breaking news
SPSR Nellore District News
-
అరాచకాలు తప్ప అభివృద్ధి లేదు
● సూపర్ సిక్స్తోపాటు ప్రజాపథకాలకు మంగళం ● అవినీతి, అక్రమ కేసులతో వేధించడమేనా సుపరిపాలనా? ● కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి బిట్రగుంట: కూటమి ప్రభుత్వంలో అరాచకాలు, అక్రమ కేసులు తప్ప అభివృద్ధి జాడే కనిపించడం లేదని కావలి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కావలి నియోజకవర్గం ఇన్చార్జి రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి అన్నారు. బోగోలులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ కార్యక్రమంపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో మంగళవారం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ జువ్వలదిన్నె వద్ద సుమారు రూ.340 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మించిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిదే అని తెలిపారు. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తీరుపై వ్యంగా స్త్రాలతో మండిపడ్డారు. అభివృద్ధి అంటే మీడియాలో, సోషల్ మీడియాలో ఫొటోలకు ఫోజులివ్వడం కాదని తెలుసుకోవాలన్నారు. పదేపదే కావలిని కాపు కాస్తా, బోగోలును కాపు కాస్తా, మీ గ్రామాన్ని దత్తత తీసుకుంటా అంటూ ఊతపదాలు వల్లెవేయడం కాదని, ప్రజలకు ఇప్పటి వరకూ ఏం మంచి చేశారో చెప్పాలన్నారు. గ్రామాల్లో టీడీపీ నాయకులు చేస్తున్న ఆగడాలను గుర్తించాలని సూచించారు. ● వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మద్దిబోయిన వీర రఘు మాట్లాడుతూ ఏనుగులబావిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై వందలాది మంది చూస్తుండగానే కత్తులతో దాడి చేయడమే కాకుండా చివరకు బాధితులపై హత్యాయత్నం కేసులు పెట్టి నెలరోజులపాటు జైల్లో మగ్గేలా చేశారన్నారు. కడనూతలలో కూడా అమాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారని వివరించారు. మహిళా జర్నలిస్ట్ అని కూడా చూడకుండా బోగోలుకు చెందిన యువతిపై ఐదు అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకల సుజాత, జెడ్పీటీసీ మద్దిబోయిన కీర్తన, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు మద్దిబోయిన పద్మ, నాయకులు మేకల శ్రీనివాసులు, ఏకే సుందర్రాజు, కల్యాణ్ కుమార్, కర్తం సురేందర్రెడ్డి, తుమ్మల రమణయ్య నాయుడు, పర్రి అంకులయ్య, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. -
సరైన బిల్లులు లేకపోవడంతో..
● పురుగు మందుల అమ్మకాల నిలిపివేత చేజర్ల(ఆత్మకూరు): సరైన బిల్లుల్లేని రూ.4 లక్షల విలువైన పురుగు మందుల అమ్మకాలు నిలిపివేయాలని డైరెక్టర్ ఆఫ్ అగ్రిక ల్చర్ సీహెచ్ రవికుమార్ ఆదేశించారు. కమిషనరేట్ కార్యాలయం నుంచి రవికుమార్తోపాటు విజిలెన్స్ అధికారి రాఘవరావు చేజర్ల మండలంలోని ఆదూరుపల్లిలో పలు ఆగ్రో సర్వీస్ ఫర్టిలైజర్ షాపుల్లో మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పురుగు మందులకు సరైన సర్టిఫికెట్లు, బిల్లులు లేకపోవడంతో అమ్మకాలు నిలిపివేయాలని ఆదేశించారు. అనుమతి లేకుండా ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వెంట జిల్లా వ్యవసాయ అధికారులు ఏడీఏ నర్సోజీరావు, శివనాయక్, స్థానిక వ్యవసాయ అధికారిణి హిమబిందు, వ్యవసాయ సిబ్బంది ఉన్నారు. రూ.3.24 లక్షల విలువైన నిల్వలపై స్టే కోవూరు: మండలంలో ఎరువులు, పురుగు మందుల గోదాముల్లో మంగళవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇన్స్పెక్టర్ రాఘవరావు, సహాయ వ్యవసాయ సంచాలకుడు వినుకొండ రవికుమార్, మండల వ్యవసాయ అధికారిణి నీరజ తదితరులు పలు డిపోల్లో లైసెన్స్ లేకుండా పురుగు మందులు నిల్వ పెట్టినట్లు గుర్తించారు. రూ.3,24,650 విలువైన పురుగు మందుల అమ్మకాలను తాత్కాలికంగా నిలుపుదల చేశారు. -
మా భూములు, ఇళ్లు ఇచ్చేది లేదు
● గిరిజనుల నిర్ణయం ఉలవపాడు: పరిశ్రమల కోసం భూములు, ఇళ్లు ఇచ్చేది లేదని గిరిజనులు తీర్మానించారు. కరేడు ఎస్టీ కాలనీలో ఐదు కుగ్రామాల యానాదులు సోమవారం రాత్రి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇండోసోల్ కంపెనీకి భూములు ఇవ్వడానికి ఇష్టం లేదని చెప్పారు. జీఓ వచ్చిన తర్వాత గ్రామసభ నిర్వహించకుండా పొలాలకు, ఇళ్లకు నోటీసులు పంపించారు. సభ ఏర్పాటు చేసిన తర్వాత యానాది వర్గానికి 70 శాతం మంది భూములివ్వడానికి సిద్ధంగా ఉన్నారని అపోహను ప్రభుత్వం కల్పించింది. దీంతో వారు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మర్రిచెట్టు సంఘం, బాలకోటయ్య సంఘం, ఆకుతోట సంఘం, పొల్లు గట్టు సంఘం, ధర్మారెడ్డి సంఘం, మంద బయట సంఘం, అలగాయపాళెం ఎస్టీ కాలనీలకు చెందిన సభ్యులు చర్చించి భూములు ఇవ్వబోమని తీర్మానించారు. కార్యక్రమంలో యానాది సంఘం నాయకులు కత్తి బాలకోటయ్య, చేవూరి శ్రీనివాసులు, నటరాజు సురేష్, మస్తానమ్మ, పోలమ్మ, మాలకొండయ్య, సురేష్, వసంతమ్మ, చౌటూరి వెంకటరావు, కత్తి చెంచయ్య, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
నేనెప్పుడొస్తే అప్పుడే బడి
● టీచర్ నిర్వాకంతో స్కూల్ మూత కావలి(జలదంకి): కావలి రూరల్ మండలం లింగంగుంటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితి దారుణంగా మారింది. ఇక్కడ నలుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. కృష్ణ అనే టీచర్ విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ఇతను తరచూ బడికి డుమ్మా కొడుతున్నాడని ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులకు మొబైల్లో మెసేజ్లు పెట్టి సెలవులు తీసేసుకుంటున్నాడు. ఒకే టీచర్ కావడంతో పాఠశాలను మూసివేయాల్సి వస్తుంది. రెండు రోజులుగా బడికి తాళాలు వేసి ఉన్నారు. దీంతో తల్లిదండ్రులు పిల్లల చదువులపై ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై కావలి ఎంఈఓ గోవిందయ్యను వివరణ కోరగా కృష్ణ సెలవు పెట్టినట్లు తనకు తెలియదన్నారు. టీచర్పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వైద్యశాఖలో జేడీ విచారణనెల్లూరు(అర్బన్): వైద్యారోగ్య శాఖలో ఉప్పలపాటి నాగరాజు అనే వ్యక్తి మరో ఉద్యోగిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేడీ మల్లేశ్వరి మంగళవారం విచారణ జరిపారు. ఫిర్యాదుదారుడు పేర్కొన్న అంశాలకు సంబంధించి ఎన్ఆర్హెచ్ఎంలో సందీప్ అనే వ్యక్తి పనిచేస్తూ బదిలీపై తిరుపతికి వెళ్లాడు. అయినా అతను నెల్లూరులో పనిచేస్తూ ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశాడని, గతంలో డీఎంహెచ్ఓకి అద్దె కారు పెట్టి ప్రైవేట్ డ్రైవర్ను పెట్టకుండా ప్రభుత్వ డ్రైవర్ను వినియోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే కాకుండా ఎన్ఆర్హెచ్ఎంలో ల్యాబ్ టెక్నీషియన్ల పోస్టుల భర్తీలో రోస్టర్ పద్ధతి పాటించలేదని దానిపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఈ అంశాలపై విచారణ అధికారిగా వచ్చిన జేడీకి మరో అర్జీని నాగరాజు అందజేశారు. అయితే విచారణ గురించి ఎవరికీ తెలియకుండా రహస్యంగా నిర్వహించారు. కరేడులో మహిళా సంఘాల ఐక్యవేదిక పర్యటన ఉలవపాడు: కరేడు గ్రామంలో మహిళా సంఘాల ఐక్యవేదికకు చెందిన వారు మంగళవారం నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ జీఓ నంబర్ 43ను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. నిరుపయోగంగా కాకినాడ సెజ్లో చాలా భూమి ఉందన్నారు. అలాంటి చోట పరిశ్రమలు పెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో 1,200 రోజులుగా పోరాడుతున్న రైతులు విజయం సాధించారన్నారు. కరేడు రైతుల కోసం తాము కూడా పోరాడి విజయం సాధిస్తామని తెలిపారు. అరకొర ఉన్న పొలాలు లాగేసుకుంటే రైతులు ఎలా జీవిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో అఖిల భారత మహిళా సమాఖ్య జాతీయ నాయకురాలు వనజాక్షి, ఐద్వా సహాయ కార్యదర్శి రమణి, రాష్ట్ర కార్యదర్శి దుర్గాభవాని, పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పోలీసుల అదుపులో హత్య కేసు నిందితులు? ఉదయగిరి: ఉదయగిరిలో ఆల్ఖైర్ ఫంక్షన్ హాల్ ఆస్తి వివాదమై ఈనెల 11వ తేదీ సాయంత్రం జరిగిన హత్య కేసులో నిందితులు మంగళవారం రాత్రి పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. ఈ కేసులో షేక్ మహ్మమద్ హామీద్ను వరుసకు బావలుగా ఉన్న గుంటుపల్లి మహ్మమద్ హనీఫ్, ఉమర్అలీ సోదరులు అత్యంత కిరాతకంగా జనం చూస్తుండగానే హత్య చేశారు. 13 కత్తిపోట్లు, 3 రాడ్డు దెబ్బలున్నట్లు వైద్యులు గుర్తించారు. నిందితులు వివిధ ప్రాంతాల్లో తల దాచుకున్నట్లు తెలిసింది. ఈ హత్యను ఓ యువకుడు తన సెల్ఫోన్లో చిత్రీకరించగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. తాము కేసు నుంచి బయటపడటం తేలిక కాదని గ్రహించిన నిందితులు సమీప బంధువు ద్వారా పోలీసులకు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో హత్య జరిగిన మరుసటిరోజు మధ్యవర్తి పోలీసులకు టచ్లోకి వచ్చి లొంగిపోవడానికి ప్రయత్నించినట్లు సమాచారం. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం మంగళవారం రాత్రి వరికుంటపాడు పోలీసుల సమక్షంలో లొంగిపోయినట్లు తెలిసింది. వారిని దుత్తలూరు స్టేషన్కు తరలించారు. తర్వాత కావలికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుండగా ఎస్పీ కార్యాలయం ఆదేశాల ప్రకా రం నెల్లూరుకు తరలించినట్లు సమాచారం. -
వేగంగా ఇళ్ల నిర్మాణాలు
● కలెక్టర్ ఆనంద్ ● అల్లూరు మండలంలో విస్తృతంగా పర్యటన అల్లూరు: ప్రభుత్వ లేఅవుట్లలో వేగంగా ఇళ్ల నిర్మాణాలను చేసి లబ్ధిదారులు నివాసం ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. తొలుత అల్లూరు – 2 పరిధిలోని నాగులదేవిగుంట వద్ద ఉపాధి హామీ కింద చేస్తున్న కాలువ పూడికతీత పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఎన్ని పనిదినాలు పూర్తి చేశారు?, ఎంత వేతనం పొందుతున్నారు?, ఉపాధి పనులే కాకుండా వేరే పనులు చేస్తున్నారా? అని ఆరాతీశారు. తర్వాత రామకృష్ణ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అనంతరం ప్రభుత్వ లేఅవుట్ను పరిశీలించారు. స్థానికులు మాట్లాడుతూ నీటి వసతి లేనందున పూర్తయిన గృహాల్లో ఇంకా చేరలేదని తెలియజేశారు. తక్షణమే స్పందించిన కలెక్టర్ నీటి వసతి కల్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీఆర్ కాలనీలో ఉన్న బీసీ సంక్షేమ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనఖీ చేశారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ వంశీకృష్ణ, అల్లూరు తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఎంపీడీఓ రజనీకాంత్, కమిషనర్ ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులకు భారీగా మామూళ్లు
కందుకూరు: ఉలవపాడు మండలం రామాయపట్నం, చాకిచర్ల, గుడ్లూరు మండలం తెట్టు ప్రాంతాల్లో రోజూ ఏదో ఒకచోట పెద్ద ఎత్తున పేకాట శిబిరాన్ని మంత్రి నారా లోకేశ్ మనుషులు నిర్వహిస్తున్నారు. ఐదారు నెలలుగా రోజూ అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు జరుగుతోంది. కందుకూరు, సింగరాయకొండ, కావలి, ఒంగోలు, నెల్లూరు, చైన్నె, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పేకాటరాయుళ్లు తరలివస్తున్నారు. 25 నుంచి 30 మంది పాల్గొంటున్నారు. రోజూ రూ.కోటికి పైగా చేతులు మారుతున్నట్లు సమచారం. ఒక్కొక్కరు రూ.లక్షల్లో పందేలు కాస్తున్నారు. కోతముక్క, కోసు వంటి వివిధ రకాల ఆటలు నిర్వహిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా అర్ధరాత్రి ప్రత్యేకంగా లైట్లు ఏర్పాటు చేసి శిబిరం నిర్వహిస్తుండటం గమనార్హం. ఆడేవారి నుంచి నిర్వాహకులు ప్రత్యేకంగా ఎంట్రీ ఫీజులు తదితరాల పేరుతో భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారు. అన్ని ఖర్చులు పోను శిబిరం నిర్వాహకులకు ఆదాయం రోజుకు రూ.లక్షల్లో ఉంటోంది. సకల ఏర్పాట్లు పేకాటరాయుళ్లకు ఏ లోటు రాకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనిని చాకిచర్ల, పెదపట్టపుపాళేనికి చెందిన ఇద్దరు వ్యక్తులకు అప్పగించారు. మద్యం, భోజనాలు శిబిరం వద్దకు సరఫరా చేస్తారు. వీరు గ్రామంలో స్థానిక నాయకులు కావడంతో అడ్డు చెప్పకుండా కొంత ఆదాయం వచ్చేలా ఈ కాంట్రాక్ట్ను అప్పజెప్పారు. కొందరికి గంజాయిని అందిస్తుండటం విశేషం. ప్రత్యేకంగా తరలిస్తూ.. శిబిరంలో పాల్గొనే వారిని తరలించేందుకు నిర్వాహకులు ప్రత్యేక రవాణా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే జాతీయ రహదారిపై ఉన్న తెట్టు వరకే కారులో రావాల్సి ఉంటుంది. అక్కడ పార్కింగ్ చేస్తే నిర్వాహకులు బైక్లపై అడవుల్లో ఏర్పాటు చేసిన శిబిరానికి తరలిస్తారు. ముగిసిన తర్వాత బైక్లపై తీసుకెళ్లి కార్ల వద్ద వదిలేస్తారు. అదే సందర్భంలో పేకాట శిబిరం వద్దకు బయట వ్యక్తులు రాకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థను కూడా పెట్టారు. స్థానికంగా ఉండే 10 నుంచి 15 మంది యువకులను నియమించారు. వీరు అటు వైపు ఎవరైనా వస్తున్నారేమోనని నిఘా ఉంచుతారు. కొత్త వ్యక్తుల సమాచారం ఉంటే వెంటనే నిర్వాహకులను చెబుతున్నారు. దీనికి గానూ ఒక్కొక్కరికి రోజుకు రూ.2,000 ఇస్తున్నారు. కందుకూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల శిబిరం రోజూ రూ.కోటికి పైగా చేతులు మారుతున్న వైనం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వస్తున్న పేకాటరాయుళ్లు మద్యం, విందు ఏర్పాట్లు బయట వ్యక్తులు రాకుండా కాపలాఇంత జరుగుతున్నా పేకాట శిబిరం గురించిన సమాచారం పోలీసులకు తెలియదా అంటే కచ్చితంగా తెలుసు. ఎవరు నిర్వహిస్తున్నారు?, ఏ ప్రాంతంలో ఏ రోజు ఆట జరుగుతుంది? అనే పక్కా సమాచారం ముందుగానే వారికి చేరుతుంది. అయినా ఆ వైపు కన్నెత్తి చూడకపోవడానికి కారణం మామూళ్ల మత్తులో జోగుతుండటమే. గుడ్లూరు, ఉలవపాడు పోలీసులకు రోజుకు రూ.30 వేలు మామూళ్లు ఈ శిబిరం నుంచి వెళ్తున్నట్లు సమాచారం. ఈ కారణంతోనే చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అదే సందర్భంలో ఎక్సైజ్ శాఖ అధికారులను కూడా మేనేజ్ చేసుకుంటున్నారు. కాగా ఆదివారం అర్ధరాత్రి పరకొండపాడు గ్రామానికి చెందిన తూమాటి లక్ష్మయ్య (49) అనే వ్యక్తి పేకాట శిబిరానికి వెళ్తుండగా కారు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక కుటుంబాలు ఆర్థికంగా దెబ్బ తింటున్నాయి. నేడు ప్రాణాల మీదకు వస్తుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఎర్రచందనం దుంగల స్వాధీనం
● విలువ రూ.50 లక్షలు ● నలుగురు స్మగ్లర్ల అరెస్ట్ ఆత్మకూరు: నియోజకవర్గ పరిధిలోని చేజర్ల అటవీ ప్రాంతంలో అక్రమ రవాణాకు సిద్ధం చేసిన ఎర్రచందనంను టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. టాస్క్ఫోర్స్ హెడ్ ఎల్.సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ఎస్పీ పి.శ్రీనివాస్ నేతృత్వంలో ఆర్ఐ సాయిగిరిధర్, ఆర్ఎస్ఐ లింగాధర్ బృందం, స్థానిక ఎఫ్బీఓ ఐ.జనార్దనతో కలిసి సోమవారం రాత్రి నుంచి చేజర్ల అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. మంగళవారం తెల్లవారుజామున వీరు కలువాయి ఫారెస్ట్ బీటు పరిధికి చేరుకోగా, అక్కడ కారు, బైక్తో కొందరు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. 192 దుంగల్లో కొన్నింటిని పలకలుగా మార్చారు. వాటిని, మరికొన్ని దుంగల్ని అడవిలో ఉంచినట్లు నిందితులు చెప్పారు. వాటిని చైన్నెకి తరలించేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. -
నన్ను, నా కుమారుడ్ని చంపేసేవారు: ప్రసన్న
నెల్లూరు (బారకాసు): ఈవీఎంల ద్వారా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాదిగా రాక్షస పాలన సాగిస్తోందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మాజీమంత్రులు అనిల్కుమార్యాదవ్ విమర్శించారు. ఆ రోజు ఇంట్లో ఉంటే తనను, తన కుమారుడిని చంపేసే వారని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అమానవీయంగా, అప్రజాస్వామ్యంగా ఉందని మండిపడ్డారు. సోమవారం నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని చూసి రాష్ట్రం ఒక్కసారిగా ఉలికి పడిందన్నారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడా ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని, ఇప్పుడు ఈ దాడి గురించి ప్రజలు చర్చించుకుంటున్నారని చెప్పారు. మారణాయుధాలతో వచ్చిన టీడీపీ గూండాలు ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లో ఉండి ఉంటే హతమార్చే వారని ప్రతి ఒక్కరికీ అర్థమవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు, వారి ఇళ్లపై దాడులు చేస్తూ టీడీపీ నేతలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఈ నెల 7వ తేదీ దాడి జరిగితే కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా ఆరు రోజుల తర్వాత గుర్తుతెలియని వ్యక్తులని కేసు నమోదు చేయడం చూస్తే పోలీసులు వ్యవహరిస్తున్న తీరుకు అద్దం పడుతుందన్నారు. గతంలో టీడీపీ కార్యాలయంపై వల్లభనేని వంశీ దాడిని ప్రోత్సహించారని ఆయనపై కేసు నమోదు చేసి నాలుగు నెలల పాటు రిమాండ్కు పంపారని అని గుర్తు చేశారు. రాజ్యాంగం అపహాస్యం : అనిల్ టీడీపీ ఈ రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తూ వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెడుతూ, వారి ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుందని మాజీమంత్రి అనిల్కుమార్యాదవ్ మండిపడ్డారు. ప్రసన్నకుమార్రెడ్డిని హతమార్చేందుకే టీడీపీ గూండాలు ఆయన ఇంట్లోకి చొరబడ్డారన్నారు. దాడికి సంబంధించి అన్ని ఆధారాలు ఇచ్చి కేసు నమోదు చేయమని కోరినా, ఎఫ్ఐఆర్లో ఎవరి పేర్లు లేకుండా పోలీసులు కేసు నమోదు చేసిన తీరు దుర్మార్గమన్నారు. ఒక మాజీమంత్రికే ఈ జిల్లాలో రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజలకు ఇంకెక్కడ రక్షణ ఉంటుందన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఆ జిల్లా ప్రథమ పౌరురాలు, బీసీ మహిళ జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై టీడీపీ, జనసేన గూండాలు విచక్షణా రహితంగా మారణాయుధాలతో దాదాపు ఒకటిన్నర గండసేపు దాడి జరిగితే అధికారంలో ఓ మంత్రి, బీసీ నేత ఖండించకపోగా ఆయన మాట్లాడిన భాష, ఆమెను మహానటి అని వ్యాఖ్యానించడం సిగ్గు చేటని విమర్శించారు. అదే కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఒకటిన్నర సంవత్సరం నుంచి నానా రకాల భాషలు మాట్లాడుతూ, అరాచకాలు చేస్తూ, ఒక ఇంటిని కూల్చేయొ చ్చు. ‘మాజీ మంత్రుల్ని, ఎమ్మెల్యేలను వాడు, వీడు, పశువులు, ఆంబోతులు’ అని అంటే మాత్రం అమాయకురాలా?. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోట వినుత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు దారుణ హత్య ఎంతో కలకలం సృషించిన విషయం అందరికి తెలిసిందేనన్నారు. ఈ ఘటన ఏమాత్రం కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ● నెల్లూరురూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు విమర్శలు సహజమని, విమర్శలు చేసినప్పుడు తిరిగి విమర్శించాలే తప్ప దాడు ల సంస్కృతి సరికాదన్నారు. అధికారంలో ఉన్నామన్న అహంకార ధోరణితో ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి వ్యవహరించడం దారుణమన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా రాజకీయ చరిత్ర కలిగిన నలపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కుటుంబమన్నారు. ప్రసన్నకుమార్రెడ్డిని చంపేయాలని దాడి చేశారని, ఆయన తల్లిని భయభ్రాంతులకు గురి చేశారని ఇది అత్యంత దుర్మార్గమన్నారు. మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లో విధ్వంసం సైకోయిజం పోలీసులు వ్యవహరిస్తున తీరు అమానవీయం ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి, మాజీ మంత్రి అనిల్ ఇంట్లో ఉండి ఉంటే నన్ను, నా బిడ్డను చంపేసే వారు : ప్రసన్న ప్రశాంతిరెడ్డి గురించి ఎక్కడా తాను వ్యక్తిగతంగా మాట్లాడలేదని మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి స్పష్టం చేశారు. తనను, తన కుమారుడిని చంపాలని 200 మంది టీడీపీ గూండాలను పంపి నా ఇల్లును ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ధ్వంసం చేయించిందన్నారు. ప్రశాంతిరెడ్డి ఈ మధ్య ప్రెస్మీట్ పెట్టి అప్పుల్లో, పర్సంటేజీల్లో, లంచాల్లో ప్రసన్నకుమార్రెడ్డి పీజీ చేశాడని నా గురించి వ్యక్తిగతంగా ఆరోపణలు చేసిందన్నారు. దీంతో తాను కూడా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి సంబంధించి కొన్ని వాస్తవాలు మాట్లాడానని చెప్పారు. దీన్ని జీర్ణించుకోలేకనే విధ్వంసానికి తెగబడ్డారన్నారు. ఇది టీడీపీ రెడ్బుక్ పాలనకు నిదర్శనమన్నారు. నా ఇంటిపై దాడికి సంబంధించి పోలీసులకు అన్ని ఆధారాలు ఇచ్చినా కేసు నమోదు చేయని పోలీసులు చివరకు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారన్నారు. ప్రశాంతిరెడ్డి నాపై ఫిర్యాదు ఇచ్చిన రెండు గంటల్లోనే పోలీసులు కేసు నమోదు చేశారని, పోలీసుల వ్యవహార శైలి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కాకాణిని తీవ్రవాదిలా తీసుకువస్తారా?
చిల్లకూరు: మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని గూడూరు కోర్టులో హాజరు పరిచే క్రమంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని, ఆయన్ను తీవ్రవాదిలా కోర్టుకు తీసుకు వచ్చారని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ధ్వజమెత్తారు. గూడూరు రెండో పట్టణంలోని వైఎస్సార్సీపీ రూరల్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మేరిగ మాట్లాడుతూ నిరాధారమైన కేసుల్లో కాకాణిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి పలు కోర్టులకు తిప్పుతున్నారని విమర్శించారు. ఈ క్రమంలోనే మరో కేసులో ఆయన్ను ఇరికించి పోలీసులు పీటీ వారెంట్ వేసి గూడూరు కోర్టుకు హాజరు పరిచారని తెలిపారు. అందు కోసం 144వ సెక్షన్ అమల్లోకి తీసుకు వచ్చి రెండో పట్టణంలోని కోర్టుకు మూడు వైపులా ఉన్న దుకాణాలు మూసి వేయడం, పోలీసులను మోహరించడం చూస్తుంటే ఎందుకంత భయమో అర్థం కావడం లేదన్నారు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బందులు గురి చేస్తున్నారని, అందులో భాగంగానే కాకాణి గోవర్ధన్రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారన్నారు. తాజాగా నెల్లూరులోని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై గంజాయి మూకలతో దాడికి పాల్పడ్డారని, దీనిపై ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ అయిన తనను కూడా గూడూరు పోలీసులు కనీస అనుమతి ఇవ్వకుండా, కోర్టు ఆవరణలోకి వెళ్లకుండా ఎండలోనే గేటు బయట అడ్డుకున్నారన్నారు. ప్రజాస్వామ్యం చచ్చిపోతుందన్నారు. తనతోపాటుగా నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బయటకు వస్తే కేసులు బనాయిస్తామని హెచ్చరికలు చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఈ సమా వేశంలో పట్టణ, రూర ల్, చిట్టమూరు, కోట మండలాల కన్వీనర్లు బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయకుమార్రెడ్డి, సన్నారెడ్డి శ్రీనివా సులరెడ్డి, పల గాటి సంపత్కుమార్రెడ్డి, కోట మాజీ జెడ్పీటీసీ ఉప్పల ప్రసాద్గౌడ్, రాష్ట్ర యూత్ సెక్రటరీ కొండూరు సునిల్రెడ్డి, గూడూ రు ఎంపీపీ బూదూరు గురవయ్య, నాయకులు గొట్టి పాటి రవీంద్రరెడ్డి, కామిరెడి కస్తూర్రెడ్డి, ఓడూరు బాలకృష్ణారెడ్డి, బాబురెడ్డి, అట్ల శ్రీనివాసులరెడ్డి, యల్లా శ్రీనివాసులరెడ్డి, సాయిరెడ్డి, దీప్తి తదితరులు పాల్గొన్నారు. కోర్టుకు హాజరు పరచడంలో పోలీసుల అత్యుత్సాహం శాసనమండలిలో ఫిర్యాదు చేస్తా ఆంక్షలపై ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ధ్వజం -
స్నేహితులే హంతకులు
పొదలకూరు: ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో ఏర్పడిన గొడవలను మనసులో పెట్టుకుని నెల్లూరు రూరల్ మండలం యనమలదిన్నె గ్రామానికి చెందిన ఓ యువకుడిని స్నేహితులే అంతమొందించారు. మాట్లాడుకుందామని పిలిచి మద్యం తాగించి దారుణంగా కత్తులు, రాడ్లు, పారతో దాడి చేసి హతమార్చి ఇసుకలో మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. పోలీసుల కథనం మేరకు.. యనమలదిన్నెకు చెందిన కె.మోహన్ చందు (21)కు పొదలకూరు మండలం విరువూరుకు చెందిన తరుణ్కుమార్రెడ్డితో స్నేహం ఉంది. చందు కార్ల కంపెనీలో పనిచేసేవాడు. రెండు కార్లు అమ్మకాలకు రావడంతో తరుణ్కు ఇప్పించాడు. అయితే వాటికి సంబంధించిన నగదును అతను ఇవ్వలేదు. ఒక కారు అమ్ముకున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో చందు, తరుణ్ మధ్య విభేదాలు వచ్చాయి. ఈనెల 10వ తేదీన రాత్రి తరుణ్ మరికొందరితో కలిసి చందును విరువూరు రావాలని ఆర్థిక లావాదేవీల గురించి మాట్లాడుకుందామని పిలిచాడు. చందు వెళ్లగా మాటలు కలిపి పెన్నా వద్ద ఫూటుగా మద్యం తాగించి హత్య చేశారు. మృతదేహాన్ని ఇసుకలోనే పాతిపెట్టి వెళ్లిపోయారు. చందు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆదివారం నెల్లూరు రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలాన్ని గుర్తించారు. సోమవారం నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు పర్యవేక్షణలో రూరల్, పొదలకూరు సీఐలు వేణు, శివరామకృష్ణారెడ్డిలు తహసీల్దార్ బి.శివకృష్ణయ్య సమక్షంలో మృతదేహాన్ని వెలికితీయించారు. ఫోరెన్సిక్ వైద్యులు అక్కడే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.యువకుడి దారుణ హత్య విరువూరు పెన్నా ఇసుకలో పూడ్చివేత ఆర్థిక వ్యవహారాలే కారణం -
వినతులిచ్చి.. స్పందించాలని కోరి..
నెల్లూరు రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీల సంఖ్య తగ్గడం లేదు. ప్రతి వారం పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్, డీఆర్వో హుస్సేన్ సాహెబ్, డ్వామా పీడీ గంగాభవాని, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్రెడ్డి సమస్యలు తెలుసుకున్నారు. ఈసారి రికార్డు స్థాయిలో 555 అర్జీలను ప్రజలు అందజేశారు. ఎక్కువగా రెవెన్యూ శాఖవి 215, మున్సిపల్ శాఖవి 43, సర్వేకు 48, పంచాయతీరాజ్ శాఖవి 53, పోలీసు శాఖవి 52, సివిల్ సప్లయ్స్వి 8 తదితరాలున్నాయి. విద్యుత్ మీటర్లు ఇప్పించాలిఆరు సంవత్సరాల క్రితం పడారుపల్లి సప్తగిరి కాలనీలో కేఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కలువాయి శ్రీనివాస్రెడ్డి అనే బిల్డర్ దగ్గర అపార్ట్మెంట్లలో తొమ్మిది ఫ్లాట్లు కొనుగోలు చేశామని, అతను ఇప్పటికీ పూర్తి చేసి ఇవ్వలేదని కొనుగోలుదారులు ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ బ్యాంక్ లోన్ పెట్టామని చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇంటి బాడుగలు భరించలేక కొంత మొత్తం వేసుకుని లిఫ్ట్, ట్రాన్స్ఫార్మర్, కరెంట్ మీటర్లు, ఫ్లోరింగ్ మిగతా రిపేర్లు చేయిద్దామంటే అతను తమపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారన్నారు. కరెంట్ మీటర్లు రానివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులు అశోక్రెడ్డి, పెళ్లూరు రవి, కృష్ణారెడ్డి, చంద్ర, నరసింహారెడ్డి పాల్గొన్నారు. ● జిల్లాలో యూరియా దుర్వినియోగాన్ని అరికట్టలని బీజేపీ నేత మిడతల రమేష్ విజ్ఞప్తి చేశారు. అధికారులకు వినతిపత్రం అందించిన తర్వాత ఆయన మాట్లాడుతూ యూరియా నిల్వలు పక్కదారి పట్టకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 90 శాతం సబ్సిడీ ఇవ్వండి కుల వృత్తుల వారికి ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ రుణాలివ్వాలని ఎరుకల సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ్ల శివ వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ బాతుల పెంపకం, ప్లాస్టిక్ వైరుతో బుట్టలు అల్లడం తదితర వృత్తులపై అనేకమంది ఆధారి పడి జీవిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఆయా వృత్తులను గుర్తించి సబ్సిడీ రుణాలివ్వాలన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో నేతలు కట్ట రామారావు, బండి బుజ్జయ్య, కట్టా రమణయ్య, దేవరకొండ వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక రికార్డు స్థాయిలో 555 అర్జీలు రెవెన్యూ శాఖవే అధికం చర్యలు తీసుకోవాలంటూ.. 20 ఏళ్లుగా సాగు చేస్తున్న వ్యవసాయ భూమిని కొందరు టీడీపీ నాయకులు ఆక్రమించుకోవాలని చూస్తున్నారని సైదాపురం మండలం చాగణం గ్రామానికి చెందిన మహిళలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిమ్మ సాగు చేస్తున్నామన్నారు. 23 ఎకరాల భూమికి సంబంధించి తమ పేరుపై ప్రభుత్వం ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్ కూడా ఇచ్చిందన్నారు. కొంతమంది ఆక్రమించుకోవాలని చూస్తే హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని ఆర్డర్ను రెవెన్యూ అధికారులకు ఇచ్చామన్నారు. అయినా ఇది మా ప్రభుత్వం, మీ దిక్కున్న చోట చెప్పుకోండంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వాపోయారు. సువర్ణమ్మ, అనురాధ, పద్మమ్మ, ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.రుణాలివ్వకపోవడం అన్యాయం ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాలివ్వకపోవడం అన్యాయమని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్.మల్లి అన్నారు. కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. మల్లి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో వారు అధిక వడ్డీలకు నగదు తెచ్చుకుని ఇబ్బందులు పడుతున్నారన్నారు. దళిత, గిరిజనులకు పథకాలు సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. దీంతో వారంతా ఆర్థిక సమస్యల్లో ఇరుక్కున్నట్లు చెప్పారు. తండల వ్యాపారస్తులు అధికార పార్టీ ఎమ్మెల్యేల పేరు చెప్పి దోచుకుంటున్నారని తెలిపారు. కె.శ్రీనివాసులు, బిల్ల మస్తానయ్య, జెడ్డా వాసు, రాజేశ్వరమ్మ, ఆర్.శ్రీనివాసులు, జె.శ్రీనివాసులు, మహిళలు పాల్గొన్నారు. -
ఏపీపీఎస్సీ పరీక్షలను పక్కాగా నిర్వహించాలి
● డీఆర్ఓ హుస్సేన్ సాహెబ్ నెల్లూరురూరల్: ఏపీపీఎస్సీ పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా పక్కాగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని డీఆర్వో హుస్సేన్సాహెబ్ అధికారులను ఆదేశించారు. సోమ వారం కలెక్టరేట్లోని డీఆర్వో చాంబర్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మూడు నోటిఫికేషన్లకు సంబంధించి నిర్వహిస్తున్న లెక్చరర్ పోస్టుల పరీక్షల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో డీఆర్వో సమీక్షించారు. డీఆర్వో మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు లెక్చరర్ పోస్టుల పరీక్షలకు జిల్లాలో ముత్తుకూరు రోడ్డులో ని నారాయణ ఇంజినీరింగ్ కళాశాల, పొట్టేపాళెంలోని ఆయాన్ డిజిటల్ జోన్, కడనూతలలోని రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసినట్లు చెప్పా రు. ఉదయం 9 గంటలు, మధ్యాహ్నం 2 గంటల తరువాత అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని చెప్పారు. అభ్యర్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఏర్పాటు చేయాలని, అభ్యర్థులకు సరిపడా ఆర్టీసీ బస్సులు నడపాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్యారోగ్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని వైద్యాధికారిని ఆదేశించారు. తాగునీరు ఏర్పాటు చేయాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లుపై చీఫ్ సూపరింటెండెంట్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావొద్దని తెలిపారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ అధికారులు ప్రసాద్కుమార్, ఎం.శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
బ్యాంక్లో అగ్నిప్రమాదం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు బృందావనంలోని కర్ణాటక బ్యాంక్లో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడంతో ఆస్తి నష్టం తగ్గింది. అధికారుల సమాచారం మేరకు.. నెల్లూరు బృందావనంలో కర్ణాటక బ్యాంక్ ఉంది. ఇన్వర్టర్ బ్యాటరీ రూమ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బ్యాంక్ నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. నెల్లూరు లీడింగ్ ఫైర్మెన్ బాలాజీ గురుప్రసాద్ నేతృత్వంలో కె.చంద్రశేఖర్, మల్లికార్జున, మధులు ఫైరింజిన్తో మూడు నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. లేనిపక్షంలో భారీగా నష్టం వాటిల్లేది. బ్యాంక్ జనరల్ మేనేజర్ సీహెచ్ సతీష్ నుంచి అగ్నిమాపక సిబ్బంది వివరాలు సేకరించారు. ప్రమాదంలో రూ.3.5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు వారు పేర్కొన్నారు. -
నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్
నెల్లూరు రూరల్: ఇండోసోల్ కంపెనీ కోసం ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో 8,348 ఎకరాల భూసేకరణకు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయాలని రైతు, వ్యవసాయ, కార్మిక, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమవారం నెల్లూరులో కలెక్టర్ ఆనంద్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ప్రధాన జీవనాధారమైన వ్యవసాయం కంపెనీ స్థాపనతో విధ్వంసమవుతుందని తెలిపారు. ఇది ఆహార భద్రత, ప్రజల జీవనోపాధుల విధ్వంసం తప్ప మరేదీ కాదన్నారు. రైతులు, ప్రజలు గ్రామసభకు హాజరై పంట పొలాలు, నివాస స్థలాలను కంపెనీకి ఇచ్చేది లేదని ఏకగ్రీవంగా తీర్మానం చేశారని గుర్తుచేశారు. ఆ కంపెనీకి ప్రభుత్వం ఇచ్చిన జీఓని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి అజయ్కుమార్, వెంగపట్నం రమణయ్య, ఆలూరు తిరుపాలు, వి.రామరాజు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
పేకాట శిబిరానికి వెళ్తుండగా..
