breaking news
SPSR Nellore District Latest News
-
‘ఉపాధి’ బకాయిల విడుదలకు డిమాండ్
● ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా నెల్లూరు రూరల్: ‘కూటమి ప్రభుత్వం బీజేపీకి వంత పాడుతూ ఉపాధి హామీ పథకానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కూలీల బకాయిలను వెంటనే చెల్లించాలి’ అని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మి క సంఘం నేతలు డిమాండ్ చేశారు. సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కూలీలకు పనులు కల్పిస్తామని చెప్పి 60 శాతం పనులను యంత్రాలతో చేయించడానికి తీర్మానాలు చేశారన్నారు. ప్రస్తుతం కూలీలతో కేవలం 40 శాతం పనులు కూడా గ్రామాల్లో చేయించడం లేదన్నారు. అధికార పార్టీ నాయకులు చెప్పిన విధంగా పనులు చేయాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. పని ప్రదేశాల్లో నిబంధనలను పాటించడం లేదని, ఏదైనా ప్రమాదం జరిగినా కనీసం మెడికల్ కిట్ కూడా ఉంచడం లేదన్నారు. జిల్లాలో 12 వారాలకు సంబంధించి బకాయిలున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకమరాజు, ప్రధాన కార్యదర్శి మంగళ పుల్లయ్య, నాపాల వెంకటేశ్వర్లు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
డాక్టర్ల సేవలకు సలాం
● కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవలు ● నేడు డాక్టర్స్ డేనెల్లూరు(అర్బన్): అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఆపదలో ఉండే రోగులకు డాక్టర్లు ప్రాణాలు పోస్తున్నారు. ప్రమాదం జరిగి ప్రాణాపాయస్థితిలో ఉన్నా, ఒళ్లంతా కాలినా, పాము కరిచినా.. కొట్లాటలో కత్తులు దిగబడినా డాక్టర్లు వృత్తినే దైవంగా భావించి విసుగు, విరామం లేకుండా వైద్యం చేసి కాపాడుతున్నారు. తెల్లని చొక్కా ధరించి, చిరునవ్వుతో, నిబద్ధతతో, అంకితభావంతో వైద్యం చేస్తూ ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్ను దేవుడితో సమానంగా చూస్తారు. కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రోగులను కాపాడారు. ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీని డాక్టర్స్ డేగా జరుపుకొంటున్నారు. జిల్లాలో వైద్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం సంబరాలు నిర్వహిస్తారు. రోగులకు సేవలందిస్తూ.. జిల్లాలో సుమారు 1,300 వరకు ఆస్పత్రులు, క్లినిక్లున్నాయి. వీటిలో 52 పీహెచ్సీలు, 28 అర్బన్ హెల్త్ సెంటర్లు, 10 సామాజిక ఆస్పత్రులు (సీహెచ్సీలు), ఆత్మకూరులో జిల్లా ఆస్పత్రి, కందుకూరు, కావలిలో ఏరియా ఆస్పత్రి, జిల్లా కేంద్రంలో సర్వజన ఆస్పత్రులున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో 2 వేల మంది డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. ఆరోగ్యం అందరి హక్కు ప్రజలందరికీ ఆరోగ్యం హక్కుగా అందాలని డాక్టర్లు భావిస్తున్నారు. కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటళ్లను మినహాయిస్తే ప్రజారోగ్యాన్ని కాపాడటంలో ప్రభుత్వ డాక్టర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. దేశంలో 70 శాతం మంది పేద, మధ్యతరగతి ప్రజలే ఉన్నారు. వీరికి వైద్యం అందించడంలో విశేష కృషి చేస్తున్నారు. డెంగీ, డయేరియా, మలేరియా లాంటి వ్యాధులు ప్రబలినప్పుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోనే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందిస్తున్నారు. వైద్యం చేసి.. కరోనా లాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు కొన్ని కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రులు తమ గేట్లు మూసేసుకున్నాయి. పలు హాస్పిటళ్లు వైద్యం చేసినా రోగుల నుంచి రూ.లక్షలు వసూలు చేసి వారి నాడి పట్టిన పాపాన కూడా పోలేదు. అలాంటి తరుణంలో ప్రాణాలకు తెగించి ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యసేవలందించిన ఘనత ప్రభుత్వ వైద్యులకే దక్కుతుంది. జిల్లాలో 2 లక్షల మందికిపైగా కోవిడ్ బారిన పడగా వారికి వైద్యం చేస్తూ ఐదుగురు వైద్యులు తమ ప్రాణాలు కోల్పోయారు. -
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.25 సన్నవి : రూ.20 పండ్లు : రూ.8 వెట్టిచాకిరి నుంచి కాపాడండినెల్లూరు రూరల్: యానాది వర్గానికి చెందిన నిరుపేద పసిపిల్లల్ని కిడ్నాప్ చేసి హోటళ్లు, వివిధ గృహాల్లో వెట్టిచాకిరి చేయిస్తున్నారని, వారిని కాపాడాలని యానాది మహానాడు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చౌటూరు శీనయ్య కోరారు. నెల్లూరులోని ప్రెస్క్లబ్లో సోమవారం ఆయన విలేకరులు సమావేశంలో మాట్లాడారు. బిడ్డలు ఎక్కడ ఉన్నారో తెలియక తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారన్నారు. సదరు కిడ్నాపర్లు పోలీసులకు, ప్రభుత్వానికి సవాలు విసురుతున్నారన్నారు. బాధితులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. వారి సమస్యలు పరిష్కరించకుండా తరిమేయడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని తెలిపారు. ప్రభుత్వం స్పందించాలని కోరారు. సమావేశంలో శీనమ్మ, ఎం.మస్తానమ్మ, శేషమ్మ, మౌనిక, సుబ్బరత్న, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. -
సిలిండర్ల చోరీ కేసులో దొంగల అరెస్ట్
నెల్లూరు సిటీ: డెలివరీ బాయ్స్ను ఏమార్చి 23 సిలిండర్లను అపహరించిన కేసులో ఇద్దరు దొంగలను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సంతపేట సీఐ దశరథరామారావు స్టేషన్లో వివరాలు వెల్లడించారు. ఓ గ్యాస్ ఏజెన్సీకి చెందిన సిబ్బంది గత నెల 28, 29 తేదీల్లో సిలిండర్లను డెలివరీకి తీసుకెళ్లగా దొంగలు చోరీ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు 4వ మైలుకు చెందిన పి.కార్తీక్, విడవలూరు మండలంలోని చవటపాళేనికి చెందిన పి.అనూష్కుమార్లను అరెస్ట్ చేసి రూ.1.15 లక్షల విలువైన 23 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. -
లారీలో నుంచి పడి క్లీనర్ మృతి
కోవూరు: జాతీయ రహదారిపై వినాయక స్వామి గుడి సమీపంలో సోమవారం విజయవాడ నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న లారీలో నుంచి నారాయణ (37) అనే క్లీనర్ నిద్రమత్తులో అదుపుతప్పి కింద పడిపోయాడు. అతను తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపు నారాయణ మృతిచెందాడు. ప్రమాద స్థలాన్ని ఎస్సై రంగనాథ్ గౌడ్ పరిశీలించారు. మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
పాఠశాలలను ఎత్తేయడం అన్యాయం
యానాది కాలనీల్లో ప్రాథమిక పాఠశాలలను ఎత్తేయడం అన్యాయమని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్.మల్లి అన్నారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందజేశారు. మల్లి మాట్లాడుతూ బోగోలు మండలంలోని కొండబిట్రగుంట యానాది కాలనీలో 46 మంది విద్యార్థులున్న పాఠశాలను పక్క గ్రామంలోని స్కూల్లో విలీనం చేయడం దారుణమన్నారు. దళిత, గిరిజనులకు విద్య లేకుండా చేయడం అన్యాయమన్నారు. 80 మంది యానాది పిల్లలకు తల్లికి వందనం రాలేదన్నారు. కార్యక్రమంలో ఎస్.లక్ష్మయ్య, అశోక్, రాచగిరి మురళి, పి.హరిబాబు, 150 మంది మహిళలు పాల్గొన్నారు. -
ఏకలవ్య భవన నిర్మాణం కోసం..
నగరంలో ఏకలవ్య భవనం నిర్మించాలని ఏపీ గురుకుల సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లగొండ శివ కలెక్టర్ ఆనంద్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న కార్యక్రమాలు, శుభకార్యాలు, సమావేశాలు చేపట్టాలంటే ఇబ్బందిగా ఉందని, అందుకోసం ప్రత్యేకమైన ఏకలవ్య భవనాన్ని నిర్మించాలని కోరారు. స్థలాన్ని కేటాయించినా భవన నిర్మాణాన్ని తామే చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బండి బుజ్జయ్య, చైర్మన్ కట్టా రామారావు, సలహాదారులు కట్టా రమణయ్య, ఉపాధ్యక్షులు నల్లగొండ్ల వెంకయ్య, దేవరకొండ చిన్నోడయ్య, కట్టా కాటయ్య ఉన్నారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
సైదాపురం: బతుకుదెరువు కోసం కువైట్కు వెళ్లి ఇటీవల స్వగ్రామానికి చేరుకున్న ఓ వ్యక్తి కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్న ఘటన సైదాపురం దళితవాడలో సోమవారం జరిగింది. ఎస్సై క్రాంతి కుమార్ కథనం మేరకు.. దళితవాడకు చెందిన కాకాణి వెంకటరమణయ్య (35)కు అదేకాలనీకి చెందిన భాగ్యమ్మతో 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులున్నారు. ఓ కుమారుడు గతంలో మృతిచెందాడు. దంపతులు మూడేళ్ల క్రితం అప్పు చేసి ఇల్లు నిర్మించుకున్నారు. అప్పులు తీర్చేందుకు వెంకటరమణయ్య కువైట్ వెళ్లాడు. మూడేళ్లపాటు అక్కడే ఉండి గత వారం స్వగ్రామానికి చేరుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో అతను ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి లక్ష్మమ్మ పోలీసులకు ఫిర్యా దు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గూ డూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
అవగాహన కల్పించాలి
ఆరోగ్యమంటే మందులు, చికిత్సతోనే రాదు. పౌష్టికాహారం, రక్షిత మంచినీరు, పరిసరాల పరిశుభ్రత, మంచి ఆరోగ్య అలవాట్లతో నూటికి 80 శాతం జబ్బులు రాకుండా అరికట్టవచ్చు. రోగం వచ్చిన తర్వాత కన్నా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జబ్బులకు చెక్ పెట్టొచ్చు. ఇందుకోసం వైద్యశాఖతోపాటు స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓలు కలిసి ప్రజల్లో అవగాహన పెంచాలి. ఆపరేషన్లు, ఇతర వైద్యసేవలను ప్రైవేట్ వైద్యశాలలు కూడా తక్కువ ఖర్చుతోనే రోగులకు అందించేలా చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్, పీపీ యూనిట్ ● -
అందుబాటులో వైద్యం
ఆరోగ్యం అనేది ప్రజల హక్కు. ప్రజారోగ్యాన్ని పేద, ధనిక తేడా లేకుండా అందరూ సమానంగా పొందగలగాలి. ఇందుకోసం ప్రభుత్వాలు కృషి చేయాలి. వైద్యాన్ని ప్రైవేట్పరం చేయకూడదు. వైద్యకళాశాలలను ప్రభుత్వం నిర్వహించాలి. బడ్జెట్లో వైద్యరంగానికి అధిక నిధులు కేటాయించాలి. మందులు, వైద్యపరికరాలపై జీఎస్టీ తొలగించాలి. అప్పుడే ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తుంది. – డాక్టర్ ఎంవీ రమణయ్య, ప్రజారోగ్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు -
పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలంటూ..
బోగోలు గ్రామ పంచాయతీ కార్యదర్శిగా అబ్దుల్ జహీర్ అక్రమాలకు పాల్పడ్డాడని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బోగోలు గ్రామ మాజీ ఉప సర్పంచ్ మద్దిబోయిన వీర రఘు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు కోరారు. వారు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా జమ ఖర్చులు అడిగామన్నారు. దీనికి కార్యదర్శి ఇచ్చిన సమాధానంతో అక్రమాలకు పాల్పడినట్లుగా తెలిసిందన్నారు. తాగునీటి వసతి కోసం సుమారు రూ.7 లక్షలు, పారిశుధ్య సామగ్రి కొనుగోలుకు రూ.4 లక్షలు, ప్రత్యేక పారిశుధ్య పనుల కోసం రూ.4,47,300, ట్రాక్టర్ డీజిల్ కోసం రూ.2,27,752, గ్రామసభలు స్వర్ణ పంచాయతీ, షామియానాల పేరుతో రూ.1.60 లక్షలు ఖర్చు చేసినట్లుగా చెప్పారన్నారు. ప్రైవేట్గా పనిచేస్తున్న దేవరపల్లి మనోహర్ ద్వారా లంచాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. అతడి బ్యాంక్ లావాదేవీలు పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. అదేవిధంగా సర్పంచ్ వద్ద ప్రతి పనికీ లంచం తీసుకుంటున్నారని తెలిపారు. సర్పంచ్ భర్త పందిపాటి ఉదయ్కుమార్, కార్యదర్శి బ్యాంక్ లావాదేవీలను పరిశీలించాలని కోరారు. -
కారుణ్య నియామకాలు
నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించి కొండలరావు, చైతన్య ప్రకాష్లకు సోమవారం జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, జెడ్పీ సీఈఓ మోహన్రావు నియామాక ఉత్తర్వులు అందజేశారు. డీఆర్వో బదిలీ నెల్లూరు (అర్బన్): జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)గా పనిచేస్తున్న ఉదయభాస్కర్రావును బదిలీ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం ది. ఆయన్ను అమరావతి రాష్ట్ర సెక్రటేరియట్లోని రెవెన్యూ శాఖలో ప్రభుత్వ అసిస్టెంట్ సెక్రటరీగా నియమించింది. రెగ్యులర్ డీఆర్వోను నియమించేంత వరకు ఎఫ్ఏసీ డీఆర్వోగా అర్హత గల వారిని కలెక్టర్ నియమించుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డీపీటీఓగా ఎస్కే షమీమ్ నెల్లూరు సిటీ: నెల్లూరు జిల్లా ప్రజా రవాణా శాఖ (డీపీటీఓ) అధికారిగా ఎస్కే షమీమ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డీపీటీఓగా విధులు నిర్వహిస్తున్న మురళీబాబు ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో నెల్లూరులోని డిప్యూటీ సీటీఎంగా విధులు నిర్వహిస్తున్న షమీమ్కు బాధ్యతలు అప్పగించారు. ఆమె స్థానంలో శృంగవరపుకోట డిపో మేనేజర్ రమేష్ను ఉద్యోగోన్నతిపై నెల్లూరు డిప్యూటీ సీటీఎంగా బదిలీ చేశారు. వాకాటి సోదరులకు నోటీసులు పొదలకూరు: పట్టణానికి చెందిన వాకాటి సోదరులు, వైఎస్సార్సీపీ నేతలు శ్రీనివాసులురెడ్డి, శివప్రసాద్రెడ్డిలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆదేశాల మేరకు సోమవారం నోటీసులను జారీ చేసినట్లు ఎస్సై హనీఫ్ తెలిపారు. రుస్తుం మైన్ కేసులో నిందితులుగా చేర్చిన క్రమంలో అక్రమ కేసుల ఒత్తిడితో కొంతకాలంగా అజ్ఞానంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరు ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడలకు నోటీసులను అంటించారు. సోమవారం సాయంత్రం లోగా విచారణ హాజరు కావాలని ఆ నోటిసుల్లో పేర్కొన్నారు. సర్వేయర్లకు కౌన్సెలింగ్ ద్వారా బదిలీ నెల్లూరు (అర్బన్): సచివాలయాల పరిధిలోని 291 మంది సర్వేయర్లకు సోమవారం నగరంలోని ఆ శాఖా కార్యాలయంలో ఏడీ నాగశేఖర్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించి బదిలీల ప్రక్రియ చేపట్టారు. బదిలీలపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ర్యాంక్ ప్రకారం కాకుండా సిఫార్సు లేఖలపై బదిలీ చేయడంతో తమకు అన్యాయం జరిగిందని పలువురు సర్వేయర్లు విచారం వ్యక్తం చేశారు. -
ఆధారాలు చూపిస్తే ఏ శిక్షకై నా సిద్ధమే
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కృష్ణపట్నం లాజిస్టిక్స్ చెక్పోస్టు ద్వారా బలవంతంగా నగదు వసూలు చేసినట్లు ఏ ఒక్క ఆధారం చూపించినా ఏ శిక్షకై నా తాను సిద్ధంగా ఉన్నానని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పోలీస్ అధికారులకు సవాల్ విసిరారు. ముత్తుకూరు బీసీ కాలనీకి చెందిన షేక్ ఫరీద్బాబు జూన్ 7వ తేదీ ఇచ్చిన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముత్తుకూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ–1గా కాకాణి గోవర్ధన్రెడ్డి, ఏ–2గా మెట్టా విష్ణువర్ధన్రెడ్డి, ఏ–3గా తూపిలి శ్రీధర్రెడ్డి, ఏ–4గా స్వామి బాలాజీ ట్రాన్స్పోర్టు, ఏ–5గా టాటా వెంకట శేషయ్య, ఏ–6గా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు నెల్లూరు ప్రసాద్, ఏ–7గా రాగా వెంకటేశ్వర్లు, ఏ–8గా పొట్టి రాజా, ఏ–9గా సాయికిరణ్తోపాటు మరికొందరిని నిందితులుగా చేర్చారు. అప్పటికే జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న కాకాణిని పీటీ వారెంట్ కింద తీసుకెళ్లి కోర్టులో హాజరు పరిచారు. ఈ కేసు విచారణ నిమిత్తం ఏడు రోజుల కస్టడీకి కావాలని పోలీసులు కోరగా, రెండు రోజులకు అనుమతి ఇస్తూ న్యాయమూర్తి అనుమతి ఇచ్చారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం 1 గంటకు కృష్ణపట్నంపోర్టు సీఐ రవినాయక్, ముత్తుకూరు ఎస్సై విశ్వనాథరెడ్డి జిల్లా సెంట్రలో జైల్లో ఉన్న కాకాణిని తమ కస్టడీకి తీసుకుని జిల్లా జైలు పక్కనే నెల్లూరు డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో విచారణ చేపట్టారు. తొలిరోజు పోలీసులు 52 ప్రశ్నలు సంధించారు. పోలీస్ అధికారులు అడిగిన ప్రశ్నలకు న్యాయవాది శ్రావణ్కుమార్ సమక్షంలో కాకాణి సమాధానాలు ఇచ్చారు. పోలీసులు: కృష్ణపట్నం లాజిస్టిక్స్ చెక్పోస్టు ద్వారా బలవంతంగా డబ్బులు వసూలు చేసిన మెట్టా విష్ణువర్ధన్రెడ్డి ద్వారా మీకు చేరినట్లుగా మా దర్యాప్తులో తేలింది. ఈ డబ్బులను మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేశారా? ఎక్కడైనా డిపాజిట్ చేశారా? మీకు ఎంత మొత్తం వచ్చిందో తెలిపాలి? కాకాణి: నాకు ఏ ఒక్క పైసా చేరినట్లు మీ దగ్గర సాక్షాధారాలు ఉంటే చూపించండి. నేను ధైర్యంగా చెబుతున్నాను. ఏ రూపంగా అయినా ఎవరి దగ్గర నుంచి అయినా ఒక్క నయాపైసా అయినా ముట్టినట్లు రుజువులు చూపిస్తే.. నేనే న్యాయాధికారి దగ్గరకెళ్లి ఎటువంటి విచారణ అవసరం లేకుండా నేను శిక్షార్హుడనని ఏ శిక్ష విధిస్తారో విధించమని వారికి విజ్ఞప్తి చేస్తాను. పోలీస్ : కృష్ణపట్నం కంటైనర్స్ ట్రాన్స్పోర్టు అసోసియేషన్ గురించి మీ వద్ద ఉన్న సమాచారం చెప్పండి. కాకాణి : నాకు ఎలాంటి సంబంధం లేదు. కూటమి ప్రభుత్వం అక్రమంగా బనాయించిన తప్పుడు కేసు తప్ప మరొకటి కాదు. కేవలం తప్పుడు ఫిర్యాదులు తీసుకుని కేసు కట్టడం తప్ప ఇంకోటి కాదు. పోలీసుల విచారణ జరిపి ఆధారాలు బయట పెడితే ఎలాంటి శిక్షకై నా నేను సిద్ధమే. పోలీస్ : ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్ గోపాలనగరానికి చెందిన ద్వారం రామిరెడ్డితో మీకున్న పరిచయం చెప్పండి. కాకాణి : ఎలాంటి పరిచయం లేదు. పేరు కూడా వినలేదు. మీరు చెప్పిన వారందరిని రెండు రోజుల కస్టడీ సమయంలో నా ఎదురుగా ప్రశ్నిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. తొలిరోజు పోలీసుల కస్టడీ విచారణలో కాకాణి సవాల్ మొదటి రోజు విచారణ పూర్తినెల్లూరు (లీగల్): మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని ముత్తుకూరు పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం మొదటిరోజు విచారణ పూర్తయింది. కృష్ణపట్నం పోర్టు సమీపంలో చెక్పోస్ట్ ఏర్పాటు చేసి అక్రమంగా డబ్బులు వసూలు చేశారని ముత్తుకూరు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో జిల్లా కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న కాకాణిని న్యాయవాది నందగమ శ్రావణ్కుమార్, మధ్యవర్తులుగా ముత్తుకూరు మండలం పంటపాళెం వీఆర్వో గండవరం భక్తవత్సలరెడ్డి, ముత్తుకూరు వీఆర్వో బాలు వెంకటరమణయ్య సమక్షంలో విచారించారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు కాకాణిని కేంద్ర కారాగారానికి తరలించారు. -
అనుమానమే పెనుభూతమై..
దుత్తలూరు: దుత్తలూరు ఏసీ కాలనీ ఆదివారం అర్ధరాత్రి హత్యల కలకలంతో ఉలికి పడింది. మద్యం మత్తులో భార్యపై అనుమానంతో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి సాగించిన మారణకాండ ఇది. కాలనీలో నివాసముంటున్న ఏలూరు వెంగయ్య మద్యానికి బానిసయ్యాడు. ఇదే క్రమంలో భార్యపై పెంచుకున్న అనుమానం అతనిలో మనిషిని మృగాన్ని చేసింది. భార్యను ఎలాగైనా అంతమొందించాలనే ఉద్దేశంతో ఉన్న వెంగయ్య ఆదివారం రాత్రి పొద్దుపోయే వరకు పూటుగా మద్యం తాగి ఇంటికెళ్లాడు. అప్పటికే భార్య వెంకాయమ్మ సమీపంలోని పుట్టింటికెళ్లింది. దీంతో మరింత కోపోద్రిక్తుడైన వెంగయ్య కట్టెలు కొట్టడానికి ఉపయోగించే పదునైన మచ్చుకత్తి వెంట తీసుకొని అత్తామామల ఇంటికి వెళ్లాడు. తన భార్యను చంపేస్తానంటూ వీరంగం చేశాడు. దీంతో అడ్డుకోబోయిన అత్తామామలు చలంచర్ల జయమ్మ (60) కల్లయ్య (65)లను కత్తితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై ఆ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అంతటితో ఆగకుండా భార్య వెంకాయమ్మపై కూడా కత్తితో దాడి చేశాడు. అయితే ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయడంతో గాయాలతో బయటపడి కింద పడిపోయింది. పెద్ద కుమార్తె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి గట్టిగా నియంత్రించడంతో వారిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ కత్తితో పరారయ్యాడు. గాయపడిన వెంకాయమ్మను ఉదయగిరి వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న సీఐ వెంకట్రావు, ఎస్సైలు ఆదిలక్ష్మి, రఘునాథ్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. క్లూస్టీం ప్రాథమిక ఆధారాలు సేకరించారు. నిందితుడు వెంగయ్య కోసం స్థానికంగా, సాంకేతకంగా వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఎప్పుడుపడితే అప్పుడు పల్లెల్లో మద్యం దొరకడం వల్లే ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. భార్యపై అనుమానంతో హత్యాయత్నం మద్యం మత్తులో విచక్షణారహితంగా కత్తితో దాడి అడ్డుకోబోయిన అత్త, మామలు హతం భార్య పరిస్థితి విషమం హత్యలతో ఉలికి పడిన దుత్తలూరు భార్యపై అనుమానమే పెనుభూతమైంది. రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబంలో మద్యం చిచ్చు రేపింది. మత్తులో విచక్షణ కోల్పోయేలా చేసింది. అడ్డుకోబోయిన అత్త, మామల ప్రాణాలు తీసింది. భార్య కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటనతో దుత్తలూరు ఒక్కసారిగా ఉలికి పడింది. పల్లెల్లో విచ్చలవిడిగా జరుగుతున్న మద్యం విక్రయాలే ఈ ఘటనకు కారణమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కెరటమై ఎగిసిన కర్షకాగ్రహం
ఉలవపాడు: ‘మండలంలోని తీర ప్రాంతం కరేడు కర్షకుల ఆగ్రహం కడలి కెరటమై ఎగిసి పడింది. పోలీసుల ఆంక్షలు, ముందస్తు అరెస్ట్లు, రహదారుల నిర్బంధాలు రైతులను ఆపలేకపోయాయి. పోలీసులు ఎక్కు పెట్టిన తుపాకులకు, ఝుళిపించిన లాఠీలకు ఒక్కొక్కరు.. ప్రకాశం పంతులు, అల్లూరి సీతారామరాజులై గర్జించారు. వేలాది మంది రైతు కుటుంబాలతో తరతరాలుగా వ్యవసాయ భూములతో ముడిపడిన బంధాలను, భావోద్వేగాలను కాదని కంపెనీలకు కట్టబెట్టే ప్రభుత్వ నిరంకుశత్వాన్ని దునుమాడుతూ మండలంలోని కరేడు రైతులు సాగించిన తొలి ఉద్యమాన్ని విజయవంతం చేసి పాలకులకు వణుకు పుట్టించారు. ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే పంట భూములే తమ జీవనాధారమని, అటువంటి భూములను తమ నుంచి తీసుకోవాలంటే, ముందుగా ప్రాణాలు తీసి శవాలపై వచ్చి తీసుకెళ్లాంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇండోసోల్ కంపెనీ కోసం భూసేకరణకు వ్యతిరేకంగా ఆదివారం మండలంలోని కరేడు కర్షకుల పోరు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఉద్యమ స్ఫూర్తిని నింపింది. వందల మంది పోలీసులు భారీగా మోహరించి అడ్డంకులు పెట్టినా చేధించుకుని సాగించిన రైతులు తమ భూముల కోసం ఎందాకై నా పోరాడతారని చాటారు. ఊహించని రీతిలో.. జాతీయ రహదారిపై కరేడు రైతులు పార్టీలకు అతీతంగా ఏకమై చేపట్టిన రాస్తారోకో విజయవంతం కావడం తెలిసిందే. కూటమి ప్రభుత్వం ఇండోసోల్ కంపెనీకి ఏకంగా 8,348 ఎకరాలు కేటాయించడం రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. భూమి లేకపోతే తమకు జీవనాధారం లేదనే పరిస్థితికి రైతులు రావడంతోనే రాస్తారోకో భారీగా జరిగింది. సుమారు 2 వేల మంది రైతులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. 800 మందికి పైగా మహిళలు ఈ ఉద్యమంలో పాల్గొనడంతో అందరూ నిశ్చేష్టులయ్యారు. తమ శవాల మీద వెళ్లి భూములు తీసుకోవాలని మహిళా రైతులు నినాదాలు చేయడం విశేషం. దాదాపు 20 నిమిషాల పాటు రైతులు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. సబ్కలెక్టర్ తిరుమణి శ్రీపూజ తాత్కాలికంగా భూసేకరణ వాయిదా వేసి రైతులు సమస్యలు పరిష్కరిస్తామని హామీతో విరమించారు. భూసేకరణపై ఇంత మంది రైతులు వ్యతిరేకంగా ఉన్నారని ఎవరూ ఊహించలేకపోయారు. రైతులకు పెరుగుతున్న మద్దతు భూ సేకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు బయట నుంచి మద్దతు పెరుగుతోంది. పోలీసులు తమ గోడును చెప్పకుండా అడ్డుకోవడంతో వారు చేసిన పోరాటం పలువురిని కదిలించింది. వామపక్షాలు, రైతుకూలీ సంఘాలు మరింతగా ఈ పోరాటానికి సహకరించేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో రాష్ట్ర రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు కరేడులో పర్యటించనున్నారు. ఆమ్ఆద్మీపార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీసీవై పార్టీలు ఇప్పటికే తమ మద్దతు ప్రకటించాయి. కరేడులో మాత్రం పార్టీకతీతంగా రైతులే నాయకత్వం వహిస్తూ అన్ని పార్టీలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్లేషకులు సైతం కరేడు రైతుల ఉద్యమం గురించి మాట్లాడడం విశేషం. ఈ కంపెనీకి 8,348 ఎకరాలు కేటాయించడం పై అందరూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కూటమి నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత... కరేడు భూముల వ్యవహారంపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. తొలుత బీపీసీఎల్కు ఇస్తారని ప్రచారం జరిగింది. తర్వాత మార్చి 25 న ఇండోసోల్కు కేటాయిస్తున్నట్లు జీఓ ప్రకటించారు. జూన్ 19న భూసేకరణ చేస్తున్నామని నోటిఫికేషన్ ఇచ్చి తీసుకునే భూముల రైతుల వివరాలు ప్రచురించారు. అందులో 4 వేల ఎకరాలకు వివరాలు ప్రకటించారు. నోటిఫికేషన్ వెలువడడంవతో ఒక్కసారిగా రైతుల్లో ఆందోళన మొదలైంది. ఉద్యమ బాట పట్టారు. తమ భూములు కోల్పోకుండా ఉండడం కోసం ‘సేవ్ కరేడు’ పేరుతో భారీ రాస్తారోకో చేపట్టారు. ఈ రైతు ఉద్యమంతో ప్రభుత్వంపై కరేడు రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు అర్థమవుతుంది. భూ సేకరణ ఆగేనా కరేడు రైతులు భూ సేకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఎగసిపడి విజయవంతమైంది. భూ సేకరణను నిలుపుదల చేయగలమనే విశ్వాసం ఏర్పడింది. పచ్చని పంట పొలాలు సుమారు 3 వేల ఎకరాలు, మామిడి తోటలు 1000 ఎకరాలు, సపోట తోటలు, 2 వేల ఎకరాలు, వేరుశనగ 2 వేల ఎకరాలు మిగిలిన భూములు జామాయిల్, కూరగాయల సాగు కలిసి ఉన్నాయి. ఇంత సారవంతమైన భూములను, అన్నం పెట్టే భూములను తీసుకోవడం దారుణమని రైతులు అంటున్నారు. పోలీసు, ఇంటెలిజెన్స్ అంచనాలకు మించి రైతులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం పునరాలోచన చేసి భూసేకరణ ఆపుతుందా.. మొండిగా ముందుకు సాగుతుందా తదుపరి పరిణామాలు ఏ స్థాయిలో ఉంటాయో వేచి చూడాల్సి వస్తుంది. పోలీసుల అణచివేత కుట్ర రైతుల పోరును అణచివేయడానికి పోలీసులు శతధా ప్రయత్నిస్తున్నారు. పోలీసులతో తోపులాట జరిగిన తరువాత కూడా రైతులు పోలీసు బంధనాలు అధిగమించి రాస్తారోకో చేయడంతో రైతులపై పోలీసులు భారీ చర్యలకు సన్నద్ధమయ్యారు. రాస్తారోకోలో పాల్గొన్న రైతులు 26 మందితోపాటు సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల సమీకరణకు సహకరించేలా చేశారని మరో 13 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. కేసుల ద్వారా ఉద్యమాన్ని అణిచివేయాలనే ఉద్దేశంతో పోలీసులు ప్రవర్తిస్తున్నారు. రాస్తారోకో సమయంలో పోలీసులు ప్రవర్తించిన తీరును ప్రజాసంఘాలు, వామపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. -
జగనన్న పర్యటనను ఆపలేరు
● కుట్రలు, కుతంత్రాలను చీల్చుకుని అభిమన్యుడిగా వస్తాడు ● తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, మాజీమంత్రి అనిల్, వైఎస్సార్సీపీ నేతలు నెల్లూరు (స్టోన్హౌస్పేట): ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను ఎవరూ అడ్డుకోలేరని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, మాజీమంత్రి అనిల్కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. జిల్లా జైల్లో ఉన్న మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు 3న నెల్లూరుకు వచ్చే జగనన్న పర్యటనను అడ్డుకునేందుకు అధికారులు, పోలీసులు, అధికార పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కుట్రలు, కుతంత్రాలను చీల్చుకుని అభిమన్యుడిగా వచ్చి తీరుతాడని చెప్పారు. నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్, ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్తలు ఆనం విజయ్కుమార్రెడ్డి, మేకపాటి రాజగోపాల్రెడ్డి, కాకాణి కుమార్తె కాకాణి పూజితలతో కలిసి సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం, అధికారులు ప్రయత్నించడం దారుణమన్నారు. హెలిప్యాడ్ కోసం 3, 4 స్థలాలను నాయకులు పరిశీలించారని, అడ్డంకులు, సాకులు చెబుతూ ఆ స్థలాలను అనుమతించకపోవడం దారుణమన్నారు. ఎప్పుడూ ఈ ప్రభుత్వమే ఉండదని, అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. జగనన్న మీద రాజకీయ కక్షతో హైడ్రామాలు చేయాల్సిన అవసరం లేదని, ఇలా పర్యటనను అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. సంవత్సరంలోనే ప్రజలు వాస్తవాలను తెలుసుకుంటున్నారని, ప్రభుత్వం చేసే దుర్మార్గాలు ఎక్కువ రోజులు ఉండవన్నారు. ● మాజీమంత్రి అనిల్కుమార్ యాదవ్ మాట్లాడుతూ 10 రోజుల నుంచి జగనన్న పర్యటనకు ప్రయత్నాలు మొదలు పెట్టినప్పటికి హెలిప్యాడ్ అనుమతి విషయంలో అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదన్నారు. జగనన్న పర్యటన అంటేనే కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఇంత భయయో అర్థం కావడం లేదన్నారు. రెండున్నర కి.మీ. సెక్యూరిటీ ఉండే విధంగా గుర్తించిన హెలిప్యాడ్పై అధికారులకు క్లారిటీ లేకపోవడం వారి భయాందోళలను తెలియజేస్తుందన్నారు. ట్రాఫిక్ ఇబ్బంది లేని ప్రాంతాన్ని ఎంచుకున్నప్పటికీ అధికారు లు మరో ప్రాంతాన్ని చూపించడం, మూడు రోజుల నుంచి కాలయాపన చేయడం ఎందుకో అర్థం కావడం లేదన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా 3వ తేదీ జగనన్న నెల్లూరుకు రావడం తథ్యమన్నారు. ● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ కొత్తూరులోని సెయింట్యాన్స్ స్కూల్, కాకుటూరు లో మరో స్థలాన్ని హెలిప్యాడ్కు కేటాయించాలని అధికారులను కోరినప్పటికి సాకులు చెప్పి తప్పించుకుంటున్నారన్నారు. సెయింట్యాన్స్ స్కూల్ యాజమాన్యాన్ని అధికార పార్టీ నేతలు బెదిరించి జగనన్న పర్యటనకు అడ్డంకులు సృష్టించారన్నారు. జైలుకు సమీపంలో ముళ్ల పొదలు, హైటెన్షన్ ఎలక్ట్రికల్ వైర్లు ఉండి అప్రోచ్ రోడ్డు లేని స్థలాన్ని చూపిస్తూ అక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకోవాలని అధికారులు చెప్పడం దుర్మార్గమన్నారు. షరతులతో సెంట్రల్ జైలు వద్ద స్థలం చూపడం సరైన పద్ధతి కాదన్నారు. జగనన్న వస్తుంటే ముందుగానే కాకాణిపై పీటీ వారెంట్ పెట్టి కోర్టుకు తరలిస్తారనే అనుమానం కూడా కలుగుతుందన్నారు. రాష్ట్రంలో మాజీ సీఎంకే స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు. జగనన్న పర్యటనను అడ్డుకునే ఆలోచనతో కూటమి నేతలు ఉన్నారన్నారు. జగనన్నకు వస్తున్న ఆదరణ చూసి కూటమి నేతల్లో భయం కనిపిస్తుందన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని, ప్రజాక్షేత్రంలోకి రావాలంటే భయం పుడుతుందన్నారు. -
ఉన్నత పాఠశాలల్లో వసతుల పరిశీలన
ఉదయగిరి రూరల్: ఉదయగిరి, వెంకట్రావుపల్లి ఉన్నత పాఠశాలల్లో మౌలిక వసతులను రాష్ట్ర వి ద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ మువ్వా రామలింగం, జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య అదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తరగతులను నూతనంగా నిర్మించిన భవనాలకు మార్చాలని, ఎలక్ట్రికల్ పనులను పూర్తి చేయాలని సూచించారు. దీనికి సంబంధించిన నిధులను వారంలో విడుదల చేస్తామని చెప్పారు. వెంకట్రావుపల్లి ఉన్నత పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు నిధులను మంజూరు చేస్తామని వెల్లడించారు. ప్రధానోపాధ్యాయుడు షరీఫ్బాషా, ఉదయగిరి ఎంఈఓలు మస్తాన్వలీ, తోట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
గ్రావెల్ రవాణా అడ్డగింత
● దాడిలో ఇద్దరికి గాయాలు జలదంకి: మండలంలోని జమ్మలపాళెం చెరువులో జేసీబీ సాయంతో గ్రావెల్ను అక్రమంగా తరలిస్తుండగా, గ్రామానికి చెందిన టీడీపీ నేత సింగమనేని మనోజ్, జనసేన నేత శెట్టిపల్లి మధు అడ్డుకున్నారు. అనుమతి లేకుండా చెరువు నుంచి ఎలా తరలిస్తారని ప్రశ్నించగా, గ్రామానికి చెందిన నక్కా మాధవ, మహేంద్ర, బాబు, జేసీబీ, ట్రాక్టర్ డ్రైవర్ దాడికి పాల్పడ్డారు. గాయపడిన వారు కావలి ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కాగా సిమెంట్ రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్ను సర్పంచ్ అనుమతితో తోలుతుండగా, వారొచ్చి దుర్భాషలాడి దాడికి పాల్పడ్డారని మాజీ సర్పంచ్ నక్కా మాధవ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సచివాలయాల్లో బదిలీలలు
ఉదయగిరి: గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా సచివాలయ వ్యవస్థకు గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి రూపకల్పన చేశారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను కల్పించి.. వారికి సొంత మండలాల్లోనే పోస్టింగ్లిచ్చారు. ఈ తరుణంలో గతేడాది కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థను గందరగోళంగా మార్చింది. తాజాగా వీరిలో ఐదేళ్ల సర్వీస్ పూర్తయిన వారిని బదిలీ చేసేందుకు జీఓను జారీ చేసింది. ఈ మేరకు ఉద్యోగులు తమ ప్రాధాన్యాన్ని ఆన్లైన్లో ఎంపిక చేసుకున్నారు. బదిలీలు పూర్తి చేసేందుకు జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. విచిత్ర వైఖరి వాస్తవానికి కౌన్సెలింగ్ను నిర్వహించి.. మెరిట్ అధారంగా బదిలీలు చేపట్టాలి. అయితే దీనికి భిన్నమైన వైఖరిని కూటమి ప్రభుత్వం అవలంబిస్తోంది. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖల ఆధారంగా బదిలీలు జరపనున్నారు. ఈ తరుణంలో ఇవి ఉంటేనే కోరుకున్న చోట నియమిస్తామని అధికారులు తేల్చిచెప్పారు. ఈ పరిణామాల క్రమంలో వీటి కోసం అధికార పార్టీ నేతల ఇంటి చుట్టూ ఉద్యోగులు ప్రదక్షిణలు చేస్తున్నారు. వారి దయ లేకపోతే జిల్లాలోని ఏ మారుమూల ప్రాంతంలో ఉద్యోగం చేయాల్సి వస్తుందోనని పలువురు కంగారు పడుతున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో 769 గ్రామ, వార్డు సచివాలయాలున్నాయి. వీటి పరిధిలో 8,239 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో 78 మంది పంచాయతీ కార్యదర్శులకు ఇటీవల గ్రేడ్ – 4 కార్యదర్శులుగా ఉద్యోగోన్నతి కల్పించి పోస్టింగ్లను ఇచ్చారు. వ్యవసాయ, వెటర్నరీ, ఉద్యాన, ఆరోగ్య శాఖల్లో పనిచేసే కొందరికీ పదోన్నతులు లభించాయి. ప్రక్షాళన పేరిట ప్రతి సచివాలయ పరిధిలో జనాభా సంఖ్య ఆధారంగా ఉద్యోగుల సంఖ్యను ఇప్పటికే కుదించారు. దీంతో అనేక మంది ఉద్యోగులు మిగిలిపోనున్నారు. వీరికి ఎక్కడ పోస్టింగ్లు ఇస్తారో అంతుచిక్కడంలేదు. మరోవైపు వార్డు సచివాలయ ఉద్యోగులకు స్థానికత (సొంత మండలం)ను తొలగించలేదు. అదే గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న వారికి సొంత మండలాల్లో పోస్టింగ్లు ఇవ్వకుండా జీఓ జారీ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని తప్పుబడుతున్నారు. అయినా సర్కార్ పట్టించుకోకపోవడం వీరి ఆగ్రహానికి కారణమవుతోంది. ఎమ్మెల్యేల సిఫార్సులకే పెద్దపీట లేఖల కోసం ఉద్యోగుల పరుగులు అధికార అండ ఉంటే అనుకున్న చోట.. లేకపోతే మరెక్కడో పారదర్శకతకు పాతర బదిలీలకు సంబంధించి ఎమ్మెల్యేలిచ్చిన సిఫార్సు లేఖలను ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు ఆయా శాఖల ఉన్నతాధికారులకు అందజేస్తున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధులు ఇప్పటికే జాబితాను పంపారు. ఇవి లేని వారు తమను మెరిట్ ప్రాతిపదికన బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉదంతంలో పారదర్శకతకు ప్రభుత్వం పాతరేస్తోందని ఆరోపిస్తున్నారు. -
సంక్షేమ బోర్డు పునరుద్ధరణకు డిమాండ్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): గత ఎన్నికలకు ముందు కూటమి నేతల హామీ మేరకు భవన నిర్మాణ కార్మి కుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించడంతో పాటు బకాయిలను వెంటనే చెల్లించాలని భవన నిర్మాణ కా ర్మిక సంఘ రాష్ట్ర కార్యదర్శి నరసింహరావు డిమాండ్ చేశారు. మినీ బైపాస్లోని పరమేశ్వరి కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన భవన నిర్మాణ కార్మిక సంఘ నగర మహాసభలో ఆయన మాట్లాడారు. సంక్షేమ బోర్డును 2007లో అప్పటి సీఎం వైఎస్సార్ హయాంలో ఏర్పాటు చేశారని, దీన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రస్తుతం యత్నించడం సిగ్గుచేటని విమర్శించారు. అనంతరం 34 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా పెంచలయ్య, శ్రీనివాసులు, ట్రెజరర్గా సంపూర్ణమ్మ ఎన్నికయ్యారు. సీఐటీయూ నెల్లూరు నగరాధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, నాగేశ్వరరావు, భవన నిర్మాణ కార్మిక సంఘ అధ్యక్ష, కార్యదర్శులు చాన్బాషా, అల్లాడి గోపాల్, సీఐటీయూ నేతలు కొండా ప్రసాద్, మూలం ప్రసాద్, కత్తి శ్రీనివాసులు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
స్టాఫ్ నర్సు ఆత్మహత్యాయత్నం
ఆత్మకూరు: ఏఎస్పేటలోని ప్రాథమిక వైద్యశాలలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న లక్ష్మి ఆత్మహత్యాయత్నానికి ఆదివారం సాయంత్రం పాల్పడ్డారు. ఆస్పత్రి డాక్టర్లతో పాటు 35 మంది సిబ్బంది, డీఎంహెచ్ఓ వేధింపులకు గురిచేస్తున్నారని సెల్ఫీ వీడియోలో ఆరోపించారు. విధులకు హాజరుకాకుండానే పలువురు సిబ్బంది పూర్తి జీతాలు తీసుకున్నారని.. తాను సెలవడిగితే డ్యూటీ డాక్టర్ మంజూరు చేయకుండా వేధించారని పేర్కొన్నారు. వీటిపై అర్జీలను అందించేందుకు కలెక్టరేట్ చుట్టూ కాళ్లరిగేలా తిరిగానని వాపోయారు. కాగా ఈమె, భర్త.. ఏబీఎన్ చానల్ రిపోర్టర్ తీవ్ర వేధింపులకు గురిచేయడంతో అదే పీహెచ్సీలో ఎఫ్ఎన్ఓగా పనిచేస్తున్న దొరసానమ్మ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి శుక్రవారం పాల్పడి న విషయం తెలిసిందే. ఈమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టాఫ్ నర్సు లక్ష్మి సైతం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి నెల్లూరు తరలించనున్నామని బంధువులు తెలిపారు. కాగా ఈ విషయమై డీఎంహెచ్ఓ సుజాతను సంప్రదించగా, తనకు ఇప్పుడే విషయం తెలిసిందని, పూర్తి స్థాయి విచారణను సోమవారం జరుపుతానని చెప్పారు. -
వెంగళరావునగర్లో కార్డన్ సెర్చ్
నెల్లూరు సిటీ: వేదాయపాళెంలోని వెంగళరావునగర్ ఏ బ్లాక్లో కార్డన్ సెర్చ్ను ఆదివారం తెల్లవారుజామున నిర్వహించారు. ఏఎస్పీ, నలుగురు సీఐలు, నలుగురు ఎస్సైలు, స్పెషల్ పార్టీలతో కలిసి సుమారు 45 మంది పోలీసులు బృందాలుగా ఏర్పడి క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాల్లేని 45 బైక్లు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు అనుమానితుల నుంచి వేలిముద్రలను సేకరించి కౌన్సెలింగ్ ఇచ్చారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని వివరించారు. అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
ఆగని దందా.. ఆపే దమ్ముందా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి నియోజకవర్గంలో అధికార మదంతో టీడీపీ నేతలు సహజ వనరుల దోపిడీని అవిశ్రాంతంగా సాగిస్తున్నారు. గనులను తలపించే రీతిలో గ్రావెల్, మట్టిని విచ్చలవిడిగా తవ్వేసి అక్రమంగా రవాణా చేస్తున్నా.. అడిగే ధైర్యం, ఆపే దమ్ము అధికార యంత్రాంగానికి లేకుండా పోతోంది. అధికార పార్టీ నేతల రెడ్బుక్ రాజ్యాంగానికి ఎక్కడ బలి కావాల్సి వస్తుందోనని తమ్ముళ్ల దందాలో వాటా లు తీసుకుంటూ ధ్రుతరాష్ట్రుల్లా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులకు దారితీస్తున్నాయని భూగర్భ, వాతావరణ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరి ధన దాహానికి రహదారులు, కల్వర్టులు, వంతెనలతోపాటు చెరువు కట్టపై కలుజులు దెబ్బతింటున్నాయి. భవిష్యత్లో భారీ వానలు వస్తే చెరువు కట్టలు తెగి ఊర్లకు ఊర్లనే ముంచే ప్రమాదఘంటికలు పొంచి ఉన్నాయి. గుట్టలు కరిగి.. గుంతలేర్పడి.. జిల్లాలో అత్యంత నాణ్యత కలిగిన గ్రావెల్ గనులు దగదర్తి మండలంలో ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా ఉలవపాళ్ల, కొత్తపల్లి కౌరుగుంట, అనంతవరం ప్రాంతాల్లోని గ్రావెల్ను మైనింగ్ శాఖ అనుమతులు లేకుండానే విచ్చలవిడిగా తవ్వేసి అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఈ మండలంలోని టీడీపీ నేతలు ఈ ఏడాది కాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తారంటే ఏ స్థాయిలో అక్రమ దందా జరుగుతుందో అర్థమవుతోంది. చెరువులు, ప్రభుత్వ భూము లు, కొండలు, తిప్పలు తేడా లేకుండా తవ్వేసి రూ.కోట్లలో గ్రావెల్ దందా సాగిస్తున్నారు. అటు బోగోలు, కావలి, కొడవలూరు నుంచి నెల్లూరు వరకు కొత్తగా ఏర్పాటవుతున్న లేఅవుట్లకు, రహదారులకు అవసరమైన గ్రావెల్కు మంచి డిమాండ్ ఉంది. దీంతో అధికార దమ్ము, ధైర్యంతో బహిరంగంగానే గ్రావెల్ తరలించి జేబులు నింపుకుంటున్నారు. రేయింబవళ్లు విచ్చలవిడిగా గ్రావెల్ తరలిస్తున్నా అధికారులు మాత్రం తమ్ముళ్లు ఇచ్చే మామూళ్లకు కక్కుర్తి పడి కిమ్మనడం లేదు. ● దగదర్తి మండలంలోని అనంతవరం, ఉలవపాళ్ల నుంచే అత్యధికంగా నెల్లూరువైపు గ్రావెల్ తరలివెళ్తోంది. దగదర్తిలో స్థిరపడిన అధికార పార్టీ నేత మట్టి దందాకు కీలకంగా వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇటీవల ఇఫ్కో భూముల్లో పాగా వేసి గ్రావెల్ తరలించి సొమ్ము చేసుకున్నారు. తాజాగా అనంతవరం చెరువును చెరపడుతున్నారు. చెరువులో నీరు తగ్గడంతో గ్రావెల్ తవ్వకాలు చేస్తూ చెరువు స్వరూపాన్నే మార్చేశారు. ఇప్పటికే దాదాపు 5 లక్షల క్యూబిక్ మీటర్లు మట్టిని తరలించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఉలవపాళ్లలో జాతీయ రహదారి వెంబడే ఉన్న భూములను కబ్జా చేసి గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు. హైవే పక్కనే బరితెగించి దోపిడీ చేస్తున్నా.. అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. రహదారులు విధ్వంసమా! అల్లూరు రోడ్డు నుంచి అనంతవరం మీదుగా నారాయణపురం వెళ్లే రోడ్డు గ్రావెల్ వాహనాలతో పూర్తిగా విధ్వంసమైంది. గ్రావెల్ మాఫియా స్వార్థానికి ప్రధాన రహదారులు చిధ్రమైపోతున్నాయి. రెండేళ్ల కిందటే వేసిన రోడ్డులు సైతం ధ్వంసమవుతున్నాయి. మరో వైపు ప్రభుత్వానికి చెల్లించాల్సిన మైనింగ్ రాయల్టీలు ఫీజులు చెల్లించకపోవడంతో ఆదాయానికి గండిపడుతున్నా.. అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదు. అనంతవరం చెరువు కలుజు కూడా దెబ్బతింది. ఆ కలుజు నుంచే తూము ద్వారా నీరు సరఫరా జరుగుతోంది. దాదాపు 150 ఎకరాలు ఆయుకట్టుకు నీరందించే ఆ తూము ధ్వంసం అవుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీఓకు ఫిర్యాదు చేసినా.. చర్యలు శూన్యం దగదర్తి మండలంలోని అనంతవరంలో జరిగే అక్రమ గ్రావెల్ రవాణాతో రహదారులు చిధ్రమై పోతున్నాయిని, కల్వర్టులు, తూములు దెబ్బతిని సాగునీటి పారుదల వ్యవస్థ నిలిచిపోతుందని అనంతవరం గ్రామ రైతులు ఇటీవల కావలి ఆర్డీఓ, దగదర్తి తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. వీరికి వామపక్ష పార్టీ నేతలు మద్దతు ఇచ్చారు. కానీ వారు చర్యలు చేపట్టకపోవడంతో మట్టి మాఫియా లెక్క చేయలేదు. వాహనాల రణ ధ్వనులతోపాటు రోడ్లపై దుమ్ముధూళితో స్థానికులు నరకం అనుభవిస్తున్నారు. గ్రావెల్ మాఫియా ధనార్జన కోసం ఇష్టానుసారంగా చేస్తున్నా.. అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతుంది. అనంతవరం, ఉలవపాళ్ల, కేకేగుంట గ్రావెల్ గనులు విచ్చలవిడిగా అక్రమ తవ్వకాలు, రవాణా మీడియా ఘోషిస్తున్నా.. చెవికెక్కించుకోని అధికార యంత్రాంగం భారీ వాహనాల బరువుకు దెబ్బతింటున్న రహదారులు, వంతెనలు, చెరువు కలుజులు -
మహిళా సంరక్షణ కార్యదర్శుల బదిలీలకు అవకాశం
నెల్లూరు సిటీ: జిల్లాలో ఐదేళ్ల సర్వీస్ను పూర్తి చేసిన గ్రామ / వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు.. ప్రత్యేక కేటగిరీలో ఉన్న వారు.. రిక్వెస్ట్ నిమిత్తం బదిలీలు కోరేందుకు అవసరమైన వివరాలతో కూడిన ఆప్షన్ ఫారాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం సమర్పించాలని పోలీస్ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. సొంత మండలం లేదా ప్రస్తుతం పనిచేస్తున్న సచివాలయంలో స్థానాన్ని ఇవ్వబోమని చెప్పారు. ఫారాల్లో తప్పుడు సమాచారమిస్తే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తి మృతి అనుమసముద్రంపేట: గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన అనుమసముద్రంలోని హజరత్ సయ్యద్షా ఖాదరీ బాబా దర్గా వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. 60 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ సొమ్మసిల్లారు. దీంతో 108లో ఆత్మకూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని కోరారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థినికి గాయాలు
ఉదయగిరి: రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని గాయపడిన ఘటన పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. స్థానిక మేకపాటి గౌతమ్రెడ్డి వ్యవసాయ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న లాస్యప్రియ తన స్నేహితురాలతో కలిసి పట్టణంలోకి వెళ్లి తిరిగి కళాశాలకు బయల్దేరారు. ఈ క్రమంలో పోలేరమ్మ చెట్టు అరుగు వద్ద వెనుక నుంచి వేగంగా బైక్పై వస్తున్న నల్లిపోగు దాస్ ఢీకొన్నారు. రోడ్డుపై పడటంతో తీవ్రంగా గాయపడిన ఆమెను ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్సను అందించారు. కాగా యువకుడు మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు తెలిపారు. ఎస్సై ఇంద్రసేనారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కండలేరులో 33.54 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారానికి 33.54 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 2150, పిన్నేరుకు 10, లోలెవల్కు 70, హైలెవల్ కు 40, మొదటి బ్రాంచ్ కాలువలకు 85 క్యూసెక్కులను విడుదల చేస్తున్నా మని వివరించారు. -
ముగిసిన జిల్లా స్థాయి చెస్ పోటీలు
నెల్లూరు(స్టోన్హౌస్పేట): పొగతోటలోని రాయ్ చెస్ అకాడమీలో నిర్వహిస్తున్న అండర్ – 15 సబ్ జూనియర్స్ బాలుర, బాలికల జిల్లా స్థాయి చెస్ చాంపియన్షిప్ ఆదివారంతో ముగిసింది. యడవల్లి సాయిచక్రధర్, సంజన గెలుపొందారు. బాలుర విభాగంలో యజ్ఞేశ్వర్రెడ్డి, శ్రీచైతన్య, మిథిలేష్.. బాలికల విభాగంలో నేహా, సుదీక్ష, కీర్తన తర్వాతి స్థానాల్లో నిలిచారు. విశాఖపట్నంలో వచ్చే నెల 12, 13న నిర్వహించనున్న రాష్ట్రస్థాయి చెస్ చాంపియన్షిప్లో జిల్లా తరఫున వీరు ప్రాతినిధ్యం వహించనున్నారు. బహుమతులను కళాలయ డైరెక్టర్ గూడూరు లక్ష్మి, ఆనం పద్మనాభరెడ్డి అందజేశారు. ఆర్బిటర్ మౌనిక, విష్ణు, సుబ్బారెడ్డి, ఫిడే ఇన్స్ట్రక్టర్ అజీజ్ పాల్గొన్నారు. -
జీతాల్లేవు.. క్రీడల్లో శిక్షణెలా..?
రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మారుస్తామని సీఎం చంద్రబాబు తరచూ ఊదరగొడుతుంటారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే విస్మయం కలగకమానదు. రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేసే వారికి నెలల తరబడి జీతాలను చెల్లించకపోవడంతో వారి ఆకలికేకలు తీవ్రమవుతున్నాయి. వీటిని సక్రమంగా అందించకపోవడంతో స్టేడియాల్లో క్రీడాకారులకు ఎలా తర్ఫీదునిస్తారో అంతుచిక్కడంలేదు. సమస్యలపై రాష్ట్ర ఉన్నతాధికారులకు లేఖలు పంపినా, ఏ మాత్రం చలనం ఉండటంలేదు. నెల్లూరు (స్టోన్హౌస్పేట): జిల్లా క్రీడాప్రాధికార సంస్థలో దాదాపు 26 మంది కోచ్లు, గ్రౌండ్స్మెన్, స్వీపర్లు, సెక్రటరీలు, వాచ్మెన్లకు ఏడాదిగా జీతాలు రావడంలేదు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వీరు తమ వెతలపై రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థకు విన్నవించినా ప్రయోజనం కరువవుతోంది. ఏటా ఇదే పరిస్థితి ఏర్పడినా ఇటీవలి కాలంలో వీరు పరిస్థితి దయనీయంగా మారింది. ఫలితంగా ఇంటి బాడుగలు చెల్లించలేక, కుటుంబాన్ని పోషించలేక నానా అగచాట్లు పడుతున్నారు. లేఖ రాసినా స్పందనేదీ..? వీరికి జీతాలు రావడంలేదనే అంశాన్ని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్కు కలెక్టర్ ఆనంద్ మార్చిలో లేఖ రాసినా, స్పందన నేటికీ కొరవడింది. నెల్లూరుతో పాటు ఆరు జిల్లాల మినహా మిగిలిన అన్ని చోట్ల వేతనాలు సక్రమంగానే అందుతున్నాయి. ఇక్కడే ఈ పరిస్థితి ఎందుకని ఎవరైనా ప్రశ్నిస్తే, సరైన సమాధానం కరువవుతోంది. వాస్తవానికి కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో పనిచేస్తున్న కోచ్లకు రూ.21,500.. జూనియర్ అసిస్టెంట్కు రూ.20 వేలు.. ఆఫీస్లో పనిచేస్తున్న వారికి రూ.18,500.. స్వీపర్లు, గ్రౌండ్ మార్కర్లకు రూ.15 వేల మేర జీతాలు రావాల్సి ఉంది. అనారోగ్యానికి గురైనా అదే తీరు.. జీవరత్నం అనే ఉద్యోగి నెల కింద బ్రెయిన్ ట్యూమర్కు గురై కాళ్లు, చేతులతో పాటు మాట పడిపోయింది. సాయం చేయాలని మేలో లేఖలు పంపినా, రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ పట్టించుకోవడంలేదు. అతని పరిస్థితిని గమనించి ఆర్థిక సాయాన్ని సాఫ్ట్బాల్ జిల్లా అసోసియేషన్, ఖోఖో, కబడ్డీ తదితర క్రీడాకారులతో పాటు నెల్లూరు డీఎస్డీఓ అందజేశారు. ఇప్పటికై నా సమస్యను పరిష్కరించి తమకు జీతాలను చెల్లించాలని వీరు కోరుతున్నారు. వేతనాలు రాక స్టేడియంలో సిబ్బంది ఆకలికేకలు లేఖలు రాసినా రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ నుంచి స్పందన కరువు అనారోగ్యానికి గురైనా కనికరం చూపని సర్కార్ ఏడాదిగా ఇదే దుస్థితి ఉన్నతాధికారులకు తెలియజేశాం జీతాలు రాని విషయాన్ని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఉన్నతాధికారులకు తెలియజేశాం. కలెక్టర్ ద్వారా లేఖలు పంపాం. సమస్య త్వరలో పరిష్కారమవుతుందని భావిస్తున్నాం. – యతిరాజ్, డీఎస్డీఓ -
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి బలవన్మరణం
నెల్లూరు సిటీ: ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. డ్రైవర్స్ కాలనీలోని బిట్ – 2లో నివాసం ఉంటున్న ఖతీముద్దీన్ (40), నూర్జ్హాన్ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉడ్ కాంప్లెక్స్లో కొయ్య పని చేసేవారు. మూడు నెలలుగా పనిలేకపోవడంతో కుటుంబపోషణకు అప్పులు చేశారు. వీటిని ఎలా తీర్చాలని రోజూ వేదనకు గురయ్యేవారు. కుమార్తె వివాహానికి సరిపడా డబ్బుల్లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. ఈ క్రమంలో భార్య తన పిల్లలతో కలిసి బెడ్రూమ్లో శుక్రవారం రాత్రి నిద్రించారు. హాల్లోకి శనివారం వచ్చి చూడగా, సీలింగ్ ప్యాన్కు చీరతో ఉరేసుకొని ఉండటాన్ని గమనించారు. భార్య కేకలేయడంతో చుట్టుపక్కలు వారు వచ్చి హాస్పిటల్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వేదాయపాళెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ముగిసిన బదిలీల కౌన్సెలింగ్
నెల్లూరు సిటీ: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఆరు మున్సిపాల్టీలతో పాటు నగరపాలక సంస్థ పరిధిలో గల వార్డు సచివాలయాల్లో విధులు నిర్వర్తించే పలు విభాగాల ఉద్యోగులకు సంబంధించిన బదిలీల కౌన్సెలింగ్ను కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఉదయం తొమ్మిదింటికే ఆయా సచివాలయాల ఉద్యోగులు 1266 మంది హాజరయ్యారు. ఉద్యోగులకు సంబంధించిన జాబితాను విడుదల చేయడం.. అందులో నియామక తేదీల్లో మార్పులుండటంతో గందరగోళం నెలకొంది. ఇవి తప్పులతడకగా ఉండటాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తమ కంటే వెనుక చేరిన వారి పేర్లు కౌన్సెలింగ్లో ముందు రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎవరికీ ఇబ్బందుల్లేకుండా.. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో కౌన్సెలింగ్కు ఉద్యోగులు సహకరించారు. అనంతరం కమిషనర్ నందన్ మాట్లాడారు. వార్డు సచివాలయ విభాగం చేపట్టిన రేషనలైజేషన్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తి చేశామని తెలిపారు. ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేశామని, ఉద్యోగులకు వార్డుల కేటాయింపు ప్రక్రియను ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు త్వరలో పూర్తి చేయనున్నామని వెల్లడించారు. హాజరైన 1266 మంది సచివాలయ ఉద్యోగులు నియామక తేదీల్లో తప్పులతో గందరగోళం -
లో గ్రేడ్ పొగాకును కొనుగోలు చేయండయ్యా..
కందుకూరు: పొగాకు మార్కెట్లో ఈ ఏడాది నెలకొన్న సంక్షోభంతో పూర్తిగా నష్టపోతున్నామని.. పండించిన పంటను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. లో గ్రేడ్ పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేయకపోతే తమ పరిస్థితి ఏమిటని నిలదీశారు. ఈ మేరకు పామూరు రోడ్డులోని రెండో వేలం కేంద్ర పరిధిలో పొగాకు వేలాన్ని అడ్డుకొని రైతులు ఆందోళనకు శనివారం దిగారు. వేలాన్ని నిలిపేసి.. రోడ్డుపైకి వచ్చి వాహనాలను అడ్డుకొని నిరసన చేపట్టారు. ఈ తరుణంలో పోలీసులు జోక్యం చేసుకొని రైతులకు సర్దిచెప్పి ఆందోళనను విరమింపజేశారు. ఆపై రైతులు మరోసారి ఆందోళనకు దిగారు. బోర్డు కార్యాలయం నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు అర్ధనగ్న ప్రదర్శన జరిపారు. అనంతరం సబ్ కలెక్టర్ శ్రీపూజకు వినతిపత్రాన్ని అందజేశారు. వేలం చివరి దశకు చేరుకుందని, అయినా బోర్డులో పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరగడంలేదని ఆరోపించారు. అదనపు భారం రైతుల వద్ద లో గ్రేడ్ రకం పొగాకు ఉత్పత్తులే ప్రస్తుతం ఉన్నాయి. కిలోను ఇప్పటి వరకు రూ.160కు కొనుగోలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ ధరకూ కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ధరలు తగ్గించిచ్చేందుకు సిద్ధమైనా, కొనుగోలు చేయడంలేదని వాపోయారు. వేలం కేంద్రానికి తీసుకొచ్చిన బేళ్లను కొనుగోలు చేయకపోవడంతో తిరిగి ఇళ్లకు చేర్చుకోవాల్సి వస్తోందని, ఫలితంగా రవాణా చార్జీల రూపంలో అదనపు భారం పడుతోందని చెప్పారు. ఒకసారి వేలానికి తీసుకొచ్చి, తిరిగి ఇంటికి తీసుకెళ్లిన బేలులో దాదాపు 10 కిలోల పొగాకు వ్యత్యాసం కనిపిస్తోందని ఆరోపించారు. కొనుగోలు చేయకుండా తిప్పి పంపితే, తామేమీ చేసుకోవాలని, ఎక్కడ విక్రయించాలని నిలదీశారు. అధికారులు జోక్యం చేసుకొని లో గ్రేడ్ ఉత్పత్తులను కొనుగోలు చేసేలా చూడాలని డిమాండ్ చేశారు. క్వింటాల్ లో గ్రేడ్ రకం పొగాకును రూ.32 వేలకు గతేడాది కొనుగోలు చేసిన వ్యాపారులు, ఈ ఏడాది రూ 15 వేలకు కూడా కొనుగోలు చేయకపోవడమేమిటని ప్రశ్నించారు. ఇరువర్గాలను ఒప్పించి.. వేలం కేంద్రానికి వచ్చిన బోర్డు రీజినల్ మేనేజర్ లక్ష్మణరావు.. అటు రైతులు, ఇటు వ్యాపారులతో చర్చలు జరిపారు. వేలం సాగేందుకు ఇరువర్గాలను ఒప్పించారు. అయినా లో గ్రేడ్ పొగాకును కొనుగోలు చేసేందుకు చాలా మంది వ్యాపారులు ముందుకు రాకపోవడం గమనార్హం. పొగాకు కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, చేతల్లో ఎలాంటి చర్యలు చేపట్టడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో వేలం కేంద్రంలో రైతుల ఆందోళన అర్ధనగ్న ప్రదర్శన సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేత -
వైభవంగా కల్యాణం
రాపూరు: పెంచలకోన క్షేత్రంలో శనివారం సాయంత్రం శ్రీపెనుశిలలక్ష్మీనరసింహాస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవిలకు శాస్త్రోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించారు. ఉత్సవ మూర్తులను అలంకార మండపంలోకి వేంచేపు చేసి అక్కడ తిర్చుపై కొలువుదీర్చారు. ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం సహస్రదీపాలంకరణ మండపంలో ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు.ఉదయం నిత్య కల్యాణ మండలపంలో స్వామి అమ్మవార్ల కల్యాణం ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించి పునీతులయ్యారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి
● ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ పొదలకూరు : వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, అక్రమ కేసులకు భయపడాల్సిన పనిలేదని ఎమ్మెల్సీ, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్ అభయమిచ్చారు. పొదలకూరులోని జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ నివాసంలో శనివారం పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో పార్టీ పటిష్టంగా ఉందన్నారు. మరో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ పార్టీ నాయకులు కార్యకర్తలను సమన్వయ పరుచుకుని సమస్యలు ఎదురైతే పోరాడాల్సిందిగా సూచించారు. వెన్నుదన్నుగా తాము నిలబడతామన్నారు. మాజీమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి కుమార్తె కాకాణి పూజిత మాట్లాడుతూ తన తండ్రి త్వరలోనే కేసుల నుంచి బయటకు వస్తారని, నాయకులు, కార్యకర్తలు మనోధైర్యంగా ఉండాలని సూచించారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నమైన తన దృష్టికి తీసుకురావాలని కోరారు. సమావేశంలో పార్టీ స్టేట్ సెక్రటరీ శివశంకర్రెడ్డి, మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, పొదలకూరు, వెంకటాచలం వైస్ ఎంపీపీలు వేణుంబాక చంద్రశేఖర్రెడ్డి, కోదండరామిరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ గోగిరెడ్డి గోపాల్రెడ్డి, ఎంపీటీసీలు జీ లక్ష్మీకల్యాణి, ఎస్కే అంజాద్, జీ శ్రీనివాసులు, మాజీ ఏఎంసీ చైర్మన్ రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ కార్యదర్శుల ఆందోళన బాట
నెల్లూరు (పొగతోట) : సమస్యల సాధన కోసం పంచాయతీ కార్యదర్శులు కదం తొక్కారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం డీపీఓ కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయం, కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగారు. భారీ సంఖ్యలో హాజరైన పంచాయతీ కార్యదర్శులు, మండుటెండను సైతం లెక్క చేయకుండా డీపీఓ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. డీపీఓ, కలెక్టరేట్ అధికారులకు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య నాయకులు చల్లా ప్రసాద్రెడ్డి, ఓ లెనిన్, శ్రీనివాసులురెడ్డి, శివకుమార్ మాట్లాడుతూ పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీ కార్యదర్శులను అవహేళన చేస్తూ మనో భావాలు దెబ్బతినేలా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 6 గంటలకే ఇంటింటి చెత్త సేకరణ చేసేటప్పుడు ఫొటోలు పెట్టి అప్లోడ్ చేయాలంటూ కార్యదర్శుల స్థాయిని తగ్గిస్తూ మాట్లాడారని వాపోయారు. ఇప్పటికే తమపై పని ఒత్తిడి అధికంగా ఉందన్నారు. ఏ శాఖకు లేని ఐవీఆర్ఎస్ కాల్స్ పంచాయతీశాఖకు వద్దంటూ విజ్ఞప్తి చేశారు. పంచాయతీ కార్యదర్శుల వల్లే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి గిన్సిస్ రికార్డు నమోదు అయిందన్నారు. యోగాంధ్ర విజయవంతంలో పంచాయతీ కార్యదర్శులు రాత్రి, పగలు శ్రమించారని గుర్తు చేశారు. కార్యదర్శులకు సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల పంచాయతీల్లో అన్ని రకాల సర్వేలు, స్వర్ణ పంచాయతీ పనులు, ఇంటి పన్ను వసూళ్లు, పీఆర్ 1 యాప్, గ్రామ సచివాలయాల సర్వేలు, పీజీఆర్ఎస్ పనులు, గ్రామ సభలు, పంచాయతీ సమావేశాలు, సంక్షేమ పథకాల అమలు, ఎన్నికల విధులు, ప్రొటోకాల్ విధులు తదితర పనులతో పని ఒత్తిడి అధికంగా ఉందన్నారు. దీంతోపాటు నిత్యం వెబ్ కాన్ఫరెన్స్లు, గూగుల్ మీట్లు, టెలీకాన్ఫరెన్స్లతో ఒత్తిడితో నలిగిపోతున్నామన్నారు. ప్రతిది పంచాయతీ కార్యదర్శులకు అప్పగించడంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై కార్యదర్శులు వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. కుటుంబ సంక్షేమాన్ని కూడా పట్టించుకోకుండా పనులపై 24 గంటలు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సమాఖ్య నాయకులు పురిణి శ్రీనివాసులు, ఆర్.శివకుమార్, ఎస్కే ఇంతియాజ్, వహీదా అధిక సంఖ్యలో పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. పని ఒత్తిడి తగ్గించాలి పంచాయతీ కార్యదర్శులు పని ఒత్తిడితో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సంక్షేమ పథకాలు, సర్వేలు, ప్రతిదీ పంచాయతీ సెక్రటరీలకే అప్పగిస్తున్నారు. పండ్లు కాచే చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లు పంచాయతీ కార్యదర్శులకే ప్రతి పనిని అప్పగిస్తున్నారు. పంచాయతీ రాష్ట్ర ఉన్నతాధికారులు కార్యదర్శులను కించపరిచేలా మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శుల మనోభావాలు దెబ్బతినేలా అధికారుల మాట తీరు ఉంది. పని ఒత్తిడి తగ్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – చల్లా ప్రసాద్రెడ్డి, కార్యదర్శుల జిల్లా నాయకుడు అనారోగ్యాల పాలవుతున్నాం పంచాయతీ కార్యదర్శులపై తీవ్రమైన పని ఒత్తిడి ఉంది. పని ఒత్తిడి కారణంగా అనారోగ్యాల పాలై ప్రాణాలు కోల్పోతున్నారు. పంచాయతీ కార్యదర్శులకు ఐవీఆర్ఎస్ కాల్స్ దూరంగా ఉంచాలి. కార్యదర్శుల సంక్షేమం కోసం అధికారులు, ప్రభుత్వం కృషి చేయాలి. – ఓ లెనిన్, కార్యదర్శుల జిల్లా నాయకుడు డీపీఓ, జిల్లా పరిషత్ కార్యాలయం, కలెక్టరేట్ ఎదుట ధర్నాలు పని ఒత్తిడి తగ్గించకుంటే సమ్మెకు దిగుతామంటూ హెచ్చరిక సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రాలు -
న్యాయమూర్తులకు శిక్షణ తరగతులు
నెల్లూరు (లీగల్): జిల్లాలోని వివిధ కోర్టుల న్యాయమూర్తులకు కోర్టు హాల్లో నిర్వహించిన శిక్షణ తరగతుల కార్యక్రమన్ని ఏపీ హైకోర్టు జడ్జి, నెల్లూరు జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ కె. శ్రీనివాసులురెడ్డి శనివారం ప్రారభించారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి జి. శ్రీనివాస్ నోడల్ అధికారిగా మాజీ హైకోర్టు జడ్జిలు బి. శ్యామసుందర్, ఎం.సీతారామమూర్తితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ వర్క్ షాప్లో సెక్షన్ 9 సీపీసీ న్యాయపరిధి, చట్టంలో కేసులను విచారించి నిర్ణయించడానికి కోర్టు అధికారం, లోక్ అదాలత్పై సమీక్షా, సలహాలు ఇవ్వడం జరిగింది. అనంతరం జిల్లా కోర్టుకు వచ్చే విభిన్న ప్రతిభా వంతులైన కక్షిదారుల సౌకర్యార్థం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అందజేసిన 18 ట్రైసైకిళ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ ఓ ఆనంద్, మునిసిపల్ కమిషనర్ వైఓ నందన్, బ్యాంక్ అధికారులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఏపీ జెన్కోలో ప్రమాదం ● కార్మికుడికి తీవ్రగాయాలు ముత్తుకూరు(పొదలకూరు): ముత్తుకూరు మండలం నేలటూరు ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రంలో శనివారం జరిగిన ప్రమాదంలో అవుట్సోర్సింగ్ కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. మచిలీపట్నంకు చెందిన శివప్రసాద్ పదేళ్లుగా ఇక్కడ అవుట్సోర్సింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రోజువారి విధుల్లో భాగంగా పని చేస్తుండగా ఈహెచ్పీ బ్రేకర్ పేలిపోవడంతో కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని తోటికార్మికులు హుటాహుటిన నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. నీకు చదువు రాదు.. టీసీ తీసుకెళ్లిపో ● ఏపీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడి నిర్వాకం దుత్తలూరు: విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేసి, తదనుగుణంగా తర్ఫీదు ఇచ్చి ఎదిగేందుకు కృషి చేయాల్సిన ఓ ఉపాధ్యాయుడే నీకు చదువురాదు.. టీసీ తీసుకుని వెళ్లిపో అంటూ ఓ విద్యార్థిని అవమానించిన ఘటన దుత్తలూరు ఏపీ ఆదర్శ పాఠశాలలో శుక్రవారం జరిగింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు.. పాఠశాలలో హర్షవర్ధన్రెడ్డి 7వ తరగతి చదువుతున్నాడు. అయితే సైన్న్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజశేఖర్ శుక్రవారం విద్యార్థిని పిలిచి టీసీ తీసుకుని వెళ్లమన్నాను కదా మళ్లీ ఎందుకు వచ్చావంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతని తల్లికి ఫోన్ చేసి పాఠశాలకు వచ్చి మీ అబ్బాయి టీసీ తీసుకెళ్లాలంటూ హెచ్చరించారు. దీంతో విద్యార్థి మేనమామ శనివారం ప్రిన్సిపల్ సైమన్రావుకు ఫిర్యాదు చేయడంతో ఆయన విద్యార్థిని పిలిచి వివరాలు సేకరించారు. ఈ విషయమై ప్రిన్సిపల్ని వివరణ కోరగా ఉపాధ్యాయుడు సెలవులో ఉన్నాడని విచారించి చర్యలు చేపడతామని తెలిపారు. -
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
● రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ మాజీ చైర్పర్సన్ శిరీష సైదాపురం: అక్రమ మైనింగ్దారుల వల్ల తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని రాష్ట్ర సంగీత నృత్య అకాడమీ మాజీ చైర్పర్సన్ పొట్టేళ్ల శిరీష యాదవ్ జిల్లా పోలీస్ ఉన్నత అధికారులను కోరారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ సైదాపురం మండలంలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై చర్యలు తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేశామన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని జిల్లా మైనింగ్ అధికారులతోపాటు అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న కొందరు తమపై తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. ప్రాణహాని తలపెట్టేందుకు పావులు కదుపుతున్నట్లు తెలిసిందన్నారు. నిరంతరం ఖనిజ సంపదను కొల్లకొడుతూ ప్రభుత్వ ఆదాయానికి అడ్డుపడుతున్న అక్రమార్కులపై నిరంతరం పోరాటం కొనసాగిస్తున్నట్లు చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని టార్గెట్ చేశారని ఆరోపించారు. రక్షణ కల్పించాలని విన్నవించారు. జిల్లా పరిషత్, కలెక్టరేట్ వాహనాల వేలంనెల్లూరు రూరల్: నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ కార్యాలయం, కలెక్టరేట్లో వాడుకలో లేని మారుతి సుజుకి, స్కార్పియో, ఇన్నోవా వాహనాలను వేలం వేయనున్నట్లు డీఆర్వో ఉదయభాస్కర్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చేనెల 3వ తేదీ ఉదయం 10.30 గంటలకు నెల్లూరు నూతన జిల్లా పరిషత్ కార్యాలయములో వేలంపాట జరుగుతుందన్నారు. ధరావత్తు సొమ్ము రూ.10 వేలు చెల్లించాలన్నారు. అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నిర్ధారించిన ధరలకు వాహనాలను వేలం వేస్తామని తెలియజేశారు.కసుమూరు దర్గా హుండీ ఆదాయం రూ.44.17 లక్షలువెంకటాచలం: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కసుమూరు మస్తాన్వలీ దర్గా హుండీ ఆదాయం రూ.44.17 లక్షలు వచ్చినట్లు ఈఓ షేక్ షరీఫ్ శుక్రవారం తెలిపారు. దర్గాలో మొత్తం 8 హుండీలు ఏర్పాటు చేశామన్నారు. రెండు ప్రధాన హుండీల్లో కానుకలను గురు, శుక్రవారాల్లో లెక్కించగా రూ.44.17 లక్షలు వచ్చాయన్నారు. మిగిలిన ఆరు హుండీల్లోని కానుకలను 15 రోజుల తర్వాత లెక్కిస్తామన్నారు.ఉచితంగా నట్టల నివారణ మందునెల్లూరు(పొగతోట): గొర్రెలు, మేకలకు ఉచితంగా నట్టల నివారణ మందు పంపిణీ చేస్తున్నట్లు పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ రమేష్ నాయక్ తెలిపారు. శుక్రవారం వివిధ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడాదిలో నాలుగుసార్లు మందు పంపిణీ చేస్తున్నారని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణంవరికుంటపాడు: మండలంలోని రామాపురం సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. వరికుంటపాడు పంచాయతీ పరిధిలోని ఆండ్రవారిపల్లికి చెందిన గాడి మాధవరెడ్డి (45) మోటార్బైక్పై తిమ్మారెడ్డిపల్లికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. అలాగే వైఎస్సార్ జిల్లా ముద్దనూరు నుంచి రాజమండ్రికి కూరగాయల లోడుతో బొలెరో వాహనం వెళ్తోంది. రెండు వాహనాలు రామాపురం సమీపంలోని నక్కలగండి రిజర్వాయర్ కాలువ వద్దకు రాగానే ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మాధవరెడ్డి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జాయింట్ ఎల్పీఎం పూర్తికి ప్రత్యేక డ్రైవ్
3,680 కొత్త పింఛన్లు మంజూరు నెల్లూరు (పొగతోట): సామాజిక పింఛన్ల పంపిణీలో భాగంగా పింఛన్ తీసుకుంటూ మరణించిన వారి భార్యలు 3,680 మందికి కొత్త పింఛన్లు వచ్చే నెల 1వ తేదీ నుంచి పంపిణీ చేస్తామని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు. శుక్రవారం ఆమె అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ గతేడాది నవంబరు నుంచి పింఛన్ తీసుకుంటూ మరణించిన వ్యక్తుల భార్యలకు కొత్తగా పింఛన్ మంజూరు చేస్తున్నామన్నారు. వచ్చే నెల 1వ తేదీ పాత పెన్షన్తోపాటు కొత్తగా మంజూరైన వారికి కూడా పింఛన్ నగదు అందిస్తామని తెలిపారు. అనంతరం డీఆర్డీఏలో విధులు నిర్వహిస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు సిబ్బంది ఒక్క రోజు వేతనాన్ని అందించారు. దానికి సంబంధించిన చెక్కులను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ● జేసీ కార్తీక్ నెల్లూరు రూరల్: అన్నదాత సుఖీభవ పథకానికి అవసరమయ్యే జాయింట్ ఎల్పీఎం (జాయింట్ ల్యాండ్ పార్సిల్ మ్యాప్) పూర్తి చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని జేసీ కె. కార్తీక్ రెవిన్యూ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కావలి, కందుకూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని తహసీల్దార్లతో రీసర్వే, డిజిటలైజేషన్, హౌసింగ్, సీసీఆర్డీ కార్డులు, సిటిజన్ సర్వీసెస్ తదితర రెవెన్యూ సంబంధిత విషయాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో రెండో విడత ఎంపికై న గ్రామాల్లో రీసర్వే సక్రమంగా పూర్తి చేయాలని, ఇప్పటికే రీసర్వే పూర్తయిన గ్రామాల్లో తలెత్తిన సమస్యలను పరిగణలోకి తీసుకుని మరింత జాగ్రత్తగా పూర్తి చేయాలన్నారు. రీసర్వేలో 22ఏ, పీజీఆర్ఎస్లో ఉన్నటు వంటి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. రెవెన్యూ రికార్డులన్నింటినీ డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలన్నారు. రెవెన్యూ సంబంధిత చట్టపరమైన విషయాల నిర్వహణను క్రమబద్ధీకరించడానికి, వాటిని పారదర్శకంగా చేయడానికి రూపొందించబడిన వెబ్ ఆధారిత వ్యవస్థ ఓఆర్సీఎంఎస్ను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అర్హత ఉన్న కౌలు రైతులకు సీసీఆర్కార్డులు అందజేయాలన్నారు. సీసీఆర్సీ కార్డులు మంజూరులో ఆలస్యమైతే వివిధ ప్రయోజనాలను, ముఖ్యంగా పంట రుణాలను పొందే అవకాశం కోల్పోతారన్నారు. ఈ సమావేశంలో కందుకూరు సబ్కలెక్టర్ టి. శ్రీపూజ, డీఆర్ఓ ఉదయభాస్కరరావు, కావలి ఆర్డీఓ వంశీకృష్ణ పాల్గొన్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు
● ఆవేదనలో వెలుగు ఉద్యోగులు సీతారామపురం: వెలుగు విభాగంలో ప్రభుత్వం చేపట్టిన సాధారణ, సర్దుబాటు పేరిట బదిలీల ప్రక్రియలో పారదర్శకత లోపించింది. నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ కక్ష సాధింపుతో బదిలీలు చేశారంటూ ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయినవారికి జిల్లాలో, కాని వారికి ఇతర జిల్లాలకు స్థానచలనం ఎలా చేస్తారని కొందరు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సర్దుబాటు ప్రక్రియ కూడా లోపభూయిష్టంగా ఉందని పలువురు విమర్శిస్తుండగా, కొందరు ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. బదిలీలకు సంబంధించి సెర్ప్ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయగా అందుకు విరుద్ధంగా జిల్లాలో బదిలీలు జరిగాయన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 23 ప్రకారం ఒకచోట ఐదేళ్లు సర్వీస్ పూర్తిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలి. అయితే కేవలం ఒక సంవత్సరం సర్వీస్ పూర్తి చేసుకున్న వారిని సైతం ఇతర జిల్లాకు బదిలీ చేసినట్లు తెలిసింది. సర్ప్లస్ కాకపోయినా రాజకీయాలు చేసి ఐదుగురు ఏపీఎంలను పల్నాడు జిల్లాకు బదిలీ చేశారు. అంతంతమాత్రపు జీతాలతో అంత దూరం వెళ్లి విధులు ఎలా నిర్వహించాలంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సీనియారిటీ లిస్టును పక్కనపెట్టి చేపట్టిన బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, డబ్బులిచ్చిన వారిని మినహాయింపు ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా నుంచి ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుష ఏపీఎంలను పల్నాడు జిల్లాకు పంపారు. వీరంతా సెర్ప్ గైడ్లైన్స్ ప్రకారం బదిలీలకు అనర్హులు. వారు ముందస్తు దరఖాస్తు చేసుకోలేదు. అయినా నిబంధనలకు విరుద్ధంగా ఇతర జిల్లాకు బదిలీ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తహసీల్దార్, ఎంపీడీఓలు, ఇతర మండల స్థాయి అధికారులకు సైతం జిల్లా స్థాయిలో బదిలీలు జరుగుతుండగా ఏపీఎంలకు మాత్రం జోనల్ స్థాయిలో స్థాన చలనం కలిగించడం గమనార్హం. -
కండలేరులో 33.986 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 33.986 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 2,040, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 70, హైలెవల్ కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. రైల్లో నుంచి పడి..● వ్యక్తి మృతిమనుబోలు: విజయవాడ నుంచి చైన్నె వెళ్తున్న రైల్లో నుంచి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన మనుబోలు – కొమ్మలపూడి రైల్వే స్టేషన్ల మధ్య 147/7–5 కిలోమీటర్ వద్ద శుక్రవారం వేకువజామున చోటుచేసుకుంది. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. పింక్ కలర్ చెక్స్ ఫుల్ హ్యాండ్స్ షర్టు, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై హరిచందన తెలిపారు. -
మద్యానికి బానిసై దోపిడీలు
● నిందితుల అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): వారంతా మద్యం, చెడు వ్యసనాలకు బానిసలయ్యారు. వ్యసనాలను తీర్చుకునేందుకు ముఠాగా ఏర్పడి ఒంటరిగా వెళ్లేవారిని చంపుతామని కత్తులతో బెదిరించి నగదు దోచుకెళుతున్నారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు నవాబుపేట పోలీస్స్టేషన్లో శుక్రవారం ఇన్స్పెక్టర్ వేణుగోపాల్రెడ్డి వివరాలను వెల్లడించారు. ఓ బ్యాంకు ఉద్యోగి ఈనెల 25వ తేదీన తన కుటుంబంతో కలిసి బైక్పై వెళుతుండగా రైల్వేస్టేషన్ వద్ద ముగ్గురు నిందితులు అడ్డగించారు. కత్తులతో చంపుతామని బెదిరించి నగదు దోచుకెళ్లారు. అదేరోజు రాత్రి ఇద్దరు బాలలు మద్యం తాగేందుకు తడికల బజారు సెంటర్ దళితవాడలో ఒంటరిగా ఇంటిముందు నిద్రిస్తున్న మహిళను కత్తితో బెదిరించి నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదుల మేరకు నవాబుపేట పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ నేతృత్వంలో సిబ్బంది బృందాలుగా ఏర్పడి సాంకేతికత ఆధారంగా బ్యాంకు ఉద్యోగిని బెదిరించి నగదు దోచుకెళ్లింది ఉడ్హౌస్ సంఘానికి చెందిన మునితేజ, సీహెచ్ మహేష్, బాలాజీనగర్కు చెందిన బి.దేవకుమార్లుగా గుర్తించారు. దళితవాడ దోపిడీ కేసులో ఇద్దరు బాలల్ని గుర్తించారు. శుక్రవారం వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. చెడు వ్యసనాలకు బానిసై నేరాలకు పాల్పడుతున్నట్లు వారు అంగీకరించారు. దీంతో ఇద్దరు బాలలను తిరుపతిలోని జువైనెల్ హోంకు తరలించి మిగిలిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. కేసులను ఛేదించడంలో ప్రతిభ చూపిన ఇన్స్పెక్టర్, ఎస్సై రెహమాన్, సిబ్బంది నరసయ్య, ప్రసాద్, మస్తాన్రావు, సుధాకర్, వేణు, మస్తానయ్య, గౌస్బాషాలను ఎస్పీ అభినందించారు. -
ఆవుల తరలింపును అడ్డుకున్న గోరక్షకులు
● జరిమానా విధించి వదిలేసిన ఎస్సై ● ఎస్పీకి ఫిర్యాదు ఉలవపాడు: అక్రమంగా గోవులను లారీలో తరలిస్తుండగా గోరక్షకులు, బీజేపీ నేతలు అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం చీమకుర్తి నుంచి తిరుపతికి కారులో వెళ్తున్న బీజేపీ నేతలు గుండా శ్రీనివాసరావు, శివారెడ్డి, నరేష్కుమార్, సుబ్బారావులకు మన్నేటికోట అడ్డరోడ్డు సమీపంలో గోవులను అక్రమంగా తరలిస్తున్న వాహనం కంటపడింది. దీంతో అడ్డుకుని పరిశీలించారు. గోవులతో సహా వాహనాన్ని, తరలిస్తున్న వారిని ఉలవపాడు పోలీస్స్టేషన్లో అప్పగించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయితే గోవులను సరంక్షించడంతోపాటు అక్రమ రవాణాదారులపై చర్యలు తీసుకోవాల్సిన ఎస్సై అంకమ్మ ఆ వాహనానికి రూ.2,200 జరిమానా వేసి ఆవులను తరలించే వాహనాన్ని వదిలేశారు. దీంతో వారు జరిమానా కట్టి వెంటనే గోవులను తీసుకుని వెళ్లిపోయారు. ఎస్సై వ్యవహరించిన తీరుపై సదరు బీజేపీ నేతలు ఎస్పీ కృష్ణకాంత్కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. గోవులను గోశాలకు తరలించకుండా, ఇరుకుగా ఉన్న వాహనంలో తిరిగి పంపించడంతో పోలీసులపై కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
మోడల్ ప్రైమరీ స్కూళ్లలో తాత్కాలిక మరమ్మతులు
నెల్లూరు(టౌన్): జిల్లాలోని 470 మోడల్ ప్రైమరీ స్కూల్స్లో ఆగస్టు చివరి నాటికి తాత్కాలిక మరమ్మతులను పూర్తి చేయనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య తెలిపారు. నెల్లూరులోని సమగ్రశిక్ష కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయా స్కూళ్లలో 1,270 గదులు అవసరమని గుర్తించినట్లు చెప్పారు. పెద్ద రూమ్లను రెండు తరగతి గదులుగా ఏర్పాటు చేయడం, లేదా వరండాను రెండు తరగతి గదులుగా, మేజర్, మైనర్ రిపేర్లు, ఎలక్ట్రికల్ వర్క్స్, గ్రీన్ చాక్బోర్డు, డ్యూయల్ డెస్క్ తదితర పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. స్కూల్ మెయింటెనెన్స్కు 2,571 ప్రభుత్వ పాఠశాలలకు రూ.2.88 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. ప్రస్తుతం రూ.54.77 లక్షలు విడుదల చేసినట్లు చెప్పారు. మిగిలిన నిధులు డిసెంబర్లో విడుదల కానున్నట్లు చెప్పారు. గతంలో 42 స్కూల్స్ పీఎంశ్రీకు ఎంపికయ్యాయన్నారు. తాజాగా తోటపల్లిగూడూరు మండలం కోడూరులోని ఏపీఎస్డబ్ల్యూఆర్, సంగంలోని ఏపీఎస్ఆర్డబ్ల్యూఆర్, ఉలవపాడులోని ఏపీ మోడల్ స్కూల్, అల్లూరు మండలంలోని అల్లూరుపేటలోని జెడ్పీహెచ్ఎస్లు ఎంపికై నట్లు తెలిపారు. జిల్లాలోని 10 కేజీబీవీల్లో రూ.2.50 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈనెల 12 నుంచి వచ్చేనెల 12వ తేదీ వరకు ఎన్రోల్మెంట్ డ్రైవ్ను నిర్వహిస్తున్నామన్నారు. సీఆర్పీలు, అంగన్వాడీ టీచర్లు, సచివాలయ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీస్ పాల్గొంటారని చెప్పారు. డ్రాప్బాక్స్లో 14,232 మంది ఉన్నారని, వారిని ఆయా పాఠశాలల్లో చేర్పించనున్నట్లు పేర్కొన్నారు. -
ప్రజాదరణను ఓర్వలేకే కేసులు
● ఆనం విజయకుమార్రెడ్డి నెల్లూరు(స్టోన్హౌస్పేట): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పర్యటనలకు లభిస్తున్న ప్రజాదరణను ఓర్వలేక అక్రమ కేసులను కూటమి ప్రభుత్వం బనాయిస్తోందని పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వ మోసాలను ఏడాది పాలనలోనే ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. వీరికి అండగా ఉంటూ.. భరోసా కలిస్తున్న తమ నేతను ఇబ్బంది పెట్టేందుకే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రెంటపాళ్ల పర్యటనలో జగన్మోహన్రెడ్డి కాన్వాయ్ కిందపడి వ్యక్తి మరణించారంటూ తప్పుడు కేసు పెట్టారని విమర్శించారు. ఆ రోజున ఎస్పీ మాటలకు.. ప్రభుత్వం పెట్టిన కేసుకు సంబంధం లేదన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన వీడియోను చూపిస్తూ కేసు పెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్న సమయంలో ఎంతో మంది మరణానికి కారణమయ్యారని, ఆయనపై ఎలాంటి కేసును ఎందుకు పెట్టలేదన్నారు. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్రెడ్డిపై బనాయిస్తున్న అక్రమ కేసుల విషయం ప్రజలందరికీ తెలుసునన్నారు. ఎవరెన్ని ఆంక్షలు పెట్టినా జూలై మూడున జగనన్న పర్యటన నెల్లూరులో ఉంటుందని, ప్రజాభిమానాన్ని ఆపడం ఎవరితరం కాదని స్పష్టం చేశారు. -
డ్రగ్స్ వాడకంతో అనర్థాలు
నెల్లూరు(అర్బన్): మాదకద్రవ్యాలను వినియోగిస్తే అనర్థాలు సంభవిస్తాయని డీఎంహెచ్ఓ సుజాత పేర్కొన్నారు. ప్రపంచ యాంటీ డ్రగ్ డేను పురస్కరించుకొని దర్గామిట్టలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల, సర్వజన ఆస్పత్రి ఆవరణలో పలువురు వైద్య సిబ్బంది, డాక్టర్లతో ప్రదర్శనను నవజీవన్ ఐడీయూ ఎన్జీఓ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. దీన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. టీవీలు, సినిమాలు, సోషల్ మీడియా మాయాజాలంలో పడి యువత ఎక్కువగా డ్రగ్స్ బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి వినియోగానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఏడీఎంహెచ్ఓ ఖాదర్వలీ తదితరులు పాల్గొన్నారు. -
విచారణ పేరిట వేధింపులు
అనుమసముద్రంపేట: విచారణ పేరిట పోలీసులు వేధించడంతో మహిళ కుప్పకూలిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. మండలంలోని కావలియడవల్లికి చెందిన మానికొండ ఇందిరమ్మ కొన్నేళ్లుగా హైదరాబాద్లో నివాసముంటున్నారు. వారం క్రితం తమ సమీప బంధువుల ఇంటికొచ్చారు. గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శ్రీలక్ష్మి ఇంట్లో ఇందిరమ్మ ఉంటున్నారు. ఈ క్రమంలో తన బంగారం పోయిందంటూ శ్రీలక్ష్మి, వెంకటేశ్వర్లు దంపతులపై పోలీసులకు ఇందిరమ్మ ఆదివారం ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి శ్రీలక్ష్మిని రోజూ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి విచారణ పేరుతో సాయంత్రం వరకు అక్కడే ఉంచారు. ఈ తరుణంలో పోలీస్స్టేషన్లో గురువారం ఆమె కుప్పకూలారు. ఆత్మకూరు వైద్యశాలకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతున్నారు. కాగా తాము వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో కక్షగట్టి తమను దెబ్బతీసేందుకు కొందరు టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని భర్త వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఇలాంటి రాజకీయాలను మానుకోవాలని, మహిళ అని చూడకుండా పోలీస్స్టేషన్ చుట్టూ తిప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పోలీస్స్టేషన్లో కుప్పకూలిన మహిళ టీడీపీ నేతల ప్రోద్బలంతోనేనని భర్త ఆరోపణ -
పిల్లాపేరును చెరిపేస్తున్నారు
