breaking news
SPSR Nellore District Latest News
-
దర్గా అభివృద్ధిలో విఫలం
● ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్రెడ్డి వెంకటాచలం: కసుమూరు దర్గా అభివృద్ధి, భక్తులకు వసతుల కల్పనలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని కసుమూరు మస్తాన్వలీ దర్గాలో గురువారం నిర్వహించిన కంబల్ ఫాతేహాకు ఆయన హాజరయ్యారు. ముజావర్లు, ముస్లింలు ఘన స్వాగతం పలికారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. కసుమూరు దర్గాకు ఎంతో ప్రాశస్థ్యం ఉందని వివరించారు. గత సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో ముస్లింల సంక్షేమానికి ప్రత్యేక చొరవ చూపిన అంశాన్ని ప్రస్తావించారు. 2019లో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక కసుమూరు దర్గా అభివృద్ధికి ఎనలేని కృషి చేశామని వెల్లడించారు. భక్తులు పడుతున్న ఇబ్బందులను స్థానికులు తన దృష్టికి తీసుకురావడంతో.. నిద్రించేందుకు, స్నానపు గదుల కోసం రూ.30 లక్షలను వెచ్చించి భవనాన్ని నిర్మించామని గుర్తుచేశారు. తాగునీటి వసతి, పారిశుధ్య సమస్య లేకుండా చర్యలు చేపట్టామని వివరించారు. తమ హయాంలో భక్తుల కోసం నిర్మించిన భవనాన్ని కూటమి ప్రభుత్వం కొలువుదీరాక స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రంగా మార్చారని ఆరోపించారు. తమ పార్టీకి మంచి పేరొస్తుందనే భయంతో ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చేతనైతే కొత్త భవనాన్ని నిర్మించాలే తప్ప, ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని హితవు పలికారు. నిధులు పుష్కలంగా ఉన్నా.. వక్ఫ్బోర్డులో నిధులు పుష్కలంగా ఉన్నా, దర్గా అభివృద్ధిని పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. భక్తులు, ప్రజలు చందాలేసుకొని కార్యక్రమాలను చేయాల్సి వస్తోందని తెలిపారు. అవినీతిపై ఉన్న శ్రద్ధ.. అభివృద్ధిపై సోమిరెడ్డికి లేదని విమర్శించారు. దర్గాను పట్టించుకోకపోవడంతో పారిశుధ్యం, తాగునీటి సమస్యతో భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెప్పారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో ముస్లింల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్బోర్డు నిధుల దుర్వినియోగంపై తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణ జరిపి చర్యలు చేపడతామని చెప్పారు. మస్తాన్బాబా ఆశీస్సులు జగన్మోహన్రెడ్డికి, రాష్ట్ర ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని కాంక్షించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసే ఆలోచనలో కూటమి ప్రభుత్వం లేదని విమర్శించారు. జగన్మోహన్రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, ఎంపీటీసీ వడ్లమూడి ప్రభావతి, నేతలు చీకుర్తి నరసయ్య, కడివేటి శివ, దస్తగిరి, మహమ్మద్, బాబర్, మందా కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ కోతలపై రైతుల కన్నెర్ర
● సంగం సబ్స్టేషన్ వద్ద కావలి కాలువ అన్నదాతల బైఠాయింపు సంగం: వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా సక్రమంగా అందడంలేదని ఆరోపిస్తూ కావలి కాలువ పరిధిలోని రైతులు.. సంగం సబ్స్టేషన్ వద్ద రోడ్డుపై గురువారం బైఠాయించి నిరసన చేపట్టారు. తొలుత ర్యాలీగా చేరుకొని విద్యుత్ శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోతల కారణంగా సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వ్యవసాయానికి ప్రభుత్వం ప్రకటించిన తొమ్మిది గంటల విద్యుత్ను సక్రమంగా అందించకుండా ఏకపక్షంగా కోతలు విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంలో మూడు రోజులే సరఫరా చేసి, మిగిలిన నాలుగు రోజులు కోతలు విధిస్తే సాగు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. సరఫరా అయ్యే వేళల్లోనూ అంతరాయాలు ఏర్పడుతుండటంతో మోటార్లు పనిచేయక సాగునీటిని పొలాలకు అందించలేకపోతున్నామని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. రైతుల ఆందోళనతో సబ్స్టేషన్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ గంగాధర్, ఎస్సై భోజ్యానాయక్, బుచ్చిరెడ్డిపాళెం డీఈఈ సతీష్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. న్యాయం జరిగేలా ఉన్నతాధికారులతో చర్చిస్తామని తెలిపారు. అధికారుల హామీతో ధర్నాను విరమించారు. -
పనికెళ్తుండగా విషాదం
● ట్రాక్టర్ను ఢీకొన్న బైక్ ● బాలుడి మృతి ● మరో ఇద్దరి పరిస్థితి విషమంకావలి రూరల్: పనికోసం ముగ్గురు స్నేహితులు ఒకే బైక్పై బయలుదేరారు. మార్గమధ్యలో ఊహించని ప్రమాదం వారి ప్రయాణాన్ని విషాదంగా మార్చింది. ట్రాక్టర్ను బైక్ ఢీకొన్న ఘటనలో ఓ బాలుడు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన కావలి – మద్దూరుపాడు మార్గంలోని డంపింగ్ యార్డ్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కావలి ముసునూరు చంద్రన్న కాలనీ, ఇందిరమ్మ కాలనీలకు చెందిన గంజం చందు (17), మొగిలి బబ్లూ, నాగులూరి బాబు స్నేహితులు. వీరు హైరర్స్, లైటింగ్, సెంట్రింగ్ తదితర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. రుద్రకోటలో పని ఉండటంతో గురువారం ఉదయం ఒకే బైక్పై బయలుదేరారు. బైక్ను బబ్లూ నడుపుతున్నాడు. డంపింగ్ యార్డ్ వద్ద.. కావలి – మద్దూరుపాడు మార్గంలోని డంపింగ్ యార్డ్ వద్ద చెత్తను తరలించి బయటకు వస్తున్న ట్రాక్టర్ను బైక్ ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బైక్పై ఉన్న ఇద్దరు రోడ్డుపక్కకు పడిపోగా తలకు తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. మరో యువకుడికి చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చందు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు 108 అంబులెన్స్లో క్షతగాత్రులను కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. బబ్లూ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్లారు. బాబు పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో కావలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై దర్యాప్తు చందు లైటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బబ్లూ బాతుల వ్యాపారం చేస్తు న్నాడు. ఇతని స్వస్థలం కందుకూరు. ప్రస్తుతం ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ముగ్గురూ చందు అన్న వంశీకి చెందిన బైక్పై రుద్రకోటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న కావలి వన్టౌన్ సీఐ రంగనాథ్గౌడ్, ఎస్సై సుమన్ ఘటనా స్థలానికి చేరు కుని ప్రమాద తీరును పరిశీలించారు. ట్రాక్టర్, డ్రైవర్ను రెండో పట్టణ పోలీస్స్టేషన్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రొటోకాల్ ఉల్లంఘన
● దేవదాయ శాఖ అధికారుల నిర్లక్ష్య ధోరణి చిల్లకూరు: గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేశాక, తాము జిల్లాలోని ప్రజాప్రతినిధులకే గౌరవమివ్వాలనుకునేలా రీతిలో అధికారులు వ్యవహరిస్తున్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో గూడూరు నియోజకవర్గం ఉందనే అంశాన్ని విస్మరిస్తున్నారు. పట్టణంలో కూరగాయల మార్కెట్, అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభ సందర్భంగా శిలాఫలకాల్లో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి పేరును వేయకుండానే మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు వ్యవహరించారు. ఈ విషయం బయటపడ్డాక, నెల్లూరులో విలీనం కావడంతో పార్లమెంట్ కూడా నెల్లూరే కదా అంటూ దాటవేత సమాధానమిచ్చారు. ఈ క్రమంలో చిల్లకూరు మండలం తూర్పుకనుపూరులో వెలసిన ముత్యాలమ్మ ఆలయంలో కుంభాభిషేక మహోత్సవాలను ఈ నెల 23 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రికలను దేవదాయ శాఖ అధికారులు పంపారు. ఇందులో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి ఫొటోను ముద్రించి.. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఫొటోను విస్మరించారు. అధికార పార్టీ నేతలకూ అందులో స్థానం కల్పించారు. అసలిది పార్టీ కరపత్రమా లేక దేవదాయ శాఖ ఆహ్వాన పత్రికాననే అనుమానాలు తలెత్తాయి. అధికారుల తీరు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఉద్యోగుల సమర శంఖారావం
● ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు అల్లంపాటి నెల్లూరు(అర్బన్): ‘హామీలను అమలు చేయాలని ఎన్నోసార్లు కూటమి ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చాం. ఉద్యమ కార్యాచరణ ప్రకటించాం. ఈ స్థితిలో ప్రభుత్వ మంత్రుల కమిటీ చర్చించి తమకు కొంత సమయం కావాలంటే ఇచ్చాం. అయినా ఉద్యోగుల సమస్యలు ఏ ఒక్కటి తీర్చలేదు. ఇక సమయం ఇచ్చే ప్రసక్తే లేదు. ఉద్యమానికి సిద్ధం కండి’ అని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు అల్లంపాటి పెంచలరెడ్డి పిలుపునిచ్చారు. ఉద్యమ కార్యాచరణ కోసం విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో శుక్రవారం జరిగే రాష్ట్ర స్థాయి సమావేశానికి తరలిరావాలని కోరుతూ ఏపీ జేఏసీ నాయకులు గురువారం పలు డివిజన్లలో ఉద్యోగులను కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెంచలరెడ్డి మాట్లాడుతూ ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమా అని ప్రశ్నించారు. బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు న్యాయంగా పొందాల్సిన నగదు పొందకపోతే మూడుతరాల ఉద్యోగులు నష్టపోయినట్టేనని తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగులకు సుమారు రూ.40 వేల కోట్ల బకాయిలు ఉందన్నారు. అవి సాధించుకునేందుకు విజయవాడలో జరుగుతున్న ఉద్యమ కార్యాచరణ సభకు తరలిరావాలని కోరారు.ఆటో బోల్తా ● ఇద్దరికి తీవ్ర గాయాలు చిల్లకూరు: మండలంలోని కమ్మవారిపాళెం గ్రామ సమీపంలో గురువారం ఆటో బోల్తా పడి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. గూడూరు మండలం పారిచెర్ల గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నాగయ్య తన వదిన సుభాషిణితో కలిసి చిట్టమూరు మండలం మెట్టు గ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో కమ్మవారిపాళెం సమీపంలో ఆటోకు కుక్క అడ్డుగా రావడంతో దాన్ని ఢీకొని అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో సుభాషి ణి కాలు విరిగింది. నాగయ్య చేతికి తీవ్ర గాయమైంది. స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. సుభాషిణిని మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు.విశ్రాంత డాక్టర్పై విచారణకు ఆదేశాలు నెల్లూరు(అర్బన్): గతంలో సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో ఆర్థోపెడిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన డాక్టర్ సూరపతి శంకర్రావుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ సెక్రటరీ వీరపాండియన్ గురువారం ఉత్తర్వులను ఇచ్చారు. అప్పట్లో శంకర్రావు పనిచేసేప్పుడు అనధికారికంగా ఎలాంటి అనుమతి తీసుకోకుండా విధులకు రాకుండా గైర్హాజరయ్యారు. నాటి అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. శంకర్రావుపై మోపిన ఆరోపణలను విచారించేందుకు విజయనగరానికి చెందిన జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజను విచారణాధికారిగా నియమించారు. ఆమె ఎదుట ప్రభుత్వం తరఫున కేసు వివరాలు సమర్పించేందుకు విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల పాథాలజీ ప్రొఫెసర్ డాక్టర్ బసుమిత్రదాసును నియమించారు. విచారణలో ఆరోపణలు నిజమని తేలితే తదుపరి క్రమశిక్షణా చర్యలను ప్రభుత్వం తీసుకుంటుంది.ధాన్యం సేకరణకు 81 కేంద్రాల ఏర్పాటు నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలో లేట్ రబీ 2025 – 26 ఎడగారుకు సంబంధించి పండించిన ధాన్యాన్ని సేరించేందుకు 81 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లుగా జిల్లా సహకారశాఖాధికారి (డీసీఓ) గుర్రప్ప తెలిపారు. నగరంలోని డీసీఓ కార్యాలయంలో గురువారం సహకార, పీసీఎస్ సీఈఓ, సంఘాల సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, సహకార శాఖ సిబ్బంది ఇందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ గణాంకాల మేరకు జిల్లాలోని 1.49 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారన్నారు. 4.84 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయ్యే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా పీఎసీఎస్ సంఘాల్లో రోజువారీ వ్యాపార లావాదేవీలను ఆన్లైన్లోనే నమోదు చేయాలని సూచించారు. కాన్ఫరెన్స్లో జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.కండలేరులో 21.75 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 21.75 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
పాస్ పుస్తకాలు మీ వద్ద ఎందుకు?
● వీఆర్వో, సర్వేయర్ తీరుపై రైతుల మండిపాటు కోవూరు: భూ సమస్యల పరిష్కారానికి నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. భూ రికార్డుల సవరణలు, రీ సర్వేలో నెలకొన్న సమస్యలపై రైతులు అధికారులను నిలదీశారు. అధికారులు తమ ఇబ్బందులను మరింత పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విడవలూరు మండలంలోని ముదివర్తి గ్రామంలో గురువారం వన్ మంత్ – వన్ విలేజ్ కార్యక్రమం జరిగింది. ఇందులో రైతులు, అధికారుల మధ్య వాదోపవాదనలు జరిగాయి. వీఆర్వో, గ్రామ సర్వేయర్ల పనితీరుపై రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భూములకు సంబంధించిన పాస్ పుస్తకాలు, ఇతర రికార్డులను అధికారులు తమ వద్ద ఎందుకు ఉంచుకున్నా రని రైతులు ప్రశ్నించారు. పాస్ పుస్తకాల విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని, పనులు చేయించుకోవాలంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. రీ సర్వేలో అనేక తప్పులు చోటుచేసుకున్నాయని, భూముల విస్తీర్ణం, హద్దులు,యాజమాన్య వివరాల్లో లోపా లు ఏర్పడటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. టీడీపీ నా యకులు ఎస్కే రఫీ, ఇమామ్బాషా మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయా ల్సిన అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం సరికాదన్నారు.అధికారులను నిలదీస్తున్న రైతులు -
వృషభ వాహనంపై వెంకయ్యస్వామి దర్శనం
● భక్తుల నామస్మరణల మధ్య గ్రామోత్సవం ● నేత్రపర్వంగా హంస వాహనసేవవెంకటాచలం: గొలగమూడి వెంకయ్యస్వామి 44వ ఆరాధనోత్సవాల్లో భాగంగా గురువారం వృషభ వాహనసేవ వైభవంగా జరిగింది. ఉదయం ఆశ్రమంలో పూజల అనంతరం స్వామిని ప్రత్యేక పూలతో అలంకరించి వృషభ వాహనంపై కొలువుదీర్చారు. భక్తులు వాహనాన్ని భుజాలపై మోసుకుంటూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అనంతరం ట్రాక్టర్పై ఆశీనులను చేశారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల మధ్య గ్రామోత్సవం ఘనంగా సాగింది. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. ఈ సేవకు ఇందుకూరుపేటకు చెందిన సూదలగుంట నాగార్జునరావు, ప్రేమలత దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ● ఆరాధనోత్సవాల్లో భాగంగా రాత్రి హంసవాహన సేవ నేత్రపర్వంగా సాగింది. హంస వాహనంపై స్వామిని ఆశీనులను చేసి పూలు, విద్యుద్దీపాలతో ఆకర్షణీయంగా అలంకరించారు. దర్శనం కోసం జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో గొలగమూడి భక్తులతో కోలాహలంగా మారింది. ఈ సేవకు మోచర్ల మధు (ఈదూరు), ఉప్పల మోహన్ (వరిగొండ), నల్లగుండ్ల గాంధీ (తెల్లపాడు) ఉభయకర్తలుగా వ్యవహరించారు. రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ● ఆరాధనోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం చినశేష వాహనసేవ, రాత్రి గజ వాహనసేవ నిర్వహించనున్నారు. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. -
ప్రభుత్వ తీరుపై జూడాల తీవ్ర ఆగ్రహం
నెల్లూరు(అర్బన్): న్యాయమైన స్టైఫండ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ వైద్యులు చేపట్టిన సమ్మె గురువారానికి తొమ్మిదో రోజుకు చేరింది. నెల్లూరు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వద్ద సమ్మె కొనసాగిస్తున్న జూనియర్ వైద్యులు రోగుల కోసం రక్తదానం చేసి ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ హనీష్ కుమార్ మాట్లాడుతూ జూనియర్ డాక్టర్లలో రెసిడెంట్ డాక్టర్లు, పీజీలు, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు భాగమని తెలిపారు. తాము ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా, తమతో సంప్రదింపులు జరపకుండానే కేవలం 5 శాతం స్టై పెండ్ పెంచుతామని ప్రకటించడం సరికాదన్నారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు జూడాల్లో భాగం కాదని పేర్కొనడాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. తాము 30 శాతం స్టై పెండ్ పెంచాలని డిమాండ్ చేస్తున్నామని, ప్రభుత్వం ఆర్థిక భారం అంటున్న నేపథ్యంలో 20 శాతానికి తగ్గించేందుకు సమ్మతిస్తున్నామని తెలిపారు. 2027 నుంచి ఏటా స్టై పెండ్ సవరణ చేయాలన్న ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని, అయితే ప్రస్తుతం న్యాయమైన రీతిలో స్టై పెండ్ పెంచాలని కోరారు. ఎంఎస్సీ, పీహెచ్డీ చేసిన వారితో వైద్య విద్యార్థులకు పాఠాలు చెప్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఎంబీబీఎస్, పీజీ పూర్తి చేసిన వైద్యులతోనే బోధన చేయించాలని డిమాండ్ చేశారు. అలాగే వైద్యుల ఉద్యోగ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా 40 మందికి పైగా జూనియర్ డాక్టర్లు రక్తదానం చేశారు. కార్యక్రమంలో భార్గవ్, భావన, జి.సుగుణ, కీర్తి, నిర్మల్, రవి తదితరులు పాల్గొన్నారు. -
పక్క రాష్ట్రాలకు
ఇంజినీరింగ్కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ విద్యను అభ్యసిస్తే చాలు జీవితం సెటిలైపోతుందనే భావన విద్యార్థుల్లో ఉండేది. దీనికి తగిన విధంగానే రాష్ట్రంలోని కళాశాలల్లో అడ్మిషన్ల కోసం పోటీపడేవారు. కౌన్సెలింగ్కు హాజరై తమకు నచ్చిన కాలేజీలో ప్రవేశాలు పొంది ఖుషీఖుషీగా ఉండేవారు. అయితే కూటమి ప్రభుత్వమొచ్చాక ఈ పరిస్థితంతా తారుమారైంది. ఇంటర్ ఫలితాలను ఈ ఏడాది ఏప్రిల్ 16న విడుదల చేయగా, ఇంజినీరింగ్లో ప్రవేశానికి సంబంధించిన ఏపీఈఏపీ సెట్ రిజల్ట్స్ విడుదల్లో ఎడతెగని జాప్యం చోటుచేసుకుంది. ఫలితంగా విసిగి వేసారిపోయిన ఇక్కడి స్టూడెంట్స్ పక్క రాష్ట్రాల్లోని విద్యాలయాల్లో అడ్మిషన్లు పొందారు. ఈ పరిణామం రాష్ట్రంలోని కాలేజీల యాజమాన్యాలకు అశనిపాతంలా పరిణమించింది. తరలిపోతున్న విద్యార్థులుయాజమాన్యాలు ఇంజినీరింగ్ సీట్లునెల్లూరు (టౌన్): జిల్లాలోని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. సర్కార్ నియంతృత్వ పోకడలతో కాలేజీలను నిర్వహించడం కష్టతరంగా మారుతోంది. వాస్తవానికి ఇంటర్ ఫలితాలను ఈ ఏడాది ఏప్రిల్ 16న విడుదల చేశారు. అదే సమయంలో ఏపీఈఏపీ సెట్ను మే 12 నుంచి 18 వరకు నిర్వహించారు. అయితే ఫలితాల విడుదల్లో అంతులేని జాప్యం చేసి చివరికి జూలై ఒకటిన వెల్లడించారు. ఈ పరిణామాల క్రమంలో రిజల్ట్స్ ఎప్పుడొస్తాయో.. కౌన్సెలింగ్ ఎప్పుడు జరుగుతుందో పాలుపోక అనేక మంది స్టూడెంట్స్ పక్క రాష్ట్రాల్లోని కళాశాలల్లో చేరేందుకు ఉత్సాహం చూపారు. ఏఐ రాకతో పరిస్థితి తలకిందులు ప్రస్తుతం ఆర్టిఫీషియన్ ఇంటెలిజెన్స్ రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఉద్యోగం ఎప్పుడుంటుందో.. ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కొత్త వారికి కొలువు లభించడమూ కలగానే మారింది. ఫలితంగా విద్యార్థుల సంఖ్యా ఏటా తగ్గిపోతోంది. గతంలో జిల్లాలో 26 ఇంజినీరింగ్ కళాశాలలుంటే, ప్రస్తుతం ఈ సంఖ్య 13కు పతనమైంది. ఒక డీమ్డ్ యూనివర్సిటీ సైతం ఉంది. వివిధ బ్రాంచీల్లో కలిపి ఇందులో 10,147 సీట్లున్నాయి. తొలి విడతలో కేవలం 5275 మేరే భర్తీ అయ్యాయి. రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటించలేదు. కళాశాలల వారీగా ఇదీ పరిస్థితి.. 90 శాతానికిపైగా సీట్లు మూడు కళాశాలల్లోనే భర్తీ అయ్యాయి. రెండు కాలేజీల్లో అయితే పది శాతం కూడా ఫిల్ కాలేదు. తొలి విడత కౌన్సిలింగ్ అనంతరం కాలేజీల్లో ప్రవేశాలను పరిశీలిస్తే ఇదే విషయం తెలుస్తోంది. నారాయణ (నెల్లూరు)లో 99.56.. ఏఈసీఎన్లో 96.76.. నారాయణ (గూడూరు)లో 94.70.. ఆరెస్సార్లో 77.24.. గీతాంజలిలో 75.26.. వీఐటీకేలో 64.42.. ఎన్బీకేఆర్లో 56.43 శాతం మేర ప్రవేశాలు నమోదయ్యాయి. వీఎస్యూ ఈఎస్ఎఫ్లో 23.11.. ఎస్వీసీఎన్లో 22.31.. ఏఎస్ఈటీలో 22.22.. డీఎస్సైటీలో 16.04.. జీకేసీఎస్లో 9.72.. పీఆర్ఐకేలో 7.29 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈసీఈకే సై.. ఇంజినీరింగ్లో ఈ విద్యాసంవత్సరంలో ఈసీఈ కోర్సులోనే ఎక్కువ మంది చేరుతున్నారు. తర్వాతి స్థానాలను సీఎస్ఈ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఏఐఎమ్మెల్ తదితర బ్రాంచీలు ఆక్రమిస్తున్నాయి. ఈసీఈలో 1626కు గానూ 1246.. సీఎస్ఈలో 3690కు గానూ 1473.. ఏఐఎమ్మెల్లో 1696కు గానూ 1246.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్లో 882కు గానూ 354.. సివిల్ బ్రాంచీలో 312 సీట్లకు గానూ 112 మాత్రమే భర్తీ అయ్యాయి. ట్రిపుల్ ఈ, మెకానికల్, ఈవీటీ, సీఎస్డీ తదితర బ్రాంచీల్లో అరకొరగా ప్రవేశాలు నమోదయ్యాయి. రెండో విడతలో ఆశించిన స్థాయిలో సీట్లు భర్తీ కాకపోతే తమ పరిస్థితి ఏమిటనే ఆందోళన యాజమాన్యాల్లో నెలకొంది. లెక్కలు చూస్తే.. దిమ్మ తిరుగుతూ.. ఏపీఈఏపీ సెట్ తొలి విడత కౌన్సెలింగ్ ఈ నెల పదితో ముగిసింది. జిల్లాలో తొలి విడతలో భర్తీ అయిన సీట్ల వివరాలను ఆన్లైన్లో గతంలో వెంటనే పెట్టేవారు. అయితే ఈసారి ఈ ప్రక్రియలోనూ జాప్యమే జరిగింది. చివరికి విడుదల చేసిన లెక్కలను పరిశీలిస్తే దిమ్మ తిరగడం కళాశాలల యాజమాన్యాల వంతైంది. జిల్లాలోని 13 ఇంజినీరింగ్ కాలేజీల్లో వివిధ బ్రాంచీల్లో 50 శాతం సీట్లు భర్తీ కావడం గగనంగా మారుతోంది. రెండో విడతలో ప్రవేశాలు పెద్దగా ఉండవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు యాజమాన్య కోటా 30 శాతం ఉండగా, అదీ ఫిల్ అయ్యే అవకాశమూ కానరావడంలేదు. కంప్యూటర్ సైన్స్కు క్రేజ్ తగ్గుతోంది ఈ విద్యా సంవత్సరంలో ఈసీఈ కోర్సులో చేరేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఏఐ ప్రభావంతో కంప్యూటర్ సైన్స్పై అధిక శాతం మంది మొగ్గు చూపడంలేదు. రోబోటిక్, వీఎల్ఎస్సై కోర్సుల్లో చేరుతున్నారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగావకాశాలు తక్కువగా ఉన్నాయి. దీంతో ఇతర కోర్ బ్రాంచీలవైపు చూస్తున్నారు. – భార్గవ్, ప్లేస్మెంట్ అధికారి ముగిసిన తొలి విడత కౌన్సెలింగ్ 50 శాతం మేరే సీట్ల భర్తీ అయోమయంలో యాజమాన్యాలు రెండు కళాశాలల్లో పది పర్సంటే.. ఈసీఈ, సీఎస్ఈకే డిమాండ్ కౌన్సెలింగ్ ఆలస్యంతోనే ఈ పరిస్థితి.. -
సుగాలి ప్రీతికి అన్యాయం చేశారు
● కాకాణి పూజిత నెల్లూరు రూరల్: కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మహిళా నేతలతో కలిసి విలేకరులతో గురువారం ఆమె మాట్లాడారు. సుగాలి ప్రీతి మృతి చెంది తొమ్మిదేళ్లు గడిచినా, ఆమె కుటుంబానికి నేటికీ న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం ఆమె తల్లి కర్నూలు నుంచి విజయవాడ వరకు వీల్చైర్లో శాంతియుతంగా యాత్ర చేపడితే, పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు శాంతియుతంగా పోరాడుతున్న మహిళను అడ్డుకోవడం కూటమి ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. ఈమె కుటుంబానికి న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కూటమి నేతలు, అధికారంలోకి వచ్చాక విస్మరించారని ఆరోపించారు. 80 మీటర్ల దూరంలోని ఇంటికెళ్లేందుకు సైతం సుగాలి ప్రీతి తల్లిని పోలీసులు అడ్డుకొని నోటీసులివ్వడం సమంజసం కాదన్నారు. సీబీఐ విచారణపై వెనుకడుగెందుకు..? సుగాలి ప్రీతి కేసును తక్షణమే సీబీఐకి అప్పగించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికలు, మెడికల్ రిపోర్టులు తదితర ఆధారాలపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. 2017లో టీడీపీ హయాంలో ఈ ఘటన జరిగిందని, అప్పటి ప్రభుత్వం న్యాయం చేయడంలో విఫలమైందని ఆరోపించారు. సుగాలి ప్రీతి కుటుంబానికి గత సీఎం జగన్మోహన్రెడ్డి అండగా నిలిచిన అంశాన్ని గుర్తుచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనంతో నేరస్తుల్లో భయం లేకుండాపోతోందని ఆరోపించారు. మహిళా డాక్టర్ ప్రియాంకకు జరిగిన ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. పోలీసులను స్వతంత్రంగా పనిచేయనీయకుండా రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రియాంక కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా విచారణను వేగవంతం చేయాలని కోరారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయొద్దు ప్రజలు లంచాలు తీసుకొని ఓట్లేశారంటూ సీఎం వ్యాఖ్యానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. లంచాలు తీసుకున్నవారు, ఇచ్చిన వారు ఎవరనే విషయమై ఆధారాలుంటే బయటపెట్టాలని, బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, గ్యాస్ సిలిండర్ల వంటి హామీల అమలుపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. జగనన్న పాలనలోనే మహిళలకు భరోసా జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో అమలు చేసిన వైఎస్సార్ ఆసరా, చేయూత, అమ్మఒడి, జగనన్న తోడు, ఉచిత ఇళ్ల స్థలాలు వంటి పథకాలతో మహిళలకు ఆర్థిక భరోసా లభించిందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల దృష్టిని మరల్చే యత్నాలు చేస్తున్నారని విమర్శించారు. నేరస్తులకు భయం కలిగేలా కఠిన చర్యలు చేపట్టడంతో పాటు బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని డిమాండ్ చేశారు. మైక్ పట్టుకొని ప్రకటనలు చేయడం కాకుండా చేతల్లో చూపించాలన్నారు. మహిళల భద్రతపై ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర జోనల్ మహిళాధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, సిటీ అధ్యక్షురాలు ధనూజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విద్యారంగానికి నిధుల కోత దారుణం
● నెల్లూరులో ఏఐఎస్ఎఫ్ నేతల ర్యాలీ నెల్లూరు(టౌన్): కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యారంగానికి నిధుల్లో కోత విధించడం దారుణమని ఏఐఎస్ఎఫ్ నేతలు అన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం నెల్లూరులోని వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్కే మస్తాన్ షరీఫ్ మాట్లాడుతూ వన్ నేషన్ – వన్ ఎడ్యుకేషన్ పేరుతో విద్యను కాషాయీకరణ చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీలకు నిధులు కేటాయించకుండా వాటి స్వయం ప్రతిపత్తిని తగ్గిస్తోందని విమర్శించారు. పేదవారికి విద్యను దూరం చేసేలా ప్రభుత్వాలు విద్యాసంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నాయన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పరీక్ష పేపర్లు లీక్ అవడంతో విద్యార్థులు తమ జీవితాలను కోల్పోతున్నారన్నారు. వెంటనే జీఓ నంబర్ 77ను రద్దు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కార్పొరేట్ విద్యాసంస్థల వ్యాపారవేత్తలు చేస్తున్న దోపిడీని అరికట్టలేని పరిస్థితిలో నేటి రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయకుండా విద్యార్థుల్లేరని పాఠశాలలను మూసివేయడం దారుణమన్నారు. విద్యాహక్కు చట్టాన్ని అపహాస్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ‘మార్పురావాలి – మార్పుకావాలి’ అనే నినాదంతో ఏఐఎస్ఎఫ్ నిరసన కార్యక్రమాలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి శివం వర్మ, నగర, రూరల్ అధ్యక్ష, కార్యదర్శులు సోహైల్, అబ్దుల్ కలీం, మహిళా నాయకులు శివానీ, మాధురి, సాబీర్, అభి, కార్తీక్, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. -
మల్లూరులో న్యాయ విజ్ఞాన సదస్సు
ముత్తుకూరు(పొదలకూరు): పౌరుల మధ్య శాంతి, మత సామరస్య సద్భావనను పెంపొందించాలని లోక్ అదాలత్ జడ్జి పద్మశ్రీ పేర్కొన్నారు. మండలంలోని మల్లూరులో గురువారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. సద్భావన దినోత్సవాన్ని ఏటా ఆగస్ట్ 20న నిర్వహిస్తున్నామని వివరించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని చెప్పారు. పేదలకు న్యాయం చేసేందుకు న్యాయసేవాధికార సంస్థ ఉందని వివరించారు. అత్యవసర సమయాల్లో 15100 నంబర్ను సంప్రదించాలని కోరారు. మానవ హక్కులు, చట్టాలపై వివరించారు. లోక్ అదాలత్ సభ్యులు సుబ్బారెడ్డి, నిరంజన్, కొండారెడ్డి, సుబ్బమ్మ, సుగుణ, రమేష్, వేణుగోపాల్, రమణయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. 29న వాహనాల వేలం నెల్లూరు(టౌన్): రవాణా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో సీజ్ చేసిన 25 వాహనాలను విడిపించుకునేందుకు ఇప్పటి వరకు ఎవరూ రాని తరుణంలో వీటిని ఈ నెల 29న వేలం వేయనున్నామని ఉప రవాణా కమిషనర్ చందర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాహనాల నంబర్లు, మోడల్, తయారు చేసిన కంపెనీ వివరాలను తమ కార్యాలయంలోని నోటీస్ బోర్డులో ఉంచామని తెలిపారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు తమ అడ్రస్ ప్రూఫ్తో పాటు రూ.ఐదు వేలను డిపాజిట్ చేయాలని సూచించారు. వేలంలో దక్కించుకున్న వారు సదరు మొత్తంతో పాటు 18 శాతం జీఎస్టీ, నిర్దేశిత పార్కింగ్ ఫీజును అదే రోజున చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. వైఎస్సార్సీపీలో పలువురికి పదవులు నెల్లూరు రూరల్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో జిల్లాకు చెందిన పలువుర్ని వివిధ హోదాల్లో నియమించారు. మైనార్టీ సెల్ రాష్ట్ర సెక్రటరీగా ఖాజారహంతుల్లా, సోషల్ మీడియా సెక్రటరీగా సయ్యద్ జీషన్, జాయింట్ సెక్రటరీగా ఆవుల అనిల్కుమార్యాదవ్ను నియమిస్తూ ఉత్తర్వులను పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం జారీ చేసింది. గిరిజన యువతకు శిక్షణ నెల్లూరు(వేదాయపాళెం): ఐటీడీఏ నెల్లూరు ప్రాజెక్ట్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాలకు సంబంధించిన గిరిజన యువతకు మల్టీ స్కిల్ టెక్నీషియన్ కోర్సులో శిక్షణను నిర్వహించనున్నామని పీఓ శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్ పాస్ లేదా ఫెయిలైన అభ్యర్థులకు చిత్తూరు జిల్లాలోని తలుపులపల్లి పోస్ట్ పేటమిట్టలోని అమరరాజా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో 24 నెలల పాటు శిక్షణను ఇవ్వనున్నారని పేర్కొన్నారు. ఇంటర్ పాసైన వారికి 18 నెలల పాటు ట్రెయినింగ్ను నిర్వహించనున్నారని వివరించారు. స్టయ్పండ్ రూపంలో నెలకు రూ.13,192 నుంచి రూ.13,392 వరకు ఇవ్వనున్నారని వెల్లడించారు. 16 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులని, ఆసక్తి గల వారు కొండాయపాళెం గేట్ సమీపంలోని తమ కార్యాలయంలో దరఖాస్తులను వచ్చే నెల 25లోపు సమర్పించాలని కోరారు. వివరాలకు 81878 99877 నంబర్ను సంప్రదించాలని సూచించారు. కిలో పొగాకు సరాసరి ధర రూ.186 కలిగిరి: కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో గురువారం కిలో పొగాకుకు సరాసరి ధర రూ.186.02గా లభించింది. జనరల్ క్లస్టర్కు చెందిన రైతులు 633 పొగాకు బేళ్లను అమ్మకానికి తీసుకురాగా, 536 బేళ్ల కొనుగోలు చేశారు. వివిధ కారణాలతో 97 బేళ్లు తిరస్కరణకు గురయ్యాయి. వేలం నిర్వహణాధికారి రాజశేఖర్ మాట్లాడుతూ కిలో పొగాకు గరిష్ట ధర రూ.250, కనిష్ట ధర రూ.110గా పలికిందన్నారు. వేలంలో పది కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. ● మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో గురువారం 595 పొగాకు బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. వేలానికి 666 బేళ్లు రాగా, 595 బేళ్లను విక్రయించామని, మిగిలిన వాటిని తిరస్కరించినట్లు తెలియజేశారు. గరిష్ట ధర కిలో ఒక్కింటికి రూ.250 కాగా కనిష్ట ధర రూ.110 లభించింది. మొత్తమ్మీద సగటు ధర రూ.199.24గా నమోదైంది. వేలంలో 11 కంపెనీలకు చెందిన వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. -
అవినీతిని ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలా?
● వలస పక్షులా నీతులు చెప్పేది? ● అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధం ● ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ నాయకులు ఆత్మకూరు: ‘జిల్లాలో మేకపాటి కుటుంబీకులకు మంచిపేరు ఉంది. సహాయం చేయడం తప్ప ఎవరినీ ఇబ్బంది పెట్టని నైజం వారిది. ఆనం అవినీతిపై విక్రమ్రెడ్డి ప్రశ్నిస్తే వలస పక్షులు, డబ్బుకు అమ్ముడుపోయిన వారు మేకపాటి కుటుంబీకులను వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటు’ అని ఆత్మకూరు వైఎస్సార్సీపీ నాయకులు ధ్వజమెత్తారు. పట్టణంలోని విక్రమ్రెడ్డి కార్యాలయంలో గురువారం అన్ని మండలాల పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆత్మకూరు పట్టణాధ్యక్షుడు నాగలపాటి ప్రతాప్రెడ్డి, జిల్లా బూత్ కమిటీల మేనేజర్ బాలిరెడ్డి సుధాకర్రెడ్డి, జెడ్పీటీసీ పెమ్మసాని ప్రసన్నలక్ష్మి, పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి పీవీ రమేష్రెడ్డి, పీఆర్ విభాగం అధ్యక్షుడు బొమ్మిరెడ్డి రవికుమార్రెడ్డి, న్యాయవిభాగం అధ్యక్షుడు నందా ఓబులేసు, మండలాల కన్వీనర్లు మాట్లాడారు. సోమశిల ఉత్తరకాలువ పనులు పూర్తికాని అంశంపై మంత్రిని ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక మేకపాటి కుటుంబీకులకు దాసోహంగా ఉంటున్నారు.. సిగ్గులేదా అంటూ నిందించడం దారుణమన్నారు. విక్రమ్రెడ్డి ఈ అవినీతిపై ప్రశ్నించారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చింది మొదలు అవినీతే.. ఆత్మకూరులో మెయిన్ రోడ్డు పక్కనే విద్యాసంస్థకు కేటాయించిన స్థలాన్ని రూ.6 కోట్లకు కొనుగోలు చేసి చెరువు మట్టిని అక్రమంగా తరలించి చదును చేసిన విషయం, దీనిని టీడీపీ నాయకులే సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో చీవాట్లు పెట్టి పనులు నిలిపివేయాలని ఆదేశించడం వాస్తవం కాదా అని నిలదీశారు. టిడ్కో ఇళ్ల సమీపంలో ప్రభుత్వ స్థలం ఉండగా అందులో మంత్రి ప్రమేయంతో వెంచర్ వేస్తున్న విషయం వాస్తవం కాదా అన్నారు. చేజర్ల మండలంలో 250 ఎకరాల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని జామాయిల్ తోటను కొట్టి తరలించింది నిజం కాదా అని ప్రశ్నించారు. అక్రమ ఇసుక తరలింపు సమయంలో ఆటోను టిప్పర్ ఢీకొనడంతో ఏడుగురు మృతిచెందగా, కనీసం ఆ కుటుంబాలను పరామర్శించే తీరిక టీడీపీ నాయకులకు లేకపోయిందన్నారు. సంగంలో స్థానిక నాయకుడు ఏఎంఆర్ సంస్థతో పాటు అధికారులను బెదిరిస్తూ తన అనుమతిలేనిదే పనులు చేయవద్దని హుకుం జారీ చేస్తున్న విషయం మంత్రి ఆనంకు తెలియదా అని అడిగారు. చికెన్ వ్యర్థాల వాహనాల వద్ద చిల్లర దండుకుంటున్న వ్యక్తి టీడీపీ నాయకుడు కాదా అన్నారు. ఆత్మకూరు చెరువు కలప రూ.10 లక్షల విలువ గల దానిని కేవలం రూ.90 వేలకే సొంతం చేసుకున్న విషయం నిజమేకదా అన్నారు. ● సుమారు రూ.200 కోట్ల ఆస్తులను దివంగత మేకపాటి గౌతమ్రెడ్డి పేరుతో వ్యవసాయ యూనివర్సిటీ కోసం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి అందజేశారన్నారు. సొంత నిధులతో పలు గ్రామాల్లో తాగునీటి వసతి కల్పించారన్నారు. ఇలా సొంత ఆస్తులను మంత్రి ఆనం కానీ, ఆ పార్టీ చోటా టీడీపీ నేతలు ఎన్నడైనా ఖర్చు చేశారా అని ప్రశ్నించారు. ఇకనైనా స్థాయి కి తగ్గట్లు మాట్లాడాలని హితవు పలికారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి షేక్ కరీముల్లా, మండలాల కన్వీనర్లు చెన్ను వెంకటేశ్వర్లురెడ్డి, పులగం బా లశంకర్రెడ్డి, బిజివేముల పిచ్చిరెడ్డి, ఎంపీపీ బోయిళ్ల పద్మజారెడ్డి, రూరల్ ఎస్సీసెల్ నాయకుడు తోడేటి అశోక్, నారాయణస్వామి, కామాక్షయ్య నాయుడు, మీరామొహిద్దీన్, నోటి వినయ్కుమార్రెడ్డి, సుబ్బిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ దేవసహాయం, పార్టీ నాయకులు పొంగూరు సుధాకర్, సూరి మదన్మోహన్రెడ్డి, గుండాల బాలచంద్రారెడ్డి, ఫణికుమార్రెడ్డి, దాడి శ్రీనివాసులునాయుడు, మాజీ సర్పంచ్ బొలిగర్ల వెంకటేశ్వర్లు, గడ్డం శ్రీనివాసులురెడ్డి, పాలేటి వెంగళరెడ్డి, బాల అంకయ్య, నందవరం ప్రసాద్ పాల్గొన్నారు. -
జోరుగా మట్టి అక్రమ తరలింపు
● పట్టించుకోని అధికారులు ముత్తుకూరు (పొదలకూరు): మండలంలోని పంటపాళెం గిరిజనుల సీజేఎఫ్ఎస్ భూముల నుంచి మట్టి అక్రమ తరలింపు ఆగడం లేదు. మట్టి అక్రమ దందాపై సోషల్ మీడియా, పత్రికల్లో కథనాలు బుధ, గురువారాల్లో ప్రచురితమైనా, అక్రమార్కులు ఏ మాత్రం ఖాతరు చేయడంలేదు. ఆ పరిసరాలకు సైతం అధికారులు వెళ్లకపోవడంతో మట్టి మాఫియా గురువారం చెలరేగిపోయి టిప్పర్ల సంఖ్యను పెంచిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీలకు ట్రిప్పును రూ.12 వేల వంతున తోలుతున్నారు. సీజేఎఫ్ఎస్ భూములు 16 ఎకరాలుండగా, అందులో నాలుగెకరాల్లో పెద్ద గుంతలను తవ్వి మట్టిని తరలిస్తున్నారు. వీటిని సాగుకు పనికిరాకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతలతో సమీపంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని వాపోతున్నారు. -
గిరిజనుల భూములను చెరబడుతూ..
● పేట్రేగిపోతున్న గ్రావెల్ మాఫియా ● స్థానిక ఎమ్మెల్యేల అండదండలతో దర్జాగా దోపిడీ ● కావలి, సర్వేపల్లి, ఉదయగిరి, గూడూరు నియోజకవర్గాల్లో నిత్యం వందల టిప్పర్లలో గ్రావెల్, మట్టి అక్రమ రవాణా ● బిట్రగుంట పోలీస్స్టేషన్ ఎదుటే విచ్చలవిడిగా తవ్వకాలు ● కావలిలో చెరువులను చెరబట్టిన తెలుగు తమ్ముళ్లు ● ముత్తుకూరు మండలం పంటపాళెంలో గిరిజన భూముల్లో మట్టి తవ్వేస్తున్న వైనం ● కలిగిరి పెద్ద చెరువు, రావులకొల్లు చెరువుల నుంచి ఇష్టారాజ్యంగా గ్రావెల్ అక్రమ రవాణా ● చిల్లకూరు, కోట, చిట్టమూరు మండలాల్లో చెరువుల్లో యథేచ్ఛగా మట్టి, గ్రావెల్ దోచేస్తున్నారుముత్తుకూరు మండలం పంటపాళెంలో యంత్రాలతో మట్టిని తవ్వి టిప్పర్లో వేస్తూ.. ముత్తుకూరు(పొదలకూరు): అధికారాన్ని అడ్డుపెట్టుకొని పంటపాళెంలోని గిరిజనుల భూముల్లో మట్టి అక్రమ తవ్వకాలను అధికార పార్టీ నేతలు కొద్ది రోజులుగా సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఫలితంగా పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దాదాపు 16 ఎకరాల మేర గిరిజనులు అనుభవిస్తున్న భూములకు ఆర్డీఓ పట్టాలున్నాయి. వీటిని విక్రయించడం, కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరం. అయితే మట్టి తవ్వకాలను అధికార పార్టీకి చెందిన కొందరు అక్రమంగా చేపట్టి సమీపంలోని ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. ట్రిప్పునకు రూ.12 వేల చొప్పున విక్రయిస్తున్నారు. పట్టపగలే.. సీజేఎఫ్ఎస్ భూముల్లో పగలూ, రాత్రనే తేడా లేకుండా మట్టిని తవ్వి టిప్పర్లలో తరలిస్తున్నారు. చుట్టుపక్కల నూతనంగా నిర్మిస్తున్న పామాయిల్ ఫ్యాక్టరీలకు వీటిని పంపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వందల అడుగుల లోతు వరకు తవ్వడంతో భూగర్భ జలాల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. గుంతల్లో నీటిని తోడుతూ.. భారీ గుంతల్లో చేరుతున్న నీటిని మోటార్ల ద్వారా తోడి ఆపై మట్టిని తరలిస్తున్నారు. ఈ ప్రభావంతో చుట్టుపక్కల వేరుశనగ పంటలను సాగు చేస్తున్న రైతులకు నీటి సమస్యలు తలెత్తుతున్నాయి. నిలదీస్తే అక్రమ కేసులు పెడతారనే భయంతో పలువురు వెనుకంజేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో గ్రావెల్, మట్టి మాఫియా దోపిడీ అప్రతిహతంగా సాగుతోంది. గ్రావెల్ మాఫియాలకు స్థానిక ఎమ్మెల్యేల అండదండలు ఉండడంతో పేట్రేగిపోతున్నారు. ప్రధానంగా కావలి, సర్వేపల్లి, ఉదయగిరి, గూడూరు నియోజకవర్గాల్లో చెరువులు, ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో రేయింబవళ్లు బరితెగించి యంత్రాలు పెట్టి గ్రావెల్, మట్టి తవ్వకాలు చేపడుతున్నా.. కట్టడి చేయాల్సిన మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ శాఖలు మామూళ్లు దండుకుంటూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. పత్రికలు, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల్లో నిత్యం పుంఖాను పుంఖాలుగా కథనాలు ప్రచురితమవుతున్నా, ప్రసారమవుతున్నా అధికారులు ధృతరాష్ట్రుల్లా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విచ్చలవిడిగా తవ్వేసి అక్రమంగా అమ్ముకుంటున్న మాఫియాకు వచ్చే రాబడిలో 10 శాతం అధికారులకు నెల మామూళ్లుగా ముట్టచెబుతుంటే.. 50 శాతం స్థానిక ప్రజాప్రతినిధులకు వాటాలుగా వెళ్తున్నట్లు సమాచారం. ప్రధానంగా కావలి నియోజకవర్గంలో కావలి, బోగోలు మండలాల్లో గ్రావెల్, మట్టి తవ్వకాల కేజీఎఫ్ తరహాలో ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. కావలి మండలంలోని కావలి పెద్ద చెరువు, రుద్రకోట, కొత్తపల్లి, ఆర్సీపాళెం, అడవిలక్ష్మీపురం, చెన్నాయపాళెం, తాళ్లపాళెం గ్రామాల్లో చెరువులను ప్రమాదకర స్థాయిలో గోతులు పెట్టి తవ్వేశారు. ఇక బోగోలు మండలంలోని కప్పరాళ్లతిప్ప, కొండబిట్రగుంట, ఉమామహేశ్వరపురం గ్రామాల్లో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. చీకటి పడితే చాలు భారీ యంత్రాలు, టిప్పర్లతో యథేచ్ఛగా ప్రభుత్వ భూముల్లో గ్రావెల్ను కొల్లగొట్టేస్తూ రియల్ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తూ రూ.కోట్లు దోచేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టేస్తున్నారు. బోగోలు మండలం నుంచి ఒక్కో గ్రావెల్ ట్రిప్పునకు దూరాన్ని బట్టి రూ.13 వేలు నుంచి రూ.17 వేల వరకు రోజుకు సుమారు 100 ట్రిప్పుల పైనే తోలుతూ మాఫియా దోచుకుంటుంది. గ్రావెల్ అక్రమ తవ్వకాలు, రవాణాపై స్థానిక ప్రజలు, మీడియా ప్రతినిధులు ఎవరైనా ప్రశ్నించినా, ఆ ప్రదేశానికి వెళ్లినా చంపేస్తాం, దాడులు చేస్తాం. మా వెనుక ఎమ్మెల్యే ఉన్నాడు.. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడంటూ చెలరేగిపోతున్నారనే విమర్శలు లేకపోలేదు. అందుకు తగినట్లుగానే రుద్రకోటలో గ్రావెల్ తవ్వకాలకు సంబంధించి ఫొటోలను తీసేందుకు వెళ్లిన ఓ జర్నలిస్టును బంధించి తీసుకెళ్లి చీకటి గదిలో నిర్బంధించి చితక్కొట్టిన విషయం విదితమే. పచ్చమాఫియా ఏ స్థాయికి వెళ్లిందంటే.. ఇటీవల గ్రావెల్ అక్రమ తవ్వకాలపై కథనాలు రాసిన జర్నలిస్టులపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా, అవమానకరంగా పోస్టులు పెట్టి వేధించే స్థాయికి చేరింది. దీనిపై జర్నలిస్టులు కావలి డీఎస్పీని కలిసి సదరు వ్యక్తులపై ఫిర్యాదు చేయడం గమనార్హం. మరో జర్నలిస్టును పట్టుకెళ్లి కట్టేసి కొట్టమని.. కొందరిని పురమాయించిన వైనం కూడా వెలుగులోకి రావడం తెలిసిందే. ఈ పరిణామాలతో అప్రమత్తమైన పోలీసులు రెండు రోజుల పాటు సదరు జర్నలిస్టును నీడలా వెంటాడినట్లు సమాచారం. ఈ రెండు ఘటనల వెనుక స్థానిక ఎమ్మెల్యే అనుచరులే ఉండడం విశేషం. పోలీస్స్టేషన్ ముందే దందా బోగోలు మండలంలో కప్పరాళ్లతిప్పలోని పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలో చీకటి పడగానే భారీ యంత్రాలు, పదుల సంఖ్యలో టిప్పర్లు గ్రావెల్ భూముల్లోకి దిగిపోతున్నాయి. అక్కడ తవ్విన గ్రావెల్ను ఆ పోలీస్స్టేషన్ మీదుగానే హైవే ఎక్కిపోతున్నా.. పోలీసు అధికారులు కన్నెత్తి చూసి కట్టడి చేసిన పాపాన పోవడం లేదు. ఈ గ్రావెల్ దందా వెనుక స్థానిక పోలీస్ స్టేషన్ సిబ్బంది స్వీయ పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోగోలు మండలంలో జరుగుతున్న గ్రావెల్ దోపిడీపై స్థానిక తహసీల్దార్ సైతం అంగీకరించడం గమనార్హం. సర్వేపల్లి నియోజకవర్గంలో నాణ్యమైన గ్రావెల్ వనరులు ఉన్న వెంకటాచలం జిల్లాలోనే అతి పెద్ద వీజీఎఫ్ (వెంకటాచలం గ్రావెల్ ఫీల్డ్స్)గా చెప్పొచ్చు. వెంకటాచలంలో గ్రావెల్ తవ్వకాలు చూస్తే.. కళ్లు బైర్లు కమ్మే స్థాయిలో జరుగుతోంది. కానీ అధికార యంత్రాంగానికి మాత్రం కనిపించదు. ఇక పొదలకూరులో అయితే ఏకంగా కొండలనే కరిగించేశారు. ముత్తుకూరులో ఇప్పటికే చెరువుల్లో కుళ్లబొడిచేసిన ఈ మాఫియా చివరకు గిరిజనుల బతుకుదెరువు భూములను వదలట్లేదు. ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి, జలదంకి, కొండాపురం, వింజమూరు మండలాల్లో అక్రమ గ్రావెల్ దందా మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి, పగలనే తేడా లేకుండా అధికార పార్టీ నేతలు అక్రమంగా గ్రావెల్ తరలిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. అడ్డుకోవాల్సిన ఇరిగేషన్ అధికారులు మామూళ్లు మత్తులో ‘పచ్చజెండా’ ఊపేశారు. కలిగిరి పెద్ద చెరువులో రేయింబవళ్లు యంత్రాలు పెట్టి 10 అడుగుల లోతు వరకు తవ్వేస్తున్నారు. కలిగిరి మండలం రావులకొల్లు చెరువు నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా ఓ రోడ్డు కాంట్రాక్టర్ అక్రమంగా మట్టి తరలించి ఒక చోట నిల్వ చేస్తున్నారు. -
అక్రమ రవాణాతో జేబులు నింపుకొంటూ..
