కలెక్టరేట్లో ఓటర్ల దినోత్సవం
నెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మొగిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవడం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడవచ్చన్నారు. 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలన్నారు. ఓటు హక్కు కలిగిన సీనియర్ సిటిజన్, నూతనంగా నమోదు చేసుకున్న యువతను జేసీ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయ్కుమార్, ఆర్డీఓ అనూష, కలెక్టరేట్ ఏఓ విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నిమ్మధరలు(కిలో)
పెద్దవి: రూ.34
సన్నవి: రూ.20
పండ్లు: రూ.10
కలెక్టరేట్లో ఓటర్ల దినోత్సవం


