తరువాతే మార్కులను నమోదు చేస్తారు. ఇంత ప్రక్రియ జరుగుతున్నా మూల్యాంకనంలో తప్పులు దొర్లుతు న్న పరిస్థితి. తక్కువ మార్కులు వచ్చాయంటూ కొద్దిమంది విద్యార్థులే రీవాల్యూయేషన్, రీకౌంటింగ్కు దరఖాస్తు చేసుకుంటున్నారు. మెజార్టీ విద్యార్థులు ఫీజు చెల్లించలేక మిన్నకుండిపోతున్నారు. దీంతో వారు నష్టపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మూల్యాంకన ప్రక్రియలో అధ్యాపకులు బాధ్యతాయుతంగా వ్యవ హరించి పేపర్లు దిద్దేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. నిబంధనలు బేఖాతరు మూల్యాంకనంలో ఇంటర్బోర్డు నిబంధనలను అధ్యాపకులు బేఖాతరు చేస్తున్నారు. స్పాట్కు హాజరయ్యే అధ్యాపకులు తమ సెల్ఫోన్లను మూల్యాంకన అధికారి ఉండే గదిలో ఉంచాలి. ఆ తరువాత మూల్యాంకనం చేసే ప్రదేశానికి వెళ్లాలి. అయితే అందరూ సెల్ఫోన్లను నేరుగా మూల్యాంకన ప్రదేశానికి తీసుకెళుతున్నారు. కొంతమంది అధ్యాపకులు ఓ వైపు మూల్యాంకనం చేస్తూ మరోవైపు సెల్ఫోన్లో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మూల్యాంకనం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఒక్కో అసిస్టెంట్ ఎగ్జామినర్ రోజుకు 30 పేపర్లు దిద్దాల్సి ఉంది. ఒక్కో పేపరుకు రూ.23.66 చెల్లిస్తున్నారు. అయితే కొంతమంది అధ్యాపకులు సాయంత్రం నిర్ణీత సమయం కంటే ముందుగానే బయటకు వెళుతున్న పరిస్థితి ఉంది. కొంతమంది గుంపుగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ పేపర్లు దిద్దుతున్న పరిస్థితి. దీంతో పేపర్లు దిద్దే సమయంలో ఏకాగ్రత లోపించి మార్కుల కేటాయింపు, మార్కుల కౌంటింగ్లో తప్పులు దొర్లే అవకాశం ఉంది. అయినా అధ్యాపకులు ఇవేమి పట్టించుకోకుండా తమకిష్టమొచ్చిన విధంగా పేపర్లను దిద్దుతున్నారు. ఫలితంగా విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇంటర్ స్పాట్లో ఇష్టారాజ్యం జిల్లాకు 3.30 లక్షల జవాబు పత్రాలు కేఏసీ జూనియర్ కళాశాలలో స్పాట్ 1480 మందికిపైగా అధ్యాపకుల విధులు సీసీకెమెరాల సాక్షిగా ఇంటర్బోర్డు నిబంధనలు బేఖాతరు యథేచ్ఛగా సెల్ఫోన్ల వినియోగం కబుర్లు చెప్పుకుంటూ మూల్యాంకనం తరచూ తప్పులు దొర్లుతున్న వైనం రీ వాల్యూయేషన్, రీకౌంటింగ్లో పెరుగుతున్న మార్కులు స్పాట్లో సెల్ఫోన్లు వినియోగించరాదు మూల్యాంకన ప్రదేశంలోకి ఎవరూ సెల్ఫోన్లు తీసుకెళ్లకూడదు. ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న ప్రతిఒక్కరికీ ఆదేశాలు జారీ చేశాం. సెల్ఫోన్ వినియోగిస్తూ పట్టుబడితే చర్యలు తీసుకుంటాం. విడివిడిగా కూర్చుని శ్రద్ధగా మూల్యాంకనం చేయాలి. వచ్చే నెల 9వ తేదీ నాటికి మూల్యాంకనాన్ని పూర్తి చేయాలని ఆదేశాలు అందాయి. అంతకంటే ముందుగానే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. – వరప్రసాదరావు, ఆర్ఐఓ -
నేరాలతో అట్టుడుకుతున్న నెల్లూరు
సాక్షి టాస్క్ఫోర్స్: జిల్లా పోలీస్ యంత్రాంగం ముందు సినిమా డైరెక్టర్లు సైతం దిగదుడుపే. అధికార పార్టీ నేతలను కంటికి రెప్పలా కాపాడుతూ.. ప్రజలను, శాంతిభద్రతలను గాలికి వదిలేశారు. జిల్లాలో హత్యలు, లైంగిక దాడులు జరిగినా.. టీడీపీ నేతలు నేరాల్లో చిక్కుకున్నా.. అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్నా.. వారిని రక్షించేందుకు అప్పటికప్పు డు.. పొంతనలేని కట్టుకథలు అల్లడంలో కథ, స్క్రీన్ప్లే, డైరెక్షన్లో అరితేరిపోతున్నారు. టీడీపీ నేతలు ఇటు తప్పులు చేయడం అటు దొరికిపోతే.. పోలీసు లు మాత్రం తప్పుల మీద తప్పులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. సంచలన ఘటనలు జరిగిన ప్రతిసారి.. టాపిక్ డైవర్షన్ చేస్తున్నారు. తాజాగా నెల్లూరు నగరంలోని బోడిగాడితోట శ్మశాన వాటికలో సగం కాలిన మృతదేహం బయటపడడం సంచలనంగా మారింది. ఆ వెంటనే పోలీసులు ప్రాథమిక విచారణ కూడా చేయకుండానే ఆత్మహత్యేనంటూ హడావుడిగా ప్రకటన చేయడంతో పాటు మీడియా దృష్టిని మరల్చేందుకు హడావుడిగా లాడ్జీల్లో దాడులు చేశారు. అయితే లాడ్జీల్లో వ్యభిచరిస్తూ భారీ సంఖ్యలో జంటలు పట్టుబడడం, ఇందులో టీడీపీ నేత ఉండడంతో ఇది సంచలనమైంది. ఒక సంచలన ఘటనను కప్పిపుచ్చబోయి.. మరో సంచలన ఘటన వెలుగులోకి రావడంతో పోలీసుల పరిస్థితి గొంతులో వెలక్కాయ ఇరుక్కున్నట్లు అయింది. ‘తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే.. దూడ గడ్డి కోసం’ అనే సామెత చందానా ఉంది.. లాడ్జీలో వ్యభిచరిస్తూ పట్టుబడిన ఓ టీడీపీ నేత పరిస్థితి. పక్కాగా విటులతో అడ్డంగా దొరికిపోతే.. లాడ్జీల్లో టీడీపీ కార్యకర్తల మీటింగ్కు వచ్చాడని, ఆస్పత్రికి ట్రీట్మెంట్ కోసం వచ్చాడంటూ ఇలా పొంతనలేకుండా పోలీసులతోనే చెప్పించి నవ్వుల పాలయ్యారు. నెల్లూరు నగర ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో చిన్నబజార్ పోలీస్స్టేషన్ పరిధిలోని నాలుగు లాడ్జీలపై ఆదివారం పోలీస్ అధికారులు ఆకస్మిక దాడులను చేపట్టారు. సాయిగ్రాండ్ లాడ్జీలో వెంకటాచలం మండలం నిడుగుంటపాళేనికి చెందిన టీడీపీ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికి అత్యంత ఆప్తుడు, చవటపాళెం ప్రాథమిక వ్యవసాయ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు రావూరు రాధాకృష్ణనాయుడు ఓ మహిళతో వ్యభిచరిస్తూ పట్టుబడిన విషయం విదితమే. అయితే ఆ వ్యక్తి టీడీపీ నేత అని పోలీసులకు తెలియకపోవడంతో పట్టుకెళ్లి స్టేషన్లో విటుల మధ్యలోనే కూర్చోబెట్టారు. ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో సదరు వ్యక్తి టీడీపీ నేతగా తెలియడంతో పోలీసులపై రాజకీయ ఒత్తిడి పెరిగింది. సదరు తమ్ముడిని తప్పించేందుకు ఆస్పత్రికి వచ్చి సేదదీరేందుకు లాడ్జీకి వచ్చాడని, ఆస్పత్రికి వెళ్లినట్లు తమ విచారణలో తేలడంతో వదిలేశామంటూ ఓ పోలీస్ అధికారి చేసిన ప్రకటనతో ఆ శాఖ నవ్వుల పాలైంది. వెంకటాచలం మండలం నిడిగుంటపాళేనికి చెందిన రావూరు రాధాకృష్ణనాయుడు ప్రస్తుతం నెల్లూరు నగరంలోనే నివాసం ఉంటున్నాడు. టీడీపీ కార్యకర్తలను కలిసేందుకు వచ్చాడంటూ.. ఏదో జరుగుతుందని చూసేందుకు వచ్చాడంటూ ఇలా రకరకాల ప్రచారం చేశారు. నెల్లూరులోని కాపురం ఉంటున్న ఆయన ఆస్పత్రికి వచ్చి లాడ్జీలో సేదదీరుతున్నాడంటూ పోలీసులు చేసిన ప్రకటన ఇప్పుడు జిల్లాలో హాట్టాపిక్గా మారింది. తమ్ముళ్లను కాపాడేందుకు పోలీసులు పడుతున్న ఆపసోపాలు చూసి జనం నవ్వుతున్నారు. జిల్లా మత్స్యకారులు తమ జీవనోపాధిని కొల్లగొట్టుతున్న తమిళ జాలర్ల మెకనైజ్డ్ బోట్లను ప్రాణాలకు తెగించి పట్టుకుని వారి అహంకారానికి సవాల్ విసిరారు. ఆ బోట్లను పోలీస్ శాఖకు అప్పగించి వారు సైతం కాపలాగా ఉన్నారు. కానీ టీడీపీ పెద్దలు మత్స్యకారులకు ద్రోహం తలపెట్టి ఆ సామాజిక వర్గ కులపెద్దలను తాయిలాలతో లోబరుచుకుని బోట్లను రాత్రికి రాత్రే విడుదల చేయించారు. మత్స్యకారులకు అండగా ఉండాల్సిన పోలీస్ శాఖ ఈ కుట్రకోణంలో భాగస్వామ్యం కావడం ఆ శాఖ ప్రతిష్టకే మాయని మచ్చగా మారింది. ఆరు రోజులుగా తమకు ద్రోహం చేసిన మత్స్యకారుల పెద్దలను తాళ్లతో నిర్బంధించి నిజాలు రాబట్టారు. దీంతో ఈ వ్యవహారం వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దల పేర్లు, పోలీసు అధికారుల పేర్లు బయటకు వచ్చాయి. ప్రస్తుతం తీర ప్రాంతంలోకి పోలీసులు అడుగుపెట్టడానికి కూడా సాహసించలేకపోతున్నారు. తమిళబోట్ల వ్యవహారం బూమ్రాంగ్ కావడంతో టీడీపీ నేతలను కాపాడేందుకు సినీ ఫక్కీ డ్రామాకు తెరతీశారు. ప్రభుత్వ పెద్దలకు, టీడీపీ నేతలకు మద్దతుగా ఎవరైనా అక్కడ అడుగు పెడితే.. ఏమి జరుగుతుందో తెలియడంతో పోలీసులు సరికొత్త డ్రామాకు తెరతీశారు. మత్స్యకారులకు ఇక నుంచి అండగా ఉంటామంటూ రాయబేరాలు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలోనే తీరం పరిస్థితులు అంచనాకు వెళ్లిన క్రమంలో తీరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే తమిళ జాలర్ల మెకనైజ్డ్ బోటు రావడంతో చుట్టుముట్టి పట్టుకున్నామంటూ హడావుడి చేశారు. గతంలో ఎన్నోసార్లు మత్స్యకారులు తమ ప్రాణాలకు తెగించి తమిళ జాలర్ల బోట్లను నిర్బంధించినా.. ఎన్నడూ తీర ప్రాంతం ముఖం చూడని అధికారులు.. ఇప్పుడు ఏకంగా మత్స్యశాఖ కమిషనరే రావడం, వచ్చీరాగానే బోటును పట్టుకోవడం, ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం చూస్తుంటే.. ఒక సినిమాటిక్గా ఉంది. అధికారులు, పోలీసుల డ్రామాలను తెలుసుకున్న మత్స్యకారులు మరింత ఆగ్రహవేశాలతో రగిలిపోతున్నారు. ఏందబయా ఈ రోజు న్యూస్లాడ్జీఅడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేత తప్పులు చేసే తమ్ముళ్లను కాపాడేందుకు అష్టకష్టాలు వీరి ముందు సినిమా డైరెక్టర్లు కూడా దిగదుడుపే వ్యభిచారం కేసులో టీడీపీ నేత పక్కాగా పట్టుబడితే ఆస్పత్రికి వచ్చాడంటూ నవ్వులపాలు తమిళ బోట్ల వ్యవహారం బూమ్రాంగ్ కావడంతో టీడీపీ నేతలను కాపాడేందుకు కొత్త డ్రామా మత్స్య శాఖ ఆధీనంలోని బోటును తెచ్చి ఇదిగో తమిళ బోటు పట్టేశామంటూ హడావుడి బోడిగాడితోట శ్మశాన వాటికలో అనుమానాస్పదస్థితిలో సగం కాలిన మహారాష్ట్ర వాసి మృతదేహం ప్రాథమిక విచారణ చేపట్టకుండానే హడావుడిగా ఆత్మహత్య అంటూ ప్రకటన నగరంలో రెచ్చిపోతున్న రౌడీయిజం.. కత్తులతో హల్చల్ చేస్తున్నా చేష్టలుడిగి చూస్తున్న వైనం అటు టీడీపీ నేతల అరాచకాలు.. పోలీసుల శాంతిభద్రతల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఆపసోపాలు అనుమానాస్పద మరణాలు.. విస్మయ ప్రకటనలు నెల్లూరు స్వర్ణాల చెరువులో రెండు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో ఒక మృతదేహం లభ్యమైంది. ఆ మరుసటి రోజే బోడిగాడి తోట శ్మశాన వాటికలో మహారాష్ట్ర నాగపూర్కు చెందిన ఓ యువకుడి మృతదేహం అనుమానాస్పదంగా సగం కాలిన స్థితిలో బయటపడింది. వరుస ఘటనలు జరగడంతో మీడియా దృష్టి అనుమానాస్పద మరణాలపై పడడంతో పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టకుండానే అది ఆత్మహత్య అంటూ పోలీస్ శాఖ ప్రకటన చేయడం విస్మయాన్ని కలిగించింది. ఎవరైనా శ్మశాన వాటికలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటాడా? ఒక వేళ శరీరానికి నిప్పంటించుకుంటే సగభాగం వరకే కాలుతుందా?.. మరి అతను ఆత్మహత్యకు ఉపయోగించిన మెటీరియల్ను గుర్తించారా?.. ఇలా ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రాథమిక ఆధారాలేవీ పరిశీలించకుండానే.. ఇది హత్య అయితే ఎక్కడ పోలీస్ ఫెయిల్యూర్ కనిపిస్తుందోనని ముందుగానే ఆత్మహత్యగా ప్రకటన చేయడం చూస్తుంటే.. పోలీస్శాఖ అసమర్థత, శాంతిభద్రతల వైఫల్యాలు, డైవర్షన్ కట్టుకథలు కనిపిస్తున్నాయి. జిల్లాలోని పోలీస్ వ్యవస్థ.. అధికార పార్టీని భుజస్కంధాలపై వేసుకుని అభాసుపాలవుతోంది. మద్యం, గంజాయి విచ్చలవిడి అక్రమ అమ్మకాలను కట్టడి చేయలేకపోతున్నారు. నేరస్తులు జూలు విదిలించి..రౌడీయిజం, హత్యలు చేస్తున్నా నియంత్రించలేకపోతున్నారు. టీడీపీ నేతలకు ఏ కష్టం వచ్చినా.. ప్రభుత్వానికి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా.. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి మసిపూసి మారేడు కాయ చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అధికార పార్టీ నేతల అరాచకాలను, ప్రకృతి సంపద దోపిడీలను, అసాంఘిక కార్యకలాపాల చర్యలను, శాంతిభద్రతల వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ఆపసోపాలు పడుతున్నారు. తప్పులు చేసే పచ్చ నేతలు ప్రజల్లో పలచ బడకుండా.. సినిమా డైరెక్టర్లను మించి అప్పటికప్పుడే కట్టుకథలు అల్లేస్తున్నారు. నెల్లూరు నగరం నేరాలతో అట్టుడికిపోతోంది. ఓ వైపు రౌడీ గ్యాంగ్లు రెచ్చిపోతున్నాయి. ఇంకో వైపు గంజాయి బ్యాచ్లు తగ్గడం లేదు. మరో వైపు హత్యలు, మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. పోలీస్శాఖ తామేదో చేస్తున్నట్లు హడావుడి తప్పా రౌడీ మూకల పీచమణచడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. గత నెల రోజులుగా కొన్ని వర్గాలుగా విడిపోయి గ్యాంగ్ వార్కు తెగబడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి కత్తులతో వీరంగం చేశారు. ముగ్గురు యువకులను పొడిచారు. అందులో ఒకరికి కడుపులో పేగులు కూడా బయటకు వచ్చాయి. ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ చావుబతుకులతో పోరాటం చేస్తున్నారు. నెల రోజులుగా గ్యాంగ్వార్లు జరుగుతున్నా.. పోలీస్ శాఖ కనిపెట్టలేకపోవడం గమనార్హం. రెండు రోజుల క్రితం డీమార్ట్ షోరూం పక్కన యువత గొడవ పడి వీరంగం చేశారు. ఏటీఎంలా మద్యం ఎనీటైం దొరుకుతోంది. లాడ్జీలు, దాబాల్లో తనిఖీలు చేయడం కాదు. ఎనీటైం దొరికే మద్యం, గంజాయి అమ్మకాలను నిరోధించే దమ్ము ఆ శాఖలో ఏకోశానా కనిపించడం లేదు. అధికార పార్టీ నేతల మాటలను చట్టాలుగా చేసుకొని రెడ్బుక్ రాజ్యాంగాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేసి అక్రమ కేసులతో పోలీస్ శాఖ చెలరేగి పోతుంది తప్ప లా అండ్ ఆర్డర్ను కంట్రోల్చేయడంలో మాత్రం చేష్టలుడిగి చూస్తోంది. వారం రోజులుగా జిల్లాలో జరిగే కొన్ని పరిణామాలు చూస్తుంటే పోలీస్ శాఖ తప్పిదాలు జిల్లా పరువు ప్రతిష్టకే భంగం కలిగిస్తున్నాయి.. మత్స్యకారుల బోట్ల విడుదల నుంచి టీడీపీ నేత వ్యభిచార వ్యవహారం వరకు అన్ని విషయాల్లో ఖాకీల చేష్టలు నవ్వులపాలయ్యాయి. -
హత్యా.. ఆత్మహత్యా?
● మహారాష్ట్ర యువకుడి అనుమానాస్పద మృతి నెల్లూరు(క్రైమ్) : మహారాష్ట్రలో అదృశ్యమైన యువకుడు నగరంలోని బోడిగాడితోట శ్మశానవాటికలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతదేహం పాక్షికంగా కాలిపోయి ఉంది. మృతుని వద్ద సెల్ఫోన్, మృతదేహం పక్కన సిమ్కార్డు, మెమోరీ కార్డులున్నాయి. యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడా.. ఎవరైనా హత్య చేశారా అనే కోణాల్లో నవాబుపేట పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల మేరకు.. మహారాష్ట్ర నాగపూర్ జిల్లా బుటిబోరి పోలీస్స్టేషన్ పరిధిలో విక్రాంత్ రవికాంత్ మెష్రామ్(22) కుటుంబం నివాసం ఉంటోంది. అతను ఐటీఐ చదివి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. కొద్దిరోజులుగా పనికి వెళ్లడం లేదు. ఈనెల 20న రాత్రి అతను ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి వెళ్లలేదు. బాధిత కుటుంబ సభ్యులు బుటిబోరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బోడిగాడితోట శ్మశానవాటికలో.. బోడిగాడితోట శ్మశానవాటికలో పాక్షికంగా కాలిపోయిన ఓ యువకుని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి డయల్ 112 ద్వారా ఆదివారం నవాబుపేట పోలీసులకు సమాచారం అందించారు. నవాబుపేట, బాలాజీనగర్ ఇన్స్పెక్టర్లు జి.వేణుగోపాల్రెడ్డి, కె.సాంబశివరావు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం మొకాళ్ల వరకు కాలిపోయి ఉంది. మృతుని జేబులో సెల్ఫోన్ను, పక్కనే ఖైనీ ప్యాకెట్ కవర్లో సిమ్కార్డు, మెమోరీకార్డులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటి సాయంతో మృతుడు విక్రాంత్ రవికాంత్గా గుర్తించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. విక్రాంత్ కొన్ని రోజులుగా ఎవరితో మాట్లాడకుండా మూడీగా ఉన్నాడని, పనికి సైతం వెళ్లడం లేదని కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. డాగ్స్క్వాడ్ పరిశీలన ఘటనా స్థలంతో పాటు పరిసర ప్రాంతాల్లో డాగ్స్క్వాడ్ కలియ తిరిగింది. క్లూస్టీం ఘటనా స్థలంలో వేలిముద్రలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించి నవాబుపేట పోలీసులు అనుమానాస్పద మృతికింద కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్రెడ్డి నేతృత్వంలో ప్రత్యేక బృందం విభిన్న కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతదేహం పాక్షికంగా కాలి ఉండటం, మృతుని వివరాలు తెలిసేలా సిమ్కార్డు, మెమోరీకార్డు వంటివి పక్కనే ఉండటంతో మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. మృతుడు నాగపూర్ నుంచి నెల్లూరుకు ఎందుకు? ఎలా వచ్చాడు? బోడిగాడితోటలో శ్మశానం గురించి అతనికి ఎలా తెలిసింది? ఇక్కడికి ఎలా వచ్చాడు.. అనే వివరాలను తెలుసుకునేందుకు నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ నుంచి బోడిగాడితోట వరకు ఉన్న సీసీ ఫుటేజ్లను, మృతుని కాల్ డీటెయిల్స్ను పరిశీలిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని నగర ఏఎస్పీ దీక్ష వెల్లడించారు. -
తమ్ముళ్ల బాహాబాహీ
కావలి: పట్టణంలో టీడీపీ నేతల మధ్య బాహాబాహీ ఆదివారం జరిగింది. జువ్వలదిన్నెలో బోట్ల మాయంపై చర్చిస్తూ వీరి మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. వివరాలు.. జువ్వలదిన్నె బోట్ల విషయమై తుమ్మలపెంట రోడ్డులోని ఓ చోట మద్యం సేవిస్తూ చర్చించసాగారు. ఈ క్రమంలో బీద వర్గానికి చెందిన టీడీపీ కావలి 30వ వార్డు ఇన్చార్జి గాదంశెట్టి వేణుగోపాల్కు మద్దతుగా ఎమ్మెల్యే వర్గానికి చెందిన ఏఎమ్సీ డైరెక్టర్ ఇడుముక్కల పవన్కుమార్ మాట్లాడారు. దీన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వర్గానికి చెందిన వారు పవన్కుమార్పై దాడికి పాల్పడ్డారు. స్థానికులు గుర్తించి బాధితుడ్ని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కాగా ఆర్యవైశ్యులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారని రాష్ట్ర నేతలు ఆరోపించడంతో టీడీపీకి చెందిన దేవరకొండ శ్రీనివాసులు అనుచరులు మురళి, సారథిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఒకటో పట్టణ సీఐ ఫిరోజ్ దర్యాప్తు చేస్తున్నారు. రాజీ చర్చలు విఫలం అందరూ టీడీపీ నేతలే కావడంతో దాడి ఘటనలో రాజీ చేసేందుకు దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిగాయి. అయితే బాధితుడి సామాజికవర్గానికి చెందిన వారు రాష్ట్రస్థాయి నేతలకు సమాచారం అందించారు. వారితో పాటు బాధితుడి బంధువులు సైతం కేసు నమోదు చేయాలని పట్టుబట్టడంతో రాజీ చర్చలు విఫలమయ్యాయి. దీంతో కేసు నమోదు చేశారు. -
5న హనుమాన్ శోభాయాత్ర
నెల్లూరు(బృందావనం): సమాజంలో హైందవ ధర్మ విశిష్టతను తెలియజేసేందుకు, హనుమంతుని వ్యక్తిత్వం, శౌర్యం, పరాక్రమం, వినయం వంటి లక్షణాలను పెంపొందించేందుకు గానూ నగరంలో హనుమాన్ భక్త శోభాయాత్రను ఏప్రిల్ ఐదున నిర్వహించనున్నామని హిందూ చైత న్య వేదిక నేతలు వెల్లడించారు. శోభాయాత్ర బైక్ ర్యాలీకి సంబంధించిన సన్నాహక సమావేశాన్ని విజయమహల్ గేట్ సమీపంలోని ఓ హోటల్లో ఆదివారం నిర్వహించారు. వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరు జయరామ్, లీగల్ కన్వీనర్ మహేష్, ప్రచార విభాగాధ్యక్షుడు కాకు మురళీరెడ్డి, జిల్లా అధ్యక్షుడు తోటపల్లి సాయిశ్రీనివాస్, మోహన్ కిశోర్, స్వామి, మోహన్రావు, బాలాజీ, కోడూరు జయప్రద, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రైతుల పక్షాన పోరాటం చేస్తాం
పొదలకూరు: జిల్లాలో ధాన్యం ధరలు రోజురోజుకూ దిగజారుతున్నాయని, మద్దతు ధరను ప్రభుత్వం అందజేసేంత వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు మండలం మహ్మదాపురంలో ఆదివారం ఆయన పర్యటించారు. పార్టీ నేత కండ్లకూటి రమణారెడ్డి సతీమణి లక్ష్మీదేవమ్మ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తనను కలిసిన రైతులతో ముచ్చటించి, ధాన్యం ధరలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. వరి కోతలు పెరిగే కొద్దీ ధరలు మరింత పతనమయ్యే అవకాశం ఉందని చెప్పా రు. ప్రస్తుతం రూ.నాలుగు వేలను తగ్గించారని, కోతలు పెరిగి ధాన్యం దిగుబడి పూర్తిస్థాయిలో పెరిగితే ఈ మాత్రం కూడా లభించదని తెలిపారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదును జమచేస్తామని సర్కార్ ప్రకటించిందని, అయితే అక్కడ కొనడంలేదని వివరించారు. ఇప్పటికే పుట్టి ఒక్కింటికి రూ.నాలుగు వేల మేర తగ్గాయని తెలిపారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామంటూ జిల్లా అధికారులు ఆర్భాటంగా ప్రకటించారని, అయితే అక్కడ సేకరించడంలేదని విమర్శించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయొద్దంటూ మౌఖిక ఆదేశాలను ప్రభు త్వం ఇస్తోందనే గుసగుసలు అధికారుల్లో వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. యూరియా అందక.. పెట్టుబడులు భారీగా పెరిగి ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇవ్వకపోతే, ప్రజాప్రతినిధులు ఏమి చేస్తున్నారో అర్థం కావడంలేదని చెప్పారు. పొలాలకు సాగునీటిని సక్రమంగా అందజేయకుండా, ఇరిగేషన్ పనుల్లో దొంగ బిల్లులు చేసుకొని రూ.కోట్లను కొల్లగొట్టారని ధ్వజమెత్తారు. ధాన్యానికి మద్దతు ధర లభిస్తోందంటూ టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో పుట్టికి రూ.24 వేలను అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి గోగిరెడ్డి గోపాల్రెడ్డి, సర్వేపల్లి బూత్ కమిటీల కన్వీ నర్ బచ్చల సురేష్కుమార్రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, మాజీ ఎంపీపీ కోనం చినబ్రహ్మయ్య, నేతలు కరిపరెడ్డి కృష్ణారెడ్డి, అశోక్కుమార్రెడ్డి, తిరుపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోజురోజుకూ దిగజారుతున్న ధాన్యం ధరలు వరి కోతలు పెరిగితే మరింత పతనమయ్యే అవకాశం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
ఆగని రేషన్ బియ్యం అక్రమ రవాణా
కూటమి ప్రభుత్వంలో బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. ఆకర్షణీయమైన ప్లాస్టిక్ బ్యాగుల్లో పేదల బియ్యం అక్రమ రవాణా జోరుగా జరిగిపోతోంది. కావలి కేంద్రంగా ఈ దందా భారీస్థాయిలో జరుగుతోంది. ఇటీవల కావలిలో అధికారుల వరుస దాడుల్లో బియ్యం పట్టుబడ్డాయి. అయితే గుట్టుచప్పుడు కాకుండా భారీగా పేదల బియ్యం జిల్లా సరిహద్దులు దాటిపోతోంది.నెల్లూరు(పొగతోట): రేషన్ బియ్యం మాఫియా రోజురోజుకు కొత్త రూపు సంతరించుకుంటోంది. గత కొన్ని నెలలుగా బియ్యం మాఫియా కావలిని కేంద్రంగా మార్చుకుంది. స్థానిక నాయకుల సహకారంతో రెచ్చిపోతోంది. కూటమి నేతల కనుసన్నల్లో అధికారులు పని చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మాఫియా లీడర్లు అధికారుల కళ్లుకప్పి బియ్యం అక్రమ రవాణాలో నూతన విధానాలు అవలంభిస్తున్నారు. గతంలో ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి వచ్చిన సంచులతోనే బియ్యం అక్రమంగా తరలించారు. ప్రస్తుతం అధికారులు, ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహిస్తుండడంతో నూతన విధానాలు ప్రారంభించింది. అక్రమంగా సేకరించిన బియ్యాన్ని రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. అక్కడ ఆకర్షణీయమైన ప్లాస్టిక్ బ్యాగుల్లో బియ్యం నింపి అక్రమంగా తరలిస్తున్నారు. గతంలో రాత్రి సమయంలో లారీల ద్వారా బియ్యం అక్రమంగా తరలించే వారు. ప్రస్తుతం పట్టపగలు పేదల బియ్యం రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నాయి. ఎరవేసి చేపలను పట్టినట్లు కొద్దిపాటి బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని అధికారులకు సమాచారం ఇస్తున్నారు. సమయం.. వాహన నంబర్తో సహా సమాచారం అందిస్తుండడంతో అధికారులు చిన్నపాటి బియ్యం పట్టుకునే ప్రయత్నంలో ఉంటున్నారు. ఈ క్రమంలో మాఫియా రాచమార్గంలో భారీ స్థాయిలో బియ్యం అక్రమంగా తరలించి సోమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా కూటమి నాయకుల నుంచి వస్తున్న ఒతిళ్లకు ఏమీ చేయలేదని స్థితిలో ఉన్నారు. ఇటీవల జరిగిన ఘటనలు ఈ మధ్య కాలంలో ప్రత్యేక బృందాల తనిఖీల్లో సుమారు 400 టన్నులకు పైగా పేదల బియ్యం పట్టుకున్నట్లు సమాచారం. ఇటీవల కావలిలో ఏడు టన్నులు, గత మంగళవారం కావలి నుంచి లారీలో అక్రమంగా తరలిస్తున్న 156 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. రూ.7.56 లక్షల విలువ చేసే బియ్యం, రూ 10 లక్షలు విలువ చేసే లారీని సిజ్ చేశారు. రైస్ మిల్లుల్లో గుట్టుగా పాలిషింగ్ జిల్లాలో 1,513 చౌకదుకాణాలు ఉన్నాయి. 7.21 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రతినెలా 12.500 మెట్రిక్ టన్నుల బియ్యం కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. కావలి కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి కావలికి పేదల బియ్యం తరలిస్తున్నారు. ప్రకాశం, బాపట్ల, కడప తదితర జిల్లాల నుంచి పేదల బియ్యం అక్రమంగా తరలిస్తున్నారు. ఆటోలు, మినీ వాహనాల్లో బియ్యం కావలికి చేరుకుంటున్నాయి. కావలిలో బియ్యానికి పాలిష్పట్టి ప్లాస్టిక్ బ్యాగుల్లో నింపుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ప్లాస్టిక్ బ్యాగులను చైన్నెకి తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఇతర దేశాలకు, రాష్ట్రాలకు బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ ప్రక్రియకు సహకరిస్తున్న కీలక నాయకుడికి నెలకు రూ.20 లక్షల వరకు ముట్టచెబుతున్నట్లు సమాచారం. అధికారులకు నెలనెలా మూడుపులు అందడంతో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కావలి చుట్టుపక్కల మండలాల్లో పెద్ద పెద్ద రైస్ మిల్లులు ఉన్నాయి. ఆయా రైస్ మిల్లులు పేదల బియ్యం పాలిష్ పట్టడానికి మాత్రమే వినియోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కావలి కేంద్రంగా పాలిషింగ్ వరుసగా కావలి, కోవూరులో భారీగా పట్టుబడిన రేషన్ బియ్యం కేవలం దాడులకే పరిమితమవుతున్న వైనం మూలాల్లోకి వెళ్లని అధికారులు -
మలుపు వద్ద అదుపుతప్పిన టిప్పర్
● త్రుటిలో తప్పిన పెను ప్రమాదం సీతారామపురం: సీతారామపురం–పోరుమామిళ్ల ఘాట్రోడ్డు మార్గంలోని ఓ మలుపు వద్ద శనివారం టిప్పర్కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల నుంచి నారాయణప్పపేట గ్రామ సమీపాన జరుగుతున్న భారతమాల జాతీయ రహదారి టన్నెల్ పనుల వద్దకు బయల్దేరిన టిప్పర్ ఘాట్రోడ్డు మార్గంలోని రెండో మలుపు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ప్రొటెక్షన్ వాల్తో పాటు డివైడర్ను ఢీకొని ఆగింది. డివైడర్ లేకుండా ఉండి ఉంటే టిప్పర్ లోయలో పడిపోయేది. ఈ ఘటనతో డ్రైవర్, క్లీనర్ భయభ్రాంతులకు గురై ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ రహదారి నిర్మాణ పనులు చేస్తున్న యంత్రాల సహాయంతో టిప్పర్ను వెనుక్కు లాగారు. -
ఆర్టీసీ డిపోను ప్రైవేట్కు కట్టబెట్టడం దుర్మార్గం
నెల్లూరు సిటీ: నెల్లూరు–2 డిపోను ఓ ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టాలని చూడడం దుర్మార్గమని, ఈ ప్రయత్నాన్ని వెనక్కు తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి కె.ప్రసాద్ డిమాండ్ చేశారు. నగరంలోని ఆర్టీసీ 2–డిపో వద్ద శనివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 40 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదన్నారు. ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పనంగా కట్టబెడుతున్నారని మండిపడ్డారు. డిపోలో పనిచేసే వారిని మరో డిపోలకు తరలించే విధానాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికై నా ప్రైవేటీకరణను విరమించుకోకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ యూనియన్ జాయింట్ సెక్రటరీ రమణారావు, ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణారావు, ఎన్ఎంయూఏ కార్యదర్శి సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
స్వర్ణాల చెరువులో వ్యక్తి మృతదేహం
నెల్లూరు(క్రైమ్): నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాల వెనుక స్వర్ణాల చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతుండడాన్ని శనివారం స్థానికులు గుర్తించి దర్గామిట్ట పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. మృతదేహం ఉబ్బి దుర్గంధం వెదజల్లుతూ ఉంది. మృతుడు సుమారు 35 నుంచి 40 ఏళ్ల వయస్సు కలిగి ఉన్నాడు. 35వ వార్డు ఇన్చార్జి వీఆర్వో మధుసూదన్రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. స్వర్ణాల చెరువుతో పాటు నీలగిరి సంఘం పరిసర ప్రాంతాల్లో మృతుని ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. మృతుని వివరాలు తెలిసిన వారు దర్గామిట్ట పోలీసులకు తెలియజేయాలని స్థానిక ఇన్స్పెక్టర్ బి.కల్యాణరాజు కోరారు. కనుల పండువగా శ్రీవారి కల్యాణం రాపూరు: మండలంలోని పెంచలకోన క్షేత్రంలో శనివారం పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవిల కల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 4 గంటలకు మూలమూర్తికి అభిషేకం, 5 గంటలకు సుప్రభాతం, 6 గంటలకు గోపూజ, పూలంగిసేవ జరిపారు. 10 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను నిత్యకల్యాణ మండపంలో కొలువుదీర్చి వివిధ రకాల ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి వేదపండితుల మంత్రోచ్ఛారణలతో కల్యాణాన్ని గావించారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్సేవ నిర్వహించారు. గ్రామాల్లో భయం భయం.. కలువాయి(సైదాపురం): రగామాల్లో చెత్త సేకరించుకుంటున్న నేపంతో కొందరు మహిళలు ముఠాగా ఏర్పడి చిన్న పిల్లలను టార్గెట్ చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. నాలుగు రోజుల కిందట కలువాయి మండలం పెన్నా బద్వేలు గ్రామంలో చెత్త ఏరుకుంటూ సంచరిస్తున్న నలుగురు మహిళలు పెన్నా బద్వేల్ పాత ఊరు ఎస్సీ కాలనీలో తుమ్మల రమేష్ కుమార్తెకు చాక్లెట్లు ఇస్తూ చూట్టూముట్టడంతో చిన్నారి కేకలు వేసింది. దీంతో కాలనీ వాసులు ఒక్కొక్కరిగా అక్కడకు చేరుకుని నలుగురు మహిళలను అడ్డగించగా దగ్గరలో ఉన్న ఆటో ఎక్కి పరారయ్యారని కాలనీ వాసులు తెలిపారు. ఈ విషయం పట్ల గ్రామంలో ఆందోళన నెలకొంది. కండలేరులో 48.220 టీఎంసీల నీరు రాపూరు: కండలేరు జలాశయంలో శనివారం నాటికి 48.220 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2100, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 200, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 80 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. పొదలకూరు నిమ్మధరలు(కిలో) పెద్దవి: రూ.90 సన్నవి: రూ.70 పండ్లు: రూ.45 -
పాముకాటుకు గీత కార్మికుడి మృతి
చేజర్ల: పాముకాటుకు గురై గీత కార్మికుడు మృతిచెందిన ఘటన శనివారం చేజర్ల మండలం చీర్లవారికండ్రిక వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని చిత్తలూరు గ్రామానికి చెందిన పర్చూరు కృష్ణయ్య (55) రోజులానే గ్రామం దగ్గరలోని చీర్లవారికండ్రికకు వెళ్లి తాటిచెట్టు ఎక్కి కళ్లు కుండలు దింపి తిరుగు ప్రయాణంలో పాముకాటు గురై తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు దగ్గరలోని ఆస్పత్రికి తరలించేలోపు మార్గమధ్యలో మృతిచెందారు. ఇంటి పెద్ద కృష్ణయ్య మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కాగా రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన యువకులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన విషాదం మిగల్చగా, పర్చూరి కృష్ణయ్య మృతితో గ్రామంలో మరింత విషాదఛాయలు అలుమున్నాయి. 24న క్యాంపస్ డ్రైవ్ కోవూరు: గంగవరంలోని గీతాంజలి పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 24వ తేదీ భారీ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ను నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎం.మహేంద్రబాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ ఉన్నత విద్యాశాఖ సహకారంతో చైన్నెకి చెందిన ఓ ప్రముఖ సంస్థ ఎంపికలు చేపట్టనుందన్నారు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రస్తుతం మూడో సంవత్సరం (ఫైనలియర్) చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థులందరూ హాజరుకావచ్చన్నారు. -
టీడీపీ పాలనలో రైతులకు సంతోషమేదీ..?
