SPSR Nellore District Latest News
-
తగలబడిందా?.. తగలబెట్టారా?
● అల్లీపురం డంపింగ్ యార్డులో పెద్దఎత్తున మంటలు ● కార్పొరేషన్ సిబ్బందిపైనే అనుమానం ● గత 15 రోజులుగా పేరుకుపోయిన చెత్తనెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ పరిధిలోని అల్లీపురంలోని డంపింగ్ యార్డులో శుక్రవారం తెల్లవారుజామున పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖకు సమాచారమిచ్చారు. ఫైరింజిన్ అక్కడికి చేరుకుని మంటలు ఆ ర్పింది. ఇదిలా ఉండగా చెత్తను ఎవరైనా తగలబెట్టారా? లేదా తగలబడిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరులోని డివిజన్ల నుంచి రోజూ చెత్తను ట్రాక్టర్ల ద్వారా డంపింగ్యార్డుకు తరలిస్తారు. అక్కడ్నుంచి టిప్పర్లు, కాంపాక్టర్ల ద్వారా దొంతాలి డంపింగ్ యార్డుకు పంపుతున్నారు. అయితే 15 రోజులుగా అల్లీపురం యార్డులో పెద్ద ఎత్తున పేరుకుపోయింది. ట్రాక్టర్ల ద్వారా చెత్తను తీసుకొచ్చినా లోపల వేయడానికి అవకాశం లేని పరిస్థితి ఏర్పడింది. లోపలున్న చెత్త బయటకు వెళ్లేందుకు టిప్పర్లను అధికారులు కేటాయించకపోవడం, కాంపాక్టర్లు సరిపోకపోవడంతో చెత్త టన్నుల్లో పేరుకుపోయింది. నగరం నుంచి వచ్చే ట్రాక్టర్లు రెండురోజులుగా రోడ్డు పక్కన నిలుపుతున్న పరిస్థితి ఉంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సమస్య మరింత జఠిలమైంది. అనేక సందేహాలు అల్లీపురంలోని డంపింగ్ యార్డులోని చెత్తను దొంతాలికి తరలించే పరిస్థితి లేకపోవడంతో కార్పొరేషన్ సిబ్బంది చెత్తను తగలబెట్టారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిరోజులుగా చెత్త లోపలికి వెళ్లలేని పరిస్థితిని బట్టి అనేకమంది ఈ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘటనపై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డుకు సమీపంలో ఇళ్లు ఉన్నాయి. చెత్త తగలబడటంతో ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే తమ పరిస్థితి ఏంటని కన్నీరుమున్నీరయ్యారు. మంత్రి నారాయణ హామీ ఏమైంది? అల్లీపురంలో డంపింగ్ యార్డును ఇక్కడ్నుంచి నెలల వ్యవధిలోనే తొలగిస్తామని మంత్రి నారాయణ గతేడాది మీడియా ముఖంగా హామీ ఇచ్చారు. అయితే అది మాటలకు పరిమితమైంది. ఆచరణలోకి రాలేదు. నెల్లూరు నుంచి అల్లీపురం వైపు వెళ్లే వాహనదారులు, ప్రజలు నిత్యం కంపును భరించలేక ఇబ్బంది పడుతున్నారు. పలుమార్లు రోడ్లపైనే చెత్త పేరుకుపోయిన సందర్భాలున్నాయి. కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఏ మ్రాతం పట్టించుకున్న దాఖలాల్లేవు. -
మీ న్యాయమే అంతిమతీర్పు కావాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ శ్రీనివాస్ నెల్లూరు (లీగల్): జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికై న వారు ఇష్టంతో కష్టపడి పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని, మీరు వెల్లడించే న్యాయమే అంతిమతీర్పు కావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ అన్నారు. ఇటీవల అదనపు జిల్లా న్యాయమూర్తులుగా నగరానికి బదిలీ అయిన న్యాయమూర్తులకు, ఇటీవల జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికైన నెల్లూరు బార్ అసోసియేషన్ సభ్యులకు శుక్రవారం బార్ అసోసియేషన్ సమావేశ మందిరంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. బార్ అధ్యక్షుడు పి. అయ్యప్పరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికై న పెళ్లకూరు కృష్ణ ప్రియాంక దేవి, దర్శి వెంకటసత్య ధనుషా, దామరమడుగు దివ్యశ్రీ, బడుగు విశ్వజాహిందులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి అభినందించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి మాట్లాడుతూ నలుగురు మహిళలు నెల్లూరు బార్ అసోసియేషన్ నుంచి జూనియర్స్ జడ్జిలుగా ఎంపిక కావడం గర్వ కారణమన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ కమిటీ, పలువురు న్యాయవాదులు జూనియర్ సివిల్ జడ్జిలుగా ఎంపికై న నలుగురిని శాలువాలు జ్ఞాపకలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ఎస్.అంకయ్య, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్. నాగరాజు ఉపాధ్యక్షుడు జల్లి పద్మాకర్ సంయుక్త కార్యదర్శి కేఎల్నారాయణ కమిటీ సభ్యు లు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఉత్తరప్రదేశ్ యువకుడి దారుణ హత్య