కందుకూరు: పేకాట పిచ్చి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయేలా చేస్తే మరొకరు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన గుడ్లూరు మండలం పోట్లూరు వద్ద చోటుచేసుకుంది. క్షతగాత్రుడి బంధువుల కథనం మేరకు.. గుడ్లూరు మండలం దప్పళంపాడు గ్రామానికి చెందిన చెరుకూరి మాల్యాద్రి అనే వ్యక్తి ఆదివారం కందుకూరు కారు స్టాండ్లోని వాహనాన్ని సెల్ఫ్ డ్రైవింగ్ విధానంలో అద్దెకు తీసుకున్నాడు. అనంతరం అదే మండలం పరకొండపాడు గ్రామానికి చెందిన తూమాటి లక్ష్మయ్య (49)ను ఎక్కించుకుని గుడ్లూరు నుంచి తెట్టు వైపు బయలుదేరాడు. ఈ క్రమంలో కారు అర్ధరాత్రి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లక్ష్మయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా చనిపోయాడు. తీవ్రగాయాలైన మాల్యాద్రిని మెరుగైన చికిత్స కోసం బంధువులు ఒంగోలు కిమ్స్కు తరలించారు. అదే కారణమా? ఈ ప్రమాదంపై పోలీసులు చెబుతున్న మాట ఒక విధంగా ఉండగా, మాల్యాద్రి బంధువులు చెప్పేది మరోలా ఉంది. మద్యం తాగి అధిక వేగంతో కారు నడపడం వల్ల చెట్టును ఢీకొన్నట్లు పోలీసులు చెబుతుంటే, పేకాట శిబిరానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు మాల్యాద్రి బంధువులు చెబుతున్నారు. అతను ఆదివారం రామాయపట్నం ప్రాంతంలో జరిగే పేకాట శిబిరానికి పేకాటరాయుళ్లను తరలించాల్సి ఉంది. ఈ ప్రాంతంలో కొంతకాలంగా జరుగుతున్న శిబిరానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పేకాటరాయుళ్లను మాల్యాద్రి పికప్ చేసుకుని కారులో తీసుకెళ్లి వదిలిపెడతాడు. దీనికి నిర్వాహకులు అతడికి కారు బాడుగ ఇవ్వడంతోపాటు అదనంగా కొంత నగదును ఇస్తారు. ఈ క్రమంలోనే కందుకూరులో కారును అద్దెకు తీసుకుని వివిధ ప్రాంతాల నుంచి పేకాటరాయుళ్లను పికప్ చేసుకుని శిబిరానికి తరలించే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుందని చెబుతున్నారు. కొంత కాలంగా ఈ శిబిరం భారీ స్థాయిలో నడుస్తోందని, అనేక కుటుంబాలు నాశనమవుతున్నాయని మాల్యాద్రి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్టును ఢీకొన్న కారు ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు -
17న వెంగమాంబకు నెల పొంగళ్లు
దుత్తలూరు: మండలంలోని నర్రవాడలో కొలువైన వెంగమాంబ పేరంటాలకు ఈ నెల 17వ తేదీ నెల పొంగళ్ల కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ ఉషశ్రీ సోమవారం తెలిపారు. బ్రహ్మోత్సవాల సమయంలో వెంగమాంబ దంపతుల కల్యాణం జరిగిన నాటి నుంచి 30వ రోజు ఈ నెలపొంగళ్లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అదే రోజు సమరసత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమ్మ వారికి ఆషాడం సారె సమర్పిస్తారని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పంటలకు ఎరువుల కొరత లేకుండా చర్యలు కోవూరు: జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరి, ఇతర పంటలు సుమారు 1.50 లక్షల హెక్టార్లలో సాగు జరుగుతోందని, అవసరమైన యూరియా సరఫరా నిరాటంకంగా సాగుతోందని జిల్లా వ్యవసాయ అధికారి పి. సత్యవాణి తెలిపారు. సోమ వారం ఆమె పడుగుపాడు రేక్ పాయింట్ వద్ద యూరియా దిగుమతి తీరును పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ సీజన్ ప్రారంభంలోనే ఎరువుల అవసరాలను అంచనా వేసి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు అందిస్తూ యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుత సీజన్కు 47,588 మెట్రిక్ టన్నుల యూరి యా అవసరం కాగా, ఇప్పటి వరకు 32,714 మెట్రిక్ టన్నులు ఏప్రిల్ నుంచి రైతులకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కోవూరు, నెల్లూరు వ్యవసాయ డివిజన్ పరిధిలో వరి ఇప్పటికే చిరుపొట్ట దశకు చేరినట్లు, కావలి, ఆత్మకూరు, పొదలకూ రు డివిజన్లలో వరి నాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు వివరించారు. సోమవారం పడుగుపాడు రేక్ పాయింట్ ద్వారా జిల్లాకు ఎన్ఎఫ్సీఎల్ యూరియా 1,850 మెట్రిక్ టన్నులు వచ్చా యి. అందులో 850 మెట్రిక్ టన్నులు ప్రైవేట్ డీల ర్ల ద్వారా, 1,000 మెట్రిక్ టన్నులు మార్క్ఫెడ్ ద్వారా రైతు సేవా కేంద్రాలు, సహకార సంఘాల ద్వారా పంపిణీకి సరఫరా చేసినట్లు తెలిపారు. రైతులు ఎక్కువ యూరియా వాడడం వల్ల పురుగులు, తెగుళ్లు పెరగడం, సూక్ష్మ పోషక లోపాల కారణంగా దిగుబడిలో తగ్గుదల సమస్యలు తలెత్తుతున్నాయని హెచ్చరించారు. ముఖ్యంగా చిరుపొట్ట దశలో ఎకరాకు కనీసం 25 కిలోల పొటాష్ ఎరువు వాడాలని రైతులకు సూచించారు. ఆమె వెంట కోవూరు సహాయ వ్యవసాయ సంచాలకులు జి. అనిత ఉన్నారు. అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ నరికివేత అనుమసముద్రంపేట: మండలంలోని జమ్మవరం గ్రామంలో చెరువు వద్ద ఉన్న అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ కర్రను అనంతసాగరం మండలం మినగల్లు గ్రామానికి చెందిన రమణారెడ్డి అనే వ్యక్తి నరికించి అమ్ముకుంటున్నాడని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ అనిల్కుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువు కట్ట మీద కంపకర్రను జమ్మవరం గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు పంచాయతీ అనుమతి లేకుండానే రమణారెడ్డికి అమ్మాడన్నారు. అతను కంపకర్రతోపాటు అగ్రిగోల్డ్ భూముల్లోని జామాయిల్ కర్రను సైతం కొట్టించి తరలించాడని చెప్పారు. సీఐడీ అటాచ్మెంట్లో ఉన్నటువంటి అగ్రిగోల్డ్ భూముల్లోని కర్రను ఎలా కొడతారని ప్రశ్నించారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. -
నా బాగోగులు పట్టించుకోవడం లేదయ్యా
నెల్లూరు(క్రైమ్): ‘నా కుమారుడు నరసింహ ఆస్తి రాయించుకుని నా బాగోగులు పట్టించుకోవడం లేదు. విచారించి న్యాయం చేయండి’ అని ఆత్మకూరుకు చెందిన ఓ వృద్ధుడు కోరాడు. సోమవారం నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 118 మంది తమ వినతులను ఎస్పీ జి.కృష్ణకాంత్కు అందించారు. పరిశీలించి న్యాయం చేస్తామని ఆయన భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఏఎీస్పీ సీహెచ్ సౌజ న్య, మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ చెంచురామారావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్బీ 2 ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి, ఆర్ఐ రాజారావు, ఫిర్యాదుల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● నా కుమార్తెకు ఫిలిప్పీన్స్లో డాక్టర్ సీట్ ఇప్పిస్తామని బాలరవితేజ అనే వ్యక్తి నమ్మించి రూ.17 లక్షలు తీసుకున్నాడు. విజిటింగ్ వీసా ఇప్పించి మోసగించాడని పొదలకూరురోడ్డుకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ● నా కుమార్తెకు యూరప్ లక్సెంబర్గ్లోని కంపెనీల్లో సూపర్వైజర్ ఉద్యోగం ఇప్పిస్తానని మున్వర్, అతని అల్లుడు ఇంతియాజ్, కుమార్తె సబీనాలు రూ.6 లక్షలు తీసుకున్నారు. 17 నెలలు గడుస్తున్నా ఉద్యోగం ఇప్పించకుండా, నగదు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని సంతపేటకు చెందిన ఓ వ్యక్తి వినతిపత్రమిచ్చాడు. ● నాకు నెల్లూరు నగరానికి చెందిన సంపత్తో పెళ్లి నిశ్చయమైంది. అతని ప్రవర్తన బాగోలేకపోవడంతో పెళ్లి రద్దు చేసుకున్నాం. సంపత్ నా వ్యక్తిగత ఫొటోలు, వీడియోలతో ఇబ్బందులు పెడుతున్నాడు. నాకొచ్చిన పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నాడని నెల్లూరు రూరల్కు చెందిన ఓ యువతి ఫిర్యాదు చేశారు. ● నా వద్ద కావలి పట్టణానికి చెందిన దేవరకొండ సుధీర్ రూ.లక్షకు రూ.3 లక్షల పాతనోట్లు ఇస్తానని నమ్మించి రూ.50 లక్షలు తీసుకున్నాడు. పాతనోట్లు ఇవ్వకుండా, నగదు తిరిగివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడని పల్నాడు జిల్లా నరసారావుపేటకు చెందిన ఓ వ్యక్తి అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ● నా కుమార్తె ఆరునెలల క్రితం నెల్లూరు రూరల్ పరిధికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. భర్త, అత్తమామలు అదనపుకట్నం కోసం వేధించారు. ఈక్రమంలో నా కుమార్తె మరణించింది. మృతిపై అనుమానాలున్నాయని విచారించి న్యాయం చేయాలని నవాబుపేటకు చెందిన ఓ మహిళ కోరారు. ● అదనపుకట్నం కోసం అత్తమామలు వేధిస్తూ ఇంటి నుంచి గెంటేశారు. కౌన్సెలింగ్ నిర్వహించి కాపురాన్ని చక్కదిద్దాలని బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు. ● ముదివర్తి గ్రామానికి చెందిన వ్యక్తి ఇన్స్టాగ్రామ్లో పరిచయమై పలుమార్లు బంగారు, నగదు తీసుకున్నాడు. ఇంకా ఇవ్వాలని లేకుంటే వ్యక్తిగత ఫొటోలు ఇన్స్టాగ్రామ్లో పెడతానని బెదిరిస్తున్నాడని విడవలూరుకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. కుమారుడిపై వృద్ధుడి ఫిర్యాదు ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ వినతులు స్వీకరించిన ఎస్పీ -
రీ కౌన్సెలింగ్లోనూ అన్యాయమే
నెల్లూరు (అర్బన్): ఒక దఫా కౌన్సెలింగ్ జరిపి బదిలీలు చేసినా, ఉన్నతాధికారుల ఆదేశాలంటూ మళ్లీ రీ కౌన్సెలింగ్ నిర్వహించి తీవ్ర అన్యాయం చేశారని పెద్ద సంఖ్యలో సచివాలయాల గ్రేడ్–3 ఏఎన్ఎంలు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం అసోసియేషన్ నాయకురాలు సుకన్య మాట్లాడుతూ నాలుగు నెలల క్రితం సచివాలయాల్లో పనిచేసే గ్రేడ్–3కి చెందిన 289 మంది ఏఎన్ఎంలకు గ్రేడ్–2 ఏఎన్ఎంలుగా ప్రమోషన్లు కల్పించి పీహెచ్సీల్లోని సబ్ సెంటర్లకు బదిలీ చేశారన్నారు. అయినప్పటికీ వారు అధికారులను మేనేజ్ చేసుకుని ప్రమోషన్ పొందిన ప్లేస్ల్లోకి వెళ్లకుండా పట్టణ ప్రాంతంలోనే సచివాలయాల్లో కొనసాగుతున్నారన్నారు. ప్రమోషన్లు పొందిన వారు తమ ప్రాంతాలను వదలకపోవడంతో బదిలీ అయిన తమకు కేటాయించిన పట్టణ ప్రాంతాలకు రాలేకపోయామన్నారు. అయితే ఇప్పుడు మళ్లీ రీ కౌన్సెలింగ్ జరుపుతూ పట్టణ ప్రాంతాల ఖాళీలను చూపడం లేదంటూ గ్రామీణ ప్రాంతాల్లోని ఖాళీలను మాత్రమే విడుదల చేశారన్నారు. ఈ క్రమంలో తాము గ్రామీణ ప్రాంతాల్లోని సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. అయితే పలువురు లంచాలు ఇచ్చి పట్టణ ప్రాంతాలకు కూడా బదిలీ అయ్యారన్నారు. ఉదాహరణగా కౌన్సెలింగ్ లిస్టులో చివరగా 457వ స్థానంలో ఉన్న ఓ సచివాలయం ఏఎన్ఎం మర్రిపాడు మండలం సింగనమల సచివాలయానికి ఆప్షన్ ఇచ్చిందన్నారు. అయితే ఆర్డర్ తీసుకునేటప్పుడు ఆశ్చర్యంగా ఆమె నెల్లూరు పట్టణంలోని రాజీవ్ గృహ కల్పకు మారిందన్నారు. ఇదేలా సాధ్యమయిందని ప్రశ్నించారు. చివరి వరుసలో 444 స్థానంలో ఉన్న మరో ఏఎన్ఎం అసలు కౌన్సెలింగ్లోనే పాల్గొన లేదన్నారు. అయితే ఆమెకు మాత్రం ఏకంగా నెల్లూరు నగరంలో పోస్టింగ్ ఇచ్చారన్నారు. ఇలా జరగడానికి పెద్ద ఎత్తున డబ్బులు మారడం, రాజకీయ నాయకుల పాత్రే కారణమని ఆరోపించారు. చిన్నచిన్న బిడ్డలున్న వారు, వితంతులు ఈ అసంబద్ధ కౌన్సెలింగ్ వల్ల తీవ్ర కష్టాలు పడుతున్నారన్నారు. అందువల్ల జరిగిన కౌన్సెలింగ్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రమోషన్లు పొందిన వారు బదిలీ కాబడిన స్థానాలకు వెళ్లిన తర్వాతనే తమకు బదిలీలు జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో తేజ, భారతి, రమణమ్మ తదితర పలువురు ఏఎన్ఎంలు పాల్గొన్నారు. కలెక్టరేట్ వద్ద సచివాలయ ఏఎన్ఎంల ధర్నా -
కేసును పోలీసులు నీరు గార్చే కుట్ర
నెల్లూరు (అర్బన్): ‘నన్ను చంపించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి వారి అనుచరులతో ఈ నెల 7వ తేదీ రాత్రి నా ఇంటిపై దాడి చేయించారని మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కలెక్టర్ ఆనంద్కు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి తాను పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసును నీరు గార్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సోమవారం మాజీమంత్రి పోలుబోయిన అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, నెల్లూరురూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి, ఇతర నాయకులతో కలిసి ప్రసన్నకుమార్రెడ్డి వినతిపత్రం అందజేశారు. మా ఇంటిపై దాడి జరిగినప్పుడు మా ఇంటిని పరిశీలిస్తున్న డీఎస్పీ పక్కనే ఉన్న నాల్గో నగర ఎస్హెచ్ఓ, తర్వాత రోజు ఏఎస్పీకి ఫిర్యాదు చేశానన్నారు. దాడి గురించి ఫిర్యాదు చేసిన కాపీని సెల్ఫోన్ వాట్సాప్ ద్వారా ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీ, ఎస్హెచ్ఓ పంపానన్నారు. కొన్ని వీడియోల ద్వారా ప్రత్యక్షంగా దాడిలో పాల్గొన్న వారిని గుర్తించామన్నారు. కోడూరు కమలాకర్రెడ్డి, దువ్వూరు కల్యాణరెడ్డి, జెట్టి రాజగోపాల్రెడ్డి, ఇంత మల్లారెడ్డి, పెనుబల్లి కృష్ణచైతన్య, కొల్లు సుధాకర్రెడ్డి, సాయితేజ, బెల్లంకొండ విజయకుమార్పాటు అనేక మంది దాడిలో పాల్గొన్నారని తెలుపుతూ ఫిర్యాదు చేశానన్నారు. ఈ విషయాలను ఈ నెల 12న రాష్ట్ర డీజీపీకి రిజిస్టర్ పోస్టులో పంపానన్నారు. 7వ తేదీ దాడి జరిగితే 12వ తేదీన నా కంప్లెంట్ రిజిస్టర్ చేశారని తెలిపారు. అయితే తాను ఇచ్చిన పేర్లను, అనుమానితులను ఎఫ్ఐఆర్లో చేర్చలేదన్నారు. ఉద్దేశ పూర్వకంగా వేమిరెడ్డి దంపతులు, ఇతర అనుమానితులతో పోలీసులు కుమ్మకై ్క కేసును నీరు గార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవడంతోపాటు తాను ఇచ్చిన ఫిర్యాదులోని పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చి వారిపై హత్యాయత్నంతోపాటు చట్టపరమైన కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మా ఇంట్లో విధ్వంసం చేయించింది వేమిరెడ్డి దంపతులే మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేత -
మీకు అండగా మేముంటాం
● కరేడు రైతులకు ఎమ్మెల్సీ తూమాటి హామీ ఉలవపాడు: కరేడు ప్రాంత రైతుల పోరాటానికి అండగా ఉంటామని, మీకు అన్యాయం జరగకుండా అన్ని వేదికల్లో మాట్లాడుతామని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు హామీ ఇచ్చారు. ఆదివారం కరేడు పంచాయతీ పరిధిలోని టెంకాయచెట్లపాళెం, కొత్తపల్లెపాళెం, చినపల్లెపాళెం, చైతన్యనగర్, కరేడు, పెద్దపల్లెపాళెం గ్రామాల్లో ఆయన పర్యటించి గ్రామ ప్రజలు, రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. మీ పోరాటంలో మేము ముందుంటాము.. పచ్చని పంటలు పండుతున్న భూములు తీసుకోవద్దని ప్రభుత్వానికి విజ్ఞపి చేస్తాను. నెల్లూరు జిల్లా డీఆర్సీ సమావేశం, శాసనమండలిలో ప్రభుత్వం ఏకపక్ష వైఖరిపై ప్రశ్నించమే కాకుండా రైతుల గుంతుకై అభిప్రాయాలను తెలియజేస్తామన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించొద్దని పోరాడుతామన్నారు. సముద్రాన్ని వదిలి మేము వెళ్లలేం టెంకాయచెట్లపాళెం మత్స్యకారులు మాట్లాడుతూ సముద్రాన్ని వదిలి మేము వెళ్లం. ముఖ్యమంత్రి వచ్చినా భూములు ఇవ్వం, ప్రాణాలైనా వదులుకుంటామంటూ తూమాటికి స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఏదైనా సమావేశం ఏర్పాటు చేస్తే జైజవాన్, జైకిసాన్ అని అంటారు. ఇప్పుడు కిసాన్ను వెళ్లిపామ్మంటున్నారు. ఇది ఎంత వరకు న్యాయమో ఆలోచించండని తెలిపారు. తాము భూములు ఇచ్చేదానికి సిద్ధంగా లేమన్నారు. తాము ఎక్కడికీ వెళ్లేది లేదన్నారు. రైతుల అభిప్రాయాలను గౌరవించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి, రైతు ఉద్యమ జేఏసీ అధ్యక్షుడు మిరియం శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ సయ్యద్ ఫజుల్, మండల కోఆప్షన్ సభ్యుడు ఖాదర్బాషా, ఎంపీటీసీలు రాధామాధవి, రమణయ్య, మాజీ సర్పంచ్ కృష్ణారావు, వైఎస్సార్సీపీ నాయకులు శ్రీనివాసమూర్తి, మోహన్బాబు, కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, రామకృష్ణ, బాలసుబ్రహ్మణ్యం, రవికాంత్, మహీధరరెడ్డి, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
సాక్ష్యాలు, ఆధారాలు చూపకుండా అక్రమ కేసులు
సాక్షిప్రతినిధి, నెల్లూరు: ‘నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక వ్యక్తిగతంగా నాపై నిందారోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని అక్రమ కేసులు బనాయించారు. ఎకై ్సజ్శాఖ అధికారులు రెండు రోజుల కస్టడీ విచారణ సమయంలో ఏ ఒక్క సాక్ష్యాన్ని, ఒక్క ఆధారాన్ని చూపించలేకపోయారు. అంటే ఇది అక్రమ కేసేనని తేలిపోతుందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఎకై ్సజ్ అధికారులను నిలదీసినట్లు సమాచారం. ముత్తుకూరు మండలం పంటపాళెంలో మద్యం అక్రమ నిల్వల కేసులో ఆదివారం పోలీసు శిక్షణా కేంద్రంలో కాకాణిని రెండో రోజు ఆయన తరఫు న్యాయవాది కె. శ్రీనివాసరావు సమక్షంలో ఇందుకూరుపేట ఎకై ్సజ్ అధికారులు 24 ప్రశ్నలు వేసి విచారించారు. ఆయా ప్రశ్నలకు కాకాణి దీటుగా సమాధానమిచ్చారు. తప్పుడు ఫిర్యాదులు, అక్రమ కేసు అని ఇప్పటికే పలుమార్లు చెప్పినా పదేపదే అవే ప్రశ్నలు లెవనెత్తడం దారుణమని, ఫిర్యాదులో పేర్కొన్న అంశాల్లో ఏ మాత్రం వాస్తవాలు లేవని, ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసేనని నాతోపాటు మీ అందరికీ తెలుసని, మద్యం అక్రమ నిల్వల విషయంలో నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటప్పుడు దాని పర్యవసనాలు ఏవి నాకు ఆపాదించవు. కేవలం కక్ష పూరితంగానే ఈ కేసు నమోదు చేశారంటూ కాకాణి ఎకై ్సజ్ అధికారులకు చెప్పినట్లు సమాచారం. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎకై ్సజ్ అధికారులు ఎన్నికల సంఘం పర్యవేక్షణలో విధులు నిర్వర్తించారు. తాను ఎకై ్సజ్ అధికారులను ప్రభావితం చేశామని పేర్కొనడంలో వాస్తవం లేదన్నారు. ఈ విషయంపై ఎకై ్సజ్ అధికారులే సమాధానం చెబితే బాగుంటుందని కాకాణి పేర్కొన్నట్లు సమాచారం. ఎన్నికల్లో నేను చేసిన అభివృద్ధి, మేము అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓటు వేయాలని ప్రచారం చేశాను. విచారణకు తాను ఎప్పుడూ సిద్ధం. రెండు రోజుల కస్టడీలో సంబంధం లేని విషయాలపై పదేపదే ప్రశ్నించారు. నాకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం, ఆధారం లేదు. కస్టడీలో ఉన్నప్పుడే మిగిలిన నిందితులుగా పేర్కొన్న వారిని, ఫిర్యాదుదారుడిని పిలిపించి ఉంటే అసలు ఫిర్యాదుదారుడు నాకు పరిచయం ఉన్నాడా? లేదా అనే విషయం అర్థమయ్యి ఉండేదని ఎకై ్సజ్ అధికారులకు సూచించినట్లు తెలిసింది. నిర్ధిష్టమైన ఆధారాలు లేకుండా ఎవరో ఇచ్చిన స్టేట్మెంట్ను పట్టుకుని ప్రశ్నించడం ఎంత వరకు కరెక్ట్ అని ఎకై ్సజ్ అధికారులను నిలదీసినట్లు తెలిసింది. ముగిసిన కాకాణి పోలీస్ కస్టడీ విచారణ నెల్లూరు (లీగల్): ముత్తుకూరు మండలం పంటపాళెంలో అక్రమంగా మద్యం నిల్వలు ఉంచారనే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి రెండు రోజుల ఎకై ్సజ్ పోలీస్ కస్టడీ ఆదివారంతో ముగిసింది. కోర్టు అనుమతితో జిల్లా కేంద్ర కారాగారం నుంచి ఇందుకూరుపేట ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. జైలు సమీపంలోని జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో కాకాణి తరఫు న్యాయవాది సీహెచ్ శ్రీనివాసులురెడ్డి, మధ్యవర్తులు వీఆర్వోలు శ్రీపతి మునిరాజు, చల్లా సూర్యకుమార్ సమక్షంలో కాకాణిని ఇందుకూరుపేట ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ జీవీ ప్రసాద్రెడ్డి రెండో 24 ప్రశ్నలు అడిగారు. కోర్టు ఇచ్చిన కస్టడీ గడువు ముగియడంతో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం నెల్లూరు స్పెషల్ ఎకై ్సజ్ కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి నిషాద్ నాజ్ షేక్ నివాసంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల ఉత్తర్వులు మేరకు జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. నా రాజకీయ ప్రత్యర్థుల కక్ష సాధింపు చర్యలే ఫిర్యాదులో పేర్కొన్న అంశాల్లో ఏ మాత్రం వాస్తవాల్లేవు పంటపాళెం మద్యం కేసు విచారణలో కాకాణి సమాధానాలు -
రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న జయలక్ష్మి
నెల్లూరు (బృందావనం): నగరంలోని దర్గామిట్టలో కొలువైన శ్రీరాజరాజేశ్వరి అమ్మవారిని ఆదివారం ఆంధ్రప్రదేశ్ భూ పరిపాలన ప్రత్యేక ముఖ్యకార్యదర్శి జి.జయలక్ష్మి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆమెను దేవస్థానం ఈఓ కోవూరు జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభంతో సంప్రదాయంగా ఆహ్వానించారు. దేవస్థానం ప్రాంగణంలోని మీనాక్షీసుందరేశ్వరస్వామి వారిని దర్శించుకొన్నారు. అమ్మ వారికి ఖడ్గమాల పూజ చేయించారు. అనంతరం అర్చకులు వేదమంత్ర ఆశీర్వచనాలతో శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా జయలక్ష్మి దృష్టికి దేవదాయశాఖ భూమిని వెబ్ల్యాండ్లో అప్డేషన్ జరిగేలా రెవెన్యూ అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఈఓ జనార్ధన్రెడ్డి కోరారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందిస్తూ తగిన ఆదేశాలు ఇస్తామని తెలిపారు. దేవస్థానం పక్కన ఉన్న రెవెన్యూ భూమి నుంచి కొంత స్థలం దేవస్థానానికి కేటాయిస్తే.. పార్కింగ్కు ఎటువంటి సమస్యలు తలెత్తవనే విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించారు. ఆమె వెంట నెల్లూరు ఆర్డీఓ అనూష ఉన్నారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా రెవెన్యూ క్రీడలు నెల్లూరు (స్టోన్హౌస్పేట): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 10వ రెవెన్యూ క్రీడలను మూడో రోజు ఆదివారం రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్, ప్రత్యేక రెవెన్యూ కార్యదర్శి జి.జయలక్ష్మి ప్రారంభించారు. మూడో రోజు ఆటలు ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగాయి. తొలుత కలెక్టర్ ఓ ఆనంద్తో కలిసి ఇండోర్ స్టేడియంలో కలెక్టరేట్ టీం, డివిజన్ టీం మధ్య జరిగిన బ్యాడ్మింటన్ పోటీలను ప్రారంభించారు. మహిళా విభాగంలో అండర్–35 100 మీటర్ల పరుగు పందెంలో గెలుపొందిన సాహిత్య, అనూష, శాంతిప్రియలకు మొదటి మూడు బహుమతులను కలెక్టర్ ఆనంద్తో కలిసి అందజేశారు. షాట్ఫుట్, డిస్కస్త్రో, జావెలిన్త్రో, లాంగ్జంప్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హుస్సేన్సాహెబ్, ఆర్డీఓలు అనూష, అవని, వంశీకృష్ణ, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎం పెంచలరెడ్డి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నటుడు ‘కోట’కు సింహపురితో అనుబంధం నెల్లూరు (బృందావనం): తెలుగు చలన చిత్ర రంగంలో విభిన్న పాత్రలను అలవోకగా పోషించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని విలక్షణ నటుడిగా కీర్తిప్రతిష్టలందుకొన్న కోట శ్రీనివాసరావుకు నెల్లూరుతో అనుబంధం ఉంది. నటుడిగా ప్రస్థానం సాగిస్తున్న తొలి రోజుల్లో పురమందిరంలో నెఫ్జా సుందరరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నెఫ్జా నాటక కళాపరిషత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1995లో నెల్లూరు పొదలకూరురోడ్డులో సుమన్, సౌందర్య నటీనటులుగా నెల్లూరీయుడు శ్రీధర్రెడ్డి నిర్మాతగా నిర్మించిన ‘బాలరాజు బంగారుపెళ్లాం’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. ఆ చిత్రం షూటింగ్ పొదలకూరురోడ్డు, పొగాకు గోడౌన్, నెల్లూరు పరిసరాల్లో జరుపుకొంది. దాదాపు 10 రోజుల పాటు ఆ చిత్ర నిర్మాణం నెల్లూరులో జరిగింది. ప్రతిఘటన చిత్రంతో స్టార్డమ్ అయిన తర్వాత కోట నెల్లూరుకు మళ్లీ ఎన్నడూ రాలేదని సమాచారం. గంజాయి కేసులో వ్యక్తి అరెస్ట్ బుచ్చిరెడ్డిపాళెం రూరల్: ఓ వ్యక్తి దగ్గర గంజాయి ఉందన్న స్థానికుల సమాచారంతో ఆదివారం పోలీసులు దాడి చేశారు. అతని వద్ద నుంచి 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరు రూరల్ మండలానికి చెందిన మస్తాన్ బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని జొన్నవాడ సమీపలో పెన్నానది బ్రిడ్జి వద్ద గంజాయి విక్రయిస్తున్నాడు. ఈ సమాచారం అందడంతో ఎస్సై సంతోష్కుమార్రెడ్డి అక్కడికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడి వద్ద 1.3 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తహసీల్దార్ వద్ద హాజరు పరిచి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
పచ్చముఠా దోపిడీ
● ఇష్టారాజ్యంగా ఇసుక, గ్రావెల్, బండరాళ్ల తరలింపు ● రాజుపాళెంలో యథేచ్ఛగా అక్రమ రవాణా ● చోద్యం చూస్తున్న అధికారులు సాక్షి టాస్క్ఫోర్స్: వెంకటగిరి నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్, బండరాళ్లను అక్రమంగా తరలిస్తూ సహజ సంపదను పచ్చముఠా లూటీ చేస్తోంది. ఓ నేత కనుసన్నల్లో ఈ మాఫియా చెలరేగిపోతోంది. కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సహజ సంపదను గుల్ల చేసి రూ.కోట్లను వెనుకేసుకుంటున్నారు. జిల్లాలోని కలువాయి మండలం రాజుపాళెం సమీపంలో గల పెన్నాలో ఇసుక తవ్వకాలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతివ్వలేదు. అయినా తమ్ముళ్లు మాత్రం ఇసుక రేవుల్లో పడి అందినంత దోచేస్తున్నారు. దీనికి తోడు పెన్నాలో నీటి ప్రవాహానికి రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో అక్కడ లభించే పెద్ద రాళ్లతో పాటు గ్రావెల్ను సైతం నిర్భయంగా తరలించుకుపోతున్నారు. రీచ్లు స్టాపైనా.. ఆగని అక్రమ రవాణా జిల్లాలోని ఇసుక రీచ్లకు అక్టోబర్ 15 వరకు అనుమతులను అధికారులు రద్దు చేశారు. అయితే ఈ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ రాజుపాళెం రీచ్లో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. కూటమి నేతల కనుసన్నల్లో దీన్ని జరిపి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిత్యం సగటున వంద వాహనాల్లో ఇసుకను ఇతర రాష్ట్రాలకు పగలూ.. రాత్రనే తేడా లేకుండా రవాణా చేస్తున్నారు. పోలీస్, రెవెన్యూ , మైనింగ్ అధికారులు ఈ అక్రమార్జనలో భాగస్వాములయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నదిలోకి రాచబాట పర్యావరణానికి తూట్లు పొడుస్తూ పెన్నాలోకి ఇసుకాసురులు రాచబాట వేశారు. తెలుగురాయపురానికి ప్రధాన రహదారి నుంచి నది మధ్యలోకి రోడ్డేశారు. రాజుపాళెంలోని ప్రధాన రహదారి నుంచి ప్రైవేట్ వ్యక్తికి చెందిన మామిడి తోట మీదుగా నిర్మించారు. దీనికి గానూ సదరు వ్యక్తికి నెలకు రూ.50 వేలు ముట్టజెప్తున్నారు. నదీ గర్భంలోకి రోడ్డేసినా సంబంధిత అధికారులు కన్నెత్తి చూడటంలేదు. రీచ్లో పెద్ద రాళ్లను తరలిస్తూ.. -
మహిళ మెడలో గొలుసు చోరీ
నెల్లూరు(క్రైమ్): ఉక్కపోతగా ఉండటంతో తలుపును దగ్గరగా వేసి వివాహిత తన కుమార్తెతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా, గుర్తుతెలియని దుండగుడు ఆమె మెడలోని బంగారు గొలుసును చోరీ చేశారు. వివరాలు.. జనార్దన్రెడ్డికాలనీలోని లక్ష్మీపార్వతినగర్లో సురేంద్ర, సౌమ్య దంపతులు నివాసం ఉంటున్నారు. వరండాలో ఆయన.. కుమార్తెతో కలిసి ఇంట్లో ఆమె నిద్రించారు. ఉక్కపోతగా ఉండటంతో తలుపును దగ్గరకు వేశారు. ఈ తరుణంలో ఇంట్లోకి గుర్తుతెలియని దుండగుడు ప్రవేశించి, ఆమె మెడలోని నాలుగు సవర్ల బంగారు గొలుసును కట్ చేసి తీసుకెళ్తుండగా, అలికిడైంది. బాధితులు నిద్ర నుంచి లేచేసరికే నిందితుడి అక్కడి నుంచి పరారయ్యారు. నిందితుడి కోసం చుట్టుపక్కల గాలించినా ప్రయోజనం లభించలేదు. కాగా ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. యాచకుడి మృతి వలేటివారిపాలెం: అనారోగ్యంతో యాచకుడు మృతి చెందిన ఘటన వలేటివారిపాళెంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై మరిడినాయుడి వివరాల మేరకు.. ఉప్పలపాడు సమీపంలోని కస్తూర్బా విద్యాలయం పక్కన ఉన్న కాలనీలో నివసిస్తూ గురునాథం నాగరాజు (30) భిక్షాటన చేసుకుంటున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. అంత్యక్రియల నిమిత్తం గ్రామస్తులు చందాల రూపంలో మృతుడి బంధువులకు సహకరిస్తున్నారు. సవక తోట దగ్ధం సైదాపురం: విద్యుత్ తీగలు తెగి మంటలు చెలరేగడంతో పదెకరాల్లో సవక తోట దగ్ధమైన ఘటన మండలంలోని గిద్దలూరులో ఆదివారం చోటుచేసుకుంది. రైతుల వివరాల మేరకు.. మండలంలోని గిద్దలూరులో కంభం శ్రీకాంత్, మరో ఐదుగురు రైతులు సుమారు వందెకరాల్లో సవక తోటలను సాగు చేస్తున్నారు. సమీపంలో ట్రాన్స్ఫార్మర్ ఉంది. తరచూ విద్యుత్ వైర్లు ఒకదానికొకటి రాసుకొని మంటలు వ్యాపిస్తుంటాయి. ఈ తరుణంలో విద్యుత్ వైర్లు రాసుకొని మంటలు చెలరేగి సవక తోటలోకి వ్యాపించాయి. సుమారు పదెకరాల్లో సవక తోట కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుమారు రూ.ఐదు లక్షల మేర నష్టం సంభవించిందని రైతులు తెలిపారు. కండలేరులో నీటి నిల్వ రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారానికి 30.316 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సత్యసాయి గంగకు 2050, పిన్నేరుకు 100, లోలెవల్కు 70, హైలెవల్కు 15, మొదటి బ్రాంచ్ కాలువలకు 65 క్యూసెక్కులను విడుదల చేస్తున్నామని వివరించారు. -
విచారణ పేరిట ఇబ్బంది పెడతారా..?
● బస్టాండ్ సెంటర్లో ఆందోళన ఉదయగిరి: పట్టణంలోని ఆల్ఖైర్ ఫంక్షన్ హాల్ ఆస్తి వివాదం నేపథ్యంలో జరిగిన హత్యను ఉదయగిరి బీసీ కాలనీకి చెందిన ఓ యువకుడు తన ఫోన్లో చిత్రీకరించారు. గమనించిన నిందితులు దాడికి యత్నించడంతో భయంతో పరారయ్యారు. ఈ దృశ్యాలను సదరు యువకుడు తన మిత్రులకు షేర్ చేయడంతో వీడియో వైరలైంది. దీంతో కేసులో ఈ వీడియో పోలీసులకు కీలకంగా మారింది. సెల్ఫోన్ను స్వాధీనం చేసుకునేందుకు గానూ యువకుడి తల్లిదండ్రులను మూడు రోజులుగా స్టేషన్కు పిలిపించి ఆచూకీ చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారు. తమ కుమారుడి ఆచూకీ తెలియక అల్లాడుతుంటే, ఇబ్బంది పెట్టడమేమిటంటూ స్థానిక పంచాయతీ బస్టాండ్ సెంటర్లో ఆందోళనను ఆదివారం చేపట్టారు. సుమారు 200 మంది బీసీ కాలనీ వాసులు రోడ్డును దిగ్బంధించారు. దీంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వీరిని శాంతింపజేసేందుకు యత్నించారు. పోలీసులు.. ఆందోళనకారుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం ఆందోళనను విరమించారు. -
పోరాటాలకు సిద్ధం కండి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలంటూ రానున్న రోజుల్లో చేపట్టనున్న పోరాటాలకు సిద్ధంగా ఉండాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న పిలుపునిచ్చారు. నగరంలోని ఓ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన డీవైఎఫ్ఐ నెల్లూరు రూరల్ మహాసభలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతిని అందజేయాలని డిమాండ్ చేశారు. యువత సత్తా ఏమిటో రానున్న రోజుల్లో ప్రభుత్వానికి తెలియజేస్తామని స్పష్టం చేశారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. డీవైఎఫ్ఐ నెల్లూరు రూరల్ అధ్యక్ష, కార్యదర్శులుగా శశి, చైతన్య, సహాయ కార్యదర్శిగా రాజా, ఉపాధ్యక్షుడిగా బాపనయ్య, కోశాధికారిగా మధు, 11 మంది కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. మాదాల వెంకటేశ్వర్లు, కట్టా సతీష్, కొండా ప్రసాద్, పెంచలనరసయ్య తదితరులు పాల్గొన్నారు. -
జీఓ 36 మేరకు జీతాలివ్వాలి
నెల్లూరు(బారకాసు): కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగంలో విధులు నిర్వర్తించే కార్మికులకు జీఓ నంబర్ 36 మేరకు జీతాలివ్వాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి పెంచలనరసయ్య, సీఐటీయూ నగర కార్యదర్శి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా నెల్లూరు నగరపాలక సంస్థ మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు విధులను ఆదివారం బహిష్కరించారు. గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ వరకు చేపట్టిన ర్యాలీలో వారు మాట్లాడారు. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు, సంబంధిత అధికారులను పలుమార్లు కలిసినా, ప్రయోజనం లేదని ఆరోపించారు. చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. విధిలేకే సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు. సమస్యలను పరిష్కరించకపోతే విధులను పారిశుధ్య కార్మికులు ఈ నెల 17 నుంచి బహిష్కరించి సమ్మెలోకి వెళ్లనున్నారని స్పష్టం చేశారు. సీఐటీయూ ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ, శివాజీ, సురేష్, మున్సిపల్ ఇంజినీరింగ్ నేతలు శ్రీనివాసులు, బాలు, మనోజ్, జిల్లా అధ్యక్షురాలు కామాక్షమ్మ, నెల్లూరు నగరాధ్యక్ష, కార్యదర్శులు సునీల్, అశోక్, నేత సుజాతమ్మ తదితరులు పాల్గొన్నారు. -
గత ప్రభుత్వంలో సజావుగా..
ఉదయగిరి: కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంలా పరిణమించింది. ఓ వైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేకపోవడం.. మరో వైపు ఎరువుల కృత్రిమ కొరతతో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. అన్నదాతా సుఖీభవ, పంట నష్టపరిహారం తదితరాలు సక్రమంగా అందక వారు ఆర్థికంగా అల్లాడిపోతున్నారు. ఇదీ పరిస్థితి.. జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్లో మూడు లక్షలెకరాల్లో వరిని సాగు చేశారు. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో వివిధ రకాల పైర్లను వేశారు. దీంతో యూరియాకు డిమాండ్ ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకున్న ముఖ్య డీలర్లు జిల్లాకు వచ్చిన యూరియాను తమ ఆధీనంలో ఉంచుకొని కృత్రిమ కొరత సృష్టించారు. డిమాండ్ను బట్టి అధిక ధరలకు విక్రయిస్తూ రైతుల జేబులకు చిల్లు పెడుతున్నారు. వాస్తవానికి బస్తా యూరియా ధర రూ.266 కాగా, రూ.350 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు. వింజమూరు, కలిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో రూ.350కు.. గ్రామీణ ప్రాంతాల్లో రూ.400 నుంచి రూ.450 వరకు అమ్ముతున్నారు. సరఫరా అయింది సగమే.. జిల్లాలో ప్రస్తుతం సాగులో ఉన్న వివిధ పైర్లకు వ్యవసాయాఽఽధికారుల సిఫార్సు మేరకు 90 వేల టన్నుల యూరియా అవసరం ఉంది. అయితే నేటికి ఇందులో సగమే వచ్చింది. వీటిని కొంతమంది డీలర్లు బ్లాక్ చేస్తున్నారు. సాగులో ఉన్న వరి ఈ చిత్రంలో కనిపిస్తున్న పేరం విష్ణు వరికుంటపాడు మండలం గణేశ్వరపురానికి చెందిన రైతు. మూడెకరాల్లో వరిని సాగు చేశారు. గత ప్రభుత్వ హయాంలో పైర్లకు అవసరమైన కాంప్లెక్స్, యూరియా ఎరువులు గ్రామంలోని ఆర్బీకేలో లభించేవి. అయితే ప్రస్తుతం ఇవి రాలేదు. దీంతో సమీపంలోని పట్ణణాలకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. రవాణా రూపంలో ఒక్కో బస్తాకు రూ.50 చొప్పున వెచ్చిస్తున్నారు. యూరియాను రూ.350కు కొనుగోలు చేస్తున్నారు. గతంలో దీన్ని రూ.266కు ఇంటి వద్దే పొందేవారు. గత ప్రభుత్వ హయాంలో నాటి సీఎం జగన్మోహన్రెడ్డి రైతులకు అండగా నిలిచారు. సీజన్కు ముందే సాగు విస్తీర్ణానికి సరిపడా ఎరువులను సిద్ధం చేసేవారు. ఆర్బీకేల ద్వారా ఎమ్మార్పీ ధరలకే నాణ్యమైన ఎరువులను గ్రామాల్లో సరఫరా చేశారు. నకిలీ ఎరువులను వ్యాపారులు విక్రయించకుండా, అధిక ధరలకు అమ్మకుండా ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరాక గతేడాది రబీ సీజన్లో వివిధ రకాల కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచి రూ.ఐదు కోట్ల భారాన్ని అన్నదాతలపై మోపారు. ఈ ఖరీఫ్ సీజన్లోనూ వీటిని తగ్గించలేదు. గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువుల సరఫరాను కూటమి ప్రభుత్వం నిలిపేసింది. దీంతో వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి యూరియాకు కృత్రిమ కొరత సృష్టించిఽ ధరలు పెంచి దోచుకుంటున్నారు. యూరియా కృత్రిమ కొరత ధరలు పెంచి దోచుకుంటున్న వ్యాపారులు చోద్యం చూస్తున్న వ్యవసాయాధికారులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు జిల్లాలో రైతుల అవసరాల మేరకు ఎరువులను అందుబాటులో ఉంచుతున్నాం. జిల్లాలో ఈ సీజన్లో సాధారణం కంటే రెట్టింపు స్ధాయిలో వరిని సాగు చేశారు. నిర్దేశించిన దాని కంటే అధిక మొత్తంలో యూరియాను వేస్తున్నారు. దీంతో కొంత సమస్య ఉంది. మరో ఎనిమిది వేల టన్నుల యూరియా త్వరలో రానుంది. వీటిని సొసైటీ, రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతాం. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు. – సత్యవాణి, జిల్లా వ్యవసాయాధికారి -
నిందితుల కోసం ముమ్మర గాలింపు
ఉదయగిరి: పట్టణంలో సంచలనం రేపిన మహమ్మద్ హమీద్ హత్య కేసులో నిందితుల కోసం గాలింపు చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు. నిందితులు ఉమర్ అలీ, హనీఫ్ను పట్టుకునేందుకు గానూ రెండు ప్రత్యేక బృందాలను కలిగిరి సీఐ వెంకటనారాయణ, ఎస్సై ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కావలి డీఎస్పీ శ్రీధర్ ఏర్పాటు చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఈ హత్యలో పలువురి ప్రమేయం ఉండొచ్చనే కోణంలో విచారణ జరుపుతున్నారు. హత్యానంతరం స్కూటీలో గోదాము వరకెళ్లి, అక్కడ ఉంచిన కారులో పరారైన విషయంలో ఎవరెవరు సహకరించారనే కోణంలో ఆరాతీస్తున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లాలోని ఓ రహస్య ప్రదేశంలో నిందితులు తలదాచుకున్నారనే ప్రచారం జరుగుతోంది. నిందితులను పోలీసులకు అప్పగించేందుకు ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన ఓ వ్యక్తి సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. రెండు రోజుల్లో లొంగిపోతారని ఓవైపు.. పోలీసుల అదుపులో ఇప్పటికే ఉన్నారనే ప్రచారమూ జరుగుతోంది. -
ప్రమాణాలు పాటించని హోటళ్లపై చర్యలు
నెల్లూరు(బారకాసు): కార్పొరేషన్ నిర్దేశించిన ప్రమాణాలను నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని రెస్టారెంట్లు, హోటళ్లు తప్పక పాటించాలని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎంహెచ్ఓ చైతన్య స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వివిధ రెస్టారెంట్లు, హోటళ్లను ఆకస్మికంగా ఆదివారం తనిఖీ చేశారు. ట్రేడ్ లైసెన్స్లు, ఎన్ఓసీని పరిశీలించారు. వంటశాలల్లో నిర్వహణ తీరును పర్యవేక్షించారు. తయారీదారులు, సర్వర్ల వ్యక్తిగత పరిశుభ్రతను మెరుగుపర్చాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడారు. హోటళ్లలో ప్రమాణాలను మెరుగుపర్చేలా నోటీసులను జారీ చేయాలని ఆదేశించారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగంపై అవగాహనను పెంపొందించుకొని, వస్త్ర సంచులనే వినియోగించాలని కోరారు. నెల్లూరు నగరపాలక సంస్థ, ఆహార ప్రమాణాల భద్రత సంస్థల ఆధ్వర్యంలో తనిఖీలను త్వరలో నిర్వహించనున్నామని వెల్లడించారు. -
వ్యసనాలకు బానిసలై నేరాలు
● దోపిడీ ముఠా అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): వ్యసనాలకు బానిసలైన యువకులు వాటిని తీర్చుకునేందుకు సరిపడా నగదు కోసం ముఠాగా ఏర్పడి దోపిడీకి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. నగరంలోని వేదాయపాళెం పోలీస్స్టేషన్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో నిందితుల వివరాలను ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. నెల్లూరు రూరల్ మండలం చంద్రబాబునగర్కు చెందిన విజయ్ అలియాస్ పుండా, సుధీర్, సిరాజ్, పోలీస్ కాలనీ ప్రాంతానికి చెందిన అనిల్, ఓ ప్రైవేట్ స్కూల్ సమీపంలో నివాసం ఉంటున్న సాయికుమార్ పెద్దగా చదువుకోలేదు. వ్యసనాలను తీర్చుకునేందుకు సరిపడా నగదు కోసం దోపిడీలకు తెరలేపారు. ఇందులో భాగంగా తల్పగిరికాలనీ సమీపంలో నాగేంద్ర అనే వ్యక్తిని కత్తులతో చంపుతామంటూ ఈ నెల 11వ తేదీ సాయంత్రం బెదిరించి అతని ఫోన్ పే ద్వారా రూ.ఐదు వేలను ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. విషయాన్ని బయట చెప్తే చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఇన్స్పెక్టర్ నేతృత్వంలో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చంద్రబాబునగర్ సమీపంలోని ఖాళీ ప్లాట్ల వద్ద నిందితులను అరెస్ట్ చేశారు. ఎస్సై నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రసన్న ఇంట్లో దాడిపై కేసు నమోదు
సాక్షిప్రతినిధి, నెల్లూరు: మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లో టీడీపీ మూకలు సాగించిన విధ్వంసంపై ఎట్టకేలకు పోలీసు అధికారులు స్పందించారు. ఘటన జరిగి ఆరు రోజుల తర్వాత నెల్లూరు దర్గామిట్ట పోలీసులు నామమాత్రపు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఆదివారం దర్గామిట్ట ఇన్స్పెక్టర్ రోశయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి అందుకు దారి తీసిన పరిస్థితుల వివరాలను ప్రసన్నకుమార్రెడ్డి నుంచి సేకరించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, వారి ముఖ్య అనుచరుల ప్రోద్బలంతో ఈ నెల 7వ తేదీ రాత్రి సుమారు 9 గంటల సమయంలో టీడీపీ మూకలు మారణాయుధాలతో సుజాతమ్మ కాలనీలోని ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లోకి అక్రమంగా చొరబడి విధ్వంసం సృష్టించారు. ప్రసన్నకుమార్రెడ్డిని చంపేస్తామని బెదిరించి ఇంట్లోని వారిపై దాడి చేశారు. ఇంటి గోడలు మినహా ప్రతి గదిలోని వస్తువులు, ఫర్నీచర్తో సహా ధ్వంసం చేశారు. ఈ ఘటనపై అదే రోజు అర్ధరాత్రి ప్రసన్న అనుమానితుల పేర్లను ఊటంకిస్తూ వేమిరెడ్డి దంపతులు తనను హత్య చేయించేందుకు పథకం పన్నారని నగర డీఎస్పీ పి.సింధుప్రియకు ఫిర్యాదు చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరారు. అయితే దర్గామిట్ట పోలీసులు జీడీ ఎంట్రీతో సరి పెట్టారు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసు అధికారులు కేసు నమోదు చేయడంలో జాప్యం చేస్తుండడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనలు తీవ్రతరం చేశారు. మరో వైపు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. ఇది ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని పోలీసు అధికారుల్లో భయం మొదలైంది. దీంతో ఎట్టకేలకు ఆరు రోజుల అనంతరం శనివారం రాత్రి 189(4), 329(4), 324(5), 332(సీ), 351(2), ఆర్/డబ్ల్యూ(5) 190 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదులో అనుమానితుల పేర్లతోపాటు పాటు వేమిరెడ్డి దంపతుల ప్రోద్బలంతోనే దాడి జరిగిందని పేర్కొన్నప్పటికీ పోలీసు అధికారులు మాత్రం గుర్తుతెలియని వ్యక్తులు దాడులకు పాల్పడినట్లు ఎఫ్ఐఆర్లో పొందుపరచడం గమనార్హం. ఆరో రోజుల తర్వాత నామమాత్రపు సెక్షన్లతో ఎఫ్ఐఆర్ దాడికి పాల్పడిన నిందితుల పేర్లు ఇచ్చినా నమోదు చేయని వైనం ఘటనా స్థలంలో వివరాల సేకరణ -
రెండో రోజూ.. అదే ఉత్సాహం
నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రెవెన్యూ క్రీడలు రెండో రోజు శనివారం ఉత్సాహంగా జరిగాయి. క్రీడాకారులతో కలిసి కలెక్టరేట్ టీమ్ తరఫున షటిల్, టెబుల్ టెన్నిస్, క్యారమ్స్ పోటీల్లో కలెక్టర్ ఆనంద్ పాల్గొని ఉత్తమ తీరును కనబర్చారు. పలు క్రీడాంశాల్లో పాల్గొంటున్న క్రీడాకారులను పరిచయం చేసుకొని బాగా ఆడాలని ప్రోత్సహించారు. డీఆర్వో హుస్సేన్ సాహెబ్, ఆత్మకూరు, కావలి ఆర్డీఓలు పావని, వంశీకృష్ణ, జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి యతిరాజ్, రెవెన్యూ అసోసియేషనన్ జిల్లా అధ్యక్షుడు అల్లంపాటి పెంచలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. – నెల్లూరు(స్టోన్హౌస్పేట) షటిల్ ఆడుతూ.. వాలీబాల్ పోటీల్లో తలపడుతూ.. -
సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి వెండి బిస్కెట్ల సమర్పణ
మోపిదేవి: కృష్ణా జిల్లా మోపిదేవిలోని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి 2.3 కిలోల వెండి బిస్కెట్లను కందుకూరుకు చెందిన తాళం నితిన్కుమార్ కుటుంబసభ్యులు శనివారం సమర్పించారు. స్వామివార్లను దర్శించుకున్న అనంతరం వీటిని ఈఓ దాసరి శ్రీరామవరప్రసాదరావుకు అందజేశారు. అనంతరం దాత కుటుంబసభ్యులను ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ, నౌడూరి సుబ్రహ్మణ్యశర్మ, వెంకటేశ్వరరావు, కిశోర్ తదితరులు పాల్గొన్నారు. పాముకాటుకు మహిళ మృతి సీతారామపురం: పాముకాటుకు మహిళ మృతి చెందిన ఘటన మండలంలోని అయ్యవారిపల్లి సమీపంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. వేప చెట్ల వద్ద వేప విత్తనాలను ఏరుకునేందుకు గానూ సింగారెడ్డిపల్లిలోని ఎస్సీ కాలనీకి చెందిన అంకి పుష్ప (39) గ్రామానికి చెందిన మరో మహిళతో కలిసి అయ్యవారిపల్లి – దేవిశెట్టిపల్లి మార్గంలోని పొలాల గట్ల వద్దకెళ్లారు. ఈ క్రమంలో విషసర్పం కాటేయడంతో కేకలేస్తూ సహచర మహిళ వద్దకెళ్లి విషయాన్ని చెప్పి అపస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికుల సాయంలో పుష్పను అయ్యవారిపల్లికి తీసుకొచ్చి 108లో స్థానిక పీహెచ్సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. కాగా పుష్ప భర్త నెలన్నర క్రితమే అనారోగ్యంతో మృతి చెందారు. మృతురాలికి సంతానం లేరు. గుర్తుతెలియని వ్యక్తి మృతి మనుబోలు: గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని జాతీయ రహదారిపై కొండూరుసత్రం సమీపంలో శనివారం చోటుచేసుకుంది. కొండూరుసత్రం సమీపంలోని పవర్ గ్రిడ్ ఎదురుగా ఓ వ్యక్తి గాయాలతో మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన వాహనచోదకులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి ఎస్సై శివరాకేష్ చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. శవ పంచనామా నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడు యాచకుడై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కాకాణికి రెండు రోజుల పోలీస్ కస్టడీ
నెల్లూరు (లీగల్): ఎన్నికల సమయంలో ముత్తుకూరు మండలం పంటపాళెంలో అక్రమంగా మద్యం నిల్వలు ఉంచారని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిఫై ఇందుకూరుపేట ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు అక్రమంగా నమోదు చేసిన కేసులో విచారణ నిమిత్తం శనివారం నుంచి రెండు రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ నెల్లూరు స్పెషల్ ఎకై ్సజ్ కోర్టు (ఇన్చార్జి) న్యాయమూర్తి నిషాద్ నాజ్ షేక్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాకాణిని 12వ తేదీ ఉదయం 8 గంటలకు విచారణ నిమిత్తం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఎకై ్సజ్ అధికారులు కస్టడీకి తీసుకోవాలని, సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేయాలని, 13వ తేదీ సాయంత్రం 5 గంటలకు అయనకు వైద్య పరీక్షలు చేయించి మెడికల్ సర్టిఫికెట్తో కోర్టులో హాజరు పరచాలన్నారు. విచారణ సమయంలో థర్డ్ డిగ్రీ ఉపయోగించొద్దని ఉత్తర్వురులో పేర్కొన్నారు. న్యాయవాది సమక్షంలో గోవర్ధన్రెడ్డిని విచారణ జరపాలన్నారు. కాకాణిని కస్టడీ ఇవ్వాలని ఇందుకూరుపేట ఎకై ్సజ్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై పోలీసుల తరఫున ఏపీపీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ కేసులో గోవర్ధన్రెడ్డి పాత్ర ఉందని విచారించడానికి ఏడు రోజులు కస్టడీ అవసరం ఉందన్నారు. కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, ఉమమహేశ్వరరెడ్డి, ఎంవీ విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లేవని కేవలం రాజకీయ కక్షతో కేసులో ఇరికించారని పోలీస్ కస్టడీ ఇవ్వాల్సిన అవసరం లేదని వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి గోవర్ధన్ రెడ్డిని రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీ ఇస్తూ ఉత్తర్వులిచ్చారు. వరదాపురంమైనింగ్ కేసులో నిరాకరణ నెల్లూరు (లీగల్): పొదలకూరు మండలం వరదాపురంలోని భూముల్లో అక్రమ మైనింగ్ జరిపారని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై పొదలకూరు పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. గోవర్ధన్రెడ్డిని పోలీస్ కస్టడీ కోరుతూ సబ్ డివిజన్ పోలీస్ అధికారి, నెల్లూరురూరల్ పోలీస్లు నెల్లూరు 5వ అదనపు జిల్లా (స్పెషల్ ఎస్సీ, ఎస్టీ) కోర్టులో పిటి షన్ దాఖలు చేశారు. పోలీ సుల తరఫున ప్రత్యేక పీపీ విజయమ్మ వాదనలు వినిపించారు. కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, ఎంవీ విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి, తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఎన్. సరస్వతి పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ను తిరస్కరిస్తూ విచారణకు నిరాకరించారు. -
అవకాశమిచ్చి.. అధికారం కట్టబెడితే..