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి వెంకటాచలం: టీడీపీ ప్రభుత్వంలో రైతు కుటుంబాలకు సంతోషమే కరువైందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని తిక్కవరప్పాడు పంచాయతీ గొట్లపాళెంలో శనివారం ఆయన పర్యటించారు. ధాన్యం ధరలను పూర్తిగా తగ్గించేశారని, వీటితో పెట్టుబడులు సైతం చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు వా పోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డారు. ధాన్యం ధరలు రోజురోజుకూ దిగజారుతుండటం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోందని చెప్పారు. ధరలు తగ్గుముఖం పట్టకుండా ప్రభుత్వం జోక్యం చేసుకొని, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కనీస మద్దతు ధరను కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై పట్టించుకోకపోతే కర్షకుల పక్షాన నిలిచి అధికారులను నిలదీస్తామని స్పష్టం చేశారు. సకాలంలో యూరి యా అందక.. సాగునీరు పారక అష్టకష్టాలు పడి పంటలను పండించిన ఽరైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడం బాధాకరమన్నారు. ఇరిగేషన్ పనుల పేరిట దొంగ బిల్లు లు చేసుకొని దోచుకోవడంపై ఉన్న శ్రద్ధ.. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించడంపై లేదని విమర్శించారు. వారం వ్యవధిలోనే ధరలు పూర్తిగా పడిపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో వారున్నారని తెలిపారు. గతంలో 25 శాతం అధికంగా.. గత సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే 25 శాతం అధికంగా రైతులకు లభించిందని గుర్తుచేశారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించి కనీస మద్దతు ధరను కల్పించిన అంశాన్ని ప్రస్తావించారు. ధరల స్థిరీకరణ నిధి పేరుతో ఏటా రూ.మూడు వేల కోట్లను కేటాయించారని, అయితే ప్రభుత్వ కూటమి ప్రభుత్వం కేవలం రూ.500 కోట్లనే కేటాయించి చేతు లు దులుపుకొందని మండిపడ్డారు. జగన్మోహన్రెడ్డి పరిపాలనను.. చంద్రబాబు పాలనను బేరీజేసుకొని నాటి పాలనే భేష్ అంటూ ప్రశంసిస్తున్నారని తెలియజేశారు. మద్దతు ధరను కల్పించకపోతే జిల్లా కార్యాలయాలను ముట్టడిస్తామని చెప్పారు. అనారోగ్యంతో మృతి చెందిన మాజీ సర్పంచ్ నలగర్ల దేవసేనమ్మ పార్థివదేహానికి పూలమాలేసి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. వైస్ ఎంపీపీ కనుపూరు కోదండరామిరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, ఆరుగుంట ప్రభాకర్రెడ్డి, మంచు వెంకటేశ్వర్లునాయుడు, నలగర్ల నరసింహరావు, మందల శీనయ్య, నలగర్ల రంగయ్య, వెలిబోయిన వెంకటేశ్వర్లు, తుపాకుల కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీలో ఇప్పటివరకు నివురుగప్పిన నిప్పులా దాగి ఉన్న అంతర్గత పోరు తాజాగా దావానంలా వ్యాపిస్తోంది. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డితో భూ జగడానికి మంత్రి నారాయణ కాలుదువ్వడమే దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. నగరంలోని వివాదాస్పద స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డితో మంత్రి నారాయణ కయ్యానికి కాలుదువ్వుతుండటం నెల్లూరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వాస్తవానికి వేమిరెడ్డి సోదరుడు కోటారెడ్డికి.. డిప్యూటీ మేయర్ రూప్కుమార్యాదవ్ ప్రధాన అనుచరుడు దార్ల వెంకటేశ్వర్లు మధ్య స్థల వివాదం జరుగుతోంది. నగర నడిబొడ్డున ఉండే సండే మార్కెట్ మలుపు వద్ద ల్యాండ్ ఈ వివాదానికి కేంద్ర బిందువైంది. ఇరిగేషన్ స్థలాన్ని ఆక్రమించి భవనాన్ని నిర్మిస్తున్నారంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వివాదం జరుగుతున్న సమయంలోనే సదరు స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి నారాయణ శంకుస్థాపన చేయడం ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. ఇదీ తంతు.. ట్రంక్రోడ్డులో ఎంపీ వేమిరెడ్డి సోదరుడు కోటారెడ్డికి 73 అంకణాల విలువైన స్థలం ఉంది. ఆ పక్కనే ఉన్న 359 – 3ఏ సర్వే నంబర్లో ఇరిగేషన్ కాలువకు సంబంధించిన స్థలమూ ఉంది. ప్రస్తుతం నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతం ఇది. అయితే ఈ స్థలంలో రూప్కుమార్యాదవ్ ప్రధాన అనుచరుడు దార్ల వెంకటేశ్వర్లుకు ఎనిమిదంకణాల స్థలానికి గతంలో ప్రభుత్వ వాల్యూతో నగదు కట్టించుకొని పట్టా ఇచ్చారని తెలుస్తోంది. మిగిలిన భూమి ఆయన ఆక్రమణలో ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇక్కడే అసలు కత.. మరోవైపు సర్వే నంబర్ 259 – 2ఏ ఉన్న భూమి నిషేధిత జాబితాలో ఉంది. అయితే 259 – 3 బీ 1, 2 సబ్ డివిజన్ చేసినట్లుగా రికార్డులను మార్చి.. పదంకణాల స్థలాన్ని రెవెన్యూ రికార్డుల్లో మార్పు చేయించుకొని తమ ఆధీనంలో ఉంచుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ 18 అంకణాల స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి జీ + 2గా మున్సిపల్ అనుమతులను పొందారు. వాస్తవానికి ఇరిగేషన్ భూమిలో భవన నిర్మాణానికి ఎలాంటి పర్మిషన్లు ఇవ్వకూడదు. అయితే రాజకీయ ఒత్తిడితో ప్లాన్ అనుమతులను అధికారులు మంజూరు చేయడం దుమారాన్ని రేపింది. భవన నిర్మాణ అనుమతులకు పేదలు వెళ్తే వంద కొర్రీలు పెట్టే అధికారులు.. ఇక్కడ మాత్రం ఇలా వ్యవహరించడంపై పలువురు మండిపడుతున్నారు. ఎంపీ సూచనలు బేఖాతర్ వివాదాస్పద స్థలంలో నిర్మాణానికి అనుమతులివ్వొద్దని.. న్యాయపరంగా చూడాలని మున్సిపల్ అధికారులను ఎంపీ ఆదేశించారు. అయితే దీన్ని బేఖాతర్ చేస్తూ.. మంత్రి నారాయణ కనుసన్నల్లోనే పర్మిషన్ ఇచ్చారని తెలుస్తోంది. ఇలా వివాదం జరుగుతున్న సమయంలోనే మంత్రి స్వయంగా వెళ్లి శంకుస్థాపనలో పాల్గొనడం ఎంపీపై కయ్యానికి కాలుదువ్వినట్లుగానే ఉందనే టాక్ సర్వత్రా వినిపిస్తోంది. న్యాయస్థానంలో ఉన్నా.. ఉయ్యాలకాలువ స్థలాన్ని ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ను నిర్మిస్తున్నారనే విషయమై హైకోర్టును ఎంపీ సోదరుడు కోటారెడ్డి ఆశ్రయించారు. ఆయన వేసిన పిటిషన్పై విచారణ మరో రెండ్రోజుల్లో జరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో శంకుస్థాపనలో అమాత్యుడు పాల్గొనడంపై తమ్ముళ్లే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఊహాగానాలతోనే ఇలానా..? ఇటీవల మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మంత్రివర్గ మార్పు ఉండొచ్చనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే ఎంపీ సతీమణి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి అమాత్య పదవి వరించే అవకాశాలూ ఉన్నాయనే ప్రచారం లేకపోలేదు. అప్పుడు నారాయణను సీఆర్డీఏకే పరిమితం చేసి, ఆ స్థానంలో ఆమెకు అవకాశం కల్పిస్తారనే చర్చా సాగుతోంది. వీటన్నింటినీ జీర్ణించుకోలేకే వేమిరెడ్డితో నారాయణ కాలుదువ్వుతున్నారని పలు వురు పేర్కొంటున్నారు. ప్రకటనలు ఉత్తుత్తేనా..? నగరంలో ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే సహించేదిలేదంటూ మంత్రి నారాయణ తరచూ ఊదరగొడుతుంటారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే, ఇదంతా ఒట్టిదేననే విషయం తేలిపోతోంది. కాలువల వెడల్పు పేరుతో పేదల నివాసాలను కూలదోసిన ఆయన.. ఇరిగేషన్ స్థలంలో ఉన్న భవన శంకుస్థాపనకు వెళ్లడం ద్వారా ఏ సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారోనని తమ్ముళ్లే నిట్టూరుస్తున్నారు. పేదలకో న్యాయం.. పెద్దలకో న్యాయమానంటూ మండిపడుతున్నారు. కాగా ఈ విషయమై సిటీ ప్లానర్ రఘునాథరావు సంప్రదించగా, న్యాయస్థానం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో జీ + 2 కింద అనుమతులిచ్చామని బదులిచ్చారు. టీడీపీలో నువ్వా.. నేనా..! వేమిరెడ్డితో కయ్యానికి దిగిన నారాయణ వివాదాస్పద స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన ఇది ఇరిగేషన్ భూమంటూ హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ సోదరుడు న్యాయస్థానంలో ఉన్న తరుణంలో ఎలా పాల్గొంటారంటూ అమాత్యుడిపై రుసరుస -
1297 హెక్టార్లలో పంట నష్టం
నెల్లూరు(వేదాయపాళెం): జిల్లాలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో నాలుగు మండలాలు ప్రభావితమై.. 1297 హెక్టార్లలో పంట నష్టం సంభవించిందని జిల్లా వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకుల కార్యాలయ ఏడీఏ నర్సోజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ● అనంతసాగరం మండలంలోని తొమ్మిది గ్రామాల్లో 1071 మంది రైతులకు సంబంధించిన 914 హెక్టార్లలో కోత దశలో ఉన్న వరి.. 140 హెక్టార్లలో పూత దశలో ఉన్న పత్తి పంట దెబ్బతినిందని చెప్పారు. ● రాపూరు మండలంలోని ఓ గ్రామంలో 80 మంది రైతులకు సంబంధించిన 80 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ● కలువాయి మండలంలోని నాలుగు గ్రామాల్లో 26 మంది రైతులకు చెందిన 13 హెక్టార్లలో కోత దశలో ఉన్న వరి పంట దెబ్బతినిందని తెలిపారు. ● మర్రిపాడు మండలంలోని ఐదు గ్రామాల్లో 250 మంది రైతులకు సంబంధించిన 150 హెక్టార్లలో కోతకొచ్చిన వరి పంటకు నష్టం వాటిల్లిందని చెప్పారు. ప్రాథమిక సమాచారం మేరకు నివేదికలను సిద్ధం చేశామని వివరించారు. అకాల వర్షాలు, వడగండ్ల వానలకు జిల్లాలోని ఏ ప్రాంత రైతులకు నష్టం జరిగినా, అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు. ● రాపూరు: మండలంలో బుధవారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న వరి పంటను వ్యవసాయాధికారి సోమసుందర్ పరిశీలించారు. గాలీవాన, వడగండ్లతో గోనుపల్లిలోని వరి, మామిడి, నిమ్మ పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారాన్ని అందించేలా నివేదికను సమర్పించనున్నామని తెలిపారు. -
ఈద్ – ఉల్ – ఫిత్ర్ శుభాకాంక్షలు
నెల్లూరు రూరల్: ఈద్ – ఉల్ – ఫిత్ర్ను పురస్కరించుకొని ముస్లింలకు శుభాకాంక్షలను మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి.. ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తెలియజేశారు. ఈ మేరకు వారు వేర్వేరు ప్రకటనలను శుక్రవారం విడుదల చేశారు. నెల్లూరు(దర్గామిట్ట): ఈద్ – ఉల్ – ఫిత్ర్ను జిల్లాలోని ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాల ని కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం ఒక ప్రకటన లో కాంక్షించారు. ఈ మేరకు పండగ శుభాకాంక్షలను తెలియజేశారు. నేటి పదో తరగతి పరీక్ష వాయిదా నెల్లూరు (టౌన్): పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షను ఏప్రిల్ రెండో తేదీకి వాయిదా వేశారని డీఈఓ బాలాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి ఈ పరీక్ష శనివారం జరగాల్సి ఉందని, అయితే రంజాన్ కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పారు. ఆ రోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరగనుందని వివరించారు. ● ఏపీ ఓపెన్ స్కూల్ పదో తరగతికి సంబంఽధించి శనివారం నిర్వహించాల్సిన గణితం, భారతీయ సంస్కృతి, వారసత్వ పరీక్షను వచ్చే నెల మూడుకు వాయిదా వేశారని డీఈఓ పేర్కొన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.30 వరకు జరగనుందన్నారు. జలాశయ ఆప్రాన్ పరిశీలన సోమశిల: సోమశిల జలాశయాన్ని ప్రాజెక్ట్ ఎస్ఈ వెంకటరమణారెడ్డి శుక్రవారం సందర్శించారు. నిలిచిపోయిన ఆప్రాన్ పనులను ప్రాజెక్ట్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇవి మూడు రోజుల్లో ప్రారంభంకానున్నాయని వెల్లడించారు. శివాలయ పక్కన ఉన్న రక్షణ గోడ ఎత్తు పెంచే విషయమై ప్రాజెక్ట్ చైర్మన్ కేశవ చౌదరి, సంబంధిత అధికారులతో చర్చించారు. పెంచలకోనలో వేలం పాటలు రాపూరు: పెంచలకోనలో వచ్చే నెల్లో నిర్వహించనున్న లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తాత్కాలిక దుకాణాల ఏర్పాటుకు సంబంధించిన వేలం పాటలను శుక్రవారం నిర్వహించారు. దేవస్థానానికి రూ.20.78 లక్షల ఆదాయం లభించిందని ఏసీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 26 నుంచి జూన్ ఏడు వరకు 49 తాత్కాలిక దుకాణాల ఏర్పాటుకు గానూ వేలాన్ని నిర్వహించామని వివరించారు. ప్రభుత్వ భూమిని పరిశీలించిన జేసీ సీతారామపురం : మండలంలోని పెద్దనాగంపల్లిలో సర్వే నంబర్ 54 – 4లో గల 14 ఎకరాల ప్రభుత్వ భూమిని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు శుక్రవారం పరిశీలించారు. ఆనం సంజీవరెడ్డి హైలెవల్ కెనాల్ నిర్మాణానికి అటవీ భూమిని కేటాయించారు. దీనికి ప్రత్యామ్నాయంగా అటవీశాఖకు కేటాయించేందుకు పెదనాగంపల్లిలోని ప్రభుత్వ భూమిని పరిశీలించామని తెలిపారు. తహసీల్దార్ ఫాజిహా, మండల సర్వేయర్ శ్రీకాంత్, వీఆర్వో మురళి, తదితరులు పాల్గొన్నారు. చంద్రశేఖర్రెడ్డి గోవర్ధన్రెడ్డి -
దర్శనమిచ్చిన నెలవంక
● వెల్లివిరిసిన ఆనందోత్సాహాలు ● మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక దువా ● ఈద్ – ఉల్ – ఫిత్ర్ నేడు వినీలాకాశంలో నెలవంక శుక్రవారం రాత్రి కనిపించింది. ఈ విషయమై మతపెద్దల ప్రకటనతో జిల్లా వ్యాప్తంగా ఈద్ – ఉల్ – ఫిత్ర్ను ఆనందోత్సాహాలతో శనివారం జరుపుకొనేందుకు ముస్లింలు సమాయత్తమయ్యారు. నెల రోజుల ఉపవాస దీక్షలను ప్రత్యేక ప్రార్థనలతో విరమించారు. నగరంలోని జెండావీధి, కోటమిట్ట తదితర ప్రాంతాల్లో బాణసంచా కాల్చి.. మిఠాయిలు పంచుకొని ఆత్మీయ ఆలింగనంతో ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. నగరంలోని మసీదులు, ఈద్గాల వద్ద పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేపట్టింది. నెలవంక దర్శనంతో మసీదులు, ఈద్గాలు, గృహాల్లో దువా చేశారు. నగరంలో సందడి పండగకు అవసరమైన సామగ్రి, వస్త్రాలను కొనుగోలు చేసేందుకు వచ్చిన వారితో నగరంలో సందడి నెలకొంది. ప్రధాన కూడళ్లు, వీధులు రద్దీగా మారాయి. – నెల్లూరు(బృందావనం) -
24న కలిగిరిలో జాబ్మేళా
నెల్లూరు(పొగతోట): ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయీమెంట్ ఆఫీస్, సీడాప్ సంయుక్తంగా ఈనెల 24వ తేదీన కలిగిరి ఏపీ మోడల్ స్కూల్లో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్దుల్ ఖయ్యూం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 14 కంపెనీలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీటెక్ చదివిన నిరుద్యోగులు హాజరుకావొచ్చన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వివరాలకు 99888 53335, 87126 55686 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు.కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యకావలి(జలదంకి): కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం జలదంకి మండలం 9వ మైలులో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. 9వ మైలు ఎస్సీకాలనీకి చెందిన రామయ్య (30) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కావలి ఏరియా వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.పొదలకూరు నిమ్మ ధరలు (కిలో) పెద్దవి: రూ. 90 సన్నవి: రూ. 70 పండ్లు: రూ. 45 -
అధికలోడు.. ప్రాణాలకు ముప్పు
నిత్యం ప్రమాదాలుచిల్లకూరు: కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మట్టి, ఇసుక, గ్రావెల్, సిలికా, బొగ్గు, క్వార్ట్ ్జ తరలింపు ఇష్టారాజ్యంగా జరుగుతోంది. ప్రధాన రహదారిపై ఖనిజాలను రవాణా చేసే సమయంలో నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలి. అయితే వాహనాల యజమానులు తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. చిల్లకూరు మండలంలో సాగరమాల రహదారి నిర్మాణం చేపట్టడంతో నిత్యం వందల సంఖ్యలో టిప్పర్లు అధికలోడుతో మట్టిని తరలిస్తున్నాయి. అలాగే తీర ప్రాంతంలో ఉన్న గనుల నుంచి ఇతర రాష్ట్రాలకు సిలికాను లారీలు, టిప్పర్లలో మోతాదుకు మించి లోడు చేసి తరలించేస్తున్నారు. ఇంకా సైదాపురం, గూడూరు రూరల్ ప్రాంతాల్లోని గనుల నుంచి నిత్యం పదుల సంఖ్యలో తెల్లరాయిని తరలించే లారీలు కనీస నిబంధనలు పాటించడం లేదని విమర్శలున్నాయి. కృష్ణపట్నం పోర్టు నుంచి చైన్నెతోపాటుగా శ్రీసిటీలోని పలు పరిశ్రమలకు బొగ్గును తరలించే లారీలు, టిప్పర్లు కూడా మోతాదుకు మించి అధికలోడుతో నిత్యం వెళ్తుంటాయి. పట్టించుకోకుండా.. నిత్యం అధికలోడుతో వాహనాలు తరలి వెళ్తున్నా గనులు, రెవెన్యూ, రవాణా, పోలీస్ శాఖలు కనీసం పట్టించుకున్న దాఖలాల్లేవు. ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో మాత్రమే హడావుడి చేసి లారీలు, టిప్పర్ల యజమానులతో చర్చించి వ్యవహారం పెద్దది కాకుండా జాగ్రత్తలు పాటించి సర్దుబాటు చేస్తున్నారని విమర్శలున్నాయి. దీంతో వాహనాల యజమానులు కూడా ఆయా శాఖల అధికారులను ప్రసన్నం చేసుకునేందుకు నెలవారీ మామూళ్లను సమర్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతోనే వాహనాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. స్పష్టత లేకపోవడంతో.. ఖనిజ సంపద పెద్ద మొత్తంలో తరలించే సమయంలో ప్రమాదాలు జరిగితే పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత రవాణా శాఖాధికారులు ఆ వాహనాన్ని తనిఖీ చేసి నిబంధనలు పాటించారా?, లేదా? అనే విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. అయితే వాటికి తిలోదకాలు ఇచ్చినట్లు విమర్శలున్నాయి. అధికలోడుతో వెళ్తూ ప్రమాదానికి గురైన వాహనంలో ఎలాంటి ఖనిజ సంపద ఉంది?, దీనికి అనుమతులున్నాయా? అనే విషయాలతోపాటు ఎంతమేర రవాణా చేయాలి?, ఎంత చేస్తున్నారు? అనే అంశాలను గనుల శాఖాధికారులు పరిశీలించాల్సి ఉంది. దీనిపై వారికి స్పష్టత లేకపోవడంతో దృష్టి పెట్టడం లేదని చెబుతున్నారు. పోలీస్ శాఖ తూతూమంత్రంగా కేసు నమోదు చేయడం అటు తర్వాత వాహనాన్ని వదలి వేయడంతో బాధితులకు సరైనా న్యాయం జరగడం లేదనే విమర్శలున్నాయి. అన్ని శాఖల ఉన్నతాధికారులు అధికలోడు వాహనాలను కట్టడి చేసేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. ఇష్టారాజ్యంగా వాహన రాకపోకలు కూటమి ప్రభుత్వంలో ఇదీ పరిస్థితి లోడు అధికంగా వేస్తున్నా చోద్యంచూస్తున్న అధికారులు తరచూ రోడ్డు ప్రమాదాలు మామూళ్లే కారణమా?మట్టి, ఇసుక, గ్రావెల్, సిలికా, బొగ్గు, తెల్లరాయిని అధిక మోతాదులో తరలించే లారీలు, టిప్పర్లతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల మండల తీర ప్రాంతంలోని చింతవరం గ్రామం వద్ద గొర్రెల మందపైకి మట్టిని తరలించే టిప్పర్ దూసుకెళ్లింది. దీంతో పదికిపైగా జీవాలు మృతిచెందాయి. గూడూరు రూరల్ ప్రాంతంలో అధికలోడుతో తెల్లరాయి తరలించే సమయంలో బ్రేక్లు పడకపోవడంతో బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే చిల్లకూరు మండలం సాగరమాల రహదారి నిర్మాణంలో భాగంగా మట్టిని అధికలోడుతో తీసుకెళ్తున్న టిప్పర్ తిక్కవరం గ్రామంలో బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొనడంతో చనిపోయాడు. అదేవిధంగా 17వ తేదీన కృష్ణపట్నం నుంచి శ్రీసిటీకి అధికలోడుతో వెళ్తున్న బొగ్గులారీ రోడ్డు పక్కనున్న ఆటోను ఢీకొనడంతో అందులో ప్రయాణించే ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. -
జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం
● ఏఐవైఎఫ్ నేతలు నెల్లూరు(వీఆర్సీసెంటర్): సీఎం చంద్రబాబు జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మరోసారి మోసం చేశాడని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మున్నా విమర్శించారు. నెల్లూరులోని సంతపేటలో ఉన్న సీపీఐ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ హామీ ఇచ్చారన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని, అదేవిధంగా నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మాయమాటలు చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చి నిరుద్యోగులను మోసం చేశాడని ఆరోపించారు. ఐదు సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలిస్తామని, ప్రతి ఏడాది జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ ద్వారా ఇస్తామని చంద్రబాబు, లోకేశ్లో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. నేడు 10,060 ఉద్యోగాలు భర్తీ చేస్తామని, వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ నెలలో విడుదల చేస్తామని చెప్పడం దారుణమన్నారు. అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తే డీఎస్సీ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. వెంటనే 50 వేల పోస్టుల ప్రక్రియను జాబ్ క్యాలెండర్ ద్వారా చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకపోతే లోకేశ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఏఐవైఎఫ్ నాయకులు బాదుల్లా, మీరా, గౌస్బాషా, షాన్వాజ్, సుబ్బరాయుడు, వాసుదేవరెడ్డి, శిరీషా తదితరులు పాల్గొన్నారు. -
పండగను ఆనందంగా జరుపుకోవాలి
నెల్లూరు(పొగతోట): పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లింలకు జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఉపవాస దీక్షలు, ప్రార్థనలు, దాన ధర్మాల ద్వారా పవిత్ర మాసం సహనం, సేవాభావాన్ని పెంపొందిస్తుందన్నారు. పండగను ఆనందంగా జరుపుకోవాలని తెలియజేశారు. ● నెల్లూరు(క్రైమ్): రంజాన్ పర్వదినం సందర్భంగా జిల్లాలోని ముస్లింలకు ఎస్పీ అజిత వేజెండ్ల శుక్రవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సేవాభావం, సామరస్యానికి ప్రతీక అయిన రంజాన్ పండగను ముస్లింలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాక్షించారు.చికెన్ వ్యర్థాల వాహనం స్వాధీనంపొదలకూరు: బెంగళూరు నుంచి రాపూరు, పొదలకూరు మీదుగా సంగంలో చేపల గుంతల వద్దకు చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న మినీలారీని పొదలకూరు పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై హనీఫ్ కథనం మేరకు.. రాపూరు నుంచి మినీలారీ వస్తుందనే సమాచారం తెలియడంతో మత్స్య, రెవెన్యూ శాఖల సహకారంతో పోలీసులు సీజ్ చేశారు. వాహనంలో 66 ప్లాస్టిక్ డ్రమ్ముల్లో వ్యర్థాలున్నట్టు గుర్తించారు. వాటిని డంపింగ్ యార్డు వద్ద గుంత తీసి పాతిపెట్టారు. నిందితులపై కేసు నమోదు చేశారు.ఆదిలక్ష్మీదేవికి వజ్రాల మంగళసూత్రం బహూకరణ రాపూరు: పెంచలకోనలో ఉన్న ఆదిలక్ష్మీదేవికి హైదరాబాద్కు చెందిన వసంతపు శ్రీనివాస్, మాధవి దంపతులు రూ.11 లక్షల విలువైన ఆభరణాలు శుక్రవారం బహూకరించినట్లు ఏసీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. అమ్మవారికి వజ్రాలతో కూడిన బంగారు మంగళసూత్రం, వెండి కాలిపట్టీలు, వెండి మెట్లు అందించినట్లు వెల్లడించారు. దాతలకు మూడు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించి, శేషవస్త్రం, తీర్థప్రసాదాలు అందించినట్లు వెల్లడించారు. -
ఇంటర్ మూల్యాంకనం వాయిదా
నెల్లూరు(టౌన్): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి శనివారం నుంచి ప్రారంభం కావాల్సిన జవాబుపత్రాల మూల్యాంనాన్ని రంజాన్ పండగ సందర్భంగా ఈనెల 22వ తేదీకి వాయిదా వేసినట్లు ఆర్ఐఓ వరప్రసాద్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలివిడత స్పెల్లో ఇంగ్లిష్, తెలుగు, హిందీ, మ్యాథ్స్, హిస్టరీ, ఎకనామిక్స్ సబ్జెక్టులకు సంబంధించి జవాబుపత్రాల మూల్యాంకనానికి విధుల్లో నియమించిన ఇన్విజిలేటర్లు ఆదివారం జరిగే స్పాట్ క్యాంపు కార్యాలయంలో రిపోర్టు చేయాలన్నారు. 25వ తేదీ నుంచి రెండో స్పెల్లో భాగంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, బయాలజీ, కామర్స్, సివిక్స్ సబ్జెక్టులకు సంబంధించి మూల్యాంకనం జరుగుతుందని వెల్లడించారు.కంటైనర్ లారీ ఢీకొని..● వ్యక్తి దుర్మరణం మనుబోలు: కంటైనర్ లారీ ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మల్లాంలో జరుగుతున్న ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కలువాయికి చెందిన చిట్టేపల్లి రమేష్ (38) గురువారం రాత్రి మోటార్బైక్పై బయలుదేరాడు. మండల పరిధిలోని కాగితాలపూరు క్రాస్రోడ్డు సమీపంలో వెనుక వస్తున్న కంటైనర్ లారీ బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో రమేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్సై శివరాకేష్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శుక్రవారం కేసు నమోదు చేశారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని..● యువకుడి మృతి చిట్టమూరు: మండల పరిధిలోని మల్లాం పంచాయతీ కోటిగుంట గిరిజన కాలనీకి వెళ్లే ములుపు వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని వాదనాల మహేష్ (25) అనే యువకుడు శుక్రవారం మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. కోట మండలం తిమ్మనాయుడుపాళెం గ్రామానికి చెందిన మహేష్ వాకాడు మండలం బుసపాళెం గ్రామంలో తమ బంధువుల వద్దకు వెళ్లాడు. తిరిగి బస్సు ఎక్కేందుకు నడిచి వస్తున్నాడు. ఈ క్రమంలో గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొని తలపైకి ఎక్కింది. దీంతో తల ఛిద్రమై గుర్తుపట్టలేని విధంగా మారింది. మహేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. అతని వద్ద ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. బుసపాళెంలోని బంధువుల ద్వారా మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాలిరెడ్డిపాళెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కారును ఢీకొట్టిన బైక్● ఒకరికి తీవ్రగాయాలు కోవూరు: మండల కేంద్రమైన కోవూరు సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. రామన్నపాళెం గ్రామానికి చెందిన నాగేంద్ర తన మోటార్బైక్పై నెల్లూరు వైపు నుంచి కావలి వైపునకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కోవూరులోని బీపీసీఎల్ పెట్రోల్ బంక్ సమీపంలోకి వచ్చేసరికి, అదే దిశలో వెళ్తున్న కారును వెనుక నుంచి బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నాగేంద్ర ఎగిరి రోడ్డుపై పడటంతో తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కోవూరు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని 108 అంబులెన్స్లో క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. కండలేరులో 48.480 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 48.480 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,050, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 255, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 80 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
అంగన్వాడీల్లో మెరుగైన విద్యాబోధన
● పీడీ హేనాసుజన్ మనుబోలు: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మెరుగైన విద్యాబోధన చేస్తారని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ హేనాసుజన్ అన్నారు. మనుబోలు మండల కేంద్రలోని పలు అంగన్వాడీ కేంద్రాలను శుక్రవారం ఆమె సందర్శించారు. చిన్నారులకు అందజేసే పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్య గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రైవేట్ స్కూళ్లతో పోలిస్తే ప్రభుత్వ అంగన్వాడీల్లో చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందన్నారు. ఆటపాటల ద్వారా విద్యాబోధన చేస్తారని తెలిపారు. ఆమె వెంట ఐసీడీఎస్ సీడీపీఓ విజయలక్ష్మి, సూపర్వైజర్లు ఆదినారాయణమ్మ, పద్మజ తదితరులున్నారు. -
రైలెక్కే సమయంలో..
● పట్టు తప్పి కిందపడి యువకుడి మృతి చిల్లకూరు: కదిలే రైలును ఎక్కే క్రమంలో పట్టు తప్పి కిందపడి ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఓడూరు గ్రామానికి చెందిన పారిచెర్ల చరణ్ (28) కొంతకాలంగా తన అమ్మమ్మ గ్రామమైన నాయుడుపేట సమీపంలోని మన్నెమాలలో నివాసం ఉంటున్నాడు. అక్కడి నుంచి పనుల నిమిత్తం రోజూ నెల్లూరుకు రైలులో వెళ్లి తిరిగి ఇంటికి చేరుకుంటుంటాడు. ఈ క్రమంలోనే శుక్రవారం పనులు ముగించుకుని మెమూ రైల్లో నాయుడుపేటకు బయలుదేరాడు. ఓడూరు రైల్వేస్టేషన్ వచ్చిన తర్వాత తాగునీటి కోసం ప్లాట్ఫారంపైకి దిగాడు. తిరిగి రైలు బయలుదేరే సమయంలో వచ్చి ఎక్కే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో పట్టు తప్పి కిందపడటంతో అతను మృతిచెందాడు. ప్రయాణికులు గుర్తించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. అలాగే రైల్వేస్టేషన్ మాస్టర్ గూడూరు రైల్వే పోలీసులకు విషయం తెలియజేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేశారు. -
హౌసింగ్ కార్యాలయంపై మద్యం బాటిళ్లతో దాడి
● మందుబాబులా లేక ఆ శాఖ బాధితులా? ● పోలీసులకు ఏఈ ఫిర్యాదుపొదలకూరు: పట్టణంలోని హౌసింగ్ కార్యాలయంపై శుక్రవారం మద్యం బాటిళ్లతో గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేరు. వరండాలో పగిలిన బాటిళ్లు పెద్ద సంఖ్యలో పడ్డాయి. ఇది మందుబాబుల పనా లేక బిల్లులు సకాలంలో చేయలేదన్న కోపంతో ఎవరైనా బాధితులు ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడ్డారా? అనే అనుమానాలున్నాయి. ఉదయం కార్యాలయ సమయంలో వచ్చిన ఏఈ మహేష్, వర్క్ ఇన్స్పెక్టర్ దాసు సంతకాలు చేశారు. ఏఈ మరుపూరుకు, వర్క్ ఇన్స్పెక్టర్ తోడేరుకు క్యాంపునకు వెళ్లారు. కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వారు పదుల సంఖ్యలో బీరు, బ్రాందీ బాటిళ్లను కార్యాలయంపైకి విసిరారు. అంతటితో ఆగకుండా వరండాలో ఉన్న కుర్చీని విరగ్గొట్టి వెళ్లారు. ఈ కార్యాలయం పొదలకూరు – మనుబోలు మెయిన్రోడ్డు పక్కనే ఉంటుంది. ప్రహరీ పొడవునా దుకాణాలున్నాయి. పగటి వేళ జన సంచారం ఉంటుంది. పట్టపగలు ప్రభుత్వ కార్యాలయంపై దాడికి పాల్పడటం వింతగా ఉందని స్థానికులు అంటున్నారు. గృహ నిర్మాణ శాఖలో సకాలంలో బిల్లులు చేయకపోవడం లేదా పక్కాఇళ్లను మంజూరు చేయకపోవడం వంటి కారణాలతో ఎవరైనా ఈ దాడికి పాల్పడ్డారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. దీనికితోడు ఇటీవల హౌసింగ్ కార్యాలయం ప్రహరీ దారి మూసివేయడం తదితర కారణాలతో కూడా ఇలాంటి ఘటన జరిగి ఉండొచ్చని చెప్పుకొంటున్నారు. ఏఈ మహేష్ పీడీ, ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లి పొదలకూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. -
అవగాహనతోనే దంత వ్యాధులకు చెక్
అప్రమత్తంగా ఉండాలి ● దంతాల ఇన్ఫెక్షన్తో ఓరల్ కేన్సర్ రిస్క్ ● జిల్లాలో 3 లక్షల మందికి వివిధ సమస్యలు ● నేడు ప్రపంచ ఓరల్ హెల్త్ డే నెల్లూరు(అర్బన్): మనం తినే ఆహారం నోటి ద్వారానే శరీరంలోకి ప్రవేశిస్తుంది. అలాంటి నోటిని పరిశుభ్రంగా ఉంచుకోకపోవడంతో దంతాలు పుచ్చిపోతాయి. చిగుళ్లు గట్టిగా ఉండవు. చూడటానికి అసహ్యంగా కనిపిస్తాయి. ఫలితంగా నోటి జబ్బులతోపాటు గుండె జబ్బులు, షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని శాస్తవేత్తలు పేర్కొంటున్నారు. నోటిలో పలు ఇన్ఫెక్షన్లు సోకుతాయి. అంతేకాకుండా పుచ్చి పళ్లతో నలుగురిలో సక్రమంగా మాట్లాడలేక మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నోటి వ్యాధులను తగ్గించేందుకు మార్చి 20వ తేదీని ప్రపంచ ఓరల్ డేగా ప్రకటించి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగా జిల్లాలో శుక్రవారం జిల్లా వైద్యారోగ్య శాఖ, ఇతర వైద్యుల పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతాయి. అనేకమందికి.. భారతదేశంలో 70 శాతం మంది ప్రజలు దంత, నోటి సమస్యలతో బాధపడుతున్నారని శాస్త్రవేత్తలు తెలిపారు. నెల్లూరు జిల్లాలో సుమారు 3 లక్షల మందికి పైగా ఏదో ఒక దంత సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో చిన్నపిల్లల్లో ఎక్కువగా దంత క్షయ సమస్యలు కనిపిస్తున్నాయి. మారిన జీవనశైలి, జంక్ఫుడ్స్ వల్ల శుభ్రత లోపించి పిల్లల నుంచి పెద్దల వరకు దంత సమస్యలతో బాధపడుతున్నారు. నోటిలో పుండ్లు, పొక్కడం, చిగుళ్లు వాపు, గమ్ డిసీజెస్, దుర్వాసన వంటి సమస్యలు పెరుగుతున్నాయి. సమస్యలు తగ్గాలంటే.. దంత సమస్యలు లేకుండా ఉండాలంటే డాక్టర్ల సలహాలు పాటించాలి. వాటిలో ప్రధానంగా గుట్కా, ఖైనీ, పాన్పరాగ్, చుట్ట, బీడీ, సిగరెట్ లాంటి పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. వాటిని వినియోగిస్తే నోటి కేన్సర్లు ఎక్కువగా వస్తాయి. ఉదయం నిద్రలేచిన తర్వాత, రాత్రి పడుకోబోయే మందు రోజూ రెండు దఫాలుగా బ్రష్ చేసుకోవాలి. బ్రష్ను ప్రతి మూడునెలలకో దఫా మార్చాలి. ఆహారం తిన్న తర్వాత నోటిని మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచే దంత శుభ్రత అలవాటు చేయాలి. నిర్లక్ష్యం చేస్తే.. దంతాలు పుచ్చిపోవడం, చిగుళ్లలో చీము కారడం కేన్సర్కు నేరుగా కారణం కాదు. అయితే నోటిలో దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ల కారణంగా చిగుళ్లు వాచి, దవడ ఎముక మెత్తబడొచ్చు. అలాంటి పరిస్థితుల్లో నోటి టిష్యూలు దెబ్బతింటాయి. ఇలా జరగడం వల్ల నేరుగా కేన్సర్ను కలిగించకపోయినప్పటికీ ఆ రిస్క్ ను పెంచే ఫ్యాక్టర్గా మారొచ్చు. అందువల్ల దంత సమస్యలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలి. జంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. నోరు పొక్కినా, పుండు ఏర్పడినా, దంతాలు జిల్లుమని పిస్తూ చల్లటి వస్తువులను తినలేకపోయినా డాక్టర్ను సంప్రదించేలా ప్రోత్సహించాలి. ప్రతి ఆరునెలలకోసారి దంతాలు చెక్ చేయించుకోవాలి.దంత సమస్యలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. జంక్ ఫుడ్వల్ల చిన్నపిల్లలో కూడా పాలదంతాలు త్వరగా పుచ్చిపోతున్నాయి. మారిన జీవనశైలి వల్ల పెద్దల్లో సైతం ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి. దంతాలు రంగు మారుతున్నా, కొంచెం పుచ్చిపోయినా వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలి. ప్రాథమిక దశలో సులభతరంగా క్లీన్ చేసి సిమెంట్ పెట్టేస్తాం. నిర్లక్ష్యం చేస్తే రూట్ కెనాల్ లాంటి ఖరీదైన వైద్యం చేయించుకోవాల్సి వస్తుంది. పొగాకు అలవాటు పూర్తిగా మానాలి. గార, చిగురు తినేయడం లాంటి సమస్యలున్నప్పుడే డాక్టర్ ద్వారా వైద్య చికిత్స పొందాలి. ఆరునెలలకు ఒకసారి దంత పరీక్షలు చేయించుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రిలో పళ్లను క్లీన్ చేయడం, జ్ఞాన దంతాలను తొలగించడం, పుచ్చిన పళ్లకు సిమెంట్ పెట్టడం లాంటి సేవలు ఉచితంగా చేస్తున్నాం. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ ఎం.హిమబిందు, ఎండీఎస్, డెంటిస్ట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, నెల్లూరు -
గంగ కాలువలో మృతదేహం
సైదాపురం: రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఓ యువకుడు గురువారం గంగ కాలువలో చనిపోయి కనిపించడంతో బాధిత కుటుంబంలో విషాదం నెలకొంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మండలంలోని చాగణం గ్రామానికి చెందిన బంకాపూరి సుబ్బయ్య కుమారుడు మణికంఠ (19) గూడూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఆంజనేయ స్వామి గుడి వద్దకు వెళ్లి వస్తానంటూ ఇంట్లో నుంచి బైక్ తీసుకుని బయటకు వచ్చాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులకు సమాచారమిచ్చారు. మర్లపూడి సమీపంలో ఉన్న తెలుగుగంగ ప్రధాన కాలువ వద్ద బైక్ను గుర్తించారు. దీంతో ఎస్సై క్రాంతికుమార్ స్థానికుల ద్వారా కాలువలో గాలించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. గురువారం మధ్యాహ్నం డక్కిలి సమీపంలో ప్రవహిస్తున్న కండలేరు ప్రధాన కాలువ వద్ద మణికంట మృతదేహం కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారొచ్చి మృతదేహాన్ని బయటకు తీయించారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో రాగివైరు చోరీ● ముగ్గురు దొంగల అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో రాగివైరును చోరీ చేసిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం నెల్లూరులోని చిన్నబజారు పోలీస్స్టేషన్లో స్థానిక ఎస్సై అబ్దుల్ రజాక్ నిందితుల వివరాలను వెల్లడించారు. ఓల్డ్ జూబ్లీ హాస్పిటల్ సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఇటీవల గుర్తుతెలియని దొంగలు 200 మీటర్ల రాగివైర్ను చోరీ చేశారు. బీఎస్ఎన్ఎల్ ఇంజినీర్ రమేష్ ఈ ఘటనపై బుధవారం చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు నేతృత్వంలో ఎస్సై అబ్దుల్ రజాక్ తన సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సాంకేతికత ఆధారంగా నిందితులు ముత్తుకూరుకు చెందిన కుమార్, రాజుపాళేనికి చెందిన వెంకయ్య, అయ్యప్పగుడి ప్రాంతానికి చెందిన ఖలీంగా గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం సీఏఎం హైస్కూల్ ప్రాంగణంలో నిందితులను అరెస్ట్ చేసి 40 మీటర్ల రాగివైరును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసిన ఎస్సై, హెచ్సీ సురేష్, పీసీలు వర్ధన్, సుబ్బారావు, దయాశంకర్, దేవాయ నాయుడును ఉన్నతాధికారులు అభినందించారు. -
కూల్డ్రింక్స్ లారీ బోలా్త
● రోడ్డుపై పడిపోయిన శీతల పానీయాలు ● నిమిషాల వ్యవధిలో ఎత్తుకెళ్లిన స్థానికులునెల్లూరు(క్రైమ్): కూల్డ్రింక్స్ లారీ బోల్తా పడిన ఘటన బుజబుజనెల్లూరు జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. సౌత్ ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు.. కూల్డ్రింక్స్ లోడ్తో లారీ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నుంచి బుచ్చిరెడ్డిపాళేనికి బయలుదేరింది. వరికోత మెషీన్ను చైన్నె నుంచి హైదరాబాద్ తీసుకెళ్తున్న లారీ బుజబుజనెల్లూరు వద్ద కూల్డ్రింక్స్ లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఢీకొంది. దీంతో కూల్డ్రింక్స్ లారీ అదుపుతప్పి డివైడర్ను ఢీకొంటూ వెళ్లి బోల్తా పడింది. ఆ లారీ డ్రైవర్, క్లీనర్కు ఎలాంటి గాయాలు కాలేదు. కూల్డ్రింక్స్ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో స్థానికులు, అటుగా వెళ్తున్న వారు నిమిషాల వ్యవధిలో బాటిళ్లను తీసుకెళ్లిపోయారు. ప్రమాద ఘటనతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. సమాచారం అందుకున్న సౌత్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను పునరుద్ధరించారు. ప్రమాదానికి కారణమైన లారీని అదుపులోకి తీసుకున్నారు. కూల్డ్రింక్స్ లారీ డ్రైవర్ మోహిత్కుమార్ రామ్ ఫిర్యాదు మేరకు సౌత్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని..
● గుర్తుతెలియని వ్యక్తి మృతి నెల్లూరు(క్రైమ్): రోడ్డు దాటుతున్న గుర్తుతెలియని వ్యక్తిని ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన నెల్లూరులో చింతారెడ్డిపాళెం క్రాస్రోడ్డు సమీపంలో చైన్నె వైపు వెళ్లే రహదారిపై గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న నార్త్ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయస్సు 50 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. 13/1వార్డు వీఆర్వో చిన్న ధనయ్య ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 94407 00095, 98856 67799, 94414 44399 ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని నార్త్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ కోరారు. -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 17 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 72,332 మంది స్వామిని దర్శించుకున్నారు. 21,852 మంది తలనీలాలు అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.53 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. టికెట్లు లేనివారు 12 గంటల్లో, ప్రత్యేక టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.కండలేరులో 48.740 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 48.740 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,800, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 255, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
పరిహారం.. రైతులతో చెలగాటం
చిల్లకూరు: క్రిస్సిటీకి సేకరించిన భూములకు సంబంధించి పరిహారం అందించే విషయంలో అధికారుల తీరును రైతులు తప్పు పడుతున్నారు. కోట మండలంలో ఒకలా.. చిల్లకూరు మండలంలో ఒకలా ధరలు నిర్ణయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిల్లకూరు మండలం తమ్మినపట్నం రెవెన్యూ పరిధిలో సుమారు 116 ఎకరాలు, కోట మండలం కొత్తపట్నం రెవెన్యూ పరిధిలో సుమారు 105 ఎకరాల వరకు పట్టా భూములను రెండు సంవత్సరం క్రితం సేకరించారు. వీటికి పరిహారం అందించే విషయంలో కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కించింది. దీంతో రైతులు పలుమార్లు ఆందోళనలు చేపట్టారు. అలాగే ఆ భూముల్లో సాగుకు సిద్ధమయ్యారు. పట్టా భూములకు ఎట్టకేలకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ఎంత ఇవ్వాలనే విషయంపై రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకోలేదు. అధికారులే రియల్ ఎస్టేట్లో ప్లాట్ ధరలు ఏ విధంగా ఉంటాయో అలా ధరలు నిర్ణయించి పరిహారం అందించాలని ప్రయత్నిస్తున్నారు. దీంతో తాతల కాలం నుంచి సాగు చేసుకునే పట్టా భూములకు ఈ విధంగా ధరలు పెట్టడంపై రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని అధికారుల వద్ద బుధవారం మొరపెట్టుకోగా అవార్డు పూర్తి చేశాం. తీసుకెళ్లండి. లేకుంటే కోర్టులో జమ చేస్తాం. అక్కడ తీసుకోండని చెప్పడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. రైతుల అసంతృప్తి పట్టా, సీజేఎఫ్ఎస్, డీకేటీ, అసైన్మెంట్, ఇలా పలు రకాల కేటగిరీల్లో ఉన్న భూములను చిల్లకూరు, కోట మండలాల్లో ఏపీఐఐసీ సేకరించింది. క్రిస్సిటీ కోసం సేకరించిన భూములు అధిక భాగం చిల్లకూరు మండలంలోనే ఉన్నాయి. అయితే కోట మండలంలో పట్టా, సీజేఎఫ్ఎస్ భూములకు పరిహారం ఒకేలా ఇస్తున్నారు. కానీ చిల్లకూరు మండలంలో పట్టా భూమికి ఒక ధర, సీజేఎఫ్ఎస్ భూమికి ఒక ధర నిర్ణయించడంపై రైతులు మండిపడుతున్నారు. సేకరించిన భూములన్నీ క్రిస్సిటీ కోసమే అయితే రెండు మండలాల్లోని రైతుల మధ్య విభేదాలు సృష్టించేలా అధికారులు వ్యవహరించడం ఎంతవరకు సబబని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రెండు మండలాలకు ఒకేలా పరిహారం ఇవ్వాలని గతంలో ఆందోళనలు చేపట్టిన సమయంలో అంగీకరించిన అధికారులు నేడు గుట్టుచప్పుడు కాకుండా ధరలు నిర్ణయించడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. చెక్కులు తీసుకెళ్లాలని చెప్పడం సరైన నిర్ణయం కాదని రైతులు అంటున్నారు. పక్క మండలంలో పట్టా భూములు, సీజేఎఫ్ఎస్ భూములకు పరిహారం ఎలా ఇస్తున్నారో అలానే చిల్లకూరు మండలంలో కూడా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళనలు చేపడతామని చెబుతున్నారు. కోట మండలంలో ఒకలా.. చిల్లకూరు మండలంలో మరోలా.. అధికారుల నిర్ణయంపై విస్మయం రియల్ ఎస్టేట్ ధరల్లా పరిహారం చెల్లింపు అవార్డు తీసుకెళ్లాలని ఒత్తిడి -
టీడీపీ నాయకుడిని అరెస్ట్ చేయాలంటూ..