ఉదయగిరి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పచ్చ నేతలు చెలరేగిపోతున్నారు. సహజ వనరులను కొల్లగొడుతూ జేబులు నింపుకొంటున్నారు. పిల్లాపేరులోని ఇసుకను రేయింబవళ్లూ ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ ఊడ్చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలను ఉపయోగించి ఇసుక తవ్వకాలు చేపట్టి రూ.లక్షల్లో ఆర్జిస్తున్నారు. అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో పడి కళ్ల ముందే జరుగుతున్న ఇసుక అక్రమ తరలింపును పట్టించుకోవడం లేదు. దీంతో పిల్లాపేరు పరీవాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా సాగు కొండాపురం, వింజమూరు, దుత్తలూరు, వరికుంటపాడు, ఉదయగిరి, సీతారామపురం మండలాల పరిధిలో పిల్లాపేరు సుమారు 50 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. వర్షాకాలంలో నీటి ప్రవాహంతో ఇసుక మేట పడుతుంది. దీంతో భూగర్భ జలాలు పెరిగి సమీప ప్రాంతాల్లోని రైతులు వివిధ పంటలను సాగు చేస్తారు. అయితే ఏడాది కాలంగా పచ్చ నేతలు ఇక్కడ నిత్యం యంత్రాలను ఉపయోగించి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా కొల్లగొడుతూ.. ఉదయగిరి, వింజమూరు, దుత్తలూరు, పామూరు ప్రాంతాలకు పిల్లాపేరు నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. దూరం బట్టి ఒక్కో ట్రాక్టర్కు రూ.1500 నుంచి రూ.3500 వరకు బాడుగ వసూలు చేస్తున్నారు. మరోవైపు పేదలు తమ ఇళ్ల నిర్మాణం కోసం ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, ఆటోలను ఉపయోగించి కూలీల ద్వారా ఇసుకను లోడ్ చేయించి అవసరాలను తీర్చుకోవచ్చనే జీఓను ప్రభుత్వం జారీ చేసింది. అయితే అధికార పార్టీ నేతలు తమ ట్రాక్టర్లను ఉపయోగించి ఇసుకను రవాణా చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇలా.. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇసుక అవసరమైతే సచివాలయం వద్ద తమ వివరాలను నమోదు చేసుకొని పర్మిట్ పొంది రవాణా చేసుకునే అవకాశం ఉండేది. దీంతో అక్రమ రవాణాకు అవకాశం లేదు. అయితే ఇప్పడా విధానాన్ని తొలగించడంతో రాజకీయ పలుకుబడి ఉన్నవారికే ఇసుక వెళ్తోంది. పేదలు అఽధిక ధరలను చెల్లించాల్సి వస్తోంది. ఇసుక ఉచితమని పేరుకు చెప్తున్నా, ఎక్కడా అది అమలుకు నోచుకోవడంలేదు. నిబంధనలను ఉల్లంఘించి యంత్రాలతో ఇసుక తవ్వకాలు అడుగంటుతున్న భూగర్భ జలాలు పట్టించుకోని అధికార యంత్రాంగం -
‘ఆక్వా’ ఎగుమతుల ప్రోత్సాహానికి చర్యలు
నెల్లూరు రూరల్: జిల్లాలో ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించేలా తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గురువారం నిర్వహించిన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా 973 దరఖాస్తులు రాగా, 856ను ఆమోదించామని చెప్పారు. పెండింగ్లో ఉన్న మిగిలిన వాటిని రానున్న సమావేశంలోపు ఆమోదించాలని సూచించారు. వాణిజ్య పన్నులు, కార్మిక, లీగల్ మెట్రాలజీ తదితర శాఖల వద్ద ఉన్న కేసులను సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఆయా కంపెనీలకు అవసరమైన మానవ వనరులకు అవసరమైన శిక్షణను ఇప్పించేలా.. సీఎస్సార్ నిధులను వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. పరిశ్రమలకు అవసరమైన భూసేకరణను సత్వరమే పూర్తి చేయాలని చెప్పారు. జిల్లా పరిశ్రమల శాఖ అధికారి మారుతిప్రసాద్, ఏపీఐఐసీ అధికారి శివకుమార్, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీపూజ తదితరులు పాల్గొన్నారు. కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేయాలి జిల్లాలో మత్స్యకారులు, పాడి రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు గానూ కిసాన్ క్రెడిట్ కార్డులను విరివిగా అందజేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకర్లను సమన్వయం చేసుకొని ఐదు వేలకుపైగా కిసాన్ క్రెడిట్ కార్డులను వారంలోపు అందజేయాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించేందుకు రుణాలను అందజేయాలని కోరారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమ క్రమబద్ధీకరణ ద్వారా రెడీ టు ఈట్, రెడీ టు కుక్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలన్నారు. అనంతరం వార్షిక రుణ ప్రణాళిక బుక్లెట్ను ఆవిష్కరించారు. ఎల్డీఎం మణిశేఖర్, నాబార్డు డీడీఎం బాబు, పశుసంవర్థక, మత్స్యశాఖ జేడీలు రమేష్నాయక్, నాగేశ్వరరావు, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, జిల్లా ఉద్యానాధికారి సుబ్బారెడ్డి, మెప్మా పీడీ లీలారాణి, విద్యుత్ శాఖ ఎస్ఈ విజయన్ తదితరులు పాల్గొన్నారు. -
బెడిసి కొట్టిన టీడీపీ దొంగల కట్టు కథ
కోవూరు: కోవూరు మండలం జమ్మిపాళెంలో మోటార్ చోరీ, రోడ్డు ప్రమాదానికి సంబంధించి టీడీపీ దొంగల కట్టు కథలు బెడిసి కొట్టాయి. ఆదివారం రాత్రి పడుగుపాడుకు చెందిన టీడీపీ కార్యకర్తలు ప్రసాద్, మణి, శ్రీహరి, శ్రీనివాసులు కలిసి టాటా ఏస్ వాహనంలో జమ్మిపాళెంలోని జగనన్న కాలనీలో తాగునీటి పథకానికి ఏర్పాటు చేసిన మోటార్లను చోరీ చేసి పరారయ్యే ప్రయత్నంలో రోడ్డు ప్రమాదానికి కారణమై ఓ యువకుడి దుర్మరణానికి బాధ్యులైన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన జరిగిన నిమిషాల్లోనే నిందితులను కాపాడేందుకు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఇందుకూరుపేటకు చెందిన ఓ ముఖ్య నేత సూచనలతో కోవూరుకు చెందిన టీడీపీ నేతలు పోలీస్స్టేషన్ ముందు వాలిపోయారు. నిందితులపై ఏ కేసు కట్టకుండా ఒక రోజంతా పోలీసులపై ఒత్తిడి తెచ్చారు.ప్రమాద ఘటనపై బంధువుల విమర్శలతో..ఈ ప్రమాదంలో నెల్లూరులోని ఓ షాపింగ్ మాల్లో క్యాషియర్గా పనిచేస్తున్న జమ్మిపాళెంకు చెందిన సుధీర్బాబు దుర్మరణం చెందాడు. అయితే ప్రమాదానికి కారణమైన నిందితులు ఘటనా స్థలంలోనే తప్పించుకునే ప్రయత్నం చేశారు. సుధీర్బాబు డ్యూటీ ముగించుకుని స్వగ్రామం జమ్మిపాళెం వెళ్తున్న సమయంలో అతని బంధువులు ఓ ఫంక్షన్కు వెళ్లి వెళ్తున్నారు. వీరిని క్రాస్ చేసి సుధీర్బాబు ముందుగా వెళ్లిపోయాడు. అయితే నిందితులు అదే గ్రామ సమీపంలోని జగనన్న కాలనీలో తాగునీటి మోటార్లు చోరీ చేసి స్థానికుల కంట పడడంతో వాహనంతో సహా పారిపోయే ప్రయత్నంలో మితిమీరిన వేగంతో వస్తూ ఎదురుగా బైక్పై వస్తున్న సుధీర్బాబును ఢీకొన్నారు. దీంతో సుధీర్బాబు రోడ్డుపై పడిపోవడంతో నిందితులు ఆగి అతన్ని పరిశీలిస్తున్నారు. ఇంతలోనే వెనుకనే వచ్చిన అతని బంధువులు వచ్చి చూసి అడగడంతో ముందు వెళ్లిన ఏదో వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందని, తాము ఆగి చూస్తున్నామంటూ బుకాయించారు. దీంతో వారి బంధువులు సుధీర్బాబు మమ్మల్ని క్రాస్ చేసి కొన్ని క్షణాలు ముందే వచ్చాడు. మాకు ఎదురుగా ఏ వాహనం రాలేదు. మీరే ఢీకొట్టి నాటకాలు ఆడుతున్నారంటూ నిలదీయడంతో వారి నుంచి తప్పించుకుని పరారయ్యారు.ఈ ఘటన తర్వాత కోవూరుకు చెందిన టీడీపీ నేతలు పోలీస్స్టేషన్కు చేరుకుని కేసు నమోదు కాకుండా ప్రైవేట్ పంచాయితీ నడిపారు. బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు ఇస్తామని బేరం పెట్టారు. అయితే బాధిత కుటుంబ బంధువులు రూ.30 లక్షల డిమాండ్ చేశారు. చివరకు టీడీపీ నేతలు రూ.5 లక్షల వరకు ఇపిస్తామని బేరసారాలు చేశారు. అయితే ఈ పంచాయితీ తెగకపోవడంతో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారు. దొంగతనం కేసు అయితే నమోదు చేయలేదు. నిందితులు మొదట చోరీ చేసి, ఆ తర్వాత రోడ్డు ప్రమాదానికి కారణమైనట్లు మీడియాల్లో కథనాలు రావడంతో పోలీసులు చోరీ కేసు కట్టడం గమనార్హం.ఎవరికి వారు టీడీపీ నేతలు సైలెంట్రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడి దుర్మరణానికి కారణమైన నిందితులు టీడీపీ వర్గీయులు కావడంతో షాడో ఎమ్మెల్యే ప్రోద్బలంతో కోవూరుకు చెందిన టీడీపీ నేతలు నిమిషాల వ్యవధిలోనే పోలీస్స్టేషన్ ముందు వాలిపోయారు. అయితే టీడీపీ నేతలు దొంగల ముఠాకు, రోడ్డు ప్రమాదానికి కారణమైన నిందితులకు కొమ్మ కాస్తున్నారని ప్రచారం జరగడంతో ఎవరికి వారు సైలెంట్ అయిపోయారు.తండ్రిని కోల్పోయిన బిడ్డలను ఆదుకోవాలిటీడీపీకి చెందిన దొంగల ముఠా చేసిన రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన సుధీర్బాబు బిడ్డల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. తల్లి గృహిణిగా ఉండగా, నాన్నమ్మ అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తుండగా అరకొర వేతనం వస్తోంది. ఆమె కూడా మరో రెండు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత ఆ కుటుంబం బతుకుదెరువు పరిస్థితి ఏమిటని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ చిన్నారులను ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.రైతు పొలంలో మోటార్లు అంటూ..రోడ్డు ప్రమాదానికి కారణమై పట్టుబడిన వాహనంలో చోరీ చేసిన మోటారు ఉండడంతో మరో కట్టుకథ అల్లారు. జమ్మిపాళెం సమీపంలో ఓ రైతు పొలాన్ని కౌలుకు తీసుకుని వేరుశనగ సాగు చేస్తున్నామని, మోటారు రిపేరు కావడంతో తీసుకెళ్తున్నామంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. సదరు రైతును అదే విషయాన్ని చెప్పాలని ఒత్తిడి చేశారు. వాస్తవానికి నిందితులు జగనన్న కాలనీలోని తాగునీటి పథకం మోటారు చోరీ చేయడం, దీనికి సంబంధించి సమాచారం ఉండడంతో టీడీపీ నేతలు చెప్పినట్లు చెబితే చివరకు తన మెడకు చుట్టుకుంటుందని భావించిన సదరు రైతు అసలు విషయాన్ని పోలీసులకు చెప్పేశాడు. ఈ క్రమంలో పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ శాఖ ఏఈ ఏకాంబరం కోవూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై మంగళవారం రాత్రి ఎట్టకేలకు చోరీ కేసు కూడా నమోదు చేశారు. -
సర్వేపల్లి మాఫియాల అడ్డా
సర్వేపల్లి.. సహజ వనరుల సంపద దోపిడీ మాఫియాలకు అడ్డాగా మారింది. అధికారం చేజిక్కించుకున్నప్పటి నుంచి ఏడాది కాలంగా విరామం లేకుండా ఇసుక, మట్టి, గ్రావెల్ తవ్వకాలతో జిల్లాలోనే చరిత్ర సృష్టిస్తున్న ముఖ్య నేత కనుసన్నల్లో తాజాగా వైట్ క్వార్ట్ ్జ తవ్వకాలను గిన్నిస్ రికార్డు స్థాయిలో చేపడుతున్నారు.పొదలకూరు, వెంకటాచలంలో విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నా.. అధికారయంత్రాంగం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. అక్రమంగా మైనింగ్, గ్రావెల్ తవ్వకాలు చేశారంటూ చేయని నేరాలకు మాజీమంత్రి కాకాణిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లోపెట్టించి పైశాచికానందం పొందుతున్న టీడీపీ నేతలు వీరు సాగిస్తున్న ప్రకృతి సంపద దోపిడీకి ఎంత కాలం జైల్లో పెట్టాలని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.సాక్షి టాస్క్ఫార్స్: సర్వేపల్లి ముఖ్యనేత నిత్యం మాట్లాడేవి నీతులు.. చేసేవి అవినీతి పనులు అన్నట్లుగా ఉంది. నియోజకవర్గాన్ని ఇసుక, మట్టి, గ్రావెల్ మాఫియాలకు అడ్డాగా మార్చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయా సహజ వనరుల దోపిడీలో అధికార పార్టీ నేతలు ఒక ఉద్యమంగా సాగిస్తున్నారు. పొదలకూరు, వెంకటాచలం మండలాల్లో ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అక్రమంగా గ్రావెల్, మట్టిని తవ్వేసి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్క గ్రావెల్ మాఫియా రూ.కోట్ల గ్రావెల్ దందా సాగిస్తోందంటే ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా.. మైనింగ్, రెవెన్యూ అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యనేత కనుసన్నల్లో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. అడ్డుకునేందుకు ప్రయత్నించే వారిపై అక్రమ కేసుల పేరుతో భయపెడుతుండడంతో కనీసం ఫిర్యాదులు చేసేందుకు ముందుకు రావడం లేదు.నిత్యం వందల ట్రిప్పుల తరలింపుసర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరు, వెంకటాచలంలో నిత్యం నిరంతరాయంగా వందల ట్రిప్పుల గ్రావెల్ను తరలిస్తున్నారు. ఒక్కో ట్రిప్పు డిమాండ్ను బట్టి రూ.5 వేల నుంచి రూ.10 వేలు కూడా వసూలు చేస్తున్నారు. ముత్తుకూరు మండలంలో చేపడుతున్న సాగరమాల ప్రాజెక్ట్కు గ్రావెల్ అవసరం కావడంతో కొన్ని నెలలుగా వెంకటాచలం, పొదలకూరు మండలాల నుంచి నిత్యం సుమారు 200 ట్రిప్పులకుపైగానే గ్రావెల్ను తరలిస్తున్నారు. జోరు వర్షం కురిస్తే తప్పించి మిగిలిన రోజుల్లో పట్టపగలే యంత్రాలతో టిప్పర్లు పెట్టి గ్రావెల్, మట్టిని దోచుకుంటున్నారు. ప్రధానంగా వెంకటాచలం మండలం నాగబొట్లకండ్రిక గ్రామం నుంచి గ్రావెల్ తరలిస్తున్నారు.తాటిపర్తిలో 130 ఎకరాల్లో..పొదలకూరు మండలం తాటిపర్తి పంచాయతీ బత్తులపల్లిపాటు గ్రామంలో సర్వే నంబరు 26లో సుమారు 130 ఎకరాల ప్రభుత్వ, మేతపొరంబోకు భూములు ఉన్నాయి. తాటిపర్తికు చెందిన టీడీపీ నేతలు ఆ భూముల్లో రేయింబవళ్లు గ్రావెల్ను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. యథేచ్ఛగా యంత్రాలను ఉపయోగించి పెద్ద గోతులను చేసి గ్రావెల్ను నెల్లూరుతోపాటు చుట్టు పక్కల లేఅవుట్లకు తరలిస్తున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు ప్రశ్నిస్తే అధికారం పార్టీలో ఉన్నాము.. చూసీచూడనట్లు పోవాల్సిందేనని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ నుంచి నిత్యం 100 ట్రిప్పుల వరకు తరలిస్తున్నట్లు సమాచారం. గ్రావెల్ దోపిడీపై అడిగే వారిపై అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరింపులకు దిగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. గతంలో ఈ పంచాయతీలో ఇంటి అవసరాల కోసం సామాన్యులు రెండు ట్రాక్టర్లు గ్రావెల్ తోలుకుంటే పోలీసులకు పట్టించి కేసులు పెట్టించారు. ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని చెలరేగిపోతున్నారు.వైఎస్సార్సీపీ హయాంలో ఏ తప్పు లేకపోయినా..గతంలో వైఎస్సార్సీపీ పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ నేత కూడా సహజ వనరుల అక్రమ దందాలకు పాల్పడలేదు. అయినా తాటిపర్తి పంచాయతీలో రుస్తుం మైన్లో అక్రమంగా మైనింగ్ చేయించారంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించారు. బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు తాజాగా సర్వేపల్లి రిజర్వాయర్లో అక్రమంగా గ్రావెల్ తవ్వారని మరో కేసు నమోదు చేయించారు. ఆ కేసుకు సంబంధించి కాకాణిని పోలీసు కస్టడీకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వాస్తవంగా సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమంగా గ్రావెల్, మట్టి, మైనింగ్ జరిగి ఉంటే అధికార పార్టీ సదరు ముఖ్య నేత వీరంగం చేసేవారు. ట్రాక్టర్ గ్రావెల్ తరలించినా.. తట్టెడు మట్టి తవ్వినా మైనింగ్ శాఖ అనుమతుల మేరకే తవ్వడంతో ఎక్కడా అక్రమ దందాలు చేసినట్లు ఆధారాలు లేకపోవడంతో మౌనంగా ఉండిపోయారు. అధికారం రాగానే అక్రమాలు జరగకపోయినా.. అక్రమాలు చేశారంటూ ఊదరగొట్టుతున్నారు.చెప్పేవి నీతులు.. చేసేవి అవినీతి పనులుగతంలో ప్రతిపక్షంలో ఉండీ అక్రమంగా గ్రావెల్ తరలిస్తుండడంతో పోలీసులు అడ్డుకుని వాహనాలను స్టేషన్కు తరలిస్తే.. సదరు ముఖ్య నేత సాగించిన హడావుడి అంతాఇంతా కాదు. నిత్యం మీడియా ముందుకు వచ్చి తానేదో సత్యహరిశ్చంద్రుడు వారసుడైనట్లు.. నీతులు మాట్లాడుతుంటారు. కానీ చేసేవన్నీ అవినీతి పనులే. సదరు నేత అధికారం దక్కిన ఏడాది కాలంగా ఇసుక, మట్టి, గ్రావెల్, బూడిద, మద్యం, పేకాట, డైమండ్ డబ్బా వంటి మాఫియాలను బహిరంగంగా నడిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యనేత మండలానికొక నేతను పెట్టుకుని ఏడాది కాలంలో రూ.వందల కోట్లు కొల్లగొట్టినట్లు అధికార పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఆ ముఖ్య నేత అక్రమాలను ఏడాది కాలంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పక్కా ఆధారాలతో మీడియా సమావేశాల్లో బట్టబయలు చేస్తూ వచ్చారు. దీన్ని జీర్ణించుకోలేక కాకాణిపై తప్పుడు కేసులు పెట్టించి జైల్లో కూర్చొబెట్టి తన అవినీతి, అక్రమాలను విచ్చలవిడిగా సాగిస్తున్నారు. -
పెన్నా కాలుష్యంపై అధికారుల పరిశీలన
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలోని జొన్నవాడ వద్ద పవిత్ర నది జలాలు కలుషితమవుతున్న విషయమై స్థానికుడు మధు ఎన్జీటీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎన్జీటీ బృందం, ఏపీ పొల్యూషన్ బోర్డు అధికారులు, స్థానిక అధికారులు బుధవారం పరిశీలన చేశారు. నెల్లూరు ఆర్డీఓ అనూష మాట్లాడుతూ ఎన్జీటీ బృందం నదిలో మురుగునీరు కలుస్తున్న మూడు ప్రదేశాలను గుర్తించి వాటర్ శాంపిల్స్ సేకరించామని, వాటిని ల్యాబ్కు పంపించడం జరుగుతుందన్నారు. రిపోర్టు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామనిన్నారు. ఎన్జీటీ చైన్నె రీజినల్ డైరెక్టర్ వరలక్ష్మి, కాలుష్య నియంత్రణ మండలి అధికారి అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు.29న చెస్ ఓపెన్ టోర్నమెంట్నెల్లూరు(స్టోన్హౌస్పేట): నెల్లూరు జిల్లా అండర్–15 చెస్ చాంపియన్షిప్ పోటీలు ఈ నెల 29వ తేదీ రాంజీనగర్లోని రోయ చెస్ అకాడమీలో ఓపెన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 29వ తేదీ ఉదయం 9 గంటల నుంచి పోటీలు ప్రారంభమవుతాయని, 2010 జనవరిలో జన్మించిన వారు మాత్రమే అర్హులని తెలిపారు. క్రీడాకారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ ఈ నెల 27గా నిర్ణయించినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 9603345326 నంబరుకు ఫోన్ చేసి సమాచారం పొందాలన్నారు.జాతీయ లోక్అదాలత్, విచారణ ఖైదీలపై సమీక్షనెల్లూరు (లీగల్): జూలై 5న జరిగే జాతీయ లోక్ అదాలత్, విక్టిమ్ కాంపెన్జేషన్ స్కీం అమలు, విచారణ ఖైదీల సమస్యలు తదితర సమస్యలపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా అధికారుల కోఆర్డినేషన్ కమిటీ సమావేశం బుధవారం జిల్లా కోర్టులో జరిగింది. జిల్లా అధికారుల సూచనలు, సలహాలపై కో ఆర్డినేషన్ కమిటీలో చర్చించారు. కలెక్టర్ ఆనంద్, ఏఎస్పీ సౌజన్య, కార్పొరేషన్ కమిషనర్ నందన్, తిరుపతి డీఆర్ఓ నరసింహులు, నెల్లూరు కేంద్ర కారాగార సూపరింటెండెంట్ సన్యాసిరావు, జీజీహెచ్ ఇన్చార్జి సూపరింటెండెంట్ మస్తానయ్య, ఫారెస్ట్, ఎకై ్సజ్, ఎలక్ట్రిసిటీ, బ్యాంకు మేనేజర్లు, చిట్ ఫండ్స్ కంపెనీ మేనేజర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు జడ్జిలు, ప్యానల్ లాయర్స్ తదితరులు పాల్గొన్నారు. -
మౌలిక వసతుల కల్పనే ఐటీడీఏ ప్రథమ కర్తవ్యం
నెల్లూరు రూరల్: జిల్లాలో ఆధార్, రేషన్ కార్డులు లేని గిరిజనులకు వచ్చే ఆగస్టు 15 లోపు వాటిని అందిస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. మారుమూల పల్లెల్లో తాగు, సాగునీరు, మౌలిక వసతుల కల్పన ఐటీడీఏ ప్రథమ కర్తవ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో గిరిజనాభివృద్ధికి గతే డాది రూ.1,300 కోట్ల నిధులు వ్యయం చేశామన్నారు.ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం ద్వారా 206 రోడ్లకు రూ.550 కోట్ల నిధులు వ్యయం చేశామన్నారు. కావలి, తిరుపతి జిల్లా కేవీపల్లి గురుకుల పాఠశాలల అభివృద్ధికి దాదాపు రూ.18 కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలోని ప్రతి అంగన్వాడీలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.లక్ష నిధులు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలోని 6,800 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చడంతో ప్రత్యేక టీచర్, ఆయాలను నియమిస్తున్నామన్నారు. అనంతరం మంత్రి కలెక్టర్తో కలిసి గిరిజన సంక్షేమ విద్యార్థులకు కాస్మోటిక్ కిట్లు, అంగన్వాడీ సిబ్బందికి స్టడీ మెటీరియల్, సామగ్రిని అందజేశారు. అనంతరం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన బాలిక చెంచమ్మను పరామర్శించి, రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్, ఐటీడీఏ పీఓ మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో జిల్లా నేతలు
మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన వైఎస్సార్సీపీ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో జిల్లా నేతలు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తూమాటి మాధవరావు, మేరిగ మురళి, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, బుర్రా మధుసూదన్రావు, మేకపాటి విక్రమ్రెడ్డి, నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, ఆనం విజయకుమార్రెడ్డి తదితరులు హాజరయ్యారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో పదవులు నెల్లూరు(స్టోన్హౌస్పేట): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు నాయకులకు రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమిస్తున్నట్లు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర ఆర్టీఐ వింగ్ జనరల్ సెక్రటరీగా దువ్వూరు మధుసూదన్రెడ్డి (గూడూరు నియోజకవర్గం), కార్యదర్శులుగా పూనూరు మనోహర్రెడ్డి (ఆత్మకూరు నియోజకవర్గం), ముమ్మారెడ్డి రవీంద్రరెడ్డి (సూళ్లూరుపేట నియోజకవర్గం), పి.సదానందరెడ్డి (వెంకటగిరి నియోజకవర్గం), రాష్ట్ర మైనారిటీ సెల్ అధికార ప్రతినిధిగా ఎండీ మగ్దుమ్ మొహిద్దీన్ (గూడూరు నియోజకవర్గం)లను నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సమస్యల పరిష్కారానికి ఆందోళన బాట
ప్రభుత్వ తీరుకు నిరసనగా ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. సమస్యలు పరిష్కరించాలంటూ బుధవారం గ్రామ రెవెన్యూ సహాయకులు, సచివాలయ సర్వేయర్లు కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేశారు. నెల్లూరు(అర్బన్): గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ)కు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, అలాగే ఇతర సమస్యలు పరిష్కరించాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పలువురు వీఆర్ఏలు ఽఆందోళన నిర్వహించారు. బుధవారం నెల్లూరులోని వీఆర్సీ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం ధర్నా జరిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కటారి అజయ్కుమార్ మాట్లాడుతూ వీఆర్ఏలు రెవెన్యూ శాఖలో అతి తక్కువ వేతనంతో పని చేస్తున్నట్లు చెప్పారు. సెలవులు లేకుండా ఫుల్టైమ్ పనిచేస్తున్నా పార్ట్టైమ్ పేరుతో గౌరవ వేతనం ఇచ్చి సరిపెట్టడం దుర్మార్గమన్నారు. వీఆర్ఏల్లో దాదాపు 90 శాతానికి పైగా దళితులు, గిరిజనులు, ఇతర బలహీనవర్గాల వారేనన్నారు. ప్రస్తుతం ఇస్తున్న ఒక్క డీఏను కూడా ఆపేయడం సిగ్గు చేటన్నారు. కూటమి ప్రభుత్వం స్పందించి తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న విధంగా టైమ్ స్కేల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. జిల్లాలో ఇంటర్వ్యూ చేసి ఆపేసిన 32 మందికి వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. అనంతరం కలెక్టరేట్ ఏఓ విజయకుమార్కి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లచ్చయ్య, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దుర్గయ్య, భాస్కర్, సుబ్బయ్య, అంకయ్య, అమీర్, ఓబులేసు, షమీం, శీను, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ సర్వేయర్ల పెన్డౌన్నెల్లూరు రూరల్: సమస్యలపై వినతిపత్రాలు సమర్పించినా పరిష్కారం చూపకపోవడంతో పెన్డౌన్ చేసి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని సచివాలయ సర్వే ఉద్యోగులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ సర్వేయర్ల సంఘం రాష్ట్ర కార్యవర్గ ఆదేశాల మేరకు రాష్ట్రాధ్యక్షుడు ఎస్.గోపాలకృష్ణ, జిల్లా అధ్యక్షుడు బీద లక్ష్మణానంద, వర్కింగ్ ప్రెసిడెంట్ అంకయ్య ఆధ్వర్యంలో ఉద్యోగులు నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ప్లకార్డులు చేతపట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదోన్నతులు కల్పించి బదిలీలు చేపట్టాలన్నారు. రేషనలైజేషన్ ప్రక్రియను సీనియారిటీ ప్రతిపాదికన చేయాలన్నారు. ఫారెస్ట్లో, ముళ్లపొదల్లోకి వెళ్లి సర్వే చేస్తే రిస్క్ అలవెన్స్ ఇవ్వాలన్నారు. గ్రామస్థాయి ఉద్యోగులకు సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రొబెషనరీ డిక్లేర్ కాకుండా ఇప్పటి వరకు రూ.15 వేల జీతంతో పనిచేస్తున్న ఉద్యోగులను తక్షణం రెగ్యులర్ చేయాలన్నారు. రాష్ట్ర కార్యవర్గ సూచనల మేరకు సర్వేయర్లందరూ 27వ తేదీ వరకు మాస్ క్యాజువల్ సెలవు పెట్టారన్నారు. మిగిలిన రెండు రోజులు విజయవాడలో జరిగే రిలే నిరాహారదీక్షలకు హాజరవుతామని తెలియజేశారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తల్ని వేధించొద్దు
● కక్ష తీరకుంటే నాపై కేసులు పెట్టండి ● కాకాణి పూజితపొదలకూరు: సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు తమను అధికార పార్టీ వారు వేధింపులకు గురిచేయడంతోపాటు అక్రమ కేసులు పెడుతున్నట్టు వెల్లడిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి కుమార్తె కాకాణి పూజిత అన్నారు. బుధవారం ఆమె పొదలకూరు విఘ్నేశ్వరాలయం, శివాలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. సంగంరోడ్డు సెంటర్లో ఉన్న తన తాత రమణారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ గోవర్ధన్రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు పీటీ వారెంట్లు పెట్టి జైల్లోనే ఉంచాలని చూస్తున్నారని, ఇందుకోసం అమాయకులైన పార్టీ నాయకులు, కార్యకర్తలను కూడా విడవకుండా కేసులు బనాయిస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ కక్షలుంటే తనపై కేసులు పెట్టుకోవాలని ఎలాంటి సంబంధం లేని కార్యకర్తల జోలికి మాత్రం వెళ్లొద్దన్నారు. తమను నమ్ముకున్న వారిని వేధింపులకు గురిచేస్తే అండగా నిలబడి ఎంత దూరమైన వెళతామన్నారు. గోవర్ధన్రెడ్డి చేసిన అభివృద్ధి పనులు మీరు చేస్తే ప్రజలు ఆదరిస్తారని కేసులు పెట్టుకుంటూ పోతే అధికారం శాశ్వతంగా కాదన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వేణుంబాక చంద్రశేఖర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు తెనాలి నిర్మలమ్మ, మాజీ సొసైటీ చైర్మన్ గోగిరెడ్డి గోపాల్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, మాజీ ఎంపీపీ కోనం చినబ్రహ్మయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ రత్నమ్మ, ఐటీ వింగ్ అధ్యక్షుడు రావుల ఇంద్రసేన్గౌడ్, ఎంపీటీసీలు జి.లక్ష్మీకల్యాణీ, జి.శ్రీనివాసులు, ఎస్కే అంజాద్, కేతు రామిరెడ్డి, నాయకులు బొడ్డు మాలకొండారెడ్డి, పి.అశోక్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అక్కా.. నేను చనిపోతున్నా..
● ఆత్మహత్యకు ముందు వీడియోకాల్ చేసిన తమ్ముడు నెల్లూరు సిటీ: చనిపోతున్నానంటూ అక్కకు తమ్ముడు వీడియోకాల్ చేసి బలవన్మరణానికి పాల్పడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు కథనం మేరకు.. రూరల్లోని కొండ్లపూడి టిడ్కో గృహంలో వి.శ్రీహరి (25) నివాసముంటున్నాడు. ప్లంబిగ్ వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పుల్లో కూరుకుపోయాడు. దీంతో కొంత కాలంగా శ్రీహరి కారు డ్రైవర్గా వెళ్తున్నాడు. అప్పుల బాధను తాళలేక ఆత్మహత్య చేసుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో బుధవారం తన అక్కకు వీడియోకాల్ చేసి బతకాలని లేదని, చనిపోతానని చెప్పాడు. ఆందోళనకు గురైన ఆమె తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. అతను ఇంటికి చేరుకుని తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లగా శ్రీహరి అప్పటికే ఫ్యాన్కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే కిందకు దించి చూడగా చనిపోయి ఉన్నాడు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.కారును తప్పించబోయి..● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి దుత్తలూరు : ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి పక్కనే ఉన్న రాళ్లగుట్టపై పడటంతో తీవ్ర గాయాలై ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని వెంగనపాళెం – తిమ్మాపురం రోడ్డు మార్గంలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు బుధవారం వివరాలు వెల్లడించారు. వెంగనపాళేనికి చెందిన పోలుబోయిన శ్రీనివాసులు (55) మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలోని గొర్రెల మంద వద్దకు మోటార్బైక్పై బయలుదేరాడు. తిమ్మాపురం వైపు పొలాల్లోకి వెళుతుండగా ఎదురుగా వచ్చిన కారును తప్పించబోయాడు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పడంతో పక్కనే ఉన్న రాళ్లగుట్టపై పడ్డాడు. ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని హుటాహుటిన వింజమూరు వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆదిలక్ష్మి తెలిపారు. కండలేరులో 34.433 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 34.433 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 2,580, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 70, హైలెవల్ కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
నేర నియంత్రణే లక్ష్యం
● ఎస్పీ కృష్ణకాంత్ నెల్లూరు సిటీ: నేర నియంత్రణే లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ కృష్ణకాంత్ సూచించారు. నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని బుధవారం ఎస్పీ నిర్వహించారు. దీనిని ఏపీ ఎస్పీ బెటాలియన్స్ ఐజీ బి.రాజకుమారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కృష్ణకాంత్ డ్రోన్లు, సీసీ కెమెరాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో నేర పరిశోధనను వేగవంతం చేయాలన్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా పురోగతి సాధించిందని అభినందించారు. పోలీస్స్టేషన్లో నమోదయ్యే కేసుల వివరాలను సీసీటీఎన్ఎస్లో ఎప్పటికప్పుడు పొందుపరచాలన్నారు. పెండింగ్ కేసులు తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారులు కృషి చేయాలన్నారు. స్టేషన్ పరిధిల్లో మిస్సింగ్ కేసులు ఛేదనకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ సీహెచ్ సౌజన్య, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్బీ, రూరల్, కావలి, ఆత్మకూరు, కందుకూరు, మహిళా పీఎస్, ఏఆర్ డీస్పీలు, అన్ని సర్కిళ్ల ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
వారిపై కఠిన చర్యలు తీసుకోండి
● జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ నెల్లూరు(పొగతోట): మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అన్నారు. అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఇందుకూరుపేట మండలానికి చెందిన బాలికను చైర్పర్సన్ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెల్ఫోన్ దొంగతనం చేసిందనే అనుమానంతో బాలికను చిత్రహింసలకు గురి చేయడం హేయమైన చర్య అన్నారు. మనం ఏ సమాజంలో ఉన్నామని ప్రశ్నించారు. అధునాతన టెక్నాలజీతో ముందుకెళ్తుంటే కొందరు మూఢనమ్మకాలు పాటిస్తున్నారన్నారు. ప్రజల్లో పూర్తిస్థాయిలో చైతన్యం రావాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీస్ అధికారులను కోరారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్, సీడీపీఓలు లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. -
ఆగిన నిధులు..నత్తనడకన పనులు
ఉదయగిరి: గ్రామాల్లో చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘గ్రామ కొలను’ పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జాతీయ ఉపాధి హామీ నిధులతో మండలానికి ఒకటి చొప్పున చెరువును ఎంపిక చేసి పనులు ప్రారంభించారు. మొత్తం 37 మండలాల్లో 37 చెరువులతోపాటు కొన్ని మండలాల్లో అదనంగా మరో 10 చెరువుల అభివృద్ధికి నిధులు కేటాయించారు. దీంతో వేగంగా పనులు జరిగాయి. అయితే కూటమి ప్రభుత్వం కొలువుదీరాక పథకం పేరును ‘గ్రామ పుష్కరిణి’గా మార్చింది. కానీ జరిగిన పనులకు బిల్లులు ఇవ్వలేదు. కొత్తగా పనులు చేపట్టలేదు. నేపథ్యం ఇదీ 2022లో అప్పుటి వైఎస్పార్సీపీ ప్రభుత్వం గ్రామ కొలనుకు శ్రీకారం చుట్టింది. అప్పటి కలెక్టర్ చక్రధర్బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లాలో 45 చెరువులను ఎంపిక చేశారు. వీటి అభివృద్ధి కోసం రూ.64.37 కోట్లకు పరిపాలనా అనుమతులు కూడా ఇచ్చారు. సుమారు 50 శాతం చెరువుల పనులు ప్రారంభించారు. కొన్నిచోట్ల తుదిదశకు చేరుకున్నాయి. ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అఽధికారం చేపట్టి ఏడాది అయినా చేసిన పనులకు బిల్లులు ఇవ్వలేదు. దీంతో కాంట్రాక్టర్లు తీవ్ర నష్టపోయారు. మొదలు కానీ పనులను రద్దు చేశారు. గత ప్రభుత్వంలో ‘గ్రామ కొలను’కు శ్రీకారం వేగంగా జరిగిన పనులు బిల్లులు నిలిపి వేసిన కూటమి ప్రభుత్వం గ్రామ పుష్కరిణిగా పేరు మార్చి చేతులు దులుపుకొన్న వైనం ఆగిపోయిన చెరువుల అభివృద్ధినిధుల సమస్య ఉంది జిల్లాలో 45 చెరువులను ఆధునికీకరించేందుకు గుర్తించాం. వీటిలో గత ప్రభుత్వంలో కొన్ని పనులు చేశారు. వాటికి కూడా ఇంత వరకు బిల్లులు రాలేదు. ప్రస్తుతం నిధుల సమస్య ఉంది. నిధులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేస్తాం. – దేశ్ నాయక్, ఎస్ఈ, ఇరిగేషన్ -
హామీలు నెరవేర్చడంలో కూటమి విఫలం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఎన్నికల హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు అన్నారు. నెల్లూరులోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో బుధవారం నెల్లూరు ప్రాంత కార్యకర్తల వర్క్షాప్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి నాయకులు సంబరాలు చేసుకునే బదులు ఆత్మ పరిశీలన చేసుకుంటే భవిష్యత్కు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గతంలో స్మార్ట్ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తే ధ్వంసం చేయాలని చెప్పిన చంద్రబాబు, లోకేశ్లు నేడు రాష్ట్రంలో అదానీకి మేలు చేకూర్చేలా వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్, సర్వేసల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిలు గతంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ కోర్టులో కేసులు కూడా వేశారని గుర్తు చేశారు. అమరావతి పేరుతో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను నిలిపి వేయాలన్నారు. కార్యక్రమంలో నేతలు మూలం రమేష్, మోహన్రావు, మాదాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
భర్త తీరు వల్లే భార్య ఆత్మహత్య
ఆత్మకూరు: పట్టణానికి చెందిన గొట్ల ప్రణవి (24) అనే వివాహిత భర్త తీరు వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు. కాగా ప్రణవి భర్త, టీడీపీ నాయకుడు, దేవరాయపల్లి గ్రామ ఉప సర్పంచ్ అయిన గొట్ల మస్తానయ్య, అతడితో అక్రమ సంబంధం కొనసాగించిన మహిళను అరెస్ట్ చేయాలంటూ మృతురాలి సోదరుడు, సమీప బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని ఆస్పత్రి గేటు వద్ద నిలిపి వారిని అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు. ఎస్సైలు, పోలీసులు శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మస్తానయ్య తన ప్రియురాలితో కలిసి ఉండగా వీడియో కాల్ ద్వారా భార్య ప్రణవికి చూపుతూ మానసికంగా హింసించాడని బంధువులు ఆరోపించారు. ఆ సమయంలో భర్త చూస్తుండగానే ప్రణవి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు. అయితే మస్తానయ్య ఏమీ తెలియనట్టు తన నివాసం పక్కనున్న వారికి ఫోన్లు చేశాడని, ప్రణవి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, చూసి చెప్పాలంటూ నటించాడన్నారు. కేసు నమోదు విషయంలో ఎలాంటి సంబంధం లేని మృతురాలి అత్త, ఆడపడచుల పేర్లను నమోదు చేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుల ప్రమేయంతో మస్తానయ్యను అరెస్ట్ చేయలేదన్నారు. పోలీసులు వారికి సర్దిచెప్పి పంపారు. బలవన్మరణం కేసులో బంధువుల ఆరోపణ భర్త వీడియోకాల్లో ఉండగానే ఉరేసుకున్నట్లు వెల్లడి అతను టీడీపీ నేత, ఉప సర్పంచ్ -
ఉపాధి పనులు వద్దని..