వింజమూరు (ఉదయగిరి): టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో ప్రకృతి వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. దీనికి ఇరిగేషన్ అధికారుల సహకారం తోడవడంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారు. రేయింబవళ్లూ రవాణా చేస్తూ జేబులు నింపుకోవడంలో పచ్చ నేతలు బిజీబిజీగా ఉన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి, జలదంకి, కొండాపురం, వింజమూరు మండలాల్లో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. ఫలితంగా రాయల్టీ రూపంలో ప్రభుత్వ ఖజానాకు జమకావాల్సిన నిధులు పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వ పనుల పేరుతో కొల్లగొడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా కలిగిరి మండలంలోని రావులకొల్లు చెరువు నుంచి మట్టిని రోడ్డు కాంట్రాక్టర్ అక్రమంగా తరలించి ఓ చోట నిల్వ ఉంచుతున్నారు. అనుమతులు పొందామని చెప్తున్నా, అవి నామమాత్రంగా ఉన్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. గ్రామావసరాల నిమిత్తం కొంత మొత్తంలో నగదు ఇచ్చే ఒప్పందంతో రవాణా సాగిస్తున్నారని తెలుస్తోంది. కలిగిరి పెద్ద చెరువు కట్ట అభివృద్ధి పేరుతో గ్రావెల్ను విక్రయిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. వింజమూరులో లేఅవుట్ల కోసం తరలిస్తున్నారు. దీని వెనుకా అధికార పార్టీ నేతల ప్రమేయముందని తెలుస్తోంది. నిబంధనలు గాలికి కలిగిరిలోని పెద్ద చెరువులో గ్రావెల్ అక్రమ దందా జోరుగా సాగుతోంది. పెద్ద మెషీన్లను వినియోగించి టిప్పర్ల ద్వారా తరలిస్తూ రూ.లక్షల్లో దోచేస్తున్నారు. ఈ క్రమంలో చెరువులో పదడుగుల లోతులో గుంతలు ఏర్పడ్డాయి. వర్షమొస్తే ఇందులో నీరు నిలిచి ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం పొంచి ఉంది. ఈ దందా వెనుక అధికార పార్టీకి చెందిన ఓ నేత పాత్ర ఉందనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. కఠిన చర్యలు చేపడతాం అనుమతుల్లేకుండా చెరువుల్లో మట్టి, గ్రావెల్ను తరలిస్తే కఠన చర్యలు చేపడతాం. ఈ విషయమై ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చాం. కలిగిరిలో అక్రమ రవాణా అంశం నా దృష్టికొచ్చింది. వీరిపై చర్యలు చేపట్టాలని సూచించాం. పెనాల్టీ రూపంలో నగదును వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తాం. – దేశ్నాయక్, ఎస్ఈ, ఇరిగేషన్ -
నేతన్నలనూ వదలని పచ్చ నేతలు
● వారికిచ్చే సొమ్ములో చేతివాటం ● ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్రెడ్డి పొదలకూరు: నేతన్న భరోసా కింద చేనేత కార్మికులకు ప్రభుత్వం అందజేసిన నగదును సైతం పచ్చ నేతలు వదలకుండా చేతివాటాన్ని ప్రదర్శించి ఒక్కొక్కరి వద్ద రూ.రెండు వేల చొప్పున వసూలు చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని నేదురుమల్లిలో బుధవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాకాణిని గ్రామస్తులు కలిసి కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం కుంటుపడిందని వాపోయారు. అనంతరం ఆయన మాట్లాడారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమంపై బహిరంగ చర్చకు రావాలంటే సోమిరెడ్డి పత్తాలేకుండా పోయారని విమర్శించారు. గ్రామాల్లో మౌలిక వసతుల్లేవని ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి ఇసుక, మట్టి, గ్రావెల్ దందాను సోమిరెడ్డి సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ, దేవదాయ, అటవీ భూములను ఆక్రమించి సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. పంటకు గిట్టుబాటు ధరలెక్కడ..? రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలను ప్రభుత్వం కల్పించడంలేదని దుయ్యబట్టారు. పుట్టి రూ.16 వేలకు రైతులు విక్రయించాల్సి వస్తోందని చెప్పారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మూడు నెలల తర్వాత రూ.36 వేల మేర దళారులు, మిల్లర్లు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. రైతులకు మద్దతు ధర కల్పించకుండా.. దళారులు, మిల్లర్లకు ఉపయోగపడేలా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధికి రూ.మూడు వేల కోట్లను కేటాయించిన విషయాన్ని గుర్తుచేశారు. గ్రామాల్లో సమస్యలపై తమ పార్టీ మాజీ సర్పంచ్లు స్పందించి నిధులను వెచ్చించి పనులు చేయడాన్ని అభినందించారు. ప్రత్యేకాధికారుల పాలనలో పంచాయతీ నిధులను దోపిడీ చేసేందుకు అధికార పార్టీ నేతలు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. గ్రామానికి చెందిన పార్టీ నేత చేపూరు చంద్రమౌళి కుమార్తె భార్గవి ముందస్తు వివాహ వేడుకలకు హాజరై ఆశీర్వదించారు. నేతలు గోగిరెడ్డి గోపాల్రెడ్డి, బచ్చల సురేష్కుమార్రెడ్డి, పెదమల్లు రమణారెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, ఉడతా రమేష్, పెంచలనాయుడు, కరిపరెడ్డి కృష్ణారెడ్డి, రావుల ఇంద్రసేన్గౌడ్, తిరుపాల్రెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, అంజద్, కేతు రామిరెడ్డి, వెంకటరమణయ్య, విజయభాస్కర్రెడ్డి, యనమల శ్రీనివాసులురెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే లై న్ల నిర్మాణంపై ఎంపీ హర్షం
చిల్లకూరు: తిరుపతి పార్లమెంట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉన్న రైల్వే లైన్లు, స్టేషన్ల అబివృద్ధి, ప్రయాణికులకు మౌలిక వసతుల కల్పనపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కృషి ఫలిస్తోంది. తమిళనాడులోని గుమ్మిడిపూండి నుంచి గూడూరు వరకు ఉన్న రెండు లైన్లతో పాటు అదనంగా మరో రెండు లైన్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నలివ్వడంపై బుధవారం ఆయన హర్షం వ్యక్తం చేయడంతో పాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు కృతజ్ఞతలను తెలియజేశారు. పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయంలో గతంలో తాను ప్రతిపాదించిన గుమ్మిడిపూండి – గూడూరు రైల్వేస్టేషన్ల మధ మూడు, నాలుగో లైన్లపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారని అడిగారు. దీంతో కేంద్ర మంత్రి సమాధానమిస్తూ.. రెండు లైన్లకు ఆమోదం తెలపడంతో పాటు నిధులను మంజూరు చేశామని చెప్పారు. సాంకేతికతను రైతులు అందిపుచ్చుకోవాలి ● కలెక్టర్ హిమాన్షు శుక్లా ● అగ్రి ఎక్స్పో ప్రారంభం నెల్లూరు(వేదాయపాళెం): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా కాంక్షించారు. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో బుధవారం నిర్వహించిన అగ్రి ఎక్స్పో, కిసాన్ మేళాకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడంతో పాటు ఆదాయాన్ని పెంచే ఆధునిక సాంకేతికత, శాసీ్త్రయ సాగు పద్ధతులు క్షేత్రస్థాయిలో రైతులకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వివిధ స్టాళ్లలో ఏర్పాటు చేసిన వ్యవసాయ యంత్రాలు, డ్రోన్లు, పరికరాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులను పరిశీలించారు. వివిధ అంశాలపై రైతులు, చాంపియన్ ఫార్మర్స్, వ్యవసాయాధికారులు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి చర్చించారు. ఉపాధి అవకాశంగా ఎంచుకోవాలి ప్రస్తుత పోటీ పరిస్థితుల్లో వ్యవసాయ రంగంవైపు యువత మొగ్గు చూపి ఆధునిక సాంకేతికతతో అధిక దిగుబడులు సాధించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ కాంక్షించారు. వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రదర్శనలు రైతుల అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. స్టాళ్లను రైతులు ఆసక్తిగా తిలకించారు. మేయర్ దేవరకొండ సుజాత, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, ఉద్యానాధికారి సుబ్బారెడ్డి, పశుసంవర్థక శాఖ జేడీ రమేష్నాయక్, డీసీఓ గుర్రప్ప, ఏపీఎంఐపీ పీడీ పద్మలత, ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు శ్రీలక్ష్మి, వినీత, శివజ్యోతి, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎక్సలెన్స్ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం నెల్లూరు (టౌన్): జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో 2025 – 26 విద్యా సంవత్సరంలో 14, 17, 19 విభాగంలో వివిధ క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎంత మంది విద్యార్థులు పాల్గొన్నారనే అంశమై వారి స్పోర్ట్స్ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను అందజేయాలని డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు (ఫిజికల్ ఎడ్యుకేషన్), వ్యాయామ ఉపాధ్యాయుల సంతకంతో వీటిని విద్యాశాఖ కార్యాలయంలో గురువారంలోపు సమర్పించాలని పేర్కొ న్నారు. స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డులకు గానూ వీటిని అందజేయాల్సి ఉంటుందని, వివరాలకు 94929 36165, 94946 40191 నంబర్లను సంప్రదించాలని సూచించారు. డీసీపల్లిలో 571 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 571 బేళ్లను బుధవారం విక్రయించామని నిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. వేలానికి 695 బేళ్లు రాగా, వాటిలో 571ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. గరిష్టంగా రూ.250.. కనిష్టంగా రూ.110.. సగటు ధర రూ.186.97గా నమోదైందని వెల్లడించారు. 11 కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారని పేర్కొన్నారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాధ్యతల స్వీకరణ
నెల్లూరు(లీగల్): జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఎ.నరసింహమూర్తి బుధవారం నెల్లూరులోని జిల్లా కోర్టులో బాధ్యతలు స్వీకరించారు. ఈయన తిరుపతి జిల్లా ప్రత్యేక (ఎర్రచందనం)కోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ బదిలీపై నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు సత్తు అంకయ్య, బార్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు అయ్యప్పరెడ్డి, జల్లి పద్మాకర్, ప్రధాన కార్యదర్శి నాగరాజు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి మృత్యువాత నెల్లూరు సిటీ: రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందిన ఘటనపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. నెల్లూరు నగరంలోని జాకీర్హుస్సేన్ నగర్కు చెందిన షేక్ చాన్బాషా (68) ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వ్యక్తిగత పని నిమిత్తం మంగళవారం నరుకూరుకు వెళ్లాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా నెల్లూరు నుంచి చినతోపు వైపు వెళ్తున్న ట్రక్కు సైడు మిర్రర్ తగలడంతో కిందపడి గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే అతడిని హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని.. ● ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య ● నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు కోట: మండలంలోని లక్ష్మక్కకండ్రిగకు చెందిన పల్లాల కోటయ్య అనే వ్యక్తి హత్య కేసులో నిందితులు పల్లాల మంజుల, కర్లపూడి చందులను బుధవారం అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు గూడూరు సీఐ మాలకొండయ్య తెలిపారు. వివరాలను కోట పోలీస్స్టేషన్లో సీఐ వెల్లడించారు. లక్ష్మక్కకండ్రిగ దళితవాడకు చెందిన పల్లాల కోటయ్య, మంజుల భార్యాభర్తలు. కాగా అదే గ్రామానికి చెందిన కర్లపూడి చందుతో మంజులకు రెండేళ్ల నుంచి వివాహేతర సంబంధం ఉంది. దీంతో భార్యభర్తల మధ్య తరచుగా గొడవలు జరిగేవి. ఈ క్రమంలో చందుతో కలిసి భర్త కోటయ్యను చంపేందుకు మంజుల పథకం పన్నింది. ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి కోటయ్య నిద్రలో ఉండగా మంజుల, చందు కలిసి పైలాన్ తాడు, చీరతో మెడకు ఉచ్చు బిగించి బలంగా లాగి చంపినట్లు సీఐ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేశామన్నారు. కేసును ఛేదించిన ఎస్సై పవన్ కుమార్, సిబ్బంది శోభారాణి, పవన్ చంద్ర, మధుబాబును అభినందించారు. -
కొనసాగుతున్న జూడాల సమ్మె
● ఇబ్బంది పడుతున్న రోగులు నెల్లూరు(అర్బన్): డిమాండ్ల సాధన కోసం విధులు బహిష్కరించి జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మె కొనసాగుతోంది. బుధవారం కూడా నెల్లూరులోని సర్వజన ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు, పీజీ చేస్తున్న వైద్యులు, సీనియర్ రెసిడెంట్లు ఈ సమ్మెలో పాల్గొన్నారు. వీరికి పలువురు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మద్దతు పలికారు. ఇప్పటి వరకు పరోక్షంగా మద్దతు పలుకుతున్న వీరు తొలిసారిగా నేరుగా జూడాలు చేస్తున్న ధర్నా శిబిరం వద్దకు వచ్చి మాట్లాడారు. సమ్మె న్యాయ సమ్మతమైందన్నారు. జూడాల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హనీష్కుమార్ మాట్లాడుతూ తమ డిమాండ్లు ప్రభుత్వం ఆమోదించే వరకు సమ్మె ఆపే ప్రసక్తేలేదని , కొనసాగుతుందన్నారు. వారిపై భారం జూనియర్ డాక్టర్లు అన్ని రకాల అత్యవసర సేవ లు ఆపేసి సమ్మెలో పాల్గొనడంతో రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సీనియర్ డాక్టర్లు, నర్సులపై పనిభారం పెరిగింది. ఇదిలా ఉండగా సీనియర్ డాక్టర్లు సక్రమంగా రాకపోవడంతో జూడాలు చేసే వైద్యసేవలు నర్సులే చేస్తున్నారు. ఈ క్రమంలో రోగులకు సక్రమంగా సేవలందడం లేదు. -
సూర్యప్రభ వాహనంపై వెంకయ్యస్వామి విహారం
● గొలగమూడిలో భక్తుల కోలాహలం ● అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు వెంకటాచలం: 44వ ఆరాధనోత్సవాల్లో భాగంగా బుధవారం సూర్యప్రభ వాహనంపై వెంకయ్యస్వామి ఆశీనులై గొలగమూడి వీధుల్లో విహరించారు. ముందుగా ఆశ్రమంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూలతో శోభాయమానంగా అలంకరించిన సూర్యప్రభ వాహనంపై స్వామివారు ఆశీనులై భక్తులను ఆశీర్వదించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల మధ్య ఊరేగింపు కనులపండువగా సాగింది. గ్రామోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు గొలగమూడికి తరలివచ్చారు. ఈ సేవకు నాయుడుపేటకు చెందిన సన్నారెడ్డి కృష్ణారెడ్డి ఉభయకర్తగా వ్యవహరించారు. ● ఆరాధనోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి చంద్రప్రభ వాహన సేవ నిర్వహించారు. పూలు, విద్యుద్దీపాలతో అలంకరించిన చంద్రప్రభ వాహనంపై వెంకయ్యస్వామిని ఆశీనులను చేసి గ్రామోత్సవం నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలను ప్రదర్శించారు. ఈ సేవకు ఆల్తూరి గిరీష్రెడ్డి, లత దంపతులు, ఆల్తూరి మహేష్రెడ్డి, రాధిక దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఉత్సవాల్లో నేడు గురువారం ఉదయం హనుమంత సేవ, రాత్రి హంస వాహన సేవ నిర్వహించనున్నారు. అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. -
పెన్షనర్ల సమస్యలు పట్టవా?
● నెల్లూరులో కలెక్టరేట్ ఎదుట ధర్నా నెల్లూరురూరల్: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరులో కలెక్టరేట్ వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు పున్నారావు, కార్యదర్శి సత్తిరాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కోట్లాది మంది పెన్షనర్లకు నష్టం కలిగించే పెన్షన్ రివాల్యుయేషన్ బిల్లు 2025ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీని వెంటనే ఏర్పాటు చేసి, 2026 జనవరి 1 నుంచి అమలు చేయాలని, అప్పటి వరకు మధ్యంతర భృతి చెల్లించాలని కోరారు. హయ్యర్ పెన్షన్ కోసం నోటీసులు అందుకున్నప్పటికీ నిర్ణీత సమయంలో డబ్బులు చెల్లించలేని వారికి మరో అవకాశం కల్పించాలన్నారు. పోస్టల్, బీఎస్ఎన్ఎల్, బ్యాంకు ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, ఏపీఎస్, సీపీఎస్, యూపీఎస్ విధానాలను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) అమలు చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న సుమారు రూ.25 వేల కోట్ల బకాయిలను దశలవారీగా చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని ఈపీఎస్ 95 పెన్షనర్లకు కనీసం రూ.9 వేలను డీఏతో కలిపి చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని సూచించారు. ఇతర రాష్ట్రాల మాదిరిగా కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. అంగన్వాడీ, ఆశా కార్యకర్తలతోపాటు వివిధ రంగాల్లో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికుల వేతనాల నుంచి ఈపీఎఫ్ చందాలను వసూలు చేసి వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. -
చిన్న జీవి.. పెద్ద ముప్పు
నెల్లూరు(అర్బన్): దోమ పరిమాణంలో చాలా చిన్నదే. కానీ మనిషి ఆరోగ్యంపై చూపే ప్రభావం చాలా పెద్దది. దాని కాటు ద్వారా వచ్చే వ్యాధులతో అనేక మంది మృతిచెందుతున్నారు. దోమల ద్వారా వ్యాపించే డెంగీలాంటి పలు వ్యాధులతో రాష్ట్రంలో లక్షలాది మంది, జిల్లాలో వేలాది మంది ప్రతి సంవత్సరం జబ్బుల బారిన పడుతున్నారు. ఇప్పటికీ దేశంలో మలేరియా లాంటి వ్యాధులతో వేలాది మంది మరణిస్తున్నారు. ఈ విషయాన్ని పరిశీలించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలను చైతన్యం చేసేందుకు పూనుకుంది. మలేరియా వ్యాధి ఆడ ఎనాఫిలిస్ దోమ ద్వారా వ్యాప్తి చెందుతుందని 1897 ఆగస్టు 20న సర్ రోనాల్డ్ రాస్ అనే శాస్త్రవేత్త నిరూపించారు. ఆ రోజును పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఆగస్టు 20న ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నీటి నిల్వలే ఆవాసాలు ఇళ్లు, పరిసరాల్లో ఏ కొంచెం నీరు నిల్వ ఉన్నా అందులో దోమలు గుడ్లు పెట్టి తమ సంతతిని వ్యాప్తి చేస్తాయి. ఆవరణలో పడి ఉండే పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ఖాళీ డబ్బాలు, పూల కుండీలు, నీటి ట్యాంక్లు, డ్రమ్ములు, గుంతల్లో నిల్వ ఉండే నీటిలో దోమలు గుడ్లు పెట్టి సంతతిని వ్యాప్తి చేస్తాయి. వచ్చే జబ్బులివే.. దోమలు కుట్టడం వల్ల ప్రధానంగా డెంగీ, మలేరియా, ఫైలేరియా, చికున్గున్యా, జపనీస్ ఎన్సెఫలైటిస్ లాంటి అనేక వ్యాధులు వస్తాయి. వీటిలో జపనీస్ ఎన్సెఫలైటిస్ వస్తే తీవ్ర ప్రమాదం ఉంటుంది. అలాగే కొన్ని రకాల డెంగీ జ్వరాలు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. ఫైలేరియా వస్తే బోధకాళ్లతో జీవితాంతం బాధను అనుభవించాల్సి ఉంటుంది. మలేరియాతో సైతం అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మగ దోమలు మనుషులను కుట్టవు. అవి మకరందాన్ని పీల్చుకుని బతుకుతాయి. ఆడ దోమలు మనుషుల రక్తాన్ని పీల్చుకుంటాయి. ఇలా రక్తాన్ని పీల్చుకునే సమయంలో దోమ నోటి లాలాజలంలో ఉండే వైరస్లు, పరాన్నజీవులు మనిషి శరీరంలోని రక్తంలోకి ప్రవేశించి జబ్బులకు కారణమవుతాయి. ఈ రకమైన వైరస్లు, పరాన్నజీవులకు దోమలు వాహకాలుగా పనిచేస్తాయి. నిర్లక్ష్యం వద్దు తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కళ్ల వెనుక నొప్పి, ఒళ్లు నొప్పులు, కీళ్ల నొప్పులు, వాంతులు, చర్మంపై దద్దుర్లు ఉంటే డెంగీ లాంటి వ్యాధులు అయి ఉండొచ్చు. ఇలాంటి సమయంలో సొంత వైద్యం మానుకుని దగ్గరలోని వైద్యుడిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా నిండు ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఏం చేయాలంటే.. దోమలు పుట్టకుండా, కుట్టకుండా చూసుకోవడం ద్వారా దోమల నియంత్రణ జరిగి వ్యాధులను అదుపులోకి తీసుకురావొచ్చు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడా కొంచెం కూడా నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. దోమలు గుడ్లు పెట్టకుండా నీటి పాత్రలపై మూతలు ఉంచాలి. కిటికీలకు మెష్లు ఏర్పాటు చేయించాలి. దోమతెరలు వాడాలి. వారానికి ఒకరోజైనా నీటి తొట్టిలను శుభ్రం చేసి డ్రైడేగా పాటించాలి. ఆరోగ్య కార్యకర్తలు, వైద్యుల సూచనలు, సలహాలు పాటించాలి. అన్ని శాఖలతో సమన్వయం దోమల నియంత్రణకు ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ వైద్యశాఖ పనిచేయాలి. పంచాయతీరాజ్, మున్సిపల్, గ్రామీణాభివృద్ధి శాఖ, విద్యాశాఖ, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో పని చేయాలి. పారిశుధ్యం మెరుగుపడితే దోమల ఉత్పత్తి కేంద్రాలు తగ్గుతాయి. ప్రాణాంతక వ్యాధులకు వాహకాలు దోమలతో డెంగీ, ఫైలేరియా, మలేరియా, చికున్గున్యా లాంటి జబ్బులు అప్రమత్తతే శ్రీరామరక్ష నేడు ప్రపంచ దోమల దినోత్సవం -
సోమిరెడ్డీ ఎన్నికల హామీని మరిచిపోయావా?
● కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరించాలి ● సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్కుమార్నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘ఎన్నికల సమయంలో సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఇచ్చిన హామీని మరిచిపోయినట్టున్నారు. హామీ మేరకు వెంటనే కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్ టెర్మినల్ను పునరుద్ధరించి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలి’ అని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నెల్లూరు జేమ్స్ గార్డెన్లో ఉన్న సీఐటీయూ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కృష్ణపట్నం పోర్టు బొగ్గు, బూడిద, ఐరన్ఓర్తో డర్టీ పోర్టుగా మారిందని అసెంబ్లీలో సోమిరెడ్డి అన్నారన్నారు. అయితే ప్రజలకు కావాల్సింది ఇది కాదన్నారు. కూటమి అధికారంలోకి వస్తే వెంటనే టెర్మినల్ను తెరిపిస్తానని చెప్పి ఇప్పుడు డర్టీ పోర్టుగా మారిందని చెప్పడం సరికాదన్నారు. 4 వేల మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకులు రెహనాబేగం, గోపాల్, గడ్డం అంకయ్య పాల్గొన్నారు. -
వైద్యాధికారిపై ఆరోపణలు అవాస్తవం
బుచ్చిరెడ్డిపాళెం: జొన్నవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ అహ్మద్బాబుపై సీహెచ్ఓ శివప్రియ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని వైద్య సిబ్బంది తెలిపారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఇతర సిబ్బంది పీహెచ్సీలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. అహ్మద్బాబు సిబ్బందితో అమర్యాదగా ప్రవర్తించలేదన్నారు. శివప్రియ కొంతకాలంగా విధులకు సక్రమంగా హాజరుకాకపోవడంతోపాటు తోటి సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో దురుసుగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు. విధుల విషయంలో వైద్యాధికారి ప్రశ్నించడం సాధారణ పరిపాలనా చర్యల్లో భాగమేనని తెలిపారు. వైద్యాధికారిపై ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను గుర్తించాలని కోరారు. -
డాక్టర్లు సకాలంలో రావడం లేదు
దురదృష్టవశాత్తు నా భర్త పాయిజన్ తీసుకున్నాడు. దీంతో మంగళవారం మధ్యాహ్నం జీజీహెచ్కు తీసుకొచ్చి ఐసీయూలో చేర్చాం. ఇంజెక్షన్లు వేశారు. సైలెన్లు పెట్టారు. ఇవన్నీ నర్సులే చేస్తున్నారు. బుధవారం ఉదయం 11 గంటల వరకు కూడా డాక్టర్ రాలేదు. ఎమర్జెన్సీ కేసుకు సంబందించి డాక్టర్ వచ్చి చూడకపోతే ఎలా? – అఖిల, గుమ్మళ్లదిబ్బనర్సులే వైద్యం చేస్తున్నారు నాకు గుండె సమస్య ఉందని డాక్టర్లు తెలిపారు. ఇంతకుముందు పెద్ద డాక్టర్లతోపాటు చిన్న డాక్టర్లు ఎక్కువగా వచ్చే వారు. ఇప్పుడు నర్సులే వచ్చి వైద్యసేవలందిస్తున్నారు. దీంతో ఇబ్బందిగా ఉంది. – హజరత్తయ్య, వృద్ధుడు, ఐసీయూ రోగి -
ఉద్యోగాల పేరుతో వల.. చిక్కితే విలవిల
ఇటీవల జరిగినవి● మోసపోతున్న నిరుద్యోగులు ● పెరుగుతున్న ఫిర్యాదులు ● అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు నెల్లూరు(క్రైమ్): ఉద్యోగాల కోసం ప్రయత్ని స్తున్న నిరుద్యోగులు, ఉన్నత విద్యావంతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. దేశ, విదేశాల్లో మంచి ఉద్యోగాలు, భారీ వేతన ప్యాకేజీలు ఇప్పిస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో కొలువులు ఇప్పిస్తామని నమ్మబలుకుతూ మోసగాళ్లు నిరుద్యోగులు, వారి తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల నగదు వసూలు చేస్తున్నారు. డబ్బు చేతికందిన తర్వాత కొందరు పరారవుతుండగా, మరికొందరు తమ పలుకుబడితో బాధితులను బెదిరిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఆకర్షణీయ ప్రకటనలతో వల జిల్లా వ్యాప్తంగా పోలీస్స్టేషన్లలో నమోదవుతున్న ఫిర్యాదుల్లో ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలకు సంబంధించినవి అధికంగా ఉంటున్నాయి. అలాగే ప్రతి సోమవారం పోలీసు కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలోనూ ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయి. ఉద్యోగాన్వేషణలో ఉన్న యువత సోషల్ మీడియాలో కనిపించే ఆకర్షణీయమైన ఉద్యోగ ప్రకటనలను నమ్మి మోసపోతున్నారు. సాఫ్ట్వేర్ సంస్థల్లో రూ.లక్షల వేతన ప్యాకేజీలతో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే నకిలీ కన్సల్టెన్సీలు నిరుద్యోగులను ఆకర్షిస్తున్నాయి. ఉద్యోగం వస్తుందన్న ఆశతో నిజానిజాలు తెలుసుకోకుండానే పలువురు రూ.లక్షలు చెల్లిస్తున్నారు. ఆ తర్వాత మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అవగాహన అవసరం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు నిర్దిష్ట విధానంలో జరుగుతాయి. ఉద్యోగ ప్రకటన జారీ చేసిన అనంతరం రాతపరీక్ష, ఇతర ఎంపిక ప్రక్రియల ద్వారా ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏ ఉద్యోగానికీ డబ్బులు తీసుకుని నియామకం చేపట్టరు. ఈ విషయంపై అవగాహన లేకపోవడం వల్లే పలువురు మోసగాళ్ల బారిన పడుతున్నారు. ముందుగా నిర్ధారించుకోవాలి ఉద్యోగార్థులు దళారులను నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఉద్యోగ ప్రకటనలు ఇచ్చే వెబ్సైట్ల విశ్వసనీయతను ముందుగా పరిశీలించాలని చెబుతున్నారు. ప్రకటనలో ఉన్న మొబైల్ నంబర్లను మాత్రమే సంప్రదించకుండా.. సంబంధిత సంస్థ ప్రధాన కార్యాలయం లేదా శాఖ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించి ఉద్యోగ అవకాశం నిజమైనదో కాదో నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు. సంస్థలో పనిచేసే ఉద్యోగులతో మాట్లాడి వివరాలు తెలుసుకోవాలని పేర్కొంటున్నారు. కొలువులు ఇప్పిస్తామని నగదు డిమాండ్ చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.రూ.6.50 లక్షలు తీసుకుని ఫేక్ లెటర్ చిన్నబజారు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఉద్యోగాన్వేషణలో ఉండగా నవీన్కుమార్, అతని స్నేహితుడు పరిచయమయ్యారు. బెంగళూరులోని ఐటీ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.6.50 లక్షల నగదు తీసుకున్నారు. అనంతరం ఫేక్ లెటర్ పంపి మోసగించారు. దీంతో బాధితుడు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశాడు. రూ.12 లక్షలు తీసుకుని బెదిరింపులు నవాబుపేట ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి ఉద్యోగం ఇప్పిస్తానని ప్రసాద్ అనే వ్యక్తి రూ.12 లక్షలు తీసుకుని మోసగించాడు. ఉద్యోగం ఇప్పించకపోగా, నగదు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరిస్తున్నాడని బాధితుడు పోలీసు ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లాడు. రూ.15.62 లక్షల వసూలు పొదలకూరు ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి ఉద్యోగం ఇప్పిస్తానని చిత్తూరుకు చెందిన వినయ్కుమార్ రూ.15.62 లక్షలు తీసుకుని మోసగించాడు. తనకు జరిగిన మోసంపై యువకుడు పీజీఆర్ఎస్లో అర్జీ ఇచ్చాడు. -
హెల్మెట్ లేకుంటే ప్రవేశం లేదు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరురూరల్: నగరంలోకి ప్రవేశించే మార్గాల్లో హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులను అనుమతించకుండా కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పోలీసు అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఎస్పీ అజిత వేజెండ్ల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ప్రమాదాలు తరచూ జరిగే ప్రాంతాలను గుర్తించి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు రేడియం పెయింటింగ్ వేయాలని సూచించారు. హైవేలపై రాంగ్ రూట్లో ప్రయాణించే వాహనాలను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, ఆ వివరాలను పోలీసులకు అందించాలని ఎన్హెచ్ అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాద క్షతగాత్రులను గోల్డెన్ అవర్లో ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించేందుకు సహకరించిన వారికి అందించే గుడ్ సమారిటన్ ప్రోత్సాహకాన్ని రూ.5 వేల నుంచి రూ.25 వేలకు పెంచినట్లు తెలిపారు. ఆస్పత్రిలో చేరిన క్షతగాత్రుల వివరాలను నమోదు చేసి, పోలీసుల సహకారంతో రూ.1.50 లక్షల వరకు ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తుందని తెలిపారు. ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆక్రమణలు తొలగించాలి నగరంలోని మద్రాసు బస్టాండ్, ఆర్టీసీ, ఆత్మకూరు బస్టాండ్, స్టోన్హౌస్పేట వంటి ప్రధాన కూడళ్ల వద్ద రోడ్డు మార్జిన్లలో ఆక్రమణలు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కార్పొరేషన్, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా పనిచేయాలన్నారు. ప్రైవేట్ బస్సుల పార్కింగ్ కోసం సర్వోదయ కళాశాల గ్రౌండ్, కేవీఆర్ పెట్రోల్ బంక్ సమీపంలోని దేవదాయ శాఖకు చెందిన ఖాళీ స్థలాలను పరిశీలించి, ట్రాఫిక్కు ఇబ్బందుల్లేకుండా నిలుపుకోవాలని సూచించారు. కావలి సమీపంలోని ట్రక్ రెస్ట్ ఏరియా సమాచారాన్ని తెలియజేసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తొలుత డిప్యూటీ ట్రాన్స్పోర్టు కమిషనర్ చందర్ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టిన చర్యలను వివరించారు. ఏఎస్పీలు దీక్ష, సౌజన్య, డీఆర్వో విజయ్కుమార్, కమిషనర్ నందన్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ శాఖల్లో అక్రమాలు
చేవ కోల్పోయిన విజిలెన్స్, ఏసీబీ శాఖలు జిల్లాలో పాలన గాడి తప్పింది. తమ అధీనంలోని శాఖలపై ఉన్నతాధికార యంత్రాంగం పట్టుకోల్పోయింది. చక్కదిద్దాల్సిన సర్వాధికారాలు కలిగిన పరిపాలన సర్వోన్నతాధికారి చేతులెత్తేశారు. ప్రత్యేక డైవర్షన్ కార్యక్రమాలతో ప్రజా విశ్వసనీయతను కోల్పోతున్నారు. ప్రతి శాఖలో అవినీతి జడలు విప్పి.. బుసలు కొడుతున్నా.. కట్టడి చేయలేని దైన్య పరిస్థితిలో మిగిలిపోతున్నారు. జిల్లాలో అత్యధికంగా రెవెన్యూ పరమైన వివాదాలు, సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా.. పరిష్కరించే అధికారాలు తన చేతిలో ఉన్నా.. ఏమీ చేయలేని అసహాయ స్థితిలో ఉన్నారనే విమర్శలను మూటగట్టుకుంటున్నారు. సహజ వనరుల దోపిడీ నుంచి ప్రభుత్వ శాఖల్లో ఫైళ్ల కదలిక వరకు.. ప్రతిదానికి ‘రేటు’ నిర్ణయిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సాక్షిప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో పరిపాలన అధికార వ్యవస్థల నుంచి రాజకీయ వ్యవస్థల చేతుల్లోకి వెళ్లిపోయింది. స్థానిక ఎమ్మెల్యేల కనుసన్నల్లో పనిచేస్తుండడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిన్నారు. పాలనపై కలెక్టర్ సైతం పట్టు సాధించలేకపోవడంతో పారదర్శకత లోపించింది. గ్రామ రెవెన్యూ అధికారి నుంచి డీఆర్వో వరకు.. పంచాయతీ సెక్రటరీ నుంచి జెడ్పీ సీఈఓ వరకు.. గ్రామ వ్యవసాయశాఖాధికారి నుంచి జిల్లా వ్యవసాయశాఖాధికారి వరకు.. సివిల్ సప్లయీస్ డీటీ నుంచి డీఎస్ఓ వరకు.. పీహెచ్సీ డాక్టర్ నుంచి డీఎంహెచ్ఓ వరకు.. ఇక ఇంజినీరింగ్ శాఖల్లో ఇరిగేషన్, హౌసింగ్, పీఆర్, ఆర్అండ్బీల ఏఈల నుంచి ఎస్ఈల వరకు.. డీఆర్డీఏ, డ్వామా తదితర శాఖల్లో కింది స్థాయి ఉద్యోగులపై పైస్థాయి అధికారులకు పట్టుకోల్పోయారు. పోలీస్, ఎకై ్సజ్, విజిలెన్స్, ఏసీబీ, నిఘా వ్యవస్థలన్నీ అధికార పార్టీ నేతల గుప్పెట్లో ఉండి తోలుబొమ్మల్లా ఆడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా పాలన పడకేస్తే.. అవినీతి వేళ్లూనుకుపోయింది. ప్రభుత్వ శాఖలపై పాలనా యంత్రాంగం పర్యవేక్షణ కొరవడడంతో కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాలనను గాడిలో పెట్టాల్సిన సర్వోన్నత అధికారి సైతం సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక డైవర్షన్ కార్యక్రమాలు, ఆర్భాటపు పర్యటనలతో ప్రజలకు చేరువ కావాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో మాత్రం పాలనపై నమ్మకం సన్నగిల్లుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవినీతి, అశ్రితపక్ష పాలనతో జనం విలవిల జిల్లాలో జడలు విప్పి బుసలు కొడుతున్న అవినీతి, రాజకీయ పక్షపాతంతో సాగుతున్న అశ్రిత పక్ష పాలనతో జిల్లా ప్రజలు విలవిలలాడుతున్నారు. అధికార పార్టీని అడ్డం పెట్టుకుని దోచుకునే రెండు శాతం వారు తప్ప.. మిగతా 98 శాతం ప్రజలు ఈ దుష్టపాలనతో విసిగివేశారిపోతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దాదాపు 32 పథకాల ద్వారా ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందించడంతో ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. సహజవనరుల దోపిడీ నియోజకవర్గాల్లో సహజ వనరులు దోపిడీ చేస్తున్నా ఉన్నతాధికారులు కళ్లప్పగించి చూస్తున్నారే తప్పా.. అడ్డుకట్టకు చర్యలు చేపట్టడం లేదు. ఉన్నతాధికారులే మౌనం దాల్చడంతో కింది స్థాయి అధికారులు, ఉద్యోగులు ఇష్టారాజ్యంగా మసలుకుంటున్నారు. ఉచిత ఇసుక పేరుతో జిల్లాలో రెండేళ్లుగా దోపిడీ చేస్తున్నారు. పెన్నానదిలో అక్టోబర్ 15 వరకు ఇసుక తవ్వకాలు చేయొద్దని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఉన్నాయి. ఈ రెండేళ్లుగా నదిలో ఇసుక తవ్వకాలకు పర్యావరణ శాఖ అనుమతి లేకుండానే విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా చేపట్టినా.. అధికార యంత్రాంగం కళ్లప్పగించి చూస్తున్నాయి. జిల్లాలో పగలు, రాత్రి తేడా లేకుండా పడమటి కంభంపాడు,. ముదివర్తి, మినగల్లు, పెరుమాళ్లపాడు నెల్లూరు నగరంలో అన్ని రీచ్ల్లో యంత్రాలు పెట్టి ఇసుకను అక్రమంగా రవాణా సాగిస్తున్నారు. ఈ విషయం జిల్లా అధికార యంత్రాంగానికి అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎవరూ ఆపే సాహసం చేయరు. రేషన్ దందాకు సహకారం జిల్లాలో ప్రతి నియోజక వర్గంలో స్థానిక షాడో ఎమ్మెల్యేల కనుసన్నల్లో రేషన్ దందా నడిపిస్తున్నారు. నెల్లూరుకు చెందిన ఓ రేషన్ మాఫియా నేత ఆధ్వర్యంలో నియోజకవర్గం ఒక్కొక్కరికి పంచేశారు. ప్రతి నెలా రూ.లక్షల్లో లోకల్ షాడో లకు కప్పం కడుతూ రేషన్ బియ్యం నెల్లూరుకు తరలించి .. మిల్లులో పాలిష్ చేసి తిరిగి మార్కెట్లోకి పంపుతున్నారు. వ్యవస్థలపై పట్టుకోల్పోయిన అధికారులు ప్రతి శాఖలో జడలు విప్పుతున్న అవినీతి ఊరూరా అధికార పార్టీ నేతల భూ ఆక్రమణలు పేదలకు అందని రేషన్ బియ్యం ఉచిత ఇసుక పేరుతో విచ్చలవిడిగా అక్రమ రవాణా ఇరిగేషన్ శాఖలో టెండర్లు ఓపెన్ చేయకుండానే పనులు పూర్తి రీ సర్వే పేరుతో కొత్తగా భూ వివాదాల సృష్టి ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పారని అడ్డగోలు విజిలెన్స్ విచారణలు ఇరిగేషన్ శాఖలో అవినీతి.. ఇరిగేషన్ శాఖలో అధికారులు బరితెగించారు. లోకల్ ఎమ్మెల్యేలు చెప్పిందే వేదంగా భావించి నిధులు స్వాహా పర్వానికి గ్రీన్సిగ్నల్ ఇచ్చేశారు. సర్వేపల్లిలో కాలువల పూడిక తీత పనులు కోసం టెండర్ల దశలో ఉండగానే పనులు తూతూ మంత్రంగా కానిచ్చేసి బిల్లులు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సర్వేపల్లి, కోవూరులో , ఉదయగిరి, ఆత్మకూరు , నెల్లూరు రూరల్ అన్ని నియోజకవర్గాల్లో అధికారులు బరితెగించి అక్రమాలు ప్రోత్సహిస్తున్నారని తెలిసినా కూడా ఉన్నతాఽధికారులు మౌనం దాల్చారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి పొంగి పొర్లుతుంది. ఇటీవల సమగ్రశిక్ష అభియాన్లో చిరుద్యోగులు, అధికారులతో కుమ్మకై ్క రూ.20 కోట్ల స్వాహా పర్వానికి తెరలేపిన సంగతి వెలుగులోకి వచ్చింది. ఉపాధి హామీ పథకంలో పనులు చేయకుండానే బిల్లులు డ్రా చేయడం, టీడీపీ నేతలే కూలీలుగా మారి నగదు డ్రా చేయడం వెలుగులోకి వచ్చింది. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సర్’ ప్రక్రియలో అధికారులు, బీఎల్ఓలు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నా, పక్కాగా ఆధారాలు బయటపడినా కనీస చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. భూ సర్వే వివాదాలు.. చుక్కల సమస్యలు జిల్లాలో ఈ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన భూముల రీసర్వేతో భూ వివాదాలు పెరిగాయి. రెవెన్యూ రికార్డుల్లో చుక్కల సమస్య పరిష్కారానికి గత ప్రభుత్వం చర్యలు తీసుకుంటే.. కూటమి ప్రభుత్వం వచ్చి యథాస్థితికి తెచ్చిపెట్టింది. ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీల్లో 70– 80 శాతం భూ సర్వే వివాదాలు.. చుక్కల సమస్యలపైనే ఉంటున్నాయి. ఇక జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతల భూ ఆక్రమణలు పెరిగినా.. కనీస చర్యలు తీసుకునే సాహసం రెవెన్యూ యంత్రాంగం చేపట్టలేకపోతోంది. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాదారుల కబంధహస్తాల్లోకి వెళ్తున్నాయి. జిల్లాలో పాలనా వ్యవస్థలో గాడి తప్పిన ప్రభుత్వ వ్యవస్థలను దారిలో పెట్టాల్సిన విజిలెన్స్, ఏసీబీ శాఖలు చేవ కోల్పోయాయి. అధికార పార్టీ నేతల గుప్పెట్లో తోలుబొమ్మల్లా ఆడుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. గత ప్రభుత్వంలో పారదర్శకంగా జరిగిన పనులపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక ఎమ్మెల్యేలు ఆరోపణలు చేస్తూ విజిలెన్స్ విచారణకు సిఫార్సుకు చేశారు. దాదాపు 90కిపైగా విచారణలు విజిలెన్స్ ముందుకు వచ్చా యి. వీటిల్లో కొన్నింటి విషయాల్లో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. వెంకటాచలంలోని జగనన్న లేఅవుట్ విషయంలో విజిలెన్స్ అధికారులు ‘దున్నపోతు ఈనిందనే’ చందంగా వ్యవహరిస్తున్నారు. పలు విషయాల్లో వైఎస్సార్సీపీ మాజీప్రజాప్రతినిధులపై తప్పుడు కేసులు కట్టి.. వేధింపులకు దిగడం తప్పించి.. వాటిల్లో తప్పులను బట్టబయలు చేయలేకపోవడం గమనార్హం. -
ఒక్క సెంటు భూమీ అన్యాక్రాంతం చేయలేదు
పొదలకూరు : ‘ఆంజనేయస్వామి సన్నిధిలో నిలబడి స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నా.. మా ప్రభుత్వంలో, నేను శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన హయాంలో ఒక్క సెంటు భూమి కూడా అన్యాక్రాంతం చేయలేదు. మా నాయకులు, కార్యకర్తలు నొచ్చుకున్నా అధికారులను నిబంధనల ప్రకారమే చేయమని చెప్పానే తప్పా.. అడ్డుగోలుగా భూమలు ఆక్రమించుకోమని ఎక్కడా చెప్పలేదు. సోమిరెడ్డీ నువ్వు నిజాయతీ పరుడవైతే.. నీ హయాంలో భూముల ఆక్రమాలకు, అవినీతి, ప్రకృతి సంపద దోపిడీకి పాల్పడలేదని ప్రమాణం చేస్తావా?’ అంటూ మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి సవాల్ విసిరారు. దైవసన్నిధిలో సోమిరెడ్డి రాజకీయాలు మాట్లాడాడు కాబట్టే నేను వాస్తవాలు వెల్లడిస్తున్నానని చెప్పారు. పొదలకూరులోని శ్రీవీర అభయాంజనేయస్వామి ఉత్సవాల్లో భాగంగా గిరిజనులు మంగళవారం నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కాకాణి పాల్గొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ గిరిజనులు పేదరికంలో ఉన్నా ఉభయదాతలు వ్యవహరించి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటీవల సోమిరెడ్డి ఆంజనేయస్వామి ఉత్సవాలకు హాజరైతే.. జనాలు రాలేదనే కడుపు మంటతో తనపై నిరాధార ఆరోపణలు చేశాడని, ఆ ఆరోపణల్లోని వాస్తవాలను వెల్లడించేందుకే మరోసారి వచ్చానన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో లేఅవుట్ల యజమానుల వద్ద డబ్బలు దండుకోలేదని ప్రాచీనమైన, ప్రసిద్ధ ఆంజనేయస్వామి సన్నిధిలో ప్రమాణం చేసే దమ్ము, ధైర్యం సోమిరెడ్డికి ఉందా? ప్రశ్నించారు. గతంలో దేవసన్నిధిలో సోమిరెడ్డి రాజకీయాలు, వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజంగా ఉంటాయని గతంలో ఉత్సవాలకు తాను వచ్చిన సమయంలో హాజరైన జనాల్లో అదే రోజున వచ్చిన సోమిరెడ్డికు పది శాతం కూడా హాజరు కాకపోవడం వల్లనే ఆరోపణలు చేశాడని కాకాణి పేర్కొన్నారు. భూముల వ్యవహారంలో ప్రమాణం చేయగలవా? అంకయ్యగౌడ్ మనవడు ఇంద్రసేనగౌడ్ భూముల వ్యవహారంలో తనకు సంబంధం ఉందని సోమిరెడ్డి ప్రమాణం చేయాలని కాకాణి సవాల్ విసిరారు. వారు టీడీపీలో ఉన్న సమయంలో అదే తోటల్లో ఇచ్చిన విందులకు హాజరైన సోమిరెడ్డి అప్పుడు భూములు అక్రమని చెప్పలేదన్నారు. వారికి అండగా ఉంటానని కూడా అప్పట్లో మాట్లాడినట్టు గుర్తుచేశారు. వారు వైఎస్సార్సీపీలో కొనసాగుతున్నందున నిత్యం ఇంద్రసేనగౌడ్ అతని తండ్రి దశరథరామయ్యగౌడ్పై బురద జల్లుతూ వారి భూములకు సంబంధించి తనపై నిందనలు వేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నట్టు విమర్శించారు. తాను అధికారంలో ఉన్న సమయంలో సెంటు భూమి కూడా నిబంధనలకు విరుద్ధంగా ఎవరికీ కట్టబెట్టలేదన్నారు. సర్వేపల్లిని అభివృద్ధి వైపు నడిపించానని రూ.కోట్లు వెచ్చించి గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్లు, ఆర్అండ్బీ రోడ్లు వేయించినట్టు తెలి పారు. అభివృద్ధిపై బహిరంగ చర్చకు రమ్మంటే పారిపోతున్నాడని, సోమిరెడ్డి హయాంలో జరిగిన అవినీతి పై తాను ఆధారాలతో సహా నిరూపిస్తానన్నారు. కాకాణి వెంట పెదమల్లు రమణారెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, బచ్చల సురేష్కుమార్రెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, రావుల ఇంద్రసేనగౌడ్, వేణుగోపాల్రెడ్డి, ఎస్కే అంజాద్, డీ.విజయభాస్కర్రెడ్డి, ఆదూరు వెంకటసుబ్బయ్య, ఆకులూరు హేమంత్, దామిశెట్టి శ్రీనివాసులు, గురవయ్య తదితరులు ఉన్నారు. ఆంజనేయ స్వామి సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నా.. సోమిరెడ్డీ.. నువ్వు నిజాయతీ పరుడవైతే ప్రమాణం చేస్తావా? సర్వేపల్లిని అభివృద్ధి వైపు నడపించింది నేనే ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధంగా ఉన్నా మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి సవాల్ -
సర్కారు దిగొచ్చే వరకు సమ్మె ఆపబోము
● నగరంలో జూనియర్ డాక్టర్ల బైక్ ర్యాలీ నెల్లూరు (అర్బన్): తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేందుకు సర్కారు దిగి వచ్చే వరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హనీష్కుమార్ తెలిపారు. తమకు స్టయిపండ్ పెంచాలని, డాక్టర్ల రిటైర్మెంట్ వయస్సు 62కు మించరాదని, ఎంబీబీఎస్, పీజీ చేసిన డాక్టర్లతోనే బోధించాలనే డిమాండ్లతో నెల్లూరు సర్వజన ఆస్పత్రిలో వైద్య సేవలు బంద్ చేసి జూనియర్ డాక్టర్లు వారం రోజులుగా ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో సోమవారం నుంచి ఎమర్జెన్సీ వైద్యసేవలు ఆపేసి సమ్మెలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా మంగళవారం జూనియర్ డాక్టర్లు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. దర్గామిట్టలోని ప్రభుత్వాస్పత్రి నుంచి వీఆర్సీ గ్రౌండ్ వరకు జరిగింది. ర్యాలీలో డాక్టర్లు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వైఖరిని ఖండించారు. డాక్టర్ హనీష్కుమార్ మాట్లాడుతూ తామేమి గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు. రేయింబవళ్లు కష్టపడుతున్నామన్నారు. రోగులకు సేవలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ జీఓ ప్రకారం స్టయిపండ్ పెంచమని కోరుతున్నామన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని తమ డిమాండ్లపై చర్చించి న్యాయం చేయాలన్నారు. లేదంటే సమ్మె కొనసాగుతుందని ప్రకటించారు. రోగులపై సమ్మె ప్రభావం జూనియర్ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాగే కొనసాగితే రోగుల ఆరోగ్యానికి రక్షణ ఉండదంటున్నారు. ఇదిలా ఉండగా డ్యూటీలకు హాజరు కావాలంటూ డీఎంఈ అధికారులు పీజీలకు, ఎస్ఆర్ (సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు)లకు నోటీసులు జారీ చేశారు. దీంతో జూనియర్ డాక్టర్లు వారిని విధులకు హాజరు కావొద్దని, ఐక్యంగా పోరాడితేనే న్యాయం జరుగుతుందని వి న్నవించడంతో పలువురు ఎస్ఆర్లు, పీజీలు కూడా డ్యూటీలకు హాజరు కాకుండా సమ్మెలో పాల్గొంటున్నారు. -
లీజుదారులపై పాలకమండలి సీరియస్