● పోలీస్స్టేషన్ ఎదుట దళిత సంఘాల నిరసన ● డీఎస్పీకి వినతిపత్రం అందజేత విడవలూరు: మండలంలోని ముదివర్తి గ్రామం దళితవాడకు చెందిన పట్టపు రోహిత్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు కారణమైన టీడీపీ నాయకుడు ఫేక్ రఫీపై బలమైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. గురువారం స్థానిక పోలీస్స్టేషన్ నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్లు సాల్మన్ రాజ్, బీఆర్మీ రాష్ట్ర నాయకుడు పొంగులూరు ప్రసాద్ మాట్లాడుతూ రోహిత్ విషయంలో పోలీసుల వైఖరి మార్చుకోవాలన్నారు. లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామన్నారు. బీఎస్పీ నాయకురాలు అరుణమ్మ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై దాడులు పెరిగాయన్నారు. యువకుడిని కులం పేరుతో దూషించి ఆత్మహత్యాయత్నం చేసుకునేలా ప్రేరేపించిన రఫీపై స్టేషన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. న్యాయం చేయకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతామన్నారు. న్యాయం చేయాలి రోహిత్ను అవమానించిన వ్యక్తిని పోలీసులు చట్టపరంగా కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు పట్టపు నాగరత్నం, ప్రశాంతి, తమ్ముడు రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. టీడీపీ నాయకుడు రఫీపై బలమైన కేసు నమోదు చేసి అరెస్ట్ చేయకపోతే పోలీస్స్టేషన్ ఎదుట గడ్డిమందు తాగి చనిపోతామని తెలియజేశారు. రఫీని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని స్థానికులు కోరారు. డీఎస్పీకి వినతి పోలీస్స్టేషన్కు వచ్చిన రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావుకు రోహిత్ తల్లితండ్రులు, స్థానికులు, దళిత సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. దళితులమని తమపై చిన్నచూపు చూడటం తగదన్నారు. రఫీని వెంటనే అదుపులోకి తీసుకోవాలని కోరారు. సెల్ఫీ వీడియో ఆధారంగానే కేసు నమోదు చేయడం జరిగిందని, కేసును పూర్తిగా విచారిస్తామని, అవసరమైతే వేరే సెక్షన్లు కూడా కలిపి న్యాయం చేస్తామని డీఎస్పీ తెలియజేశారు. కార్యక్రమంలో అంబేడ్కర్ రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు దానం మాల్యాద్రి, నాయకులు ముసలి నరేంద్ర, స్థానిక మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
రచ్చబండను ఢీకొట్టిన బైక్
● ఇద్దరు యువకుల దుర్మరణం ● చిత్తలూరులో విషాదం చేజర్ల: మోటార్బైక్ అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి రచ్చబండను ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి మండలంలోని చిత్తలూరులో జరిగింది. చేజర్ల పోలీసుల కథనం మేరకు.. మండలంలోని చిత్తలూరు ఎస్సీ కాలనీకి చెందిన సిద్ధి మురళి (25), సిద్ధి హరీష్ (26) పని నిమిత్తం పొదలకూరు పట్టణానికి బైక్పై వెళ్లి అర్ధరాత్రి స్వగ్రామానికి వస్తున్నారు. బైక్ వేగంగా గ్రామంలోకి ప్రవేశించగానే అదుపుతప్పి ఆర్అండ్బీ రోడ్డు పక్కనే ఉన్న రచ్చబండను ఢీకొట్టింది. దీంతో హరీష్, మురళి అక్కడికక్కడే మృతి చెందారు. తెల్లవారుజామున ఆ దారిన వెళ్లే వాహనచోదకులు చూసి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. ఇంటికి 200 మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది. హరీష్కు ఇటీవల వివాహమైంది. మురళీకి వివాహమై చిన్నబాబు ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని గురువారం ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, సంగం సీఐ శ్రీనివాసులురెడ్డి, చేజర్ల ఎస్సై తిరుమలరావు పరిశీలించారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి కావలి రూరల్: కావలి రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని కొండాయగారిపాళేనికి చెందిన మన్నెం మాల్యాద్రి (50) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. రూరల్ ఎస్సై తిరుమలరెడ్డి కథనం మేరకు.. మాల్యాద్రికి మద్యం తాగే అలవాటు ఉంది. బుధవారం ఉదయం బుడంగుంట నక్కల కాలనీలో ఉన్న తన అక్క మల్లేశ్వరి ఇంటికి వెళ్లాడు. తిరిగి రాత్రి తన ఇంటికి వచ్చి వరండాలో నిద్రపోయాడు. 11 గంటల సమయంలో భార్య నిద్ర లేపేందుకు ప్రయత్నించింది. అయితే అతని నుంచి స్పందన లేకపోవడంతో బంధువులకు సమాచారం ఇచ్చింది. 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరీక్షించగా మృతిచెందినట్లు నిర్ధారించారు. మల్లేశ్వరి తన తమ్ముడి మృతిపై అనుమానాలున్నటు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేశారు.సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం● జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య నెల్లూరు(పొగతోట): గిరిజనులు, ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య అన్నారు. గురువారం నెల్లూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గిరిజనులు, ఆదివాసీల సమస్యల పరిష్కారం విషయంలో నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనివ్వనని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏకలవ్య విద్యాలయాల స్థాపనకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశామన్నారు. గిరిజనుల సమస్యలను నేరుగా లేదా ఈ – మెయిల్ ద్వారా కమిషన్ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు. వచ్చే నెలలో ఏపీలో గిరిజనుల సమస్యలు, బడ్జెట్ వినియోగంపై ప్రత్యేక సమావేశం జరుగుతుందన్నారు. ఎస్టీల అభివృద్ధికి కేంద్రం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. ఉదయగిరి, కోవూరు, సర్వేపల్లి ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఎస్టీల సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. తొలుత ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు తమ పరిధిలో జరిగే కార్యక్రమాలను వివరించారు. ఎన్జీఓలు, గిరిజనుల సంక్షేమ సంఘం నాయకులు సమస్యలను చైర్మన్కు వివరించారు. సమావేశంలో ఎస్పీ అజిత, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
చలో జువ్వలదిన్నెను జయప్రదం చేయండి
● మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి కావలి: జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి వ్యతిరేకంగా శుక్రవారం జరిగే చలో జువ్వలదిన్నె కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి కోరారు. కావలిలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కు 70 ఎకరాల స్థలాన్ని సేకరించి అభివృద్ధి చేశారన్నారు. 29.5 ఎకరాల భూమిని ప్రైవేట్ సంస్థ అయిన సాగర్ డిఫెన్స్ సంస్థకు అప్పజెప్పడం మంచి పద్ధతి కాదన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు తాము, తమ పార్టీ వ్యతిరేకం కాదన్నారు. వారికి స్థలాన్ని వేరేచోట ఇచ్చి స్థానిక ప్రజలకు ఉపాధి కల్పిస్తే మంచిదన్నారు. కానీ హార్బర్ కోసం సేకరించిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. శుక్రవారం కావలి వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి చలో జువ్వలదిన్నె కార్యక్రమం జరుగుతుందన్నారు. దీనికి పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, నాయకులు విచ్చేస్తారన్నారు. తీర ప్రాంత ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రూరల్ మండల అధ్యక్షుడు వాయిల తిరుపతి, సీఆర్పాళెం సర్పంచ్ గిరిబాబు, జువ్వలదిన్నె సర్పంచ్ గోవిందస్వామి, అన్నగారిపాళెం ఎంపీటీసీ సభ్యులు పి.శ్రీనివాసులు, గంగన్నగారి యోధశ్రీ, పెద్దపట్టపుపాళెం ఎంపీటీసీ వాయిల రాధాకృష్ణ, వెంకట్రావు, పౌలు తదితరులు పాల్గొన్నారు. -
సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఉగాది
కలెక్టరేట్లో ఉగాది సంబరాలు ● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(దర్గామిట్ట): ఉగాది.. పండగ మాత్రమే కాదని, సంప్రదాయాల సుగంధం, మన సంస్కృతి గొప్పతనాన్ని ప్రతిబింబించే వేడుక అని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఉగాది సంబరాలను వేడుకగా గురువారం నిర్వహించారు. తొలుత జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలో అన్ని రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను గతేడాదిలో విజయవంతంగా కొనసాగించామని, ప్రజల సహకారం, అధికారుల సమన్వయంతో ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఇదే ఉత్సాహంతో ఈ ఏడాది మరింత అభివృద్ధి సాధించాలని కాంక్షించారు. బాల్య వివాహాల నిర్మూలన, ప్రతి ఒక్కరికీ విద్య అందేలా కృషి చేయడం తదితర అంశాల్లో ప్రజలందరూ ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఉత్సాహంగా.. పరాభవ నామ సంవత్సరాది ఉగాది పంచాంగాన్ని ఆలూరి శిరోమణిశర్మ వినిపించారు. ప్రముఖ వేద పండితులను దేవదాయ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ సత్క రించారు. కవులు, కళాకారులు, వివిధ రంగాల ప్రము ఖులను సన్మానించారు. అనంతరం నిర్వహించిన కవి సమ్మేళనం, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత కళాశాల విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇన్చార్జి డీ ఆర్వో మహేశ్వరరెడ్డి, జిల్లా టూరిజం అధికారి ఉషశ్రీ, ఆర్డీఓ అనూష, మెప్మా పీడీ లీలారాణి పాల్గొన్నారు. -
కూటమి పాలనలో అల్లాడుతున్న అన్నదాతలు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మనుబోలు: ‘ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆ మాటలు బోగస్. క్షేత్రస్థాయిలో మద్దతు ధర లభించక అన్నదాతలు అల్లాడుతున్నారు’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మనుబోలు కోదండరామపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అన్నదాతల సంక్షేమం కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వం మొక్కుబడిగా రూ.500 కోట్లు కేటాయించి చేతులు దులుపుకొందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన ధర ప్రకారం ధాన్యం పుట్టి రూ.20,306కి కొనుగోలు చేయాల్సి ఉండగా బీపీటీ కేవలం రూ.17 వేలకే వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేస్తూ దోచుకుంటున్నారని తెలిపారు. ఎంత ధాన్యమైనా కొనుగోలు చేసి 24 గంటల్లో నగదు రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పిన అధికారులు ఇప్పుడు మిన్నకుండిపోయారన్నారు. అధికారులను ఫోన్ ద్వారా సంప్రదిస్తే ప్రభుత్వం మాకు టార్గెట్ ఇచ్చిందని, అంతకు మించి కొనుగోలు చేయలేమని చేతులెత్తేస్తున్నారని మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ జమ కాలేదని, తుఫాన్ సమయంలో నాసిరకం విత్తనాలు సరఫరా చేశారని, అధికారులు సహకరించడం లేదని రైతులు తమ వద్ద గొల్లుమంటున్నారని తెలిపారు. సోమిరెడ్డి మిల్లర్లతో కుమ్మక్కు కాకుండా రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బండేపల్లి బ్రాంచ్ కెనాల్కు సంబంధించి తాము సేకరించిన భూములకు పరిహారం అందజేశామన్నారు. సోమిరెడ్డి మాత్రం కాంట్రాక్టర్ల వద్ద ముడుపులు తీసుకుని మట్టి పనులకు డబ్బులు చెల్లించాడని తెలిపారు. బోగస్ జాబ్మేళా జాబ్మేళాల పేరుతో సోమిరెడ్డి నిరుద్యోగులను మోసం చేస్తున్నాడని కాకాణి ధ్వజమెత్తారు. వెయ్యి మందికి పైగా ఉద్యోగాలిచ్చామని డబ్బాలు కొట్టుకుంటున్నారని, వారి వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తాము విచారణ చేసి నిగ్గుతేలుస్తామన్నారు. బోగస్ ఉద్యోగాలిచ్చి నిరుద్యోగుతో ఆటలాడుకోవడం తగదని హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్రెడ్డి, ముంగర రవీందర్రెడ్డి, గుర్రం ప్రభాకర్, బందిల వేణుగోపాల్, గిద్దంటి రమణయ్య, గుంజి రమేష్, ఆవుల తులసీరామ్, దాసరి భాస్కర్గౌడ్, కేవీఆర్ గౌడ్, చల్లా నవకోటి, తుపాకుల గిరి, భాస్కర్రెడ్డి, కోటేశ్వరగౌడ్, పార్థూ, సుధాకర్రెడ్డి, సుమంత్రెడ్డి, కమాలాకర్రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో సత్తా
నెల్లూరు(లీగల్): ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) బలపరిచిన అభ్యర్థి సీనియర్ న్యాయవాది సత్తు అంకయ్య సత్తా చాటారు. గత నెల 13వ తేదీ పోలింగ్ జరిగింది. బుధవారం ఫలితాలు వెల్లడించారు. నెల్లూరు నుంచి ఐదుగురు పోటీ చేశారు. ఏపీ బార్ కౌన్సిల్ మాజీ సభ్యులు సీనియర్ న్యాయవాది వేనాటి చంద్రశేఖర్రెడ్డి.. అంకయ్య మధ్య పోటీ తీవ్రంగా సాగింది. చివరికి అంకయ్యకు విజయం దక్కింది. ప్రస్తుతం ఆయన ఐలు జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా, నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అంకయ్యను సీనియర్ న్యాయవాదులు బీవీ రమణరెడ్డి, పి.విజయకుమార్రెడ్డి, కటారి అజయ్కుమార్, జి.బాలసుబ్రహ్మణ్యం, కుడుమల రవికుమార్, జల్లి పద్మాకర్, వేలూరు రంగరావు, సలీం అభినందించారు. జిల్లా కోర్టు ఆవరణలో ఐలు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అంకయ్యను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఐలు నాయకులు రమేష్, పీఎన్ సాయి, పి.కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
నెల్లూరురూరల్: జిల్లా ప్రజలకు ఉగాది పండగ శుభాకాంక్షలను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డిలు బుధవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. నూతన తెలుగు సంవత్సరంలో ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అధ్యాపకులను రిలీవ్ చేయాలినెల్లూరు(టౌన్): ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనానికి ఎగ్జామినర్లుగా నియమించిన అధ్యాపకులను ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్ రిలీవ్ చేయాలని ఆర్ఐఓ వరప్రసాద్రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలు ముగిసిన నేపథ్యంలో నెల్లూరులోని స్టోన్హౌస్పేటలో ఉన్న కేఏసీ కళాశాలలో ఈనెల 21వ తేదీ నుంచి స్పాట్ వాల్యుయేషన్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మొదటి విడతలో ఇంగ్లిష్, తెలుగు, హిందీ, గణితం, హిస్టరీ, ఎకనామిక్స్ సబ్జెక్టులు, 25వ తేదీ నుంచి రెండో విడతలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, బయాలజీ, కామర్స్, సివిక్స్ సబ్జెక్టులకు సంబంధించి జవాబుపత్రాల మూల్యాంకనం జరుగుతుందన్నారు. స్పాట్ వాల్యుయేషన్కు హాజరుకాని అధ్యాపకులు, రిలీవ్ చేయని కళాశాలల యాజమాన్యాలపై ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్వగ్రామానికి రాజశేఖర్ మృతదేహం ఆత్మకూరురూరల్: పాపసాని రాజశేఖర్ మృతదేహాన్ని దుబాయ్ నుంచి బుధవారం స్వగ్రామమైన మండలంలోని నారంపేటకు తీసుకొచ్చారు. స్థానికుల కథనం మేరకు.. రాజశేఖర్ దుబాయ్లో సైబర్ గేట్ డిఫెన్స్ సెక్యూరిటీ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతను కొద్దిరోజులుగా కుటుంబ సభ్యుల ఫోన్కు స్పందించలేదు. వారు ఆందోళన చెంది వివిధ మార్గాల ద్వారా అక్కడి కాన్సులేట్ను సంప్రదించారు. రాజశేఖర్ తాను నివాసముంటున్న అపార్ట్మెంట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం వచ్చింది. అతని పాస్పోర్ట్ గదిలో లేదు. దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి కావడంతో స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. అంత్యక్రియలు నిర్వహించారు.విధుల్లో ఉండగా..● గుండెపోటుతో ఎకై ్సజ్ కానిస్టేబుల్ మృతి ఆత్మకూరు: ఎకై ్సజ్ కానిస్టేబుల్ కె.రాఘవరావు (52) విధుల్లో ఉండగా తీవ్ర గుండెపోటుకు గురై మృతిచెందాడు. కార్యాలయ సిబ్బంది తెలిపిన వివరాల మేరకు.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సిబ్బంది మంగళవారం రాత్రి పలు గ్రామాల్లో దాడులు నిర్వహించేందుకు వెళ్లారు. ఈక్రమంలో రాఘవరావు కార్యాలయంలోనే సెంట్రీ విధులు నిర్వహిస్తున్నాడు. తెల్లవారుజామున తీవ్ర గుండెనొప్పితో బాధపడుతుండగా విధుల్లో ఉన్న మరో వ్యక్తి వెంటనే స్థానిక జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. రాఘవరావు ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం నరసయ్యపాళెం గ్రామానికి చెందిన వ్యక్తి. ఏడునెలల క్రితం కనిగిరి ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయం నుంచి బదిలీపై ఆత్మకూరుకు వచ్చాడు. అతడికి భార్య, కుమా రుడు ఉన్నారు. కానిస్టేబుల్ మృతి విషయం తెలుసుకున్న ఎకై ్సజ్ సీఐ కిశోర్, సిబ్బంది కృష్ణయ్య, విజయ్బాబు, మరికొందరు బుధవారం ప్రభుత్వాస్పత్రికి వచ్చి సంతాపం తెలిపారు. పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
నుడాలో అక్రమాలు
● కొనసాగిన ఏసీబీ తనిఖీలు ● పలు ఫైళ్ల పరిశీలన నెల్లూరు(బారకాసు): నగరంలోని నుడా కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీలు బుధవారం కూడా కొనసాగాయి. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు ఆధ్వర్యంలో రెండు బృందాలు సోదాలు చేశాయి. పలు అక్రమాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఒక బృందం కార్యాలయంలోని ప్రణాళికా విభాగంలో కీలకమైన ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు అధికారులు, కిందిస్థాయి ఉద్యోగులను విచారించారు. మరో బృందం ఆర్అండ్బీ, ప్రణాళికా విభాగాధికారుల సహకారంతో పలు భవనాలను పరిశీలించింది. ప్రభుత్వ నిబంధనల మేరకు చదరపు గజానికి రూ.165 నుంచి రూ.250లు వరకూ ఉండాలి. అయితే నుడా అధికారులు రూ.1 నుంచి రూ.93 వరకూ రేట్లు తక్కువగా అంచనా వేసి 45 భవనాలకు అనుమతులు మంజూరు చేశారని డీఎస్పీ తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వా ఖజానాకి రూ.కోట్లలో నష్టం వచ్చిందన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ పది శాతానికి మించిన వ్యత్యాసాలున్న అనేక భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేశారన్నారు. తుడా పరిధిలో ఉన్న పలు లేఅవుట్లపై నుడా అధికారులు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కార్యాలయంలో ముఖ్యమైన అనేక రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించలేదని గుర్తించామన్నారు. అదేవిధంగా ఫైల్ ప్రాసెసింగ్లో అసాధారణ జాప్యాలు జరిగినట్లుగా తెలుస్తుందన్నారు. అక్రమాలపై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు నివేదించనున్నామని డీఎస్పీ తెలిపారు. ఏసీబీ ఆకస్మిక తనిఖీలతో తమ అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనని నుడా కార్యాలయ అధికారులు, ఉద్యోగుల్లో గుబులు పట్టుకోగా మరోవైపు ఈ తనిఖీలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తనిఖీల ప్రక్రియలో ఏసీబీ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, విజయ్కుమార్, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. -
గిట్టుబాటు ధరల్లేక రైతుల ఆత్మహత్యలు
● నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి వాకాడు: ‘ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం వారిపై నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోంది’ అని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి విమర్శించారు. బుధవారం వాకాడులోని తన నివాసంలో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నాయకులు, రైతులతో రామ్కుమార్రెడ్డి ప్రత్యేక సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు మండలాలకు చెందిన రైతులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా రామ్కుమార్రెడ్డి మాట్లాడుతూ మిల్లర్లు ఒక్కటై రైతుల కష్టాన్ని అందినకాడికి దోచుకుపోతున్నారని విమర్శించారు. ఇప్పటికే రాష్ట్రంలో 22 నెలల్లో దాదాపు 500 మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాడ్పినట్లు అధికార గణాంకాల ద్వారా తెలిసిందన్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పైసా పరిహారం ఇచ్చిన పాపాన పోలేదన్నారు. గత ప్రభుత్వంలో జిలకర మసూరి ధాన్యం పుట్టి రూ.25 వేలు ధర పలికిందన్నారు. నేడు రూ. 18 వేలకు పడిపోయిందన్నారు. జగనన్న ప్రభుత్వం వస్తుందని, రైతులు ఆత్మహత్యలకు పాల్పడాల్సిన అవసరం లేదని నేదురుమల్లి భరోసా ఇచ్చారు. ఆయన తిరుపతి, నెల్లూరు జిల్లాల ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యుడు కొడవలూరు భక్తవత్సలరెడ్డి, వాకాడు, చిట్టమూరు మండల కన్వీనర్లు ఏనుగు సుధాకర్నాయుడు, సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి, నేతలు ఎన్.హిమకుమార్రెడ్డి, పి.రాజశేఖర్రెడ్డి, డి.నాగూర్రెడ్డి, జి.సుధాకర్రెడ్డి, జి.వెంకటేశ్వర్లురెడ్డి, ఎన్.శ్రీధర్రెడ్డి, పి.శశిరెడ్డి, ఎన్.పెంచలరెడ్డి, రవి, ఈ.వెంకటయ్య, శేషురెడ్డి, మణి తదితరులు పాల్గొన్నారు. -
చలో జువ్వలదిన్నె రేపు
● ఫిషింగ్ హార్బర్ను ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకుందాం ● మత్స్యకారుల భవిష్యత్కు అండగా నిలుద్దాం.. తరలిరండి బిట్రగుంట: మత్స్యకారుల జీవితాలను ఉజ్వలం చేసేందుకు బోగోలు మండలం జువ్వలదిన్నెలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఫిషింగ్ హార్బర్ను దొడ్డిదారిన ప్రైవేట్ పరం చేస్తున్న టీడీపీ నేతల కుట్రలను ఎదుర్కొనేందుకు చలో జువ్వలదిన్నె కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జువ్వలదిన్నెకు ఉత్తర, దక్షిణంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని తీర ప్రాంతాల మత్స్యకారులతో పాటు పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. సముద్రంపైనే ఆధారపడి జీవనం సాగించే మత్స్యకారులకు భరోసా కల్పించేందుకు.. ఉపాధి కోసం చైన్నె, గుజరాత్, మంగుళూరు వంటి దూరప్రాంతాలకు వలస వెళుతున్న మత్స్యకార యువకులకు స్థానికంగానే ఉపాధి కల్పించే లక్ష్యంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టారన్నారు. దీని ద్వారా ఒక మత్స్యకారులకే కాకుండా వేలాది మందికి ఇతరులకు పరోక్షంగా ఉపాధి లభిస్తుదన్నారు. శరవేగంగా నిర్మాణం పూర్తి చేయించారని, ఎన్నికలు రావడంతో వాయిదా పడిందన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఫిషింగ్ హార్బర్ను వర్చువల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించినప్పటికీ మత్స్యకారులకు అంకితం చేయకుండా, కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ ప్రయత్నాల ద్వారా వారి నోట్లో మట్టికొట్టే యత్నం చేస్తోందన్నారు. హార్బర్లో ప్రైవేట్ వ్యక్తులకు పెత్తనం అప్పగిస్తే స్థానిక మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. తీరంపై ప్రైవేట్ పెత్తనాన్ని అడ్డుకునే లక్ష్యంతో చలో జువ్వలదిన్నెకు శ్రీకారం చుట్టామని తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డితో పాటు పలువురు జిల్లా నేతలు పాల్గొననున్నట్లు తెలిపారు. -
మల్లాం ఆలయ ఆదాయానికి గండి
● దేవుడి సొమ్ము స్వాహా ● పాలకమండలి వ్యవహారశైలి వివాదాస్పదంచిట్టమూరు: మండలంలోని మల్లాం గ్రామంలో వెలసిన వళ్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పాలకమండలి తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. అలాగే వివిధ అంశాలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూజలకు సంబంధించిన ధరలను దేవదాయ శాఖ నిర్ణయించి బోర్డుపై ఉంచింది. అయితే అందుకు విరుద్ధంగా భక్తుల నుంచి అదనంగా వసూలు చేసి నిలువు దోపిడీ చేస్నున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో అన్నదాన పథకానికి రూ.13 వేలు తీసుకునేవారు. ప్రస్తుత రూ.20 వేలు తీసుకుంటున్నా సక్రమంగా కార్యక్రమం చేపట్టడం లేదని ప్రచారం జరుగుతోంది. పాలకమండలి కుటుంబ సభ్యుల పెత్తనం ఎక్కువ కావడంతో అన్నదానానికి ఉపయోగించే బియ్యం బస్తాలు కూడా విక్రయాలు జరుగుతున్నట్లు సమచారం. కొద్దిరోజుల క్రితం పలువురు నగదు కట్టి కల్యాణం జరిపించుకున్నారు. అయితే స్వామికి ఒకే పట్టువ స్త్రాలతో కల్యాణం జరిపించడాన్ని ఒకరు ప్రశ్నించి పాలకమండలి, పూజారులు, ఈఓకు చీవాట్లు పెట్టినట్లు సమాచారం. సమస్యలపై భక్తులు ప్రశ్ని స్తే మా ప్రభుత్వం.. మా ఇష్టం.. మీక్కు దిక్కున్నచోట చెప్పుకోండటంటూ సమాధానం వస్తోంది. గతంలో దర్శనానికి ఉచితంగా వెళ్లేవారు. ప్రస్తుతం టోకన్లు పెట్టి నగదు వసూలు చేస్తున్నట్లు భక్తులు తెలిపారు. బలవంతంగా ఖాళీ ఆలయానికి అనుసంధానంగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లో వ్యాపారాలు చేసుకుంటున్న వారిని బలవంతంగా ఖాళీ చేయిన్నట్లు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు తమ వర్గం వారికి చౌకగా రూ.4 వేలకే గదులు బాడుగకు ఇప్పిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. గతంలో ఆలయం ముందు పలువురు చిన్నపాటి వ్యాపారం చేసుకునే వారు. వారిని ఖాళీ చేయించి నూతనంగా అద్దె గదులు నిర్మిస్తున్నారు. అవి కూడా అధికార పార్టీకి చెందిన వారికి తక్కువ రేటుకు ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు. హుండీ కానుకల లెక్కింపులో, వందల ఎకరాల మాగాణి భూముల ఆదాయంపై గోప్యత పాటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాలపై ఆలయ ఈఓ పెంచల వరప్రసాద్రావును వివరణ కోరగా తాను కొత్తగా బాధ్యతలు తీసుకున్నానని, అన్ని లోపాలను గుర్తించి సరిచేసి దేవదాయ శాఖ నిబంధనల మేర పూజలను చేయిస్తామని చెప్పారు. -
పాలు కల్తీ చేస్తే కఠిన చర్యలు
● జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిణి నీరజ వింజమూరు(ఉదయగిరి): పాలు కల్తీ చేస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా కేసులు నమోదు చేస్తామని జిల్లా ఫుడ్ సేఫ్టీ అఽధికారిణి డాక్టర్ నీరజ తెలిపారు. వింజమూరులోని పలు పాల సేకరణ కేంద్రాలను ఆమె మంగళవారం తనిఖీ చేశారు. శాపింల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. ఈ సందర్భంగా పాలు సేకరించే ఏజెంట్లకు అవగహన కల్పించారు. సేకరణ సమయంలో కల్తీ పాలను గుర్తించే విధానం గురించి తెలిపారు. కల్తీ పాలు సేకరించినట్లు రుజువైతే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. -
ఆటోను ఢీకొట్టిన బొగ్గు లారీ
● ఐదుగురికి తీవ్రగాయాలుచిల్లకూరు: బొగ్గు లారీ వేగంగా ఆటోను ఢీకొట్టడంతో ఐదుగురు మహిళలకు తీవ్రగాయాలైన ఘటన మంగళవారం చిల్లకూరు పోలీస్స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. మండలంలోని ముత్యాలపాడు పంచాయతీ పరిధిలో రైటార్ సత్రానికి చెందిన సుగుణ, లక్ష్మమ్మ, బుజ్జమ్మ, వెంకటరమణమ్మ చిల్లకూరులోని పొదుపు కార్యాలయానికి వెళ్లారు. అలాగే అదే ప్రాంతానికి చెందిన శ్రావణి గూడూరు ఏరియా ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుని కార్యాలయానికి వచ్చింది. వీరంతా పని ముగించుకుని ఇంటికి తిరిగి ఆటోలో ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో పోలీస్స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కన ఆగి జ్యూస్ తాగి బయలుదేరారు. అదే సమయంలో కృష్ణపట్నం పోర్టు నుంచి శ్రీసిటీకి బొగ్గు లోడుతో వెళ్తున్న లారీ వెనుక నుంచి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో చిల్లకూరు 108 సిబ్బంది కృష్ణ, పెంచలయ్య ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వివరాలు తెలుసుకుని ప్రమాదానికి కారణమైన బొగ్గు లారీని స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బంధువే.. రాబందువు
● బస్సెక్కిస్తానంటూ తీసుకెళ్లి వృద్ధురాలి నిలువు దోపిడీ ● ఆ తర్వాత కాలువలోకి తోసేసిన వైనంకోవూరు: బంధువే.. రాబందువై ఓ వృద్ధురాలిని నిలువు దోపిడీ చేసి.. కాలువలోకి నెట్టిన ఘటన మండలంలోని జమ్మిపాళెంలో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కావలి పప్పులమిల్లు ప్రాంతానికి చెందిన జలదంకి లక్ష్మీరాజ్యం ఆదివారం మండలంలోని వేగూరులో ఉన్న తన అక్క ఇంటికొచ్చింది. సోమవారం ఆమె తిరిగి కావలికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇంతలో అక్క కుమారుడు సతీష్ లక్ష్మీరాజ్యంను ఆటోలో ఎక్కించుకుని ఆత్మకూరు బస్టాండ్లో బస్సు ఎక్కిస్తానని బయలుదేరాడు. కానీ ఆమెను దగదర్తి, అల్లూరు, కోవూ రు పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు తిప్పా డు. తర్వాత జమ్మిపాళెంలోని హైవే బ్రిడ్జిపైకి తీసుకెళ్లాడు. వృద్ధురాలి వద్ద ఉన్న బంగారు నగలను లాక్కొన్నాడు. ఆమె కేకలు వేయడంతో పక్కనే ఉన్న పంట కాలువలోకి తోసేసి పరారయ్యాడు. మంగళవారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ముత్యాలరావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో వృద్ధురాలిని క్షేమంగా బయటకు తీశారు. కేసు నమోదు చేశారు. సతీష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
12 గ్యాస్ సిలిండర్ల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలోని పలు హోటళ్లు, క్యాటరింగ్లు, టీ కేఫ్లు, ధాబాలపై మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. సబ్సిడీపై అందజేసే గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాల నిమిత్తం అక్రమంగా ఉపయోగిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. 12 సిలిండర్లను స్వాధీనం చేసుకుని సివిల్ సప్లయీస్ అధికారులకు అప్పగించారు. సంబంధిత యజమానులపై నిత్యావసరాల సరుకుల చట్టం సెక్షన్ 6 (ఏ) ప్రకారం చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శ్రీహరి తెలిపారు. పొదలకూరు నిమ్మధరలు (కిలో) పెద్దవి: రూ.75 సన్నవి: రూ.65 పండ్లు: రూ.40 -
టీచర్ల సమస్యలపై కలెక్టర్కు వినతి
నెల్లూరు(దర్గామిట్ట): ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్కారించాలని కోరుతూ నెల్లూరు కలెక్టరేట్లో కలెక్టర్ హిమాన్షు శుక్లాను మంగళవారం ఏపీ వైఎస్సార్ టీఏ నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీఆర్సీ అమలయ్యే వరకు ఉద్యోగులకు కనీసం 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. పెండింగ్ కరువు భత్యాలను వెంటనే ఇవ్వాలన్నారు. ఉద్యోగుల సంపాదిత సెలవు బకాయిలను విడుదల చేయాలని, ఉద్యోగులు తమ అవసరాల కోసం దరఖాస్తు చేసిన పీఎఫ్ లోన్లు ఆలస్యం లేకుండా మంజూరు చేయాలన్నారు. ఈ సమస్యలను అత్యవసరంగా పరిగణించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్కి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఒ.శివశంకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి షేక్ మునీర్ జాన్, రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
పోలీసులకు ఉగాది సేవా పతకాలు
నెల్లూరు(క్రైమ్): ఉగాది పండగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన పోలీస్, విజిలెన్స్, సీఐడీ, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బందికి సేవా పతకాలను ప్రకటించింది. విజిలెన్స్ ఇన్స్పెక్టర్ కె.నరసింహారావు మహోన్నత సేవా పతకానికి ఎంపికయ్యారు. ఉత్తమ సేవా పతకాలు లభించిన వారిలో ఎస్సై ఎన్.శ్రీనివాస్ సింగ్ (డీసీఆర్బీ), లీడింగ్ ఫైర్మెన్ జి.శ్రీనివాసులు (రాపూరు ఫైర్స్టేషన్), సేవా పతకం లభించిన వారిలో డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు (నెల్లూరు రూరల్), ఆర్ఐ జె.హరిబాబు (డీఏఆర్), ఏఎస్సైలు వి.చెంగయ్య (సంతపేట), ఈ.శ్రీనివాసులు (డీసీఆర్బీ), ఎస్డీ జిలానీబాషా (ఏఆర్ ఎస్సై), హెచ్సీలు కె.హజరత్ (కొడవలూరు), ఒ.శ్రీనివాసులు (సీఐడీ), జి.చంద్రశేఖర్ (డీఏఆర్), పి.మాలకొండయ్య (డీఏఆర్), కానిస్టేబుళ్లు బి.జయంతికుమార్ (బిట్రగుంట), షేక్ సుల్తాన్ మొహిద్దీన్ (నవాబుపేట), పి.సన్యాసినాయుడు (డీఏఆర్), ఎస్ఎఫ్ఓ డి.హరిబాబు (ఉదయగిరి ఫైర్స్టేషన్), ఎల్ఎఫ్లు ఎ.సుధాకర్ (ఆత్మకూరు ఫైర్ స్టేషన్), జి.వెంకటేశ్వర్లు (మర్రిపాడు ఫైర్స్టేషన్), డ్రైవర్ ఆపరేటర్ బి.హరిబాబు (మర్రిపాడు ఫైర్స్టేషన్) ఉన్నారు.వి.చెంగయ్య, ఏఎస్సై, సంతపేట కె.నరసింహారావు, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, నెల్లూరు రూరల్ డీఎస్పీ -
కావలి కాలువలో మృతదేహం
సంగం: మండలంలోని సంగం సమీపంలో ఉన్న కావలి కాలువలో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించి వివరాలు సేకరించారు. మృతుడిని సంగం తిరమణతిప్ప ఎస్టీ కాలనీకి చెందిన కొమరగిరి పెంచలయ్యగా గుర్తించారు. మృతి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యనెల్లూరు(క్రైమ్): ఆర్థిక విభేదాలో?, కుటుంబ కలహాలో?, ఇతర కారణాలో తెలియదుగానీ చైన్నె టు పూరి ఎక్స్ప్రెస్ రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో నెల్లూరు వైపు వెళ్లే పట్టాలపై సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మృతుడు సుమారు 5.4 అడుగుల ఎత్తు ఉన్నాడు. ఎరుపు రంగు గళ్ల ఫుల్ హ్యాండ్స్ చొక్కా, బులుగు రంగు గళ్ల లుంగీ ధరించి ఉన్నాడు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా తయారైంది. నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. కండలేరులో 49.230 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 49.230 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,050, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 255, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణంగూడూరురూరల్: ఎల్ఐసీ కార్యాలయం సమీపంలోని రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. గూడూరు రూరల్ ఎస్సై తిరుపతయ్య కథనం మేరకు.. మనుబోలు మండలం కట్టువపల్లి గ్రామానికి చెందిన బత్తల ముత్యాలయ్య కుమారుడు చిన ముత్యాలయ్య అలియాస్ రఘు (35) గూడూరులోని ఆస్పత్రి రోడ్డులో ఉన్న ఓ ఫొటో ల్యాబ్లో పనిచేస్తున్నాడు. పట్టణంలోని గమళ్లపాళెం ప్రాంతంలో నివాసముంటున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మంగళవారం మధ్యాహ్నం వరకు అతను ల్యాబ్లో పనిచేసి యశ్వంత్ అనే స్నేహితుడితో కలిసి మోటార్బైక్పై జాతీయ రహదారి వైపు వెళుతున్నాడు. ఈ క్రమంలో ఎల్ఐసీ కార్యాలయం సమీపంలో ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయారు. అదే సమయంలో ఎదురుగా నడిచి వస్తున్న ఓ వ్యక్తిని తప్పించబోయి ఢీకొనడంతో బైక్పై నుంచి ఇద్దరూ రోడ్డుపై పడ్డారు. వెనుక కూర్చొని రఘు అక్కడికక్కడే మృతిచెందాడు. యశ్వంత్కు స్వల్ప గాయాలయ్యారు. 108 అంబులెన్స్లో గూడూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్సై కేసు నమోదు చేశారు. రఘు మృతి విషయం తెలిసి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించారు. -
వినతుల వెల్లువ
● పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి 140 మంది విచ్చేసి తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్ల దృష్టికి తీసుకెళ్లారు. వాటిని పరిశీలించిన ఆమె చట్టపరిధిలో పరిష్కరించాలని ఆయా ప్రాంత పోలీస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఫిర్యాదుల విభాగం సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● నా కొడుకు సాయివినయ్ ఉద్యోగ నిమిత్తం తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఇంతవరకూ తిరిగి రాలేదు. కావలి ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. కుమారుని ఆచూకీ కనుక్కోవాలని ఓ మహిళ కోరారు. ● వెంకట్ అనే వ్యక్తి నా వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు తన దగ్గర పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. విచారించి చర్యలు తీసుకోవాలని వేదాయపాళెం ప్రాంతానికి చెందిన ఓ మహిళ వినతిపత్రమిచ్చారు. ● ఉద్యోగం ఇప్పిస్తానని ఎన్టీఆర్ నగర్కు చెందిన రమేష్ నా వద్ద రూ.4.80 లక్షలు తీసుకుని మోసగించాడు. నగదు అడిగితే అంతు చూస్తామని బెదిరిస్తున్నాడని చిన్నబజారు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ● భర్త చెడు వ్యసనాలకు బానిసై నన్ను, ఇద్దరు పిల్లలను వదిలేసి వెళ్లాడు. కుటుంబ పోషణ భారంగా మారింది. అతని ఆచూకీ కనుక్కోవాలని గూడూరు రూరల్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు. -
మోటార్బైక్పై వెళ్తూ..
● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతివింజమూరు(ఉదయగిరి): మండలంలోని ఇందిరా నగర్ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మూలె జనార్దనరెడ్డి (39) సొంతూరు చేజర్ల మండలం నూతక్కివారికండ్రిక. వింజమూరు పట్టణంలోని యర్రబల్లిపాళెంలో వివాహం చేసుకుని కొన్నేళ్ల నుంచి ఇక్కడే కాపురముంటున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. అతను హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సోమవారం ఉదయగిరికి కోర్టు పనుల నిమిత్తం వెళ్లి తిరిగి ఊరికి బైక్పై బయలుదేరాడు. నిద్రమత్తు కారణంగా వాహనం అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఇంటి పెద్ద మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఘటనా స్థలాన్ని కలిగిరి సీఐ వెంకటనారాయణ, ఏఎస్సై జయరావు పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. గ్యాస్ సమస్యల పరిష్కారానికి కాల్ సెంటర్ నెల్లూరు(పొగతోట): గ్యాస్ సమస్యల పరిష్కారానికి జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కార్యాలయంలో కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో జాప్యం, అధిక ధరల వసూలు, బుకింగ్లో సమస్యలు ఉంటే వినియోగదారులు 94922 73897 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటారు. భర్త వేధింపులు తాళలేక.. ● వివాహిత ఆత్మహత్య నెల్లూరు(క్రైమ్): భర్త తీరుతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు అనగుంటకు చెందిన ప్రతాప్, మహిత (20)లు దంపతులు. వారిది ప్రేమ వివాహం. కొద్దిరోజులు సజావుగా సాగిన కాపురంలో కలతలు చోటుచేసుకున్నాయి. భర్త తరచూ ఆమెను నల్లగా ఉన్నావు.. అందంగా లేవంటూ మానసికంగా వేధించడంతోపాటు కొడుతుండేవాడు. దీంతో గతేడాది సెప్టెంబర్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మహితను ఆమె పెద్దమ్మ వెంకటసుబ్బమ్మ తన వెంట కడపకు తీసుకెళ్లింది. కొంతకాలం తర్వాత ప్రతాప్ అక్కడికెళ్లి బాగా చూసుకుంటానని నమ్మించి భార్యను కాపురానికి తీసుకెళ్లాడు. అయినా అతని తీరులో మార్పురాలేదు. పదిరోజుల క్రితం మహిత తన పెద్దమ్మకు ఫోన్ చేసి భర్త తీరును వివరించి కన్నీటి పర్యంతమైంది. ఆదివారం మహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని వెంకటసుబ్బమ్మకు ప్రతాప్ ఫోన్ చేసి చెప్పా డు. ఆమె ఈ విషయాన్ని హైదరాబాద్లో ఉంటున్న మహిత అన్న మంజునాథ్కు తెలియజేసింది. అతను నెల్లూరుకు చేరుకుని సోదరి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు. వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిత మృతికి ప్రతాప్ కారణమని అతడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. సోమవారం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.మా భూములు మాకే ఇప్పించండి● మోకాళ్లపై కూర్చుని పొదుపు మహిళల నిరసన కావలి రూరల్: మా భూములు మాకే ఇప్పించడంటూ కావలి మండలం చెన్నాయపాళెం పంచాయతీ పరిధిలోని పెద్దపట్టపుపాళేనికి చెందిన సుమారు 300 మంది పొదుపు మహిళలు సోమవారం వినూత్నంగా మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో గ్రామంలోని నిరుపేదలకు మహిళలకు ప్రభుత్వం భూములు మంజూరు చేసిందని తెలిపారు. అప్పట్లో నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో తాము గ్రామాన్ని వీడి బయట ప్రాంతాలకు వెళ్లామని చెప్పారు. ఆ సమయంలో కొందరు నాయకులు తమ భూములను ఆక్రమించుకుని వారి పేర్లపై అడంగళ్లు చేయించుకుని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆక్రమణదారుల చెర నుంచి తమ భూములను విడిపించాలని కోరుతూ పోరాటం సాగిస్తున్నామని తెలియజేశారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదని వాపోయారు. తమకు న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. అధికారులు స్పందించకపోతే మరింత పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జి.రత్నమ్మ, ప్రళయకావేరి తిరుపతమ్మ, కాటంగారి నరసమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పట్టపగలు.. యథేచ్ఛగా..
● అక్రమంగా గ్రావెల్ తరలింపు ● ఐదు ట్రాక్టర్లు, ఒక జేసీబీ సీజ్ పొదలకూరు: పట్టపగలు పొదలకూరుకు సమీపంలోని చిట్టేపల్లి తిప్ప నుంచి అక్రమంగా ట్రాక్టర్లలో గ్రావెల్ను తరలిస్తుండగా సోమవారం పోలీసులు సీజ్ చేశారు. ఎస్సై ఎస్కే హనీఫ్ గ్రావెల్ అనుమతులను అడిగితే ఏఎంఆర్కు నగదు చెల్లించి తోలుతున్నట్టు వెల్లడించారు. అయితే రోడ్డు ఎక్కిన తర్వాత ట్రిప్పునకు ఏఎంఆర్కు రూ.300 వంతున చెల్లిస్తుండగా క్వారీ నిర్వహణకు మాత్రం అనుమతి లేకపోడంతో ఎస్సై ఐదు ట్రాక్టర్లు, ఒక జేసీబీని సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. ఇప్పటికే చిట్టేపల్లి తిప్పను అక్రమార్కులు తవ్వేశారు. కొండ దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. ఎలాంటి అనుమతుల్లేకుండా ఇక్కడి నుంచి రేయింబళ్లు ఏఎంఆర్ పేరు చెబుతూ గ్రావెల్ను తరలించేస్తున్నారు. హౌసింగ్ గ్రావెల్ కూడా.. తిప్పపై హౌసింగ్ శాఖ ద్వారా నిర్మించిన ఇళ్లకు సంబంధించిన రోడ్లు, లెవలింగ్ గ్రావెల్ను కూడా అక్రమార్కులు వదిలిపెట్టలేదు. ఇటీవల దానిని సైతం తరలించి సొమ్ము చేసుకున్నారు. హౌసింగ్ అధికారులు పోలీసుల దృష్టికి సైతం తీసుకెళ్లారు. విద్యుత్ స్తంభాల చుట్టూ ఉన్న గ్రావెల్ను కూడా లోడేసి తరలించడంతో స్తంభాలు బలహీనంగా మారినట్టు తెలుస్తోంది. -
టీడీపీ నేత వేధింపులు
● దళిత యువకుడి ఆత్మహత్యాయత్నం విడవలూరు: ఓ టీడీపీ నేత వేధింపులతో దళిత యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సోమవారం మండలంలోని ముదివర్తిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ముదివర్తి దళితవాడకు చెందిన పట్టపు రోహిత్ అనే యువకుడు.. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. అయితే ఈ వ్యవహారం నచ్చని యువతి తల్లిదండ్రులు అప్పట్లో రాజకీయ ఒత్తిళ్లతో రోహిత్పై పోక్సో కేసు పెట్టించారు. అయితే ఈ కేసు హియరింగ్కు వచ్చిన క్రమంలో ఆ టీడీపీ నేతను రోహిత్ సోమవారం కలిసి న్యాయం చేయాలని కోరాడు. ఈ క్రమంలో అతడిని ‘నువ్వు దళితుడివి.. నీకు మా అమ్మాయి కావాలా?’ అంటూ కులవివక్షతో దూషించారు. ‘ఇక నీకు 14 ఏళ్లు జైలు శిక్ష పడటం ఖాయం.. ఆ జైలుకెళ్లి కుళ్లిపోవడం కంటే, గడ్డిమందు తాగి చావడం మేలు’ అంటూ కర్కశంగా మాట్లాడటంతో రోహిత్ తీవ్ర మానసికక్షోభకు గురయ్యాడు. టీడీపీ నేత హెచ్చరికలతో భయపడి, జీవితంపై విరక్తి చెందిన రోహిత్ సోమవారం గడ్డిమందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన చావుకు టీడీపీ నేతనే కారణమని పేర్కొన్నాడు. ఈ విషయం తెలిసి రోహిత్ను కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తతరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత దళితులు తమ బిడ్డను కులం పేరుతో అవమానించి, ఆత్మహత్యకు ప్రేరేపించిన టీడీపీ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డెత్ సర్టిఫికెట్ కోసం వినతి సైదాపురం: ‘మా అమ్మ ఏడాది క్రితం చనిపోయింది. డెత్ సర్టిఫికెట్ ఇవ్వండి’ అంటూ చీకవోలు గ్రామ సర్పంచ్ బట్టా వెంకటయ్య తహసీల్దార్ సుభద్రకు విన్నవించుకున్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. తమ పొలాన్ని మరొకరు ఆక్రమించుకున్నారు. సర్వేయర్ వచ్చినా కూడా సమస్య పరిష్కారం కావడం లేదంటూ రైతులు విన్నవించారు. -
విషాదం నింపిన రోడ్డు ప్రమాదం
● లారీని ఢీకొట్టిన ఆటో ● మహిళ దుర్మరణం కోవూరు: మండలంలోని జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొన్న ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. యల్లాయపాళెం గ్రామానికి చెందిన ఆయేషా (40)కు వివాహమైంది. ఆమె కుమార్తె సోఫియా అనారోగ్యంతో ఉంది. దీంతో నెల్లూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు చూపించేందుకు ఆయేషా, సోఫియా, ఇద్దరు కుటుంబ సభ్యులు ఆటోలో బయలుదేరారు. డాక్టర్ వద్ద చూపించాక తిరిగి గ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో కోవూరు సమీపంలోని చౌదరి (ఆర్కే) పెట్రోల్ బంక్ వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆటో అదుపుతప్పి వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. సిబ్బంది క్షతగాత్రులను నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆయేషా చనిపోయింది. ముగ్గురూ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేశారు. -
నగరంలో ఎక్కడి సమస్యలక్కడే..