● కాసులకు కక్కుర్తిపడి పచ్చకండువా కప్పుకున్న జెడ్పీ వైస్ చైర్పర్సన్ ఇందుకూరుపేట: రాష్ట్రంలోనే మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళకు అవకాశమిచ్చి.. జెడ్పీ వైస్ చైర్పర్సన్ అధికారం కట్టబెడితే.. ఇప్పుడు టీడీపీ నేతల ప్రలోభాలకు తలొగ్గి పచ్చకండువా కప్పుకున్నారు. మండలంలోని మైపాడు గ్రామానికి చెందిన శ్రీహరికోట జయలక్ష్మి ఇందుకూరుపేట జెడ్పీటీసీగా వైఎస్సార్సీపీ తరఫున అప్పటి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి గెలిపించారు. మత్స్యకార సామాజిక వర్గానికి గుర్తింపు కల్పించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమెకు సముచిత స్థానం కల్పించాలని నెల్లూరు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలుగా ఎన్నుకోవాలని నేరుగా ఆదేశించారు. దీంతో ఒక్కసారిగా ఆ సామాజిక వర్గంలో ఎప్పుడూ లేని విధంగా ఈ హోదా దక్కడంతో వారిలో ఆనందం వెల్లివిరిసింది. తాజాగా టీడీపీలో చేరిక జెడ్పీ వైస్ చైర్పర్సన్ జయలక్ష్మి శుక్రవారం కోవూ రు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో పచ్చకండువా కప్పుకుంది. అందుకు ఆమెను భారీ మొత్తంతో ప్రలోభ పెట్టినట్లు ఆ సామాజికవర్గంలో చర్చ జరుగుతోంది. మైపాడుకు చెందిన టీడీపీ నేత దువ్వూరు కళ్యాణ్కుమార్రెడ్డి నేరుగా ఆమెను తన కారులో ఎక్కించుకొని ఎమ్మెల్యే నివాసానికి తీసుకెళ్లి కండువా కప్పించినట్లు తెలిసింది. మత్స్యకారులను గుర్తించి ఈ పదవి ఇచ్చారని, కానీ నమ్మక ద్రోహం చేస్తూ జయలక్ష్మి డబ్బుకు అమ్ముడుపోయి తమకు తీరని మచ్చను తెచ్చారని మత్స్యకార నాయకులు పలువురు విచారం వ్యక్తం చేశారు. -
ధాన్యం కొనుగోళ్లకు సహకరించండి
నెల్లూరు (పొగతోట): రానున్న సీజన్లో రైతులను ఇబ్బందులు పెట్టకుండా ధాన్యం కొనుగోలుకు సహకరించాలని డీఎస్ఓ విజయ్కుమార్, సివిల్ సప్లయ్స్ డీఎం అర్జున్రావు కోరారు. నగరంలోని పౌరసరఫరాల కార్యాలయంలో రైస్ మిల్లర్లతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. గత సీజన్లో ధాన్యం కొనుగోళ్ల విషయమై పీపీసీల్లో ఏర్పడిన సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని, వీటిని పరిష్కరించి ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతాన్ని పరిశీలించే పరికరాలను ఎలాంటివైతే ఏర్పాటు చేశారో అవే రైస్మిల్లుల్లో ఉండేలా చూడాలని సూచించారు. సీఎమ్మార్కు సంబంధించిన బ్యాంక్ గ్యారెంటీలను రైస్మిల్లర్లు తప్పక ఇవ్వాలని చెప్పారు. ధాన్యం వాహనాలు మిల్లులకొచ్చిన అనంతరం ఆరు గంటల్లో అన్లోడ్ చేయాలని, వీటికి జీపీఎస్ తప్పక ఉండాలన్నారు. అనంతరం రైస్ మిల్లర్ల నేతలు మాట్లాడారు. రూ.150 కోట్లకుపైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వీటిని చెల్లిస్తే సీఎమ్మార్కు ముందుకొస్తామని వివరించారు. సమస్యలను మంత్రి దృష్టికి ఆర్నెల్ల క్రితమే తీసుకెళ్లినా, నేటికీ పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
జలాశయానికి వరద ప్రవాహం
సోమశిల: జలాశయం నీటి మట్టం పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలం నుంచి జలాలు దిగువకు విడుదల చేసిన నేపథ్యంలో సోమశిలకు క్రమేణా నీటి ప్రవాహం రానుంది. శుక్రవారానికి ఆదినిమ్మాయపల్లి రెగ్యులేటర్ ద్వారా 1,131 క్యూసెక్కుల నీరు జలాశయానికి చేరుతున్నట్లు ప్రాజెక్ట్ ఈఈ శ్రీనివాసులు తెలిపారు. మరికొన్ని రోజులు ఈ వరద ప్రవాహం ఇలానే కొనసాగితే 35 టీఎంసీలకు చేరుకునే అవకాశం ఉందని అధికారుల సమాచారం. ప్రస్తుతం జలాశయంలో 28.660 టీఎంసీలు ఉన్నాయి. పెన్నా డెల్టాకు 2,650 క్యూసెక్కులు, ఉత్తర కాలువకు 375, దక్షిణ కాలువకు 400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అభ్యసన సామర్థ్యాన్ని మెరుగు పరచండి ● కలెక్టర్ ఆనంద్ నెల్లూరురూరల్: ప్రాథమిక తరగతుల విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని మెరుగు పరిచేందుకు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు అందరూ సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ ఒ. ఆనంద్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో విద్యార్థుల ప్రావీణ్యత గురించి నిర్వహించిన పరాఖ్ సర్వేక్షన్ సర్వే, 2024 ఫలితాలపై డీడీఈఓలు, ఎంఈఓలు, డైట్ అధ్యాపకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కలెక్టర్ విస్తృతంగా చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు అధికారులందరూ కలిసి మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల్లో గుణాత్మక మార్పు తెచ్చేందుకు కృషి చేయాలన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో పిల్లల విద్యా సంబంధ విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థుల నాణ్యత ప్రమాణాలను పెంచాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో మోడల్ స్కూల్స్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ఉత్సాహపడే విధంగా వాటిని తయారు చేయాలన్నారు. డీఈఓ బాలాజీరావు మాట్లాడుతూ గతేడాది జిల్లాలోని 108 పాఠశాలల్లో 3, 6, 9 తరగతులకు చెందిన 2,927 మంది విద్యార్థులు, 379 మంది ఉపాధ్యాయులు ఈ సర్వేలో పాల్గొన్నారన్నారు. ఉపాధ్యాయుల ప్రమేయం లేకుండా పిల్లలు స్వతహాగా ఈ సర్వేలో పాల్గొనేలా నిర్వహించామన్నారు. ప్రాథమిక తరగతుల నుంచి ఉన్నత పాఠశాల తరగతులకు వచ్చిన విద్యార్థుల్లో కొన్ని అంశాల్లో ప్రావీణ్యత తగ్గడం గమనించామన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో సమగ్రశిక్ష ఏపీఓ వెంకటసుబ్బయ్య ఇతరులు పాల్గొన్నారు. -
వసతిగృహ సంక్షేమాధికారులతో సమావేశం
ఉదయగిరి: జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ పసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శోభారాణి పేర్కొన్నారు. ఉదయగిరి డివిజన్ పరిధిలోని వసతి గృహ సంక్షేమాధికారులతో స్థానిక ఏఎస్డబ్ల్యూఓ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. వసతిగృహాల్లో 100 మంది చొప్పున విద్యార్థులను చేర్పించాలని సూచించారు. కొన్ని చోట్ల 35 నుంచి 75 మందే ఉన్నారని, నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 64 వసతిగృహాల్లో మరమ్మతు పనులు జరుగుతున్నాయని, ఇవి 85 శాతం మేర పూర్తయ్యాయన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పీహెచ్సీ వైద్యులతో ఆరోగ్య పరీక్షలను ప్రతి నెలా నిర్వహించాలని సూచించారు. మెనూ మేరకు భోజనాన్ని అందించాలని కోరారు. ఏఎస్డబ్ల్యూఓ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతమ్మ.. రాచరిక పాలన కాదు
కోవూరు: మాజీమంత్రి, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని ‘కట్టిపడేసి నీ కళ్ల దగ్గర పడేయాలి’ అంటవా?. ఇది రాజరిక పాలన కాదు, ప్రజాస్వామ్యం. ప్రజలే నీకు తగిన బుద్ధి చెబుతారు’ అంటూ వైఎస్సార్సీపీ మహిళా నేతలు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని హెచ్చరిచ్చారు. శుక్రవారం కోవూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీసునంద, అధికార ప్రతినిధి మల్లి నిర్మల, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు వేంకట జ్యోతి, కొడవలూరు ఎంపీపీ జ్యోతి, కోవూరు జెడ్పీటీసీ శ్రీలత, నేతలు సంపూర్ణ, షకీలా, ప్రవళ్లిక, ఉమా తదితరులు మాట్లాడారు. ప్రశాంతమ్మ అహంకారంగా మాట్లాడుతున్న తీరు రాష్ట్ర ప్రజలందరికీ అసహ్యం కలిగేలా ఉందన్నారు. రాజ్యాధికారం మీద మత్తులో మాట్లాడే భాష అని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలే తగిన తీర్పు ఇస్తారన్నారు. ప్రసన్న ఇంటిపై దాడి జరిగి ఐదు రోజులు గడిచినా ఇప్పటికీ నిందితులను అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లోకి చొరబడి కారు ధ్వంసం చేయడం, రూ.లక్షల విలువైన వస్తువులను ధ్వంసం చేయడం రాజ్యాంగ వ్యతిరేక చర్యలని పేర్కొన్నారు. బండారు మాటలు మరిచిపోలేరు టీడీపీ నేత బండారు సత్యనారాయణ మాజీమంత్రి ఆర్కే రోజాపై అసభ్యంగా మాట్లాడిన మాటలు ఇప్పటికీ ప్రజలకు గుర్తున్నాయన్నారు. ఆ సమయంలో ఉన్న సీఎం జగన్మోహన్రెడ్డి న్యాయపద్ధతిలో వ్యవహరించిన తీరును గుర్తు చేశారు. అప్పుడు అదే జగన్మోహన్రెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించారన్నారు. ప్రతి ఒక్కరికీ కుటుంబం ఉంటుందని, ఆ కుటుంబంలో అమ్మ, అక్కా, చెల్లెళ్లు ఉంటారనే విషయాన్ని ప్రశాంతిరెడ్డి కూడా గుర్తించాలన్నారు. మహిళగా ప్రశాంతమ్మ ఇతర మహిళల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత ఉందని సూచించారు. దివంగత మాజీమంత్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి జిల్లాకు గొప్ప పేరు తీసుకొచ్చారని, ఆయన భార్య శ్రీలక్ష్మమ్మ దాడి సమయంలో ఇంట్లో ఉండడాన్ని కూడా బేఖాతర్ చేయకపోవడం చూస్తే వీరి అరాచకానికి అద్దం పడుతుందన్నారు. జిల్లాలో ఒకే ఒక మహిళా ఎమ్మెల్యే ఉన్నప్పుడు మహిళలకు మేలు జరుగుతుందనుకున్నారు. కానీ ఆమె పేరులో ప్రశాంతి ఉన్నా.. చర్యల్లో మాత్రం అశాంతి కనబడుతోందని వ్యాఖ్యానించారు. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు పార్టీ సమావేశం జరుగుతుందని తెలుసుకుని ముందుగానే పోలీసులు అక్కడికి చేరుకోవడంపై నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారు ఎవరో తెలిసినా ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. న్యాయం జరగకపోవడంతో కోవూరు సెంటర్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించేందుకు ర్యాలీగా వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమావేశంలో పలు గ్రామాల మహిళా సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మాజీమంత్రిని కట్టేసి నీ కాళ్ల దగ్గర పడేయమంటావా? ఇది ప్రజాస్వామ్య పాలన అని గుర్తుపెట్టుకో వైఎస్సార్సీపీ మహిళా నేతల హెచ్చరిక -
కరేడు రైతులకు అండగా నిలవాలి
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు కందుకూరు: బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా కరేడు గ్రామ రైతులు చేస్తున్న పోరాటానికి సీపీఎం శ్రేణులు ప్రత్యక్షంగా మద్దతు తెలిపి అండగా నిలవాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సూచించారు. బుధవారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన సీపీఎం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు కృషి చేయాలన్నారు. సీఐటీయూ జిల్లా కె.అజయ్కుమార్ మాట్లాడుతూ సీపీఎం, సీఐటీయూ శ్రేణులు నిరంతరం రైతుల వెంట ఉండి వారికి అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కె. ప్రభాకర్రెడ్డి, సీనియర్ నాయకులు ముప్పరాజు కోటయ్య, గుడ్లూరు, ఉలవపాడు మండలాల ప్రాంతీయ కమిటీ కార్యదర్శులు జీవీబీ కుమార్, ఎస్ఏ గౌస్, నాయకులు మాదాల రమణయ్య, దువ్వూరి జాన్, పొందూరి కొండమ్మ, పొన్నం రామలక్ష్మమ్మ, కత్తి సుజాత, ఎం.లలితమ్మ, దాసరి రామ్మూర్తి, ఎస్కే మున్వర్ సుల్తానా, టి.వెంకట్రావు, ఎస్కే మల్లిక, ఎం.పద్మ, షేక్ ఆస్మా, అనూరాధ, పొట్లూరి రవి పాల్గొన్నారు. -
తెలుగు తమ్ముళ్లకే పాసులు
నెల్లూరు(టౌన్): రొట్టెల పండగ సందర్భంగా ప్రత్యేక దర్శనాల కోసం ఇచ్చిన పాసుల్లో అధిక శాతం తెలుగు తమ్ముళ్ల వద్దకే వెళ్లినట్లు విమర్శలున్నాయి. దీంతో బారాషహీద్లను దర్శించుకునేందుకు వచ్చిన వేలాది మంది భక్తులు క్యూలైన్లో పడిగాపులు కాశారు. స్థానికంగా ఉండే వారికి పాస్లు అందలేదని చెబుతున్నారు. మీడియా వర్గాలకు కూడా గతంలో మాదిరి కాకుండా తక్కువ సంఖ్యలో ఇచ్చారు. అయితే పాసుల పేరుతో కొంతమందిని క్యూలైన్లతో సంబంధం లేకుండా నేరుగా దర్గాలోకి ప్రవేశించారు. టీడీపీ నాయకులు దగ్గరుండి పంపించిన సందర్భాలున్నాయి. పురుషులు, మహిళలకు వేర్వేర్లుగా క్యూలైన్లు ఉన్నా ఎక్కడా పాటించలేదు. అందరిని ఒకే లైన్లో పంపడంతో మహిళా భక్తులు అసౌకర్యానికి గురయ్యారు. టీడీపీ నేతల తీరు కారణంగా క్యూలైన్లు రోడ్డు వద్దకు వచ్చిన పరిస్థితి ఉంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో తాగునీటికి ఇబ్బంది పడిన వారెందరో. కొన్నిచోట్ల క్యూలైన్లకు టెంట్లు ఏర్పాటు చేయలేదు. చిన్నపిల్లలతో వచ్చిన తల్లిదండ్రులు గంటల తరబడి ఎండలోనే నిరీక్షించారు. -
వేమిరెడ్డి దంపతుల ప్రోద్బలంతోనే దాడి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ప్రోద్బలంతో వారి ముఖ్య అనుచరులు, టీడీపీ రౌడీ మూకలు మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని హత్య చేయాలనే ఆయన ఇంటి మీద దాడి చేశారని, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోవూరు జెడ్పీటీసీ కౌరవగిరి శ్రీలత, వైఎస్సార్సీపీ మహిళా నేతలు పోలీసు అధికారులను కోరారు. ఆమె బుధవారం రాత్రి మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీసునంద, మరికొందరు నేతలు, కార్యకర్తలతో కలిసి దర్గామిట్ట ఎస్ఐ రమేష్బాబుకు వినతిపత్రం అందజేశారు. శ్రీలత మాట్లాడుతూ సోమవారం రాత్రి 9 గంటల సమయంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిల ముఖ్య అనుచరులు కోడూరు కమలాకర్రెడ్డి, జెట్టి రాజగోపాల్రెడ్డి, ఇంత మల్లారెడ్డి, పల్లా సుధాకర్రెడ్డి, పెనుబల్లి కృష్ణచైతన్య, గుడిహరి కుమార్రెడ్డి, సాయితేజరెడ్డి, గురు మహేష్ మరో వంద మందికిపైగా టీడీపీ రౌడీమూకలు నెల్లూరు సుజాతమ్మ కాలనీలోని నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లో విధ్వంసం సృష్టించారన్నారు. ప్రసన్నకుమార్రెడ్డిని చంపాలన్న ఉద్దేశంతోనే ఈ దాడి జరిగిందని, ఆయన ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో ఇంట్లోని ఫర్నీచర్ మొదలు అన్నీ వస్తువులును, బెంజ్కారును ధ్వంసం చేశారన్నారు. ప్రసన్నకుమార్రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మతోపాటు పనిచేసే వారిపై దుండగులు భౌతిక దాడిచేశారన్నారు. విధ్వంసంలో రూ.5 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందన్నారు. ఈ దాడి ఘటనకు సంబంధించిన వీడియోల్లో నిందితుల చిత్రాలు ఉన్నాయన్నారు. ఈ ఘటనపై అదేరోజు అర్థరాత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఫిర్యాదు చేసినా ఇంత వరకూ కేసు నమోదు చేయకపోవడం బాధాకరమన్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలి దర్గామిట్ట పోలీసులకు జిల్లా వైఎస్సార్సీపీ మహిళా నేతల ఫిర్యాదు -
అవినీతిని బయట పెట్టినందుకే అక్రమ బదిలీ
● న్యాయం జరిగే వరకు అమరణ దీక్ష ● భీష్మించిన సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ భాస్కర్ నెల్లూరు (బారకాసు): కావలి మున్సిపాలిటీ కమిషనర్ శ్రావణ్కుమార్ అవినీతిని ప్రశ్నించినందుకు తనను అక్రమంగా చేసిన బదిలీని వెంటనే రద్దు చేయాలని సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ భాస్కర్ డిమాండ్ చేశారు. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలంటూ కోరుతూ ఉద్యోగి బుధవారం నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయ ఆవరణలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ కావలి మున్సిపాలిటీ కమిషనర్ అవినీతిపై ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి తెలియజేసినందుకే తనను అక్రమంగా బదిలీ చేశారని ఆరోపించారు. కమిషనర్ అవినీతిపై ఆధారాలతో సహా మీడియా ముందు బయట పెడతానని తెలియజేశారు. ఇటీవల జరిగిన సచివాలయ ఉద్యోగుల బదిలీల్లో తనకు అన్యాయం జరిగిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కావలి మున్సిపాలిటీ పరిధిలోని సచివాలయంలో వెల్ఫేర్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న తనని అక్రమంగా, అన్యాయంగా సూళ్లూరుపేట మున్సిపాల్టీకి బదిలీ చేశారన్నారు. తాను దరఖాస్తులో ఎంచుకున్న మూడు స్థానాల్లో ఏ ఒక్క స్థానానికి బదిలీ చేసే అవకాశం కల్పించకుండా సూళ్లూరుపేట మున్సిపాలిటీకి బదిలీ చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమి అన్యాయమని అధికారులను అడిగితే బదిలీ చేసిన చోటకే వెళ్లాలంటూ ఆదేశిస్తున్నారన్నారు. అందుకే తనకు న్యాయం జరిగేంత వరకు ఆమరణ దీక్ష చేపడుతున్నట్లు భాస్కర్ స్పష్టం చేశారు. భాస్కర్ తనకు న్యాయం చేయాలంటూ కార్పొరేషన్ కమిషనర్ నందన్ను కలిసి వినతిపత్రం అందజేశారు. యుద్ధ నౌకకు ‘ఉదయగిరి’ పేరు ఉదయగిరి: చారిత్రాత్మక నేపథ్యం ఉన్న ‘ఉదయగిరి’కి భారత ప్రభుత్వం గుర్తింపు కల్పించింది. ఒక యుద్ధ నౌకకు ‘ఉదయగిరి’ అనే పేరును నామకరణం చేశారు. ఎఫ్–35 పేరుతో రూపుదిద్దుకుంటున్న ఈ యుద్ధనౌకను అధికారికంగా ఆగస్టు 26వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తారని విశాఖపట్నం నేవీ లెఫ్టినెంట్ కమాండర్ ప్రశాంత్ వెల్లడించారు. ఈ యుద్ధనౌక 148 మీటర్ల పొడవుతో 40 మిస్సైల్స్ ప్రయోగించేలా రూ.600 కోట్ల వ్యయంతో నౌకను తయారు చేశారు. ఇంత ప్రాధాన్యత కలిగిన యుద్ధనౌకకు ‘ఉదయగిరి’ పేరు పెట్టడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కిలో పొగాకు సగటు ధర రూ.205.22 మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో బుధవారం 569 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 731 బేళ్లు రాగా 569 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. కిలోకు గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.159 లభించింది. వేలంలో 9 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. -
నా పాత్రపై ఆధారాలు చూపించండి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి ప్రభుత్వ వైఫల్యాను ప్రశ్నించమే నేరంగా నాపై ఎన్నో అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఆ కేసుల్లో పోలీసులు నా పాత్ర ఉన్నట్లు ఏ ఒక్క ఆధారం చూపించినా నా తప్పు ఒప్పుకుని ఏ శిక్ష కై నా సిద్ధం అంటూ పోలీసులకు మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి సవాల్ విసిరారు. సాక్షులను బెదిరించి, భయపెట్టి నన్ను కేసుల్లో ఇరికిస్తున్నారంటూ పోలీసులపై ఫైర్ అయినట్లు సమాచారం. కనువూరు చెరువులో అక్రమంగా గ్రావెల్ తరలించారని నమోదు చేసిన అక్రమ కేసులో విచారణ నిమిత్తం వెంకటాచలం పోలీసులు బుధవారం కస్టడీకి తీసుకున్నారు. న్యాయవాది కటారి విద్యాసాగర్రెడ్డి సమక్షంలో పోలీసులు తొలి రోజు కాకాణిని 30 ప్రశ్నలు అడిగారు. అన్నింటికి దీటుగా సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. గ్రావెల్ తరలింపు కేసులో నాపాత్ర ఎందుకు ఉంటుంది. ఆరోపణలు చేయడం, వాటి ఆధారంగా కేసులు నమోదు చేయడం, నిందితులను బెదిరించి, భయపెట్టి చెప్పించడం తప్ప నా పాత్రపై పోలీసులు వద్ద ఏదైనా స్పష్టత ఉందా. ఏదైనా ఆధారం ఉంటే చూపిస్తే నేను స్పదించగలను. మంత్రిగా నా బాధ్యత ఏముంటుంది. ఏదైనా పత్రికల్లో కానీ, సోషల్ మీడియాలో ఏదైనా వార్తలు వస్తే అధికారులకు తగు చర్యలు తీసుకోమ్మని కోరడం, నాకు తెలిసిన బుజ్జయ్యనాయుడు కనువూరు చెరువు మట్టి అక్రమంగా తరలిస్తూ అతని టిప్పర్ ఒక వ్యాన్ను ఢీకొట్టి కొంత మంది చనిపోయారు. అప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. బుజ్జయ్యను స్టేషన్కు తీసుకురాగా ఆయన అక్కడినుంచి తప్పించుకుని హైకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నాడు. బుజ్జయ్యనాయుడు టీడీపీ నాయకుడు. సోమిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా చెలామణి అవుతున్నాడు. నేను ఎప్పుడూ నిబంధనలు వ్యతిరేకించి విరుద్ధంగా పని చేయమని అధికారులెవరికి చెప్పలేదు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం నడుచుకోవడం అధికారుల పని. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకోవడం పోలీస్ శాఖ బాధ్యత. ఇలాంటి బాధ్యతలను నాకు ఆపాదించడం ఎంత వరకు సబబు అని పోలీసులను ప్రశ్నించారని సమాచారం. కాకాణి అడిగిన ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలినట్లు తెలిసింది.నెల్లూరు (లీగల్): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని వెంకటాచలం ఇన్స్పెక్టర్ పి.సుబ్బారావు మొదటి రోజు విచారించారు. కనుపూరు చెరువులో అక్రమంగా గ్రావెల్ తవ్వారని నమోదైన అక్రమ కేసులో జిల్లా కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న కాకాణిని కోర్టు అనుమతితో వెంకటచలం పోలీసులు రెండు రోజుల విచారణ నిమిత్తం బుధవారం జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి తరలించారు. న్యాయవాది కాటూరు విద్యాధర్రెడ్డి సమక్షంలో గోవర్ధన్ రెడ్డిని వెంకటచలం పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ పి.సుబ్బారావు 30 ప్రశ్నలు అడిగారు. వెంకటాచలం మండలం ఇడిమేపల్లి వీఆర్ఓ దేవరపాటి నాగేంద్రబాబు, కురిచెర్లపాడు వీఆర్వో కవరగిరి వినయ్ మధ్యవర్తుల సమక్షం విచారణ జరిగింది. సాయంత్రం 5 గంటలకు కాకాణిని జిల్లా కేంద్ర కారాగారానికి తరరించారు. -
కార్మిక లోకం భారీ ర్యాలీ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): అభిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సార్వత్రిక సమ్మెలో భాగంగా బుధవారం నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలంటూ పది సంఘాలకు చెందిన కార్మికులు కదం తొక్కారు. ఏబీఎం కాంపౌండ్ నుంచి ర్యాలీగా బయలుదేరి పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహం, ఏసీ బొమ్మ సెంటర్, గాంధీబొమ్మ సెంటర్ మీదుగా మద్రాస్ బస్టాండ్ వరకు నిర్వహించారు. అక్కడ జరిగిన సభలో సీఐటీయూ నగర కార్యదర్శి నాగేశ్వరరావు, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బి.జయకుమార్రెడ్డి మాట్లాడుతూ, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి శంకర్ కిశోర్లు మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ను రద్దు చేసి పాత చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. 10 గంటల పని విధానాన్ని రద్దు చేసి 8 గంటల విధానాన్ని అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాలకు చెందిన నవీన్కుమార్రెడ్డి, ప్రసాద్రెడ్డి, అజయ్కుమార్, సాగర్, యానాదయ్య, టీవీవీ ప్రసాద్, ప్రసాద్, పెంచలప్రసాద్, శ్రీనివాసులు, సూర్యనారాయణ, కత్తి శ్రీనివాసులు, మూలం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కోలాహలంగా..
నెల్లూరు(బారకాసు): నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండగ చివరి ఘట్టానికి చేరింది. బుధవారం వివిధ రాష్ట్రాల భక్తులు పోటెత్తారు. నగరవాసులు కూడా తరలిరావడంతో స్వర్ణాల తీరం కిటకిటలాడింది. బారాషహీదులను దర్శించుకుని ప్రార్థనలు చేశారు. కాగా పండగ గురువారంతో ముగియనుంది. నాలుగోరోజు స్వర్ణాల ఘాట్ వద్ద ఆరోగ్య, వివాహ, విద్య రొట్టెలకు డిమాండ్ ఏర్పడింది. వేలాది మంది భక్తులకు దర్గా కమిటీ అన్నదానం నిర్వహిస్తోంది. ఆర్టీసీ, దర్గాకు పెరిగిన ఆదాయం రొట్టెల పండగ సందర్భంగా నాలుగు రోజుల్లో ఆర్టీసీకి రాబ డి పెరిగింది. అలాగే భక్తులు లక్షలాదిగా తరలిరావడంతో కానుకల రూపంలో దర్గాకు కూడా ఆదాయం సమకూరింది. భక్తిశ్రద్ధలతో తహలీల్ ఫాతేహా నెల్లూరు(బృందావనం): రొట్టెల పండగ ముగింపు సందర్భంగా తహలీల్ ఫాతేహా కార్యక్రమాన్ని సంప్రదాయంగా బుధవారం మధ్యాహ్నం నిర్వహించారు. ఇన్స్పెక్టర్, ఆడిటర్ వక్ఫ్ బోర్డు షేక్ ఖుదావన్ బారాషహీద్లకు బోర్డు తరఫున గంధం ప్రత్యేక బిందెలో తీసుకొచ్చి, ఖర్జూరం పండ్లతో సమర్పించారు. ముజావర్లు, ఫకీర్లు, గంధ మహోత్సవం నిర్వాహకులు, మతపెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక దువా నిర్వహించారు. అనంతరం పవిత్ర గంధం, ఖర్జూరాలను భక్తులు పంచిపెట్టారు. పండగ నిర్వాహకులు, మతపెద్దలు మాట్లాడుతూ సోమవారం అర్ధరాత్రితో ప్రారంభమైన గంధ మహోత్సవం బుధవారం నిర్వహించిన తహలీల్ ఫాతేహాతో పరిసమాప్తమైందన్నారు. సంప్రదాయంగా గురువారం ఉదయం జరిగే ఖత్ మే జియారత్ (ముగింపు)తో ఐదు రోజులుగా వైభవంగా జరుగుతున్న రొట్టెల పండగ ముగుస్తుందన్నారు. రొట్టెల పండగకు తరలివచ్చిన భక్తులు నాలుగో రోజూ కొనసాగిన రద్దీ బారాషహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు -
రాజకీయ చరిత్రలో చీకటి రోజు
నెల్లూరు (స్టోన్హౌస్పేట): నెల్లూరు రాజకీయ చరిత్రలో ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై దాడి ఘటన చీకటి రోజు అని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలే తప్ప ఇళ్లపై దాడులు చేయడం దారుణమని, హేయమన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం మాజీమంత్రి అనిల్కుమార్యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళి, ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి, కాకాణి పూజిత విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉలికిపడింది : అనిల్కుమార్ విమర్శలు, ప్రతి విమర్శలు ఉండాలే తప్ప ఇళ్లపై దాడులు సమాధానం కాదు ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు దారుణం, హేయం మాజీమంత్రి అనిల్కుమార్, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ నేతలు -
వైఎస్సార్ జయంతి సందర్భంగా..
● నెల్లూరులో రక్తదాన శిబిరం ఏర్పాటు నెల్లూరు(స్టోన్హౌస్పేట): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని మంగళవారం నెల్లూరు నగరంలోని వైఎస్సార్సీపీ నగర కార్యాలయంలో యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆ పార్టీ సిటీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి నాయకులు, యువజన విభాగం నేతలు, కార్యకర్తలతో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళలర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మాట్లాడుతూ వైఎస్సార్ అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన ప్రజా నాయకుడని చెప్పారు. -
ఆరోగ్య సమస్యలు తాళలేక..
● యువకుడి బలవన్మరణం నెల్లూరు(క్రైమ్): ఆరోగ్య సమస్యలు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై నెల్లూరు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. డ్రైవర్స్ కాలనీలో శైలజ, శివకోటాచారి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు మంజునాఽథ్ (25) కొయ్యపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతను కొంతకాలంగా ఫిట్స్తో బాధపడుతున్నాడు. చికిత్స చేయించుకుంటున్నా ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. రెండురోజుల క్రితం శైలజ, శివకోటాచారి చైన్నెలోని కుమార్తె ఇంటికెళ్లారు. మంజునాథ్ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. సోమవారం జ్వరం కారణంగా అతను పనికి వెళ్లలేదు. శైలజ కుమారుడికి ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమె పక్కింట్లో ఉంటున్న వినయ్కు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది. అతను ఇంటికి వెళ్లిచూడగా మంజునాఽథ్ బెడ్రూమ్లోని ఫ్యాన్కు ఉరేసుకుని మృతిచెంది ఉండటాన్ని గమనించాడు. ఈ విషయాన్ని మృతుడి తల్లిదండ్రులకు తెలియజేశాడు. బాధిత తండ్రి శివకోటాచారి మంగళవారం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.చిన్నారులను సంరక్షించి.. నెల్లూరు(క్రైమ్): రొట్టెల పండగ సందర్భంగా పోలీసు అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సోమవారం అర్ధరాత్రి భారీ బందోబస్తు నడుమ గంధ మహోత్సవం జరిగింది. కాగా తప్పిపోయిన 42 మంది చిన్నారులను పోలీసులు సంరక్షించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. క్రైమ్ పార్టీ పోలీసులు ముగ్గురు జేబుదొంగల్ని అదుపులోకి తీసుకుని నగదు, బ్యాగ్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించారు. మంగళవారం ఏఎస్పీ సీహెచ్ సౌజన్య భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. నెల్లూరు కాలువలో మృతదేహంనెల్లూరు సిటీ: నెల్లూరు కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. పోలీసుల కథనం మేరకు.. రూరల్ మండల పరిధిలోని జొన్నవాడ కూడలి వద్ద నెల్లూరు కాలువలో సుమారు 40 సంవత్సరాల వయసున్న వ్యక్తి మృతదేహం కొట్టుకొచ్చింది. మృతుడి వివరాలు లభ్యం కాలేదు. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అతను ఆరురోజుల క్రితం చనిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కండలేరులో 31.397 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 31.397 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 2,300, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 70, హైలెవల్ కాలువకు 70, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
స్వర్ణాల సంబరం
జనసంద్రంగా మారిన స్వర్ణాల చెరువునెల్లూరు(బారకాసు): నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండగకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. బారాషహీద్లకు లేపనం చేసిన గంధాన్ని అందుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. అనంతరం వరాల రొట్టెలు అందుకునేందుకు వచ్చిన వారితో స్వర్ణాల ఘాట్ కిక్కిరిసింది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో మంగళవారం నెల్లూరులోని అన్ని రోడ్లు నిండిపోయాయి. స్వర్ణాల ఘాట్లు కిటకిట రొట్టెల పండగలో ముఖ్యమైన గంధ మహోత్సవం ముగియడంతో భక్తుల తాకిడి పెరిగింది. దర్గాలో బారాషహీద్లను దర్శించుకునేందుకు భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. మూడోరోజు కూడా దర్గా ప్రాంగణంలో అన్నదానం నిర్వహించారు. జిల్లా వైద్యారోగ్యశాఖతోపాటు పలు కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు దర్గా ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాయి. వరాల రొట్టెకు డిమాండ్ స్వర్ణాల తీరంలో పలు రొట్టెలకు డిమాండ్ పెరిగింది. ప్రధానంగా ఉద్యోగం, వివాహం, సంతాన రొట్టెల కోసం గంటల కొద్దీ భక్తులు నిరీక్షించాల్సి వచ్చింది. అధిక మంది ఆయా రొట్టెలను పట్టుకునేందుకు ఘాట్ వద్ద పోటీ పడ్డారు. అలాగే ధన, ప్రమోషన్, చదువు, సౌభాగ్య, విదేశీయాన తదితర రొట్టెలకు కూడా డిమాండ్ ఉంది.ఆధ్యాత్మిక శోభ నెల్లూరు(బృందావనం): మతసామరస్యానికి ప్రతీకగా సింహపురి వేదికగా జరుగుతున్న రొట్టెల పండగ సందర్భంగా బారాషహీద్ దర్గా వద్ద ఆధ్యాత్మిక శోభ నెలకొంది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు జరిగిన బారాషహీద్ల గంధ మహోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. విద్యుద్దీప కాంతుల్లో దర్గా ప్రాంగణం శోభిల్లుతుంటే మరోవైపు బారాషహీద్ల దర్గా ప్రాంగణంలోని స్వర్ణాల చెరువు కిటకిటలాడుతోంది. ప్రాంగణంలో ఏర్పాటైన వివిధ రకాల దుకాణాల వద్ద కోలాహలం నెలకొంది. ఐదురోజుల రొట్టెల పండగలో బుధవారం సంప్రదాయంగా బారాషహీద్లను స్మరిస్తూ ‘తహలీల్ ఫాతేహ’ (చదివింపులు) నిర్వహిస్తారు. భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటారు. గురువారం ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఐదురోజులు పండగను జయప్రదం చేసిన అధికార యంత్రాంగానికి అభినందన కార్యక్రమం జరగనుంది. రొట్టెల పండగకు మూడోరోజూ పోటెత్తిన భక్తులు దర్శనానికి గంటల కొద్దీ నిరీక్షణ -
బలవంతపు భూసేకరణను అడ్డుకుంటాం
కందుకూరు: కరేడు గ్రామ రైతులకు కనీస సమాచారం ఇవ్వకుండా బలవంతంగా భూములు లాక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరేడు పరిధిలో 8,800 ఎకరాల భూములను తీసుకోవడంతోపాటు, 16 గ్రామాల ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. చట్ట ప్రకారం గ్రామసభ నిర్వహించి 80 శాతం మంది గ్రామస్తులు ఆమోదిస్తేనే భూసేకరణ చేయాలనే నిబంధన ఉన్నా కనీసం రైతుల అభిప్రాయాలకు విలువ ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండో సోలార్ కంపెనీకి గతంలో రావూరు, చేవూరు గ్రామాల పరిధిలో భూములు కేటాయించారని, అయినా కూడా ఆ పరిశ్రమను ప్రస్తుతం కరేడు వైపు మార్చడంలో ఉన్న ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదన్నారు. దొనకొండ, పామూరు వద్ద నిమ్జ్కు కేటాయించిన భూములు అనేకం ఉన్నాయని వాటిల్లో ఎందుకు ఏర్పాటు చేయకూడదని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలకు చెందిన వారికే ఉద్యోగాలా? పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్నామని ప్రజలకు భ్రమ కల్పిస్తున్నారని, ఎటువంటి ఉద్యోగాలు రావడం లేదని శ్రీనివాసరావు అన్నారు. ఎక్కువ శాతం ఉద్యోగాలు పక్క రాష్ట్రాలకు చెందిన వారికే దక్కుతున్నాయని, భూములు కోల్పోతున్న వారికి రావడం లేదన్నారు. ఇప్పటికే ఇండో సోలార్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1,800 కోట్ల వరకు సబ్సిడీల రూపంలో వచ్చాయన్నారు. గతంలో కంపెనీ ఏర్పాటును వ్యతిరేకించిన టీడీపీ నాయకులు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. నేడు దేశవ్యాప్త సమ్మె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు బ్రోకర్లుగా మారి కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని తీవ్రంగా శ్రీనివాసరావు విమర్శించారు. కార్మికుల హక్కులను కాపాడేందుకు బుధవారం దేశవ్యాప్తంగా జరిగే కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్రెడ్డి, సీపీఎం నెల్లూరు జిల్లా కార్యదర్శి మూలం రమేష్, కార్యదర్శివర్గ సభ్యుడు కె.అజయ్కుమార్, గుడ్లూరు, ఉలవపాడు, కందుకూరు ప్రాంతీయ కమిటీల కార్యదర్శులు జి.వెంకటేశ్వర్లు, జీవీబీ కుమార్, ఎస్ఏ గౌస్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తోంది సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు -
రేషన్ షాపుల్లో బినామీల బాగోతం
నెల్లూరు(పొగతోట): చౌకదుకాణాల డీలర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. బినామీ పేర్లతో షాపులు నిర్వహిస్తూ పేదల బియ్యం పక్కదారి పట్టిస్తున్నారు. జిల్లాలో 1,513 చౌకదుకాణాలున్నాయి. ప్రతినెలా 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం కార్డుదారులకు అందజేస్తున్నారు. 7.21 లక్షల మంది కార్డుదారులున్నారు. 338 చౌకదుకాణాలు స్వయం, సహాయక గ్రూపు మహిళల ఆధ్వర్యంలో ఉన్నాయి. వీటిలో కొన్నింటిని బినామీ పేర్లతో మార్పులు చేసి సంవత్సరాల నుంచి డీలర్లు నిర్వహిస్తున్నారు. కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. చౌకదుకాణానికి సంబంధించి డీలర్ పేరు, ఐడీ మార్పు చేయాలంటే డీఎస్ఓ కార్యాలయం నుంచి ఫైల్ నిర్వహించాల్సి ఉంది. దీనికి సుమారు వారం నుంచి 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. డీలర్ల మహత్యం, నిమిషాల వ్యవధిలో ఐడీ, ఫొటో మార్పులు జరిగిపోతున్నాయి. గతవారంలో నెల్లూరులోని 50వ నంబర్ దుకాణంలో ఫిర్యాదులు రావడంతో ఏఎస్ఓ అంకయ్య తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో డీలర్ యశోధ అనే మహిళకు బదులు పురుషుడి ఫొటో ఉంది. తనిఖీ అనంతరం యశోధ ఫొటో ప్రత్యక్షమైంది. మరుసటి రోజు డీఎస్ఓ విజయ్కుమార్ తనిఖీలకు వెళ్లగా మహిళ ఫొటో ఆన్లైన్లో దర్శనమిచ్చింది. అదే విధంగా నగరంలో పది దుకాణాలకు సంబంధించి ఫొటోల మార్పులు జరిగినట్లు సమాచారం. నిబంధనలతో పనిలేకుండా.. 6 ఏ కేసు, ఇతర అక్రమాలకు పాల్పడిన డీలర్లను సస్పెండ్ చేసి ఆ దుకాణాన్ని స్వయం సహాయక గ్రూపు మహిళకు నిర్వహించేందుకు అప్పగిస్తారు. మూడు నెలలు మాత్రమే వారి ఆధ్వర్యంలో నిర్వహణకు అవకాశం ఉంది. నిబంధనలకు పాతరేసిన డీలర్లు సంవత్సరాల తరబడి ఆయా దుకాణాలను కొనసాగిస్తున్నారు. ఆన్లైన్లో డీలర్ ఐడీ, ఫొటో మార్పునకు సంబంధించి డీఎస్ఓ కార్యాలయం నుంచి ఫైల్ నిర్వహించి వాటికి డీఎస్ఓ, జాయింట్ కలెక్టర్ అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఈప్రక్రియ పూర్తయిన అనంతరం ఎన్ఐసీ అధికారులు ఆన్లైన్లో ఐడీ, ఫొటో మార్పు చేయాల్సి ఉంది. నెల్లూరు డీలర్ల మాయాజాలం, కంప్యూటర్ ఆపరేటర్ చేతివాటంతో నిమిషాల వ్యవధిలో అవి మారిపోతున్నాయి. ఎస్హెచ్జీల ఆధ్వర్యంలో 338 దుకాణాల నిర్వహణ బినామీల పేర్లతో ఏళ్ల తరబడి కొనసాగింపు తనిఖీల తర్వాత మారిపోతున్న డీలర్ల ఫొటోలు పట్టించుకోని అధికారులు చర్యలు తీసుకుంటాం చౌకదుకాణాల్లో అక్రమాలకు పాల్పడే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్లో డీలర్ల ఫొటో మార్పునకు సంబంధించి పూర్తిస్థాయిలో పరిశీలించి నివేదికలు తెప్పించుకుంటాం. దానికి బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేస్తాం. ఎస్హెచ్జీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుకాణాలకు ఆర్డీఓలు నోటిఫికేషన్ ఇచ్చి డీలర్లను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. – విజయ్కుమార్, డీఎస్ఓ -
దేవుడి దయతో బయట పడ్డా
నెల్లూరు (స్టోన్హౌస్పేట): దేవుడి దయతోనే బయట పడ్డానని, నన్ను అంతమొందించే కుట్ర చేశారని మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆరోపించారు. తమ కుటుంబం 1961 నుంచి రాజకీయాల్లో ఉందని, జిల్లాలోని రాజకీయ కుటుంబాల్లో ఇటువంటి సంప్రదాయం లేదన్నారు. సైద్ధాంతికంగానే తాము పోరాడామని గుర్తు చేశారు. మంగళవారం తన స్వగృహంలో ప్రసన్నకుమార్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో తాను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని కానీ, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిని గాని వ్యక్తిగతంగా విమర్శించ లేదన్నారు. ఎన్నికల్లో విమర్శించుకున్నామని, విమర్శలు, ప్రతి విమర్శలు తప్పవన్నారు. ప్రశాంతిరెడ్డి గురించి తాను ఎక్కడ చెడ్డగా మాట్లాడలేదన్నారు. ఆమే తన గురించి చెడుగా మాట్లాడినా తాను పట్టించుకోలేదన్నారు. ఇటీవల ముదివర్తికి వెళ్లి నియోజకవర్గంలో ప్రసన్నకుమార్రెడ్డి ఒక తట్టకూడా మట్టి వేయలేదని, అన్ని తానే చేయించానని చెప్పి ప్రగల్భాలు పలికిందన్నారు. తాను ఏదో సంపాదించుకున్నానని, అవినీతి పరుడినని వ్యక్తిగతంగా దాడి చేశారన్నారు. ఆమె విమర్శలకు కౌంటర్ ఇచ్చానే కానీ.. సోమవారం కోవూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో తాను ఇటీవల ఆమె మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చానే కానీ, ప్రత్యేకంగా విమర్శలు చేయలేదని ప్రసన్న స్పష్టం చేశారు. నేనన్న మాటలు వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటికీ కూడా ఆ మాటలకు కట్టుబడి ఉన్నానన్నారు. తాను చెప్పింది నూటికి నూరు శాతం నిజమన్నారు. మీకు దమ్ము, ధైర్యముంటే నీవు, ప్రభాకర్రెడ్డి రండి ప్రెస్మీట్ పెట్టండి.. విమర్శలు చేయండి. మళ్లీ మేము కౌంటర్ ఇచ్చుకుంటామన్నారు. ఏదో ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయిపోయి ఇలాంటి నీచ రాజకీయ సంస్కృతిని తీసుకురావడం గొప్పనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. ఇంట్లో తానుంటే చంపేసేవారని, ఆ దేవుడు తనను బయటకు పంపించాడన్నారు. ఈ రౌడీ మూకలు ఇల్లంతా ధ్వంసం చేశారని, 85 ఏళ్ల వయస్సులోని నా తల్లి ఇంట్లో ఉంటే ఆమెను బెదిరించారన్నారు. పనివాళ్లను ప్రాణభయానికి గురి చేశారన్నారు. ఇంటిని పగలగొట్టేశారు. బెడ్రూమ్, ఆఫీస్ సహా ధ్వంసం చేశారన్నారు. నన్ను అంతమొందించే కుట్ర ఇది 1961 నుంచి మా కుటుంబం రాజకీయాల్లో ఉంది జిల్లాలోని రాజకీయ కుటుంబాల్లో ఇలాంటి సంస్కృతి లేదు ఇలాంటి పరిణామాలు ప్రజాక్షేత్రంలో మంచిది కాదు రాజకీయంగా ఇలాంటివెప్పుడూ చూడలేదు రాజకీయాల్లో ప్రత్యర్థులు విమర్శించడం సాధారణం. ఇలా ఇళ్లపై దాడులు జరగడం నేను ఇంత వరకు చూడలేదు. ఇన్నేళ్ల రాజకీయాల్లో ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఇంట్లోకి చాలా మంది వచ్చారు. నన్ను మా వాచ్మెన్ రూమ్లో పెట్టాడు. అతన్ని బెదిరించారు. ఆమె ఎవరు అని అడిగితే పెద్దమ్మ అని చెప్పాడు. మా రూమ్లో కూడా వస్తువులు పగుల గొట్టారు. ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇలా చేస్తుందనుకోలేదు. – శ్రీలక్ష్మమ్మ, ప్రసన్నకుమార్రెడ్డి తల్లి -
విధ్వంసం వెనుక కుట్ర ఎవరిది
● మాజీమంత్రి ప్రసన్న ఇంట్లో టీడీపీ గూండాల విధ్వంసం దేనికి సంకేతం ● లోకేశ్ వచ్చి వెళ్లిన గంటల వ్యవధిలోనే ఈ ఘటన ● ఇటీవల కూటమి ప్రభుత్వంపై ప్రసన్న ఘాటైన విమర్శలు ● విమర్శలు చేశారని కిరాయి మూకల అరాచకం ● బూతులు మాట్లాడుతూ చంపేస్తామంటూ రౌడీమూకలు వీరంగం ● హుందా రాజకీయాల నుంచి గూండాయిజంపై సర్వత్రా విమర్శలు ● ప్రశ్నించినా.. విమర్శలు చేసినా భౌతిక దాడులు, అక్రమ కేసులు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు జిల్లా.. సుదీర్ఘ రాజకీయ చరిత్రకు, హుందా సంస్కతికి పట్టం కట్టిన నేల. దశాబ్దాలుగా రాజకీయం అంటే హుందాతనానికి చిరునామాగా ఉండేది. అటువంటిది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గూండాయిజం రాజకీయంగా మారిపోయింది. జిల్లాలో ఆనం, నల్లపరెడ్డి, నేదురుమల్లి, మేకపాటి వంటి కుటుంబాలు రాజకీయంగా విభిన్న అభిప్రాయాలతో ఉన్నా, వ్యక్తిగత విధ్వంసాలకు పాల్పడకుండా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ ముందుకు నడిచాయి. తమకంటూ వర్గాలను సొంతం చేసుకుని హుందా రాజకీయాలు నడిపించాయి. రాజకీయ క్షేత్రంలో ఎన్నెన్నో విమర్శలు చేసుకున్నప్పటికీ ప్రతి విమర్శలు కూడా అందుకునుగుణంగా సిద్ధాంత పరంగానే ఉండేవి. రాజకీయ ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది గానీ, ఇళ్లపై దాడులు, గూండాయిజం ఎన్నడూ చోటు చేసుకోలేదు. కూటమి పాలనలో రాజకీయాల స్వభావమే మారిపోయింది. ఈ మార్పు తాజాగా మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై టీడీపీ గూండాల దాడిలో స్పష్టంగా కనిపిస్తోంది. లోకేశ్ పర్యటన ముగిశాక కొన్ని గంటల వ్యవధిలోనే ఈ దాడి జరగడం రాజకీయ కుట్రగా వైఎస్సార్సీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. హుందా రాజకీయాలపై గూండాయిజం ముసురు తాజాగా జిల్లా రాజకీయ స్వరూపమే మారిపోయింది. రాజకీయంగా చేసిన విమర్శలపై అదే విధంగా తిప్పి కొట్టాల్సిన ప్రజాప్రతినిధులు సంయమనం కోల్పోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి, కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై సోమవారం రాత్రి టీడీపీ కిరాయి గూండాలు సాగించిన విధ్వంస కాండ ఇందుకు అద్దం పడుతోంది. ప్రసన్నకుమార్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఎన్నో అభివద్ధి పనులు చేశారు. అందులో ముదివర్తి– ముదివర్తిపాళెం కాజ్వేను సైతం ప్రసన్నకుమార్రెడ్డి పట్టుబట్టి ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతో కోవూరు ఎమ్మెల్యేగా గెలిచిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇటీవల నియోజకవర్గ పర్యటనలో ముదివర్తిపాళెం కాజ్వేను తమ ప్రభుత్వం నిర్మిస్తుందంటూ తప్పుడు ప్రచారం చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు సైతం ఈ ప్రాజెక్ట్ మంజూరుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలతో సహా మీడియాకు చూపించి ఇది తమ ప్రభుత్వం సాధించిన ఘనత అయితే.. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అజ్ఞానంగా మాట్లాడాన్ని ఖండించారు. ఈ క్రమంలోనే సోమవారం కోవూరులోని ఓ కల్యాణ మండపంలో ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ సన్నాహాక కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రసన్నకుమార్రెడ్డి తాను నియోజకవర్గంలో ఎన్నో అభివద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అవినీతికి పాల్పడలేదని, తనపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై విమర్శలు చేశారంటూ మండిపడ్డారు. నిఖార్సు అయిన రాజకీయాలు చేయాలే కానీ, ఎవరో రాసిచ్చిన స్క్రీప్ట్ చదవడం కాదంటూ ఘాటైన విమర్శలు చేశారు. చంపేస్తామంటూ రౌడీమూకలు వీరంగం ప్రసన్నకుమార్రెడ్డి, తన కుమారుడు రజత్కుమార్రెడ్డితో కలిసి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో రాత్రి 9 గంటల సమయంలో నెల్లూరు సుజాతమ్మ కాలనీలోని ఆయన ఇంటికి సుమారు వంద మందికి పైగా రౌడీమూకలు మారణాయుధాలతో దౌర్జన్యంగా ప్రవేశించి విధ్వంసం సష్టించారు. ప్రసన్నకుమార్రెడ్డి.. మా ఎమ్మెల్యే ప్రశాంతమ్మని విమర్శిస్తావా? నిన్ను చంపేస్తామంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఇళ్లంతా ధ్వంసం చేశారు. రౌడీమూకల ఆగడాలతో బెంబేలెత్తిన ప్రసన్నకుమార్రెడ్డి తల్లి శ్రీలక్ష్మమ్మ బెడ్ రూమ్లో తలుపులు వేసుకోగా వాటిని సైతం పగుల గొట్టారు. దీంతో భయాందోళనకు గురైన ఆమె బాత్ రూమ్లో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంది. పోర్టికోలో ఉన్న బెంజ్ కారును దుండగులు ధ్వంసం చేశారు. ? ఇప్పటికే రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో షాడో సీఎం లోకేశ్ రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లో సాగించిన పచ్చమూకల దాష్టీకం కుట్ర వెనుక కచ్చితంగా లోకేశ్ కుట్ర ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రసన్నకుమార్రెడ్డి ప్రభుత్వం వైఫల్యాలు, చంద్రబాబు అధికారం చేజిక్కించుకున్న తీరుపై ఘాటుగానే విమర్శలు చేశారు. దీంతో ప్రసన్నకుమార్రెడ్డిని టార్గెట్ చేసిన లోకేశ్.. సోమవారం నెల్లూరు జిల్లా పర్యటనలోనే విధ్వంస రచనకు ప్లాన్ గీశారని, ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న చేసిన విమర్శలను అడ్డం పెట్టుకుని, ఆయన నెల్లూరు నుంచి వెళ్లిపోయిన తర్వాత టీడీపీ రౌడీ మూకలు ఈ దాడులకు పాల్పడ్డాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే విమర్శలకు బదులుగా వాదనలు గాకుండా, రౌడీ మూకల దాడులు చోటు చేసుకోవడం రాష్ట్రంలో ప్రజాస్వామ్య భావనకు గండి పడుతోంది. విమర్శలు చేసిన నేతల ఇంటిపైనే దాడులు చేయడం దారుణమని, రాజకీయ విమర్శలను ఎదుర్కొనే సంస్కృతి క్రమంగా అంతరించిపోతున్నదనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
మరణం లేని మహానేత వైఎస్సార్
ఘనంగా 76వ జయంతి నెల్లూరు (స్టోన్హౌస్పేట): దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో మరణం లేని మహానేత అని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి అన్నారు. మంగళవారం వైఎస్సార్ జయంతి వేడుకులు జిల్లా కేంద్రం ఘనంగా నిర్వహించారు. నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లో నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు జంకె వెంకటరెడ్డి, కాకాణి పూజితతో కలిసి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, నెల్లూరు రూరల్ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి, పూజిత, జంకె వెంకటరెడ్డి, మహిళా నేతలతో కలిసి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని ఆ మహానేత సేవలను స్మరించుకోవడం ఎంతో సంతోషకరమన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, 108, 104 సేవలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, పక్కా ఇల్లు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను రాజశేఖరరెడ్డి పేద బడుగు బలహీనవర్గ ప్రజలకు అందించారని తెలిపారు. రాజశేఖరరెడ్డి అందించిన సేవలను స్మరించుకుంటూ ప్రజలు ఆయన్ని దైవంగా కొలుస్తున్నారని తెలిపారు. రాజశేఖరరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు సంక్షేమ పాలన అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జిలు, జిల్లా అనుబంధ సంఘాల నేతలు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కాకాణికి రెండు రోజుల పోలీస్ కస్టడీ
నెల్లూరు (లీగల్): కనుపూరు చెరువు నుంచి అక్రమంగా మట్టిని తరరించాలని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై వెంకటాచలం పోలీసులు అక్రమంగా నమోదు చేసిన కేసులో విచారణ నిమిత్తం రెండు రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ నెల్లూరు 4వ అదనపు మొదటి తరగతి జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నిషాద్ నాజ్ షేక్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాకాణిని 9వ తేదీ ఉదయం 8 గంటలకు విచారణ నిమిత్తం నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పోలీస్ కస్టడీకి తీసికోవాలని తిరిగి 10వ తేదీ సాయంత్రం 5 గంటలకు అయనకు వైద్య పరీక్షలు చేయించి మెడికల్ సర్టిఫికెట్తో కోర్టులో హాజరు పరచాలన్నారు. థర్డ్ డిగ్రీ ఉపయోగించకూడదని ఉత్తర్వులో పేర్కొన్నారు. న్యాయవాది సమక్షంలో గోవర్ధన్రెడ్డిని విచారణ జరపాలన్నారు. కాకాణిని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని వెంకటాచలం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై పోలీసులు తరఫున ఏపీపీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ ఏడు రోజులు పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరారు. కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి, మాలపాటి వెంకట విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లేవని, కేవలం రాజకీయ కక్షతో కేసు పెట్టారని, పోలీస్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి గోవర్ధన్రెడ్డికి రెండు రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. డీసీపల్లిలో 527 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో మంగళవారం నాటికి 527 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 740 బేళ్లు రాగా 527 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. గరిష్టంగా కిలోకు రూ.280, కనిష్టంగా రూ.160 ధర లభించింది. సగటున రూ.202.37 ధర పలికింది. వేలంలో 10 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. నాణ్యతలేని పొగాకు తీసుకురావొద్దు మర్రిపాడు: ప్రస్తుతం మార్కెట్లో మొద్దు మచ్చలు, రెండో నంబరు, సైలెన్, బొగ్గులు ఉన్నవి తప్ప మిగిలిన అన్ని రకాల పొగాకు అమ్ముడు పోతుందని, నాణ్యత లేని పొగాకును తీసుకు రావొద్దని డీసీపల్లి వేలం కేంద్రం నిర్వహణాధికారి జీ రాజశేఖర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కసారి అమ్ముడుపోని బేళ్లను తిరిగి అవే బేళ్లను వేలానికి తీసుకురావొద్దని, వాటి స్థానంలో వేరొక బేళ్లు కట్టి వేలానికి తీసుకురావాలని కోరుతున్నామన్నారు. పొగాకు బేళ్లు వేలానికి తీసుకుని వచ్చేటప్పుడు 1వ నంబరు పొగాకు సగం, రెండో నంబరు పొగాకు సగం ఉండేటట్లు తీసుకురావాలని సూచించారు. మొత్తం రెండో నంబరు తీసుకుని వస్తే పోటీ లేకుండా ఎక్కువ నోబిడ్స్ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. నేడు, రేపు రెవెన్యూ అసోసియేషన్ క్రీడలు నెల్లూరురూరల్: 10వ జిల్లా రెవెన్యూ అసోసియేషన్ క్రీడా పోటీలు ఈ నెల 9, 10 తేదీల్లో బుజబుజ నెల్లూరులోని క్రికెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంధ్ర స్టేడియంలో క్రికెట్ పోటీలు జరుగుతాయని మంగళవారం రెవెన్యూ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపారు. 9వ తేదీ ఉదయం 8.45 గంటలకు కలెక్టర్ ఓ ఆనంద్ క్రికెట్ పోటీలను లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. 18న జెడ్పీ సర్వసభ్య సమావేశం నెల్లూరు (పొగతోట): ఈ నెల 18న ఉదయం 10.30 గంటలకు జెడ్పీ సమావేశం నిర్వహించనున్నట్లు సీఈఓ మోహన్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన సమావేశం జరుగుతుందన్నారు. పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖలు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా విద్యాశాఖ, విద్యుత్ శాఖలపై సమీక్షించడం జరుగుతుందన్నారు. అధ్యక్షుల అనుమతితో ఇతర శాఖలపై సమీక్షించడం జరుగుతుందన్నారు. జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా స్థాయి అధికారులు హాజరు కావాలని కోరారు. -
తప్పుడు హామీలు.. బాబు మోసాలు
నెల్లూరు (స్టోన్హౌస్పేట): తప్పుడు హామీలతో ప్రజలను మభ్య పెట్టి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, చంద్రబాబు మోసాలపై ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్దామని వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పిలుపునిచ్చారు. నగరంలోని డీఆర్ ఉత్తమ్ హోటల్లో మంగళవారం ఎంపీ మిఽథున్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు. ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు తీరు మారలేదన్నారు. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో అబద్ధం చెబుతూ ప్రజలను దగా చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో కరెంట్ బిల్లులు పెంచడం, కూటమి నేతలు సిండికేట్లుగా మారి ప్రజాధనాన్ని దోచుకుతినడం చూస్తున్నామన్నారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్లో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మోసపూరిత విధానాలను ఎండగడుతామన్నారు. 40 శాతం ఓటింగ్తో అత్యధిక జనాదరణ కలిగిన పార్టీగా వైఎస్సార్సీపీకి గుర్తింపు ఉందన్నారు. జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ క్యాడర్ ఎంతో పటిష్టంగా ఉందన్నారు. జగన్మోహన్రెడ్డి చేపడుతున్న కార్యక్రమాలకు స్వచ్ఛందంగా వస్తున్న ప్రజలను చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ విషయం అర్థమవుతుందన్నారు. వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన నిలిచి చేస్తున్న కార్యక్రమాలను చూసి ఓర్వలేక కూటమి నేతలు జగన్మోహన్రెడ్డి పర్యటనలు అడ్డుకుంటున్నారన్నారు. ఇది ఎంతో కాలం చెల్లదని, కూటమి ప్రభుత్వానికి అర్థమయిందని, అందుకే జగన్మోహన్రెడ్డి పర్యటన అంటేనే భయపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు జంకే వెంకటరెడ్డి, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మేరిగ మురళీధర్, మాజీమంత్రి పోలుబోయిన అనిల్కుమార్యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్రెడ్డి, మేకపాటి విక్రమ్రెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, కిలివేటి సంజీవయ్య, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఆనం విజయకుమార్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డి, కాకాణి పూజిత తదితరులు హాజరయ్యారు. వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఎంపీ మిథున్రెడ్డి -
మంత్రుల మధ్య మంటలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: షోడో సీఎం లోకేశ్ సమక్షంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మరో మంత్రి నారాయణపై బహిరంగంగా విమర్శలు చేయడం సంచలనం సృష్టిస్తోంది. నగరంలో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థయిన వీఆర్ హైస్కూల్ పునః ప్రారంభోత్సవ వేదికపై నుంచి ఆ పాఠశాలను మున్సిపల్ హైస్కూల్గా మార్పు చేయడంపై వచ్చిన మంత్రి లోకేశ్ సమక్షంలో తీవ్ర స్వరంతో దుయ్యబట్టారు. ఇదే పాఠశాలను మంత్రి నారాయణ కృషి, పట్టుదలతో రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దారని లోకేశ్ ప్రశంసించారు. వాస్తవానికి నెల్లూరులో శతాబ్దాల కాలం నాటి చరిత్ర ఉన్న వీఆర్సీ విద్యాసంస్థలపై మంత్రి నారాయణ ఆధిపత్యం చెలాయించడం మరో మంత్రి రామనారాయణరెడ్డికి కంటగింపుగా మారింది. ఎన్నో ఏళ్లగా వీఆర్సీ విద్యాసంస్థల మేనేజ్మెంట్ కమిటీని ఆనం కుటుంబం హస్తగతం చేసుకొని పెత్తనం చెలాయిస్తోంది. తమ నుంచి తాజాగా మంత్రి నారాయణ లాక్కోవడం వారికి రుచించడం లేదు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే వీఆర్సీ విద్యా సంస్థలపై మంత్రి నారాయణ కన్ను పడింది. అప్పట్లోనే వీఆర్ జూనియర్ కాలేజ్ అంటూ పెత్తనం లాక్కొనే ప్రయత్నం చేశారు. దీంతో మేనేజ్మెంట్ కమిటీపై న్యాయ స్థానంలో వ్యాజ్యం వేయించి రద్దు చేసేలా చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాకతో ఈ వ్యవహారం మరుగున పడింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాకతోనే మళ్లీ నారాయణ వీఆర్ విద్యాసంస్థలపై పెత్తనం ప్రారంభించారు. నారాయణ సంస్థల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండానే అమరావతి రాజధానితోపాటు అల్లూరుకు చెందిన బడా కాంట్రాక్టర్ల కంపెనీల నుంచి దాదాపు రూ.15 కోట్ల సీఎస్సార్ ఫండ్స్ సేకరించి హైస్కూల్ను పునద్ధరణ చేయించారు. ఆధునిక హంగులతో తీర్చిదిద్దారు. నగర వాసుల్లో ఏదో అభివృద్ధి చేస్తున్నట్లు చూపిస్తూ వెనుక నుంచి వీఆర్సీ విద్యా సంస్థలను గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. వాస్తవంగా న్యాయ స్థానంలో పెండింగ్లో ఉన్న ఎయిడెడ్ పాఠశాలను మున్సిపల్ పరిధిలోకి చేర్చడం పెద్ద వివాదమే. చట్టవిరుద్ధంగా మంత్రి నారాయణ వీఆర్సీ విద్యాసంస్థల్ని మున్సిపల్ శాఖ పరిధిలోకి తెచ్చారు. ఎలాంటి తీర్మానాలు లేకుండానే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొని మంత్రి నారాయణ కార్పొరేట్ సంస్థలాగా మార్చేశారు. ఆ హైస్కూల్లో అడ్మిషన్ల నుంచి టీచర్స్ సెలక్షన్ వరకు అన్నింట్లోనూ మంత్రి పెత్తనం చేయడాన్ని మంత్రి ఆనం సహించలేకపోయారు. దశాబ్దాలుగా తమ అధీనంలో ఉన్న సంస్థలను బలవంతంగా నారాయణ లాక్కోవడం రుచించలేదు. మంత్రి లోకేష్ సమక్షంలోనే మంత్రి నారాయణ తీరును ఎండ గట్టడం పెద్ద దుమారమే రేపింది. రూ.వేల కోట్లకు అధిపతిగా ఉన్న మంత్రి నారాయణ తన సంస్థల నుంచి ఒక్క రూపాయి కూడా ఇందులో పెట్ట లేదని మంత్రి ఆనం బహిరంగంగానే విమర్శలు చేయడంతోపాటు ముందు నీ సంస్థ నుంచి ఖర్చు పెట్టమని సలహా ఇవ్వడం పెద్ద చర్చనీయాంశమైంది. నారాయణపై ‘ఆనం’ ఆగ్రహం వీఆర్ విద్యాసంస్థలపై ఆయన పెత్తనమేమిటి..? కార్పొరేట్ కంపెనీల సీఎస్సార్ ఫండ్తో అభివృద్ధి చేసి తనఖాతాలో వేసుకోవడంపై మండిపాటు మంత్రి సంస్థ నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదంటూ ఘాటైన విమర్శలు మంత్రి లోకేశ్ సాక్షిగా బట్టబయలైన విభేదాలు -
కనికరం చూపండయ్యా..