చిల్లకూరు: పొట్టకూటి కోసం వేరే రాష్ట్రం నుంచి వచ్చిన ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శుక్రవారం గూడూరు రూరల్ ప్రాంతంలోని చెన్నూరు గ్రామంలో వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్కు చెందిన ఐదుగురు యువకులు గూడూరు రూరల్ ప్రాంతంలోని కలర్ షైన్ పరిశ్రమలో పనిచేసేందుకు ఈనెల 5వ తేదీన మంగళవారం రాత్రి వచ్చారు. వీరిని పరిశ్రమలో లేబర్ కాంట్రాక్ట్ చేసే భానుప్రతాప్ సింగ్, అనిల్కుమార్ పిలిపించినట్లు సమాచారం. వారు యువకులకు చెన్నూరులో ఐఓబీ బ్యాంక్ సమీపంలో ఇల్లు అద్దెకు తీసిచ్చారు. 11వ తేదీ నుంచి పరిశ్రమలో విధుల్లో చేరాల్సి ఉంది. ఏమైందో.. 7వ తేదీ గురువారం రాత్రి యువకుల మధ్య ఏం జరిగిందో తెలియదు. శుక్రవారం ఉదయం ఇంటి యజమాని వెళ్లి చూసేసరికి సుమారు 20 ఏళ్ల వయస్సున్న యువకుడు రక్తమడుగులో పడి ఉన్నాడు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చాడు. రూరల్ సీఐ కిశోర్బాబు, ఎస్సై తిరుపతయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి యువకుడి హత్య విషయంపై ఉన్నతాధికారులకు చెప్పారు. దీంతో ఏఎస్పీ సౌజన్య, ఇన్చార్జి డీఎస్పీ గిరిధర్, గూడూరు ఒకటో పట్టణ సీఐ శేఖర్బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం డాగ్ స్క్వాడ్, క్లూస్టీమ్ను పిలిపించారు. వేలిముద్రలు సేకరించారు. రూరల్ సీఐ మాట్లాడుతూ యువకుల మధ్య జరిగిన ఘర్షణల కారణంగానే హత్య జరిగి ఉండొచ్చన్నారు. హత్య జరిగిన గదిలో ఎలాంటి ఆధారాలు లేకుండా చేశారన్నారు. మృతుడికి చెందిన ఆధార్కార్డు తదితరాలను తీసుకెళ్లినట్లు వెల్లడించారు. దీంతో లేబర్ కాంట్రాక్టర్ల ద్వారా విషయం తెలుసుకుని బాధిత కుటుంబ సభ్యులకు సమా చారం అందిస్తామన్నారు. హత్యకు దారి తీసిన విషయాలను తెలుసుకోవడంతోపాటు మిగిలిన యువకుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టామన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు. పరిశ్రమలో పనిచేసేందుకు రాక సహచరులపై అనుమానం ఆధారాలు దొరక్కుండా చేసిన వైనం -
సీఆర్పీఎఫ్ ఏఎస్సైకు కన్నీటి వీడ్కోలు
మర్రిపాడు: మండలంలోని సింగనపల్లి గ్రామానికి చెందిన సీఆర్పీఎఫ్ ఏఎస్సై ఎన్.శేఖర్రెడ్డి గురువారం ఆకస్మికంగా మృతిచెందాడు. శుక్రవారం స్వగ్రామంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు, సిబ్బంది గౌరవ వందనం సమర్పించి నివాళులర్పించారు. మర్రిపాడు ఎస్సై శ్రీనివాసరావుతోపాటు పలువురు అధికారులు అంత్యక్రియలకు హాజరయ్యారు. శేఖర్రెడ్డి పార్థివదేహానికి వైఎస్సార్సీపీ నాయకుడు గంగవరపు శ్రీనివాసులు నాయుడు, మండల యువత అధ్యక్షుడు చండ్ర నారాయణస్వామి, విద్యార్థి విభాగం మండలాధ్యక్షుడు గంగినేని విజయ్కుమార్, స్థానిక నాయకులు గోపవరం కాశిరెడ్డి, కాసాల శ్రీను, బాలకృష్ణ, రసూల్ సాహెబ్, చల్లా వెంకటేశ్వర్లురెడ్డి, రేవూరు రామకృష్ణారెడ్డి, అయ్యవారయ్య నివాళులర్పించారు. -
నెల్లూరులో పట్టపగలు భారీ చోరీ