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు ● ఎన్ఎంసీ కార్యాలయం ఎదుట మహా ధర్నా నెల్లూరు(బారకాసు): కార్పొరేషన్ పరిధిలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, వాటి పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మహా ధర్నా జరిగింది. తొలుత బారాషహీద్ దర్గా నుంచి ప్రజలతో కలిసి నాయకులు ర్యాలీగా బయలుదేరి కార్పొరేషన్ కార్యాలయం వద్దకు చేరుకుని అధికారుల నిర్లక్ష్యంపై నినాదాలు చేశారు. దీంతో అదనపు కమిషనర్ హిమబిందు వచ్చి ప్రజలు తీసుకొచ్చిన అర్జీలను స్వీకరించారు. ఎప్పటిలోగా సమస్యలు పరిష్కరిస్తారో హామీ ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. మూడు వారాల్లోగా పరిష్కరిస్తామన్నారు. సమస్యలు గాలికి.. రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ మంత్రి నారాయణ అమరావతి జపం చేస్తూ ప్రజా సమస్యలు గాలికొదిలేశారన్నారు. నగరంలో ఏ వార్డులో చూసినా కుళాయిల్లో కలుషిత నీరు సరఫరా అవుతోందన్నారు. దోమలు స్వైర విహారం చేస్తున్నాయన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించలేని పాలకులు కోర్టు నోటీసులు, బెదిరింపులు, దౌర్జన్యాలతో పన్నులు వసూలు చేయడం, దానిని ఘనతగా చెప్పుకోవడం మంచిపద్ధతి కాదని హితవు పలికారు. నగరంలో 70 శాతానికి పైగా ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం లేకపోవడం అత్యంత దారుణమన్నారు. ప్రజల నుంచి దౌర్జన్యంగా పన్నులు వసూలు చేసి ప్రైవేట్ ట్రాక్టర్లు, చెట్లు నాటే పేరుతో రూ.కోట్లను అధికార పార్టీ కార్యకర్తలు దోచుకుంటున్నారని, ఇది సరైన పద్ధతి కాదన్నారు. 53, 54 డివిజన్ల పరిధిలో ప్రభుత్వ బ్యాంక్ ఏర్పాటు చేయాలన్నారు. కాలువ కట్టలపై ఉన్న నిరుపేద దళితుల ఇళ్లను దౌర్జన్యంగా తొలగించే చర్యలు ఆపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నేతలు కత్తి శ్రీనివాసులు, జి.నాగేశ్వరరావు, షేక్ మస్తాన్బీ, పి.సూర్యనారాయణ, నరసింహ, కత్తి పద్మ, మూలం ప్రసాద్, ఎన్వీ సుబ్బమ్మ, అల్లంపాటి శ్రీనివాస్రెడ్డి, ఎం.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
నిత్యం గంజాయి, మద్యం విక్రయాలు
మా గ్రామంలో నిత్యం గంజాయి, మద్యం విక్రయిస్తున్నారు. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈనెల 14వ తేదీన గ్రామంలోని దేవాలయం వద్ద సమావేశం ఏర్పాటు చేసుకుని మద్యం విక్రయించవద్దని చెప్పినా పక్కరోజు ఆటోలో ఐదుగురు వ్యాపారులు మద్యం బాటిళ్లు దించుకుని బెల్టు షాపులు నిర్వహస్తున్నారు. అడిగితే దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరిస్తున్నారు. స్థానిక పోలీసులకు నెల మామూళ్లు ఇస్తున్నాం ఏం చేసుకుంటారో చేసుకోండంటున్నారు. – రాపూరు మండలం సైదాదుపల్లి గ్రామ బీసీకాలనీ వాసులు -
అధికారం శాశ్వతం కాదని గుర్తుంచుకోండి
నెల్లూరురూరల్: అధికారం శాశ్వత కాదని కూటమి పాలకులు గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకాలు చేస్తున్నారని, అక్రమ కేసులు బనాయించి పైశాచికానందం పొందుతున్నారని మండిపడ్డారు. జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న పిన్నెల్లి సోదరులను రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరురూరల్ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డితో కలిసి సోమవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందన్నారు. చంద్రబాబు ఆయన కుమారుడు లోకేశ్ కలిసి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని జైల్లో అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. వ్యవస్థలను అడ్డు పెట్టుకొని అరాచకాలు చేస్తే ఏదో ఒక రోజు ఆ వ్యవస్థ మీకు భూమ్రాంగ్ అవుతుందన్న విషయాన్ని గుర్తుచేసుకోవాలన్నారు. భవిష్యత్లో నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్లు వ్యవస్థలను తయారు చేస్తున్నారన్నారు. టీడీపీలోని రెండు వర్గాలు కొట్టుకుని చనిపోతే పిన్నెల్లిపై అక్రమ కేసులు బనాయించి చంద్రబాబు, ఆయన కుమారుడు పైశాచికానందం పొందుతున్నారన్నారు. ఇదే విషయం అప్పటి ఎస్పీ చెప్పారన్నారు. పిన్నెల్లికి మధుమేహ వ్యాధి ఉందని, ఆయనకు సక్రమంగా మందులు జైలు అధికారులు అందించడం లేదన్నారు. దీంతో ఆరోగ్యం దెబ్బతిని బరువును కూడా కోల్పోయారన్నారు. ఇది ఒక దుశ్చర్య అని, ఫలితం త్వరలోనే అనుభవిస్తారని హెచ్చరించారు.రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీలోని బలమైన నాయకులను ఎన్నుకుని అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపి ఈ ప్రభుత్వం పైశాచికానందం పొందుతుందన్నారు. పోలీసులు చార్జ్షీట్ వేసి 96 రోజులైందని, బెయిల్ రాకుండా అడ్డుకోవడం హేయమైన చర్య అన్నారు. పిన్నెల్లి సోదరులను జైల్లో హింసిస్తున్నారన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని జైలు అధికారులు గుర్తెరిగి ప్రవర్తించాలన్నారు. అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి వ్యవహరిస్తే, అధికారం కోల్పోయిన రోజు కాపాడడానికి ఎవరూ రారని హెచ్చరించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని కూటమి పాలకులు అరాచకం అక్రమ కేసులు బనాయించి పైశాచిక ఆనందం పొందుతున్నారు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని వికృత క్రీడకు తెరదీశారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -
అమరజీవికి నివాళి
నెల్లూరు(దర్గామిట్ట): పొట్టి శ్రీరాములు జయంతిని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించారు. అమరజీవి చిత్రపటానికి కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శివుడి వద్ద నాగేంద్రుడి దర్శనం ● విశ్వనాథస్వామి ఆలయంలో వింత మనుబోలు: మనుబోలులోని చెర్లోపల్లి రైల్వేగేటు సమీపంలో ఉన్న విశ్వనాథస్వామి ఆలయంలో సోమవారం విశిష్టతగా అర్చకుడు శ్రీనివాసులు శివ లింగానికి పూజలు చేస్తుండగా నాగేంద్రుడు మళ్లీ దర్శనమిచ్చాడు. ఇటీవల కాలంలో తరచూ ప్రత్యేక సందర్భాల్లో శివలింగం వెనుకనే ఉన్న పుట్టలో నుంచి నాగుపాము వచ్చి శివలింగం పక్కన పడగ విప్పి చాలాసేపు ఉంటుంది. సోమవారం కూడా అదే తరహాలో నాగేంద్రుడు శివలింగం వద్ద పడగ విప్పి ఉండగా ఫొటోలను కొందరు యువకులు తీసి సోషల్ మీడియాలో ఉంచారు. ఈ విషయం సంచలనంగా మారింది. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి నాగేంద్రుడిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 25న పాలిసెట్ ప్రవేశ పరీక్ష నెల్లూరు (టౌన్): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఏప్రిల్ 25న పాలిసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లుగా జిల్లా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష కోఆర్డినేటర్ ఎస్ రామారావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది రాపూరు, వెంకటగిరిలో కూడా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నామని చెప్పారు. వచ్చే నెల 1 నుంచి నెల్లూరులోని వెంకటేశ్వపురంలో ఉన్న ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశ పరీక్షకు సంబంధించి ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, డీసీసీపీ, తదితర సాంకేతిక కోర్సుల్లో శిక్షణ పొందిన వారికి కచ్చితంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో హెల్ప్లైన్ సెంటర్ను ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల సమాచారాన్ని 99123 42016 నంబరును సంప్రదించి పొందవచ్చని తెలిపారు. 28న జెడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్నట్లుగా జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు సమావేశం జరుగుతుందని చెప్పారు. విద్య, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్, ఆర్డబ్ల్యూఎస్, డీఆర్డీఏ, తదితర శాఖలపై సమీక్షించనున్నట్లుగా తెలిపారు. జిల్లా పరిషత్ సభ్యులు, జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. వెబ్సైట్లో సీనియారిటీ జాబితా నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన రెండో సీనియారిటీ జాబితాను http://deonellore.50.we bs.com వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ బాలాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తగిన ఆధారాలను సమర్పించాలని కోరారు. -
ప్రశాంతంగా పది పరీక్షలు
● తొలిరోజు 260 మంది గైర్హాజరు నెల్లూరు (టౌన్): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 174 సెంటర్లలో పరీక్షలను నిర్వహించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరిగాయి. తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 28,131 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 27,871 మంది రాశారు. 260 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షకు గంట ముందుగా విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించారు. హాల్ టికెట్ నంబర్లను పరీక్ష కేంద్రాల్లోని నోటీసు బోర్డుల్లో ప్రదర్శించారు. విద్యార్థులు తమ హాల్టికెట్ నంబరును ఏ గదిలో కేటాయించారో చూసుకుని లోపలికి వెళ్లారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి కేంద్రంలోకి అనుమతించారు. కలెక్టర్ హిమాన్షుశుక్లా సంతపేటలోని సెయింట్ జోసెఫ్ బాలికల హైస్కూల్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. డిస్ట్రిక్ట్ లెవల్ ఆఫీసరు రవీంద్రారెడ్డి ఏడు కేంద్రాలను తనిఖీ చేయగా, డీఈఓ బాలాజీరావు ఐదు కేంద్రాలు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినేషన్ 4 కేంద్రాలను పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద కోలాహలం తొలిరోజు పరీక్షకు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు రావడంతో పరీక్ష కేంద్రాల వద్ద కోలాహలం నెలకొంది. తొలుత పలువురు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు పరీక్ష రాసి వచ్చేంత వరకు తల్లి,దండ్రులు కేంద్రాల వద్ద పడిగాపులు కాశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో చెట్ల కింద సేద తీరారు. పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ను అమలు చేశారు. ఎక్కువ మంది అక్కడ లేకుండా పోలీసులు దూరంగా పంపించారు. ఓపెన్ స్కూల్ పది పరీక్షలకు 139 మంది గైర్హాజరు ఏపీ ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలకు సోమవా రం జిల్లా వ్యాప్తంగా 139 మంది అభ్యాసకులు గైర్హాజరయ్యారు. మొత్తం 1130 మందికి గానూ 991 మంది అభ్యాసకులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 15 సెంటర్లలో పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.30 గంటల వరకు జరిగాయి. -
అమరజీవి త్యాగం చిరస్మరణీయం
నెల్లూరురూరల్: అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని నగరంలోని జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సోమవారం కాకాణి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రత్యేక ఆంధ్రరాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు అని స్మరించుకున్నారు. ఆయన బలిదానం వల్లే 1953 అక్టోబర్ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైందన్నారు. ఆయన త్యాగం కేవలం ఆంధ్ర రాష్ట్రానికే పరిమితం కాలేదని, భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు బలమైన పునాదిగా నిలిచిందన్నారు. తెలుగు జాతి ఉన్నంత వరకు మహనీయుని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. పొట్టి శ్రీరాములు నడయాడిన నెల్లూరు జిల్లాకు ఆయన పేరు పెట్టాలని దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలు చేసినా ఫలితం లేదన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ అమరజీవి అభిమానుల కోరిక మేరకు మన జిల్లాకు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేసి ఆయన పేరును ప్రతినిత్యం స్మరించుకునే అవకాశాన్ని మనకు కల్పించారన్నారు. పొట్టి శ్రీరాములు ఆశయాలను గౌరవిస్తూ, ఆయనను స్మరించుకోవడం బాధ్యతగా భావిస్తున్నామన్నారు. -
జర్నలిస్టులపై ఇసుక మాఫియా దాడి
● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు ఫిర్యాదు నెల్లూరు (దర్గామిట్ట): జిల్లాలోని పెన్నా పరీవాహక ప్రాంతాల్లో అక్రమంగా సాగుతున్న ఇసుక రవాణాను వెలుగులోకి తెచ్చేందుకు వెళ్లిన జర్నలిస్టులపై ఇసుక మాఫియా ముఠా దాడికి తెగబడిందని, ఈ దౌర్జన్యంపై నెల్లూరు జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జేఏసీ ప్రతినిధులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకుడు జయరాజ్ మాట్లాడుతూ ఓ టీవీ చానల్ ప్రతినిధులు సురేంద్ర, కమలాపస్ మనోజ్, మహమ్మద్ షాహీన్, వెంకటగిరి, ఆత్మకూరు రిపోర్టర్లు కలిసి కలువాయి మండలంలోని రాజపాళెం, తెలుగురాయపురం, పొదలకూరు మండలంలోని విరువూరు రీచ్ల్లో జరుగుతున్న ఇసుక తవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లారన్నారు. విరువూరు రీచ్ వద్ద విజువల్స్ తీసుకుంటున్న సమయంలో కొందరు వ్యక్తులు జర్నలిస్టులను అడ్డుకున్నారన్నారు. బెదిరింపులతో పాటు దౌర్జన్యం చేస్తూ జర్నలిస్టుల కారును అడ్డగించి జర్నలిస్టులపై అసభ్య పదజాలంతో విరుచుకు పడ్డారన్నారు. ‘ఇక్కడికి ఎందుకు వచ్చారు.. విజువల్స్ ఎందుకు తీస్తున్నారు.. మిమ్మల్ని ఇక్కడే చంపేస్తాం’ అంటూ బెదిరించరని విన్నవించారు. కారు అద్దాలు పగులగొట్టే ప్రయత్నం చేయడమే కాకుండా, విధుల్లో ఉన్న జర్నలిస్టులను భయాందోళనలకు గురిచేశారన్నారు. ఈ ఘటనపై బాధితులు పొదలకూరు ఎస్సైకు సమాచారం అందించగా, ఆయన స్పందించిన తీరు వివాదాస్పదంగా ఉందన్నారు. ఇసుక మాఫియా వ్యక్తులకు వత్తాసు పలుకుతూ, జర్నలిస్టులనే ప్రశ్నించడం గమనార్హమని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డులు కూడా తమ వద్ద ఉన్నాయని మీడియా ప్రతినిధులు వివరించారు. నిజాయతీగా వార్తలు సేకరిస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని జేఏసీ నేతలు మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని వారు కలెక్టర్ను కోరారు. ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు సురేంద్ర, సునీల్, సాగర్రెడ్డి తదితరులు ఉన్నారు. -
పక్షి.. అడ్రస్ మారింది
పాలపిట్ట కింగ్ ఫిషర్ కాలగమనంలో చాలా మార్పులు వచ్చాయి. విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అనేక ఊర్లు కాంక్రీట్ జంగిల్గా మారిపోయాయి. సెల్ టవర్ల సంఖ్య పెరిగింది. వాహన కాలుష్యం రాజ్యమేలుతోంది. దీనికితోడు ఆహార కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొన్నిరకాల పక్షులు కనిపించడం అరుదుగా మారింది. గతంలో పట్టణాలు, నగరాల్లో అడపాదడపా కనిపించిన కొన్ని జాతుల పక్షులు నేడు గ్రామీణ ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఈ జనరేషన్ పిల్లలు కొన్నింటిని నేరుగా చూసిన పరిస్థితి లేదు. జిల్లాలోని పల్లె ప్రాంతాల్లో తీసిన చిత్రాలు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
మోటార్బైక్ను ఢీకొట్టిన వ్యాన్
● ఒకరి మృతి కలిగిరి: మోటార్బైక్ను వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో మూకిరి రత్నరాజు (40) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా వలపర్లకు చెందిన రత్నరాజు వింజమూరు మండలం గుండెమడకలలో పొగాకు బ్యారెన్ల వద్ద క్యూరింగ్ పనులు చేస్తున్నాడు. జాతీయ రహదారిపై కావలి వైపు నుంచి గుండెమడకలకు బైక్పై బయలుదేరాడు. అదే సమయంలో కావలి నుంచి కలిగిరి వెళ్తున్న మినీ పార్సిల్ వ్యాన్ పెద్దపాడు సమీపంలో వెనుక వైపు నుంచి బైక్ను ఢీకొట్టింది. దీంతో రత్నరాజు తలకు తీవ్రగాయాలై అక్కడికిక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో వచ్చిన 108 సిబ్బంది రత్నరాజు మృతిచెందినట్లు నిర్ధారించారు. కలిగిరి ఎస్సై ఉమాశంకర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రత్నరాజుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. -
భళా.. చిత్రకళ
దారంతో వివిధ రకాల చిత్రాలు ● మర్రిపాడు మండల వాసి ప్రతిభ ● ఎన్నో అవార్డులు సొంతం వేంకటేశ్వర స్వామి చిత్రం ఆత్మకూరు: ఆ మాస్టార్ దారం పట్టుకుంటే అద్భుత చిత్రాలు తయారవుతాయి. దేవుళ్లు, రాజుల చిత్రాలను దారంతో తయారు చేయడంలో ఆయనది అందెవేసిన చేయి. ఇప్పటికే ఆ కళను గుర్తించిన ‘అకాడమీ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్’ వారు అవార్డు అందజేశారు. పలువురు సినీనటులు అవార్డులు అందజేసిన సందర్భాలున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలం బూదవాడకు చెందిన మున్నెళ్లి శివశంకర్ అనంతసాగరం మండలం చిలకలమర్రి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు టీచర్గా పనిచేస్తున్నారు. ఇప్పటికే వందలాది దారపు చిత్రాలు తయారు చేసి ప్రశంసలు అందుకున్నారు. వినాయకచవితి, కృష్ణాష్టమి, వరలక్ష్మీవ్రతం, హనుమాన్ జయంతి, ఛత్రపతి శివాజీ జయంతి తదితర సందర్భాల్లో దారపు చిత్రాలను తయారు చేయడం శివశంకర్ ప్రత్యేకత. ఇలా చిత్రాలు రూపొందించే కళ జిల్లాలో మరెవరికీ లేకపోవడం గమనార్హం. ఈయన కళను గుర్తించిన అమెరికన్ విజ్డమ్ పీస్ అకాడమీ – బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ వారు గత నెల 28న అవార్డును ప్రకటించి తమిళనాడులోని హోసూరులో ప్రదానం చేశారు. వివిధ విభాగాల్లో సృజనాత్మక కళను ప్రదర్శించి గుర్తింపు పొందిన వారికి ఈ సంస్థ అవార్డులు అందస్తుంది. ఎక్కడా చూడలేదు గతేడాది నెల్లూరుకు వచ్చిన ప్రముఖ సినీనటుడు, మాజీ మంత్రి బాబుమోహన్ శివశంకర్ తయారు చేసిన చిత్రాలను చూసి అభినందించారు. ఈ కళ గురించి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి దారపు చిత్రకళ తాను ఎక్కడా చూడలేదని బాబుమోహన్ అన్నారు. దారం ఎక్కడ ప్రారంభించారో, చిత్రం పూర్తయ్యి తిరిగి అక్కడే అంతమయ్యేలా రూపొందించడం అభినందనీయమని కొనియాడారు.అదృష్టంగా భావిస్తున్నా అరుదైన ఈ కళ నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఆసక్తి గల వారికి నేర్పించేందుకు సిద్ధంగా ఉన్నా. – శివశంకర్ -
కొనసాగుతున్న అధికారుల దాడులు
● 22 గ్యాస్ సిలిండర్ల స్వాధీనం నెల్లూరు(క్రైమ్)/నెల్లూరు(పొగతోట): గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా ఉపయోగిస్తున్న పలు హోటళ్లు, క్యాటరింగ్ సెంటర్లలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లయీస్ అధికారుల తనిఖీలు ఆదివారం కూడా కొనసాగాయి. సబ్సిడీపై అందజేసే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రూ.51,250ల విలువైన వివిధ కంపెనీలకు చెందిన 22 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్ఓ లీలారాణి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేశామన్నారు. సబ్సిడీపై అందజేసే గృహ గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగించడం నేరమన్నారు. నగరంలోని కృష్ణా గ్యాస్ ఏజెన్సీని తనిఖీ చేసి సకాలంలో గ్యాస్ సిలిండర్లు డెలివరీ జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. రెండు రోజుల్లో 21 మందిపై కేసులు నమోదు చేసి, 141 సిలిండర్లను సీజ్ చేసి గ్యాస్ ఏజెన్సీల వద్ద భద్రపరిచామన్నారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శ్రీహరి, ఏఎస్ఓ లక్ష్మీనారాయణరెడ్డి, సీఎస్ డీటీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వయోజన అభ్యాసకులకు అసెస్మెంట్ టెస్ట్నెల్లూరు(టౌన్): వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా వ్యాప్తంగా వయోజన అభ్యాసకులకు అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించారు. దీనికి 1,00,528 మందికి గానూ 1,00,115 మంది హాజరయ్యారు. వారికి 100 గంటలపాటు శిక్షణా తరగతులు జరిపి టెస్ట్ నిర్వహించినట్లు వయోజన విద్యాశాఖ అక్షరాంధ్ర నోడల్ ఆఫీసర్ మస్తాన్రెడ్డి తెలిపారు. డీఆర్డీఏ, మెప్మా, ఐసీడీఎస్ పీడీలు, విద్యాశాఖాధికారులు, మండల అభివృద్ధి అధికారులు తదితరులు పాల్గొని విజయవంతం చేసినట్లు వెల్లడించారు.ప్రాణం తీసిన ఈత సరదాపొదలకూరు: మండలంలోని మరుపూరు ఎస్టీ కాలనీలో ఉంటున్న వెందోటి ప్రదీప్ (14) ఆదివారం ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. నరసింహులుకు ఇద్దరు సంతానం. కుమార్తెకు వివాహమై ంది. కుమారుడు ప్రదీప్ తండ్రి వద్దే ఉంటున్నాడు. అతను నలుగురు స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని శ్మశానం వద్ద ఉన్న పాత బావిలో సరదాగా ఈత కు వెళ్లాడు. ఈ క్రమంలో మునిగిపోవడంతో మిగిలిన వారు గ్రామంలో చెప్పగా పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బావిలో నీటిని తోడి ప్రదీప్ మృతదేహాన్ని వెలికితీశారు. ఎస్సై హనీఫ్ కేసు నమోదు చేశారు. -
జిల్లా వ్యాప్తంగా నాకాబందీ
నెల్లూరు(క్రైమ్): నేరనియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు పోలీసు అధికారులు నాకాబందీ నిర్వహించారు. హైవే ప్రవేశం, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్పై 19, బహిరంగంగా మద్యం తాగడంపై 24 కేసులు నమోదు చేశారు. మూడు వాహనాలను సీజ్ చేశారు. రహదారి భద్రత నిబంధనల ఉల్లంఘనపై 49 కేసులు నమోదు చేసి రూ.1,81,260ల అపరాధరుసుము విధించారు. లాడ్జీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బస చేసిన వ్యక్తుల వివరాలను సేకరించారు. అసాంఘిక కార్యకలాపాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు తదితరాలపై డయల్ 112, కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 93929 03143కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
శాంతి, సహనం, దయాగుణంతో మెలగాలి
● ఇఫ్తార్ విందులో కాకాణి గోవర్ధన్రెడ్డి ముత్తుకూరు(పొదలకూరు) : శాంతి, సహనం, దయాగుణంతో మెలగాలని ముస్లింలకు పవిత్ర రంజాన్ మాసం సందేశాన్ని ఇస్తుందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. ముత్తుకూరులో ఆదివారం నిర్వహించిన ఇఫ్తార్ విందులో కాకాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ ముత్తుకూరులోని ముస్లింలు గత 12 ఏళ్లుగా క్రమం తప్పకుండా ఇఫ్తార్ విందులో తనను భాగస్వామిని చేస్తున్నట్టుగా తెలిపారు. నమ్మకం, విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ముస్లిం సమాజమంటే తనకు ఎనలేని గౌరవం ఉందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఎంతో పాటుపడ్డారని తెలిపారు. ముస్లిం కుటుంబాల బాగు కోసం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగు శాతం రిజర్వేషన్లను కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో ముస్లిం కుటుంబాలు నివశించే ప్రాంతాల్లో సీసీరోడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించానని గుర్తుచేశారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లింల శ్మశాన వాటిక అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ముస్లింలకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. తొలుత కాకాణికి ముస్లింలు ఘనస్వాగతం పలికారు. మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నాయకులు మెట్టా విష్ణువర్ధన్రెడ్డి, శివప్రసాద్, షేక్ అబ్దుల్ రహీం, జావీద్బాషా, షమ్ము, రవూఫ్, సిరాజ్, తాజ్, బచ్చల సురేష్కుమార్రెడ్డి, ఎం వెంకటశేషయ్య, చెంగారెడ్డి తదితరులు ఉన్నారు. -
కేంద్రం సృష్టించిన కృత్రిమ సంక్షోభమే గ్యాస్ కొరత
● సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లు ● మహిళలతో కలిసి రోడ్డుపై కట్టెల పొయ్యిలపై వంటా వార్పుతో నిరసన ● ఖాళీ గ్యాస్ సిలిండర్లతో ర్యాలీ నెల్లూరు (వీఆర్సీసెంటర్): పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో కేంద్రం సృష్టించిన కృత్రిమ సంక్షోభమే గ్యాస్ కొరత అని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, పుష్కలంగా నిల్వలు ఉన్నాయని ఒక పక్క చెబుతూనే మరో పక్క గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచడం, బుకింగ్లపై కాల పరిమితి విధించడం, దేశ రాజధానిలో కట్టెల పొయ్యిలపై ఆంక్షలు సడలించడం ఏమిటని ప్రశ్నించారు. పెంచిన గ్యాస్ ధరలను తగ్గించడంతోపాటు అందరికి అందుబాటులో గ్యాస్ను ఉంచాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలతో కలిసి రోడ్డుపై కట్టెల పొయ్యిలు పెట్టి వంటా, వార్పు చేసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాదాల వెంకటేశ్వర్లు, నెల్లూరు రూరల్ కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ వంట గ్యాస్ కొరతతో గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ల కోసం ప్రజలు పనులు మానుకుని గ్యాస్ గోదాముల వద్ద పడికాపులు కాస్తున్నారన్నారు. కొరత కారణంగా నగరంలోని పలు హోటళ్లు, హాస్టళ్లు మూతపడుతున్నాయని ఆరోపించారు. పరీక్షల సమయంలో వంట గ్యాస్ లేక విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, హోటళ్లలో పనిచేసే కార్మికులు పని లేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. గ్యాస్కు ప్రత్యామ్నాయంగా ఉన్న ఇండక్షన్ స్టౌలు, ఎలక్ట్రికల్ కుక్కర్లు, వంటనూనె, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు అవస్థ పడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు పెంచలనరసయ్య, అబ్దుల్ అజీజ్, షాహీనాబేగం, అరిగెల రమమ్మ, నాగేశ్వరరెడ్డి, శివాజీ, సురేష్, నాగేశ్వరరావు, షంషాద్ తదితరులు, పాల్గొన్నారు. -
జనసేన నేతల బాహాబాహీ
● పోటాపోటీగా బలప్రదర్శన ● నియోజకవర్గ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్, టిడ్కో చైర్మన్ అజయ్కుమార్ మధ్య ఆధిపత్య పోరు ఆత్మకూరు: ఆత్మకూరు జనసేన పార్టీ నేతలు ఆదివారం బాహాబాహీకి తలపడ్డారు. ఆత్మకూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ కొద్ది రోజులుగా సభ్యత్వ నమోదు చేయిస్తున్నారు. శనివారం పది వేలకుపైగా సభ్యత్వాలు పూర్తి చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే, నెల్లూరు జిల్లా ఇన్చార్జి బొలిశెట్టి శ్రీనివాసులు స్వయంగా ఆత్మకూరుకు వచ్చి శ్రీధర్ను అభినందించారు. ఈ నేపథ్యంలో పార్టీలోని మరో వర్గంగా కొనసాగుతున్న టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్కుమార్ అనుచరులు చదలవాడ హరీష్కుమార్ దంపతుల ఆధ్వర్యంలో ఆదివారం మున్సిపల్ బస్టాండ్ వద్ద పార్టీ సభ్యత్వ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వేములపాటి అజయ్కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న నలిశెట్టి శ్రీధర్ వర్గీయులు బహిరంగ సభ జరుగుతున్న వేదిక వద్దకు చేరుకుని తమ అనుచరులతో బలప్రదర్శన చేస్తూ సభలో పాల్గొన్న వారిని తరిమేస్తూ కుర్చీలను తోసేశారు. ఇంతలో ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ జీ గంగాధర్, ఎస్సైలు ఎస్కే జిలానీ, బీ సాయిబాబా నలిశెట్టి శ్రీధర్ వర్గీయులను బహిరంగ సభ నుంచి కొంత దూరం తీసుకెళ్లారు. అయితే వారు అక్కడ రోడ్డుపై బైఠాయించి అజయ్కుమార్ గోబ్యాక్ అంటూ నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బహిరంగ సభ జరిగినంతసేపు నలిశెట్టి శ్రీధర్ వర్గీయులు అజయ్కుమార్కు వ్యతిరేక నినాదాలు చేస్తూనే ఉన్నారు.ఆత్మకూరులో జనసేన బహిరంగ సభను అజయ్కుమార్ వర్గీయులు నిర్వహిస్తుండగా గొడవ పడుతున్న నలిశెట్టి శ్రీధర్ వర్గీయులుఒక వైపు జనసేన బహిరంగ సభ జరుగుతుండగా ఎదురుగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న శ్రీధర్ వర్గీయులు -
డ్రగ్స్కు అడ్డాగా ఏపీ
● పోలీసులపైనే కాల్పులకు తెగబడడం అత్యంత దారుణం ● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి నెల్లూరురూరల్: టీడీపీ ఎంపీ పుట్టా మహేష్యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడి వారిపైనే కాల్పులకు తెగబడడం అత్యంత దారుణమైన విషయమని వైఎస్సార్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఖండించారు. నగరంలోని వైఎస్సార్సీపీ సిటీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రోజు సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. డ్రగ్స్ ముఠాను పట్టుకునేందుకు పోలీసులు జరిపిన రైడ్లో ఎంపీ మహేష్యాదవ్ ముఠా వారిపైనే కాల్పులకు తెగబడడం చూస్తే ఒక ప్రజాప్రతినిధిగా సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. సమాజంలో శాంతిభద్రతల కోసం పాటు పడుతున్న పోలీసులపైన కాల్పులు జరపడం అత్యంత దుర్మార్గమన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీలో డ్రగ్స్ కల్చర్ పెచ్చుమీరిపోయిందని వైఎస్సార్సీపీ మొదటి నుంచి చెబుతూనే వస్తుందన్నారు. అడ్డూఅదుపు లేకుండా పోలీసుల కళ్లు గప్పి చుట్టూ పక్కల రాష్ట్రాల నుంచి ఏపీకి పెద్ద మొత్తంలో గంజాయి దిగుమతి అవుతుందన్నారు. ఈ గంజాయి టీడీపీ నాయకులు, కార్యకర్తల ద్వారానే ఏపీలో అన్ని జిల్లాల్లో హోమ్ డెలివరీ జరుగుతోందన్నారు. ప్రశాంతతకు మారుపేరైన నెల్లూరు నగరంలో కూడా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా డ్రగ్స్ దొరుకుతున్నాయన్నారు. యువత డ్రగ్స్కు బానిసై పీకలు కోయడాలు, హత్యలు చేయడాన్ని మనమంతా చూస్తున్నామన్నారు. ఒక పార్లమెంట్ సభ్యుడు అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి డ్రగ్స్ సేవిస్తూ, ఒక డ్రగ్స్ ముఠాను తయారు చేస్తూ సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. దీనికి హోం మంత్రి సమాధానం చెప్పాలన్నారు. గతంలో ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో డ్రగ్స్ తీసుకున్నారని, పోలీసులకు పట్టుబడ్డారనే విషయాలు విన్నాము.. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచ్చలవిడిగా డ్రగ్స్ తీసుకుంటూ రోడ్ల మీదకు వచ్చి రూ.200, రూ.300లకు పీకల కోయడం హత్యలు చేయడం చూస్తున్నామన్నారు. కొంత మంది దారి దోపిడీలకు పాల్పడుతూ అడ్డొచ్చిన వారిని కత్తులతో పొడిచి చంపేయడం కూడా చూస్తున్నామన్నారు. జరుగుతున్న ఈ పరిణామాలకు సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత ప్రజలకు ఏమని సమాధానం చెబుతారో చూడాలన్నారు. హోం మంత్రి అనిత అనేక సందర్భాల్లో మాట్లాడుతూ డ్రగ్స్ను మేము లేకుండా చేస్తాం, నిర్మూలిస్తామని చెప్పారని, దీనికి మీరేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎంపీ పుట్ట మహేష్యాదవ్ చేత రాజీనామా చేయించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందన్నారు. -
నేటి నుంచి పది పరీక్షలు ప్రారంభం
జిల్లాలో 16 సమస్యాత్మక కేంద్రాలు నెల్లూరు (టౌన్): జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. పదోతరగతి పరీక్షలు సోమవారం నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్ 27,910, ప్రైవేట్ 679 మంది కలిపి మొత్తం 28,589 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. జిల్లా వ్యాప్తంగా 174 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో ఏ సెంటర్లు 95, బీ సెంటర్లు 55, సీ సెంటర్లు 24గా విభజించారు. ఇప్పటికే పోలీసు స్టేషన్లలోని స్ట్రాంగ్రూముల్లో ప్రశ్న పత్రాలను భద్రపరిచారు. పరీక్షకు ముందుగా ప్రశ్న పత్రాలను కేంద్రాలకు చేర్చనున్నారు. విద్యార్థులను పరీక్ష సమయానికి అరగంట ముందుగా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. విద్యార్థుల ఇబ్బందులు, సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్ రూమ్ 83414 08109 నంబర్ను ఏర్పాటు చేశారు. పరీక్ష సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సౌకర్యంతో పాటు మెడికల్ కిట్, ఏఎన్ఎంను అందుబాటులో ఉంచనున్నారు. పకడ్బందీగా పరీక్షల నిర్వహణ పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. పది పరీక్షలకు 1532 మందిని ఇన్విజిలేటర్లుగా నియమించారు. అయితే ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా నియమించనున్నారు. అయితే ప్రైవేట్ ఉపాధ్యాయులను నియమిస్తే ప్రైవేట్ పాఠశాలల్లో మాస్ కాపీయింగ్ జరిగే అవకాశం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే విధంగా 174 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 174 మంది డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా 9 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. సీ సెంటర్లకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులతోపాటు మరో 24 మంది గ్రేడ్–2 హెడ్మాస్టర్లను కస్టోడియన్లుగా నియమించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. సమీపంలోని జెరాక్స్, ఆన్లైన్ సెంటర్లను మూసివేయనున్నారు. 8 కేంద్రాలకే సీసీ కెమెరాలు సాధారణంగా సమస్యాత్మక కేంద్రాల్లో ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తుంటారు. అయితే ఈ విద్యా సంవత్సరంలో కేవలం అతి సమస్యాత్మక కేంద్రాలుగా ఉన్న 8 పరీక్ష కేంద్రాల్లోనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి 8 కేంద్రాలకే అనుమతి వచ్చినట్లుగా చెబుతున్నారు. వెబ్సైట్లో హాల్టికెట్లు పదో తరగతి విద్యార్థుల హాల్టికెట్లను విద్యాశాఖ వెబ్సైట్ bse.ap.gov.inలో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ జిల్లా, స్కూల్, పేరు, పుట్టిన తేదీని నమోదు చేసి హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్ మీద స్కూల్ హెడ్మాస్టర్ సంతకం అవసరం లేదు. ఆల్ ద బెస్ట్ జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ నెల్లూరు (పొగతోట): సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలకు హాజరువుతున్న విద్యార్థులకు జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ఆదివారం ఒక ప్రకటనలో ఆల్ ద బెస్ట్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 28,589 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరువుతున్నారన్నారు. విద్యా శాఖ 174 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. పరీక్ష కేంద్రాలకు సమయానికి హాజరుకావాలన్నారు. తల్లిదండ్రులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా చూడాలన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని పరీక్షలకు హాజరుకావాలన్నారు. విద్యార్థులు తమ బంగారు భవిష్యత్కు మార్గం ఏర్పరుచుకోవాలన్నారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశలను నిలపాలని కోరారు. జిల్లాలో 174 సెంటర్ల ఏర్పాటు హాజరుకానున్న 28,589 మంది విద్యార్థులు 1532 మంది ఇన్విజిలేటర్లు 174 మంది సీఎస్లు, 174 మంది డీఓలు 9 ఫ్లయింగ్ స్క్వాడ్స్ నియామకం తొలిసారి ఇన్విజిలేటర్లుగా ప్రైవేట్ ఉపాధ్యాయులు జిల్లాలో 16 సమస్యాత్మక కేంద్రాలు అందులో 8 అతి సమస్యాత్మక కేంద్రాలు పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం ఉచిత బస్సు సౌకర్యం పది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రజారవాణాశాఖ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు బస్సుల్లో హాల్ టికెట్ను చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు. జిల్లా వ్యాప్తంగా 8 సమస్యాత్మక కేంద్రాలు, మరో 8 అతి సమస్యాత్మక కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారులు గుర్తించారు. అతిసమస్యాత్మక కేంద్రాలుగా విడవలూరు జెడ్పీహెచ్ఎస్, పొదలకూరు మండలం మహ్మదాపురం జెడ్పీహెచ్ఎస్, కలువాయి జెడ్పీహెచ్ఎస్లోని ఏ, బీ సెంటర్లు, నెల్లూరు రూరల్లోని సౌత్మోపూరు జెడ్పీహెచ్ఎస్, మర్రిపాడు జెడ్పీహెచ్ఎస్, అనంతసాగరం మండలం రేవూరు జెడ్పీహెచ్ఎస్, ఇందుకూరుపేటలోని ఎంకేఆర్ ప్రభుత్వ హైస్కూల్, కందుకూరు జెడ్పీహెచ్ఎస్ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. సమస్యాత్మ క కేంద్రాలుగా నెల్లూరు రూరల్ నారాయణరెడ్డిపేట జెడ్పీహెచ్ఎస్, ముత్తుకూరు మండలం పిడతాపోలూరులోని రత్నం ఇంగ్లిష్ మీడియం హైస్కూల్, ఇందుకూరుపేట మండలం నరసాపురం జెడ్పీహెచ్ఎస్, బోగోలు మండలం బిట్రగుంట జెడ్పీహెచ్ఎస్, జెడ్పీజీహెచ్ఎస్, జలదంకి జెడ్పీహెచ్ఎస్, అనంతసాగరం జెడ్పీహెచ్ఎస్, వరికుంటపాడు జెడ్పీహెచ్ఎస్, ఉదయగిరి మండలం గండిపాళెంలోని ఏపీఆర్ఎస్ కేంద్రాలు ఉన్నాయి. -
మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి
కావలి : తీరప్రాంత మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని మైరెన్ సీఐ సీహెచ్వీ శేషయ్య అన్నారు. కావలి రూరల్ మండలం వెంకటేశ్వరపాళెంలో తీరప్రాంత భద్రతపై మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీరప్రాంత మత్స్య కారులు సైనికుల్లా వ్యవహరించాలన్నారు. దేశంలోకి సముద్ర మార్గం ద్వారా ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందన్నారు. అందువల్ల తీరంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, బోట్లు కనిపిస్తే వెంటనే మైరెన్ పోలీస్ టోల్ఫ్రీ నంబర్ 1093 లేదా కోస్ట్గార్డ్ టోల్ఫ్రీ నంబర్ 1554కు సమాచారం అందజేయాలని కోరారు. అనంతరం సీఆర్జెడ్ యాక్ట్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ అధికారి, వీఆర్ఏ వెంకటేశ్వర్లు, గ్రామ కాపులు కొండూరి యానాది, ఆవుల వెంకయ్య, నరసయ్య, మైరెన్ పోలీసులు కృష్ణ, రమేష్ , బాలసుబ్రహ్మణ్యం, శామ్యూల్, సిబ్బంది పాల్గొన్నారు. గ్రావెల్ అక్రమ తరలింపు నిలిపివేత ఉదయగిరి: దుత్తలూరులోని ఓ లేఅవుట్కు ముత్తరాశిపల్లి చెరువు నుంచి గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయమై ‘సాక్షి’లో ‘అవినీతి ఒరవడి..చెరువుల దోపిడీ’ పేరుతో ఆదివారం కథనం ప్రచురితం కావడంతో ఇరిగేషన్ ఎస్ఈ దేశ్నాయక్ స్పందించారు. గ్రావెల్ అక్రమ తరలింపును నిలిపివేయించారు. శనివారం చెరువు నుంచి గ్రావెల్ తరలింపు విషయమై ఇరిగేషన్ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా ఎవరూ స్పందించలేదు. ‘సాక్షి’లో కథనం వచ్చినా స్థానిక ఇరిగేషన్ అధికారులు స్పందించకపోవడంతో అక్రమార్కులు ఆదివారం ఉదయం కూడా గ్రావెల్ తరలింపును కొనసాగించారు. అయితే విషయం తెలుసుకున్న ఎస్ఈ వెంటనే గ్రావెల్ తరలింపును నిలిపివేయించి తగిన చర్యలు తీసుకోవాలని కావలి ఈఈ ఖాన్ను అదేశించారు. అంతేగాకుండా శనివారమే గ్రావెల్ తరలింపును నిలిపివేయాలని స్థానిక ఏఈ వెంకటసుబ్బయ్యన ఆదేశించినా ఖాతరు చేయకపోవడంపై సోమవారం వ్యక్తిగతంగా తన ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లుగా తెలిసింది. చెరువు చేపల ధారాదత్తం ● వేలం నిర్వహించకుండానే టీడీపీ నాయకుడికి అప్పగింత ● పంచాయతీ ఆదాయానికి గండి కొండాపురం : మండలంలోని గరిమెనపెంట పంచాయతీ పరిధిలోని చల్లగిరగల చెరువు చేపలను ఇరిగేషన్ అధికారులు ధారాదత్తం చేశారు. బహిరంగ వేలం పాట నిర్వహించకుండానే టీడీపీ నాయకుడికి అప్పగించి పంచాయతీ ఆదాయానికి గండికొట్టారు. బహిరంగ వేలం పాట నిర్వహించి అత్యధిక ధరకు పాడిన వారికి చెరువు ను అప్పగించాలి. కానీ పంచాయతీకి చెందిన టీడీపీ నాయకుడి సిఫార్సు మేరకు ఇరిగేషన్ అధికారులు వరికుంటపాడు మండలం శాసు్త్రలవారిపల్లి గ్రామానికి చెందిన మరో టీడీపీ నాయకుడికి రూ.20వేలకు అప్పగించారు. చెరువు చేపల వేలం ద్వారా గతేడాది రూ.50వేలు, అంతకుముందు ఏడాది రూ.లక్ష ఆదాయం పంచాయతీకి లభించింది. ఈ ఏడాది టీడీపీ నాయకుడికి రూ.20వేలకే అప్పగించడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లును వివరణ కోరగా తనకు తెలియదని, ఇరిగేషన్ అధికారులే వేలం నిర్వహించారని తెలిపారు. ఇరిగేషన్ ఏఈ వెంకట్రావును వివరణ కోరగా పంచాయతీ తీర్మానంతోనే చెరువును రూ.20వేలకు అప్పగించామని, సాగునీటి సంఘం అధ్యక్షుడు దొడ్డ గంగయ్య ఖాతాలో నగదు జమచేశామని తెలిపారు. -
రాజీ మార్గమే లోక్ అదాలత్ లక్ష్యం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ నెల్లూరు (లీగల్): రాజీ మార్గమే లోక్అదాలత్ లక్ష్యమని, కక్షిదారులు రాజీపడి వస్తే లోక్అదాలత్లో సత్వర న్యాయం అందిస్తామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి.శ్రీనివాస్ అన్నా రు. నెల్లూరులోని జిల్లా కోర్టు ఆవరణలో ఆ సంస్థ ఆధ్వర్యంలో శనివారం జరిగిన జాతీయ లోక్అదాలత్ కార్యక్రమాన్ని శ్రీనివాస్ ప్రారంభించి మాట్లాడారు. జాతీయ లోక్అదాలత్లో కేసును రాజీ చేసుకోవడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని తెలిపా రు. ఎస్పీ అజిత వేజెండ్ల మాట్లాడుతూ రాజీ మార్గంతో ఇరుపక్షాలకు స్నేహపూరిత వాతావరణం ఏర్పడుతుందన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జాతీ య లోక్అదాలత్లో 66,376 కేసులు పరిష్కారం కా గా, లబ్ధిదారులకు రూ. 10,39,34,942 పరిహారం చెల్లించి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. న్యాయమూర్తులు ఎల్.తేజోవతి, కె.శ్రీనివాస్, ఎంఏ సోమశేఖర్, సిరిపిరెడ్డి సుమ, కరుణాకర్, ఎస్. శ్రీనివా స్, శారదరెడ్డి, ఎస్కే నిషాద్నాజ్ ప్రిసైడింగ్ అధికారు లుగా వ్యవహరించి 32,916 కేసులు పరిష్కరించారు. పలు కోర్టుల న్యాయమూర్తులు, ఏపీ బార్ కౌన్సిల్ మాజీ సభ్యులు వేనాటి చంద్రశేఖర్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు అయ్యపరెడ్డి, పోలీస్, బీమా, బ్యాంకు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.వాణి జిల్లావ్యాప్తంగా పర్యవేక్షించారు. -
వ్యవసాయమంటే చంద్రబాబుకు గిట్టదు
● అన్నదాతలను గాలికొదిలేశారు ● అన్నదాత సుఖీభవ’ పథకంలో భారీ కోత ● నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ధ్వజం కోవూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని, చంద్రబాబుకు వ్యవసాయమంటే ఆది నుంచి గిట్టదని, అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అన్నదాతలను పూర్తిగా గాలికొదిలేస్తారని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై మండి పడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో సాగుకు ముందే పెట్టుబడి సాయం అందేదని, కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ఏకంగా ఏడు లక్షల మంది రైతులకు ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద కోత విధించారని ప్రసన్నకుమార్రెడ్డి ఆరోపించారు. గతంలో 53.58 లక్షల మందికి సాయం అందగా, ఇప్పుడు కేవలం 46.85 లక్షల మందికే పరిమితం చేయడం దారుణమన్నారు. జిల్లాలో సుమారుగా జగనన్న ప్రభుత్వంలో 2.15 లక్షల మంది రైతులకు న్యాయం జరిగిందని, అయితే కూటమి కుట్రలతో 1.95 లక్షలకు కుదించి వేలాది మంది రైతులను ఏరివేసిందన్నారు. కేంద్రం ఇచ్చే రూ. 6 వేలు కాకుండా, రాష్ట్రం రూ. 20 వేల లెక్క ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2 వేల మందికి పైగా రైతు కూలీలు చనిపోయారని ప్రసన్నకుమార్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులకు మొండిచేయి మీరు చేసిన మోసాలకు కౌలు రైతులు అప్పులో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. కౌలు రైతులకు పైసా కూడా ఇవ్వకుండా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ప్రసన్న దుయ్యబట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో కౌలు రైతులకు సైతం భరోసా కల్పించారని, కానీ ఇప్పుడు వారిని పట్టించుకునే నాథుడే లేడని విమర్శించారు. చంద్రబాబు నిర్లక్ష్యం కారణంగానే ఏపీ రైతుల రుణభారంలో దేశంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. ధరల స్థిరీకరణ నిధి లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు, కనీసం పంటల బీమా ప్రీమియం కూడా కట్టలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఫలితంగా రైతులు వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారన్నారు. జగన్ హయాం సువర్ణాధ్యాయం వైఎస్ జగన్ పాలనలో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని ప్రసన్న గుర్తుచేశారు. రైతులకు సున్నా వడ్డీ కింద సకాలంలో రుణాలు చెల్లించిన 84.66 లక్షల మందికి ప్రయోజనం చేకూర్చారన్నారు. ఉచిత పంటల బీమా ద్వారా 54.55 లక్షల మంది రైతులకు రూ. 7,802 కోట్ల బీమా సాయం అందించారన్నారు. విపత్తులు సంభవిస్తే అదే సీజన్లో త్వరితగతిన పరిహారం అందించడమే కాకుండా, దురదుష్టవశాత్తు రైతు ఆత్మహత్య చేసుకుంటే 48 గంటల్లోనే రూ. 7 లక్షల పరిహారం అందించిన ఘనత జగన్దే అని కొనియాడారు. -
విజయదీపికతో ఉత్తమ విజయాలు
● జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ నెల్లూరు (పొగతోట): జెడ్పీ ప్రత్యేక నిధుల తో పదో తరగతి విద్యార్థుల కోసం రూపొందించి విజయదీపిక ద్వారా పరీక్షలు బాగా రాసి మంచి ర్యాంకుల సాధించాలని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ఆకాంక్షించారు. శనివారం జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్పర్సన్ అధ్యక్షతన జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పనులు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా.. బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతుందని జెడ్పీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మర్రిపాడు మండలంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, సైకిల్పై కూడా వెళ్లడానికి కూడా వీల్లేకుండా దెబ్బతిన్నాయని, గ్రామాలకు వెళితే ప్రజలు తిడుతున్నారని జెడ్పీటీసీ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. చైర్ పర్సన్ మాట్లాడుతూ పనులు పూర్తి చేసి న బిల్లుల చెల్లింపుల్లో జాప్యం ఎందుకు జరుగుతుందని అధికారులను ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. రోడ్లకు త్వరితగతిన మరమ్మతులు చేయించేలా చర్యలు తీసు కోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జెడ్పీటీసీలకు గౌరవ వేతనం మంజూరు చేసి 25 నెలలు కావొస్తుందని త్వరగా చెల్లించకపోతే సభ్యులందరం సమావేశంలో ధర్నా చేస్తామని మర్రిపాడు జెడ్పీటీసీ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయం కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లామని త్వరలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామని జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి సమాధానమిచ్చారు. జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలకు జిల్లా అధికారులు తప్పకుండా హాజరు కావాలని, అనుమతి లేకుండా సమావేశాలకు హాజరుకాని అధికారులకు నోటీసులు ఇవ్వా లని ఆదేశించారు. వరి కోతలు ప్రారంభమయ్యాయ ని రైతులు నష్టపోకుండా మద్దతు ధర కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. హాస్టల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించా లన్నారు. ఈ సమావేశాల్లో జెడ్పీ డిప్యూటీ సీఈఓ మోహన్రావు, వివిధ మండలాలు జెడ్పీటీసీలు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ఒంటిపూట బడి
నెల్లూరు (టౌన్): ఎండలు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు సోమవారం నుంచి ఒంటిపూట నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.బాలాజీరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి రోజు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు అన్ని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం పూట రాగిజావ, మధ్యాహ్నం భోజనాన్ని విద్యార్థులకు అందజేయాలన్నారు. విద్యుత్ తీగలు పడి రైతు మృతి మనుబోలు: పొలంలో గడ్డి కోసుకుని వస్తుండగా విద్యుత్ తీగలు పైన పడడంతో ఓ రైతు మృతి చెందిన ఘటన మండలంలోని బండేపల్లిలో శనివారం జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఆవుల చినపోతయ్య (54) గేదెలు, గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తాడు. పశువుల మేత కోసం పొలంలో గడ్డి కోసుకుని తిరిగి వస్తుండగా పొలాల్లోని ఓ విద్యుత్ స్తంభం గాలికి ఒరిగిపోవడంతో కరెంట్ తీగలు పైన పడ్డాయి. దీంతో పోతయ్య అక్కడికక్కడే షాక్నకు గురై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. గడ్డి కోసమని ఇంటి నుంచి వెళ్లిన పోతయ్య గంటల వ్యవధిలోనే విగతజీవిగా మారడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అతిగా మద్యం తాగిన వ్యక్తి మృతి మనుబోలు: అతిగా మద్యం తాగిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మనుబోలులోని చెర్లోపల్లి రోడ్డు పక్కన శనివారం వెలుగుచూసింది. మనుబోలుకు చెందిన దాసరి రఘురామయ్య (55) కుటుంబంతో గొడవల కారణంగా ఐదారేళ్లుగా ఒంటరిగా మరో ఊరిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో శుక్రవా రం అతిగా మద్యం తాగి మనుబోలులోని ఇంటికి వచ్చి భార్య, కోడలుతో గొడవ పడినట్లు సమాచారం. తర్వాత ఏమి జరిగిందో కానీ శనివారం ఉదయం హైవే పక్కన ఉన్న ఆంధ్రా విలాస్ హోటల్ సమీపంలో మృతి చెందిన ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అతిగా మద్యం తాగడంతో గొంతు తడారిపోయి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పకడ్బందీగా పది పరీక్షలు
● డీఈఓ ఆర్.బాలాజీరావు నెల్లూరు (టౌన్): పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించే విధంగా ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఆర్.బాలాజీరావు తెలిపారు. శనివారం స్థానిక దర్గామిట్టలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 174 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్షలకు రెగ్యులర్ 27,910 మంది, ప్రైవేట్ 679 కలిపి మొత్తం 28,589 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు 9 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 24 మంది కస్టోడియన్స్, సిటింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 174 మంది చీప్ సూపరింటెండెంట్లు, 174 మంది డిపార్ట్మెంట్ అధికారులు, 1,532 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు చెప్పారు. జిల్లాలో 8 కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలు జరిగే కేంద్రాల్లో 144 సెక్షన్ అమలు ఉంటుందన్నారు. పరీక్షల్లో విద్యార్థుల సమస్యలు, ఇబ్బందుల పరిష్కారం కోసం స్థానిక దర్గామిట్టలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామన్నారు. సమస్యలపై 8341408109 నంబర్కు ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. విద్యార్థులు హాల్ టికెట్లను బీఎస్ఈ (బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) వెబ్సైట్ నుంచి హాల్టికెట్ ఆప్షన్కు వెళ్లి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. హాల్ టికెట్పై సంబంధిత హెడ్మాస్టరు సంతకం అవసరం లేదన్నారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్తో నేరుగా పరీక్షకు హాజరు కావచ్చన్నారు. రేపటి నుంచి పది ఓపెన్ స్కూల్ పరీక్షలు నెల్లూరు (టౌన్) : ఏపీ ఓపెన్ స్కూ ల్ పదో తరగతి పరీక్షలు సోమవా రం నుంచి ఈ నెల 28వ తేదీ వర కు నిర్వహించనున్నారు. జిల్లా వ్యా ప్తంగా 15 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు 1291 మంది అభ్యాసకులు హాజరుకానున్నారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. పరీక్షలకు 4 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 61 మంది ఇన్విజిలేటర్లు, 15 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 15 మంది డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. -
కార్పొరేషన్కు ఉత్తమ ర్యాంక్ వచ్చేలా కృషి
● పట్టణ పురపాలక శాఖ రీజినల్ డైరెక్టర్ హరికృష్ణ నెల్లూరు(బారకాసు): స్వచ్ఛ సర్వేక్షణ్లో నెల్లూరు నగరపాలక సంస్థ ఉత్తమ ర్యాంక్ సాధించేందుకు కృషి చేయాలని పట్టణ పురపాలక శాఖ రీజినల్ డైరెక్టర్ హరికృష్ణ ఆదేశించారు. ఎన్ఎంసీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో కమిషనర్ వైఓ నందన్తో కలిసి శానిటేషన్ విభాగంపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీ స్వచ్ఛ సర్వేక్షణ్ గురించి పూర్తిగా ఎంతమందికి తెలుసు? తదితర అంశాలపై శానిటరీ కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లను ప్రశ్నించారు. వంద శాతం డోరు టు డోర్ చెత్త సేకరణ జరిగేలా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని అడగ్గా అందుకు సరైన జవాబు చెప్పలేకపోయారు. దీంతో నగరాన్ని చెత్తరహితంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలు వేయడం మానుకుని, చెత్త సేకరణ వాహనాలకు మాత్రమే అందించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం రెవెన్యూ విభాగంతో ఆర్డీ సమీక్ష నిర్వహించారు. మొండి బకాయిలున్న వారిని గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుని పన్నులు వసూలు అయ్యేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్, ఇంజినీరింగ్ విభాగం ఎస్ఈ రహంతు జానీ, టీపీఆర్వో వాసుబాబు, రెవెన్యూ అధికారులు సమద్, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
నమ్మకంగా ఉంటూ.. నగదు దోచేసి..
● చోరీ కేసులో సహాయకుడి అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): యజమాని వద్ద నమ్మకంగా ఉంటూ నగదు, బంగారు గొలుసును అపహరించిన సహాయకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం నెల్లూరులోని వేదాయపాళెం పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. కొండాయపాళెం ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎ.శ్రీధర్రెడ్డి తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నారు. అతని వద్ద సత్యసాయి జిల్లా పెనుగొండ మండలానికి చెందిన కె.శ్రీనివాసులురెడ్డి సహాయకుడిగా పనిచేస్తున్నాడు. శ్రీధర్రెడ్డి తల్లి ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు. ఈనెల 5వ తేదీన శ్రీధర్రెడ్డి వ్యాపారానికి సంబంధించిన రూ.16.50 లక్షల నగదును ఇంటికి తీసుకొచ్చి శ్రీనివాసులురెడ్డికిచ్చి బీరువాలో భద్రపరచమని చెప్పాడు. 6వ తేదీన అతను నిద్ర లేచి చూడగా సహాయకుడితోపాటు నగదు, 55 గ్రాముల బంగారు గొలుసు కనిపించలేదు. శ్రీధర్రెడ్డి గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ సాంకేతికత ఆధారంగా నిందితుడి కోసం గాలించారు. శుక్రవారం భగత్సింగ్ కాలనీ సమీపంలో శ్రీనివాసులురెడ్డిని అరెస్ట్ చేసి. రూ.15.70 లక్షల నగదు, 55 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన సిబ్బందిని నగర ఏఎస్పీ దీక్ష అభినందించారు. -
చెల్లీ.. వెళ్లిరా..