గూడూరు: గూడూరు పట్టణ నడిబొడ్డులో ఉన్న ధర్మరాజుల స్వామి దేవస్థానానికి సంబంధించిన దుకాణాల లీజుదారులపై పాలకమండలి మంగళవారం సీరియస్ అయ్యింది. ఆలయంలో ఈఓ రవికృష్ణ, పాలకమండలి సభ్యులు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయానికి చెందిన దుకాణాల ద్వారా వేలాదిగా ఆదాయం పొందుతున్నా కనీసం దేవుడికి నైవేద్యాలు కూడా సమర్పించాలనే ఆలోచన చేయని కఠినాత్ములుగా లీజుదారులు ఉన్నారని దుయ్యబట్టారు. దేవుడంటే లీజుదారులకు లెక్కలేదా, పాలకమండలి అంటే లెక్క లేదా అని ప్రశ్నించారు. ఇకపై దేవస్థానానికి చెందిన ప్రతి దుకాణంపై ఉన్న నేమ్ బోర్డులో లోగో కచ్చితంగా ఉండాలని, ఆయా దుకాణాలలో పవిత్రమైన ఆహారం మాత్రమే విక్రయించాలని, అలాగే ఒక దుకాణాన్ని లీజుకు తీసుకుని, రెండు భాగాలుగా చేసి అద్దెకు ఇవ్వడం కుదరదన్నారు. అలాగే లీజులు పొందిన వారు మరొకరికి సబ్ లీజులు ఇవ్వడం నిషిద్ధమన్నారు. ఇకపై దుకాణదారులు పాలకమండలికి సహకారం అందించాలని స్పష్టం చేశారు. సమావేశంలో పాలకమండలి చైర్మన్ వాటంబేటి శివకుమార్, సభ్యులు పాల్గొన్నారు. -
వైభవంగా వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాలు
వెంకటాచలం: జిల్లాలో ప్రసిద్ధి చెందిన భగవాన్ శ్రీవెంకయ్యస్వామి 44వ ఆరాధన మహోత్సవాలు మండలం గొలగమూడిలో మంగళవారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున గోపూజ, గణపతి పూజ, స్వస్తి వాచనం, అంకురార్పణ, దీక్ష వస్త్రధారణ, కంకణధారణ, కలశస్థాపన, శిఖర సంప్రోక్షణలు జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు సర్వభూపాల వాహనసేవ గావించారు. తొలుత వెంకయ్యస్వామిని వాహనంపై ఆశీనులు చేసి ప్రత్యేక పూలాలంకరణ చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో గ్రామంలోని అన్నివీధుల్లో ఉత్సవం నిర్వహించారు. గ్రామోత్సవం వెంట భక్తులు పాల్గొని ఓం నారాయణ.. ఆది నారాయణ అంటూ భజనలు చేశారు. చిన్నారులు, మహిళలు కోలాట ప్రదర్శన చేపట్టారు. గ్రామోత్సవంలో మహిళలు కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని దర్శించుకున్నారు. రాత్రి నిర్వహించిన కల్ప వృక్ష వాహనసేవ కనుల పండువగా సాగింది. గొలగమూడి గ్రామస్తులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఆరాధనోత్సవాల్లో నేడు వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం ఉదయం సూర్యప్రభ వాహనసేవ నిర్వహించనున్నారు. అలాగే రాత్రి 9 గంటలకు చంద్రప్రభ వాహనసేవ నిర్వహిస్తారు. ● వెంకయ్యస్వామి ఆశ్రమాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం సందర్శించారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పలువురు అధికారులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్నారు
సర్వే నంబరు 284లోని ప్రభుత్వ స్థలంలో పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించారు. అక్కడ కనీస వసతులు కల్పించకపోవడంతో గృహ నిర్మాణాలు జరగలేదు. ఇటీవల ఇళ్ల స్థలాల ధరలు పెరగడంతో ప్లాట్లపై కన్నేసిన కొందరు అక్రమార్కులు కబ్జా చేసి అమ్ముకుంటున్నారు. ఎమ్మెల్యే పేరు చెప్పి అనేక మంది అక్రమాలు చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. కలెక్టర్ జోక్యం చేసుకుని ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని పేదలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. – భాస్కర్రెడ్డి, సీఐటీయూ నాయకుడు సర్వే చేయించి నిర్ణయం తీసుకుంటాంభట్టువారిపాళెంలో రోడ్డు లోని సర్వే నంబరు 284లో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలకు సంబంధించి రికార్డులు లేవు. మేము పని ఒత్తిడిలో ఉన్నాం.త్వరలో స ర్వే చేయించి తగిన నిర్ణయం తీసుకుంటాం. ఆ క్రమణలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. – స్వర్ణ, తహసీల్దార్, వింజమూరు -
2.1 కిలోల గంజాయి స్వాధీనం
● ఐదుగురి అరెస్ట్ బద్వేలు అర్బన్: పట్టణంలోని పోరుమామిళ్ల బైపాస్రోడ్డులో ఫ్లైఓవర్ కింద తనిఖీలు నిర్వహించి 2.1 కిలోల గంజాయితో పాటు ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు అర్బన్ సీఐ బి.రామకృష్ణ తెలిపారు. స్థానిక అర్బన్ స్టేషన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలం లక్ష్మక్కపల్లి గ్రామానికి చెందిన దొడ్డేటిపల్లి రమణయ్య వివిధ ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి.. బద్వేలును అడ్డాగా చేసుకుని కిలో రూ.6 వేల చొప్పున ఇతర నిందితులకు విక్రయిస్తుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం పోరుమామిళ్ల బైపాస్రోడ్డులోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఎలక్ట్రానిక్ తూనిక యంత్రం ద్వారా ఒక్కొక్కరికి 250 గ్రాముల చొప్పున తూకం వేసి విక్రయిస్తుండగా దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. రమణయ్యతో పాటు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన షేక్.చిన్నమీరావలీ, ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం మాలేపాడు గ్రామానికి చెందిన వలేరి మల్లికార్జున, బద్వేలు పట్టణం మార్తోమానగర్కు చెందిన వల్లెపు వెంకటసుబ్బయ్య, ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలం పెద్దఇర్లపాడు గ్రామానికి చెందిన నాగులూరి రాజమ్మను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిలో చిన్నమీరావలీ, రాజమ్మపై గతంలో కూడా గంజాయి కేసులు ఉన్నట్లు వివరించారు. సమావేశంలో ఎస్సైలు యూవై జయరాములు, ఎం.రంగారావు, ఏఎస్సై శ్రీనివాసమూర్తి, హెడ్కానిస్టేబుల్ శివయ్య, కానిస్టేబుళ్లు కె.సుబ్బయ్య, ఎం.సుబ్బయ్య, మహిళా కానిస్టేబుల్ కల్యాణి పాల్గొన్నారు. -
విధుల పేరిట వేధింపులు
● వైద్యాధికారిపై సీహెచ్ఓ ఫిర్యాదు ● అదనపు డీఎంహెచ్ఓ విచారణ ● సిబ్బంది వాంగ్మూలాల నమోదు బుచ్చిరెడ్డిపాళెం: జొన్నవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) వైద్యాధికారి డాక్టర్ అహ్మద్బాషా విధుల పేరుతో వేధింపులకు పాల్పడడంపై కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (సీహెచ్ఓ) శివప్రియ చేసిన ఆరోపణలపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. అడిషనల్ డీఎంహెచ్ఓ సునీత జొన్నవాడ పీహెచ్సీని సందర్శించి పలువురు ఉద్యోగుల వాంగ్మూలాలను నమోదు చేసినట్లు తెలిసింది. అధిక పనిభారం.. చిత్రహింసలు, అవమానాలు తనపై ఉద్దేశపూర్వకంగా అధిక పనిభారం మోపుతున్నారని, విధులకు సంబంధంలేని అదనపు పనులను సైతం అప్పగిస్తున్నారని సీహెచ్ఓ శివప్రియ ఆరోపించారు. ఉన్నతాధికారుల స్థాయిలో నిర్వహించాల్సిన డేటా సేకరణ, హెల్త్ యాప్ పర్యవేక్షణ తదితర పనులను కూడా సిబ్బందితో చేయిస్తున్నారన్నారు. సెలవులు కోరిన సమయంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రశ్నిస్తే చిత్రహింసలు, అవమానాలకు గురిచేస్తున్నట్లు ఆమె విచారణాధికారికి ఫిర్యాదు చేశారు. అనారోగ్య సమయంలోనూ ఒత్తిడి తాను గర్భంతో ఉన్న సమయంలో తన పట్ల అవమానకరంగా వ్యవహరించడంతో పాటు అధిక పనిభారం మోపారని శివప్రియ ఆరోపించినట్లు సమాచారం. ఈ విషయాలను ప్రశ్నించినప్పటి నుంచి విజిటింగ్ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనూ సమావేశాలకు హాజరు కావాలని ఒత్తిడి చేశారని, హాజరు కాకపోతే మెమోలు జారీ చేస్తామని హెచ్చరించినట్లు సమాచారం. ఏఎన్ఎంలను రెచ్చగొట్టి సిబ్బంది మధ్య విభేదాలకు కారణమవుతున్నారని, కొందరు అనుకూల సిబ్బంది విధులకు గైర్హాజరైనా పట్టించుకోవడం లేదని, ప్రశ్నిస్తే టెర్మినేషన్ చేస్తామని బెదిరించడం, మెమోలు జారీ చేయడం వంటి చర్యలతో ఇబ్బంది పెడుతున్నట్లు శివప్రియ అధికారులకు వివరించినట్లు తెలిసింది. శివప్రియ ఫిర్యాదులోని అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదికను జిల్లా ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు అదనపు డీఎంహెచ్ఓ సునీత తెలిపినట్లు సమాచారం. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. సోమవారం అర్ధరాత్రి వరకు 79,445 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 36,834 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.80 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేయండి ● డీఎంహెచ్ఓకు డాక్టర్ల వినతి నెల్లూరు(అర్బన్): జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్సీల్లో పనిచేస్తున్న వైద్యులకు సంబంధించిన పెండింగ్ ఫైళ్లను సత్వరమే క్లియర్ చేయాలని ఏపీ ప్రభుత్వ డాక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అమరేంద్రనాథ్రెడ్డి కోరారు. మంగళవారం పలు పీహెచ్సీల డాక్టర్లు డీఎంహెచ్ఓ సుజాతను కలిసి వినతిపత్రం ఇచ్చి మాట్లాడారు. డాక్టర్ల ఇంక్రిమెంట్లు, చైల్డ్కేర్ లీవులు, మెడికల్ సెలవులు, ఆర్జిత సెలవులు, రెగ్యులైజేషన్ ఫైళ్లు పెండింగ్లో ఉంచారన్నారు. సంబంధిత ఈ–1 క్లర్క్ విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడం, మూడు నెలలుగా అందుబాటులో లేకపోవడంతో ఇబ్బంది తలెత్తిందన్నారు. ఇప్పటికై నా పరిస్థితి చక్కదిద్దకపోతే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏడుకొండలు, డాక్టర విజయ, డాక్టర్ శ్రావణి, డాక్టర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అగ్రి ఎక్స్పో, కిసాన్ మేళా నేడు నెల్లూరు(వేదాయపాళెం): రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేసేందుకు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో బుధవారం ఉదయం 9 గంటలకు అగ్రి ఎక్స్పో, కిసాన్మేళా–2026 ప్రారంభించనున్నట్లు డీఏఓ పి.సత్యవాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్తలతో రైతులకు ముఖాముఖి నిర్వహిస్తామన్నారు. ఎల్నినో ప్రభావం, వాతావరణ మార్పుల కనుగుణంగా పంటల నిర్వహణ, పంటల ఆరోగ్య సంరక్షణ, చీడ పీడలు, తెగుళ్ల నివారణ, సమగ్ర పంట ఆరోగ్య నిర్వహణ, ఆధునిక సాగు విధానం తదితర అంశాలపై వ్యవసాయ, అనుబంధ రంగాల్లో నిష్ణాతు లు, నిపుణుల సూచనలు, సలహాలు పొందవచ్చన్నారు. ఆధునిక వ్యవసాయానికి అవసరమైన యంత్ర పరికరాలు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, సాంకేతిక ఉత్పత్తులు ప్రదర్శనలో ఉంటాయని తెలిపారు. -
విద్యుత్ విజిలెన్స్ అధికారుల దాడులు
● ఆరు కేసుల నమోదు ● రూ.5 లక్షల జరిమానా నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలో విద్యుత్ చౌర్యాన్ని అరికట్టేందుకు సోమవారం అర్ధరాత్రి నుంచి విద్యుత్ విజిలెన్స్ విభాగపు తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన అధికారులు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. కావలి రూరల్, బోగోలు, చిల్లకూరు, వాకాడు ప్రాంతాల్లో అక్రమంగా విద్యుత్ వాడుతున్న వారిని గుర్తించి ఆరు కేసులు నమోదు చేసి, రూ.5 లక్షల జరిమానా విధించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యుత్ విజిలెన్స్ విభాగపు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సుధాకర్ మాట్లాడుతూ విద్యుత్ చౌర్యం కారణంగా ఆర్థిక నష్టం జరుగుతోందని, దీనివల్ల సాధారణ వినియోగదారులపై అదనపు భారం పడుతోందన్నారు. విద్యుత్ చౌర్యం నేరమని, ఇలాంటి పనులకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
కన్నేశారు.. దున్నేశారు
●వింజమూరు(ఉదయగిరి): ప్రభుత్వ జాగా కనిపిస్తే చాలు అక్రమార్కులు గద్దల్లా వాలిపోతున్నారు. దర్జాగా కబ్జా చేసి తమ అధీనంలోకి తెచ్చుకుంటున్నా రు. ఆ తరువాత ప్లాట్లుగా మార్చి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ధోరణి పతాక స్థాయికి చేరింది. వింజమూరు పట్టణంలో ఇళ్ల స్థలాలకు గిరాకీ పెరగడంతో విలువైన ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతున్నాయి. అక్రమార్కులపై చర్యలు తీసుకుని వాటిని కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు మౌనవ్రతం పాటిస్తున్నారు. దీంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతూ ప్రభుత్వ స్థలాలను మింగేస్తున్నారు. రాత్రికి రాత్రే చదును తాజాగా వింజమూరు పట్టణ పరిధిలోని భట్టువారిపాళెం రోడ్డు మార్గంలో ఇంజినీరింగ్ కళాశాల పక్కన సర్వేనంబరు 284లోని సుమారు ఎకరా ప్రభుత్వం స్థలంపై అక్రమార్కులు కన్నేశారు. రాత్రికి రాత్రే ఆక్రమించి యంత్రాలతో చదును చేయించారు. ఆ మరుసటి రోజు చుట్టూ మొక్కలు నాటారు. సుమారు రూ.2 కోట్ల విలువ చేసే స్థలంలో ఆక్రమణలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2011లో లేఅవుట్ ఏర్పాటు వింజమూరులోని సర్వే నంబరు 284లో సుమారు 20 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. అందులో 2001లో అప్పటి రెవెన్యూ అధికారులు పలువురు పేదలకు మూడు సెంట్ల లెక్కన నివేశన స్థలాలు మంజూరు చేశారు. అప్పట్లో ఈ ప్రాంతం పట్టణానికి దూరంగా ఉండడం..కనీస సౌకర్యాలు లేకపోవడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. అధికారులు కూడా లేఅవుట్ వేసి ప్లాట్ల రూపంలో ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో 2011లో రెవెన్యూ అధికారులు సుమారు పది ఎకరాల స్థలంలో ప్రత్యేకంగా లేఅవుట్ నిర్మించి 199 ప్లాట్లు ఏర్పాటు చేశారు. 2001లో పట్టాలు పొందిన వారితో పాటు కొత్తవారికి కూడా ప్లాట్లు కేటాయించారు. అందులో సుమారు మూడెకరాల వరకు ప్రజాప్రయోజనాల కోసం కేటాయించారు. అయితే తాజాగా అధికార పార్టీ నేతల సహకారంతో కొందరు తమకు 1998లో డీఫారం పట్టా ఇచ్చారని చెబుతూ ఎకరా భూమిని ఆక్రమించారు. రూ.2 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా 2011లో పదెకరాల్లో ప్రభుత్వ లేఅవుట్ నిర్మాణం ప్రజావసరాల కోసం మూడెకరాలు కేటాయింపు అందులో ఎకరా భూమి ఆక్రమణకు స్కెచ్ రాత్రికి రాత్రే చదును..మరుసటి రోజే చుట్టూ మొక్కలు నాటిన అక్రమార్కులు చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు రికార్డులు మాయం ఇటీవల వింజమూరు పట్టణ పరిధిలో ఇళ్ల స్థలాలకు గిరాకీ పెరగడంతో ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలు, ప్లాట్లపై అక్రమార్కుల కన్నుపడి ఆక్రమణల పర్వం ప్రారంభమైంది. నిబంధనలకు విరుద్ధంగా క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ప్లాటుగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే 2011లో వేసిన ప్రభుత్వ లేఅవుట్లోని ఒరిజినల్ పట్టాదారుల జాబితా బయటపడకుండా కొందరు అక్రమార్కులు రెవెన్యూ సిబ్బంది సహకారంతో రికార్డులను మాయం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా లేవుట్లోని ప్లాట్లకు ఒరిజినల్, నకిలీ పట్టాదారులను గుర్తించడం అధికారులకు కష్టంగా మారింది. దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది అక్రమార్కులు అమాయకులకు పట్టాలు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు లోతుగా విచారణ జరిపితే అక్రమార్కుల బాగోతం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
చలో కలెక్టరేట్ రణరంగం
● తొమ్మిది మంది ఏఐటీయూసీ నేతల అరెస్ట్ ● ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదంటూ నినాదాలు నెల్లూరురూరల్: కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ నేతలు నెల్లూరులో నిర్వహించిన చలో కలెక్టరేట్ రణరంగాన్ని తలపించింది. నెల్లూరు వీఆర్సీ గ్రౌండ్ నుంచి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను కలెక్టర్కు స్వయంగా వివరించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఏఐటీయూసీ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో కలెక్టరేట్లోకి వెళ్లాలని ప్రయత్నించిన తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేసి వన్టౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అరెస్టయిన వారిలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కొమ్మి నారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి యామాల మధు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి నందిపోగు రమణయ్య, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ షాన్వాజ్, భవన నిర్మాణ కార్మిక సంఘ జిల్లా అధ్యక్షుడు మీరా ముక్తియార్, మహిళా సంఘం నాయకురాలు వనజ తదితరులు ఉన్నారు. అన్నిరంగాల ఉద్యోగులకు నిరాశే ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో 12వ పీఆర్సీ ప్రకటిస్తారని ఆశించిన ఉద్యోగ, కార్మికులకు ప్రభుత్వం నిరాశే మిగిల్చిందని విమర్శించారు. పెండింగ్లో ఉన్న డీఏలు, సరెండర్ లీవ్ ఎన్క్యాష్మెంట్, గ్రాట్యుటీలను విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలనే రాష్ట్రంలోని చంద్రబాబు సర్కార్ కూడా అనుసరిస్తోందని వాపోయారు. 40 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తున్నామని, ఇలాంటి ప్రభుత్వాన్ని, పోలీసులను చూడలేదంటూ నినదించారు. సీఎం డౌన్డౌన్, పోలీసు జులుం నశించాలనే నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీపీఐ నగర సహాయ కార్యదర్శి ఎస్డీ సిరాజ్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు, లీలామోహన్, ఆంజనేయులు, మహీంద్రా, పెంచాలయ్య, శిరీష, మల్లి అంకయ్య, పాముల శ్రీను, మున్నా, సుబ్బారాయుడు తదితరులతో పాటు వివిధ రంగాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
వైద్య విద్యార్థి పరిశోధన ప్రాజెక్ట్కు కేంద్ర ఆమోదం
నెల్లూరు(అర్బన్): నగరంలోని ఏసీఎస్సార్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థి జి.తేజస్ సాయి సమర్పించిన పరిశోధన ప్రాజెక్ట్కు కేంద్ర ఆరోగ్య పరిశోధన శాఖ ఆమోదం తెలిపింది. దీంతో మెడికల్ కళాశాలలో మంగళవారం ఆ వైద్య విద్యార్థిని ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి ప్రత్యేకంగా అభినందించి మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 17,500 పరిశోధనలలో 1650 ప్రాజెక్ట్లు ఎంపిక కాగా అందులో నెల్లూరుకు చెందిన విద్యార్థి తేజస్సాయి సమర్పించిన పరిశోధన కూడా ఉండడం గర్వకారణమన్నారు. దీనికి బయో కెమిస్ట్రీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రశంత్ మార్గదర్శకత్వం వహిస్తున్నారన్నారు. ఈ ఎంపిక కళాశాలలో పరిశోధనా సంస్కృతిని మరింత పెంచేందుకు దోహదం చేస్తుందన్నారు. డీసీసీబీలో ఇంటర్వ్యూలు నెల్లూరు(వీఆర్సీ సెంటర్): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లో బ్యాంకు ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి మంగళవారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద ఉన్న పరిపాలనా కార్యాలయంలో బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి ఆధ్వర్యంలో డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, రెండు మేనేజర్ పోస్టులు, ఐదు అసిస్టెంట్ మేనేజర్ల పోస్టులకు ఇంటర్వ్యూలు చేశారు. ఎంపికై న వారికి త్వరలో నియామక పత్రాలు అందజేస్తామని చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ శ్రీనివాసరావు, ఆఫ్కాబ్ ఏజీఎం రామచంద్రయ్య, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. లారీని తప్పించబోయి కారు బోల్తా ● ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో తప్పిన ప్రాణాపాయం మనుబోలు: నెల్లూరు నుంచి గూడూరు వైపు వస్తున్న కారు మండల పరిధిలోని పొదలకూరు క్రాస్రోడ్డు వద్ద మంగళవారం ప్రమాదానికి గురైంది. రహదారిపై హఠాత్తుగా ఎదురుగా వచ్చిన లారీని తప్పించే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో కారు రోడ్డు డివైడర్ను బలంగా ఢీకొని బోల్తా పడింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కారులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై వివరాలు సేకరించారు. గాయపడిన వ్యక్తి మృతి నెల్లూరు(క్రైమ్): రోడ్డు ప్రమాదంలో గాయాలపాలైన వ్యక్తిని మెరుగైన వైద్యం కోసం చైన్నెకు తరలిస్తుండగా మృతిచెందారు. సౌత్ ట్రాఫిక్ పోలీసుల సమాచారం మేరకు.. మనుబోలు మండలం బద్దెవోలుకు చెందిన సునీల్(42)కు భార్య, పిల్లలున్నారు. నగరంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద సునీల్ సోమవారం ఆటో ఎక్కారు. అయ్యప్పగుడి ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి ప్రమాదవశాత్తు ఆటో నుంచి కిందపడటంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు ఆయన్ను చికిత్స నిమిత్తం అపోలో హాస్పిటల్లో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబసభ్యులు మంగళవారం ఆయన్ను చైన్నెకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. ఈ మేరకు మృతుని తండ్రి గోపాలయ్య సౌత్ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ సీహెచ్ కృష్ణారెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు చిల్లకూరు(గూడూరు): మండలంలోని ముత్యాలపాడు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. ముత్యాలపాడు గ్రామానికి చెందిన నివాస్, హరినాథ్ అనే ఇద్దరు యువకులు బైక్పై గూడూరు నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా గొర్రెల సంత వద్ద ముందు వెళ్తున్న బస్సును అధిగమించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఎదురుగా గూడూరు వైపు వస్తున్న లారీని ఢీకొనడంతో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆటోలో చికిత్స నిమిత్తం గూడూరుకు తరలించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. -
వెంకటాచలం పీఎస్లో ఎస్పీ తనిఖీ
వెంకటాచలం: వెంకటాచలం పోలీస్స్టేషన్ను ఎస్పీ అజిత వేజెండ్ల మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎఫ్ఐఆర్ ఇండెక్స్, మిస్సింగ్ కేసులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, స్టేషన్లో రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులను, పీజీఆర్ఎస్ పిటిషన్స్ నిర్దేశిత గడువులోపు నాణ్యమైన దర్యాప్తు, విచారణతో పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు. ప్రధాన కూడళ్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, బ్లాక్ స్పాట్లలో సీసీటీవీ కవరేజీని విస్తరించాలని సూచించారు. హైవేపై నిరంతర గస్తీ, పెట్రోలింగ్, వాహన తనిఖీలు, ట్రాఫిక్ నియంత్రణ చేపట్టి రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. తనిఖీల్లో నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, సీఐ సురేంద్రబాబు, ఎస్సై అంజనేయులు పాల్గొన్నారు. -
ధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలం
● సీపీఐ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన, కలెక్టరేట్ వద్ద ధర్నా నెల్లూరురూరల్: నిత్యావసర వస్తువులు, వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఐ నాయకులు విమర్శించారు. ఆ పార్టీ నేతలు సోమవారం వీఆర్సీ మైదానం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ధర్నా చేశారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ చేపట్టిన పాదయాత్రల ముగింపు సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, నెల్లూరు జిల్లా ఇన్చార్జి జంగాల అజయ్కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ విధానాలతో పేదలపై ఆర్థిక భారం పెరుగుతుండగా, కార్పొరేట్ శక్తులకు ప్రయోజనాలు కల్పిస్తున్నారని విమర్శించారు. ఇదేనా వికసిత్ భారత్ అని ప్రశ్నించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందేలా ప్రభుత్వ రంగాలను బలోపేతం చేయాలన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, సాగునీరు, రుణాలు అందించాలని కోరారు. మహిళలపై హింసను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, సామాజిక భద్రత కల్పించాలని, దళితులు, ఆదివాసీలు, బలహీనవర్గాల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసి, ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతిని పునరుద్ధరించాలని కోరారు. ● సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి మాట్లాడుతూ పాదయాత్రల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావడమే కార్యక్రమం ఉద్దేశమన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే సీపీఐ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జేసీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నేతలు దామా అంకయ్య, కె.వినోదిని, వి.రామరాజు, నందిపోగు రమణయ్య, సిరాజ్, చిన్న అంకయ్య, షాన్వాజ్, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్తి కోసం వృద్ధురాలికి చిత్రహింసలు
● పీజీఆర్ఎస్లో ఆవేదన ● 162 వినతుల అందజేత నెల్లూరు(క్రైమ్): ‘నా చిన్నకుమారుడు ఆస్తి కోసం చిత్రహింసలు పెడుతున్నాడు. నా ఇంటిని దౌర్జన్యంగా ఆక్రమించుకుని ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. విచారించి న్యాయం చేయండి’ అని బుచ్చిరెడ్డిపాళెం ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు కోరారు. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. మీరైనా విచారించి సమస్యను పరిష్కరిండని పలువురు బాధితులు పోలీస్ ఉన్నతాధికారులను కోరారు. సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 162 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్ల దృష్టికి తీసుకెళ్లారు. వినతులు పునరావృత్తం కాకుండా చూడాలని ఆమె అన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ కె.వేమారెడ్డి, మహిళా పోలీస్ స్టేషన్, పీసీఆర్, ఎస్బీ ఇన్స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, భక్తవత్సలరెడ్డి, దశరథ రామారావు తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● నా భర్త చనిపోయాడు. ఉద్దీపగుంట ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చెడు ఉద్దేశంతో నా వెంటబడి వేధింపులకు గురిచేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని అల్లూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళ కోరారు. ● కందుకూరుకు చెందిన జీవన్ కుమార్, ప్రసాద్ ఓ ఆన్లైన్ యాప్ ద్వారా పరిచయమయ్యారు. యాప్లో పెట్టుబడులు పెడితే అధికలాభాలు వస్తాయని నమ్మించారు. నాచేత రూ.2.50లక్షలు పెట్టించి మోసగించారని గూడూరు గాంఽధీనగర్కు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ● నెల్లూరుకు చెందిన నవీన్కుమార్ అతని స్నేహితుడు బెంగళూరులో ఐటీ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.6.50 లక్షలు తీసుకున్నారు. ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ పంపి మోసగించారని చిన్నబజారుకు చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు. -
కన్నీటి సుడుల్లో కన్నపేగు
నెల్లూరు(పొగతోట): అతని కాళ్లు, చేతులు కదలవు.. తన అవసరాలు చెప్పుకోలేడు.. ఆకలేస్తే అన్నం కావాలని, దాహమేస్తే మంచినీళ్లు కావాలని అడగలేడు. పురుగులు, దోమలు కుట్టినా.. ఈగలు వాలినా వాటిని చేతులతో తోలుకోలేడు. 22 ఏళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. ఈ స్థితిలో ఉన్న కొడుకు ఆలనాపాలనను తల్లి చూసుకుంటూనే పింఛన్ కోసం రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతోంది. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు కలెక్టర్ను ఆశ్రయించింది. వరికుంటపాడు మండలం కనీయంపాడు గ్రామానికి చెందిన నారయ్య, నవమ్మ దంపతులది పేద కుటుంబం. వారికి ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు చేవూరి రవి (32) పదేళ్ల వయసు వరకు అందరి పిల్లల్లాగే చురుగ్గానే ఉండేవాడు. ఆ తర్వాత అనారోగ్యంతో కాళ్లు, చేతులు చచ్చుబడి మంచానికే పరిమితమయ్యాడు. రవి తన అవసరాలను తానే తీర్చుకోలేని పరిస్థితి. రోజూ భోజనం తినిపించడం, మంచినీరు అందించడం నుంచి అన్ని పనులూ తల్లే చేయాలి. రెండేళ్లుగా పింఛన్ కోసం.. ప్రస్తుతం రవికి దివ్యాంగుల పింఛన్ వస్తోంది. అయితే మంచానికే పరిమితమైన అతడికి డీఎంహెచ్ఓ పింఛన్ మంజూరు చేయించాలని తల్లి రెండేళ్లుగా సచివాలయం, ఎంపీడీఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా సమస్య పరిష్కారం కాలేదు. భర్త నారయ్య వృద్ధుడు. చిన్న కుమారుడు పదో తరగతి వరకు చదువుకుని బేల్దారి పనులకు వెళ్తుంటాడు. కుటుంబ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో రవి పింఛన్ తమకు ఎంతో ఆసరాగా ఉంటుందని తల్లి చెబుతోంది. కలెక్టర్కు మొర.. ఎన్నిసార్లు అధికారులను కలిసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ హిమాన్షు శుక్లాను నవమ్మ కలిసి వినతిపత్రం సమర్పించింది. మంచానికే పరిమితమైన రవిని కార్యాలయానికి తీసుకురాలేని తన పరిస్థితిని వివరించింది. అధికారులు పరిశీలించి, నిబంధనల ప్రకారం డీఎంహెచ్ఓ పింఛన్ మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరింది. 22 ఏళ్లుగా మంచానికే పరిమితమైన కుమారుడు డీఎంహెచ్ఓ పింఛన్ కోసం తిప్పలు దివ్యాంగుల పింఛన్ వస్తుంది కదా అంటున్న అధికారులు రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న తల్లి -
జూనియర్ డాక్టర్ల సమ్మె ఉధృతం
● ఆగిన ఎమర్జెన్సీ సేవలు ● ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రదర్శన నెల్లూరు(అర్బన్): జీఓను అనుసరించి తమకు స్టయ్పండ్ను పెంచాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా, ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడంతో నగరంలోని సర్వజన ఆస్పత్రిలో సాధారణ సేవలతో పాటు అత్యవసర వైద్యసేవలను జూనియర్ డాక్టర్లు సోమవారం నుంచి ఆపేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆస్పత్రి ఆవరణ లో నిరాహార దీక్షలను చేపట్టారు. ఎమ్సీహెచ్ బ్లాక్, మెడికల్ కళాశాల తదితర ప్రాంతాల మీదుగా భారీ ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హనీష్కుమార్ మాట్లాడారు. తెలంగాణ, తమిళనాడులో జూనియర్ డాక్టర్లకు పలు సౌకర్యాలున్నాయని, అయితే ఇక్కడ మాత్రం భద్రతలేదన్నారు. పని ఒత్తిడ్ని విపరీతంగా పెంచారని, రేయింబవళ్లూ పనిచేయాల్సి వస్తున్నా, ఓర్చుకొని రోగులకు వైద్యసేవలను అందిస్తున్నామని తెలిపారు. స్టయ్పండ్ను పెంచాలని అడగడమే నేరంగా చూడటం భావ్యం కాదన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. భార్గవ్, భావన, కీర్తి పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో బీజేపీ నేత చేరిక
చిట్టమూరు: మండల పరిధిలోని ఎల్లసిరి పాటిమిట్ట గ్రామానికి చెందిన బీజేపీ నేత కామిరెడ్డి యుగంధర్రెడ్డి సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. సోమవారం గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య యుగంధర్రెడ్డికి పార్టీ కుండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు పోచారెడ్డి సుకుమార్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, చింతంరెడ్డి ప్రసాద్రెడ్డి, సురేంద్రరెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళం నెల్లూరురూరల్: సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ఆర్.సుభాషిణి రూ.20 లక్షల విరాళాన్ని అందించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్, జిల్లా సైనిక సంక్షేమ బోర్డు చైర్మన్ హిమాన్షు శుక్లాకు చెక్కును అందజేశారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి సేవలందిస్తున్న సాయుధ దళాల సిబ్బంది, మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి తోడ్పడాలనే ఉద్దేశంతో ఈ విరాళాన్ని అందించినట్లు సుభాషిణి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెను అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. టీచర్ ఆత్మహత్యగూడూరు: పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న హిందీ టీచర్ ఆరోగ్య సమస్యలతో సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఒకటో పట్టణ పోలీసుల కథనం మేరకు.. బజారువీధిలో టీచర్ యల్లంరాజు విజయమ్మ (51) నివాసముంటోంది. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుమార్తె పాండేటి శ్రావ్య ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. పేకాట కేంద్రంపై పోలీసుల దాడులు● రూ.1.38 లక్షల నగదు స్వాధీనం నెల్లూరు(క్రైమ్): పేకాట కేంద్రంపై పోలీసులు దాడులు చేసి 11 మంది జూదరులను అరెస్ట్ చేసి రూ.1,38,800ల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. తెలుగుగంగ కార్యాలయం సమీపంలోని ఓ కారు వాష్ వెనుక భాగంలో సోమవారం కొందరు పేకాట ఆడుతున్నారన్న సమాచారం వేదాయపాళెం ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావుకు అందింది. ఆయన తన సిబ్బందితో కలిసి దాడులు చేశారు. నెల్లూరు నగరం, రూరల్ మండలానికి చెందిన ఎన్.చంద్రబాబు, సీహెచ్ మోహన్రెడ్డి, కె.మురళీకృష్ణ, డి.జనార్దన్, కె.నాగేంద్రరావు, నరహరి, కె.ప్రసాద్రెడ్డి, బి.శ్రీనివాసులు, పి.వెంకటరమణయ్య, ఎస్.వెంకటేశ్వర్లు, కొడవలూరు మండలానికి చెందిన ఎస్.నవీన్రెడ్డిని అరెస్ట్ చేశారు. వారి నుంచి నగదు, 11 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ తెలిపారు.రైలు ఢీకొని..● గుర్తుతెలియని వ్యక్తి మృతి నెల్లూరు(క్రైమ్): పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరు వేదాయపాళెం రైల్వేస్టేషన్ సమీపంలో సోమవారం చైన్నె వైపు వెళ్లే పట్టాలపై చోటుచేసుకుంది. మృతుడి వయసు సుమారు 40 నుంచి 45 ఏళ్ల లోపు ఉండొచ్చని భావిస్తున్నారు. ఖాకీ రంగు ఫుల్ హ్యాండ్స్ చొక్కా, బ్లూ, నలుపు రంగుల గళ్ల లుంగీ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు నెల్లూరు రైల్వే పోలీసులకు, 92475 75628 సెల్ నంబర్కు తెలియజేయాలని ఎస్సై కోరారు. -
ఒకే కుటుంబానికి 21 ఎకరాలా?
● భూకబ్జాదారులకు అధికార పార్టీ నేతల అండ ● దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు మల్లి కావలి: మండలంలోని రుద్రకోటలో జాతీయ రహదారి సమీపాన రూ.కోట్ల విలువ చేసే 21 ఎకరాల భూమిని ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులకు కట్టబెట్టడం దారుణమని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్.మల్లి ఆరోపించారు. దీనికి అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని మండిపడ్డారు. పేదల శ్మశాన స్థలాన్ని కూడా వదలకుండా రెవెన్యూ అధికారులు డబ్బుకు అమ్ముడుపోయి చేసిన ఈ నిర్వాహకాన్ని ఎండగడుతూ ఆ గ్రామ దళితులతో కలిసి సోమవారం కావలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అధికార పార్టీ నేతలు చర్యల్ని ఖండించారు. అనంతరం ఆర్డీఓ ఎలీషాకుమార్కు వినతిపత్రం అందజేశారు. గ్రామ సర్వే నంబర్ 600లో పులుసు గోపీకి 4.94 ఎకరాలు, పులుసు ప్రసాద్కు సర్వే నంబర్ 599లో 4.56 ఎకరాలు, పుట్టా సునీతకు 599–1లో 4.56 ఎకరాలు, పులుసు రాజేశ్వరికి 5 ఎకరాలు గతంలో అధికారులు అమ్ముడుపోయి కట్టబెట్టారని వివరించారు. దళితవాడ శ్మశాన స్థలానికి కూడా పట్టా మంజూరు చేశారని, న్యాయం చేస్తామన్న అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి నేటికి ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం దారుణమని వివరించారు. పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. -
డిగ్రీలో ప్రవేశాలకు గడువు పొడిగింపు
నెల్లూరు (టౌన్): డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన గడువును మంగళవారం వరకు పొడిగించామని డీకేడబ్ల్యూ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గిరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 20 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. 23 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు.. 24న వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్, 31న సీట్ల కేటాయింపు, కళాశాలలో వచ్చే నెల రెండులోపు రిపోర్టు చేయాల్సి ఉంటుందని చెప్పారు. కళాశాలలో వివిధ కోర్సులతో పాటు ప్రయోగశాలలు, గ్రంథాలయం, ఎన్నెస్సెస్, ఎన్సీసీ, జేకేసీ, ఆర్ఆర్సీ స్కాలర్షిప్లు, క్రీడా మైదానం, వసతి గృహం తదితరాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. వివరాలకు 86397 34668 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఐటీఐల్లో ప్రవేశాలకు.. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2026 – 27 విద్యా సంవత్సరంలో మూడో విడత ఽప్రవేశాలకు గానూ బుధవారంలోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ప్రభుత్వ ఐటీఐ కన్వీనర్ శ్రీధర్రెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారు ఏ ఐటీఐలో చేరాలనుకుంటున్నారో అక్కడే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ను చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఐటీఐల్లో ఈ నెల 20న.. ప్రైవేట్లో ఈ నెల 21న నిర్వహించనున్న కౌన్సెలింగ్కు హాజరుకావాలని సూచించారు. వివరాలకు సమీపంలోని కళాశాలను సంప్రదించాలని కోరారు. నేటి నుంచి వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాలు వెంకటాచలం: దక్షిణాదిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గొలగమూడిలోని వెంకయ్యస్వామి 44వ ఆరాధనోత్సవాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. భక్తులను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లను ఈఓ బాలసుబ్రహ్మణ్యం చేయిస్తున్నారు. విశేష పూజలు, వేదపారాయణం, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానం, గణపతి పూజను రోజూ నిర్వహించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాలు ఇలా.. ఉత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహనసేవను మంగళవారం ఉదయం, కల్పవృక్ష వాహనసేవను రాత్రి నిర్వహించనున్నారు. సూర్యప్రభ వాహనసేవను 19న ఉదయం, చంద్రప్రభ వాహనసేవను రాత్రి జరపనున్నారు. హనుమంత, హంసవాహనసేవలను 20న.. చినశేష, గజవాహన సేవలను 21న నిర్వహించనున్నారు. అశ్వ, పెదశేష వాహనసేవలను 22న.. సింహ, గరుడవాహన సేవలను 23న నిర్వహించనున్నారు. ఆరాధన మహోత్సవాన్ని చివరి రోజైన 24న ఘనంగా జరపనున్నారు. రథోత్సవాన్ని ఉదయం పదికి, రాత్రి ఎనిమిది గంటలకు నిర్వహించనున్న తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నాయి. వేడుకగా సొందల్ మాలి అనుమసముద్రంపేట: ఏఎస్పేటలోని హజరత్ ఖాజానాయబ్ రసూల్ గంధమహోత్సవం సందర్భంగా దర్గాలో ఏడాదికోసారి మహిళలను అనుమతించే సొందల్ మాలి కార్యక్రమాన్ని వేడుకగా ఆదివారం రాత్రి నిర్వహించారు. అమ్మాజాన్, అబ్బాజాన్ సమాధులకు గంధం లేపనం చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడమే కార్యక్రమ ప్రత్యేకత. దర్గా ఈఓ హుస్సేన్ ప్రత్యేక ఆహ్వానం పలకడంతో ఆదివారం రాత్రి 11 నుంచి తెల్లవారుజామున ఐదు వరకు కార్యక్రమం సాగింది. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. దర్గా నుంచి దొరసానమ్మ తోట వరకు భారీ క్యూలైన్లను పోలీసులు ఏర్పాటు చేసి ప్రవేశానికి అవకాశం కల్పించారు. సీఐ గంగాధర్, ఎస్సైలు జిలానీ, సుభాషిణి, భవానీ, భోజ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సోమ వారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 97,014 మంది ఆదివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. టైమ్ స్లాట్ టిక్కెట్లున్న భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై కర్కశం
● నిర్మాణాల కూల్చివేత వెంకటాచలం: మండలంలోని తిక్కవరప్పాడు పంచాయతీ జోసఫ్పేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త విడవలూరు రంగయ్యకు చెందిన నిర్మాణ గోడలను జేసీబీతో అధికారులు సోమవారం కూల్చేశారు. దళితుడైన రంగయ్య 20 ఏళ్లుగా తన ఆధీనంలో ఉన్న స్థలంలో గోడౌన్ నిర్మాణ పనులను గతేడాది ప్రారంభించారు. ఆర్థిక ఇబ్బందులతో కొంచెం కొంచెంగా పనులు చేసుకుంటూ వచ్చారు. గోడల నిర్మాణ పనులు పూర్తయ్యాక రేకులను ఇటీవల నిర్మించుకున్నారు. అయితే ఇవి ప్రభుత్వ స్థలంలో ఉన్నాయంటూ అధికారులు ఇటీవల హెచ్చరించడంతో రేకులను ఆయన తొలగించారు. తాజాగా గ్రామానికి అధికారులు చేరుకొని గోడలను కూల్చేశారు. తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడనే కారణంతోనే అన్యాయంగా ఇలా చేశారని రంగయ్య వాపోయారు. తనకు రూ.ఐదు లక్షల నష్టం సంభవించిందని పేర్కొన్నారు. -
కనీస వేతనం పెంచాలంటూ..
కార్మికులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఎంఎస్ జిల్లా శాఖ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసింది. నేతలు మాట్లాడుతూ ఈఎస్ఐ వేతన పరిమితిని రూ.42 వేలకు, ఈపీఎస్ కనీస పెన్షన్ను రూ.7,500కు, ఈపీఎఫ్ వేతన పరిమితిని రూ.30 వేలకు పెంచాలని కోరారు. కనీస వేతనాన్ని రూ.30 వేలకు నిర్ణయించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. బ్యాంక్ ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలు అమలు చేయాలని, గ్రాట్యుటీ పరిమితిని రూ.40 లక్షలకు పెంచాలని కోరారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించాలని కోరారు. కార్యక్రమంలో బీఎంఎస్ జిల్లా అధ్యక్షుడు మన్నె రాంబాబు, కార్యదర్శి సీహెచ్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి కుట్రలు.. కట్టు కథలు
అభివృద్ధి పనులు చేయడం చేతగాని కూటమి నేతలు.. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన డెవలప్మెంట్ను చూసి ఓర్వలేకపోతున్నారు. ఏదో తరహాలో దుష్ప్రచారం చేస్తూ తామేదో సాధించాలనే రీతిలో కలలుగంటూ చివరికి అభాసుపాలవుతున్నారు. పేదలకు ఇల్లుండాలనే మహోన్నత ఆశయంతో జగనన్న కాలనీలను గత సీఎం జగన్మోహన్రెడ్డి తీర్చిదిద్ది వారి కళ్లల్లో ఆనందాన్ని నింపారు. చివరికి దీనిపైనా టీడీపీ నేతలు విషం గక్కుతూ ప్రజల ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గంలో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను చూసి కూటమి నేతలు ఓర్వలేకపోతున్నారు. ఇక్కడ ఏళ్ల తరబడి సొంతింటి స్వప్నాన్ని నెరవేర్చుకోవాలని ఎదురుచూసిన కుటుంబాల కలను అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రత్యేక చొరవతో సాకారం చేశారు. దీంతో నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జగనన్న కాలనీల పేరుతో ప్రత్యేకంగా ఊళ్లే ఏర్పడ్డాయి. దీన్ని తట్టుకోలేని కూటమి ప్రభుత్వం.. జగనన్న కాలనీలపై విషప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగానే వెంకటాచలంలోని కాలనీపై కొద్ది రోజులుగా వీరు విషం కక్కుతుండటంపై స్థానికులు మండిపడుతున్నారు. గతంలో అన్నీ కష్టాలే.. వెంకటాచలంలో వందల కుటుంబాలకు 2019 ముందు వరకు సొంతిల్లు లేక అద్దె గృహాల్లోనే ఉండేవారు. కొన్ని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఈ స్తోమత లేక స్థానిక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఉండే చెట్ల నీడ కిందే గుడిసెలేసుకొని నివసించేవారు. అప్పట్లో సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉన్న కాకాణి గోవర్ధన్రెడ్డి దృష్టికి ఇళ్ల స్థలాలు, నిర్మాణాల విషయాన్ని గిరిజనులు పలుమార్లు తెలియజేశారు. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో, తమ సర్కార్ కొలువుదీరాక అర్హులందరికీ న్యాయం జరుగుందని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువుదీరాక పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రత్యేక చొరవ చూపారు. ఈ క్రమంలోనే వెంకటాచలంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న సర్వే నంబర్ 667 – 3లో 14.16 ఎకరాలు ఇతరుల అన్యాక్రాంతంలో ఉన్నాయనే అంశాన్ని గుర్తించి, దాన్ని పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించారు. చెట్లు, పుట్టలను తన సొంత నిధులను వెచ్చించి చదును చేయించారు. అనంతరం అధికారులతో ప్లాట్లు వేయించి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలను పంపిణీ చేయించారు. ఇల్లు నిర్మించివ్వడంతో లబ్ధిదారులు ఎంతో సంతోషంగా నివాసాల్లో జీవిస్తున్నారు. నవ్విపోదురు గాక నాకేటి..! వెంకటాచలంలోని జగనన్న కాలనీలో పార్టీలకతీతంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. గ్రామంలోని భూములు, ఇళ్లు, స్థలాలపై కోర్టులో కేసు నడుస్తోంది. అయితే టీడీపీ నేతలు మాత్రం దేవదాయ శాఖకు చెందిన భూముల్లో జగనన్న కాలనీ ఉందంటూ దుష్ప్రచారం చేస్తుండటంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి చేసిన అభివృద్ధిని జీర్ణించుకోలేకే ఇలా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటాచలంలోని జగనన్న కాలనీలో అర్హులకు ఇళ్లు నిర్మించిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఓర్వలేక దుష్ప్రచారాన్ని సాగిస్తూ నవ్వులపాలు మండిపడుతున్న గ్రామస్తులు -
వినతులిస్తున్నాం.. పరిష్కారమెక్కడ?