● అధికారులకు అర్జీదారుల వినతి నెల్లూరు(అర్బన్): సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ అర్జీలను ఇస్తున్నామని.. ఎంపీడీఓలు, తహసీల్దార్లు పట్టించుకోకపోవడంతో విసిగివేసారిపోయామని.. మీరైనా పరిష్కరించాలని పలువురు అర్జీదారులు కోరారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణం వద్ద సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు భారీగా తరలివచ్చారు. అర్జీలను జేసీ కార్తీక్, డీఆర్వో హుస్సేన్సాహెబ్, డ్వామా పీడీ గంగాభవాని, జెడ్పీ సీఈఓ మోహన్రావు, డీపీఓ శ్రీధర్రెడ్డి తదితరులు స్వీకరించారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో కలిపి సుమారు 400 అర్జీలు అందాయి. సమస్యలను సకాలంలో పరిష్కరించాలి అధికారులతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. ప్రజలు అందజేసే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, ఒకవేళ అలా కాకపోతే అందుకు గల కారణాలను తెలియజేయాలని సూచించారు. ప్రధానంగా రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, వీటిపై దృష్టి సారించాలని ఆదేశించారు. అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అధికారుల తప్పిదానికి సంక్షేమ పథకాలు కట్ చేపలు పట్టుకొని నేను, నా భార్య పోలమ్మ జీవిస్తున్నాం. మాకు ముగ్గురు పిల్లలు. ప్రభుత్వం గతంలో నిర్వహించిన హౌస్ హోల్డ్ సర్వేలో నా రేషన్ కార్డులో పోలమ్మ పేరును పోలయ్యగా వెబ్సైట్లో అధికారులు చూపారు. పోలయ్యకు ప్రభుత్వోద్యోగం ఉందంటూ రేషన్ కార్డులో ఐడీ నంబర్ను ఇచ్చారు. దీంతో సంక్షేమ పథకాలు రద్దు కావడంతో పాటు ఆరోగ్యశ్రీ వర్తించలేదు. అధికారుల తప్పిదానికి బలయ్యాం. సచివాలయాలు.. తహసీల్దార్ చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదు. కలెక్టరేట్కు మూడుసార్లు వచ్చినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. – కునాసి వెంకటేశ్వర్లు, రవీంద్రాపురం, విడవలూరు మండలం పొదుపులో దాచుకున్న డబ్బును కాజేశారు రాష్ట్రంలోనే తొలిసారిగా పొదుపు మహిళల కోసం లేగుంటపాడులో ఏర్పాటు చేసిన బ్యాంక్లో నెలకు రూ 2500 చొప్పున అక్టోబర్, 2018 నుంచి చెల్లించా. దీని మెచ్యూర్టీ కింద గతేడాది మార్చిలో రూ 2.35 లక్షలు రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని బ్యాంక్ సీఈఓ ప్రసాద్రెడ్డి చెల్లించలేదు. కలెక్టరేట్లో ఫిర్యాదు చేయగా, డీఆర్డీఏ అధికారులు, డీసీఓ కార్యాలయాధికారి నిర్మల విచారణ జరిపారు. దీంతో చెక్కును ఇవ్వగా, బ్యాంక్లో జమచేయగా బౌన్సయింది. అధికారులకు మరోసారి ఫిర్యాదు చేయగా, కోవూరు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఎస్డీఎల్సీఓ సుభాషిణి విచారణ జరిపారు. నగదును మూడు రోజుల్లో ఇస్తానని మీడియా సమక్షంలో గత నెల 23న ప్రసాద్రెడ్డి చెప్పినా, నేటికీ ఇవ్వలేదు. – ఏలూరు సుజాతమ్మ, లేగుంటపాడు, కోవూరు మండలం విచారణలో అభిప్రాయం చెప్పడమే తప్పా..? భర్త దూరమయ్యారు. ఇద్దరు ఆడబిడ్డలు. రూ.13 వేల వేతనంతో ఏఎస్పేట పీహెచ్సీలో ఎఫ్ఎన్వోగా పనిచేస్తున్నా. డాక్టర్లు, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు లక్ష్మికి జరిగిన వివాదంలో ఉన్నతాధికారులు విచారణ జరిపారు. లక్ష్మిపై నా అభిప్రాయాన్ని తెలిపా. అయితే అనుకూలంగా అభిప్రాయం చెప్పలేదనే ఉద్దేశంతో లక్ష్మి తీవ్ర వేధింపులకు గురిచేశారు. చదువుకోనీయకుండా కెరీర్ను దెబ్బతీశారు. ఎలాంటి తప్పు లేకపోయినా నర్సు, డాక్టర్లతో పాటు నన్ను జొన్నవాడ పీహెచ్సీకి బదిలీ చేశారు. దీన్ని రద్దు చేయాలి. – దొరసానమ్మ, ఎఫ్ఎన్వో, ఏఎస్పేట పీహెచ్సీ -
కార్లు ఢీకొని.. రోడ్డు పక్కకు దూసుకెళ్లి
● బస్సు కోసం నిరీక్షిస్తున్న వ్యక్తిని కబళించి దుత్తలూరు: కార్లు ఢీకొని.. బస్సు కోసం నిరీక్షిస్తున్న వ్యక్తిపైకి దూసుకెళ్లాయి. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని నందిపాడు కూడలిలో గల జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. బండిపై గోలీ సోడాను విక్రయిస్తూ నందిపాడుకు చెందిన నల్లబోతుల వెంకటేశ్వర్లు (54) జీవనం సాగిస్తున్నారు. ఈ తరుణంలో ఉదయగిరి వెళ్లేందుకు గానూ బస్సు కోసం నందిపాడు సెంటర్లో రోడ్డు మార్జిన్లో వేచి ఉన్నారు. ఈ క్రమంలో ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి తిరుపతి వెళ్తున్న కారు ఉదయగిరి నుంచి సంగానికి వెళ్తున్న కారును ఢీకొని రోడ్డు పక్కన ఉన్న వెంకటేశ్వర్లు.. ఆపై గృహాలపైకి దూసుకెళ్లాయి. ప్రమాదంలో గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకొని విలపించారు. సమాచారం అందుకున్న ఉదయగిరి ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి తన సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు. పోస్ట్మార్టం నిమి త్తం ఉదయగిరి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. కార్ల యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. -
డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కార్యవర్గ ఎన్నిక
నెల్లూరు(అర్బన్): ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, అమరావతి రాష్ట్ర సర్వసభ్య సమావేశాన్ని ధనలక్ష్మీపురంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగ గౌరవాధ్యక్షురాలిగా సరోజిని, గౌరవ సలహాదారుగా లీలాకృష్ణ ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్ష, జనరల్ సెక్రటరీలుగా వెంకటరమణ, చేజర్ల సుధాకర్రావు, కోశాధికారిగా హరిప్రసాద్, అసోసియేట్ ప్రెసిడెంట్గా జయప్రకాష్, ఉపాధ్యక్షులుగా శివరామకృష్ణ, సయ్యద్ బేగం, మహ్మద్ రఫీ, వెంకటేశ్వర్లు, రాజేంద్రకుమార్, విజయలక్ష్మి, సాదు వెంకటేశ్వర్లు, రమణ, వెంకటగిరిబాబు, భాస్కర్, కృష్ణమోహన్, మంగమ్మను ఎన్నుకున్నారు. పబ్లిసిటీ సెక్రటరీగా టాటాబాయ్, జాయింట్ సెక్రటరీలుగా అనూరాధ, పద్మావతి, సుమతి, సుబ్బలక్ష్మి, సీతామహలక్ష్మి, లక్ష్మీకుమారి, ధనలక్ష్మి, సునీత, మంగ, విజయకుమార్, అనిల్ ప్రేమ్కుమార్, తులసీదేవి ఎన్నికయ్యారు. అనంతరం వీరు ప్రమాణం చేశారు. -
అస్తవ్యస్తంగా బదిలీలు
నెల్లూరు (అర్బన్): ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో పశుసంవర్థక శాఖలో సహాయకులకు సంబంధించిన బదిలీల కౌన్సెలింగ్ను జరపకుండా అస్తవ్యస్తం చేశారని పలువురు ఆరోపించారు. ఈ మేరకు కలెక్టరేట్లో కలెక్టర్ ఆనంద్కు వినతిపత్రాన్ని సోమవారం అందజేసిన అనంతరం ఏహెచ్ఏ శ్రీనివాసులు మాట్లాడారు. రైతు సేవా కేంద్రాల్లో ఏహెచ్ఏలుగా ఆరేళ్లుగా పనిచేస్తున్నామని చెప్పారు. బదిలీలకు సంబంధించిన నోటిఫికేషన్ గత నెల్లో వచ్చిందని, అయితే తమ శాఖలో కనీసం కౌన్సెలింగ్ జరగలేదన్నారు. ప్లేస్మెంట్ ఆప్షన్లనూ అడగలేదన్నారు. జిల్లా అధికారులకు అనుకూలంగా ఉన్న వ్యక్తులనే దగ్గరగా బదిలీ చేశారని తెలిపారు. కొంత మందిని ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు సుమారు 200 కిలోమీటర్ల దూరానికి బదిలీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొబేషన్ డిక్లేర్ చేయని వారిని కూడా బదిలీ చేసి సీనియార్టీ ఉన్న వారికి అన్యాయం చేశారని, ప్రక్రియను రద్దు చేసి విచారణ జరపాలని కోరారు. ప్రధానోపాధ్యాయుడిపై దాడి దగదర్తి: కట్టుబడిపాళెం జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై అక్కడే పనిచేసి బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయురాలు ప్రమీల, ఆమె భర్త ప్రసాద్ సోమవారం దాడి చేశారు. వివరాలు.. ధ్రువీకరణ పత్రాల కోసం పాఠశాలకు ఆమె వచ్చారు. ఎల్పీసీ పత్రాలను అందించి.. ఎస్సార్ను నాలుగు రోజుల తర్వాత ఇస్తానని ప్రధానోపాధ్యాయుడు చెప్పారు. దీంతో ఆగ్రహించిన ప్రసాద్ ఆయనపై దాడి చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రీ కౌన్సెలింగ్ వద్దంటూ ఆందోళన
నెల్లూరు(అర్బన్): సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న తమకు బదిలీల విషయంలో రీ కౌన్సెలింగ్ను నిర్వహించొద్దని గ్రేడ్ – 3 ఏఎన్ఎంలు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద ధర్నాను సోమవారం నిర్వహించిన అనంతరం జేసీ కార్తీక్కు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా గ్రేడ్ – 3 ఏఎన్ఎం అసోసియేషన్ జిల్లా నేతలు జయలక్ష్మి, వాణి మాట్లాడారు. గ్రేడ్ – 3 నుంచి గ్రేడ్ – 2కు ఉద్యోగోన్నతి పొందిన ఏఎన్ఎంలు వారికి కేటాయించిన సబ్ సెంటర్లకు వెళ్లకుండా సచివాలయాల పరిధిలోనే ఉన్నారని చెప్పారు. సచివాలయాల పరిధిలో ఖాళీలు చూపొద్దని అధికారులను ఒత్తిడి చేసే సరికి, తమకు రీ కౌన్సెలింగ్ను నిర్వహించి వేరే మండలానికి కేటాయిస్తామని చెప్పడం అన్యాయమన్నారు. ఇదే జరిగితే తాము తీవ్రంగా నష్టపోతామని పేర్కొన్నారు. పదోన్నతి పొందిన వారిని సబ్ సెంటర్లకు బదిలీ చేయాలని, అలా కాని పక్షంలో కౌన్సెలింగ్ను రద్దు చేసి తాము ఇప్పుడు పని చేస్తున్న ప్రదేశంలోనే ఉంచేలా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రక్రియను తాము అంగీకరించేదిలేదని స్పష్టం చేశారు. -
పచ్చ గూండాల అరాచకం
జిల్లాలో పచ్చ కిరాయి గూండాల అరాచకం సంచలనం సృష్టించింది. నెల్లూరు నగరంలోని సుజాతమ్మకాలనీలో ఉన్న మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి నివాసంలో సోమవారం రాత్రి బీభత్సం సృష్టించారు. రాజకీయ చైతన్యానికి, హుందా రాజకీయాలకు మారు పేరైన నెల్లూరులో రెడ్ బుక్ రాజ్యాంగం వెర్రితలలు వేస్తోంది. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న చేసిన విమర్శలను జీర్ణించుకోలేని పచ్చమూకలు ఇంట్లో ప్రసన్న తల్లి శ్రీలక్ష్మమ్మ ఒకటే ఉన్న రాత్రి సమయంలో మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. ముందుగా సీసీ కెమెరాలు ధ్వంసం చేసి ఇంట్లోని ప్రతి గదిలో బీభత్సం చేశారు. -
సమగ్ర సోమశిల నెరవేర్చిన జలయాజ్ఞికుడు
వైఎస్సార్.. భవిష్యత్ స్వాప్నికుడు. వర్షపు నీటిని ఒడిసి పట్టి సాగుకు మళ్లించిన అపర భగీరథుడు. పుడమి తల్లిని పులకింప చేశారు. సింహపురి సిగలోని జలనిధి నుంచి గంగమ్మను ఉరకలెత్తించారు. బంజరు భూములకు జలసిరులు అందించి బంగరు భూములుగా మార్చిన జలయాజ్ఞికుడు. ఉమ్మడి జిల్లా తీరంలో మధ్య భాగంగా కృష్ణపట్నంలో పోర్టు నిర్మించి ప్రపంచ స్థాయి పటంలో నెల్లూరుకు స్థానం కల్పించిన భవిష్యత్ స్వాప్నికుడు. పవర్ ప్రాజెక్ట్లతో జిల్లాలో వెలుగులు నింపిన వెన్నెల రేడు. పారిశ్రామిక సెజ్లతో విదేశీ సంస్థలను స్థాపించి అభివృద్ధికి బీజాలు వేసిన పాలికుడు. నిరుద్యోగాన్ని రూపు మాపి లక్షల కుటుంబాల్లో సంతోషాన్ని నింపిన వల్లభుడు. దశాబ్దన్నర కాలం గడిచినా జిల్లా అన్నదాతల మదిలో రాజన్న స్థానం పదిలం. మంగళవారం వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. – సాక్షి ప్రతినిధి, నెల్లూరు దాదాపు మూడు దశాబ్దాలపైకు పైగా నిర్లక్ష్యానికి గురైన సాగునీటి ప్రాజెక్ట్లను పూర్తి చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వందల రూ.కోట్లతో ప్రాజెక్ట్లకు పునాదులతో జలయజ్ఞానికి శ్రీకారం చుట్టిన పాలక కర్షకుడు. 2004 ఎన్నికలకు ముందు 48 టీఎంసీలకే పరిమితమైన సోమశిల నీటి సామర్థ్యాన్ని రెండు దశల్లో 78 టీఎంసీల స్థాయికి తీసుకు వచ్చారు. సమగ్ర సోమశిలలో భాగంగా 104 కిలో మీటర్ల పొడవునా ఉత్తర కాలువను సోమశిల నుంచి ప్రకాశం జిల్లా కందుకూరు వరకు అభివృద్ధి చేసి నీటి ఔట్ ఫ్లో సామర్థ్యాన్ని పెంచారు. వృథా నీటి ఒడిసి పట్టి.. వృథాగా సముద్రంలో కలుస్తున్న కృష్ణా నది వరద నీటిని శ్రీశైలం డ్యాం నుంచి కరువు ప్రాంతమైన రాయలసీమకు కేవలం 1,500 క్యూసెక్కుల తరలించేందుకు గతంలో ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని అధికారికంగా 44 వేల క్యూసెక్కులని చెప్పినా వాస్తవంగా 1.10 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో రోజుకు దాదాపు 10 టీఎంసీలు తరలించే విధంగా అభివృద్ధి చేశారు. పెన్నార్ డెల్టాతో పాటు మెట్ట ప్రాంత భూములను సస్య శ్యామలం చేసేందుకు జలయజ్ఞం ద్వారా రూ.220 కోట్లతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. సంగం బ్యారేజ్ నిర్మాణంతో.. జిల్లాలోనే కీలక ప్రాజెక్ట్లైన సంగం, పెన్నా బ్యారేజీలపై దృష్టి సారించి 2006 మే 28న రూ.98 కోట్ల వ్యయంతో సంగం బ్యారేజీ శంకుస్థాపన చేశారు. 800 మీటర్ల పొడవుతో దీన్ని నిర్మించి 0.45 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో పాటు డెల్టా స్థిరీకరణకు దోహదపడేలా సిద్ధం చేశారు. అయితే నిర్మాణ వ్యయం పెరగడంతో 2008లో రీ టెండర్లు నిర్వహించి ప్రాజెక్ట్ వ్యయాన్ని రూ.149.60 కోట్లకు పెంచి పనులు వేగవంతం చేశారు. ఆయన మరణానికి ముందు వరకు 40 శాతం పనులు పూర్తయ్యాయి. తదనంతర పాలకులు నిర్లక్ష్యం వహించడంతో వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీనిపై దృష్టి సారించి ప్రజలకు అంకితం చేశారు. పెన్నా బ్యారేజ్తో.. 2008లో పెన్నాబ్యారేజ్ రూ.126 కోట్ల వ్యయంతో నిర్మించడానికి శంకుస్థాపన చేశారు. 0.55 టీఎంసీ నీటి సామర్థ్యంతో తలపెట్టిన పెన్నా బ్యారేజీ తదనంతరం రీ టెండర్ల ద్వారా రూ.149.39 కోట్లకు చేరింది. దివంగత మహానేత హయాంలో పరుగులు తీసిన అభివృద్ధి మళ్లీ ఆయన తనయుడు దృష్టి సారించి పూర్తి చేశారు. 57 గేట్లతో 637 మీటర్ల పొడవుతో 10.90 లక్షల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా బ్యారేజ్ని నిర్మించారు. మహానేత దూరదృష్టి.. అభివృద్ధి సృష్టి దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ దూరదృష్టితో అభివృద్ధి సృష్టించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 169 కి.మీ. పొడవైన సముద్ర తీరంలో మధ్య భాగం కృష్ణపట్నంలో పోర్టును నిర్మించారు. ఈ పోర్టు ద్వారా ఎగుమతులు, దిగుమతులతో ప్రపంచ స్థాయిలో సింహపురి కీర్తిని నిలిపారు. ఈ పోర్టు ద్వారా జిల్లాలో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి కల్పనకు బీజాలు వేశారు. జిల్లాకే కాకుండా రాష్ట్ర, కేంద్ర ఖజానాలకు ఆదాయ వనరుగా మార్చారు. మరో వైపు అదే ప్రాంతంలో ప్రభుత్వ రంగంలో 2,400 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టి.. జిల్లాలో వెలుగులు నింపారు. -
అగ్రిగోల్డ్ బాధితుల మొర ఆలకించండి
ఆత్మకూరు: ‘మా సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం మొర ఆలకించాలి’ అని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు అన్నారు. ఆత్మకూరు పట్టణంలోని బైపాస్రోడ్డులో అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లతో ఆదివారం సాయంత్రం పీవీ రామకృష్ణ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో 10 లక్షల బాధిత కుటుంబాలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల చొప్పున మొత్తం రూ.906 కోట్లు జమైనట్లు తెలిపారు. 143 ఏజెంట్ కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఎక్స్గ్రేషియో అందినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అగ్రిగోల్డ్ సమస్యను పొందుపరిచిందని, ఆ మేరకు పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. అగ్రిగోల్డ్ ఆస్తులను పరిశీలించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. సమస్య పరిష్కారంలో కాలయాపన చేస్తే మరోసారి ఉద్యమం నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు చౌడయ్య, మునీర్, సురేష్, శివయ్య, సుధాకర్, అజయ్, నాగేశ్వరరావు, కృష్ణమోహన్, తదితరులు పాల్గొన్నారు. -
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
● 34 గ్రాముల బంగారు ఆభరణాల స్వాధీనం నెల్లూరు(క్రైమ్): నమ్మకంగా ఉంటూ నగలు కాజేసిన ఘటనలో నిందితుడిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు వేదాయపాళెం పోలీసుస్టేషన్లో ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు నిందితుడి వివరాలను వెల్లడించారు. వెంగళరావ్నగర్ ఏ బ్లాక్లో విశ్రాంత రైల్వే ఉద్యోగులు వెంకటేశ్వర్లు, కొండమ్మ దంపతులు నివాసముంటున్నారు. వారికి ముగ్గురు సంతానం. చిన్నకుమారుడు ప్రసన్నకుమార్కు వివాహం నిశ్చయమైంది. అతను గతనెల 29వ తేదీన బీరువాలోని తన బంగారు బ్రాస్లెట్, రెండు చైన్ల కోసం చూడగా అవి కనిపించలేదు. దీంతో వెంకటేశ్వర్లు ఈనెల 4వ తేదీన వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఎస్సై డి.విజయకుమార్ తన సిబ్బందితో కలిసి విచారణ చేపట్టారు. పనిచేసే గణపతి నిందితుడని తేలడంతో ఆదివారం అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. వెంగళరావునగర్ ప్రాంతానికి చెందిన గణపతి కొంతకాలంగా వెంకటేశ్వర్లు ఇంట్లో పనిచేస్తూ నమ్మకంగా ఉండేవాడు. గతనెల 28వ తేదీన యజమానులు ఇంటి బయట ఉండగా బీరువాలోని 34 గ్రాముల రెండు బంగారు గొలుసులు, బ్రాస్లెట్ను అపహరించాడు. నేరం అంగీకరించడంతో అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని ఇన్స్పెక్టర్ చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపి సిబ్బందిని డీఎస్పీ సింధుప్రియ అభినందించారు. -
అనుమానాస్పద స్థితిలో..
● యువకుడి మృతిఅల్లూరు: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. బోగోలు మండలం కప్పరాళ్లతిప్పకు చెందిన ఇరగాలదిన్నె నాని (21) శనివారం మధ్యాహ్నం నుంచి కనిపించకపోవడంతో బిట్రగుంట పోలీస్స్టేషన్లో తల్లి శరణ్య ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని అల్లిమడుగు సంఘానికి చెందిన కొందరు తీసుకెళ్లినట్లు ఆమె అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు నాని కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఆదివారం అల్లూరు చెరువులో మృతదేహం లభ్యమైంది. దానిని శవపరీక్ష నిమిత్తం కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కావలి రూరల్ సీఐ పాపారావు తెలిపారు. -
జగ్జీవన్రామ్కు ఘన నివాళి
నెల్లూరు(స్టోన్హౌస్పేట): నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ వర్ధంతిని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కాకాణి పూజిత జగ్జీవన్రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ జగ్జీవన్రామ్ ఆశయాలకు అనుగుణంగా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని చెప్పారు. సంజీవయ్య మాట్లాడుతూ దేశంలో హరిత విప్లవానికి, కార్మిక విప్లవానికి ఆద్యులు జగ్జీవన్రామ్ అని, అణగారిన వర్గాలకు రాజ్యాంగఫలాలు అందించేందుకు జీవితకాలం శ్రమించారన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రజా వ్యతిరేక పాలన ఎల్లకాలం సాగదని గుర్తుంచుకోవాలన్నారు. పూజిత మాట్లాడుతూ డాక్టర్ బాబూ జగ్జీవన్ రాం వర్థంతి సందర్భంగా ఆయన చేసిన గొప్ప విషయాలను దేశమంతా గుర్తు చేసుకుంటుందన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఆయన అందించిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు. జగ్జీవన్రామ్ ఆశయాలు రాష్ట్రంలో అమలు కావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వేమిరెడ్డి హంసకుమార్రెడ్డి, బాలకృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్ సత్తార్, రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శులు స్వర్ణ వెంకయ్య, రవీంద్ర, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కాకుటూరి లక్ష్మీసునంద, అంగన్వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలు పాల లావణ్య, మహిళా రాష్ట్ర కార్యదర్శి వెంకటజ్యోతి, మండల కన్వీనర్ మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
నిఘా నీడన రొట్టెల పండగ
నెల్లూరు(క్రైమ్): పోలీస్, సీసీ కెమెరాల నిఘా నీడన ఆదివారం బారాషహీద్ దర్గాలో రొట్టెల పండగ ప్రారంభమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. 1,700 మంది సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. మహిళలు, చిన్నారుల రక్షణ నిమిత్తం స్వర్ణాల చెరువు ఘాట్, దర్గా ఆవరణలో మహిళా సిబ్బందిని ఏర్పాటు చేశారు. మూడు పీటీజెడ్ కెమెరాలు, 67 సీసీ కెమెరాలు, పది డ్రోన్లను ఏర్పాటుచేసి పోలీసు అవుట్ పోస్టులోని తాత్కాలిక కమాండ్ కంట్రోల్రూమ్కు అనుసంధానం చేశారు. పోలీసు అధికారులు అక్కడి నుంచి పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలు, సలహాలిచ్చారు. అవుట్ పోస్టు సిబ్బంది తప్పిపోయిన 28 మంది చిన్నారులను సంరక్షించి బాధిత కుటుంబసభ్యులకు అప్పగించారు. క్రైమ్ పార్టీ సిబ్బంది ఓ జేబుదొంగను అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. సాయంత్రం ఎస్పీ జి.కృష్ణకాంత్, కలెక్టర్ ఒ.ఆనంద్తో కలిసి దర్గా ఆవరణ, క్యూలైన్లు, రొట్టెల మార్పిడి తదితర ప్రాంతాలను పరిశీలించారు. కమాండ్ కంట్రోల్రూమ్, సీసీ కెమెరాల పనితీరుపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. క్యూలైన్లలోని భక్తులు వీలైనంత త్వరగా దర్శనం చేసుకునేలా చూడాలన్నారు. క్రైమ్ పార్టీలు నేరాలు జరగకుండా చూడాలన్నారు. నేర నియంత్రణ చర్యలపై పబ్లిక్ అడ్రస్సింగ్ సిస్టం ద్వారా భక్తులకు తెలియజేయాలని సూచించారు. దారి మూసేయడంతో.. రొట్టెల పండగ సందర్భంగా కొందరు పోలీసుల తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. దర్గా వైపు వెళ్లే రహదారులను అధికారులు బారికేడ్లతో మూసివేయడంతో పొదలకూరురోడ్డు సెంటర్, జేవీఆర్ కాలనీ, లక్ష్మీనరసింహపురం, అంబేడ్కర్ నగర్, బ్రహ్మానందపురం, బట్వాడిపాళెం సెంటర్ తదితర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. తమ ఇళ్లు అక్కడేనని చెబుతున్నా వినిపించుకోకుండా వాహనాలు నిలిపివేశారు. దీంతో వారు ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లో కాకుండా వాహనాలు ఎక్కడపడితే అక్కడ నిలిపివేస్తుండటంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. దర్గా ఆవరణలోనూ ఇష్టారాజ్యంగా వాహనాలు నిలిపివేయడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ పోలీసుల తీరుపై స్థానికుల అసహనం -
స్వర్ణాల చెరువు.. కోర్కెల అర్థనకు వేదికై ంది. వరాల రొట్టెలను ఒడిసి పట్టుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. మది నిండా భక్తి, విశ్వాసంతో కోరిన కోర్కెలు తీరి వదిలే రొట్టెలు, కోర్కెలతో రొట్టెలను పట్టుకునే భక్తులతో పవిత్ర స్వర్ణాల తీరం జనసంద్రంగా మారింది. బారాషహీ
భక్త జనసంద్రమైన స్వర్ణాల ఘాట్నెల్లూరు (బారకాసు): విద్య, ఉద్యోగం, విదేశీయానం, వ్యాపారం, ధనం, సౌభాగ్యం, వివాహం, ఆరోగ్యం, ప్రమోషన్, స్వగృహం.. ప్రతి ఒక్కరి కల. జీవితాశయం. బారాషహీదులు ఆశీస్సులతో స్వర్ణాల సాక్షిగా తీరుతాయనేది ప్రగాఢ విశ్వాసం. భక్తి ప్రపత్తులతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల మధ్య రొట్టెల పండగ ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. తొలి రోజు కోర్కెలు తీరిన భక్తులు వదిలే రొట్టెల కోసం కొత్త కోర్కెలతో రొట్టెలు తీసుకునేందుకు వచ్చిన భక్తులతో బారాషహీద్ దర్గా ప్రాంగణం కిటకిటలాడింది. స్వర్ణాల చెరువు వరాల రొట్టెలు మార్చుకునే భక్తులతో నిండిపోయింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల వారు, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాలు, సుదూర ప్రాంతాల నుంచి భక్తులు హాజరయ్యారు. స్వర్ణాల చెరువులో పుణ్య స్నానాలు ఆచరించి తమ కోర్కెల రొట్టెల మార్పిడి చేసుకున్నారు. మత బోధకులైన యుద్ధ వీరుల త్యాగనిరతిని స్మరిస్తూ సమాధులను దర్శించుకున్నారు. ఐదు రోజుల పాటు నిర్వహించనున్న రొట్టెల పండగలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కే కార్తీక్, కార్పొరేషన్ కమిషనర్ నందన్ ఏర్పాట్లు పర్యవేక్షించారు. అంచనాకు మించి రెట్టింపు స్థాయిలో భక్తులు వచ్చినా ఆటంకాలు లేకుండా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు స్వచ్ఛందంగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రతి కోర్కె రొట్టెకు ప్రత్యేక ఘాట్ స్వర్ణాల చెరువులో సంప్రదాయబద్ధంగా స్నానమాచరించి రొట్టెలు ఇచ్చి పుచ్చుకోవడం ఆనవాయితీ. ఇందుకోసం ఏ కోర్కె రొట్టె ఎక్కడ దొరుకుంతుందో వెతుకులాటతో భక్తులు ఇబ్బంది పడకూడదని అధికారులు ప్రతి కోర్కె రొట్టెకు ప్రత్యేక ఘాట్ ఏర్పాటు చేశారు. భక్తులు ఏ కోర్కెతో వచ్చారో ఆ ఘాట్లోకి వెళ్లి తమకు కావాల్సిన రొట్టెను అందుకుంటున్నారు. గతంలో తమ కోర్కెలు తీరిన భక్తులు రొట్టెలను వదులుతున్నారు. ఆరోగ్యం, సంతానం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, గృహ, సౌభాగ్యం, వివాహం, విదేశీయానం రొట్టెల బోర్డులను ఏర్పాటు చేశారు. స్వర్ణాల చెరువు వద్ద పక్కాగా ఏర్పాట్లు బారాషహీద్ దర్గా స్వర్ణాల చెరువు వద్ద రొట్టెలు పట్టుకొనే భక్తుల కోసం నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చెరువు లోతులోకి వెళ్లకుండా ఉండేందుకు చెరువులో కంచె, చెరువు ఘాట్ వద్ద నీటిని శుభ్రం చేసే యంత్రాలు ఏర్పాటు చేశారు. భక్తిశ్రద్ధలతో షహదత్ సందల్ మాలి నెల్లూరు (బృందావనం): రొట్టెల పండగ తొలి రోజు ఆదివారం సంప్రదాయంగా మత పెద్ద షబ్బీర్ సాహెబ్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి 10.30 గంటలకు అమరులైన 12 మంది యోధులను స్మరిస్తూ దర్గా ప్రాంగణంలో బారాషహీద్ల సమాధుల చెంత షహదత్ (ప్రత్యేక పూజలు) నిర్వహించారు. 2 గంటల వరకు గులాములు, పన్నీరుతో పరిశుభ్రం చేశారు. సంప్రదాయంగా గంధం లేపనం చేసిన అనంతరం గలేఫాలు, చద్దర్లు కప్పి ‘సందల్ మాలి’ భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఈ ఘట్టాన్ని భక్తజనం కనులారా భక్తి శ్రద్ధలతో వీక్షించి పరవశించిపోయారు. గంధ మహోత్సవం నేడు బారాషహీద్ దర్గా రొట్టెల పండగలో అత్యంత ప్రాధాన్యత కలిగిన గంధ మహోత్సవం 2వ రోజు సోమవారం రాత్రి నిర్వహించనున్నారు. పవిత్రమైన గంధాన్ని 12 పవిత్ర కలశాలలో కోటమిట్టలోని అమీనియా మసీదు నుంచి సంప్రదాయంగా గంధాన్ని తీసుకు వచ్చి బారాషహీద్లకు లేపనం చేసి. అనంతరం భక్తులకు ఆ గంధాన్ని, ప్రసాదాన్ని పంచి పెట్టనున్నారు. ఎంతో విశేషంగా అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. వైభవంగా ప్రారంభమైన రొట్టెల పండగ తెల్లవారుజాము నుంచే పోటెత్తిన భక్తులు బారాషహీద్ దర్గా, స్వర్ణాల చెరువు కిటకిట కోర్కెల రొట్టెలు ఇచ్చిపుచ్చుకున్న భక్తులు -
అధికారుల నిర్లక్ష్యం.. భక్తులకు ఇబ్బందులు
నెల్లూరు(బారకాసు): బారాషహీద్ దర్గా ప్రాంగణమంతా బ్లీచింగ్, సున్నం చల్లాల్సి ఉంది. అయితే కొన్నిచోట్ల మాత్రమే చల్లుతూ మమ అనిపిస్తున్నారు. దీంతో అంటురోగాలు ప్రబలుతాయోనని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పండగకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ నేపథ్యంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని ప్రదేశాల్లో బ్లీచింగ్, సున్నం ఎప్పటికప్పుడు చల్లుతూ ఉండాలి. అయితే దర్గా ప్రధాన రహదారిలో బ్లీచింగ్, సున్నం చల్లిన దాఖలాల్లేవు. సంబంధిత అధికారులు స్పందించాల్సిన అవసరముంది. క్వారీ డస్ట్ వల్ల.. దర్గా ప్రాంగణంలో ఎక్కడైతే సిమెంట్ రోడ్డు వేయలేదో ఆ ప్రాంతాల్లో క్వారీ డస్ట్ వేసి చదును చేశారు. అయితే డస్ట్పై నీరు చల్లడం మరిచిపోయారు. ఆదివారం ఉదయం నుంచి గాలి మొదలుకావడంతో డస్ట్ గాలికి ఎగిరి భక్తుల కళ్లలోకి చేరడంతో ఇబ్బంది పడ్డారు. స్టాల్స్లోనూ, దుకాణాల్లో తినుబండారాలపై డస్ట్ పడుతోంది. వాటిని కొనాలంటే భక్తులు వెనుకంజ వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా సంబంధిత అధికారులు నీళ్లు చల్లించాలన్న ఆలోచన కూడా చేయకపోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నెల్లూరు రొట్టెల పండగలో కల్తీ మద్యం విక్రయాలకు స్కెచ్
కందుకూరు: గుడ్లూరు కేంద్రంగా వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో పలు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు వీరాంజనేయులు కూటమి పార్టీల నేతలు, పెద్దలతోపాటు ఎకై ్సజ్ అధికారుల అండదండలతోనే చాలా కాలంగా గుట్టుచప్పుడు కాకుండా తయారీ చేసినట్లు తెలుస్తోంది. నకిలీ మద్యం తయారీలో ఉన్న రేపల్లికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో వీరాంజనేయులు నకిలీ మద్యం తయారీ గట్టును రట్టు చేయాల్సి వచ్చినట్లు సమాచారం. వ్యసనాలకు బానిసై.. నకిలీ మద్యం తయారు చేస్తూ ఎకై ్సజ్ శాఖ అధికారులకు పట్టుబడిన వీరాంజనేయులుది సొంత ఊరు గుడ్లూరు. అక్కడి స్థానిక అధికార పార్టీకి చెందిన నాయకుడితో ఇతనికి మంచి సంబంధాలు ఉన్నాయి. స్థానికంగా పేకాట శిబిరాలు నిర్వహించడంలో సదరు అధికార పార్టీ నేత సిద్ధహస్తుడు. ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఇద్దరూ కూడా పేకాట ఆడేవారు. ఈ క్రమంలో వీరాంజనేయులు భారీగా డబ్బులు పొగొట్టుకున్నట్లు సమాచారం. అందులో నష్టపోయిన డబ్బును సంపాదించడానికి నకిలీ మద్యం తయారీ చేసే అడ్డ దారిని ఎంచుకున్నట్లు ఎకై ్సజ్ అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. మద్యం తయారీకి గుడ్లూరులోని మిట్టపాళెంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కల్తీ మద్యం తయారీ మెషిన్, ఇతర సామగ్రిని ఏర్పాటు చేశాడు. శనివారం చేసిన దాడుల్లో 6,200 ఖాళీ క్వార్టర్ బాటిల్స్తో పాటు, 3,500 ఏసీ ప్రీమియం క్వార్టర్ బాటిల్ లేబుల్స్ బయట పడ్డాయి. ఎకై ్సజ్ అధికారులకు తెలిసే జరుగుతుందా? వీరాంజనేయులు గుడ్లూరులో చాలా కాలం నుంచి భారీ స్థాయిలో నకిలీ మద్యం తయారు చేస్తున్నాడు. బాహాటంగానే మద్యం షాపులతోపాటు, బెల్టు షాపులకు నకిలీ మద్యం సరఫరా చేస్తుంటే.. ఎకై ్సజ్ అధికారులకు కానీ, అధికార పార్టీ నేతలకు కానీ తెలియదంటే నమ్మక శక్యంగా లేదని పలువురు అంటున్నారు. కూటమి పార్టీల పెద్దల అండదండలు లేకపోతే నకిలీ మద్యం తయారీ చేయలేడని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎకై ్సజ్ అధికారులకు తెలిసే జరుగుతుందనే ప్రచారం ఉంది. అధికార పార్టీ నేతల సూచనలతోపాటు మామూళ్ల మత్తులో పడి వదిలేశారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే కల్తీ మద్యం తయారీ నిందితుడు వీరాంజనేయులుకు అధికారులు దాడుల చేయనున్న సమాచారం ముందే అందడం ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. ఈ క్రమంలో భారీ స్థాయిలో నకిలీ మద్యాన్ని ఓ ఆటో ద్వారా తరలించినట్లు తెలుస్తోంది. ఇలా దొరికాడు ఇటీవల ఎకై ్సజ్ శాఖ అధికారులు బాపట్ల జిల్లా రేపల్లిలో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై దాడి చేసి కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాడు. అక్కడి కేసులో ఉన్న నిందితుడే వీరాంజనేయులకు కల్తీ మద్యం తయారీకి ఉపయోగించే స్పిరిట్ సరఫరా చేస్తున్నాడని గుర్తించారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు వీరాంజనేయులను అతని సెల్ఫోన్ డేటా ఆధారంగా పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ వీరాంజనేయులు పేరుతో నెల్లూరుకు చెందిన మరో వ్యక్తి సిమ్ కార్డు ఉపయోగిస్తుండడంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో వీరాంజనేయులు పట్టుబడినట్లు సమాచారం. చాలా కాలంగా వీరాంజనేయులు ఏసీ ప్రీమియం క్వార్టర్ బాటిల్ పేరుతో కల్తీ మద్యాన్ని తయారు చేసి రూ.100లకే మద్యం, బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నాడు. ఇదే మద్యాన్ని షాపులు, బెల్టు షాపుల్లో రూ.160లకు విక్రయిస్తున్నారు. ఇలా కొన్ని వేల బాటిల్స్ను వీరాంజనేయులు సరఫరా చేసినట్లు సమాచారం. అయితే బెల్టు షాపులకు సరఫరా విషయంలో మద్యం షాపుల యజమానులకు, వీరాంజనేయులకు మధ్య తేడా రావడంతో కొంత కాలంగా మద్యం తయారీని నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం నెల్లూరులో రొట్టెల పండగ జరుగుతున్న నేపథ్యంలో కల్తీ మద్యాన్ని భారీగా తయారు చేసి విక్రయించాలని ప్రణాళిక వేసుకున్నాడు. దీని కోసం నెల్లూరుకు చెందిన మరో వ్యక్తితో కలిసి రొట్టెల పండగకు కేటాయించే దుకాణాల్లో ఒకటి తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ నుంచి కార్గోలో 400 లీటర్ల స్పిరిట్ తెప్పించాడు. ఇందులో ప్రస్తుతం 300 లీటర్ల ఒరిజినల్ స్పిరిట్ను అధికారులు స్వాధీనం చేసుకోగా, మరో 100 లీటర్ల మిక్స్డ్ స్పిరిట్ ఉన్నట్లు గుర్తించారు. -
తల్లిని కాపాడబోయి..