● వీడ్కోలు పలికిన ముత్యాలమ్మ ● ముగిసిన జాతర ● పోటెత్తిన భక్తులుచిల్లకూరు: మండలంలోని తూర్పుకనుపూరులో జరుగుతున్న పోలేరమ్మ జాతర శుక్రవారం ముగిసింది. అమ్మవారిని దర్శించుకునేందుకు గురువారం రాత్రి నుంచే భక్తులు పోటెత్తారు. ముత్యాలమ్మ చెల్లిగా భావించే పోలేరమ్మ జాతరను నాలుగురోజులపాటు వైభవంగా నిర్వహించారు. చివరిరోజున వెళ్లనంపు కార్యక్రమంలో భాగంగా పోలేరమ్మను నిలిపిన చోట ముందుగా కుంభం పోసి మొక్కులు చెల్లించారు. పొలి, బలి కార్యక్రమం ముగిసిన అనంతరం అమ్మవారిని వెళ్లనంపేందుకు గ్రామస్తుల నుంచి గణాచారి అనుమతి పొందారు. తర్వాత పోలేరమ్మను సప్పరం పీటపై ఉంచి తలపై మోసుకుంటూ పురవీధుల్లో నడుస్తుండగా మొక్కులున్న వారు కొత్త చీరలు ఆ మార్గంలో కింద పరిచారు. వాటిపై అమ్మవారిని సాగనంపారు. మార్గమధ్యలో పోలేరమ్మ తన అక్క ముత్యాలమ్మను పలకరించి వెళ్లేందుకు గుడి వద్దకు రాగా గణాచారి సాగనంపుతున్నట్లుగా చెప్పిన ఽకథ ఆకట్టుకుంది. అనంతరం ముత్యాలమ్మ ఆలయం వెనుక వైపున ఉన్న ద్వారం నుంచి పోలేరమ్మను పంబలోళ్ల వాయిద్యాల నడుమ తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆసాదులు పోలేరమ్మకు సంప్రదాయంగా కథ వినిపించి మెప్పించే సన్నివేశాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం గ్రామానికి పడమటి వైపున ఉన్న జీడిమామిడి పొదల్లోకి తీసుకెళ్లి పోలేరమ్మను నిమజ్జనం చేసారు. కార్యక్రమాన్ని అదికారులు, పర్యవేక్షించారు. -
కౌలురైతులకు మొండిచేయి
నేను ఐదు ఎకరాలు భూమిని కౌలుకు తీసుకు ని పంటలు సాగుచేస్తున్నా. గత ప్రభుత్వం రైతుభరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం క్రమం తప్పకుండా అందించడంతో కొంత ఊరట లభించింది. కూటమి ప్రభుత్వంలో కూడా అన్నదాత సుఖీభవ అందుతుందని అనుకున్నా. అయితే జాబితాలో పేరు లేదు. ఈ ప్రభుత్వం కౌలురైతులను పూర్తిగా విస్మరించింది. కౌలురైతులకు కూడా అన్నదాత సుఖీభవ నగదును అందించి ఆదుకోవాలి. – చేను వెంకటయ్య, కౌలురైతు, వాకాడు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నా. ఏటా ఐదెకరాలు మాగాణి కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నా. గత ప్రభుత్వం కౌలురైతులకు కూడా రైతుభరోసా పథకం కింద క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం అందించి ఆదుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఎన్నికల సమయంలో కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపారు. గుర్తింపు కార్డులు కూడా ఇవ్వడం లేదు. – దుగ్గన రామచంద్రయ్య, కౌలురైతు, మనుబోలు నేను ఏటా నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలు సాగుచేస్తు న్నా. గత ప్రభు త్వం కౌలురైతులకు అన్ని విధాలా అండగా నిలిచింది. ఏటా క్రమం తప్పకుండా రైతుభరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కౌలురైతులను చిన్నచూపు చూస్తోంది. రెండు పర్యాయాలు కౌలురైతుగా దరఖాస్తు చేసుకున్నా అన్నదాత సుఖీభవ నగదు అందలేదు. పెట్టుబడికి అప్పులు చేయాల్సి వచ్చింది. పంటలకు మద్దతు ధరలు కూడా లేక నష్టపోతున్నాం. – వెందోటి సుధాకర్, కౌలురైతు, చిట్టమూరు చిన్నచూపు తగదు -
పిల్లలు లేరు..వంట చేయలేదు
వెంకటాచలం: మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను ఏపీ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు ఈ లక్ష్మిరెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. తొలుత వెంకటాచలం మండలం లింగంగుంటలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రానికి పేరు బోర్డు లేకపోవడం, కేంద్రంలో పిల్లలు, సిబ్బంది ఎవరూ లేకపోవడం, ఉదయం 11 గంటలు దాటినా వంట చేయకపోవడాన్ని గుర్తించారు. రికార్డులను తనిఖీ చేయగా 12వ తేదీ హాజరు నమోదు చేయకపోవడం, కేంద్రంలో 16 మంది పిల్లలు నమోదై ఉండగా, కేవలం ముగ్గురు మాత్రమే హాజరైనట్లుగా నమోదు చేయడాన్ని పరిశీలించారు. స్టాక్ రిజిస్ట్టర్ను సక్రమంగా నిర్వహించకపోవడం, స్టాక్ రిజిష్టర్, భౌతిక స్టాక్ మధ్య 183 గుడ్లు తేడా, ఫేజ్ –ఐకు చెందిన 46 బ్లూ కలర్ గుడ్లు నిల్వ ఉండడాన్ని గుర్తించారు. అనంతరం టీహెచ్ఆర్ లబ్ధిదారులకు ఫోన్ చేసి ఆరాతీయగా ఇప్పటి వరకు గుడ్లు ఇవ్వలేదని తెలిపారు. దీంతో అంగన్వాడీ టీచర్, సూపర్వైజర్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఐసీడీఎస్ నోడల్ ఆఫీసర్, పీడీ అనురాధకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం సర్వేపల్లిలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. కేంద్రంలో ఫేజ్–ఐకు చెందిన 131 బ్లూ కలర్ గుడ్లు నిల్వ ఉండడం, గతేడాది అక్టోబరు నుంచి సూపర్వైజర్ కేంద్రాన్ని సందర్శించకపోవడాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో అంగన్వాడీ టీచర్, సూపర్వైజర్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అనంతరం సర్వేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో 540 కలర్ మార్కింగ్ లేని గుడ్లు నిల్వ ఉండడాన్ని గుర్తించారు. ఇలాంటి స్టాక్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించగా మధ్యాహ్న భోజన నిర్వాహకులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. అనంతరం గుడ్ల సరఫరాదారుడితో మాట్లాడగా తన వద్ద కలర్ మార్కింగ్ చేసిన గుడ్లు లేవని సమాధానం ఇచ్చాడు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై విచారణ జరిపి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని, పాఠశాల హెచ్ఎం, ఎగ్ వెండర్కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట జిల్లా సరఫరాల అధికారిణి లీలారాణి, జిల్లా మేనేజర్ అర్జున్రావు, ఆర్ఐ సుస్మిత తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఆహార కమిషన్ తనిఖీలు వెలుగులోకి పలు అక్రమాలు అంగన్వాడీలు, సూపర్వైజర్లు, హెచ్ఎంకు షోకాజ్ నోటీసులు -
గ్యాస్ కొరత వదంతులను నమ్మొద్దు
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో గ్యాస్ కొరత ఉందని వస్తున్న వదంతులను ప్రజలు నమ్మొద్దని జాయింట్కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సూచించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిణి లీలారాణితో కలిసి గ్యాస్ సరఫరా సంస్థల ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో గృహ వినియోగానికి అవసరమైన మేర గ్యాస్ నిల్వలు ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేశారు. ప్రతి గ్యాస్ ఏజెన్సీ వద్ద వీఆర్వోతో పాటు కానిస్టేబుల్ను నియమించి గ్యాస్ సిలిండర్ల డెలివరీని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. డీలర్లు కూడా ప్రతిరోజూ స్టాక్ వివరాలు, బుకింగ్, డెలివరీ స్టేటస్లను ప్రభుత్వానికి అందించాలని సూచించారు. గ్యాస్ సిలిండర్ల అక్రమ రవాణాను అరికట్టేందుకు, ప్రజలకు పారదర్శకంగా అందించేందుకు నిరంతర పర్యవేక్షణకు డివిజన్ స్థాయిలో ప్రత్యేక బందాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఆయిల్ కంపెనీలు, డిస్ట్రిబ్యూటర్లు గ్యాస్సిలిండర్లను సమయానికి అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సంబంధిత ఏజెన్సీలు లేదా అధికారులకు తెలియజేయాలని సూచించారు. హెచ్పీ, భారత్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ల గ్యాస్ ఏజెన్సీల డీలర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
పీఎం కిసాన్ పథకానికి భారీగా కోతలు
అన్నదాత సుఖీభవ ఇప్పటి వరకు రాలేదు అన్నదాత సుఖీభవ అంటూ చంద్రబాబు ప్రభుత్వం పథకానికి అనేక కొర్రీలు వేసి.. గుండె కోతను మిగిల్చింది. అర్హులు ఎవరైనా ఉంటే.. నెల రోజుల్లో దరఖాస్తు చేసుకుంటే తిరిగి సాయం అందిస్తామంటూ ప్రతిసారి చెబుతున్నా.. ఆ దరఖాస్తులకు మూడో విడత జమవుతున్న నేటికీ దిక్కులేని పరిస్థితి. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అర్హత ఉండీ పథకం డబ్బులు రాకపోతే.. తిరిగి దరఖాస్తు చేయించి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. చంద్రబాబు ప్రభుత్వం పథకాన్నే కాకుండా.. ప్రణాళికను కాపీ కొట్టినా చివరకు వెన్నుపోటు పేటెంట్ను నిలబెట్టుకుంటోంది. చంద్రబాబు చరిత్రలో రైతుల కోసం అమలు చేసిన పథకం ఒక్కటీ లేదు. అధికారం కోసం గత ప్రభుత్వం అమలు చేసిన వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని కాపీ కొట్టి.. పీఎం కిసాన్ సాయం కాకుండా అన్నదాత సుఖీభవ పథకం పేరుతో ఏడాదికి రూ.20 వేలు ఇస్తామంటూ ప్రచారం చేశారు. తొలి ఏడాది ఎగ్గొట్టేశారు. ఆ తర్వాత పీఎం కిసాన్తో కలిపి అంటూ నాలుక మడతేసి.. రూ.14 వేలు మూడు విడతల్లో ఇస్తామన్నారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న కౌలు రైతు పేరు బందెల ప్రసాద్. చేజర్ల మండలం యనమదల గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద రెం డున్నర ఎకరాల కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతు భరోసా (పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ) ఇవ్వలేదు. గతంలో జగనన్న ప్రభుత్వంలో ఏడాదికి రూ.13,500 చొప్పన మూడేళ్లు రైతు భరోసా అందిందని, అది వ్యవసాయానికి పెట్టుబడి సాయంగా ఎంతో ఆదరువుగా ఉండేదంటున్నాడు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కౌలుకు రైతులకు పథకం వర్తించదని అధికారులు చెప్పడంతో హతాశుడయ్యాడు. నిమ్మ, మామిడి, తదితర ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు అన్నదాత సుఖీభవ జమ కావడం లేదు. అయ్యా..నాకు సుఖీభవ డబ్బులు పడడం లేదయ్య..నేనేమంటానంటే.. కొందరికేనయ్య... ఇక పడవ్.. వెళ్లిపో...!సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో అర్హులైన రైతులకు కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోని లబ్ధిదారులను అనేక కారణాలు చూపించి ఏరివేసింది. అధికారంలోకి రాక ముందు కౌలురైతులకు పథకాన్ని వర్తింప చేస్తామని చెప్పినా.. అమల్లోకి వచ్చే సరికి కౌలురైతుల ఊసే ఎత్తకుండా.. అర్హులైన లబ్ధిదారుల సంఖ్యకు కోత పెట్టింది. అర్హత ఉండీ పథకం వర్తించని లబ్ధిదారులకు నెల రోజులు గడువు ఇస్తున్నామని అర్హతలతో తిరిగి దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి సాయం అందిస్తామని నిధుల విడుదల ప్రతిసారి చెబుతోంది. కానీ అర్హత ఉండీ లబ్ధి చేకూరని 84,134 మంది రైతులకు నేటికీ దిక్కులేదు. ‘సూపర్’ మోసం చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అడ్డదిడ్డంగా.. అలవి కాని హామీలిచ్చారు. గతంలో 9 ఏళ్లు, ఆ తర్వాత ఐదేళ్లు అధికారంలో ఉండీ కూడా ఏనాడు రైతుల సంక్షేమానికి ఒక్క పథకాన్ని అమలు చేయని ఆయన సూపర్ సిక్స్లో భాగంగా పీఎం కిసాన్ సాయం కాకుండా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఎగనామం పెడితే.. మలి ఏడాది సగం మందికే ఇచ్చి సరిపుచ్చారు. రెండో ఏడాదిలో తొలి విడతలో ఆర్టీజీఎస్ వ్యాలిడేషన్ తర్వాత 1,98,514 మంది రైతులను అర్హులైన లబ్ధిదారులుగా గుర్తించినప్పటికీ చివరకు 1,95,866 మందిని ఫైనల్ చేశామని చెప్పారు. ఆ తరువాత ఈకేవైసీ, ఆధార్లింక్, బ్యాంకు అకౌంట్ లింకు కాలేదని, తదితర కారణాలు చూపి మరి కొంత మందిని తగ్గించి.. చివరకు 1,86,368 మందికి జమ చేశారు. ఆ తర్వాత 1,95,866 మందిని నికరంగా నిర్ధారించి.. మూడు విడతల్లోనూ అంతే మందికి జమ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఆర్బీకేలో రైతుల జాబితాలను నోటీసు బోర్డుల్లో ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికి పారదర్శకతకు పాతరేసింది. జిల్లాలో సుఖీభవ కొందరికే వర్తిపు 1,95,866 మందిని అర్హులుగా గుర్తించిన ప్రభుత్వం అర్హులు తిరిగి దరఖాస్తు చేసుకుంటే సాయమందిస్తామని చెప్పినా.. ఫలితం శూన్యం 84,134 మంది రైతుల దరఖాస్తులు పెండింగ్ కౌలు రైతులకు పంగనామాలు పెట్టిన కూటమి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2,14,667 మందికి రైతు భరోసా ఏటా రూ.20 వేలిస్తామన్న చంద్రబాబు తొలి ఏడాది పూర్తిగా ఎగనామం రెండో ఏడాది నుంచి పీఎం కిసాన్తో కలిపి అంటూ నాలుక మడత జిల్లాలో వైఎస్సార్సీపీ హయాంలో 2,14,667 మంది రైతులకు వైఎస్సార్ రైతు భరోసా జమ అయితే.. అందరికీ పీఎం కిసాన్ పథకం కూడా అమలవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి ఏడాదిలో కూడా అన్నదాత సుఖీభవ జమ కాకపోయినా.. ప్రతీ ఒక్కరికీ గతంలో మాదిరిగానే పీఎం కిసాన్ పథకం సాయం రైతుల ఖాతాల్లో జమ అయింది. రెండో ఏడాది తొలి విడత సమయానికి కూడా పీఎం కిసాన్ సాయం ప్రతి ఒక్కరికీ జమ అయితే.. గడిచిన రెండు విడతలుగా భారీగా కోత పడింది. ఆధార్ తరహాలో విశిష్ట సంఖ్యతో కూడిన కార్డులు అంటూ ‘ఫార్మర్ రిజిస్ట్రేషన్’ను చేపట్టింది. ఈ క్రమంలో పీఎం కిసాన్ డేటాలో అర్హులైన రైతులకు సంబంధించిన డేటాను తొలగించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం రెండో విడతతోపాటు, తాజాగా విడుదల చేసే జాబితాల్లో అర్హులైన రైతులు ఎగిరిపోయారు. ప్రస్తుతం పీఎం కిసాన్ కింద 1,63,125 మందికి జమ చేస్తున్నట్లు వ్యవసాయశాఖాధికారులు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ సంఖ్య తగ్గించడం వెనుక రాష్ట్ర ప్రభుత్వం కుట్ర ఉందనే ఆరోపణలు లేకపోలేదు. పీఎంకిసాన్లో అర్హత ఉంటేనే.. అన్నదాత సుఖీభవ పథకానికి అర్హతగా మార్చే కుట్రగా ఉందని రైతులు విమర్శిస్తున్నారు. మొదటి ఏడాది అన్నదాత సుఖీభవ ఎగ్గొట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. పీఎం కిసాన్ అర్హతనే ప్రామాణికంగా తీసుకుంటే రైతుల నుంచి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని తొలి విడతలో ఎంత మందికి ఇచ్చారో మూడో విడతలోనూ అంతే మందికి సుఖీభవ నిధులు విడుదల చేస్తున్నట్లు సమాచారం. వీరిలో అందరికీ సుఖీభవ పడుతుందా? లేదా? అనేదానిపై కూడా రైతుల్లో అనుమానాలు నెలకొన్నాయి. అర్హులైన రైతుల జాబితాలను రైతు సేవా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) ప్రదర్శించకపోవడం దీనికి అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. -
గ్యాస్ గుది ‘బండ’
● కొనుగోలు ‘భారం’.. దొరకడం కష్టం ● గృహ వినియోగ సిలిండర్లపై రూ.60 ● వాణిజ్య సిలిండర్లపై రూ.115 పెంపు ● జిల్లాలో ఏటా రూ .47 కోట్ల భారం పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం గ్యాస్ ధరలపై పడింది. జిల్లాలో గ్యాస్ వినియోగం అధికంగా ఉండడంతో ఈ పెంపు ప్రభావం మరింత ఎక్కువగా కనిపించనుంది. అంచనాల ప్రకారం జిల్లాలో వినియోగదారులపై ఏటా సుమారు రూ.47 కోట్ల వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. ఇప్పటికే ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు గ్యాస్ ధరల పెంపు మరో భారంగా మారింది. ఉదయగిరి: ప్రభుత్వం వంట గ్యాస్ ధర మరో సారి పెంచింది. గృహ వినియోగదార్లు ఉపయోగించే (14.2 కేజీలు) సిలిండర్ ధరను ఒక్కసారిగా రూ.60 పెంచి సామాన్య ప్రజల్లో గుండెల్లో మంటలు రేపింది. వాణిజ్య అవసరాల కోసం వాడే సిలిండర్ల ధరను కూడా రూ.115 పెంచింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో గత ఏప్రిల్ రూ.50 పెంచితే.. తాజాగా ఇప్పుడు మరో రూ.60 పెంచింది. ఒక వైపు నిత్యావసర సరుకుల ధరలు చాపకింద నీరులా పెరుగుతూ పోతున్నాయి. దానికి తోడు గ్యాస్ ధర కూడా పెరగడంతో సామాన్య జనం నెత్తిన భారం గుది బండగా మారుతోంది. అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా గ్యాస్, చమురు ధరలు పెరిగినా, రాష్ట్ర ప్రజల ఆర్థిక, జీవన ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని పెరిగిన ధర ప్రభుత్వం భరించకపోగా పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజల నెత్తిన మోపింది. దీంతో సామాన్య ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రూ.47 కోట్ల భారం జిల్లా వ్యాప్తంగా 7,87,483 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో గృహ వినియోగదార్లకు సంబంధించి సాధారణ కనెక్షన్లు 4,64,871, దీపం కనెక్షన్లు 2,67,421, ఉజ్వల పథకం కనెక్షన్లు 18,986, సీఎస్ఆర్ కనెక్షన్లు 33,589 ఉన్నాయి. ఇవి కాకుండా వాణిజ్య కనెక్షన్లు మరో 2,616 వరకు ఉన్నాయి. ఇంతకు ముందు గృహ వినియోగ సిలిండరు ధర రూ.890 ఉండగా, పెరిగిన ధర ప్రకారం రూ.950 వరకు చేరుకుంది.అదే వాణిజ్య సిలిండర్ ధర రూ.2,066కు చేరింది. ప్రస్తుతం పెరిగిన ధర ప్రకారం జిల్లా వ్యాప్తంగా వినియోగదార్లపై ఏడాదికి సుమారు రూ.47 కోట్ల భారం పడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నీ రంగాలు కుప్పకూలాయి. దీంతో జిల్లాలో పేదవర్గాల వారికి పనులు దొరక్క చేతిలో చిల్లగవ్వలేక, కొనుగోలు శక్తి క్షీణించింది. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం గాలికి వదిలేసింది. చౌక దుకాణాల్లో సబ్సిడీపై ఇచ్చే కందిపప్పు కూడా ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వంట గ్యాస్ ధర పెరగడం సామాన్యలకు గుదిబండగా మారింది. వణికిస్తున్న గ్యాస్ కొరత.. గ్యాస్ ధరలు పెరిగాయని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో మరో పక్క గ్యాస్ కొరత ప్రజలను వేధిస్తోంది. ఇప్పటికే గ్యాస్ కొరత కారణంగా అనేక ప్రాంతాల్లో హోటళ్లు, దేవాలయాల్లో ప్రసాదాల తయారీ నిలిచిపోతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంతో పాటు గ్యాస్ ఏజెన్సీల్లో స్టాక్ లేదని సమాచారం ప్రజల్లో మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. మరో వైపు కొన్ని హాటళ్లల్లో తిన్న ఫుడ్కు గ్యాస్ వినియోగ బిల్లులు యాడ్ చేస్తుండడం, కట్టెల పొయ్యిలపై వంటలు చేయడం వంటి రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకో వైపు గ్యాస్ బుకింగ్ ఆన్లైన్ కావడంతో.. ఆన్లైన్ బుకింగ్లు కూడా కాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ప్రజలు పరేషాన్ చెందుతున్నారు. ఆఫ్లైన్లో గ్యాస్ కొనుగోలు చేసే ఏజెన్సీల వద్ద జనం సిలిండర్లు పట్టుకుని పోటెత్తుతున్నారు. సామాన్యులపై పెనుభారం పెంచిన గ్యాస్ ధరలతో సామాన్యులపై భారం పడుతోంది. ఇప్పటికే సామాన్య ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్నారు. రోజువారీగా కుటుంబం గడవడమే కష్టంగా మారింది. పేదల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. సంక్షేమ పథకాలు పూర్తిగా గాలికి వదిలేయడంతో పేద వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పడు మళ్లీ గ్యాస్ ధరలు పెంచడం గోరు చుట్టుపై రోకలి పోటు చందంగా మారింది. పెరిగిన గ్యాస్ ధరను రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరించి పేదలను ఆదుకోవాలి. – మేకపాటి రాజగోపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, ఉదయగిరి పెరిగిన సిలిండర్ ధర తగ్గించాలి ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలి. ఏడాదిలో రెండు సార్లు ధరలు పెంచారు. మాలాంటి రోజు వారి కూలీ పనులు చేసుకునే జనాలకు భారంగా మారింది. అసలే నిత్యావసర సరుకులఽ ధరలు పెరిగి ఏ వస్తువు కొనలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు గ్యాస్ ధర పెరగడంతో కుటుంబ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం వెంటనే పెంచిన ధరను తగ్గించి పేదలను ఆదుకోవాలి. – ఎన్.లక్ష్మీదేవి, గృహిణి -
వైకల్యం ఓడింది.. సంకల్పం గెలిచింది
● జాతీయ స్థాయిలో పొదలకూరు దివ్యాంగుడి ప్రతిభ ● తల్లి ప్రోత్సాహంతో విజయ తీరాలకు.. దివ్యాంగుడిగా ఎన్నో బాధలు.. అవమానాలు.. కష్టాలు.. కన్నీళ్లు ఉన్నా తన తల్లి అందించిన ప్రోత్సాహం వల్ల జాతీయ స్థాయి దివ్యాంగుల వాలీబాల్ పోటీల్లో రాణించారు పొదలకూరుకు చెందిన వ్యక్తి. తండ్రిని కోల్పోయినా.. క్రీడలపై మక్కువతో ఆత్మ విశ్వాసాన్ని విడవకుండా వృద్ధురాలైన తల్లితో జీవిస్తూ విజయ తీరాలను అందుకునేందుకు ఇంకా శ్రమిస్తూనే ఉన్నాడు. ఉపాధ్యాయుడిగా ఎంపికై తన తల్లిని బాగా చూసుకోవాలనే పట్టుదలతో ముందుకు వెళ్తున్నాడు.పొదలకూరు: పొదలకూరు పట్టణంలో నివసిస్తున్న కంభాపు పెంచలయ్య చిన్న వయస్సు లోనే తండ్రి రామయ్యను కోల్పోయారు. అప్పటి నుంచి తల్లి అంకమ్మ పెంపకంలో పెరిగారు. బిడ్డ భవిష్యత్తే లక్ష్యంగా ఆమె తమ కుల వృత్తి అయిన దుస్తులు ఉతికి ఐరన్ చేస్తూ బిడ్డను ఉన్నతంగా చదివించారు. అయితే పెంచలయ్య 80 శాతం వికలత్వంతో జన్మించినా ఏనాడు ఆ తల్లి నిట్టూర్చలేదు. లేకలేక జన్మించిన పెంచలయ్య తమ గారాలపట్టిగా పెంచుకుంది. దీనికితోడు అంకమ్మకు చెవుడు రావడంతో జీవితం మరింత ఇబ్బందిగా మారింది. అయినా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు. కుమారుడిని పొదలకూరులో ఇంటర్, డిగ్రీ వరకు చదివించారు. ఆ తర్వాత ఎంఏ, బీఈడీ నెల్లూరులో అష్టకష్టాలు పడి చదివించారు. క్రీడలపై ఆసక్తి చదువుల తర్వాత పెంచలయ్య దివ్యాంగుల క్రీడలపై ఆసక్తి పెంపొందించుకున్నారు. దీంతో తనకు ఇష్టమైన క్రీడలపై నిరంతరం శ్రమించి పట్టు సాధించాడు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రతిభ చాటుతూ చివరకు జాతీయ స్థాయికి ఎదిగాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నగరంలో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి పారా సిట్టింగ్ వాలీబాల్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపికై ఆడిన పెంచలయ్య అద్భుత ప్రతిభ కనబరిచారు. జట్టు విజయానికి తన వంతు కృషి చేసి రాష్ట్ర జట్టు ప్రథమ స్థానాన్ని సాధించేందుకు ఒకడిగా నిలిచారు. దీంతో జాతీయ స్థాయిలో అభినందనలు అందుకున్న పెంచలయ్య పొదలకూరుకు చేరుకున్నాడు. అమ్మను బాగా చూసుకోవాలి క్రీడల్లో ఎన్ని విజయాలు సాధించినా అమ్మను బాగా చూసుకునేందుకు ఇన్ని కష్టాలు పడుతున్నానంటాడు పెంచలయ్య. వైకల్యం శరీరానికే కాని పట్టుదలకు కాదంటున్నాడు. సంకల్పం ఉంటే ఏదైనా సాధించేందుకు వీలు కలుగుతుందని, అవకాశాలు తలుపు తట్టవని.. మనమే అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లాలని ఇప్పటి యువతకు మార్గదర్శకంగా చెబుతున్నారు. క్రీడా కోటాలో ఉద్యోగం సాధించి ఎనిమిది పదుల వయస్సులో ఉన్న తన తల్లి అంకమ్మను బాగా చూసుకోవడం తన ముందున్న పెద్ద లక్ష్యంగా చెప్పాడు. పారా సిట్టింగ్ వాలీబాల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు బోడపాటి శివదత్ తనను ఎంతగానో ప్రోత్సహించారని తెలిపారు. అయితే పెంచలయ్య పట్టణంలోని నరసారెడ్డి కాలనీ సమీపంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ప్రోత్సహిస్తే క్రీడాకారునిగా మరింత ప్రతిభ చూపేందుకు అవకాశం ఉంటుందంటున్నాడు. -
మాకు కోడిగుడ్లు అందలేదు
● ఆహార కమిషన్ తనిఖీల్లో వెలుగులోకి.. ● వివిధ ప్రాంతాల్లో సభ్యుడు లక్ష్మీరెడ్డి పర్యటన ● కోడిగుడ్ల నిల్వపై ఆగ్రహం ● టీచర్లు, హెచ్ఎంలకు షోకాజ్ నోటీసులుకోవూరు: రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు ఈ.లక్ష్మీరెడ్డి గురువారం కోవూరు నియోజకవర్గంలో పర్యటించారు. కోవూరు మండలం పాటూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. 147 కాలం చెల్లిన గుడ్లు నిల్వ ఉండటాన్ని ఆయన గుర్తించారు. లబ్ధిదారులకు ఫోన్ చేయగా, తమకు గుడ్లు అందలేదని చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అంగన్వాడీ టీచర్, సూపర్వైజర్ సుమిత్రకు షోకాజ్ నోటీసులివ్వాలని ఐసీడీఎస్ నోడల్ ఆఫీసర్ అనురాధను ఆదేశించారు. పాటూరు జెడ్పీ బాలుర హైస్కూల్లో తనిఖీలు చేశారు. మధ్యాహ్న భోజనాన్ని మరోచోట తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి లిఖితపూర్వక అనుమతి లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని, హెచ్ఎంకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని డీఈఓను ఆదేశించారు. అనంతరం దామరమడుగు హైస్కూల్కు వెళ్లారు. ఇక్కడ కూడా గుడ్లు పెద్ద సంఖ్యలో నిల్వ ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇంత భారీ స్థాయిలో స్టాక్ ఎందుకు తీసుకున్నారో సమాధానం చెప్పలేక సిబ్బంది నీళ్లు నమిలారు. అలాగే, బుచ్చిరెడ్డిపాళెం బాలికల హైస్కూల్లో ఆయన తనిఖీ చేయగా స్టాక్ రిజిస్టర్ ప్రకారం ఉండాల్సిన దానికంటే 760 గుడ్లు తక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ అక్రమాలపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తూ, బాధ్యులైన హెచ్ఎంలకు నోటీసులివ్వాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల్లో.. నెల్లూరు(పొగతోట): ఆహార కమిషన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి గురువారం జిల్లాలోని చౌకదుకాణాలు, అంగన్వాడీ కేంద్రాలు, గురుకుల పాఠశాలను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల్లో కోడిగుడ్లు నిల్వ ఉన్న ట్లు గుర్తించారు. సంబంధిత సిబ్బందికి షోకాజు నోటీసులివ్వాలని అధికారులను ఆదేశించారు. నగరంలో చౌకదుకాణాలను పరిశీలించి కార్డుదారులకు రేషన్ సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్ఓ లీలారాణి, సివిల్ సప్లైస్ డీఎం అర్జున్రావు, ఏఎస్ఓ లక్ష్మీనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కండలేరులో 50.580 టీ ఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 50.580 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,100, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 240, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
బారులు తీరి.. అమ్మవారిని దర్శించుకుని..
చిల్లకూరు: మండలంలోని తీర ప్రాంతమైన తూర్పుకనుపూరులో ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో జరుగుతున్న జాతర సందర్భంగా అమ్మవారికి గురువారం బంగారు చీరను అలంకరించారు. దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తూర్పుకనుపూరుకు చేరుకున్నారు. పలు రాష్ట్రాలకు చెందిన వారు మొక్కుల తీర్చుకునే క్రమంలో పొంగళ్లు పెట్టి చీర, సారె సమర్పించారు. ఆలయంలో క్యూలైన్లు పూర్తిగా నిండిపోవడంతో అమ్మ వారి దర్శనానికి గంటకు పైగా సమయం పట్టింది. దీంతో కొందరు ఇలా ఎప్పుడూ జరగలేదని వాపోయారు. సాయంత్రానికి భక్తుల సంఖ్య విపరీతంగా పెరగడంతో అధికారులు చర్యలు చేపట్టారు. వైభవంగా గ్రామోత్సవం జాతర సందర్భంగా పోలేరమ్మ గుడికి సమీపంలో కొలువుదీరిన యారా గురునాథస్వామికి గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇసుక తిన్నెలపై ఉన్న గురునాథస్వామి వద్ద ఉన్న అక్క దేవతలు, గంగపెట్టెకు గొల్లలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణాచారి ముందు ఉండగా, గంగపెట్టెను ఎత్తుకుని గొల్లలు నడుస్తుండగా గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా చేశారు. ఈ సందర్భంగా గొల్లలు వేసిన వీరతాళ్లు అందరిని అలరించాయి. పోలీసుల పెత్తనం జాతర సందర్భంగా ఆలయంలో భక్తులకు సౌకర్యాలు కల్పించే బాధ్యత మొత్తం దేవదాయ శాఖ చూసుకోవాల్సి ఉంది. అయితే ఈ ఏడాది పెత్తనం మొత్తం పోలీసులు తమ చేతుల్లోకి తీసుకున్నారు. తమకు కావాల్సిన వారిని ఇష్టానుసారంగా పంపి అమ్మవారి దర్శనం చేయించారు. దీంతో క్యూలైన్లలో ఉన్న భక్తులు ఇబ్బంది పడ్డారు. ఆలయ పాలకమండలి కూడా గతంలో ప్రత్యేక పాస్ సౌకర్యం కల్పించేది. అయితే ఈసారి పోలీసులు పాస్లు ఇచ్చే ఆనవాయితీని ఆపేశారు. తాము ప్రత్యేక పాస్లను నచ్చిన వారికి ఇచ్చారని విమర్శలున్నాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా జాతర సందర్భంగా మాతమ్మల చేత చిందులు వేయించడంతో గుర నాథస్వామి గ్రామోత్సవంలో తోపులాట జరిగింది. అయినా పోలీసులు పట్టించుకున్న దాఖలాల్లేవని మహిళా భక్తులు విమర్శించారు. -
కొలతలు వేసి.. క్షుణ్ణంగా పరిశీలించి..
● ముగిసిన ఏసీబీ అధికారుల తనిఖీలు ● నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తింపు నెల్లూరు(బారకాసు): నెల్లూరు నగరంలో ఏసీబీ అధికారుల తనిఖీలు ముగిశాయి. గురువారం కూడా ఆర్అండ్బీ, టౌన్ ప్లానింగ్ అధికారులను వెంట బెట్టుకుని మినీబైపాస్, మాగుంట లేఅవుట్, వనంతోపు సెంటర్ తదితర ప్రాంతాలకు వెళ్లారు. భవనాలను కొలతలు వేసి క్షుణ్ణంగా పరిశీలించారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు ఆదేశాల మేరకు సీఐ వెంకటేష్, విజయ్కుమార్ పర్యవేక్షణలో రెండు బృందాలుగా విడిపోయి పలు ప్రాంతాల్లో రెండు రోజులపాటు క్షేత్రస్థాయిలో 10 భవన నిర్మాణాలను పరిశీలించారు. వాటిలో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఇప్పటికే కార్యాలయంలోని రికార్డులను సీజ్ చేసిన ఏసీబీ అధికారులు, అక్రమాస్తులు, నిబంధనలకు విరుద్ధంగా జరిగిన లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. మొత్తం వ్యవహారంపై నివేదికలు తయారు చేసి రాష్ట్ర ఉన్నతాధికారులకు పంపనున్నారు. అనంతరం బాధ్యు లపై కఠిన చర్యలు ఉంటాయని తెలిసింది. -
ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు
● రూ.5,43,649ల రికవరీకి ఆదేశం సీతారామపురం: మండలంలోని 14 పంచాయతీల్లో జరిగిన ఉపాధి హామీ పనుల్లో అవకతవకలను అధికారులు గుర్తించారు. రూ.5,43,649ల రికవరీకి ఆదేశించారు. సీతారామపురంలోని సీ్త్రశక్తి భవన ప్రాంగణంలో గురువారం 15వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. మండలంలో 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన ఉపాధి హామీ పనులపై నెలరోజులుగా విచారణ చేపట్టిన డీఆర్పీలు నివేదికలను డ్వామా పీడీ గంగా భవాని ముందు వెల్లడించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మండలంలో సుమారు రూ.10 కోట్లతో పనులు జరిగాయన్నారు. వాటిలో రూ.6.65 కోట్లు కూలీలకు చెల్లించినవి కాగా రూ.2.90 కోట్లు ఇతర పనులకు వినియోగించారన్నారు. టెక్నికల్ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంతో తప్పులు జరిగాయన్నారు. కొలతల్లో తేడాలున్న ప్రతి పనికి రికవరీ విధించామన్నారు. పలు పంచాయతీల్లో వంద రోజులు పూర్తయినా కూడా అదే కుటుంబానికి సింగిల్ జాబ్కార్డులను కొత్తగా తయారుచేసి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనులు కల్పించడం వంటివి గుర్తించామన్నారు. అలాంటి వాటికి కూడా రికవరీ రాశామన్నారు. ఎం బుక్ల్లో తేడాలకు టీఏ, ఈసీలు, మస్టర్లలో తేడాలకు ఏపీఓ, ఫీల్డ్ అసిస్టెంట్లు బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో డీవీఓ విజయలక్ష్మి, ఎస్సార్పీ భాస్కర్, డీఆర్పీలు నూతన్, నాగరాజు, మల్లికార్జున్, ఏపీఓలు శ్యామల, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. -
డైట్లో ముగిసిన శిక్షణ
ఇందుకూరుపేట: మండలంలోని పల్లిపాడు డైట్లో 20 రోజుల పాటు నిర్వహించిన టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం గురువారంతో ముగిసింది. కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి కరికులం, టెక్స్ట్ బుక్ డెవలప్మెంట్ విభాగ ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఇన్చార్జి ప్రిన్సిపల్ అక్కిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జెడ్పీలో కారుణ్య నియామకాలు నెల్లూరు(పొగతోట): జెడ్పీ యాజమాన్య పరిధిలో విధులు నిర్వర్తిస్తూ మరణించిన ఐదుగురు ఉద్యోగుల కుటుంబసభ్యులకు ఉద్యోగావకాశాలను కారుణ్య నియామకాల ద్వారా కల్పించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, సీఈఓ శ్రీధర్రెడ్డి, డిప్యూటీ సీఈఓ మోహన్రావు గురువారం అందజేశారు. జూనియర్ అసిస్టెంట్గా ఒకర్ని, ఆఫీస్ సబార్డినేట్లుగా నలుగుర్ని నియమించారు. అదే విధంగా జెడ్పీలో సీనియర్ సహాయకులుగా పనిచేస్తున్న ఇద్దరికి పరిపాలనాధికారులుగా ఉద్యోగోన్నతులు కల్పించారు. అసోసియేషన్ నేతలు లక్కాకుల పెంచలయ్య, బాషా, భీమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 9 నుంచి పొగాకు కొనుగోళ్లు ఆత్మకూరు రూరల్: డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో పొగాకు కొనుగోళ్లను వచ్చే నెల తొమ్మిది నుంచి ప్రారంభించనున్నామని నిర్వహణాధికారి సునీల్కుమార్ పేర్కొన్నారు. మండలంలోని జాలయ్యనగరంలో పొగాకు రైతులతో కలిసి క్షేత్ర దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. పొగాకు తోటల్లో పరిశీలన, కొనుగోళ్ల కంపెనీలతో కలిసి శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పొగాకు పంటలో నూతన వంగడాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. క్యూరింగ్ చేసిన బేళ్లనే వేలం కేంద్రానికి తీసుకురావాలని కోరారు. బోర్డు నిబంధనల మేరకు ఒక్కో బేలు 150 కిలోలకు మించకుండా చూడాలని సూచించారు. ఐటీసీ మేనేజర్ వెంకటేశ్వరరావు, జీపీఐ కంపెనీ మేనేజర్ గోపిరెడ్డి, పొగాకు బోర్డు ఫీల్డ్ ఆఫీసర్ ఆదర్శ్ జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. -
ఈ ప్రభుత్వంతో ఒరిగేదేమీలేదు
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పింఛన్లు ఇలా అన్ని పథకాల్లో ప్రభుత్వం కోతలు విధిస్తోంది. దీంతో సర్కార్పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లింది. సన్నకారు రైతులకు ఏ మాత్రం లబ్ధి చేకూరడంలేదు. – బొద్దుకూరు జయమ్మ, నెల్లూరు జిల్లాలోని రైతులకు అందుతుంది జిల్లాలో 1,95,866 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తిస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్లో 1,63,125 మంది అర్హులుగా ఉన్నారు. వీరందరికీ నగదు జమవుతుంది. – సత్యవాణి, జిల్లా వ్యవసాయాధికారి -
అన్నదాతకు వంచన
అన్నదాత.. నాడు ఖుషీఖుషీగా ● ఫల సాయాన్ని అందించడంలోనూ కక్కుర్తే ● కుంటిసాకులతో పలువురి పేర్ల తొలగింపు ● జగనన్న హయాంలో రైతు సంక్షేమానికి పెద్దపీట ● ప్రస్తుత సర్కార్ తీరుతో అంతా అయోమయం వ్యవసాయమే దండగా అంటూ నాడు ప్రకటించిన చంద్రబాబు.. తాజాగా అదే పోకడను అవలంబిస్తూ అన్నదాత పొట్టగొడుతున్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించి, అధికారంలోకి రావడం.. ఆ తర్వాత తన ఫార్ములా రాజకీయాలను అమలు చేయడంలో ఆయనకెవరూ సాటిరారనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇందులో తాజాగా అన్నదాత సుఖీభవ పథకం చేరింది. కేంద్ర సాయంతో సంబంధం లేకుండా ప్రతి రైతుకూ రూ.20 వేలను అందిస్తామని ఆర్భాటంగా ప్రకటించిన ఆయన ప్రస్తుతం దాన్ని తుంగలో తొక్కారు. పైగా వివిధ కొర్రీలు పెట్టి అర్హుల పేర్లను మాయం చేసి వారిని వంచించారు. నెల్లూరు(వేదాయపాళెం): అన్నదాతను టీడీపీ ప్రభుత్వం దగా చేస్తోంది. బూటకపు హామీలతో గద్దెనెక్కిన కూటమి సర్కార్, ప్రస్తుతం రైతులకు అందించే సాయంలోనూ తన కక్కుర్తి బుద్ధిని ప్రదర్శిస్తోంది. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నిధులను శుక్రవారం జమ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో రైతుల సంఖ్యకు భారీగా కోత విధించింది. పంగనామాలు.. కేంద్రంతో సంబంధం లేకుండా రైతులకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేస్తానంటూ గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత హోదాలో ప్రస్తుత సీఎం చంద్రబాబు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇది నిజమేనని నమ్మి ఆయనకు ఓట్లేసిన కర్షకులకు తన నిజస్వరూపాన్ని ఆయన చూపారు. జిల్లాలో 84,134 మంది రైతులను అనర్హులుగా ప్రకటించి వారికి శోకాన్ని మిగిల్చారు. విశిష్ట గుర్తింపు సంఖ్య నమోదు, ఫార్మర్ రిజిస్ట్రేషన్ తదితర కుంటిసాకులతో ఇలా వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇలా.. జిల్లాలో 2.8 లక్షల మంది రైతులున్నారు. అయితే వీరిలో 1,95,866 మందే అర్హులంటూ జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో 1,63,125 మందికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి వర్తిస్తోంది. వీరికి స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్ను విడుదల చేయాల్సిన తరుణంలో అన్నదాత సుఖీభవకు అరకొరగా ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. నిధుల విడుదల నేడు అన్నదాత సుఖీభవ మూడో విడత.. పీఎం కిసాన్ 22వ విడత పెట్టుబడి సాయం నిధులు శుక్రవారం సాయంత్రం విడుదల కానున్నాయని జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి తెలిపారు. అన్నదాత సుఖీభవ ద్వారా 1,95,866 మందికి రూ.78.35 కోట్లు.. పీఎం కిసాన్ ద్వారా 1,63,125 మందికి రూ.32.63 కోట్లు జమకానున్నాయని వెల్లడించారు. ఉదయగిరికి రూ.25.74 కోట్లు, ఆత్మకూరుకు రూ.19.59 కోట్లు, కావలికి రూ.10.14 కోట్లు, కోవూరుకు రూ.9.3 కోట్లు, సర్వేపల్లికి రూ.15.84 కోట్లు, నెల్లూరుకు రూ.2.97 కోట్లు, వెంకటగిరికి రూ.9.07 కోట్లు, కందుకూరుకు రూ.18.33 కోట్ల మేర నిధులు జమకానున్నాయని పేర్కొన్నారు. పీఎం కిసాన్ సాయం అన్నదాత సుఖీభవ గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి.. రైతుల సంక్షేమానికి పెద్దపీటేశారు. ఆ సమయంలో ఒక కుటుంబంలో ఎంత మంది రైతులుంటే అందరికీ రైతు భరోసా పథకాన్ని వర్తింపజేశారు. ఎలాంటి ఆంక్షల్లేకుండా.. పార్టీలకతీతంగా అందరికీ అందజేశారు. ఆ సమయంలో పది సెంట్లున్న రైతుకూ సాయమందేది. అయితే ప్రస్తుత ప్రభుత్వం తమను విస్మరిస్తోందనే భావన కర్షకుల్లో వ్యక్తమవుతోంది. -
జగన్ను మరోసారి సీఎం చేద్దాం
నెల్లూరు రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని మరోసారి సీఎంను చేయాలని ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని రామ్జీనగర్లో గల పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి చంద్రశేఖర్రెడ్డి, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ పరిశీలకుడు కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి 16 కిలోల కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్రెడ్డి మాట్లాడారు. పార్టీని ప్రజలు తమ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారని చెప్పారు. ఎన్నో సంక్షేమ పథకాలను దివంగత సీఎం వైఎస్సార్ అమలు చేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయసాధనే లక్ష్యంగా ప్రజలకు సుపరిపాలనను గత సీఎం జగన్మోహన్రెడ్డి అందించారని తెలిపారు. సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. రాబోయేది జగనన్న పాలనేనని చెప్పారు. రాష్ట్రానికి మంచి జరగాలంటే అది జగన్మోహన్రెడ్డితోనేననే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. -
జగనన్నను ప్రజల నుంచి వేరు చేయలేరు
ఇందుకూరుపేట: పేదల గుండెల్లో నుంచి పుట్టిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని.. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా.. ఎన్ని కుట్రలు చేసినా జగనన్నను ప్రజల నుంచి వేరు చేయలేరని మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇందుకూరుపేటలోని ఆరో మైలు వద్ద గల వైఎస్సార్ విగ్రహానికి గురువారం నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. మహానేత వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక 600 మంది మరణిస్తే, వారి కుటుంబాలను పరామర్శించేందుకు జగనన్న నాడు పూనుకున్నారని చెప్పారు. అయితే దీనికి సోనియాగాంధీ నిరాకరించడంతో ఆమెను ఎదిరించి ఓదార్పు యాత్రను చేపట్టిన అంశాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్, చంద్రబాబు కుమ్మకై ్క ఆయన్ను 16 నెలలు జైల్లో అక్రమంగా నిర్బంధించినా బెదరలేదన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం కుంటుపడ్డాయని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని చెప్పారు. తమ పార్టీ శ్రేణులపై కేసులను అక్రమంగా మోపి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ విజయం తథ్యమన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతి, రైతు విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మావులూరు శ్రీనివాసులురెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు కొండూరు అనిల్బాబు, గొల్లపల్లి విజయకుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి బట్టేపాటి నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. . -
దేశ రాజకీయాల్లో ఓ చరిత్ర
చిల్లకూరు: దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ పేర్కొన్నారు. గూడూరులోని సనత్నగర్లో గల పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కేక్ను కట్ చేశారు. దివంగత సీఎం వైఎస్సార్ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట ప్రజల ఆకాంక్ష మేరకు పార్టీని జగన్మోహన్రెడ్డి స్థాపించారని గుర్తుచేశారు. సంక్షేమ పథకాలను ప్రజల ఇళ్ల వద్దే అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. పట్టణ, రూరల్ కన్వీనర్లు బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయకుమార్రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఊటుకూరు మహేంద్రరెడ్డి, తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు మెట్టా రాధాకృష్ణారెడ్డి, నందవరం సుబ్బారావు, మహిళా విభాగ నేతలు సృజనారెడ్డి, దీప్తి, షంషీర్, నేతలు వినోద్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు. -
నిరంతరం ప్రజాసేవలోనే..