● కలెక్టరేట్కు పోటెత్తిన అర్జీదారులు ● పెండింగ్ బకాయిల కోసం ధర్నా నెల్లూరురూరల్: ‘అయ్యా మండల కార్యాలయాల్లో వినతులిస్తున్నాం. పట్టించుకోవడం లేదు. మీరైనా మా అర్జీలను పరిశీలించి పరిష్కరించండి’ అని ప్రజలు కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు, డిప్యూటీ కలెక్టర్ కేశవర్ధనరెడ్డి, మెప్మా, డీఆర్డీఏ పీడీలు కిరణ్కుమార్, నాగరాజకుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్ తదితరులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.పెండింగ్ బకాయిల కోసం.. అంగన్వాడీ వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, పాఠశాల ఆయాలు, వాచ్మెన్లకు పెండింగ్లో ఉన్న వేతనాలు, బిల్లులను వెంటనే చెల్లించాలని ఆ సంఘం గౌరవాధ్యక్షురాలు రెహనా బేగం కోరారు. కలెక్టరేట్ ఎదుట 24 గంటల నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెగా పేరెంట్స్ డే ఖర్చులను కూడా చెల్లించాలని, ఒక్కో విద్యార్థికి మెనూ బిల్లును రూ.20కు పెంచాలని కోరారు. కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. -
దేవదాయశాఖ భూమిగా రికార్డే లేదు
వాస్తవానికి ఈ ప్రాంతానికి చెందిన మల్లవరపు రామారావు అనే భూస్వామి తనకున్న సర్వే నంబర్ 667– 3లో 300 ఎకరాల పట్టా భూమిని వందేళ్ల క్రితమే.. బాటసారుల భోజన వసతి కోసం కేటాయించారు. తదనంతర కాలంలో ఆ భూమిని తమ గ్రామంలోని రైతులకు తలా కొంత పొలాన్ని ఇనాంగా రాసిచ్చారు. అప్పటి నుంచి రైతులు సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. కాలక్రమేణ కొందరు రైతులు కాలం చేయడం, వారసులు కూడా ఈ భూమిని వదిలేశారు. ఈ క్రమంలో 14.16 ఎకరాలు బీడు భూమిగా మారడం, ఇతరుల అన్యాక్రాంతంలో ఉన్నట్లు గుర్తించి, దాన్ని జగనన్న పేదల ఇళ్ల స్థలాల కోసం కేటాయించారు. అయితే ఎక్కడ వైఎస్ జగన్మోహన్రెడ్డి, కాకాణి గోవర్ధన్రెడ్డికి పేరొస్తొందోననే దుగ్ధతో అధికార పార్టీ పెద్దలు కుట్రలకు తెరతీశారు. సీతమ్మ చలివేంద్రం పేరుతో దేవదాయశాఖ భూమిగా తెరపైకి తెచ్చి.. విజిలెన్స్ విచారణతో రోజుకొక కట్టుకథలు అల్లుతున్నారు. శతాబ్ద కాలంగా రెవెన్యూ రికార్డుల్లో కానీ, రిజిస్టర్ డాక్యుమెంట్లలో కానీ ఇది దేవదాయశాఖ భూమిగా ఎక్కడా నమోదు కాలేదు. ఈ భూమి దేవదాయశాఖదిగా చెప్పడానికి ఆ శాఖ వద్ద కనీసం చిత్తు డాక్యుమెంట్ కూడా లేదనే వాదనను స్థానికులు వినిపిస్తున్నారు. దేవదాయశాఖ భూమి అయితే.. కాలనీకి స్థలం కేటాయించినప్పుడు కూ డా ముందుకు రాని అధికారులు.. ఇప్పుడే రాద్ధాంతం చేయడం వెనుక అధికార పార్టీ నేతల కుట్రలు ఉన్నాయని కాలనీ వాసులు మండిపడుతున్నారు. -
అవినీతిలో సోమిరెడ్డి కొత్త పుంతలు
● ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్రెడ్డి మనుబోలు: అవినీతిలో సోమిరెడ్డి కొత్త పుంతలు తొక్కుతూ.. అక్రమాలను ఎలా చేయొచ్చో చూపుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని ముద్దమూడిలో పార్టీ నేత కసుమూరు పెంచలయ్య కుమారుడు ప్రసాద్ గుండెపోటుతో మరణించడంతో ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. వీరంపల్లికి చెందిన పార్టీ నేతలు అడపాల కృష్ణారెడ్డి, రమణమ్మ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో సోమిరెడ్డి అవినీతిపై ప్రజలు కథలు.. కథలుగా చెప్పుకొంటున్నారని ఆరోపించారు. ఎక్కడ చూసినా ఆయన అవినీతి జాడలు తప్ప అభివృద్ధి కానరావడంలేదని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ పనుల్లో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ కోట్లాది రూపాయలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన పనులను తాజాగా చేయించినట్లుగా కొత్తగా బిల్లులు చేసుకొని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. అవినీతిలో భాగమైన అధికారులపై భవిష్యత్తులో చర్యలు తప్పవని హెచ్చరించారు. తీవ్ర కాలుష్యం మనుబోలులోని సంగమేశ్వరస్వామి దేవస్థానం వద్ద పశువుల మేత కోసం జొన్న కంకులను నిల్వ చేస్తుండటంతో తీవ్ర కాలుష్యం ఏర్పడుతోందంటూ కాకాణికి పార్టీ నేతలు ిఫిర్యాదు చేశారు. దేవాలయాలకు సీసీ రోడ్లను గతంలో తాము వేశామని, వీటి ముందు సిమెంట్తో వరండాలను ఏర్పాటు చేయించామని చెప్పారు. అయితే ప్రస్తుతం దీనికి విరుద్ధంగా ఆలయాలను సైతం సొంత అవసరాలకు అధికార పార్టీ నేతలు వాడుకుంటూ కాలుష్యానికి కారకులవుతున్నారని మండిపడ్డారు. సంగమేశ్వరాలయం వద్ద దుర్గంధంతో అక్కడ నివాసముంటున్న గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ముత్తుకూరులో బల్కర్ల ప్రవేశంతో కాలుష్యం ఏర్పడుతోందని చెప్పి, చివరికి టన్నుకు రూ.40 చొప్పున యజమానుల వద్ద సోమిరెడ్డి వసూలు చేశారని దుయ్యబట్టారు. నేతలు బొమ్మిరెడ్డి హరగోపాల్రెడ్డి, సూరపనేని కిశోర్నాయుడు, దాసరి భాస్కర్గౌడ్, జెట్టి సురేందర్రెడ్డి, గుర్రం ప్రభాకర్, చాంద్బాషా, ఆవుల తులసీరామ్, తుపాకుల గిరి తదితరులు పాల్గొన్నారు. -
పొంగళ్ల కార్యక్రమానికి బయలుదేరి..
● బైక్ను ఢీకొన్న లారీ ● ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి సంగం: మండలంలోని తరుణవాయి సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఇనకర్ల శీనయ్య (40) మున్సిపాలిటీలో ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సంగంలోని బంధువులు నిర్వహిస్తున్న మాతా పరమేశ్వరి పొంగళ్ల కార్యక్రమానికి ఆదివారం సాయంత్రం శీనయ్య బైక్పై బయలుదేరాడు. ఈ క్రమంలో తరుణవాయి సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం అనంతరం లారీని అక్కడే నిలిపి డ్రైవర్ పరారయ్యాడు. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని 108 వాహనంలో నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై సంగం ఎస్సై భోజ్యానాయక్ కేసు నమోదు చేశారు. ఘటనా స్థలంలో శీనయ్య -
చెరువును చెరబట్టి.. మట్టిని కొల్లగొట్టి
● రామాపురంలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు ● భారీ గోతులతో సాగునీరు పారని పరిస్థితి సాక్షి టాస్క్ఫోర్స్: పేదవాడు తన అవసరాలకు కొద్దిగా మట్టిని తోలుకుంటే కేసులు పెట్టే అధికారులు కూటమి నేతలు ఇష్టారాజ్యంగా చెరువు మట్టిని తరలిస్తున్నా అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. చిట్టమూరు మండల పరిధిలోని చిల్లమూరు పంచాయతీ రామాపురం చెరువులో కూటమి నాయకులు అక్రమంగా గ్రావెల్, మట్టిని తరలిస్తున్నారు. ఇదేమని అడిగితే మమ్మల్ని ఎవడ్రా ఆపేది అంటూ దౌర్జన్యం చేస్తున్నారని ఆయకట్టు రైతులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో కూటమి నాయకులు చెరువులో మూడు పెద్ద హిటాచీలు పెట్టి రాత్రి, పగలు పది టిప్పర్లకు మట్టిని నింపి సాగరమాల రోడ్డుకు తోలుకుని రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారని రైతులు వెల్లడిస్తున్నారు. చెరువు తూముల కంటే లోతుగా మట్టిని ఎత్తి వేయడంతో సాగునీరు పొలాలకు పారని పరిస్థితి నెలకొంటోంది. అయితే కూటమి నేతలకు కొంత మంది వత్తాసు పలుకుతూ మట్టి ఎత్తడం వల్ల చెరువు లోతు అవుతుందని సన్నాయినొక్కులు నొక్కుతూ గ్రామస్తులను మభ్యపెడుతున్నారు. కూటమి నేతలు మట్టి మాఫియాగా మారి ధనార్జనే ధ్యేయంగా ప్రవర్తిస్తున్నారు. అధికారులు చెరువులో మట్టి తరలింపునకు ఎలా అనుమతులు ఇస్తారని గ్రామస్తులు వాపోతున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మట్టి తరలింపును అడ్డుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఆపేవారే లేరా? నిత్యం ధనార్జనే ధ్యేయంగా చిట్టమూరు మండలంలో కూటమి నాయకులు అధికారులను ఒత్తిళ్లకు గు రి చేసి ప్రజాప్రతినిధుల సహకారంతో మట్టి, ఇసుక, గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారని ప్రజ లు వాపోతున్నారు. మండలంలో ఒక్కో గ్రామాన్ని ఎంచుకుని స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై మీ గ్రామానికి ఎంతో కొంత నగదు ఇస్తామని నమ్మబలికి పబ్బం గడుపుతున్నారు. ప్రకృతి సంపదను కొల్లగొట్టి కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు పంచుకుంటూ పోతున్నారు. -
పార్టీ అభివృద్ధికి సమష్టిగా కృషి చేయాలి
మాట్లాడుతున్న రామ్కుమార్రెడ్డి ● నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి వాకాడు: వైఎస్సార్సీపీ అభివృద్ధికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఆ పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి అన్నారు. వాకాడులోని తన నివాసంలో ఆదివారం వాకాడు, కోట, చిట్టమూరు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృష్టి చేద్దామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో వైఎస్సార్సీపీ జెండా ఎగిరేలా ఇప్పటినుంచే క్షేత్రస్థాయిలో కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. అధికార పార్టీ నాయకులు ఎన్ని తప్పుడు కేసులు పెట్టి భయపెట్టినా బెదిరేదిలేదన్నారు. ప్రజలంతా వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే ఉన్నారన్నారు. పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త అంకిత భావంతో పని చేయాలని పిలుపునిచ్చారు. -
కేర్ టేకర్గా చేరి బంగారం, నగదు చోరీ
● కేసును ఛేదించిన పోలీసులు ● 11 సవర్ల బంగారం, రూ.1,80,500 నగదు స్వాధీనం ఆత్మకూరు: కేర్ టేకర్గా వృద్ధ దంపతులకు సేవలందిస్తున్న ఓ వ్యక్తి చోరీకి పాల్పడ్డాడు. 24 గంటల వ్యవధిలోనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. సీఐ జి.గంగాధర్, ఎస్సై జంపానికుమార్ ఆదివారం సీఐ కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఆత్మకూరుకు చెందిన తలసిరి సుబ్బయ్య, ఆయన భార్య వెంకటసుబ్బమ్మలు వృద్ధులు. వారి కుమారుడు హైదరాబాద్లో కాంట్రాక్ట్ పనులు చేస్తుంటాడు. తల్లిదండ్రుల కేర్ టేకర్గా హైదరాబాద్లోని నాగోల్ ప్రాంతంలో ఉన్న రామకృష్ణ హోం కేర్ సర్వీసెస్ ద్వారా విజ్జనపు వీర్రాజు అనే వ్యక్తిని నియమించాడు. 20 రోజుల క్రితం అతను ఆత్మకూరులో సుబ్బయ్య ఇంట్లో ఉంటున్నాడు. ఈక్రమంలో నగలు, నగదు, పొలాల ద్వారా వచ్చే కౌలు నగదును బీరువాలో భద్రపరిచడం లాంటి విషయాలు తెలుసుకున్నాడు. అప్పులపాలై.. మద్యానికి బానిసైన వీర్రాజుకు అప్పులున్నాయి. ఈ నేపథ్యంలో ఖర్చుల కోసం బీరువాను రాడ్తో పగులగొట్టి 11 సవర్ల బంగారు నగలు, రూ.2 లక్షల నగదు దొంగతనం చేసి జేఆర్పేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో చెత్త పోగుచేసే దగ్గర దాచాడు. దొంగతనం జరిగిందని గుర్తించిన వృద్ధ దంపతులు కుమారుడికి సమాచారం ఇచ్చారు. అతను ఆత్మకూరుకు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ హడావుడి చూసి వీర్రాజు పరారయ్యాడు. అతడిపై అనుమానంతో సెల్ఫోన్ ఆధారంగా నెల్లూరుపాళెం వద్ద బస్సు ఎక్కుతుండగా వీర్రాజును ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన 11 సవర్ల నగలు స్వాధీనం చేసుకున్నారు. రూ.2 లక్షల నగదులో సుమారు రూ.19 వేలు ఖర్చు చేయగా, మిగిలిన మొత్తా న్ని స్వాధీనం చేసుకున్నారు. వీర్రాజు కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం జల్లివారిపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. 24 గంటల వ్యవధిలో చోరీ కేసును ఛేదించిన సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్లు కేశవకు ఎస్పీ అజిత రివార్డులు ప్రకటించారు. -
డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలి
● ఆధారాలు చూపిస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటు ● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి నెల్లూరు రూరల్: రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని, దేశవ్యాప్తంగా దీనిపైనే చర్చ జరుగుతోందని ఎమ్మెల్సీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. డీఎస్సీపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి అణిచేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. అవకతవకలపై ఆధారాలను చూపుతున్నా, వాటిపై సమాధానం చెప్పడంలేదని విమర్శించారు. తాము ప్రశ్నిస్తున్న అంశాలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తే, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, అయితే ప్రభుత్వం అందుకు ముందుకు రాకుండా వివిధ అంశాలను తెరపైకి తెచ్చి దృష్టి మళ్లించే యత్నం చేస్తోందని మండిపడ్డారు. లోకేశ్ను కాపాడేందుకే రకరకాల డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఆధారాలను తాము బయటపెడుతుంటే, గతంలో అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లను సర్కార్ పదేపదే ట్యాంపరింగ్ చేసిందన్నారు. తాము లేవనెత్తిన అంశాలపై విచారణ జరపకుండా, ఏపీపీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ.. ఇప్పుడు సిట్ విచారణను తెరపైకి తీసుకురావడం డైవర్షన్ పాలిటిక్స్ కావానని ప్రశ్నించారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీపై సీబీఐ విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వానికి దమ్ముంటే ఆదేశించాలని సవాల్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో నష్టపోయిన అభ్యర్థులు ఇప్పటికే గ్రీవెన్స్ విభాగానికి, శాప్ అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారని తెలిపారు. ఉద్యోగాలను రూ.15 లక్షలకు అమ్ముకున్నారనే ఆడియోలూ వెలుగులోకి వచ్చాయన్నారు. పరీక్షలను నిర్వహించకుండా, నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన దొంగ జీఓల ఆధారంగా ఉద్యోగాలిచ్చారని ధ్వజమెత్తారు. సాఫ్ట్బాల్ చైర్మన్నగా ఉన్న ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా 35 మందికి ఉద్యోగాలను ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. సెక్రటరీ సంతకాలు చేయాల్సిన చోట చైర్మన్ హోదాలో ఎలా చేశారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కోటాలో అవకతవకలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలని కోరారు. సంబంధం లేని టీచర్లతో ర్యాలీలెందుకు..? స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయనే అంశంపైనే తాము ప్రశ్నిస్తున్నామని, అయితే దీంతో సంబంధం లేని ప్రొబేషన్లో ఉన్న ఉపాధ్యాయులతో ర్యాలీలను నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. ఎంఈఓలు, డీఈఓలను బెదిరించి వారి ద్వారా ఉపాధ్యాయులను బలవంతంగా ర్యాలీలకు తీసుకెళ్లారని ఆరోపించారు. ర్యాలీల్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది ఏర్పడితే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, వీరి సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు. ఉద్యోగుల బకాయిలను రూ.30 వేల కోట్లకు పెంచారన్నారు. పోలీస్ అధికారులకు జీతాలివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కోవిడ్ సమయంలోనూ గత ప్రభుత్వం 23 శాతం పీఆర్సీని ఇచ్చిన అంశాన్ని గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి సర్కార్ ఏర్పడి దాదాపు రెండున్నరేళ్లవుతున్నా.. ఐఆర్, పీఆర్సీని ఇవ్వలేదని.. ఈ విషయాన్ని ఉద్యోగులు గమనించాలని కోరారు. అనుమానాలకు సమాధానాలు చెప్పడంతో పాటు, ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్ని అంశాలపై నిష్పక్షపాత విచారణను జరిపించాలని డిమాండ్ చేశారు. నారాయణతో చర్చకు సిద్ధం గత ప్రభుత్వ తీరుతో కేంద్ర నిధులను సైతం తెచ్చుకోలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉందంటూ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారని, వీటిని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. దేనిపై చర్చకొస్తారో చెప్తే తానూ సిద్ధమని సవాల్ విసిరారు. ప్రశ్నించిన వారిపై కేసులా..? అవకతవకలను ప్రశ్నిస్తూ వివిధ నియోజకవర్గాల్లో నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొన్న వారిపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని చూస్తుంటే ప్రభుత్వంలో ఉన్న భయం తెలుస్తోందన్నారు. ఉద్యమాలను అణచేయడం ద్వారా సమస్యలు పరిష్కారం కావన్నారు. సర్వీస్లో ఉన్న తమకు టెట్ నుంచి మినహాయింపువ్వాలని కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసిన ఉపాధ్యాయులపై చర్యలు చేపట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. 25 నుంచి 30 ఏళ్లుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారిని ఇప్పుడు కొత్తగా టెట్ రాయాలని కోరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. -
అవినీతిపై విచారణ చేస్తే స్వాగతిస్తాం
● గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త గురువయ్య చిల్లకూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో గూడూరు నియోజకవర్గంలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై స్థానిక ఎమ్మెల్యే ఎలాంటి విచారణ చేపట్టినా స్వాగతిస్తామని వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురువయ్య అన్నారు. గూడూరులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్లో హాల్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోమిడిలో జరిగిన కార్యక్రమంలో తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా వాటిని వక్రీకరించడం సరికాదన్నారు. గతంలో జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన డీఎస్సీ నిరసన ర్యాలీకి అనుమతులు కోరినా పోలీసులు అడ్డుకున్నారన్నారు. అదే డీఎస్సీకి అధికార పార్టీ అనుకూలంగా సంఘీభావ ర్యాలీ నిర్వహిస్తే పోలీసులు దగ్గరుండి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. గూడూరు మండలం మంగళపూరులో జరిగిన ఫ్లెక్సీ వివాదాన్ని ఎమ్మెల్యే స్వయంగా పరిష్కరించాల్సిందిపోయి రూరల్ సీఐ ద్వారా వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సీఐ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్సార్సీపీ కార్యకర్తలను ఏదో విధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఖాకీ చొక్కా వేసుకుని పచ్చ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కడివేడు రెవెన్యూ పరిధిలో ఎమ్మెల్యే అనుచరులు ఎంత మేర భూములు ఆక్రమించుకున్నారో ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. చిల్లకూరు, కోట మండలాల్లో క్రిస్ సిటీ భూసేకరణకు సంబంధించి బినామీలుగా తమ పార్టీకి చెందినవారి పేర్లను, తమకు అనుకూలంగా ఉన్నవారి పేర్లను ప్రభుత్వ భూముల సాగుదారులుగా నమోదు చేయించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు వాస్తవం కాదా అనడిగారు. గూడూరు రూరల్ పరిధిలోని వెడిచెర్లలో ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటూ, పశువులను మేపుకునే భూములను ఇద్దరు పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టారని ఆరోపించారు. దీనిపై దళితులు ప్రశ్నిస్తే వారిపైనే కేసులు పెట్టి పారిశ్రామికవేత్తలకు మద్దతుగా నిలిచారని విమర్శించారు. ● చిల్లకూరు జెడ్పీటీసీ సభ్యుడు మన్నెం శీనయ్య మాట్లాడుతూ చిల్లకూరు మండలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గతంలో పంపిణీ చేసిన భూములు ప్రస్తుతం పెద్దల చేతుల్లో ఉన్నాయని ఆరోపించారు. సమావేశంలో తొణుకుమాల ఎంపీటీసీ సభ్యుడు జానకిరామ్, నాయకులు అట్ల శ్రీనివాసులరెడ్డి, ఇందుకూరి జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాలుడి వైద్యానికి ఆర్థిక సాయం
ఉదయగిరి: మండలంలోని కృష్ణంపల్లికి చెందిన తుపాకుల మహేష్, మంజుల దంపతుల కుమారుడు తన్వీష్ కేన్సర్తో బాధపడుతున్నాడు. చికిత్సకు రూ.40 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై ఈ నెల 6న సాక్షిలో ‘పేద కుటుంబానికి పెద్ద కష్టం’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నియోజకవర్గ యువనేత మేకపాటి అభినవ్రెడ్డి తన వంతు సాయంగా రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. అందులో భాగంగా ఆదివారం ఆ మొత్తాన్ని బాలుడి తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. ఈ సందర్భంగా అభినవ్రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్లోనూ తనవంతు సహాయం అందిస్తానని తెలిపారు. తల్లిదండ్రులు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. పేద కుటుంబాన్ని ఆదుకునేందుకు పార్టీ శ్రేణులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లాల కొండారెడ్డి, వింజమూరు మండల పార్టీ అధ్యక్షుడు రేవునూరి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీటీసీ రొడ్డ కొండయ్య తదితరులున్నారు. బాలుడిని ఢీకొట్టిన కారు ● తీవ్ర గాయాలు వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండల కేంద్రంలోని బీసీ కాలనీ సమీపంలో చాకలకొండ రోడ్డుపై ఆదివారం గుర్తుతెలియని కారు ఢీకొట్టిన ఘటనలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుల వివరాల మేరకు.. స్థానిక జైభీమ్ నగర్కు చెందిన మేరిగ ప్రేమకుమార్ బీసీ కాలనీ సమీపంలోని ఓ ధాబా వద్ద ఉన్న స్విమ్మింగ్ పూల్లో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లాడు. అనంతరం తిరిగి రోడ్డుపై నడుచుకుంటూ వస్తుండగా వింజమూరు వైపు వేగంగా వస్తున్న కారు ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రేమకుమార్ను అక్కడున్న యువకులు వెంటనే స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరుకు తీసుకెళ్లారు. ఘటనపై బాధితుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోటార్బైక్ అదుపుతప్పి.. ● హెడ్ కానిస్టేబుల్ మృతి ముత్తుకూరు(పొదలకూరు): మోటార్బైక్ అదుపుతప్పి తీవ్రంగా గాయపడిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసు లు, స్థానికుల కథనం మేరకు.. ముత్తుకూరు రాజీవ్ నగర్కు చెందిన గుణ్ణం విజయ్ ప్రకాష్ (55) నెల్లూరు ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. పని ముగించుకుని శనివారం రాత్రి బైక్పై ఇంటికి బయలుదేరాడు. ఈక్రమంలో జంగాలకండ్రిగ పెట్రోల్ బంక్ సమీపంలో బైక్ అదుపు తప్పింది. దీంతో ప్రకాష్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై ముత్తుకూరు ఎస్సై డీవీకే రెడ్డి కేసు నమోదు చేశారు. నేడు ‘డయల్ యువర్ ఎస్ఈ’ నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ వినియోగదారులు సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ పరిధిలో ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని ఎస్ఈ రాఘవేంద్రం సోమవారం నిర్వహించనున్నారు. నెల్లూరు విద్యుత్ భవన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. వినియోగదారులు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య 0861 – 2320427 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు. ● తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం సీఎండీ శివశంకర్ ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వినియోగదారులు 89777 16661 నంబర్కు ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు. -
స్విమ్మింగ్లో నెల్లూరు వాసులకు పతకాలు
నెల్లూరు(టౌన్): ఆంధ్రప్రదేశ్ మాస్టర్స్ ఆక్వాటిక్ 7వ రాష్ట్రస్థాయి ఇంటర్ డిస్ట్రిక్ట్ చాంపియన్షిప్ స్విమ్మింగ్ పోటీల్లో నెల్లూరుకు చెందిన పలువురు క్రీడాకారులు సత్తాచాటారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో శనివారం నిర్వహించిన పోటీల్లో పినాకినీ స్విమ్మర్స్ క్రీడాకారులు 8 బంగారు, 11 రజత, 3 కాంస్య పతకాలు సాధించారు. వారిలో మోపూరు పెంచలయ్య, బీవీ కృష్ణారెడ్డి, యు.కోటేశ్వరరావు, తురకా శ్రీనివాస్, కె.శంకరనారాయణ, ఎన్.శ్రీనివాసులు, పి.చంద్రశేఖర్ ఉన్నారు. విజేతలను నెల్లూరు ఆక్వాటిక్ అసోసియేషన్ కార్యదర్శి పి.సనత్కుమార్, పినాకినీ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.పెంచలయ్య ఆదివారం అభినందించారు. బంగారు పతకాలు సాధించిన క్రీడాకారులు ఏషియన్ స్విమ్మింగ్ పోటీలకు అర్హత సాధించారు. -
అధికారం మాది.. ఏమైనా చేస్తాం
● చెరువుల్లో అక్రమంగా మట్టి తరలింపు ● అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహంవెంకటాచలం: మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. కొందరు టీడీపీ నాయకుల అండతో చెరువుల్లో రేయింబవళ్లు మట్టి తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు. తవ్వకాలతో చెరువుల్లో భారీ గుంతలు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారం అధికారుల దృష్టికి వెళ్లినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. మండలంలోని పలు గ్రామాల్లో చెరువుల్లో నీరు అంతంతమాత్రంగా ఉండటం కొందరు తెలుగుదేశం న ఆయకులు వరంగా మారింది. జేసీబీ యంత్రాలతో మట్టి తవ్వి లేఅవుట్లు, ఖాళీ ప్లాట్లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వెంకటాచలంలోని కనుపూరు చెరువు, కాకిఎద్దలగుంట, కాకుటూరు, చెముడుగుంట, కసుమూరు తదితర ప్రాంతాల్లో అనుమతులు లేకుండా మట్టి తరలింపు సాగుతోంది. కనుపూరు, కాకిఎద్దలగుంట చెరువుల్లో ఐదు రోజులుగా పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పు మట్టిని రూ.800 నుంచి రూ.1,200 వరకు విక్రయిస్తున్నారు. ట్రిప్పు మట్టి ధర రూ.500 కదా అని కొందరు నివాస ప్రాంతాల ప్రజలు ప్రశ్నిస్తే.. తమ ధర ఇంతేనని నిర్వాహకులు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. అధికారుల పట్టింపు ఏదీ? ఐదు రోజులుగా చెరువుల్లో రేయింబవళ్లు మట్టి తవ్వకాలు, రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. తహసీల్దార్ కార్యాలయం, పోలీస్స్టేషన్, ఇరిగేషన్ కార్యాలయాలు ఉండే మార్గంలోనే మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లు నిత్యం తిరుగుతున్నా చర్యలు లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకుల నుంచి ముడుపులు అందడం వల్లే అధికారులు చర్యలు తీసుకోవడం లేదని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై అధికారులు స్పందించాల్సి ఉంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మండలంలోని చెరువుల్లో జరుగుతున్న మట్టి తవ్వకాలను అడ్డుకుని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
పెళ్లి పత్రికలు ఇచ్చేందుకు వెళ్తూ..
● రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి ● బైక్ పైనుంచి పడి.. సోమశిల(ఆత్మకూరు): కుమారుడి పెళ్లి పత్రికలు బంధువులకు అందజేసేందుకు వెళ్తూ మోటార్బైక్పై నుంచి జారి పడి ఓ మహిళ మృతిచెందిన ఘటన అనంతసాగరం మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. నెల్లూరుకు చెందిన షేక్ శాన్వాజ్ (50) కుమారుడికి వచ్చే నెల 5వ తేదీ వివాహం నిశ్చయమైంది. పెళ్లి పత్రికలను అనంతసాగరం, సోమశిల గ్రామాల్లో ఉన్న బంధువులకు ఇచ్చేందుకు ఆమె బైక్పై వెనుకవైపు కూర్చొని వెళ్తుండగా మండలంలోని ముత్తుకూరు వద్ద జారిపడడంతో తలకు తీవ్ర గాయమైంది. 108 సిబ్బంది ఆత్మకూరులోని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసు కేసు నమోదైంది.కండలేరులో 22.55 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 22.55 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 10, హైలెవల్ కాలువకు 90, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ సేవలు ప్రారంభం
నెల్లూరు(అర్బన్): శిశువుల వైద్య సంరక్షణ సేవల్లో దేశంలో పేరుగాంచిన రెయిన్బో చిల్డ్రన్స్ ఆస్పత్రి సేవలను నెల్లూరులో ప్రారంభిస్తున్నామని వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ రమేష్ కంచర్ల తెలిపారు. ఆయన ఆదివారం వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ తర్వాత తన సొంతూరు నెల్లూరులో నాలుగో బ్రాంచ్గా, దేశంలో 24వ బ్రాంచ్గా ఆస్పత్రిని ప్రారంభిస్తున్నామన్నారు. నెల్లూరులోని ప్రైమ్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో మెజారిటీ వాటాను కొనుగోలు చేశామన్నారు. ఇకపై ఇక్కడ సూపర్ స్పెషాలిటీ సేవలను అందిస్తామన్నారు. ఇప్పుడున్న 70 పడకలను మరింత విస్తృతం చేయనున్నామన్నారు. పీడియాట్రిక్ కార్డియాలజీ, కార్డియాక్ సర్జరీ, పీడియాట్రిక్ న్యూరాలజీ, పీడియాట్రిక్ నెఫ్రాలజీ, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్, అంకాలజీ, హెపటాలజి, గాస్ట్రో ఎంటరాలజీ, నియోనేటాలజీ, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ తదితర అనేక రకాల సూపర్ స్పెషాలిటీలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రైమ్ రెయిన్బో చిల్డ్రన్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రీతమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ ప్రైమ్ ఆస్పత్రిని రెయిన్బో క్లినికల్ వ్యవస్థలో విలీనం చేయడం ద్వారా తాము అందించే ఉత్తమ సేవలను జిల్లా ప్రజలు వినియోగించుకోవాలన్నారు. అన్ని రకాల శిశు సంరక్షణ సేవలకు మెట్రో పాలిటిన్ నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ప్రైమ్ ఆస్పత్రి డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. -
సోమిరెడ్డీ.. ప్రమాణానికి సిద్ధమా..?
● సవాల్ విసిరిన మాజీ మంత్రి కాకాణి వెంకటాచలం: అధికారాన్ని అడ్డుపెట్టుకొని నీతో పాటు నీ కొడుకు, అల్లుడు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేసేందుకు సిద్ధమానని సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డిని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రశ్నించారు. వెంకటాచలం, జంగాలపల్లి గ్రామాల్లో స్థానిక నేతలతో కలిసి ఆదివారం పర్యటించిన ఆయన మాట్లాడారు. వెంకటాచలంలోని జగనన్న కాలనీలో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి, గృహాలను తమ ప్రభుత్వ హయాంలో నిర్మించామని చెప్పారు. అయితే దీన్ని ఓర్వలేక అనర్హులకు ఇచ్చారంటూ ప్రచారం చేశారని ఆరోపించారు. చంద్రబాబు గోటిలో చిలుకగా మారిన విజిలెన్స్ శాఖ కాకుండా సీబీఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపడితే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని చెప్పారు. దీనికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తనపై మోపిన కేసులపై సీబీఐ విచారణ జరపాలంటే, నిజం బయటపడుతుందనే ఉద్దేశంతో దీనికి ప్రభుత్వం అడ్డుపడుతోందని విమర్శించారు. తనకు దమ్ముంది కాబట్టే, సీబీఐ విచారణను కోరానన్నారు. సోమిరెడ్డి కుటుంబం తరహాలో తీవ్ర అవినీతికి పాల్పడుతూ, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై నిందలేసే నీచ మనస్తత్వం తనది కాదని స్పష్టం చేశారు. పారిపోతున్నారు.. సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి, అవినీతి విషయాలపై బహిరంగ చర్చకు.. కాణిపాకం వినాయకుడి గుడి వద్ద ప్రమాణానికి తాను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరినా, సోమిరెడ్డి పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కందలపాడు, రామదాసుకండ్రిగ, నాగంభొట్లకండ్రిగ, వెంకటాచలం, కనుపూరు గ్రామాల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలతో నిలువెత్తు గుంతలతో ప్రజలకు కన్నీరు మిగిల్చారని మండిపడ్డారు. ఇరిగేషన్లో దొంగ బిల్లులు.. ఇసుక, గ్రావెల్, మట్టి, క్వార్ట్జ్ అక్రమ తరలింపుతో కోట్ల రూపాయలను దోచుకున్న నీచ చరిత్ర నీదికాదానని ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ రేట్లను ప్రభుత్వం పెంచిన తరహాలో.. సర్వేపల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల వద్ద రూ.మూడు లక్షల నుంచి రూ.నాలుగు లక్షల మేర సోమిరెడ్డి అల్లుడు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. వైస్ ఎంపీపీ కనుపూరు కోదండరామిరెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, మండల కన్వీనర్ కొణిదెన మోహన్నాయుడు, ఎంపీటీసీ వేమారెడ్డి రఘునందన్రెడ్డి, షాజహాన్ తదితరులు పాల్గొన్నారు. -
సింహపురిలో ఓనం సంబరాలు
పుష్పాలతో తీర్చిదిద్దిన రంగవల్లి వద్ద యువతులు నృత్య ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమాలుకేరళీయులు అత్యంత వేడుకగా జరుపుకొనే ఓనం పండగ సందర్భంగా అథం ప్రారంభాన్ని పురస్కరించుకొని సింహపురిలో సంబరాలు ఆదివారం అంబరాన్నంటాయి. నగరంలోని టౌన్హాల్లో సాంస్కృతిక కార్యక్రమాలను మలయాళీస్ వెల్ఫేర్ అసోసియేషన్స్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. పుష్పాలతో తీర్చిదిద్దిన రంగవల్లుల వద్ద యువతులు సందడి చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
తమిళనాడు బోటు పట్టివేత
ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని నేలటూరుపాళెం సముద్ర జలాల్లో అక్రమంగా చేపల వేటకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన బోటును గస్తీ బృందం ఆదివారం పట్టుకుంది. కృష్ణపట్నం పోర్టుకు సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో బోటును గుర్తించి అడ్డుకున్నారు. దుగరాజపట్నం సీఎస్పీఎస్ ఎస్సై ఆంజనేయులు, వెంకటాచలం, మైరెన్ పోలీస్ సిబ్బంది, ఎఫ్డీఓ చిల్లకూరు శ్రీనివాసులు, వీఎఫ్ఏ రంజిత్, అటవీశాఖ సిబ్బంది సంయుక్తంగా సముద్ర గస్తీ నిర్వహిస్తుండగా బోటును గుర్తించి పట్టుకున్నారు. ఇందులో తమిళనాడుకు చెందిన ఏడుగురు మత్స్యకారులున్నారని గుర్తించారు. డ్రైవర్గా మేఘనాథ్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. బోటును జువ్వలదిన్నె హార్బర్కు తరలించి సురక్షిత కస్టడీకి అప్పగించామని పేర్కొన్నారు. నేటి నుంచి అత్యవసర వైద్యసేవలు బంద్ నెల్లూరు(అర్బన్): స్టయ్పండ్ను సవరించాలని కోరుతూ పలుమార్లు అర్జీలిచ్చి , ఆందోళనలు చేస్తున్నా, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అత్యవసర వైద్యసేవలను సోమవారం నుంచి నిలిపేయనున్నామని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హనీష్కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఆగస్ట్ 15 సాయంత్రంలోపు లిఖితపూర్వకమైన హామీ లభిస్తుందని ఆశతో ఎదురుచూశామని, అయినా ప్రయోజనం లేకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సమ్మెతో పెద్దాస్పత్రిలో ఇబ్బందులు సాధారణ వైద్యసేవలను జూనియర్ డాక్టర్లు ఆరు రోజులుగా నిలిపేసి ఆందోళనలు చేస్తుండటంతో పెద్దాస్పత్రిలోని రోగులకు వైద్యసేవలు సకాలంలో అందడం లేదు. పలువురు సీనియర్ డాక్టర్లు అందుబాటులో ఉండటంలేదు. ఇప్పుడు ఎమర్జెన్సీ సేవలను నిలిపేస్తే ఆ ప్రభావం కాజ్యువాల్టీ, ఐసీయూ తదితర చోట్ల పడనుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఏమి జరుగుతుందోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి దర్శనానికి 22 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి.. ఆక్టోపస్ సర్కిల్ వద్దకు క్యూ చేరుకుంది. స్వామివారిని 90,293 మంది శనివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 53,090 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.6 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 22 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. విద్యార్థులకు మెరిట్ అవార్డులు గూడూరు రూరల్: పట్టణంలోని ప్రభుత్వ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిరామిక్ టెక్నాలజీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మెరిట్ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. కళాశాల పూర్వ విద్యార్థి ప్రభాకర్రావు స్థాపించిన తల్లూరి చారిటబుల్ సంస్థ ఆధ్వర్యంలో వీటిని అందజేశారు. ప్రథమ సంవత్సర టాపర్ యశ్వంత్.. ద్వితీయ సంవత్సరం నుంచి ప్రతాప్.. డిప్లొమా నుంచి వినయ్కుమార్కు మెరిట్ అవార్డులను అందజేశారు. ప్రిన్సిపల్ సత్యనారాయణ, హెచ్ఓడీ విజయలక్ష్మి, పూర్వ విద్యార్థులు సుబ్రహ్మణ్యం, జీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
వికసిత్ భారత్ సాధనలో యువత భాగస్వామ్యం కీలకం
● కలెక్టర్ హిమాన్షు శుక్లా ● కలెక్టరేట్లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నెల్లూరురూరల్: వికసిత్ భారత్ సాధనలో యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. నెల్లూరు కలెక్టరేట్లో శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి హిమాన్షు శుక్లా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలోని 100 అడుగుల స్తూపం వద్ద జాతీ య పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. స్వర్ణాంధ్ర, స్వర్ణభారత్, వికసిత్ భారత్ దిశగా దేశం, రాష్ట్రం ముందుకు సాగుతున్నాయని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అంగరంగా వైభవంగా..