ఆత్మకూరు: పెన్నానదిలో ఇసుక రీచ్లను జూన్ 1వ తేదీ నుంచి రెండు నెలల పాటు మూసివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలిచ్చిన విషయం తెలిసిందే. అయినా ఎక్కడా ఈ ఆదేశాలు అమలు చేయడం లేదు. మిగతా చోట్ల పగలు ఇసుక తవ్వకాలు ఆపేసి రాత్రి పూట చాటుమాటుగా చేపడుతుంటే.. ఆత్మకూరు మండలంలోని అప్పారావుపాళెం వద్ద పెన్నానది ఇసుక రీచ్ రాత్రింబవళ్లు విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రీచ్లను మూసివేయకపోవడంతో ‘సాక్షి’లో వచ్చిన కథనానికి స్పందించిన ఆర్డీఓ బి.పావని ఆదేశాలతో తహసీల్దారు రీచ్ని మూయించి వేశారు. కేవలం రెండు రోజులు మాత్రమే మూసేసిన ఈ రీచ్లో శనివారం నుంచి యథేచ్ఛగా ట్రాక్టర్ల ద్వారా ఆత్మకూరు, పొదలకూరు, చేజర్ల మండలాలకు తరలిస్తున్నారు. అధికారుల ఆదేశాలతో ఓ వీఆర్ఓను అక్కడ కాపలా ఉంచి రీచ్లోకి వెళ్లకుండా తాళం సైతం వేశారు. అయితే టీడీపీ నాయకుల ప్రమేయంతో స్థానికులు తాళాలు పగులగొట్టి వీఆర్ఓను అక్కడి నుంచి పంపివేసి దౌర్జన్యంగా ఇసుకను తరలిస్తున్నారు. రీచ్లోకి వాహనాలు వెళ్లకుండా జేసీబీతో లోతుగా గాడి తీయాలని అధికారులు పంపగా స్థానికులు అడ్డుకొని రీచ్లోకి దారికి గండి కొట్టకుండా ఆ వాహనాన్ని వెనక్కి పంపివేశారు. విలేకరులకు బెదిరింపులు ప్రభుత్వం మాదే.. ఇసుక రీచ్లో పెత్తనమంతా మాదేనంటూ స్థానిక టీడీపీ నేతలు కొందరు యువకులను చేరదీసి ఇసుక రీచ్లో హవా కొనసాగిస్తున్నారు. గ్రామంలో యంత్రాల ద్వారా ఇసుక లోడ్ చేయడం లేదని కేవలం మనుషులే ఉపాధి కోసం ఇసుక లోడ్ చేస్తున్నారని చెబుతూ, తమకు ప్రత్యేకమైన అనుమతి ఉందని పేర్కొనడం గమనార్హం. ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా తీవ్ర పరిణామాలు ఉంటాయని విలేకరులను సైతం ఇష్టారాజ్యంగా వార్తలు రాస్తే సహించేది లేదని ఫోన్ల ద్వారా బెదిరిస్తున్నారు. స్థానిక టీడీపీ నేతల అండ చూసుకుని యువకులు సైతం కథనాలు రాసిన వారిపై కేసు నమోదు చేయాలని ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. గ్రామంలోకి వస్తే విలేకరుల అంతు చూస్తామని వారు బాహాటంగానే అంటున్నారంటే అక్కడి పరిస్థితి అర్థమవుతుంది. శనివారం నుంచి పూర్తిస్థాయిలో ఇసుకను తరలిస్తున్న ఈ రీచ్లో సుమారు 50 నుంచి 70కిపైగా ట్రాక్టర్లు లోడ్ చేసుకొని యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇసుక లోడింగ్ ద్వారా ఉపాధి పొందుతూ కుటుంబాలను పోషించుకుంటున్న వారికి ప్రత్యామ్నాయంగా ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించేందుకు అధికారులను మూడు రోజుల క్రితం గ్రామానికి పంపించారు. అందరికీ జాబ్కార్డులు ఇచ్చి పనులను కల్పించాలని ఉపాధి కోల్పోకుండా చూడాలని ఆదేశించారు. దీంతో ఉపాధి హామీ పథకం సిబ్బంది గ్రామానికి వెళ్లారు. అయితే అక్కడ ఓ వర్గం ఉపాధి పనులు మాకు వద్దని ఇన్నాళ్లు గ్రామానికి ఎందుకు రాలేదని ఇప్పుడెందుకు వచ్చారని వారిని దుర్భాషలాడి తరిమేశారు. గతంలోనూ ఉపాధి పనులు చేసుకోవాలని తాము సూచించామని, ఇసుక రీచ్ ఉందని ఎప్పుడు ఈ పనులు ఉంటాయని, ఉపాధి పనులు అవసరం లేదని గ్రామస్తులు చెప్పడాన్ని ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది గుర్తు చేశారు. కాలనీలోని కొందరు టీడీపీ నాయకుల అండతో ఇసుక రీచ్నే పరమావధిగా చేసుకొని అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. -
ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలు చెప్పండి
● పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నెల్లూరు (వీఆర్సీసెంటర్): రాష్ట్రంలో తాను పాదయాత్ర చేయడం ముఖ్యం కాదని, ప్రజల వద్దకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని, ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీయాలని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి ఆమె మంగళవారం నగరానికి విచ్చేశారు. నగరంలోని పీఎస్ఆర్ కల్యాణ మండపం నుంచి ర్యాలీగా బయలుదేరిన ఆమె గాంధీబొమ్మ సెంటర్లోని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇందిరాభవన్లో నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పలువురు నాయకులు ఆమెను రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని కోరారు. దీంతో ఆమె తన పాదయాత్ర ముఖ్యం కాదని, రాష్ట్రంలో సూపర్సిక్స్ పథకాల అమల్లో ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని సూచించారు. పక్కనే ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, రానున్న కాలంలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్రజల నమ్మకాన్ని సంపాదించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ఇన్చార్జి గోపాల్రెడ్డి, ఓబీసీ సెల్ అధ్యక్షుడు నాగరాజు, కిసాన్ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్, కమాలాకర్, డీసీసీ అధ్యక్షుడు దేవకుమార్రెడ్డి, నగర అధ్యక్షుడు కిరణ్కుమార్రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు బాలసుధాకర్, డాక్టర్ యశోధర, సంజయ్, నియోజకవర్గాల సమన్వయకర్తలు, నాయకులు తదితరులు పాల్గాన్నారు. -
15.5 కిలోల గంజాయి స్వాధీనం
కావలి (జలదంకి): నెల్లూరు, కావలి, గూడూరు రైల్వేస్టేషన్ల పరిధిలో సోమవారం మధ్యాహ్నం చేపట్టిన తనిఖీల్లో 15.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు నెల్లూరు రైల్వే సీఐ ఎ.సుధాకర్ మంగళవారం తెలిపారు. తమిళనాడు తిరుచ్చిరాపల్లికి చెందిన తవామణి, బిహార్కు చెందిన సూరజ్కుమార్ గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించి పట్టుకుని కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో గంజాయి రవాణాదారులను పట్టుకున్న నెల్లూరు రైల్వే సీఐ హరిచందన, నెల్లూరు డీఎస్ఆర్పీ మురళీధర్, కావలి జీఆర్ప్పీ సబ్ ఇన్స్పెక్టర్ రమాదేవిని అభినందించారు. -
పురావస్తుశాఖ అధికారుల పరిశీలన
ఉదయగిరి: ఉదయగిరిలోని రాయల కాలం నాటి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న పలు కట్టడాలను మంగళవారం పురావస్తు, ఆర్కియాలజీ శాఖల అధికారులు పరిశీలించారు. శిథిలమవుతున్న పలు కట్టడాలకు ఏ విధంగా రక్షణ కల్పించాలనే అంశంపై స్థానికులతో చర్చించారు. ప్రాముఖ్యత ఉన్న దేవాలయాలను పురావస్తు శాఖ నుంచి దేవదాయశాఖకు మార్పు చేయాలని కోరారు. ఇందుకు అధికారులు స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. ఆర్కియాలజీ సూపరింటెండెంట్ ఇన్స్పెక్టర్ పీఎన్ భాయి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఎం.సాంబశివకుమార్, అసిస్టెంట్ ఇంజినీర్ ప్రవీణ్కుమార్, ఒంగోలు పురావస్తు శాఖ అధికారి యశ్వంత్రెడ్డి, తదితరులున్నారు. కూలీల సంఖ్య పెంచండి నెల్లూరు (పొగతోట): ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్యను రోజుకు లక్షకు తగ్గకుండా పెంచాలని డ్వామా పీడీ గంగాభవాని అధికారులను ఆదేశించారు. మంగళవారం డ్వామా కార్యాలయం ఏపీఓలు, ఈసీలు, టీఏలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో పీడీ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో పనులను గుర్తించి కూలీలకు పనిదినాలు కల్పించాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధి నిధులతో గతంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర నిర్మాణాలు చేపట్టారన్నారు. అందుకు సంబంధించి పాత బకాయిలు రూ.50 కోట్ల బిల్లులు చెల్లించామన్నారు. మిగిలిన బిల్లులు త్వరలో చెల్లిస్తామని తెలిపారు. పంట కుంటల లక్ష్యాలను పూర్తి చేయాలని తెలిపారు. నేడు మంత్రి సంధ్యారాణి పర్యటన నెల్లూరు రూరల్: రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి బుధవారం నెల్లూరులో పర్యటించనున్నట్లు కలెక్టర్ ఓ ఆనంద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు నెల్లూరుకు చేరుకుని మధ్యాహ్నం ఒంటి గంట వరకు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో మహిళా,శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖల సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. 2 గంటల నుంచి 2:30 వరకు అధికారులో మాట్లాడుతారు. 2:30 గంటలకు విలేకరుల సమావేశం అనంతరం తిరిగి రోడ్డు మార్గంలో విజయవాడకు వెళ్తారని పేర్కొన్నారు. సాగునీటి కాలువల ఆక్రమణల పరిశీలన ● లోకాయుక్త ఆదేశాలతో ఆత్మకూరు: ఆత్మకూరు చెరువు పరిధిలో పలు సాగునీటి కాలువల ఆక్రమణలను మంగళవారం ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ వరప్రసాద్, తిరుపతి, నెల్లూరు ఎస్ఈ దేశ్నాయక్, ఆత్మకూరు ఈఈ ఎం.రవి, ఏఈ రవికుమార్రెడ్డి, తహసీల్దారు పద్మజాకుమారి తదితరుల బృందం పరిశీలించింది. సాగునీటి కాలువలు ఆక్రమణలకు గురయ్యాయని లోకాయుక్తకు ఫిర్యాదులు వెళ్లాయి. లోకాయుక్త ఆదేశాల మేరకు పట్టణంలోని స్పార్క్ సిటీ ప్రాంతం నుంచి చెరువు వరకు ఉన్న కాలువలను, అలుగులను, సోమశిల రోడ్డు మలుపు వద్ద కాలువను ఆక్రమించి నిర్మించిన భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా చీఫ్ ఇంజినీరు వరప్రసాద్ మాట్లాడుతూ చెరువు నుంచి పొలాలకు వెళ్లే సాగునీటి కాలువలు పలుచోట్ల ఆక్రమణలకు గురైనట్లు గుర్తించామన్నారు. దీంతో పైర్లకు సాగు నీరందక రైతులు పడుతున్న ఇబ్బందులపై పూర్తి వివరాలను లోకాయుక్తకు నివేదిక అందజేస్తామన్నారు. వారి ఆదేశానుసారం తదుపరి చర్యలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ సిబ్బంది కొండయ్య, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. -
40 బ్యాచ్లతో ఇసుక లోడింగ్
ఇక్కడి ఇసుక రీచ్లో ఒక్కో బ్యాచ్కు 8 నుంచి 10 మంది చొప్పున లోడర్లు ఉన్నారు. మొత్తం 40 బ్యాచ్లు ట్రాక్టర్లకు ఇసుక లోడింగ్ చేస్తున్నారు. ఈ ఇసుక లోడ్ చేసే బ్యాచ్ల వద్ద స్థానిక టీడీపీ నాయకుల ఆదేశాలతో ఓ కుటుంబం ఒక్కో బ్యాచ్ వద్ద రూ.50 వసూలు చేస్తున్నారు. ఇందుకు ట్రాక్టర్లకు చీటీలు ఇచ్చి ఆ మేరకు బ్యాచ్లకు లోడింగ్ పనులు కల్పిస్తున్నారు. పట్టించుకోని అధికారులు జిల్లా వ్యాప్తంగా ఇసుక రీచ్లను ప్రభుత్వ ఆదేశాలతో మూసి వేసినా అప్పారావుపాళెంలో ఇసుక రీచ్ రెండు రోజుల పాటు నిలిపివేసినా తిరిగి కొనసాగించడంపై అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. నిత్యం పదుల కొద్ది వాహనాలకు ఇసుకను లోడ్ చేసి రెండు, మూడు మండలాలకు తరలిస్తున్నారు. ఆయా శాఖల అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ పద్మజాకుమారిని సంప్రదించగా గత వారంలో ఆర్డీఓ ఆదేశాల మేరకు రీచ్ను క్లోజ్ చేయించాం. అక్కడ వీఆర్ఓను కాపలా ఉంచాం. రీచ్లోకి వాహనాలు వెళ్లకుండా లోతుగా గాడి తీయిస్తాం. ఈ విషయాలను ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపడతామని తెలిపారు. -
పెన్నా కలుషితంపై నేడు కలెక్టర్ విచారణ
● ఎన్జీటీకి ఫిర్యాదు చేసిన జొన్నవాడ వాసి బుచ్చిరెడ్డిపాళెం రూరల్: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం జొన్నవాడ కామాక్షితాయి ఆలయ పరిసరాల్లోని పవిత్ర పినాకిని నది మురుగు జలాలతో కలుషితం కావడంపై కలెక్టర్ ఆనంద్ బుధవారం విచారణ చేపట్టనున్నారు. పెన్నానది కలుషితమవుతోందని జొన్నవాడకు చెందిన సింగిరి మధు అనే వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు గత నెలలో ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా జొన్నవాడలోని మలికార్జున సమేత కామాక్షితాయి ఆలయానికి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు పెన్నానదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తుంటారని, అలాంటి పవిత్ర తీరంలో గ్రామానికి చెందిన మురుగునీరు నదిలోకి వదిలేయడంతో కలుషితమవుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన ఎన్జీటీ చైన్నెలోని సౌత్జోన్ బెంచ్కు బదిలీ చేసింది. ట్రిబ్యునల్ ప్రిన్సిపల్ బెంచ్కు చెందిన జస్టిస్ అరుణ్కుమార్ త్యాగి, డాక్టర్ అప్రోజ్ అహ్మద్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జలవనరుల, పర్యావరణ, అడవులు, వాతావరణ మార్పుల విభాగం కార్యదర్శులు, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శితోపాటు కలెక్టర్ను బాధ్యులుగా చేస్తూ గత నెల 29న ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్జీటీ ఆదేశాల మేరకు కలెక్టర్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు బుధవారం జొన్నవాడ ఆలయ పరిసరాల్లో విచారణ చేపట్టనున్నారు. నదీ జలాలు కాలుష్యం, చెత్త తదితర వస్తువులు నదిలో కలవడంపై సమగ్ర విచారణ జరిపి నివేదికను ఎన్జీటి చైన్నె బెంచ్కు అందించనున్నారు. ఆగస్టు 8న ఎన్జీటీ బాధ్యులుగా గుర్తించిన సభ్యులందరూ బెంచ్ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంది. -
క్రస్ట్గేట్ల మరమ్మతుల్లో తీవ్ర జాప్యం
సోమశిల: జిల్లా జలనిధి సోమశిల జలాశయం క్రస్ట్గేట్ల మరమ్మతుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. జలాశయ 11, 12 క్రస్ట్ గేట్ల రోప్లు పూర్తిస్థాయిలో దెబ్బతినడంతో వాటికి మరమ్మతుల కోసం దాదాపు 20 రోజుల క్రితం నూతన రోప్లను ప్రాజెక్టు వద్దకు చేర్చారు. అయితే వాటిని అక్కడ నిరుపయోగంగా పడేశారు. ఈ క్రమంలో 4, 6 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని డెల్టాకు విడుదల చేయడంతో ఆప్రాన్ మీదుగా వాహనాలు అనుమతించకపోవడంతో సోమశిల, రాజుపాళెం, కమ్మవారిపల్లి, కలువాయి, పీకేపాడు గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు సుదూరం తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సంబంధిత జలాశయం అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే క్రస్ట్ గేట్లకు కొత్త రోప్లు ఏర్పాటు చేసే పనులు చేపట్టాలని స్థానిక గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.30 సన్నవి : రూ.20 పండ్లు : రూ.8 కుటుంబ కలహాలతో.. ● వివాహిత బలవన్మరణం ఆత్మకూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆత్మకూరు హిల్రోడ్డులో మంగళవారం జరిగింది. ఎస్సైలు ఎస్కే జిలానీ, బి.సాయిప్రసాద్ల కథనం మేరకు.. గొట్ల హజరత్తయ్య, ప్రణవి (24) దంపతులకు ఇద్దరు సంతానం. మరో మహిళతో హజరత్తయ్య సన్నిహితంగా ఉంటూ భార్యను నిర్లక్ష్యం చేశాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. తీవ్ర మనస్తాపానికి గురైన ప్రణవి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం తెలుసుకున్న ఎస్సైలు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
డీసీపల్లిలో 584 పొగాకు బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి వేలం కేంద్రంలో మంగళవారం 584 పొగాకు బేళ్లను విక్రయించినట్లు నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 1,007 బేళ్లు రాగా వాటిలో 584 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలియజేశారు. వేలంలో 73,783.2 కిలోల పొగాకును విక్రయించగా రూ.1,56,49,598ల వ్యాపారం జరిగింది. గరిష్ట ధర కిలో ఒక్కింటికి రూ.280 కాగా కనిష్ట ధర రూ.160 లభించింది. మొత్తం మీద సగటు ధర రూ.212.10గా నమోదైంది. వేలంలో తొమ్మిది కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. కిలో పొగాకు గరిష్ట ధర రూ.280 కలిగిరి: కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం కిలో పొగాకు గరిష్ట ధర రూ.280 లభించింది. జనరల్ క్లస్టర్కు చెందిన రైతులు 509 బేళ్లను అమ్మకానికి తీసుకురాగా 394 పొగాకు బేళ్ల కొనుగోలు జరిగింది. వివిధ కారణాలతో 115 బేళ్లను తిరస్కరించారు. ఈ సందర్భంగా వేలం నిర్వహణాధికారి శివకుమార్ మాట్లాడుతూ కిలో పొగాకు గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.160 పలుకగా, సరా సరి రూ.242.91 లభించిందన్నారు. వేలంలో 16 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. -
గిరిజన బాలికకు పరామర్శ
నెల్లూరు(అర్బన్): చిత్రహింసలకు గురై శరీరం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న ఇందుకూరుపేట మండలం కుడితిపాళేనికి చెందిన గిరిజన బాలిక చెంచమ్మను మంగళవారం నగరంలోని అపోలో ఆస్పత్రిలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు పడిత్యా శంకర్నాయక్ పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బాధితురాలికి అండగా నిలిచి రక్షణ కల్పించడంతోపాటు ఆ గిరిజన కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఇస్లావత్ హనుమంతనాయక్, దుర్గానాయక్, ప్రసన్నకుమార్, యాటగిరి సునీల్, శివ పాల్గొన్నారు. -
బీసీ సంక్షేమ హాస్టళ్లు పెంచాం
నెల్లూరు(స్టోన్హౌస్పేట): జిల్లాలో బీసీ సంక్షేమ హాస్టళ్లను పెంచామని జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారిణి వెంకటలక్ష్మమ్మ తెలిపారు. దుత్తలూరులో హాస్టల్ మూసివేతపై మంగళవారం ఆమె వివరాలు వెల్లడించారు. దుత్తలూరు, వరికుంటపాడుల్లో హాస్టల్ భవనాలు పిల్లలు ఉండేందుకు అనుకూలంగా లేవని, అనేక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండటంతో తాత్కాలికంగా ఆపేశామన్నారు. ప్రైవేట్ భవనాలను వెతుకుతున్నామని, దొరికిన వెంటనే హాస్టళ్లను పునఃప్రారంభిస్తామన్నారు. అలా కానీ పక్షంలో విద్యార్థులకు అనువైన చోట్ల ఈ ఏడాది చదువుకునే అవకాశం కల్పిస్తామన్నారు. గతేడాది విద్యార్థుల సంఖ్య తగ్గడంతో 14 హాస్టళ్లను మూసివేశామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఆత్మకూరు, సంగం, బుచ్చి, అక్కంపేట, వింజమూరు, కావలి, ఉదయగిరిలో ప్రీ మెట్రిక్ హాస్టళ్లను మళ్లీ ప్రారంభిస్తున్నామన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 230 మంది విద్యార్థులు కొత్తగా చేరారని, జూలై 15వ తేదీ వరకు అడ్మిషన్లు ఉంటాయన్నారు. -
తనువు చాలించి.. కన్నీళ్లు మిగిల్చి..
● వేర్వేరు చోట్ల ఇద్దరి ఆత్మహత్య నెల్లూరు సిటీ: యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం రూరల్ మండలంలో చోటు చేసుకుంది. రూరల్ పోలీసుల కథనం మేరకు.. ఆమంచర్ల పంచాయతీ మట్టెంపాడుకు చెందిన వి.మణికంఠ (20) పెయింటింగ్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి తల్లిదండ్రులు లేరు. ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. ఎవరూ లేకపోవడం, అప్పుల పాలుకావడంతో కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం తన ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమీప బంధువు వెళ్లి చూసి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒంటరితనం వేధించడంతో ఒకరు, వివిధ కారణాలతో మరొకరు మద్యానికి బానిసయ్యారు. ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలు నెల్లూరు రూరల్ మండలంలో జరిగాయి. ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.అల్లీపురంలో.. అల్లీపురంలోని టిడ్కో ఇంట్లో ఓ వ్యక్తి ఫ్యాన్కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కొండాపురం మండలంలోని వరికుంట గ్రామానికి చెందిన దార్ల వెంకటేష్ (34)కు కొన్నినెలల క్రితం వివాహమైంది. భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. వెంకటేష్ తల్లిదండ్రులతో ఉంటూ వ్యసనాలకు బానిసయ్యాడు. స్థానికంగా గొడవలకు వెళ్తుండేవాడు. రెండో పెళ్లి కోసం కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చాడు. నెల్లూరు నగరంలోని బంధువుల ఇంట్లో ఉంటూ బేల్దారి పనులకు వెళ్లాలని తల్లిదండ్రులు నచ్చజెప్పి పంపారు. ఈ క్రమంలో బంధువులు తమకు అల్లీపురంలో టిడ్కో ఇల్లు ఉందని అక్కడికి వెళ్లి ఉండాలని అతడిని పంపారు. కొంత కాలంగా అక్కడే ఉంటున్న వెంకటేష్ భార్య వదిలేయడం, ఇంట్లో వాళ్లు రెండో పెళ్లి చేయకపోవడంతో మనస్తాపానికి గురై మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. బంధువులు అతడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో టిడ్కో ఇంటికి వెళ్లారు. తలుపులు తట్టినా తెరవకపోవడంతో కిటికీలో నుంచి చూశారు. వెంకటేష్ చీరతో ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించాడు. వెంటనే బంధువులు రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా వారొచ్చి తలుపులు పగులకొట్టి మృతదేహాన్ని దించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉచితంగా ప్రవేశాలు
సంవత్సరం విద్యార్థులు 2022 – 23 48 2023 – 24 598 2024 – 25 902 2025 – 26 688నెల్లూరు(టౌన్): ప్రైవేట్ పాఠశాలల్లో ఆర్టీఈ కింద 25 శాతం మంది పేద విద్యార్థులకు ఒకటో తరగతి ఉచిత ప్రవేశం కల్పించేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిని గతంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేసిన దాఖలాల్లేవు. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలతో 2022 – 23 విద్యా సంవత్సరం నుంచి ఉచిత ప్రవేశాల అవకాశం దక్కింది. పేద విద్యార్థులకు సొంత గ్రామాల పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో పదో తరగతి వరకు ఉచితంగా విద్యను అందించాల్సి ఉంది. ఒక్కో విద్యార్థి గ్రామీణ ప్రాంతాల్లోని స్కూల్ అయితే రూ.6,500, పట్ణణ ప్రాంతాల్లో అయితే రూ.8,500 ప్రభుత్వమే చెల్లిస్తుంది. గత ప్రభుత్వంలో ఈ ప్రక్రియ ఇబ్బందుల్లేకుండా జరిగింది. అడ్మిషన్లు ఇవ్వం కూటమి ప్రభుత్వంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు లేనట్లే అనే ప్రచారం జరుగుతోంది. రెండేళ్లుగా ఉచిత ప్రవేశాలకు ఫీజులను చెల్లించలేదు. దీంతో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు గత విద్యా సంవత్సరం ఉచిత ప్రవేశాలు పొందిన పిల్లలను పాత ఫీజులు చెల్లిస్తేనే చేరండని లేకుంటే అడ్మిషన్లు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నాయి. పైగా బుక్స్, యూనిఫాం, అడ్మిషన్ తదితర ఫీజుల కింద రూ.13 వేల నుంచి రూ.18 వేల వరకూ వసూలు చేస్తున్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉచిత విద్యతోపాటు పుస్తకాలు, యూనిఫాం కూడా యాజమాన్యాలే ఇవ్వాలి. కానీ అలా జరగడం లేదు. ఉచిత ప్రవేశం పొందిన విద్యార్థుల్లో సగం మందికి పైగానే ఆయా పాఠశాలల్లో లేదా ఇతర వాటిల్లో సొంత ఫీజులు చెల్లించి చదువుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారుల నుంచి విద్యాశాఖాధికారుల వరకూ అందరికీ తెలిసినా జిల్లాలో మంత్రి నారాయణకు చెందిన పాఠశాలలు ఎక్కువగా ఉండటంతో మిన్నకుండి పోతున్నారనే ఆరోపణలున్నాయి. సాక్షాత్తు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.చర్యలు లేకపోవడంతో...చింతారెడ్డిపాళెం పంచాయతీ సౌత్రాజుపాళేనికి చెందిన ఎంబీటీ వినయ్కుమార్ కుమారుడు యువ యశ్వంత్కు 2024 – 25 విద్యా సంవత్సరంలో నెల్లూరులోని రామలింగాపురంలోని నారాయణ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశం లభించింది. అయితే సదరు యాజమాన్యం ఆ ఏడాది బుక్స్, యూనిఫాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పేరుతో రూ.11 వేలు తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం రెండో తరగతిలో చేరాలంటే నిబంధనలు పెట్టింది. 1వ తరగతి ఫీజు కింద రూ.13 వేలు, అలాగే రెండో తరగతికి బుక్స్, యూనిఫాంకు రూ.10 వేలు, అడ్మిషన్ ఫీజు కింద రూ.3,800 కలిపి మొత్తం రూ.26,800లు చెల్లిస్తేనే స్కూల్లో ఉంచుతామని ఖరాఖండిగా చెప్పింది. దీంతో చేసేదేమి లేక పాఠశాల ప్రారంభమైనా ఇంటి దగ్గర ఉన్నాడు. ఈ విషయంపై యశ్వంత్ తండ్రి వినయ్కుమార్ కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నాలుగుసార్లు ఫిర్యాదు చేశారు. ఇంకా మరో ముగ్గురు పిల్లల తల్లిదండ్రులు కూడా అదే నారాయణ పాఠశాల యాజమాన్యంపై వినతిపత్రం ఇచ్చారు. అయినా నేటికీ చర్యలు తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరించి చట్టాలను అమలు చేయాల్సిన నారాయణ వాటిని తుంగలో తొక్కి పైసా వసూళ్లే పరమావధిగా వ్యవహరించడమేమిటని విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నారాయణ స్కూల్స్ యాజమాన్య దారిలోనే మిగిలిన ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. విద్యాహక్కు చట్టానికి తూట్లు పేరుకే ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలు ఫీజులు చెల్లించకుంటే పిల్లలు రావొద్దని ఆదేశాలు సాక్షాత్తు మంత్రి నారాయణ స్కూల్లోనే ఘటన ఆ స్కూల్పై చర్యలు తీసుకునేందుకు అధికారుల వెనుకంజ స్కూల్ నిర్వాకంపై గ్రీవెన్స్లో నాలుగుసార్లు ఫిర్యాదుశిక్షకు అర్హులు విద్యాహక్కు చట్టంలో భాగంగా ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలి. ఏమైనా సమస్యలుంటే ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలే గానీ పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఉచిత సీట్ల విషయంలో సుప్రీంకోర్టు, పార్లమెంట్ కూడా ఆదేశాలు జారీ చేశాయి. ఫీజు చెల్లించలేదని విద్యార్థులను పాఠశాలలో చేర్చుకోకుంటే గుర్తింపు రద్దు, జైలు శిక్షకు అర్హులని చెప్పింది. – నరహరి, రాష్ట్రాధ్యక్షుడు, ది పేరెంట్స్ అసోసియేషన్ ఇబ్బంది పెట్టడం వాస్తవమే విద్యాహక్కు చట్టం ద్వారా ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలు కల్పించిన విద్యార్థుల విషయంలో ఇబ్బందులున్న మాట వాస్తవమే. ఈ సమస్య మా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పెండింగ్ ఫీజుల చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరిస్తాం. – బాలాజీరావు, డీఈఓ -
మహిళలపై అఘాయిత్యాలు సహించం
● రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ నెల్లూరు(పొగతోట): మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే వారు ఎటువంటి వారైనా, ఏ పార్టీకి చెందిన వ్యక్తులైనా కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ హెచ్చరించారు. మంగళవారం ఆమె నెల్లూరుకు వచ్చారు. పలువురు బాధితులను పరామర్శించారు. అనంతరం ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇందుకూరుపేట మండలంలో సెల్ఫోన్ చోరీ అనుమానంతో ఓ బాలికను చిత్రహింసలకు గురిచేసిన ఐదుగురిలో నలుగురిని గుర్తించి అరెస్ట్ చేశారన్నారు. కనుపర్తిపాడు ఘటనకు సంబంధించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. మహిళలను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా ఉపేక్షించేది లేదని, కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రతి జిల్లాలో వన్స్టాప్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, అక్కడ బాధితులకు అవసరమైన కౌన్సెలింగ్ ఇస్తారన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్, ఇందుకూరుపేట సీడీపీఓ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. -
పంట కాలువలో పడి.. యువకుడి మృతి
తోటపల్లిగూడూరు: పంట కాలువలో పడి ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని కొత్తపాళెం గ్రామంలో జరిగింది. ఎస్సై వీరేంద్రబాబు కథనం మేరకు.. బుచ్చిరెడ్డిపాళెం మండలం పంచేడు గ్రామానికి చెందిన పాటి అశోక్ (29) మోటార్ మెకానిక్గా జీవనం సాగిస్తున్నాడు. చెన్నకేశవ స్వామి తిరునాళ్ల సందర్భంగా కొత్తపాళెంలోని తన చెల్లెలు ఈదూరు అమూల్య ఇంటికి రెండు రోజుల క్రితం అశోక్ వచ్చాడు. సోమవారం రాత్రి ఆలయంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించిన అనంతరం అశోక్ బహిర్భూమి కోసం స్థానిక పంట కాలువ వద్దకు వెళ్లాడు. అక్కడ గుండెపోటు రావడంతో పంట కాలువలో పడి ఊపిరాడక మృతిచెందినట్లు చెబుతున్నారు. మంగళవారం ఉదయం గుర్తించిన స్థానికులు జరిగిన విషయం అశోక్ సోదరి, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కాలువలో నుంచి బయటకు తీయించి శవ పంచనామా నిర్వహించారు. అనంతరం శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని నెల్లూరు జీజీహెచ్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై తెలిపారు. -
గిరిజన బాలికకు నల్లపరెడ్డి పరామర్శ
● రూ.20 వేల ఆర్థిక సాయం అందజేత కోవూరు: ఇందుకూరుపేట మండలం కుడితిపాళెంలో చిత్రహింసలకు గురై శరీరం అంతా కాలిన గాయాలతో నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన బాలిక గంధళ్ల చెంచమ్మను మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి సోమవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరడంతోపాటు, బాధిత కుటుంబానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందించి వారికి ధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్రెడ్డి మాట్లాడుతూ చెంచమ్మపై జరిగిన దారుణం హృదయాన్ని కలిచి వేసింది. ప్రభుత్వం బాధితురాలికి అండగా నిలిచి రక్షణ కల్పించడంతోపాటు ఆమెకు న్యాయం జరగాలి. మెరుగైన వైద్యం అందించాలన్నారు. ప్రసన్న వెంట జొన్నవాడ దేవస్థానం చైర్మన్, ఇందుకూరుపేట మండల పార్టీ అధ్యక్షుడు మావులూరు శ్రీనివాసులురెడ్డి, ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ తదితరులున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్–బీ, సీ పోస్టులకు నోటిఫికేషన్ ● 5వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలి నెల్లూరు (టౌన్): కేంద్ర మంత్రిత్వశాఖ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న భారత ప్రభుత్వ సంస్థల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో గ్రూప్–బీ, గ్రూపు–సీ పోస్టులకు సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డీఈఓ బాలాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (సీబీటీ), కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ 2025 సంబంధించి వచ్చేనెల 4వ తేదీలోపు దరఖాస్తు అందజేయాలని, 5వ తేదీలోపు ఆన్లైన్లో ఫీజు చెల్లించాలన్నారు. పరీక్ష ఆగస్టు 13వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరగనున్నట్లు చెప్పారు. పరీక్షకు సంబంధించిన పోస్టుల వివరాలు, వయో పరిమితి, ఫీజు వివరాలు, దరఖాస్తు చేసే విధానం, ఇతర వివరాలు ssc. gov. in వెబ్సైట్లో ఉన్నట్లు పేర్కొన్నారు. విజయ డెయిరీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు నెల్లూరు (స్టోన్హౌస్పేట): నెల్లూరు విజయ డెయిరీలో పనిచేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతూ డెయిరీ పాలకమండలి సోమవారం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. వెంకటేశ్వరపురంలోని విజయ డెయిరీ కార్యాలయంలో చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి అధ్యక్షతన పాలక మండలి సమావేశం జరిగింది. ఎంతో కాలంగా ఈ ప్రతిపాదన పాలక మండలి వద్ద పెండింగ్లో ఉంది. ఈ నిర్ణయం తీసుకునే విషయంలో డెయిరీ ఆదాయ, ఖర్చులతోపాటు ఉద్యోగుల నియామకం, జీతభత్యాలు తదితర అంశాలపై కసరత్తు చేస్తోంది. తాజాగా జరిగిన సమావేశంలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల వరకు పెంచుతూ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తీసుకున్న నిర్ణయానికి పాలకమండలి సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. దీంతో ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. కాకాణితో ఎమ్మెల్సీలు ములాఖత్ వెంకటాచలం: కూటమి ప్రభుత్వం మోపిన అక్రమ కేసులతో జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్న మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితో ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి సోమ వారం ములాఖత్ అయ్యారు. కూటమి ప్రభుత్వ కుట్రలతోపాటు, జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించారు. -
కౌన్సెలింగ్లో ‘ప్రైవేట్’ ప్రలోభాలు
నెల్లూరు (టౌన్): పాలిసెట్ కౌన్సెలింగ్లో ప్రైవేట్ ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల ప్రతినిధులు ప్రలోభాలు మితిమీరాయి. వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 21వ తేదీ నుంచి కౌన్సెలింగ్ జరుగుతోది. ఈ కౌన్సెలింగ్ కేంద్రం ముందు ఆది, సోమవారాల్లో శ్రీవెంకటే శ్వర ఇంజినీరింగ్ కళాశాల, గీతాంజలి కళాశాల బస్సులు తీసుకువచ్చి ప్రచారం చేస్తున్నారు. ఈ బస్సులకు ఇరు వైపులా బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వారి ప్రతినిధులు నేరుగా కౌన్సెలింగ్ కేంద్రాల్లోకి వచ్చి తమ కళాశాలల్లో చేరితే మీకు గిఫ్ట్లతోపాటు ప్రయోజనాలు ఉంటాయని విద్యార్థులను ప్రలోభ పెడుతున్నారు. ఈ విషయం పాలిసెట్ కౌన్సెలింగ్ కన్వీనర్, అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. ప్రైవేట్ కళాశాలల ప్రతినిధులు, కౌన్సెలింగ్ అధికారుల మధ్య లోపాయికారి ఒప్పందాల కారణంగానే ఈ విధంగా బాహాటంగా ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా కౌన్సెలింగ్ కేంద్రం పరిసరాల్లోకి ప్రైవేట్ కళాశాలల వాహనాలకు అనుమతి లేదు. అయినా ఆయా కళాశాలల ప్రతినిధులు నేరుగా కౌన్సెలింగ్ కేంద్రంలోకి వచ్చి ప్రచారం చేయడం చూస్తే ఎంతగా బరి తెగించారో అర్థమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతుండగా ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మాత్రం సంఖ్య పెరుగుతుండడం గమనార్హం. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని కేంద్రంలో ప్రైవేట్ కళాశాలల ప్రతినిధులు ప్రచారాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. ఇదే తంతు కొనసాగితే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. -
బీసీ హాస్టల్ మూసివేత
దుత్తలూరు: పేద విద్యార్థులను చదువుకు దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గత విద్యా సంవత్సరం ప్రారంభంలోనే జిల్లాలో చాలా వసతి గృహాలను మూసివేసిన ప్రభుత్వం తాజాగా మరికొన్ని మూసివేతకు సిద్ధమైంది. పేద విద్యార్థులు వసతి పొందుతూ చదువుకునేందుకు దశాబ్దాల క్రితం గత ప్రభుత్వాలు వసతి గృహాలను ఏర్పాటు చేశాయి. అయితే కూటమి ప్రభుత్వం ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే దుత్తలూరులోని బీసీ బాలుర వసతిగృహాన్ని మూసివేసింది. ఈ వసతి గృహంలో మూడో తర గతి నుంచి 10వ తరగతి వరకు 44 మంది విద్యార్థులు వసతి పొందుతూ చదువుకుంటున్నారు. గతంలో ఇదే వసతి గృహంలో దాదాపు 150 మంది వరకు విద్యార్థులు ఉండేవారు. వసతి గృహాల్లోని విద్యార్థులకు నాణ్యమైన భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించకపోవడంతో చాలా మంది విద్యార్థులు చదువులకు స్వస్తి చెప్పి ఇళ్లకు వెళ్లి పోయి కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నా రు. తాజాగా విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాలల తెరిచిన సమయంలో ముందస్తు సమాచా రం ఇవ్వకుండానే దుత్తలూరులోని వసతి గృహాన్ని మూసివేశారు. హాస్టల్కు వచ్చిన పిల్లలు ఎక్కడికి వెళ్లాలి.. ఎక్కడ ఉండి చదువుకోవాలనే సందిగ్ధంలో తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు. ఇక్కడ వసతి గృహంపై కనీసం సమాచారం ఇచ్చేవారు కూడా లేకుండాపోయారు. హాస్టళ్లను ఎత్తివేసే దిశగానే ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుంటోందని పలువురు విమర్శిస్తున్నారు. దశాబ్దాలుగా నియోజకవర్గంలోనే ఎంతో పేరుగాంచిన ఈ బాలుర వసతిగృహాన్ని ఈ ఏడాది నుంచి ఎత్తివేయడంపై విద్యార్థు లు, తల్లిదండ్రుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ విషయమై కావలి అసిస్టెంట్ బీసీ సంక్షేమాధికారి వెంకటేశ్వర్లును వివరణ కోరగా హాస్టల్ భవనం పూర్తిగా శిథిలమైందని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హాస్టల్ను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. -