వింజమూరు(ఉదయగిరి): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా పక్షమని, ప్రజాసేవలో నిరంతరం కృషి చేస్తూ వారి తరఫున పోరాటం చేస్తోందని పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు. వింజమూరు మండలంలోని కాటేపల్లిలో గురువారం నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆయన హాజరయ్యారు. వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం పార్టీని జగన్మోహన్రెడ్డి స్థాపించారని చెప్పారు. భవిష్యత్తు తమదేనని.. ఎవరూ అధైర్యపడొద్దని తెలిపారు. -
సోమిరెడ్డి అవినీతికి అంతేలేదు
● ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు రూరల్: సర్వేపల్లిలో సోమిరెడ్డి అవినీతికి అంతే లేకుండాపోయిందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన నాటకంలో సర్పంచ్ సుబ్బయ్య పాత్రను సోమిరెడ్డి వేయడంపై ‘సుబ్బయ్య‘ అని సంబోధిస్తూ సైటెర్లు వేశారు. ఆ నాటకం ద్వారా తనకు మంత్రి పదవి కావాలంటూ సీఎం చంద్రబాబుకు ఆయన పరోక్షంగా చెప్పారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు దిగజారాయని ఆరోపించారు. జిల్లాలో బాలికలపై అఘాయిత్యాలు నానాటికీ ఎక్కువవుతున్నాయని ఆరోపించారు. గుమ్మళ్లదిబ్బ ఘటనను మరువకముందే వరిగొండలో మరో బాలికపై అఘాయిత్యం జరిగిందని, వీటిని దాచిపెట్టేందుకు పోలీసులు యత్నించడం దారుణమన్నారు. సస్పెండైన సీఐ, ఎస్సైపై ఉదాసీనతతో వ్యవహరించకుండా విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు. కేసును దర్యాప్తు చేసిన ఇన్చార్జి సీఐను సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు. కాగితాలపూరు క్రాస్ రోడ్డు వద్ద రూ.100 కోట్ల విలువైన భూమికి సోమిరెడ్డి ఎసరు పెట్టారని విమర్శించారు. గుమ్మళ్లదిబ్బలో బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకెళ్లి, వారి ఇంటికి దూరంలో వివరాలను ప్రస్తావించకుండా మాట్లాడి ప్రభుత్వాన్ని ప్రశ్నించాననే కారణంతో తనపై కేసు నమోదు చేసి, తన కుమార్తెకు నోటీసులిచ్చారని దుయ్యబట్టారు. ప్రశ్నించే వారిపై కేసులు పెడుతూ తమ బాధ్యతలను పోలీసులు విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. వరిగొండలో బాలికపై జరిగిన ఘటనపై పెద్దాస్పత్రికి వెళ్లి తమ పార్టీ మహిళా నేతలు విచారిస్తే, ఆచూకీ తెలియనీయకుండా కప్పిపుచ్చేందుకు పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది యత్నించారని ఆరోపించారు. డ్యూటీలో ఉన్న డాక్టర్ గీతాలక్ష్మి.. బాలిక విషయం తెలియదంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని చెప్పారు. గంజాయి కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి.. బాలికపై మత్తులో అఘాయిత్యానికి పాల్పడితే ఏ చర్యలు చేపట్టారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, సమాధానం చెప్పలేక కొత్త డ్రామాలకు తెరలేపి బాలిక కుటుంబాన్ని అదృశ్యం చేశారని మండిపడ్డారు. ఆ కుటుంబం ఎక్కడికెళ్లింది.. వారు క్షేమంగానే ఉన్నారాననే అనుమానం కలుగుతోందన్నారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే కృష్ణపట్నం పోర్టు సీఐ రవినాయక్, ముత్తుకూరు ఎస్సై ప్రసాద్రెడ్డిని సస్పెండ్ చేశారని ఆరోపించారు. రవినాయక్కు పోలీస్ శాఖలో కొనసాగే అర్హత లేదని తెలిపారు. తమ పార్టీ నేతలపై అనేక అక్రమ కేసులు పెట్టి, జైలు పాల్జేశారని.. చివరికి ఒక తప్పుడు కేసులో జడ్జి చీవాట్లు పెట్టారన్నారు. గతంలో ఎస్పీగా విధులు నిర్వర్తించిన కృష్ణకాంత్ అసమర్థతతో జిల్లా భ్రష్టుపట్టిపోయిందని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. సోమిరెడ్డి మాటలు విని అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురికావొద్దని పోలీసులకు హితవు పలికారు. కాగితాలపూరు క్రాస్ రోడ్డు వద్ద ఉన్న భూములకు సంబంధించి తహసీల్దార్ సంతకం చేయకపోవడంతో కొత్త వారిని నియమించుకున్నారని చెప్పారు. సోమిరెడ్డి అవినీతిపై బీజేపీ నేతలే మీడియా ఎదుట మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఆయనంత అవినీతిపరుడు మరొకరు లేరని చెప్పారు. ఆయన బెదిరింపులకు తాము భయపడేదిలేదని స్పష్టం చేశారు. -
గంగమిట్టపై కొలువుదీరిన పోలేరమ్మ
● పుష్పాలంకారంలో ముత్యాలమ్మ దర్శనం ● తూర్పుకనుపూరు వైపు భక్తుల అడుగులు చిల్లకూరు: మండలంలోని తూర్పుకనుపూరులో పోలేరమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. రెండో రోజైన బుధవారం మెట్టినింట నుంచి గంగమిట్టపై కొలువుదీరేందుకు వచ్చిన పోలేరమ్మను ఊరేగింపుగా తీసుకొచ్చారు. మార్గమధ్యలో తన సోదరి ముత్యాలమ్మను పలకరించిన అనంతరం తాత్కాలిక తాటాకుల గుడిసెలో కొలువుదీరారు. పంబలోళ్ల వాయిద్యాల మధ్య పోలేరమ్మ తల్లి గంగమిట్ట మీదకు వచ్చే సమయంలో దారిలో భక్తులు మొక్కులు చెల్లించారు. అమ్మవారికి నడకోకల మధ్య స్వాగతం పలికారు. ముందు గణాచారి నడుస్తుండగా పంబలోళ్లు వాయిద్యాలు, కొమ్ము బూరలు ఊదుతుండగా అమ్మవారిని గుడిసెలో కొలువుదీర్చారు. తర్వాత కుంభం పోసి దిష్టి తీర్పు తీర్చిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. యారా గురనాథస్వామి గ్రామోత్సవం గణాచారి ముందు నడుస్తుండగా గొల్లలు వీరతాళ్లు వేస్తూ అక్క దేవతలతో పాటు గురనాథస్వామి గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని కేరింతలు కొట్టారు. అలసత్వం వద్దు జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు పాటించాలని, అలసత్వం వహించి ఏదైనా జరిగితే సంబంధిత డ్యూటీ ప్రాంతంలో ఉన్న సిబ్బందిపై చర్యలు తప్పవని అడిషనల్ ఎస్పీ సౌజన్య తెలిపారు. బందోబస్తును ఆమె పరిశీలించి పలు సూచనలిచ్చారు. అలాగే గూడూరు ఆర్డీఓ సత్యనారాయణ, ముఖ్య నాయకులు, అధికారులు పోలేరమ్మ, ముత్యాలమ్మను దర్శించుకున్నారు. వారికి దేవదాయ శాఖ అధికారులు స్వాగతం పలికి ఆలయ మర్యాదలు చేశారు. తొలిరోజే లక్ష మందికిపైగా.. జాతరలో తొలిరోజు తూర్పుకనుపూరుకు లక్ష మందికి పైగా భక్తులు హాజరైనట్లు అధికారులు అంచనా వేశారు. దూర ప్రాంతాల నుంచి భక్తులు రాకముందే స్థానికంగా ఉన్నవారు దర్శించుకునేందుకు వచ్చినట్లు తెలిపారు. వీరు ముత్యాలమ్మతో పాటు పోలేరమ్మను దర్శించుకుని మొక్కలు చెల్లించారు. -
పేదల గుండెచప్పుడు వైఎస్సార్సీపీ
కోవూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ కాదని, పేదల గుండె చప్పుడని మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం పురస్కరించుకొని నెల్లూరులోని తన నివాసంలో బుధవారం ఆయన మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్సార్ ఆశయాలను పుణికిపుచ్చుకొని ఆవిర్భవించింది తమ పార్టీ అన్నారు. జగనన్న స్థాపించిన ఈ పార్టీ ప్రతి పేదవాడి గడపకు చేరిందని చెప్పారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయన వెన్నంటే ఉండి పార్టీని కాపాడుకున్న ఘనత కార్యకర్తలకే దక్కుతుందని కొనియాడారు. సంక్షేమ రాజ్యాన్ని మరోసారి తీసుకురావడమే తమ లక్ష్యమని వివరించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ప్రజల పక్షాన తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ మరింత బలోపేతమవుతుందని కాంక్షించారు. భోజన వసతికి టెండర్ల ఆహ్వానం నెల్లూరు(క్రైమ్): మూలాపేటలోని జైళ్ల శాఖ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందే సిబ్బందికి భోజన సదుపాయాన్ని కల్పించేందుకు గానూ టెండర్లను ఆహ్వానిస్తున్నామని ఏపీ స్టార్స్ ప్రిన్సిపల్ ప్రకాష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి కాంట్రాక్ట్ అమల్లో ఉంటుందని, టెండర్ విలువ రూ.20,16,450 అన్నారు. ఆసక్తి గల కాంట్రాక్టర్లు రూ.112ను చెల్లించి టెండర్ ఫారాన్ని ఏపీ స్టార్స్లో పొందొచ్చని చెప్పారు. పూర్తి చేసిన ఫారాలను సీల్డ్ కవర్లో ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వీకరించనున్నామని, అదే రోజు మధ్యాహ్నం 2.30కు వీటిని తెరవనున్నామని వివరించారు. ధరావతుగా రూ.40,329ను చెల్లించాల్సి ఉంటుందని, వివరాలకు తమ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. -
వెలుగులదివ్వె.. జువ్వలదిన్నె
జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప.. టీడీపీ ప్రభుత్వం పునాది వేసి.. పూర్తి చేసిన ప్రాజెక్ట్ ఒక్కటీ లేదు. 42 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో మొత్తంగా 16 ఏళ్ల రాజ్యాధికారంలో ఆ పార్టీ మార్కు అభివృద్ధి ఇది అని చెప్పే ఒక్క ప్రాజెక్ట్ లేదంటే అతిశయోక్తి లేదు. పునాది రాళ్లు కూడా వేయని ప్రాజెక్ట్లకు ఉద్యమంలా శిలాఫలకాలు వేయడం, గత ప్రభుత్వాలు పూర్తి చేసిన ప్రాజెక్ట్ల క్రెడిట్ చోరీ చేసి తమ ఖాతాలో వేసుకోవడం తప్ప.. టీడీపీ పాలనలో అభివృద్ధి శూన్యమనే చెప్పాలి. ఈ జాబితాలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, దగదర్తి ఎయిర్ పోర్టు, రామాయపట్నం పోర్టు ఉండడం గమనార్హం. కనీసం డీపీఆర్లు, నిధుల కేటాయింపులు లేకుండానే ఏకంగా శిలాఫలకాలు వేసిన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుండగా, తాజాగా ఆ జాబితాలో మంత్రి లోకేశ్ కూడా చేరుతున్నారు. – సాక్షి ప్రతినిధి, నెల్లూరు గాల్లో చక్కర్లు కొడుతున్న.. దగదర్తి ఎయిర్పోర్టు ● వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే హార్బర్ నిర్మాణానికి పునాది, పూర్తి ● 72 ఎకరాల్లో రూ.288.80 కోట్లతో నిర్మాణం ● 1,250 బోట్లు నిలిపే సామర్థ్యంతో ఏర్పాటు ● ఏటా 41,250 టన్నుల మత్స్యసంపద వెలికితీతే లక్ష్యం ● పూర్తయిన ఈ ప్రాజెక్ట్ను అటకెక్కించిన చంద్రబాబు సర్కారు నేను జువ్వలదిన్నె హార్బర్ను కట్టేశా..! నానారు.. ఎయిర్పోర్టును పూర్తి చేశా..!జిల్లాలో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రాజెక్ట్ ‘జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్’ ఒకటి. అపార మత్స్యసంపదకు నిలయమైన ఆంధ్రా తీరాన్ని వేటకు అనుకూలంగా మార్చి, ఎగుమతులకు అవకాశం కల్పి స్తే మత్స్యకారుల్లో వలసలను నివారించడంతో పాటు సాగర తీరాన్ని సుసంపన్నంగా మార్చాలనే లక్ష్యంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక దృష్టి సారించారు. సుమారు 76.89 ఎకరాల్లో రూ.288.8 కోట్ల వ్యయంతో 2021 మార్చి 19న జువ్వలదిన్నె ఫిషింగ్హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అదే సమయంలో కరోనా వంటి విపత్తు వచ్చినా.. అధిగమించి త్వరితగతిన పూర్తి చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి జువ్వలదిన్నె హార్బర్ దాదాపుగా పూర్తయింది. దీన్ని అప్పట్లో వర్చువల్గా ప్రారంభించాలని నిర్ణయించినప్పటికీ ఆఖరి నిమిషంలో తానే స్వయంగా వచ్చి ప్రారంభిస్తానని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వాయిదా వేశారు. ఆ వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రావడంతో ప్రారంభోత్సవం వాయిదా పడింది. 41,250 టన్నుల మత్స్యసంపదే లక్ష్యంగా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మత్స్యకారుల జీవితాల్లో వెలుగుల దివ్వెగా మార్చిన జువ్వలదిన్నెను టీడీపీ ప్రభుత్వం చీకట్లు కమ్ముకునేలా చేసింది. గత ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్ ద్వారా ఏటా 41,250 టన్నుల మత్స్య సంపదను వెలికి తీయడంతోపాటు హార్బర్ ఆధారిత పరిశ్రమల ద్వారా మత్స్సకారులకు అదనపు ఆదాయం పొందే మార్గాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా 20 ఎకరాల్లో ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, ఐదు ఎకరాల్లో బోట్ల తయారీ యూనిట్తోపాటు సుమారు 50 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ ఫుడ్పార్క్ల నిర్మాణంపై దృష్టి సారించింది. తద్వారా మత్స్యకార మహిళలకు, యువతకు స్థానికంగానే ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వలసలు పూర్తిగా నివారించాలని భావించింది. ఇప్పటి వరకు సరైన వేట, ఉపాధి అవకాశాలు లేక మత్స్యకారులు తమిళనాడు, పాండిచ్చేరి, ముంబై, గోవా వంటి ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సి వచ్చేది. 1250 బోట్లకు బెర్త్లు ఏర్పాటు.. జువ్వలదిన్నెలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్లో ఏక కాలంలో 1250 బోట్లు నిలిపే విధంగా బెర్త్లను నిర్మించింది. ఇప్పటి వరకు తీరంలో పెద్దబోట్లు నిలిపే అవకాశం లేకపోవడంతోపాటు సముద్రంలో 25 నాటికల్ మైళ్లు దాటి వేట చేపట్టలేని పరిస్థితి. ఈ ప్రాజెక్ట్ అందులోబాటులోకి వస్తే.. ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లే పరిస్థితి లేకుండా.. ఇక్కడి నుంచి వేటను సాగించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ వల్ల 25,000 మత్స్యకార కుటుంబాలకు ప్రత్యక్ష, పరోక్ష లబ్ధి చేకూరుతుంది. యువతకు ఉపాధి లభిస్తుంది. చంద్రబాబు చేసిందేమిటంటే.. జిల్లా మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపే ఈ ప్రాజెక్ట్ను చంద్రబాబు గతంలో 9 ఏళ్లు, ఆ తర్వాత ఐదేళ్లు అధికారంలో ఉన్నా.. నిర్మించాలనే ఆలోచనే చేయలేదు. అప్పటి ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను నిర్మిస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో 2019 ఎన్నికల నోటిఫికేషన్కు పది రోజుల ముందు హడావుడిగా ఆర్భాటంగా వచ్చి శిలాఫలకం వేసి చేతులు దులుపుకొన్నారు. కనీసం ఈ ప్రాజెక్ట్కు సంబంధించి భూసేకరణ చేపట్టలేదు. నిర్మాణ అంచనా వ్యయంపై డీపీఆర్కు పెన్ను సైతం పెట్టలేదు. చివరగా పెట్టిన ఓటాన్ బడ్జెట్లో కూడా కనీసం కేటాయింపులు కూడా పెట్టలేదంటే.. ఈ ప్రాజెక్ట్పై చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేసింది. ఈ ప్రాజెక్ట్ను వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే భూసేకరణ చేపట్టి, డీపీఆర్ సిద్ధం చేసి, నిధులు కేటాయించి పనులు పరుగులు పెట్టించి పూర్తి చేస్తే.. ఎన్నికల నోటిఫికేషన్తో మత్స్యకారులకు అంకితం చేయలేకపోతే.. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గడిచిన 21 నెలలుగా ఈ ప్రాజెక్ట్ ఊసే ఎత్తకపోవడం శోచనీయం. మత్స్యకారులంటే ఆయనకు ఉన్న ప్రేమ, చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. ఫిషింగ్ హార్బర్ కోసం సిద్ధం చేసిన భవనాలుజువ్వలదిన్నెలో నిర్మాణం పూర్తయిన బెర్తు2009 ఎన్నికల ముందు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కిసాన్సెజ్ ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలో కృష్ణపట్నం పోర్టు, కిసాన్ సెజ్కు ఇటు నెల్లూరు, అటు ప్రకాశం జిల్లాలకు అందుబాటులో ఉండేలా దగదర్తి వద్ద జాతీయ రహదారికి పక్కనే ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రతిపాదనలు చేశా రు. ఈ మేరకు భూసేకరణకు శ్రీకారం చుట్టారు. అయితే ఆయన అకాల మరణంతో ఎయిర్పోర్టు నిర్మాణానికి గ్రహణం పట్టింది. 2014 ఎన్నికల సమయంలో ఈ ఎయిర్పోర్టును ఎన్నికల ప్రచారాస్త్రంగా ఉపయోగించుకున్న టీడీపీ.. అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలో టీడీపీ నేతలు ఎయిర్పోర్టుకు ప్రతిపాదిత భూ ములపై గద్దల్లా వాలిపోయి.. ప్రైవేట్ భూములతోపాటు పేదలకు పంపిణీ చేసిన ప్రభుత్వ భూములు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి భూకుంభకోణానికి పాల్పడ్డారు. దీంతో ఎయిర్పోర్టును ఒక దశలో రద్దు చేసిన పరి స్థితి కూడా అప్పట్లో ఏర్పడింది. తర్వాత ప్రతిపక్షాల ఆందోళనలు, ఆరోపణల క్రమంలో 2019 ఎన్నికల నోటిఫికేషన్కు పది రోజుల ముందు ఎయిర్ నిర్మాణానికి సంబంధించి డీపీఆర్ లేదు.. బడ్జెట్ కేటాయింపులు లేకుండానే హడావుడిగా ఆర్భాటంగా వచ్చిన శిలాఫలకం వేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికీ ఎయిర్పోర్టు నిర్మాణం గాల్లోనే చక్కర్లు కొడుతుండడం గమనార్హం. -
క్రిస్సిటీ పనుల అడ్డగింత
● పొలాల్లోకి వెళ్లేందుకు వీల్లేకుండా రోడ్డు నిర్మాణం చిల్లకూరు: చిల్లకూరు – కోట మండల తీర ప్రాంతంలోని తమ్మినపట్నం, కొత్తపట్నం రెవెన్యూ పరిధిలో ఏర్పాటవుతున్న క్రిస్సిటీకి సంబంధించిన పనులను బుధవారం తీగపాళెం గ్రామానికి చెందిన సన్న, చిన్నకారు రైతులు అడ్డుకున్నారు. భూములు కోల్పోయిన వారికి ఇప్పటి వరకు పరిహారం ఇవ్వలేదు. దీనికితోడు కాంట్రాక్ట్ పనులు చేస్తున్న వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ సేకరించిన భూములకు దగ్గరలో ఉన్న వ్యవసాయ భూముల్లోకి వెళ్లేందుకు వీల్లేకుండా 8 అడుగులకు పైగా రోడ్డును ఎత్తు చేస్తున్నారు. దీనిపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పరిహారం ఇచ్చాకే పనులు చేసుకోవాలంటూ అడ్డుకున్నారు. రైతులు మాట్లాడుతూ భూములు సేకరించిన సమయంలో త్వరితగతిన పరిహారం అందించడమే కాకుండా కాంట్రాక్టర్లు చేపట్టే పనుల్లో కూడా స్థానికులకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారన్నారు. అయితే నేడు ఇతర రాష్ట్రాల నుంచి మనుషులను తీసుకొచ్చి పనులు చేయించుకుంటున్నారని వాపోయారు. వ్యవసాయం చేసుకోలేక, ఇటు పరిహారం అందక, పనుల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. భూ సేకరణ సమయంలో తిరుపతి జిల్లా కలెక్టర్ పర్యటించి స్థానికుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారన్నారు. అయితే ఇప్పుడు క్రిస్సిటీ యాజమాన్యం రోడ్డుకు ఇరువైపులా పట్టా భూములున్న వాటిలోకి వెళ్లేందుకు రోడ్డు మార్గం చూపించకుండా 8 అడుగుల ఎత్తుకు పైగా చేస్తుండడంతో భవిష్యత్లో వ్యవసాయ పనులు చేసుకునేందుకు ట్రాక్టర్లు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా రెవెన్యూ, ఏపీఐఐసీ అధికారులు స్పందించి పరిహారం త్వరగా అందించే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కాంట్రాక్ట్ సంస్థకు చెందిన సిబ్బంది రైతులతో మాట్లాడి పనులు నిలిపివేయడంతో పాటు సంస్థ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తామన్నారు. -
కేజీబీవీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు (టౌన్): జిల్లాలోని 12 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని కేజీబీవీల్లో ఆరో తరగతికి 40.. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 40 సీట్లున్నాయని చెప్పారు. అదే విధంగా ఏడు నుంచి పదో తరగతి వరకు.. ఇంటర్ ద్వితీయ సంవత్సరాల్లో మిగిలిన సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అనాథ, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బాలికలు మాత్రమే అర్హులని, దరఖాస్తులను apkgbv.apcfss.in ద్వారా వచ్చే నెల ఒకటిలోపు పొందొచ్చని వివరించారు. ఆన్లైన్ ద్వారా వచ్చిన వాటినే పరిగణించనున్నామని, ఎంపికై న విద్యార్థుల ఫోన్కు మెసేజ్ వస్తుందన్నారు. సందేహాల కోసం సమీపంలోని కేజీబీవీ ప్రిన్సిపల్స్ను సంప్రదించాలని సూచించారు. నర్రవాడలో వేలం పాటలు దుత్తలూరు: మండలంలోని నర్రవాడలో కొలువైన వెంగమాంబ పేరంటాలు అమ్మవారి ఆలయంలో వివిధ హక్కులు పొందేందుకు సంబంధించిన బహిరంగ వేలం పాటలను దేవదాయ శాఖ అధికారులు మంగళవారం నిర్వహించారు. పూజా ద్రవ్యాలు విక్రయించుకునే హక్కును రూ.30.2 లక్షలకు.. అమ్మవారికి సమర్పించే చీరలు, జాకెట్లను సేకరించే హక్కును రూ.8.2 లక్షలకు శివలీల దక్కించుకున్నారు. పొంగలి షెడ్డుకు సంబంధించి పొంగలి సామగ్రిని విక్రయించే హక్కును రూ.1.36 లక్షలకు సుశీలమ్మ.. పుష్పాలు, పూలమాలలను సరఫరా చేసే హక్కును రూ.5.15 లక్షలకు పత్తి సుబ్రహ్మణ్యం.. పాదరక్షలు భద్రపర్చుకునే హక్కును రూ.22 వేలకు జయరాజ్ దక్కించుకున్నారు. ఇన్చార్జి ఈఓ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, వ్యవస్థాపక ధర్మకర్త వేమూరు ముసలయ్య తదితరులు పాల్గొన్నారు. ఎస్ఈఐఎల్ ఎనర్జీలో ఉత్తమ భద్రత ప్రమాణాలు తోటపల్లిగూడూరు(పొదలకూరు): ముత్తుకూరు మండలంలోని ఎస్ఈఐఎల్ ఎనర్జీ కంపెనీలో ఉత్తమ భద్రత ప్రమాణాలను పాటిస్తున్నారని డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఈశ్వర్చంద్ పేర్కొన్నారు. ఎస్ఈఐఎల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్లో జాతీయ భద్రత వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంగళవారం ఆయన హాజరయ్యారు. ప్రపంచ స్థాయి భద్రత ప్రమాణాలు, మార్గదర్శకాలను అనుసరిస్తున్నారని ప్రశంసించారు. వివిధ భద్రత పోటీల్లో విజేతలకు అవార్డులు, బహుమతులను అందజేశారు. సంస్థలో భద్రత అవగాహన, పద్ధతులను ప్రోత్సహించడంలో కృషి చేసిన ఉద్యోగులను సత్కరించారు. సీఈఓ జన్మేజయ మహాపాత్ర తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 22 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 72,526 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 26,664 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.41 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తులు విక్రయిస్తే చర్యలు
నెల్లూరు(బారకాసు): 120 మైక్రాన్ల కన్నా తక్కువ స్థాయి ప్లాస్టిక్ ఆధారిత ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్ హెచ్చరించారు. మంగళవారం ఎంహెచ్ఓ తన సిబ్బందితో కలిసి నెల్లూరులోని స్టోన్హౌస్పేట, రేబాలవీధి, పప్పులవీధి ప్రాంతాల్లోని 14 ప్లాస్టిక్ ఉత్పత్తుల దుకాణాలు, గోదాములపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. 800 కేజీలు నిషేధిత సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను గుర్తించి సీజ్ చేశారు. ఆయా దుకాణాల యజమానులకు రూ.3.20 లక్షల జరిమానా విధించారు. మరోసారి నిషేధిత ఉత్పత్తుల విక్రయాలు జరిపితే దుకాణాలను శాశ్వతంగా సీజ్ చేస్తామని హెచ్చరించారు. దాడుల్లో శానిటరీ సూపర్వైజర్లు మహబూబ్ షరీఫ్, ఆశీర్వాదం, శానిటరీ ఇన్స్పెక్టర్లు శ్రీనివాసులు, జిలానీబాషా, అశోక్ పాల్గొన్నారు. ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ దినేష్ నెల్లూరులో దుకాణాలపై దాడులు -
హెచ్పీవీ వ్యాక్సిన్తో కేన్సర్లకు చెక్
నెల్లూరు(అర్బన్): కేన్సర్.. ఈ పదం వినగానే ప్రతిఒక్కరి గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. ఒక్కరికి కేన్సర్ సోకినా కుటుంబం మొత్తం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. కేన్సర్ వస్తే మరణం తథ్యమని అనుకునే వారే ఎక్కువ. జీవనశైలి, కాలుష్యం, కల్తీ ఆహారం, జంక్ఫుడ్స్ కారణంగా రోగులు పెరిగిపోతున్నారు. ఎన్నో రకాల కేన్సర్లు ఉన్నప్పటికీ కొన్ని రకాల నివారణకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అందులో హ్యూమన్ పాపిల్లోవా వైరస్ (హెచ్పీవీ) వ్యాక్సిన్ కూడా ఒకటి. దీనితో పలురకాల కేన్సర్లు జీవితంలో దరిచేరవు. అందుకే ఈ వ్యాక్సిన్ను తొలిదశలో 14 ఏళ్లు నిండి 15వ జన్మదినం జరుపుకోని బాలికలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది తొలిసారిగా అందుకు శ్రీకారం చుట్టింది. ఖరీదైన ఈ వ్యాక్సిన్ ప్రైవేట్ ఆస్పత్రుల్లో దొరుకుతున్నప్పటికీ పేదల కోసం ఉచితంగా వ్యాక్సిన్ వేస్తోంది. సాధారణంగా రెండు డోసులు వేయాల్సి ఉంది. జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. జిల్లాలో.. జిల్లా జనాభాలో 14 సంవత్సరాల వయస్సు నిండి 15 ఏళ్లు నిండని బాలికలు 1 శాతం మంది ఉంటారని అంచనా వేశారు. ఈ లెక్కన సుమారు 26 వేల మంది బాలికలు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరందరికీ వ్యాక్సిన్ వేసేందుకు వైద్యారోగ్య శాఖ అఽధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే తొలి విడతగా 8,616 వ్యాక్సిన్లను మాత్రమే ప్రభుత్వం సరఫరా చేసింది. మరో వారంలో మిగిలిన వ్యాక్సిన్లను సరఫరా చేయనుంది. పీహెచ్సీలు, సీహెచ్సీలకు సరఫరా చేశారు. టీకా ఎలా వేయాలి..ఎన్ని డిగ్రీల కూలింగ్లో వ్యాక్సిన్ ఉంచాలి.. వ్యాక్సిన్ వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?, తదితర అంశాలపై నెలక్రితమే వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. హెచ్పీవీ అరికట్టగల కేన్సర్లు హెచ్పీవీ వ్యాక్సిన్ మహిళల్లో ఎక్కువగా వచ్చే సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార కేన్సర్), బాహ్య జననేంద్రియ, యోని, మలద్వారా, పురుషాంగ, గొంతు, నాలుక వెనుక భాగంలో వచ్చే కేన్సర్లను అరికట్టవచ్చు. హెచ్పీవీ వ్యాక్సిన్తో జెనిటల్ వార్ట్స్ లాంటి వ్యాధులు కూడా తగ్గుతాయని శాస్త్రవేత్తలు చెబుతుతున్నారు. 9 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ వేస్తే ఎంతో ఉపయోగం. హెచ్పీవీ వైరస్ పురుషుల నుంచి మహిళలకు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల బాలురకు కూడా వేయడం మంచిది. అయితే ప్రభుత్వం వ్యాక్సిన్ అందుబాటు, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది బాలికలకు మాత్రమే వేయనుంది. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రారంభం నేడు తొలిదశలో బాలికలకు ఉచితంగా టీకాలు ఇప్పటికే ప్రభుత్వాస్పత్రులకు చేర్చిన వైద్యాఆరోగ్య శాఖ జిల్లాలో 26 వేల మంది బాలికలు ఉంటారని అంచనాబాలికలకు వ్యాక్సిన్ వేస్తున్నాం ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రస్తుతం 14 ఏళ్లు నిండిన 15వ జన్మదినం జరుపుకోని బాలికలకు మాత్రమే కేన్సర్ నివారణ కోసం హెచ్పీవీ వ్యాక్సిన్ను వేయనున్నాం. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. కలెక్టర్ అనుమతితో వ్యాక్సినేషన్ను బుధవారం నుంచి లాంఛనంగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నాం. తల్లిదండ్రులు వైద్యసిబ్బంది వచ్చినప్పుడు బాలికలకు వ్యాక్సిన్ వేయించాలి. – డాక్టర్ సుజాత, డీఎంహెచ్ఓ -
ఎలాంటి పన్నులను చెల్లించకుండానే జిల్లాకు ఎలక్ట్రానిక్స్ వస్తువులు, పరికరాలను పలువురు దుకాణదారులు దర్జాగా దిగుమతి చేసుకుంటున్నారు. వాస్తవానికి వీటిపై 18 శాతం జీఎస్టీని చెల్లించాల్సి ఉన్నా, అవేవీ తమకు పట్టవనే రీతిలో వ్యవహరిస్తూ ప్రభుత్వాదాయానికి గండి కొడుత
నెల్లూరు (టౌన్): జిల్లాల్లో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, మొబైల్స్ తదితర పరికరాలకు ఎలాంటి పన్నులను చెల్లించకుండానే పలు దుకాణ యజమానులు భారీ మొత్తంలో విక్రయాలు సాగిస్తున్నారు. బిల్లులు చెల్లించకుండానే అమ్మి అందిన కాడికి దోచుకుంటున్నారు. నిజానికి వీటికి జీఎస్టీని చెల్లించాల్సి ఉన్నా, అవేవీ లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి భారీ మొత్తంలో గండి కొడుతున్నారు. తనిఖీలతో వెలుగులోకి.. బ్రాండెడ్ కంపెనీల పేరుతో ఇయర్ బడ్స్, ఛార్జర్లు, పౌచ్లు, ఇయర్ ఫోన్స్ తదితర డూప్లికేట్ వస్తువులను విక్రయదారులకు అంటగట్టి పెద్ద మొత్తంలో యజమానులు క్యాష్ చేసుకుంటున్నారు. వీటిపై తనిఖీలు నిర్వహించాల్సిన జిల్లా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. నగరంలోని లస్సీ సెంటర్లో గల పలు మొబైల్స్ దుకాణాలపై పోలీస్ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలను సోమవారం చేపట్టారు. ఈ క్రమంలో అంబికా, జేపీ మొబైల్స్ షాపుల్లో ఎలాంటి బిల్లుల్లేకుండా అమ్మకానికి సిద్ధంగా ఉంచిన రూ.49.24 లక్షల విలువజేసే సెల్ఫోన్లు, యాక్సెసరీస్ను స్వాధీనం చేసుకొని ఎస్జీఎస్టీ అధికారులకు అప్పగించారు. మరోవైపు తనిఖీలు నిర్వహిస్తున్నారనే సమాచారం తెలియడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో గల మొబైల్ ఫోన్ల దుకాణాలను యజమానులు మూసేశారు. జిల్లా వ్యాప్తంగా తనిఖీలను మరిన్ని నిర్వహిస్తే, ఇలాంటి బాగోతాలు వెలుగుచూసే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. అబ్బే.. మాకెందుకు..! రూ.300 దాటితే జీఎస్టీ నంబర్ ఉన్న ఒరిజినల్ బిల్లును వినియోగదారులకు ఇవ్వాలి. అయితే ఏ దుకాణాంలోనూ వీటిని ఇస్తున్న దాఖలాల్లేవు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే, ధర పెరుగుతుందనే సమాధానమొస్తోంది. ఒక్కో యజమాని రెండు రకాల బిల్లుల పుస్తకాలను ముద్రించి డూప్లికేట్ను అంటగడుతున్నారని తెలుస్తోంది. వీటిపై తనిఖీలను నిర్వహించి కఠినంగా వ్యవహరించాల్సిన వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, మామూళ్ల మత్తులో జోగుతూ ఆ దిశగా చర్యలు చేపట్టడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, మొబైల్ ఫోన్ల దుకాణాల యజమానుల నుంచి ప్రతి నెలా ముడుపులను స్వీకరిస్తున్నారని సమాచారం. జీఎస్టీ చెల్లించని, డూప్లికేట్ వస్తువులను విక్రయిస్తున్న దుకాణాలపై మరిన్ని తనిఖీలను నిర్వహించి వారిపై కఠిన చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు. కాగా ఈ విషయమై వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ కిరణ్కుమార్ను సంప్రదించేందుకు పలుమార్లు యత్నించగా, ఆయన వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారని కింది స్థాయి అధికారులు తెలిపారు. ముంబై, చైన్నె తదితర ప్రాంతాల నుంచి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, మొబైల్స్, యాక్సెసరీస్ తదితర పరికరాలను జిల్లాకు భారీ మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నారు. ఇవన్నీ దాదాపు చైనా వస్తువులుగా తెలుస్తోంది. యాపిల్, సామ్సంగ్ తదితర కంపెనీల పరికరాలకు సంబంధించిన ఒరిజినల్స్ స్థానంలో నకిలీలను అంటగడుతున్నారు. వీటి ధరలూ పెద్ద మొత్తంలోనే ఉంటున్నాయి. ఆయా ప్రాంతాల్లోని హోల్సేల్ దుకాణాల యజమానులతో ముందుగానే మాట్లాడుకొని, అక్కడ్నుంచి లారీలు, పార్శిల్ వాహనాల్లో వీటిని తీసుకొస్తున్నారని తెలుస్తోంది. ఇలా తరలించిన వాటి ద్వారా వ్యాపారం నిత్యం రూ.లక్షల్లో ఉంటోంది. వినియోగదారులను ఆకర్షించేందుకు రకరకాల బ్రాండ్లు, కొత్త కంపెనీలకు సంబంధించిన పరికరాలను తరలిస్తున్నారని సమాచారం. ఎలాంటి బిల్లుల్లేకుండానే ఎలక్ట్రానిక్స్, పరికరాల దిగుమతి వాస్తవానికి వీటిపై 18 శాతం జీఎస్టీ తప్పనిసరి ఇవేవీ లేకుండానే యథేచ్ఛగా విక్రయాలు సెల్ఫోన్ల దుకాణాలపై విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు బిల్లుల్లేని రూ.49.24 లక్షల విలువజేసే మొబైల్స్, యాక్సెసరీస్ స్వాధీనం ప్రభుత్వాదాయానికి రూ.కోట్లల్లో గండి పట్టనట్లు వ్యవహరిస్తున్న వాణిజ్య పన్నుల అధికారులు -
అంగరంగ వైభవంగా..
● ముత్యాలమ్మ, పోలేరమ్మ జాతర ప్రారంభం ● తూర్పుకనుపూరు చేరుకున్న ఘటోత్సవం చిల్లకూరు: తీర ప్రాంతంలోని తూర్పుకనుపూరులో ముత్యాలమ్మ, పోలేరమ్మ జాతర మంగళవారం ప్రారంభమైంది. జాతర సందర్భంగా గ్రామాల్లో తెలియజేసేలా ఏర్పాటు చేసిన ఘటోత్సవం ఐదు గ్రామా లు తిరిగి తూర్పుకనుపూరు చేరుకుంది. ఈదులవారిపాళెం, కొమరావారిపాళెం, పోసినవారిపాళెం, రావులవారిపాళెం గ్రామాల్లో తిరిగిన అనంతరం తూర్పుకనుపూరుకు ఘటోత్సవం చేరుకుంది. పోలేరమ్మ ప్రతిమను కుమ్మరి ఇంట తయారు చేసి మెట్టినిల్లుగా ఉన్న చాకలి వారి ఇంటికి చేర్చారు. ఆ తర్వాత ఆలయ ప్రధానార్చకుడి ఇంట ఘటం కుండలు దిగాక దిష్టి తీర్పు తీర్చి గణాచారి ముందు నడుస్తుండగా, పోలేర మ్మ ప్రతిమను సప్పరంపై ఉంచి గంగమిట్టపై వేసిన తాత్కాలిక తాటాకుల గుడిసెలో కొలువుదీర్చారు. పూలంగిసేవలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఉత్సవా న్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులు అమ్మవారికి వేయి కళ్ల దుత్తల తో ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలోని రావి చెట్టు వద్ద మహిళలు పూజలు చేశారు. -
బ్యాంక్ ఉద్యోగాల పేరుతో టోకరా
శ్రీకాకుళం క్రైమ్: బ్యాంక్లో పీఓ, క్లర్క్ ఉద్యోగాలు తీసిస్తానని నిరుద్యోగ యువతను నమ్మించిన అంతర్జిల్లా నేరస్తుడు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. శ్రీకాకుళంతోపాటు తిరుపతి, నెల్లూరు, తాడేపల్లిగూడెం, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో అమాయక యువత నుంచి రూ.కోట్లలో దోచుకున్న నెల్లూరు జిల్లాకు చెందిన గొల్ల బెనర్జీని శ్రీకాకుళం రూరల్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు వివరాలను శ్రీకాకుళం డీఎస్పీ సీహెచ్ వివేకానంద మీడియాకు వెల్లడించారు. ఇలా చెప్పి.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం వవ్వేరు గ్రామానికి గొల్ల బెనర్జీ అలియాస్ హర్షవర్ధన్రెడ్డి ఇంటర్ చదివి సీఏ కోర్సులో చేరి మధ్యలోనే మానేశాడు. అకౌంట్స్పై పరిజ్ఞానం సంపాదించాడు. నెల్లూరులో ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. భార్యను విడిచి పెట్టేశాడు. తర్వాత శ్రీకాకుళం జిల్లా గార మండలం సతివాడకు చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం అరసవల్లిలో దేశెట్టి రమణమూర్తి ఇంట్లో అద్దెకు దిగాడు. రమణమూర్తి స్వగ్రామం నందిగాం మండలం నర్సిపురం. ఢిల్లీ సెంట్రల్ జోనల్ ఆడిట్ అధికారిగా పనిచేసి ఇటీవల విశాఖ రీజియన్కు బదిలీపై వచ్చానని, పలు బ్యాంక్ల రిక్రూట్మెంట్ బోర్డులో మెంబర్నని బెనర్జీ నమ్మించాడు. పీఓలు, క్లర్కు పోస్టులంటూ.. ఎస్బీఐ బ్యాంక్లో బ్యాక్లాగ్ పోస్టుల కింద పీఓ, క్లర్కు పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. ఒక్కో ఉద్యోగానికి రూ. 6 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ కడితే ఉద్యోగం తీసిస్తానని యువతను నమ్మబలికాడు. అలా ఆరుగురి నుంచి రూ.36 లక్షలు తీసుకున్నాడు. వారికి నకిలీ అపాయిట్మెంట్ ఆర్డర్ కాపీలు సైతం ఇచ్చాడు. ఈ మేరకు బాధితులు 2024 నవంబర్ 12వ తేదీన జిల్లా ఎస్పీ గ్రీవెన్స్ను ఆశ్రయించారు. బెనర్జీ తమ వద్ద రూ.1.80 కోట్లు కాజేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థలాల పేరుతో.. చిన్నబజారు రోడ్డులో 8 సెంట్ల స్థలం వేలానికి వస్తుందని, తన పరిచయాలతో తక్కువ ధరకు ఇప్పిస్తానని దేశెట్టి రమణమూర్తి వద్ద రూ.86 లక్షలను బెనర్జీ తీసుకున్నాడు. రూ.29 లక్షల విలువైన గోల్డ్ క్రాఫ్ట్ మెషీన్ను రూ.14 లక్షలకే ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేశాడు. మొత్తంగా రమణమూర్తి నుంచి రూ.1.05 కోట్లకు టోకరా వేశాడు. జిల్లాలో తన మోసాలు బయటపడటం, పలువురు ఫిర్యాదులివ్వడంతో బెనర్జీ మకాం మార్చేశాడు. పలు ప్రాంతాల్లో సైతం తిరుపతి ఈస్ట్ పోలీస్స్టేషన్ పరిధిలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి నుంచి రూ.25 లక్షలు, వారి సోదరుడు, సోదరుని కుమార్తె నుంచి కొంత నగదు తీసుకున్నాడు. విశాఖపట్నంలో 8 మంది నుంచి రూ.కోటి తీసుకోగా, నెల్లూరులో 2 చీటింగ్ కేసులు, బుచ్చిరెడ్డిపాళెంలో 1, తాడేపల్లి గూడెంలో 1, ఏఎస్పేట పీఎస్లో ఒక కేసు ఉన్నాయి. సీఐడీ డీజీకి సైతం ఫిర్యాదు మూడేళ్లుగా ఎవరికీ చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న బెనర్జీపై అరసవల్లిలో ఉంటున్న నందిగాం వాసి రమణమూర్తి మంగళగిరి సీఐడీ డీజీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో అధికారులు లోతుగా విచారణ చేపట్టారు. నివేదికను తదుపరి చర్యల కోసం శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డికి పంపించారు. డీఎస్పీ సీహెచ్ వివేకానంద పర్యవేక్షణలో రూరల్ పరిధి కావడంతో సీఐ పైడపు నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తనకొచ్చిన సమాచారంతో సీఐ పైడపునాయుడు బెనర్జీని నగరంలోనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. ఢిల్లీలో సెంట్రల్ జోనల్ ఆడిటర్నంటూ మోసం శ్రీకాకుళం, నెల్లూరు, తిరుపతి, విశాఖ, తాడేపల్లిగూడెంలో దోపిడీ ఎట్టకేలకు అంతర్ జిల్లా నేరస్తుడు బెనర్జీ అరెస్ట్ నిందితుడిది బుచ్చిరెడ్డిపాళెం -
వైద్యసేవల్లో నిర్లక్ష్యం తగదు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా ● ఏపీఎమ్మెస్ఐడీసీ అధికారులపై ఆగ్రహం నెల్లూరు(అర్బన్): నగరంలోని పెద్దాస్పత్రిలో చిన్న కారణాలను చూపుతూ వైద్యసేవలను సక్రమంగా అందించకపోతే పేదలు, దళితులు, ఎస్టీలు ఎక్కడికెళ్లాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రశ్నించారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఏయే విభాగాల్లో ఆపరేషన్లు తక్కువగా జరిగాయని ప్రశ్నించారు. ఈఎన్టీ, నేత్ర, ఆంకాలజీ విభాగాల్లో ఆపరేషన్లు తక్కువగా జరిగాయని, న్యూరో సర్జన్ విభాగంలో ఒక్కటి సైతం జరగకపోవడానికి గల కారణాలను ఆరాతీశారు. వీటికి అవసరమైన కనీస పరికరాలు న్యూరో సర్జరీలో లేవని.. ఈఎన్టీలో పది నుంచి 15 మంది పేషెంట్లకు ఉపయోగించాక కొన్ని ఎక్విప్మెంట్లు పనికిరావని, కొత్తవి కావాల్సి ఉంటుందని ఆయా విభాగాల హెచ్ఓడీలు తెలిపారు. ఇవి లేకపోవడంతోనే ఆపరేషన్లు తగ్గిపోయాయని బదులిచ్చారు. జాబితాను అందజేయండి విభాగాల వారీగా కావాల్సిన అత్యవసర, కనీస అవసరాలు తీర్చే పరికరాల జాబితాను తయారు చేయించి డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డి ద్వారా తనకు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో సంబంధం లేకుండా ఏదో విధంగా సర్దుబాటు చేయించి వీటిని ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఆపరేషన్లు చేయడంలో ముందున్న ఆర్థోపెడిక్ డాక్టర్లను అభినందించారు. పరికరాలను అందించడంలో ఈ విభాగానికి తొలి ప్రాధాన్యమిస్తామని వెల్లడించారు. రిపోర్టులొచ్చేలోపే డాక్టర్లు వెళ్లిపోతున్నారు ఆస్పత్రిలో రక్త పరీక్షల రిపోర్టులొచ్చేలోపే డాక్టర్లుండటం లేదని హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యుడు మొగరాల సురేష్ తెలిపారు. సిబ్బంది తక్కువవడంతో రక్త పరీక్షల రిపోర్టులు ఆలస్యంగా వస్తున్నాయని వివరించారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ను సకాలంలో తీయడం లేదని.. అపాయింట్మెంట్ ఇచ్చి అప్పుడు రావాలంటున్నారని చెప్పారు. ఎమ్మారై, సీటీ స్కాన్ రిపోర్టులను రెండు, మూడు రోజులకు ఇస్తున్నారని ఆరోపించారు. ఫిజియోథెరపీ విభాగంలో పది శాతం పరికరాలే ఉన్నాయని, ఇలాగైతే సేవలు ఎలా అందుతాయని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఏపీఎమ్మెస్ఐడీసీ అధికారులు ఇటీవల రూ.13 లక్షలతో నిర్మించిన రేకుల గదులు ఉరుస్తున్నాయని తెలిపారు. లోపాలను సరిచేయాలని హాస్పిటల్ కో ఆర్డినేటర్ మడపర్తి శ్రీనివాసులు, కమిటీ సభ్యులు బ్రహ్మారెడ్డి, మల్లికార్జున, అబీదా సుల్తానా కోరారు. ఆస్పత్రిలోకి బయటి వ్యక్తులు గుంపులుగా రావడంతో పాటు ఎమర్జెన్సీ విభాగంలోకి వచ్చి వైద్యసేవలకు ఆటంకం కలిగిస్తున్నారని, వీటిని తక్షణమే అరికట్టేందుకు పోలీసులను ఉపయోగించాలని ఏఎస్పీ సౌజన్యను ఆదేశించారు. ఇలా బయటి వ్యక్తులు హల్చల్ చేస్తే సంబంధిత ఎస్సైపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. జాప్యం చేస్తే సహించేదిలేదు ఆస్పత్రిలో రాత్రి పూట లైట్లను ఏర్పాటు చేయాలని ఏపీఎమ్మెస్ఐడీసీ అధికారులను ఆదేశించగా, ప్రతిపాదనలను సిద్ధం చేస్తామని వారు చెప్పడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగైతే వేరే విభాగాలకు పంపుతానని స్పష్టం చేశారు. వేసవిలో విద్యుత్ సరఫరాకు ఆటంకం లేకుండా బ్యాకప్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెత్తను తరలించడంలో ఇబ్బందులను తొలగించాలని ఎంహెచ్ఓకు సూచించారు. క్లినికల్, నాన్ క్లినికల్ సమస్యలపై సమీక్షించారు. పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ కొండేటి మాధవి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, డీసీహెచ్ఎస్ పరిమళ, ఏడీఎంహెచ్ఓ ఖాదర్వలీ, ఆర్డీఓ అనూష, ఏఎస్పీ సౌజన్య, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు కళారాణి, సుశీల్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతకు అగచాట్లు
● పెనుబల్లిలో రైస్మిల్లు ఎదుట ధర్నా ● రూ.80 లక్షలు ఎగ్గొట్టిన వైనం బుచ్చిరెడ్డిపాళెం: చంద్రబాబు ప్రభుత్వం చెప్పే మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిస్థితులకు పొంతన లేదు. అన్నదాతకు అండగా ఉంటాం.. ధాన్యం డబ్బులు త్వరగా జమ చేస్తామన్న కూటమి నేతల హామీలు నీటి మూటలయ్యాయి. బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లి గ్రామంలో రైతులకు జరిగిన అన్యాయమే ఇందుకు నిదర్శనం. కొల్లూరు గ్రామానికి చెందిన పలువురు రైతులు తమ ధాన్యాన్ని పెనుబల్లిలోని శ్రీరాజరాజేశ్వరి రా అండ్ బాయిల్డ్ రైస్మిల్లుకు తరలించారు. దాదాపు రూ.80 లక్షల విలువైన ధాన్యాన్ని అప్పగించి నెలలు గడుస్తున్నా, మిల్లర్లు మాత్రం నేటికీ నగదు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారు. అడిగితే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. నగదు కోసం మిల్లు యజమానుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో, విసిగిపోయిన బాధితులు మంగళవారం మిల్లు ఎదుట ధర్నా చేశారు. కలెక్టర్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా సొమ్ము జమ చేస్తే.. నేడు కూటమి ప్రభుత్వం మిల్లర్లతో కుమ్మకై ్క నట్టేట ముంచుతోందని రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆటోను ఢీకొట్టిన ఫ్యాక్టరీ బస్సు
● పలువురికి తీవ్రగాయాలు వింజమూరు(ఉదయగిరి): చంద్రపడియ కెమికల్ ఫ్యాక్టరీకి చెందిన బస్సు ఆటోను ఢీకొట్టిన ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. యర్రబల్లిపాళేనికి చెందిన కూలీలు మంగళవారం వ్యవసాయ పనుల నిమిత్తం ఆత్మకూరు రోడ్డు మార్గంలో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉద్యోగులతో బస్సు వింజమూరుకు వస్తోంది. చెన్నకేశవ స్వామి దేవాలయం సమీపంలో ఉన్న మూల వద్ద ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తా పడింది. అందులో ఉన్న శింగవరపు ఆదిలక్ష్మమ్మకు కాలు, చేయి విరిగింది. బయ్యపురెడ్డి శాంతమ్మకు తలపై తీవ్ర గాయాలయ్యాయి. సోమవరపు వజ్రమ్మ, బయ్యపురెడ్డి శారదతోపాటు ఆటో డ్రైవర్ నడిపిగడ్డ మస్తాన్కు గాయాలయ్యాయి. వీరిని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ వైద్యశాలలో ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరు, ఆత్మకూరుకు తరలించారు. ఎస్సై జయరాజ్ వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. పన్నుల వసూళ్లపై టెలి కాన్ఫరెన్స్నెల్లూరు(పొగతోట): పంచాయతీల్లో ట్యాక్స్, నాన్ ట్యాక్స్ వసూళ్లను వేగవంతం చేయాలని డీపీఓ వసుమతి ఆదేశించారు. నగరంలోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి పంచాయతీ కార్యదర్శులతో మంగళవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. వసూళ్లలో రాపూరు, వింజమూరు, పొదలకూరు తదితర మండలాలు వెనుకబడి ఉన్నాయని చెప్పారు. నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. వసూళ్లకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. -
విద్యుదాఘాతానికి గురై..