● రూ.15 లక్షల నగదు, 183 గ్రాముల బంగారం అపహరణ నెల్లూరు(క్రైమ్): ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు రూ.15 లక్షల నగదు, 183 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించిన ఘటన శుక్రవారం పట్టపగలు చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మనుమసిద్ధి నగర్లో మహేశ్వరి కుటుంబం అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమె భర్త రెండేళ్ల క్రితం మృతిచెందాడు. నెల్లూరులో ఇల్లు కొనుక్కునేందుకు గానూ తనకున్న ఆస్తులను అమ్మగా సుమారు రూ.15 లక్షలు వచ్చాయి. వాటిని ఇంట్లోనే భద్రపరిచారు. గతనెల 30వ తేదీన తన సోదరి వివాహ నిమిత్తం ఆమె పిల్లలతో కలిసి కోడూరుపాడుకు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం ఇంటి యజమానులు మిద్దైపెకి వెళ్లే గేటు తెరిచి ఉండటంతో అనుమానం వచ్చి పైకి వెళ్లిచూడగా మహేశ్వరి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో ఆమెకు ఫోన్ చేసి సమాచారం అందించారు. బాధితురాలు బంధువులతో కలిసి ఇంటికి చేరుకుంది. బీరువాలోని నగదు, 183 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు, ఎస్సై అబ్దుల్ రజాక్ ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. క్లూస్టీమ్ వేలిముద్రలను సేకరించింది. ఇన్స్పెక్టర్ సాంకేతికత ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. పక్కాగా రెక్కీవేసి నిందితులు చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. -
ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
సంగం: కంకర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి చెరువులో బోల్తాపడి డ్రైవర్ మృతిచెందిన ఘటన శుక్రవారం మండలంలోని వంగల్లు గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తిరువీధిపాడు గ్రామం నుంచి సంగం వైపు కంకర లోడుతో ట్రాక్టర్ వెళ్తోంది. ఈ క్రమంలో అదుపుతప్పి చెరువులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కాశీపాళేనికి చెందిన షేక్ సుభాని (48) మృతిచెందాడు. సమాచారం అందుకున్న సంగం ఎస్సై రాజేష్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. కేసు నమోదు చేశారు. -
వైభవంగా ధ్వజారోహణ
బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని జొన్నవాడలో కొలువైన మల్లికార్జున సమేత కామాక్షితాయి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు శుక్రవారం ఉదయం ధ్వజారోహణతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ ఘట్టాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, స్వస్తి వాచనం, దేవత ఆహ్వానం, బేరి పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజ పటానికి ఆవాహన పూజ చేసి, ధ్వజ స్తంభానికి సంప్రోక్షణ చేశారు. మంగళహారతి, మంత్రపుష్పంతో కార్యక్రమం కొనసాగింది. స్వామివారి ధ్వజస్తంభం వద్ద నంది, త్రిశూలం, డమరుకం గుర్తులను ఏర్పాటు చేసి ధర్మసూత్రంతో ధ్వజారోహణ నిర్వహించారు. అమ్మవారి ధ్వజస్తంభం వద్ద సింహం, త్రిశూలం గుర్తులతో ధ్వజపటాన్ని ఆవాహన చేసి ధ్వజారోహణ చేశారు. ఈ కార్యక్రమానికి శివకుమార్ కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామి, అమ్మవార్లను దర్శించుకుని కోడి ముద్దల ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తిరువూరు అశోక్ రెడ్డి, సహాయ కమిషనర్ వెంకట శ్రీనివాసులురెడ్డి, పాలక మండలి సభ్యులు శివకృష్ణ, వరలక్ష్మి, చాముండేశ్వరి, ప్రత్యూష, శ్రీనివాసులు, సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
డీసీపల్లిలో 318 పొగాకు బేళ్ల విక్రయం
మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో శుక్రవారం 318 బేళ్లను విక్రయించినట్లు వేలం నిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. వేలానికి 413 బేళ్లు రాగా 318 బేళ్లను విక్రయించామని, మిగిలిన బేళ్లను వివిధ కారణాలతో తిరస్కరించినట్లు తెలిపారు. వేలంలో 43474.2 కిలోల పొగాకును విక్రయించగా రూ.9924534.60 వ్యాపారం జరిగింది. గరిష్టంగా కిలోకు రూ.250, కనిష్ట ధర రూ.210 లభించింది. సగటు ధర 228.29గా నమోదైంది. వేలంలో 8 కంపెనీల వ్యాపార ప్రతినిధులు పాల్గొన్నారు. ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తల గుర్తింపు నెల్లూరు(పొగతోట): ప్రతి గ్రామ సంఘం నుంచి 15 మంది ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలను గుర్తించామని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారికి శిక్షణ, నైపుణ్యం, రుణాలు మంజూరు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అనంతరం మహిళల అర్హతను పరిశీలించి రుణాలు మంజూరు చేస్తామన్నారు. 2026 – 27 ఆర్థిక సంవత్సరం లక్ష్యాలను నిర్దేశిస్తామన్నారు. జిల్లాలోని 3,54,361 మంది గ్రూపు సభ్యులు ఉండగా 3,49,565 మందికి రుణాలు, జీవనోపాధుల సమాచారాన్ని సీఆర్పీలు నమోదు చేశారన్నారు. వార్షిక రుణాలు, జీవనోపాధుల ప్రణాళికలు 99 శాతం పూర్తయినట్లు వెల్లడించారు. వీఓఏ, సీసీ, ఏపీఎం లాగిన్లో సభ్యులకు మంజూరు చేయాల్సిన రుణాల వివరాలు బ్యాంక్ల వారీగా మ్యాప్ చేయడం జరుగుతుందని తెలిపారు. పేదల సొంతింటి కలలు కూటమి భగ్నం ● మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి ఆత్మకూరు: రాష్ట్రంలో పేదల సొంతింటి కలలను సాకారం చేయడంలో కూటమి ప్రభు త్వం నిర్లక్ష్యం ధోరణి అవలంబిస్తోందని మాజీ ఎమ్మెల్యే మేక పాటి విక్రమ్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సకాలంలో వినియోగించకపోవడంతో పేదలకు అన్యాయం జరుగుతోందన్నారు. సొంతింటి కలలను భగ్నం చేస్తోందంటూ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కారణంగా సుమారు రూ.200 కోట్లు నిధులు వినియోగం కాకుండా నిలిచిపోయాయని మేకపాటి విమర్శించారు. పేదలు ఇప్పటికే నిర్మాణం చేపట్టిన ఇళ్లకు బిల్లులు మంజూరు చేయకుండా ఆలస్యం చేయడం అమానుషమన్నారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇళ్లను కూడా పూర్తి చేయకుండా కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. అధికారులు రూపొందించిన ప్రణాళికలను కూడా పట్టించుకోకుండా, కేంద్ర నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. దీని వల్ల పేదల ఇళ్ల నిర్మాణం నిలిచిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికే రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు పెండింగ్ బిల్లులు ఉన్నప్పటికీ వాటిని విడుదల చేయకుండా, నిధులను తిరిగి కేంద్రానికి పంపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నదని ఆయన ఆరోపించారు. ఇది పేదల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవా రం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 70,001 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 30,085 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.77 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
రూ.3 కోట్ల భూమి హాంఫట్
కావలి రూరల్: కావలి మున్సిపాలిటీలో విలీనమైన ముసునూరులో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వ భూములను కొందరు కబ్జాకోరులు ఆక్రమించి ఏకంగా ప్లాట్లుగా విభజించి విక్రయాలు చేస్తున్నారు. ఇప్పటికే మందాటి చెరువు, రాళ్లగుట్ట పోరంబోకు భూములు వందలాది ఎకరాలు కబ్జాకోరుల కబంధహస్తాల్లో చిక్కుకుంది. ఇంత జరుగుతున్నా.. సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు భారీ మొత్తాల్లో ముడుపులు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తూ కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో సుమారు రూ.3 కోట్లు విలువైన భూమిని ఆక్రమించి పాట్లు వేసి విక్రయాలు చేయడంతో అక్కడ నిర్మాణాలు సాగుతున్నాయి. దాదాపు ఏడు దశాబ్దాల క్రితం పంచాయతీగా ఏర్పడిన ముసునూరు ఇటీవల కావలి మున్సిపాలిటీలో విలీనం అయింది. ఈ ప్రాంతం జాతీయ రహదారికి పక్కనే ఉండడంతోపాటు జీఎన్టీ రోడ్డుకు అటూఇటూగా ఉండడంతో ఇక్కడి స్థలాలు ఖరీదుగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ప్రభుత్వ స్థలాలను కొంచెం కొంచెంగా ఆక్రమించుకుంటూ వస్తున్నారు. తాజాగా జీఎన్టీ రోడ్డుని ఆనుకొని