పొదలకూరు: తనకు ప్రాణం పోసిన తల్లిని విద్యుత్ ప్రమాదం నుంచి కాపాడబోయిన ఓ తనయుడు తనువు చాలించాడు. ఈ విషాదకరమైన ఘటన మండలంలోని మరుపూరు ఎస్సీ కాలనీలో ఆదివారం జరిగింది. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. ఎస్సీ కాలనీకి చెందిన ఆర్.వంశీ (30) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. వివాహమై నెలల బాబు ఉన్నాడు. వంశీ తల్లి లక్ష్మమ్మ ఆదివారం ఉదయం ఇంట్లో పనులు చేసుకుంటూ వాషింగ్ మెషీన్కు ఉన్న విద్యుత్ తీగను గమనించకుండా తాకడంతో విద్యుదాఘాతానికి గురైంది. ఆమె కేకలు వేయడంతో నిద్రపోతున్న వంశీ వెంటనే లేచి అక్కడికి వెళ్లాడు. తల్లిని పట్టుకుని లాగేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు బాధితుడిని పొదలకూరు సీహెచ్సీకి తరలించారు. అప్పటికే వంశీ మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. లక్ష్మమ్మ విద్యుదాఘాతంతో స్పృహ కోల్పోయినా ప్రాణాపాయం నుంచి బయట పడింది. తన ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో బిడ్డ చనిపోవడంతో లక్ష్మమ్మ, ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. సమాచారం అందుకున్న ఎస్సై హనీఫ్ కేసునమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జీజీహెచ్కు తరలించారు. మరుపూరు ఎస్సీ కాలనీలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతానికి గురై తనయుడి మృత్యువాత మరుపూరులో విషాదం -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
గుడ్లూరు: లారీని బొలెరో ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన తెట్టు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎస్సై వెంకట్రావు కథనం మేరకు.. ఏలూరు జిల్లా కలిదిండి మూలలంక గ్రామానికి చెందిన కేతా సాయిబాబా (24), క్లీనర్ పుట్టా నాగరాజు (19) బొలెరో వాహనంలో చేపల లోడుతో బయలుదేరారు. హైదరాబాద్ నుంచి లారీ కర్ణాటకకు వెళ్తోంది. తెట్టు వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో బొలెరో వాహనం తప్పించబోయి ఢీకొట్టింది. దీంతో సాయిబాబా, నాగరాజు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం కందుకూరు ఆస్పత్రికి తరలించారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతో..● వ్యక్తి ఆత్మహత్య ఆత్మకూరు: కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెంది ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని నెల్లూరుపాళెంలో చోటు చేసుకుంది. ఎస్సై బి.సాయిప్రసాద్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బీసీకాలనీకి చెందిన జి.శ్రీకాంత్ (37) మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్యతో తరచూ గొడవ లు జరుగుతుండేవి. ఆమె ఇటీవల అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీకాంత్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.ఇన్చార్జి డీఆర్వోగా హుస్సేన్ సాహెబ్ నెల్లూరు(అర్బన్): జిల్లా రెవెన్యూ ఇన్చార్జి అధికారిగా తెలుగుగంగ స్పెషల్ కలెక్టర్ హుస్సేన్సాహెబ్ను నియమిస్తూ కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. డీఆర్వోగా పనిచేస్తున్న ఉదయభాస్కర్రావును ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసింది. రెగ్యులర్ డీఆర్వోను నియమించేంత వరకు హుస్సేన్ సాహెబ్ ఇన్చార్జిగా కొనసాగుతారు. నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదికనెల్లూరు రూరల్: ప్రతి సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిథిగా కొనసాగుతుందని కలెక్టరేట్ కార్యాలయ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యలపై కలెక్టరేట్లో వినతిపత్రాలు అందించాలన్నారు. -
కనికరం లేకుండా..
పింఛన్ సొమ్ము.. ఇంటి పన్నుకు జమ ఆత్మకూరు: వృద్ధులు, దివ్యాంగుల పట్ల కూటమి ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయింది. గ్రామాల్లో ఇంటి పన్నులు చెల్లించలేదని పింఛన్లో కోత విధించి ఇస్తున్న వైనం ఆత్మకూరు మండలంలోని కనుపూరుపల్లి గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన నేలటూరి సుబ్బరాయుడు కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించేవాడు. పక్షవాతానికి గురై మూడేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఇంటి పన్ను చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల సచివాలయానికి చెందిన ఓ ఉద్యోగి పింఛన్లో రూ.1,000 తగ్గించి మిగిలింది చేతిలో పెట్టింది. ఇదేంటని అడిగితే పంచాయతీ కార్యదర్శి చెప్పాడని, అందుకే పింఛన్లో ఇంటి పన్ను మినహాయించుకుని మిగిలిన నగదు ఇచ్చినట్లు చెప్పారు. తమ వద్ద కూడా ఇదే విధంగా పింఛన్లో ఇంటి పన్ను నగదును జమ చేసుకుని మిగిలింది ఇచ్చారని కాలనీకి చెందిన వడిగ సుగుణమ్మ, బొడ్డు లక్ష్మమ్మ, దాసరి అయ్యన్న, నేలటూరి వెంకటయ్య, కటారి చిన్న పెంచలయ్య, గొర్రిపాటి శంకరయ్య తదితరులు వాపోయారు. మరుసటిరోజు ఇంటి పన్నుకు సంబంధించిన రశీదులు ఇచ్చారన్నారు. బలవంతంగా పన్నులు వసూలు చేయడం ఏమిటని, దానిని పింఛన్కు ముడిపెట్టడం దారుణమని బాధితులు వాపోతున్నారు. ఈ విషయమై సంబంధిత పంచాయతీ కార్యదర్శి, సచివాలయం ఉద్యోగిని వివరణ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. -
రైతులకు న్యాయవాదుల అండ
● కరేడులో ఐలు బృందం పర్యటన ● న్యాయ పోరాటం చేస్తాం ఉలవపాడు: భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కరేడు రైతులకు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) మద్దతు ఉంటుందని ఐలు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆదివారం న్యాయవాదుల బృందం కరేడు ప్రాంతంలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ అక్రమంగా రైతుల భూములు లాక్కోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే యూనియన్ అండగా ఉంటుందన్నారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు, ప్రభుత్వం ఉద్యమాన్ని అణచలేవన్నారు. రైతులకు వ్యతిరేకంగా ఉంటే ప్రభుత్వాలే కూలిపోతాయన్నారు. విజనరీకి ఆ మాత్రం తెలియదా అన్నారు. భూగర్భ సంపదను దోచుకోవడానికి ప్రయత్ని స్తున్నారనే అనుమానం కలుగుతుంది. న్యాయ సహాయం అందిస్తాం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఐలు అధ్యక్షులు నర్రాశ్రీనివాసరావు మాట్లాడుతూ 18 వేల మందికి జీవనాధారమైన భూములను తీసుకోవడం న్యాయం కాదన్నారు. కరేడు రైతులకు న్యాయ సహాయం అందిస్తామన్నారు. కుగ్రామాలన్నీ తిరిగి భూము లు పరిశీలించి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. కార్యక్రమంలో ఐలు రాష్ట్ర కార్యదర్శి యన్. మాధవరావు, ఏపీ వైస్ ప్రసిడెంట్ వి కోటేశ్వరరావు, సెక్రటేరియట్ ప్రెసిడెంట్ రమేష్, ఐలు నాయకులు రాజారత్నం, కిరణ్బాబు, అహ్మద్, వినోద్కుమార్, చీరాల బార్ అసోసియేషన్ నాయకులు గొట్టి ప్రసాద్, నెల్లూరు బార్ అసోసియేషన్ నాయకులు రమేష్, సాయికుమార్, బండా శ్రీనివాసులు, ఐ శ్రీనివాసులుతోపాటు పౌర హక్కుల సంఘ నాయకులు, వామపక్షాలు, సీఐటీయూ నాయకులు ఉన్నారు. -
సర్కారు బడి.. కార్పొరేట్ పెత్తనం
వీఆర్ హైస్కూల్ను మున్సిపల్ హైస్కూల్గా మార్పు చేసి పునః ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. ఓ ప్రైవేట్ కంపెనీ ఇచ్చిన సుమారు రూ.9 కోట్ల సీఎస్సార్ ఫండ్తో పాఠశాల భవనాలను, ప్రాంగణాన్ని ఆధునికీకరించారు. సర్కారు స్కూల్ను కార్పొరేట్ పెద్దలు తమ కబంధహస్తాల్లోకి తీసుకున్నారు. రాష్ట్ర మంత్రి నారాయణ ఈ పాఠశాలపై అజమాయిషీ బాధ్యతలను తీసుకున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండానే తన విద్యా సంస్థల్లో పని చేసే సిబ్బందిని, బోధకులను నియమించడంతోపాటు విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. తన పాఠశాలల్లో కేటాయించాల్సిన ఫ్రీ సీట్లను ఈ పాఠశాలకు మళ్లించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెల్లూరు (టౌన్): సర్కారు బడిపై కార్పొరేట్ మంత్రి నారాయణ పెత్తనం, ఆయన సాగిస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజల కోసం వెంకటగిరి రాజా కుటుంబీకులు వీఆర్ విద్యా సంస్థలను ప్రారంభించారు. ప్రస్తుతం వీఆర్ విద్యా సంస్థల వ్యవహారం సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉంది. అయితే మంత్రి నారాయణ కోర్టు వివాదంలో ఉన్న వీఆర్ ఎయిడెడ్ హైస్కూల్ను వీఆర్ మున్సిపల్ హైస్కూల్గా మార్పు చేస్తూ ప్రతిపాదనలు పంపించగా, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల భవనాలతోపాటు ప్రాంగణాన్ని అధునాతనంగా తీర్చిదిద్దేందుకు, మౌలిక సదుపాయాలను కల్పించేందుకు నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ యాజమాన్యం దాదాపు రూ.9 కోట్ల మేర సీఎస్సార్ ఫండ్స్ను ఖర్చు చేసింది. గత నెల 30వ తేదీన వీఆర్ హైస్కూల్లో తరగతులను అనధికారికంగా ప్రారంభించారు. సోమవారం రాష్ట్ర విద్యాశాఖా మంత్రి లోకేశ్తో అధికారికంగా ప్రారంభించనున్నారు. సిటీ నియోజకవర్గానికే పరిమితం మంత్రి నారాయణ తన నియోజకవర్గం పరిధిలో ఉందన్న కారణంతో పాఠశాలలో కేవలం సిటీ నియోజకవర్గ పరిధిలోని విద్యార్థులకే అడ్మిషన్లు పరిమితం చేశారనే విమర్శలు వినిస్తున్నాయి. దీంతో జిల్లా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. వీఆర్ హైస్కూల్ పక్కనే ఉన్న గడియారం స్తంభం వరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధి ఉంది. అయితే ఆ నియోజకవర్గానికి చెందిన కేవలం 35 నుంచి 50 మంది విద్యార్థులకు మాత్రమే మొక్కుబడిగా అడ్మిషన్లు ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. వీఆర్ హైస్కూల్లో అడ్మిషన్లు జిల్లా వ్యాప్తంగా కల్పించాల్సి ఉన్నా కేవలం సిటీ నియోజకవర్గానికే పరిమితం చేయడంపై పలువురు విద్యావేత్తలు, ప్రజలు మండి పడుతున్నారు. వీఆర్లో నారాయణ సిబ్బంది నియామకం వీఆర్ హైస్కూల్లో ఉపాధ్యాయుల నియామకానికి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు ఉండాలి. అయితే సచివాలయాల్లో పని చేస్తున్న క్వాలిఫైడ్ స్కూల్ అసిస్టెంట్లను 20 మంది వరకు నియమించారు. ప్రస్తుతం 8 మంది స్కూల్ అసిస్టెంట్లు, 10 ఎస్జీటీలను నియమించారు. మరో 15 మంది స్కూల్ అసిస్టెంట్లు, ఐదుగురు ఎస్జీటీలు, ఇద్దరు హెడ్మాస్టర్లు కావాలని విద్యాశాఖకు లేఖ పంపించారు. వీరితోపాటు నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసే మరో 25 మందికి పైగా సిబ్బందిని బోధన, బోధనేతర విభాగాల్లో నియమించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యా వలంటీర్ను నియమించాలన్న ప్రభుత్వ అనుమతి ఉండాల్సి ఉంది. అయితే ఇవేమి పట్టించుకోని జిల్లా విద్యాశాఖ అధికారులు మంత్రికి ఇష్టం వచ్చిన వారిని అనధికారికంగా నియమిస్తున్నారు. పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ అయినా అనుభవం లేకపోతే బోధన ఏ విధంగా చేస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. వీఆర్ హైస్కూల్ను మున్సిపల్ హైస్కూల్గా మార్పు పునః ప్రారంభానికి ఎన్సీసీ కంపెనీ రూ.9 కోట్ల సీఎస్సార్ ఫండ్స్ అంతా నారాయణ సిబ్బందిదే అజమాయిషీ ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండానే నారాయణ పాఠశాల బోధకుల నియామకం నేడు విద్యాశాఖ మంత్రి లోకేశ్తో ప్రారంభం టీడీపీ నేతల సిఫార్సులకే అడ్మిషన్లు విద్యాహక్కు చట్టం 12/1సీ కింద జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి పేద పిల్లలకు ఉచితంగా ప్రవేశం కల్పించాల్సి ఉంది. అయితే జిల్లాలో ఏ కార్పొరేట్ పాఠశాలతోపాటు నారాయణ విద్యా సంస్థల్లో కూడా ఉచిత ప్రవేశాలు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇటీవల విద్యాహక్కు చట్ట ప్రకారం నారాయణ స్కూల్స్ల్లో అడ్మిషన్లు ఇవ్వడం లేదని చాలా మంది తల్లిదండ్రులు కలెక్టర్ ఆనంద్కు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో ఇటువంటి కొంత మంది విద్యార్థులకు వీఆర్ పాఠశాలలో అడ్మిషన్లు ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు టీడీపీ నేతలు సిఫార్సు చేసిన వారికి సైతం అడ్మిషన్లు కల్పించారని తెలిసింది. అయితే ఈ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల వ్యవహారాలను నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసే సిబ్బంది, ఆయా డివిజన్లల్లో ఉండే పార్టీ ఇన్చార్జిలకు అప్పగించినట్లు తెలిసింది. వీరితోపాటు పేరుకు ఒకరిద్దరు సచివాలయ సిబ్బందిని కూడా నియమించారు. మొత్తం మీద 1 నుంచి 9వ తరగతి వరకు 1,050 మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చారు. జిల్లాలో అందరికీ అడ్మిషన్లు ఇవ్వాలి జిల్లాలోని నిరుపేదలకు వీఆర్ హైస్కూల్లో అడ్మిషన్లు ఇవ్వాలి, కేవలం సిటీ నియోజకవర్గానికే పరిమితం చేయడం సరికాదు. విద్యాహక్కు చట్టం ప్రకారం వీఆర్ హైస్కూల్లో బోధన బోధనేతర సిబ్బందిని నియమించాలి. ప్రైవేట్ స్కూల్స్ల్లో 1వ తరగతిలో ఉచిత ప్రవేశాలు కల్పించడం లేదు. మంత్రి లోకేశ్ చర్యలు తీసుకోవాలి. – నరహరి, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ పేరెంట్స్ అసోసియేషన్ అడ్మిషన్లతో మాకు సంబంధం లేదు వీఆర్ హైస్కూల్లో అడ్మిషన్ల వ్యవహారం పూర్తిగా సచివాలయ సిబ్బంది చూసుకున్నారు. ఉపాధ్యాయులను పూర్తి స్థాయిలో నియమిస్తాం. సచివాలయాల్లో పని చేసే క్వాలిఫైడ్ అసిస్టెంట్లను కొంత మందిని తీసుకున్నాం. వీఆర్ హైస్కూల్ ఇన్చార్జిగా జాకీర్హుస్సేన్నగర్ హెచ్ఎం నారాయణకు బాధ్యతలు అప్పగించాం. – బాలాజీరావు, జిల్లా విద్యాశాఖాధికారి -
నకిలీ మద్యం తయారీ వెనుక అధికార పార్టీ అండదండలు
కందుకూరు నియోజకవర్గంలో బెల్టు షాపులకు సరఫరా ● ఇందులో ఇద్దరు వ్యక్తుల పాత్ర ● గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఇటీవల ఎకై ్సజ్ దాడులు ● ఈ దాడుల్లో పట్టుబడిన వారి సమాచారంతో సోదాలు ● అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నట్లు సమాచారం కందుకూరు: గుడ్లూరుకు చెందిన ఓ టీడీపీ నేత తన ఇంట్లోనే నకిలీ మద్యం తయారు చేస్తున్న గుట్టు శనివారం ఎస్సైజ్ అధికారులు దాడుల్లో రట్టయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బరితెగించిన టీడీపీ నేత ఉప్పలపాటి వీరాంజనేయరాజు తన ఇంట్లోనే నకిలీ మద్యం తయారు చేసి బెల్టుషాపుల ద్వారా విక్రయాలు సాగించినట్లు తెలుస్తోంది. శనివారం ఎకై ్సజ్ అధికారులు చేసిన దాడుల్లోనే మద్యం తయారీకి ఉపయోగించే సుమారు 400 లీటర్ల రెక్టిఫైడ్ స్పిరిట్, మద్యం సీసాలు, తయారీకి ఉపయోగించే మెషిన్లతోపాటు రూ.లక్షలు విలువ చేసే మందు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఇద్దరి పాత్ర ఉన్నట్లు ఎకై ్సజ్ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల గోదావరి, నెల్లూరు జిల్లాలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించిన ఎకై ్సజ్ అధికారులు తయారీ దారులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారి ఇచ్చిన సమాచారంతో గుడ్లూరులో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. మద్యం షాపులతోపాటు బెల్టు దుకాణాలకు సరఫరా తయారు చేసిన నకిలీ మద్యాన్ని పలు మద్యం షాపులతోపాటు బెల్టు షాపులకు సరఫరా చేస్తున్నారు. ఎక్కడా ఎవరికి అనుమానం రాకుండా మద్యం సీసాలు, వాటిపై లేబుల్స్ పక్కాగా ఏర్పాటు చేసుకున్నారు. లేబుల్పై ఒరిజినల్ను తలపించే రీతిలో మద్యం బాటిళ్లపై ఉండే లేబుల్, బ్యాచ్ నంబర్లు, ఎమ్మార్పీ ధరలు కూడా తయారు చేసి వేస్తున్నారు. అంతా పక్కాగా వేసి గుట్టు చప్పుడు కాకుండా నకిలీ మద్యాన్ని తయారు చేసి విక్రయిస్తూ రూ.లక్షలు సంపాదిస్తున్నారు. పేదల ఆరోగ్యంతో చెలగాటం ఎక్కువగా ఈ మద్యం తక్కువ ధరకు లభించి ఛీప్ లిక్కర్ను పోలిన బాటిళ్లు, పలు రకాల బ్రాండ్ల పేర్లతో నకిలీవి తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ మద్యం ధర తక్కువగా ఉండడంతో ఎక్కువగా పేదలు మాత్రమే వీటిని తాగుతుంటారు. ఈ నకిలీ మద్యాన్ని కందుకూరు, లింగసముద్రం, వలేటివారిపాళెం, గుడ్లూరు మండలాలతోపాటు పక్క జిల్లాలకు కూడా సరఫరా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో విక్రయిస్తున్నారు. ఇలాంటి నకిలీ మద్యం తయారు చేసి పేద ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. విచారణ పేరులో కాలయాపన ఎకై ్సజ్ అధికారులు నకిలీ మద్యం తయారీ దారులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఉంది. అయితే మీడియాకు వివరాలు వెల్లడించేందుకు వెనుకంజ వేస్తున్నారు. విచారణ చేస్తున్నామని పూర్తి విచారణ తర్వాతే సమాచారం ఇస్తామంటూ కాలయాపన చేస్తున్నారు. నకిలీ మద్యం తయారీ నిర్వాహకులను తప్పించేందుకు అధికార పార్టీ పెద్దల నుంచి అధికారులకు ఒత్తిడి వస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. చాలా కాలం నుంచి నియోజకవర్గంలో ఇలాంటి దందాలు నడుస్తున్న అధికారులు స్పందించింది లేదు. బెల్టు షాపుల నిర్వాహణలోనే అధికారులు కనసన్నలోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. మద్యం, బెల్టు షాపుల్లో తనిఖీ చేస్తే.. టీడీపీ నేత ఉప్పలపాటి వీరాంజనేయరాజు తయారు చేసిన నకిలీ మద్యాన్ని ఇప్పటికే మద్యం, బెల్టు షాపులకు అధిక మొత్తంలో సరఫరా చేసినట్లు తెలుస్తోంది. దుకాణాలపాటు బెల్టు షాపుల్లో ఎకై ్సజ్ అధికారులు తనిఖీలు చేస్తే భారీ స్థాయిలో నకిలీ మద్యం పట్టుబడుతుందని తెలుస్తోంది. ఏ దుకాణానికి ఎంత సరుకు సరఫరా చేశారో ఎకై ్సజ్ అధికారులు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. నకిలీ మద్యం తాగి అనారోగ్యపాలైన వారిని ఆరోగ్య సిబ్బందితో గుర్తించి అనుమానం వచ్చిన వారికి మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం కూడా ఉందని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కూటమి పాలనలో కందుకూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు చేయని అక్రమ వ్యాపారాల్లేవు. ఇప్పటికే ఇసుక, గ్రావెల్, రేషన్ బియ్యం, పేకాట, కోడి పందేలు, అసాంఘిక కార్యకలాపాల్లో ఆరితేరారు. తాజాగా ఓ టీడీపీ నేత ఏకంగా తన ఇంట్లోనే నకిలీ మద్యం తయారు చేస్తూ బెల్టు షాపులకు సరఫరా చేస్తూ మందుబాబుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న గుట్టును ఎకై ్సజ్ అధికారులు రట్టు చేశారు. సదరు నేత అధికార పార్టీ నేతల అండదండలతో కొంత కాలంగా ఈ అక్రమ వ్యాపారానికి తెర తీసినట్లు తెలుస్తోంది. ఇటీవల గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఎకై ్సజ్ అధికారులు చేసిన దాడుల్లో నకిలీ మద్యం తయారీ చేస్తూ పట్టుబడిన అధికార పార్టీ నేతలు ఇచ్చిన సమాచారం మేరకు తనిఖీలు చేయడంతో తెలుగు తమ్ముడి బాగోతం బయట పడినట్లు తెలుస్తోంది. ఈ నకిలీ మద్యం తయారీ వెనుక మద్యం షాపుల నిర్వాహకులు, అధికార పార్టీ నాయకులు అండదండలు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. నకిలీ మద్యం తయారు చేస్తూ పట్టుబడిన వీరాంజనేయులు మండలంలోని అధికార పార్టీకి చెందిన ప్రధాన నేతల అనుచరుడు. అసాంఘిక కార్యకలాపాల్లో ఆరితేరినట్లు తెలుస్తోంది. సదరు నాయకుడు మండలంలో పేకాట శిబిరాలు నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తుంటారు. -
అధికారులకు రాజకీయాలెందుకు?
నెల్లూరు (పొగతోట): ‘ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. అధికారులు మాత్రం సర్వీసులోనే ఉంటారు. అధికారులకు రాజకీయాలెందుకంటూ’ జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ఎంపీడీఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో పంచాయతీ పురోగతి సూచిక కార్యక్రమంపై ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడారు. అధికారులు నిబంధనలు ప్రొటోకాల్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు జెడ్పీ చైర్పర్సన్, జెడ్పీటీసీలను, ఎంపీపీలను ఆహ్వానించాలన్నారు. ప్రొటోకాల్ విషయంలో అంత ఇబ్బంది పడేటట్లు అయితే రిజైన్ చేసి ఇంట్లో కూర్చోవాలని సూచించారు. ఇకపై ప్రొటోకాల్ విషయంలో ఘటన పునరావృతమైతే సహించేది లేదంటూ హెచ్చరించారు. ప్రస్తుత, భవిష్యత్ తరాల శ్రేయస్సు కోసం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను రూపొందించుకుని 2030 నాటికి వాటిని సాధించు కోవాలన్నారు. ఈ లక్ష్య సాధన కోసం కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించిందన్నారు. పేదరికం లేని మెరుగైన జీవనోపాధి, ఆరోగ్య వంతమైన, స్వయం సమృద్ధిగల మౌలిక సదుపాయాలు, సామాజిక సురక్షితమైన, సుపరిపాలన, మహిళా స్నేహ పూర్వకమైన గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు క్షేత్ర స్థాయిలో అమలు చేయాలన్నారు. ప్రతి పంచాయతీలో 9 కార్యక్రమాల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకుని, సంపూర్ణంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని పంచాయతీలను ఏ–గ్రేడ్లోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీఓలు మండల సాధారణ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రజా ప్రతినిధులకు విడుదల చేయాలన్నారు. ఆత్మకూరు ఘటనకు సంబంధించి ఇంత వరకు నివేదికలు అందలేదన్నారు. నివేదికలను త్వరగా ఇవ్వాలని ఆత్మకూరు ఎంపీడీఓకు సూచించారు. ● జెడ్పీ సీఈఓ మోహన్రావు మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధికి సంబంధించి జిల్లా స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నెల 9వ తేదీన శిక్షణకు హాజరైన అధికారులు మండల స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు ఇవ్వాలని సూచించారు. లైన్ డిపార్ట్మెంట్లను కో ఆర్డినేషన్ చేసుకుని పంచాయతీలకు అవార్డులు వచ్చేలు ప్రణాళికలు రూపొందించాలన్నారు. జీపీడీపీ యాక్షన్ ప్లాన్లు పేపర్లలోనే జరుగుతున్నాయని, క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు. పంచాయతీల అభివృద్ధికి సంబంధించి 147 అంశాలను పొందుపరిచారన్నారు. జరిగిన అభివృద్ధికి సంబంధించి పూర్తి వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో హౌసింగ్ పీడీ వేణుగోపాల్, ట్రైనర్ ప్రసాద్, ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. ఇబ్బందిగా ఉంటే రిజైన్ చేసి ఇంట్లో కూర్చోండి జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ -
ఐదు రోజుల పండగ
6వ తేదీ – షహదత్ 7వ తేదీ – గంధమహోత్సవం 8వ తేదీ – రొట్టెల పండగ 9వ తేదీ – తహలీల్ ఫాతెహా 10వ తేదీ – ముగింపు సభ ● నేటి నుంచి రొట్టెల పండగ ప్రారంభం స్వర్ణాల చెరువులో భక్తుల సందడిమత సామరస్యానికి ప్రతీకగా జరిగే రొట్టెల పండగ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ పండగకు సింహపురి దారులన్నీ బారాషహీద్ దర్గా వైపే మళ్లాయి. కోర్కెలు తీరిన భక్తులు రొట్టెలు వదిలేందుకు, కొత్త కోర్కెల రొట్టెలు పట్టుకునేందుకు ముందు రోజే భక్తులు పోటెత్తడంతో దర్గా ప్రాంగణం కిటకిటలాడుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో స్వర్ణాల చెరువు భక్తజనసంద్రంగా మారింది. బారాషహీద్ దర్గానెల్లూరు (బారకాసు): నెల్లూరుకు రొట్టెల పండగొచ్చింది. నగరంలోని దర్గామిట్టలో ఉన్న బారాషహీద్ దర్గాలో రొట్టెల పండగకు అవసరమైన ఏర్పాట్లన్నీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఈ రొట్టెల పండగ ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. నెల్లూరులో జరిగే రొట్టెల పండగకు ఎంతో విశిష్టత ఉంది. దేశ, విదేశాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. బారాషహీద్లను స్మరిస్తూ కోర్కెలు తీరాలని స్వర్ణాల చెరువులో ఒకరికొకరు రొట్టెలను మార్చుకుంటారు. ఆ కోర్కెలు తీరిన తర్వాత మళ్లీ వచ్చి రొట్టెను వదులుతారు. మరో కోర్కె రొట్టెను తీసుకెళ్తుంటారు. దర్గా ప్రాంగణంలో విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయి. స్వర్ణాల చెరువులో భక్తుల సందడి రొట్టెల మార్చుకునే స్వర్ణాల చెరువు భక్తులతో సందడి నెలకొంది. పండగ ప్రారంభానికి ముందే భక్తుల రాకతో బారాషహీద్ దర్గా ప్రాంగణం కిటకిటలాడుతోంది. శనివారం ఉదయం నుంచి స్వర్ణాల చెరువు వద్ద కోర్కెల రొట్టెలను మార్చు కున్నారు. రెండు రోజుల ముందు నుంచే వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు బారాషహీద్ దర్గాకు చేరుకుంటున్నారు. నగర పాలక సంస్థ, పోలీసు, విద్యుత్, ఆరోగ్య, రెవెన్యూ శాఖలతోపాటు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు సౌకర్యాల కల్పన జాతీయ రహదారి నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గంలో బారాషహీద్ దర్గాకు రూట్ మ్యాప్ సూచిస్తూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తాగునీటి కేంద్రాలు, స్నానపు గదులు, మరుగుదొడ్లు మహిళలు, పురుషులకు వేర్వేరుగా నిర్మించారు. భక్తులకు అందుబాటులో 108 వాహనాలు, ఆరోగ్య కేంద్రాలు కల్పించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా షామియానాలు, పందిళ్లపైనా భారీ జింక్ షీట్లు ఏర్పాటు చేశారు. స్వర్ణాల చెరువు వద్ద భక్తులు ప్రమాదాలకు గురికాకుండా కంచెను ఏర్పాటు చేశారు. చెరువు వద్ద గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. చెరువులో నీరు మురుగు చేరకుండా ఎప్పటికప్పుడు మోటార్లతో శుద్ధి చేస్తున్నారు. దర్గా ఆవరణలో చిన్నారులు ఆడుకునేందుకు ఆట వస్తువులు, జైంట్వీల్స్ ఏర్పాటు చేశారు. అధికారుల సమన్వయంతో నగర పాలక సంస్థ, విద్యుత్, పోలీస్, వైద్య శాఖలతోపాటు ఇతర శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్, ఎస్పీ, కార్పొరేషన్ కమిషనర్ ఇతర శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి సిబ్బందికి రొట్టెల పండగ నిర్వహణపై సూచనలు చేశారు. వేలాది మంది భక్తుల హాజరు దర్గాకు శనివారం వేలాది మంది భక్తులు హాజరయ్యారు. కోర్కెల రొట్టెలను మార్చుకుని భక్తి శ్రద్ధలతో దర్గాను సందర్శించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతోపాటు ఆంధ్రరాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు అధికంగా హాజరయ్యారు. రొట్టెల పండగకు ముందుగానే భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో అధికారులు కూడా ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. కళకళలాడుతున్న దర్గా ప్రాంగణం బారాషహీద్ దర్గాకు పోటెత్తుతున్న భక్తులు స్వర్ణాల చెరువులో కొర్కెల రొట్టెల మార్పిడి సందడి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం రొట్టెల పండుగకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. క్షేత్రస్థాయిలో నిత్యం పరిశీలిస్తూ సిబ్బందికి తగు సూచనలు చేస్తున్నాం. బారాషహీద్ దర్గా ప్రాంగణ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 24గంటలు పాటు పోలీసు నిఘా ఉంటుంది. అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నాం. – ఆనంద్, కలెక్టర్. -
వెయ్యి మొబైల్ ఫోన్ల రికవరీ
నెల్లూరు(క్రైమ్): వివిధ కారణాలతో ప్రజలు పోగొట్టుకున్న సుమారు రూ.2 కోట్ల విలువైన 1,000 మొబైల్ ఫోన్లను పోలీస్ అధికారులు రికవరీ చేశారు. శుక్రవారం నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ కృష్ణకాంత్ చేతుల మీదుగా ఫోన్లను బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొబైల్ హంట్ ద్వారా ఎనిమిది విడతల్లో రూ.4 కోట్ల విలువైన 3,900 ఫోన్లు, సీఈఐఆర్ ద్వారా రూ.6 లక్షల విలువైన 60 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించా మన్నారు. మొబైల్ హంట్ (91543 05600)తోపాటు సీఈఐఆర్ సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ అవకాశాన్ని ఎవరైనా తప్పుడు పద్ధతిలో వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫోన్లను గుర్తించి అప్పగించిన ఎస్పీ, సైబర్ క్రైమ్ పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నెల్లూరు నగర డీఎస్పీ పి.సింధుప్రియ, సైబర్ క్రైమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎనిమిది విడతల్లో బాధితులకు 3,900 ఫోన్ల అందజేత ఎస్పీ కృష్ణకాంత్ -
కాంట్రాక్టర్లకు స్వర్ణాల వర్షం
తాము కోరిన కోర్కెలను నెరవేర్చే రొట్టెల పండగ అంటే ఎంతో మందికి మహా ఇష్టం. ఏటా బారాషహీద్ దర్గాలోని స్వర్ణాల చెరువు వద్దకు పోటెత్తి రొట్టెలను మార్పిడి చేసుకుంటూ ఉత్సాహంగా గడుపుతారు. అయితే ఇక్కడ పరిస్థితి ఎలా ఉన్నా, కాంట్రాక్టర్లకు మాత్రం కాసుల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా అవసరానికి మించి అంచనాలను రూపొందించారు. వివిధ రకాల తాత్కాలిక పనులకే కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నారంటే ఇక్కడ జరుగుతున్న కథాకమామీషు ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ● అవసరానికి మించి అంచనాలకు రూపకల్పన ● నగరపాలక సంస్థ సాధారణ నిధుల కేటాయింపు ● రొట్టెల పండగలో ఇదీ తంతు -
ఇష్టారాజ్యంగా బదిలీలు
మనోవేదనకు.. సాంఘిక సంక్షేమ శాఖలో ఇదీ పరిస్థితి ● కౌన్సెలింగ్ లేదు ● అయోమయంలో సంక్షేమ విద్యా సహాయకులు ● వివరాలు తెలుసుకోవడానికి కార్యాలయానికి రాక ● పట్టించుకోని ఉన్నతాధికారులునెల్లూరు(స్టోన్హౌస్పేట): సంక్షేమ విద్యా సహాయకుల బదిలీల ప్రక్రియ గందరగోళంగా మారింది. ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 500 మందికి పైగా ఉన్న సహాయకుల్లో ఎవరిని ఎక్కడికి మార్చారో తెలియడం లేదు. బదిలీల ప్రక్రియ గత నెల 30వ తేదీకి పూర్తి కావాల్సి ఉంది. అయితే ఆ శాఖలోని అధికారులు, సిబ్బంది ఆఫీస్లో లేకపోవడంతో వివరాలు తెలియక ఉద్యోగులు దూర ప్రాంతాల నుంచి నెల్లూరుకు వచ్చి కార్యాలయంలో వేచి చూడటం పరిపాటిగా మారింది. నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. సిఫార్సు లేఖల వల్లే.. సాంఘిక సంక్షేమ శాఖ డీడీ, సీనియర్ అసిస్టెంట్లు కార్యాలయంలో లేకపోవడంతో ఏం జరుగుతుందో ఉద్యోగులకు తెలియడం లేదు. గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఇప్పటికే వివిధ శాఖలకు అందించిన సీనియారిటీ జాబితా ప్రకారం బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ జరగాల్సి ఉంది. ఏఎస్డబ్ల్యూ పరిధిలో అందరి ఉద్యోగుల దగ్గర ఆప్షన్ ఫారం ఇచ్చి మూడు సచివాలయాలు ఎంపిక చేసుకోవాలని, దాని సీనియారిటీ ప్రకారం బదిలీ చేస్తామని చెప్పారని ఉద్యోగులు అంటున్నారు. అయితే కూటమికి ప్రజాప్రతినిధులు ఇచ్చిన సిఫార్సు లేఖలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిసింది. లెటర్లు లేకపోతే ఎక్కడికై నా బదిలీలు చేస్తామని అధికారులు ఫోన్ చేసి తెలుపుతున్నారని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేరే చోటుకు వెళ్లండి బదిలీకి దరఖాస్తు చేసుకున్న కొంతమంది ఉద్యోగులకు ఆ శాఖ సిబ్బంది ఫోన్లు చేసి మీరు పెట్టుకున్న ప్లేస్ ఖాళీగా లేదు. వేరే చోటుకు బదిలీ చేస్తామని చెబుతున్నారని ఆరోపణలున్నాయి. అసలు బదిలీల ప్రక్రియలో ఉద్యోగులను ఏమీ అడగకుండా సంబంధిత శాఖాధికారులు కార్యాలయంలో అందుబాటులో ఉండటం లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. మొత్తం బదిలీల ప్రక్రియ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది గత నెల 30వ తేదీ నుంచి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే వారికి ఎవరూ వివరాలు అందించడం లేదు. అధికారులకు ఫోన్ చేస్తే సరైన సమాధానం ఉండటం లేదు.బదిలీల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సి ఉంది. అయితే ఆ శాఖలోని కొందరు అధికారుల చేష్టల వల్ల సంక్షేమ విద్యా సహాయకులు తీవ్ర మనోవేదనకు గురువుతన్నారు. ఎవరికి ఏ ప్రాంతానికి బదిలీ జరుగుతుందోనని తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యంగా దివ్యాంగులు, అనారోగ్య కారణాలున్నవారు, ఒంటరి మహిళలు, స్పౌజ్ కేటగిరీ విషయంలో నిబంధనలను పాటించడం లేదని విమర్శలున్నాయి. ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి నిబంధనల ప్రకారం బదిలీలు నిర్వహించడం లేదని చెబుతున్నారు. ఇప్పటికే సొంత మండలాల్లో స్థానం కోల్పోయామని తెలిసిన వారు ఏ ప్రభుత్వ ఉద్యోగులకై నా ఇలా చేస్తారా? అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నిబంధనల ప్రకారమే నిర్వహించాం ప్రభుత్వ నిబంధనల ప్రకారమే బదిలీలు నిర్వహించాం. బదిలీలు అయిపోయినట్టే. ఆ జాబితాను కలెక్టర్కు అందజేశాం. ఆఫీసులో కరెంట్ లేకపోవడం వల్ల కొండాయపాళెం గేటు వద్ద అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ కార్యాలయంలో జాబితాను రూపొందించాం. మేము ఎవరికీ ఫోన్ చేయలేదు. – శోభారాణి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ -
గంజాయి అక్రమ రవాణాపై దాడులు
● 4 కేజీల స్వాధీనం నెల్లూరు(క్రైమ్): గంజాయి అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం నెల్లూరు రైల్వే డీఎస్పీ జి.మురళీధర్, రైల్వే సీఐ ఎ.సుధాకర్తో కలిసి తన కార్యాలయంలో తనిఖీల వివరాలను వెల్లడించారు. గురువారం సాయంత్రం సీఐ పర్యవేక్షణలో రైల్వే, ఆర్పీఎఫ్ అధికారులు తమ సిబ్బందితో కలిసి నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్లో తనిఖీలు చేపట్టారు. టాటానగర్ – ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు దిగి నాలుగో నంబర్ ప్లాట్ఫారానికి వెళ్తున్న పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన బిష్షు షబ్బర్, పదహారేళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరి బ్యాగ్ల్లో ఉన్న రూ.80 వేల విలువైన 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒడిశా, ఏఓబీ సరిహద్దుల్లో గంజాయిని కొనుగోలు చేసి చైన్నె తదితర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని డీఎస్పీ వెల్లడించారు. కేసులో ప్రతిభ చూపిన సీఐతోపాటు ఎస్సై ఎన్.హరిచందన, సిబ్బంది రవి, వెంకటేశ్వర్లు, మణికంఠ తదితరులను డీఎస్పీ అభినందించారు. -
స్థల వివాదంలో వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి
ఆత్మకూరు: చేజర్ల మండలం తూర్పుకంభంపాడు గ్రామంలో స్థల వివాదంలో వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్త కృష్ణవేణిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బాధితుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన పంచేటి కృష్ణవేణికి ఆమె బంధువువైన టీడీపీ కార్యకర్త కృష్ణయ్యకు మధ్య స్థల వివాదం ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తహసీల్దార్ బి.మురళి గ్రామానికి వెళ్లాడు. కృష్ణవేణి పొజిషన్ సర్టిఫికెట్ రద్దు చేస్తున్నామని, కృష్ణయ్యకు దారికి స్థలం ఇవ్వాలని చెప్పాడు. దీనిపై కృష్ణవేణి అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టులో ఈ అంశం ఉందన్నారు. రెండు నెలల క్రితం కోర్టు కమిషనర్ వచ్చి స్థలం పరిశీలించారని, ఇంకా తీర్పు వెలువడలేదన్నారు. ఈ సమయంలో దారి ఎలా ఇవ్వమంటారంటూ తహసీల్దార్ను ప్రశ్నించారు. అయితే తహసీల్దార్ ఆదేశాలతో సర్వేయర్, వీఆర్వోలు స్థలం కొలతలు వేసి కర్రలు నాటాలని ప్రయత్నించగా కృష్ణవేణి, ఆమె బంధువులు ప్రశ్నించారు. కృష్ణయ్య, అతని బంధువులు కృష్ణవేణిపై దాడికి పాల్పడ్డారు. దీంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితురాలు పోలీస్స్టేషన్కు వెళ్లగా సిబ్బంది లేరని తొలుత ఫిర్యాదు తీసుకోలేదు. ఫోన్లో ఎస్సై తిరుమలేశ్వరరావును సంప్రదించిన అనంతరం ఫిర్యాదు అందజేసి బాధితురాలిని ఆత్మకూరులోని ప్రభుత్వ వైద్యశాలకు చికిత్స కోసం బంధువులు తరలించారు. ఈ విషయమై తహసీల్దార్ స్పందిస్తూ అప్పట్లో ఇచ్చిన పొజిషన్ సర్టిఫికెట్ సర్వే నంబర్ తప్పు అని, అందుకే దానిని రద్దు చేస్తానన్నారు. కాగా కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణవేణిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు పరిగణలోకి తీసుకోలేదన్నారు. అప్పుల బాధ తాళలేక.. ● పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య నెల్లూరు సిటీ: అప్పుల బాధ తాళలేక ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. రూరల్ పరిధిలోని కలివెలపాళెంలో నివాసముంటున్న చాంద్బాషా (43) బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. ఇటీవల అప్పులు చేశాడు. ఆర్థిక సమస్యలతో వాటిని తీర్చలేకపోయాడు. గురువారం రాత్రి మామిడితోటలో చాంద్బాషా పురుగు మందు తాగి ఇంటికెళ్లాడు. కుటుంబ సభ్యులు గుర్తించి అతడిని హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆత్మాహుతికై నా సిద్ధమే.. భూములు మాత్రం ఇవ్వం
ఉలవపాడు: ఆత్మాహుతికై నా సిద్ధమే కానీ మా భూములు మాత్రం ఇవ్వమని మండలంలోని కరేడు రైతులు తేల్చి చెప్పారు. భూసేకరణపై ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభ శుక్రవారం కరేడులోని 1వ సచివాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భూ సేకరణకు వ్యతిరేకంగా తమ అభిప్రాయాలు వెల్లడించడానికి సుమారు 4 వేల మంది రైతులు తరలివచ్చారు. మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అధికారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. అభివృద్ధి అంటే ఏమిటని రైతులు ప్రశ్నించారు. మెట్ట భూములు ఉపయోగంలోకి తేవడం అభివృద్ధి అంటారన్నారు. సస్యశ్యామలంగా ఉన్న భూములను తీసుకుంటే అభివృద్ధి ఎలా అవుతుందని, వ్యవసాయమే లేకుండా చేస్తారా అని నిలదీశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మా భూములివ్వాలా అని అధికారులను ప్రశ్నించారు. తాము మాత్రం భూములివ్వడానికి అంగీకరించమని తేల్చి చెప్పారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్ మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం దృష్ట్యా భూ సేకరణ చేస్తున్నామన్నారు. రైతుల సమస్యలు 100 శాతం పరిష్కరించలేమని, కానీ వారికి అన్నీ అందించాలని కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. సబ్ కలెక్టర్ శ్రీపూజ మాట్లాడుతూ రైతుల సహకారంతోనే భూ సేకరణ చేస్తామన్నారు. చివరకు ఎలాంటి తీర్మానం లేకుండానే సభను ముగించారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు: ఎమ్మెల్సీ తూమాటి కరేడు రైతులకు ఏ మాత్రం అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు హెచ్చరించారు. రైతుల అభిప్రాయాలను తీసుకోకుండా ఒక్క ఎకరా కూడా తీసుకోలేరన్నారు. కరేడు రైతులందరూ చిన్న, సన్న కారు రైతులు వారు కేవలం వ్యవసాయం మీద ఆధారపడి జీవించే వాళ్లు. వారికి అండగా ఉంటామన్నారు. కంపెనీలు 75 శాతం ఉద్యోగాలు ఇస్తామని చెప్తారు. కానీ ఎక్కడ ఇచ్చారో చూపాలన్నారు. రామాయపట్నం పోర్టు అరబిందో కంపెనీ కడుతుంటే ప్రభుత్వం మారగానే నవయుగకు అప్పగించారన్నారు. అక్కడి ఉద్యోగులను తొలగించారని, కంపెనీలు ఉద్యోగాల కల్పనను పాటించడం లేదన్నారు. భూ సేకరణ జరగాలంటే ప్రజలను సంతృప్తి పరచి చేయాలి. రైతులు తమ నిర్ణయాన్ని తెలియజేశారని, వారికి అండగా ఉంటామన్నారు. రాస్తారోకోలో రైతులు తమ బాధను వెలిబుచ్చడానికి ఆందోళన చేస్తే వారిపై కేసులు పెట్టారని, వాటిని ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కరేడు గ్రామ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భూ సేకరణకు వ్యతిరేకంగా అర్జీ అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ సురేష్తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. తేల్చి చెప్పిన కరేడు గ్రామస్తులు బీడు భూములు కాకుండా.. పచ్చని భూములు తీసుకుంటారా? మూడు వేలకు పైగా అభ్యంతర అర్జీలు రైతులకు అండగా ఉంటాం: ఎమ్మెల్సీ తూమాటి -
గ్రామసభలు పెట్టకుండా భూములెలా ఇస్తారు?