నిరుద్యోగ భృతి ఇవ్వాలంటూ కదంతొక్కిన యువత
● ఫీజు రీయింబర్స్మెంట్, ఫీజు రీయింబర్స్మెంట్, ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ తదితర హామీలపై కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో యువత గర్జించింది. హామీలను తుంగలో తొక్కిందంటూ యువతీ, యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు కదం తొక్కారు. గత ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలను ఊడగొట్టిందంటూ ప్రభుత్వ తీరుపై మండి పడ్డారు. కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. నెల్లూరు (అర్బన్)/ నెల్లూరు (స్టోన్హౌస్పేట): నిరుద్యోగ యువతను మోసం చేసిన కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ వైఎస్సార్సీపీ యువజన విభాగం పిలుపు మేరకు సోమవారం యువత కలెక్టరేట్ వద్దకు కదలి వచ్చింది. విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ప్రభుత్వ చేస్తున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్లకార్డులు చేతబట్టి ప్రభుత్వ వ్యతిరేక నినాదాల హోరుతో కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు. పాత జెడ్పీ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నగర నియోజకవర్గ ఇన్చార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. తొలుత బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున వినూత్నంగా రిక్షా తొక్కుతూ యువత పడుతున్న కష్టాలపై ప్రభుత్వ తీరును ఎత్తి చూపారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం కూటమి హామీలు అమలు చేయాలంటూ డీఆర్వో ఉదయభాస్కర్రావుకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఊటుకూరు నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు అలవిగాని హామీలిచ్చారని, అధికారం చేపట్టాక వాటిని తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి అధికారం చేపట్టి ఏడాదైనా ఒక్క ఉద్యోగం కల్పించలేదన్నారు. తనకు ఓటేస్తే వలంటీర్లకు ఇస్తున్న జీతాన్ని రూ.10 వేలకు పెంచుతానని నమ్మబలికి అధికారం రాగానే రాష్ట్రంలోని 2.50 లక్షల మంది వలంటీర్లను వీధుల పాల్జేశారన్నారు. గతంలో తమ పార్టీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో వివిధ రంగాల్లో వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు. ఇంటింటికీ రేషన్ పంపిణీ పేరుతో వందలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. మద్యం షాపులను ప్రభుత్వ పరం చేసి నిరుద్యోగ యువతకు అక్కడ అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు కల్పించారన్నారు. దేశమే గర్వించే రీతిలో సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి ఇంటి వద్దకే పౌర సేవలు అందించేందుకు వలంటీర్ల వ్యవస్థకు రూపకల్పన చేశారన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడంతో రాష్ట్రం పురోగమన దిశ నుంచి తిరోగమనం వైపు పరుగులు తీస్తుందన్నారు. కూటమి దాష్టీకాలు చూసి పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం లేదన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రారంభించిన పరిశ్రమల నిర్మాణాలు ఆగిపోయాయన్నారు. ఏడాది కాలంలో చదువుకున్న ఒక్క విద్యార్థికి ఉద్యోగం రాలేదన్నారు. పారిశ్రామిక రంగం కుప్పకూలిపోతే, ప్రధానమైన వ్యవసాయం రంగం కూడా నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు లేదన్నారు. మద్యాన్ని ఏరులై పారించడంతో శాంతిభద్రతలు పాతాళానికి దిగజారిపోయాయన్నారు. జిల్లాలోనే 100 మందికి పైగా అభాగ్య మహిళలు, చిన్నారులు అత్యాచారాలకు గురయ్యారన్నారు. అంగన్వాడీలకు, ఆశ కార్యకర్తలకు రేషన్కార్డులు రద్దు చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి ఏడాది కాలంలోనే ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబును నమ్మి నిలువునా మోసపోయామని ప్రజలు గ్రహించారన్నారు. మళ్లీ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు కసితో ఉన్నారన్నారు. ● యువజన విభాగం నాయకుడు, కార్పొరేటర్ వేలూరు మహేష్ మాట్లాడుతూ అలవి గాని హామీలివ్వడం వాటిని నీరుగార్చడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఆయన సీఎంగా కేవలం రూ.1000 మాత్రమే పింఛన్ పెంచి గొప్పలు చెప్పుకుంటున్నాడన్నారు. ఇప్పుడు పలువురు అర్హులకు కూడా పింఛన్ కోత పెట్టేందుకు శ్రీకారం చుడుతున్నాడని విమర్శించారు. ● వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్ మాట్లాడుతూ ప్రశ్నించే యువతపై రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందన్నారు. అయినా తమ పోరాటం ద్వారా ‘తల్లికి వందనం’ పథకం అమలు చేయించగలిగామన్నారు. సంవత్సరానికి ఒక్కొక్క నిరుద్యోగికి నిరుద్యోగభృతి కింద రూ.36 వేలు బాకీ ఉందన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం మెడలు వంచి యువతకు నిరుద్యోగ భృతి ఇచ్చేలా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందన్నారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని లోకేశ్ చెప్పారని, ఇప్పుడు ఆ ఊసే లేదన్నారు. ● రాష్ట్ర యువజవన విభాగం ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అంటేనే మోసం, జగన్అంటేనే నమ్మకం అన్నారు. కరోనా సమయంలో కూడా సంక్షేమ పథకాలు అందించిన గొప్ప వ్యక్తి జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రస్తుతం హామీలు గురించి ప్రశ్నించే వారి గొంతుకలను కూటమి ప్రభుత్వం నొక్కుతుందన్నారు. అయినా భయపడేది లేదన్నారు. మోసపోయిన విద్యార్థులు, యువత అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ● వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు అశ్రిత్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు. చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు సర్టిఫికెట్లు తీసుకోలేక అల్లాడుతున్నారన్నారు. ● కావలి నియోజకవర్గ యువజన విభాగం నేత చైతన్య మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టగానే 1.25 లక్షల ఉద్యోగాలు కల్పించారన్నారు. 2.50 లక్షల మందికి ఉపాధి చూపారన్నారు. చంద్రబాబు రాగానే ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నాడని విమర్శించారు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ అని చంద్రబాబు నిరూపించారన్నారు. ● వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల్లో 140కి పైగా హామీలిచ్చి ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ఏడాది 5 లక్షలు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికే 4 లక్షల మందికి ఉన్న ఉద్యోగాలు తొలగించిందని విమర్శించారు. ● కోవూరు వైఎస్సార్సీపీ నేత వీరి చలపతి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో రూ.1.40 లక్షల కోట్ల అప్పులు చేసిందన్నారు. ఆ డబ్బుతో ఒక్క చోట కూడా అభివృద్ధి పనులు చేయలేదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్కు రూ.2 వేల కోట్ల బకాయిలున్నాయన్నారు. యువజన, విద్యార్థి నాయకులు అన్వేష్, మల్లి, యోగి మాట్లాడారు. యువత పోరు ఉద్యమానికి తరలివచ్చిన యువతీ, యువకులకు వైఎస్సార్సీపీ మహిళా జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, జిల్లా అధ్యక్షురాలు కాకుటూరు లక్ష్మీసునంద, మైనార్టీ రాష్ట్ర నాయకులు ఖలీల్ తదితరులు సంఘీ భావం తెలిపారు. ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలెక్కడ అంటూ ప్రభుత్వాన్ని నిలదీత గత ప్రభుత్వం కల్పించిన ఉద్యోగాలు ఊడగొడుతోందని మండిపాటు పాత జెడ్పీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ, ధర్నా డీఆర్వో ఉదయభాస్కర్కు వినతి పత్రం అందజేత -
వ్యాన్ ఢీకొని యువకుడి దుర్మరణం
● జగనన్న కాలనీలో మోటార్ల చోరీకి వెళ్లిన దొంగల ముఠా ● స్థానికులు రావడంతో వ్యాన్లో పరారయ్యే క్రమంలో బైక్ను ఢీకొన్న దొంగలు ● దుండగులు టీడీపీ వర్గీయులు కావడంతో కాపాడే యత్నంకోవూరు: మండలంలోని జమ్మిపాళెంలో ఉన్న జగనన్న కాలనీలో సబ్మెర్సిబుల్ మోటార్ల చోరీకి వ్యాన్లో వెళ్లిన దొంగల ముఠా స్థానికులు రావడంతో వ్యాన్తోసహా పరారయ్యే క్రమంలో ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం అర్ధరాత్రి జమ్మిపాళెం సమీపంలో ఇటుకుల బట్టీ వద్ద జరిగింది. అయితే ఈ దొంగల ముఠా టీడీపీ వర్గీయులు కావడంతో వారిని కాపాడేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికుల సమాచారం మేరకు.. జమ్మిపాళేనికి చెందిన మర్లపాటి సుధీర్బాబు (32)కు భార్య ముత్యాలమ్మ, ముగ్గురు పిల్లలున్నారు. అతను నెల్లూరులోని ఓ షాపింగ్ మాల్లో క్యాషియర్గా పని చేస్తున్నాడు. ఆదివారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న క్రమంలో జమ్మిపాళెం మార్గంలో ఇటుకల బట్టీల వద్దకు వచ్చేసరికి అతడి బైక్ను పడుగుపాడు వైపు వస్తున్న టాటా ఏస్ వాహనం బలంగా ఢీకొంది. దీంతో సుధీర్బాబు తీవ్రగాయాలతో ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు కోవూరు ఎస్సై రంగనాథ్గౌడ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని కోవూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రూ.2 లక్షలిస్తామని బేరాలు ఈ ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్ ప్రసాద్తోపాటు మణి, శ్రీహరి, మరో వ్యక్తి పడుగుపాడుకు చెందిన టీడీపీ వర్గీయులు. వీరు ఇందుకూరుపేటకు చెందిన కోడూరు కమలాకర్రెడ్డికి ముఖ్య అనుచరులు. ప్రమాదం జరిగిన తర్వాత నిందితులు ఆగకుండా వ్యాన్తో సహా పరారయ్యారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక టీడీపీ ముఖ్య నేతలు కొందరు పోలీస్స్టేషన్ వద్దకు చేరుకుని పోలీసులపై ఒత్తిడి తేవడంతోపాటు ప్రైవేట్ పంచాయితీ పెట్టారు. బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు పరిహారంగా ఇస్తామని, కేసు లేకుండా చేయాలని ఒత్తిడి చేశారు. అయితే బాధిత కుటుంబం తరఫున మరో టీడీపీ నేత వచ్చి రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఈ పంచాయితీ సోమవారం రాత్రి వరకు తెగ లేదు. నిందితులు నలుగురూ స్థానిక టీడీపీ నేత ఇంట్లోనే ఉన్నట్లు సమాచారం. టీడీపీ నేతల దన్ను నిందితులు టీడీపీ వర్గీయులు కావడంతో వారిని కాపాడేందుకు ఆ పార్టీ ముఖ్య నేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే స్థాయిలో పోలీసులపై ఒత్తిడి చేయిస్తున్నారని సమాచారం. రోడ్డు ప్రమాదానికి కారణమైన నిందితులు జమ్మిపాళెం సమీపంలో ఉన్న జగనన్న కాలనీవాసుల దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన బోర్లలోని సబ్మెర్సిబుల్ మోటార్లను చోరీ చేసేందుకు టాటా ఏస్ వ్యాన్లో వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికులు గమనించి అక్కడికి రావడంతో దుండగులు వ్యాన్తోపాటు పరారయ్యే క్రమంలో స్థానికులు వారిని వెంబడించడంతో అతి వేగంగా వెళ్తూ ఎదురుగా బైక్పై వస్తున్న సుధీర్బాబును ఢీకొన్నట్లు స్థానికులు చెబుతున్నారు. నిండు ప్రాణాన్ని బలిగొన్న దొంగల ముఠా టీడీపీ వర్గీయులు అని తెలియడంతో ఆ పార్టీ నేతలు వారిని కాపాడే ప్రయత్నం చేయడాన్ని స్థానికులు అసహ్యించుకుంటున్నారు. జమ్మిపాళెంలో విషాదం అందరితో కలివిడిగా ఉండే సుధీర్బాబు చనిపోవడంతో స్థానికులు కంటతడి పెడుతున్నారు. అతని భార్య, ముగ్గురు బిడ్డలు అనాథలు అయ్యారంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు. సుధీర్బాబు తల్లి చెంచమ్మ అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తోంది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
వేధిస్తున్నారు.. రక్షణ కల్పించండి
నెల్లూరు(క్రైమ్): పెళ్లికి అంగీకరించలేదన్న అక్కసుతో సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ ఒకరు, కోర్కె తీర్చమని ఇంకొకరు, అసభ్యంగా ప్రవర్తిసూ మరొకరు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రక్షణ కల్పించాలని బాధిత మహిళలు, యువతులు కోరారు. సోమవారం నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఏఎస్పీ సీహెచ్ సౌజన్య బాధితులతో మాట్లాడి ఆయా ప్రాంత పోలీస్ అధికారులకు ఆదేశాలిచ్చారు. వేధింపులకు గురిచేస్తున్న వారిపై తక్షణమే కేసులు నమోదు చేయాలన్నారు. వివిధ సమస్యలపై 96 ఫిర్యాదులందాయి. కార్యక్రమంలో నగర, మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీలు పి.సింధుప్రియ, చెంచురామారావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసరెడ్డి, ఎస్బీ–2 ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● పెళ్లి చేసుకోవాలంటూ శశి అనే వ్యక్తి వేధిస్తున్నాడు. నేను నిరాకరించడంతో సోషల్ మీడియాలో నాపై అసభ్యకరమైన మెసేజ్లను బంధువులకు పంపిస్తున్నాడు. ఊర్లో, కళాశాల వద్ద అసత్య ప్రచారాలు చేస్తున్నాడు. అతడి బారి నుంచి రక్షణ కల్పించాలని ఉలవపాడుకు చెందిన ఓ యువతి కోరారు. ● నా కుమార్తెతో చింటూ, సుధీర్, జయకృష్ణ అనే వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈనెల 20వ తేదీన ఆమె ఫొటోలు తీసి ఇబ్బంది పెడుతున్నారని దుత్తలూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళ వినతిపత్రమిచ్చారు. ● కోర్కె తీర్చాలని, లేదంటే నా ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడతానని శివ అనే వ్యక్తి బెదిరిస్తున్నాడు. అతడిపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు రూరల్ మండలానికి చెందిన ఓ మహిళ విజ్ఞప్తి చేశారు. ● నా భార్య అదృశ్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంత వరకూ ఆమె జాడ తెలియరాలేదు. ఆచూకీ కనుక్కోవాలని బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఓ వ్యక్తి కోరాడు. -
వెల్లువలా వినతులు
నెల్లూరు రూరల్: నెల్లూరులోని కలెక్టరేట్లో ఉన్న తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జేసీ కార్తీక్, డీఆర్వో ఉదయభాస్కర్రావు, హౌసింగ్ పీడీ వేణుగోపాల్, సర్వే రికార్డుల ఏడీ నాగశేఖర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వివిధ సమస్యలపై జాప్యం లేకుండా వెంటనే సమస్యల్ని పరిష్కరించాలన్నారు. మొత్తం 399 అర్జీలను ప్రజలు అందజేశారు. వీటిలో ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించి 142, మున్సిపల్ శాఖవి 39, సర్వేవి 44, పంచాయతీరాజ్ శాఖవి 32, పోలీసు శాఖవి 39 తదితరాలున్నాయి. పేదల భూముల ఆక్రమణ నెల్లూరులోని వేదాయపాళెం చంద్రమౌళి నగర్లో సర్వే నంబర్ 78/2లో గతంలో పేదలకిచ్చిన ప్రభుత్వ భూమిని రిటైర్డ్ ఉద్యోగి పోగుల విజయసేన్ కుమార్ నకిలీ డాక్యుమెంట్లతో ఆక్రమించి బిల్డింగ్ నిర్మించి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడని, చర్యలు తీసుకోవాలని చేకూరి సురేష్ అనే వ్యక్తి వినతిపత్రమిచ్చాడు. ఈ విషయమై అనేకసార్లు నెల్లూరు రూరల్ తహసీల్దార్ కార్యాలయ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. నష్టాలు ఎదుర్కొంటున్నాం 40 ఏళ్లుగా కేబుల్ టీవీ వ్యాపారాన్ని జీవనోపాధిగా చేసుకున్నాం. ప్రస్తుతం వచ్చిన విప్లవాత్మక మార్పులతో ఎల్సీఓలు ఉనికి కోల్పోయి ఆర్థికంగా అనేక నష్టాలను ఎదుర్కొంటున్నాం. డిజిటలైజేషన్ తర్వాత కేబుల్ టీవీని ట్రాయ్ రెగ్యులేటరీ చట్టం కిందకు తీసుకువచ్చారు. దీంతో ప్రజలు అధిక చార్జీలను చెల్లించాల్సి వస్తోంది. చార్జీలు పెంచకుండా నిలుపుదల చేయాలి. అదే సమయంలో ఎల్సీఓలను కూడా ట్రాయ్ పరిధిలోకి తీసుకొచ్చి బ్రాడ్కాస్టర్లు, ఎంఎస్ఓలతోపాటు కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ వారిని కూడా భాగస్వాములను చేయాలి. – కేబుల్ టీవీ ఆపరేటర్లు -
సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి
నెల్లూరు(బారకాసు): మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) నెల్లూరు నగరపాలక సంస్థ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం బారాషహీద్ దర్గా గ్రౌండ్స్ నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం ప్రధాన గేటు వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నెల్లూరు నగర గౌరవాధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి కె.పెంచల నరసయ్య, మహిళా సంఘం జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్బీ మాట్లాడారు. దళితులు, గిరిజనులు, బలహీనవర్గాల పట్ల కూటమి ప్రభుత్వం వివక్షపూరిత ధోరణితో వ్యవహరించడం సరికాదన్నారు. బ్యాంక్ రుణాలు కోరితే మీరు ఉద్యోగులు కాదని, రోజువారి కూలీలని చెప్పిన పాలకులు, కా ర్మికులకు వర్తింపజేసే సంక్షేమ పథకాలు తీసివేయడానికి ప్రభుత్వ వెబ్సైట్లో ఉద్యోగులుగా చూపించడం విడ్డూరంగా ఉందన్నారు. 60 సంవత్సరాలు నిండాయనే నెపంతో ఏ రకమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా, నోటీసులు కూడా ఇవ్వకుండా 93 మంది కార్మికులను అన్యాయంగా తొలగించారన్నారు. మంచినీటి సరఫరా వీధిలైట్లు తదితర పనులు నిర్వహించే ఇంజినీరింగ్ విభాగంలోని కార్మికులకు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని తక్షణమే వారి జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ధర్నా వద్దకు విచ్చేసిన కమిషనర్ వైఓ నందన్కు నాయకులు, కార్మికులు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కొండా ప్రసాద్, కోటేశ్వరరావు, నాగేశ్వరరావు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కామాక్షమ్మ, మట్టిపాటి శ్రీనివాసులు, సుజాతమ్మ, లోకేష్ భాగ్యమ్మ, మనోజ్, జైకుమార్, షబ్బీర్, రాంబాబు, పందల శ్రీనివాసులు, దార్ల మాలకొండయ్య, బాలు, కొండమ్మ, వజ్రమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ధర్నాలు చేసి.. సమస్యల్ని నినదించి..
నెల్లూరు రూరల్: కూటమి ప్రభుత్వంపై వివిధ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సమస్యల పరిష్కారం కోసం పోరు బాట పట్టాయి. సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ యూనియన్, విద్యార్థి సంఘం, కార్పొరేషన్ ఎదుట ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ధర్నాలు చేశారు. ‘తల్లికి వందనం’ అమలు చేయాలంటూ.. సమగ్ర శిశు అభివృద్ధి సేవ పథకం కింద గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లకు తల్లికి వందనం పథకం అమలు చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ అనుబంధ యూనియన్ వారు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు ఇవ్వాలని, సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగం అనే పదం తొలగించాలని డిమాండ్ చేశారు. గౌరవ వేతనంతో ఉపాధి పొందుతున్నారని, సంక్షేమ పథకాలు లేకపోతే బతకడం కష్టమన్నారు. ఐదు సంవత్సరాల్లోపు పిల్లలందరూ అంగన్వాడీ సెంటర్లోనే ఉండేలా జీఓ ఇవ్వాలన్నారు. ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేయాలని కోరారు. మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలన్నారు. ప్రతినెలా 10వ తేదీ నాటికి లబ్ధిదారులకు ఇచ్చే అన్ని రకాల సరుకులు సకాలంలో సెంటర్కు చేర్చాలని కోరారు. మెనూ చార్జీలు పెంచాలని కోరారు. హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలి నెల్లూరు వెంకటేశ్వరపురం పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో సమస్యలున్నాయని, అధికారులు చొరవ తీసుకుని పరిష్కరించాలని పీడీఎస్యూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిగింది. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సునీల్ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి విద్యార్థులు ప్రభుత్వ పాలిటెక్నిక్ హాస్టల్లో ఉంటున్నారని, మౌలిక వసతుల్లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. బురద నీరు వస్తోందని, పిల్లలు స్నానం కూడా చేయలేకపోతున్నట్లు చెప్పారు. ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలన్నారు. కరెంట్ బిల్లు ప్రభుత్వమే కట్టేలా చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నేతలు అక్రమ్, తాహిర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరోగ్య యోగం
నెల్లూరు(స్టోన్హౌస్పేట): అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నెల్లూరులో అట్టహాసంగా శనివారం నిర్వహించారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పెద్ద సంఖ్యలో యోగా విన్యాసాలు చేశారు. వన్ ఎర్త్.. వన్ హెల్త్ నినాదంతో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్ మాట్లాడారు. జిల్లాలోని ఏడు వేల ప్రదేశాల్లో యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించామన్నారు. 11 లక్షల మంది నమోదు చేసుకున్నారన్నారు. యోగా జీవన విధానంలో భాగం కావాలన్నారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మాట్లాడారు. జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ అధికారి శ్రీనివాసరావు వ్యాఖ్యాతగా, క్రీడాభివృద్ధి సంస్థ అధికారి యతిరాజ్ నోడల్ అధికారిగా వ్యవహరించారు. అవెన్యూ స్కూల్ విద్యార్థినులు సహస్ర, లయశ్రీ, జనన్య తదితరులు నిర్వహించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కో ఆర్డినేటర్ ప్రసన్నకుమార్, శిక్షకులు సెలీనా, అరుణ సుకన్య, శైలజ, పద్మజ, ప్రసూన, గాయత్రి, ప్రసన్న తదితరులకు జ్ఞాపికలను అందజేశారు. ఎస్పీ కృష్ణకాంత్, జేసీ కార్తీక్, కమిషనర్ నందన్, డీఆర్వో ఉదయభాస్కర్, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎలాంటి రుజువుల్లేకుండానే ఆరోపణలా..?
నెల్లూరు(స్టోన్హౌస్పేట): కనుపర్తిపాడు పరిధిలోని సర్వే నంబర్ 295లో గల భూమి అహోబిలం మఠానికి చెందిందనే రెవెన్యూ రికార్డులు వారి వద్ద లేవని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి స్పష్టం చేశారు. మినీబైపాస్లోని తన నివాసంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు. రుజువులుంటే కలెక్టర్ వద్దకెళ్లడమో లేక న్యాయస్థానాలను ఆశ్రయించాలే గానీ ఆశ్రమంలో ఎక్కడో రాసి ఉందనే అంశాన్ని పట్టు కొని తన వద్దకొచ్చి డబ్బులు అడగడం న్యాయం కాదని పేర్కొన్నారు. గతంలో తనను అహోబిలం మఠం సెక్రటరీ వరదరాజన్ కలిశారని, ఏమైనా రుజువులుంటే తీసుకొస్తే పరిశీలిస్తానని చెప్పిన అంశాన్ని గుర్తుచేశారు. తనపై రెండు రోజులుగా నిరాధార ఆరోపణలు చేస్తుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ పత్రాలను సృష్టించి పొలం వద్ద బోర్డు పెట్టారని ఆరోపించారు. తహసీల్దార్ ప్రకటన చేయడం.. పొలం వద్దకు వీఆర్వో నేరుగా వెళ్లి.. ఇది వేరొకరిదనేలా బోర్డు నాటి ఫొటోలు తీయించుకోవడాన్ని ఇప్పటి వరకు ఎక్కడా చూడ లేదన్నారు. ఎలాంటి నోటీసులివ్వకుండానే ఇలా వ్యవహరించారని చెప్పారు. సర్వే నంబర్ 295 లోని ఈ పొలాన్ని 2007లో మురళీకృష్ణంరాజు, కిలారి రమేష్బాబు తదితరులు తనకు విక్రయించారంటూ డాక్యుమెంట్లను ప్రదర్శించారు. 1954 నుంచి నేటి వరకు లింక్ డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నా, ఎవరి ప్రోద్బలంతోనో అధికారులు తప్పుడు సమాచారాన్ని సృష్టించి తన ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని చెప్పారు. వీఆర్వో, అహోబిలం మఠం సెక్రటరీ వరదరాజన్, తన ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై న్యాయస్థానంలో కేసు వేస్తానని స్పష్టం చేశారు. ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదని, అందుకే కోర్టును ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. వేరొకరి పొలాలను ఆక్రమించాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. నెల్లూరు చెరువు, కనుపర్తిపాడు, పొదలకూరు రోడ్డు, నగర శివారు ప్రాంతాల్లో అనేక ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురయ్యాయని, వీటిని స్వాధీనం చేసుకొని ఇల్లు లేని పేదలకు పంచాలని హితవు పలికారు. విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నేతలు స్వర్ణా వెంకయ్య, పాశం శ్రీనివాస్, హరిబాబుయాదవ్, ఏసునాయుడు, మల్లు సుధాకర్రెడ్డి, మొయినుద్దీన్, శ్రీధర్బాబు, ఆగాల శ్రీనివాస్రెడ్డి, సందానీబాషా తదితరులు పాల్గొన్నారు. ఆక్రమించాల్సిన అవసరమే లేదు వీరిపై కోర్టును ఆశ్రయిస్తా అహోబిలం మఠం భూములపై మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి -
1 నుంచి ముఖ ఆధారిత హాజరు
వింజమూరు(ఉదయగిరి): రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో ముఖ ఆధారిత హాజరును జూలై ఒకటి నుంచి అమలు చేయనున్నారని ఐసీడీఎస్ గుంటూరు రేంజ్ ఆర్జేడీ జయలక్ష్మి పేర్కొన్నారు. ప్రాజెక్ పనితీరుపై సీడీపీఓ, సూపర్వైజర్లతో స్థానిక ఐసీడీఎస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలకు చిన్నారులొచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. సమయపాలన పాటించడంతో పాటు విధులకు ప్రతి ఒక్కరూ హాజరయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆధార్ ఈ – కేవైసీని పోషణ్ యాప్లో ఈ నెల 30లోపు నూరు శాతం పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం కార్యాలయ అవరణలో మొక్కలు నాటారు. సీడీపీఓ పద్మజకుమారి, సూపర్వైజర్లు తేజశ్విని, సుహాసిని, నాగేశ్వరమ్మ, సుజాత, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం
పొదలకూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధైర్యపడొద్దని, అండగా మేమున్నామని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి కుమార్తె కాకాణి పూజిత భరోసా ఇచ్చారు. మండలంలోని చెన్నారెడ్డిపల్లికి చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీపీ నోటి మాలకొండారెడ్డి అనారోగ్యానికి గురికావడంతో ఆమె శనివారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్న అనంతరం ఆమె మాట్లాడారు. తన తాత కాకాణి రమణారెడ్డి అనుచరుడిగా మాలకొండారెడ్డి ఉంటూ విలువలతో కూడిన రాజకీయాలు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వమొచ్చాక సర్వేపల్లి నియోజకవర్గంలో పదుల సంఖ్యలో అక్రమ కేసులను బనాయించారని ఆరోపించారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, తమ కుటుంబంతో పాటు గోవర్ధన్రెడ్డి అభిమానులు, కార్యకర్తలు అండగా నిలుస్తారని చెప్పారు. ప్రజాబలం ముందు అక్రమ కేసులు నిలబడవని తెలిపారు. తన తండ్రిపై బనాయించిన కేసులన్నీ వీగిపోయి తిరిగి ప్రజాసేవలో పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలోని నేతలు వెల్మిరెడ్డి సుబ్బారెడ్డి, కోడూరు ఆనందరెడ్డి నివాసాలకెళ్లి యోగక్షేమాలను ఆరాతీశారు. సొసైటీ మాజీ చైర్మన్ గోగిరెడ్డి గోపాల్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి, జెడ్పీటీసీ తెనాలి నిర్మలమ్మ, మాజీ ఎంపీపీ కోనం చినబ్రహ్మయ్య, ఎంపీటీసీలు కేతు రామిరెడ్డి, సుబ్బరత్నమ్మ, శ్రీనివాసులు, అంజద్, నేతలు నోటి బాలకొండారెడ్డి, కోడూరు మాలకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
ఆత్మకూరు: పట్టణ పరిధిలోని నెల్లూరు – ముంబై జాతీయ రహదారి ఎన్హెచ్ – 67పై రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు – ముంబై రహదారి నుంచి ఏఎస్పేట వెళ్లే అడ్డ రోడ్డు ఆర్చి వద్ద ప్రమాదాలు జరిగిన స్థలాన్ని అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. 20 రోజుల వ్యవధిలో ఒకే ప్రాంతంలో మూడు ప్రమాదాలు సంభవించి, ముగ్గురు మృతి చెందడం బాధాకరమని చెప్పారు. అనంతరం ఆర్ అండ్ బీ అతిథిగృహంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్తించిన ప్రాంతంలో వాహనాల వేగాన్ని తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో రూ.ఐదు కోట్ల ఆదాయం దాటిన ప్రధానాలయాల్లో భక్తులకు అన్నప్రసాదాన్ని నాణ్యత ప్రమాణాలతో అందించేలా చర్యలు చేపట్టామని వివరించారు. కామన్ గుడ్ ఫండ్ ద్వారా రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు నిధులను ఆలయాల మరమ్మతులు, పునర్నిర్మాణాలకు మంజూరు చేయనున్నామని వెల్లడించారు. ఆర్డీఓ పావని, డీటీసీ చందర్, ఎన్హెచ్ డిప్యూటీ మేనేజర్ సుదాన్ష్కుమార్, మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, తహసీల్దార్ పద్మజాకుమారి, ఆర్ అండ్ బీ ఈఈ, ఏఈలు మురళీకృష్ణ, అమానుల్లాఖాన్, ఇరిగేషన్ ఈఈ రవి, ఏఈ రవికుమార్, డీఎస్పీ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఏయ్.. మమ్మల్నే ప్రశ్నిస్తారా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రతిపక్ష నేతలు, సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఫిర్యాదు అందడమే తరువాయిగా కనీస విచారణ జరపకుండానే కేసులు నమోదు చేసే పనిలో పోలీసులు తలమునకలై ఉన్నారు. ఈ తరహా పరిస్థితులు కావలిలో మరింత శ్రుతిమించాయి. రెడ్బుక్ రాజ్యాంగ అమల్లో ఖాకీలు పరిధి దాటి వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కేసుల విషయంలో అత్యున్నత న్యాయస్థానాలు మందలిస్తున్నా, వీరికి ఏ మాత్రం పట్టడంలేదు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై టీడీపీ, జనసేన నేతలతో పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేయించి కేసుల పేరిట వేధింపులకు గురిచేస్తున్నారు. కావలిలో ఇదీ తీరు.. ● పైలాన్ ధ్వంసం కేసులో 12 మందిపై నాన్బెయిలబుల్ కేసును కావలి రెండో పట్టణ పోలీసులు నమోదు చేసి నలుగుర్ని అరెస్ట్ చేశారు. ఎనిమిది మందిలో ఐదుగురు ముందస్తు.. మరో ముగ్గురు ఇంటర్నల్ బెయిల్ పొందారు. ● దగదర్తిలో టీడీపీ నేత తన స్నేహితులతో కలిసి వ్యవసాయ భూముల్లో గల గెస్ట్హౌస్లో మందు పార్టీ చేసుకున్నారు. ఈ ఫొటోలు ఓ సోషల్ మీడియా గ్రూపులో వచ్చాయి. వాటిని ప్రభావతి.. ఇతరుల వాట్సాప్ గ్రూపుల్లోకి ఫార్వార్డ్ చేశారనే కారణంతో ఆమైపె కేసు నమోదు చేశారు. ● సోషల్ మీడియాలో వీర రఘు, శ్రీనివాసులు, ఎం శ్రీనివాసులు, మాచర్ల సుందరరాజు యాక్టివ్గా ఉంటారు. ప్రభుత్వ వైఫల్యాలపై మీడియాలో వచ్చిన కథనాలు, పోస్టులను ఫార్వార్డ్ చేస్తున్నారంటూ వీరిపై పోలీసులకు కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో వీరిపై పలు కేసులు నమోదయ్యాయి. ● ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులను వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వార్డ్ చేస్తున్నారంటూ కావలి పట్టణంలోని 11వ వార్డుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఆత్మకూరు రాజేష్పై టీడీపీ నేతల ఫిర్యాదుతో రెండు కేసులను పోలీసులు నమోదు చేశారు. ఓ కేసులో స్టేషన్ బెయిల్ మంజూరు కాగా, మరో దాంట్లో రిమాండ్కు వెళ్లారు. ● సోషల్ మీడియా యాక్టివిస్ట్ దామెర్ల శ్రావణ్కుమార్పై కావలి పోలీసులు రెండు, ఒకటో పట్టణ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. రెండు కేసుల్లో బెయిల్ మంజూరుకాగా, మరో అంశంలో రిమాండ్కు వెళ్లారు. ● సోషల్ మీడియా యాక్టివిస్ట్ బెహరా లక్ష్మీనారాయణపై కావలి ఒకటి, రెండో పట్టణ పోలీస్స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. రెండు కేసుల్లో బెయిల్ మంజూరైంది. ● వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పరుసు మౌళీశంకర్పై కావలి రెండో పట్టణ పోలీస్స్టేషన్లో కేసును ఇటీవల కేసు నమోదు చేయగా, బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. ● బోగోలు మండలం కడనూతలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మారణాయుధాలతో దాడి చేశారు. అయితే తిరిగి ఆ పార్టీ నేత బాబుతో పాటు మరో ఏడుగురిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ● ఏఎంసీ మాజీ చైర్మన్ సన్నిబోయిన ప్రసాద్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పది రోజుల క్రితం నమోదు చేశారు. ● విజయదుర్గ హోటల్కు తాళాలేశారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఈతముక్కల చంద్రశేఖర్రెడ్డితో పాటు మరో ఇద్దరిపై కావలి రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. వీరికి స్టేషన్ బెయిల్ను మంజూరు చేశారు. భావప్రకటన స్వేచ్ఛపై కూటమి ప్రభుత్వ ఉక్కుపాదం వైఎస్సార్సీపీ శ్రేణులే లక్ష్యంగా స్కెచ్ అక్రమ కేసులతో వేధింపులు కావలిలో శ్రుతిమించుతున్న రెడ్బుక్ రాజ్యాంగం ప్రజాస్వామ్యంలో తమ గళాన్ని స్వేచ్ఛగా వినిపించే హక్కును రాజ్యాంగం కల్పించింది. దీనికి భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా శిక్షార్హులేననే విషయాన్ని కూటమి ప్రభుత్వం విస్మరిస్తూ.. పౌరుల హక్కులను కాలరాస్తోంది. ప్రశ్నించే వారిపై ఉక్కుపాదాన్ని మోపి పైశాచికానందాన్ని పొందుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమే నేరమనే రీతిలో సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై అక్రమ కేసులను బనాయిస్తోంది. అధికారం ఉందనే ధీమాతో పోలీసులను ఉసిగొల్పి తీవ్రంగా వేధిస్తోంది. మీపై కేసులు కట్టాం.. రండి -
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అయ్యపరెడ్డి
నెల్లూరు(లీగల్): ప్రతిష్టాత్మకమైన నెల్లూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పి.అయ్యపరెడ్డి ఎన్నికయ్యారు. జిల్లా కోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం న్యాయవాదుల సంఘం ఎన్నికలు జరిగాయి. శనివారం రాత్రి 10 గంటల వరకు వచ్చిన సమాచారం మేరకు అధ్యక్షుడిగా వీసీఎస్ఆర్ ప్యానెల్కు చెందిన అయ్యపరెడ్డి తన సమీప ప్రత్యర్థి వి.ఉపేంద్రరావుపై 149 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాగా వీసీఎస్ఆర్ ప్యానెల్ నుంచి అధ్యక్షుడు, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీలు గెలిచారు. న్యాయవాదుల ఐక్యవేదిక నుంచి ఉపాధ్యక్షుడు, టెజ్రరర్, జాతీయ న్యాయ వేదిక నుంచి లైబ్రరీ సెక్రటరీ గెలుపొందారు. ● ఉపాధ్యక్షుడిగా జల్లి పద్మాకర్ తన సమీప ప్రత్యర్థి ఈదూరు భాస్కరయ్యపై, జనరల్ సెక్రటరీగా నక్కల నాగరాజు తన సమీప ప్రత్యర్థి సత్తు అంకయ్యపై స్వల్ప ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీగా కేఎల్ నారాయణ తన ప్రత్యర్థి ఎన్.రవికష్ణపై 93 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందరు. ట్రెజరర్గా డి.పెంచలప్రణీత్ తన సమీప ప్రత్యర్థి ఆర్.శివశంకరరావుపై 6 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా జి.చంద్రశేఖర్ నాయుడు తన సమీప ప్రత్యర్థి ఎస్డీ వశీంపై 170 ఓట్ల మెజారిటీతో, లైబ్రరీ సెక్రటరీగా నాగశ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థి ఎండీ ముజిబుర్ రహిమాన్ఫై 83 ఓట్ల మెజారిటీతో గెలిచారు. లేడీ రెప్రజెంటేటివ్ లక్ష్మమ్మ, రమాదేవీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. కార్యనిర్వాహక సీనియర్ (ఈసీ) విభాగంలో మూడు పోస్టులకు కార్యనిర్వాహక జూనియర్ (ఈసీ) విభాగంలో 5 పోస్టులకు కౌంటింగ్ కొనసాగుతోంది. -
గంజాయి విక్రయిస్తుండగా..