ఉన్న అయ్యప్ప గుడి మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న సర్వే నంబరు 911, 911/2లోని సుమారు 122 అంకణాలను ఆక్రమించారు. ఒక్కొక్కటి 12 అంకణాలుగా 10 ప్లాట్లుగా విభజించి అమ్మేశారు. ఇక్కడ అంకణం ధర సుమారు రూ.2.50 లక్షలపైమాటే. ఈ లెక్కన దీని విలువ సుమారు రూ.3 కోట్లకు పైనే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అయితే అక్రమార్కులు ఈ భూములను కావలిలో రిజిస్ట్రేషన్ చేయించుకుండా అల్లూరులో రిజిస్ట్రేషన్ జరిగినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించినట్లు తెలుస్తోంది. అసలు సర్వే నంబర్లు కాకుండా 918/2, 920 నంబర్లతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఇప్పటికే ఈ సర్వే నంబర్లకు పక్కనే ఉన్న సర్వే నంబరు 914లో మర్రిచెట్టు కాలనీలో చెరువు పోరంబోకు స్థలం ఉండగా దాన్నీ కబ్జాదారులు ఆక్రమించి గృహాలను నిర్మించుకున్నారు. రైల్వే ట్రాక్ నుంచి వరద నీరు పారే గుడ్డి తూము సర్వే నంబర్ 908లోని భూమి కూడా ఆక్రమణలకు గురికావడంతో పూర్తిగా కనుమరుగైంది. పై నుంచి వర్షపు వరదనీరు ప్రవహించేందుకు వీలుగా పూర్వీకులు నిర్మించిన ఈ కాలువను ఆక్రమించడంతో భారీ వర్షాలు కురిస్తే మర్రిచెట్టు సంఘం పూర్తిగా నీట మునిగే పరిస్థితి నెలకొందని గ్రామస్తులు వాపోతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, పాలకులు ముసునూరులో జరుగుతున్న ప్రభుత్వ భూముల ఆక్రమణలపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే పలు సర్వే నంబర్లలో భూముల ఆక్రమణ, రిజిస్ట్రేషన్లు కబ్జా కోరల్లో మందాటి చెరువు, రాళ్లగుట్ట పోరంబోకు భూములు చోద్యం చూస్తున్న అధికారులు, పాలకులు -
మెప్మా కార్యాలయం
నెల్లూరు (పొగతోట): జిల్లాలోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో అవినీతి మాఫియా రాజ్యమేలుతోంది. పేద మహిళల ఆత్మ నిర్భరత కోసం ఏర్పాటు చేసిన మెప్మా విభాగాన్ని కొందరు అవినీతి సామ్రాజ్యాంగా విస్తరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రూపు సభ్యులకు తెలియకుండానే బ్యాంకుల నుంచి భారీ మొత్తాల్లో రుణాలు మంజూరు చేయించడం, బినామీ గ్రూపులను సృష్టించి నిధులు కాజేయడం, ఆన్లైన్ నమోదు పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. కొన్ని నెలలుగా సుమారు రూ.100 కోట్లపైగా రుణాలు స్వాహా అయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం కూటమి కీలక నేత వరకు వెళ్లినా మౌనం వహిస్తున్నట్లు సమాచారం. పొదుపు మహిళపై అవినీతి పంజా జిల్లాలోని నెల్లూరు నగర పాలక సంస్థతోపాటు కావలి, గూడూరు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీలు, అల్లూరు నగర పంచాయతీ పరిధిలో సుమారు 30 వేలకుపైగా పొదుపు గ్రూపులు మెప్మా ఆధ్వర్యంలో ఉన్నాయి. ఆయా గ్రూపుల్లో సుమారు 4 లక్షల మందికిపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. మహిళా సాధికారత కోసం ఏటా బ్యాంక్ లింకేజీతో రూ.కోట్ల రుణాలు మంజూరు చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.518 కోట్లు రుణాలు మంజూరయ్యాయి. మహిళలు 10 మంది గ్రూపుగా ఏర్పడి బ్యాంకులో ఖాతాను ప్రారంభించి పొదుపు చేస్తారు. ఏ బ్యాంకులో అకౌంట్ ఉండి పొదుపు చేస్తున్నారో అదే బ్యాంకు ద్వారా సభ్యులకు రుణాలు మంజూరు చేయాల్సి ఉంటుంది. అయితే మెప్మాలో నిబంధనలకు విరుద్ధంగా గ్రూపుల పేరుతో అనేక బ్యాంక్ల్లో ఖాతాలు తెరిచి వందల కోట్ల రుణాలు మంజూరు చేయించడం గమనార్హం. ఇదిలా ఉంటే.. చాలా గ్రూపుల సభ్యులకు తెలియకుండానే రుణాలు మంజూరు చేయించి ఆ మొత్తాలను తమ ఖాతాలకు మళ్లించుకుని నిధులు స్వాహా చేసినట్లు ఇటీవల బ్యాంకుల నుంచి సదరు సభ్యులకు రుణాలు చెల్లించాలంటూ నోటీసులు పంపడంతో వెలుగులోకి వచ్చాయి. కొన్ని గ్రూపు సభ్యుల పేరుతో రుణాలు మంజూరు చేయించి.. తృణమో.. పణమో ఇచ్చి మిగతా డబ్బులను స్వాహా