నెల్లూరు(అర్బన్): 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నెల్లూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. వివిధ ప్రభుత్వ శాఖలు తాము చేసిన అభివృద్ధిని శకటాల ప్రదర్శనలో చూపారు. ఇందులో నగరపాలక సంస్థ మొదటి, పంచాయతీరాజ్ శాఖ రెండో, వ్యవసాయశాఖ మూడో బహుమతులు గెలుచుకున్నాయి. అలాగే ఆయాశాఖలు వివిధ స్టాళ్లను ప్రదర్శించాయి. డీఆర్డీఏ, మెప్మా, గిరిజన సంక్షేమ శాఖలు ప్రదర్శించిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. గత సంవత్సర కాలంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించినందుకు గాను మంత్రి, కలెక్టర్, ఎస్పీ చేతులమీదుగా 521 మందికి అవార్డులు అందజేశారు. ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు దేశభక్తి ఉప్పొంగేలా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పరేడ్ గ్రౌండ్లో అద్భుతమైన నృత్య ప్రదర్శనలు చేశారు. జాతీయ సమైఖ్యతను, స్వాతంత్య్ర కాంక్షను, అహింసను తెలుపుతూ ప్రదర్శనలు సాగాయి. పొదలకూరు జెడ్పీ బాలికల హైస్కూల్, పొదలకూరుకు చెందిన అమరావతి ఇంగ్లిష్ మీడియం, గొలగమూడికి చెందిన బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, బుజబుజ నెల్లూరు శేషు ఇంగ్లిష్ మీడియం పాఠశాల, మాగుంట లేఅవుట్లోని ఓవెల్ పాఠశాల, ముత్తుకూరు జెడ్పీ హైస్కూల్, అవెన్యూ పాఠశాల విద్యార్థులు ప్రదర్శనలిచ్చారు. -
పెన్నా నదిలో వ్యక్తి మృతదేహం
సంగం: సంగం ఆనకట్ట వద్ద పెన్నా నదిలో శనివారం ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు శనివారం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై భోజ్యా నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని బయటకు తీయించి పంచనామా నిమిత్తం తరలించి, కేసు నమోదు చేశారు. కాగా మృతుడు ఏఎస్పేట మండలం హసనాపురానికి చెందిన షేక్ ఖాసిం సాహెబ్గా గుర్తించారు. ఇటీవల కాలంలో ఆయన మానసిక స్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జామాయిల్ తోట దగ్ధం
● రూ.5 లక్షల ఆస్తి నష్టం ఆత్మకూరురూరల్: మండలంలోని కరటంపాడు గ్రామ శివారులో శనివారం సుమారు ఎనిమిది ఎకరాల్లో జామాయిల్ తోట దగ్ధమైంది. స్థానికుల కథనం మేరకు.. కరటంపాడు డీసీపల్లి మధ్య పడమర వైపున ఉన్న పొలాల్లోని ఎండు గడ్డికి మధ్యాహ్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు తెలిసింది. ఆ సమయంలో బలంగా తూర్పు గాలులు వీయడంతో సమీపంలోని జామాయిల్ తోటకు మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు వ్యాపించి తోట దగ్ధమైంది. డీసీపల్లి టోల్గేట్ సిబ్బంది వెంటనే మర్రిపాడు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే ఎనిమిది ఎకరాల్లోని జామాయిల్ చెట్లు కాలిపోయి దాదాపు రూ.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితురాలు సుబ్బరత్నమ్మ తెలిపారు. -
పంద్రాగస్టును మరిచిన అధికారులు
వింజమూరు (ఉదయగిరి): వింజమూరు మండల పరిషత్ ప్రాంగణంలో ఉన్న పలు ప్రభుత్వ కార్యాలయాల్లో శనివారం స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేయకపోవడం చర్చనీయాశంగా మారింది. ప్రధానంగా మండల విద్యావనరుల కేంద్రం, హౌసింగ్, ఉద్యానశాఖ, వీబీజీ రామ్ జీ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకం ఆవిష్కరణ చేయలేదు. కనీసం ఆయాశాఖల అధికారులు, ఉద్యోగులు శనివారం కార్యాలయానికి వచ్చిన దాఖలాలు లేకపోవడంతో వీరి తీరుపై సోషల్ మీడియా గ్రూపుల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయమై ఆయా కార్యాలయాల అధికారులను సంప్రదించగా మండల ప్రజా పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఉండడంతో ఎంపీడీఓలో ఆవిష్కరించారని, అందుకే మా కార్యాలయాల్లో ప్రత్యేకంగా జాతీయ జెండాను ఎగుర వేయలేదని తెలిపారు. అయితే అదే ప్రాంగణంలో ఉన్న ఐకేపీ పొదుపు కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించాల్సి ఉన్నా.. అధికారుల ఉదాసీన వైఖరితో ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. శ్రీవారి దర్శనానికి 20 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 73,699 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 39,884 మంది భక్తులు తలనీలాలర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.31 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
జూనియర్ డాక్టర్ల నిరాహార దీక్షలు
నెల్లూరు(అర్బన్): తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నాలుగు రోజులుగా జూనియర్ డాక్టర్లు తమ విధులు బహిష్కరించి నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ముందు ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరించకపోవడంతో శనివారం నుంచి జూనియర్ డాక్టర్లు నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హనీష్ కుమార్ మాట్లాడుతూ తాము కేవలం స్టైఫండ్ పెంచాలని, డాక్టర్ల రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్ల వరకు మాత్రమే ఉంచాలని, ఎంబీబీఎస్, పీజీ చేసిన వారి ద్వారానే జూనియర్ డాక్టర్లకు వైద్య విద్య బోధించాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామన్నారు. అయినా ప్రభుత్వం దిగిరాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో నిరాహార దీక్షలు చేపట్టామన్నారు. ఇప్పటికై నా న్యాయం చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. జూనియర్ డాక్టర్లు భార్గవ్, అనంత్, హేమంత్, ఇవాన, రూపేంద్ర, ఇర్ఫాన్, వర్షిత, జ్ఞానేష్ తదితరులు పాల్గొన్నారు. అన్నదాన నిధికి రూ.1.21 లక్షల విరాళం నెల్లూరు(బృందావనం): మూలాపేటలోని ఇరుకళల పరమేశ్వరి దేవస్థానంలో నిత్యాన్నదాన నిధికి హైదరాబాద్కు చెందిన సోమిశెట్టి ప్రవళ్లిక కుటుంబసభ్యులు రూ.1,21,173లను శనివారం ఈఓ గిరికృష్ణకు చెక్ ద్వారా విరాళంగా అందజేశారు. వీరికి ఆలయ మర్యాదలతో పూజలు జరిపించి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. ధర్మకర్తల మండలి చైర్మన్ ఒట్టూరు సురేంద్రయాదవ్, అర్చకుడు పులికొలను చంద్రశేఖర్ పాల్గొన్నారు. 147 గ్రాముల వెండి బహూకరణ నెల్లూరు సిటీ: రూరల్ పరిధిలోని నరసింహకొండ వేదగిరి క్షేత్రంలో స్వామివారికి నెల్లూరుకు చెందిన ఆల్తూరు గిరీష్రెడ్డి, లత దంపతులు శనివారం 147 గ్రాముల వెండి కాసులను బహూకరించారు. అదే విధంగా నిత్యాన్నదానానికి నెల్లూరుకు చెందిన గుంజి మనోహర్, శ్రీవాణి దంపతులు రూ.12 వేల విరాళం అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు మాధవగిరి భాస్కరాచార్యులు, నరసింహమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. -
సగర్వం.. త్రివర్ణ వైభవం
● ఊరూరా మువ్వన్నెల జెండాల సంబరం ● స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుతూ రెపరెపలాడిన జాతీయ పతకాలు ● అంబరాన్నంటిన 80వ పంద్రాగస్టు వేడుకలు ● విశిష్ట సేవలందించిన 521 మందికి అవార్డుల ప్రదానం ● జిల్లా సమగ్రాభివృద్ధి, సంక్షేమమే ధ్యేయం: మంత్రి నారాయణ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు.. స్వేచ్ఛా స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి.. ఎనిమిది దశాబ్దాల భారతావని జాతీయతా భావం.. ఇవన్నీ మువ్వన్నెల జెండాలో మిళితమై పంద్రాగస్టు వేడుకల్లో ప్రతిబింబించాయి. ఊరూరా ఆకాశ వీధుల్లో మువ్వన్నెల వీచికలు.. భరత ఖండం గర్వ ధ్వజమై రెపరెపలాడగా.. స్వాతంత్య్ర స్ఫూర్తి వెల్లివిరిసింది. త్రివర్ణ తరంగం.. తరం తరం గౌరవానికి ప్రతీకగా, వీధివీధిన అలరారగా, పట్టణం నుంచి పల్లె వరకు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో దేశభక్తి గర్వగీతమై ఉప్పొంగింది. సగర్వంగా ఎగిరిన త్రివర్ణ పతాకం.. దేశభక్తి, త్యాగం, సమైక్యతకు ప్రతీకగా నిలిచింది. అంబరాన్నంటిన సంబరాల నడుమ జాతీయ పతాకానికి ఘన వందనం సమర్పించారు. విశిష్ట సేవలందించిన 521 మందికి అవార్డులు ప్రదానం చేస్తూ.. ప్రజా సంక్షేమం, జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. జాతీయ పతాకానికి వందనం చేస్తున్న మంత్రి నారాయణ, చిత్రంలో కలెక్టర్ హిమన్షు శుక్లా, ఎస్పీ అజిత, ఏఎస్పీ సౌజన్య, డీఆర్వో విజయకుమార్నెల్లూరు (అర్బన్): స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ.. దేశభక్తి స్ఫూర్తిని చాటుతూ.. 80వ పంద్రాగస్టు వేడుకలు జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శనివారం కలెక్టర్ హిమాన్షు శుక్లా అధ్యక్షతన ఎస్పీ అజిత వేజెండ్ల నేతృత్వంలో ఘనంగా జరిగాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఎటుచూసినా త్రివర్ణ పతాకాలే దర్శనమిచ్చాయి. ఆకాశ వీధుల్లో రెపరెపలాడిన మువ్వన్నెల జెండాలు.. స్వేచ్ఛా భారత స్ఫూర్తిని చాటాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రధాన కూడళ్లు జాతీయ పతాకాలతో కళకళలాడగా.. చిన్నారుల నుంచి పెద్దల వరకు దేశభక్తి భావనతో ఉప్పొంగారు. జాతీయ పతాకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలతో పంద్రాగస్టు సంబరం అంబరాన్నంటింది. ప్రధాన వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారాయణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రగతి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజా సంక్షేమం, జిల్లా సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన 521 మందిని సత్కరించి అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులు స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుతూ చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి పారదర్శకతతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. పీ–4 విధానం ద్వారా జిల్లాలో 41,875 బంగారు కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకుని ప్రభుత్వ–ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో జిల్లాలోని అట్టడుగున ఉన్న 20 శాతం కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గానికి పెద్ద పీట వేస్తూ రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో భారీ పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇఫ్కో సెజ్ను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్చైన్, గోదాములు, ఎగుమతుల కేంద్రంగా రూ. 30 వేల కోట్ల పెట్టుబడులతో అభివృద్ధి చేయబోతున్నామన్నారు. తద్వారా 80 వేల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. కృష్ణపట్నం పోర్టు ఆధారంగా పరిశ్రమలను ప్రోత్సహిస్తూ చైన్నె–బెంగళూరు కారిడార్లో భాగంగా 2,500 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నా రు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అనే మూడు లక్ష్యాలతో జిల్లాను రాష్ట్రంలోనే పారిశ్రామిక, లాజిస్టిక్స్ హబ్గా తీర్చిదిద్దబోతున్నామన్నారు. సంక్షేమానికి పెద్ద పీట జిల్లాలో సంక్షేమానికి పెద్ద పీట వేశామన్నారు. సీ్త్ర శక్తి, దివ్యాంగ శక్తి పథకాల ద్వారా మహిళలకు, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. ఆటోడ్రైవర్లకు రూ 15 వేలు, అన్నదాత సుఖీభవ ద్వారా ప్రతి రైతు కుటుంబానికి రూ.20 వేలు వంతున ప్రతి సంవత్సరం సాయమందిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా 2.86 లక్షల మందికి ప్రతి నెలా రూ.126 కోట్లను ఇంటి పద్దనే పెన్షన్ రూపంలో అందిస్తున్నామన్నారు. తల్లికి వందనం ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2.90 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ 378.79 కోట్లను జమ చేశామన్నారు. నేతన్నల సేవలో పథకం కింద 4,172 మంది చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి రూ.25 వేలు చొప్పున రూ.10.43 కోట్లు అందించామన్నారు. దగదర్తిలో రాష్ట్రంలోని 8వ విమానాశ్రయంగా గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజాప్రతినిధులు డుమ్మా స్వాతంత్య్ర స్ఫూర్తిని నింపుతూ ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎంపీ తదితరులు పంద్రాగస్టు వేడుకలకు హాజరు కావాల్సి ఉంది. అయితే ప్రజా ప్రతినిధులకు కేటాయించిన కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మాత్రం ముందు నుంచి వచ్చి కూర్చున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వచ్చినప్పటికీ ఆయన కాసేపు ఉండి వెళ్లిపోయారు. మిగతా వారు రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దేశం పట్ల గౌరవం కలిగి ఉండాలి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన హైకోర్టు జడ్జి, జిల్లా జడ్జి కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ మన్మధరావు నెల్లూరు (లీగల్): దేశం పట్ల గౌరవాన్ని, ఐక్యతను చాటుతూ దేశభక్తితో ఉండాలని కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ మన్మధరావు సూచించారు. న్యాయశాఖ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ మన్మధరావు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.శ్రీనివాస్ పోలీసులు గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ, న్యాయశాఖ ఉద్యో గులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన రక్త శిబిరాన్ని సందర్శించి రక్తదానం చేసిన న్యాయవాదులను, న్యాయశాఖ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పలు కోర్టుల న్యాయమూర్తులు, జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్ జి.రవిశంకర్, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మశ్రీ, న్యాయశాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ నారాయణ రెడ్డి, వెంకటసునీల్, న్యాయవాదులు పాల్గొన్నారు. తొలుత కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ మన్మధరావుకు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ నాయకులు ఘన స్వాగతం పలికారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి జాతీయ జెండా ఎగురా వేశారు. ప్రధాన కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షుడు జల్లి పద్మాకర్, సహాయ కార్యదర్శి కేఎల్ నారాయణ కమిటీ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
డివైడర్ను ఢీకొన్న బైక్
● అన్నా చెల్లికి గాయాలు మనుబోలు: మండల పరిధిలోని జాతీయ రహదారిపై పొదలకూరు క్రాస్రోడ్డు వద్ద శనివారం వేకువజామున బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న ప్రమాదంలో అన్నా, చెల్లెలు గాయపడ్డారు. డక్కిలి మండలం వెలికల్లు గ్రామానికి చెందిన ఎస్.బాలు తన సోదరి శైలజతో కలిసి బైక్పై నెల్లూరుకు వస్తున్నారు. పొదలకూరు క్రాస్రోడ్డు వద్దకు చేరుకునే సరికి బాలు నిద్రమత్తు కారణంగా బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బాలుకు తీవ్ర గాయాలు కాగా శైలజ స్వల్పంగా గాయపడింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వారికి ప్రథమ చికిత్స చేసి గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చెక్కనగిషీ కళాకారులకు రాయితీపై కలప
ఉదయగిరి రూరల్ : పట్టణంలోని చెక్క నగిషీ కేంద్రంలో పనిచేస్తున్న హస్త కళాకారులకు రాయితీపై అతి తక్కువ ధరకు అవసరమైన కలపను అందిస్తామని ఇన్చార్జి డీఎఫ్ఓ శ్రీకాంత్రెడ్డి తెలిపారు. శనివారం డీసీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రి నుంచి ఉదయగిరితోపాటు రాష్ట్రంలో ఐదు క్లస్టర్ల పరిధిలో ఉన్న ఉడ్ బ్యాంకులను వర్చువల్గా ప్రారంభించారు. రేంజ్ అధికారి కుమార్రాజా, ఇన్చార్జ్ డీఎఫ్ఓ శ్రీకాంత్రెడ్డి ఉడ్ బ్యాంకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ చెక్క నగీషి వస్తువులు తయారు చేసే కళాకారులకు అవసరమైన కర్ర ప్రస్తుతం కొరతగా ఉండడంతో వాటిని అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. కళాకారులు ఎక్కువగా ఉపయోగించే కర్ర అంతరించిపోకుండా రిజర్వు ఫారెస్ట్ల్లో పెంచేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఎఫ్ఆర్ఓ ఆనంద్, డీఆర్ఓ మురళి, ఎఫ్ఎస్ఓలు శ్రీరామరాజు, ఖాజా మహమ్మద్, కేంద్రం నిర్వహకురాలు గౌసియా బేగం, ఎఫ్బిఓలు, ఏబీఓలు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. న్యూట్రిషన్ అండ్ హెల్త్ కేర్ సైన్సెస్లో ప్రవేశాలు నెల్లూరు (టౌన్): తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీలో హోమ్ సైన్స్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ న్యూట్రిషన్ అండ్ హెల్త్ కేర్ సైన్సెస్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విభాగాధిపతి ఆచార్యులు ఎన్.రజని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్లో బైపీసీ లేదా ఎంపీసీ చదివి కనీసం 45 శాతం మార్కులు సాధించిన మహిళా విద్యార్థినులు అర్హులన్నారు. న్యూట్రిషన్ హెల్త్ కేర్ రంగాలకు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా ఈ కోర్సు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు మంచి అవకాశాలను అందిస్తుందన్నారు. కోర్సు పూర్తి చేసిన అనంతరం డైటీషియన్, న్యూట్రినిష్ట్, సీడీపీఓ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ తదితర విభాగాల్లో ఉద్యోగ కెరీర్ అవకాశాలను పొందవచ్చన్నారు. ఆసక్తి ఉన్న మహిళా విద్యార్థినులు ప్రవేశాల కోసం apcfss cap పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రవేశాల కోసం 8374707898, 8985641616, 9550818367 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
కూటమి పాలనలో స్వేచ్ఛ, స్వాతంత్య్రం కనుమరుగు
● వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నెల్లూరురూరల్: నెల్లూరు వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలతో కలిసి కాకాణి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి కాకాణి, పర్వతరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాకాణి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, ఈ రోజు కూటమి పాలనలో ఆ స్వేచ్ఛ, స్వాతంత్య్రం కనుమరుగైందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే, విమర్శించే వారి గొంతు నొక్కుతున్నారని, చట్టాలను అడ్డుపెట్టుకుని కేసులు నమోదు చేస్తూ భావప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు పడ్డాయన్నారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో గ్రామ స్థాయిలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసి పాలనలో సరికొత్త విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు రాజకీయ, సామాజికంగా ప్రాధాన్యత కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. రెడ్బుక్ పాలనకు చరమగీతం పాడాలి: పర్వతరెడ్డి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి లోకేశ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ‘రెడ్బుక్ పాలన’ కారణంగా ప్రజలు స్వాతంత్య్రానికి పూర్వం నాటి చీకటి రోజులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ప్రభుత్వ విధానాలను, అన్యాయాలను ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర పరిస్థితులు బ్రిటిష్ పాలన కంటే దారుణంగా మారాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో చీకటి పాలన తొలగిపోయి వైఎస్సార్సీపీ ప్రభుత్వం తిరిగి రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. జగన్ పాలనలో విద్య, వైద్యం, సంక్షేమంతోపాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత లభించిందన్నారు. పాలకుల ధోరణిలో మార్పు రావాలని, స్వాతంత్య్ర స్ఫూర్తితో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగించాలని కోరారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
● గొంతుపై గాయాలు ● హత్య కోణంలో పోలీసుల విచారణ కోట: మండల పరిధిలోని లక్ష్మక్కకండ్రిగ అరుంధతీయవాడలో శనివారం పల్లాల కోటయ్య (45) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. తెల్లవారుజామున భర్త ఇంట్లో మృతిచెందినట్లు భార్య మంజుల బంధువులకు సమాచారమిచ్చింది. వీధిలో ఓ ఫంక్షన్ ఉండడంతో అక్కడ రాత్రి మద్యం ఎక్కువ సేవించాడని, నిద్రలోనే మృతిచెందినట్లు ఆమె తెలిపింది. అయితే సమయం గడిచే కొద్ది భార్య ప్రవర్తనపై బంధువులకు అనుమానం వచ్చింది. గొంతు వరకు గుడ్డకప్పి ఉంచడం, ఆమె రోధిస్తున్న తీరుపై వారికి అనుమానం కలగడంతో గుడ్డను తొలగించి మృతదేహాన్ని పరిశీలించగా గాయాలు కనిపించాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గూడూరు సీఐ శేఖర్బాబు, ఎస్సై పవన్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. వైరు లేదా తాడు గొంతుకు బిగించి హత్య చేసినట్లు అనుమానం కలగడంతో అతని భార్యను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని కోట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతునికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలంలో క్లూస్టీమ్ ఆధారాలు సేకరించింది. దారుణంగా హత్య చేశారు కోటయ్యను భార్య మంజుల, ఆమె ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసిందని బంధువులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఉన్న ఓ వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఉందని, కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. కొద్దిరోజుల క్రితం ఆమె ప్రియుడు కోటయ్యపై దాడికి కూడా పాల్పడినట్లు బంధువులు ఆరోపించారు. ఇద్దరిని విచారించి అసలు నిజాలు బయటపెట్టాలని కోరారు. మృతుని మామ వెంకటసుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశామని, విచారణలో అన్నీ విషయాలు తెలుస్తాయని ఎస్సై తెలిపారు. -
నిమ్మ మార్కెట్ ఢీలా
● ధరలున్నా దయనీయ పరిస్థితి ● గణనీయంగా తగ్గిన దిగుబడి ● 20 లారీల స్థానంలో మూడింటిలోనే ఎగుమతులుపొదలకూరు: నిమ్మ తోటల్లో కాయల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా నిమ్మకాయలు లూజు(బస్తా) ఒక్కటింటికి రూ.8 వేలు పలుకుతోంది. యార్డు నుంచి సీజన్లో 20 లారీలలో కాయల ఎగుమతులు జరుగుతాయి. ప్రస్తుతం మూడు లారీల కాయలు ఎగుమతి చేసేందుకు కూడా వ్యాపారులు ఆపసోపాలు పడుతున్నారు. యార్డులో వ్యాపారులు, కూలీలకు పెద్దగా పనులు ఉండడం లేదు. సీజన్లో రాత్రి 10 గంటల వరకు కూడా ప్యాకింగ్ చేసి ఎగుమతులు పంపేవారు. కాయల్లేక.. తగ్గిన కూలీలు నిమ్మమార్కెట్ యార్డు చాలా మందికి పనులు కల్పిస్తోంది. ముఖ్యంగా దినసరి కూలీలు ఇక్కడ పనులు చేసుకుని జీవిస్తున్నారు. ప్రతినిత్యం ఇక్కడ 200 మంది కూలీలు దుకాణాల్లో ప్యాకింగ్, కాయల గ్రేడింగ్ తదితర పనుల ద్వారా జీవనం సాగిస్తున్నారు. అయితే ఇప్పుడు కాయల ఎగుమతులు తగ్గిపోవడంతో కూలీలకు సైతం పనులు లేకుండాపోయాయి. ఓ వ్యాపార దుకాణంలో సీజన్లో 30 మంది కూలీలు పనులకు హాజరు అవుతుండగా ప్రస్తుతం ఏడుగురు మాత్రమే వస్తున్నారు. దీనినిబట్టి పరిశీలిస్తే కాయల ఎగుమతులు ఎంతగా తగ్గిపోయాయో అర్థం చేసుకోవచ్చు. యార్డునే నమ్ముకుని జీవించే కూలీలు కూడా ఉన్నారు. బయటి ప్రాంతాల నుంచి పొదలకూరు వచ్చి యార్డులో పనులకు వెళ్తుంటారు. రెండు ప్రాంతాలకే ఎగుమతులు ప్రస్తుతం యార్డు నుంచి కాయలు చైన్నె, బిహార్ ప్రాంతాలకే ఎగుమతులు జరుగుతున్నాయి. చైన్నెకు రెండు లారీలు, బిహార్కు ఒక లారీ కాయలు మాత్రమే ఎగుమతులు జరుగుతున్నట్లు వ్యాపారులు వెల్లడించారు. చైన్నెకు నాణ్యత కలిగిన కాయలను మాత్రమే ఎగుమతి చేయాల్సి ఉంటుందంటున్నారు. బిహార్కు పండిన కాయలు కూడా పంపేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. బిహార్లో కూడా నిమ్మసాగు ఉన్నప్పటికీ ప్రస్తుతం అక్కడ కాయలు లేకపోవడం వల్ల కొంత వరకు డిమాండ్ పెరిగింది. ఢిల్లీ మార్కెట్కు ప్రస్తుతం కాయల ఎగుమతి జరగడం లేదు. అక్కడ వాతావరణ మార్పుల వల్ల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కాయలకు మార్కెట్ లేదు. అయితే ఢిల్లీ మార్కెట్ నిమ్మ ఎగుమతులకు పెట్టింది పేరు.నిమ్మ దిగుబడులు తగ్గడం వల్ల ధరలు పెరిగినా రైతులకు పెద్దగా ఆదాయం లేకుండాపోయింది. అంతేకాక స్థానిక ప్రభుత్వ నిమ్మమార్కెట్ యార్డులో కూలీలకు పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా ఇలాంటి సీజన్లో కాయలకు ధరలు ఉండవు. అయితే ప్రస్తుతం కిలో నిమ్మకాయలు రూ.50 నుంచి రూ.100 ధరలు పలుకుతున్నాయి. అయినా నిమ్మ మార్కెట్ ఢీలా పడుతోంది. -
వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలి
వెంకటాచలం: విద్యార్థులు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగాలని విక్రమసింహపురి యూనివర్శిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు సూచించారు. మండలంలోని కాకుటూరు వద్దనున్న వీఎస్యూలో సస్టైనబుల్ బయో ఇన్నోవేషన్పై హ్యాకథాన్ను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, లైఫ్సైన్సెస్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో విద్యార్థులు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. సమాజానికి, పర్యావరణానికి ఉపయోగపడే సుస్థిర పరిష్కారాలను రూపొందించడంలో యువత కీలకపాత్ర పోషించాలని సూచించారు. పరిశోధన, సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమన్వయం చేసుకుని నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జీ విజయానంద్కుమార్బాబు, డాక్టర్ మేరీ సందీప, డాక్టర్ విద్యాప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తికి వీడ్కోలు
నెల్లూరు (లీగల్): నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గోకవరపు శ్రీనివాస్ విశాఖపట్నం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయనకు వీడ్కోలు సభను నెల్లూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు సత్తు అంకయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస్ కృషితో కోర్టు భవనాల సుందరీకరణ పనులు, పార్కింగ్ సౌకర్యం సాధ్యమయ్యాయని కొనియాడారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ ఇక్కడ బాధ్యతలు నిర్వహించడం సంతోషాన్నిచ్చిందని, కేసుల పరిష్కారంలో సహకారం అందించిన న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. వివిధ కోర్టుల న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నక్కల నాగరాజు, ఉపాధ్యక్షుడు పద్మాకర్, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర జ్వాల రగిలిన గడ్డ
గాంధీజీ పిలుపుతో కదిలి.. ఉప్పు పిడికిలి బిగించి..ఉప్పు కోసం కాదు.. హక్కు కోసం పోరాటం ● ఉమ్మడి నెల్లూరు జిల్లా స్వాతంత్య్ర సంగ్రామంలో వీరుల గాథలు ● గాంధీజీ అడుగులతో పల్లిపాడు నుంచి మైపాడు వరకు ఉద్యమ బాట ● జైళ్లకు వెళ్లిన మహిళలు ● విదేశీ వస్త్రాల దహనం.. బ్రిటిష్ చట్టాలకు బహిరంగ సవాల్ ● నేడు 80వ స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు స్వాతంత్య్రం ఒక రోజులో దక్కిన వరం కాదు. వేలాది మంది త్యాగాలు, జైలు శిక్షలు, లాఠీ దెబ్బలు, ఆస్తుల త్యాగం, కుటుంబాలకు దూరంగా గడిపిన సంవత్సరాల ఫలితం. ఆ మహా పోరాటంలో నెల్లూరు నేలకూ ప్రత్యేకమైన స్థానం ఉంది. గాంధీజీ పిలుపుతో గ్రామాల నుంచి పట్టణాల వరకు ప్రజలు కదిలారు. విదేశీ వస్త్రాలను బహిష్కరించారు. ఖాదీని స్వీకరించారు. పాఠశాలలు, న్యాయస్థానాలను బహిష్కరించే ఉద్యమంలో పాల్గొన్నారు. చివరకు సముద్రపు నీటిని మరిగించి ఉప్పు తయారు చేస్తూ బ్రిటిష్ ఉప్పు చట్టానికే సవాల్ విసిరారు. ఈ ఉద్యమాల్లో పురుషులతో సమానంగా మహిళలు కూడా జైళ్లకు వెళ్లడం నెల్లూరు స్వాతంత్య్ర చరిత్రలో ప్రత్యేక అధ్యాయం. – సాక్షిప్రతినిధి, నెల్లూరుసింహపురి స్వాతంత్య్ర స్ఫూర్తి జ్వాలను రగిలించిన గడ్డ. 1920లో గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమానికి అప్పటి నెల్లూరు జిల్లా విశేష స్పందన చూపింది. 1921లో గాంధీజీ నెల్లూరుకు వచ్చి అహింస, స్వదేశీ, ఖాదీ, మద్యనిషేధం వంటి అంశాలపై ప్రజలను చైతన్యపరిచారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, న్యాయస్థానాల బహిష్కరణకు ప్రజలు ముందుకొచ్చారు. అనేక ప్రాంతాల్లో జాతీయ పాఠశాలలు ఏర్పడ్డాయి. గ్రామాల్లో విదేశీ వస్త్రాల దహనం ఒక ఉద్యమ రూపంగా మారింది. ఈ దశలో రాళ్లపల్లి రామసుబ్బయ్య వంటి నాయకులు ఇంటింటికీ తిరిగి విదేశీ వస్త్రాలను సేకరించి వాటిని బహిరంగంగా దహనం చేయించారు. ఖాదీ నేయడం, స్వదేశీ వస్తువులను వినియోగించడం ప్రజా ఉద్యమంగా మారింది. పల్లిపాడు.. గాంధీ ఆశ్రమానికి నెలవు నెల్లూరు స్వాతంత్య్రోద్యమ చరిత్రలో పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం ఒక కీలక కేంద్రం. పెన్నానది ఒడ్డున ఏర్పడిన ఈ ఆశ్రమం గాంధేయ సిద్ధాంతాలకు, సత్యాగ్రహ శిక్షణకు, ఖాదీ–స్వదేశీ ప్రచారానికి కేంద్రంగా నిలిచింది. గాంధీజీ స్వయంగా 1921లో ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఈ ఆశ్రమం వెనుక పొణక కనకమ్మ వంటి ఉద్యమకారిణుల త్యాగం ఉంది. నెల్లూరు మహిళా చైతన్యానికి ఆమె ఒక ప్రతీకగా నిలిచారు. స్వాతంత్య్రోద్యమంతో పాటు మహిళా విద్య, సామాజిక సేవకు కూడా ఆమె జీవితాన్ని అంకితం చేశారు. జైలు నుంచి వెనక్కి తగ్గని ధీశాలి బొమ్మ శేషురెడ్డి 1920లోనే చదువును వదిలి సహాయ నిరాకరణోద్యమంలోకి వచ్చారు. ప్రభుత్వ ఆదాయానికి దెబ్బకొట్టేలా అబ్కారీ వేలాల బహిష్కరణకు ప్రజలను సమీకరించారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. వ్యక్తిగత సత్యాగ్రహం సందర్భంగా అరైస్టె అలీపూర్ జైల్లో శిక్ష అనుభవించారు. 1942–44 మధ్య కూడా నిర్బంధంలో ఉన్నారు. ఆ సమయంలో తల్లి మరణించిన వార్త తెలిసినా బెయిల్ కోసం ప్రయత్నించకుండా జైలు శిక్షను కొనసాగించారు. ఆశ్రమం, ఖాదీ కేంద్రం నిర్వహించడం, దళిత, గిరిజన విద్యార్థుల కోసం వసతిగృహాలు నిర్వహించడం ఆయన ఉద్యమం సామాజిక సేవలు కొనసాగించారు. ఉప్పు నుంచి క్విట్ ఇండియా వరకు.. బత్తిన రామకృష్ణారెడ్డి 1921లో గాంధీజీ పిలుపుతో చదువును వదిలి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. 1930లో మైపాడు ఉప్పు సత్యాగ్రహంలో చేరి అరెస్టయిన తొలి సత్యాగ్రహుల్లో ఒకరిగా నిలిచారు. వ్యక్తిగత సత్యాగ్రహంలోనూ పాల్గొన్నారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో ఆయన పోరాటం మరింత తీవ్రరూపం దాల్చింది. అల్లూరు పోలీస్స్టేషన్పై దాడి, దహనం చేసే ప్రయత్నానికి నాయకత్వం వహించినందుకు అరైస్టె 1942 నుంచి 1944 వరకు వెల్లూరు, తంజావూరు జైళ్లలో నిర్బంధాన్ని అనుభవించారు. మహిళలూ వెనుకడుగు వేయలేదు నెల్లూరు ఉప్పు సత్యాగ్రహం ప్రత్యేకతల్లో మహిళల భాగస్వామ్యం ఒకటి. ఒరుగంటి మహాలక్ష్మమ్మ, పొణక కనకమ్మ వంటి మహిళలు మైపాడు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఉప్పు తయారు చేసి చట్టాన్ని ధిక్కరించడమే కాకుండా అరెస్టులకు సిద్ధపడ్డారు. కనకమ్మ నాయకత్వంలో సుమారు 20 మంది మహిళలు జైలు శిక్ష అనుభవించినట్లు కేంద్ర ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ఇది అప్పటి కుటుంబ, సామాజిక పరిమితులను దాటి మహిళలు బహిరంగంగా బ్రిటిష్ ప్రభుత్వాన్ని సవాల్ చేసిన ఘట్టం. జైళ్లు నిండినా.. ఉద్యమం ఆగలేదు ఉప్పు సత్యాగ్రహం సందర్భంగా నెల్లూరు జిల్లాలో అరెస్టుల పరంపర కొనసాగింది. ఉద్యమకారులకు ఆశ్రయం ఇచ్చినందుకు ఉదయగిరికి చెందిన అనంతాచార్యులు జైలుకు వెళ్లారు. బ్రిటిష్ ప్రభుత్వం కొందరు రైతుల భూములను కూడా స్వాధీనం చేసుకుంది. జిల్లా స్థాయి అధికారులకు వ్యతిరేకంగా ప్రజా నిరసనలు, రాజీనామాలు చోటుచేసుకున్నాయి. మన్నెపల్లి హనుమంతరావు నెల్లూరులోని తిప్పరాజువారి సత్రం గోడపై ‘నలభై వేల మంది జైళ్లలో ఉన్నారు’ అనే సందేశాన్ని రాసినందుకు అరెస్టయ్యారు. బ్రిటిష్ పాలకుల కళ్లముందే స్వాతంత్య్ర నినాదాన్ని గోడలపై రాసేంతగా ఉద్యమ స్ఫూర్తి ప్రజల్లో పెరిగింది. ఇది కొందరి చరిత్ర కాదు నెల్లూరు స్వాతంత్య్ర సంగ్రామాన్ని పరిశీలిస్తే గ్రామీణ రైతు నుంచి మహిళ వరకు, విద్యార్థి నుంచి న్యాయవాది వరకు, ఖాదీ నేసే వ్యక్తి నుంచి జైలు శిక్ష అనుభవించిన నాయకుడి వరకు అనేక వర్గాలు ఇందులో భాగస్వాములయ్యాయి. పల్లిపాడు ఆశ్రమం శిక్షణ ఇచ్చింది. మైపాడు సముద్రతీరం ఉప్పు సత్యాగ్రహానికి వేదికై ంది. నెల్లూరు వీధులు విదేశీ వస్త్రాల దహనాన్ని చూశాయి. గ్రామాలు స్వదేశీ, ఖాదీ నినాదాలతో మార్మోగాయి. జైళ్లు సత్యాగ్రహులతో నిండాయి. మరుగునపడిన వీరులెందరో.. ఈ నేలపై స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిలో కొందరి పేర్లు మాత్రమే నేటి తరానికి తెలుసు. మరెందరో చరిత్ర పుటల్లో చిన్న అక్షరాలుగా మిగిలిపోయారు. వారి జీవితాలు, జైలు శిక్షలు, త్యాగాలు, కుటుంబాల బాధలు, ఉద్యమ అనుభవాలు పాఠశాలలు, కళాశాలలు, ప్రజా గ్రంథాలయాలు, స్థానిక చరిత్ర పుస్తకాల ద్వారా కొత్త తరానికి చేరాల్సిన అవసరం ఉంది. నెల్లూరు నేల నుంచి జాతీయ చరిత్రకు.. కనకమ్మ.. మహిళా చైతన్యానికి ప్రతిరూపం పొణక కనకమ్మ పేరు నెల్లూరు స్వాతంత్య్ర చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోతుంది. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్న ఆమె 1930 ఉప్పు సత్యాగ్రహంలోనూ చురుకై న పాత్ర పోషించారు. మైపాడులో ఉప్పు చట్టాన్ని ధిక్కరించిన ఉద్యమంలో మహిళలను ముందుకు నడిపించారు. ఆమె నాయకత్వంలో సుమారు 20 మంది మహిళలు జైలుకు వెళ్లినట్లు కేంద్ర ప్రభుత్వ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ రికార్డులు పేర్కొంటున్నాయి. కనకమ్మ సేవ కేవలం రాజకీయ పోరాటానికే పరిమితం కాలేదు. మహిళా విద్యకు ప్రాధాన్యం ఇస్తూ నెల్లూరులో కస్తూరిదేవి విద్యాలయం స్థాపించారు. స్వాతంత్య్ర పోరాటం అంటే కేవలం బ్రిటిష్ పాలనను ఎదురించడం మాత్రమే కాదు.. సమాజాన్ని లోపల నుంచి మార్చడంలో ఆమె జీవితం త్యాగం చేసింది. నెల్లూరు ప్రాంతంతో విడదీయరాని అనుబంధం ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు స్వాతంత్య్రోద్యమంలోనూ పాల్గొన్నారు. 1930 ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారు. 1941–42 మధ్య వ్యక్తిగత సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని పలుమార్లు జైలు శిక్ష అనుభవించారు. గాంధీజీకి అత్యంత నిబద్ధుడైన అనుచరుడిగా ఆయన గుర్తింపు పొందారు. స్వాతంత్య్రం అనంతరం కూడా సామాజిక సమానత్వం కోసం ఆయన పోరాటం కొనసాగింది. నెల్లూరులోని మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయంలో దళితులకు ప్రవేశం కల్పించాలనే డిమాండ్తో ఆయన నిరాహార దీక్ష చేసి వారికి ప్రవేశాన్ని కల్పించారు. స్వాతంత్య్ర పోరాటం తర్వాత భాషాప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం ఆయన ఆమరణ దీక్ష చేపట్టి ప్రాణాలు విడిచారు. 1930లో గాంధీజీ ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిచ్చినప్పుడు నెల్లూరు జిల్లా మరోసారి ఉద్యమ కేంద్రంగా మారింది. పల్లిపాడు సత్యాగ్రహ ఆశ్రమం ఉద్యమకారులకు శిక్షణా కేంద్రంగా పని చేసింది. 1930 మార్చి 22న సత్యాగ్రహ వలంటీర్లు సమావేశమై ఉద్యమ కార్యాచరణను రూపొందించారు. అనంతరం మైపాడు ప్రధాన కేంద్రంగా ఉప్పు చట్టాన్ని ధిక్కరించే కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఒరుగంటి వెంకట సుబ్బయ్య ఉద్యమానికి ముఖ్య నిర్వాహకుడిగా వ్యవహరించారు. బెజవాడ గోపాలరెడ్డి, వేమూరు లక్ష్మయ్య, లేబూరు సుబ్బరామిరెడ్డి, ఒరుగంటి మహాలక్ష్మమ్మ, పొణక కనకమ్మ, బొమ్మ శేషురెడ్డి, బత్తిన రామకృష్ణారెడ్డి, దువ్వూరు బాలరామిరెడ్డి తదితరులు ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. మైపాడు తీరంలో మహిళలు అలంకరించిన కుండల్లో సముద్రపు నీటిని తీసుకొచ్చి మరిగించి ఉప్పు తయారు చేశారు. తయారైన ఉప్పును బహిరంగంగా విక్రయించి బ్రిటిష్ చట్టాన్ని సవాల్ చేశారు. మైపాడుతో పాటు గోగులపల్లి, తుమ్మలపెంట, తడ, సూళ్లూరుపేట, నాయుడుపేట తదితర ప్రాంతాల్లోనూ ఉప్పు చట్టాన్ని ధిక్కరించే కార్యక్రమాలు సాగాయి. -
స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబు
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలోని పోలీసు కవాతు మైదానం శనివారం జరిగే 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబైంది. పోలీసు వందనం స్వీకరణ, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల వేడుకల సన్నాహక ఏర్పాట్లను పరిశీలించారు. కవాతు రిహార్సల్స్ను వీక్షించి భద్రతాపరంగా తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు. వేడుకలను ఎలాంటి లోపాలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని, ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, ఏఆర్ ఏఎస్పీ అప్పారావు, నెల్లూరు రూరల్, డీటీసీ, మహిళా, ఏఆర్ డీఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, గిరిధర్, కె.వేమారెడ్డి, చంద్రమోహన్, సీఐలు, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు. -
మద్యం తాగేందుకు డబ్బులివ్వలేదని..
● భర్త ఆత్మహత్య చిల్లకూరు: మద్యం తాగేందుకు భార్య నగదు ఇవ్వలేదని భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఓడూరు గ్రామ సమీపంలోని నిమ్మతోటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తోటపల్లిగూడూరు మండలం వరిగొండ గ్రామానికి చెందిన యాకసిరి విజయ్కుమార్ (26), భార్యతో కలిసి కొంతకాలంగా చిల్లకూరు మండలంలోని ఓడూరు గ్రామంలో మునిరెడ్డి అనే రైతు నిమ్మతోటలో పనికి కుదిరాడు. ఈ క్రమంలో గురువారం తన భార్యను మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వాలని పట్టుబట్టడంతో ఆమె నిరాకరించింది. దీంతో తోటలో నిమ్మచెట్లకు తెచ్చిన పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అతడిని గూడూరు చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా నిరసన చిల్లకూరు: కూటమి ప్రభుత్వం వీధికొక బెల్ట్ దుకాణం ఏర్పాటు చేసి సంసారాలు గుల్ల చేస్తోందని మోమిడికి చెందిన మహిళలు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ గతంలో గ్రామంలో మద్యం బాటిల్ కనిపించేది కాదన్నారు. నేడు ఒక వీధిలో రెండు బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తున్నారన్నారు. అనేకమంది తమ సంపాదనను మద్యంకే ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. దీంతో ఇళ్లు గడవడం కష్టతరంగా మారుతోందన్నారు. పలుమార్లు ఎకై ్సజ్ అధికారులకు ఫోన్లు చేసినా కనీసం తనిఖీలు కూడా చేపట్టడం లేదన్నారు. నిర్వాహకుల వద్దకు వెళ్లి విక్రయాలు ఆపేయాలని కోరితే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.100 సన్నవి : రూ.50 పండ్లు : రూ.25 -
కోట గురుకులం మూసివేత దారుణం
● కలెక్టరేట్ ఎదుట ధర్నా నెల్లూరురూరల్: కోట మండలంలోని ఎస్సీ గురుకుల పాఠశాలను మూసివేసి విద్యార్థులను ఖాళీ చేయించడం దారుణమని వివిధ సంఘాల నాయకులు అన్నారు. ఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు వీరంరెడ్డి సురేష్రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఆశ్రిత్ రెడ్డి ఈ కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థుల సంక్షేమం కోసం ఎంత దూరమైనా పోరాటం చేస్తామన్నారు. అనంతరం విద్యార్థి నాయకులు మాట్లాడుతూ సుమారు 40 సంవత్సరాలుగా కొనసాగుతున్న గురుకుల పాఠశాలలో 600 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. గత నెల 18వ తేదీన తల్లిదండ్రులకు ఫోన్ చేసి తమ పిల్లలను వెంటనే తీసుకెళ్లాలని సమాచారం ఇచ్చారన్నారు. 19వ తేదీన పాఠశాలను పూర్తిగా ఖాళీ చేయించారని ఆరోపించారు. 10.5 ఎకరాల స్థలాన్ని ‘ఐఐటీ’ పేరుతో కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకే ఈ చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. నారా లోకేశ్, టీడీపీ ప్రభుత్వం పేదపిల్లల్ని విద్యకు దూరం చేసే కుట్రకు పాల్పడుతోందని విమర్శించారు. విద్యార్థుల పట్ల ఇలాంటి అనైతిక విధానాలను కొనసాగిస్తే రానున్న రోజుల్లో నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నగరాధ్యక్షుడు చంద్రారెడ్డి, నాయకులు హేమంత్, వర్షిత్, మిషాక్, అలీ, రియాజ్, ఐఎస్ఎఫ్ నాయకులు పవన్, జశ్వంత్, అబ్బు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలో జెడ్పీటీసీ సభ్యుడి చేరిక
చిల్లకూరు: చిల్లకూరు జెడ్పీటీసీ సభ్యుడు మన్నెం శీనయ్య శుక్రవారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి సమక్షంలో తన అనుచర గణం సుమారు 200 మందితో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య పరిచయ వేదిక మోమిడిలో నిర్వహించిన కార్యక్రమంలో తన అనుచరులతో కలిసి శీనయ్య వైఎస్సార్సీపీలోకి అడుగు పెట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగుజాడల్లో రాజకీయాల్లో కొనసాగాలని చేరుతున్నట్లు తెలిపారు. అనంతరం కాకాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోని ఎంతోమంది ఆయా పార్టీలను వీడేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. శీనయ్యకు సముచిత స్థానం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇండియా పోస్ట్ ద్వారా రాఖీలు పంపండి నెల్లూరురూరల్: రక్షాబంధన్ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు విదేశాల్లో నివసిస్తున్న సోదరులకు రాఖీలు, రాఖీ కవర్లు, బహుమతులను పంపేందుకు ఇండియా పోస్ట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు నుంచి దేశీయ గమ్యస్థానాలకు స్పీడ్ పోస్ట్ ద్వారా, విదేశాలకు ఐటీపీఎస్/స్పీడ్ పోస్ట్ సేవల ద్వారా పంపించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ సేవలకు ట్రాకింగ్ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. చివరి నిమిషంలో కాకుండా రాఖీలను ముందుగానే బుక్ చేసుకోవాలని సూచించారు. విదేశాలకు రాఖీలు పంపే వారు సంబంధిత పోస్టల్, కస్టమ్స్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలియజేశారు. పొట్టు ట్రాక్టర్ను ఢీకొన్న టిప్పర్ ● ముగ్గురికి గాయాలు వెంకటాచలం: పొట్టు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి టిప్పర్ ఢీకొనడంతో ముగ్గురు గాయపడిన ఘటన మండలంలోని సర్వేపల్లి సమీపంలో కృష్ణపట్నం రోడ్డుపై శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. సర్వేపల్లి నుంచి కృష్ణపట్నం పోర్టు వైపు వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ పల్టీలు కొట్టి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్తోపాటు టిప్పర్లో ఉన్న డ్రైవర్లు మణి, రాజేష్ గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్ను పక్కకు తొలగించారు. వైఎస్సార్సీపీలో పలువురికి పదవులునెల్లూరురూరల్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పలువురిని రాష్ట్ర, జిల్లా, సిటీ అనుబంధ విభాగాల కమిటీల్లో వివిధ హోదాలలో నియమిస్తూ శుక్రవారం కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఎస్సీ సెల్ కమిటీ సెక్రటరీగా నెల్లూరు నగర నియోజకవర్గానికి చెందిన ఊటుకూరు నాగార్జున, జిల్లా యువత అధ్యక్షుడిగా డాక్టర్ మేరిగ రేవంత్ చక్రవర్తి నియమితులయ్యారు. -
జెండా పండగకు ముస్తాబు
నెల్లూరు(అర్బన్): జెండా పండగకు జిల్లా ముస్తాబైంది. కలెక్టరేట్తో పాటు ప్రభుత్వ కార్యాలయాలను మువ్వన్నెల దీపాలతో శోభాయమా నంగా అలంకరించారు. నెల్లూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో శనివారం జరగనున్న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9గంటలకు కార్యక్రమాలు మొదలు కానున్నాయి. మంత్రి నారాయణ పోలీసు వందనం స్వీకరించి ఉపన్యసించనున్నారు. జిల్లా అభివృద్ధిపై శకటాలు ప్రదర్శించనున్నారు. జిల్లాలో సంవత్సర కాలంలో విశిష్ట సేవలందించిన వివిధ శాఖలకు చెందిన 501 మంది సిబ్బందిని గుర్తించి పురస్కారాలకు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ జాబితా తెల్లారేసరికి పెరిగే అవకాశం ఉంది. చిత్తశుద్ధితో, నిజాయతీతో పని చేసేవారికి మాత్రమే కలెక్టర్ అవార్డులు ప్రకటించాలి. అయితే సిఫార్సులకు ఒకే చెప్పాల్సి రావడంతో అవార్డులకు జంబో లిస్టు తయారైందని పలువురు ఉద్యోగులు విమర్శిస్తున్నారు. కాగా 30 మంది జిల్లా అధికారులకు అవార్డులు దక్కాయి. అందులో ఎస్పీ అజిత వేజెండ్ల, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, ఏపీ మారిటోరియం బోర్డు, కావలి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్, ఆత్మకూరు ఆర్డీఓ పావని, సోమశిల ప్రాజెక్ట్ ల్యాండ్ అక్విజిషన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటరెడ్డి, తెలుగుగంగ పీఏ టు స్పెషల్ కలెక్టర్ కేశవర్ధన్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారిణి వసుమతి, జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి, ఎన్టీఆర్ వైద్యసేవా జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ సుధీర్కుమార్ తదితరులు ఉన్నారు. సేవా రంగం పేరుతో కార్పొరేట్ యాజమాన్యాలతో పాటు పలువురు ప్రైవేట్ వ్యక్తులకు అవార్డులు దక్కాయి. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి త్రివర్ణ దీపకాంతుల్లో మెరిసిన కలెక్టరేట్ 501 మందికి విశిష్ట సేవా పురస్కారాలు -
ఏఆర్ డీఎస్పీకి ‘ఎంఎస్ఎం’
నెల్లూరు(క్రైమ్): పోలీస్ శాఖలో సుదీర్ఘకాలంగా విధులుగా నిర్వహిస్తున్న నెల్లూరు ఏఆర్ డీఎస్పీ ఎస్.చంద్రమోహన్ అత్యున్నతమైన మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ (ఎంఎస్ఎం) వరించింది. విడవలూరుకు చెందిన చంద్రమోహన్ 1992లో ఆర్ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. 2008లో ఆర్ఐగా, 2022లో డీఎస్పీగా పదోన్నతి పొందారు. 2024 నవంబర్ నుంచి నెల్లూరు ఏఆర్ డీఎస్పీగా పనిచేస్తున్నారు. విశాఖ రూరల్ జిల్లాలో పనిచేసే సమయంలో నిషేధిత సామాజిక వ్యతిరేక శక్తుల కదలికలను నియంత్రించడంలో కీలకపాత్ర పోషించారు. పనిచేసిన ప్రతిచోటా సిబ్బంది సంక్షేమానికి తనవంతు కృషిచేశారు. ఆయన సేవలకు 2017లో సేవా పతకం, 2022లో ఉత్తమ సేవా పతకం, 22 నగదు బహుమతులు, 38 జీఎస్ఈ (గుడ్ సర్వీస్ ఎంట్రీ), ఒక ఎంఎస్ఈ (మెరిటోరియస్ సర్వీస్ ఎంట్రీ), 30 ప్రశంసాపత్రాలు, ఇతర పురస్కారాలు లభించాయి. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎం ప్రకటించింది. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. -
బతుకుదారిలో మృత్యుగుంత
చిల్లకూరు: మామిడి తోటలో దుక్కి దున్నేందుకు వచ్చిన తండ్రీ కొడుకులు ఇద్దరు చీకట్లో తోట వద్దకు వెళ్లే సమయంలో ట్రాక్టర్ బోల్తాపడి తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా కొడుకు తీవ్రగాయలతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ విషాద ఘటన మండలంలోని కడివేడు చెరువు సమీపంలో గురువారం వేకువజామున జరిగింది. పోలీసుల సమచారం మేరకు.. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మేదరకాలనీకి చెందిన పోట్లూరి రమణయ్య (50), ఆయన కుమారుడు పోట్లూరి శీనయ్య (29) రెండు రోజుల క్రితం కడివేడులోని ఓ మామిడి తోటలో ట్రాక్టర్తో దుక్కి దున్నేందుకు వచ్చారు. ఇక్కడ పనులు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తండ్రీ కొడుకులు ఇద్దరు బుధవారం రాత్రి కడివేడుకు ట్రాక్టర్లో వచ్చి వేకువ జామున తోట వద్దకు వెళుతుండగా చెరువు సమీపంలో ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలోకి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ కింద ఇద్దరు పడి బయటకు రాలేని స్థితిలో ఉండగా శీనయ్య అత్యవసర సర్వీస్ 112కు సమాచారమిచ్చాడు. దీంతో వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయిన ఇద్దరిని బయటకు తీయగా అప్పటికే తండ్రి రమణయ్య మృతి చెందాడు. కుమారుడు శీనయ్య తీవ్ర గాయాలతో ఉండడంతో 108 ద్వారా అతన్ని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యంలో మృతి చెందాడు. వారి వద్ద ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా ప్రమాద విషయం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రమణయ్య శీనయ్య ట్రాక్టర్ బోల్తా .. తండ్రీకొడుకుల దుర్మరణం కళ్ల ముందే ఆగిన తండ్రి ఊపిరి ఆఖరి శ్వాస వరకు పోరాడిన కుమారుడు కూలి పనుల కోసం వచ్చి విషాదం పొట్టకూటి కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటూ, చెమట చుక్కలను నమ్ముకున్న ఆ శ్రమజీవుల పాలిట కారు చీకట్ల వేకువే కాళరాత్రయింది. చీకటిని చీల్చుకుంటూ వెళ్తున్న ఆ తండ్రీకొడుకుల ప్రయాణం.. ఊహించని గుంత రూపంలో మృత్యువై ఎదురొచ్చి అర్ధాంతరంగా నూరేళ్ల జీవితాన్నే చీకటి మయం చేసింది. కన్నతండ్రి కళ్లముందే ఊపిరొదిలితే, అపార వేదనతో ఆఖరి శ్వాస వరకు పోరాడిన ఆ కొడుకు ఆర్తనాదం నిశీధి నిశ్శబ్ధంలో కలిసిపోయింది. ఈ దారుణ విషాదం.. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. -
పొగాకు రైతుకు రూ.50 వేల వరకు వడ్డీలేని రుణం
మర్రిపాడు: 2026–27 పంట కాలానికి ఎఫ్సీవీ పొగాకు రైతులకు ఒక బ్యారన్కు రూ.50 వేల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు వేలం నిర్వహణాధికారి జి సునీల్కుమార్ గురువారం తెలిపారు. పంట అవసరాల కోసం ఈ రుణాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. జీపీఏ, బ్యారెన్ ఇన్సూరెన్స్ చెల్లించిన రైతులకు మాత్రమే రుణం వర్తిస్తుందని తెలిపారు. రుణం కోసం బ్యాంక్ పాస్బుక్ కాపీ, పొగాకు బోర్డు పుస్తకం రెండు వైపుల జిరాక్స్, ఇద్దరు హామీదారుల బోర్డు పుస్తకాల రెండు వైపుల జిరాక్స్ సమర్పించాలని సూచించారు. సంబంధిత పత్రాలతో ఫీల్డ్ సూపర్ వైజర్ను సంప్రదించాలని కోరారు. ఒక రైతు గరిష్టంగా ఇద్దరు రైతులకు మాత్రమే హామీ సంతకం చేయాల్సి ఉంటుందని తెలిపారు. బ్యారెన్ లీజుకు తీసుకున్న రైతులు రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే యజమాని కూడా సంతకం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అర్హత ఉన్న పొగాకు రైతులు ఈ రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జి సునీల్కుమార్ సూచించారు. సమ్మెను ఆపే ప్రసక్తే లేదు ● జూనియర్ డాక్టర్లు ● రోగులకు తప్పని తిప్పలు నెల్లూరు(అర్బన్): తమ డిమాండ్లు తీర్చే వరకు సమ్మెను ఆపే ప్రసక్తే లేదని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హనీష్కుమార్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం నెల్లూరు సర్వజన ఆస్పత్రి వద్ద జూనియర్ డాక్టర్లు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా హనీష్కుమార్ మాట్లాడుతూ తాము కోరేవి చాలా చిన్న డిమాండ్లు అని అన్నారు. ఇందుకు ప్రభుత్వం ఒప్పుకోకపోవడం బాధాకరమన్నారు. రోగుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని అత్యవసర వైద్యసేవలకు హాజరవుతున్నామన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించకపోతే అన్ని రకాల ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపేస్తామన్నారు. సుమారు 200 మందికిపైగా జూనియర్ డాక్టర్లు సమ్మెలో ఉన్నారు. దీంతో సాధారణ సేవలకు ఆటంకాలు, వైద్యసేవలు ఆలస్యమవుతున్నా యి. రాత్రి డ్యూటీలు ఆపేస్తే రోగులకు మరింత ఇబ్బందిగా మారుతోంది. అందువల్ల ప్రభుత్వం తక్షణమే డిమాండ్లు అంగీకరించి సమ్మెను విరమింపజేయాలని రోగులతో పాటు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమ్మెలో భావన, భార్గవ్, సాయి, కీర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 82,800 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 27,525 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.68 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
అర్హులందరికీ న్యాయం జరిగేలా చేస్తాం
● కలెక్టర్ హిమాన్షు శుక్లా మనుబోలు: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ న్యాయం జరిగేలా చూస్తామని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలెదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు గురువారం మనుబోలుతో ‘పల్లె వీక్షణ’ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆర్ఎస్కేలు, చెత్త సంపద కేంద్రం, సచివాలయాలను పరిశీలించి వాటి పనితీరును సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ అధికారులందరూ సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని సూచించారు. జలధార–జలహారతి కార్యక్రమాన్ని వీబీజీ రామ్జీ కార్యక్రమంతో అనుసంధానం చేసుకుని ఫీడర్ చానల్స్, కాలువల్లో పేరుకుపోయిన పూడికి, చెత్త, పాచి తొలగింపు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఎల్నినోని కారణంగా తలెత్తే నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు రైతులు ప్రత్యామ్నాయంగా పాడి, మెట్ట పంటలు సాగు చేసుకునేలా వ్యవసాయ శాఖ ద్వారా చాంపియన్ ఫార్మర్స్ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు. మనుబోలు మండలంలో శ్యామ్ స్టీల్ పరిశ్రమ ఏర్పాటు కానుందని తెలిపారు. పాడుబడిన అండర్ టన్నెల్ పునరుద్ధరణకు రూ.1.67 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. డేగపూడి–బండేపల్లి కాలువ మిగిలిపోయిన పనులను త్వరలో పూర్తి చేస్తామన్నారు. వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలకు సంబంధించి సాంకేతిక సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు. -
కొట్టేదానికి వచ్చారు.. కట్టబెట్టేశారు..