● శివాలయ పూజారి మృతికోవూరు: విద్యుత్ షాక్కు గురై శివాలయ పూజారి ప్రాణాలు కోల్పోయిన ఘటన పోతిరెడ్డిపాళెం గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కోవూరు మండలం రాళ్లమిట్ట అరుంధతీయవాడకు చెందిన దువ్వూరు కృష్ణయ్య (71) పోతిరెడ్డిపాళెంలోని పెన్నానది కరకట్టపై ఉన్న పెన్నేశ్వర శివాలయంలో పూజారిగా ఉన్నారు. ఆయన ఆలయ సమీపంలోని రేకుల ఇంట్లో నివాసముంటున్నారు. మంగళవారం ఉదయం ఇంట్లోని స్టాండ్ ఫ్యాన్ ప్లగ్ను సాకెట్లో పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రవహించింది. ఫ్యాన్ను పట్టుకోవడంతో కృష్ణయ్యకు తీవ్రస్థాయిలో షాక్ తగిలి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే ఆయన్ను కోవూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి కుమారుడు దువ్వూరు నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణయ్య మృతితో పోతిరెడ్డిపాళెం, రాళ్లమిట్ట ప్రాంతాల్లో విషాదం నెలకొంది. -
టౌన్ప్లానింగ్లో ఏసీబీ తనిఖీలు
● అక్రమ నిర్మాణాలకు అనుమతులు.. పెండింగ్ ఫైళ్లపై ఫిర్యాదులు ● డీఎస్పీ రామకృష్ణుడు నేతృత్వంలో సోదాలు ● రికార్డుల పరిశీలన నెల్లూరు (బారకాసు): నెల్లూరు నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ విభాగంలో ఆకస్మిక తనిఖీలను ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు నేతృత్వంలో అధికారులు మంగళవారం చేపట్టారు. అక్రమ కట్టడాలకు అనుమతులు.. ఫైళ్ల పెండింగ్.. అవినీతి ఆరోపణలపై సోదాలు నిర్వహించి పలు కీలక ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఉదయం 11.30కు ప్రారంభమైన సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. రికార్డుల నిర్వహణలో లోపాలు.. సిటిజన్ చార్టర్లో నిర్లక్ష్యం.. అనుమతి లేని భవనాలకు అప్రూవల్స్.. అనధికారిక పర్మిషన్లతో పాటు డెస్కుల్లో ఫైళ్లను నిశితంగా పరిశీలించారు. సర్వేయర్లుండే గదిలో పలు ఫైళ్లను పరిశీలించి వివిధ అంశాలను ఆరాతీశారు. తనిఖీలను బుధవారం సైతం కొనసాగించనున్నామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. మారని ఉద్యోగుల తీరు నెల్లూరు నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఓ వైపు ప్రజాప్రతినిధుల అండ, మరోవైపు రాష్ట్ర మున్సిపల్ శాఖ ఉన్నతాధికారుల సహకారంతో ఇక్కడి ఆఫీసర్ల అవినీతి రోజురోజుకూ పెరుగుతోంది. గతంలోనూ ఈ విభాగంలో ఏసీబీ అధికారులు పలుమార్లు తనిఖీలు చేసి కీలకమైన ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయినా ఇక్కడ ఏ మాత్రం మార్పు రావడంలేదని కార్యాలయ ఉద్యోగులే పేర్కొంటున్నారు. మరోవైపు ఏసీబీ తనిఖీలతో టౌన్ప్లానింగ్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ విభాగానికి సంబంధించిన పలువురు అధికారులు అందుబాటులో లేకుండాపోవడం గమనార్హం. సీఐలు విజయ్కుమార్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన కాలనీల్లో ఆర్వో ప్లాంట్లు, బోర్ల ఏర్పాటు
● ఎంపీ గొల్ల బాబూరావు రూ.15 లక్షల ఎంపీ నిధుల మంజూరు ● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కోవూరు: కోవూరు నియోజకవర్గంలోని గిరిజన కాలనీల్లో ఆర్వోప్లాంట్ల ఏర్పాటుకు తన విజ్ఞప్తి మేరకు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు రూ.15 లక్షల ఎంపీ ల్యాడ్స్ మంజూరు చేశారని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలోని నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి (ఎన్ఎస్ఆర్) గిరిజన కాలనీలో ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు రూ.5 లక్ష లు, అలాగే చేతిపంపు నిర్మాణం కోసం రూ.2.5 లక్షలు మంజూరు చేశారు. కోవూరు మండలం పాటూరు, ఉత్తరపల్లిపాళెం ప్రాంతాల్లో సురక్షిత మంచినీరు అందించేందుకు ఆర్వో ప్లాంట్ కోసం మరో రూ.5 లక్షలు, బోరు నిర్మాణానికి రూ.2.5 లక్షలను కేటాయించినట్లు ప్రసన్న పేర్కొన్నారు. గిరిజన కాలనీల్లో తాగునీటి సమస్యలను ఎంపీ గొల్ల బాబూరావు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి, తక్షణమే నిధులు విడుదల చేశారని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, పేదల కనీస అవసరాల తీర్చేందుకు తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామన్నారు. అడిగిన వెంటనే స్పందించి నిధులు కేటాయించిన గొల్లబాబూరావుకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా సర్కిల్కు గుర్తింపునెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ వినియోగదారులకు సేవలందించడంలో జిల్లా సర్కిల్ ముందంజలో ఉందని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం అన్నారు. నెల్లూరులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ విద్యుత్ సెక్షన్ పరిధిలో గాంధీనగర్లో మంగళవారం ఆయన ‘కరెంటోళ్ల జనబాట’ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని టాప్–20లో నెల్లూరు జిల్లా సర్కిల్కు చెందిన 10 సెక్షన్లు ఉన్నాయన్నారు. కోటమిట్ట సెక్షన్ 87 శాతం, కోవూరు టౌన్, స్టోన్హౌస్పేట, ఏకే నగర్ సెక్షన్లు 85 శాతం, బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరు, ఇండస్ట్రియల్ ఎస్టేట్, డైకస్రోడ్డు సెక్షన్లు 84 శాతం, టౌన్హాల్, కిసాన్ నగర్ సెక్షన్లు 83 శాతం సాధించాయన్నారు. అధికారులు, సిబ్బంది సమష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఈఈలు శ్రీధర్, శేషాద్రి బాలచంద్ర పాల్గొన్నారు. మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదని..● కుమారుడిపై తండ్రి కర్రతో దాడి నెల్లూరు సిటీ: మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదని కుమారుడు నిద్రిస్తున్న సమయంలో తండ్రి కర్రతో దాడి చేసిన ఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. మంగళవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. రూరల్ మండలంలోని మూడో మైలులో మసీదుకు సమీపంలో సుబ్బారావు, అతని భార్య సూరమ్మ ఉంటున్నారు. వారికి తిరుపతి అనే కుమారుడున్నాడు. సుబ్బారావు మద్యానికి బానిసయ్యాడు. తాగొచ్చి నిత్యం కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు. సోమవారం రాత్రి తనకు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని భార్యను అడిగాడు. కుమారుడు.. తండ్రిని మందలించి డబ్బులు ఇచ్చేది లేదని తేల్చిచెప్పాడు. కోపోద్రిక్తుడైన సుబ్బారావు.. కుమారుడు నిద్రిస్తున్న సమయంలో కర్రతో ముఖంపై దాడి చేశారు. గాయపడిన తిరుపతిని స్థానికులు హాస్పిటల్కు తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
మహిళలకు రక్షణేదీ..?
నెల్లూరు రూరల్: టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంగళవారం ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని మహిళలు భయంతో బతుకుతున్నారని చెప్పారు. గత సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో అర్ధరాత్రి సైతం మహిళలు ధైర్యంగా తిరిగేవారని గుర్తుచేశారు. అక్రమాలు, అన్యాయాలు, అఘాయిత్యాలు తప్ప మహిళల భద్రతను ప్రస్తుత ప్రభుత్వం గాలికొదిలేసిందని మండిపడ్డారు. సంక్షేమ పథకాలను అటకెక్కించి, మద్యాన్ని మాత్రం డోర్ డెలివరీ చేస్తూ రాష్ట్రాన్ని మత్తులో ముంచుతున్నారని ధ్వజమెత్తారు. గుమ్మళ్లదిబ్బలో బాలికపై జరిగిన దాడిని మరువక ముందే వరిగొండలో మరో బాలికపై అఘాయిత్యం జరగడం హేయమన్నారు. కారకులపై చర్యలు చేపట్టకుండా.. బాధితులకు న్యాయం చేయాలని పోరాడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. వరిగొండలో బాలికపై జరిగిన దాడిని పోలీసులు ఎంత గోప్యంగా ఉంచాలని చూసినా, అది దాగలేదని చెప్పారు. జీజీహెచ్ హెచ్ఓడీ గీతాలక్ష్మిని సంప్రదించి వివరాలను కోరితే, బాలిక పేరు చెప్పాలని పదేపదే అడిగారని, పోక్సో చట్టం ప్రకారం పేరు వెల్లడించకూడదని తాము చెప్పినా వినలేదని తెలిపారు. ఐదో తేదీన హాస్పిటల్లో బాలిక చేరితే డాక్టర్లు, సిబ్బందికి తెలియకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. చివరికి బాలికపై అఘాయిత్యం జరగలేదని, టీవీ దొంగతనానికి వెళ్లిన వారిని అడ్డుకోవడంతో గాయలయ్యాయని పోలీసులు తెలిపారన్నారు. ఒక సీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అఘాయిత్యం జరిగిందని, మరొకరు మాత్రం అలా జరగలేదని రాయడం విస్మయాన్ని కలిగిస్తోందని చెప్పారు. పోలీసుల అసమర్థత, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. తనపై చిన్నబజార్ పోలీస్స్టేషన్లో గంజాయి కేసు నమోదైందని నిందితుడే స్వయంగా అంగీకరించిన అంశాన్ని ప్రస్తావించారు. బాలిక విషయం బయటకు రావడంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా కృష్ణపట్నం సీఐ, ముత్తుకూరు ఎస్సైను సస్పెండ్ చేశారని విమర్శించారు. తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టడాన్ని మాని, మహిళలకు రక్షణ కల్పించాలని ఎస్పీ, హోంమంత్రిని డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణను ఎలా కల్పించాలో జగనన్నను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. బాలిక కుటుంబానికి తమ పార్టీ అండగా ఉండి.. న్యాయం జరిగేంత వరకూ పోరాడుతూనే ఉంటామని చెప్పారు. పార్టీ జోనల్ మహిళాధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, జిల్లా మహిళాధ్యక్షురాలు సునంద, రూరల్, సర్వేపల్లి మహిళాధ్యక్షులు రమాదేవి, సంధ్యారాణి, దువ్వూరు సర్పంచ్ కృష్ణవేణి పాల్గొన్నారు. -
కార్యకర్తలకు అండగా వైఎస్సార్సీపీ
● నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి వాకాడు: ‘కష్టపడిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది. త్వరలో మంచి రోజులు వస్తున్నాయి’ అని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం వాకాడులోని తన నివాసంలో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రామ్కుమార్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందన్నారు. అందుకు తగినట్టుగానే అధికారులు ప్రభుత్వానికి వంత పలుకుతున్నారన్నారు. త్వరలోనే ప్రజలు కూటమి ప్రభుత్వానికి చరమగీతం పాడతారన్నారు. ప్రస్తుతం రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. పండించిన ధాన్యానికి తగిన గిట్టుబాటు ధరల్లేక అప్పుల పాలవుతున్నారన్నారు. తమ పార్టీ అన్నదాతలకు ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. జగనన్న పాలనలోనే పేదలకు న్యాయం జరిగిందన్నారు. అనంతరం స్థానిక ముస్లింలు రామ్కుమార్రెడ్డిని కలిసి ఇఫ్తార్ విందుకు ఆహ్వానించారు. ఆయన వెంట ఎస్ఈసీ సభ్యుడు కొడవలూరు దామోదర్రెడ్డి, వాకాడు, చిట్టమూరు మండలాల కన్వీనర్లు ఏనుగు సుధాకర్నాయుడు, సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి, దేవారెడ్డి నాగూర్రెడ్డి, శేషురెడ్డి, గూడూరు వెంకటేశ్వర్లురెడ్డి, నెల్లూరు పెంచలరెడ్డి, పాపారెడ్డి రాజశేఖరరెడ్డి, రాజారెడ్డి, మధురెడ్డి, శ్రీహరిరెడ్డి, జనార్దనరెడ్డి, సుధాకర్ నాయుడు, బాలకృష్ణయ్య, మధురెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
చెడు వ్యసనాలకు బానిసై భార్యకు వేధింపులు
● న్యాయం కోసం పీజీఆర్ఎస్లో మహిళ వినతి నెల్లూరు(క్రైమ్): ‘చెడు వ్యసనాలకు బానిసైన నా భర్త అదనపుకట్నం కోసం వేధిస్తున్నాడు. నన్ను, పిల్లలను పట్టించుకోవడంలేదు. ఇటీవల ఇంటి నుంచి గెంటేశాడు. విచారించి తగిన చర్యలు తీసుకోవాలి’ అని తోటపల్లిగూడూరు మండలానికి చెందిన ఓ వివాహిత కోరారు. సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 161 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్లకు అందజేశారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. మీరైనా దృష్టి సారించాలని పలువురు ఉన్నతాధికారులను కోరారు. ఎస్పీ మాట్లాడుతూ చట్ట పరిధిలో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆయా ప్రాంత పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ యు.సత్యనారాయణ, డీసీఆర్బీ, పీసీఆర్, ఎస్బీ ఇన్స్పెక్టర్లు ఎన్.రామారావు, భక్తవత్సలరెడ్డి, బి.శ్రీనివాసరెడ్డి, ఫిర్యాదుల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● నా భర్త చనిపోయాడు. కుమారుడు నా దగ్గరున్న 8 సవర్ల బంగారు ఆభరణాలు, పీఎఫ్ అకౌంట్లోని నగదు తీసుకున్నాడు. నాకు జీవనాధారం కష్టంగా ఉంది. ఇదేమని ప్రశ్నిస్తే కొట్టేందుకు వస్తున్నాడు. విచారించి న్యాయం చేయాలని ముత్తుకూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు. ● నా భర్త నిత్యం వేధిస్తుండటంతో జనవరిలో పోలీసుకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. విచారించి న్యాయం చేయాలని కోటకు చెందిన ఓ వివాహిత కోరారు. ● అమెరికాలో క్విక్ అకౌంట్ ద్వారా భారీ లాభాలు వస్తాయని అశ్విన్, నితిన్రెడ్డి నా వద్ద రూ.60 వేలు తీసుకుని మోసగించారు. వారిపై చర్యలు తీసుకోవాలని దర్గామిట్ట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. -
అధికంగా గృహహింస కేసులు
● రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ● నెల్లూరులో జన సున్వాయి నెల్లూరు(పొగతోట): సమాజంలో ప్రస్తుతం గృహహింస కేసులు అధికంగా ఉన్నాయని, వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం జన సున్వాయి కార్యక్రమం జరిగింది. మహిళా కమిషన్ కార్యాలయం నుంచి 12 కేసులకు నోటీసులిచ్చారు. వాటిలో నలుగురు మహిళలు హాజరయ్యారు. 30 మంది వివిధ సమస్యలపై కమిషన్కు ఫిర్యాదు చేశారు. శైలజ మాట్లాడుతూ పోలీస్ అధికారులు జీరో ఎఫ్ఐఆర్పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నెల్లూరు ఆర్డీఓ అనూష చైర్పర్సన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి, ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్, లీగల్ కౌన్సెలర్ పూజిత, సీఐ సుబ్బారావు, సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి పాల్గొన్నారు. సమస్యలు చెప్పి.. రంగనాయకులపేటకు చెందిన ఓ మహిళ తన భర్త ఇబ్బంది పెడుతున్నాడని, కుమారుడిని, తనను పట్టించుకోవడం లేదన్నారు. అనారోగ్యంతో అవస్థలు పడుతున్నానని భరణం ఇప్పించి, విడాకులు మంజూరు చేయించాలని కోరారు. తనును ప్రభు త్వ ఉద్యోగి ఇబ్బంది పెడుతున్నాడని న్యాయం చేయాలంటూ కోరుతూ నగరానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. లాయర్ అయిన తనకే న్యాయం జరిగలేదని ఓ మహిళ సమస్యను వెల్లడించారు. కొందరు ఇంటివద్ద ఉన్న నాపై, భర్తపై దౌర్జన్యం చేసి దాడి చేసి 10 సవర్ల బంగారం లాక్కెళ్లారని వాపోయారు. ఈ విషయంపై కేసు పెట్టినా కొట్టి వేశారని, మనం ఏ కాలంలో ఉన్నామని లాయర్ ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు ఇబ్బందులు పెడుతున్నారని ఓ తల్లి అర్జీ ఇచ్చారు. భర్త ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, కేసు నమోదు చేసి న్యాయం చేయాలని ఉదయగిరి ప్రాంతానికి చెందిన ఓ మహిళ వినతిపత్రమిచ్చారు. మీ భర్తను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తాం. ఇద్దరూ కలిసి ఉండేలా చర్యలు తీసుకుంటామని కమిషన్ చెప్పినా ఆమె వినలేదు. భర్త వల్ల పడరాని పాట్లు పడుతున్నానని తల్లిదండ్రులతో వచ్చి ఫిర్యాదు చేశారు. కార్యాలయాల్లో అధికారుల వల్ల ఇబ్బందులు పడుతున్నామని మహిళా ఉద్యోగులు అర్జీ ఇచ్చారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కమిషన్ ఆదేశించారు. -
ప్లంబింగ్ పనులు చేస్తుండగా..
● సన్షేడ్పై పడి ప్లంబర్ మృతి నెల్లూరు(క్రైమ్): ఓ వ్యక్తి అపార్ట్మెంట్లో తాడు సాయంతో ప్లంబింగ్ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో తాడు తెగిపోవడంతో సన్షేడ్పై పడి ప్లంబర్ మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని ఉస్మాన్సాహెబ్పేటకు చెందిన ఎ.మధుసూదన్ (29) ప్లంబర్. భార్యాభర్తలు విడిపోయారు. దీంతో ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటూ పనికి వెళ్తున్నాడు. సోమవారం అతను హరనాథపురం ఐదో వీధిలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్మెంట్లో పనికి వెళ్లారు. సహచరులు కరీమ్, అజయ్ తాడు పట్టుకోగా దాని సాయంతో మధుసూదన్ మూడో అంతస్తులో పనులు చేయసాగాడు. ప్రమాదవశాత్తు తాడు తెగిపోవడంతో మధుసూదన్ ఒకటో అంతస్తు ఫ్లాట్స్ మధ్యనున్న సన్షేడ్పై పడటంతో తీవ్రగాయాలయ్యాయి. సహచరులు అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని అపో లో హాస్పిటల్కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మధుసూదన్ మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి తండ్రి లింగన్న బాలా జీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై పుల్లారెడ్డి కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమి త్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. పెన్నానదిలో మృతదేహం నెల్లూరు(క్రైమ్): నెల్లూరు కొత్త పెన్నాబ్రిడ్జి సమీపంలో సోమవారం నదిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వారు భగత్సింగ్ కాలనీ 54/4వ వార్డు వీఆర్వో తిరుమలరాజుకు సమాచారం అందించారు. ఆయన నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. మృతుడి వయస్సు 50 నుంచి 55 సంవత్సరాల్లోపు ఉంటుందని భావిస్తున్నారు. తెలుపు, గోధుమ రంగు గళ్ల ఫుల్ హ్యాండ్స్ చొక్కా ధరించి ఉన్నాడు. మృతదేహం కుళ్లిపోయి, ఉబ్చి జుట్టు ఊడిపోయి గుర్తించలేని స్థితిలో ఉంది. మృతుడు ఒంటిపై చొక్కా మాత్రమే ఉండటాన్ని బట్టి కాలకృత్యాల నిమిత్తం నదిలో దిగి ప్రమాదవశాత్తు మృతిచెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. -
జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
● కలెక్టరేట్లో డీవైఎఫ్ఐ ధర్నా నెల్లూరు(అర్బన్): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి అన్ని రకాల పోస్టులను భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరసింహ, ఎంవీ రమణ డిమాండ్ చేశారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఆ సంఘానికి చెందిన కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇంకా ఖజనాలో డబ్బుల్లేవంటూ గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ కాలం గడపడం సిగ్గు చేటని విమర్శించారు. సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం వాటి సంగతి మర్చిపోయిందన్నారు. ఇప్పటికై నా ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేకుంటే, ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు తిరుపతి, జగదీష్, హర్ష, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభాకర్రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు
ఇందుకూరుపేట: కొమరిక గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు గూడూరు ప్రభాకర్రెడ్డి మృతి పార్టీకి తీరని లోటని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. ఇటీవల ప్రభాకర్రెడ్డి అనారోగ్యంతో మృతిచెందిన విషయం తెలిసిందే. సోమవారం కాకాణి కొమరికిలోని ప్రభాకర్రెడ్డి నివాసానికి చేరుకుని కుటుం బసభ్యులను పరామర్శించారు. తొలుత ప్రభాకర్రెడ్డి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఆయన వెంట పార్టీ మండలాధ్యక్షుడు మావులూరు శ్రీనివాసులురెడ్డి, రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి బట్టేపాటి నరేంద్రరెడ్డి, నాయకులు మందల వెంకటశేషయ్య, షబ్బీర్, మహీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సారూ.. మీరైనా దయ చూపండి
● అధికారులను కోరిన అర్జీదారులు ● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నెల్లూరు(అర్బన్): ‘సారూ.. మా సమస్యల పరిష్కారం కోసం మండల స్థాయిలో అధికారుల చుట్టూ తిరిగాం. అక్కడ స్పందన లేదు. మీరైనా దయ చూపండి’ అని అర్జీదారులు అధికారులను వేడుకున్నారు. సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులతో కలెక్టరేట్ కిటకిటలాడింది. ప్రజల నుంచి కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, డిప్యూటీ కలెక్టర్ మురళి తదితరులు వినతులు స్వీకరించారు.చర్యలు తీసుకోవాలి వరికుంటపాడు, పక్కనే ఉన్న భాస్కరాపురం గ్రామాల మధ్య ప్రభుత్వానికి చెందిన 47 ఎకరాల భూముల్లో తెల్లరాయి తవ్వకాలను గ్రామస్తులు వ్యతిరేకిస్తూ గత సంవత్సరం ఆగస్టులో ర్యాలీకి సిద్ధపడ్డారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు కాంట్రాక్టర్ తరఫున ఉండి ప్రజలపై దౌర్జన్యాలు చేశారు. దీంతో అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టుకెళ్లగా కోర్టు ప్రజలకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అధికారులుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయినా ఎలాంటి చర్యల్లేవు. కలెక్టర్ స్పందించి కోర్టు తీర్పునకు అనుగుణంగా రెండు గ్రామాల ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించిన వారిపై చర్యలు చేపట్టాలి. – నల్లగొండ్ల మాల్యాద్రి, వరికుంటపాడు గ్రామం బ్లాక్లో వంట గ్యాస్ విక్రయం ఇరాన్పై యుద్ధం నేపథ్యంలో పలు గ్యాస్ ఏజెన్సీలు కమర్షియల్ సిలిండర్లను బ్లాక్ చేశాయి. అందుబాటులో లేవంటూ అధిక రేటుకు బ్లాక్లో విక్రయిస్తున్నారు. సిలిండర్పై అదనంగా రూ.700 నుంచి రూ.1,000 వరకు డిమాండ్ చేస్తున్నారు. మాకు వ్యాపారాల రీత్యా తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నాం. అధిక భారం మోయాల్సి వచ్చింది. మరింత రేట్లు పెరుగుతాయని ఏజెన్సీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమంగా బ్లాక్ మార్కెట్ను సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. గ్యాస్ సిలిండర్లను అందుబాటులో ఉంచాలి. – అర్షద్, యాదవ్కుమార్రెడ్డి, సుందర్నాయుడు, కృష్ణనాయుడు హోటళ్లు, ధాబాల నిర్వాహకులు గోషా ఆస్పత్రిని పూర్తి చేయాలి నెల్లూరులోని పాత మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఏడేళ్ల క్రితం గోషా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ప్రహరీ నిర్మించారు. లోపల చిన్నపాటి ఆస్పత్రిలా అరకొర నిర్మాణాలు జరిపారు. దీంతో ప్రజలకు వైద్య సౌకర్యాలు స్థానికంగా అందడం లేదు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నిర్ణీత కాలపరిమితి లోపు పూర్తి నిర్మాణాలు జరిపి ప్రారంభోత్సవం చేసి వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురావాలి. – మధు, అజీజ్, అహ్మద్బాషా, లీలామోహన్, సీపీఐ నేతలు -
గంజాయి కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలు
● ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా నెల్లూరు (లీగల్): అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారని నమోదైన కేసులో నేరం రుజువు కావడంతో ఒడిశా ప్రాంతానికి చెందిన కుమార్ దలై, అనిల్కుమార్ జీనాకు ఐదేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధిస్తూ నెల్లూరు మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జీ గీత సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. ఒడిశా నుంచి ఏపీకి గంజాయి సరఫరా జరుగుతున్న సమచారం మేరకు చీరాల రైల్వేస్టేషన్లో 2021 నవంబర్ 28న పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా సుమారు మూడు గంటల సమయంలో బిలాస్పూర్– తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు జనరల్ బోగి నుంచి ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా దిగుతున్న సమయంలో రైల్వే పోలీసులు గుర్తించి తనిఖీలు చేశారు. వారి వద్ద ఉన్న బ్యాగ్లో 15 కేజీల గంజాయిని గుర్తించి మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు. దర్యాప్తు అనంతరం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయగా, విచారణలో నేరం రుజువు కావడంతో పైమేరకు శిక్ష జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ షేక్ రఫీ మాలిక్ వాదించారు. -
సముద్రంలోకి ఆలివ్రిడ్లీ పిల్లల విడుదల
విడవలూరు: మండలంలోని ఊటుకూరు పెద్దపాళెం వద్ద సముద్రంలోకి ఆలివ్రిడ్లీ తాబేలు పిల్లలను సోమవారం విడిచి పెట్టారు. స్రౌత్ కోస్టల్ సెక్యూరిటీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మైరెన్ పోలీసులు ట్రీ ఫౌండేషన్ సహకారంతో సుమారు 80 తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి వదిలారు. ఈ సందర్భంగా ఇసుకపల్లి మైరెన్ పోలీస్ స్టేషన్ సీఐ శేషయ్య మాట్లాడుతూ సముద్రంలో జీవవైవిధ్యం కోసం అంతరించిపోతున్న ఆలివ్రిడ్లీ తాబేళ్ల సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ట్రీ ఫౌండేషన్ జిల్లా కోఆర్డినేటర్ ఎం నరేష్ మాట్లాడుతూ ఆలివ్రిడ్లీ తాబేళ్లు గుడ్లు పెట్టే విధానం, పొదిగే ప్రక్రియ, పిల్లల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. తీరప్రాంత మత్యకారులు తాబేళ్లను సంరక్షించాలన్నారు. హెడ్ కానిస్టేబుల్ కృష్ణ, పీసీలు వినోద్, కృష్ణ, తాబేలు సంరక్షణ వాచర్లు, స్ధానికులు తదితరులు పాల్గొన్నారు. -
మొబైల్ యాక్సెసరీస్ దుకాణాలపై విజిలెన్స్ దాడులు
● రూ.49.24 లక్షల సరుకు సీజ్ నెల్లూరు (క్రైమ్): నెల్లూరు నగరంలోని పలు మొబైల్ యాక్సెసరీస్ విక్రయ దుకాణాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సోమవారం దాడులు చేశారు. రూ.49.24 లక్షల సరుకును సీజ్ చేశారు. పలు మొబైల్ యాక్సరీస్ విక్రయ దుకాణాల్లో బిల్లులు లేకుండా వస్తువులు విక్రయిస్తున్నారనీ, జీఎస్టీ ఎగువేస్తూ ప్రభుత్వాదాయానికి గండికొడుతున్నారని విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు తమ సిబ్బందితో కలిసి సోమవారం లస్సీ సెంటర్, గడ్డంవారివీఽధిలో ని పలు దుకాణాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వ హించారు. వ్యాపారులు సరైన బిల్లులు లేకుండా మొబైల్ యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్ పరికరాలు విక్రయిస్తున్నారని గుర్తించారు. ప్రముఖ కంపెనీలకు చెందిన ఈయర్పోడ్స్, ఛార్జర్లు, నెక్ బ్యాండ్స్ అంటూ నాణ్యతలేని వస్తువులను వినియోగదారులకు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. జై అంబికా షాపులో రూ.8,99, 224, శ్రీఅంబికా షాపులో రూ. 22,45,919, జేపీ షాపులో రూ.17,79,439 విలువ చేసే సరుకును సీజ్ చేసి దుకాణాలను మూసివేశారు. మూడు దుకాణాల్లో సీజ్ చేసిన రూ.49,24,582 సరుకును తదుపరి దర్యాప్తు నిమిత్తం జీఎస్టీ అధికారులకు అప్పగించారు. ఈ దాడుల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ కే నరసింహరావు, డీసీటీఓ కే విష్ణురావు, వ్యవసాయాధికారి పీ వేణుగోపాల్, ఆఫీసు సూపరింటెండెంట్ శాంతిభూషణ్రెడ్డి, హెడ్కానిస్టేబుల్ వీ హరికృష్ణ, కానిస్టేబుల్ పీవీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక తవ్వకాలపై గతంలో ఫైర్
● నారాయణకు తలనొప్పిగా మారిన సొంత పార్టీ నేతలు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో షాడో మంత్రుల ఆధిపత్యం పెరిగింది. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణకు సొంత పార్టీ నేతలే తలనొప్పిగా తయారయ్యారు. సాక్షాత్తు మంత్రే కార్యకర్తల టెలికాన్ఫరెన్స్లో తనకు చెడ్డపేరు తెచ్చేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని, ఇక్కడ ఏం జరుగుతున్నాయో తనకు అన్నీ తెలుసని చెప్పడంతో పార్టీ లో గ్రూప్ రాజకీయాలను ఆయన విస్పష్టం చేసినట్లు అయింది. మంత్రి నారాయణ కుటుంబ సభ్యులు, ఆయనకు అత్యంత సన్నిహితులతో పాటు ముఖ్యనేతలు సైతం గ్రూపు రాజకీయాలు చేస్తున్నారు. మద్యం వ్యాపారాలు, ఇసుక తవ్వకాలు, కాంట్రాక్ట్ పనులు, నామినేటెడ్ పదవులు, ఉద్యోగుల బదిలీలు తదితర విషయాల్లో వీరి జోక్యం అధికం అయినట్లు మంత్రి మాటల్లోనే తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మంత్రి పొంగూరు నారాయణ నెల్లూరు నగర ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నెలలో వారం రోజులకు మించి స్థానికంగా ఉండడం లేదు. నెల్లూరుకు ఆయన గెస్ట్గా అప్పుడప్పుడు వచ్చిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల పేరుతో హడావుడి చేసి వెళ్లిపోవడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ఆయన నగరంలో లేకపోవడంతో కొందరు టీడీపీ నేతలకు పార్టీ పగ్గాలు అప్పగించారు. అయితే ఆ నేతలు తమ సొంత వ్యక్తులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీ కోసం దశాబ్దాలపాటు కష్టపడిన వారిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. మరో వైపు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే కాంట్రాక్ట్ పనులు అప్పగిస్తున్నారని తెలుస్తోంది. ఈ విషయాలను నారాయణ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా ఆయన అందుబాటులో లేకపోవడంతో క్రియాశీల కార్యకర్తలు పార్టీ వ్యవహారాల్లో దూరంగా ఉంటున్నారు. ఆ ఆరు గ్రూపులే కీలకం మంత్రి నారాయణ నగర నియోజకవర్గంలో ఎక్కువ రోజులు గడపకపోవడంతో కొందరు టీడీపీ ముఖ్య నేతలకు పార్టీ కార్యక్రమాలు, ఇతర కాంట్రాక్ట్ కేటాయింపులను అప్పగించారు. అయితే మంత్రి నారాయణ భార్య రమాదేవి, వేమిరెడ్డి విజయ్భాస్కర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఎవరికి వారు షాడో మంత్రులుగా వ్యవహరిస్తూ ఇసుక తవ్వకాలు, మద్యం వ్యాపా రులు, కాంట్రాక్ట్ పనులు, నామినేటెడ్ పదవులు, ఉద్యోగుల బదిలీలు ఇలా.. ప్రతి విషయంలో తమదైన ముద్ర వేసుకుంటున్నారు. పనులు అవసరమైన వారు సైతం వీరిలో ఎవరి దగ్గరకు పోతే.. తమ పని అవుతుందో తెలుసుకుని.. అక్కడికే వెళ్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కార్యకర్తలు సామాజిక వర్గాలు, స్థానిక బలాలతో ముడిపెట్టుకుని ఆయా నాయకుల చెంతకు చేరుతున్నారు. దీంతో తమ వారికి మున్సిపల్ కాంట్రాక్ట్ పనులు అప్పగింత, నామినేటెడ్ పదవులు కేటాయింపు, ఇతర పనుల్లో ప్రాధాన్యత కల్పిస్తున్నారు. పోటాపోటీగా నారాయణ వద్దకు సిఫార్సులు నగరంలోని టీడీపీ నేతల గ్రూపుల్లోని తమ వర్గీయులకు ప్రాధాన్యత కల్పించుకునేందుకు పోటీ పడుతున్నారు. నగరంలోని ఓ ఆలయ కమిటీ చైర్మన్ ఎన్నికలో తమ వ్యక్తికి స్థానం కల్పించాలని ఇద్దరు టీడీపీ ముఖ్య నేతలు మంత్రి వద్ద సిఫార్సులు పెట్టారు. ఇతర నామినేటెడ్ పదవులను తమ వారికే ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో ఎవరికి ఇవ్వాలనే దానిపై నారాయణ సమాలోచనలు చేసి పదవులు కేటాయించారు. ఈ క్రమంలో తాజాగా రంగనాథస్వామి బ్రహ్మోత్సవ కమిటీలో అన్యమతస్తురాలికి మంత్రి సిఫార్సులతో చోటు కల్పించడంతో అభాసుపాలయ్యారు. గ్రూప్లుగా ఏర్పడిన నగర ముఖ్య టీడీపీ నేతలు తమ కనుసన్నల్లోనే మద్యం వ్యాపారాలు, ఇసుక తవ్వకాలు, కాంట్రాక్ట్ పనుల కేటాయింపులు నామినేటెడ్ పదవుల్లోనూ పోటా పోటీగా మంత్రికి నేతల సిఫార్సులు తాజాగా రంగనాథస్వామి బ్రహ్మోత్సవ కమిటీలో అన్యమతస్తురాలికి చోటు కల్పించి అభాసుపాలు మరో వైపు నగరంలో టీడీపీ నేతలే ఇసుక తవ్వకాలు బహిరంగా చేస్తున్నారంటూ గతంలో మంత్రి నారాయణ నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో పేర్లతో సహా హెచ్చరించడంతో పెద్ద దుమారమే రేగింది. తాజాగా జరిగిన టెలికాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడుతూ తనకు చెడ్డ పేరు తెచ్చేలా కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని, నాకు అన్నీ తెలుసని చెప్పడంతో ఆ నేతలు ఎవరనేదానిపై పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తన దగ్గర 700 మంది పనిచేస్తున్నారని, ఎప్పటికప్పుడు నగరంలో ఏమి జరుగుతుందో తన దృష్టికి వస్తుందన్నారు. దీంతో ఆ నేతలపై నారాయణ నిఘా ఉంచారని స్పష్టమవుతోంది. -
గూడూరు ఆర్డీఓగా సత్యనారాయణ బాధ్యతలు
చిల్లకూరు: గూడూరు ఆర్డీఓగా జీవీవీ సత్యనారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న సబ్కలెక్టర్ రాఘవేంద్ర మీన ఆరు నెలల క్రితం బదిలీపై ఢిల్లీ వెళ్లారు. అప్పట్నుంచి నెల్లూరు ఆర్డీఓ నాగసంతోష అనూషా ఇన్చార్జి ఆర్డీఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రామాయపట్నం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పని చేస్తున్న జీవీవీ సత్యనారాయణను పూర్తిస్థాయి బాధ్యతలతో ఆర్డీఓగా నియమించారు. ఇద్దరికి కారుణ్య నియామకాలు నెల్లూరు(అర్బన్): ప్రభుత్వ శాఖల్లో పని చేస్తూ మృతి చెందిన ఇద్దరి ఉద్యోగుల కుటుంబ సభ్యులకు సోమవారం కలెక్టర్ హిమాన్షు శుక్లా కలెక్టరేట్లో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించారు. సూరాయపాళెం పీహెచ్సీలో ఎంఎన్ఓగా విధులు నిర్వర్తిస్తూ మృతి చెందిన వెంకటయ్య కుమారుడు ఆనంద్కుమార్కు జూనియర్ అసిస్టెంట్/కంప్యూటర్ అసిస్టెంట్గా, డక్కిలి పీహెచ్సీలో ఆఫీస్ సబార్డినేట్గా విధులు నిర్వర్తిస్తూ మృతి చెందిన రమేష్కుమారుడు నితిన్తేజను వ్యవసాయశాఖలో జూనియర్ అసిస్టెంట్గా నియమిస్తూ అందుకు సంబంధించిన ఉత్తర్వులను అందజేశారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 77,879 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 12 గంటలు పడుతుండగా, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
భక్తవరదాయిని ముత్యాలమ్మ
● నేటి నుంచి నాలుగురోజుల పాటు జాతర ● తూర్పుకనుపూరులో మొదలైన సందడి చిల్లకూరు: మండలంలోని తీరప్రాంతంలో కొలువైన ముత్యాలమ్మ భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. ఏటా ఉగాదికి ముందు ముత్యాలమ్మ ఆలయానికి అనుబంధంగా ఉండే పోలేరమ్మ జాతరను దేవదాయశాఖ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా ఈ ఏడాది మంగళవారం నుంచి నాలుగురోజుల పాటు జాతరను వైభవంగా నిర్వహించనున్నారు. జాతరకు నాలుగు రాష్ట్రాల నుంచి సుమారు నాలుగు లక్షల మందికిపైగా భక్తులు తరలిరానున్నారు. ముత్యాలమ్మను దర్శించుకుని పోలేరమ్మకు పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకోనున్నారు. అందుకనుగుణంగా దేవదాయశాఖ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చే స్తున్నారు. జాతర నిర్వహణ ఇలా.. ముత్యాలమ్మ సోదరిగా భావించే పోలేరమ్మ జాతర మంగళవారం రాత్రి ప్రారంభం కానుంది. నాలుగు రోజుల పాటు నిర్వహించే జాతరలో భాగంగా తొలిరోజు పోలేరమ్మ విగ్రహాన్ని కుమ్మరి ఇంట తయారు చేసి చాకలి ఇంటికి చేర్చుతారు. అనంతరం ఘటంలోని చద్దిని అమ్మవారికి ప్రసాదంగా సమర్పించి దిష్టితీర్పు చేపడుతారు. రెండోరోజు బుధవారం వేకువజామున గ్రామానికి సమీపంలో ఉన్న గంగమిట్ట మీద పోలేరమ్మను కొలువుదీర్చి భక్తులకు దర్శనం, గురునాథస్వామి గ్రామోత్సవం నిర్వహించనున్నారు. గురువారం యార గురునాథస్వామి గ్రామోత్సవం, గొల్లల వేడుక, ముత్యాలమ్మకు బంగారుచీర అలంకరణ, భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. శుక్రవారం పోలేరమ్మను సాగనంపే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. -
డిప్యూటీ సీఎం పవన్కు అవమానం
‘ప్రజల చేతిలో ప్రభుత్వం’ వాట్సాప్ గవర్నెన్స్ ప్రచారం పోస్టర్లలో ప్రోటోకాల్ ప్రకారం డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ఫొటో ముద్రించకపోవడంతో తీవ్ర అవమానం జరిగింది. ఒక పక్క చంద్రబాబు సింగిల్గా మనం గెలవలేదు.. మోదీ, పవన్కళ్యాణ్ అండతోనే గెలిచామంటూ బహిరంగ వేదికలపై చెబుతున్నారు. మరో పక్క ప్రభుత్వ ప్రచార పోస్టర్లలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఫొటోలు ముద్రించారు. సీఎం ఫొటో పెట్టారంటే అర్థం ఉంది. కానీ మంత్రి లోకేశ్ ఆ శాఖ కానప్పటికీ.. ఆ పోస్టర్లలో ఆయన ఫొటో ముద్రించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కూటమిలో సఖ్యత లేదనే ఒక ప్రచారం అయితే.. మరో వైపు పవన్కళ్యాణ్ను వ్యూహాత్మకంగా పక్కకు తప్పిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఒక వైపు సీఎం చంద్రబాబు, మరో పక్కన డీసీఎం పవన్ ఫొటోలు పెట్టారు. జెడ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వాట్సాప్ గవర్నెన్స్ ప్రచారం పోస్టర్లలో మాత్రం ఆయన ఫొటో లేకుండా చేయడం సర్వత్రా చర్చకు దారితీసింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
కూటమి పాలనలో రైతులు విలవిల
● ధాన్యానికి గిట్టుబాటు ధరలు కల్పించాలి ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తోటపల్లిగూడూరు(పొదలకూరు) : ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు విలవిలాడిపోతున్నారని, జిల్లాలో వరికోతలు ప్రారంభమైన నేపథ్యంలో ఒకటి రెండ్రోజుల్లోనే ధరలు తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. తోటపల్లిగూడూరు మండలం ఈదూరులో సోమవారం ఆయన పర్యటించారు. ఇటీవల మృతి చెందిన పార్టీ నాయకుడు తూపిలి సుబ్బరామిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా రైతులకు కష్టాలు తప్పవన్నారు. 850 కేజీల పుట్టి ధాన్యం రూ.20,300 ఉండాల్సి ఉండగా, రూ.19 వేలకు పడిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతుల వద్ద ధాన్యాన్ని సేకరించి కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కూటమి నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం తిరుమల శ్రీవారిని రాజకీయాల్లో లాగారని ఆరోపించారు. చంద్రబాబునాయుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే పథకం ప్రకారం తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేశారన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు భ్రష్టుపట్టిపోయారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో అప్పులు కుప్పలుగా మారినట్టుగా కాగ్ నివేదిక తేటతెల్లం చేసిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ, గత ప్రభుత్వ పాలనల్లోని తేడాను ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారన్నారు. రాబో యేది వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమేనన్నారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా లభ్యం అవుతుండడంతో నేరాలు బాగా పెరుగుతున్నాయన్నారు. గుమ్మళ్లదిబ్బ, వరిగొండ అఘాయిత్యాలు పోలీసుల నిర్లక్ష్యం వల్లే జరిగాయని విమర్శించారు. సస్పెండ్ అయిన పోలీసు అధికారులపై లోతుగా విచారణ జరిపితే శాశ్వతంగా విధుల నుంచి తొలగించే అవకాశం ఉంటుందన్నారు. వారి హయాంలో జరిగిన అవినీతి, అరాచకాలపై విచారణ జరిపితే అన్ని విషయాలు బయటపడతాయన్నారు. పోలీసులు సంఘవిద్రోహులపై నిఘాపెట్టకుండా వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టేందుకు సమయం వెచ్చించడం వల్లే అఘాయిత్యాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. జిల్లాలో శాంతిభద్రతలు లోపించాయని, వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులను పెట్టేందుకు ఆసక్తి చూపుతూ శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలమవుతున్నారన్నారు. తోటపల్లిగూడూరుకు చెందిన బాధిత బాలిక కుటుంబాన్ని త్వరలో పరామర్శించి ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తామన్నారు. ఆయన వెంట పార్టీ నేతలు టంగుటూరు పద్మనాభరెడ్డి, ఉప్పల శంకరయ్యగౌడ్, వంశీకృష్ణారెడ్డి, సుబ్రహ్మణ్యంగౌడ్, తలమంచి సురేంద్రబాబు, చిరంజీవిగౌడ్ తదితరులు ఉన్నారు. -
క్రీడా పోటీల్లో సత్తా
నెల్లూరు(పొగతోట): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు మొదటిసారిగా ఆటల పోటీలను జెడ్పీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో శుక్ర, శనివారాల్లో ఏర్పాటు చేసిన పోటీలు ఉత్సాహంగా సాగాయి. విజేతలకు బహుమతులను చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, సీఈఓ శ్రీధర్రెడ్డి, డిప్యూటీ సీఈఓ మోహన్రావు ఆదివారం అందజేశారు. జెడ్పీలో పనిచేస్తున్న అధిక శాతం మహిళా ఉద్యోగులు రెండు నుంచి మూడు బహుమతులను దక్కించుకున్నారు. అనంతసాగరం ఎంపీడీఓ కార్యాలయానికి చెందిన ఆఫీస్ సభార్డినేట్ సుమతి ఆరు బహుమతులను గెలుచుకున్నారు. అలరించిన భరతనాట్య ప్రదర్శన జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏఓగా పనిచేస్తున్న విజయరాణి 61 ఏళ్ల వయస్సులో భరతనాట్యాన్ని ప్రదర్శించి అబ్బురపర్చారు. ఈమెకు బహుమతిని అరుణమ్మ అందజేశారు. -
సర్వేయర్లకు ‘సర్కారు’ సంకటం
వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థను సమూలంగా నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఒక్కొక్క సచివాలయంలో పది నుంచి పన్నెండు మందిని వివిధ విభాగాల కింద ఉద్యోగులుగా నియమించారు. ఇందులో భాగంగా విలేజ్ సర్వేయర్లను నియమించారు. ఇప్పటికే సచివాలయ వ్యవస్థను చీలకలు పీలికలు చేశారు. రెండు.. మూడింటిని విలీనం చేస్తూ.. ఉద్యోగులను ఇతర విభాగాలకు బదిలీ చేయడంతో సచివాలయ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. తాజాగా విలేజ్ సర్వేయర్ల విభాగ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేసేలా సర్కార్ నిర్దయగా వ్యవహరిస్తోంది. నెల్లూరు సిటీ : కూటమి సర్కారు విలేజ్ సర్వేయర్ల పాలిట సంకటంగా మారింది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు.. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టారు. శతాబ్దం క్రితం ఏర్పాటు చేసిన సర్వే రాళ్లు, హద్దుల విషయంలో వివాదాలకు చెక్ పెట్టేందుకు అప్పటికే అమల్లోకి తెచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థలోకి విలేజ్ సర్వేయర్లను నియమించారు. రీసర్వే ప్రక్రియకు ఉపక్రమించారు. సచివాలయ వ్యవస్థ నిర్వీర్యమిలా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రజలకు విస్తృతంగా, వేగంగా సేవలందించేందుకు ఒక్కో సచివాలయంలో పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పో లీస్, ఏఎన్ఎం, విలేజ్ సర్వేయర్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, వెటర్నరీ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్తోపాటు పండ్ల తోటలు ఉన్న ప్రాంతాల్లో హార్టికల్చర్ అసిస్టెంట్లు, సముద్రతీర ప్రాంతాల్లో మత్స్యశాఖ అసిస్టెంట్లను నియమించారు. అదే సమయంలో ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీర్ను ఏర్పాటు చేసి అన్ని వివరాలను వీరితో సర్వే చేయించి, ఆ వివరాలు నమోదు చేసేందుకు ఆయా విభాగాలు పనిచేస్తూ వచ్చాయి. దీంతో పాటు కార్యాలయంతోపాటు క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజాదరణ అందుకున్న సచివాలయ వ్యవస్థతో వైఎస్ జగన్మోహన్రెడ్డి కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుందనే దుగ్ధతో కూటమి ప్రభుత్వం వచ్చాక.. ఒక్కో విభాగాన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చారు. వలంటీర్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు. రెండు..మూడు సచివాలయాలను విలీనం చేసి నిర్వీర్యం చేశారు. అందులోని ఉద్యోగులను ఇతర విభాగాలకు బదిలీ చేశారు. ఉన్న ఇద్దరు ముగ్గురు ఉద్యోగులకు అలవికాని బాధ్యతలు అప్పగించి వేధింపులకు పాల్పడుతోంది. విలేజ్ సర్వేయర్ల వ్యవస్థకు విధ్వంస రచన జిల్లాలో మొత్తం 386 మంది విలేజ్ సర్వేయర్లు విధులు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో భాగంగా గ్రామ / వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అందులో విలేజ్ సర్వేయర్ల నియామక ప్రక్రియ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి విలేజ్ సర్వేయర్లపై వివిధ శాఖల పనులుంచి ఒత్తిడి చేశారు. దూర ప్రాంతాలకు డిప్యుటేషన్ పై పంపారు. ఇవన్నీ భరిస్తూనే ఉద్యోగాలు చేస్తున్నారు. అదే సమయంలో గ్రామ / వార్డు సచివాలయ వ్యవస్థలోని ఇతర ఉద్యోగులకు మాదిరిగానే పే రోల్ మార్పు చేయాలని విలేజ్ సర్వేయర్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. మిగతా అందరికీ రూ.30 వేల వరకు బేసిక్ పే ఉండగా, విలేజ్ సర్వేయర్లకు రూ.25,200 మాత్రమే బేసిక్ పే ఉందని, ఈ తారతమ్యాన్ని సరిచేసేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రమోషన్ చానల్ కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దాన్ని అమలు చేయకపోవడంతో ఈ నెల ఐదు నుంచి విలేజ్ సర్వేయర్లు సహాయ నిరాకరణకు దిగారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వేయర్ల అసోసియేషన్లో నాయకులు సుమారు 40 మందిని సస్పెండ్ చేసింది. జిల్లాలో విలేజ్ సర్వేయర్ అసోసియేషన్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులపై ప్రభుత్వం చర్యలు చేపట్టడంపె సర్వేయర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట సచివాలయ సర్వేయర్లు ధర్నా నిర్వహించారు. అధ్యక్ష, ఉపాధ్యక్షుల సస్పెన్షన్ జిల్లాలోని సచివాలయ విలేజ్ సర్వేయర్ అసోసియేషన్లో కీలకంగా వ్యవహరించిన అధ్యక్ష, ఉపాధ్యక్షులు ప్రభుత్వానికి టార్గెట్ అయ్యారు. ప్రభుత్వం నుంచి జరగాల్సిన న్యాయాన్ని ప్రశ్నించడమే వారు చేసిన తప్పు. బేసిక్ పే తక్కువగా ఉందని, సర్వేయర్లపై పని ఒత్తిడి ఉందని ఉన్నతాధికారులను ప్రశ్నించడంతో వారిపై చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని విలేజ్ సర్వేయర్లుగా పనిచేస్తున్న అసోసియేషన్ అధ్యక్షుడు బీద లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు అస్మతుల్లాను సస్పెండ్ చేశారు. భయం గుప్పెట్లో సర్వేయర్లు ప్రభుత్వ ఏకపక్ష ధోరణి, నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడంపై సర్వేయర్లు, భయం గుప్పెట్లో ఉన్నారు. ప్రతి వ్యవస్ధలో ప్రశ్నించే హక్కు ఉంటుంది. అయితే కూటమి ప్రభుత్వం ఆ హక్కును కాలరాస్తోంది. దీంతో అధ్యక్ష, ఉపాధ్యక్షులనే సస్పెండ్ చేయడంతో ఇతర సర్వేయర్లు ముందుకొచ్చేందుకు సాహసం చేయలేకపోతున్నారు. తమపై ఎక్కడ వేటు వేస్తారని భయపడుతున్నారు. ఇది ఏ మాత్రం ఉపేక్షించేది కాదని పలువురు వాపోతున్నారు. హక్కుల కోసం పోరాటమే తప్పనే రీతిలో.. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరసనలు జిల్లాలో ఇద్దరు సచివాలయ సర్వేయర్ల సస్పెన్షన్తో బెదిరింపులు వైఎస్ జగన్ తెచ్చిన వ్యవస్థలను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు రీ సర్వేకు ఆటంకాలు -