● ఇండోసోల్ కంపెనీకి చంద్రబాబు బినామీనా? ● భూ కబ్జాదారులకు అండగా కూటమి ప్రభుత్వం ● వామపక్ష నేతలునెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములు కంపెనీలకు కేటాయించాలంటే గ్రామసభలు నిర్వహించాలి. రైతుల అభిప్రాయాలు తీసుకుని వారి అనుమతితో భూములను కేటాయించాలి. కానీ కూట మి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా రైతుల భూములు, గ్రామాలను ఇండోసోల్ సోలార్ కంపెనీకి కేటాయించడం చట్ట విరుద్ధం’ అని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) సీనియర్ నాయకులు రాంబాబు అన్నారు. నెల్లూరులోని బాలాజీ నగర్లో సీపీఎం జిల్లా కార్యాలయంలో గురువారం వామపక్షాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శుక్రవారం కలెక్టర్ కరేడు గ్రామానికి వెళ్లనున్నారన్నారు. రైతులు, ప్రజల నుంచి వచ్చిన తీవ్ర నిరసనతో ఇప్పుడు ప్రభుత్వం గ్రామాల్లో అభిప్రాయసేకరణ చేపట్టేందుకు సిద్ధపడిందన్నారు. గతంలో కూడా జిల్లాలోని ముత్తుకూరు, రాచర్లపాడు గ్రామాల్లో కంపెనీలకు వందలాది ఎకరాలు కట్టపెట్టారని అయితే సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి పరిశ్రమలు రాలేదని ఆరోపించారు. ఈ భూములను బ్యాంక్లో తాకట్టు పెట్టి రూ.వందల కోట్లు రుణాలు తీసుకుని ఎగనామం పెట్టే భూకబ్జాదారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోందని ఆరోపించారు. 8,464 ఎకరాలు ఇవ్వడం చూస్తుంటే సదరు కంపెనీకి చంద్రబాబు బినామీగా ఉన్నట్లు అనుమానం కలుగుతోందన్నారు. ఒక సంస్థకు భూములు ఇవ్వాలంటే గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు రెట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు రెట్లు అధికంగా నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. అందుకు భిన్నంగా తాము ఎంత ఇస్తే అంతే తీసుకుని భూములు, గ్రామాలు ఖాళీ చేసి వెళ్లాలని బెదిరించి పోలీసు కేసులు పెట్టి భూములను స్వాధీనం చేసుకుంటామంటే ఒప్పుకొనేది లేదన్నారు. కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు రైతులకు తన సొంత నగదుతోపాటు, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఇప్పిస్తానని చెబుతున్నాడని, ఆయనే నియోజకవర్గ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా భూములు స్వాధీనం చేసుకునేందుకు పోలీసు కేసులు పెట్టి రైతులు, ప్రజలను బెదించడం సరికాదన్నారు. ప్రజలతో పెట్టుకుంటే ఎమ్మెల్యే నియోజకవర్గంలో తిరగలేడని హెచ్చరించారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భూములను రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు షాన్వాజ్, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లు, ఎస్యూసీఐ నాయకుడు సురేష్ పాల్గొన్నారు. -
భూసేకరణకు వ్యతిరేకంగా..
● అర్జీలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న రైతులు●● నేడు కరేడులో గ్రామసభ ఉలవపాడు: భూ సేకరణ కోసం ప్రభుత్వం శుక్రవారం ఏర్పాటు చేస్తున్న గ్రామసభలో భారీగా అర్జీలు అందించి నిరసన తెలియజేయాలని రైతులు సిద్ధమవుతున్నారు. గురువారం కరేడు గ్రామంలో పెద్ద సంఖ్యలో అర్జీలు రాశారు. ప్రభుత్వం రైతులకు భూ సేకరణ గ్రామసభ ఉందని సమాచారం ఇవ్వకపోయినా.. వారు మాత్రం తెలుసుకుని మరీ తమ అభ్యంతరాలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇండోసోల్ కంపెనీకి భూములు ఇవ్వడంపై రైతులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తమ భూములు ఇవ్వమని రోడ్డెక్కడంతోనే ప్రభుత్వం దిగొచ్చి గ్రామసభను ఏర్పాటు చేసింది. ఈ పరిస్థితుల్లో సభను సంపూర్ణంగా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో రైతులున్నట్లు సమాచారం. ప్రతి ఒక్కరూ ఎవరికి వారే అభ్యంతరం తెలియజేయడానికి అర్జీలను రూపొందించుకుంటున్నారు. భూమి లేకపోతే తాము బతకలేమని, భూములు, ఇళ్లు ఇచ్చేది లేదని కచ్చితంగా చెప్పేలా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కూటమి ప్రభు త్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎందాకై నా పోరాడేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు రైతులకు మద్దతు తెలుపుతున్నాయి. గోడు వినిపించనున్న రైతులు శుక్రవారం కరేడులో జరిగే గ్రామసభకు కలెక్టర్ ఆనంద్, సబ్ కలెక్టర్ శ్రీపూజ, తహసీల్దార్ శ్రీనివాసరావు వస్తున్నట్లు సమాచారం. ఇందులో రైతులు తమ బాధలను అర్జీల రూపంలో తెలియజేయనున్నారు. కరేడు రైతులకు అండగా వైఎస్సార్సీపీ, వామపక్షాలు, కాంగ్రెస్తోపాటు పలు పా ర్టీలు మద్దతు ఇస్తున్నాయి. కూటమి పార్టీలు తప్ప మిగిలినవి భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఆయా పార్టీలు కూడా అర్జీలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇందుకోసం రైతులతో కలిసి మాట్లాడి వారి అభిప్రాయాన్ని పార్టీ తరఫున అందజేయనున్నారు. వైఎస్సార్సీపీ కరేడు రైతుల కోసం ఎంత వరకై నా పోరాడడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో సభకు పోలీసు బందోబస్తు కూడా భారీగా ఉండే అవకాశం ఉంది. -
కుక్కల దాడిలో చుక్కలదుప్పి మృతి
మర్రిపాడు: మండలంలోని పొంగూరుకండ్రికలో గురువారం జనారణ్యంలోకి చుక్కల దుప్పి వచ్చింది. కుక్కలు దానిని వెంటాడి గాయపరిచాయి. దీంతో దుప్పి మృతిచెందగా గమనించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువకుడి ఆత్మహత్య ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని గోపాలపురం సమీపం ఉన్న ఉప్పునీటి దొరువులో దూకి మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. కృష్ణపట్నం పోర్టు ఎస్సై శ్రీనివాసరెడ్డి కథనం మేరకు.. మహారాష్ట్రకు చెందిన అనిల్ భద్ర (27), మరో ముగ్గురు వ్యక్తులు రెండురోజుల క్రితం గేట్వే కంపెనీలో చేరారు. వారంతా ముత్తుకూరులో ఓ హోటల్లో బసచేసి బుధవారం ఒక్కరోజే విధులు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున అనిల్భద్ర కనిపించకపోవడంతో మిగిలిన ముగ్గురు ఫోన్ చేశారు. అతను తన స్వస్థలానికి వెళ్లిపోతున్నానని చెప్పి కాల్ కట్ చేశాడు. ఈ నేపథ్యంలో గోపాలపురం వద్ద వాటర్ ట్యాంకర్ కింద పడి ఆత్మహత్య చేసుకోవాలని అనిల్ ప్రయత్నించగా డ్రైవర్ చాకచక్యంగా తప్పించాడు. దీంతో పరిగెత్తుకుంటూ వెళ్లి ఉప్పునీటి దొరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. అనుమతి లేకుండా దుంగలు తరలిస్తుండగా.. ● రెండు ట్రాక్టర్లను పట్టుకున్న అటవీ అధికారులు ● ఆ వాహనాలు టీడీపీ నేతవిగా గుర్తింపు సైదాపురం: అనుమతి లేకుండా రెండు ట్రాక్టర్లలో వేప దుంగలు తరలిస్తుండగా గురువారం అటవీ శాఖాధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన మండలంలోని లింగసముద్రం గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, అధికారుల కథనం మేరకు.. ప్రకృతి సంపదన నరికి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు నెల్లూరు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. వారి ఆదేశాల మేరకు స్థానిక అధికారులు తనిఖీలు చేశారు. లింగసము ద్రం గ్రామం నుంచి గూడూరుకు రెండు ట్రాక్టర్లలో వేప దుంగల్ని తరలిస్తుండగా పట్టుకున్నా రు. ట్రాక్టర్లు స్థానిక టీడీపీ నేతవిగా గుర్తించారు. ఈ సందర్భంగా నెల్లూరు అటవీ శాఖ రేంజర్ మాల్యాద్రి మాట్లాడుతూ అనుమతి లేకుండా దుంగల్ని రవాణా చేసే వారిపై కఠినమైన చర్యల తీసుకుంటామని హెచ్చరించారు. రెండు ట్రాక్టర్ల విషయమై సమగ్రవిచారణ చేస్తున్నట్లు తెలిపారు. -
ఉపాధ్యాయుడి సస్పెన్షన్
వరికుంటపాడు: మండలంలోని తూర్పు బోయమడుగు ప్రాథమికోన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు వెంగయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను డీఈఓ బాలాజీరావు గురువారం జారీ చేశారు. దీన్ని ప్రధానోపాధ్యాయుడికి ఎంఈఓలు రమేష్, రమణయ్య అందజేశారు. పాఠశాలలో బాలికలతో వెంగయ్య అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ గ్రామస్తులు రెండు రోజుల క్రితం దేహశుద్ధి చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి నివేదిక పంపారు. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటేశారు. రొట్టెల పండగకు పటిష్ట బందోబస్తు నెల్లూరు సిటీ: రొట్టెల పండగకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేయనున్నామని ఎస్పీ కృష్ణకాంత్ పేర్కొన్నారు. బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండగ ఏర్పాట్లను గురువారం ఆయన పరిశీలించారు. పరిసరాలు, కంట్రోల్ రూమ్, వాహన పార్కింగ్ ప్రదేశాల్లో చేస్తున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. దర్గా మార్గంలో ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, ఘాట్ ఏరియా, రొట్టెల మార్పిడి చేసే ప్రదేశాలను సందర్శించారు. భక్తుల రద్దీకి తగిన విధంగా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. -
కాకాణిపై ఆగని కక్షసాధింపు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై అక్రమ కేసుల పరంపర కొనసాగుతోంది. రిమాండ్లో ఉన్న ఆయన్ను మరికొన్ని రోజుల పాటు బయటకు రానీయకుండా మరిన్ని అక్రమ కేసులను నమోదు చేయాలని పోలీస్ అధికారులకు కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఎకై ్సజ్ శాఖ సైతం తలదూర్చి అక్రమ కేసులు బనాయించి ముప్పుతిప్పలు పెడుతోంది. కాకాణిపై సర్కార్ పాల్పడుతున్న కుట్రలతో టీడీపీ శ్రేణులు భవిష్యత్తును తలుచుకొని బెంబేలెత్తుతున్నారు. వైఫల్యాలను ప్రశ్నించడాన్ని తట్టుకోలేక.. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి వారి వైఫల్యాలతో పాటు స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అవినీతి, అక్రమాలను నిరంతరం ఎండగడుతూ వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిన సమయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీస్ శాఖ తీరును తప్పుబట్టేవారు. ఈ పరిణామాలు రుచించని ఎమ్మెల్యే, ప్రభుత్వ పెద్దలు ఆయన్ను టార్గెట్ చేశారు. సర్కారు ఏర్పాటైన ఐదు నెలల్లో ఏడు కేసులు నమోదు చేయించారు. అక్రమ మైనింగ్ చేశారంటూ.. ఇవన్నీ బెయిలబుల్ కిందికొచ్చేవి కావడంతో పొదలకూరు మండలం రుస్తుం మైన్లో అక్రమంగా మైనింగ్ జరిపారంటూ మరో కేసును నమోదు చేశారు. ఇందులో ముగ్గురికి హైకోర్టు ముందస్తు బెయిలిచ్చింది. ఏ – 4గా ఉన్న కాకాణికి బెయిల్ను అడ్డుకోవడమే లక్ష్యంగా మరో కొత్త కుట్రను తెరపైకి తెచ్చారు. మైన్లో జిలెటిన్ స్టిక్స్ లాంటి పేలుడు పదార్థాలను ఉపయోగించారని.. ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టారని.. అట్రాసిటీ కేసును బనాయించి జైలుకు పంపారు. కాగా ఇదే కేసులో ఏ – 5గా ఉన్న టీడీపీ నేతను మాత్రం విచారణకు ఇప్పటికీ పిలవలేదు. గ్రావెల్ తవ్వకాలకు జీఓ ఇచ్చినా.. వెంకటాచలం మండలంలోని కనుపూరు చెరువులో మట్టి తవ్వకాలకు గత టీడీపీ ప్రభుత్వం జీఓను జారీ చేసింది. దీనికి అనుబంధంగా గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల అవసరాల నిమిత్తం జీఓలను రెండుసార్లు విడుదల చేసింది. అందులో నిబంధనల మేరకే మట్టి తవ్వకాలు జరిగాయి. అయితే కేసులో ఏ – 2గా చూపి రిమాండ్ పొడిగించేలా చేశారు. ప్రస్తుతం ఆ కేసులో పోలీస్ కస్టడీకి పిటిషన్ వేయడంతో సోమవారానికి వాయిదా వేశారు. ఎంపీ శ్రీనివాసులురెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ తవ్వకాలు చేశారని మరో అక్రమ కేసు నమోదు చేసి రిమాండ్ పొడిగించారు. ఇందులోనూ కాకాణిని పోలీస్ కస్టడీకి తీసుకొని విచారణ పూర్తి చేశారు. లేనిపోనివి తెరపైకి.. ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టు వద్ద లారీ ఓనర్స్, కంటైనర్, కృష్ణపట్నం లాజిస్టిక్ అసోసియేషన్లను గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు ఏర్పాటు చేసి ట్రాన్స్పోర్ట్ వాహనాల నుంచి వసూలు చేశారని మరో అక్రమ కేసు నమోదు చేశారు. ఇందులోనూ విచారణను పూర్తి చేశారు. మద్యం కేసును తిరగదోడి.. గత ఎన్నికల సమయంలో ముత్తుకూరు మండలం పంటపాళెం, పొదలకూరు మండలం విరువూరులో మద్యం కేసులు పట్టుబడ్డాయి. అప్పట్లో వీటిని ఎస్ఈబీ అధికారులు స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్ట్ చేశారు. ఈసీ నిబంధనల మేరకు వీటిపై అధికారులు చార్జీషీట్ను దాఖలు చేయడంతో కేసులు ముగిశాయి. తాజాగా ఈ రెండింటినీ తిరగదోడి కాకాణిపై పీటీ వారెంట్ను జారీ చేయడం వేధింపుల పర్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. ధైర్యంగా ఎదుర్కొంటున్న కాకాణి ఈ కేసులు ఎకై ్సజ్ శాఖ పరిధిలో ఉన్నాయి. అయితే రికార్డులను పోలీస్ శాఖ బిగించి ఎకై ్సజ్ అధికారుల ద్వారా సంతకాలు చేయించి.. కాకాణి పేరును నమోదు చేసి కోర్టులో గురువారం హాజరుపర్చారు. ఈ కేసులో ఈ నెల 17 వరకు రిమాండ్ విధించారు. విరువూరు మద్యం కేసులో కాకాణిపై పీటీ వారెంట్ను సిద్ధం చేశారు. కస్టడీ పేరుతో బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. ఎన్ని అక్రమ కేసులను నమోదు చేసినా, కాకాణి మాత్రం ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. 17 వరకు జ్యుడీషియల్ రిమాండ్ నెల్లూరు (లీగల్): మద్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై ఇందుకూరుపేట ప్రొహిబిషన్, ఎకై ్సజ్ పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో జూలై 17 వరకు జ్యుడీషియల్ రిమాండ్ను విధిస్తూ న్యాయమూర్తి గురువారం ఉత్తర్వులిచ్చారు. నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి పీటీ వారెంట్పై నెల్లూరు స్పెషల్ ఎకై ్సజ్ (ఇన్చార్జి) కోర్టులో ఎకై ్సజ్ పోలీసులు హాజరుపర్చారు. ఎకై ్సజ్ తరఫున ఏపీపీ లక్ష్మీనారాయణ.. కాకాణి తరఫున రామిరెడ్డి రోజారెడ్డి, ఉమామహేశ్వర్రెడ్డి, సిద్ధన సుబ్బారెడ్డి, విజయలక్ష్మి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ఇన్చార్జి న్యాయమూర్తి నిషాద్ నాజ్షేక్ జూలై 17 వరకు జ్యుడీషియల్ రిమాండ్కు ఉత్తర్వులిచ్చారు. కాకాణి తరఫున బెయిల్ పిటిషన్ను న్యాయవాదులు దాఖలు చేశారు. తాజాగా మద్యం కేసులో పీటీ వారెంట్ ఈ నెల 17 వరకు రిమాండ్ ఆయనపై ఆరు అక్రమ కేసులు రెండు నెలల పాటు బయటకు రాకుండా అడ్డుకునేందుకు యత్నం రెండు నెలల పాటు రాకూడదని.. అక్రమ మైనింగ్ కేసులో నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న కాకాణిని మరో రెండు నెలల పాటు బయటకు రానీయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వ పెద్దలతో పాటు పోలీసులు మరో ఆరు అక్రమ కేసులు బనాయించారు. సోమిరెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యంగ్య చిత్రాలను వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేశారని.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఎమ్మెల్యే అనుచరుడు మేకల సురేంద్ర ఫిర్యాదు మేరకు మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంలో గుంటూరు కోర్టులో హాజరుపర్చగా, రిమాండ్ విధించారు. అయితే తప్పుడు కేసు కావడంతో హైకోర్టు స్టే ఇచ్చింది. -
మహిళా సమస్యలపై ఉద్యమాలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): మహిళా సమస్యలపై ఉద్యమాలు చేపట్టేందుకు సంబంధించిన కార్యాచరణ నిమిత్తం ఐద్వా మహాసభలను నిర్వహిస్తున్నామని జిల్లా, నగర కార్యదర్శులు మస్తాన్బీ, కత్తి పద్మ, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ దుగ్గిరాల అన్నపూర్ణమ్మ పేర్కొన్నారు. ఐద్వా నగర 16వ మహాసభలను గుర్రాలమడుగు సంఘంలోని జక్కా పార్వతమ్మ, బీబీజాన్ ప్రాంగణంలో గురువారం నిర్వహించారు. ఐద్వా పతాకాన్ని ఆవిష్కరించి.. వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన మద్యం పాలసీ పేరుతో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఐద్వా జిల్లా, నగరాధ్యక్షులు సుబ్బమ్మ, శివకుమారి, రూరల్ అధ్యక్షురాలు వరలక్ష్మి, నేతలు భాగ్యమ్మ, నాజున్నీ, ఆదిలక్ష్మి, మహ్మదా, షాహిన్, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు రజిని, కామాక్షమ్మ తదితరులు పాల్గొన్నారు. -
మా బిడ్డ మరణంపై అనుమానాలు నిగ్గు తేల్చాలి
విద్యార్థులకు మంచి సర్వీస్ ఇస్తున్నాం స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. పిల్లలకు డాక్టర్స్తో తరచూ కౌన్సెలింగ్ క్లాసెస్ ఇస్తున్నాం. తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య కూడా చిన్న చిన్న విషయాలు కూడా పరిష్కరిస్తున్నాం. ఆ రాత్రి కూడా తండ్రితో మాట్లాడాడు. ఒక్కడివే ఎందుకు స్నేహితులతో ఉండమని తండ్రి చెప్పాడు. అయినా పర్లేదు నాకు అలవాటే నాన్న అని చెప్పాడు. అయితే ఉదయానికి ఇలా ఉరేసుకున్నాడు. – మల్లికార్జున, ప్రిన్సిపల్ నెల్లూరు సిటీ: తమ బిడ్డను ఉన్నత చదువులు చదివించేందుకు కుమారుడిని విడిచి దూరంగా ఉండలేకపోయినా తల్లిదండ్రులు హాస్టల్లో చదివిస్తున్నారు. అయితే హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం నేపథ్యంలో ఆ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. నగరంలోని రామచంద్రాపురం మూడో వీధిలో నివాసం ఉంటున్న ఎన్.సాయిరామ్, కవిత దంపతుల కుమారుడు రేవంత్ (17)తోపాటు కుమార్తె ఉన్నారు. తండ్రి సాయిరామ్ చేజర్లలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే విద్యార్థి మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరురూరల్ ఇన్స్పెక్టర్ వేణు ఘటనా స్థలానికి చేరుకుని హాస్టల్లో సీసీ కెమెరాలు పరిశీలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి ఆ రోజు హాస్టల్ గదిలో ఒక్కడే నిద్ర తెల్లారే సరికి బాత్రూమ్లో ఉరేసుకుని విగతజీవిగా వేలాడిన వైనం హాస్టల్ నిర్వాహకుల తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం సెటిల్మెంట్ చేసుకుందామని తల్లిదండ్రులతో బేరసారాలు -
యాజమాన్య నిర్లక్ష్యంతోనే మా కుమారుడి మృతి
మంగళవారం రాత్రి నా కుమారుడు రేవంత్ ఫోన్ చేసి ఎదురు రూమ్లో ఐదుగురు విద్యార్థులు రూమ్ మారుదామని చెబుతున్నారని, బూతులు కూడా తిడుతున్నారని, భయంగా ఉందన్నాడు. ప్రిన్సిపల్కు ఫోన్ చేసి చెప్పమన్నాడు. ఇన్చార్జికి చెప్పలేదా అని అడిగితే చెప్పాను పట్టించుకోవట్లేదని రేవంత్ చెప్పాడు. వెంటనే నేను ప్రిన్సిపల్కు ఫోన్ చెప్పాను. అయినప్పటికీ ప్రిన్సిపల్ పట్టించుకోలేదు. దీంతో కొద్దిసేపటికే రెండో సారి కూడా రేవంత్ ఫోన్ చేసి ప్రిన్సిపల్కు చెప్పావా నాన్న అని అడిగితే చెప్పాను.. ప్రిన్సిపల్ వచ్చి మాట్లాడుతానని చెప్పారని బదులిచ్చాను. ఈ క్రమంలో బుధవారం ఉదయం 8.30 గంటలకు కళాశాల నిర్వాహకులు ఫోన్ చేసి రేవంత్ ఉరేసుకున్నాడని, కొన ఊపిరితో ఉన్నాడని ఫోన్ చేశారు. అపోలో హాస్పిటల్కు తీసుకెళ్లామని చెప్పాం. మా కుమారుడు కళాశాల నిర్వాహకుల వల్లే మృతి చెందారని ఆరోపించారు. ఈ విషయవం మీడియాకు చెప్పొద్దని, సెటిల్మెంట్ చేసుకుందామని కళాశాల నిర్వాహకులు మా బంధువులతో బేరసారాలు చేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. మా కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయి. తోటి పిల్లలే చేశారో.. యాజమాన్యం చేశారో పోలీసులే విచారించి న్యాయం చేయాలని కోరారు. – రేవంత్ తండ్రి సాయిరామ్ -
జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షం
కోవూరు: వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా పని చేసిన ఐదేళ్లు రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉన్నారని, ఇప్పుడు కూటమి పాలనలో ప్రజలు దుర్భిక్షంలో కొట్టు మిట్టాడుతున్నారని మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. ఏ ఊరికి వెళ్లినా ప్రజలు మా దగ్గరకు వచ్చి మా ఓట్లు వైఎస్సార్సీపీకే వేశామని, అయినా కూటమి ప్రభుత్వం వచ్చి, మా జీవితాలు దుర్భరంగా మారాయని కన్నీరు పెట్టుకుంటున్నారని ప్రసన్న ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం కోవూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మనస్సాక్షిగా ఇచ్చిన పథకం ఏ ఒక్కటీ లేదన్నారు. వైఎస్సార్సీపీ చేసిన నిరసనల ఫలితంగానే తల్లికి వందనం (అమ్మ ఒడి) డబ్బులు వేశారన్నారు. ఈ పథకం కూడా చాలా మందికి అందలేదన్నారు. చంద్రబాబు ఈవీఎంల ద్వారా సీఎం అయ్యారే కాని ప్రజలు ఇచ్చే తీర్పునకు కాదన్నారు. మా ప్రభుత్వ పాలనలో కోవూరు నియోజకవర్గానికి కోట్లాది రూపాయలు నిధులు సమీకరించి అభివృద్ధి చేశామన్నారు. అదే ఈవీఎంల ద్వారా గెలిచిన ఎమ్మెల్యేకు అవగాహన లేకపోవడం, ఎవరో తెల్ల కాగితంపైన రాసి ఇచ్చిన దానిని చదవడం విచారకరమన్నారు. రాష్ట్రంలో 22 మంది ఎంపీలు ఉంటే దాదాపు 17 మంది ఎంపీలతోపాటు ఇతర రాష్ట్రాల ఎంపీల వద్ద నుంచి కూడా నిధులు తీసుకువచ్చి నియోకవర్గంలో అభివృద్ది పనులు చేశామని గుర్తు చేశారు. అప్పటి మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలతోపాటు అభివృద్ధి పనులు చేశారన్నారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసింది శూన్యమన్నారు. ముదివర్తి– ముదివర్తిపాళెం కాజ్వే ప్రసన్నన్న కృషి ఫలితమే ముదివర్తి– ముదివర్తిపాళెం కాజ్వే నిర్మాణం మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రన్నకుమార్రెడ్డి కృషి ఫలితమేని, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఘనత అని డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరిచలపతిరావు అన్నారు. ముదివర్తి– ముదివర్తిపాళెం కాజ్వే నిర్మాణం ఆవశ్యకతను అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న ప్రసన్నన్న ఆ నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తే మొదటి విడతగా రూ.92.32 కోట్ల నిధులతో కాజ్వే నిర్మాణానికి పనులు చేపట్టడం జరిగిందన్నారు.మా ప్రభుత్వంలో మేము చేపట్టిన ఈ పనిని కూటమి ఖాతాలో వేసుకోవడం సిగ్గు చేటన్నారు. కోవూరు నియోజకవర్గంలో కూటమి పాలనలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చేపట్టిన శాశ్వత ప్రయోజనకరమైన ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేశామని నిరూపిస్తే తాము రాజకీయాల నుంచే తప్పుకుంటామన్నారు. ● నెల్లూరు– మైపాడు రోడ్డుకు రూ.48 కోట్ల అంచనాతో నిధులు మంజూరు చేయించారన్నారు. బుచ్చిరెడ్డిపాళెం ప్రజల దాహార్తి తీర్చేందుకు అమృత్ పథకం కింద రూ.85 కోట్లు నిధులతో పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. మరో రూ.45 కోట్లతోబుచ్చిరెడ్డిపాళెంలో సీసీ రోడ్డు, బీటీ రోడ్డుతోపాటు పార్కుల అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత మా ప్రభుత్వం, మా ప్రసన్నదేనని చెప్పారు. బుచ్చిరెడ్డిపాళెం–దగదర్తి రోడ్డు నిర్మాణ ఘటనత కూడా తమదే అన్నారు. ఈ కార్యక్రమంలో అనంతరం ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లప్రోలు విజయ్కుమార్, మండల కన్వీనర్లు శ్రీనివాసులురెడ్డి, అనూప్రెడ్డి, సతీష్రెడ్డి, నాయకులు దినేష్రెడ్డి, నరసింహులురెడ్డి, సుబ్బారెడ్డి, రాధాకృష్ణారెడ్డి, షాహుల్, రఫీ, జెడ్పీటీసీ శ్రీలత, ఉమ తదితరులు ఉన్నారు. కూటమి పాలనలో దుర్భిక్షంలో ప్రజలు మాజీమంత్రి ప్రసన్నకుమార్రెడ్డి మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కూటమి ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావు -
‘సుపరిపాలన’కు ఎమ్మెల్యేల డుమ్మా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి ప్రభుత్వం ఏడాది ‘సుపరిపాలనకు తొలిఅడుగు’ కార్యక్రమానికి తొలిరోజు బుధవారం జిల్లాలో మొక్కుబడిగా జరిగింది. నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కోవూరులో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తమ నియోజకవర్గాల్లో, కావలిలో దగుమాటి కృష్ణారెడ్డి పట్టుమని పది ఇళ్లు కూడా తిరగకుండానే మొక్కుబడిగా నిర్వహించి మమ అనిపించారు. ఉదయగిరి, కందుకూరు ఎమ్మెల్యేలు కాకర్ల సురేష్, ఇంటూరి నాగేశ్వరరావు విదేశాలకు చెక్కేశారు. స్థానికంగా ఉన్నప్పటికీ సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అసలు కార్యక్రమాన్నే ప్రారంభించలేదు. అర్ధరాత్రి దర్గా కూల్చేశారు నెల్లూరు రూరల్: నెల్లూరు వెంకటేశ్వరపురంలోని మస్తానీ అమ్మవారి దర్గాను ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇంజినీరింగ్ అధికారులు గత నెల 30వ తేదీ రాత్రికి రాత్రే కూల్చి వేశారని కమిటీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక ప్రెస్క్లబ్లో కమిటీ సభ్యులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మస్తానీ అమ్మవారి దర్గాలో గత 40 సంవత్సరాల నుంచి నిత్యం పూజలు చేస్తూ సేవ చేసుకునే వారమని తెలిపారు. ఈ దర్గా 15 అంకణాల స్థలంలో ప్రభుత్వం మంజూరు చేసిన పట్టా కూడా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ముక్తియార్, సాజిదా, దస్తగిరి యాస్మిన్ తదితరులు పాల్గొన్నారు. పెద్దాస్పత్రి సూపరింటెండెంట్గా డాక్టర్ మాధవి నెల్లూరు (అర్బన్): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి) సూపరింటెండెంట్గా (ఎఫ్ఎసీ) బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్ డాక్టర్ కె.మాధవిని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నియమించింది. ఆమె బుధవారం ఆస్పత్రిలో బాధ్యతలు స్వీకరించారు. ఆమె ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్గాను, మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్గాను బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె కళాశాలలో సౌమ్యురాలిగా, నిజాయితీ గల అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు. విశ్రాంత సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ మస్తాన్బాషా, అడ్మినిస్ట్రేషన్ అధికారి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. రైతుల పోరాటానికి అండగా ఉంటాం ● కరేడులో వామపక్ష నేతల పర్యటన ఉలవపాడు: భూ సేకరణకు వ్యతిరేకంగా ఉద్యమి స్తున్న కరేడు గ్రామ రైతులకు వామపక్ష పార్టీలు అండగా ఉంటాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వంకాయలపాటి శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేవీ ప్రసాద్ అన్నారు. వామపక్ష పార్టీలు, అనుబంధ ప్రజాసంఘాల నాయకులు కరేడు పంచాయితీ పరిధిలోని రామకృష్ణపురం, ఉప్పరపాళెం, అలగాయపాళెం, కరేడు, పొట్టేళ్లగుంటలో బుధవారం వారు పర్యటించి ప్రజలతో మాట్లాడారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వ కుండా, గ్రామసభ నిర్వహించకుండా భూ సేకరణ నోటిఫికేషన్ ఇవ్వడం చట్టవిరుద్ధమన్నారు. మూడు పంటలు పండే పచ్చని భూములు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం వెనుక కుట్ర ఉందన్నారు. గతంలో ఇదే కంపెనీకి భూములు ఇస్తుంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు అదే కంపెనీకి 8,348 ఎకరాలు కేటాయించడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. గత నెల 29న జరిగిన రాస్తారోకోలో పోలీసులను తోసివేసి రోడ్డెక్కిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా కరేడు రైతుల పోరాట పటిమను తెలియ చేసిందన్నారు. వరి, మామిడి, సపోట, వేరుశనగ, కూరగాయలు పండించే రైతుల భూమిని తీసుకోవడానికి ఒప్పుకోమన్నారు. సీపీఎం నెల్లూరుజిల్లా కార్యదర్శి మూలం రమేష్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆండ్రామాల్యాద్రి, సీపీఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, రైతు సంఘం ప్రకాశంజిల్లా కార్యదర్శి హనుమారెడ్డి, సీపీఐ ఎంఎల్ నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సాగర్, పీఓడబ్ల్యూ నాయకురాలు పద్మ, ఈసీసీఐ నాయకులు ఆనంద్, ఆర్యస్పీ నాయకులు సురేష్, సీపీయం నాయకులు కుమార్ పాల్గొన్నారు. -
ప్రశాంతమ్మా.. ఇదేనా అవినీతి రహిత పాలన
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి అవినీతి రహిత పాలన అంటూ నిత్యం నీతులు వల్లిస్తోంది. కానీ తన నియోజకవర్గంలోనే అన్ని రంగాల్లో అవినీతే జరుగుతోంది. పోతిరెడ్డిపాళెంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరుగుతోంది. జొన్నవాడ, మినగల్లు నుంచి పోతిరెడ్డిపాళెం, పల్లిపాళెం వరకు నిత్యం భారీ స్థాయిలో ఇసుక అక్రమ రవాణా జరగుతూనే ఉంది. కానీ ఎక్కడా అధికారులు అడ్డుకునే ప్రయత్నాలు చేయడం లేదు. గతంలో మినగల్లులో 12 వేల మెట్రిక్ టన్నుల ఇసుక మాయం చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పటి వరకు ఆ మాయమైన ఇసుక నగదు రికవరీ ఏమైందో ఇప్పటికీ చిదంబర రహస్యంగానే మిగిలిపోయింది. -
విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలి
నెల్లూరు (టౌన్): స్థానిక ధనలక్ష్మీపురంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలని ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యసాయి డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక వీఆర్సీ సెంటర్లో ధర్నా నిర్వహించి మాట్లాడారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల ఫీజులు, పుస్తకాల విక్రయాలపై ఉన్న శ్రద్ధ వారి భద్రతపై లేదని మండి పడ్డారు. ఇప్పటికై నా విద్యార్థి మృతిపై విచారణ జరిపించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హరీష్, బాలు, సాయి, మురళి, జనార్దన్, అబు తదితరులు పాల్గొన్నారు. -
అత్తమామల హత్య కేసులో నిందితుడి అరెస్ట్
కావలి(జలదంకి): ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు ఏసీ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి మద్యం మత్తులో అత్తమామలను హత్య చేసిన ఏలూరు వెంగయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం కావలి డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ పి.శ్రీధర్ వివరాలు వెల్లడించారు. వెంగయ్యకు వెంకాయమ్మ అనే మహిళతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం ఉన్నారు. చేపల వేట, చిల్లకర్ర కొట్టుకుని జీవనం సాగిస్తున్నారు. వెంగయ్య అత్తమామలు చలంచర్ల కల్లయ్య (62), చలంచర్ల జయమ్మ (59)లు వారింటి సమీపంలోనే ఉంటూ మేకలు కాస్తున్నారు. వెంగయ్య నిత్యం మద్యం మత్తులో ఉండేవాడు. అతను భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆదివారం వెంగయ్య భార్యను పిట్టల వేటకు రమ్మని పిలవగా రాలేనని చెప్పింది. వేటకు వెళ్లి వచ్చిన అతడికి భార్య వేరేవారితో చేపల వేటకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో వెంగయ్య భార్యపై మరింత అనుమానం పెంచుకుని ఫూటుగా మద్యం తాగాడు. అనంతరం భార్య తల్లిదండ్రుల ఇంటి వద్ద ఉండగా అక్కడికి వెళ్లాడు. మచ్చు కత్తితో వెంకాయమ్మ వీపుపై నరికాడు. కుమార్తెను కాపాడాలని కల్లయ్య, జయమ్మ అడ్డు వెళ్లారు. వెంగయ్య భార్యను వదిలేసి అత్తమామలను కత్తితో విచక్షణారహితంగా నరికి చంపాడు. వారిద్దరూ అక్కడికక్కడే మృతిచెందగా నిందితుడు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి వెంగయ్య కోసం గాలించారు. అతడిని లక్ష్మీపురం శివారులోని మిద్దెలబోడు కొండ – రామస్వామికుంట వద్ద బుధవారం అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన కలిగిరి సీఐ వెంకట్రావ్, దుత్తలూరు, ఉదయగిరి ఎస్సైలు ఆదిలక్ష్మి, ఇంద్రసేనారెడ్డి, సిబ్బందిని అభినందించారు. -
వైద్యులను అరెస్ట్ చేయడం దుర్మార్గం
నెల్లూరు (అర్బన్): విదేశాల్లో వైద్య విద్యను పూర్తి చేసుకుని శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆందోళన చేస్తున్న వైద్య విద్యార్థులను కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేయడం దుర్మార్గమని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సునీల్ అన్నారు. యువ వైద్యుల అరెస్ట్ను నిరసిస్తూ బుధవారం నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరికి ఆ సంఘం నాయకులు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ ఎన్నో కష్టాలు పడి అప్పులు చేసి విదేశాల్లో చదివి పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో డాక్టర్ అయిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ను పర్మినెంట్ రిజిస్టర్ సర్టిఫికెట్ ఇవ్వమని కోరారన్నారు. గత 13 నెలలుగా రిజిస్ట్రేషన్ కోసం శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోలేదన్నారు. ఈ నేపథ్యంలోనే మెడికల్ కౌన్సిల్ కార్యాలయం వద్దకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోసం వచ్చిన యువ వైద్యులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నగర అధ్యక్షుడు ఆశిర్, నాయకులు చరణ్, వంశీ తదితరులు పాల్గొన్నారు. -
రొట్టెల పండగకు ఏర్పాట్లు
● ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు.. ● రూ.3.5 కోట్లతో వసతులు ● మూడు షిఫ్ట్ల్లో 5 వేల మంది పారిశుధ్య కార్మికులు ● 14 పార్కింగ్ స్థలాల గుర్తింపునెల్లూరు(బారకాసు): నెల్లూరులో ఈనెల 6 నుంచి 10వ తేదీ వరకు రొట్టెల పండగను నిర్వహించనున్నారు. రూ.3.5 కోట్లతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పండగకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. బారాషహీద్ దర్గా ప్రాంగణంలో 12 తాగునీటి స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. స్నానపు గదులు, మరుగుదొడ్లు పెట్టారు. వర్షం వచ్చినప్పుడు తడవకుండా ఉండేందుకు షెడ్లపైన వాటర్ ప్రూఫ్ జింక్షీట్లు ఏర్పాటు చేశారు. పార్కింగ్కు ప్రత్యేక స్థలాలు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తమ వాహనాలను పార్కింగ్ చేసేందుకు దాదాపు 14 పార్కింగ్ స్థలాలను గుర్తించారు. నగరంలోని పాత టీబీ హాస్పిటల్, సైన్స్ పార్కు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ప్రాంగణం (బాలుర వసతి గృహం వెనుక), వైఎంసీఏ క్రీడా మైదానం, ఎన్టీఆర్ నగర్ సమీపంలోని వేణుగోపాలస్వామి కళాశాల ప్రాంగణం, పాత సీవీ రామన్ స్కూల్ ప్రాంగణం, జొన్నవాడకు వెళ్లే దారిలోని డీఎస్ఎన్ మినీ ఫంక్షన్ హాల్ ముందు వైపు, డీఎస్ఎన్ మినీ ఫంక్షన్ హాల్ వెనుక వైపు ఉన్న ఖాళీ ప్రాంగణం, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వెనుక వైపు (కస్తూరిదేవి స్కూల్ ఎదురుగా) ఉన్న ఎగ్జిబిషన్ స్థలం, పొదలకూరురోడ్డులోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణం, వీఆర్సీ క్రీడా మైదానం, డీకేడబ్ల్యూ కళాశాల ప్రాంగణం, కస్తూర్బా గార్డెన్ వెనుకవైపు ఉన్న ప్రాంగణం, ప్రసార భారతి (ఆకాశవాణి) రేడియో కేంద్ర సమీపంలోని ప్రాంగణంతోపాటు అవసరం మేరకు పోలీసు అధికారులు సూచించే మరికొన్నిచోట్ల పార్కింగ్ స్థలాలు కేటాయించడం జరుగుతుంది. వాటి వద్ద కార్పొరేషన్ అధికారులు మొబైల్ టాయిలెట్స్, స్నానపు గదులు, తాగునీటి వసతి ఏర్పాట్లు చేస్తున్నారు. అంతే కాకుండా విద్యుత్ దీపాలు పెడుతున్నారు. సీసీ కెమెరాలు అమర్చనున్నారు. దర్గా ప్రాంగణంలో 40 సీసీ కెమెరాలతోపాటు మరో 5 పీటీజెడ్ కెమెరాలు, 2 డ్రోన్ల నిత్యం పరిశీలించనున్నారు. వాటిని పోలీస్ కంట్రోల్రూంకు అనుసంధానం చేయడం జరుగుతుంది.ఏర్పాట్లు ఇలా.. బారాషహీద్ దర్గా ప్రాంగణంతోపాటు సమీప ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకున్నారు. మూడు షిఫ్టుల్లో పనిచేసేందుకు 5 వేల మంది కార్మికులను నియమించడం జరుగుతుంది. స్వర్ణాల చెరువు ఘాట్ వద్ద మోటార్లతో వాటర్ ప్యూరిఫై చేసే పనులు చేపట్టనున్నారు. దర్గా ప్రాంగణంతోపాటు కేవీఆర్ పెట్రోల్ బంక్, బట్వాడిపాళెం సెంటర్, పొదలకూరోడ్డు కూడలి వరకు రోడ్డుకిరువైపులా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా వీఐపీ రిసెప్షన్ కోసం ప్రత్యేకంగా టెంట్ వేస్తున్నారు. అన్నదానం చేసేందుకు మరో రెండు టెంట్లు వేయనున్నారు. ప్రత్యేకంగా పోలీస్ కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేయడం జరుగుతోంది. నిత్యం సమీక్షిస్తున్నాం రొట్టెల పండగకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని శాఖల సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాం. దాదాపు రూ.3.5 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందని అంచనా వేశాం. నిత్యం అధికారులతో ఏర్పాట్లను సమీక్షిస్తున్నాం. – వైఓ నందన్, కమిషనర్, నెల్లూరు నగరపాలక సంస్థ -
నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
● కలెక్టర్ ఆనంద్ నెల్లూరు రూరల్: అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆనంద్ అధికారులను హెచ్చరించారు. పీజీఆర్ఎస్ అర్జీలు, ఇళ్ల నిర్మాణాల పురోగతి, ఉపాధి హామీ పనులు, పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు, పింఛన్ల పంపిణీ మొదలైన అంశాలపై మంగళవారం సాయంత్రం నెల్లూరు కలెక్టరేట్ నుంచి సబ్ కలెక్టర్, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను చేరుకోవడంలో అశ్రద్ధగా ఉంటే చర్యలకు వెనుకాడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జిల్లాలో గృహ నిర్మాణాలు, ఉపాధి హామీ పనుల్లో పురోగతి మెరుగుపడాల్సి ఉందన్నారు. హౌసింగ్లో ఉపాధిని అనుసంధానిస్తూ 90 రోజుల పనిదినాలు కల్పించాలన్నారు. జిల్లాలో పాఠశాలలన్ని ప్రారంభమయ్యాయని, ఇంకా ఒకటో తరగతిలో చేరాల్సిన విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. అత్యంత నిరుపేదలకు మంజూరైన అంత్యోదయ కార్డులకు ఈకేవైసీని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతినెలా ఒకటో తేదీన 95 శాతానికి పైగా పింఛన్ల పంపిణీని పూర్తి చేయాలన్నారు. పంపిణీలో అశ్రద్ధగా ఉంటే సస్పెండ్ చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో జేసీ కార్తీక్, హౌసింగ్, డ్వామా, డీఆర్డీఏ పీడీలు వేణుగోపాల్, గంగాభవాని, నాగరాజకుమారి, జెడ్పీ డిప్యూటీ సీఈఓ మోహన్రావు, విద్యుత్శాఖ ఎస్ఈ విజయన్, సీపీఓ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
గుర్తుతెలియని వ్యక్తి మృతి
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: నగర పంచాయతీ పరిధిలోని జొన్నవాడ రోడ్డు పెట్రోల్ బంక్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి పడి ఉండటాన్ని గమనించి స్థానికులు సోమవారం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని 108 అంబులెన్స్లో నెల్లూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ శ్రీనివాసరెడ్డి మంగళవారం తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు బుచ్చిరెడ్డిపాళెం పోలీస్స్టేషన్లో సంప్రదించాలని కోరారు. ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలినెల్లూరు(అర్బన్): మహిళలు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని నెల్లూరు అబ్స్టెట్రిక్, గైనకాలజికల్ సొసైటీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ సుప్రజ, డాక్టర్ లలితా షిర్ధీశా అన్నారు. డాక్టర్స్ డేను పురస్కరించుకుని మంగళవారం నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యాలయంలో నెల్లూరు అబ్స్టెట్రిక్ సంఘానికి చెందిన మహిళా డాక్టర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఆమె తన పిల్లలను, భర్త ఆరోగ్యాన్ని కాపాడుకుంటుందన్నారు. మారిన ఆధునిక జీవనంలో రుతుక్రమంలో మార్పులు రావడం, ఊబకాయం సమస్యలు వస్తున్నాయన్నారు. ఆలస్యపు వివాహాల వల్ల సంతాన సాఫల్యత లేకపోవడం కూడా జరుగుతుందన్నారు. హైరిస్క్తో కూడిన గర్భిణులు ఎక్కువవుతున్నారన్నారు. ఇందువల్ల కాన్పులో సమస్యలు వస్తున్నాయన్నారు. అందువల్ల ఆరోగ్యానికి మహిళలు తగు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం సభ్యులు డాక్టర్ వాణి, డాక్టర్ అహల్య, డాక్టర్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. -
డెంగీ రహిత సమాజం కోసం కృషి
● డీఎంహెచ్ఓ సుజాత నెల్లూరు(అర్బన్): డెంగీ వ్యాధి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ సుజాత అన్నారు. డెంగీ అవగాహన మాసోత్సవాన్ని పురస్కరించుకుని మలేరియా నివారణ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరు సంతపేటలోని వైద్యశాఖ కార్యాలయం నుంచి ములుముడి బస్టాండ్, గుప్తా పార్కు మీదుగా ర్యాలీ జరిగింది. దీనిని జెండా ఊపి ప్రారంభించిన డీఎంహెచ్ఓ మాట్లాడుతూ తలనొప్పి, కళ్లు ఎర్రబడటం, జ్వరం, చర్మంపై ఎర్రటి మచ్చలు, వాంతులు తదితర లక్షణాలుంటే డెంగీగా అనుమానించి రక్తపరీక్షలు చేయించుకోవాలన్నారు. జిల్లా మలేరియా నివారణాధికారి హుస్సేనమ్మ మాట్లాడుతూ దోమలు కుట్టకుండా చూసుకోవడం ద్వారా డెంగీతోపాటు మలేరియా తదితర వ్యాధులు రాకుండా చూసుకోవచ్చన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీఎంహెచ్ఓ ఖాదర్వలీ, మలేరియా నివారణ సహాయ అధికారి నాగార్జునరావు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
కేంద్ర పథకాలపై రైతులకు అవగాహన
● దిశ సమావేశంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ● అంగన్వాడీ భవన నిర్మాణాలకు జెడ్పీ నిధులు ● చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ● హాజరుకాని మంత్రులు, ఎమ్మెల్యేలునెల్లూరు(పొగతోట): కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని నెల్లూరు ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అధికారులకు సూచించారు. నెల్లూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కో–ఆర్డినేషన్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ (దిశ)ను మంగళవారం నిర్వహించారు. ఎంపీ మాట్లాడుతూ జిల్లాలో 732 అంగన్వాడీ కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారని, శాశ్వత భవనాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.30 కోట్లతో 24 ప్రాజెక్ట్లు చేపట్టడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన ద్వారా 89,577 మందికి ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. 25,640 ఇళ్లు పూర్తయ్యాయన్నారు. జిల్లా అభివృద్ధి తనవంతు సహాయ, సహకారాలు అందిస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో ఏమైనా లోపాలుంటే తన దృష్టికి తీసుకురావాలని, పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ● జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ అడిగిన వెంటనే రోడ్లు మంజూరు చేసిన ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు రూరల్లో పాఠశాలకు జెడ్పీ నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అయితే ప్రారంభోత్సవానికి ప్రొటోకాల్ పాటించలేదని, ఆహ్వానాన్ని పంపించలేదన్నారు. ఇందుకు సంబంధించి ఏఈని ఎక్కడ దాచి పెట్టారని ప్రశ్నించారు. ఏఈపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ భవన నిర్మాణాలకు జెడ్పీ నిధులు మంజూరు చేశామని తెలిపారు. తిరుపతి జిల్లాలో నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి నిర్మాణాలు చేపట్టడంలో అధికారులు జాప్యం వహిస్తున్నారని తెలిపారు. ● కలెక్టర్ ఆనంద్ మాట్లాడుతూ అంగన్వాడీ భవన నిర్మాణాలకు సంబంధించి గత సమావేశంలోనూ పీఆర్ అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు ప్రగతి చూపలేదని, ఇదే విధంగా ఉంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి, జెడ్పీ సీఈఓ మోహన్రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా మరికొంతమంది అర్హులను చేర్చేందుకు అవకాశం ఉంటే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. దాని కోసం తహసీల్దార్లు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ● సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ జిల్లాలో ఉన్నా హాజరుకాలేదు. -