నెల్లూరు(క్రైమ్): ఒడిశా రాష్ట్రం నుంచి గంజాయి తీసుకొచ్చి నెల్లూరులో విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంతపేట పోలీసుస్టేషన్లో శనివారం నగర డీఎస్పీ పి.సింధుప్రియ స్థానిక ఇన్స్పెక్టర్ జి.దశరథరామారావుతో కలిసి నిందితుల వివరాలను వెల్లడించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ కుమార్ భోల్ కొంతకాలం క్రితం ఉపాధి నిమిత్తం నెల్లూరు నగరానికి వచ్చాడు. హరనాథపురం ఎక్స్టెన్షన్ ఏరియాలో నివాసం ఉంటూ ఎంబ్రాయిడరీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. అతను తన వ్యసనాలను తీర్చుకునేందుకు సరిపడా నగదు కోసం గంజాయి విక్రయాలకు తెరలేపాడు. ఒడిశా రాష్ట్రంలో కేజీ గంజాయిని రూ.5 వేల చొప్పున కొనుగోలు చేసి వాటిని చిన్ని ప్యాకెట్లుగా చేసి నెల్లూరు నగరంలో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకోసాగాడు. కొద్దిరోజులుగా సంతపేట పోలీసుస్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి గంజాయి విక్రయాలపై దాడులు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ప్రశాంత్కుమార్ భోల్ శుక్రవారం ఆత్మకూరు బస్టాండ్ రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలోని ఓ లాడ్జి ఎదురుగా గంజాయి విక్రయించేందుకు ఉన్నాడని ఇన్స్పెక్టర్కు పక్కా సమాచారం అందింది. ఆయన తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని నుంచి రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని డీఎస్పీ చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్, సిబ్బంది శ్రీహరి, లావణ్యకుమార్, విజయ్మోహన్, సుబ్బారావు, సురేంద్రబాబు తదితరులను ఎస్పీ అభినందించారు. వ్యక్తి అరెస్ట్ రెండు కేజీల స్వాధీనం -
కాల్ సెంటర్ ఏర్పాటు
నెల్లూరు రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సంబంధించి వినతుల సమాచారం ప్రజలు తెలుసుకునేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ శనివారం తెలిపారు. జిల్లా కేంద్రంతోపాటు అన్ని మండల కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, డివిజనల్ స్థాయిలో వినతుల స్వీకరణ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ప్రజలు తమ అర్జీ పరిష్కారం కాకున్నా, ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకునేందుకు 1100 నంబర్కు ఫోన్ చేయాలని తెలియజేశారు. నెల్లూరులో యువత పోరు రేపునెల్లూరు(స్టోన్హౌస్పేట): వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జిల్లా కేంద్రమైన నెల్లూరులో ఈనెల 23వ తేదీన జరగబోయే యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున శనివారం ఒక ప్రకటనలో కోరారు. కూటమి ప్రభుత్వం యువతకు నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. 23న పాత జెడ్పీ కూడలి నుంచి కలెక్టరేట్ వరకు యువత, నిరుద్యోగులతో కలిసి ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించడం జరుగుతుందన్నారు. ఎస్ఎస్సీ నోటిఫికేషన్ జారీనెల్లూరు రూరల్: భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, సంస్థల్లోని వివిధ గ్రూప్ బీ, సీ పోస్టులకు ప్రత్యక్ష నియామకం కోసం ఓపెన్ కాంపిటిటీవ్ కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ జారీ చేసిందని కలెక్టర్ ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టుల వివరాలు, వయో పరిమితి, అవసరమైన విద్యార్హత, చెల్లించాల్సిన రుసుం, పరీక్ష పథకం, దరఖాస్తు చేసుకునే విధానం తదితర వివరాల కోసం కమిషన్ ssc.gov.in వెబ్సైట్ను సందర్శించాలన్నారు. జూలై 4వ తేదీలోగా ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించాలన్నారు. పరీక్ష ఆగస్ట్ 13 నుంచి 30వ తేదీ వరకు జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఎస్సైల బదిలీలునెల్లూరు(క్రైమ్): జిల్లాలోని పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ జి.కృష్ణకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. అల్లూరు ఎస్సై కె.కిశోర్బాబును వీఆర్కు, వీఆర్లో ఉన్న ఎ.శ్రీనివాసరెడ్డిని అల్లూరుకు, కావలి రెండో పట్టణ ఎస్సై ఎన్.ప్రభాకర్ను బిట్రగుంటకు, బిట్రగుంట ఎస్సై కె.భోజ్యానాయక్ను వీఆర్కు, వీఆర్లో ఉన్న ఎస్.కోటయ్యను కలువాయి పోలీసుస్టేషన్కు బదిలీ చేశారు.బైక్ అదుపుతప్పి..● యువకుడి మృతి మర్రిపాడు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. మర్రిపాడు పోలీసుల కథనం మేరకు.. ఏఎస్పేటు చెందిన షేక్ సమీర్ (18) మర్రిపాడు మండలంలోని డీసీపల్లి మజారా ఖాన్ సాహెబ్ పేట గ్రామంలోని దర్గాకు శుక్రవారం అర్ధరాత్రి బయలుదేరాడు. ఖాన్సాహెబ్పేట గ్రామానికి వచ్చేసరికి టర్నింగ్ వద్ద బైక్ అదుపుతప్పగా సమీర్ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన సమీర్ను ఆత్మకూరు జిల్లా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మర్రిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి దర్యాప్తు చేస్తున్నారు.శాస్త్రోక్తంగా ఊంజల్సేవ రాపూరు: మండలంలోని పెంచలకోన క్షేత్రంలో శనివారం సాయంత్రం పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవికి శాస్త్రోక్తంగా ఊంజల్సేవ నిర్వహించారు. ఉత్సవమూర్తులను అలంకార మండపంలో తిరుచ్చిపై కొలువుదీర్చారు. ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం సహస్ర దీపాలంకరణ మండపంలో ఊంజల్సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఉదయం నిత్య కల్యాణ మండలపంలో స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని జరిపారు. నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.30 సన్నవి : రూ.20 పండ్లు : రూ.10 -
పట్టుకున్నారు.. వదిలేశారు
తడ: తమిళనాడు వైపు తరలిపోతున్న ఇసుక టిప్పర్ను శనివారం బీవీపాళెం చెక్పోస్టు వద్దనున్న పోలీసు ఔట్పోస్ట్ సిబ్బంది పట్టుకున్నారు. కూటమి పెద్దల నుంచి ఒత్తిడి రావడంతో పట్టుకున్న కొద్దిసేపటికే వదిలేశారు. సూళ్లూరుపేట నుంచి 12 టైర్ల టిప్పర్ సుమారు 50 టన్నుల ఇసుక తీసుకుని బీవీపాళెం మీదుగా తమిళనాడుకు బయలుదేరింది. తనిఖీ కేంద్రం వద్ద సిబ్బంది పరిశీలించి అదుపులోకి తీసుకున్నారు. మీడియా సిబ్బంది అక్కడ ఉండటాన్ని గమనించిన పోలీసులు టిప్పర్ని పక్కన పెట్టించారు. కొంత సమయం గడిచే సరికి టిప్పర్ అక్కడ కనిపించకుండా పోయింది. బడా నాయకుడు ఫోన్ చేయడంతో పోలీసులు వదిలేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 22 టన్నుల కెపాసిటీ కలిగిన ఈ టిప్పర్లో రెండింతలు ఇసుక నింపి పట్టలు కప్పి యథేచ్ఛగా తరలిస్తుండడం గమనార్హం. ఆంధ్రా నుంచి తమిళనాడుకు అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు బీవీపాళెం పాత చెక్పోస్టు వద్ద తనిఖీ కేంద్రం ఏర్పాటు చేశారు. -
నాగలింగేశ్వర స్వామి ఆలయ పరిశీలన
ఆత్మకూరు: చేజర్ల మండలంలోని పెన్నానది ఒడ్డున పెరుమాళ్లపాడు గ్రామ సమీపంలో ఏడు దశాబ్దాల క్రితం ఇసుకలో పూడిపోయిన నాగలింగేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పరిశీలించారు. శనివారం ఆత్మకూరు పట్టణంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన సాయంత్రం ఆలయాన్ని సందర్శించారు. గుడికి సుమారు 300 సంవత్సరాల చరిత్ర ఉంది. 70 ఏళ్ల క్రితం ఉధృతంగా వచ్చిన వరదలకు ఇసుక ఆలయాన్ని పూడ్చివేసింది. అప్పటి నుంచి పూజా కార్యక్రమాలకు దూరమైంది. ఈ నేపథ్యంలో 2020లో స్థానిక యువకుల చొరవ తీసుకుని ఆలయాన్ని వెలుగులోకి తెచ్చారు. కొంతమేర ఇసుక మేటను తొలగించారు. దీనిని పరిశీలించిన మంత్రిమాట్లాడుతూ జిల్లాకే తలమానికంలాంటి చరిత్ర కలిగిన ఆలయంలో పూర్తి స్థాయిలో ఇసుకను తొలగించి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పునఃనిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఆయన వెంట దేవదాయ శాఖ అధికారులు, సోమశిల ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వి.కేశవచౌదరి, శ్రీనివాసులునాయుడు, బూదళ్ల వీరరాఘవ రెడ్డి తదితరులున్నారు. -
రేపు పీజీ జోనల్ సీఎంఈ ప్రోగ్రాం
నెల్లూరు(అర్బన్): ఈనెల 22వ తేదీన దర్గామిట్టలోని ఏసీఎస్ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్లో భాగంగా పీజీ జోనల్ సీఎంఈ ప్రోగ్రాం నిర్వహిస్తామని ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి, సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధానాయక్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్పోస్టర్లను శుక్రవారం సర్వజన ఆస్పత్రిలోని సూపరింటెండెంట్ చాంబర్లో డాక్టర్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంకో అనస్తీషియా, రీసెంట్ అడ్వాన్సెస్పై కొత్త పద్ధతులు, మెళకువలు, కొత్త పరిశోధనల గురించి చర్చించడం జరుగుతుందన్నారు. జోన్లో ఉన్నటువంటి అన్ని మెడికల్ కళాశాలల పీజీ విద్యార్థులు హాజరవుతారన్నారు. ఓవైపు ఆపరేషన్ థియేటర్లో చికిత్సలు అందిస్తూ మరో వైపు స్క్రీన్పై లైవ్లో కనిపించేలా పీజీ వైద్యులకు బోధన జరుగుతుందన్నారు. పీజీ చేస్తున్న వైద్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరెడ్డి, అనస్తీషియా విభాగం హెచ్ఓడీ డాక్టర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
వెంగమాంబ బ్రహ్మోత్సవాల ఆదాయం రూ.51.50 లక్షలు
దుత్తలూరు: వెంగమాంబ బ్రహ్మోత్సవాలకు సంబంధించి వివిధ మార్గాల ద్వారా రూ.51,50,638ల ఆదాయం వచ్చినట్లు ఈఓ వెట్టిగుంట ఉషశ్రీ తెలిపారు. శుక్రవారం దేవస్థాన సన్నిధిలో హుండీ కానుకల్ని లెక్కించారు. ఈ సందర్భంగా ఆమె వివరాలు తెలిపారు. హుండీల ద్వారా రూ.25,11,590, తాత్కాలిక అంగళ్ల వేలంపాట ద్వారా రూ.6.50 లక్షలు, అన్నదానం విరాళాల ద్వారా రూ.6,41,344, లడ్డూ ప్రసాదం అమ్మకం ద్వారా రూ.4,74,600, దర్శనం టికెట్ల అమ్మకం ద్వారా రూ.7,03,660, తలనీలాల టికెట్ల అమ్మకం ద్వారా రూ.49,920, అమ్మవారి కల్యాణ చదివింపుల ద్వారా రూ.22,764, ఉభయాల ద్వారా రూ.79,380, ఇతరాల ద్వారా రూ.17,380 చొప్పున వచ్చినట్లు తెలిపారు. గత ఏడాది కంటే భక్తుల సంఖ్య తగ్గడంతో ఆదాయం కూడా తగ్గినట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ వి.నాగమల్లేశ్వరరాజు, సిబ్బంది పాల్గొన్నారు. -
7 వేల ప్రదేశాల్లో యోగా
● కలెక్టర్ ఆనంద్ నెల్లూరు (అర్బన్): 11వ జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా వ్యాప్తంగా 7 వేల ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతూ కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్ నుంచి శుక్రవారం తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్డీఓలు, కమిషనర్లు, ఇతర అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో యోగా కార్యక్రమాల్లో 10 లక్షల మంది పాల్గొనాలన్నారు. యోగా జరిగే ప్రతి ప్రదేశంలో ఒక యోగా ట్రైనర్తోపాటు ఒక ప్రత్యేకాఽధికారి ఉండేలా చూ డాలని ఆదేశించారు. మండల స్థాయిలో ఎప్పటికప్పుడు జరుగుతున్న యోగా ఫొటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయించాలన్నారు. అన్ని చోట్ల ఏఎన్ఎంలు ఉండేలా డీఎంహెచ్ఓ ఏర్పాట్లు చేయాలన్నారు. విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొనే యోగా కార్యక్రమాలతో సమాంతరంగా జిల్లాలో యోగా కార్యక్రమాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ కార్తీక్తోపాటు జెడ్పీ సీఈఓ మోహన్రావు, డీఈఓ బాలాజీరావు, జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అధికారి యతిరాజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఆశవర్కర్ల సమ్మె నోటీసు
నెల్లూరు (అర్బన్): ఆశ వర్కర్లకు రూ.26 వేలు కనీస వేతనం ఇవ్వడంతోపాటు వారిని కార్మికులుగా గుర్తించాలని ఏపీ ఆశవర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గిరాల అన్నపూర్ణమ్మ డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం సంతపేటలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో డీఎంహెచ్ఓ సుజాతకు ఆశ కార్యకర్తలు జూలై 9న జరిగే దేశ వ్యాప్త సమ్మెలో భాగమవుతున్నామని, సమ్మె నోటీసు అందజేశారు. దుగ్గిరాల అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు టీబీ, లెప్రసీ, సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియా, ఫైలేరియా వంటి సర్వేలు చేస్తున్నారన్నారు. బాలింతలు, గర్భిణులను గుర్తించి వారికి పౌష్టికాహారం అందేలా కృషి చేస్తున్నారన్నారు. క్షేత్రస్థాయిలో అన్ని రకాల వైద్య సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ అదనంగా టీబీ నిర్ధాణ జరిపే గళ్ల పరీక్షలు చేయాలనడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, కోశాధికారి మధుమాధవి, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. -
పెండింగ్ పనులు పూర్తి చేయకపోతే చర్యలు
● రూ.13 కోట్ల విలువైన పనులకు వర్క్ ఆర్డర్లు ● ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ విజయన్ హెచ్చరిక నెల్లూరు (వీఆర్సీసెంటర్): ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ పరిధిలోని అన్ని డివిజన్లలో పెండింగ్లో ఉన్న వర్క్ ఆర్డర్లను ఈ నెలాఖరు లోపు పూర్తి చేయకపోతే సంబంధిత విద్యుత్ అధికారుల జీతాల నుంచి రికవరీ చేస్తామని ఎస్ఈ విజయన్ హెచ్చరించారు. నగరంలోని విద్యుత్భవన్లో శుక్రవారం జిల్లాలోని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2022–23 ఏడాదికి సంబంధించి పెండింగ్లో ఉన్న వర్క్ ఆర్డర్లపై దృష్టి సారించాలన్నారు. ప్రధానంగా జిల్లాలో ఐదు డివిజన్లలో అధికంగా వర్క్ ఆర్డర్స్ పెండింగ్లో ఉన్నాయన్నారు. ఆత్మకూరులో 398, కావలి 89, కోవూరు 134, నెల్లూరుటౌన్ 14, నెల్లూరురూరల్ 147 మొత్తం రూ.13 కోట్ల విలువైన 782 వర్క్ ఆర్డర్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇప్పటికై నా వీటిని పరిష్కరించే విధంగా ఈఈలు దృష్టి సారించాలన్నారు. ఈ సమావేశంలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మురళి, నోడల్ అధికారి శేషాద్రిబాలచంద్ర, అకౌంట్స్ ఆఫీసర్ విజిత, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు. -
కాకాణితో ఆదాల ములాఖత్
వెంకటాచలం: కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులతో జిల్లా సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితో మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డి శుక్రవారం ములాఖత్ అయ్యారు. జిల్లాలో నెలకొన్న తాజా పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించారు. అధైర్య పడొద్దని, వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి వెంట వైఎస్సార్సీపీ నేతలు స్వర్ణా వెంకయ్య, సీహెచ్ హరిబాబుయాదవ్, పాశం శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు మల్లు సుధాకర్రెడ్డి, పార్టీ నాయకులు హంషీద్ అలీ, కొండేటి నరసింహారావు, షేక్ మొయిద్దీన్, ఆగాల శ్రీనివాసులురెడ్డి, ఖలీల్, జీవన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ నెల్లూరు (టౌన్): పాలిటెక్నిక్లోని ఆయా కోర్సుల్లో చేరేందుకు శనివారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు పాలిసెట్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ రామారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే వి ద్యార్థులు ర్యాంకు కార్డు, ఫీజు చెల్లింపు రసీదు, 4 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, ఆదాయ, కుల ధ్రువపత్రాలను తీసుకురావాలన్నారు. తల్లికి వందనం వర్తింపజేయండి ఆత్మకూరు: ప్రభుత్వం చిన్నారుల చదువుల కోసం అందిస్తున్న తల్లికి వందనం పథకాన్ని మున్సిపల్ కార్మికులకు ఇవ్వకపోవడం దారుణమని, వారికి సైతం ఆ పథకం వర్తింపజేయాల ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూ నియన్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మిక యూనియన్, సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ సి గంగాప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ చిరుద్యోగులైన కార్మికులకు తల్లికి వందనం ఇవ్వకపోవడం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమన్నారు. ఈ కార్యక్రమంలో డేవిడ్ రాజు, గురవయ్య తదితరులు పాల్గొన్నారు. ఖాళీ పోస్టుల్లో 1998, 2008 డీఎస్సీ టీచర్లు నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న సబ్జెక్ట్ టీచర్ల స్థానంలో 1998, 2008 డీఎస్సీలో ఎంపికై మినిమమ్ టైమ్ స్కేల్ కింద పని చేస్తున్న టీచర్లను నియమించాలని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వారి సీనియారిటీ ప్రకారం ఆయా పాఠశాలల్లో నియమించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. పాఠశాలల్లో ఖాళీ పోస్టులు లేకపోతే క్లస్టర్ల్లో నియమించనున్నారు. 1998, 2008 డీఎస్సీల్లో ఎంపికై ఉద్యోగాలు పొందలేక నిరీక్షిస్తున్న అభ్యర్థులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మినిమమ్ టైమ్ స్కేల్తో టీచర్ పోస్టులు కల్పించిన విషయం విదితమే. లాసెట్లో రాష్ట్ర స్థాయిలో 124వ ర్యాంకు దుత్తలూరు: ఏపీ లాసెట్ ఫలితాల్లో దుత్తలూరు మండలం ఏరుకొల్లుకు చెందిన రావిళ్ల నాగార్జున రాష్ట్రస్థాయిలో 124వ ర్యాంకు సాధించాడు. తిరుపతి ఎస్వీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి హెచ్ఈసీ గ్రూపులో 941 మార్కులు సాధించాడు. లాసెట్ ప్రవేశ పరీక్ష రాయగా ఉత్తమ ప్రతిభ కనబరచడంతో గ్రామస్తులు అభినందించారు. నాగార్జున మాట్లాడుతూ భవిష్యత్లో సివిల్స్ సాధించి పేదలకు సేవ చేయాలనేదే తన లక్ష్యమన్నారు. -
మామూళ్లతో విద్యాశాఖ ముఖం చాటేత
కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూళ్లు, అనధికారికంగా పుస్తకాలు, యూనిఫాం విక్రయాలు చేస్తున్నా జిల్లా విద్యాశాఖ అధికారులకు ఏ మాత్రం పట్టడం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠశాలల గుర్తింపు, మౌలిక వసతులు, ఫీజుల వసూళ్లు, పుస్తకాలు, యూనిఫాం విక్రయాలపై ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ, డీఈఓలు పాఠశాలకు వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. అయితే ఈ అధికారులు ఎప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేసిన సందర్భాలు ఉండడం లేదు. పాఠశాల గుర్తింపు సమయంలో కూడా గుమస్తా నుంచి జిల్లా విద్యాశాఖ అధికారి వరకు ముడుపులు ఇవ్వడంతో ఆ వైపు కన్నెత్తి చూడని పరిస్థితి ఉంది. -
కాలకేయుల పాలన
ప్రతిపక్షాన్ని, ప్రతిపక్ష నేతను భూస్థాపితం చేస్తామంటూ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నాడు. రెడ్బుక్ రాజ్యాంగంతో ఆయన సుపుత్రుడు ప్రభుత్వ వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ప్రజాప్రతినిధుల నుంచి సామాన్యుల వరకు అక్రమ అరెస్ట్లతో భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఆ విధంగానే వైఎస్సార్సీపీ నేతలు, సానుభూతిపరులే లక్ష్యంగా పోలీస్, రెవెన్యూ అధికారులతో కలిసి వారి ఆర్థిక మూలలపై దెబ్బ కొట్టే చర్యలకు దిగుతున్నారు. అధికార యంత్రాంగాలు సైతం వాస్తవాలతో పనిలేకుండా.. టీడీపీ ఎమ్మెల్యేలు ఏం చెబితే.. అదే చేస్తూ న్యాయ వివాదాలు సృష్టిస్తున్నారు. నిబంధనల మేరకు వైఎస్సార్సీపీ నేతలు ఏర్పాటు చేసిన లేఅవుట్లను ధ్వంసం చేసి నష్టపరుస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రజాసంక్షేమాన్ని తుంగలో తొక్కేశారు. అభివృద్ధిని విస్మరించారు. మద్యం ఏరులై పారిస్తూ శాంతి భద్రతలను గాలికి వదిలేశారు. రెడ్బుక్ రాజ్యాంగం అంటూ సామాన్యుడి నుంచి మేధావుల వరకు నోరు మెదపకుండా అక్రమ కేసులతో వేధిస్తున్నారు. పథకాల గురించి ప్రశ్నించేవారిపై కుట్రలు చేస్తున్నారు. అధికారం చేజిక్కించుకుని ఏడాది దాటినా నారా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు. అధికార యంత్రాంగాలు సైతం జీ హుజూరంటూ ఊడిగం చేస్తున్నాయి. కక్షలు, కుట్రలతో కూటమి ప్రభుత్వ పాలన సాగుతోంది. వైఎస్సార్సీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు. వారి మౌఖిక ఆదేశాలే చట్టాలుగా భావించి పోలీస్, రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులు అమలు చేస్తున్నారు. రికార్డులు పరిశీలించకుండానే.. నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి నగరానికి సమీపంలోని కనుపర్తిపాడులో 2007లో స్థానిక రైతుల వద్ద దాదాపు 40 ఎకరాల భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ భూముల్లోనే సర్వే నంబర్ 295లో 1.80 ఎకరాల భూమి కూడా రిజిస్ట్రర్ అయింది. అప్పటి నుంచి కూడా ఆదాల అధీనంలో ఆ భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం వన్ బీ అడంగళ్, పట్టాదారు పాసుపుస్తకం అన్నీ ఉన్నాయి. రాజకీయ కక్షతోనే.. కనుపర్తిపాడులో ఉన్న ఆదాల ప్రభాకర్రెడ్డికి చెందిన ఆ భూమిని అహోబిలం మఠానికి చెందినది అంటూ స్థానిక వీఆర్వో, మఠానికి చెందిన వ్యక్తి గురువారం ఆ భూమిలో బోర్డు పెట్టడం వివాదాస్పదంగా మారింది. ఇదంతా రాజకీయ కక్షతోనే జరిగిందని వైఎస్సార్సీపీ నేతలు మండి పడుతున్నారు. నిబంధనల ప్రకారం ఆ భూమిపై వివాదం ఉంటే స్థానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తారు. సదరు రెవెన్యూ అధికారి నోటీసులు ఇచ్చి ఇరుపక్షాలను పిలిపించి వారి వద్ద ఉన్న రికార్డులను పరిశీలిస్తారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం అది పట్టా భూమిగా ఉంటే అందులో ఎవరూ ఏమీ చేయలేరు. ఒక వేళ ప్రభుత్వ భూమి అయి ఉంటే ఆ భూమి ఎలా వచ్చిందో నోటీసు జారీ చేస్తారు. సరైన ఆధారాలు చూపించకుంటే ఆ భూమిని స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. అయితే ఇందుకు విరుద్ధంగా ఏకపక్షంగా ఆ భూమిలో బోర్డు పెట్టిడచడం చూస్తే ఇదంతా రాజకీయ కోణంతోనే జరిగిందని, అధికారులు నిబంధనలు ప్రకారం నడుచుకోలేదని వైఎస్సార్సీపీ వర్గీయులు మండి పడుతున్నారు. ప్రస్తుతం కనుపర్తిపాడులోని ఆదాల ప్రభాకర్రెడ్డికి చెందిన ఆ భూములు మార్కెట్ విలువ ప్రకారం ఎకరా రూ.70 లక్షల వరకు ధర పలుకుతోంది. కనుపర్తిపాడు గ్రామ శివారులో ఉన్న ఆ భూములు విలువ టీడీపీ అనుకూల పత్రికల్లో పాటు సోషల్ మీడియా గ్రూపుల్లో ఎకరం రూ.15 కోట్లు ఉందంటూ, మాజీ ఎంపీ ఆదాల భూమి కాజేశాడంటూ నిరాధారమైన ఆరోపణలతో కథనాలు ప్రచురించడం, వైరల్ చేస్తుండడం గమనార్హం. రెడ్బుక్ అమలు అంబేడ్కర్ రాజ్యాంగం అవహేళన వైఎస్సార్సీపీ నేతల ఆస్తులే టార్గెట్ టీడీపీ ఎమ్మెల్యేల ఆదేశాలే చట్టాలు 2007లో కనుపర్తిపాడులో 40 ఎకరాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆదాల అందులో కొంత మఠం భూమి ఉందంటూ అధికారుల ప్రకటన కొత్తూరు–అంబాపురంలో వైఎస్సార్సీపీ వర్గీయుల లేఅవుట్లు ధ్వంసం కొత్తూరులో లేఅవుట్ ధ్వంసం నెల్లూరు రూరల్ పరిధిలోని కొత్తూరు–అంబాపురంలో వైఎస్సార్సీపీ మద్దతుదారులు దాదాపు 27 ఎకరాల్లో లేఅవుట్ వేశారు. అందులో 17 ఎకరాల్లో వేసిన లేఅవుట్కు ప్రస్తుత ప్రభుత్వంలోనే మున్సిపల్ కార్పొరేషన్ అప్రూవల్ కూడా తీసుకున్నారు. మిగిలిన 9 ఎకరాలకు అప్రూవల్ లేకపోవడంతో ఆ భూముల్లో ప్లాట్లు వేయకుండానే వదిలేశారు. అందులో రెండున్నర ఎకరాల భూమి రెవెన్యూ రికార్డుల్లో మాత్రం గయాళ్గా చూపిస్తోంది. ఆ భూముల చుట్టూ ప్రహరీ నిర్మించారే కానీ ప్లాట్లు వేయలేదు. ప్రస్తుతం ఆ భూములు రైతుల అధీనంలోనే ఉన్నాయి. రాజకీయ కక్షతో పట్టాభూమిలో నిర్మించి ఉన్న ప్రహరీని కార్పొరేషన్ అధికారులు కొంత భాగం ధ్వంసం చేయడంపై సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఇదంతా వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేసేందుకు ఈ పరిణామాలు చేస్తున్నారని మండి పడుతున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలో దాదాపు 50 వరకు అనధికార లే అవుట్లు ఉన్నట్లు ఇటీవల ఽఅధికారులు గుర్తించారు. వాటి జోలికి వెళ్లకుండా కేవలం వైఎస్సార్సీపీ నేతలనే టార్గెట్ చేయడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. -
మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు(టౌన్): జిల్లాలోని వలేటివారిపాళెం, లింగసముద్రంలోని టైప్ – 4 కేజీబీవీల్లో 2025 – 26 విద్యా సంవత్సరంలో తాత్కాలిక గెస్ట్ ఫ్యాకల్టీ (వార్డెన్, పార్ట్టైం టీచర్లు), డైలీ వేజ్ పద్ధతిలో నాన్ టీచింగ్ సిబ్బంది (హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, వాచ్మెన్లు)కి సంబంధించి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వలేటివారిపాళెం ఆదర్శ పాఠశాలలో వార్డెన్ – 1, పార్ట్టైం టీచర్ – 1, హెడ్ కుక్ – 1, అసిస్టెంట్ కుక్ – 2, వాచ్మెన్ – 1, లింగసముద్రంలో వార్డెన్ – 1, పార్ట్టైం టీచర్ – 1, హెడ్ కుక్ – 1, అసిస్టెంట్ కుక్ – 2, వాచ్మెన్ – 1, ఉలవపాడు (వీరేపల్లి)లో వార్డెన్ – 1, పార్ట్టైం టీచర్ – 1, హెడ్ కుక్–1, అసిస్టెంట్ కుక్ – 2, వాచ్మెన్ – 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం ● కుమార్తె పెళ్లికి నగదు తెచ్చిన బాధితుడు ● బూడిదైన రూ.2.50 లక్షల నగదు కొండాపురం: మండలంలోని ఆదిమూర్తిపురం గ్రామంలో గురువారం రాత్రి రేకుల ఇల్లు దగ్ధమైంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన తుల్లిబిల్లి కొండయ్య రేకుల ఇంట్లో నివాసం ఉంటున్నాడు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి మంటల్ని ఆర్పేలోపు కొండయ్య కుమారై వివాహానికి సమకూర్చుకున్న రూ.2.50 లక్షల నగదు, 4 సవర్ల బంగారం, గృహోపకరణాలు, వివిధ పత్రాలు, రేషన్, ఆధార్ కార్డులు దగ్ధమైనట్లు బాధితుడు తెలిపాడు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న తహసీల్దార్ కోటేశ్వరరావు, వీఆర్వో కొండయ్యలు శుక్రవారం ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కాకాణి బెయిల్ పిటిషన్ తిరస్కరణనెల్లూరు(లీగల్): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై పొదలకూరు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులకు సంబంధించి నెల్లూరు ఐదో అదనపు జిల్లా (ప్రత్యేక ఎస్సీ, ఎస్టీ) కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలైంది. రాజకీయ కక్షతో కేసులు పెట్టారని, బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ కేసు విచారణ పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. గోవర్ధన్రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను తిరస్కరిస్తూ శుక్రవారం న్యాయమూర్తి సరస్వతి ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్ఎస్సీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానంనెల్లూరు(అర్బన్): స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు నివేదించిన వివిధ పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 23వ తేదీతో ముగుస్తుందని కలెక్టర్ ఆనంద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోస్టుల భర్తీ కోసం కమిషన్ ఓపెన్ కాంపిటేటివ్ కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తారన్నారు. దరఖాస్తులను కమిషన్ అధికారిక వెబ్సైట్ హెచ్టీటీపీఎస్://ఎస్ఎస్సీ.జీఓవీ.ఇన్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో సమర్పించాలన్నారు. ఫీజును ఈనెల 24లోగా ఆన్లైన్లో చెల్లించవచ్చన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దైవ దర్శనానికి వెళ్లగా..● పది సవర్ల బంగారం, నగదు చోరీ అల్లూరు: ఓ కుటుంబం తిరుమలలో దైవ దర్శనానికి వెళ్లగా దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బంగారం, నగదు దోచుకెళ్లిన ఘటన అల్లూరు నగర పంచాయతీ పరిధిలోని అంజి నాయుడు కాలనీలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కె.మహేష్ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. అతను కుటుంబంతో గురువారం ఉదయం తిరుమలకు వెళ్లాడు. శుక్రవారం ఉదయం మహేష్ ఇంటి తలుపులు పగులగొట్టి ఉండగా స్థానికులు గుర్తించి అతడికి ఫోన్ చేసి చెప్పారు. దీంతో మహేష్ తన బంధువులు, స్నేహితులను ఇంటి దగ్గరికి పంపాడు. పది సవర్ల బంగారం, రూ.70 వేల నగదును దొంగలు చోరీ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న బంగారం, నగదు దోచుకెళ్లారని, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరాడు. -
‘యోగాంధ్ర’ను విజయవంతం చేద్దాం
నెల్లూరు(స్టోన్హౌస్పేట): నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో శనివారం జరిగే జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్ కోరారు. శుక్రవారం స్టేడియంలో ఏర్పాట్లను జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికి కేటాయించిన విధులను వారు సక్రమంగా, బాధ్యతతో నిర్వహించాలన్నారు. యోగా ఔత్సాహికులు ఉదయం 6 గంటలకు స్టేడియానికి చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు, మహిళలు భారీ సంఖ్యలో హాజరవుతున్న దృష్ట్యా ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. కార్యక్రమ అనంతరం విద్యార్థులు క్షేమంగా తిరిగి వెళ్లేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నందన్, ఆర్డీఓ అనూష, డీఎస్డీఓ యతిరాజ్, డీఎంహెచ్ఓ సుజాత, ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు, విద్యుత్ శాఖ ఎస్ఈ విజయన్, డీఈఓ బాలాజీరావు, ఆర్ఐఓ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జేసీ కార్తీక్ ఏసీ స్టేడియంలో ఏర్పాట్ల పరిశీలన -
టెర్రస్ పైనుంచి పడి..
కోవూరు: మండలంలోని లేగుంటపాడు గ్రామానికి చెందిన ఓ బాలిక టెర్రస్ పైనుంచి కిందపడింది. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ చనిపోయింది. స్థానికుల కథనం మేరకు.. రేష్మ కుమార్తె రషీఫా (5) సోమవారం తమ ఇంటి టెర్రస్ పైనుంచి కింద పడింది. ఆ సమయంలో రేష్మ ఇంట్లో ఉంది. ఆమె బయటకు వచ్చి చూసింది. బాలికకు తీవ్రగాయాలు కావడంతో ఆ కుటుంబం వెంటనే మోటార్బైక్పై నెల్లూరులోని నారాయణ హాస్పిటల్కు తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు చైన్నెకి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రషీఫా చనిపోయింది. కాగా ఈ ఘటనపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టెర్రస్ పైకి ఎవరైనా తీసుకెళ్లి తోసారా?, లేక ప్రమాదవశాత్తు జారిపడిందా? అనే కోణాల్లో విచారణ చేయాలని కోరుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ బాలిక మృతి అనుమానం వ్యక్తం చేసిన బాధిత కుటుంబం -
హత్య కేసులో నిందితుల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): ఉత్తరప్రదేశ్ వాసి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం నెల్లూరులోని నవాబుపేట పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్రెడ్డి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సంత్ కబీర్నగర్ జిల్లాకు చెందిన జైహింద్ సహానీ (40) ఉడ్ పాలిషింగ్ వర్కర్. అతను ఉపాధి నిమిత్తం కొంతకాలం క్రితం నెల్లూరుకు వచ్చాడు. అదే రాష్ట్రం సిద్ధార్థ నగర్ జిల్లాకు చెందిన పరదేశి, రామ్కే ష్తో కలిసి శ్రీనివాస నగర్ ఒకటో వీధిలో నివాసం ఉంటూ నగరానికి చెందిన శివ మేసీ్త్ర వద్ద పనిచేస్తున్నారు. జైహింద్ తమను మందలించడం, పెత్తనం చెలాయించడాన్ని పరదేశి, రామ్కేష్లు జీర్ణించుకోలేకపోయారు. ఈనెల 16వ తేదీ రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో జైహింద్ భోజనం చేస్తుండగా వారు బండరాయితో అతని తలపై కొట్టి హత్య చేశారు. అనంతరం నిందితులు పరారయ్యారు. మృతుడి బంధువు సోను సహాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. వారిని బర్మాషెల్గుంట వద్ద గురువారం అరెస్ట్ చేశామని ఇన్స్పెక్టర్ తెలిపారు. సమావేశంలో ఎస్సై రహిమాన్ తదితరులు పాల్గొన్నారు. -
విషాద యాత్ర
అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన కారు సరదాగా సాగిన యాత్ర ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు, ఓ బాలిక మృతిచెందడంతో కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.● ఒకే కుటుంబంలో ఇద్దరి మృతి ● ఐదుగురికి గాయాలు ● బాధితులది తిరుపతి జిల్లాకొడవలూరు: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఓ బాలిక, ఓ వృద్ధుడు మృతిచెందారు. ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని రాచర్లపాడు వద్ద శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి జిల్లా భాకరాపేటకు చెందిన మహబూబ్బాషా కుటుంబం పదిమంది కారులో హైదరాబాద్ యాత్రకు వెళ్లింది. తిరిగి అదే కారులోనే సొంతూరికి బయలుదేరారు. కొడవలూరు మండలం రాచర్లపాడు సమీపంలో వస్తుండగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న మస్తాన్ సాహెబ్ (67) అక్కడికక్కడే మృతిచెందారు. ఆయేషా (11) అనే బాలిక తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయింది. కారు నడుపుతున్న మహబూబ్బాషాతోపాటు లోపల ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హైవే మొబైల్ సిబ్బంది చొరవతో 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం నెల్లూరు వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారికి ప్రాణాపాయ పరిస్థితి లేదని వైద్యులు తెలిపినట్లు ఎస్సై కోటిరెడ్డి వెల్లడించారు. కారు నడుపుతున్న వ్యక్తి నిద్ర మత్తు కారణంగా అదుపుతప్పి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నామన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కళ్లెదుటే తండ్రి, మేనకోడలి మృతి భాకరాపేటకు చెందిన మహబూబ్బాషా సొంత కారులో కుటుంబ సభ్యులను రెండు రోజుల క్రితం హైదరాబాద్ యాత్రకు తీసుకెళ్లాడు. అక్కడ వివిధ ప్రాంతాలను సందర్శించి సంతోషంగా తిరిగొస్తుండగా రాచర్లపాడు వద్ద ప్రమాదం జరిగింది. బాషా తండ్రి మస్తాన్ సాహెబ్, అక్క కూతురైన ఆయేషాలు మృతిచెందారు. కళ్లెదుటే తండ్రి, మేనకోడలు చనిపోవడం, మిగిలిన కుటుంబ సభ్యులు గాయపడటంతో బాషా కన్నీరుమున్నీరయ్యారు. క్షతగాత్రులు మృతులను చూసి రోదించడం స్థానికులను కలచి వేసింది. -
బార్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం
నెల్లూరు(లీగల్): నెల్లూరు బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. వీసీఎస్ఆర్ న్యాయవాదుల ప్యానెల్, న్యాయవాదుల ఐక్య వేదిక ప్యానెల్, జాతీయ న్యాయవాద ప్యానెల్కు చెందిన అభ్యర్థులు, మద్దతుదారులతో జిల్లా కోర్టు ఆవరణ కిక్కిరిసింది. ఘర్షణలకు తావు లేకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం పది గంటలకు మొదలైన పోలింగ్ రాత్రి 7:30 గంటలకు ముగిసింది. సెల్ఫోన్లను అనుమతించలేదు. పోలీసులు తనిఖీ చేసిన అనంతరం పోలింగ్ కేంద్రంలోకి న్యాయవాదులను పంపారు. 1,362 ఓట్లకు గానూ 1,149 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లెక్కింపు రాత్రి 10 నుంచి మొదలైందని ఎన్నికల అధికారి బి.శ్రీనివాసన్ తెలిపారు. -
ప్రజలకు వేగంగా సేవలు : కలెక్టర్
● ఘనంగా రెవెన్యూ దినోత్సవం నెల్లూరు(అర్బన్): ‘రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది దశాబ్దాల తరబడి ప్రజలతో నేరుగా సత్సంధాలు కలిగి ఉన్నారు. నేడు వచ్చిన ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని వారికి మరింత వేగంగా సేవలందించాలి’ అని కలెక్టర్ ఆనంద్ కోరారు. శుక్రవారం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో రెవెన్యూ దినోత్సవం ఘనంగా జరిగింది. నెల్లూరు కలెక్టరేట్లో ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అల్లంపాటి పెంచలరెడ్డి అధ్యక్షతన వేడుకల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ అసోసియేషన్కు గెస్ట్హౌస్ నిర్మించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అలాగే వచ్చేనెల 11వ తేదీ నుంచి మూడురోజులపాటు ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. జేసీ కార్తీక్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలులో ఆ శాఖ ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ చేతుల మీదుగా రెవెన్యూ అకాడమీ వెబ్సైట్ను ఆవిష్కరించారు. అనంతరం పెంచలరెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ ఉద్యోగిగా ప్రజలకు సేవచేసే అరుదైన అవకాశం ఉద్యోగులకు దక్కిందన్నారు. అనంతరం రిటైరైన పలువురు తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్ తదితర ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. అలాగే పాత్రికేయుడు వేలమూరి శ్రీధర్ను సత్కరించారు. తర్వాత ప్రజల్లో రెవెన్యూ శాఖ ఔన్నత్యాన్ని కాపాడుతామంటూ, జవాబుదారీగా పని చేస్తామని కలెక్టర్తోపాటు అధికారులు, ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. కలెక్టర్ను సన్మానించారు. కార్యక్రమంలో డీఆర్వో ఉదయభాస్కర్రావు, టీజీపీ స్పెషల్ కలెక్టర్ హుస్సేన్ సాహెబ్, కలెక్టరేట్ పరిపాలనాధికారి విజయకుమార్, ఏపీఆర్ఎస్ఏ జిల్లా ప్రధాన కార్యదర్శి డానియేల్ పీటర్, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. -
సీఎం ఇలాకాలోనే మహిళకు రక్షణ ఏదీ?
నెల్లూరు(స్టోన్హౌస్పేట): కూటమి ప్రభుత్వ పాలనలో సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలోనే సామాన్య మహిళలకు రక్షణ లేదని, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీసునంద ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలకు, ఆడపిల్లలకు భద్రత, రక్షణ విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతుందన్నారు. తాజాగా కుప్పంలో శిరీషా అనే మహిళకు జరిగిన ఘోర అవమానానికి కూటమి ప్రభుత్వం సిగ్గుతో తల దించుకోవాలన్నారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇలాంటి ఘటనలు జరిగాయంటే టీడీపీ నేతలు ఎవరి అండ చూసుకుని ఇలా దారుణంగా వ్యవహరించారని ప్రశ్నించారు. బాధితురాలు శిరీషా భర్త తిమ్మరాయప్ప ఓ వ్యక్తి దగ్గర రూ.80 వేలు అప్పు తీసుకుని తిరిగి చెల్లించే క్రమంలో ఆలస్యమవడంతో ఇటువంటి దారుణానికి పాల్పడడం అనాగరిక చర్య అన్నారు. అప్పు ఇచ్చిన మునికన్నప్ప టీడీపీ నాయకుడు కావడంతో అతనిపై తూతూమంత్రంగా చర్యలు తీసుకున్నారన్నారు. టీడీపీ నాయకులు అయితే ఏం చేసినా ఎటువంటి దాడులకు పాల్పడినా చెల్లుబాటు అవుతుందని సీఎం ఈ ఘటనతో స్పష్టం చేశారన్నారు. హోంమంత్రి అనిత తమ నాయకుడు జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి భారతి, పార్టీ నాయకులు రోజా, ఇతర నాయకులను తిట్టడంతోపాటు అక్రమ కేసులు పెట్టి వారిని వేధించడంపై చూపే శ్రద్ధ కొంచమైనా మహిళలు, బాలికలను రక్షించడంలో చూపాలన్నారు. ఎన్నికల ముందు పవన్కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును అడ్డుపెట్టుకుని మహిళల మీద అన్యాయం జరుగుతుందని ఊగిపోయారని, ఇప్పుడు మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై నోరు మెదపడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 188 మంది మహిళలపై అఘాయిత్యాలు, దాడులు జరిగితే పవన్కళ్యాణ్ కానీ, బీజేపీ కానీ కనీసం స్పందించకపోవడం బాధాకరమన్నారు. సుమారు 15 మంది మహిళలను హత్య చేస్తే పట్టించుకోవడం మానేసిన ప్రభుత్వం మద్య పానాన్ని, గంజాయిని రాష్ట్రమంతా విస్తరించే పనిలో ఉందన్నారు. ఇకనైనా చంద్రబాబు కళ్లు తెరిచి రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులను, అత్యాచారాలను, హత్యలను అరికట్టి మహిళలకు భద్రత కల్పించాలని కోరారు. బాధిత మహిళలకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం తోడుగా నిలుస్తుందన్నారు. వారి కోసం పోరాటం చేస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయి మహిళలు, ఆడపిల్లలకు భద్రత కరువు వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ సునంద -
సీఐడీ కేసులో కాకాణికి జూలై 2 వరకు రిమాండ్
నెల్లూరు (లీగల్): సర్వేపల్లి రిజర్వాయర్ నుంచి అక్రమంగా గ్రావెల్ తరలించారని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని రెండో నిందితుడిగా చేర్చి బాపట్ల పరిధిలోని ఏపీ సీఐడీ సిట్ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం గోవర్ధన్రెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి పీటీ వారెంట్పై నెల్లూరు రెండో అదనపు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో సీఐడీ పోలీసులు ప్రవేశ పెట్టారు. సీఐడీ పోలీసులు తరఫున ఏపీపీ లక్ష్మి తమ వాదనలు వినిపించారు. ఈ మేరకు కాకాణికి 14 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి శారదారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, ఎస్ సుబ్బారెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గత వారంలో ఈ కేసులోని ఆరోపణలు ఎదురుకొంటున్న మొదటి నిందితుడు నిరంజన్రెడ్డి రిమాండ్ రిపోర్ట్ను తిరస్కరిస్తూ వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేస్తూ న్యాయమూర్తి పాలమంగళం వినోద్ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. -
నిబంధనలతో కొర్రీలు
వైఎస్సార్సీపీ పాలనలో ఇచ్చిన రైతు భరోసా సంవత్సరం మొత్తం రైతులు ఆర్థిక సాయం (రూ.కోట్లల్లో) 2019–20 2,02,306 273.11 2020–21 2,43,502 328.72 2021–22 2,43,911 329.27 2022–23 2,14,667 289.80 2023–24 2,14,667 289.80 ● అన్నదాత పథకానికి కోత ● 3.19 లక్షల మంది రైతుల దరఖాస్తు ● 1.77 లక్షల మందిని అర్హులుగా గుర్తించిన ప్రభుత్వం ● కౌలు రైతులకు పంగనామాలు ● వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2,14,667 మందికి రైతు భరోసా ● రేపు పీఎంకిసాన్ సాయంతో కలిపి వేస్తామని చంద్రబాబు హామీ ● పథకం అమలుపై ఇప్పటికీ స్పష్టత లేదంటున్న వ్యవసాయశాఖాధికారులు నెల్లూరు (పొగతోట) : కూటమి అధికారంలోకి వచ్చి అన్నదాతల ఆశలను చిదిమేసింది. ఆరుగాలం పండించిన పంటలకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సాగు పెట్టుబడిగా అన్నదాత సుఖీభవ పథకంతో ఏడాదికి రూ.20 వేలు ఇస్తామంటూ ప్రచారం చేసి తొలి ఏడాదిలోనే హామీని తుంగలో తొక్కేశారు. తాజాగా పీఎంకిసాన్ మొత్తాన్ని మినహాయించి రూ.14 వేలు మూడు విడతల్లో ఇస్తామని ఇటీవల చంద్రబాబు ప్రకటించారు. అయితే ఏ విడతలో ఎంత ఇస్తారు.. అసలు పీఎంకిసాన్ నిధులు విడుదల చేసిన రోజే ఇస్తారా? లేదా? అనే విషయంలో వ్యవసాయశాఖాధికారులకే నేటికీ స్పష్టత లేదని తెలుస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా పథకం.. జగన్ బ్రాండ్ చంద్రబాబు గతంలో 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ ఏనాడు అన్నదాతల కోసం ఎలాంటి పథకాన్ని అమలు చేయలేదు. ఆర్థికంగా ఆదుకున్నది లేదు. అధికారంలోకి వచ్చిన ప్రతి సారి రైతులను వంచనకు గురి చేసిన చరిత్ర చంద్రబాబుకు మాత్రమే ఉంది. 2004 ముందు వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారు. వ్యవసాయమే దండగ అని వ్యాఖ్యానించిన చంద్రబాబు, 2014 ఎన్నికల్లో రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తానని నిలువునా మోసం చేశారు. తాజా ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన వైఎస్సార్ రైతు భరోసా పథకం పేరును అన్నదాత సుఖీభవ పథకంగా మార్పు చేసి ఆర్థిక సాయం అందిస్తామని చెబుతున్నారు. కౌలు రైతులు అవుట్ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 2025–26 ఆర్థిక సంవత్సరానికి 3.19 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వివిధ రకాల కారణాలు చూపి వారిలో 1.77 లక్షల మందిని మాత్రమే అర్హులని తేల్చి చెప్పారు. ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ ఇస్తామని హామీలిచ్చినా.. చివరికి గత ప్రభుత్వంలోని అర్హుల్లో సుమారు 50 వేల మందిని తొలగించారు. కౌలు రైతులు అయితే ఈ పథకానికే అర్హులే కాదంటూ విస్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చివరి సంవత్సరంలోనూ 2,14,667 లక్షల మందికి వైఎస్సార్ రైతు భరోసా పథకం సాయం అందించింది. చంద్రబాబు చరిత్ర చూస్తే.. గతంలో రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ అని ప్రచారం చేసి, అధికారంలోకి రాగానే ఒక కమిటీ వేసి నిబంధనలు పెట్టి కొర్రీలు వేసి లక్షల మంది రైతులను తొలగించారు. బ్యాంకుల్లో పెట్టి బంగారాన్ని తిరిగి ఇస్తానని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ నిబంధనలు పెట్టి బంగారాన్ని వేలం వేసి దగా చేశారు. రుణం మొత్తాన్ని ఐదు విడతల్లో ఇస్తామని ఒకటి.. రెండు విడతలు ఇచ్చి మిగతావి ఎగనామం పెట్టారు. అన్నదాత సుఖీభవ జాబితాఅంతన్నాడు.. ఇంతన్నాడు.. ఆఖరికి కొందరికే అన్నదాత సుఖీభవ అంటున్నాడు. వ్యవసాయం దండగ అని విమర్శించిన చంద్రబాబు తిరిగి అధికారంలోకి రావడానికి గతంలో రైతులకు రుణమాఫీ అంటూ మోసం చేశారు. చంద్రబాబు చరిత్రలో రైతుల కోసం ఎలాంటి పథకాన్ని అమలు చేయలేదు. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ అధికారం చేజిక్కించుకునేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవగా పేరు మార్చి ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీలు గుప్పించారు. అధికారం దక్కగానే గతేడాది ఎగనామం పెట్టిన చంద్రబాబు ఈ ఏడాది వచ్చే సరికి నాలిక మడతేసి, పీఎం కిసాన్ మొత్తాన్ని మినహాయించి రూ.14 వేలు ఇస్తామంటూ ఆఖరి రాగం పాడేశారు. గత ప్రభుత్వంలోని లబ్ధిదారుల్లో నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టి వేలాది మందిని తొలగించేశారు. కౌలు రైతులను ఆదుకుంటానని.. జాబితా నుంచే లేపేశారు. ఈకేవైసీ, ఆధార్లింక్, బ్యాంకు అకౌంట్ లింకు కాలేదంటూ తదితర కారణాలు చూపి జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో రైతులను అనర్హులుగా ప్రకటించారు. ఆర్టీజీఎస్ వ్యాలిడేషన్ తర్వాత అర్హులైన రైతులు 1.77 లక్షల మందేనని జిల్లా వ్యవసాయ అధికారులు లెక్కలు తేల్చారు. రైతులు రైతుభరోసా కేంద్రాలకు వెళ్లి వేలిముద్ర వేయాల్సి ఉంది. ఓటీపీ చెప్పాల్సి ఉంటుంది. వీటిపై అవగాహన లేక వేలాది మంది రైతులు వేలిముద్ర వేయలేదు. వారికి అవగాహన కల్పించడంలో సర్కారు పూర్తిగా విఫలమైంది. సర్కారు నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది రైతులు అన్నదాత సుఖీభవకు దూరమయ్యారు. జిల్లాలో అన్నదాత సుఖీభవ మార్గదర్శకాల ప్రకారం రైతు కుటుంబానికి ఒక్కరికి మాత్రమే సంవత్సరానికి రూ.20 వేలు మూడు దఫాలుగా పీఎం కిసాన్తో కలిపి అందించనున్నారు. ప్రకటించిన సాయం ఎప్పుడొస్తుందో తెలియక దయనీయ స్థితిలో రైతులు ఉన్నారు. ప్రస్తుతం ఈకేవైసీ, థంబ్ వేసేందుకు రైతులకు మరో పర్యాయం అవకాశం ఇస్తామని వ్యవసాయ శాఖాధికారులు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థిఽతి చూస్తుంటే ప్రభుత్వం మరొక పర్యాయం ఈకేవైసీ థంబ్ వేసేందుకు అవకాశం కల్పించే అవకాశాలు లేనట్లు కనిపిస్తున్నాయి. -