చేస్తున్నట్లు కూడా సమాచారం. తీసుకున్న రుణాలతో వడ్డీల వ్యాపారం గ్రూపు మహిళలు పొదుపు చేసుకుంటూ బ్యాంకుల ద్వారా రుణాలు పొందుతున్నారు. పట్టణాల్లో అధిక శాతం మంది పేద మహిళలు గ్రూపులకు దూరంగా జీవిస్తున్నారు. డబ్బులు ఉన్న మహిళలు, మధ్య తరగతి మహిళలు అధిక శాతం మంది గ్రూపుల్లో సభ్యులుగా కొనసాగుతున్నారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు బ్యాంకుల నుంచి రూ.20 లక్షలు రుణంగా తీసుకుంటున్నారు. రుణం మంజూరు అయినట్లు గ్రూపుల్లో ఇతర మహిళలకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. తీసుకున్న రుణాన్ని వడ్డీలకు ఇవ్వడం, లేదా వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం చేస్తున్నారు. మూడు రూపాయలు వడ్డీ వేసుకున్న నెలకు రూ.60 వేలు వస్తుంది. ఈ విధంగా సంపాదించే వారు పట్టణాల్లో అధిక శాతం ఉన్నారు. బ్యాంక్ మేనేజర్న్యాయ పోరాటం చేద్దాంపొదుపు గ్రూపుఆన్లైన్ పేరుతో దోపిడీ గ్రూపు సభ్యుల వివరాలు ఆన్లైన్ నమోదు ప్రక్రియ జరుగుతోంది. వివరాలు ఆన్లైన్ చేయడానికి వేలకు వేలు డిమాండ్ చేస్తున్నారని సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మహిళ సభ్యులు కలెక్టర్ హిమాన్షు శుక్లాకు ఫిర్యాదు చేశారు. ఆన్లైన్లో పేర్లు వివరాలు నమోదు చేయకపోతే రుణాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏవీ అందవని ప్రచారం చేశారు. దీంతో మహిళలు వారి వారి వివరాలను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. నగదు ఇవ్వనిదే సిబ్బంది ఆన్లైన్లో వివరాలు నమోదు చేయడంలేదు. గ్రూపు మహిళల పూర్తి వివరాలు, బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల వివరాలు, బకాయిలు పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. దీనికి సంబంధించి మెప్మా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయిస్తున్నారు. ఉచితంగా చేయాల్సిన ప్రక్రియకు నగదు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. రూ.100 కోట్లకు పైగా పొదుపు గ్రూపుల పేరిట స్వాహా? సంఘాల సభ్యులకు తెలియకుండానే రుణాలు భారీ ఎత్తున బినామీ గ్రూపులు ఏర్పాటు చేసినట్లు అనుమానాలు బ్యాంక్ మేనేజర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో కలిసి అక్రమాలు రుణ బకాయిలు చెల్లించాలంటూ నోటీసులివ్వడంతో అవినీతి బట్టబయలు ఎన్ఓసీ లేకుండానే రుణాలు వాస్తవానికి బ్యాంకు రుణాలు మంజూరు చూసే క్రమంలో నో అబెక్షన్ సర్టిఫికెట్ తీసుకుంటారు. అయితే ఇందుకు భిన్నంగా నగరంలోని మెప్మా సిబ్బంది, అధికారులు, గ్రూపు సభ్యులు కుమ్మకై ఎన్ఓసీలు లేకుండానే, నెల్లూరు నగర పరిధిలో బినామీ గ్రూపులు ఏర్పాటు చేసి రూ.కోట్ల స్వాహా చేసినట్లు సమాచారం. ఇలాంటి విషయాలు బయటకు పొక్కడంతో సిబ్బందిని మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆయా డివిజన్లల్లో కూటమి నేతలు వారికి అవసరమైన, అనుకూలంగా ఉండే వారి వివరాలను కీలక నేత సతీమణికి అప్పగించారు. పాత సిబ్బందిని తొలగించి కొత్త వారిని తీసుకునేందుకు అప్పటి అధికారుల వద్ద చర్చలు జరిగాయి. ఏమి జరిగిందో తెలియదు.. తిరిగి పాత వారినే కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని, దీంతో ఎవరిపైనా చర్యలు తీసుకోకుండా మౌనం వహిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ విషయంపై అనేక మంది ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఎన్ఓసీలు ఎంత ఎన్ని గ్రూపులకు ఇచ్చారు వివరాలు అడిగితే అధికారులు తప్పుడు సమాచారం ఇవ్వడం గమనార్హం. బ్యాంకు అధికారుల నుంచి మౌనమే సమాధానంగా కనిపిస్తోంది. పరిశీలించి చర్యలు తీసుకుంటాం గ్రూపులకు అకౌంట్ ఉన్న బ్యాంకుల నుంచి మాత్రమే రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. గ్రూపునకు ఒక బ్యాంకులోనే అకౌంట్ ఉంటుంది. ఒకే గ్రూపు రెండు, మూడు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవడంపై పరిశీలిస్తాం. గతంలో ఈ విషయానికి సంబంధించి ఏదైనా ఫైల్ పెట్టారో లేదో చూస్తాను. పూర్తి స్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – కిరణ్కుమార్, మెప్మా పీడీ -