జగన్ పర్యటనపై కూటమి కుట్రలు
కోవూరు: రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలకు ప్రజల్లో విశేష స్పందన లభిస్తుండడంతో చంద్రబాబుకు భయం పట్టుకుందని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం నెల్లూరులోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న జగన్ను కూటమి ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. అర చేతితో సూర్యకాంతిని ఎలా ఆపలేరో.. కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు, కుట్రలు సృష్టించినా జగన్ పర్యటనను ఆపలేరని తెలుసుకోవాలన్నారు. జగన్ హెలికాప్టర్ దిగడానికి కూడా వీలులేకుండా చేయడం దుర్మార్గమని, నెల్లూరేమన్నా.. చంద్రబాబు నాయన ఖర్జూరపునాయుడు జాగీరా అని ప్రసన్నకుమార్రెడ్డి మండిపడ్డారు. జగన్ ప్రజల మధ్య ఉండే నాయకుడని, ఆయన పర్యటనల్లో ప్రజలు తండోపతండాలుగా పాల్గొంటారని చెప్పారు. ‘బాబు, లోకేశ్, పవన్ పర్యటనలకు సెక్యూరిటీ సిబ్బంది తప్ప.. జనం కానరాని, అదే జగన్ వస్తే వేలాదిగా జన ప్రభంజనమవుతుందన్నారు. గతంలో చంద్రబాబు, పవన్కల్యాణ్ నిర్వహించిన సభలను వైఎస్సార్సీపీ ఎప్పుడూ అడ్డుకోలేదని గుర్తు చేశారు. కాకాణి గోవర్ధన్రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారన్నారు. కాకాణితో ములాఖత్ అయ్యాక, ఆ కుటుంబాన్ని పరామర్శించే ఈ పర్యటనను అడ్డుకోవడం ప్రభుత్వం దుర్మార్గమన్నారు. ఇది రాజకీయ పర్యటన కాదని, మానవతా పరమైన పరామర్శ మాత్రమే అన్నారు. కూటమికి కౌంట్ డౌన్ స్టార్ట్ బాబు ఇటీవల ఐదారు సర్వేలు చేయించారు. 97 స్థానాల్లో టీడీపీ ఎమ్యెల్యేలకు డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని నివేదికలు రావడంతో చంద్రబాబులో టెన్షన్ ప్రారంభమైందన్నారు. ఇటీవల జరిగి టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి 15 ఎమ్మెల్యేలు కూడా హాజరు కాలేదు. వీటన్నంటిని చూసి భయంతో జగన్ పర్యటనలకు అనుమతులు నిరాకరణ చేస్తున్నాడని ప్రసన్నకుమార్రెడ్డి విమర్శించారు. అక్రమ అరెస్టులకు ప్రజల తీర్పు సిద్ధం వైఎస్సార్సీపీ నేత వీరి చలపతిరావు మాట్లాడుతూ జగన్ పర్యటనను అడ్డుకునే కుట్రలకు కూటమి ప్రభుత్వానికి ప్రజలు తీర్పు సిద్ధంగా ఉందన్నారు. కాలువ గట్లు, పొలాలు గట్లపై జనం పరుగులు తీస్తున్న తీరు చూసి కూటమి నాయకుల గుండెల్లో గుబులు మొదలైందన్నారు. కూటమి నాయకులూ కళ్లు తెరిచి ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలను అమలు చేయాలన్నారు. ఇటీవల వైఎస్సార్సీపీ చేసిన పోరాట ఫలితంగానే తల్లికి వందనం (అమ్మఒడి ) పథకం వచ్చిందన్నారు. ఈ సమావేశంలో నాయకులు మావులూరు శ్రీనివాసులురెడ్డి, మల్లికార్జునరెడ్డి దినేష్రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, విజయకుమార్రెడ్డి, సతీష్రెడ్డి, నరసింహులురెడ్డి, సుబ్బారెడ్డి, షాహుల్, బాలశంకర్రెడ్డి, నవీన్కుమార్రెడ్డి, శ్రీలత, రఫీ, రూప్కుమార్రెడ్డి తదితరులున్నారు. నెల్లూరు ఏమన్నా.. ఖర్జూరపునాయుడి జాగీరా? జగన్ బయటకు వస్తే బాబుకు భయం మాజీ మంత్రి ప్రసన్నకుమార్రెడ్డి -
ఇది ముమ్మాటికీ అక్రమ కేసే
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘నేను స్పష్టంగా పోలీసులను అడిగేది ఒకటే. నా పాత్రపై ఏమైనా ఉంటే రుజువు చేయగలరా? ఇది అక్రమ కేసని తెలియకుండా కప్పిపుచ్చడానికి పోలీస్ కస్టడీ పేరుతో దొంక తిరుగుడు ప్రశ్నలు సంధించడం తప్ప మరోకటి లేదు. రెండు రోజులుగా పోలీస్ కస్టడీలో నా పాత్ర గురించి కానీ, నాకు ఒనగూరిన లబ్ధి గురించి ఏ చిన్న ఆధారాన్ని పోలీసులు చూపించలేకపోయారంటే ఇది ముమ్మాటికీ అక్రమ కేసు బనాయించడమేని అర్థమవుతోంది.’ అని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పోలీసులను నిలదీసినట్లు సమాచారం. కృష్ణపట్నం లాజిస్టిక్ చెక్పోస్టు ద్వారా బలవంతంగా నగదు వసూలు చేశారని నమోదైన అక్రమ కేసులో సెంట్రల్ జైల్లో జ్యుడిషి యల్ రిమాండ్లో ఉన్న కాకాణిని రెండు రోజులపాటు ముత్తుకూరు పోలీసులు పోలీస్ కస్టడీకి తీసుకుని ప్రశ్నించారు. మొదటి రోజు 52 ప్రశ్నలు, రెండో రోజు మంగళవారం ఆరు ప్రశ్నలు అడగడంతో కాకాణి దీటుగా సమాధాన మివ్వడంతో పోలీసులు సైతం నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. పోలీసుల పక్షపాత వైఖరికి నిదర్శనం మీరు అక్రమ కేసులు బనాయించడం, సాక్షులు, సహ నిందితులను భయపెట్టి బెదిరించి ఇష్టారీతిన స్టేట్మెంట్ల మీద సంతకాలు చేయించుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో తెల్ల కాగితాల మీద ముందుగానే సంతకాలు తీసుకుంటున్నారు. న్యాయస్థానంలో నిలబడని స్టేట్మెంట్లపై నేను వ్యాఖ్యానించ దలుచుకోలేదు. నేను తప్పు చేసి ఉంటే సాంకేతిక పరంగా విచారణ చేసి నా పాత్ర ఉందని రుజువు చేస్తే నేను ఏ శిక్షకై నా సిద్ధంగా ఉన్నట్లు పోలీసులకు సవాల్ విసిరారని ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ అక్రమ కేసుల్లో వైఎస్సార్సీపీ చెందిన వారినే నిందితులుగా చూపిస్తూ డాక్యుమెంట్లో ఉన్న మిగిలిన వారిని వదిలి వేయడం పోలీసుల పక్షపాతి వైఖరికి నిదర్శనమని విమర్శించారని సమాచారం. ఎవరో చేసే వ్యాపారాలకు నన్ను జవాబుదారి చేయడం పోలీసులకు భావ్యం కాదన్నారు. నాకు అసోసియేషన్ గొడవలతో ఏంటి సంబంధం, పత్రికల్లో వచ్చిన వార్తలను నేను పట్టించుకోను. ఇటీవల పోలీస్ కస్టడీకి తీసుకున్నప్పుడు ‘ఓ ఎల్లో పత్రికలో నాకు గుర్తులేదు. మా న్యాయవాదులను అడగండి’ అని చెప్పినట్లు నేను మాట దాటవేసినట్లు రాశారు. ఇవన్ని అసత్యాలే. పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెపుతున్నాను. నాకు తెలియని విషయాలు మాత్రం తెలిదయనే చెప్పుతున్నాను. నాపై బురద చల్లేందుకు కక్ష కట్టి తప్పుడు కథనాలు రాయిస్తున్నారు. నాకు సంబంధం లేని ఈ కేసులో పోలీసులు ఏ–1గా చేర్చారు. ఇది కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా అక్రమ కేసు నమోదు చేసిందనేందుకు ఇదే నిదర్శనంగా చూపవచ్చు. సోమిరెడ్డి తప్పుడు ఆరోపణలపై కేసులా? సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు సార్లు నాతో పోటీ చేసి ఓడిపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి నా మీద, వైఎస్సార్సీపీ నాయకులు మీద నిత్యం అసత్య ఆరోపణలు చేశారు. యూనియన్ గొడవల్లోకి రాజకీయ జోక్యం అవసరం లేదు. ఏ యూనియన్లతో కానీ, ప్రెస్మీట్లతో కానీ నాకు సంబంధం లేదు. అలాంటప్పుడు నాపై అక్రమ కేసు బనాయించినట్లే అవుతోంది. రెండు రోజుల పాటు నన్ను కస్టడీకి తీసుకున్నారు కదా నా సమక్షంలోనే సాక్షులను విచారిస్తే నాకు వారితో సంబంధం లేదని తెలుస్తోంది. అలా చేయకుండా కస్టడీ పేరుతో ఏదో జరుగుతుందంటూ ప్రచారం చేయడానికి కాకపోతే దేనికి ఇదంతా అని కాకాణి సంధించిన పలు ప్రశ్నలకు పోలీసులు సైతం నీళ్లు నమలాల్సి వచ్చింది. కృష్ణపట్నం కేసులో తన పాత్రపై స్పష్టత ఇవ్వగలరానని కాకాణి డిమాండ్ పలు ప్రశ్నలకు కాకాణి దీటుగా సమాధానం తిరిగి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన పోలీసులు -
93.83 శాతం పింఛన్ల పంపిణీ
నెల్లూరు (పొగతోట): జిల్లాలో పింఛన్ల పంపిణీ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 3,04,034 మందికి పింఛన్ల నగదు అందజేయాల్సి ఉండగా 2,85,261 మందికి పంపిణీ చేశారు. నగరంలోని పొదలకూరు రోడ్డు లోని గౌతమీనగర్లో దివ్యాంగురాలు భానుశ్రీకి కలెక్టర్ ఓ ఆనంద్ నగదు అందజేశారు. జీజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ అరుణ నియామకం ● తిరస్కరించిన డాక్టర్ నెల్లూరు (అర్బన్): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్గా పనిచేస్తున్న డాక్టర్ సిద్ధానాయక్ సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. ఆయన స్థానంలో ఫుల్ అడిషనల్ చార్జి (ఎఫ్ఏసీ) సూపరింటెండెంట్గా పెద్దాస్పత్రిలోని పల్మనాలజీ విభాగం హెచ్ఓడీ, ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ అరుణను నియమిస్తూ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ఉత్తర్వులను ఆమె తిరస్కరించారు. తాను ఆ బాధ్యతలు చేపట్టలేనని డీఎంఈకు విన్నవించారు. పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యం నెల్లూరు రూరల్: రొట్టెల పండగ ఏర్పాట్లలో పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ ఓ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్లో రొట్టెల పండగ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ నుంచి ఐదు రోజులపాటు జరిగే రొట్టెల పండగకు గతంలో కంటే ఎక్కువగా భక్తులు విచ్చేస్తారని, అందుకనుగుణంగా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. స్వర్ణాల చెరువులో సరిపోయే నీటిని ఉంచాల్సిందిగా ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పార్కింగ్ స్థలాల వద్ద, ఇతర అవసరమైన చోట మొబైల్ టాయిలెట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. మెడికల్ టీంలను, అంబులెన్స్లను సన్నద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఎక్కువ సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రొట్టెల పండగ ఏర్పాట్లలో భాగమయ్యే వివిధ శాఖల సిబ్బందికి ఆయా రోజుల్లో ఎటువంటి సెలవులు మంజూరు చేయొద్దని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జేసీ కార్తీక్, ఏఎస్పీ సౌజన్య, మున్సిపల్ కమిషనర్ నందన్, ఆర్డీఓ అనూష, విద్యుత్, ఇరిగేషన్ ఎస్ఈలు విజయన్, దేశ్నాయక్, డీఎంహెచ్ఓ సుజాత, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
వృద్ధుల ఆచూకీ కోసం గాలింపు
సోమశిల: మల్లెంకొండ అటవీ ప్రాంతంలో తప్పిపోయిన వృద్ధులు కోటపాటి రత్నయ్య, కోటపాటి సుబ్బయ్య నాయుడుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మంగళవారం సోమశిల ఎస్సై అనూష, అనంతసాగరం ఎస్సై సూర్యప్రకాష్రెడ్డి, పొదలకూరు ఎస్సై హనీఫ్ ఆధ్వర్యంలో స్పెషల్ ఫోర్స్, రెవెన్యూ అధికారులు, కుటుంబ సభ్యులు ఇతర వ్యక్తులతో చిలకలమర్రి మల్లెంకొండ శిలల వద్దకు వెళ్లి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 40 మంది వెళ్లారు. అయినా అన్నదమ్ముల ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. స్మగ్లర్ల చేతిలో చిక్కుకున్నారా అనే అనుమానంతో ఉన్నారు. ప్రభుత్వం స్పందించి పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాలని బాధిత కుటుంబం కోరుతోంది. ఎస్సై అనూష మాట్లాడుతూ వృద్ధుల ఆచూకీ తెలిపితే రూ.10 వేల పారితోషికం అందిస్తామన్నారు. -
సిలిండర్ల చోరీ కేసులో దొంగల అరెస్ట్
నెల్లూరు సిటీ: డెలివరీ బాయ్స్ను ఏమార్చి 23 సిలిండర్లను అపహరించిన కేసులో ఇద్దరు దొంగలను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సంతపేట సీఐ దశరథరామారావు స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఓ గ్యాస్ ఏజెన్సీకి చెందిన సిబ్బంది గత నెల 28, 29 తేదీల్లో సిలిండర్లను డెలివరీకి తీసుకెళ్లగా దొంగలు చోరీ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు 4వ మైలుకు చెందిన పి.కార్తీక్, విడవలూరు మండలంలోని చవటపాళేనికి చెందిన పి.అనూష్కుమార్లను అరెస్ట్ చేసి రూ.1.15 లక్షల విలువైన 23 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. -
‘ఉపాధి’ బకాయిల విడుదలకు డిమాండ్
● ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా నెల్లూరు రూరల్: ‘కూటమి ప్రభుత్వం బీజేపీకి వంత పాడుతూ ఉపాధి హామీ పథకానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కూలీల బకాయిలను వెంటనే చెల్లించాలి’ అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మి క సంఘం నేతలు డిమాండ్ చేశారు. సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కూలీలకు పనులు కల్పిస్తామని చెప్పి 60 శాతం పనులను యంత్రాలతో చేయించడానికి తీర్మానాలు చేశారన్నారు. ప్రస్తుతం కూలీలతో కేవలం 40 శాతం పనులు కూడా గ్రామాల్లో చేయించడం లేదన్నారు. అధికార పార్టీ నాయకులు చెప్పిన విధంగా పనులు చేయాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. పని ప్రదేశాల్లో నిబంధనలను పాటించడం లేదని, ఏదైనా ప్రమాదం జరిగినా కనీసం మెడికల్ కిట్ కూడా ఉంచడం లేదన్నారు. జిల్లాలో 12 వారాలకు సంబంధించి బకాయిలున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకమరాజు, ప్రధాన కార్యదర్శి మంగళ పుల్లయ్య, నాపాల వెంకటేశ్వర్లు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
అవగాహన కల్పించాలి
ఆరోగ్యమంటే మందులు, చికిత్సతోనే రాదు. పౌష్టికాహారం, రక్షిత మంచినీరు, పరిసరాల పరిశుభ్రత, మంచి ఆరోగ్య అలవాట్లతో నూటికి 80 శాతం జబ్బులు రాకుండా అరికట్టవచ్చు. రోగం వచ్చిన తర్వాత కన్నా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జబ్బులకు చెక్ పెట్టొచ్చు. ఇందుకోసం వైద్యశాఖతోపాటు స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓలు కలిసి ప్రజల్లో అవగాహన పెంచాలి. ఆపరేషన్లు, ఇతర వైద్యసేవలను ప్రైవేట్ వైద్యశాలలు కూడా తక్కువ ఖర్చుతోనే రోగులకు అందించేలా చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్, పీపీ యూనిట్ ● -
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.25 సన్నవి : రూ.20 పండ్లు : రూ.8 వెట్టిచాకిరి నుంచి కాపాడండినెల్లూరు రూరల్: యానాది వర్గానికి చెందిన నిరుపేద పసిపిల్లల్ని కిడ్నాప్ చేసి హోటళ్లు, వివిధ గృహాల్లో వెట్టిచాకిరి చేయిస్తున్నారని, వారిని కాపాడాలని యానాది మహానాడు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చౌటూరు శీనయ్య కోరారు. నెల్లూరులోని ప్రెస్క్లబ్లో సోమవారం ఆయన విలేకరులు సమావేశంలో మాట్లాడారు. బిడ్డలు ఎక్కడ ఉన్నారో తెలియక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారన్నారు. సదరు కిడ్నాపర్లు పోలీసులకు, ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారన్నారు. బాధితులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. వారి సమస్యలు పరిష్కరించకుండా తరిమేయడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని తెలిపారు. ప్రభుత్వం స్పందించాలని కోరారు. సమావేశంలో శీనమ్మ, ఎం.మస్తానమ్మ, శేషమ్మ, మౌనిక, సుబ్బరత్న, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. -
లారీలో నుంచి పడి క్లీనర్ మృతి
కోవూరు: జాతీయ రహదారిపై వినాయక స్వామి గుడి సమీపంలో సోమవారం విజయవాడ నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న లారీలో నుంచి నారాయణ (37) అనే క్లీనర్ నిద్రమత్తులో అదుపుతప్పి కింద పడిపోయాడు. అతను తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపు నారాయణ మృతిచెందాడు. ప్రమాద స్థలాన్ని ఎస్సై రంగనాథ్ గౌడ్ పరిశీలించారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
ఏకలవ్య భవన నిర్మాణం కోసం..
నగరంలో ఏకలవ్య భవనం నిర్మించాలని ఏపీ గురుకుల సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ శివ కలెక్టర్ ఆనంద్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న కార్యక్రమాలు, శుభకార్యాలు, సమావేశాలు చేపట్టాలంటే ఇబ్బందిగా ఉందని, అందుకోసం ప్రత్యేకమైన ఏకలవ్య భవనాన్ని నిర్మించాలని కోరారు. స్థలాన్ని కేటాయించినా భవన నిర్మాణాన్ని తామే చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బండి బుజ్జయ్య, చైర్మన్ కట్టా రామారావు, సలహాదారులు కట్టా రమణయ్య, ఉపాధ్యక్షులు నల్లగొండ్ల వెంకయ్య, దేవరకొండ చిన్నోడయ్య, కట్టా కాటయ్య ఉన్నారు. -
అందుబాటులో వైద్యం
ఆరోగ్యం అనేది ప్రజల హక్కు. ప్రజారోగ్యాన్ని పేద, ధనిక తేడా లేకుండా అందరూ సమానంగా పొందగలగాలి. ఇందుకోసం ప్రభుత్వాలు కృషి చేయాలి. వైద్యాన్ని ప్రైవేట్పరం చేయకూడదు. వైద్యకళాశాలలను ప్రభుత్వం నిర్వహించాలి. బడ్జెట్లో వైద్యరంగానికి అధిక నిధులు కేటాయించాలి. మందులు, వైద్యపరికరాలపై జీఎస్టీ తొలగించాలి. అప్పుడే ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తుంది. – డాక్టర్ ఎంవీ రమణయ్య, ప్రజారోగ్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
సైదాపురం: బతుకుదెరువు కోసం కువైట్కు వెళ్లి ఇటీవల స్వగ్రామానికి చేరుకున్న ఓ వ్యక్తి కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్న ఘటన సైదాపురం దళితవాడలో సోమవారం జరిగింది. ఎస్సై క్రాంతి కుమార్ కథనం మేరకు.. దళితవాడకు చెందిన కాకాణి వెంకటరమణయ్య (35)కు అదేకాలనీకి చెందిన భాగ్యమ్మతో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. ఓ కుమారుడు గతంలో మృతిచెందాడు. దంపతులు మూడేళ్ల క్రితం అప్పు చేసి ఇల్లు నిర్మించుకున్నారు. అప్పులు తీర్చేందుకు వెంకటరమణయ్య కువైట్ వెళ్లాడు. మూడేళ్లపాటు అక్కడే ఉండి గత వారం స్వగ్రామానికి చేరుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో అతను ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి లక్ష్మమ్మ పోలీసులకు ఫిర్యా దు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గూ డూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పాఠశాలలను ఎత్తేయడం అన్యాయం
యానాది కాలనీల్లో ప్రాథమిక పాఠశాలలను ఎత్తేయడం అన్యాయమని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్.మల్లి అన్నారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. మల్లి మాట్లాడుతూ బోగోలు మండలంలోని కొండబిట్రగుంట యానాది కాలనీలో 46 మంది విద్యార్థులున్న పాఠశాలను పక్క గ్రామంలోని స్కూల్లో విలీనం చేయడం దారుణమన్నారు. దళిత, గిరిజనులకు విద్య లేకుండా చేయడం అన్యాయమన్నారు. 80 మంది యానాది పిల్లలకు తల్లికి వందనం రాలేదన్నారు. కార్యక్రమంలో ఎస్.లక్ష్మయ్య, అశోక్, రాచగిరి మురళి, పి.హరిబాబు, 150 మంది మహిళలు పాల్గొన్నారు. -
డాక్టర్ల సేవలకు సలాం
● కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు ● నేడు డాక్టర్స్ డేనెల్లూరు(అర్బన్): అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఆపదలో ఉండే రోగులకు డాక్టర్లు ప్రాణాలు పోస్తున్నారు. ప్రమాదం జరిగి ప్రాణాపాయస్థితిలో ఉన్నా, ఒళ్లంతా కాలినా, పాము కరిచినా.. కొట్లాటలో కత్తులు దిగబడినా డాక్టర్లు వృత్తినే దైవంగా భావించి విసుగు, విరామం లేకుండా వైద్యం చేసి కాపాడుతున్నారు. తెల్లని చొక్కా ధరించి, చిరునవ్వుతో, నిబద్ధతతో, అంకితభావంతో వైద్యం చేస్తూ ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్ను దేవుడితో సమానంగా చూస్తారు. కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రోగులను కాపాడారు. ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీని డాక్టర్స్ డేగా జరుపుకొంటున్నారు. జిల్లాలో వైద్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం సంబరాలు నిర్వహిస్తారు. రోగులకు సేవలందిస్తూ.. జిల్లాలో సుమారు 1,300 వరకు ఆస్పత్రులు, క్లినిక్లున్నాయి. వీటిలో 52 పీహెచ్సీలు, 28 అర్బన్ హెల్త్ సెంటర్లు, 10 సామాజిక ఆస్పత్రులు (సీహెచ్సీలు), ఆత్మకూరులో జిల్లా ఆస్పత్రి, కందుకూరు, కావలిలో ఏరియా ఆస్పత్రి, జిల్లా కేంద్రంలో సర్వజన ఆస్పత్రులున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో 2 వేల మంది డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. ఆరోగ్యం అందరి హక్కు ప్రజలందరికీ ఆరోగ్యం హక్కుగా అందాలని డాక్టర్లు భావిస్తున్నారు. కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటళ్లను మినహాయిస్తే ప్రజారోగ్యాన్ని కాపాడటంలో ప్రభుత్వ డాక్టర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. దేశంలో 70 శాతం మంది పేద, మధ్యతరగతి ప్రజలే ఉన్నారు. వీరికి వైద్యం అందించడంలో విశేష కృషి చేస్తున్నారు. డెంగీ, డయేరియా, మలేరియా లాంటి వ్యాధులు ప్రబలినప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోనే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందిస్తున్నారు. వైద్యం చేసి.. కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు తమ గేట్లు మూసేసుకున్నాయి. పలు హాస్పిటళ్లు వైద్యం చేసినా రోగుల నుంచి రూ.లక్షలు వసూలు చేసి వారి నాడి పట్టిన పాపాన కూడా పోలేదు. అలాంటి తరుణంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యసేవలందించిన ఘనత ప్రభుత్వ వైద్యులకే దక్కుతుంది. జిల్లాలో 2 లక్షల మందికిపైగా కోవిడ్ బారిన పడగా వారికి వైద్యం చేస్తూ ఐదుగురు వైద్యులు తమ ప్రాణాలు కోల్పోయారు. -
పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలంటూ..
బోగోలు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా అబ్దుల్ జహీర్ అక్రమాలకు పాల్పడ్డాడని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బోగోలు గ్రామ మాజీ ఉప సర్పంచ్ మద్దిబోయిన వీర రఘు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు కోరారు. వారు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా జమ ఖర్చులు అడిగామన్నారు. దీనికి కార్యదర్శి ఇచ్చిన సమాధానంతో అక్రమాలకు పాల్పడినట్లుగా తెలిసిందన్నారు. తాగునీటి వసతి కోసం సుమారు రూ.7 లక్షలు, పారిశుధ్య సామగ్రి కొనుగోలుకు రూ.4 లక్షలు, ప్రత్యేక పారిశుధ్య పనుల కోసం రూ.4,47,300, ట్రాక్టర్ డీజిల్ కోసం రూ.2,27,752, గ్రామసభలు స్వర్ణ పంచాయతీ, షామియానాల పేరుతో రూ.1.60 లక్షలు ఖర్చు చేసినట్లుగా చెప్పారన్నారు. ప్రైవేట్గా పనిచేస్తున్న దేవరపల్లి మనోహర్ ద్వారా లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అతడి బ్యాంక్ లావాదేవీలు పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. అదేవిధంగా సర్పంచ్ వద్ద ప్రతి పనికీ లంచం తీసుకుంటున్నారని తెలిపారు. సర్పంచ్ భర్త పందిపాటి ఉదయ్కుమార్, కార్యదర్శి బ్యాంక్ లావాదేవీలను పరిశీలించాలని కోరారు. -
అనుమానమే పెనుభూతమై..
దుత్తలూరు: దుత్తలూరు ఏసీ కాలనీ ఆదివారం అర్ధరాత్రి హత్యల కలకలంతో ఉలికి పడింది. మద్యం మత్తులో భార్యపై అనుమానంతో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి సాగించిన మారణకాండ ఇది. కాలనీలో నివాసముంటున్న ఏలూరు వెంగయ్య మద్యానికి బానిసయ్యాడు. ఇదే క్రమంలో భార్యపై పెంచుకున్న అనుమానం అతనిలో మనిషిని మృగాన్ని చేసింది. భార్యను ఎలాగైనా అంతమొందించాలనే ఉద్దేశంతో ఉన్న వెంగయ్య ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు పూటుగా మద్యం తాగి ఇంటికెళ్లాడు. అప్పటికే భార్య వెంకాయమ్మ సమీపంలోని పుట్టింటికెళ్లింది. దీంతో మరింత కోపోద్రిక్తుడైన వెంగయ్య కట్టెలు కొట్టడానికి ఉపయోగించే పదునైన మచ్చుకత్తి వెంట తీసుకొని అత్తామామల ఇంటికి వెళ్లాడు. తన భార్యను చంపేస్తానంటూ వీరంగం చేశాడు. దీంతో అడ్డుకోబోయిన అత్తామామలు చలంచర్ల జయమ్మ (60) కల్లయ్య (65)లను కత్తితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై ఆ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అంతటితో ఆగకుండా భార్య వెంకాయమ్మపై కూడా కత్తితో దాడి చేశాడు. అయితే ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయడంతో గాయాలతో బయటపడి కింద పడిపోయింది. పెద్ద కుమార్తె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి గట్టిగా నియంత్రించడంతో వారిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ కత్తితో పరారయ్యాడు. గాయపడిన వెంకాయమ్మను ఉదయగిరి వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న సీఐ వెంకట్రావు, ఎస్సైలు ఆదిలక్ష్మి, రఘునాథ్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. క్లూస్టీం ప్రాథమిక ఆధారాలు సేకరించారు. నిందితుడు వెంగయ్య కోసం స్థానికంగా, సాంకేతకంగా వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఎప్పుడుపడితే అప్పుడు పల్లెల్లో మద్యం దొరకడం వల్లే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. భార్యపై అనుమానంతో హత్యాయత్నం మద్యం మత్తులో విచక్షణారహితంగా కత్తితో దాడి అడ్డుకోబోయిన అత్త, మామలు హతం భార్య పరిస్థితి విషమం హత్యలతో ఉలికి పడిన దుత్తలూరు భార్యపై అనుమానమే పెనుభూతమైంది. రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబంలో మద్యం చిచ్చు రేపింది. మత్తులో విచక్షణ కోల్పోయేలా చేసింది. అడ్డుకోబోయిన అత్త, మామల ప్రాణాలు తీసింది. భార్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనతో దుత్తలూరు ఒక్కసారిగా ఉలికి పడింది. పల్లెల్లో విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం విక్రయాలే ఈ ఘటనకు కారణమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కారుణ్య నియామకాలు
నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించి కొండలరావు, చైతన్య ప్రకాష్లకు సోమవారం జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, జెడ్పీ సీఈఓ మోహన్రావు నియామాక ఉత్తర్వులు అందజేశారు. డీఆర్వో బదిలీ నెల్లూరు (అర్బన్): జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)గా పనిచేస్తున్న ఉదయభాస్కర్రావును బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం ది. ఆయన్ను అమరావతి రాష్ట్ర సెక్రటేరియట్లోని రెవెన్యూ శాఖలో ప్రభుత్వ అసిస్టెంట్ సెక్రటరీగా నియమించింది. రెగ్యులర్ డీఆర్వోను నియమించేంత వరకు ఎఫ్ఏసీ డీఆర్వోగా అర్హత గల వారిని కలెక్టర్ నియమించుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీపీటీఓగా ఎస్కే షమీమ్ నెల్లూరు సిటీ: నెల్లూరు జిల్లా ప్రజా రవాణా శాఖ (డీపీటీఓ) అధికారిగా ఎస్కే షమీమ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీపీటీఓగా విధులు నిర్వహిస్తున్న మురళీబాబు ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో నెల్లూరులోని డిప్యూటీ సీటీఎంగా విధులు నిర్వహిస్తున్న షమీమ్కు బాధ్యతలు అప్పగించారు. ఆమె స్థానంలో శృంగవరపుకోట డిపో మేనేజర్ రమేష్ను ఉద్యోగోన్నతిపై నెల్లూరు డిప్యూటీ సీటీఎంగా బదిలీ చేశారు. వాకాటి సోదరులకు నోటీసులు పొదలకూరు: పట్టణానికి చెందిన వాకాటి సోదరులు, వైఎస్సార్సీపీ నేతలు శ్రీనివాసులురెడ్డి, శివప్రసాద్రెడ్డిలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆదేశాల మేరకు సోమవారం నోటీసులను జారీ చేసినట్లు ఎస్సై హనీఫ్ తెలిపారు. రుస్తుం మైన్ కేసులో నిందితులుగా చేర్చిన క్రమంలో అక్రమ కేసుల ఒత్తిడితో కొంతకాలంగా అజ్ఞానంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరు ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడలకు నోటీసులను అంటించారు. సోమవారం సాయంత్రం లోగా విచారణ హాజరు కావాలని ఆ నోటిసుల్లో పేర్కొన్నారు. సర్వేయర్లకు కౌన్సెలింగ్ ద్వారా బదిలీ నెల్లూరు (అర్బన్): సచివాలయాల పరిధిలోని 291 మంది సర్వేయర్లకు సోమవారం నగరంలోని ఆ శాఖా కార్యాలయంలో ఏడీ నాగశేఖర్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీల ప్రక్రియ చేపట్టారు. బదిలీలపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ర్యాంక్ ప్రకారం కాకుండా సిఫార్సు లేఖలపై బదిలీ చేయడంతో తమకు అన్యాయం జరిగిందని పలువురు సర్వేయర్లు విచారం వ్యక్తం చేశారు. -
కెరటమై ఎగిసిన కర్షకాగ్రహం
ఉలవపాడు: ‘మండలంలోని తీర ప్రాంతం కరేడు కర్షకుల ఆగ్రహం కడలి కెరటమై ఎగిసి పడింది. పోలీసుల ఆంక్షలు, ముందస్తు అరెస్ట్లు, రహదారుల నిర్బంధాలు రైతులను ఆపలేకపోయాయి. పోలీసులు ఎక్కు పెట్టిన తుపాకులకు, ఝుళిపించిన లాఠీలకు ఒక్కొక్కరు.. ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజులై గర్జించారు. వేలాది మంది రైతు కుటుంబాలతో తరతరాలుగా వ్యవసాయ భూములతో ముడిపడిన బంధాలను, భావోద్వేగాలను కాదని కంపెనీలకు కట్టబెట్టే ప్రభుత్వ నిరంకుశత్వాన్ని దునుమాడుతూ మండలంలోని కరేడు రైతులు సాగించిన తొలి ఉద్యమాన్ని విజయవంతం చేసి పాలకులకు వణుకు పుట్టించారు. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే పంట భూములే తమ జీవనాధారమని, అటువంటి భూములను తమ నుంచి తీసుకోవాలంటే, ముందుగా ప్రాణాలు తీసి శవాలపై వచ్చి తీసుకెళ్లాంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇండోసోల్ కంపెనీ కోసం భూసేకరణకు వ్యతిరేకంగా ఆదివారం మండలంలోని కరేడు కర్షకుల పోరు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపింది. వందల మంది పోలీసులు భారీగా మోహరించి అడ్డంకులు పెట్టినా చేధించుకుని సాగించిన రైతులు తమ భూముల కోసం ఎందాకై నా పోరాడతారని చాటారు. ఊహించని రీతిలో.. జాతీయ రహదారిపై కరేడు రైతులు పార్టీలకు అతీతంగా ఏకమై చేపట్టిన రాస్తారోకో విజయవంతం కావడం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఇండోసోల్ కంపెనీకి ఏకంగా 8,348 ఎకరాలు కేటాయించడం రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. భూమి లేకపోతే తమకు జీవనాధారం లేదనే పరిస్థితికి రైతులు రావడంతోనే రాస్తారోకో భారీగా జరిగింది. సుమారు 2 వేల మంది రైతులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. 800 మందికి పైగా మహిళలు ఈ ఉద్యమంలో పాల్గొనడంతో అందరూ నిశ్చేష్టులయ్యారు. తమ శవాల మీద వెళ్లి భూములు తీసుకోవాలని మహిళా రైతులు నినాదాలు చేయడం విశేషం. దాదాపు 20 నిమిషాల పాటు రైతులు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. సబ్కలెక్టర్ తిరుమణి శ్రీపూజ తాత్కాలికంగా భూసేకరణ వాయిదా వేసి రైతులు సమస్యలు పరిష్కరిస్తామని హామీతో విరమించారు. భూసేకరణపై ఇంత మంది రైతులు వ్యతిరేకంగా ఉన్నారని ఎవరూ ఊహించలేకపోయారు. రైతులకు పెరుగుతున్న మద్దతు భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు బయట నుంచి మద్దతు పెరుగుతోంది. పోలీసులు తమ గోడును చెప్పకుండా అడ్డుకోవడంతో వారు చేసిన పోరాటం పలువురిని కదిలించింది. వామపక్షాలు, రైతుకూలీ సంఘాలు మరింతగా ఈ పోరాటానికి సహకరించేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో రాష్ట్ర రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు కరేడులో పర్యటించనున్నారు. ఆమ్ఆద్మీపార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీసీవై పార్టీలు ఇప్పటికే తమ మద్దతు ప్రకటించాయి. కరేడులో మాత్రం పార్టీకతీతంగా రైతులే నాయకత్వం వహిస్తూ అన్ని పార్టీలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్లేషకులు సైతం కరేడు రైతుల ఉద్యమం గురించి మాట్లాడడం విశేషం. ఈ కంపెనీకి 8,348 ఎకరాలు కేటాయించడం పై అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కూటమి నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత... కరేడు భూముల వ్యవహారంపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. తొలుత బీపీసీఎల్కు ఇస్తారని ప్రచారం జరిగింది. తర్వాత మార్చి 25 న ఇండోసోల్కు కేటాయిస్తున్నట్లు జీఓ ప్రకటించారు. జూన్ 19న భూసేకరణ చేస్తున్నామని నోటిఫికేషన్ ఇచ్చి తీసుకునే భూముల రైతుల వివరాలు ప్రచురించారు. అందులో 4 వేల ఎకరాలకు వివరాలు ప్రకటించారు. నోటిఫికేషన్ వెలువడడంవతో ఒక్కసారిగా రైతుల్లో ఆందోళన మొదలైంది. ఉద్యమ బాట పట్టారు. తమ భూములు కోల్పోకుండా ఉండడం కోసం ‘సేవ్ కరేడు’ పేరుతో భారీ రాస్తారోకో చేపట్టారు. ఈ రైతు ఉద్యమంతో ప్రభుత్వంపై కరేడు రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు అర్థమవుతుంది. భూ సేకరణ ఆగేనా కరేడు రైతులు భూ సేకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఎగసిపడి విజయవంతమైంది. భూ సేకరణను నిలుపుదల చేయగలమనే విశ్వాసం ఏర్పడింది. పచ్చని పంట పొలాలు సుమారు 3 వేల ఎకరాలు, మామిడి తోటలు 1000 ఎకరాలు, సపోట తోటలు, 2 వేల ఎకరాలు, వేరుశనగ 2 వేల ఎకరాలు మిగిలిన భూములు జామాయిల్, కూరగాయల సాగు కలిసి ఉన్నాయి. ఇంత సారవంతమైన భూములను, అన్నం పెట్టే భూములను తీసుకోవడం దారుణమని రైతులు అంటున్నారు. పోలీసు, ఇంటెలిజెన్స్ అంచనాలకు మించి రైతులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం పునరాలోచన చేసి భూసేకరణ ఆపుతుందా.. మొండిగా ముందుకు సాగుతుందా తదుపరి పరిణామాలు ఏ స్థాయిలో ఉంటాయో వేచి చూడాల్సి వస్తుంది. పోలీసుల అణచివేత కుట్ర రైతుల పోరును అణచివేయడానికి పోలీసులు శతధా ప్రయత్నిస్తున్నారు. పోలీసులతో తోపులాట జరిగిన తరువాత కూడా రైతులు పోలీసు బంధనాలు అధిగమించి రాస్తారోకో చేయడంతో రైతులపై పోలీసులు భారీ చర్యలకు సన్నద్ధమయ్యారు. రాస్తారోకోలో పాల్గొన్న రైతులు 26 మందితోపాటు సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల సమీకరణకు సహకరించేలా చేశారని మరో 13 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. కేసుల ద్వారా ఉద్యమాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో పోలీసులు ప్రవర్తిస్తున్నారు. రాస్తారోకో సమయంలో పోలీసులు ప్రవర్తించిన తీరును ప్రజాసంఘాలు, వామపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. -
జగనన్న పర్యటనను ఆపలేరు
● కుట్రలు, కుతంత్రాలను చీల్చుకుని అభిమన్యుడిగా వస్తాడు ● తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, మాజీమంత్రి అనిల్, వైఎస్సార్సీపీ నేతలు నెల్లూరు (స్టోన్హౌస్పేట): ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను ఎవరూ అడ్డుకోలేరని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, మాజీమంత్రి అనిల్కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. జిల్లా జైల్లో ఉన్న మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు 3న నెల్లూరుకు వచ్చే జగనన్న పర్యటనను అడ్డుకునేందుకు అధికారులు, పోలీసులు, అధికార పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కుట్రలు, కుతంత్రాలను చీల్చుకుని అభిమన్యుడిగా వచ్చి తీరుతాడని చెప్పారు. నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్, ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్తలు ఆనం విజయ్కుమార్రెడ్డి, మేకపాటి రాజగోపాల్రెడ్డి, కాకాణి కుమార్తె కాకాణి పూజితలతో కలిసి సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం, అధికారులు ప్రయత్నించడం దారుణమన్నారు. హెలిప్యాడ్ కోసం 3, 4 స్థలాలను నాయకులు పరిశీలించారని, అడ్డంకులు, సాకులు చెబుతూ ఆ స్థలాలను అనుమతించకపోవడం దారుణమన్నారు. ఎప్పుడూ ఈ ప్రభుత్వమే ఉండదని, అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. జగనన్న మీద రాజకీయ కక్షతో హైడ్రామాలు చేయాల్సిన అవసరం లేదని, ఇలా పర్యటనను అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. సంవత్సరంలోనే ప్రజలు వాస్తవాలను తెలుసుకుంటున్నారని, ప్రభుత్వం చేసే దుర్మార్గాలు ఎక్కువ రోజులు ఉండవన్నారు. ● మాజీమంత్రి అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ 10 రోజుల నుంచి జగనన్న పర్యటనకు ప్రయత్నాలు మొదలు పెట్టినప్పటికి హెలిప్యాడ్ అనుమతి విషయంలో అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదన్నారు. జగనన్న పర్యటన అంటేనే కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఇంత భయయో అర్థం కావడం లేదన్నారు. రెండున్నర కి.మీ. సెక్యూరిటీ ఉండే విధంగా గుర్తించిన హెలిప్యాడ్పై అధికారులకు క్లారిటీ లేకపోవడం వారి భయాందోళలను తెలియజేస్తుందన్నారు. ట్రాఫిక్ ఇబ్బంది లేని ప్రాంతాన్ని ఎంచుకున్నప్పటికీ అధికారు లు మరో ప్రాంతాన్ని చూపించడం, మూడు రోజుల నుంచి కాలయాపన చేయడం ఎందుకో అర్థం కావడం లేదన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా 3వ తేదీ జగనన్న నెల్లూరుకు రావడం తథ్యమన్నారు. ● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ కొత్తూరులోని సెయింట్యాన్స్ స్కూల్, కాకుటూరు లో మరో స్థలాన్ని హెలిప్యాడ్కు కేటాయించాలని అధికారులను కోరినప్పటికి సాకులు చెప్పి తప్పించుకుంటున్నారన్నారు. సెయింట్యాన్స్ స్కూల్ యాజమాన్యాన్ని అధికార పార్టీ నేతలు బెదిరించి జగనన్న పర్యటనకు అడ్డంకులు సృష్టించారన్నారు. జైలుకు సమీపంలో ముళ్ల పొదలు, హైటెన్షన్ ఎలక్ట్రికల్ వైర్లు ఉండి అప్రోచ్ రోడ్డు లేని స్థలాన్ని చూపిస్తూ అక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవాలని అధికారులు చెప్పడం దుర్మార్గమన్నారు. షరతులతో సెంట్రల్ జైలు వద్ద స్థలం చూపడం సరైన పద్ధతి కాదన్నారు. జగనన్న వస్తుంటే ముందుగానే కాకాణిపై పీటీ వారెంట్ పెట్టి కోర్టుకు తరలిస్తారనే అనుమానం కూడా కలుగుతుందన్నారు. రాష్ట్రంలో మాజీ సీఎంకే స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. జగనన్న పర్యటనను అడ్డుకునే ఆలోచనతో కూటమి నేతలు ఉన్నారన్నారు. జగనన్నకు వస్తున్న ఆదరణ చూసి కూటమి నేతల్లో భయం కనిపిస్తుందన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని, ప్రజాక్షేత్రంలోకి రావాలంటే భయం పుడుతుందన్నారు. -
ఆధారాలు చూపిస్తే ఏ శిక్షకై నా సిద్ధమే
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కృష్ణపట్నం లాజిస్టిక్స్ చెక్పోస్టు ద్వారా బలవంతంగా నగదు వసూలు చేసినట్లు ఏ ఒక్క ఆధారం చూపించినా ఏ శిక్షకై నా తాను సిద్ధంగా ఉన్నానని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పోలీస్ అధికారులకు సవాల్ విసిరారు. ముత్తుకూరు బీసీ కాలనీకి చెందిన షేక్ ఫరీద్బాబు జూన్ 7వ తేదీ ఇచ్చిన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ–1గా కాకాణి గోవర్ధన్రెడ్డి, ఏ–2గా మెట్టా విష్ణువర్ధన్రెడ్డి, ఏ–3గా తూపిలి శ్రీధర్రెడ్డి, ఏ–4గా స్వామి బాలాజీ ట్రాన్స్పోర్టు, ఏ–5గా టాటా వెంకట శేషయ్య, ఏ–6గా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నెల్లూరు ప్రసాద్, ఏ–7గా రాగా వెంకటేశ్వర్లు, ఏ–8గా పొట్టి రాజా, ఏ–9గా సాయికిరణ్తోపాటు మరికొందరిని నిందితులుగా చేర్చారు. అప్పటికే జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న కాకాణిని పీటీ వారెంట్ కింద తీసుకెళ్లి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసు విచారణ నిమిత్తం ఏడు రోజుల కస్టడీకి కావాలని పోలీసులు కోరగా, రెండు రోజులకు అనుమతి ఇస్తూ న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 1 గంటకు కృష్ణపట్నంపోర్టు సీఐ రవినాయక్, ముత్తుకూరు ఎస్సై విశ్వనాథరెడ్డి జిల్లా సెంట్రలో జైల్లో ఉన్న కాకాణిని తమ కస్టడీకి తీసుకుని జిల్లా జైలు పక్కనే నెల్లూరు డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో విచారణ చేపట్టారు. తొలిరోజు పోలీసులు 52 ప్రశ్నలు సంధించారు. పోలీస్ అధికారులు అడిగిన ప్రశ్నలకు న్యాయవాది శ్రావణ్కుమార్ సమక్షంలో కాకాణి సమాధానాలు ఇచ్చారు. పోలీసులు: కృష్ణపట్నం లాజిస్టిక్స్ చెక్పోస్టు ద్వారా బలవంతంగా డబ్బులు వసూలు చేసిన మెట్టా విష్ణువర్ధన్రెడ్డి ద్వారా మీకు చేరినట్లుగా మా దర్యాప్తులో తేలింది. ఈ డబ్బులను మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశారా? ఎక్కడైనా డిపాజిట్ చేశారా? మీకు ఎంత మొత్తం వచ్చిందో తెలిపాలి? కాకాణి: నాకు ఏ ఒక్క పైసా చేరినట్లు మీ దగ్గర సాక్షాధారాలు ఉంటే చూపించండి. నేను ధైర్యంగా చెబుతున్నాను. ఏ రూపంగా అయినా ఎవరి దగ్గర నుంచి అయినా ఒక్క నయాపైసా అయినా ముట్టినట్లు రుజువులు చూపిస్తే.. నేనే న్యాయాధికారి దగ్గరకెళ్లి ఎటువంటి విచారణ అవసరం లేకుండా నేను శిక్షార్హుడనని ఏ శిక్ష విధిస్తారో విధించమని వారికి విజ్ఞప్తి చేస్తాను. పోలీస్ : కృష్ణపట్నం కంటైనర్స్ ట్రాన్స్పోర్టు అసోసియేషన్ గురించి మీ వద్ద ఉన్న సమాచారం చెప్పండి. కాకాణి : నాకు ఎలాంటి సంబంధం లేదు. కూటమి ప్రభుత్వం అక్రమంగా బనాయించిన తప్పుడు కేసు తప్ప మరొకటి కాదు. కేవలం తప్పుడు ఫిర్యాదులు తీసుకుని కేసు కట్టడం తప్ప ఇంకోటి కాదు. పోలీసుల విచారణ జరిపి ఆధారాలు బయట పెడితే ఎలాంటి శిక్షకై నా నేను సిద్ధమే. పోలీస్ : ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్ గోపాలనగరానికి చెందిన ద్వారం రామిరెడ్డితో మీకున్న పరిచయం చెప్పండి. కాకాణి : ఎలాంటి పరిచయం లేదు. పేరు కూడా వినలేదు. మీరు చెప్పిన వారందరిని రెండు రోజుల కస్టడీ సమయంలో నా ఎదురుగా ప్రశ్నిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. తొలిరోజు పోలీసుల కస్టడీ విచారణలో కాకాణి సవాల్ మొదటి రోజు విచారణ పూర్తినెల్లూరు (లీగల్): మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని ముత్తుకూరు పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం మొదటిరోజు విచారణ పూర్తయింది. కృష్ణపట్నం పోర్టు సమీపంలో చెక్పోస్ట్ ఏర్పాటు చేసి అక్రమంగా డబ్బులు వసూలు చేశారని ముత్తుకూరు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో జిల్లా కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న కాకాణిని న్యాయవాది నందగమ శ్రావణ్కుమార్, మధ్యవర్తులుగా ముత్తుకూరు మండలం పంటపాళెం వీఆర్వో గండవరం భక్తవత్సలరెడ్డి, ముత్తుకూరు వీఆర్వో బాలు వెంకటరమణయ్య సమక్షంలో విచారించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు కాకాణిని కేంద్ర కారాగారానికి తరలించారు. -
సంక్షేమ బోర్డు పునరుద్ధరణకు డిమాండ్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): గత ఎన్నికలకు ముందు కూటమి నేతల హామీ మేరకు భవన నిర్మాణ కార్మి కుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించడంతో పాటు బకాయిలను వెంటనే చెల్లించాలని భవన నిర్మాణ కా ర్మిక సంఘ రాష్ట్ర కార్యదర్శి నరసింహరావు డిమాండ్ చేశారు. మినీ బైపాస్లోని పరమేశ్వరి కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన భవన నిర్మాణ కార్మిక సంఘ నగర మహాసభలో ఆయన మాట్లాడారు. సంక్షేమ బోర్డును 2007లో అప్పటి సీఎం వైఎస్సార్ హయాంలో ఏర్పాటు చేశారని, దీన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రస్తుతం యత్నించడం సిగ్గుచేటని విమర్శించారు. అనంతరం 34 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా పెంచలయ్య, శ్రీనివాసులు, ట్రెజరర్గా సంపూర్ణమ్మ ఎన్నికయ్యారు. సీఐటీయూ నెల్లూరు నగరాధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, నాగేశ్వరరావు, భవన నిర్మాణ కార్మిక సంఘ అధ్యక్ష, కార్యదర్శులు చాన్బాషా, అల్లాడి గోపాల్, సీఐటీయూ నేతలు కొండా ప్రసాద్, మూలం ప్రసాద్, కత్తి శ్రీనివాసులు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వెంగళరావునగర్లో కార్డన్ సెర్చ్