ఏఎన్ఎం బదిలీల్లో సిఫార్సు లేఖలు
● అర్హులకు అన్యాయం నెల్లూరు (అర్బన్): జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో జరుగుతున్న సాధారణ బదిలీల్లో సిఫార్సులతో అర్హులకు అన్యాయం జరిగింది. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఏపీఎన్జీఓ, ఏపీ జీఈఏ వంటి యూనియన్ల ఆఫీసు బేరర్లకు ప్రాధాన్యత ఉంది. ఈ అవకాశాన్ని అడ్డు పెట్టుకుని ఆఫీసు బేరర్ల కాని వారికి కూడా యూనియన్ల నేతలు రూ.10 వేల నుంచి రూ.20 వేలు వరకు డబ్బులు వసూలు చేసి సిఫార్సు లేఖలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో సీనియర్లకు తీవ్ర నష్టం జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. యూనియన్ల నాయకులు ఇష్టారాజ్యంగా లేఖలు ఇవ్వడంతోనే సీనియారిటీ ఉన్న వారికి దూరంగా.. జూనియర్లకు దగ్గరగా వచ్చారని తెలుస్తోంది. మరో వైపు సీనియారిటీ జాబితా తయారీలోనూ లొసుగులున్నాయనే ఆరోపణలున్నాయి. బుధవారం జరిగిన ఏఎన్ఎం బదిలీల్లో సబ్ సెంటర్లలో పనిచేసే వారి సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకోవాలి. అయితే కొన్నిచోట్ల తప్పులు దొర్లాయి. ఒక చోట పీహెచ్సీని ప్రాతిపదికగా తీసుకుని అక్కడి యూడీసీ సీనియారిటీ జాబితాను వైద్యశాఖకు పంపించారు. అందులో ఒక ఏఎన్ఎం పేరు 13వ స్థానానికి వచ్చింది. ఈ లోపాన్ని గుర్తించిన వైద్యశాఖాధికారులు మళ్లీ సబ్సెంటర్ ప్రాతిపదికగా మరో జాబితాను తయారు చేశారు. దీంతో ఆ ఏఎన్ఎం 13వ స్థానం నుంచి ఏకంగా 108 స్థానానికి వెళ్లిపోయారు. ఇదెలా సాధ్యమని ఆ ఏఎన్ఎం ప్రశ్నిస్తున్నారు. అనుమానాలు, అధికారుల వివరణలతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కౌన్సెలింగ్ జరిపి బదిలీలు చేశారు. 135 ఏఎన్ఎంలు, 5 మంది రిక్వెస్ట్ డాక్టర్లకు బుధవారం కౌన్సెలింగ్ జరిగింది. -
132 మందికి ఉద్యోగాలు
నెల్లూరు (టౌన్): స్థానిక వెంకటేశ్వపురంలోని ప్రభుత్వ బాలికల ఐటీఐలో బుధవారం క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ను నిర్వహించారు. ఈ డ్రైవ్లో బాలికల ఐటీఐతోపాటు సంగం, ఏఎస్పేటల్లోని ప్రభుత్వ ఐటీఐలో చదువుతున్న 160 మంది విద్యార్థులు హాజరు కాగా రాత పరీక్ష, ఇంటర్వ్యూలు అనంతరం 132 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ ఏడుకొండలు తెలిపారు. ఈ డ్రైవ్లో బ్లూస్టార్, గ్రీన్టెక్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్, ఏంపినోల్ తదితర కంపెనీ ప్రతినిధులు హాజరైనట్లు చెప్పారు. మరో ఇద్దరికి కరోనా నెల్లూరు (అర్బన్): జిల్లాలో మరో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది. కోవూరు పట్టణానికి చెందిన 40 ఏళ్ల మహిళ, నెల్లూరు నగరంలోని జెడ్పీ కాలనికీ చెందిన 60 ఏళ్ల విశ్రాంత అధికారి జ్వరం, జ్వరం, గొంతునొప్పి లక్షణాలతో బాధపడుతూ పెద్దాస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. వారికి బుధవారం కరోనా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో వారిని హోం ఐసోలేషన్లో ఉంచి వైద్యశాఖాధికారులు పర్యవేక్షిస్తున్నారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కేసులు 14కి చేరాయి. కాకాణి బెయిల్ పిటిషన్పై తీర్పు రేపు నెల్లూరు (లీగల్): పొదలకూరు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ ఐదో అదనపు జిల్లా (ప్రత్యేక ఎస్సీ ఎస్టీ,)కోర్టులో బుధవారం పూర్తయింది. పోలీసుల తరఫున స్పెషల్ పీపీ విజయమ్మ తమ వాదనలు వినిపించారు. కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి ఇప్పటికే వాదనలు వినిపించారు. ఉభయుల వాదనలు పూర్తికావడంతో కోర్టు న్యాయమూర్తి సరస్వతి తుది తీర్పు శుక్రవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎరువుల కొరత లేదు ● జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి సంగం: జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని, అందుకు అవసరమైన ఎరువులు సిద్ధం చేస్తున్నామని, ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి తెలిపారు. మండలంలోని తలుపురుపాడు పంచాయతీ కార్యాలయంలో బుధవారం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రైతులకు పంటల సాగు, నీటి యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. ప్రస్తుతానికి 11 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించామన్నారు. గోదాముల్లో 1,690 మెట్రిక్ టన్నుల యూరియా, 350 మెట్రిక్ టన్నుల డీఏపీ నిల్వ ఉందన్నారు. రైతులు నానో యూరియా, డీఏపీ వాడాలని కోరారు. గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి రైతులకు సీసీఆర్సీ కార్డులు ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాజున్ని, సంగం సాగునీటి సంఘం అధ్యక్షుడు షేక్ బాబు, వ్యవసాయ శాఖ ఏడీఏలు నర్సోజీ, అనిత, వ్యవసాయాధికారి శశిధర్, వ్యవసాయ విస్తరణాధికారి మనోహర్ తదితరులు పాల్గొన్నారు. -
గంగిశెట్టికి బాలసాహిత్య అవార్డు
ఆనందం మాటల్లో చెప్పలేను ఊహ తెలిసిన నాటి నుంచి చందమామ, బాలమిత్ర కథలు చదివాను. తాను కథలు చదివిన చందమామలో కథలు రాశాను. ఆ పత్రికలో ఉపసంపాదకుడిగా పనిచేశాను. ఆ బాలకథల ద్వారానే బాలసాహిత్యంలో కేంద్రసాహితీ పురస్కారాన్ని అందుకోవడంతో ఈ ఆనందం మాటల్లో చెప్పలే ను. ఈ పురస్కారాన్ని తనను బాల్యంలో ప్రోత్సహించిన తల్లిదండ్రులు చిరంజీవి,అంజనాదేవి, విద్యాబుద్దులు నేర్పిన గురువులతోపాటు దిశానిర్దేశనం చేసి ప్రొఫెసర్ గూడూరు నాగయ్యకుకు అంకితంచేస్తున్నాను. ఈ పురస్కారం కింద నగదుతోపాటు అకాడమీ అవార్డును ఢిల్లీలో రాష్ట్రపతి ద్వారా అందుకోనుండడం సంతోషకరం. – డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ నెల్లూరు(బృందావనం): సాహితీ రంగంలో ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం ఈ ఏడాది నెల్లూరీయుడైన డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ను వరించింది. దాదాపు 57 ఏళ్లుగా ఆయన పడిన సాహితీ సేద్య శ్రమకు ఫలితం దక్కింది. నెల్లూరు జిల్లా అభ్యుదయ రచయితల సంఘం (అరసం) అధ్యక్షుడు గంగిశెట్టి శివకుమార్ ‘కబుర్ల దేవత’ కథలు పుస్తకానికి బాలసాహిత్య విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ పురస్కారాన్ని కేంద్రం బుధవారం ప్రకటించింది. 13వ ఏటే సాహితీ ప్రస్థానం గంగిశెట్టి శివకుమార్ రాపూరులో 1954లో జన్మించారు. జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేసి రిటైరయ్యారు. తన 13వ ఏట సాహితీ ప్రస్థానం ఆరంభించిన గంగిశెట్టి బాలల కథలు రాస్తూనే ఉన్నారు. చందమామ, బాలమిత్ర వంటి పిల్లల పత్రికల్లో తెలుగు, ఆంగ్లంలో చంపక్, గోకులం పత్రికల్లో బాలకథలు రాశారు. అమెరికాలోని బాలల కోసం ‘మూన్బీమ్’ (చంద్రకిరణాలు) ఆంగ్ల కథలు రాశారు. తెలుగులో బాలకథలపై పరిశోధన చేసి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ‘డాక్టరేట్’ అందుకొన్నారు. చందమామ పత్రికలో సబ్ ఎడిటర్గా ఉద్యోగం చేశారు. రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు బాలసాహిత్యానికి సంబంధించి 40 వరకు పరిశోధన పత్రాలు సమర్పణ, బాలబంధు, బాలసాహితీ సామ్రాట్ బిరుదులు పొందారు. ఘన సన్మానం ఈ నేపథ్యంలో స్థానిక రిత్విక్ఎన్క్లేవ్లోని శ్రీవేంకటేశ్వర విద్యాలయంలో అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అంతర్జాతీయ కవి డాక్టర్ పెరుగు రామకృష్ణ, ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టేకుమళ్ల వెంకటప్పయ్య, ప్రధాన కార్యదర్శి డాక్టర్ కరుణశ్రీ, కార్యదర్శి అవ్వారు శ్రీధర్బాబు తదితరులు ఘనంగా సన్మానించి అభినందించారు. -
కూటమి పాలనలో ‘చేనేత’ నిర్వీర్యం
నెల్లూరు (స్టోన్హౌస్పేట): కూటమి ప్రభుత్వం చేనేత వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర మండి పడ్డారు. చీరాల నుంచి చేనేత సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన బుధవారం నెల్లూరుకు వచ్చారు. మినీ బైపాస్లోని ఆ సంస్థ కార్యాలయంలో చేనేత సంఘ నాయకులతో కలిసి సమస్యలు వాటి పరిష్కారాలపై సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు, పాలక మండళ్లను నియమించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ‘నేతన్న నేస్తం’ ద్వారా మగ్గం ఉన్న వారికి ఏడాదికి రూ.24 వేలు ఇచ్చి ఆదుకున్నారని, ఆ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలన్నారు. ఆప్కో చైర్మన్ను నామినేట్ చేసే జీఓను ఇంత వరకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. చేనేత వర్గంపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడాలన్నారు. ఎన్నికల్లో జీఎస్టీపై హామీ ఇచ్చిన లోకేశ్ ఇప్పటి వరకు దాని గురించి చర్చించకపోవడం విచారకరమన్నారు. ఆకలి చావులు లేకుండా చూడాల్సిన ప్రభుత్వం అభివృద్ధి పేరుతో కొంగ జపం చేస్తుందని, పేదల సంక్షేమం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో చేనేత సొసైటీ మాజీ ఇన్చార్జి శీతా సుధాకర్, మాస్టర్ వీవర్ కడవల వెంకటశేషయ్య, చేనేత నాయకులు మదిర దయాకర్ పాల్గొన్నారు. పేదల సంక్షేమంపై నిర్లక్ష్యం తగదు వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏటా రూ.24 వేల సాయం దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర -
మాకూ ‘తల్లికి వందనం’ అమలు చేయాలి
● కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికుల ధర్నా నెల్లూరు (బృందావనం): తమకు తల్లికి వందనంతోపాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు బుధవారం ధర్నా చేపట్టారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వైఓ నందన్కు వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె.పెంచలనరసయ్య, సీఐటీయూ రూరల్ అధ్యక్షుడు కొండాప్రసాద్ మాట్లాడుతూ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పారిశుధ్య కార్మికులందరికి తల్లికి వందనం అమలు చేయాలని సర్క్యులర్ జారీ చేసిన ఇప్పటికీ దరఖాస్తులు తీసుకోవడం లేదన్నారు. మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు వేతనాలు పెంచాలని, వీరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఎవరూ చేయని విధంగా మున్సిపల్ కార్మికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పనులు చేస్తున్నారన్నారు. వీరందరూ దళితులు, గిరిజనులన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. నిరసనలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సుజాతమ్మ, వజ్రమ్మ, లక్ష్మీ, చెన్నయ్య, బుజ్జమ్మ, సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. -
రెడ్క్రాస్ కేన్సర్ ఇన్స్టిట్యూట్కు విరాళం
నెల్లూరు(అర్బన్): పొదలకూరు రోడ్డులోని ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ కేన్సర్ ఆస్పత్రి రేడియోథెరపీ విభాగంలో లిఫ్ట్ కోసం రూ.లక్ష చొప్పున విరాళాన్ని ఇద్దరు దాతలు బుధవారం ప్రకటించారు. ఈ క్రమంలో ఈ మొత్తాన్ని రెడ్క్రాస్ చైర్మన్ వాకాటి విజయకుమార్రెడ్డికి నగరానికి చెందిన దొడ్ల భరత్కుమార్రెడ్డి.. గంగా కన్యాకుమారి అందజేశారు. రెడ్క్రాస్ కోశాధికారి సురేష్జైన్, కేన్సర్ ఆస్పత్రి కో కన్వీనర్ కమలేష్జైన్, మెడికల్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ లక్ష్మి, రేడియోథెరపీ డిపార్ట్మెంట్ హెచ్ఓడీ గీత ఉషశ్రీ, ఆస్పత్రి జీఎం భక్తవత్సలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ఎడ్ల బండలాగుడు పోటీలు
సీతారామపురం : గ్రామదేవత మాతమ్మ తిరునాళ్లలో భాగంగా మండలంలోని సింగారెడ్డిపల్లి అరుంధతీయవాడలో ఎడ్ల బండలాగుడు పోటీలను బుధవారం నిర్వహించారు. ఆత్మకూరు మండలం గొల్లపల్లికి చెందిన మద్దిరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఎడ్లు 20 నిమిషాల్లో 2,106.04 అడుగులు బండను లాగి ప్రథమ స్థానంలో నిలిచాయి. పొట్టేపాళేనికి చెందిన లెనిన్ ఎంటర్ప్రైజెస్ వారి ఎడ్లు 20 నిమిషాల్లో 2,067.3 అడుగులు లాగి ద్వితీయ స్థానాన్ని సాధించాయి. గండ్లవీడు, చిన్నమాచనూరుకు చెందిన ఏలూరి సుమంత్నాయుడు, మండవ హాజరత్నాయుడి ఎడ్లు 20 నిమిషాల్లో 1,526.8.. 1,514 అడుగులు బండలాగి తృతీయ, నాలుగో స్థానాల్లో నిలిచాయి. విజేతలకు వరుసగా రూ.30 వేలు, రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.పది వేల చొప్పున నగదు బహుమతులను అందజేశారు. -
కమనీయం.. వెంగమాంబ కల్యాణం
● వీక్షించి.. పరవశించిన భక్తజనం ● నేటితో ముగియనున్న ఉత్సవాలు దుత్తలూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన నర్రవాడ వెంగమాంబ పేరంటాల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని వెంగమాంబ, గురవయ్య ఉత్సవమూర్తులకు కల్యాణాన్ని నేత్రపర్వంగా బుధవారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన అశేష భక్తజనం వీక్షించి తన్మయత్వం చెందారు. తొలుత విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాన ఆలయం నుంచి వేదిక వద్దకు మంగళవాయిద్యాల నడుమ తీసుకొచ్చారు. అమ్మవారికి పట్టువస్త్రాలను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు సమర్పించారు. వెంగమాంబ పుట్టినిల్లయిన వడ్డిపాళెం నుంచి పసుపు, కుంకుమను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో దేవస్థానం వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను వేదికపై ఉంచి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. కల్యాణాన్ని పచ్చవ, తుమ్మల, వేమూరి వంశస్తులు జరిపించారు. అనంతరం పల్లకిసేవ నిర్వహించారు. అట్టహాసంగా ప్రతానోత్సవం వడ్డిపాళెంలో హంసవాహనంపై వెంగమాంబ, గురవయ్య ఉత్సవమూర్తులను కొలువుదీర్చి ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం బాణసంచాను కాలుస్తూ డప్పు, వాయిద్యాల నడుమ ప్రతానోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. దారిపొడవునా అమ్మవారిని భక్తులు దర్శించుకొని పూజలు చేశారు. నర్రవాడ పురవీధుల మీదుగా సాగింది. నేటి కార్యక్రమాలు బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం పొంగళ్లు పొంగించడం, ఎడ్ల బండలాగుడు పోటీలను నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో బందోబస్తును పోలీసులు ఏర్పాపు చేయనున్నారు. -
ట్యాంపరింగ్.. జంబ్లింగ్ విధానానికే విఘాతం
కందుకూరు రూరల్: ఇంటర్మీడియట్ జవాబు పత్రాల ట్యాంపరింగ్ అనేది జంబ్లింగ్ విధానానికే విఘాతమని గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణారావు, డైరెక్టర్ భరద్వాజ్ పేర్కొన్నారు. కాలేజీకి చెందిన అవినాష్బాబు, సాయితేజశ్విని జవాబు పత్రాల ట్యాంపరింగ్ విషయమై కళాశాలలో విలేకరులతో బుధవారం వారు మాట్లాడారు. ట్యాంపరింగ్ అంశాన్ని బోర్డు అధికారులు నిర్ధారించి బాధిత విద్యార్థులకు మార్కులను కలిపారని తెలిపారు. దీనిపై సంబంధిత వివేకా జూనియర్ కళాశాలపై బోర్డు అధికారులు విచారణ జరిపి రెండు వారాలు దాటినా, నేటికీ చర్యలను చేపట్టలేదని చెప్పారు. పరీక్ష కేంద్రంగా చూపించిన భవనం ఒకటని, విద్యార్థులతో పరీక్ష రాయించిన షెడ్లు వేరుగా ఉందనే విషయాన్ని విచారణలో ప్రశ్నించారని తెలిపారు. వివేకా కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు కాగా, ఆయన స్థానంలో షాహుల్ హమీద్ను అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్గా నియమించారని తెలిపారు. వాస్తవానికి బోర్డు ఐడీ తప్పనిసరని, అయితే షాహుల్ హమీద్కు ఇది లేదన్నారు. ట్యాంపరింగ్ జరిగిన పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్గా పనిచేసిన అధ్యాపకుడ్ని కళాశాల నుంచి తొలగించామని యాజమాన్యం బోర్డు అధికారులకు సమాచారమిచ్చిందని, ఎలాంటి తప్పు చేయకపోతే ఇలా ఎందుకు చేస్తారని ప్రశ్నించారు. బోర్డుకు సమర్పించిన లేఖలో షాహుల్ హమీద్ను ప్రిన్సిపల్గా చూపిస్తూ, సంతకం మాత్రం ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లుగా పెట్టి పంపారని తెలిపారు. కారకులపై త్వరితగతిన చర్యలు చేపట్టాలని కోరారు. -
ఫీడింగ్ ఖర్చు తగ్గించుకునేందుకు..
ప్రాణాంతక వ్యాధులు వస్తాయి చికెన్ వ్యర్థాల్లో పలు రకాల సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాలు, శిలీంద్రాలు, వైరస్లు ఉంటాయి. తగిన విధంగా ప్రాసెస్ చేయకుండా, చేపలకు నేరుగా ఆహారంగా వేయడం వల్ల ఈ–కొలీ వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. దీని వల్ల చేపలతోపాటు మనుషులకు ప్రమాదకరమైన జబ్బులు కలిగిస్తాయి. చేపలను శుభ్రపరిచేటప్పుడు వాటిని తాకిన మనుషులకు అలెర్జీలు, టైఫాయిడ్ జబ్బులు రావొచ్చు. వ్యర్థాల్లో ఉండే అమ్మోనియా నీటిలో కలుషి తం కావడం వల్ల ఆర్సెనిక్, లెడ్ వంటి విష పూరితమైన మూలకాలు నీటిలో కలిసే ప్రమాదం ఉంది. జ్ఞాపక శక్తి తగ్గిపోవడంతోపాటు, నరాల బలహీనతలు వచ్చే ప్రమాదం ఉంది. – డాక్టర్ ఎంవీ రమణయ్య, సీనియర్ వైద్యుడు, పీపీసీ చేపలు.. అదీ నెల్లూరు చేపల పులుసు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఫేమస్. వీటిల్లోని ఒమేగా–3 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని, మెదడు పనితీరును పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు. కానీ ఇప్పుడు నెల్లూరు చేపలు తింటే గుండె, కిడ్నీ, జీర్ణాశయం జబ్బులతోపాటు ప్రధానంగా కేన్సర్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. చేపల పెంపకందారులు వీటికి కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను ఆహారంగా వేస్తుండడమే కారణమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. నీరు, ఆహారం కలుషితం చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా గుంతల్లో వేసినప్పుడు నీరు కలుషితమవుతోంది. పాత నీటిని వదిలి కొత్త నీటిని గుంతల్లోకి వదిలే క్రమంలో ఒక చోట నుంచి మరో చోటుకు కలుషితమైన నీరు చేరడం ద్వారా మానవులకు చర్మ సంబంధిత రోగాలు వస్తాయి. ఇలాంటి చేపలను తినడం ద్వారా మనుషులకు సులభతరంగా జబ్బులు అంటుకుంటున్నాయి. చేపల్లో చేరిన సీసం ద్వారా మనుషుల్లో నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉంది. ఉదర సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి. అందువల్ల చికెన్ వ్యర్థాలను చేపల గుంతల్లో వేయడం మంచిది కాదు. – డాక్టర్ వై.గంగాధర్, ఎండీ, ఫిజీషియన్, లీడ్ హాస్పిటల్, నెల్లూరు ● జీర్ణాశయం, గుండె, కిడ్నీ వ్యాధులు వస్తాయని వైద్యుల హెచ్చరిక ● కేన్సర్ కూడా రావొచ్చని చెబుతున్న డాక్టర్లు ● వీటికి చికెన్ వేస్టే ఫీడింగ్ ● కోవూరు, ఆత్మకూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా వినియోగం ● నిత్యం పట్టుబడుతున్న చికెన్ వ్యర్థాల వాహనాలు ● కట్టడి చేయలేకపోతున్న అధికార యంత్రాంగం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నాన్వెజ్ ఫుడ్లో ఆరోగ్యానికి చేపలు మంచివని వైద్యులు సూచిస్తుంటారు. సంప్రదాయంగా చెరువులు, వాగులు, జలాశయాల్లో పెరిగే చేపలు ఆరోగ్యానికి మేలు చేస్తుండగా, జిల్లాలో వేలాది ఎకరాల్లో కృత్రిమంగా పెంచుతున్న చేపలు తింటే మాత్రం చేటు తప్పదని అదే వైద్యులు హెచ్చరిస్తున్నారు. గతంలో అరకొర మంది చేపల ఉత్పత్తిదారులు ఇలాంటి చికెన్ వ్యర్థాలను చాటుమాటున వినియోగిస్తుంటే.. కూటమి ప్రభు త్వం వచ్చాక విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. కోవూరు షాడో ఎమ్మెల్యే నేతృత్వంలో ‘చికెన్ వేస్ట్ మాఫియా’ ఏర్పాటైంది. కోవూరు నియోజకవర్గంలో అన్ని మండలాలతోపాటు, ఆత్మకూరు, సర్వేపల్లి మండలాల్లో కొన్ని గ్రామాల్లో చేపల పెంపకం జరుగుతోంది. ఈ మాఫియా కనుసన్నల్లోనే అన్ని ప్రాంతాలకు కుళ్లిన చికెన్ వ్యర్థాలను తెచ్చి వినియోగిస్తున్నారు. నెలకు రూ.కోట్లల్లో ఈ వ్యాపారం జరుగుతుంటే ఏ స్థాయిలో వినియోగం ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజారోగ్యాన్ని పణంగా పెట్టి తమ జేబులు నిండితే చాలన్నట్లుగా టీడీపీ నేతలు కాసులు పిండుకుంటున్నారు. పోలీసులు, మత్స్యకార అధికారుల సహకారంతో ఇదంతా జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో డంపింగ్ యార్డులు పర్యావరణాన్ని కాపాడే చర్యల్లో భాగంగా చేపలు, రొయ్యలకు మేతగా కుళ్లిన మాంసాన్ని వేయడాన్ని కేంద్రం సీరియస్గా తీసుకుంది. అనేక దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించిన నేపథ్యంలో రెండేళ్ల క్రితం ప్రత్యేక జీఓ కూడా తెచ్చింది. దీంతో తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు చికెన్ వేస్ట్ను నిర్వీర్యం చేస్తూ చర్యలు చేపట్టడంతో ఇది జిల్లాలో కూటమి నేతలకు వరంగా మారింది. కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం, సంగం ప్రాంతాలకు చెందిన టీడీపీ నేతలు కొందరు మాఫియాగా తయారయ్యారు. ఇందు కోసం బెంగళూరు, చైన్నె, కేరళ ప్రాంతంలో కోళ్ల వ్యర్థాల సేకరణకు ప్రత్యకంగా డంపింగ్ యార్డులు ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్రాల్లో చికెన్ నుంచి వ్యర్థాల సేకరణ చేస్తున్నారు. కేజీ రూ.5 వంతున సేకరించి డంపింగ్ యార్డుల్లోకి చేర్చుకుని అక్కడి నుంచి రాత్రి వేళల్లో లోడింగ్ చేసి నెల్లూరుకు రవాణా చేస్తున్నారు. నెలకు రూ.లక్షల్లో మామూళ్లు ఈ వాహనాలు రాష్ట్రాల చెక్పోస్టులు, జిల్లాలోని టోల్గేట్లు దాటుకుని వస్తున్నప్పుడు వాటిని కట్టడి చేసే అవకాశం ఇటు పోలీసులకు, అటు మత్స్యశాఖ అధికారులు పెద్ద కష్టమేమి కాదు. వీటిని గుర్తించి కట్టడి చేసే అవకాశం ఉన్నప్పటికీ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పోలీస్ శాఖకు ఒక్కో వాహనానికి రూ.10 వేలు వంతున నెలవారీ మామూళ్లు ముట్టజెప్పుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంటే నెలకు వంద వాహనాలు తిరిగితే నెలకు ఒక్కో స్టేషన్కు రూ.10 లక్షలు ఇస్తారు. సర్కిల్, డీఎస్పీ స్థాయి అధికారులతోపాటు మత్స్యశాఖ అధికారులకు ప్రత్యేకంగా మామూళ్లు ఇస్తారనే ఆరోపణలున్నాయి. బెంగళూరు నుంచి కడప సరిహద్దు ప్రాంతం నుంచి వాహనాలు వస్తాయి. చైన్నె, కేరళ నుంచి జాతీయ రహదారి నుంచే వాహనాలు వస్తాయి. ఆయా ప్రాంతాల్లో ప్రతి స్టేషన్కు, సర్కిల్కు నెలవారీ మామూళ్లు ఇస్తుండడంతో ఏ అధికారి ఆ వాహనాల జోలికి వెళ్లడం లేదు. అడపాదడపా రోడ్డు ప్రమాదాలు, వాహనం పాడైతే మాత్రం వ్యర్థాల రవాణా వెలుగులోకి వస్తున్నాయి చేతులెత్తేసిన ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక చికెన్ వ్యర్థాల మాఫియా బరితెగించింది. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి చికెన్ వ్యర్థాల విషయంపై పోలీస్ శాఖకు ఆదేశాలిచ్చారు. నాలుగు నెలల తర్వాత కట్టడి చేస్తామని, క్రాప్ మధ్యలో ఉందని చెప్పారు. కానీ ఎక్కడా ఎమ్మెల్యే ఆదేశాలు అమలు చేయడం లేదు. అడపాదడపా పోలీసులు వాహనాల పట్టివేత చూపిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆత్మకూరు మండంలోని వాసిలి ప్రాంతంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న జనసేన కార్యకర్తలు చికెన్ వ్యర్థాల డంపింగ్ కేంద్రాన్ని చూపించి పోలీసులకు పట్టించారు. ఇంత జరుగుతున్నా.. పాలకులకు తెలియకపోవడం చర్చనీయాంశంగా మారింది.జిల్లాలో ప్రధానంగా కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఇందుకూరుపేట, విడవలూరు, ఆత్మకూరు రూరల్, సంగం, ముత్తుకూరు, తోటపల్లిగూడూరు మండలాల్లో వేల ఎకరాల్లో చేపల పెంపకం జరుగుతోంది. అయితే చేపలకు వినియోగించే ఫీడ్ (ఆహారం) ఖరీదు కావడంతో వీటి పోషణ రైతులకు భారంగా మారింది. సాధారణంగా చేపలు ఒక కేజీ పైబడి పెరగడానికి ఆరు నుంచి ఎనిమిది నెలలు పడుతోంది. రైతుల దగ్గర వ్యాపారులు చేపలను కేజీ రూ.80 నుంచి రూ.90లకే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులకు నష్టాలే ఎక్కువగా వస్తున్నాయి. అదే కోళ్ల మేతగా బ్రాండెడ్ ఫీడ్కు బదులు, ప్రత్యామ్నాయంగా అతి తక్కువ ఖర్చుతో కూడిన కోళ్ల వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగించడంతో నాలుగు నెలలకే కేజీ, అంతకు మించిన బరువు పెరుగుతున్నాయి. దీంతో జిల్లాలో దాదాపు 80 శాతం మంది చేపల రైతులు కోళ్ల వ్యర్థాలనే వినియోగిస్తున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రాంతాల నుంచి కోళ్ల వ్యర్థాలు జిల్లాకు తెచ్చి విక్రయించే మాఫియా తయారైంది. అక్కడ కేజీకి ఐదారు రూపాయలకు కొనుగోలు చేసి ఇక్కడ రూ.15లకు విక్రయిస్తున్నారు. ఈ విధంగా నెలకు సుమారుగా రూ.10 కోట్ల మేర వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. -
మృత్యువై దూసుకొచ్చిన మినీ వ్యాన్
మృత్యువు ఏ రూపంలో వస్తుందో తెలియదు. ఆరు పదులు దాటిన వయస్సులో కూడా బిడ్డలపై ఆధార పడకుండా ఆ దంపతులు చిరు వ్యాపారంతో జీవనం సాగిస్తున్నారు. కావలి– ఉదయగిరి రోడ్డుకు సుమారు ముప్పై అడుగుల దూరంలో నివాసం ఏర్పాటు చేసుకుని అందులోనే చిన్నపాటి ఫలసరుకుల దుకాణం నిర్వహించుకుంటున్నారు. ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు. తమ ఇంట్లోనే ఉంటున్న ఆ దంపతులపైకి ఊహించని మృత్యువులా మినీ వ్యాన్ దూసుకొచ్చింది. దంపతుల శరీర భాగాలు నుజ్జునుజ్జుగా మారి చెల్లాచెదురుగా పడిపోవడం చూస్తే.. దుర్ఘటన తీవ్రతను తెలియజేస్తోంది. -
ప్రైవేట్ గుప్పెట్లోకి ప్రభుత్వ వైద్యం
నెల్లూరు (అర్బన్): ప్రభుత్వ వైద్య రంగాన్ని పబ్లిక్, ప్రైవేట్, పార్టనర్షిప్ (పీపీసీ) పేరుతో ప్రైవేట్ యాజమాన్యాల చేతికి అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం పూనుకుంటోందని ప్రజారోగ్యవేదిక రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ ఎంవీ రమణయ్య, కామేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం నెల్లూరులోని డాక్టర్ జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కళాశాల అనే లక్ష్యంతో రాష్ట్రంలో 17 వైద్య కళాశాలలు నిర్మించిందన్నారు. వీటిలో గత ప్రభుత్వం ప్రారంభించిన నూతన వైద్యకళాశాలలతోపాటు నిర్మాణంలో చివరి దశలో ఉన్న వైద్యకళాశాలలను పీపీపీ మోడ్లో ప్రైవేట్ వారికి అప్పగిస్తామని కూటమి ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించడం దారుణమన్నారు. ఇదే జరిగితే పేదలకు సరైన వైద్యం అందదన్నారు. ప్రజలు వైద్యం కోసం ఎక్కడికెళ్లాలని ప్రశ్నించారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ప్రభుత్వ వైద్యులు కాపాడితే కార్పొరేట్ వైద్యులు తాళాలు వేసుకున్నారని, కొన్ని కార్పొరేట్ ఆస్పత్రులు రూ.కోట్లు సంపాదించుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం తన విధానం మార్చుకోకపోతే రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు చేసి మెడికల్ సీట్లు కొనుగోలు చేయాల్సి వస్తుందన్నారు. పేద, అణగారిన వర్గాల వారికి సీట్లు దక్కవన్నారు. రిజర్వేషన్లు కూడా అమలు జరగవన్నారు. కర్ణాటక, ముంబైలో పీపీపీ మోడ్లో నడుస్తున్న ప్రభుత్వ వైద్యశాలలు విఫలమయ్యాయన్నారు. అలాంటి వ్యవస్థను రాష్ట్రంలో బలవంతంగా అమలు చేయొద్దన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్లో 50 శాతం సీట్లు ప్రభుత్వమే అమ్ముకునేందుకు వీలు కల్పించే జీఓ నంబర్ 107, 108లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీడీపీలో వైద్య రంగానికి 6 శాతం నిధులు కేటాయించాలని, నాణ్యమైన వైద్యాన్ని ప్రజలకు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానంలోనే వైద్య కళాశాలలు, ఆస్పత్రులను నడపాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సదస్సులకు మేధావులు, ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. ఇప్పటికే పలుమార్లు సీఎం చంద్రబాబుకు వినతి పత్రాలు పంపామన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలలు, అనుబంధ ఆస్పత్రులను కొనసాగిస్తామని సీఎం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు జూలై నుంచి శ్రీకారం చుట్టుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రజారోగ్య వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు, నాయకులు కామయ్య పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో కొత్తగా 17 వైద్య కళాశాలల నిర్మాణం వాటిని ప్రభుత్వమే నిర్వహించాలి పీపీసీ పేరుతో ప్రైవేట్కు అప్పగిస్తే ఊరుకునేదిలేదు ప్రజారోగ్య వేదిక రాష్ట్ర నాయకులు -
ఆటోలో నుంచి జారిపడి..
● 108 ఉద్యోగి మృతిసీతారామపురం: మండలంలోని బసినేనిపల్లి గ్రామం వద్ద ఆటోలో ప్రయాణిస్తున్న 108 అంబులెన్స్ ఉద్యోగి ఓంకారం వెంకటనారాయణ రాజు (38) ప్రమాదవశాత్తు జారిపడి మంగళవారం మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. సోమవారం 108లో నైట్ డ్యూటీ చేసిన వెంకటనారాయణరాజు మంగళవారం ఉదయం తన బంధువులు అనారోగ్యానికి గురికావడంతో వారిని ఉదయగిరిలోని ఆస్పత్రిలో చూపించేందుకు ఆటోలో బయలుదేరాడు. డ్రైవర్ పక్కన కూర్చున్న రాజు మార్గమధ్యలో నిద్రమత్తులో ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి జారి రోడ్డుపై పడి గాయాలపాలయ్యాడు. వెంటనే క్షతగాత్రుడిని 108 అంబులెన్స్లో ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందాడు. రాజుకు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉదయగిరికి తరలించారు. -
లోగ్రేడ్ పొగాకును ప్రభుత్వమే కొనాలి
కందుకూరు: లోగ్రేడ్ పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూల వెంకయ్య డిమాండ్ చేశారు. మంగళవారం పామూరు రోడ్డులోని వేలం కేంద్రం వద్ద పొగాకు రైతుల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పంటను అమ్ముకుందామంటే మార్కెట్లో ధరలు నిరాశాజనకంగా ఉన్నాయన్నారు. కిలో గరిష్ట ధర రూ.280 వేస్తున్నారని, లోగ్రేడ్ ఒకటి, రెండు బేళ్లకు మాత్రమే రూ.180 వేస్తున్నారని చెప్పారు. మిగిలిన వాటిని నోబిడ్ వేయడం వల్ల రైతులు తిరిగి వెనక్కి తీసుకెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే దివి శివరాం మాట్లాడుతూ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కోసం రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ ముందుకొచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం జిల్లా సీనియర్ నాయకుడు ముప్పరాజు కోటయ్య మాట్లాడుతూ సంక్షోభ సమయంలో ప్రభుత్వాలు రంగంలోకి దిగి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీసీ లాంటి సంస్థలతో లాలూచి పడకుండా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పాలేటి కోటేశ్వరరావు, సీపీఎం నాయకులు ఎస్ఏ గౌస్, జి వెంకటేశ్వర్లు, జీవీబీ కుమార్, తానికొండ రమణయ్య, రైతులు వలేటి నరశింహం, అల్లం సుమతి, బ్రహ్మయ్య, మాదాల మాధవ, మామిళ్లపల్లి మాధవ, దామా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. 20వ తేదీ ఒంగోలులో రాష్ట్ర స్థాయి సదస్సు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీ ఒంగోలులోని మల్లలింగయ్య భవన్లో నిర్వహించే రైతు సదస్సును జయప్రదం చేయాలని కార్యవర్గ సభ్యుడు కె.వీరారెడ్డి కోరారు. మంగళవారం కందుకూరులోని ఒకటి, రెండు వేలం కేంద్రాలను సీపీఐ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొగాకు కంపెనీలు సిండికేట్గా ఏర్పడి అంతర్జాతీయ మార్కెట్ను సాకుగా చూపి ధరలు తగ్గిస్తున్నాయని ఆరోపించారు. గతేడాది హై గ్రేడ్ను క్వింటా రూ.36 వేలకు కొనుగోలు చేస్తే ఈ ఏడాది రూ.28 వేలకు కొంటున్నారన్నారు. మీడియం గ్రేడ్ను రూ.35 వేలకు గతేడాది కొనుగోలు చేస్తే ప్రస్తుతం రూ.25 వేలకు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. ఇక లోగ్రేడ్ను కొనడమేలేదని వివరించారు. ప్రస్తుతం సరాసరి ధర రూ.243.51 మాత్రమే ఉందని అంటే రోజు రోజుకు ధరలు పతనమవుతున్నట్లు అర్థమవుతుందన్నారు. సదస్సుకు పెద్ద సంఖ్యలో రైతులు హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి బూసి సురేష్బాబు, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి వై.ఆనందమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
వెంగమాంబ బ్రహ్మోత్సవం
అంగరంగ వైభవం..దుత్తలూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన నర్రవాడ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలు మూడురోజులుగా కనుల పండువగా జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి విచ్చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడోరోజు మంగళవారం గ్రామోత్సవం వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై వెంగమాంబ – గురవయ్య దంపతుల ఉత్సవమూర్తులను ఊరేగించారు. ఆలయ సన్నిధిలో సంతానం లేని మహిళలు అమ్మవారి ముందు వరపడ్డారు. ఆలయం నుంచి గ్రామోత్సవం కనుల పండువగా ప్రారంభమై నర్రవాడ, గుదేవారిపాళెం, ఉలవవారిపాళెం మీదుగా సాగింది. అంతకుముందు నర్రవాడలో ఉత్సవ విగ్రహాలకు వేదపండితుల ఆధ్వర్యంలో చక్రస్నానం నిర్వహించారు. వెంగమాంబ దంపతులకు ఏటా పులివర్తి వంశీయులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అయితే ఈ ఏడాది ఆటంకం రావడంతో వారి తరఫున మల్లపాటి చెన్నయ్య – సునీత దంపతులు, నెల్లూరు మహానందం – తిరుపతమ్మ దంపతులు పట్టువ స్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాలకు వేదపండితులు ప్రత్యేకాలంకరణ చేసి పూజలు నిర్వహించి అనంతరం గ్రామోత్సవానికి తీసుకెళ్లారు. నేడు ప్రధాన ఘట్టాలు ఉత్సవాల్లో భాగంగా బుధవారం ప్రధాన ఘట్టాలు నిర్వహిస్తారు. ఉదయం వడ్డిపాళెం నుంచి నర్రవాడ వరకు పసుపు, కుంకుమ ఉత్సవం, అనంతరం వెంగమాంబ – గురవయ్య దంపతుల కల్యాణోత్సవం, రాత్రి ప్రథానోత్సవం జరుగుతాయి. వీఐపీలతోపాటు భక్తులు భారీగా తరలిరానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు ఉదయగిరి సీఐ వెంకట్రావు తెలిపారు. -
పేలుడు సామగ్రి స్వాధీనం
ఉదయగిరి: ఉదయగిరి దుర్గంపై గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయన్న విషయం వెలుగులోకి రావడంతో మంగళవారం అటవీ, పోలీసు శాఖ సిబ్బంది స్పందించారు. దుర్గంపైకి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా దుర్గంపైన ఉన్న రామ బుగ్గ, కరీమ్ బుగ్గ ప్రాంతంలో తవ్వకాలు జరిపినట్లుగా గుర్తించారు. ఆ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకందారులు వదిలివెళ్లిన పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 16 జిలెటిన్ స్టిక్స్తోపాటు విద్యుత్ వైర్లు, పేలుడుకు ఉపయోగించే స్టార్టర్ను స్వాధీనం చేసుకున్నారు. ముఠా కొన్నిరోజులనుంచి దుర్గంపైనే మకాం పెట్టి భారీ స్థాయిలో తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. విలువైన సంపదను కూడా ఈ తవ్వకందారులు తీసుకెళ్లి ఉంటారనే ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. శనివారం రాత్రి ఉదయగిరిలోని దిలావర్భాయి వీధికి చెందిన పలువురు యువకులు పార్టీ చేసుకునేందుకు దుర్గంపైకి వెళ్లారు. వారిని గమనించి గుప్తనిధుల తవ్వకందారుల ముఠా పరారైనట్లు తెలుస్తోంది. -
భార్య హత్య కేసులో భర్త అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): భార్యను హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్ట్చేశారు. మంగళవారం నెల్లూరు బాలాజీనగర్ పోలీస్స్టేషన్లో స్థానిక ఇన్స్పెక్టర్ కె.సాంబశివరావు హత్యకు దారితీసిన పరిస్థితులను వెల్లడించారు. బాలాజీనగర్ వైకే ఆచారి స్కూల్ వీధిలో ఎల్.విజయచంద్ర, శైలజ (46) దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు సంతానం. విజయచంద్ర ట్రెజరీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. శైలజ తండ్రి ఆస్తి కోసం చైన్నె కోర్టులో కేసు వేసి ఓడిపోయింది. కేసుకు సంబంధించి ఆమె భర్తచే రూ.40 లక్షలకు పైగా అప్పు చేయించింది. దీని కారణంగా విజయచంద్ర పిల్లల ఫీజులు సైతం కట్టలేకపోయాడు. ఈ క్రమంలోనే శైలజ భర్తపై అనుమానం పెంచుకుని వేధించసాగింది. విధులకు వెళ్లినా వీడియో కాల్స్ చేస్తుండేది. వేధింపులు తాళలేని విజయచంద్ర భార్యను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 14వ తేదీన అతను కుమారులను భోజనం తీసుకురావాలని ఇంటి నుంచి బయటకు పంపాడు. పథకం ప్రకారం భార్య గొంతుకు టవల్ బిగించి చంపేందుకు యత్నించాడు. ఆమె చావకపోవడంతో రోకలిబండతో బలంగా తలపై కొట్టాడు. ఆమె మృతిచెందిందని నిర్ధారించుకున్న అనంతరం విజయచంద్ర పరారయ్యాడు. మృతురాలి పెద్దకుమారుడు ఎల్.శ్యామ్సాత్విక్ ఫిర్యాదు మేరకు బాలాజీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని ఇన్స్పెక్టర్ సోమవారం అరెస్ట్ చేశారు. కేసు ఛేదనలో ప్రతిభ చూపిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
ఇటీవల జరిగిన ఘటనలు
● పొట్టేపాళేనికి చెందిన ఓ యువకుడు నగరంలోని మందుల దుకాణంలో పనిచేస్తున్నాడు. పనిముగించుకుని ఇంటికి వెళుతుండగా మార్గమధ్యలో మద్యం మత్తులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అతడిని అడ్డగించి కత్తులతో బెదిరించి నగదు, బంగారు ఉంగరం దోచుకెళ్లారు. ● ఐపీఎల్ ఫైనల్స్ రోజు అర్ధరాత్రి కొందరు యువకులు మద్యం మత్తులో జాతీయ రహదారిపై వీరంగం చేశారు. వాహన రాకపోకలకు అంతరాయం కలిగించడంతోపాటు ప్రజలపై దౌర్జన్యం చేశారు. ● రంగనాయకులపేటకు చెందిన ఓ వ్యక్తిని చంపుతామని బెదిరించి రూ.1,500 దోచుకెళ్లారు. ● ముత్తుకూరు బస్టాండ్ వద్ద ఇద్దరు వ్యక్తులు ఒంటరిగా వెళ్తున్న ఓ మహిళను చంపుతామని బెదిరించి రెండు సెల్ఫోన్లను దోచుకెళ్లారు. ● మూడురోజుల క్రితం బీవీనగర్కు చెందిన ఓ యువకుడు ఇంటికి వెళుతుండగా మద్యం మత్తులో ఉన్న కొందరు అడ్డుకున్నారు. చంపుతామని బెదిరించి అతడి వద్దనున్న సెల్ఫోన్ను దోచుకెళ్లారు. -
నిషాలో నేరాలు
కొందరు రాత్రి సమయంలో మద్యం తాగి ఉంటారు. దారిలో వెళ్లే వారిని అడ్డగించి బెదిరించి నగదు దోచుకుంటారు. ఒకప్పుడు ఇలాంటివి ఎక్కడో జరిగితే వినేవాళ్లం. నేడు నిత్యకృత్యమయ్యాయి. జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలో ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.నెల్లూరు(క్రైమ్): కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది. మద్యం, గంజాయి విచ్చలవిడి విక్రయాలతోపాటుగా ఇతర మత్తు ఉత్ప్రేరకాలు అందుబాటులో ఉంటుండటంతో నిషా మత్తులో నేరాలు అధికమయ్యాయి. ప్రశాంత సింహపురి నేరపురిగా మారుతోంది. పాతనేరస్తులు, వ్యసనాలకు బానిసైన కొందరు తమ అవసరాలకు సరిపడా నగదు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. కత్తులు, మారణాయుధాలను చేతబూని రాత్రివేళల్లో ఒంటరిగా వెళ్లేవారిని చంపుతామని బెదిరించి, దౌర్జన్యం చేసి నగదు, సెల్ఫోన్లు దోచుకెళుతున్నారు. ఎదురు తిరిగిన వారిపై దాడులకు వెనుకాడటం లేదు. ఇంకొందరు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ప్రజలపై దాడులు చేస్తున్నారు. నెల్లూరు నగరంలో ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అని లేకుండా అన్నిచోట్లా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. బాధితుల్లో కొందరు పోలీసులకు ఫిర్యాదులు చేస్తుండగా మరికొందరు భయంతో పోలీస్స్టేషన్ వరకు వెళ్లడం లేదు. ఇదే అదునుగా భావించిన కొందరు యథేచ్ఛగా నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. భయంతో.. ఏ వేళలో అయినా ప్రజలు నిర్భయంగా నగరంలో రాకపోకలు సాగించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనుమరుగవుతోంది. ఇంటి నుంచి బయటకు వస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరు దాడి చేస్తారోనన్న భయంతో నగరవాసులు భయాందోళనకు గురవుతున్నారు. నేర నియంత్రణకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ పాతనేరస్తులు, ఆకతాయిల భరతం పడుతున్నా పరిస్థితుల్లో మాత్రం మార్పురావడం లేదు. ఇప్పటికై నా పోలీసు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టాలి. మత్తులోనే నేరాలు అధికంగా జరుగుతుండటంతో మద్యం అనధికార విక్రయాలు, గంజాయి విక్రయాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయాలి. అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక శక్తులు, పాతనేరస్తుల కదలికలపై నిఘా పెంచి వారిపట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. ఒంటరిగా కనిపిస్తే అంతే.. కత్తులతో బెదిరించి నగదు, సెల్ఫోన్ల దోపిడీ వరుస ఘటనలతో భయం గుప్పిట్లో జనం పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాలంటున్న నగరవాసులు -
చికెన్ వ్యర్థాల వాహనం పట్టివేత
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలోని పంచేడు గ్రామంలో చికెన్ వ్యర్థాలు తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. సోమవారం అర్ధరాత్రి గ్రామం మీదుగా చికెన్ వ్యర్థాలతో వాహనం వెళ్తుండగా స్థానికులు దుర్గంధం భరించలేక అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. రాత్రి వేళల్లో చికెన్ వ్యర్థాల వాహనాలు పదుల సంఖ్యలో తమ గ్రామం మీదుగా వెళ్తున్నాయని, పోలీసులు నిఘా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. నూతన రహదారితో ప్రజలకు ఉపయోగంఆత్మకూరు రూరల్: ఆత్మకూరు మండలం రామస్వామిపల్లి నుంచి మర్రిపాడు మండలం డీసీపల్లి మీదుగా వెన్నవాడ, గండ్లవేడులను తాకుతూ వింజమూరు మండలం నల్లగొండ్ల వరకు పీఎంజీఎస్వై పథకంలో నిర్మిస్తున్న రహదారి మూడు మండలాలకు ప్రయోజనకరంగా ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ అశోక్ పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణ పనులను తన శాఖ అధికారులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గండ్లవేడు – నల్లగొండ్ల మధ్య నిర్మించిన తారు, సిమెంట్ రోడ్లతోపాటు వెన్నవాడ బొగ్గేరు వద్ద నూతనంగా నిర్మించిన కాజ్వే పనులను ఆయన క్షేత్ర పరిశీలన చేశారు. అనంతరం డీసీపల్లి – రామస్వామిపల్లి మధ్యలో నిర్మించిన సిమెంట్ రోడ్లు, తారురోడ్లను పరిశీలించి పలు సూచనలిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారం, పదిరోజుల్లో ఈ రహదారుల నిర్మాణాలను పూర్తి చేయడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అయితే వెన్నవాడ వద్ద సుమారు 250 మీటర్ల మేరకు స్థానికులు రహదారి నిర్మాణానికి ఇబ్బందులు కల్పిస్తున్న కారణంగా ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చిన తర్వాత నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ ప్రాజెక్ట్ విభాగం డీఈ సుధాకర్రెడ్డి, ఏఈ ప్రసాద్, గండ్లవేడు స్థానిక నాయకుడు కొల్లి దొరస్వామినాయుడు తదితరులు పాల్గొన్నారు. సాగునీరు విడుదలసైదాపురం: కండలేరు 2ఏ, 2బీ బ్రాంచ్ కెనాళ్లకు సాగునీరు విడుదల చేశారు. ఈ ఏడాది ఎడగారు పంటలకు సైదాపురం మండలానికి వచ్చే ప్రధాన కాలువలైన 2ఏ, 2బీ కెనాళ్లకు నీటిని విడుదల చేశారు. దీంతో మండలంలోని తుమ్మల తలుపూరు, కలిచేడు, ఓరుపల్లి, మలిచేడు, కట్టబడిపల్లి, దేవరవేమూరు, తురిమెర్ల, ఊటుకూరు, గిద్దలూరు, జోగిపల్లి, పోక్కందల, ఆదూరుపల్లి, మొలకలపూండ్ల, సైదాపురం, రామసాగరం, పెరుమాళ్లపాడు, పరసారెడ్డిపల్లి చెరువులకు 2ఏ బ్రాంచి కెనాల్ ద్వారా సాగు నీరు వస్తోంది. సుమారు 16వేల మాగాణి భూములకు సాగునీరు అందనుండటంతో రైతులు పంటల సాగు చేపట్టనున్నారు. అలాగే 2బీ కాలువ ద్వారా చీకవోలు, అన్నంరాజుపల్లి, రాజులెరుగుంటపాళెం, పోతేగుంట, చాగణం, రాగనరామాపురం, తిప్పిరెడ్డిపల్లి, లింగసముద్రం, కమ్మవారిపల్లి, గంగదేవిపల్లి, అనంతమడుగు, పాలూరు, తోకలపూడి, వేములచేడు గ్రామాల్లో సుమారు 14,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. -
ఉదయగిరి దుర్గంపై పేలుడు సామగ్రి
ఉదయగిరి రూరల్: ఉదయగిరి దుర్గంపై పేలుడు సామగ్రిని కొంతమంది యువకులు గుర్తించారు. ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నా యి. ఉదయగిరి పట్టణానికి చెందిన యువకులు శనివారం రాత్రి దుర్గంపై ఉన్న పెద్ద మసీదు వద్దకు నిద్రించేందుకు వెళ్లారు. వారు మసీదు వద్దకు వెళ్తున్న సమయంలో రామ్, కరీం బుగ్గ ప్రాంతంలో దీపాల వెలుతురు రావడం, వ్యక్తులు ఆ ప్రాంతంలో సంచరిస్తుండడాన్ని గమనించారు. ఆ సమయంలో అక్కడికి వెళ్లేందుకు యువకులు భయపడ్డారు. ఆదివారం తిరిగి ఇళ్లకు బయలుదేరారు. వచ్చే సమయంలో శనివారం రాత్రి దీపాలు వెలుగుతున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ప్లాస్టిక్ కవర్లో పేలుడు సామగ్రి, భోజనం చేసే ప్లేట్లు తదితరాలను గుర్తించారు. రాత్రి ఆ ప్రాంతంలో ఉన్నది గుప్తనిధుల ముఠాయేనని నిర్ధారించుకుని అక్కడి నుంచి కిందకు పరుగులు తీశారు. గతంలో కూడా దుర్గం కొండపై గుప్తనిధుల తవ్వకాలు జరిపే సమయంలో పేలుడు సంభవించి ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతిచెందాడు. -
ఇళ్ల నిర్మాణంపై ప్రతి వారం సమీక్షలు
● కలెక్టర్ ఆనంద్ నెల్లూరు(అర్బన్) : ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఎంపీడీఓలు ప్రతి వారం సమీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్ నుంచి సోమవారం సాయంత్రం తహసీల్దార్లు, ఎంపీడీఓలు, స్పెషలాఫీసర్లు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలు పొందుతున్న ప్రజల అభిప్రాయాలను సచివాలయ సిబ్బంది ద్వారా తెలుసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఇచ్చిన అర్జీలను పెండింగ్ లేకుండా పరిష్కరించాలని సూచించారు. ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని కోరారు. ప్రతి వారం కనీసం 70 శాతం పనులు తగ్గకుండా చూడాలన్నారు. ప్రతి గిరిజన కుటుంబానికి ఆధార్కార్డులు అందేలా ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలన్నారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రజలకు చేరువ చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ కార్తీక్, డీఆర్వో ఉదయభాస్కర్రావు, కార్పొరేషన్ కమిషనర్ నందన్, జెడ్పీ ఇన్చార్జి సీఈఓ మోహన్రావు, హౌసింగ్, డ్వామా పీడీలు వేణుగోపాల్రావు, గంగాభవాని, విద్యుత్ శాఖ ఎస్ఈ విజయన్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీపీపై చర్యలు చేపట్టాలంటూ..