విజయవాడ ప్రజాప్రతినిధుల స్పెషల్ కోర్టుకు కాకాణి కేసు బదిలీ
● కోర్టు విచారణకు గోవర్ధన్రెడ్డి హాజరు నెల్లూరు (లీగల్): సోమిరెడ్డి అక్రమాస్తులను కలిగి ఉన్నాడంటూ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డు పెట్టుకుని 2017లో ఆయనపై నమోదైన కేసులో ఎగ్జామినేషన్ పూర్తి కావడంతో నెల్లూరు నాలుగో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి నిసాద్నాజ్ షేక్ కేసును విజయవాడ ప్రజాప్రతినిధుల స్పెషల్ కోర్టుకు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు విచారణకు కాకాణితోపాటు పసుపులేటి చిరంజీవి, వెంకటకృష్ణన్, హరిహరణ శుక్రవారం హాజరయ్యారు. ఈ కేసులో పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్లోని అభియోగాలను న్యాయమూర్తి నిసాద్నాజ్ షేక్ తెలుగులో చదివి వినిపించారు. ఈ సందర్భంగా తనపై తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేశారని కాకాణి న్యాయమూర్తికి వివరించారు. ఈ మేరకు కేసును విజయవాడ ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. సోమిరెడ్డి తాతలు దిగి రావాలి ‘సోమిరెడ్డి అనే వాడు ఓ అవినీతి పరుడు. కాకాణిపై తప్పుడు కేసులు పెట్టించి ఆయనేదో నిజాయితీ పరుడన్నట్లు తనకు తానే డబ్బా కొట్టుకుంటున్నాడు. మాజీ కాకాణి గోవర్ధన్రెడ్డిపై పెట్టిన తప్పుడు కేసులను సోమిరెడ్డి కాదు కదా.. ఆయన తాతలు దిగొచ్చినా నిరూపించలేరు. తప్పుడు కేసులకు భయపడే పిరికి తనం కాకాణిలో లేదు. దమ్ముగా ధైర్యంగా ఎదుర్కొంటారు.’ అని ఆయన అనుచరులు స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సోమిరెడ్డికి ఇతర దేశాల్లో అక్రమ ఆస్తులు ఉన్నాయని కాకాణి మీడియా సమావేశంలో ఆరోపించారు. అయితే సోమిరెడ్డి తనకు అక్రమ ఆస్తులు లేవని నిరూపించుకోలేక 2017లో కాకాణి పై తప్పుడు కేసు బనాయించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన నాటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కేసుకు విచారణ అర్హత లేదని ప్రభుత్వానికి నివేదించి, కేసును తీసివేయాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో కేసుకు సంబంధించిన ఫైళ్లు దొంగతనానికి గురయ్యాయి. అయితే సోమిరెడ్డి పదే పదే కోర్టులో ఫైళ్లు గల్లంతు విషయమై కాకాణి పాత్ర ఉన్నట్లు విష ప్రచారం చేశారు. పచ్చమీడియా సైతం అత్యుత్సాహంతో చిలువలు పలువులుగా కథనాలు వండి వార్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తే నిజానిజాలు వెల్లడి కావంటూ గగ్గొలు పెట్టింది. సీబీఐ విచారణలో క్లీన్ చిట్ కోర్టులో ఫైళ్ల మిస్సింగ్ కేసులో ఉన్నత న్యాయస్థానం సీబీఐను విచారణ జరిపి నిజానిజాలు నిగ్గు తేల్చాలని ఆదేశించింది. సుమారు ఏడాది పాటు సీబీఐ విచారణ చేపట్టి చివరకు కాకాణికి కోర్టులో ఫైళ్ల మిస్సింగ్లో పాత్ర లేదని క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే పచ్చ మీడియా సాక్షాత్తు సీబీఐ దర్యాప్తు పైనా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ, కథనాలు వండి వార్చింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక విచారణ జిల్లా కోర్టులో శుక్రవారం విచారణ ఉండడంతో కాకాణి కోర్టుకు రానున్నారని తెలిసి పచ్చ మీడియా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోర్టు ప్రాంగంణంలో పడిగాపులు పడ్డారు. వీరిని న్యాయవాదులతోపాటు కోర్టుకు వచ్చిన వారందరూ చూసి ఏం ఖర్మరా బాబు మీకు అంటూ మాట్లాడడం గమనార్హం. చివరకు కేసును విజయవాడ ప్రజాప్రతినిధుల స్పెషల్ కోర్టుకు బదిలీ చేశారని తెలుసుకుని నిట్టూర్పులతో పచ్చమీడియా వెనుదిరిగింది. -
ట్రాక్టర్లో వెళ్తుండగా..