నెల్లూరు సిటీ: వేదాయపాళెంలోని వెంగళరావునగర్ ఏ బ్లాక్లో కార్డన్ సెర్చ్ను ఆదివారం తెల్లవారుజామున నిర్వహించారు. ఏఎస్పీ, నలుగురు సీఐలు, నలుగురు ఎస్సైలు, స్పెషల్ పార్టీలతో కలిసి సుమారు 45 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాల్లేని 45 బైక్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు అనుమానితుల నుంచి వేలిముద్రలను సేకరించి కౌన్సెలింగ్ ఇచ్చారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని వివరించారు. అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
సచివాలయాల్లో బదిలీలలు
ఉదయగిరి: గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా సచివాలయ వ్యవస్థకు గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి రూపకల్పన చేశారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కల్పించి.. వారికి సొంత మండలాల్లోనే పోస్టింగ్లిచ్చారు. ఈ తరుణంలో గతేడాది కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థను గందరగోళంగా మార్చింది. తాజాగా వీరిలో ఐదేళ్ల సర్వీస్ పూర్తయిన వారిని బదిలీ చేసేందుకు జీఓను జారీ చేసింది. ఈ మేరకు ఉద్యోగులు తమ ప్రాధాన్యాన్ని ఆన్లైన్లో ఎంపిక చేసుకున్నారు. బదిలీలు పూర్తి చేసేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. విచిత్ర వైఖరి వాస్తవానికి కౌన్సెలింగ్ను నిర్వహించి.. మెరిట్ అధారంగా బదిలీలు చేపట్టాలి. అయితే దీనికి భిన్నమైన వైఖరిని కూటమి ప్రభుత్వం అవలంబిస్తోంది. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల ఆధారంగా బదిలీలు జరపనున్నారు. ఈ తరుణంలో ఇవి ఉంటేనే కోరుకున్న చోట నియమిస్తామని అధికారులు తేల్చిచెప్పారు. ఈ పరిణామాల క్రమంలో వీటి కోసం అధికార పార్టీ నేతల ఇంటి చుట్టూ ఉద్యోగులు ప్రదక్షిణలు చేస్తున్నారు. వారి దయ లేకపోతే జిల్లాలోని ఏ మారుమూల ప్రాంతంలో ఉద్యోగం చేయాల్సి వస్తుందోనని పలువురు కంగారు పడుతున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో 769 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. వీటి పరిధిలో 8,239 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 78 మంది పంచాయతీ కార్యదర్శులకు ఇటీవల గ్రేడ్ – 4 కార్యదర్శులుగా ఉద్యోగోన్నతి కల్పించి పోస్టింగ్లను ఇచ్చారు. వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన, ఆరోగ్య శాఖల్లో పనిచేసే కొందరికీ పదోన్నతులు లభించాయి. ప్రక్షాళన పేరిట ప్రతి సచివాలయ పరిధిలో జనాభా సంఖ్య ఆధారంగా ఉద్యోగుల సంఖ్యను ఇప్పటికే కుదించారు. దీంతో అనేక మంది ఉద్యోగులు మిగిలిపోనున్నారు. వీరికి ఎక్కడ పోస్టింగ్లు ఇస్తారో అంతుచిక్కడంలేదు. మరోవైపు వార్డు సచివాలయ ఉద్యోగులకు స్థానికత (సొంత మండలం)ను తొలగించలేదు. అదే గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న వారికి సొంత మండలాల్లో పోస్టింగ్లు ఇవ్వకుండా జీఓ జారీ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని తప్పుబడుతున్నారు. అయినా సర్కార్ పట్టించుకోకపోవడం వీరి ఆగ్రహానికి కారణమవుతోంది. ఎమ్మెల్యేల సిఫార్సులకే పెద్దపీట లేఖల కోసం ఉద్యోగుల పరుగులు అధికార అండ ఉంటే అనుకున్న చోట.. లేకపోతే మరెక్కడో పారదర్శకతకు పాతర బదిలీలకు సంబంధించి ఎమ్మెల్యేలిచ్చిన సిఫార్సు లేఖలను ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు ఆయా శాఖల ఉన్నతాధికారులకు అందజేస్తున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు ఇప్పటికే జాబితాను పంపారు. ఇవి లేని వారు తమను మెరిట్ ప్రాతిపదికన బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉదంతంలో పారదర్శకతకు ప్రభుత్వం పాతరేస్తోందని ఆరోపిస్తున్నారు. -
ఆగని దందా.. ఆపే దమ్ముందా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి నియోజకవర్గంలో అధికార మదంతో టీడీపీ నేతలు సహజ వనరుల దోపిడీని అవిశ్రాంతంగా సాగిస్తున్నారు. గనులను తలపించే రీతిలో గ్రావెల్, మట్టిని విచ్చలవిడిగా తవ్వేసి అక్రమంగా రవాణా చేస్తున్నా.. అడిగే ధైర్యం, ఆపే దమ్ము అధికార యంత్రాంగానికి లేకుండా పోతోంది. అధికార పార్టీ నేతల రెడ్బుక్ రాజ్యాంగానికి ఎక్కడ బలి కావాల్సి వస్తుందోనని తమ్ముళ్ల దందాలో వాటా లు తీసుకుంటూ ధ్రుతరాష్ట్రుల్లా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులకు దారితీస్తున్నాయని భూగర్భ, వాతావరణ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరి ధన దాహానికి రహదారులు, కల్వర్టులు, వంతెనలతోపాటు చెరువు కట్టపై కలుజులు దెబ్బతింటున్నాయి. భవిష్యత్లో భారీ వానలు వస్తే చెరువు కట్టలు తెగి ఊర్లకు ఊర్లనే ముంచే ప్రమాదఘంటికలు పొంచి ఉన్నాయి. గుట్టలు కరిగి.. గుంతలేర్పడి.. జిల్లాలో అత్యంత నాణ్యత కలిగిన గ్రావెల్ గనులు దగదర్తి మండలంలో ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ఉలవపాళ్ల, కొత్తపల్లి కౌరుగుంట, అనంతవరం ప్రాంతాల్లోని గ్రావెల్ను మైనింగ్ శాఖ అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా తవ్వేసి అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఈ మండలంలోని టీడీపీ నేతలు ఈ ఏడాది కాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తారంటే ఏ స్థాయిలో అక్రమ దందా జరుగుతుందో అర్థమవుతోంది. చెరువులు, ప్రభుత్వ భూము లు, కొండలు, తిప్పలు తేడా లేకుండా తవ్వేసి రూ.కోట్లలో గ్రావెల్ దందా సాగిస్తున్నారు. అటు బోగోలు, కావలి, కొడవలూరు నుంచి నెల్లూరు వరకు కొత్తగా ఏర్పాటవుతున్న లేఅవుట్లకు, రహదారులకు అవసరమైన గ్రావెల్కు మంచి డిమాండ్ ఉంది. దీంతో అధికార దమ్ము, ధైర్యంతో బహిరంగంగానే గ్రావెల్ తరలించి జేబులు నింపుకుంటున్నారు. రేయింబవళ్లు విచ్చలవిడిగా గ్రావెల్ తరలిస్తున్నా అధికారులు మాత్రం తమ్ముళ్లు ఇచ్చే మామూళ్లకు కక్కుర్తి పడి కిమ్మనడం లేదు. ● దగదర్తి మండలంలోని అనంతవరం, ఉలవపాళ్ల నుంచే అత్యధికంగా నెల్లూరువైపు గ్రావెల్ తరలివెళ్తోంది. దగదర్తిలో స్థిరపడిన అధికార పార్టీ నేత మట్టి దందాకు కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇటీవల ఇఫ్కో భూముల్లో పాగా వేసి గ్రావెల్ తరలించి సొమ్ము చేసుకున్నారు. తాజాగా అనంతవరం చెరువును చెరపడుతున్నారు. చెరువులో నీరు తగ్గడంతో గ్రావెల్ తవ్వకాలు చేస్తూ చెరువు స్వరూపాన్నే మార్చేశారు. ఇప్పటికే దాదాపు 5 లక్షల క్యూబిక్ మీటర్లు మట్టిని తరలించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఉలవపాళ్లలో జాతీయ రహదారి వెంబడే ఉన్న భూములను కబ్జా చేసి గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. హైవే పక్కనే బరితెగించి దోపిడీ చేస్తున్నా.. అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. రహదారులు విధ్వంసమా! అల్లూరు రోడ్డు నుంచి అనంతవరం మీదుగా నారాయణపురం వెళ్లే రోడ్డు గ్రావెల్ వాహనాలతో పూర్తిగా విధ్వంసమైంది. గ్రావెల్ మాఫియా స్వార్థానికి ప్రధాన రహదారులు చిధ్రమైపోతున్నాయి. రెండేళ్ల కిందటే వేసిన రోడ్డులు సైతం ధ్వంసమవుతున్నాయి. మరో వైపు ప్రభుత్వానికి చెల్లించాల్సిన మైనింగ్ రాయల్టీలు ఫీజులు చెల్లించకపోవడంతో ఆదాయానికి గండిపడుతున్నా.. అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదు. అనంతవరం చెరువు కలుజు కూడా దెబ్బతింది. ఆ కలుజు నుంచే తూము ద్వారా నీరు సరఫరా జరుగుతోంది. దాదాపు 150 ఎకరాలు ఆయుకట్టుకు నీరందించే ఆ తూము ధ్వంసం అవుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీఓకు ఫిర్యాదు చేసినా.. చర్యలు శూన్యం దగదర్తి మండలంలోని అనంతవరంలో జరిగే అక్రమ గ్రావెల్ రవాణాతో రహదారులు చిధ్రమై పోతున్నాయిని, కల్వర్టులు, తూములు దెబ్బతిని సాగునీటి పారుదల వ్యవస్థ నిలిచిపోతుందని అనంతవరం గ్రామ రైతులు ఇటీవల కావలి ఆర్డీఓ, దగదర్తి తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. వీరికి వామపక్ష పార్టీ నేతలు మద్దతు ఇచ్చారు. కానీ వారు చర్యలు చేపట్టకపోవడంతో మట్టి మాఫియా లెక్క చేయలేదు. వాహనాల రణ ధ్వనులతోపాటు రోడ్లపై దుమ్ముధూళితో స్థానికులు నరకం అనుభవిస్తున్నారు. గ్రావెల్ మాఫియా ధనార్జన కోసం ఇష్టానుసారంగా చేస్తున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతుంది. అనంతవరం, ఉలవపాళ్ల, కేకేగుంట గ్రావెల్ గనులు విచ్చలవిడిగా అక్రమ తవ్వకాలు, రవాణా మీడియా ఘోషిస్తున్నా.. చెవికెక్కించుకోని అధికార యంత్రాంగం భారీ వాహనాల బరువుకు దెబ్బతింటున్న రహదారులు, వంతెనలు, చెరువు కలుజులు -
మహిళా సంరక్షణ కార్యదర్శుల బదిలీలకు అవకాశం
నెల్లూరు సిటీ: జిల్లాలో ఐదేళ్ల సర్వీస్ను పూర్తి చేసిన గ్రామ / వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు.. ప్రత్యేక కేటగిరీలో ఉన్న వారు.. రిక్వెస్ట్ నిమిత్తం బదిలీలు కోరేందుకు అవసరమైన వివరాలతో కూడిన ఆప్షన్ ఫారాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం సమర్పించాలని పోలీస్ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. సొంత మండలం లేదా ప్రస్తుతం పనిచేస్తున్న సచివాలయంలో స్థానాన్ని ఇవ్వబోమని చెప్పారు. ఫారాల్లో తప్పుడు సమాచారమిస్తే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.గుర్తుతెలియని వ్యక్తి మృతిఅనుమసముద్రంపేట: గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన అనుమసముద్రంలోని హజరత్ సయ్యద్షా ఖాదరీ బాబా దర్గా వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. 60 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ సొమ్మసిల్లారు. దీంతో 108లో ఆత్మకూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని కోరారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థినికి గాయాలు
ఉదయగిరి: రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని గాయపడిన ఘటన పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. స్థానిక మేకపాటి గౌతమ్రెడ్డి వ్యవసాయ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న లాస్యప్రియ తన స్నేహితురాలతో కలిసి పట్టణంలోకి వెళ్లి తిరిగి కళాశాలకు బయల్దేరారు. ఈ క్రమంలో పోలేరమ్మ చెట్టు అరుగు వద్ద వెనుక నుంచి వేగంగా బైక్పై వస్తున్న నల్లిపోగు దాస్ ఢీకొన్నారు. రోడ్డుపై పడటంతో తీవ్రంగా గాయపడిన ఆమెను ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్సను అందించారు. కాగా యువకుడు మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు తెలిపారు. ఎస్సై ఇంద్రసేనారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కండలేరులో 33.54 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారానికి 33.54 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 2150, పిన్నేరుకు 10, లోలెవల్కు 70, హైలెవల్ కు 40, మొదటి బ్రాంచ్ కాలువలకు 85 క్యూసెక్కులను విడుదల చేస్తున్నా మని వివరించారు. -
ఉన్నత పాఠశాలల్లో వసతుల పరిశీలన
ఉదయగిరి రూరల్: ఉదయగిరి, వెంకట్రావుపల్లి ఉన్నత పాఠశాలల్లో మౌలిక వసతులను రాష్ట్ర వి ద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ మువ్వా రామలింగం, జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య అదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తరగతులను నూతనంగా నిర్మించిన భవనాలకు మార్చాలని, ఎలక్ట్రికల్ పనులను పూర్తి చేయాలని సూచించారు. దీనికి సంబంధించిన నిధులను వారంలో విడుదల చేస్తామని చెప్పారు. వెంకట్రావుపల్లి ఉన్నత పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు నిధులను మంజూరు చేస్తామని వెల్లడించారు. ప్రధానోపాధ్యాయుడు షరీఫ్బాషా, ఉదయగిరి ఎంఈఓలు మస్తాన్వలీ, తోట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన జిల్లా స్థాయి చెస్ పోటీలు
నెల్లూరు(స్టోన్హౌస్పేట): పొగతోటలోని రాయ్ చెస్ అకాడమీలో నిర్వహిస్తున్న అండర్ – 15 సబ్ జూనియర్స్ బాలుర, బాలికల జిల్లా స్థాయి చెస్ చాంపియన్షిప్ ఆదివారంతో ముగిసింది. యడవల్లి సాయిచక్రధర్, సంజన గెలుపొందారు. బాలుర విభాగంలో యజ్ఞేశ్వర్రెడ్డి, శ్రీచైతన్య, మిథిలేష్.. బాలికల విభాగంలో నేహా, సుదీక్ష, కీర్తన తర్వాతి స్థానాల్లో నిలిచారు. విశాఖపట్నంలో వచ్చే నెల 12, 13న నిర్వహించనున్న రాష్ట్రస్థాయి చెస్ చాంపియన్షిప్లో జిల్లా తరఫున వీరు ప్రాతినిధ్యం వహించనున్నారు. బహుమతులను కళాలయ డైరెక్టర్ గూడూరు లక్ష్మి, ఆనం పద్మనాభరెడ్డి అందజేశారు. ఆర్బిటర్ మౌనిక, విష్ణు, సుబ్బారెడ్డి, ఫిడే ఇన్స్ట్రక్టర్ అజీజ్ పాల్గొన్నారు. -
స్టాఫ్ నర్సు ఆత్మహత్యాయత్నం
ఆత్మకూరు: ఏఎస్పేటలోని ప్రాథమిక వైద్యశాలలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న లక్ష్మి ఆత్మహత్యాయత్నానికి ఆదివారం సాయంత్రం పాల్పడ్డారు. ఆస్పత్రి డాక్టర్లతో పాటు 35 మంది సిబ్బంది, డీఎంహెచ్ఓ వేధింపులకు గురిచేస్తున్నారని సెల్ఫీ వీడియోలో ఆరోపించారు. విధులకు హాజరుకాకుండానే పలువురు సిబ్బంది పూర్తి జీతాలు తీసుకున్నారని.. తాను సెలవడిగితే డ్యూటీ డాక్టర్ మంజూరు చేయకుండా వేధించారని పేర్కొన్నారు. వీటిపై అర్జీలను అందించేందుకు కలెక్టరేట్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగానని వాపోయారు. కాగా ఈమె, భర్త.. ఏబీఎన్ చానల్ రిపోర్టర్ తీవ్ర వేధింపులకు గురిచేయడంతో అదే పీహెచ్సీలో ఎఫ్ఎన్ఓగా పనిచేస్తున్న దొరసానమ్మ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి శుక్రవారం పాల్పడి న విషయం తెలిసిందే. ఈమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టాఫ్ నర్సు లక్ష్మి సైతం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి నెల్లూరు తరలించనున్నామని బంధువులు తెలిపారు. కాగా ఈ విషయమై డీఎంహెచ్ఓ సుజాతను సంప్రదించగా, తనకు ఇప్పుడే విషయం తెలిసిందని, పూర్తి స్థాయి విచారణను సోమవారం జరుపుతానని చెప్పారు. -
గ్రావెల్ రవాణా అడ్డగింత
● దాడిలో ఇద్దరికి గాయాలు జలదంకి: మండలంలోని జమ్మలపాళెం చెరువులో జేసీబీ సాయంతో గ్రావెల్ను అక్రమంగా తరలిస్తుండగా, గ్రామానికి చెందిన టీడీపీ నేత సింగమనేని మనోజ్, జనసేన నేత శెట్టిపల్లి మధు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా చెరువు నుంచి ఎలా తరలిస్తారని ప్రశ్నించగా, గ్రామానికి చెందిన నక్కా మాధవ, మహేంద్ర, బాబు, జేసీబీ, ట్రాక్టర్ డ్రైవర్ దాడికి పాల్పడ్డారు. గాయపడిన వారు కావలి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కాగా సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్ను సర్పంచ్ అనుమతితో తోలుతుండగా, వారొచ్చి దుర్భాషలాడి దాడికి పాల్పడ్డారని మాజీ సర్పంచ్ నక్కా మాధవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
లో గ్రేడ్ పొగాకును కొనుగోలు చేయండయ్యా..
కందుకూరు: పొగాకు మార్కెట్లో ఈ ఏడాది నెలకొన్న సంక్షోభంతో పూర్తిగా నష్టపోతున్నామని.. పండించిన పంటను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లో గ్రేడ్ పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయకపోతే తమ పరిస్థితి ఏమిటని నిలదీశారు. ఈ మేరకు పామూరు రోడ్డులోని రెండో వేలం కేంద్ర పరిధిలో పొగాకు వేలాన్ని అడ్డుకొని రైతులు ఆందోళనకు శనివారం దిగారు. వేలాన్ని నిలిపేసి.. రోడ్డుపైకి వచ్చి వాహనాలను అడ్డుకొని నిరసన చేపట్టారు. ఈ తరుణంలో పోలీసులు జోక్యం చేసుకొని రైతులకు సర్దిచెప్పి ఆందోళనను విరమింపజేశారు. ఆపై రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. బోర్డు కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు అర్ధనగ్న ప్రదర్శన జరిపారు. అనంతరం సబ్ కలెక్టర్ శ్రీపూజకు వినతిపత్రాన్ని అందజేశారు. వేలం చివరి దశకు చేరుకుందని, అయినా బోర్డులో పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరగడంలేదని ఆరోపించారు. అదనపు భారం రైతుల వద్ద లో గ్రేడ్ రకం పొగాకు ఉత్పత్తులే ప్రస్తుతం ఉన్నాయి. కిలోను ఇప్పటి వరకు రూ.160కు కొనుగోలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ ధరకూ కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ధరలు తగ్గించిచ్చేందుకు సిద్ధమైనా, కొనుగోలు చేయడంలేదని వాపోయారు. వేలం కేంద్రానికి తీసుకొచ్చిన బేళ్లను కొనుగోలు చేయకపోవడంతో తిరిగి ఇళ్లకు చేర్చుకోవాల్సి వస్తోందని, ఫలితంగా రవాణా చార్జీల రూపంలో అదనపు భారం పడుతోందని చెప్పారు. ఒకసారి వేలానికి తీసుకొచ్చి, తిరిగి ఇంటికి తీసుకెళ్లిన బేలులో దాదాపు 10 కిలోల పొగాకు వ్యత్యాసం కనిపిస్తోందని ఆరోపించారు. కొనుగోలు చేయకుండా తిప్పి పంపితే, తామేమీ చేసుకోవాలని, ఎక్కడ విక్రయించాలని నిలదీశారు. అధికారులు జోక్యం చేసుకొని లో గ్రేడ్ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా చూడాలని డిమాండ్ చేశారు. క్వింటాల్ లో గ్రేడ్ రకం పొగాకును రూ.32 వేలకు గతేడాది కొనుగోలు చేసిన వ్యాపారులు, ఈ ఏడాది రూ 15 వేలకు కూడా కొనుగోలు చేయకపోవడమేమిటని ప్రశ్నించారు. ఇరువర్గాలను ఒప్పించి.. వేలం కేంద్రానికి వచ్చిన బోర్డు రీజినల్ మేనేజర్ లక్ష్మణరావు.. అటు రైతులు, ఇటు వ్యాపారులతో చర్చలు జరిపారు. వేలం సాగేందుకు ఇరువర్గాలను ఒప్పించారు. అయినా లో గ్రేడ్ పొగాకును కొనుగోలు చేసేందుకు చాలా మంది వ్యాపారులు ముందుకు రాకపోవడం గమనార్హం. పొగాకు కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, చేతల్లో ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో వేలం కేంద్రంలో రైతుల ఆందోళన అర్ధనగ్న ప్రదర్శన సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేత -
ముగిసిన బదిలీల కౌన్సెలింగ్
నెల్లూరు సిటీ: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఆరు మున్సిపాల్టీలతో పాటు నగరపాలక సంస్థ పరిధిలో గల వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తించే పలు విభాగాల ఉద్యోగులకు సంబంధించిన బదిలీల కౌన్సెలింగ్ను కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఉదయం తొమ్మిదింటికే ఆయా సచివాలయాల ఉద్యోగులు 1266 మంది హాజరయ్యారు. ఉద్యోగులకు సంబంధించిన జాబితాను విడుదల చేయడం.. అందులో నియామక తేదీల్లో మార్పులుండటంతో గందరగోళం నెలకొంది. ఇవి తప్పులతడకగా ఉండటాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తమ కంటే వెనుక చేరిన వారి పేర్లు కౌన్సెలింగ్లో ముందు రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎవరికీ ఇబ్బందుల్లేకుండా.. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో కౌన్సెలింగ్కు ఉద్యోగులు సహకరించారు. అనంతరం కమిషనర్ నందన్ మాట్లాడారు. వార్డు సచివాలయ విభాగం చేపట్టిన రేషనలైజేషన్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తి చేశామని తెలిపారు. ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేశామని, ఉద్యోగులకు వార్డుల కేటాయింపు ప్రక్రియను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు త్వరలో పూర్తి చేయనున్నామని వెల్లడించారు. హాజరైన 1266 మంది సచివాలయ ఉద్యోగులు నియామక తేదీల్లో తప్పులతో గందరగోళం -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం
నెల్లూరు సిటీ: ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. డ్రైవర్స్ కాలనీలోని బిట్ – 2లో నివాసం ఉంటున్న ఖతీముద్దీన్ (40), నూర్జ్హాన్ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉడ్ కాంప్లెక్స్లో కొయ్య పని చేసేవారు. మూడు నెలలుగా పనిలేకపోవడంతో కుటుంబపోషణకు అప్పులు చేశారు. వీటిని ఎలా తీర్చాలని రోజూ వేదనకు గురయ్యేవారు. కుమార్తె వివాహానికి సరిపడా డబ్బుల్లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో భార్య తన పిల్లలతో కలిసి బెడ్రూమ్లో శుక్రవారం రాత్రి నిద్రించారు. హాల్లోకి శనివారం వచ్చి చూడగా, సీలింగ్ ప్యాన్కు చీరతో ఉరేసుకొని ఉండటాన్ని గమనించారు. భార్య కేకలేయడంతో చుట్టుపక్కలు వారు వచ్చి హాస్పిటల్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వేదాయపాళెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జీతాల్లేవు.. క్రీడల్లో శిక్షణెలా..?
రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మారుస్తామని సీఎం చంద్రబాబు తరచూ ఊదరగొడుతుంటారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే విస్మయం కలగకమానదు. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసే వారికి నెలల తరబడి జీతాలను చెల్లించకపోవడంతో వారి ఆకలికేకలు తీవ్రమవుతున్నాయి. వీటిని సక్రమంగా అందించకపోవడంతో స్టేడియాల్లో క్రీడాకారులకు ఎలా తర్ఫీదునిస్తారో అంతుచిక్కడంలేదు. సమస్యలపై రాష్ట్ర ఉన్నతాధికారులకు లేఖలు పంపినా, ఏ మాత్రం చలనం ఉండటంలేదు. నెల్లూరు (స్టోన్హౌస్పేట): జిల్లా క్రీడాప్రాధికార సంస్థలో దాదాపు 26 మంది కోచ్లు, గ్రౌండ్స్మెన్, స్వీపర్లు, సెక్రటరీలు, వాచ్మెన్లకు ఏడాదిగా జీతాలు రావడంలేదు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వీరు తమ వెతలపై రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థకు విన్నవించినా ప్రయోజనం కరువవుతోంది. ఏటా ఇదే పరిస్థితి ఏర్పడినా ఇటీవలి కాలంలో వీరు పరిస్థితి దయనీయంగా మారింది. ఫలితంగా ఇంటి బాడుగలు చెల్లించలేక, కుటుంబాన్ని పోషించలేక నానా అగచాట్లు పడుతున్నారు. లేఖ రాసినా స్పందనేదీ..? వీరికి జీతాలు రావడంలేదనే అంశాన్ని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్కు కలెక్టర్ ఆనంద్ మార్చిలో లేఖ రాసినా, స్పందన నేటికీ కొరవడింది. నెల్లూరుతో పాటు ఆరు జిల్లాల మినహా మిగిలిన అన్ని చోట్ల వేతనాలు సక్రమంగానే అందుతున్నాయి. ఇక్కడే ఈ పరిస్థితి ఎందుకని ఎవరైనా ప్రశ్నిస్తే, సరైన సమాధానం కరువవుతోంది. వాస్తవానికి కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో పనిచేస్తున్న కోచ్లకు రూ.21,500.. జూనియర్ అసిస్టెంట్కు రూ.20 వేలు.. ఆఫీస్లో పనిచేస్తున్న వారికి రూ.18,500.. స్వీపర్లు, గ్రౌండ్ మార్కర్లకు రూ.15 వేల మేర జీతాలు రావాల్సి ఉంది. అనారోగ్యానికి గురైనా అదే తీరు.. జీవరత్నం అనే ఉద్యోగి నెల కింద బ్రెయిన్ ట్యూమర్కు గురై కాళ్లు, చేతులతో పాటు మాట పడిపోయింది. సాయం చేయాలని మేలో లేఖలు పంపినా, రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ పట్టించుకోవడంలేదు. అతని పరిస్థితిని గమనించి ఆర్థిక సాయాన్ని సాఫ్ట్బాల్ జిల్లా అసోసియేషన్, ఖోఖో, కబడ్డీ తదితర క్రీడాకారులతో పాటు నెల్లూరు డీఎస్డీఓ అందజేశారు. ఇప్పటికై నా సమస్యను పరిష్కరించి తమకు జీతాలను చెల్లించాలని వీరు కోరుతున్నారు. వేతనాలు రాక స్టేడియంలో సిబ్బంది ఆకలికేకలు లేఖలు రాసినా రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ నుంచి స్పందన కరువు అనారోగ్యానికి గురైనా కనికరం చూపని సర్కార్ ఏడాదిగా ఇదే దుస్థితి ఉన్నతాధికారులకు తెలియజేశాం జీతాలు రాని విషయాన్ని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఉన్నతాధికారులకు తెలియజేశాం. కలెక్టర్ ద్వారా లేఖలు పంపాం. సమస్య త్వరలో పరిష్కారమవుతుందని భావిస్తున్నాం. – యతిరాజ్, డీఎస్డీఓ -
న్యాయమూర్తులకు శిక్షణ తరగతులు
నెల్లూరు (లీగల్): జిల్లాలోని వివిధ కోర్టుల న్యాయమూర్తులకు కోర్టు హాల్లో నిర్వహించిన శిక్షణ తరగతుల కార్యక్రమన్ని ఏపీ హైకోర్టు జడ్జి, నెల్లూరు జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ కె. శ్రీనివాసులురెడ్డి శనివారం ప్రారభించారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జి. శ్రీనివాస్ నోడల్ అధికారిగా మాజీ హైకోర్టు జడ్జిలు బి. శ్యామసుందర్, ఎం.సీతారామమూర్తితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ వర్క్ షాప్లో సెక్షన్ 9 సీపీసీ న్యాయపరిధి, చట్టంలో కేసులను విచారించి నిర్ణయించడానికి కోర్టు అధికారం, లోక్ అదాలత్పై సమీక్షా, సలహాలు ఇవ్వడం జరిగింది. అనంతరం జిల్లా కోర్టుకు వచ్చే విభిన్న ప్రతిభా వంతులైన కక్షిదారుల సౌకర్యార్థం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అందజేసిన 18 ట్రైసైకిళ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఓ ఆనంద్, మునిసిపల్ కమిషనర్ వైఓ నందన్, బ్యాంక్ అధికారులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఏపీ జెన్కోలో ప్రమాదం ● కార్మికుడికి తీవ్రగాయాలు ముత్తుకూరు(పొదలకూరు): ముత్తుకూరు మండలం నేలటూరు ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో శనివారం జరిగిన ప్రమాదంలో అవుట్సోర్సింగ్ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. మచిలీపట్నంకు చెందిన శివప్రసాద్ పదేళ్లుగా ఇక్కడ అవుట్సోర్సింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజువారి విధుల్లో భాగంగా పని చేస్తుండగా ఈహెచ్పీ బ్రేకర్ పేలిపోవడంతో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని తోటికార్మికులు హుటాహుటిన నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. నీకు చదువు రాదు.. టీసీ తీసుకెళ్లిపో ● ఏపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడి నిర్వాకం దుత్తలూరు: విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేసి, తదనుగుణంగా తర్ఫీదు ఇచ్చి ఎదిగేందుకు కృషి చేయాల్సిన ఓ ఉపాధ్యాయుడే నీకు చదువురాదు.. టీసీ తీసుకుని వెళ్లిపో అంటూ ఓ విద్యార్థిని అవమానించిన ఘటన దుత్తలూరు ఏపీ ఆదర్శ పాఠశాలలో శుక్రవారం జరిగింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు.. పాఠశాలలో హర్షవర్ధన్రెడ్డి 7వ తరగతి చదువుతున్నాడు. అయితే సైన్న్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజశేఖర్ శుక్రవారం విద్యార్థిని పిలిచి టీసీ తీసుకుని వెళ్లమన్నాను కదా మళ్లీ ఎందుకు వచ్చావంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతని తల్లికి ఫోన్ చేసి పాఠశాలకు వచ్చి మీ అబ్బాయి టీసీ తీసుకెళ్లాలంటూ హెచ్చరించారు. దీంతో విద్యార్థి మేనమామ శనివారం ప్రిన్సిపల్ సైమన్రావుకు ఫిర్యాదు చేయడంతో ఆయన విద్యార్థిని పిలిచి వివరాలు సేకరించారు. ఈ విషయమై ప్రిన్సిపల్ని వివరణ కోరగా ఉపాధ్యాయుడు సెలవులో ఉన్నాడని విచారించి చర్యలు చేపడతామని తెలిపారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి
● ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ పొదలకూరు : వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, అక్రమ కేసులకు భయపడాల్సిన పనిలేదని ఎమ్మెల్సీ, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్ అభయమిచ్చారు. పొదలకూరులోని జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ నివాసంలో శనివారం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో పార్టీ పటిష్టంగా ఉందన్నారు. మరో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ పార్టీ నాయకులు కార్యకర్తలను సమన్వయ పరుచుకుని సమస్యలు ఎదురైతే పోరాడాల్సిందిగా సూచించారు. వెన్నుదన్నుగా తాము నిలబడతామన్నారు. మాజీమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి కుమార్తె కాకాణి పూజిత మాట్లాడుతూ తన తండ్రి త్వరలోనే కేసుల నుంచి బయటకు వస్తారని, నాయకులు, కార్యకర్తలు మనోధైర్యంగా ఉండాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైన తన దృష్టికి తీసుకురావాలని కోరారు. సమావేశంలో పార్టీ స్టేట్ సెక్రటరీ శివశంకర్రెడ్డి, మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, పొదలకూరు, వెంకటాచలం వైస్ ఎంపీపీలు వేణుంబాక చంద్రశేఖర్రెడ్డి, కోదండరామిరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ గోగిరెడ్డి గోపాల్రెడ్డి, ఎంపీటీసీలు జీ లక్ష్మీకల్యాణి, ఎస్కే అంజాద్, జీ శ్రీనివాసులు, మాజీ ఏఎంసీ చైర్మన్ రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ కార్యదర్శుల ఆందోళన బాట
నెల్లూరు (పొగతోట) : సమస్యల సాధన కోసం పంచాయతీ కార్యదర్శులు కదం తొక్కారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం డీపీఓ కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయం, కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగారు. భారీ సంఖ్యలో హాజరైన పంచాయతీ కార్యదర్శులు, మండుటెండను సైతం లెక్క చేయకుండా డీపీఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. డీపీఓ, కలెక్టరేట్ అధికారులకు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య నాయకులు చల్లా ప్రసాద్రెడ్డి, ఓ లెనిన్, శ్రీనివాసులురెడ్డి, శివకుమార్ మాట్లాడుతూ పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీ కార్యదర్శులను అవహేళన చేస్తూ మనో భావాలు దెబ్బతినేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 6 గంటలకే ఇంటింటి చెత్త సేకరణ చేసేటప్పుడు ఫొటోలు పెట్టి అప్లోడ్ చేయాలంటూ కార్యదర్శుల స్థాయిని తగ్గిస్తూ మాట్లాడారని వాపోయారు. ఇప్పటికే తమపై పని ఒత్తిడి అధికంగా ఉందన్నారు. ఏ శాఖకు లేని ఐవీఆర్ఎస్ కాల్స్ పంచాయతీశాఖకు వద్దంటూ విజ్ఞప్తి చేశారు. పంచాయతీ కార్యదర్శుల వల్లే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి గిన్సిస్ రికార్డు నమోదు అయిందన్నారు. యోగాంధ్ర విజయవంతంలో పంచాయతీ కార్యదర్శులు రాత్రి, పగలు శ్రమించారని గుర్తు చేశారు. కార్యదర్శులకు సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల పంచాయతీల్లో అన్ని రకాల సర్వేలు, స్వర్ణ పంచాయతీ పనులు, ఇంటి పన్ను వసూళ్లు, పీఆర్ 1 యాప్, గ్రామ సచివాలయాల సర్వేలు, పీజీఆర్ఎస్ పనులు, గ్రామ సభలు, పంచాయతీ సమావేశాలు, సంక్షేమ పథకాల అమలు, ఎన్నికల విధులు, ప్రొటోకాల్ విధులు తదితర పనులతో పని ఒత్తిడి అధికంగా ఉందన్నారు. దీంతోపాటు నిత్యం వెబ్ కాన్ఫరెన్స్లు, గూగుల్ మీట్లు, టెలీకాన్ఫరెన్స్లతో ఒత్తిడితో నలిగిపోతున్నామన్నారు. ప్రతిది పంచాయతీ కార్యదర్శులకు అప్పగించడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై కార్యదర్శులు వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. కుటుంబ సంక్షేమాన్ని కూడా పట్టించుకోకుండా పనులపై 24 గంటలు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య నాయకులు పురిణి శ్రీనివాసులు, ఆర్.శివకుమార్, ఎస్కే ఇంతియాజ్, వహీదా అధిక సంఖ్యలో పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. పని ఒత్తిడి తగ్గించాలి పంచాయతీ కార్యదర్శులు పని ఒత్తిడితో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సంక్షేమ పథకాలు, సర్వేలు, ప్రతిదీ పంచాయతీ సెక్రటరీలకే అప్పగిస్తున్నారు. పండ్లు కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు పంచాయతీ కార్యదర్శులకే ప్రతి పనిని అప్పగిస్తున్నారు. పంచాయతీ రాష్ట్ర ఉన్నతాధికారులు కార్యదర్శులను కించపరిచేలా మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శుల మనోభావాలు దెబ్బతినేలా అధికారుల మాట తీరు ఉంది. పని ఒత్తిడి తగ్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – చల్లా ప్రసాద్రెడ్డి, కార్యదర్శుల జిల్లా నాయకుడు అనారోగ్యాల పాలవుతున్నాం పంచాయతీ కార్యదర్శులపై తీవ్రమైన పని ఒత్తిడి ఉంది. పని ఒత్తిడి కారణంగా అనారోగ్యాల పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. పంచాయతీ కార్యదర్శులకు ఐవీఆర్ఎస్ కాల్స్ దూరంగా ఉంచాలి. కార్యదర్శుల సంక్షేమం కోసం అధికారులు, ప్రభుత్వం కృషి చేయాలి. – ఓ లెనిన్, కార్యదర్శుల జిల్లా నాయకుడు డీపీఓ, జిల్లా పరిషత్ కార్యాలయం, కలెక్టరేట్ ఎదుట ధర్నాలు పని ఒత్తిడి తగ్గించకుంటే సమ్మెకు దిగుతామంటూ హెచ్చరిక సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రాలు -
వైభవంగా కల్యాణం
రాపూరు: పెంచలకోన క్షేత్రంలో శనివారం సాయంత్రం శ్రీపెనుశిలలక్ష్మీనరసింహాస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవిలకు శాస్త్రోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించారు. ఉత్సవ మూర్తులను అలంకార మండపంలోకి వేంచేపు చేసి అక్కడ తిర్చుపై కొలువుదీర్చారు. ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం సహస్రదీపాలంకరణ మండపంలో ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు.ఉదయం నిత్య కల్యాణ మండలపంలో స్వామి అమ్మవార్ల కల్యాణం ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి పునీతులయ్యారు. -
కండలేరులో 33.986 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 33.986 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 2,040, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 70, హైలెవల్ కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. రైల్లో నుంచి పడి..● వ్యక్తి మృతిమనుబోలు: విజయవాడ నుంచి చైన్నె వెళ్తున్న రైల్లో నుంచి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన మనుబోలు – కొమ్మలపూడి రైల్వే స్టేషన్ల మధ్య 147/7–5 కిలోమీటర్ వద్ద శుక్రవారం వేకువజామున చోటుచేసుకుంది. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. పింక్ కలర్ చెక్స్ ఫుల్ హ్యాండ్స్ షర్టు, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై హరిచందన తెలిపారు. -
మద్యానికి బానిసై దోపిడీలు
● నిందితుల అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): వారంతా మద్యం, చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. వ్యసనాలను తీర్చుకునేందుకు ముఠాగా ఏర్పడి ఒంటరిగా వెళ్లేవారిని చంపుతామని కత్తులతో బెదిరించి నగదు దోచుకెళుతున్నారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు నవాబుపేట పోలీస్స్టేషన్లో శుక్రవారం ఇన్స్పెక్టర్ వేణుగోపాల్రెడ్డి వివరాలను వెల్లడించారు. ఓ బ్యాంకు ఉద్యోగి ఈనెల 25వ తేదీన తన కుటుంబంతో కలిసి బైక్పై వెళుతుండగా రైల్వేస్టేషన్ వద్ద ముగ్గురు నిందితులు అడ్డగించారు. కత్తులతో చంపుతామని బెదిరించి నగదు దోచుకెళ్లారు. అదేరోజు రాత్రి ఇద్దరు బాలలు మద్యం తాగేందుకు తడికల బజారు సెంటర్ దళితవాడలో ఒంటరిగా ఇంటిముందు నిద్రిస్తున్న మహిళను కత్తితో బెదిరించి నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుల మేరకు నవాబుపేట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ నేతృత్వంలో సిబ్బంది బృందాలుగా ఏర్పడి సాంకేతికత ఆధారంగా బ్యాంకు ఉద్యోగిని బెదిరించి నగదు దోచుకెళ్లింది ఉడ్హౌస్ సంఘానికి చెందిన మునితేజ, సీహెచ్ మహేష్, బాలాజీనగర్కు చెందిన బి.దేవకుమార్లుగా గుర్తించారు. దళితవాడ దోపిడీ కేసులో ఇద్దరు బాలల్ని గుర్తించారు. శుక్రవారం వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. చెడు వ్యసనాలకు బానిసై నేరాలకు పాల్పడుతున్నట్లు వారు అంగీకరించారు. దీంతో ఇద్దరు బాలలను తిరుపతిలోని జువైనెల్ హోంకు తరలించి మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. కేసులను ఛేదించడంలో ప్రతిభ చూపిన ఇన్స్పెక్టర్, ఎస్సై రెహమాన్, సిబ్బంది నరసయ్య, ప్రసాద్, మస్తాన్రావు, సుధాకర్, వేణు, మస్తానయ్య, గౌస్బాషాలను ఎస్పీ అభినందించారు. -
ఆవుల తరలింపును అడ్డుకున్న గోరక్షకులు
● జరిమానా విధించి వదిలేసిన ఎస్సై ● ఎస్పీకి ఫిర్యాదు ఉలవపాడు: అక్రమంగా గోవులను లారీలో తరలిస్తుండగా గోరక్షకులు, బీజేపీ నేతలు అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం చీమకుర్తి నుంచి తిరుపతికి కారులో వెళ్తున్న బీజేపీ నేతలు గుండా శ్రీనివాసరావు, శివారెడ్డి, నరేష్కుమార్, సుబ్బారావులకు మన్నేటికోట అడ్డరోడ్డు సమీపంలో గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనం కంటపడింది. దీంతో అడ్డుకుని పరిశీలించారు. గోవులతో సహా వాహనాన్ని, తరలిస్తున్న వారిని ఉలవపాడు పోలీస్స్టేషన్లో అప్పగించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే గోవులను సరంక్షించడంతోపాటు అక్రమ రవాణాదారులపై చర్యలు తీసుకోవాల్సిన ఎస్సై అంకమ్మ ఆ వాహనానికి రూ.2,200 జరిమానా వేసి ఆవులను తరలించే వాహనాన్ని వదిలేశారు. దీంతో వారు జరిమానా కట్టి వెంటనే గోవులను తీసుకుని వెళ్లిపోయారు. ఎస్సై వ్యవహరించిన తీరుపై సదరు బీజేపీ నేతలు ఎస్పీ కృష్ణకాంత్కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. గోవులను గోశాలకు తరలించకుండా, ఇరుకుగా ఉన్న వాహనంలో తిరిగి పంపించడంతో పోలీసులపై కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు
● ఆవేదనలో వెలుగు ఉద్యోగులు సీతారామపురం: వెలుగు విభాగంలో ప్రభుత్వం చేపట్టిన సాధారణ, సర్దుబాటు పేరిట బదిలీల ప్రక్రియలో పారదర్శకత లోపించింది. నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ కక్ష సాధింపుతో బదిలీలు చేశారంటూ ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయినవారికి జిల్లాలో, కాని వారికి ఇతర జిల్లాలకు స్థానచలనం ఎలా చేస్తారని కొందరు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సర్దుబాటు ప్రక్రియ కూడా లోపభూయిష్టంగా ఉందని పలువురు విమర్శిస్తుండగా, కొందరు ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బదిలీలకు సంబంధించి సెర్ప్ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయగా అందుకు విరుద్ధంగా జిల్లాలో బదిలీలు జరిగాయన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 23 ప్రకారం ఒకచోట ఐదేళ్లు సర్వీస్ పూర్తిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలి. అయితే కేవలం ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని సైతం ఇతర జిల్లాకు బదిలీ చేసినట్లు తెలిసింది. సర్ప్లస్ కాకపోయినా రాజకీయాలు చేసి ఐదుగురు ఏపీఎంలను పల్నాడు జిల్లాకు బదిలీ చేశారు. అంతంతమాత్రపు జీతాలతో అంత దూరం వెళ్లి విధులు ఎలా నిర్వహించాలంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సీనియారిటీ లిస్టును పక్కనపెట్టి చేపట్టిన బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, డబ్బులిచ్చిన వారిని మినహాయింపు ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా నుంచి ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుష ఏపీఎంలను పల్నాడు జిల్లాకు పంపారు. వీరంతా సెర్ప్ గైడ్లైన్స్ ప్రకారం బదిలీలకు అనర్హులు. వారు ముందస్తు దరఖాస్తు చేసుకోలేదు. అయినా నిబంధనలకు విరుద్ధంగా ఇతర జిల్లాకు బదిలీ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తహసీల్దార్, ఎంపీడీఓలు, ఇతర మండల స్థాయి అధికారులకు సైతం జిల్లా స్థాయిలో బదిలీలు జరుగుతుండగా ఏపీఎంలకు మాత్రం జోనల్ స్థాయిలో స్థాన చలనం కలిగించడం గమనార్హం. -
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
● రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ మాజీ చైర్పర్సన్ శిరీష సైదాపురం: అక్రమ మైనింగ్దారుల వల్ల తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ మాజీ చైర్పర్సన్ పొట్టేళ్ల శిరీష యాదవ్ జిల్లా పోలీస్ ఉన్నత అధికారులను కోరారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ సైదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేశామన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని జిల్లా మైనింగ్ అధికారులతోపాటు అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న కొందరు తమపై తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. ప్రాణహాని తలపెట్టేందుకు పావులు కదుపుతున్నట్లు తెలిసిందన్నారు. నిరంతరం ఖనిజ సంపదను కొల్లకొడుతూ ప్రభుత్వ ఆదాయానికి అడ్డుపడుతున్న అక్రమార్కులపై నిరంతరం పోరాటం కొనసాగిస్తున్నట్లు చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని టార్గెట్ చేశారని ఆరోపించారు. రక్షణ కల్పించాలని విన్నవించారు. జిల్లా పరిషత్, కలెక్టరేట్ వాహనాల వేలంనెల్లూరు రూరల్: నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ కార్యాలయం, కలెక్టరేట్లో వాడుకలో లేని మారుతి సుజుకి, స్కార్పియో, ఇన్నోవా వాహనాలను వేలం వేయనున్నట్లు డీఆర్వో ఉదయభాస్కర్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చేనెల 3వ తేదీ ఉదయం 10.30 గంటలకు నెల్లూరు నూతన జిల్లా పరిషత్ కార్యాలయములో వేలంపాట జరుగుతుందన్నారు. ధరావత్తు సొమ్ము రూ.10 వేలు చెల్లించాలన్నారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నిర్ధారించిన ధరలకు వాహనాలను వేలం వేస్తామని తెలియజేశారు.కసుమూరు దర్గా హుండీ ఆదాయం రూ.44.17 లక్షలువెంకటాచలం: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కసుమూరు మస్తాన్వలీ దర్గా హుండీ ఆదాయం రూ.44.17 లక్షలు వచ్చినట్లు ఈఓ షేక్ షరీఫ్ శుక్రవారం తెలిపారు. దర్గాలో మొత్తం 8 హుండీలు ఏర్పాటు చేశామన్నారు. రెండు ప్రధాన హుండీల్లో కానుకలను గురు, శుక్రవారాల్లో లెక్కించగా రూ.44.17 లక్షలు వచ్చాయన్నారు. మిగిలిన ఆరు హుండీల్లోని కానుకలను 15 రోజుల తర్వాత లెక్కిస్తామన్నారు.ఉచితంగా నట్టల నివారణ మందునెల్లూరు(పొగతోట): గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ చేస్తున్నట్లు పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ రమేష్ నాయక్ తెలిపారు. శుక్రవారం వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడాదిలో నాలుగుసార్లు మందు పంపిణీ చేస్తున్నారని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణంవరికుంటపాడు: మండలంలోని రామాపురం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. వరికుంటపాడు పంచాయతీ పరిధిలోని ఆండ్రవారిపల్లికి చెందిన గాడి మాధవరెడ్డి (45) మోటార్బైక్పై తిమ్మారెడ్డిపల్లికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. అలాగే వైఎస్సార్ జిల్లా ముద్దనూరు నుంచి రాజమండ్రికి కూరగాయల లోడుతో బొలెరో వాహనం వెళ్తోంది. రెండు వాహనాలు రామాపురం సమీపంలోని నక్కలగండి రిజర్వాయర్ కాలువ వద్దకు రాగానే ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మాధవరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.