త్యాగరాజ స్మరణోత్సవాల ప్రారంభం
నెల్లూరు(బృందావనం): నగరంలోని పురమందిరంలో త్యాగరాజ స్మరణోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలుత వేదాయపాళెంలోని త్యాగరాజస్వామి మందిరం నుంచి సీతారామ, లక్ష్మణ, హనుమత్ సమేత త్యాగరాజస్వామి ఉత్సవమూర్తులు, చిత్రపటాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి పురమందిర ప్రాంగణంలోని వేదికపై ప్రతిష్టించారు. అనంతరం గణపతిపూజ, పుణ్యాహవచనం, కలశస్థాపనను జరిపారు. హరికథకులతో హరికథలు, ఔత్సాహిక సంగీత కళాకారులతో త్యాగరాజ కృతుల ఆలాపన, శాక్సాఫోన్, కీబోర్డు, గాత్ర కచేరీలు, పంచరత్న గోష్టిగానాన్ని వీనులవిందుగా నిర్వహించారు. తొలి రోజు 120 మంది పాల్గొన్నారని భిక్షాటన పూర్వక త్యాగరాజ స్మరణోత్సవ సభ కమిటీ శాశ్వత కార్యదర్శి యనమండ్ర నాగదేవీప్రసాద్ తెలిపారు. వీనులవిందుగా గాత్రకచేరి చైన్నెకి చెందిన సంగీత విద్వాంసులు దీపిక, నందిక బృంద ఆధ్వర్యంలో ప్రధాన గాత్రకచేరిని నిర్వహించారు. వాద్య సహకారాన్ని పప్పు జ్ఞానదేవ్, కిశోర్ రమేష్, హరికిశోర్ అందించారు. -
డయల్ యువర్ ఎస్ఈ నేడు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నామని ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని విద్యుత్ భవన్లో ఉదయం 8.30 నుంచి 9.30 వరకు కార్యక్రమాన్ని జరపనున్నామని, సమస్యలను 0861 – 2320427 నంబర్కు తెలియజేయాలని కోరారు. రౌడీషీటర్పై పీడీ యాక్ట్ నెల్లూరు(క్రైమ్): రౌడీషీటర్ మనోజ్ అలియాస్ మనోజ్కుమార్పై పీడీ యాక్ట్ను సంతపేట పోలీసులు ఆదివారం ప్రయోగించారు. స్థానిక పోలీస్స్టేషన్లో వివరాలను ఇన్స్పెక్టర్ సోమయ్య వెల్లడించారు. ముత్తుకూరు మండలం నారికేళపల్లికి చెందిన మనోజ్కుమార్.. వెంకటాచలం మండలం సర్వేపల్లిలో ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. సంతపేట పోలీస్స్టేషన్లో రౌడీషీట్ ఉంది. నగరంలోని పెన్నా సమీపంలో గతేడాది అక్టోబర్లో చోటుచేసుకుంటున్న జంట హత్యకేసుల్లో ఇతను నిందితుడు. ప్రస్తుతం జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా అనుమతితో మనోజ్పై పీడీ యాక్ట్ను నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కడప కేంద్ర కారాగారానికి తరలించనున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. జాతర ఘటోత్సవం ప్రారంభం చిల్లకూరు: మండలంలోని తీర ప్రాంతంలో కొలువైన ముత్యాలమ్మ ఆలయంలో నిర్వహించే పోలేరమ్మ జాతరకు తొలి ఘట్టం ప్రారంభమైంది. మూడో చాటింపును ఆదివారం వేసిన అనంతరం ఘటోత్సవాన్ని నిర్వహించారు. ఈ నెల 10 నుంచి 13 వరకు నిర్వహించనున్న జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరానున్నారు. జాతరకు ముందొచ్చే ఆదివారాన ఆలయ ప్రధానార్చకుడి ఇంటి నుంచి ఘటం కుండలు పంచాయతీలోని ఐదు గ్రామాల్లో తిరిగి తూర్పుకనుపూరుకు మంగళవారం రాత్రికి చేరుకుంటే పోలేరమ్మను గంగ మిట్టపైకి తీసుకొచ్చి వేడుకను ప్రారంభించడం ఆనవాయతీ. ఈ క్రమంలో ఆలయ ప్రధానార్చకుడు చాకిరి రమణయ్య ఇంటి వద్ద ఘటం కుండలకు పూజలు చేశారు. అనంతరం కుండలో చద్ది పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామస్తుల కిలారింపులతో ఘటం కుండలను గ్రామంలోని ప్రధానమైన ఐదు కుటుంబాల ఇంటికి తీసుకెళ్లి అక్కడ చద్ది పోయించుకొని తిరిగి ప్రధానార్చకుడి ఇంటికి వేకువజామున తీసుకురానున్నారు. ఒబ్బాయి శివకుమార్ పర్యవేక్షించారు. సీఐ, ఎస్సై సస్పెన్షన్ నెల్లూరు(క్రైమ్): విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఓ సీఐ, ఎస్సైను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి జారీ చేశారు. ఓ బాలికపై లైంగిక దాడి యత్నం ఘటనలో పోక్సో కేసును తోటపల్లిగూడూరు పోలీసులు నమోదు చేశారు. సదరు కేసులో నిందితుడిపై ముత్తుకూరు పోలీస్స్టేషన్లో సస్పెక్ట్ షీటుంది. ఏడాదిగా నిందితుడిపై పోలీసుల నిఘా కొరవడటంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు భావించి కృష్ణపట్నం పోర్టు సీఐ రవినాయక్, ముత్తుకూరు ఎస్సై ప్రసాద్రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారని సమాచారం. దుబాయ్లో నారంపేట యువకుడి అదృశ్యం ఆత్మకూరు రూరల్: మండలంలోని నారంపేటకు చెందిన పాపసాని రాజశేఖర్ అనే యువకుడి ఆచూకీ పది రోజులుగా తెలియడంలేదని కుటుంబసభ్యులు ఆదివారం తెలిపారు. దుబాయ్లో సైబర్ గేట్ డిఫెన్స్ సెక్యూర్టీ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారని, ఫోన్లో అందుబాటులోకి రాకపోవడంతో ఆత్మకూరు పోలీసులను ఐదు రోజుల క్రితం ఆశ్రయించామని చెప్పారు. అయినా ప్రయోజనం లేదని, తమకు న్యాయం చేయాలని కోరారు. -
కారు ఢీకొని జింక మృతి
కోవూరు: ఆహారం కోసం జనావాసాల వైపు వస్తూ గుర్తుతెలియని కారు ఢీకొని జింక మృతిచెందిన ఘటన మండలంలోని పోతిరెడ్డిపాళెం సమీపంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గంగవరం కాలువ వద్ద ముంబై హైవే సమీపంలో జింక రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన గుర్తుతెలియని కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జింక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. స్థానికులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని జింక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. చెట్టు పైనుంచి పడి విద్యార్థినికి గాయాలు నెల్లూరు(స్టోన్హౌస్పేట): నగరంలోని దర్గామిట్టలో గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల విద్యార్థిని చెట్టు పైనుంచి పడిన ఘటన కలకలం రేపింది. ఆ హాస్టల్ సిబ్బంది, అధికారుల నుంచి సేకరించిన వివరాల మేరకు.. సరస్వతి పూజ కోసం మామిడాకులు కోసేందుకు ఇద్దరు విద్యార్థినులు శుక్రవారం హాస్టల్ భవనాన్ని ఎక్కారు. అయితే హఠాత్తుగా తొమ్మిదో తరగతి విద్యార్థిని చెట్టుపై నుంచి పడిపోయింది. గడ్డం భాగంలో దెబ్బతగలడంతో రక్తం కారుతున్న విద్యార్థినిని ఆస్పత్రికి తరలించారు. అదే సమయంలో ఐటీడీఏ పీఓ శ్రీనివాసులు హాస్టల్ పరిశీలనకు వచ్చారు. హాస్టల్ సిబ్బందిలో ఆందోళనను చూసి ప్రశ్నించగా ఇక్కడ తొమ్మిదో తరగతి విద్యార్థిని చెట్టుపై నుంచి పడిందని, ఆస్పత్రిలో చేర్చామని వారు తెలపడంతో పీఓ తక్షణమే రామచంద్రారెడ్డి ఆస్పత్రికి వెళ్లి సందర్శించారు. అక్కడ సిబ్బంది విద్యార్థిని నోటికి దెబ్బలు తగలడంతో మాట్లాడలేని పరిస్థితుల్లో ఉందని, తిరుపతికి తీసుకెళ్లాలని చెప్పడంతో అంబులెన్స్ కూడా మాట్లాడారు. అయితే తిరుపతికి వెళ్లేలోపు ఆలస్యమవుతుందని, కిమ్స్కు తరలించారు. అక్కడ ఆరోగ్యశ్రీ లేకపోవడంతో ఐటీడీఏ అధికారులు తల్లిదండ్రుల అనుమతితో నారాయణ ఆస్పత్రికి తరలించి చికిత్సను ప్రారంభించారు. దీనిపై ఐటీడీఏ పీఓను సంప్రదించగా ప్రస్తుతం ఆ విద్యార్థిని ఆరోగ్యం బాగుందని తెలిపారు. జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారిణి సుజాత మాట్లాడుతూ పూర్తిస్థాయిలో విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మా మనుమరాలు బాగుంది పొదలకూరు మండలం బచ్చలపల్లికి చెందిన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గాయపడిన విద్యార్థిని తన మనుమరాలు అని, ఘటనపై ప్రిన్సిపల్ నుంచి పీఓ వరకు బాగా స్పందించారన్నారు. ఆస్పత్రి ఖర్చుల కోసం పీఓ శ్రీనివాసులు రూ.10 వేలు ఇచ్చారన్నారు. తాము పెట్టిన డబ్బును సైతం ప్రభుత్వం ద్వారా తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రస్తుతం తన మనుమరాలి ఆరోగ్యం బాగుందన్నారు. నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి నెల్లూరు సిటీ: జిల్లాలో నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ అజిత వేజెండ్ల తెలిపారు. నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో శనివారం పోలీస్ అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పీజీఆర్ఎస్కు వచ్చే పిటిషన్లను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. డయల్ 112 కాల్స్కు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. డ్రోన్ నిఘా పెంచాలని, సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. సమావేశంలో ఏఎస్పీ సౌజన్య, ఎస్బీ, కావలి, ఆత్మకూరు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
ఆర్చరీ జిల్లా జట్ల ఎంపిక
నెల్లూరు(స్టోన్హౌస్పేట): రాష్ట్ర ఆర్చరీ పోటీలకు హాజరయ్యే జిల్లా జట్ల ఎంపికలను శనివారం నిర్వహించారు. నగరంలోని పొట్టేపాళెం మార్గంలో నవబాల దుర్గాదేవి ఆలయం వద్ద లిటిల్ ఏంజెల్స్ ఆర్చరీ అకాడమిలో జిల్లా ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలను క్రీడాభివృద్ధి అధికారి పాండురంగారావు ప్రారంభించారు. ఎంపికై న క్రీడాకారుల వివరాలను అసోసియేషన్ అధ్యక్షుడు పల్లంరెడ్డి శ్రీహర్ష, కార్యదర్శి పావురాల వేణు ప్రకటించారు. మినీ అండర్–15 ఇండియన్ రౌండ్లో బాలురలో జి.మహేంద్ర, మోక్షితసాయి, డాత్విక్రెడ్డి, జి.హరిహర, జి.మోక్షిత్రెడ్డిలు, బాలికల విభాగంలో టి.ఆలయ, ఎం.కౌషికి లాస్య, ఎ.ప్రీతి, షఫియా సుల్తానా, యశస్విలు ఎంపికయ్యారు. అలాగే అండర్–15 రికర్వ్ రౌండ్లో బాలుర విభాగంలో సీహెచ్ అజయ్దేవ్, పి.కృష్ణేశ్వర కుమార్సింగ్, కె.చరిత్, బి.జిగ్నేష్, బాలికల విభాగంలో దిత్యా చండిక, డి.నిషితలు ఉన్నారు. మినీ అండర్–15 కాంపౌండ్ విభాగంలో ఎ.ఆస్రీత్, కె.జననీరెడ్డి ఎంపికయ్యారు. వీరు మార్చి 11 నుంచి 13 వరకు నూజివీడులో జరిగే రాష్ట్ర ఆర్చరీ చాంపియన్షిప్ పోటీలకు జిల్లా తరఫున పాల్గొంటారు. లిటిల్ ఏంజెల్స్ స్కూల్ కరెస్పాండెంట్ చాట్ల రాజేష్, కోచ్లు భరద్వాజ్రెడ్డి, పి.శంకర్, సాయికిరణ్, ఎం.హారతి పాల్గొన్నారు. -
మాటల్లో సాధికారత.. మారని బతుకుబాట
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన వేదికలపైనే మహిళా సాధికారత కనిపిస్తోంది. వాస్తవంలో జీవన పోరాటం తప్పడం లేదు. సమాజంలో సగం.. అని సగర్వంగా చెప్పుకొనే అతివల జీవితాల్లో నిజమైన ప్రాధాన్యం అల్లంత దూరంలోనే ఉండిపోతోంది. వేదికలపై మహిళా సాధికారతపై గొప్ప మాటలు వినిపిస్తున్నా, నేలపై నిత్య జీవితం కూలీ పనులు, చిరు వ్యాపారాల్లోనే కనిపిస్తోంది. తెల్లవారుజాము నుంచే ఇంటి పనులతో ప్రారంభమయ్యే వీరి జీవన పోరాటం అర్ధరాత్రి వరకు అవిశ్రాంతంగా సాగుతోంది. గతంలో మహిళల ఆర్థిక బలానికి తోడుగా నిలిచిన పలు సంక్షేమ పథకాలు కొంత ఊరటనిచ్చాయి. అయితే ప్రభుత్వం మారాక ఈ పథకాల గమ్యం మారిపోవడంతో అనేక కుటుంబాల్లో మళ్లీ పాత కష్టాలే కనిపిస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా మహిళల బతుకుబండి గమ్యంలో మార్పు కానరావడంలేదు. మహిళా సంక్షేమానికి బడ్జెట్లలో పెద్ద అంకెలు కనిపించినా, బతుకు బాటలో మాత్రం ఇంకా చిన్న ఆశలే ఆధారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పూలదండలు, శుభాకాంక్షల కంటే మహిళల కష్టాలు, వేదనలు, వారి జీవన పోరాటమే ఈ ఫొటోలకు నిదర్శనంగా కనిపిస్తోంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
రైల్లో గంజాయి అక్రమ రవాణా
● తొమ్మిది కిలోల పట్టివేత నెల్లూరు సిటీ: ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ను ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్, ఈగల్ పోలీసులు శనివారం నిర్వహించారు. ఈ క్రమంలో రైల్లో అక్రమంగా తరలిస్తున్న రెండు బ్యాగుల్లోని తొమ్మిది కిలోల గంజాయిని పట్టుకున్నారు. నెల్లూరు రైల్వేస్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలను రైల్వే డీఎస్పీ మురళీధర్ వెల్లడించారు. నెల్లూరు, ఒంగోలు సర్కిల్ పరిధిలోని రైల్వేస్టేషన్లు, రైళ్లలో తనిఖీలను చేపట్టామని తెలిపారు. ఈ తరుణంలో నెల్లూరు – గూడూరు మార్గంలోని రామేశ్వరం వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ జనరల్ కోచ్లో తనిఖీలను జరిపామని చెప్పారు. అనుమానాస్పదంగా ఉన్న రెండు బ్యాగ్లను పరిశీలించగా, అందులో తొమ్మిది కిలోల గంజాయి లభ్యమైందన్నారు. తనిఖీల నేపథ్యంలో సదరు బ్యాగ్లను వ్యక్తి వదిలి పరారయ్యారని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిరంతరంగా తనిఖీలు రైల్వేస్టేషన్లు, రైళ్లలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా ఉంచుతామని, తనిఖీలను నిరంతరం జరుపుతామని మురళీధర్ తెలిపారు. 1972 నంబర్కు సమాచారమివ్వాలని, వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. తొలుత ఈగల్ టీమ్కు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ పోస్టర్లను ఆవిష్కరించారు. సీఐ సుధాకర్, ఎస్సైలు హరిచందన, చెన్నకేశవ పాల్గొన్నారు. -
జైల్లో స్నేహం.. అంతులేని నేర చరిత్ర
నెల్లూరు సిటీ: ఒంటరి మహిళ ఇంట్లోకి ప్రవేశించి ఆమెను కుర్చీకి కట్టేసి, ఇంట్లోని నగదు, బంగారు ఆభరణాలను అపహరించిన కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నగరంలోని చిన్నబజారు పోలీస్స్టేషన్లో నగర ఏఎస్పీ దీక్ష శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. నగరంలోని ముత్తుకూరు బస్టాండ్ వద్ద టిఫెన్ అంగడి నిర్వహిస్తున్న ఎ.నాగరత్నమ్మ ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈ క్రమంలో ఈనెల 28వ తేదీ తెల్లవారుజామున పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం మట్లపాళెం గ్రామానికి చెందిన టి.రామకృష్ణ, బిట్రగుంటకు చెందిన ఎం.మాల్యాద్రిలు చోరీ చేసేందుకు పన్నాగం పన్నారు. ఈ క్రమంలో నాగరత్నమ్మ ఇంట్లో నగదు, బంగారం ఉంటుందని భావించారు. ఆమె ఒంటరిగా ఉంటుండడంతో తమ చోరీ సులువుగా ఉంటుందని, గత నెల 28వ తేదీ తెల్లవారుజామున ఇంటి తలుపులు పగులకొట్టి లోనికి ప్రవేశించారు. చంపేస్తానని బెదిరించి, నాగరత్నమ్మను కుర్చీకి తాళ్లతో కట్టేశారు. బెడ్రూమ్లోని ట్రంకు పెట్టిలో రూ.1.50 లక్షలు, 160 గ్రాముల బంగారు ఆభరణాలను దొంగిలించి పరారయ్యారు. స్థానికులు ఉదయం వచ్చి చూడగా ఆమెను కట్టేయడాన్ని గుర్తించి విడిపించారు. బాధితురాలు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు తన సిబ్బందితో నిందితులను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశారు. వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ వద్ద ఇద్దరు నిందితులను శనివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.63 వేలు నగదు, 153 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. త్వరితగతిన నిందితులను పట్టుకున్న సిబ్బందిని దీక్ష అభినందించారు. సమావేశంలో ఎస్సై కిషోర్బాబు తదితరులు పాల్గొన్నారు. పరారీలో ప్లాన్ చేసిన వ్యక్తి ఈ చోరీకి నగరంలోని మాగుంట లేఅవుట్కు చెందిన చంద్రమోహన్రెడ్డి ప్లాన్ చేశారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. బాధితురాలి ఇంటికి సమీపంలో ఫైనాన్స్ కోసం వస్తూ ఆమె వద్ద భారీగా డబ్బులు ఉంటాయని చంద్రమోహన్రెడ్డి భావించారు. దీంతో ఆయనకు జైలులో రామకృష్ణ, మాల్యాద్రిలతో పరిచయం ఉండడంతో వారితో చోరీకి స్కెచ్ వేశారు. సమయం చూసి చోరీ చేయించారు. అయితే ప్రస్తుతం అతను పరారీలో ఉన్నారు. పోలీసులు అతన్ని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. ఆ ఇద్దరూ అంతర్ జిల్లాల నేరగాళ్లు వారిపై పలు జిల్లాల్లో దొంగతనం కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడు రామకృష మీద డీసీ(డోసియర్ క్రిమినల్) షీట్ ఉంది. ఆయనపై తూర్పు గోదావరి జిల్లాలో 11 కేసులు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 14 కేసులు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకటి, ఏలూరు జిల్లాలో ఒకటి మొత్తంగా 27 కేసులు ఉన్నాయి. అదే క్రమంలో బిట్రగుంటకు చెందిన మాల్యాద్రి మీద సైతం డీసీ షీట్ ఉంది. నిందితుడిపై వైఎస్సార్ కడప జిల్లాలో 1, తూర్పుగోదావరి 3, పశ్చిమగోదావరి 1, ప్రకాశం జిల్లాలో 7, నెల్లూరు జిల్లాలో 2 కేసులు ఉన్నాయి. మొత్తంగా 14 కేసులు ఉన్నాయి. ఒంటరి మహిళపై దాడి చేసి బంగారం, నగదు అపహరణ ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని పట్టుకున్న పోలీసులు 153 గ్రాముల బంగారం, రూ.63 వేల నగదు స్వాధీనం వీరిపై ఏడు జిల్లాల్లో పదుల సంఖ్యలో కేసులు ఆ ఇద్దరూ దొంగతనమే పనిగా పెట్టుకున్నారు. చోరీలు చేయడం.. పోలీసులకు పట్టుపడడం వారికి పరిపాటి. జైల్లో స్నేహితులైన వారు.. కలిసి ప్లాన్ చేస్తే ఎంత పెద్ద చోరీ అయినా చేయవచ్చని నిర్ణయించుకున్నారు. వారిపై ఏడు జిల్లాల్లో పదుల సంఖ్యలో చోరీ కేసులు ఉన్నాయి. -
బైక్పై వెళ్తుండగా ఇనుప కమ్ములు తగిలి..
● హోంగార్డుకు గాయాలు ఆత్మకూరు: ఓపెన్ ఇంటర్ పరీక్షల విధులకు హాజరై తిరిగి బైక్పై స్వగ్రామం వెళ్తుండగా బస్టాండ్ సమీపంలో ఎదురుగా ఓ వ్యక్తి బైక్పై తరలిస్తున్న ఇనుప కమ్ములు హోంగార్డుకు తగిలి తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం జరిగింది. బాధితుని వివరాల మేరకు.. అనంతసాగరం పోలీస్స్టేషన్లో విధులు నిర్వహించే పి.ప్రసాద్రెడ్డి నాలుగు రోజులుగా ఆత్మకూరులో ఓపెన్ ఇంటర్ పరీక్షల కేంద్రాల వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పరీక్ష పూర్తయిన తర్వాత పేపర్లను సబ్మిట్ చేసి బైక్లో వెళ్తుండగా బస్టాండ్ వద్ద ఎదురుగా మరో మోటారు సైకిల్పై వస్తున్న వ్యక్తి పొడవాటి ఇనుప కమ్ములను అడ్డంగా పెట్టుకొని వస్తుండడంతో అవి తగిలి హోంగార్డు తొడపై లోతైన గాయమైంది. సమీపంలో ఉన్న వారు వెంటనే ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై సాయిప్రసాద్, సిబ్బంది ఆస్పత్రి వద్ద హోంగార్డును పరామర్శించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
నేత్రపర్వంగా తెప్పోత్సవం
బిట్రగుంట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండబిట్రగుంట బిలకూట క్షేత్ర వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఉభయదేవేరులతో కలిసి పుష్కరిణిలో శనివారం రాత్రి జలవిహారం చేశారు. దేవదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం, అత్యుత్సాహం కారణంగా పుష్కరిణిలో తెప్ప ఈ నెల నాలుగున ఒరిగిపోయి ఉత్సవం ఆగిపోయిన విషయం విదితమే. ఈ తరుణంలో భక్తులతో పాటు కొండబిట్రగుంట, పాతబిట్రగుంట గ్రామస్తుల నుంచి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమవడంతో ఆగమ పండితుల సూచన మేరకు అన్ని జాగ్రత్తలతో తెప్పోత్సవాన్ని మరోసారి నిర్వహించారు. భక్తుల గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాల నడుమ ఉభయదేవేరులు, స్వామివారిని కొండ దిగువన ఉన్న పుష్కరిణి వద్దకు అర్చక బృందం తీసుకొచ్చారు. వివిధ రకాల పుష్పాలు, పట్టు పీతాంబరాలతో సిద్ధం చేసిన తెప్పపై స్వామివారిని కొలువుదీర్చి జలవిహారం చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకున్నారు. వెబ్సైట్లో సీనియార్టీ జాబితా నెల్లూరు (టౌన్): జోన్ – 3 పరిధిలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో స్కూల్ అసిస్టెంట్ల నుంచి గ్రేడ్ – 2 ప్రధానోపాధ్యాయ పోస్టులకు సంబంధించిన తాత్కాలిక సీనియార్టీ జాబితాను deognt.blogspot.co mలో అందుబాటులో ఉంచామని డీఈఓ బాలాజీరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏమైనా అభ్యంతరాలుంటే తగిన ఆధారాలను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఈ నెల 13లోపు అందజేయాలని కోరారు. వేగవంతంగా గృహ నిర్మాణాలు నెల్లూరు(అర్బన్): గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పక్కా గృహాలను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో గృహ నిర్మాణ శాఖ అధికారులతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్తగా మంజూరైన గృహ నిర్మాణాలతో పాటు పెండింగ్లో ఉన్న వాటిని నిర్దిష్ట కాలపరిమితిలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆప్షన్ – 3 కింద గుర్తించిన నాణ్యత లేని నిర్మాణాలను వెంటనే కాంట్రాక్టర్లతో సరిచేయించాలని సూచించారు. పూర్తి చేసిన ఇళ్లకు బిల్లులను వెంటనే మంజూరు చేస్తున్నామని తెలిపారు. గృహ నిర్మాణ శాఖ ఇన్చార్జి పీడీ మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ కార్యదర్శులతో టెలి కాన్ఫరెన్స్ నెల్లూరు(పొగతోట): గ్రామ పంచాయతీల్లో పొదుపు మహిళల సేవలను వినియోగించుకొని వారి ద్వారా ఇంటి పన్నులను వసూలు చేయాలని డీపీఓ వసుమతి ఆదేశించారు. నగరంలోని తన కార్యాలయం నుంచి పంచాయతీ కార్యదర్శులతో శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. వసూళ్లలో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఆదివారం సెలవైనా, కార్య దర్శులు విధులకు హాజరుకావాలని ఆదేశించారు. నూరు శాతం లక్ష్యాలను పూర్తి చేయా లని పేర్కొన్నారు. -
సమ్మె కాలపు జీతాలు చెల్లించాలి
నెల్లూరు(బారకాసు): మున్సిపల్ కార్మికులకు సమ్మె కాలపు జీతాలు చెల్లించాలని, 12వ పీఆర్పీ కమిషన్ ఏర్పాటు చేసి జీతాలు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేస్తూ నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు శనివారం రెండో రోజు జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు కె.పెంచల నరసయ్య మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలపై రెండేళ్ల నుంచి కూటమి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా పరిష్కరించలేదన్నారు. కరోనా సమయంలో, ప్రకృతి విపత్తుల సందర్భంగా వారి ప్రాణాలకు తెగించి పనులు చేస్తున్న మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని, ఇప్పటికై నా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిప్యూటీ కమిషనర్ చెన్నుడుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నెల్లూరు రూరల్ అధ్యక్షుడు ఎం.సుధాకర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మనోజ్, కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, లోకేష్, శ్రీనివాసులు, రాము, జైకుమార్, రమేష్, కామేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, షఫీ పాల్గొన్నారు. -
శ్రామికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయండి
● డ్వామా పీడీ గంగాభవాని నెల్లూరు(పొగతోట): ఎండలు పేరుగుతున్నందున ఉపాధి హామీ పనులు జరిగే ప్రదేశాల్లో శ్రామికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని డ్వామా పీడీ గంగాభవాని మండలాధికారులను ఆదేశించారు. నగరంలోని డ్వామా కార్యాలయం నుంచి వివిధ మండలాల అధికారులు, ఉపాధి సిబ్బందితో శనివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో పీడీ మాట్లాడారు. పని ప్రదేశాల్లో శ్రామికుల కోసం చలువ పందిళ్లు వేయాలన్నారు. ఉపాధి హామీ పనులకు హాజరయ్యే శ్రామికుల సంఖ్యను పెంచాలన్నారు. జాబ్కార్డులు కలిగిన శ్రామికులకు ఈ–కేవైసీ చేయాలని, 30 శాతం ఈ–కేవైసీ పెండింగ్ ఉందని త్వరగా వంద శాతం పూర్తి చేయాలని సూచించారు. నూతన పద్ధతిలో ఉపాధి హామీ పనులు పూర్తి చేయాలన్నారు. ఉదయం 7.30 గంటల్లోపు ఎన్ఎంఎంఎస్లో పనులకు హాజరైన శ్రామికుల ఫొటోలు అప్లోడ్ చేయాలన్నారు. ఫొటోలను అప్లోడ్ చేసే సమయంలో తేడాలు జరిగితే పేమెంట్లు మంజూరు కావన్నారు. -
పెద్దాస్పత్రిలో హైడ్రామా
● అఘాయిత్యానికి గురైన బాలికను హడావుడిగా తరలించిన వైనం ● తీరుపై మండిపడిన కాకాణి పూజిత నెల్లూరు రూరల్: తోటపల్లిగూడూరు మండలంలోని వరిగొండలో అఘాయిత్యానికి గురైన బాలిక ఉదంతంలో నెల్లూరులోని ప్రభుత్వాస్పత్రిలో హైడ్రామా శుక్రవారం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత వచ్చారు. ఈ క్రమంలో బాలికను హాస్పిటల్ సిబ్బంది, పోలీసులు హడావుడిగా తరలించారు. ఈ విషయాన్ని పూజిత ఆరాతీయగా, గైనకాలజీ విభాగాధిపతి గీతాకృష్ణని కలవాలని సూచించారు. దీంతో ఆమెను సంప్రదించగా, పాప విషయమే తమకు తెలియదంటూ బుకాయించారు. దీనిపై సమాచారమివ్వాలని పట్టుబట్టడంతో ఇక్కడ్నుంచి తరలించారంటూ ఎట్టకేలకు సమాధానమిచ్చారు. జిల్లాలో పోలీసులతో పాటు హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం దారుణంగా మారిందని మండిపడ్డారు. మహిళలకు రక్షణ కరువు కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని పూజిత ఆరోపించారు. వరిగొండలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడటం దారుణమని, గంజాయి మత్తులో రాష్ట్రంలో వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నా, సర్కార్ ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు తామొస్తే, ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందనే భయంతో పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది హడావుడిగా తరలించి నాటకమాడారని ఆరోపించారు. పారదర్శకంగా విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కోవూరులోని గుమ్మళ్లదిబ్బలో ఇటీవల జరిగిన ఘటనను మరువకముందే తాజాగా ఇలాంటి ఉదంతం చోటుచేసుకోవడంపై విచారం వ్యక్తం చేశారు. శాంతిభద్రతలను ఖాకీలు గాలికొదిలి.. ప్రశ్నించే వారికి నోటీసులిస్తూ కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. పట్టణాలు, నగరాలకే పరిమితమైన డ్రగ్ కల్చర్, ప్రస్తుతం గ్రామాలకూ పాకిందని ధ్వజమెత్తారు. పార్టీ జోనల్ మహిళా ప్రెసిడెంట్ మొయిళ్ల గౌరి, జిల్లా మహిళాధ్యక్షురాలు సునంద, నెల్లూరు రూరల్ మహిళాధ్యక్షురాలు రమాదేవి, ముత్తుకూరు ఎంపీపీ సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
నూరు శాతం పన్నుల వసూళ్లే లక్ష్యం
నెల్లూరు(పొగతోట): గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పన్నులను నూరు శాతం మేర ఈ నెల 15 నాటికి వసూలు చేయాలని డీపీఓ వసుమతి ఆదేశించారు. నగరంలోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం నుంచి వివిధ మండలాల అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో శుక్రవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా రూ.47 కోట్లకు గానూ ఇప్పటి వరకు రూ.27 కోట్లనే వసూలు చేశారని చెప్పారు. పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని, వీటిని ఈ నెల తొమ్మిదిన ప్రచురించాల్సి ఉందన్నారు. బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించనున్నామని వివరించారు. -
లాహిరి.. లాహిరి.. లాహిరిలో
నేత్రపర్వంగా తెప్పోత్సవం వీక్షిస్తున్న భక్తులు రంగనాయకులపేటలోని పవిత్ర పినాకినీ తీరం శ్రీదేవీ, భూదేవీ సమేత తల్పగిరి రంగనాథస్వామి తెప్పోత్సవంతో శుక్రవారం రాత్రి కళకళలాడింది. భక్తజన ఆనందోత్సాహాల నడుమ కనులపండువగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని పెన్నమ్మ ఒడిలో సర్వాలంకారశోభితంగా కొలువై విహరించారు. తొలుత పూజలను అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. తెప్పలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై స్వామివారిని కొలువుదీర్చారు. మేయర్ దేవరకొండ సుజాత, ఏఎస్పీ దీక్ష, వేమిరెడ్డి విజయభాస్కర్రెడ్డి, ఈఓ ఆళ్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెప్పోత్సవం అనంతరం అశ్వవాహనంపై స్వామివారు విహరించారు. – నెల్లూరు(బృందావనం) -
రైతులకు విరివిగా రుణాలివ్వండి
నెల్లూరు(అర్బన్): వ్యవసాయ అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యమిచ్చి రైతులకు రుణాలను విరివిగా మంజూరు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా స్థాయి బ్యాంకర్లతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు, డ్రోన్లు తదితరాల కొనుగోళ్లకు రుణాలను అధికంగా ఇవ్వాలని కోరారు. పశు, మత్స్య, కోళ్ల పరిశ్రమలను ప్రోత్సహించాలని చెప్పారు. డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి లాంటి ఉద్యాన పంటలు, పీఎం సూర్యఘర్కు లోన్లు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించి యాక్టివ్లో లేని అకౌంట్లను వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. అనంతరం నాబార్డు ద్వారా అమలవుతున్న పథకాలకు సంబంధించిన పుస్తకాలను ఆవిష్కరించారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ మణిశేఖర్, డీఆర్వో విజయకుమార్, నాబార్డు డీడీఎం బాబు, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, డీఆర్డీఏ, మెప్మా, డ్వామా పీడీలు నాగరాజకుమారి, లీలారాణి, గంగాభవానీ, పశు, మత్స్య, ఉద్యాన శాఖల అధికారులు రమేష్నాయక్, చాన్బాషా, సుబ్బారెడ్డి పాల్గొన్నారు. యూనిఫైడ్ సర్వేను పూర్తి చేయండి నెల్లూరు(పొగతోట): యూనిఫైడ్ సర్వేను నూరు శాతం పూర్తి చేయాలని జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి ఆదేశించారు. నగరంలోని జెడ్పీ కార్యాలయం నుంచి వివిధ మండలాల అధికారులతో శుక్రవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. గ్రామాల వారీగా ఇచ్చిన జాబితాల్లో ఒకట్రెండు కుటుంబాలు వలసెళ్లాయంటే నమ్మశక్యంగా ఉంటుందని, అయితే దీన్ని సక్రమంగా చేయకుండా ఇలా చెప్పడం సరికాదన్నారు. నిర్దేశిత సమయంలోపు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ‘పది’ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు ఆత్మకూరు: పదో తరగతి పరీక్షలను పక్కాగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని డీఈఓ బాలాజీరావు పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో విధి విధానాలపై ఆత్మకూరు డివిజన్ పరిధిలోని తొమ్మిది మండలాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని 174 పరీక్ష కేంద్రాలకు 174 మంది చొప్పున చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమించామని వివరించారు. సెట్ – 1, 2 ప్రశ్నపత్రాలను ఈ నెల పది, 11 నాటికి భద్రపర్చి పరీక్షకు అర్ధగంట ముందు అందజేయనున్నామని వెల్లడించారు. విద్యార్థులు బాగా చదివి పరీక్షలను చక్కగా రాయాలని కాంక్షించారు. డిప్యూటీ డీఈఓ జానకిరామ్, శిక్షకులు ఫణీష్, రామ్కుమార్, ఎంఈఓలు అనంతలక్ష్మి, చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. వీఆర్కు ఇద్దరు సీఐలు నెల్లూరు(క్రైమ్): బుచ్చిరెడ్డిపాళెం ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి, బుచ్చిరెడ్డిపాళెం రూరల్ సీఐ సురేంద్రబాబును రేంజ్ వీఆర్కు బదిలీ చేస్తూ ఉత్తర్వులను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి శుక్రవారం జారీ చేశారు. తుళ్లూరు – 2 సీఐగా పని చేస్తున్న శ్రీనివాసరావును బుచ్చిరెడ్డిపాళెం ఇన్స్పెక్టర్గా.. ఒంగోలు ఎస్సీ, ఎస్టీ సెల్ ఇన్స్పెక్టర్ దుర్గాప్రసాద్ను రూరల్ సీఐగా నియమించా రు. వీఆర్కు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
సివిల్ సప్లయ్స్శాఖ పరుగులు
నెల్లూరు సిటీ: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారుల అలసత్వంపై ఓ రైతు ఆవేదనతో సివిల్ సప్లయ్స్ విభాగం పరుగులు తీసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటూ అర్జీని ఓ అన్నదాత అందజేయగా, దాన్ని పరిష్కరించకుండానే సంతకం పెట్టాలని ఒత్తిడి చేశారు. అయితే దానికి అంగీకరించకపోవడంతో సాల్వ్ అయినట్లు మెసేజ్ పంపారు. ఈ ఉదంతంపై ‘కలెక్టర్ సార్.. ఇదేం పరిష్కారం’ అనే శీర్షికన సాక్షిలో కథనం శుక్రవారం ప్రచురితమైంది. దీంతో స్పందించిన అధికారులు.. ఫిర్యాదుదారుడి వద్దకే వెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. జరిగిందిదీ.. నెల్లూరు రూరల్ మండలంలోని ములుమూడిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏటా ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ సంవత్సరం అలా చేయకపోవడంతో గ్రామానికి చెందిన సండి శ్రీనివాసులు.. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీని అందజేశారు. అయితే తన సమస్యను పరిష్కరించినట్లు మెసేజ్ రావడంతో కంగుతిన్నారు. ఈ తరుణంలో సాక్షిలో ప్రచురితమైన కథనంతో గ్రామానికి అధికారులు చేరుకున్నారు. కొనుగోలు కేంద్రాన్ని రెండ్రోజుల్లో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సివిల్ సప్లయ్స్ డీఎం తిరుపాల్, సీఈఓ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
మరికొన్ని ఘటనలు
చిన్నారులపై కామాంధులు కాటేస్తున్నారు. మృగాళ్ల చేతిలో అభం శుభం తెలియని చిన్నారులే కాకుండా మహిళలు సైతం బలైపోతున్న ఘటనలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. చట్టాలు కఠినంగా ఉన్నా.. మృగాళ్ల దాష్టీకాలకు ఏ మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ప్రేమ పేరుతో ఒకరు.. గంజాయి మత్తులో మరొకరు.. కామంతో మరొకరు.. ఇలా రోజురోజుకూ ఇలాంటి దారుణాలు పెరుగుతుండటం ప్రజలను కలవరపెడుతున్నాయి. ఆడ పిల్లలకు ఇంటా, బయట భద్రత కొరవడింది. ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. మరో వైపు దారుణ ఉదంతాలు వెలుగు చూసినా.. వీలైతే కప్పిపుచ్చడం, కాకుంటే.. తారుమారు చేసేందుకూ వెనుకాడటం లేదు. సాక్షి టాస్క్ఫోర్స్: ‘మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే అదే ఆఖరు రోజు అవుతుందంటూ’ బహిరంగ వేదికల్లో సాక్షాత్తు కూటమి ప్రభుత్వ పెద్దలే రోమాలు నిక్కబొడుచుకునే రీతిలో ఉపన్యాసాలిస్తున్నారు. నేరం చేయాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొస్తామన్న మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిచిన ఇరవై నెలల్లోనే జిల్లాలో బాలికలపై అనేక దారుణాలు జరిగాయి. ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన సుమారు 40 పోక్సో కేసులే ఇందుకు అద్దం పడుతున్నాయి. జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి, మద్యం విక్రయాలే ఇలాంటి దారుణాలకు ప్రధాన కారణాలవుతున్నాయని మహిళా సంఘాలు, అభ్యుదయ వాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు ఒంటరిగా కనిపిస్తే కామాంధులు ఏ వైపు నుంచి కాటేస్తారోనని కుటుంబ సభ్యులు భయపడుతున్నారు. ఇలాంటి దారుణ పరిస్థితులు గతంలో ఎన్నడూ చూడలేదంటూ వారు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. చిన్నారులు, మహిళలకు రక్షణ కల్పించాలని, కామాంధులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వణికిస్తున్న వరుస ఘటనలు జిల్లాలో బాలికలపై వరుసగా జరుగుతున్న ఘటనలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. చిన్నారులకు ఇంటా, బయటా భద్రత కొరవడింది. మానవ మృగాలుగా మారిన కొందరు అభం, శుభం తెలియని చిన్నారులపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. వావివరుసల తేడా లేకుండా కామాంధుల వికృత చేష్టలకు చిన్నారుల జీవితాలు చితికిపోతున్నాయి. మహిళలే కాదు చిన్నారులు ఒంటరిగా బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. స్నేహం, ప్రేమ ముసుగులో మృగాళ్లు లైంగిక దాడులకు పాల్పడుతూ వారి జీవితాలను చిదిమేస్తున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన పేగుబంధాలు సైతం కాటేస్తున్నాయి. గత నెల రోజులుగా జిల్లాలో జరిగిన ఘటనలను పరిశీలిస్తే.. ● కోవూరులో బాలిక ఉదంతం తర్వాత కావలి మండలంలోని ఓ గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ లైంగిక దాడి చేశాడు. బాధిత బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ● కోట మండలం అటవీ ప్రాంతంలో 12 ఏళ్ల బాలికపై ఆటోడ్రైవర్ లైంగికదాడికి యత్నించాడు. ● గూడూరు పరిధిలో ఐదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. ● ఉదయగిరిలో బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించి గర్భిణిని చేసిన బాలుడిపై పోక్సో కేసును ఉదయగిరి పోలీసులు నమోదు చేశారు. ● కావలి పట్టణంలో ఓ పాఠశాలలో చదువుతున్న బాలికలకు తినుబండారాల ఆశ చూపి ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై పోక్సో కేసును కావలి రెండో పట్టణ పోలీసులు నమోదు చేశారు. ● నెల్లూరు నగరంలో ఆరేళ్ల బాలికపై తండ్రి పైశాచికంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని గమనించిన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ● తాజాగా తోటపల్లిగూడూరు మండలం వరిగొండలో ఓ బాలికపై లైంగిక దాడి జరిగిందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ● వరికుంటపాడు మండలంలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికను అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన వెంట తీసుకెళ్లాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను సంరక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇలా చెప్పుకొంటూ పోతే జిల్లాలో ఇలాంటి ఘటనలు చాంతాడంత జాబితాలే ఉన్నాయి. బాలికపై లైంగిక దాడి..? వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు అయితే ఘటనను తారుమారు చేసేందుకు పోలీసుల యత్నం..? నిందితులు చోరీకి వచ్చారంటూ మీడియాకు వెల్లడి తోటపల్లిగూడూరు(పొదలకూరు): తోటపల్లిగూడూరు మండలం వరిగొండలో బాలిక (8)పై లైంగిక దాడి జరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనలోని బాధితురాలిని పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. అయితే సోషల్ మీడియాలో బాలికపై లైంగిక దాడి జరిగినట్లు వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కాగా ఈ ఘటనను తారుమారు చేసేందుకు పోలీసులు ఆపసోపాలు పడుతున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. బాలికపై లైంగిక దాడి జరగలేదని, నిందితులు దొంగతనానికి వచ్చారని మీడియా ముఖంగా వెల్లడించారు. అయితే నిందితులు చోరీకి వస్తే.. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జీజీహెచ్కు ఎందుకు తరలించారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. అసలేం జరిగిందంటే.. స్థానికుల సమాచారం మేరకు.. వరిగొండ గ్రామంలో కాలువ గట్టుపై బాలిక కుటుంబం నివసిస్తోంది. గురువారం ఆమె తల్లిదండ్రులు పనికెళ్లడంతో తమ్ముడితో కలిసి ఇంట్లో ఉండగా గుర్తుతెలియని వ్యక్తి (40) మరో మహిళతో కలిసి బైక్పై వచ్చారు. అయితే బాలిక తమ్ముడికి మహిళ కొని పెడతానని మాయమాటలు చెప్పి దూరంగా తీసుకెళ్లడంతో ఆ వ్యక్తి బాలికపై లైంగిక దాడికి యత్నించాడు. బాలిక కేకలేయడంతో స్థానికులు అక్కడికి రావడంతో మహిళతో కలిసి ఆగంతకుడు పారిపోయారు. దీంతో బాలికను వైద్య పరీక్షల నిమిత్తం నెల్లూరు జీజీహెచ్కు పోలీసులు తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి కృష్ణపట్నం పోర్టు ఇన్చార్జి సీఐ సుబ్బారావు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చిన వారు బాలిక ఇంట్లో టీవీని దొంగలించేందుకు యత్నించారని వెల్లడించారు. బాలికతో పాటు ఆరేళ్ల బాలుడు ఉన్నాడన్నారు. వీరిని చూసి బాలుడు కేకలేయడంతో నిందితులు పరారయ్యారని వివరించారు. అయితే నిందితులు చోరీ యత్నానికి పాల్పడితే బాలికకు వైద్య పరీక్షలు ఎందుకు చేయిస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. యువకుడిపై పోక్సో కేసు నమోదు వరికుంటపాడు: మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడిపై పోక్సో కేసును నమోదు చేసి కోర్టులో హాజరుపర్చామని ఎస్సై రఘునాథ్ శుక్రవారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. మీరయ్య అనే యువకుడు ఓ బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కావలి డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో సిబ్బంది గాలించి జడదేవి గ్రామ సమీపంలో ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు. 29.01.2026 నెల్లూరు నగరంలో ఆరేళ్ల చిన్నారిపై కన్నతండ్రి లైంగిక దాడి చేశాడు. 29.01.2025 ఏడో తరగతి చదువుతున్న బాలికను ఆటోడ్రైవర్ సతీష్ మాయమాటలు చెప్పి కొత్తకోడూరు బీచ్కు తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. అతనితో పాటు సహకరించిన స్నేహితులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. 16.03.2025 స్నేహితుడి కుమార్తెకు మాయమాటలు చెప్పి కుమార్ లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జూన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. 17.07.2025 ఆత్మకూరు మండలంలో ఓ బాలికపై ప్రణవ్ లైంగిక దాడి చేశాడు. 18.07.2025 ఆత్మకూరు మండలానికి చెందిన ఓ బాలిక ఆత్మకూరు పట్టణంలో చదువుతోంది. గ్రామానికి చెందిన చందన్ ప్రేమించాలంటూ ఆమెను వేఽధించాడు. నిరాకరించడంతో ఆమైపె దాడిచేసి గాయపరిచాడు. 27.07.2024 కావలి పట్టణంలో చిన్నారికి మాయమాటలు చెప్పి మహబూబ్బాషా లైంగిక దాడి చేశాడు. మానవ మృగాళ్ల దాడిలో సమిధలుగా బాలికలు జిల్లాలో ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు ఇంటా.. బయటా కొరవడిన భద్రత ఈ దారుణాలను కప్పిపుచ్చుతున్న పోలీసులు తాజాగా వరిగొండలో బాలికపై లైంగిక దాడి..? వరికుంటపాడులో ప్రేమ పేరిట బాలికను తీసుకెళ్లిన యువకుడు విచ్చలవిడిగా గంజాయి, మద్యం విక్రయాలే కారణాలు -
మంచి వైద్యులుగా పేరు తెచ్చుకోవాలి
నెల్లూరు(అర్బన్): డాక్టర్లుగా మారుతున్న వైద్య విద్యార్థులు ప్రజలకు వైద్యసేవలందిస్తూ సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని మెడికల్ ఎడ్యుకేషన్ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ రఘునందన్ సూచించారు. నెల్లూరులోని ఏసీఎస్సార్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో డాక్టర్ విద్య పూర్తి చేసుకున్న ఏడో బ్యాచ్కు చెందిన 170 మంది వైద్య విద్యార్థులకు సంబంధించి పట్టాలిచ్చే కాన్వొకేషన్ డేను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న రఘునందన్ మాట్లాడుతూ స్మార్ట్ డాక్టర్గా కాకుండా గాయానికి మందువేసి నయం చేసే మంచి డాక్టర్గా పేరు తెచ్చుకోవాలన్నారు. మృత్యువు కోరలు చాచే వేళ కొన ఊపిరి ఊది ప్రాణ దాతలుగా నిలవాలంటూ సాట పాడి కర్తవ్యాన్ని గుర్తు చేశారు. ● మరో ముఖ్యఅతిథి కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ డాక్టర్లు కనిపించే దేవుళ్లన్నారు. దేవుడిని చూస్తారో లేదో గానీ ఒక రోగిని కాపాడి ప్రాణం నిలిపినప్పుడు మొదటి దేవుడిగా డాక్టర్ కనిపిస్తారన్నారు. ఈ వృత్తి ఎంతో పవిత్రమైందన్నారు. రోగి చెప్పేది వైద్యుడు శ్రద్ధగా వినాలని, తర్వాత పరిశీలించి నవ్వుతూ వైద్యం చేయాలన్నారు. డబ్బే పరమావధిగా కాకుండా వైద్యంలో రాణిస్తూ సమాజానికి ఉపయోగపడాలని తెలిపారు. ● మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి మాట్లాడుతూ వైద్యులుగా ప్రయాణం ఆరంభిస్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రొఫెసర్లు డాక్టర్ మస్తాన్బాషా, డాక్టర్ గోవిందు మాట్లాడుతూ నేటితో ఆటలు, చదువు బంద్ అయ్యాయన్నారు. ఇక నుంచి అసలైన జీవితం చూస్తారనన్నారు. రోగుల పట్ల కరుణ, దయ చూపుతూ సేవలందించాలని కోరారు. అనంతరం ప్రిన్సిపల్ కులమతాలు, లింగ, వర్ణ భేదాలు చూపకుండా సేవే దైవంగా భావించి వైద్యం చేయాలంటూ పట్టాలు తీసుకుంటున్న వారితో ప్రమాణం చేయించారు. ఇదే సందర్భంలో అత్యున్నత ప్రతిభ చూపిన ఏడుగురికి కలెక్టర్ గోల్డ్ మెడల్స్ అందజేసి అభినందించారు. వైద్య డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తర్వాత ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డీఎంఈ రఘునందన్ వైద్యులు కనిపించే దేవుళ్లు : కలెక్టర్ హిమాన్షు శుక్లా ఘనంగా మెడికల్ కళాశాల కాన్వొకేషన్ డే