నెల్లూరు (బారకాసు): రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని మంత్రి నారాయణకు కట్టబెట్టేందుకు అత్యవసరంగా కౌన్సిల్ సమావేశం పెట్టించారు. రూ.కోట్లు విలువైన ప్రభుత్వ భూమిని మంత్రి ఆక్రమిస్తే కొన్నేళ్లుగా ఆయన స్వాధీనంలో ఉందంటూ జీఓల ఆధారంగా అధికారికంగా ఆ భూమిని మార్కెట్ వాల్యూకు అప్పగించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని కౌన్సిల్ సమావేశంలో పెట్టడం సిగ్గు చేటంటూ 13వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున నిలదీశారు. ప్రశ్నించిన ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై ఫిరాయింపు కార్పొరేటర్లు విరుచుకుపడ్డారు. నిగ్గదీసిన వారిని కొట్టేందుకు వచ్చారు. ప్రజాసమస్యలు, తమ అభిప్రాయాలు చెప్పనీయకుండా గొంతు నొక్కేశారు. చివరకు చర్చ లేకుండానే.. ఆల్ పాస్తో మంత్రి నారాయణకు మద్దతుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని ఏపీజే అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో బుధవారం మేయర్ దేవరకొండ సుజాత అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సంపద సృష్టి అంటే ప్రజలపై భారం మోపడమా? 21వ డివిజన్ కార్పొరేటర్ మొయిళ్లగౌరి మాట్లాడుతూ.. పారిశుధ్య సిబ్బంది కొరత, దోమల నివారణలో వైఫల్యం, చెత్త సేకరణలో లోపాలపై అధికారుల తీరును తప్పుబట్టారు. ప్రజలకు విద్య, వైద్యం, రవాణా, తాగునీరు వంటి మౌలిక సేవలకు యూజర్ చార్జీలు వసూలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రజలపై అదనపు భారం మోపడమేనన్నారు. ప్రజలకు మౌలిక సదుపాయాలకు సంబంఽధించి విద్య, వైద్యం, రవాణా, తాగునీరు వంటి 16రకాలసేవలను ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచి యూజర్ చార్జీలు కలెక్ట్ చేసే ఉత్తర్వులు దారణమన్నారు. 29వ డివిజన్ కార్పొరేటర్ ఎస్కే సత్తార్ మాట్లాడుతూ.. ఫుట్పాత్లు, రోడ్లు ఆక్రమించి పెద్ద పెద్ద భవనాలు, షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మిస్తున్నా వాటి జోలికి వెళ్లకుండా ఎండకు ఎండుతూ, వానకు తడస్తూ రోడ్డు వెంబడి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే పేదల కడుపు కొట్టడం దారుణమన్నారు. 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ తన డివిజన్లో అభివృద్ధి పనులు తనకు తెలియకుండానే జరుగుతున్నాయని అభ్యంతరం వ్యక్తం చేశారు. కో–ఆప్షన్ సభ్యుడు నూనె మల్లికార్జునయాదవ్ నగరంలో రోడ్లు, ఫుట్పాత్లు, డ్రైన్ల ఆక్రమణలపై అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని మేయర్కు వినతిపత్రం అందజేశారు. సమావేశంలో పలువురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మద్దినేని మస్తానమ్మ, మొగళ్లపల్లి కామక్షిదేవి, వేనాటి శ్రీకాంత్రెడ్డి, షేక్ ఫామీదా, గుంజి జయలక్ష్మి, నీలి రాఘవరావుతోపాటు పలువురు ఫిరాయింపు కార్పొరేటర్లు, కో–ఆప్షన్ సభ్యులు, ఎన్ఎంసీలోని అన్ని విభాగాధిపతులు పాల్గొన్నారు. మంత్రి నారాయణకు రూ.కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం అప్పగింతకు గ్రీన్ సిగ్నల్ అభ్యంతరం వ్యక్తం చేసిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై ఫిరాయింపు కార్పొరేటర్ల దౌర్జన్యం ప్రజా సమస్యలపై మాట్లాడనీయకుండా గొంతు నొక్కిన వైనం చర్చలేకుండానే అజెండాలోని అంశాలన్ని ఆల్పాస్ కార్పొరేటర్ల మధ్య ఆద్యంతం రగడ అజెండాలోని 150 అంశాలను సెక్రటరీ శ్రీలక్ష్మి చదివి వినిపించారు. అయితే 116వ అంశాన్ని చదువుతుండగా కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున తన డివిజన్ పరిధిలో రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి మంత్రి నారాయణ అధీనంలో ఉందంటే కబ్జా చేసినట్లు కాదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూమిని మంత్రికి సంబంధించిన సంస్థకు తక్కువ ధరకు ఎలా అప్పగిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జునకు తోడుగా పలువురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు నిలిచారు. దీంతో పలువురు ఫిరాయింపు కార్పొరేటర్లు ఒక్కసారిగా తమ మంత్రినే విమర్శిస్తావా అంటూ దౌర్జన్యానికి దిగారు. వైఎస్సార్సీపీ, ఫిరాయింపు కార్పొరేటర్ల మధ్య ఆద్యంతం రగడ చోటు చేసుకుంది. ఓ దశలో మేయర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో కమిషనర్ నందన్ జావాబిస్తూ మంత్రి నారాయణ సంస్థ అధీనంలో ఉన్న స్థలం ఇరిగేషన్కు సంబంధించిందని కార్పొరేషన్కు ఎలాంటి సంబంధం లేదని, ఏదైనా అభ్యంతరం ఉంటే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో మాట్లాడుకోవాలని లేదంటే కోర్టుకై నా వెళ్లండంటూ చెప్పారు. అయితే ప్రభుత్వానికి సంబంధించిన భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తెలియజేస్తూ కోర్టు ఇచ్చిన గైడ్లైన్స్కు సంబంధించిన కాపీని కమిషనర్కు అందజేశారు. చివరకు 116 అంశానికి సంబంధించి వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల వ్యతిరేకించినప్పటికీ.. ఫిరాయింపు కార్పొరేటర్ల బలం ఉండడంతో ఆమోద ముద్ర వేసుకున్నారు. -
కూటమి వచ్చాక.. మరింతగా..!
దేవస్థానానికి సంబంధించిన దుకాణాలు ప్రధాన రహదారికి ముఖ ద్వారాలుగా ఉన్నాయి. దీంతో ప్రతి షాపు నుంచి పన్నులను మున్సిపాల్టీకి చెల్లించాల్సి ఉంది. అయితే అధికార పార్టీకి చెందిన పాలకమండలి పగ్గాలు చేపట్టాక, ఇది నిలిచిపోయింది. ఫలితంగా గ్రూప్ దేవస్థానాల కార్యాలయంతో పాటు దుకాణాలను ఏప్రిల్లో మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. అప్పట్లో బకాయిలను యజమానులే చెల్లించి వ్యాపారాలను నిర్వహించుకున్నారు. విద్యుత్ బిల్లులను సైతం చెల్లించకపోవడంతో కార్యాలయానికి సరఫరాను నిలిపేశారు. రూ.లక్షల్లో ఆదాయమొస్తున్నా, ఇలా వ్యవహరిస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. లీజులు.. ఆపై సబ్ లీజులు దేవస్థాన దుకాణాల కాంప్లెక్స్లో అసలు లీజుదారులు ఎప్పుడో కనుమరుగయ్యారు. మరో వైపు వీటికి దక్కించుకున్న వారు రూ.లక్షలను తీసుకొని సబ్ లీజులకు ఇస్తున్నారు. పాలక మండలితోపాటు ఈఓకు ఈ విషయం తెలిసినా, ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. పైగా అనధికార వ్యక్తులకు రూ.పది వేల నుంచి రూ.15 వేల వరకు అద్దె చెల్లించేలా ఒప్పందాలు చేసుకున్నారు. ఈ మొత్తాన్ని ఇవ్వలేకపోతున్నామంటూ ఎవరైనా వస్తే వెంటనే షాపులకు బేరం పెట్టి మరొకరికి రూ.లక్షల్లో విక్రయిస్తున్నారు. తమ వాటాను తీసుకొని పబ్బం గడిపేస్తున్నారు. ఈ విషయమై ఈఓను సంప్రదించగా, దుకాణాలను తొలిగా ఎవరికి కేటాయించారో వారే ఉన్నారని, అయినా దృష్టి సారిస్తామని బదులిచ్చారు. -
కలెక్టర్ వచ్చారు.. వెళ్లారు
కలెక్టర్ హిమన్షు శుక్లా తొలిసారిగా ఏప్రిల్ 15న ఆత్మకూరు మండలం బోయలచిరివెళ్లలో పల్లెవీక్షణ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జగనన్న కాలనీవాసులు తమ సమస్యలను కలెక్టర్కు విన్నవించారు. ప్రధానంగా రోడ్డు, తాగునీటి సౌకర్యాలను కల్పించాలని విన్నవించారు. బోయలచెరివెళ్ల సమీపంలో 67వ నంబరు జాతీయ రహదారి ఉంది. జాతీయ రహదారి పక్కనున్న తారురోడ్డు నుంచి సుమారు కి.మీ. దూరం ఉన్న జగనన్న కాలనీ వరకు సిమెంట్ రోడ్డు నిర్మించి రాకపోకల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. కాలనీలో అసంపూర్తిగా నిలిచిపోయిన జల్జీవన్ మిషన్ పనులు పూర్తిచేయించి తాగునీటిని అందించాలని కోరారు. అయితే కలెక్టర్ వచ్చి వెళ్లి నాలుగు నెలలు గడిచినా ఏ సమస్యలకు పరిష్కారం లభించకపోవడంపై కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరే పట్టించుకోకపోతే ఇక అధికారులు ఏమి స్పందిస్తారని వాపోతున్నారు. -
మర్యాదపూర్వకంగా..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మేరిగ మురళీధర్ మర్యాదపూర్వకంగా బుధవారం కలిశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ అభ్యంతరాలను రేపటిలోపు తెలియజేయాలి నెల్లూరు (టౌన్): జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న ఆరు పోస్టులకు రోస్టర్ వారీగా మెరిట్ జాబితాను deonellore.50webs.comలో పొందుపర్చామని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే సంబంధిత డాక్యుమెంట్ల జిరాక్స్లను నగరంలోని సమగ్రశిక్ష కార్యాలయంలో గురు, శుక్రవారాల్లో అందజేయాలని కోరారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా నరసింహమూర్తి ● విశాఖపట్నానికి శ్రీనివాస్ బదిలీ నెల్లూరు (లీగల్): జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ను విశాఖపట్నం ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. ఈయన స్థానంలో తిరుపతి స్పెషల్ కోర్టు (ఎర్రచందనం) న్యాయమూర్తి నరసింహమూర్తిని నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు బుధవారం జారీ చేసింది. పెండింగ్ కేసుల పరిష్కారంతో పాటు జిల్లా కోర్టు భవనాల సుందరీకరణ, కోర్టు ఆవరణలో పార్కింగ్ పనులు, లిఫ్టు తదితరాలు ఇటీవలి కాలంలో విజయవంతంగా సాగాయి. నరసింహమూర్తి శ్రీనివాస్ ప్రభుత్వానికి చెందిన విలువైన ఇరిగేషన్ భూమిని మంత్రి నారాయణ సంస్థకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. నారాయణ మెడికల్ కాలేజీ పక్కనే ఉన్న రూ.కోట్లు విలువైన కాలువ పోరంబోకు భూమిని మార్కెట్ రేటుకే నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీకి కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పటికే కార్పొరేషన్ కౌన్సిల్ అజెండాలో ఒక అంశంగా పెట్టి ఆమోదం పొందేందుకు చేసిన ప్రయత్నం హాట్టాపిక్గా మారింది. అధికార బలంతో ‘మాస్టారు’ స్కెచ్తో ఫైళ్లకు రెక్కలొచ్చాయి. -
నెలవుతున్నా.. మా ముఖం చూసిన పాపాన పోలేదు
పులికల్లు ఎస్టీ కాలనీలో గత ప్రభుత్వంలో పక్కా ఇళ్లు 35 మంజూరు చేశారు. ఇళ్లను అప్షన్–3 కింద నిర్మించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే బిల్లులు చెల్లించని కారణంగా అరకొరగా ఇళ్లను నిర్మించారు. ఇప్పటికీ పూర్తి చేయకపోవడంతో వాటిలో నివాసం ఉంటున్నాం. ఇదే విషయంపై పల్లెవీక్షణకు జూన్ 16న కలెక్టర్ వచ్చిన సందర్భంగా అర్జీ ఇచ్చాం. ఇప్పటి వరకు ఇళ్లకు సంబంధించిన అధికారులు ఎవరూ వచ్చి వివరాలు అడగలేదు. మా కాలనీలో మురుగు కాలువలు, వీధిలైట్లు కూడా లేవు. ఇళ్లకు బిల్లులు అందజేస్తే అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేస్తామంటున్నారు. – నల్లు పెంచలయ్య, పులికల్లు ఎస్టీకాలనీ, పొదలకూరు మండలం -
ఇళ్ల పట్టాలు ఇచ్చినట్టే ఇచ్చి లాగేసుకున్నారు
కలువాయిలో దివ్యాంగులకు 903 సర్వేలో 11 మందికి నివేశన స్థలాలకుకు సంబంధించి అధికారులు పట్టాలు మంజూరు చేశారు. అయితే పట్టాలు ఇవ్వలేదు. కలెక్టర్ కుల్లూరు గ్రామానికి పల్లెవీక్షణకు వచ్చినప్పుడు పట్టాలివ్వాలని అర్జీ ఇచ్చాం. దీంతో కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు అప్పటికప్పుడు పట్టాలిచ్చినట్టు ఫొటోలు కూడా దిగారు. మళ్లీ పట్టాలు తీసుకుని ఇప్పటికీ రెవెన్యూ అధికారులు ఏదో కారణం చెబుతూ పట్టాలివ్వలేదు. హద్దులు చూపించలేదు. ఎన్ని సార్లు తిరుగుతున్న తహసీల్దార్ పట్టించుకోవడం లేదు. – రేవూరి శ్రీనివాసులు, మండల వికలాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు -
గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
నెల్లూరు సిటీ: జొన్నవాడ ఆర్చి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి కలుపు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడని ఘటన ఘటన బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రూరల్ నియోజకవర్గం దేవరపాళెం గ్రామ పరిధిలోని జొన్నవాడ ఆర్జి వద్ద గుర్తుతెలియని వ్యక్తి కలుపు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అటువైపు వెళ్తున్న వారు గమనించి రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో కాలువలో పడి.. ● వ్యక్తి మృతి విడవలూరు: మద్యం మత్తులో కాలువలో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు ఎన్టీఆర్ నగర్కు చెందిన తిరువాల శ్రీనివాసులు (55) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య వెంకటరమణమ్మ, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. శ్రీనివాసులుకు విడవలూరు కామాక్షి నగర్లో ఇంటి స్థలం ఉంది. దానిని విక్రయించేందుకు తరుచూ విడవలూరుకు వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం విడవలూరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరిన శ్రీనివాసులు మధ్యాహ్నం కామాక్షి నగర్ ఒకటో వీధి వద్ద ఉన్న కాలువ వద్ద కూర్చొని మద్యం తాగాడు. మత్తులో ఉన్న అతను ప్రమాదవశాత్తు తూలి కాలువ నీటిలో బోర్లా పడిపోవడంతో ఊపిరి ఆగి అక్కడకక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రీనివాసులు మృతదేహాన్ని చూపి బోరున విలపించారు. అనంతరం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై సాయి కల్యాణ్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
అడిగేదెవరు.. ఆపేదెవరు?
● పట్టించుకోని అధికారులు ● చేపల గుంతల పేరుతో ఆక్రమణలు ● కలుషితమవుతున్న నీరు కలిగిరి: నిబంధనలతో మాకేంటి.. అధికారుల అనుమతులు అవసరం లేదు.. మమ్మల్ని అడ్డుకునేది ఎవరు అనే తీరులో అక్రమార్కులు చెరువుల నుంచి రాత్రి సమయంలో టిప్పర్ల ద్వారా గ్రావెల్ను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గంగిరెడ్డిపాళెం పంచాయతీ పరిధిలోని పెద్దిరెడ్డిగుంట చెరువు, మాలపాటివారి చెరువుల నుంచి భారీగా గ్రావెల్ను తరలిస్తున్నారు. కలిగిరి, వింజమూరు మండలాల్లో ఉన్న ఇటుక బట్టీలకు ఈ చెరువుల నుంచి గ్రావెల్ను తరలిస్తున్నారు. జాతీయ రహదారి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల లేఅవుట్లకు కూడా ఇక్కడి నుంచే గ్రావెల్ను అధికంగా తోలుతున్నట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఈ తంతు జరుగుతున్నట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి టిప్పర్ల ద్వారా గ్రావెల్ తరలించడానికి ప్రయత్నించడాన్ని స్థానికులు ఇరిగేషన్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. స్థానిక జేసీబీ, టిప్పర్ వాహనాల నిర్వాహకులే అక్రమ గ్రావెల్ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. భారీ గోతులు చెరువుల లోపలి వైపు కట్టల సమీపంలో భారీగా గ్రావెల్ను తరలిస్తున్నారు. దీంతో పెద్ద గోతులు ఏర్పడ్డాయి. చెరువులు నిండితే అవి నీటితో నిండి ప్రమాదకరంగా మారుతాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువులు గోతుల్లో పడి మృత్యువాత పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్పందన లేదు అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న సమాచారాన్ని ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. గ్రావెల్ తరలింపు పూర్తయిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లి హడావుడి చేస్తున్నారని విమర్శిస్తున్నారు.దగదర్తి: మండల పరిధిలోని రామన్న చెరువులో ఇష్టారాజ్యంగా గుంతలు తవ్వి మట్టిని తరలిస్తున్నారు. వేల ఎకరాలకు సాగునీరు అందించే ఆయకట్టు కలిగిన ఈ చెరువులోని మట్టిని తవ్వి ప్రైవేట్ భూములను చదును చేసేందుకు తరలిస్తున్నారు. దాని పక్కనే సుమారు 70 ఎకరాల్లో చేపల గుంతలు సాగు చేస్తున్నారు. వాటిని లీజుకు తీసుకున్న కొంతమంది వ్యక్తులు, చెరువు పరిధిలోకి సైతం విస్తరించి గుంతలు ఏర్పాటు చేస్తున్నారు. రాత్రివేళల్లో చెరువులో మట్టి తవ్వకాలు చేస్తున్నారు. దీంతో పశువులకు ప్రమాదం పొంచి ఉందని ఆవేదన రైతులు వ్యక్తం చేస్తున్నారు. వ్యర్థాలతో నీటి కాలుష్యం చేపల గుంతల్లో ఫంగస్ చేపల పెరుగుదల కోసం జంతు, కోళ్ల వ్యర్థాలను మేతగా వినియోగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా చేపలు త్వరగా పెరగాలనే ఉద్దేశంతో కొన్ని రసాయనాలను కూడా వాడుతున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యర్థాలు, రసాయనాలు చెరువు నీటిలో కలిసే అవకాశం ఉండటంతో నీటి నాణ్యత దెబ్బతిని, సాగునీటిపై ఆధారపడుతున్న వేలాది ఎకరాల ఆయకట్టు రైతులకు భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. ఇరిగేషన్ అధికారుల తీరుపై ప్రశ్నలు చెరువు పరిధిలో జరుగుతున్న మట్టి తవ్వకాలు, గుంతల ఏర్పాటు వ్యవహారంపై సంబంధిత ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. సుమారు 2 వేల ఎకరాలకు పైబడి ఉన్న చెరువు హద్దులను గుర్తించి అక్రమ తవ్వకాలను అడ్డుకోవడంతోపాటు, ఇప్పటికే తవ్విన గుంతలను పరిశీలించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.చెరువులో మట్టిని తరలించడంతో ఏర్పడిన గుంతలు యథేచ్ఛగా చెరువుల నుంచి గ్రావెల్ తరలింపు ఇటుక బట్టీలకు తోలి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు చెరువుల్లో భారీ గోతులతో పొంచి ఉన్న ప్రమాదాలు చోద్యం చూస్తున్న ఇరిగేషన్ అధికారులు కూటమి ప్రభుత్వంలో ప్రకృతి వనరుల దోపిడీ ఆగడం లేదు. తెలుగుదేశం నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు ఉంటున్నారు. గ్రావెల్ తవ్వకాలతో భవిష్యత్లో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా అక్రమార్కులు లెక్క చేయడం లేదు.పోలీసులకు ఫిర్యాదు చేశాం గంగిరెడ్డిపాళెం పరిధిలోని పెద్దిరెడ్డిగుంట, మాలపాటివారి చెరువుల నుంచి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న విషయంపై పోలీసుల ఫిర్యాధు చేశాం. వాటి నుంచి ఇటుక బట్టీలు, లేఅవుట్లకు గ్రావెల్ తరలిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. చెరువులు, వాగుల్లో అనుమతులు లేకుండా అక్రమంగా గ్రావెల్ తరలిస్తే కేసులు పెడతాం. – శ్రీనాఽథ్, ఇరిగేషన్ ఏఈ, కలిగిరి -
సీసీ రోడ్డు పునర్నిర్మాణం
నెల్లూరు(బారకాసు): నగరంలోని మైపాడు రోడ్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సురక్షిత తాగునీటి సరఫరా పనులు చేపట్టారు. ఇవి పూర్తయిన అనంతరం ఆయా ప్రాంతాల్లో సీసీ రోడ్లను పునర్నిర్మించారు. అయితే నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో కొద్దిరోజులకే రోడ్డు పగుళ్లు ఏర్పడి కుంగిపోయే పరిస్థితి నెలకొంది. దీనిపై గత నెల 27న ‘ఇష్టారాజ్యంగా సిమెంట్ రోడ్డు నిర్మాణం’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. అయితే సంబంధిత అధికారులు రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యతగా ఉన్నాయని, ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. కాగా రోడ్డు నిర్మించిన 15 రోజులకే ‘సాక్షి’ కథనంలో పేర్కొన్నట్లుగానే పగుళ్లు ఏర్పడి కుంగిపోయింది. దీనిపై ఈనెల 7న ‘నారాయణా.. ఇదేనా నాణ్యత’ శీర్షికన మరో కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు స్పందించి పగుళ్లు ఏర్పడి కుంగిపోయిన సీసీ రోడ్డును తొలగించి అదే ప్రాంతంలో తిరిగి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించినట్లు తెలిసింది. నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించినట్లు సమాచారం. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు వెంకటాచలం: మోటార్బైక్ అదుపుతప్పి ఇద్దరు గాయపడిన ఘటన మండలంలోని కనుపూరు సమీపంలో బుధవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. నెల్లూరులోని పొదలకూరు రోడ్డు ప్రాంతానికి చెందిన సోని, అన్వర్ పని నిమిత్తం బైక్పై కసుమూరుకు వచ్చారు. తిరిగి నెల్లూరుకు వెళ్తుండగా కనుపూరు సమీపంలోని మలుపు వద్ద బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో సోని, అన్వర్కు గాయాలు కాగా స్థానికులు వారిని చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు.జిల్లాకు తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ల మంజూరు నెల్లూరు(అర్బన్): జిల్లాకు తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ (102) వాహనాలు 9 మంజూరయ్యాయి. వాటిని బుధవారం డీఎంహెచ్ఓ సుజాత, పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి, ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్ నెల్లూరులోని పెద్దాస్పత్రిలోని ఎంసీహెచ్ బ్లాక్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ కాన్పు జరిగిన తర్వాత తల్లీబిడ్డను ప్రభుత్వాస్పత్రుల నుంచి ఇంటికి ఎలాంటి ఆటంకం లేకుండా ఈ వాహనాలు తీసుకెళ్తాయన్నారు. 4 సర్వజన ఆస్పత్రికి, రెండు ఆత్మకూరులోని జిల్లా ఆస్పత్రికి, గూడూరు, కావలి, పొదలకూరుకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించడం జరిగిందన్నారు. కాగా ఇప్పటి వరకు నిర్వహిస్తున్న అరబిందో కాంట్రాక్ట్కు సంబంధించిన పాత వాహనాలు పెద్దాస్పత్రి ఆవరణలో ఉన్నాయని, వాటిని ఆ యాజమా న్యం త్వరలోనే తీసుకెళ్తుందని తెలిపారు. హైవేపై ట్రాఫిక్కు అంతరాయం మనుబోలు: మండలంలోని జాతీయ రహదారిపై వెళ్తున్న బస్సు.. మరో బస్సును ఢీకొనడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. స్థానికుల కథనం మేరకు.. బుధవారం గూడూరు వైపు నుంచి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును అదే మార్గంలో వెనుక వస్తున్న ప్రైవేట్ బస్సు ఢీకొంది. ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ట్రాఫిక్కు అంతరాయం కలగడంతో హైవే సిబ్బంది, పోలీసులు స్పందించి పునరుద్ధరించారు. -
3.22 లక్షల ఎకరాలకు నీరందేలా చర్యలు
నెల్లూరురూరల్: జిల్లాలో 3.22 లక్షల ఎకరాల్లో సాగవుతున్న రెండో పంట వరికి చివరి ఆయకట్టు వరకు నీరందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదేశించారు. ప్రతి ఎకరా పంటను కాపాడేందుకు అవసరమైన మేరకు సాగునీటిని సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంచాలని సూచించారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో మంత్రి అధ్యక్షతన బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రానున్న 30 రోజులు అత్యంత కీలకమని, ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించాలని సూచించారు. నెల్లూరు, కోవూరు డెల్టాలతోపాటు కావలి, దక్షిణ, కందుకూరు కాలువల్లో నీటి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కావలి కాలువ 12వ కిలోమీటర్ వద్ద ఉన్న సైఫన్ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తెలుగుగంగ పరిధిలో నెల్లూరు, తిరుపతి జిల్లాల రైతులకు రెండో పంటకు అవసరమైన నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, సోమశిల, కండలేరు, ఇరిగేషన్ ఎస్ఈలు జి.రామచంద్రమూర్తి, సుబ్రహ్మణ్యేశ్వరరావు, దేశ్నాయక్, జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. -
డీఎల్పీఓ వ్యవహార శైలిపై విమర్శలు
● అర్జీదారుడితో మంతనాలు ● సోషల్ మీడియాలో వైరల్పొదలకూరు: నెల్లూరు డీఎల్పీఓ రమణయ్య మంగళవారం పొదలకూరులో వివాదాస్పద స్థలంపై విచారణ నిర్వహించేందుకు వచ్చి విమర్శలు ఎదుర్కొంటున్నారు. సీఎంఓ కార్యాలయానికి పొదలకూరుకు చెందిన ఓ వ్యక్తి స్థలం విషయమై వినతిపత్రం సమర్పించాడు. ఈ నేపథ్యంలో విచారణ నిర్వహించాల్సిందిగా అక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇందుకు రమణయ్యను విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాల్సిందిగా ఉన్నతస్థాయి అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో ఆయన క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించేందుకు వచ్చారు. అయితే జెడ్పీ హైస్కూల్ స్థలం ఆక్రమణకు గురై ప్రైవేట్ వ్యక్తులు ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టటంపై గతంలో కలెక్టర్, జెడ్పీ సీఈఓ, జిల్లా, మండల సర్వేయర్లు, ఆర్డీఓ తదితరులంతా స్థలాన్ని సర్వే చేయించడంతోపాటు సమగ్ర విచారణ నిర్వహించారు. అంతేకాక స్థలం స్కూల్కు సంబంధించినదేనని నిర్ధారణ కూడా చేశారు. నాటి జెడ్పీ సీఈఓ ఈమేరకు హైస్కూల్ హెచ్ఎంకు వారి స్థలాన్ని కట్టుదిట్టం చేసుకోవాల్సిందిగా ఉత్తర్వులను కూడా అందజేశారు. అయితే అక్కడ నిర్మాణం పనులు చేపట్టిన వ్యక్తి తిరిగి సీఎంఓ కార్యాలయానికి వినతిపత్రం సమర్పించడంతో ఇది కొత్త అంశంగా విచారణ నిర్వహించాల్సిందిగా ఆదేశాలందాయి. ఈ నేపథ్యంలో డీఎల్పీఓ విచారణ నిర్వహించేందుకు హాజరై వెళ్తూ అర్జీదారుడితో కేఫ్లో మంతనాలు జరపడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరలైంది. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని స్థానికులు అంటున్నారు. -
సంబరంగా తిరంగా ర్యాలీ
నెల్లూరురూరల్: స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో జిల్లాలో భారీ తిరంగా ర్యాలీతో సంబరాలకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో నెల్లూరులో 275 అడుగుల జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బుధవారం ప్రారంభించారు. దేశభక్తి నినాదాలతో ర్యాలీ వీఆర్సీ సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈనెల 15వ తేదీ వరకు జిల్లాలో వివిధ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలపై గౌరవాన్ని మరింత పెంపొందించడమే తిరంగా ర్యాలీ ప్రధాన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్కుమార్, మున్సిపల్ కమిషనర్ వైఓ నందన్, అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
డిమాండ్లు తీర్చే వరకు సమ్మె ఆగదు
● ర్యాలీ నిర్వహించిన జూనియర్ డాక్టర్లు నెల్లూరు(అర్బన్): ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హనీష్ కుమార్ స్పష్టం చేశారు. స్టై ఫండ్ను తక్షణమే 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె బుధవారానికి మూడో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా నెల్లూరు సర్వజన ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి ఆస్పత్రి, మెడికల్ కళాశాల ఆవరణంతో పాటు సమీప ట్రంకురోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హనీష్ కుమార్ మాట్లాడుతూ తాము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు. ప్రభుత్వ జీఓ ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి స్టై ఫండ్ను పెంచాల్సి ఉందని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటడంతోపాటు మరో ఎనిమిది నెలలు గడిచినా స్టై ఫండ్ పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించలేదన్నారు. ఈ విషయంపై పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. స్టై ఫండ్ను 30 శాతం పెంచడంతోపాటు డాక్టర్ల ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు మించకుండా చూడాలన్నారు. ఎంబీబీఎస్, పీజీ పూర్తి చేసిన వైద్యులతోనే తమకు బోధన చేయించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ మూడు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే అత్యవసర సేవలను సైతం నిలిపివేసి పూర్తిస్థాయిలో ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్లు భార్గవ్, నిర్మల్, భావన, కీర్తి తదితరులు పాల్గొన్నారు. ● జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడంతో ఆస్పత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీనియర్ వైద్యులు అందుబాటులో లేకపోవడం, జూనియర్ డాక్టర్లు విధులకు హాజరుకాకపోవడంతో రోగులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదనే ఆరోపణలున్నాయి. -
జూనియర్ డాక్టర్ల సమ్మె ఉధృతం
● విధులు బహిష్కరించి జీజీహెచ్ వద్ద ధర్నా ● రోగులకు అందే సేవలపై ప్రభావంనెల్లూరు(అర్బన్): డిమాండ్ల పరిష్కారం కోరుతూ జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె రెండో రోజుకు చేరడంతో సేవలపై ప్రభావం పడింది. రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా మంగళవారం జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (జీజీహెచ్) వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హనీష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ జీఓ ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి స్టై ఫండ్ పెంచాల్సి ఉందన్నారు. రెండేళ్లు దాటి ఎనిమిది నెలలు గడిచినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా స్టై ఫండ్ను 30 శాతం పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్యుల ఉద్యోగ విరమణ వయసును 62 నుంచి 65 లేదా 70 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. కొత్తగా వైద్యులకు అవకాశాలు కల్పించాలంటే ప్రస్తుత ఉన్న నిబంధనను కొనసాగించాలని కోరారు. ఎంబీబీఎస్, పీజీ చేసిన వైద్యులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో వైద్య విద్య బోధన కొనసాగుతున్న నేపథ్యంలో నాన్ – మెడికల్ విభాగాల్లో ఎంఎస్సీ, పీహెచ్డీ చేసిన వారికి అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదా కల్పించి వైద్య విద్య బోధించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వం స్పందించి తమ ప్రధాన డిమాండ్లను పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జూనియర్ డాక్టర్లు నిర్మల్, భార్గవ్, రవి, భావన, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. -
రెంట్ కారు కోసం పోలీసుల వేట
సంగం: అద్దెకు తీసుకున్న కారును యజమానికి అప్పగించకుండా పరారైన వ్యక్తుల కోసం కడప నుంచి సంగం వరకు ఛేజింగ్ సాగింది. పోలీసుల వేటను పసిగట్టిన నిందితులు కారును పొలాల్లో వదిలేసి పరారయ్యారు. సంగం ఎస్సై భోజ్యానాయక్ కథనం మేరకు.. హైదరాబాద్కు చెందిన సాయిచంద్ వద్దకు ఈనెల 8న హమీద్ అనే యువకుడి వెళ్లి లాంగ్ డ్రైవ్ కోసం తన డాక్యుమెంట్లు సమర్పించి కారును అద్దెకు తీసుకున్నాడు. ఒప్పందం ప్రకారం 9న వాహనాన్ని తిరిగి అప్పగించాల్సి ఉంది. అయితే హమీద్ తిరిగి రాకపోవడంతో సాయిచంద్ ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో అతను మీర్పేట పోలీసులను ఆశ్రయించాడు. జీపీఎస్ ఆధారంగా.. పోలీసులు కారు జీపీఎస్ లొకేషన్ను పరిశీలించి వైఎస్సార్ కడప జిల్లాలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో సాయిచంద్ మంగళవారం కడపకు చేరుకోగా ఈ విషయాన్ని గమనించిన ఇద్దరు నిందితులు కారుతో వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో సాయిచంద్ తన కారులో నిందితుడి వాహనాన్ని వెంబడిస్తూ కడప నుంచి ఆత్మకూరు వైపు వచ్చాడు. ఈ క్రమంలో డీసీపల్లి టోల్గేట్లో నిలపకుండా సంగం వైపు వచ్చారు. 112కు సమాచారం పరిస్థితిని గమనించిన సాయిచంద్ వెంటనే 112కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సంగం ఎస్సై భోజ్యానాయక్ సిబ్బందితో అప్రమత్తమై నిందితుల వాహనం కోసం గాలింపు చేపట్టారు. పోలీసుల వాహనాలను గమనించిన వారు బుచ్చి టోల్గేట్ వైపు వెళ్లి అకస్మాత్తుగా యూటర్న్ తీసుకున్నారు. అనంతరం దువ్వూరు గ్రామం వైపు దూసుకెళ్లారు. పోలీసులు వెంబడిస్తుండటంతో చివరకు చీకట్లో కారును పొలాల్లో వదిలేసి పరారయ్యారు. సంగం పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాహనాన్ని రికవరీ చేసి యజమాని సాయిచంద్కు అప్పగించారు. ఘటనపై మీర్పేట పోలీసులకు సమాచారం అందించారు. కడప నుంచి సంగం వరకు సినిమా స్టైల్ ఛేజింగ్ పొలాల్లో వదిలేసి పరారైన కేడీలు సంగం ఎస్సై చాకచక్యంతో వాహనం స్వాధీనం -
నాలుగు ఆలయాల్లో చోరీలు
● హుండీలను ఎత్తుకెళ్లిన దుండగులు ● క్లూస్టీం ఆధారాల సేకరణకొండాపురం: మండలంలోని సాయిపేట గ్రామంలో సోమవారం రాత్రి నాలుగు ఆలయాల్లో చోరీలు జరిగాయి. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఉన్న వీర్ల అంకమ్మతల్లి ఆలయంలో హుండీని దుండగులు ఎత్తుకెళ్లారు. ఇటీవలే తిరునాళ్ల నిర్వహించడంతో హుండీలో సుమారు రూ.75 వేల వరకు కానుకల నగదు ఉండొచ్చని స్థానికులు తెలిపారు. అలాగే బస్టాండ్ సెంటర్లోని అంకమ్మతల్లి ఆలయంలో హుండీని అపహరించారు. రెండేళ్లుగా హుండీ కానుకలను లెక్కించలేదని, త్వరలో తిరునాళ్ల ఉండటంతో అనంతరం లెక్కించాలని భావిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. ఇందులో సుమారు రూ.లక్ష వరకు నగదు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బీసీ కాలనీలోని అంకమ్మతల్లి ఆలయంలోని హుండీని దొంగలు ఎత్తుకెళ్లారు. అందులో సుమారు రూ.25 వేల వరకు కానుకలు ఉండొచ్చని భావిస్తున్నారు. గ్రామ శివారులోని గంగమ్మతల్లి ఆలయ తాళాన్ని పగలగొట్టినప్పటికీ అక్కడ ఎలాంటి చోరీ జరగలేదని స్థానికులు చెప్పారు. అదే విధంగా స్థానిక సచివాలయం వెనుక ముళ్లపొదల్లో రెండు హుండీలను గుర్తించారు. మరో రెండు కనిపించకపోవడంతో దుండగులు ఎత్తుకెళ్లినట్లు భావిస్తున్నారు. ఘటనపై గ్రామస్తులు కొండాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం క్లూస్టీం సిబ్బంది ఘటనా స్థలాలకు చేరుకుని వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
అధికారం దోచుకోవడానికేనా?