● కలెక్టర్కు వైఎస్సార్సీపీ నాయకుల వినతి నెల్లూరు(అర్బన్): ఆత్మకూరులో శిథిలావస్థకు చేరిన పూర్వపు ఎంపీడీఓ కార్యాలయం కూల్చివేత సందర్భంగా అక్రమంగా టేకు తదితర ఖరీదైన కలపను తరలించిన మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు (ఎంపీపీ) కేతా వేణుగోపాల్రెడ్డిపై చర్యలు చేపట్టాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో నేతలు పెమ్మసాని ప్రసన్నలక్ష్మి, బోలిగర్ల వెంకటేశ్వర్లు, బొమ్మిరెడ్డి రవికుమార్రెడ్డి కలెక్టర్ ఆనంద్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవనాన్ని ఇటీవల రూ.1.68 లక్షలు ఖర్చుతో అధికారులు కూల్చివేయించారన్నారు. అందులో ఉన్న ఖరీదైన కలపను వేణుగోపాల్రెడ్డి అధికారుల అనుమతి లేకుండానే తన స్వగ్రామమైన చెర్లోయడపల్లికి తరలించాడన్నారు. ఈ విషయం పత్రికల్లో రావడంతో తాము ఎంపీడీఓను ప్రశ్నించామన్నారు. దీంతో ఎంపీపీ గత సర్వసభ్య సమావేశంలో అనుమతి పొందారంటూనే కలప తన పరిధిలోనిది కాదని పంచాయతీరాజ్ ఏఈ పరిధిలోకి వస్తుందని తెలిపారన్నారు. దీనిపై మళ్లీ కథనాలు రావడంతో ఎంపీపీ కలపను ఈనెల 7వ తేదీన ఎంపీడీఓ కార్యాలయానికి తిరిగి చేర్చారన్నారు. అందులో ఖరీదైన 70 శాతం కలప మాయమైందని, 30 శాతం మాత్రమే తిప్పి పంపారన్నారు. ఈ కొంచెం కలపను ఈనెల 18న వేలానికి పెడుతున్నట్టు అధికారులు తెలిపారన్నారు. కలెక్టర్ స్పందించి మిగతా 70 శాతం కలపను రికవరీ చేయించాలని, అక్రమంగా తరలించిన ఎంపీపీపై, సహకరించిన ఎంపీడీఓ, పంచాయతీరాజ్ ఏఈపై చర్యలు చేపట్టాలని, వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలని కోరారు. దీనికి ఆనంద్ సానుకూలంగా స్పందించారు. -
జిల్లాలో చెలరేగిపోతున్న పచ్చ మాఫియా
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి ప్రభుత్వంలో గ్రావెల్ మాఫియాకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా భారీ యంత్రాలతో కొండలను పిండి చేయడంతో పాటు పొలాలు, చెరువులను అగాధాలుగా మారుస్తున్నారు. ప్రకృతిని ధ్వంసం చేసి కోట్లాది రూపాయలను దోచుకుని జేబులు నింపుకొంటున్నారు. అదే సామాన్యుడు సొంత అవసరాల కోసం తట్టమట్టి కూడా తోలుకునే పరిస్థితి లేదు. గత ప్రభుత్వంలో గ్రావెల్ దందా జరిగిందని గగ్గోలు పెట్టిన టీడీపీ నేతలు ప్రస్తుతం అదే దోపిడీ కొనసాగిస్తున్నారు. మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు నెలవారీ మామూళ్ల మత్తులో జోగుతున్నాయి. జిల్లా అధికారులు సైతం సహజ వనరుల దోపిడీని గుడ్లప్పగించి చూస్తున్నారే తప్పా నిలువరించే ప్రయత్నాలు చేయడం లేదు.కావలిలో ఆగని దందాజాతీయ రహదారుల అభివృద్ధి పనుల కోసం కావలి నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పగలు, రాత్రి తవ్వకాలు సాగిస్తున్నారు. కావలి పెద్దచెరువుతో పాటు రుద్రకోట, అల్లూరు మండలం నార్తుఆములూరు, దగదర్తి మండలం ఉలవపాళ్ల, తదితర ప్రాంతాల్లో గ్రావెల్దందా నిర్విరామంగా సాగుతోంది. కావలి మండలం కొత్తపల్లి, తాళ్లపాళెం, చలంచర్ల చెరువులను సైతం గుల్ల చేస్తున్నారు.సర్వేపల్లిలో భారీ ఎత్తున..సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం, పొదలకూరు, ముత్తుకూరు, మనుబోలు మండలాల్లో అధికార పార్టీ నాయకులు గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్నారు. ఫిర్యాదులు అందితే కొద్దిరోజులు ఆపి ఆ తర్వాత యథావిధిగా కొనసాగిస్తున్నారు. వెంకటాచలం మండలంలో భారీ ఎత్తున గ్రావెల్ను అక్రమంగా తరలిస్తూ కోట్లాది రూపాయలను జేబుల్లో వేసుకుంటున్నారు. సర్వేపల్లి పంచాయతీ నాగబొట్లకండ్రిక నుంచి అదానీ కృష్ణపట్నం పోర్టుకు స్వయంగా ప్రధాన నాయకుడి కనుసన్నల్లో గ్రావెల్ను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికార ఒత్తిళ్లతో మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు.ఇరిగేషన్ చెరువులే లక్ష్యంగా..కందుకూరు నియోజకవర్గంలో ఇరిగేషన్ చెరువులు, కుంటలను లక్ష్యంగా చేసుకుని గ్రావెల్ మాఫియా దందా సాగిస్తోంది. అధికార పార్టీ అండదండలతో ఇష్టారీతిన గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నారు. ప్రధానంగా ఉలవపాడు, గుడ్లూరు, లింగసముద్రం, వలేటివారిపాళెం, కందుకూరు మండలాల పరిధిలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. ఉలవపాడు మండలంలోని ఇరిగేషన్ చెరువుల నుంచి పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఎల్.రాజుపాళెం చెరువులో గ్రావెల్ తవ్వకాలు ఇష్టారీతిన సాగుతున్నాయి. కొందరు ప్రైవేట్ వ్యక్తులు పెద్దఎత్తున మట్టి తవ్వకాలు చేస్తున్నారు. దీని గురించి ఇరిగేషన్ అధికారులు సమాచారం ఉన్నా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. గుడ్లూరు మండలంలోని చెరువుల్లోనూ ఇష్టారీతిన తవ్వకాలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఇరిగేషన్శాఖలో పనిచేసే ఓ ఉన్నతాధికారి మట్టిమాఫియాకు అండదండలు అందిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కందుకూరు మండలం కొండికందుకూరులోని కుంట నుంచి పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. స్వయంగా సర్పంచ్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్ననాథుడు లేడు. అలాగే లింగసముద్రం మండలం మాలకొండరాయునిపాళెం చెరువు నుంచి అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తాను వేస్తున్న రోడ్డుకు భారీగా మట్టి తవ్వకాలు జరిపాడు. ఇలా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికార పార్టీ కి చెందిన కొందరు నాయకులు పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు జరిపి విక్రయించుకుంటున్నారు. అయినా ఇరిగేషన్శాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు.అధికార పార్టీ నేతల దయాదాక్షిణ్యాలపై..ఉదయగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల దయాదాక్షిణ్యాలపైన గ్రావెల్ అక్రమ రవాణా సాగుతోంది. పేదలు తమ కనీస అవసరాల కోసం గ్రావెల్ తోలుకోవాలన్నా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీ నేతలు మాత్రం రేయింబవళ్లు అనుమతులు లేకుండా లేఅవుట్లకు గ్రావెల్ను తరలిస్తూ దోచేస్తున్నారు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన రాయితీకి గండిపడుతోంది. ఉదయగిరిలోని చెరువుల నుంచి ఇటుకబట్టీలు, లేఅవుట్ల కోసం గ్రావెల్ తరలిస్తున్నారు. దుత్తలూరుతోపాటు నందిపాడు, తదితర గ్రామాల్లో గ్రావెల్ అక్రమ దందా కొనసాగుతోంది. వింజమూరు మండలం పాతూరు, యర్రబల్లిపాళెం చెరువుల నుంచి పెద్ద మొత్తంలో గ్రావెల్ను లేఅవుట్ల కోసం తరలిస్తున్నారు. కలిగిరి మండలం కృష్ణారెడ్డిపాళెం, కమ్మవారిపాళెం, తదితర ప్రాంతాల్లో లేఅవుట్ల కోసం గ్రావెల్ను తరలిస్తున్నారు. వరికుంటపాడు మండలంలో పిల్లాపేరు బ్రిడ్జికి అతి సమీపంలో గ్రావెల్ను తరలిస్తుండటంతో పెద్దపెద్ద గోతులు ఏర్పడి వంతెన మనుగడ ప్రమాదకరంగా మారింది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో మోసం
నెల్లూరు(క్రైమ్): చిత్తూరుకు చెందిన స్వరూప్ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.40 లక్షలు తీసుకుని మోసగించారని దగదర్తి పరిసర ప్రాంతాలకు చెందిన 23 మంది బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అతడిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వారు కోరారు. నెల్లూరు ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 70 మంది విచ్చేసి తమ సమస్యలను వినతుల రూపంలో మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ చెంచురామారావుకు అందజేశారు. వినతులను పరిశీలించిన ఆయన చట్టపరిధిలో సమస్యలు పరిష్కరించాలని ఆయా ప్రాంత పోలీసు అధికారులకు సూచించారు. కార్యక్రమంలో లీగల్ అడైజ్వర్ శ్రీనివాసులురెడ్డి, ఎస్బీ– 2 ఇన్స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● కోవూరుకు చెందిన రోహిత్ నా కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని రూ.6 లక్షలు తీసుకుని మోసగించాడని కోవూరుకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ● నా భర్త మరణానంతరం చిన్నకుమారుడు, కోడలు తిడుతూ ఇబ్బందులు పెడుతున్నారు. కౌలు డబ్బులు, ఇంటి కాగితాలు తీసుకుని నా బాగోగులను పట్టించుకోవడం లేదు. విచారించి న్యాయం చేయాలని కావలి రూరల్ పరిధికి చెందిన ఓ మహిళ కోరారు. ● చెడు అలవాట్లకు బానిసైన నా భర్త నా పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. నాతోపాటు నా పిల్లల బాగోగులను పట్టించుకోవడం లేదు. కౌన్సెలింగ్ నిర్వహించి కాపురాన్ని చక్కదిద్దాలని నవాబుపేటకు చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు. ● నా భర్త మరణించాడు. ఇందుకూరుపేటకు చెందిన ఎ.శీనయ్య నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. అసభ్యంగా తిడుతూ వేధిస్తున్నాడు. అతడిపై చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలని అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళ విజ్ఞప్తి చేశారు. ● నా తమ్ముడు కొంతకాలం కిందట తప్పిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసినా ఇంతవరకూ ఆచూకీ తెలియజేయలేదు. తగిన చర్యలు తీసుకోవాలని వేదాయపాళేనికి చెందిన ఓ వ్యక్తి కోరాడు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 70 ఫిర్యాదులు -
కాకాణి బెయిల్ పిటిషన్పై విచారణ రేపు
నెల్లూరు(లీగల్): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ నెల్లూరు ఐదో అదనపు జిల్లా జడ్జి (ప్రత్యేక ఎస్సీ ఎస్టీ) కోర్టు న్యాయమూర్తి సరస్వతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గోవర్ధన్రెడ్డి బెయిల్ పిటిషన్పై పోలీసుల తరఫున స్పెషల్ పీపీ వాదనలు వినిపించాల్సి ఉంది. కాగా పీపీ అత్త మృతిచెందగా వాదనలను మరోరోజుకు వాయిదా వేయాలని కోరుతూ కేసులోని దర్యాప్తు అధికారి కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో న్యాయమూర్తి బెయిల్ పిటిషన్పై వాదనల కొనసాగింపును బుధవారానికి వాయిదా వేశారు. ● గోవర్ధన్రెడ్డిపై ముత్తుకూరు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ విచారణను ఈనెల 19వ తేదీకి వేయిదా వేస్తూ నెల్లూరు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ – సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జి. శ్రీనివాస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా వెంకటాచలం పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో కాకాణి దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ విచారణను ఈనెల 19కు వాయిదా వేస్తూ నెల్లూరు నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కె.శ్రీనివాసరావు ఉత్తర్వులిచ్చారు.కలెక్టర్ను కలిసిన ఐఏఎస్ అధికారులునెల్లూరు(అర్బన్): శిక్షణలో భాగంగా ఏపీ దర్శన్ కింద ఏడుగురు ఐఏఎస్ అధికారులు సోమవారం నెల్లూరుకు వచ్చారు. వీరు కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్ను కలెక్టరేట్లో కలిశారు. జిల్లాలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి ఆనంద్ వివరించారు. వీరికి ఉదయగిరి ఉడెన్తో చేసిన వస్తువులను బహూకరించారు. యువ ఐఏఎస్లు కృష్ణపట్నం పోర్టును సందర్శించారు. డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి పాల్గొన్నారు. చికెన్ వ్యర్థాల పట్టివేత● టీడీపీ, జనసేన నేతల మధ్య వాగ్వాదం ఆత్మకూరు రూరల్: మండలంలోని వాశిలి చెరువుకట్టపై చికెన్ వ్యర్థాలను జనసేన నియోజకవర్గ ఇన్చార్జి నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో సోమవారం ఆ పార్టీ నాయకులు పట్టుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జనసేన నేతలు బండి అనిల్ రాయల్, డబ్బుకొట్టు నాగరాజు యాదవ్ తదితరులు మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గ వ్యాప్తంగా చేపల పెంపకం చేసే చెరువుల్లో కర్ణాటక నుంచి వచ్చే చికెన్ వ్యర్థాలు వాడుతున్నారన్నారు. స్థానికంగా ఉన్న రాజకీయ నేతల ప్రోద్బలంతో ఈ తంతు జరుగుతున్నట్లు తెలిపారు. ఈ విషయమై ఆత్మకూరు ఆర్డీఓ భూమిరెడ్డి పావని, డీఎస్పీ వేణుగోపాల్కు ఫిర్యాదు చేశామన్నారు. వాశిలి గ్రామంతోపాటు పరిసర గ్రామాల్లో ఉన్న టీడీపీ, కూటమి నాయకుల ప్రమేయంతో ఈ వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చికెన్ వ్యర్థాల రవాణాకు అండగా ఉన్న టీడీపీ నాయకులు ఘటనా స్థలానికి చేరుకుని జనసేన నేతలతో వాగ్వాదానికి దిగారు. రెండు వాహనాలను పట్టించడంపై మండిపడ్డారు. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులే పనివాళ్లు● పుస్తకాలు మోస్తున్న వైనం ఆత్మకూరు: విద్యార్థులను కూలీలుగా మార్చేసిన వైనమిది. మండల కేంద్రమైన అనుమసముద్రంపేట మెయిన్ పాఠశాలకు ఎంఈఓ నేతృత్వంలో పాఠ్యపుస్తకాలు వారంరోజుల క్రితం చేరాయి. తొలి రెండురోజులు పుస్తకాలను కొన్ని బడులకు ఎంఈఓ–2 నేతృత్వంలో సరఫరా చేశారు. ఇంకా మరికొన్నిచోట్లకు పుస్తకాలను సరఫరా చేసేందుకు సోమవారం గ్రామాల్లోని స్కూళ్ల ఉపాధ్యాయులు మండల కేంద్రానికి చేరుకున్నారు. విద్యార్థులచే పుస్తకాలను మోటార్బైక్ వరకు మోయించారు. దీనిని చూసిన పలువురు విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయమై డిప్యూటీ డీఈఓ ఎన్వీ జానకీరామ్ను సంప్రదించగా తనకు ఇప్పుడే సమాచారం తెలిసిందని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. -
విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నారు
జిల్లాలో మాంటిస్సోరి, శాటిలైట్ ఫౌండేషన్ల పేరుతోనో.. మరొక పేరుతోనో ఎల్కేజీ, యూకేజీ లాంటి ప్రీ ప్రైమరీ పాఠశాలలు 500 వరకు ఉన్నాయి. వాటిలో కేవలం ఏడు మాత్రమే విద్యాశాఖ గుర్తింపు పొందాయి. మిగతావాటిని గుర్తింపు లేకుండా అక్రమంగా నడుపుతున్నారు. విద్యార్థుల నుంచి వేలాది రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారు. అదనపు గంటలతో పాఠశాలలు నిర్వహిస్తున్నారు. సమాచార హక్కు చట్టంతో ఆధారాలు తీసుకుని సమర్పిస్తున్నాం. పిల్లలను శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు. దీనిపై చర్యలు చేపట్టాలి. – శిఖరం నరహరి, కోట శ్రీనివాసులురెడ్డి, రాజశేఖర్ యాదవ్, శ్రీనివాసరావు, పేరెంట్స్ అసోసియేషన్ -
పొలాన్ని ఆక్రమించాలని చూస్తున్నారు
మానాన్న కాలం నాటి నుంచి గ్రామంలోని ప్రభుత్వ శివాయి భూమి 2.50 ఎకరాలు మా సాగుబడిలో ఉంది. అప్పట్లోనే భూమి చదును, బాగు కోసం రూ.50 వేలు, మోటార్కు, బోరుబావికి మరో రూ.లక్ష ఖర్చు చేశాం. 30 ఏళ్ల నుంచి ఉలవలు, జామాయిల్ లాంటి పంటలు పండించాం. 17 ఏళ్ల నుంచి మామిడి తోట వేశాం. ప్రభుత్వ రీసర్వేలో సైతం సాగుబడి కింద మా పేర్లు నమోదు చేశారు. ఇటీవల వెలిచర్ల అంకమ్మ, వారి కుటుంబ సభ్యులు ఆ భూములు తమవంటూ దౌర్జన్యం చేస్తున్నారు. దీంతో తమ భూములను 10 – 1 అడంగళ్లో ఎక్కించి పట్టాదారు పాస్పుస్తకాలు ఇప్పించాలని కలెక్టరేట్లో సంవత్సరం క్రితం అర్జీ ఇచ్చాను. కలెక్టర్ ఆ అర్జీని ఆర్డీఓకు పంపారు. ఆయన తిప్పుకొన్నారు. ఇప్పుడు బదిలీ అయ్యారు. నా భూమికి పాస్ పుస్తకాలు ఇప్పించాలంటూ ఇప్పటికే మూడు దఫాలు కలెక్టరేట్కు వచ్చి అర్జీలిచ్చాం. సమస్యకు పరిష్కారం చూపాలి. – చీదర్ల మాల్యాద్రి, లక్ష్మీకాంతమ్మ, కేశవరం గ్రామం, జలదంకి మండలం -
వైభవంగా వెంగమాంబ గ్రామోత్సవం
దుత్తలూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన నర్రవాడ వెంగమాంబ పేరంటాలు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం నర్రవాడలోని ఆలయంలో వెంగమాంబ, గురవయ్య దంపతులకు విశేషాభిషేకాలు, పూజలు, హోమాలు నిర్వహించారు. రాత్రికి వెంగమాంబ పుట్టినిల్లు అయినా వడ్డిపాళెంలోని రేణుకా ఎల్లమ్మతల్లి ఆలయం వద్ద వెంగమాంబ దంపతుల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. నర్రవాడ, గుదేవారిపాళెం, ఉలవవారిపాళెం, తదితర గ్రామాల్లో గ్రామోత్సవం సాగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. హోమగుండంలో ఎండుకొబ్బరి వేసి మొక్కులు తీర్చుకున్నారు. కాగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి కూడా అమ్మవారి గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. -
రామతీర్థం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
కోవూరు: జిల్లాలోని శైవ క్షేత్రాల్లో అతిపురాతన, ఎంతో ప్రాశస్త్యం కలిగిన విడవలూరు మండలం రామతీర్థంలోని కామాక్షిదేవి సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలకు సోమవారం రాత్రి అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా దేవదేవేరులకు విశేషాభిషేకాలు, పూజలు నిర్వహించారు. బ్రహ్మోత్సవ వివరాలు 17న ధ్వజారోహణం, శేషవాహనోత్సవం, 18న చిలక వాహనం, 19న హంస వాహనం, 20న పులి వాహనం, 21న రావణసేవ, 22న నందిసేవ, 23న రథోత్సవం, 24న కల్యాణోత్సవం, గజవాహనోత్సవం నిర్వహించనున్నారు. 25న ముఖ్య ఘట్టం తీర్థవాది (సముద్రస్నానం), రాత్రికి తెప్పోత్సవం, అశ్వవాహన సేవ, 26న ధ్వజావరోహణ, ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన రథోత్సవం, కల్యా ణోత్సవం, తీర్థవాది ఘట్టాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఐఅండ్పీఆర్ డీడీగా శివశంకర్ నెల్లూరు(అర్బన్): జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ (ఐఅండ్పీఆర్) డీడీగా అదే శాఖలో పనిచేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ శివశంకర్రావుకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన కలెక్టరేట్ ఆవరణంలోని ఐఅండ్ పీఆర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీడీగా పనిచేసిన సదాశివరావు విశాఖపట్నానికి బదిలీ అయ్యారు. నూతన డీడీ శివంకర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు, జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. నకిలీ ఇళ్ల పట్టాలపై సమగ్ర విచారణ సీతారామపురం : మండలంలో తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్వోల ఫోర్జరీ సంతకాలతో నకిలీ ఇళ్ల పట్టాలు సృష్టించి పంపిణీ చేయడంపై సమగ్ర విచారణ చేపడుతున్నామని తహసీల్దార్ పీవీ కృష్ణారెడ్డి తెలిపారు. సీతారామపురంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంపై‘సాక్షి’లో సోమవారం కథనం వెలువడిన విషయం తెలిసిందే. అందుకు స్పందించిన తహసీల్దార్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. నకిలీ ఇళ్ల పట్టాల వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని, సూత్ర, పాత్రధారులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. నకిలీ పట్టాలపై నిశితంగా విచారణ చేపడుతున్నామని, త్వరలోనే సూత్రధారులను పట్టుకుని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఇప్పటికే నకిలీ ఇళ్ల పట్టాల తయారీదారులపై ప్రత్యేక దృష్టి సారించి రహస్య విచారణ జరుపుతున్నామన్నారు. కార్యాలయ స్టాంపులు నకిలీ ఇళ్ల పట్టాలపై ఎలా వేశారన్న దానిపైన, ఈ వ్యవహారంలో కార్యాలయ సిబ్బంది పాత్రపై కూడా విచారణ చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు మాయగాళ్ల ఉచ్చులో పడి మోసపోవద్దని సూచించారు. ఫేక్కాల్స్ నమ్మి పన్నుల చెల్లింపులు చేయొద్దు నెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థ పన్నులను క్యూఆర్ కోడ్ ద్వారా సులభతరంగా చెల్లించొచ్చు అంటూ కొందరు ఆగంతకులు ఫేక్కాల్స్ చేసి ప్రజలను మోసగిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి కాల్స్ను నమ్మి చెల్లింపులు చేసి మోసపోవద్దని కమిషనర్ వైఓ నందన్ సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. ఇటీవల పొగతోటలోని ఓ ఆస్పత్రిని ఆగంతకులు ఫేక్ కాల్ ద్వారా సంప్రదించి, ట్రేడ్ లైసెన్స్ను తాము పంపుతున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి సులభతరంగా చెల్లించాలని కోరడం జరిగిందన్నారు. ఆస్పత్రి నిర్వాహకులకు అనుమానం వచ్చి తమ దృష్టికి తీసుకొచ్చారని కమిషనర్ వివరించారు. కార్పొరేషన్కు చెల్లించాల్సిన అన్ని పన్నులను ప్రధాన కార్యాలయంతో పాటు స్థానిక సచివాలయాల్లోనూ, అదేవిధంగా ఆన్లైన్ విధానంలోనూ చెల్లించవచ్చని తెలిపారు. గుర్తుతెలియని ఆగంతకులు ఫోన్ చేసి క్యూఆర్ కోడ్ తదితర మాధ్యమాల ద్వారా చెల్లింపులు చేయమని డిమాండ్ చేస్తే వెంటనే టోల్ఫ్రీ నంబర్ 18004251113 నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ
వెంకటాచలం: చంద్రబాబు పాలనలో వైఎస్సార్సీపీ కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులను బనాయిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి విమర్శించారు. కూటమి ప్రభుత్వం మోపిన అక్రమ కేసుల కారణంగా వెంకటాచలం మండలం చెముడుగుంటలోని జిల్లా సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని ఎమ్మెల్సీ మేరిగ మురళి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి ములాఖత్ ద్వారా సోమవారం ఆయన పరామర్శించారు. అనంతరం నారాయణస్వామి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఏడాది పాలనంతా అభివృద్ధిని విస్మరించి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చుట్టూ ఉన్నవారిపై కేసులు పెట్టి, వేధించడంతోనే సరిపోయిందన్నారు. ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా, నియంతృత్వ పోకడలతో పాలన సాగించడం సరైన పద్ధతి కాదన్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై రోజుకొక కొత్త కేసు పెడుతుండడం దారుణమన్నారు. ప్రజావ్యతిరేక విధానాలపై గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల మన్ననలు పొందకుండా వైఎస్సార్సీపీ నేతలను వేధింపులకు గురిచేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి నాయ కులు వైఎస్సార్సీపీని భూస్థాపితం చేస్తామని చెబుతున్నారని, కానీ భవిష్యత్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడం ఖాయమని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటమి పాలైన వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్కడకు వెళ్లినా ప్రజాదరణ తగ్గలేదని చెప్పారు. ఆయనకు వస్తున్న జనాదరణ చూసి కూటమి ప్రభుత్వం తట్టుకోలేకపోతుందన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుందనే విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుచుకోవాలన్నారు. కాకాణిపై రోజుకొక కేసు పెట్టడం దారుణం మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి -
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
జిల్లాలో దివ్యాంగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఇంటి వద్దకే రేషన్ రావకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ డోర్ డెలివరీ చేయించాలి. నడవలేని వారికి ఉపకరణాలు ఇచ్చేందుకు వెంకటాచలంలోని ఆల్మెకో సంస్థ వద్దకు వెళ్లాలని కలెక్టర్ చెప్పడం అన్యాయం. మాకు దివ్యాంగుల శాఖ ఉంది. దాని ద్వారా గతంలోలానే ఉపకరణాలు ఇప్పించాలి. రెండేళ్లకు సంబంధించి దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి. తమకు అంత్యోదయ కార్డులు మంజూరు చేయాలి. నకిలీ దివ్యాంగుల కోటాతో ఉద్యోగాలు పొందుతున్న వారి సర్టిఫికెట్లను కూడా రీ వెరిఫికేషన్ చేయించాలి. తమ సమస్యల పరిష్కారం కోసం దివ్యాంగులతో కూడిన (డీఎల్సీ) జిల్లా స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. – ఆవుల నాగేంద్ర, వీహెచ్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి, వెంకటరమణయ్య, చిట్టికుమార్, కాలేషాబాషా, సుజాత -
కాళ్లరిగేలా తిరుగుతున్నాం..కనికరించండి
తల్లికి వందనం పథకం కోసం.. కార్పొరేషన్తోపాటు అన్ని మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న 2,500 మంది పారిశుధ్య, ఇంజినీరింగ్, ఏఎంఆర్ కార్మికులకు తల్లికి వందనం పథకం వర్తింపజేయాలి. వీరంతా వివిధ సొసైటీలు, ఆఫ్కాస్ కింద కాంట్రాక్ట్, ఎన్ఎంఆర్ పద్ధతిలో అతి తక్కువ వేతనంతో పని చేస్తున్నారు. ఎలాంటి ప్రభుత్వ పథకాలు వర్తింపజేయకపోవడం దారుణం. అలాగే 8 నెలలుగా పారిశుధ్య కార్మికులకు చెల్లిస్తున్న విధంగానే ఇంజినీరింగ్ కార్మి కులకు జీఓ నంబర్ 36 ప్రకారం రూ.21 వేల నుంచి రూ.24 వేల వరకు జీతం చెల్లించాలి. తల్లికి వందనంతోపాటు అన్ని రకాల సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి. – నాగేశ్వరరావు, కొండా ప్రసాద్, పెంచలనరసయ్య, శ్రీనివాసులు, సీఐటీయూ నాయకులు, నెల్లూరు ● అర్జీదారులతో కలెక్టరేట్ కిటకిట నెల్లూరు(అర్బన్): సమస్యల పరిష్కారం కోసం మండల స్థాయిలో అధికారులు తిప్పుకొంటున్నారు. కాళ్లరిగేలా తిరుగుతున్నా కనికరించడం లేదు. నెల్లూరు కలెక్టరేట్కు వస్తే మళ్లీ మండలాధికారుల వద్దకే పంపుతున్నారు. వారు మళ్లీ మళ్లీ తిప్పుకొంటున్నారు. మీరైనా దయచూపి సమస్యలను తీర్చాలని బాధితులు కోరారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. దీనికి జిల్లాలోని నలుమూలల నుంచి ప్రజలు వచ్చారు. కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తీక్, డీఆర్వో ఉదయభాస్కర్రావు, డీపీఓ శ్రీధర్రెడ్డి, జిల్లా సర్వే అధికారి నాగశేఖర్ తదితరులు అర్జీలు స్వీకరించారు. 398 మంది ఆన్లైన్ అర్జీలను, మరో 40 మంది ఆఫ్లైన్లో సమర్పించారు. కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. -
నకిలీ ఇళ్ల పట్టాల కలకలం
సీతారామపురం: ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములపై కన్నేసిన కొందరు వాటికి నకిలీ పత్రాలు సృష్టించి అమాయకులకు అంటగడుతున్న వైనం సీతారామపురంలో వెలుగులోకొచ్చింది. గ్రామంలోని సర్వే నంబర్ 240లోని ప్రభుత్వ భూమికి ఓ ప్రబుద్ధుడు నకిలీ నివేశన పట్టాలు సృష్టించి అమాయకులకు అంటగట్టాడు. ఒక్కొక్కరికీ 3 సెంట్లు చొప్పున 40 మందికి నివేశన పట్టాలను తయారుచేసి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.25 వేలు చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. ఇలా పలువురి నుంచి అతను సుమారు రూ.10 లక్షల మేరకు వసూలు చేసినట్లు సమాచారం. ఇంటి నివేశన పత్రం ఉదయగిరి మండలానికి సంబంధించినది కాగా,ఆ పత్రంపై వీఆర్వో, ఆర్ఐ, తహసీల్దార్ల సంతకాలు ఫోర్జరీ చేసి ఉన్నాయి. స్టాంపులు మాత్రం సీతారామపురం తహసీల్దార్ కార్యాలయానివి వేసి ఉన్నారు. నకిలీ పట్టాల విషయం ఆదివారం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీంతో నివేశన పట్టాలు నకిలీవని తెలుసుకున్న పలువురు బాధితులు సదరు వ్యక్తిని నిలదీయగా పట్టా కాగితాలు తిరిగి ఇచ్చేయండి, మీ నగదు మీకు చెల్లిస్తానంటూ బుకాయిస్తున్నట్లు సమాచారం. మండలంలో ఇలాంటి మాయగాళ్లు నిత్యం మండల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూ వారి దర్పాన్ని ప్రదర్శిస్తూ రెవెన్యూ సిబ్బందిని ప్రలోభాలకు గురిచేసి ఈ తతంగం సాగిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు, పోలీసులు ఈ నకిలీ పట్టాలపై నిగ్గుతేలిస్తే మాయగాళ్ల లీలలు మరెన్నో బయటకు వచ్చే అవకాశం ఉంది. సీతారామపురంలో 40 మందికి పంపిణీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వైనం -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు
ఆత్మకూరు: మున్సిపల్ పరిధిలో నెల్లూరు – ముంబై రహదారి నుంచి ఏఎస్పేట అడ్డరోడ్డుకు మలుపు తిరుగుతున్న కారును ఆత్మకూరు నుంచి నెల్లూరు మార్గంలో వెళ్తున్న టీవీఎస్ ఎక్సెల్ వేగంగా ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై ఎస్కే జిలానీ, ఏఎస్సై శ్రీనివాసులురెడ్డి కథనం మేరకు.. తెలంగాణకు చెందిన ఓ కుటుంబం కారులో నెల్లూరు నుంచి ఏఎస్పేట దర్గా వద్దకు వస్తోంది. అదే క్రమంలో ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని వెంకట్రావుపల్లి గిరిజనకాలనీకి చెందిన పెంచలయ్య, యాకసిరి శ్రీనివాసులు అనే ఇద్దరు వ్యక్తులు టీవీఎస్ ఎక్సెల్పై వేగంగా వస్తూ మలుపు తిరుగుతున్న కారును ఢీకొట్టారు. దీంతో పెంచలయ్య ఎగిరి రోడ్డుపై పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లినట్లు ఎస్సై జిలానీ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
మోటార్బైక్ దగ్ధం
కలువాయి(సైదాపురం): మండల కేంద్రమైన కలువాయి బస్టాండ్ సెంటర్లో సీఎస్సీ సెంటర్ నిర్వహిస్తున్న కరిముల్లా అనే వ్యక్తి మోటార్బైక్ ఆదివారం దగ్ధమైంది. వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో గమనించిన స్థానికులు ఆర్పేందుకు యత్నించారు. అయితే అప్పటికే బైక్ కాలిపోయింది. ఆదివారం కదా.. అందుకే రాలేదు!ఉదయగిరి: ఉదయగిరి మండలం గండిపాళెంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం ఒక్క స్టాఫ్ నర్సు మినహా మిగతా సిబ్బంది ఎవరూ లేరు. ఈ పీహెచ్సీలో ఇద్దరు వైద్యాధికారులు ఉండగా ఒక్కరు కూడా విధులకు హాజరుకాలేదు. ల్యాబ్ టెక్నీషియన్ది కూడా ఇదే పరిస్థితి. దీంతో మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ గదుల తలుపులు తెరుచుకోలేదు. ఒక్క స్టాఫ్నర్సు మాత్రమే విధుల్లో ఉండి వచ్చిన రోగులకు మందులిచ్చి పంపించారు. ఆదివారం వచ్చిందంటే గండిపాళెం పీహెచ్సీకి సెలవే. ఇది 24 గంటలు పనిచేయాల్సిన ఆస్పత్రి. అయితే ఆరోజు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండరు. దీంతో పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు. కసుమూరు దర్గాలో నటుడు అలీ ప్రార్థనలువెంకటాచలం: సినీ నటుడు అలీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం కసుమూరు దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా దర్గా ముజావర్లు ఘన స్వాగతం పలికారు. అలీ కుటుంబం ప్రత్యేక ప్రార్థనలు చేసింది. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికగూడూరు రూరల్: గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు దీపిక, కౌసల్య జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు మాధవీలక్ష్మి తెలిపారు. ఆదివారం వివరాలు వెల్లడించారు. బాలికలు కాకినాడలో ఈనెల 12 నుంచి 15వ తేదీ వరకు జరిగిన కబడ్డీ ఫెడరేషన్ చాంపియన్షిప్లో ప్రతిభ చూపి జాతీయ స్థాయికి ఎంపికై నట్టు పేర్కొన్నారు. వీరు రాజస్థాన్లో జూలై 10 నుంచి 13వ తేదీ వరకు జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు. ఆమె, పీడీ విజయలక్ష్మి, విద్యార్థినులను అభినందించారు.వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలుపెళ్లకూరు: మండలంలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. విజయవాడకు చెందిన మధుసూదన్రెడ్డి, కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఆదివారం తిరుగు ప్రయాణమయ్యారు. పెళ్లకూరు మండలం పెన్నేపల్లి వద్ద కారు అదుపుతప్పి ఐరన్ డివైడర్ను ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న తొమ్మిది మందిలో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి, అలాగే తిరుపతి నుంచి నెల్లూరుకు సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ చిల్లకూరు వడ్డిపాళెం వద్ద డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. డ్రైవర్కు గాయాలయ్యాయి. వారిని స్థానికులు నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కండలేరులో 36.955 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 36.955 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇన్చార్జి ఈఈ రామచంద్రమూర్తి తెలిపారు. సత్యసాయి గంగ కాలువకు 2,480, పిన్నేరు కాలువకు 10, లోలెవల్ కాలువకు 70, హైలెవల్ కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.32 సన్నవి : రూ.25 పండ్లు : రూ.10 -
ఆరోగ్య రంగం నిర్వీర్యం
నెల్లూరు(అర్బన్): ప్రస్తుత ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రముఖ డాక్టర్ విరించి అన్నారు. నెల్లూరు హరనాథపురంలోని డాక్టర్ జేఎస్ విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ జెట్టి శేషారెడ్డి 17వ స్మారక సదస్సు ఆదివారం జరిగింది. జనవిజ్ఞానవేదిక, డాక్టర్ రామచంద్రారెడ్డి ఆస్పత్రి, ప్రజారోగ్యవేదిక, మెడికల్ రెప్స్ యూనియన్, యూటీఎఫ్, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ – పర్యవసానాలు అనే అంశంపై విరించి మాట్లాడారు. పేదలు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లలేని పరిస్థితులను ప్రభుత్వం కల్పిస్తోందని విమర్శించారు. ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా తెస్తున్న 12 వైద్య కళాశాలలను పీపీపీ మోడ్లో ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తామని బహిరంగంగా ప్రభుత్వం చెప్పడం సిగ్గు చేటన్నారు. ఇదే జరిగితే సామాన్య పిల్లలు వైద్యవిద్యను ఎక్కడ అభ్యసించాలని ప్రశ్నించారు. ● భారత రాజ్యాంగం పూర్వాపరాలు, సవాళ్లు అనే అంశంపై మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ పాలకులు రాజ్యాంగ మూలస్తంభాలపైనే దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తమ స్వార్థం కోసం ఎలక్షన్ కమిషన్, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, సీబీఐలను దుర్వినియోగం చేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మతం పేరుతో ప్రజల్లో అసమానతలు పెంచుతూ తమ అధికారాన్ని కాపాడుకుంటున్నాయన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రామచంద్రారెడ్డి వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రాజేశ్వరరావు, డాక్టర్ రమణయ్య, సతీష్, మాజీ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
రొట్టెల పండగకు విస్తృత ఏర్పాట్లు
● మంత్రి నారాయణనెల్లూరు(టౌన్): రొట్టెల పండగకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో ఇన్చార్జి కలెక్టర్ కార్తీక్, ఎస్పీ కృష్ణకాంత్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అధికారులతో కలిసి ఏర్పాట్లపై ఆదివారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దర్గా అభివృద్ధికి సీఎం రూ.5 కోట్లు మంజూరు చేశారన్నారు. 20 వేల మంది భక్తులు ఒకేచోట ప్రార్థన చేసేందుకు వీలుగా మందిరాన్ని నిధులతో నిర్మిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నుడా ఆధ్వర్యంలో ఈ నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. నగరంలో అండర్పాస్లు, ఓవర్ బ్రిడ్జిల వద్ద, ఓవర్ హెడ్ ట్యాంకులు వద్ద పెయింటింగ్ పనులు సంవత్సర కాలంగా కొనసాగుతుండటంపై సంబంధిత అధికారులు, పెయింటింగ్ కాంట్రాక్టర్లపై మండిపడ్డారు. 45 రోజుల్లో అన్ని ప్రాంతాల్లో పెయింటింగ్ పనులు పూర్తి చేయాలన్నారు.