నెల్లూరురూరల్: ప్రజలు అధికారమిచ్చింది.. దోచుకునేందుకే అనే విధంగా టీడీపీ నేతల తీరు ఉందని, ముఖ్యంగా నెల్లూరు నగర పాలక సంస్థను అడ్డం పెట్టుకుని మంత్రి నారాయణ రూ.కోట్ల అవినీతికి తెరతీశారని ఎమ్మెల్సీ, నెల్లూరు నగర ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆరోపించారు. ఇప్పటికే సహజ వనరులను దోచుకుంటున్నారు. కార్పొరేషన్ నిధులను దారి మళ్లించి లూటీ చేస్తున్నారు. తాజాగా నగర పాలక సంస్థ పరిధిలోని భూములను అప్పనంగా దోచుకునేందుకు స్కెచ్ వేస్తే.. ఇందుకు సంబంధిత కార్యాలయ అధికారులు, పాలక వర్గం కట్టబెట్టుతున్నారని ఆరోపించారు. ఇలాంటి అవినీతి దోపిడీని, ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మంగళవారం ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు రూరల్ బిట్–2 పరిధిలోని 1.40 సెంట్ల ప్రభుత్వ కాలువ స్థలాన్ని మంత్రి నారాయణ ఆక్రమించి కళాశాల నిర్మించారన్నారు. ఆయన పెద్ద మనసు చేసుకొని కార్పొరేషన్కు మార్కెట్ వాల్యూ కడతానని లేఖ రాస్తే, అదే మహద్భాగ్యమన్నట్టు కార్పొరేషన్ అధికారులు అంగీకరించి కౌన్సిల్ సమావేశంలో ఆమోదించేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం దారుణమన్నారు. కాలువలో నీళ్లు లేవనే కారణంతో ప్రభుత్వ కాలువ స్థలాన్ని అప్పనంగా ప్రైవేట్ సంస్థకు ఎలా కట్టబెడుతారని ప్రశ్నించారు. చట్టాలను ఉల్లంఘించి మార్కెట్ వాల్యూ కడతానంటే అంగీకరించేందుకు అధికారులకు, పాలకవర్గాలకు అధికారం లేదన్నారు. పేదల ఇళ్లు.. దుకాణాలు కూల్చేస్తారు.. పేదలు బతుకుదెరువు కోసం సెంటు, రెండు సెంట్ల స్థలాల్లో ఇళ్లు కట్టుకుంటే.. అంకణం స్థలంలో దుకాణాలు పెట్టుకుంటే ఇదే కార్పొరేషన్ అధికారులు మానవత్వం మరిచి వాటిని కూల్చేస్తారని, అదే మంత్రి నారాయణకు సంబంధించిన ప్రైవేట్ సంస్థకు రూ.కోట్ల విలువైన భూములను కట్టబెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారని చంద్రశేఖరరెడ్డి మండిపడ్డారు. పెద్దలకు ఒక న్యాయం.. పేదలకు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. పేదల ఇళ్లపై నిబంధనలు ప్రయోగించే అధికారులు, పెద్దల విషయంలో, ప్రభుత్వ భూముల విషయంలో ఎందుకు అదే నిబంధనలు పాటించడం లేదని నిలదీశారు. చెత్త సేకరణ నుంచి రోడ్ల వరకు.. అవినీతి ఆరోపణలు గత ప్రభుత్వ హయాంలో ‘క్లీన్ ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించేందుకు వాహనాలు ఏర్పాటు చేశామని చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ప్రస్తుతం చెత్త సేకరణను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించి ట్రాక్టర్లను నడుపుతున్నారని, తమకు నచ్చిన వారికి కాంట్రాక్ట్లు కట్టబెట్టి దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. చెట్లు నాటడంలో ఎంత అవినీతి జరిగిందో మనందరికీ తెలుసన్నారు. పేదల నుంచి కూడా చెత్త పన్ను వసూలు చేస్తున్నారని, ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తున్నప్పటికీ అందుకు తగిన సేవలు అందడం లేదని విమర్శించారు. నాసిరకంగా రోడ్లు నిర్మించి కొంత కాలానికే అవి దెబ్బతిన్నాయని, తిరిగి అదే పనులకు టెండర్లు పిలిచి ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ తమకు అనుకూలంగా వ్యవహరించేలా కార్పొరేటర్లను ప్రలోభపెట్టి, మేయర్ను మార్చి తమకు ఇష్టమైన పనులు జరిపించుకుంటోందని కూడా ఆయన ఆరోపించారు. గోవింద నామాలతో లోకేశే విమర్శలు వెన్నుపోటు పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ఎగ్గొట్టారని ఓ కార్యకర్త తన బాధను గోవింద నామాలతో వ్యక్తం చేస్తే, దానిని కూడా రాజకీయంగా చిత్రీకరించి తనపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటి మంత్రి లోకేశే గోవింద నామాలతో బహిరంగ వేదికల్లోనే మాట్లాడారని గుర్తుచేశారు. ఆయనపై కేసు కట్టే ధైర్యం ఈ పోలీసులకు ఉందా? అని పశ్న్రించారు. పేదోడు బతికేందుకు అంకణం స్థలం ఆక్రమిస్తే జేసీబీలతో ధ్వంసం కార్పొరేట్ బడాబాబులకు రూ.కోట్ల స్థలాలు అప్పనంగా అప్పగింత మంత్రి నారాయణకు 1.40 ఎకరాల భూమిని కట్టబెట్టేందుకు కార్పొరేషన్ అధికారులు ప్లాన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ధ్వజం -
గ్యాస్ సిలిండర్ పేలి ఒకరి దుర్మరణం
● మరొకరికి తీవ్ర గాయాలు● మహిమలూరులో ఘటన● ధ్వంసమైన ఇల్లుఆత్మకూరు రూరల్: మండలంలోని మహిమలూరులో మంగళవారం గ్యాస్ లీకై సిలిండర్ పేలిన ఘటనలో ఓ మహిళ మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన నిజమాల లక్ష్మమ్మ (75).. మాజీ ఎంపీటీసీ చింతలపల్లి కవితమ్మ ఇంట్లో పనిచేస్తున్నారు. బంధువుల మృతితో నెల్లూరులో జరిగే కార్యక్రమానికి కవితమ్మ వెళ్లింది. ఈ క్రమంలో గ్యాస్ లీకవుతున్నట్లు గుర్తించిన లక్ష్మమ్మ పక్కింటికి చెందిన షేక్ జమీలాను సాయం కోసం పిలిచింది. ఇద్దరూ ఇంట్లోకి వెళ్లి ట్యూబ్లైట్ స్విచ్ వేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి సిలిండర్ పేలినట్లు పోలీసులు చెబుతున్నారు. పేలుడు ధాటికి ఇద్దరూ తీవ్రంగా గాయపడటంతోపాటు వంటగది, ఇంటిలోని కొంత భాగం దెబ్బతింది. స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి లక్ష్మమ్మ చనిపోయింది. ● అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జమీల భర్త ఖాదర్ హుస్సేన్ కువైట్లో ఉన్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు సంతానం. ఘటన గురించి తెలిసిన వెంటనే అతను స్వదేశానికి బయలుదేరాడు. వంటగది స్లాబ్ జమీలపై తలకు తీవ్రగాయమైంది. దీంతో ఆమెను అపోలో నుంచి మెరుగైన వైద్యం కోసం చైన్నెకు తీసుకెళ్లారు. స్విచ్ వేయడంతోనే మంటలు సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ గంగాధర్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వంటగదిలో గ్యాస్ లీకై నిండిపోయిన సమయంలో ట్యూబ్ లైట్ స్విచ్ వేయడంతో ఏర్పడిన మంటల కారణంగా సిలిండర్ పేలినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై ఎస్సై జంపానీ కుమార్ దర్యాప్తు చేపట్టారు. -
కాకాణితో నేదురుమల్లి భేటీ
నెల్లూరురూరల్: వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జి నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం చిలకూరు మండల కన్వీనర్ యద్దల మధుసూదన్రెడ్డి, వేమారెడ్డి కుమారస్వామిరెడ్డి వారిని కలిసి గూడూరు నూతన నియోజకవర్గ ఇన్చార్జి బూదూరు గురవయ్య పరిచయ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈనెల 14న చిలకూరు మండలం మోమిడి గ్రామంలో జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి తప్పక హాజరవుతామని కాకాణి, నేదురుమల్లి తెలిపారు. గాలివాన.. నేలవాలిన వరి పంటవాకాడు: మండలంలో సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో చేతికందే దశలో ఉన్న వరి పంట నేలవాలింది. పలు ప్రాంతాల్లో పొలాల్లో నీరు చేరడంతో కోతకు సిద్ధంగా ఉన్న పంట నీటమునిగింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అనేక రోజులుగా పంటను కంటికి రెప్పలా కాపాడుకున్న అన్నదాతలకు వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. బలమైన ఈదురుగాలుల వల్ల గొల్లపాళెం, సవళ్ల, పులికాలవ, తెంగేళదిబ్బ, జీవుమానుదిబ్బ, నెల్లిపూడి, కల్లూరు, ముట్టెంబాక, కాశీపురం, కొండాపురం, జానరపేట, యరగాటిపల్లి తదితర గ్రామాల్లో వరి కంకులు నీట మునగడంతో దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కోతకు సిద్ధంగా ఉన్న పంట దెబ్బతినడంతో ధాన్యం మొలకెత్తే అవకాశం ముందని చెబుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి నస్టాన్ని అంచనా వేయాలని, ప్రభుత్వం వెంటనే నష్టాన్ని గుర్తించి పరిహారం అందించాలని కోరుతున్నారు. రెండు బైక్లు ఢీకొని ముగ్గురికి గాయాలు ఆత్మకూరు: రెండు మోటార్బైక్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మున్సిపల్ పరిధిలోని అల్లీపురం రోడ్డులో మోటార్బైక్పై జి.నరసింహులు, మరో వ్యక్తి కలిసి ఆత్మకూరుకు బయలుదేరారు. మరోవైపు ఎదురుగా బైక్పై పి.వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వస్తున్నాడు. ఈ రెండు బైక్లు ఢీకొన్నాయి. వీరంతా మద్యం మత్తులో ఉన్నారు. దీనికితోడు నరసింహులు బైక్లో రెండు ఫుల్లు బాటిళ్లున్నాయి. గాయపడిన ఆత్మకూరు 108 సిబ్బంది ఈఎంటీ అశోక్, పైలట్ మహేంద్ర ఆత్మకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. -
కూటమి ప్రభుత్వంలో వణుకు మొదలు
నెల్లూరు(వేదాయపాళెం): కూటమి ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు, ర్యాలీలకు అన్ని వర్గాల ప్రజల నుంచి లభించిన మద్దతు, స్పందనను చూసి కూటమి ప్రభుత్వ పెద్దలలో వణుకు మొదలైందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. నెల్లూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాకాణి మాట్లాడారు. డీఎస్సీ నిరసన కార్యక్రమాలకు సంబంధించి గత నెలలోనే పోలీసు అనుమతులు కోరామని తెలిపారు. అప్పుడు మిన్నకుండిన పోలీసులు, ఇతర అధికార యంత్రాంగం ప్రభుత్వ ప్రోద్బలంతో నిరసన దీక్షలు, ర్యాలీలను అడ్డుకునేందుకు ప్రయత్నించారన్నారు. అయితే పార్టీ శ్రేణుల అప్రమత్తతతో ఎక్కడికక్కడ వారి ఆగడాలను అడ్డుకోగలిగామన్నారు. జిల్లాలో నిరసన కార్యక్రమాలు టీడీపీ ఊహించిన దానికంటే, తాము ఆశించిన దానికంటే ఎక్కువగా విజయవంతమయ్యాయని, దీన్నిబట్టి ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్పష్టంగా అర్ధమవుతుందన్నారు. తమ పార్టీ నిరసనలను ఓర్వలేక కూటమి ప్రభుత్వ పోలీసులను పురమాయించి దీక్షా శిబిరాల టెంట్లను పీకేసేందుకు ప్రయత్నించడం, తమ కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడడం, దాడులకు తెగబ డడం, చివరకు పార్టీ ఫ్లెక్సీలను చించివేయడం వంటివి చేశారన్నారు. తాము అరగంట పాటు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తే అనేక అడ్డంకులను సృష్టించిన పోలీసులు ఇటీవల మంత్రి నారాయణ సైకిళ్ల పంపిణీ పేరుతో ఒక రోజంతా వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీబొమ్మ వరకు ట్రంకురోడ్డును బ్లాక్ చేసి ట్రాఫిక్కు తీవ్రఅంతరాయం,ప్రజలకు తీవ్ర అసౌకర్యం కల్పిండం కనబడ లేదా అని ప్రశ్నించారు. సాధారణ జనజీవనానికి, ట్రాఫిక్కు అంతరాయం కలిగించినందుకు కేసులు పెట్టాల్సివస్తే ముందుగా మంత్రి నారాయణపై నమోదు చేయాలని హితబోధ చేశారు. టీడీపీ ఎప్పుడూ అధికారంలో ఉండదని, ఏకపక్షంగా వ్యవహరిస్తూ వారికి వత్తాసుపలికి పోలీసు శాఖపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని సూచించారు.నిరసన దీక్షలో పాల్గొన్న డీఎస్సీ బాధితులను బ్లాక్మెయిల్ చేసేందుకు కూడా ఈ ప్రభుత్వం వెనుకాడలేదన్నారు.వైఎస్సార్సీపీ నిరసనలను నేరుగా ఎదుర్కోలేక డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన కొందరిని ఉసిగొల్పేందుకు ప్రయత్నించి ఘోరంగా విఫలమైందన్నారు. మెగా డీఎస్సీ నియామకాలపై మంత్రి నారాయణ క్లీన్చిట్ ఇచ్చాడని టీడీపీ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఆయన ఏమైనా సీబీఐ ఆఫీసరా అని ప్రశ్నించారు. అదృష్టం కలిసొచ్చి మంత్రి అయిన నారాయణకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. విద్యాశాఖ మంత్రిగా కొనసాగే ప్రతిభ, అర్హత లోకేశ్కు లేవని, డీఎస్సీ స్కామ్కు నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోసపూరిత ప్రకటనలు, ఆచరణ సాధ్యం కానీ హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం రెండేళ్ల నమ్మకం అంటూ ప్రజల మధ్యకు రావడం సిగ్గుచేటని, కరపత్రాలతో వచ్చిన టీడీపీ నాయకులను ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. డీఎస్సీ స్కామ్పై తమ పార్టీ చేపట్టిన రిలే దీక్షలు, ర్యాలీలకు మద్దతు ప్రకటించి సంఘీభావం తెలిపిన మేధావులు, నిరుద్యోగులు, యువత, విద్యార్థులు, పార్టీ శ్రేణులు, డీఎస్సీ బాధితులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తప్పులను సరిదిద్ధుకునే ప్రయత్నం చేయడం లేదు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ స్కామ్పై తమ పార్టీ ఆధ్వర్యంలో తాము మొదటి నుంచి ఎప్పటికప్పుడు ఆందోళనలు చేపడుతున్నా ప్రస్తుత పాలకులు తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోగా, తమ మీద తప్పుడు కేసులతో ఎదురుదాడికి దిగుతున్నారన్నారు. ఎన్సీఈఆర్టీలో టైపిస్టుగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి పేపర్ లీకేజీకి పాల్పడితే అతనిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ఒక్కో ఉపాధ్యాయ ఉద్యోగాన్ని కనీసం రూ.15లక్షలకు అమ్ముకున్నట్లు తాము ఆడియో రికార్డులు,తగిన సాక్ష్యాధారాలను చూపించిన ప్రభుత్వంలో చలనం లేదన్నారు. దీనిని బట్టి అవినీతి, అక్రమాల్లో విద్యాశాఖ మంత్రి, ఇతర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందనే విషయం స్పష్టంగా అర్ధమవుతోందన్నారు. వైఎస్సార్సీపీ రిలేదీక్షలు, ర్యాలీలకు అనూహ్య స్పందన ఓర్వలేక పోలీసులతో అడ్డుకునేందుకు ప్రయత్నించి విఫలం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి బాధితుల పక్షాన నిలబడతాం నెల్లూరురూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ నమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ నియామకాల్లో ప్రభుత్వం చేత దగాపడిన బాధితుల పక్షాన నిలబడతామని తెలిపారు. డీఎస్సీ స్కామ్పై సీబీఐ విచారణ జరిపించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. లోకేశ్ మంత్రిగా కొనసాగితే ప్రత్యక్షంగా, పరోక్షంగా విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున రాజీనామా చేయించాలన్నారు. ఫీజురీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి నిధులను తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆత్మకూరు, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితమ్మ, జోనల్ ప్రెసిడెంట్ మొయిళ్ల గౌరి, లక్ష్మీసునంద తదితరులు పాల్గొన్నారు. -
కోట ఎస్సీ గురుకులాన్ని కొనసాగించాలి
● తిరుపతి ఎంపీ గురుమూర్తి గూడూరురూరల్: తిరుపతి పార్లమెంట్ పరిధిలోని కోటలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ గురుకుల పాఠశాల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి మంగళవారం లేఖ రాశారు. గురుకుల ప్రాంగణాన్ని ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ అందించే సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా మార్చాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఎస్సీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి కల్పిస్తూ ఎంతో కాలంగా సేవలందిస్తున్న గురుకులాన్ని ఒక్కసారిగా మూసివేయడంతో సుమారు 600 మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. వారి భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకునే ముందు తల్లిదండ్రులతో చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం స్వాగతించదగిన విషయమేనన్నారు. అయితే అందుకోసం ఇప్పటికే కొనసాగుతున్న పాఠశాలను మూసివేయడం సరైన విధానం కాదని స్పష్టం చేశారు. గురుకులాన్ని యథావిధిగా కొనసాగిస్తూ అవసరమైతే అదే ప్రాంతంలో ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్సీ విద్యార్థుల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రబుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని డిమాండ్ చేశారు. దెబ్బతిన్న సైఫన్ పరిశీలన ● టెండర్లు పిలిచి పనులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశం సంగం: మండలంలోని మర్రిపాడు వద్ద కావలి కాలువకు సంబంధించిన దెబ్బతిన్న సైఫన్ను కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం పరిశీలించారు. సైఫన్ వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రింగ్ బండ్ను చూసి ప్రస్తుత పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 7న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘తాత్కాలిక మరమ్మతులు చాల్లే’ కథనానికి కలెక్టర్ స్పందించారు. శాశ్వత నిర్మాణం చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇరిగేషన్ అధికారులతో చర్చించారు. సాగునీటి మ్యాప్ను పరిశీలించి, కాలువ ద్వారా రైతులకు నీరు అందుతున్న తీరుపై అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్మాణం చేపట్టేందుకు వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. కలెక్టర్ స్థానిక రైతులతో మాట్లాడి సైఫన్ దెబ్బతినడంతో ఎదురవుతున్న సమస్యలు, సాగునీటి ఇబ్బందులు, పంటల పరిస్థితిపై వివరాలను ఆరా తీశారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ దేశనాయక్, మధుబాబు నాయుడు, శ్రీనివాసులురెడ్డి, జనార్దన్రెడ్డి, పట్టాభిరామిరెడ్డి, బాబు, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు. నిద్రమత్తు.. నిండు ప్రాణం బలి ● రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ● ఇద్దరికి తీవ్ర గాయాలు బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని ఆర్ఆర్ నగర్ సమీపంలోని ముంబై జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. నంద్యాల నుంచి నెల్లూరుకు కారులో ముగ్గురు వ్యక్తులు బయలుదేరారు. వాహనం ఆర్ఆర్ నగర్ వద్దకు చేరుకున్న సమయంలో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. దీంతో అదుపుతప్పిన కారు పలుమార్లు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న షేక్ జావీద్ (26) అక్కడికక్కడే చనిపోయాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వారిని నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
హామీలపై గళమెత్తిన పొదుపు మహిళలు
● మెప్మా పీడీ కార్యాలయం ఎదుట ధర్నా ● సూపర్సిక్స్ హామీలు అమలు చేయాలంటూ ప్లకార్డుల ప్రదర్శన నెల్లూరు(బారకాసు): కూటమి ప్రభుత్వంపై పొదుపు మహిళలు కన్నెర్ర చేశారు. అధికారంలోకి రావడం కోసం సూపర్సిక్స్లో భాగంగా ప్రతి మహిళకు నెలకు రూ.1,500, నిరుద్యోగ భృతి తదితర హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బోసుబొమ్మ దగ్గర ఉన్న ఏబీఎం కాంపౌండ్ నుంచి మెప్మా కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం మెప్మా కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మెప్మా పీడీ వచ్చి సమాధానం చెప్పేంత వరకు కదిలేది లేదని నినాదాలు చేశారు. అనంతరం పీడీ కిరణ్కుమార్ ధర్నా వద్దకు విచ్చేసి వినతిపత్రం స్వీకరించారు. నెలరోజుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దీంతో వారు ధర్నా విరమించారు. ● ఈ సందర్భంగా ఐద్వా నెల్లూరు జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్బీ, నగర కార్యదర్శి కత్తి పద్మ మాట్లాడారు. పొదుపు మహిళలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. కేవలం బ్యాంక్ లింకేజీ రుణాలు మాత్రమే ఇప్పించి గొప్పలు చెప్పుకొంటున్నారన్నారు. ఆ రుణాలకు సైతం అధిక వడ్డీలు విధిస్తున్నారన్నారు. ప్రతి మహిళలకు నెలకు రూ.1,500, రూ.10 లక్షల వరకు రుణమాఫీ, వడ్డీ మాఫీ, నిరుద్యోగ భృతి రూ.3 వేలు ప్రకటించిందన్నారు. అయితే రెండు సంవత్సరాలు గడిచినా ఆ ఊసే ఎత్తకపోవడం విచారకరమన్నారు. బ్యాంక్, మెప్మా అధికారుల వేధింపులు పొదుపు మహిళలపై అధికమయ్యాయన్నారు. అన్లైన్ యాప్ల నమోదు పేరుతో పొదుపు మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. నగరంలో 53, 54 డివిజన్లలో లక్షమందికి పైగా నివసిస్తున్నారని వాటి పరిధిలో ప్రభుత్వ బ్యాంక్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నెలరోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని పీడీకి తెలిపారు. ధర్నాలో ఐద్వా నెల్లూరు రూరల్ కార్యదర్శి షేక్ షాహినా బేగం, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ డి.అన్నపూర్ణమ్మ, ఇంకా రెహనా బేగం, నగరాధ్యక్షురాలు ఎన్వీ సుబ్బమ్మ, ఆదిలక్ష్మి, సంపూర్ణమ్మ, మహమ్మదా, షాహిన్, మంజుల భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. -
ఆనం అభివృద్ధి విఘాతకుడు
నెల్లూరు(పొగతోట): మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అంటే అభివృద్ధి విఘాతకుడని, ఆయన ఎక్కడ ప్రాతినిథ్యం వహిస్తే.. అక్కడ అవినీతి తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి దుయ్యబట్టారు. మంగళవారం ఆయన నెల్లూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇటీవల మర్రిపాడులో జరిగిన సభలో టీడీపీ కార్యకర్త హైలెవల్ కెనాల్ పనులకు సంబంధించి మంత్రి ఆనంను ప్రశ్నించగా మర్రిపాడు వాసులకు సిగ్గు లేదంటూ మాట్లాడారన్నారు. టీడీపీ కార్యకర్త అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మా కుటుంబం మీద విమర్శలు చేయడం ఆయన కుసంస్కారానికి నిదర్శమన్నారు. ఎవరి హయాంలో ఆత్మకూరు అభివృద్ధి సాధించిందో..ఇక్కడి ప్రజలందరికీ తెలుసన్నారు. తమ కుటుంబంపై ఈ ప్రాంత ప్రజల్లో ఎంతో అభిమా నం ఉందన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా తమ కుటుంబం మెట్ట ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేసిందన్నారు. రెండేళ్లుగా మంత్రి చేసిన అభివృద్ధి చెప్పాలి సమస్యలపై అధికార పార్టీ కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారంటే.. ఇక్కడి అభివృద్ధి ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుందన్నారు. ఆనం గెలిచిన సాయంత్రమే మర్రిపాడులోని ఇసుక కొండను మాయం చేశారని, రెండ్రోజుల తర్వాత ఆయన ఇంటి ముందు రెండు కొత్త వాహనాలు కనిపించాయని ఆరోపించారు. నియోజకవర్గంలో ఏటికి ఒక వైపు ఒకరిని, ఆవతలి వైపు మరొకరిని పెట్టి ఇసుక దందా సాగిస్తున్నారన్నారు. ఆయన ధనదాహానికి ఇసుక టిప్పర్ ఢీకొని ఏడుగురు మరణించగా, ఇప్పటి వరకు ఆ కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదన్నారు. చేజర్ల మండలంలో సుమారు 150 ఎకరాల్లోని జామాయిల్ను పోలీసుల సమక్షంలో బద్వేలుకు చెందిన వ్యక్తులతో రాత్రికి రాత్రే తరలించి స్వాహా చేశారని ఆరోపించారు. ఆఖరికి చికెన్ వేస్ట్ను కూడా అమ్ముకుంటూ ప్రజారోగ్యాన్ని ఫణంగా పెడుతున్నారన్నారు. దానిని స్యయంగా తానే మీడియా ద్వారా చూపించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇటువంటి పనులు చేయడానికి మీకు సిగ్గుండాలన్నారు. వైఎస్సార్ జలయజ్ఞం.. రిబ్బన్ కత్తిరించిన ఆనం దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో జలయజ్ఞంలో భాగంగా హైలెవల్ కెనాల్ ప్రాజెక్ట్ను ప్రతిపాదించి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారని గుర్తుచేశారు. అప్పట్లో మంత్రిగా ఉండి హైలెవల్ కెనాల్కు ప్రారంభోత్సవం చేయించారే తప్పా అందులో ఆనం పాత్ర ఏ మాత్రం లేదన్న విషయం అందరికీ తెలుసునన్నారు. హైలెవల్ కెనాల్ నిర్మాణాన్ని ప్రారంభించి 19 ఏళ్లు కాగా, 13 ఏళ్లు ఆనమే ఇన్చార్జిగా ఉన్నారని గుర్తుచేశారు. పొంగూరు, చాబోలు రిజర్వాయర్లు నిర్మించాలంటే ముందు భూసేకరణ చేయాలని, మంత్రిగా ఉండి ఆ విషయం కూడా తెలియకుండా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పటి కలెక్టర్ ద్వారా భూసేకరణకు సంబంధించిన ఫైళ్ల క్లియరెన్స్కు చర్యలు తీసుకున్నామన్నారు. ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చేది నేనే..ఇచ్చేది నేనే అంటున్న ఆనం ఒక్కసారి చరిత్ర చూడాలన్నారు. వెంకటగిరిలో రిజర్వాయర్ నిర్మాణానికి మీకు అడిగినంత కమీషన్ ఇవ్వలేదని పనులు నిలిపివేయించింది నిజం కాదా అని ప్రశ్నించారు. సోమశిల స్పిల్వే నిర్మాణానికి కాంట్రాక్టర్లు మారారే తప్ప ఇప్పటికీ అతి ముఖ్యమైన పనిని చేపట్టలేదన్నారు. అధికారం కోసం తరచూ పార్టీ మారే ఆనం మా కుటుంబాన్ని దూషించడం సిగ్గుమాలినతనమన్నారు. అభివృద్ధి చేశామని గొప్పలు చెబుతున్న ఆనం రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వచ్చే దుమ్ముందా అని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు, జెడ్పీటీసీలు, తదితరులు పాల్గొన్నారు. అధికారం, అవినీతి తప్ప.. ప్రజలకు ఒరగబెట్టిందేమీలేదు ఊసరవెల్లి వంటి మీరా మమ్మల్ని విమర్శించేది ఇసుక దందాతో ప్రాణాలు కోల్పోయిన వారిని పట్టించుకున్నారా? ఎవరికి సిగ్గులేదో ప్రజలందరికీ తెలుసు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి -
అయ్యా.. మా గోడు వినండి
● సమస్యలపై కలెక్టరేట్కు పోటెత్తిన అర్జీదారులునెల్లూరు(అర్బన్): ‘అయ్యా.. తహసీల్దార్లు, మండల అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాం. అయినా మా సమస్యలు పరిష్కరించలేదు. తిప్పుకొంటూనే ఉన్నారు. మీరైనా మా గోడు వినండి’ అని పలువురు బాధితులు అధికారులను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్ తదితరులు అర్జీలు స్వీకరించారు. దళిత మహిళను కొట్టిన సీఐపై కేసు నమోదు చేయాలి బుజబుజనెల్లూరుకు చెందిన యెంబేటి కరుణమ్మ అనే వృద్ధురాలిని దూషించి, చెంపపై కొట్టిన వేదాయపాళెం సీఐపై కేసు నమోదు చేయాలి. సివిల్ వివాదమైనప్పటికీ ఈ వ్యవహారంలో సీఐ అత్యుత్సాహం ప్రదర్శించి ఆమెను భయభ్రాంతులకు గురిచేసి కొట్టారు. ఈ విషయంపై జూన్ 8న కలెక్టర్, ఎస్పీకి అర్జీలు ఇచ్చాం. ఇప్పటివరకు విచారణ జరగలేదు. సీఐపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. – పందిటి సుబ్బయ్య, రవి రాఘవేంద్ర, కుడుముల సుబ్బారావు, వాదనాల వెంకటరమణ, దళిత సంఘాల ఐక్య వేదిక నాయకులు -
సమ్మెలోకి జూడాలు
● తొలిరోజే రోగులకు ఇబ్బందినెల్లూరు(అర్బన్): తాము ఎన్నో వినతి పత్రాలు ఇచ్చి తమ స్టైఫండ్ను పెంచాలని ఎంతో కాలంగా కోరుతున్నప్పటికీ ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మె బాట పట్టామని ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (జూడా) జిల్లా అధ్యక్షుడు హనీష్ అన్నారు. రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఐపీ భవనం వద్ద జూనియర్ డాక్టర్లు నల్లరిబ్బన్లు ధరించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తమను మరోదఫా చర్చలకు ఆహ్వానించినందున పూర్తి స్థాయిలో పీజీలు, ఎస్ఆర్లు, జూడాలు సమ్మెలో పాల్గొనలేదన్నారు. ప్రభుత్వం డిమాండ్లను అంగీకరించకపోతే మంగళవారం నుంచి సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తొలిరోజే రోగులకు ఇబ్బంది ఏర్పడింది. వైద్యసేవలు సక్రమంగా అందలేదు. కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు భార్గవ్, నిర్మల్ తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల విషయంలో అలసత్వం వద్దు నెల్లూరు(వీఆర్సీసెంటర్): ప్రజలు అందించే ఫిర్యాదుల విషయంలో అలసత్వం ప్రదర్శించవద్దని ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఎస్పీ పాల్గొని సమస్యలు తెలుసుకున్నారు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన 156 మంది వినతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్క ఫిర్యాదును సమగ్రంగా విచారించి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ వేమారెడ్డి, ఇన్స్పెక్టర్ సుబ్బారావు, పాపారావు, సీతారామయ్య, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవుల శాంతియుత నిరసన ర్యాలీ నెల్లూరు(అర్బన్): క్రైస్తవులకు ఇబ్బందిగా ఉన్న 1950 రాష్ట్రపతి ఉత్తర్వులోని పేరా 3ని తొలగించాలని డిమాండ్ చేస్తూ సోమవారం క్రైస్తవ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరులోని ట్రంక్రోడ్డు, వీఆర్సీ మీదుగా కలెక్టరేట్ వరకు శాంతియుత ర్యాలీ జరిగింది. అనంతరం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వేదిక నాయకులు మాట్లాడుతూ క్రైస్తవ మతం అనుసరిస్తే వారికి షెడ్యూల్ కులాల హోదా నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. చర్చిలపై, క్రైస్తవుల ఆస్తులపై మతోన్మాదంతో చేస్తున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపైన వేసిన జస్టిస్ రంగనాథమిశ్రా కమిషన్ సిఫార్సులను అమలు చేయాలన్నారు. 2022లో బాలకృష్ణ కమిషన్ను కాలయాపన చేసేందుకు కేంద్రం వేసిందన్నారు. దళిత క్రైస్తవులకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఎస్సీ హోదా కల్పించాలని కోరారు. అనంతరం జేసీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ ఎలీషాకుమార్, ఫాదర్లు జోసఫ్కుమార్, ఇన్నయ్య, హృదయరాజ్, రమేష్, ఊరందురు సురేంద్రబాబు, బర్నాబాస్, పాస్టర్ హనోక్, రాజు, రాజశేఖర్, విజయకుమార్, రమేష్, కిషోర్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. గంజాయి కేసులో ఇద్దరి అరెస్ట్ కావలిరూరల్: దగదర్తి వద్ద వెలుగులోకి వచ్చిన గంజాయి అక్రమ రవాణా కేసులో పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కావలి డీఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వీవీ రమణకుమార్ వివరాలను వెల్లడించారు. ఈనెల 2వ తేదీన గంజాయిని అక్రమంగా తరలిస్తున్న బొలెరో వాహనం దగదర్తి సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మొత్తం ఐదుగురు నిందితులు ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు వ్యక్తుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని డీఎస్పీ తెలిపారు. -
మెడికో ప్రియాంకకు నివాళి
నెల్లూరు(అర్బన్): రాజమండ్రిలో మెడికో డాక్టర్ ప్రియాంక హత్యను నిరసిస్తూ సోమవారం నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆవరణలో పెద్ద ఎత్తున మెడికోలు, జనవిజ్ఞాన వేదిక నాయకులు కలిసి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ప్రియాంక మృతికి సంతాపంగా మౌనం పాటించారు. ఈ సందర్భంగా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి, పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి తమ సంఘీభావాన్ని తెలిపారు. ప్రియాంక హత్య దుర్మార్గమన్నారు. ఆమె హత్యకు కారకులను కఠినంగా శిక్షించాలని కోరారు. అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కాళేషాబాషా, వేదిక ఆరోగ్యవిభాగం సబ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ శ్రీనునాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం మాదక ద్రవ్యాలను, మద్యాన్ని నిషేధించాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతలు కాపాడాలని, మహిళలకు రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. ప్రియాంక మృతికి కారణమైన వారిని ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ ఎండీ రషిక్, జేవీవీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చలపతి, విజయకుమార్, సమతా విభాగం కన్వీనర్ విజయమ్మ, నగర కార్యదర్శి కృష్ణ, మెడికోలు అఖిల్, జీవనసాయి, భార్గవి, లావణ్య, బలరామ్ తదితరులు పాల్గొని మాట్లాడారు. -
అధికారుల తప్పు.. వృద్ధుడికి శాపం
● కలెక్టరేట్లో అందుబాటులో లేని వీల్చైర్ నెల్లూరు(అర్బన్): ఆ వృద్ధుడి పేరు పెద వీరయ్య. వయసు సుమారు 89 ఏళ్లు. ఏఎస్పేట మండలం దూబగుంట గ్రామానికి చెందిన ఆయన తన సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సోమవారం కలెక్టరేట్కు వచ్చాడు. కాలికి గాయం కావడంతో కట్టు కట్టుకుని ఉన్నాడు. నడవలేని పరిస్థితి. దీంతో ఇద్దరి సాయంతో ఊతకర్ర పట్టుకుని కష్టంగా నడుస్తూ జేసీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. కలెక్టరేట్లో వీల్చైర్ అందుబాటులో లేకపోవడంతో నడవలేని వృద్ధుడిని ఇద్దరు వ్యక్తులు పట్టుకుని లోపలకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్ద అన్ని వసతులు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నప్పటికీ.. నడవలేని వృద్ధుడికి కనీసం వీల్చైర్ కూడా అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిచ్చింది. మ్యుటేషన్ మార్చాలంటూ.. తనకు తెలియకుండా పట్టా భూమిని వేరే వ్యక్తుల పేరుపై మ్యుటేషన్ చేశారని వీరయ్య ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై న్యాయం కోసం పలుమార్లు ఏఎస్పేట మండల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా స్పందన లేదని వాపోయారు. తనకు తెలియకుండా చేసిన మ్యుటేషన్కు సంబంధించిన పత్రాలివ్వాలని కోరినా అధికారులు స్పందించడం లేదని తెలిపారు. ‘అధికారులు చేసిన తప్పు నాకెందుకు శాపంగా మారింది?’ అంటూ వీరయ్య ప్రశ్నించారు. -
రీసర్వేలో తప్పులు
మా గ్రామంలో మాకు 2.38 సెంట్ల భూమి ఉంది. 80 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం. మా వద్ద పాస్బుక్, వన్బీ అడంగళ్ ఉన్నాయి. అనుభవదారు కింద కూడా నమోదై ఉన్నాం. అయితే ఎనిమిది నెలల క్రితం జరిగిన రీసర్వేలో అధికారులు మా పొలాన్ని పెద్దమాలకొండయ్య పేరుపై రికార్డుల్లో నమోదు చేశారు. ఆయన ఆ పొలం తనది కాదని రాతపూర్వకంగా ఇచ్చారు. రికార్డులను సరిచేయాలని ఎనిమిది నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కరించలేదు. – కొల్లిబోయిన శ్రీనివాసులు, సున్నంవారిచింతల, ఉదయగిరి మండలం -
రైలు ఢీకొని యువకుడి మృతి
కోవూరు: రైలు ఢీకొని ఓ యువకుడు మృతిచెందిన ఘటన పడుగుపాడు రైల్వేస్టేషన్ సమీపంలో కిలోమీటర్ నంబర్ 178/2 – 4 పోస్టుల మధ్య చోటుచేసుకుంది. చనిపోయిన వ్యక్తి వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు తెలుపు రంగు చొక్కా, బులుగు రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. ఎడమ చెవికి కమ్మ ఉంది. కుడి చేతిపై సుబ్బమ్మ అని ఇంగ్లిష్, ఎన్టీఆర్ అక్షరాలతో టాటూలు, త్రిశూలం గుర్తులున్నాయి. మృతుడి వివరాలు తెలిసిన వారు 83280 86971 ఫోన్ నంబర్ను సంప్రదించాలని కావలి జీఆర్పీ ఎస్సై కె.వెంకట్రావు కోరారు. 620 బస్తాల పీడీఎస్ బియ్యం స్వాధీనం నెల్లూరు(పొగతోట): అక్రమంగా తరలిస్తున్న 620 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని వెంకటాచలం టోల్ప్లాజా వద్ద పట్టుకున్నామని డీఎస్ఓ పుల్లయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం రాత్రి వెంకటాచలం టోల్ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించామన్నారు. లారీ (ఏపీ 26 టీఈ 1233)లో అక్రమంగా బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బియ్యం, లారీని స్వాధీనం చేసుకుని వెంకటాచలం పోలీస్స్టేషన్కు అప్పగించామన్నారు. సంబంధించిన వ్యక్తులపై 6ఏ కేసు నమోదు చేశామన్నారు. తనిఖీల్లో సీఎస్ డీటీలు సైమన్బాబు, అజేయుల్లాఖాన్ పాల్గొన్నట్లు వెల్లడించారు.రైలు కింద పడి బలవన్మరణం గూడూరు: గూడూరు – వెంకటగిరి మధ్యలో నిడిగల్లు రైల్వేస్టేషన్కు సమీపంలో సోమవారం తెల్లవారుజామున రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్యాంగ్మెన్లు ఇచ్చిన సమాచారం మేరకు గూడూరు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. నిడిగల్లు రైల్వేస్టేషన్ ఒకటో నంబర్ ప్లాట్ఫారం దక్షిణం వైపు చివరగా సుమారు 40 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. తల, మొండెం వేరయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లుగా రైల్వే పోలీసులు తెలిపారు. కండలేరులో 23.75 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 23.75 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 10, హైలెవల్ కాలువకు 90, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
కెమిస్ట్రీ అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు (టౌన్): స్టోన్హౌస్పేటలోని కేఏసీ జూనియర్ కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపక పోస్టుకు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ శ్రీనివాసులురెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను కళాశాలలో ఈ నెల 17లోపు అందజేయాలని, ఇంటర్వ్యూలను 19న నిర్వహించనున్నామని చెప్పారు. పీజీలో కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండాలని పేర్కొన్నారు. అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ ప్రవేశాలు నెల్లూరు (టౌన్): అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2026 – 27 విద్యా సంవత్సరంలో డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని సర్వోదయ కళాశాల కోఆర్డినేటర్ పిచ్చయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎల్ఐఎసీఎస్ కోర్సులున్నాయని చెప్పారు. వివరాలకు drbraouap.ac.inను సంప్రదించాలని సూచించారు. పవిత్ర ఆలయంలో చిల్లర వేషాలు ● సింహపురి గ్రామదేవత సన్నిధిలో వీరంగం ● నియోజకవర్గ ప్రజాప్రతినిధి పేరుతో హల్చల్ నెల్లూరు(బృందావనం): స్థానిక ప్రజాప్రతినిధి మనుషులమంటూ ఓ పది, 15 మంది నెల్లూరు రూరల్ పరిధిలోని సింహపురి గ్రామదేవత ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో హల్చల్ చేశారు. ఆషాఢ మాసం ఆఖరి ఆదివారం కావడంతో ఎంతో మంది భక్తులు ఆలయానికి వచ్చారు. ఈ క్రమంలో రూ.50 టికెట్లను కొందరు తీసుకోకుండా వీఐపీ దర్శనం కల్పించాలంటూ నానా హంగామా చేశారు. వీరిని క్యూలైన్లను పర్యవేక్షిస్తున్న సిబ్బంది నిలువరించారు. ఈ క్రమంలో విధివిధానాలను ప్రశ్నిస్తూ కొందరు వ్యక్తులతో కలిసి దేవస్థాన ప్రాంగణంలో గందరగోళం చేసేందుకు యత్నించారు. సిబ్బందిని బెదిరింపులకు గురిచేస్తూ వారిపైకొస్తూ మొబైల్ కెమెరాల్లో చిత్రీకరించారు. ఈ తతంగం జరుగుతున్నా, దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ ఒట్టూరు సురేంద్రయాదవ్, ఈఓ గిరికృష్ణ మిన్నకుండిపోయారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి పేరు చెప్పడంతో ఎవరితో ఎలాంటి ఇబ్బందులొస్తాయనే ఉద్దేశంతో వారు మౌనం దాల్చారని తెలుస్తోంది. ఇదిలా ఉండగా నెల క్రితమే దేవస్థానంలో గదిని బుక్ చేసుకున్న వారితో సైతం వాగ్వాదానికి దిగారని సమాచారం. ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వరిస్తున్న స్వప్న అనే ఉద్యోగితో పాటు మరో నలుగురిపై అనుచితంగా ప్రవర్తించారు. పలు అంశాలను తమ ఫోన్లలో చిత్రీకరించి సిబ్బందిపై చిందులేశారు. మేకపాటి రాజగోపాల్రెడ్డిపై కేసు నమోదు ఉదయగిరి: అనుమతి లేకుండా ర్యాలీని నిర్వహించారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డిపై కేసును ఎస్సై మహేంద్ర సోమవారం నమోదు చేశారు. ముందస్తు అనుమతి లేకుండా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ ట్రాఫిక్కు అంతరాయం సృష్టించారంటూ కేసు నమోదు కావడం విస్మయానికి గురిచేసింది. కాగా మరికొందరిపై సైతం కేసు నమోదు చేశారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 87,179 మంది ఆదివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాల ను 34,256 మంది అర్పించారు. కానుకల రూ పంలో హుండీలో రూ.4.03 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. కాగా సర్వదర్శన టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
ఇంటికి చేరే వేళ.. అంతలోనే విషాదం
రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదం నింపాయి. ఇంటి పెద్దలు చనిపోవడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. ఓ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి మృతిచెందింది.● వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం గ్రావెల్ టిప్పర్ ఢీకొని.. కోట: ఉపాధి పనులు ముగించుకుని మోపెడ్పై ఇంటికి తిరిగి వెళ్తున్న దంపతులను గ్రావెల్ టిప్పర్ ఢీకొట్టింది. దీంతో భర్త దుంపల ఏడుకొండలు (58) మృతిచెందాడు. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం విద్యానగర్ సమీపంలోని సాగరమాల రోడ్డులో చోటుచేసుకుంది. ఎస్సై పవన్కుమార్, కొత్తపాళెం గ్రామస్తుల కథనం మేరకు.. కొత్తపాళేనికి చెందిన ఏడుకొండలు తన భార్య లక్ష్మమ్మతో కలిసి పెన్నక్కచెరువు వద్ద ఉపాధి పనులకు వెళ్లాడు. ముగిశాక మోపెడ్పై ఇంటికి తిరిగి వస్తుండగా సాగరమాల రోడ్డు పనులు జరుగుతున్న ప్రాంతంలో ప్రమాదం జరిగింది. రోడ్డు నిర్మాణానికి గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్.. రోడ్డు దాటుతున్న మోపెడ్ను ఢీకొంది. దీంతో ఏడుకొండలు టిప్పర్ చక్రాల కింద చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. లక్ష్మమ్మకు గాయాలు కావడంతో కోటకు తరలించి చికిత్స అందించారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలున్నారు. ఘటనా స్థలాన్ని ఎస్సై పరిశీలించి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై తెలిపారు. ఆటో బోల్తా పడి.. చేజర్ల: ఆటో బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందగా.. అతని కుమారుడు తీవ్రంగా గాయపడిన ఘటన చేజర్ల మండలం చిత్తలూరు గ్రామ సమీపంలోని రెడ్డిగుంట వాగు వద్ద చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువుల కథనం మేరకు.. పుట్టుపల్లి గ్రామానికి చెందిన ఫేక్ రహంతుల్లా (46) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తన కుమార్తె పెళ్లి సామగ్రి కొనుగోలు చేసేందుకు ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఆటోలో నెల్లూరుకు వెళ్లాడు. రాత్రి తిరిగి వస్తుండగా చిత్తలూరు సమీపంలోని రెడ్డిగుంట వాగు వద్దకు వచ్చేసరికి కోతి అడ్డు వచ్చింది. దాన్ని తప్పించే క్రమంలో ఆటో కుదుపులకు కుమారుడు కిందకు దూకుతున్న సమయంలో రహంతుల్లా అతడిని పట్టుకుబోయాడు. ఈ క్రమంలో ఆటోను వదిలేయడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు ఆటో కింద నలిగిపోయారు. రహంతుల్లా అక్కడికక్కడే చనిపోయాడు. కుమారుడు తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మృతుడు పలువురు యువకులకు ఆటో నడపడంలో శిక్షణ ఇచ్చేవాడు. అందరితో సన్నిహితంగా మెలిగే రహంతుల్లా మృతితో తోటి ఆటో డ్రైవర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరో 30 నిమిషాల్లో స్వగ్రామానికి చేరుకుంటామని ఫోన్లో చెప్పిన వ్యక్తి.. ఇంతలోనే ప్రమాదానికి గురై మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
ట్రాక్టర్ను ఢీకొట్టిన కారు
దగదర్తి: ఆ కుటుంబం నెల్లూరు నుంచి ఉత్తరప్రదేశ్లోని తమ స్వగ్రామానికి కారులో బయలుదేరింది. ఈ క్రమంలో సున్నపుబట్టి జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి చనిపోయింది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని జ్యోతి నగర్లో వ్యాపార నిమిత్తం పఠాన్ ముస్లిం ఖాన్ తన కుటుంబంతో ఉంటున్నాడు. వారంతా కలిసి కారులో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని తమ స్వగ్రామమైన బైసా గ్రామానికి బయలుదేరారు. కారును ముస్లింఖాన్ నడుపుతున్నాడు. సున్నపుట్టి జామాయిల్ ఫారెస్ట్ వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న ట్రాక్టర్ను వేగంగా వెళ్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ట్రాక్టర్ రోడ్డుపై బోల్తా పడింది. సమాచారం అందుకున్న దగదర్తి పోలీసులు హైవే ఫోర్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ముస్లిం ఖాన్ కుమార్తె పఠాన్ జైనబ్ ఫాతిమా (3)ను హైవే అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. ముస్లింఖాన్ భార్య ఉ జ్మఖాన్, తమ్ముడు హాసిల్ ఖాన్, కుమారుడు పఠాన్ ఆయత్ ఖాన్, కుమార్తె పఠాన్, ట్రాక్టర్ డ్రైవర్ బత్తుల శ్రీనివాసులుకు గాయాలయ్యాయి. ఇతడిని కొడవలూరు మండలం పెయ్యలపాళెం గ్రామవాసిగా గుర్తించారు. క్షతగాత్రులను నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశామని ఎస్సై మహేంద్ర తెలిపారు. -
రైలుపై రాళ్లు వేసిన నిందితుల అరెస్ట్
చిల్లకూరు: ఇద్దరు యువకులు మద్యం మత్తులో మైసూర్ ఎక్స్ప్రెస్పై రాళ్లు వేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సోమవారం రైల్వే పోలీసులు వివరాలు వెల్లడించారు. ఈనెల 7వ తేదీ రాత్రి మైసూర్ నుంచి దర్బాంగా బయలుదేరిన రైలు గూడూరు రైల్వేస్టేషన్ దాటుతోంది. పార్శిల్ ఆఫీస్ దగ్గర రైలుపై రాళ్లు విసిరారు. దీంతో కిటికి పక్కన కూర్చుని ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరులో రైలు నిలిపి అతడికి చికిత్స అందించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దుండగుల కోసం గాలించారు. సోమవారం గూడూరు రైల్వేస్టేషన్ వద్ద ఇందిరమ్మ కాలనీకి చెందిన అసనాపురం రాజేష్, గాంధీ నగర్కు చెందిన సూరిపాక విగ్నేష్ను పట్టుకున్నారు. వారిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లుగా నెల్లూరు రైల్వే ఇన్స్పెక్టర్ సుధాకర్ తెలిపారు. గూడూరు రైల్వే ఎస్సై ఎం.నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
లైసెన్స్డ్ సర్వేయర్ల నూతన కార్యవర్గం ఏర్పాటు
నెల్లూరు(బృందావనం): నెల్లూరులోని పురమందిరం ప్రాంగణంలో ఏసీ హాల్లో సోమవారం ఆంధ్రప్రదేశ్ లైసెన్స్డ్ సర్వేయర్ల సర్వసభ్య సమావేశం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ముత్యంగౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రీసర్వే పనులకు లైసెన్స్డ్ సర్వేయర్లను వినియోగించుకోవాలన్నారు. గౌరవ వేతనం ఏర్పాటు చేయాలని, టీఏ, డీఏలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా దార్ల దయాకర్, ఉపాధ్యక్షుడిగా పొన్నపూడి తాతారావు, కార్యదర్శిగా బొడ్డు శ్రీహరి, ఎంకే జగదీషన్, కె.రమేష్, కోశాధికారిగా ఐవీ కృష్ణమోహన్, సాయి ప్రసూన, డివిజన్ల ప్రెసిడెంట్లుగా కె.విజయకుమార్, ఎస్కే మసూద్, ఎస్కే ఇమ్రాన్బాషా, మునిచంద్ర, కార్యవర్గ సభ్యులుగా సీహెచ్ కోటేశ్వరరావు, డి.శ్రీనివాసరావు, కె.రవికుమార్, జి.బ్లెస్సీ నియమితులయ్యారు. -
సీబీఐతో విచారణ జరిపించాల్సిందే
● కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు(పొగతోట): మెగా డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐతో విచారణను జరిపించేంత వరకు తమ పోరాటాన్ని ఆపేదిలేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. మెగా డీఎస్సీపై నిరసన ర్యాలీని నగరంలో ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. మెగా డీఎస్సీ ఉద్యమంలో సీఎం పీఠం కదిలిపోతోందని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ గజగజ వణికిపోతున్నారని విమర్శించారు. తమ పార్టీ చేపట్టిన ఉద్యమానికి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోందని వివరించారు. డీఎస్సీ పేపర్ లీకై ందని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కుట్రలు, కుతంత్రాలతో అభ్యర్థులకు సర్కార్ అన్యాయం చేసిందని మండిపడ్డారు. సీబీఐ విచారణను తాము కోరుతుంటే, మంత్రి నారాయణ క్లీన్ చిట్ ఇచ్చారని ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర తర్వాత అతి పెద్ద ఉద్యమమిదే.. సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత ఆ స్థాయిలో జరుగుతోంది మెగా డీఎస్సీ ఉద్యమమేనని పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. బాధ్యులను శిక్షించాలనే తాము కోరుతున్నామన్నారు. డీఎస్సీని రద్దు చేయాలనో లేదా ఇచ్చిన ఉద్యోగాలను తీసేయాలని తామెక్కడా చెప్పడంలేదని తెలిపారు. విచారణ పారదర్శకంగా జరగాలంటే లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆధారాలను ట్యాంపరింగ్ చేశారని, ఆయన మంత్రిగా ఉంటే విచారణను పక్కదారి పట్టించే అవకాశం ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనిలోనూ పారదర్శకత లోపించిందని విమర్శించారు. ఉద్యమం చేస్తున్న తమ పార్టీ శ్రేణులపై కేసులు పెట్టడంలో ఉన్న శ్రద్ధ.. అక్రమాలకు పాల్పడిన వారిపై ఎందుకు లేదని ప్రశ్నించారు. యువత, విద్యార్థులు రోడ్లపైకొచ్చి ప్రశ్నిస్తుంటే, విచారణకు సర్కార్ ఎందుకు వెనుకడుగేస్తోందో చెప్పాలన్నారు. ఉద్యోగాలొచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేసి వారితో ర్యాలీలు చేయించడం సిగ్గుచేటని విమర్శించారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రభుత్వమే ప్రోత్సహించి.. బస్సులను ఏర్పాటు చేసి డబ్బులు ఖర్చు పెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. డీఎస్సీ అక్రమాలపై త్వరలో జరగనున్న శాసనమండలి సమావేశాల్లో ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. -
నేడు ‘డయల్ యువర్ ఎస్ఈ’
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ వినియోగదారులు సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ పరిధిలో ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని ఎస్ఈ రాఘవేంద్రం సోమవారం నిర్వహించనున్నారు. నెల్లూరు విద్యుత్ భవన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. వినియోగదారులు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య 0861 – 2320427 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు. ● తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం సీఎండీ శివశంకర్ ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వినియోగదారులు 89777 16661 నంబర్కు ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు.సీతారామపురం: మండలంలోని పండ్రంగి గ్రామ సమీపాన ఆదివారం ట్రాక్టర్ పైనుంచి పడి జార్ఖండ్కు చెందిన సుక్రం చటుంబా అనే యువకుడు గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. విద్యుత్ స్తంభాలను తీసుకెళ్తున్న ట్రాక్టర్పై నిలబడి ప్రయాణిస్తున్న చటుంబా ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో కుడికాలు విరిగింది. క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరుకు తరలించారు.20 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత గూడూరురూరల్: గూడూరు మండలం చవటపాళేనికి చెందిన బాలకిషోర్ అనే వ్యక్తి ఆటోలో 20 బస్తాల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా గూడూరు డిప్యూటీ తహసీల్దార్ చైతన్య, సిబ్బంది పట్టుకున్నారు. జాతీయ రహదారిపై పోటుపాళెం కూడలి ప్రాంతంలో ఆదివారం ఉదయం ఈ తనిఖీలు నిర్వహించారు. పట్టుకున్న రేషన్ బియ్యాన్ని తిలక్నగర్ ప్రాంతంలోని గోదాముకు అప్పగించారు. అనంతరం ఆటోను సీజ్ చేసి గూడూరు రూరల్ పోలీస్స్టేషన్కు తరలించారు. ఓజిలి మండలం ఆర్మేనిపాడులో ప్రజల నుంచి కిలో రూ.16 చొప్పున రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, నెల్లూరులోని రైస్ మిల్లులో అధిక ధరకు విక్రయించేందుకు ఆటోలో తరలిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ మేరకు బాలకిషోర్పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మరుపూరులో ఆలయాల్లో చోరీలు పొదలకూరు: మండలంలోని మరుపూరు గ్రామం కామాక్షి సమేత మల్లికార్జునస్వామి ఆలయం, సాయిబాబా మందిరంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కరెంట్ లేని సమయంలో మల్లికార్జునస్వామి దేవస్థానం గ్రిల్స్కు ఉన్న తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు హుండీని అపహరించారు. దానిని సమీపంలోని చెరువు కట్టకు తీసుకెళ్లి పగులగొట్టి అందులోని సుమారు రూ.8 వేల నగదును తీసుకెళ్లారు. ఇదే దేవస్థానంలో గతేడాది దుండగులు హుండీని అపహరించారు. సాయిబాబా మందిరంలో ఇదే తరహాలో హుండీని ఎత్తుకెళ్లి సమీపంలోని చంద్రశేఖర్రెడ్డి తోటలో పగులగొట్ట అందులో ఉన్న నగదును తీసుకెళ్లిపోయారు. పోలీసులు ఫిర్యాదు చేయనున్నట్టు గ్రామస్తులు వెల్లడించారు. కండలేరులో 23.95 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 23.95 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 10, హైలెవల్ కాలువకు 90, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. పొదలకూరు నిమ్మధరలు (కిలో) పెద్దవి: రూ.70 సన్నవి: రూ.30 పండ్లు: రూ.15 -
పత్తా ఉండరు
వాస్తవానికి ఆస్పత్రికి డాక్టర్లు ఉదయం ఎనిమిదికే రావాలి. గంట పాటు రౌండ్స్ వేసి ఇన్పేషెంట్లను చూసి ఓపీలకు తొమ్మిదింటికి రావాల్సి ఉంది. అయితే సీనియర్ వైద్యుల్లో అతి కొద్ది మందే ఓపీలకొస్తున్నారు. ఎక్కువ శాతం మంది పత్తా ఉండరు. పది గంటల తర్వాత తీరిగ్గా వచ్చి, చుట్టపు చూపుగా గంటో.. రెండు గంటలో ఓపీ సేవలందిస్తారు. రక్త, ఎక్స్రే, ఎకో, అబ్డామిన్ లాంటి పరీక్షలు రాస్తారు. అయితే రిపోర్టులొచ్చేలోపే మళ్లీ అదృశ్యమవుతారు. ఫలితంగా జూనియర్ డాక్టర్లందించే వైద్యమే రోగులకు దిక్కవుతోంది. ఇక సూపర్ స్పెషాల్టీలో న్యూరో సర్జన్లు, కేన్సర్ విభాగ డాక్టర్లు ఎప్పుడోస్తారో.. రారో సైతం ఎవరికీ తెలియదు. వారి ఓపీ విభాగాలు ఖాళీగా దర్శనమిస్తుంటాయి. ఫలితంగా నాణ్యమైన వైద్యం మృగ్యమవుతోంది. -
విద్యుత్ భవన్లో అగ్నిప్రమాదం
● మీటర్ టెస్టింగ్ ల్యాబ్కు మంటల వ్యాప్తి నెల్లూరు(వీఆర్సీసెంటర్): నెల్లూరులోని ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా ప్రధాన కార్యాలయం విద్యుత్ భవన్ ప్రాంగణంలో పాత ఎంఆర్టీ భవనంలో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యుత్ సబ్స్టేషన్ల నుంచి మరమ్మతులకు గురైన, అధికంగా రీడింగ్ వస్తున మీటర్లను ఇక్కడికి తీసుకొస్తారు. వాటిని టెస్టింగ్ ల్యాబ్లో తనిఖీ చేస్తారు. మరమ్మతులకు గురైన వాటిని పునరుద్ధరిస్తారు. పూర్తిగా చెడిపోయిన మీటర్లను అక్కడే ఉంచుతారు. ఆదివారం ఈ ప్రదేశంలో అగ్నిప్రమాదం జరిగి మీటర్లు కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. -
అమాంతం పెరిగిన నిమ్మ ధరలు
● బస్తా కాయలు రూ.ఐదు వేలు ● తగ్గిన దిగుబడి ● రేట్లు మరింత పెరిగే అవకాశం పొదలకూరు: నిమ్మ ధరలు పెరిగాయని సంతోషపడాలో.. లేక దిగుబడి లేక బాధపడాలో అర్థం కాని పరిస్థితి రైతుల్లో ఏర్పడింది. ఇటీవల నిమ్మ ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా కిలో రూ.30 నుంచి రూ.70 వరకు ఎగబాకాయి. బస్తా కాయలను మార్కెట్లో రూ.ఐదు వేలకుపైగా విక్రయిస్తున్నారు. అయితే తోటల్లో దిగుబడులు తగ్గి, కాయల అవసరం పెరిగి రేట్లు పెరుగుతున్నాయని తెలుస్తోంది. నెలాఖరు నాటికి మరింత ఎగబాకే అవకాశం ఉంది. రేట్లు పతనమై కిలో కాయలు రూ.15కు విక్రయం కాని పరిస్థితి వస్తుందని జిల్లా స్థాయి అధికారులు ముందస్తుగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే పండగల సీజన్తో కొంత ఊపిరిపోసుకున్నా, ఇవి తాత్కాలికంగానే ఉంటాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. వర్షాలు ప్రారంభమైతే ఎగుమతి పూర్తిగా తగ్గిపోయే అవకాశముంది. దసరా వరకు నష్టం వాటిల్లకుండా ధరలుంటాయని చెప్తున్నారు. తోటల్లో కాయల్లేకపోవడంతో ఇప్పుడు డిమాండ్ మెలమెల్లగా పెరిగి, ఢిల్లీ మార్కెట్ పుంజుకుంటూ ధరలను పెంచుతున్నారని తెలుస్తోంది. ధరలు పెరగడం మంచిదే ధరలు పెరగడం మంచి పరిణామమే. అయితే నెల ముందే ఇది జరిగి ఉంటే రైతులు బాగేపడేవారు. తోటల్లో కాయల్లేని తర్వాత పెరగడంతో తక్కువ మందికే ప్రయోజనం కలుగుతుంది. – పెంచలనారాయణరెడ్డి, నిమ్మ రైతు, అంకుపల్లి -
ఎన్నికల హామీలెప్పుడు నెరవేరుస్తారు?
● ‘చలో మెప్మా’ రేపు ● ఐద్వా జిల్లా కార్యదర్శి మస్తాన్బీనెల్లూరు(వీఆర్సీసెంటర్): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా, నగర కార్యదర్శులు మస్తాన్బీ, కత్తి పద్మ ప్రశ్నించారు. నెల్లూరు బాలాజీ నగర్లోని డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్లో ఐద్వా నగర రమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పొదుపు మహిళల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 11వ తేదీన ‘చలో మెప్మా’ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. మెప్మా, బ్యాంక్ అధికారులు నెల్లూరు నగరంలో పొదుపు మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. బ్యాంక్ లింకేజీ రుణాలు ఇచ్చి అధిక వడ్డీలను బ్యాంక్లు వసూలు చేస్తున్నాయన్నారు. దీంతో అనేక మంది మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ప్రతినెలా మహిళకు రూ.1,500 ఇస్తామని చెప్పారన్నారు. అదేవిధంగా నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారన్నారు. అయితే ఇప్పటి వరకూ ఏ మహిళకు, నిరుద్యోగికి లబ్ధి చేకూర్చలేదన్నారు. ఓట్ల కోసం కూటమి నాయకులు అనేక హామీలు ఇచ్చారన్నారు. ‘చలో మెప్మా’ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో ఐద్వాకు చెందిన సుబ్బమ్మ, ఆదిల క్ష్మి, ముంజుమ్మ, భాగ్యమ్మ పాల్గొన్నారు. -
ఎక్సలెన్స్ సెంటర్ పేరుతో కడుపు కొట్టడం దారుణం
● ఎంపీ గురుమూర్తి గూడూరు రూరల్: కోటలోని అంబేడ్కర్ ఎస్సీ గురుకులాన్ని ఐఐటీ, జేఈఈ, నీట్ ఎక్సలెన్స్ సెంటర్ పేరుతో ఎత్తేసి 600 మంది దళిత విద్యార్థుల కడుపు కొట్టడం దారుణమని తిరుపతి ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు. కలెక్టర్కు తెలియకుండా ఎస్సీ గురుకులాన్ని విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు ఎత్తేయడం దుర్మార్గమని చెప్పారు. ఇక్కడ ఐదు నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 600 మంది విద్యార్థులను ఖాళీ చేయించి వారిని వాకాడు, చిల్లకూరు, నాయుడుపేట ప్రాంతాల్లోని గురుకులాలకు తరలించి అదనపు భారాన్ని మోపడం సిగ్గుచేటని విమర్శించారు. ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించి భవనాలను నిర్మించడం చేతగాక, ఉన్న గురుకులాన్ని మూసేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. విద్యార్థుల ఆవేదన, గురుకుల పాఠశాల ఆవశ్యకతతో పాటు కొనసాగించేలా చర్యలు చేపట్టాలని కోరుతూ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించి దళిత విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. డీఎఫ్ఓగా శ్రీకాంత్రెడ్డి నెల్లూరు(అర్బన్): జిల్లా అటవీశాఖాధికారి (డీఎఫ్ఓ)గా కావలి సబ్ డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీకాంత్రెడ్డి పూర్తి అదనపు బాఽధ్యతలను వేదాయపాళెంలోని ఆ శాఖ కార్యాలయంలో ఆదివారం స్వీకరించారు. ఇప్పటి వరకు డీఎఫ్ఓగా పనిచేసిన ఐఎఫ్ఎస్ మహబూబ్బాషా ఉత్తరాఖండ్లోని దెహ్రాదూన్లో గల ఇందిరాగాంధి నేషనల్ ఫారెస్ట్ అకాడమీలో అక్టోబర్ తొమ్మిది వరకు నిర్వహించనున్న ప్రొఫెషనల్ స్కిల్ అప్గ్రడేషన్ శిక్షణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రిలీవయ్యారు. దీంతో శ్రీకాంత్రెడ్డిని ఏపీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ అండ్ హెడ్ ఫారెస్ట్స్ ఫోర్స్ డాక్టర్ చలపతిరావు నియమించారు. గురుకులం ఎత్తివేత దళిత బిడ్డలపై కుట్రే కోట: కోటలో ఎస్సీ గురుకుల పాఠశాల, కళాశాలను ఎత్తేయడం దళిత బిడ్డలపై జరిగిన కుట్రగానే భావించాల్సి వస్తుందని రిటైర్డ్ సీఐడీ అడిషనల్ డీజీ, ఐపీఎస్ సునీల్కుమార్ పేర్కొన్నారు. ఎస్సీ గురుకులాన్ని దళిత సంఘాలతో కలిసి ఆదివారం పరిశీలించారు. ముందస్తు సమాచారంతో గేట్లను అధికారులు మూసేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళిత సంఘాల నేతలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 600 మంది విద్యార్థులు చదువుతున్న గురుకులాన్ని ఎలాంటి సమాచారం లేకుండా మూసేయడం దారుణమన్నారు. ఇతర చోట్ల పిల్లలు సర్దుబాటు కాకపోవడంతో వంద మంది వరకు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని తెలిపారు. నీట్, ఐఐటీ శిక్షణ కేంద్రం కోసం ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నా, వాటిని పరిశీలించకుండా ఖాళీ చేయించారని ఆరోపించారు. గురుకులాన్ని కొనసాగించాలని, అప్ప టి వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. నేతలు మీజూరు మాధవ్, దాసరి అశోక్, మల్లికార్జున్, వసంత్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలు సరే.. నిధులేవి?
● నేటి నుంచి జిల్లా స్థాయి అమరావతి చాంపియన్షిప్ పోటీలు ● ఖర్చుల కింద కేవలం రూ.50 వేలు మాత్రమే.. ● ఒక్కో క్రీడాకారుడికి టిఫిన్, భోజనం, రవాణాకు రూ.140 కేటాయింపు ● పరికరాల కొనుగోలుకు నిధులివ్వని ప్రభుత్వం ● నియోజకవర్గ స్థాయిలోనూ నామమాత్రంగానే పోటీలునాణ్యమైన భోజనం అందేనా?నెల్లూరు(టౌన్): అమరావతి చాంపియన్షిప్ క్రీడా పోటీల నిర్వహణ మొక్కుబడిగా సాగుతోంది. పోటీలను ఘనంగా జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.. అందుకు అనుగుణంగా నిధులు కేటాయించలేదు. జిల్లాలో నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పోటీల నిర్వహణకు నామమాత్రపు నిధులు విడుదల చేసి పండగ వాతావరణంలో చేయాలని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అథ్లెటిక్స్, ఖోఖో, బాక్సింగ్, చెస్, కబడ్డీ, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, యోగా, ఆర్చరీ, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, హాకీ తదితర క్రీడాంశాల్లో అండర్ 17, 23 విభాగాల్లో పోటీలు నిర్వహించాలని సూచించారు. అయితే ఆయా పోటీలకు అవసరమైన కొత్త క్రీడా పరికరాల కొనుగోలుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. ఉన్న వాటిని వినియోగించుకోవాలని లేదా క్రీడాకారులే తీసుకోచ్చుకోవాలని ఉచిత సలహా అందజేశారు. దీంతో అనేకమంది ఆసక్తి చూపలేదు. తప్పని పరిస్థితుల్లో జిల్లా శాప్ అధికారులు నామమాత్రంగా నిర్వహించాల్సి వస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా పోటీలతో పోలిస్తే ప్రస్తుత పోటీల నిర్వహణకు కేటాయిస్తున్న నిధులు చాలా తక్కువగా ఉన్నాయి. అప్పట్లో క్రీడా పరికరాలు, భోజనం, ఇతర నిర్వహణ ఖర్చులకు నిధులు కేటాయించడంతో పోటీలు ఉత్సాహంగా సాగాయి. మొక్కుబడిగా.. జిల్లాలో నియోజకవర్గ స్థాయి అమరావతి చాంపియన్షిప్ పోటీలు గత నెల 28 నుంచి ఈనెల 4వ తేదీ వరకు నిర్వహించారు. అయితే నిధుల కొరత కారణంగా పోటీలు నామమాత్రంగానే జరిగాయని పలువురు క్రీడాకారులు చెబుతున్నారు. ఒక్కో నియోజకవర్గంలో పోటీల నిర్వహణకు కేవలం రూ.5 వేల చొప్పున కేటాయించారు. టిఫిన్ ఖర్చులను క్రీడాకారులే భరించుకోవాల్సి వచ్చింది. మధ్యాహ్నం సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే భోజనాన్నే క్రీడాకారులకు అందించారు. పరికరాలను కూడా క్రీడాకారులే తీసుకురావాలని సూచించారు. అవసరమైతే పాఠశాలల్లో అందుబాటులో ఉన్నవాటిని వినియోగించుకోవాలని అధికారులు చెప్పారు. దీంతో పోటీల నిర్వహణపై క్రీడాకారుల్లో ఆసక్తి తగ్గింది. గతంలో మాదిరిగా క్రీడా పండగ వాతావరణం కనిపించలేదని ఆయా వర్గాలు అంటున్నాయి. -
డీఎస్సీ దగాపై ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్
● కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పొదలకూరు: డీఎస్సీ దగాపై తాము ప్రశ్నిస్తే.. డైవర్షన్ పాలిటిక్స్కు కూటమి ప్రభుత్వ పెద్దలు పాల్పడుతున్నారని, దగాపడిన నిరద్యోగులకు సర్కార్ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లిలో పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ రావుల దశరథరామయ్యగౌడ్, సర్వేపల్లి ఐటీ వింగ్ ప్రెసిడెంట్ రావుల ఇంద్రసేన్గౌడ్ ఆధ్వర్యంలో గ్రామదేవత అంకమ్మతల్లి ప్రత్యేక పూజలకు రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, కాకాణి ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డీఎస్సీ దగాలో డైవర్షన్ పాలిటిక్స్పై ప్రజలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. డీఎస్సీపై తమ పార్టీ సాగిస్తున్న పోరాటాలను చూసి టీడీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. వీరిలో అభద్రతాభావం పెరిగిందని, మీడియా సమావేశాల్లో మాట్లాడే తీరును పరిశీలిస్తే ఇదే విషయం అర్థమవుతోందని చెప్పారు. డీఎస్సీలో చోటుచేసుకున్న అవకతవకలపై స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమాల విషయమై తాము ఆధారాలతో సహా మాట్లాడుతున్నామని గుర్తుచేశారు. క్రీడాకారుల కోటాలో గతంలో ఇచ్చిన జీఓలను మార్చి కొత్త వాటిని తీసుకురావడం వెనుక అక్రమాలు దాగున్నాయనే అంశాన్ని తాము నమ్ముతున్నామని చెప్పారు. పార్టీ పటిష్టతకు శ్రేణులే కారణం జిల్లా అధ్యక్షుడిగా అన్ని నియోజకవర్గాల్లో తాను పర్యటిస్తున్నానని, సర్వేపల్లి నియోజకవర్గంలో పార్టీ పటిష్టంగా ఉందంటే అందుకు కార్యకర్తలు, నేతలే కారణమని చెప్పారు. బాధ్యతలను తన కుమార్తె పూజిత భుజాలపై వేసుకొని కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. పార్టీ శ్రేణుల నిబద్ధతకు ఏమిచ్చినా రుణాన్ని తీర్చుకోలేనన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించారని మండిపడ్డారు. టీడీపీ నిర్వహించే కార్యక్రమాలు వెలవెలబోతున్నాయని ఎద్దేవా చేశారు. భవిష్యత్తంతా తమ పార్టీదేనని, జగన్మోహన్రెడ్డి మరోసారి సీఎం కావడం తథ్యమని చెప్పారు. భారీ ర్యాలీలు నేడు డీఎస్సీ దగాపై జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలను తమ పార్టీ శ్రేణులు, విద్యార్థులు, యువత సోమవారం నిర్వహించనున్నారని కాకాణి వెల్లడించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలులో నిర్వహించనున్న ర్యాలీకి అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. బచ్చల సురేష్కుమార్రెడ్డి, వెన్నపూస దయాకర్రెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, బొమ్మిరెడ్డి హరగోపాల్రెడ్డి, దాసరి భాస్కర్గౌడ్, వెన్నపూస కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నేత కారు ఢీకొని యువకుడి మృతి
● మరో యువకుడి పరిస్థితి విషమం ● క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించకుండా వెళ్లిపోయిన వైనం ● క్షతగాత్రులను పట్టించుకోని దుర్మార్గం ● ఘటనపై కేసు కూడా నమోదు కాలేదని సమాచారంకావలి: పొంగళ్ల వేడుకకు వెళ్తున్న టీడీపీ నేత కారు ఢీకొని ఓ యువకుడు మృతిచెందగా, మరో యువకుడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికుల కథనం మేరకు.. కావలికి చెందిన టీడీపీ నేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి జనిగర్ల మహేంద్ర యాదవ్ ఆదివారం ముందర పొట్టెమ్మ తల్లి వద్ద పొంగళ్ల కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతను తన కారులో వెళ్తూ కావలి – తుమ్మలపెంట రోడ్డుపై బైక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను తొలుత కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తీసుకెళ్తుండగా మండలంలోని అడవి రాజుపాళేనికి చెందిన మంద వాసు (22) మృతిచెందాడు. మరో యువకుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. వాసు ఏసీ మెకానిక్గా పనిచేస్తూ కుటుంబానికి ఆధారంగా ఉన్నాడు. ప్రాణాలు పోతుంటే.. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి అక్కడి నుంచి వెళ్లిపోయారన్న ఆరోపణలున్నాయి. ఇద్దరు యువకులు అపస్మారక స్థితిలో ప్రాణాలతో పోరాడుతుండగానే పొంగళ్ల కార్యక్రమం యథావిధిగా కొనసాగడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ఓ యువకుడు మృతి చెందగా, మరొకరు మృత్యువుతో పోరాడుతున్న ఘటనపై కేసు కూడా నమోదు కాలేదని సమాచారం. దీంతో ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు సమగ్ర దర్యాప్తు జరిపి ప్రమాదానికి కారణాలు, బాధ్యులను తేల్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయడంతోపాటు, క్షతగాత్రుడికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఆక్రమించేద్దాం.. అడిగేదెవరు?
నెల్లూరు నగరంలో ప్రజలకు ట్రాఫిక్ నరకం చూపిస్తోంది. రహదారులు, ఫుట్పాత్లను ఆక్రమించిన పరిస్థితి ఉంది. ప్రధాన వీధుల్లో వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేస్తుండటంతో కష్టాలు తప్పడం లేదు. ఈ సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు.నెల్లూరు(బారకాసు): నెల్లూరు నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. నగర పాలక సంస్థ పరిధిలో సుమారు 10 లక్షల మంది నివసిస్తుండగా.. వివిధ పనుల నిమిత్తం నిత్యం ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు నగరానికి రాకపోకలు సాగిస్తుంటారు. దీనికితోడు వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, ఆస్పత్రులు, నిత్యావసర సరుకులు, పండ్లు, కూరగాయలు తదితర వ్యాపార సంస్థలు అధికంగా ఉన్నాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో నగరంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉంటోంది. నిబంధనలు గాలికి.. షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాల నిర్మాణాల్లో పార్కింగ్ స్థలం తప్పనిసరిగా ఉండేలా నిబంధనలు ఉన్నప్పటికీ.. వాటి అమలు సక్రమంగా జరగడం లేదన్న ఆరోపణలున్నాయి. కొన్ని నిర్మాణాల్లో సెల్లార్ను పార్కింగ్కు కేటాయించకుండా కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా దుకాణాలు, షాపింగ్ మాల్స్కు వచ్చే వాహనాలను రోడ్డుపైనే నిలిపివేస్తున్నారు. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఆక్రమణలతో.. మరోవైపు కొందరు వ్యాపారులు రోడ్డు మార్జిన్, ఫుట్పాత్లను ఆక్రమించి తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. కొంతకాలం తర్వాత అవే శాశ్వత నిర్మాణాలుగా మారుతున్నాయి. పండ్లు, టిఫిన్ తదితర దుకాణాలు రోడ్డు మార్జిన్లోకి విస్తరించడంతో పాదచారులు రోడ్డుపైనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో విశాలంగా ఉండాల్సిన ప్రధాన రహదారులు క్రమంగా కుచించుకుపోతున్నాయి. పట్టించుకోని అధికారులు ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు పోలీసులు, కార్పొరేషన్ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాల్సి ఉన్నా.. ఆశించిన స్థాయిలో చర్యలు కనిపించడం లేదని నగరవాసులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలు, రోడ్డు, ఫుట్పాత్ ఆక్రమణలను అధికారులు అడ్డుకోవాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. కార్పొరేషన్ అధికారులు సమావేశాల్లో రోడ్డు విస్తరణ, ఆక్రమణల తొలగింపుపై హామీలు ఇస్తున్నా.. ఆచరణలో మాత్రం ఆశించిన స్థాయిలో చర్యలు చేపట్టడం లేదని పలువురు పేర్కొంటున్నారు. విస్తరణతోనే పరిష్కారం నగరంలో పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రహదారులను విస్తరించడంతోపాటు ఫుట్పాత్లు, రోడ్డు మార్జిన్లను ఆక్రమణల నుంచి రక్షించాలని నగరవాసులు కోరుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలు, పార్కింగ్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి.. ఆక్రమణలను తొలగించి రోడ్డు విస్తరణ పనులు చేపడితే నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులకు కొంతమేర పరిష్కారం లభించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణాలు రోడ్డుపైనే వాహనాల పార్కింగ్ పాదచారులు, వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు చోద్యం చూస్తున్న టౌన్ప్లానింగ్ అధికారులు రోడ్డు విస్తరణతోనే సమస్యకు పరిష్కారం -
అర్జీదారుల కన్నీళ్లు.. కరిగించని అధికారుల రాతి గుండెలు
● క్షేత్రస్థాయి విచారణ లేకుండానే ‘పరిష్కారం’ ముద్ర ● రెవెన్యూ శాఖ ఫిర్యాదులే అధికం ● వినతులు.. బుట్టదాఖలు ● ఆత్మకూరు మండలం నాగులపాడుకు చెందిన రైతు దేవూరు కమలాకర్కు గ్రామంలో సర్వే నంబర్ 178లో 2 ఎకరాలు భూమి పిత్రార్జితం ద్వారా సంక్రమించింది. ఆ భూమిని కొందరు బడా వ్యక్తులు రికార్డులు తారుమారు చేసి నకిలీ పాసు పుస్తకాలు సృష్టించుకుని భూ ఆక్రమణ చేశారు. తన సమస్యను పరిష్కారం చేసి న్యాయం చేయాలని ఆయన ఇప్పటికి ఐదుసార్లు కలెక్టర్ ప్రజావిజ్ఞప్తుల కార్యక్రమంలో అర్జీలు ఇస్తూ తిరుగుతూనే ఉన్నారు. కానీ ఆయన సమస్య పరిష్కారం కాకపోగా పరిష్కరించినట్లు అధికారులు ముద్రవేస్తున్నారు. ● ఈయన పేరు లోకిరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి. జలదంకి మండలం కొత్తపాళెం. ఆయన కుటుంబానికి కలిగిరి మండలంలో 12.02 ఎకరాల పట్టా భూమి ఉంది. పక్కనే ఉన్న 8 ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూమికి దొంగ పట్టాలు సృష్టించి ఆక్రమించుకున్న కొందరు వ్యక్తులు ఇతని పట్టా భూమిని కూడా ఆక్రమించుకుంటున్నారు. స్థానిక తహసీల్దార్ కూడా ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నాడనే ఆరోపణలు చేస్తూ.. న్యాయం కోసం కలెక్టరేట్కు వచ్చి 45 దఫాలు అర్జీలిచ్చాడు. గత సోమవారం 46వ దఫా అర్జీ కలెక్టర్కు ఇచ్చి తమ గోడును వెళ్లబోసుకున్నాడు. తమకు భూమి లేకపోతే బతుకే లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. న్యాయం చేయలేకపోతే తన కుటుంబానికి కారుణ్య మరణానికై నా అనుమతించాలని వేడుకున్నాడు. కలెక్టర్ మాత్రం షరా మామూలే అన్నట్లు.. ఇతనికి ద్రోహం తలపెట్టిన తహసీల్దార్కు రెఫర్ చేశారు. అయితే రికార్డుల్లో సమస్యను పరిష్కరించినట్లు ఆన్లైన్ ఎక్కించేశారు. క్షేత్ర స్థాయిలో అయితే సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ● ఆత్మకూరు మండలం నల్లపరెడ్డిపల్లెకు చెందిన కరవళ్ల రవీంద్రరెడ్డి పొలానికి సంబంధించి రీసర్వేలో అధికా రులు తప్పులు చేశారు. ఆ విషయాన్ని సరిదిద్దమని ఆయన కలెక్టరేట్కు వచ్చి అర్జీ ఇచ్చారు. అయినా పరిష్కరించలేదు. ఆయన మాత్రం క్షేత్రస్థాయిలో అధికారుల చుట్టూ సంవత్సరం నుంచి తిరుగుతూనే ఉన్నాడు. ● కలువాయి మండలం తోపుగుంట అగ్రహారానికి చెందిన నాపా పెంచలయ్యకు ఆ గ్రామ పరిధిలో సర్వే నంబరు 21/2ఏలో 2.36 ఎకరాలు, 138/3ఈలో 0.03 సెంట్లు విస్తీర్ణం కలిగిన స్థిరాస్తి, ఇల్లును ఆయన తల్లికి పసుపు కుంకుమ ద్వారా సంక్రమించిన ఆస్తిని వీలునామా రిజిస్ట్రేషన్ చేసింది. అప్పటి ఆ భూమి ఆయన ఆధీనంలో ఉంది. ప్రస్తుతం ఆత్మకూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో (ఓఎస్ నంబరు 137/2024) విచారణ జరుగుతోంది. కోర్టులో సివిల్ కేసు పెండింగ్లో ఉన్న విషయం తెలిసీ కూడా కలువాయి మాజీ, ఇన్చార్జి తహసీల్దార్లు పెంచలయ్య సోదరుడు నాపా నరసింహులు పేరుపై వెబ్ల్యాండ్లో మ్యుటేషన్ చేశారు. ఈ సమస్య పరిష్కారానికి కలెక్టర్కు ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో ఇప్పటికి పలుమార్లు అర్జీలు ఇచ్చాడు. ఆయనకు ఎటువంటి సమాచారం లేకుండానే క్లోజ్ చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక.. ప్రహసనంగా మారింది. జిల్లా అధికార యంత్రాంగం మొత్తం ఆ రోజంతా స్వీకరించిన వినతులను.. సాయంత్రానికి బుట్టదాఖలు చేస్తున్న పరిస్థితి నెలకొందనే ఆరోపణలకు అనేక ఉదాహరణలు అద్దం పడుతున్నాయి. ‘రెవెన్యూ అధికారులతో కలిసి కొందరు ధనబలవంతులు నా భూమిని ఆక్రమించారు. మా భూమిని రెవెన్యూ అధికారులు తారుమారు చేసి మరొకరి పేరిట బదలాయించారు’ కలెక్టర్కు తమ గోడు చెప్పుకొంటే.. న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతో వ్యయప్రయాసలు పడి వచ్చి మొరపెట్టుకుంటే.. తిరిగి ఆ అర్జీలు తప్పు చేసిన తప్పుడు అధికారులకే పంపుతున్న దౌర్భాగ్య పరిస్థితి పరిపాలన వ్యవస్థ దౌర్భల్యానికి అద్దం పడుతోంది. రాజకీయ పలుకుబడి, ఆర్థిక బలవంతులు సామాన్యుడి భూములను కబ్జా చేస్తే.. పరిష్కరించాల్సిన రెవెన్యూ వ్యవస్థ కబ్జాదారుల కొమ్ము కాస్తూ.. వివాద వ్యాజ్యాలకు కారణమవుతున్నారు. సామాన్య జనం కన్నీళ్లు.. అవినీతి మరిగిన అధికారుల రాతి గుండెలను కదిలించలేకపోతున్నాయి. ఒకే సమస్యపై పదే పదే అర్జీలు సామాన్య ప్రజల సమస్యకు పరిష్కారం చూపేందుకు అంటూ ప్రభుత్వం ప్రతి సోమవారం ఆర్భాటంగా నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జిల్లాలో క్రమక్రమంగా తన అసలు ఉద్దేశాన్ని కోల్పోతోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లా నలుమూలల నుంచి సామాన్య జనులు తమ కష్టాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలనే ఆత్రుతతో రోజువారి పనులు మానుకుని, అప్పులు చేసి, ప్రయాణ ఖర్చులు భరించి కలెక్టరేట్కు వస్తున్నారు. ‘ఈసారైనా న్యాయం జరుగుతుందేమో’ అనే ఆశతో పదే పదే అర్జీలు సమర్పిస్తున్నారు. కానీ వారాలు, నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యమే. అర్జీకి జవాబుదారీతనమేదీ..? ప్రతి వారం వందలాది అర్జీలు స్వీకరించినట్లు అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ, వాటిలో ఎన్ని సమస్యలు నిజంగా పరిష్కారమయ్యాయనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు. గణాంకాల్లో పరిష్కారాలు పెరుగుతున్నా.. క్షేత్రస్థాయిలో సమస్యలు మాత్రం యథాతథంగానే ఉండడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోంది. ఒకే సమస్యపై పదేపదే అర్జీ వస్తుంటే.. ఎందుకు వస్తుందని ఆరా తీసి, ప్రత్యేక చర్యలు తీసుకోవడంలో జవాబుదారీ తనం కనిపించడం లేదు. పీజీఆర్ఎస్లో నమోదవుతున్న ఫిర్యాదుల్లో అత్యధికం రెవెన్యూ శాఖకు సంబంధించినవే. భూ వివాదాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, సర్వే సమస్యలు, పట్టాదారు పాస్బుక్, సరిహద్దు వివాదాలు వంటి అంశాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేయాల్సి ఉన్నా, చాలా చోట్ల చేయకుండానే పరిష్కరించినట్లు నమోదు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రతి అర్జీకి జవాబుదారీ తనంగా ఉంటామని చెబుతున్న అధికారులు వాస్తవంలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. అర్జీదారుల సమస్యను పరిష్కరించకుండానే పరిష్కార ముద్ర వేయడం. నిర్ణీత గడువు దాటకుండా ఉండేందుకు కొందరు అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా, బాధితులను సంప్రదించకుండా, ఎలాంటి చర్యలు తీసుకోకుండానే ఆన్లైన్లో ‘పరిష్కరించబడింది’ అని నమోదు చేస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి సమస్య అలాగే ఉండగా, కంప్యూటర్లో మాత్రం పరిష్కారమైనట్లు చూపించడం ద్వారా ప్రభుత్వాన్ని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అల్లూరు మండలం తలమంచి రెవెన్యూ గ్రామంలోని నార్త్ ఆమూలూరు నివాసి మౌలాలికి చెందిన ఒక ఎకరా పట్టా భూమిని రీ సర్వేలో సర్వేయర్ పక్క పొలం వారి పేరు మీద ఎక్కించారు. ఇది తెలిసిన ఆ రైతు సంవత్సర కాలంగా సరి చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. మ్యుటేషన్కు కూడా డబ్బులు చెల్లించాడు. అంటే రెవెన్యూ ఉద్యోగులు తప్పు చేస్తే శిక్ష మాత్రం రైతులకు పడుతోంది. పైగా లంచాలిచ్చి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అధికారులు చేసిన తప్పులను కూడా సరిచేయడం లేదు. ఇలాంటివి కోకొల్లలుగా జిల్లాలో ఉన్నాయి. కలెక్టర్ చూసి చూడనట్టు పోతుండటంతో పాలన.. పాలకులకు అనుకూలంగా మారిపోతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
జిల్లా వ్యాప్తంగా నాకాబందీ
నెల్లూరు(క్రైమ్): శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా శుక్రవారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రత్యేక నాకాబందీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, జాతీయ రహదారులు, జిల్లా ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. డ్రంక్ అండ్ డ్రైవ్పై 26 కేసులు, ఎంవీ యాక్ట్ కింద 325 కేసులు నమోదు చేసి రూ.1,46,190ల జరిమానా విధించారు. బహిరంగంగా మద్యం సేవించిన వారిపై 20 కేసులు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా 72 లాడ్జీలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచామన్నారు. క్రైమ్ ప్రోన్ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేపడుతున్నామని, ప్రజల భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే డయల్ 112కు లేదా జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ 93929 03143కు సమాచారం అందించాలని కోరారు. -
కూటమిపై తీవ్రస్థాయిలో ప్రజా వ్యతిరేకత
● మేకపాటి సమక్షంలో వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు ఉదయగిరి: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడంతో ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని, దీనివల్ల టీడీపీలో ఇమడలేక నాయకులు ఆ పార్టీని వీడుతున్నట్లు వైఎస్సార్సీపీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి అన్నారు. సీతారామపురం మండలం బసినేనిపల్లి, నెమళ్లదిన్నెతో పాటు పలు పంచాయతీలకు చెందిన టీడీపీ యువ కార్యకర్తలు శనివారం ఆ మండల యువనేత చింతంరెడ్డి లోకేశ్రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని దీక్షా శిబిరం వద్ద రాజగోపాల్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. అలాగే బసినేనిపల్లికి చెందిన నానిపోగు మనోహర్ ఆధ్వర్యంలో పలువురు టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి మేకపాటి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతిఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ప్రారంభమైందన్నారు. రెండేళ్ల ప్రజా వ్యతిరేక పాలనతో అన్నివర్గాల వారు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వలసలు భారీగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీసీ మండల యూత్ అధ్యక్షుడు పాలగిరి ముద్దుకృష్ణంరాజు, మండల ఐటీ వింగ్ ఉపాధ్యక్షుడు కప్ప సురేంద్రరాజు, ఇతర నేతలు కప్ప శ్రీనివాసరాజు, ముకుంద విక్రమ్, పాలకొలను సురేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
లారీని ఢీకొన్న బస్సు
మనుబోలు: ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి బస్సు ఢీకొన్న ఘటన మనుబోలులో జాతీయ రహదారిపై శనివారం జరిగింది. బెంగళూరు నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సు మనుబోలు సమీపానికి చేరుకోగానే ముందు వెళ్తున్న లారీ నెమ్మదించడంతో ప్రమాదవశాత్తు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం దెబ్బతింది. బస్సులో 22 మంది ప్రయాణికులుండగా, ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రయాణికులను పోలీసులు మరో బస్సులో తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. మద్యం మత్తులో డ్రైవర్, క్లీనర్ వీరంగం మనుబోలు: ఫూటుగా మద్యం తాగిన లారీ డ్రైవర్, క్లీనర్లు వీరంగం చేశారు. ఈ ఘటన మండలంలోని కాగితాలపూరు రోడ్డు వద్ద శనివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. మద్యం తాగిన లారీ డ్రైవర్, క్లీనర్ మధ్య ఓ మహిళ విషయంలో గొడవలు చెలరేగాయి. ఇద్దరూ కర్రలతో దాడులు చేసుకుంటూ జాతీయ రహదారిపైకి చేరుకోవడంతో వాహనాలు నిలిచిపోయాయి. ఇద్దరూ కలిసి హైవేపై నిలిపిన వాహనాలపైనా దాడులకు దిగడంతో ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరినీ అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. రైల్లోంచి జారిపడి వ్యక్తి మృతి మనుబోలు: రైల్లో నుంచి ప్రమాదవశాత్తు జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన మండల పరిధిలో శనివారం జరిగింది. రైల్వే పోలీసుల వివరాల మేరకు.. కొమ్మలపూడి–మనుబోలు రైల్వేస్టేషన్ మధ్య అప్లైన్లో వెళ్తున్న రైల్లో నుంచి సుమారు 40 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తుతెలియని వ్యక్తి జారిపడి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. తెలుపు రంగు, ఫుల్ హ్యాండ్ షర్ట్, బులుగు రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు గుర్తుతెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యుడిని అటకాయించి రాయితో దాడి నెల్లూరు(క్రైమ్): డబ్బులివ్వలేదన్న కోపంతో వైద్యుడిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసి గాయపరిచిన ఘటన పొర్లుకట్ట సెంటర్లో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. పాత మున్సిపల్ కార్యాలయ సమీపంలో నివాసం ఉంటున్న వైద్యుడు రవీంద్రనాథ్ ఠాగూర్ శుక్రవారం రాత్రి పుత్తా ఎస్టేట్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా పొర్లుకట్ట సెంటర్ వద్ద షఫీ, నాయబ్, మరో వ్యక్తి ఆయన్ను అడ్డుకున్నారు. డబ్బులివ్వాలని వారు డిమాండ్ చేశారు. తన వద్ద లేవని వైద్యుడు చెప్పడంతో ఆగ్రహించిన షఫీ రాయితో దాడిచేయగా, మిగిలిన ఇద్దరు కాళ్లతో కొట్టారు. ఈ ఘటనలో వైద్యుడికి గాయాలయ్యాయి. ఈ మేరకు బాధితుడు సంతపేట పోలీసులకు ఫిర్యాదు శారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రేషన్ బియ్యం పట్టివేత పొదలకూరు: పట్టణానికి సమీపంలోని చిట్టేపల్లి గ్రామం నుంచి రేషన్ బియ్యం తరలిస్తుండగా శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సివిల్ సప్లయ్స్ అధికారులకు పట్టుకున్న బియ్యాన్ని శనివారం అప్పగించారు. ఈ సందర్భంగా డీఎస్ఓ ఐ.పుల్లయ్య మాట్లాడుతూ బడా దోస్త్ వాహనంలో అక్రమ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకుని, డీటీ రవి ద్వారా విచారణ చేపట్టగా యద్దల పెంచలనర్సయ్య, పామర్తి పెంచలయ్య ఆటో సహాయంతో పామర్తి బాబు డ్రైవరుగా పొదలకూరు 53వ నంబర్ రేషన్ షాపు డీలర్ ప్రవీణ్ నుంచి 29 గోతాలలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్టు తెలిసిందన్నారు. ఈ మేరకు వారిపై 6ఏ కేసు నమోదు చేశామన్నారు. బియ్యం విలువ రూ.59,450 కాగా వాహనం విలువ రూ.3 లక్షలుగా నిర్ధారించామన్నారు. జేసీకి నివేదిక పంపామని వెల్లడించారు. తనిఖీల్లో పొదలకూరు సచివాలయ బిట్–4 వీఆర్వో పోలిరెడ్డి పాల్గొన్నారు. -
నైపుణ్యాలను వెలికితీసేందుకే హ్యాకథాన్
గూడూరు: విద్యార్థుల్లోని నైపుణ్యాలను వెలికి తీసేందుకు హ్యాకథాన్ ఉపయోగపడుతుందని వీఎస్యూ వీసీ శ్రీనివాసులు తెలిపారు. గూడూరు సమీపంలో ఉన్న ఆదిశంకర డీమ్డ్ యూనివర్సిటీలో శనివారం కోడ్ స్ప్రింట్ నేషనల్ లెవల్ హ్యాకథాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు కొత్త పరిచయాలు చేసుకోవడంతో పాటుగా వారిలో వారు పలు విషయాలపై చర్చించుకుని కొత్త ఆలోచనలకు దారి తీస్తాయన్నారు. ప్రతి ఏడాది కోర్సులు పూర్తి చేసుకుని లక్షల మంది ఉద్యోగాలు చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని, అలా కాకుండా కొత్త ఆలోచనలతో పరిశ్రమలు స్థాపించి మరికొంత మందికి ఉద్యోగావకాశాలు కల్పించేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో నాలుగు రాష్ట్రాల నుంచి సుమారు 950 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్వేపల్లి కల్యాణ్, వెంకటరెడ్డి, మోహన్, రాజయ్య, రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
వెంచర్లకు మట్టి తోలకాలు
సాక్షి టాస్క్ఫోర్స్: కోట మండలంలోని పలు గ్రామాలకు స్వర్ణముఖి నది నుంచి సాగునీరు అందించే చల్ల కాలువలో పూడికతీత పనులకు నీటిపారుదల శాఖ టెండర్లు ఆహ్వానించింది. గూడూరు ప్రాంతంలోని చెన్నూరుకు చెందిన అధికార పార్టీ నాయకుడు టెండర్ దక్కించుకున్నాడు. కాగా తమ ప్రాంతంలో బయటి ప్రాంతానికి చెందిన వ్యక్తులు పనిచేయడం ఏమిటని కోట మండల నాయకులు నియోజకవర్గ ప్రజాప్రతినిధి వద్ద వాపోయారు. దీంతో ఆయన ఇద్దరి మధ్య వివాదం లేకుండా పనులు కోట మండలానికి చెందిన నాయకులు చేసుకునేలా ఒప్పందం కుదిర్చారు. అంతే తమకు అడ్డేది అంటూ కోట నాయకులు చల్ల కాలువలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టారు. వాస్తవానికి కాలువలో సుమారు 34 వేల క్యూబిక్ మీటర్ల మేర మట్టి తవ్వకాలు చేపట్టాల్సి ఉంది. అయితే అంతకు మించి తరలిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలో ఇలా.. కోట మండలంలోని స్వర్ణముఖి నది నుంచి చల్ల కాలువ ద్వారా మండలంలోని వంజివాక, అల్లంపాడు, ఉత్తమ నెల్లూరు, కొక్కుపాడు, దొరువుకట్ట గ్రామాల్లోని చెరువులకు సాగునీరు అందుతుంది. ఇందులో తొమ్మిది కిలోమీటర్ల మేర పూడికతీత పనులకు టెండర్ను తమ్ముళ్లు దక్కించుకున్నారు. కాగా ఇందులోని కట్టలను పటిష్టం చేసేందుకు ఇక్కడి మట్టి పనికి రాదంటూ బయట విక్రయించుకుంటున్నారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధం. అయితే అధికార పార్టీ నేతలు కావడంతో వీరిని అడిగే వారు లేకుండాపోయారు. కట్టలు బలహీనం చల్లకాలువ తవ్వకాల వల్ల కట్టలు పటిష్ట పరిచాలనుకోకుండా బలహీన పరచాలని చూస్తున్నట్లు స్థానికులు వాపోయారు. చల్లకాలువలో మట్టి తవ్వకాలను ఇష్టానుసారంగా చేపడుతున్నా కనీసం ఇరిగేషన్ అధికారులు అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇరిగేషన్ అధికారులు మాత్రం కాలువలో పూడికతీత (డీసిల్టింగ్) పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, అయితే రాత్రి పూట తవ్వకాలు చేపడుతున్నట్లు తమ దృష్టికి రాలేదని అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ అధికార పార్టీ నాయకులకు ఇలాంటి పనులు మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగించుకుంటున్నారు. గూడూరు ప్రాంతంలో కొత్తగా ఎక్కడ వెంచర్లు వేస్తున్నారు అనే విషయాలను తెలుగు తమ్ముళ్లు ముందుగా తెలుసుకుని అక్కడకు మట్టిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో పగటి పూట చేయాల్సిన మట్టి తవ్వకాలను రాత్రి సమయంలో పెద్ద పెద్ద యంత్రాలను పెట్టి తవ్వి తరలించేస్తున్నారు. వీరికి మట్టి తవ్వకాలకు అనుమతులున్నా ఇంత కక్కుర్తి ఎందుకో అర్థం కావడం లేదని స్థానికులు అంటున్నారు. రాత్రి పూట తవ్వకాలతో వాహనాలు వేగంగా తిరగడం వల్ల నిద్ర ఉండడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కేబీఆర్ ఆస్పత్రిలో తనిఖీ
● రోగి మృతిపై విచారణ నెల్లూరు(అర్బన్): రెండు రోజుల క్రితం నగరంలోని గాంధీబొమ్మ సమీపంలో ఉన్న కేబీఆర్ ఆర్థోపెడిక్ ఆస్పత్రిలో ఓ రోగి కాలుకు కట్టు కట్టించుకుని గాయం మానేందుకు ఇంజెక్షన్ వేయించుకుంది. అయితే ఇంజెక్షన్ వేసిన 15 నిమిషాల్లోనే ఆమె అస్వస్థతకు గురై మరణించింది. దీంతో పేషెంట్ బంధువులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ సుజాత ఆదేశాల మేరకు వైద్యశాఖకు చెందిన ఎపిడిమియాలజిస్ట్ డాక్టర్ భాస్కర్, డీపీఎం సునీల్ శనివారం ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రి అనుమతులు, డాక్టర్ల విద్యార్హతలు, వారు నిర్వహిస్తున్న రికార్డులు, మందులు తనిఖీ చేశారు. పేషెంట్కు చేసిన చికిత్స గురించి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు జిల్లా వైద్యశాఖలో సమర్పించాల్సిందిగా ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. -
క్లీన్ చిట్ కాదు.. వాస్తవాలు తేలాలి
నెల్లూరు రూరల్: డీఎస్సీ వ్యవహారంలో ఆరోపణలను ఎదుర్కొంటున్న ప్రభుత్వ పెద్దలు ప్రెస్మీట్లలో క్లీన్ చిట్ ఇచ్చుకోవడం కాదని.. వాస్తవాలను తేల్చాల్సింది దర్యాప్తు సంస్థలు, కోర్టులని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. నిజాయతీ, చిత్తశుద్ధి ఉంటే విద్యాశాఖ మంత్రిపై సీబీఐ విచారణకు ఆదేశించి తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు సంబంధించిన అన్ని ఆధారాలను సీబీఐ ముందు తాను బయటపెడతానని చెప్పారు. విచారణకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. 1:1 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులకు కాల్లెటర్లిచ్చి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ అనంతరం ఉద్యోగాలివ్వకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రోడ్లపైకి జెన్ జీ వచ్చే పరిస్థితిని ప్రభుత్వమే సృష్టించిందని మండిపడ్డారు. 2029లో ప్రజలే తగిన సమాధానం చెప్తారని స్పష్టం చేశారు. -
ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలి
నెల్లూరు(అర్బన్): ప్రభుత్వోద్యోగుల డిమాండ్లను పరిష్కరించడంలో విఫలమైతే ఉద్యమం చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ పేర్కొన్నారు. నగరంలోని ఎన్జీఓ భవన్లో శనివారం నిర్వహించిన సంఘ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. డిమాండ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణను ప్రకటించడంతో ప్రభుత్వం స్పందించి మంత్రుల కమిటీని పంపి తమతో చర్చించిందన్నారు. సీఎంతో మాట్లాడి పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చారని, తేడా వస్తే ఉద్యమాన్ని కచ్చితంగా చేపట్టి తమ సత్తా చూపుతామని తెలిపారు. మెగా ఉచిత వైద్యశిబిరం మహిళా ఉద్యోగుల కోసం కిమ్స్ హాస్పిటల్, రాష్ట్ర ఆయుష్ శాఖ, ఇతర ఆస్పత్రుల సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్యశిబిరాన్ని ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అలపర్తి విద్యాసాగర్, రమణ ప్రారంభించారు. సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బండారుపల్లి వెంకటేశ్వర్లు, గాదిరాజు రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్కుమార్, నిర్వహణ కార్యదర్శి లక్కాకుల పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 75,533 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 35,551 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.81 కోట్లను సమ ర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టిక్కెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
మూడు టన్నుల చికెన్ వ్యర్థాల స్వాధీనం
మనుబోలు: చేపల గుంతలకు అక్రమంగా తరలిస్తున్న మూడు టన్నుల చికెన్ వ్యర్థాలను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి కథనం మేరకు.. ముందస్తుగా అందిన సమాచారంతో కొండూరుసత్రం పవర్గ్రిడ్ వెనుక ఉన్న చేపల గుంతల వద్ద గురువారం పోలీసులు తనిఖీలు చేశారు. చికెన్ వ్యర్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో టాటా ఏస్ వాహనాన్ని సీజ్ చేశారు. డ్రైవర్ పరమాత్మను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బెంగళూరుకు చెందిన బోలే పరమాత్మ తన టాటా ఏస్ వాహనంలో చికెన్ వేస్ట్ను చేపల గుంతలకు సరఫరా చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. కండలేరులో 24.54 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 24.54 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 10, హైలెవల్ కాలువకు 90, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 60 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
నారాయణా.. ఇదేనా నాణ్యత?
నెల్లూరు సిటీ.. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోంది సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ. ఇక్కడ జరుగుతున్న అవినీతికి అంతు లేకుండా పోయింది. ఇందుకు రోడ్ల నిర్మాణాలే నిదర్శనం. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ), సురక్షిత తాగునీటి సరఫరా పనుల పేరుతో ఇష్టానుసారంగా రహదారులను తవ్వేశారు. కొత్తవి వేసే సమయంలో నాణ్యతకు పాతరేసి అక్రమాలకు పాల్పడుతున్నారు.నెల్లూరు(బారకాసు): 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో యూజీడీ, సురక్షిత తాగునీటి సరఫరా ప్రాజెక్ట్లను రూ.1,137.62 కోట్ల వ్యయంతో ప్రారంభించారు. ఇందులో రూ.995 కోట్లు హడ్కో నుంచి రుణంగా మంజూరు కాగా, మిగిలిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. హడ్కో నుంచి తీసుకున్న రుణాన్ని వడ్డీతో సహా 2030లోపు నగరపాలక సంస్థ చెల్లించాల్సి ఉంది. ఇందుకోసం ప్రతి మూడు నెలలకోసారి అసలు, వడ్డీ కలిపి రూ.30 కోట్లు, అంటే నెలకు రూ.10 కోట్లు చెల్లిస్తోంది. ఈ మొత్తం ప్రజల నుంచి వివిధ రకాల పన్నుల రూపంలో వసూలు చేసిన నిధుల నుంచే చెల్లిస్తున్నారు ఎప్పటికి అవుతాయో.. నగర పాలక సంస్థ పరిధిలో 427 కిలోమీటర్ల మేర యూజీడీ, 650 కిలోమీటర్ల మేర సురక్షిత తాగునీటి సరఫరా పైప్లైన్ పనులు చేపట్టారు. ఇందులో యూజీడీ పనులు 410 కి.మీ. మేర పూర్తయ్యా యని, మిగిలిన 17 కి.మీ. పనులు త్వరలో పూర్తవుతాయని ప్రజారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే సురక్షిత తాగునీటి సరఫరా పైప్లైన్ పనులు పూర్తయ్యాయని, ప్రజలకు ఇవ్వాల్సిన కుళాయి కనెక్షన్లలో ఇప్పటికే అధిక శాతం పూర్తి చేశామని, మిగిలినవి కొనసాగుతున్నాయని పేర్కొంటున్నారు. అయితే పనులు ప్రారంభించి పదేళ్లు గడిచినా ఇంకా పూర్తి కాకపోవడంపై నగర ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్ట్ల పనుల వల్ల నగరంలోని అధికశాతం అంతర్గత రోడ్లు ధ్వంసమయ్యాయి. వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షాకాలంలో గుంతలు నీటితో నిండిపోవడంతో ఎక్కడ రోడ్డు, ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి నెలకొంటోంది. పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.ఆగుతూ.. సాగుతున్న యూజీడీ పనులు అంతర్గత రోడ్లు అధ్వానంగా మారడంతో ప్రజలకు ఇబ్బందులు రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం 15 రోజులకే పగుళ్లు, కుంగిపోయిన రహదారి ముందే హెచ్చరించిన ‘సాక్షి’ అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే కారణమంటున్న ప్రజలు -
వ్యాధితో పోరాటం.. పింఛన్ కోసం నిరీక్షణ
● ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులపై కనికరం లేదా? ● కొత్త పెన్షన్లు మంజూరు చేయని కూటమి ప్రభుత్వం ● దరఖాస్తు చేసుకున్న వారు 4,500 మందినెల్లూరు(అర్బన్): పొరపాటో.. గ్రహపాటో.. విధి వంచనకు గురై హెచ్ఐవీ – ఎయిడ్స్తో జీవనం సాగిస్తున్న వారి జీవితాలు దుర్భరంగా మారాయి. వారిలో పసిబిడ్డలున్నారు. భార్యాభర్తలు ఉన్నారు. వృద్ధులున్నారు. వ్యాధి నియంత్రణ కోసం ప్రతి నెలా ఖరీదైన మందులు వాడాల్సి వస్తోంది. పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అయితే కుటుంబాన్ని పోషించేందుకు సరిపడా ఆదాయం లేక, శారీరకంగా బలహీనపడిన స్థితిలో అనేకమంది నిరుపేదలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి కొంతైనా ఆసరాగా సామాజిక పింఛన్లు ఉపయోగపడుతున్నా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త పింఛనూ మంజూరు కాకపోవడంతో అల్లాడిపోతున్నారు. జిల్లాలో 19,359 మంది నమోదు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉన్న ఏఆర్టీ (యాంటీ రెట్రోవైరల్ థెరపీ) కేంద్రంలో ఇప్పటి వరకు 19,359 మంది హెచ్ఐవీ – ఎయిడ్స్ బాధితులు నమోదు చేసుకున్నారు. వారిలో 8,236 మంది క్రమం తప్పకుండా చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం 2,200 మంది సామాజిక పింఛన్ పొందుతుండగా, ఒక్కొక్కరికి నెలకు రూ.4 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. స్పందించరా? గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో హెచ్ఐవీ – ఎయిడ్స్ బాధితులకు కొత్తగా పింఛన్లు మంజూరు చేసేందుకు చర్యలు ప్రారంభించారు. తొలిదశలో 1,700 మందికి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, అనంతరం ప్రభుత్వం మారడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఇప్పటి వరకు ఒక్క కొత్త పింఛన్ మంజూరు కాలేదు. కొత్త దరఖాస్తులు స్వీకరించే అవకాశం కూడా కల్పించలేదు. రెండేళ్లుగా సుమారు 4,500 మంది దరఖాస్తులు పెండింగ్లోనే ఉన్నాయి. వ్యాధి కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గి తరచూ అనారోగ్యానికి గురవుతున్న తమలాంటి నిరుపేదలను ఆదుకోవాలని బాధితులు కన్నీటితో వేడుకుంటున్నారు. పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వంతుగా అన్ని వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ప్రభుత్వానికి పంపించామని, పింఛన్ల మంజూరుపై తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు.త్వరలోనే మంజూరు ఏఆర్టీ కేంద్రానికి వచ్చే రోగులు అందజేసే దరఖాస్తులను అక్కడి డాక్టర్లు ఏపీ శాక్స్ అధికారులకు పంపుతారు. నెల్లూరు నుంచి కూడా అలాగే పంపి ఉన్నారు. ఏపీ శాక్స్ అధికారులు స్క్రూట్నీ చేసి అర్హత ఉన్న వాటిని సెర్ప్ అధికారులకు పంపారు. త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు కానున్నాయి. – డాక్టర్ ఖాదర్వలీ, జిల్లా ఎయిడ్స్, లెప్రసీ, టీబీ నివారణ అధికారి