● కిందపడి మున్సిపల్ కార్మికుడి మృతి ఆత్మకూరు: పారిశుద్ధ్య కార్మికుడు ట్రాక్టర్ పైనుంచి జారిపడి మృతిచెందిన ఘటన ఆత్మకూరులో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకులు, మున్సిపల్ కార్మికుల వివరాల మేరకు.. అనంతసాగరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన చిచ్చు మల్లికార్జున (32) ఆత్మకూరులో వివాహం చేసుకుని ఇక్కడే నివాసముంటున్నాడు. ఆప్కాస్ ద్వారా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడిగా నియమింపబడి పనిచేస్తున్నాడు. గురువారం చెత్త సేకరించిన ట్రాక్టర్ బైపాస్ రోడ్డులోని డంపింగ్ యార్డు వద్ద అన్లోడ్ చేసి తిరిగి వస్తుండగా ట్రాక్టర్పై నుంచి జారిపడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయమై కోమాలోకి చేరుకున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్, మరో కార్మికుడు పరిశీలించి వెంటనే మల్లికార్జునను ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎక్స్గ్రేషియా చెల్లించాలి మృతుని కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్గ్రేషి యా చెల్లించాలని, బాధిత కుటుంబంలో ఒకరికి ఆప్కాస్ ద్వారా ఉద్యోగం కల్పించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కమిషనర్ సి.గంగాప్రసాద్ అక్కడికి చేరుకుని ప్రభుత్వ ఆర్థిక సాయం త్వరలోనే అందేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. -
గడ్డివాములు దగ్ధం
● రూ.10 లక్షల నష్టంచేజర్ల: మండలంలోని మడపల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఇందులో గ్రామానికి చెందిన పొదలకూరు శ్రీనివాసులు, పుట్లూరు కామయ్య, ఈగ భాస్కర్రెడ్డి, పొదలకూరు రమణయ్యకు చెందిన ఆరు గడ్డివాములు దగ్ధమయ్యాయి. అందరూ నిద్రలో ఉండగా ఒకసారిగా మంటలు చెలరేగి గడ్డివాములు తగలపడటంటంతో రైతులు గమనించి ఆత్మకూరు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేసినప్పటికీ గడ్డి మొత్తం కాలిపోయింది. దీంతో రూ.10 లక్షల నష్టం వాటిలినట్లుగా చెబుతున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా లేదా ఆకతాయిలు చేశారా అనే కోణంపై పోలీసులు విచారణ చేపట్టారు. బాధితులు పలువురిపై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. కాగా గత సంవత్సరం కూడా గ్రామంలో ఇదే విధంగా గడ్డివాములు దగ్ధమైన ఘటన జరిగి ఉంది. ఏది ఏమైనా మూగజీవాలు తినాల్సిన పశుగ్రాసం అగ్నికి ఆహుతవడంతో బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. బోధనా సిబ్బంది నియామక నోటిఫికేషన్లు రద్దు వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీలో 2023 సంవత్సరంలో విడుదల చేసిన బోధనా సిబ్బంది నియామక నోటిఫికేషన్లను రద్దు చేసినట్లు వర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ తీర్మానం, జీఓ ప్రకారం యూనివర్సిటీలోని 106 ఖాళీ అధ్యాపక పోస్టుల భర్తీకి గతంలో ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం ఉపసంహరించుకుందన్నారు. అభ్యర్థులకు దరఖాస్తు రుసుము తిరిగి చెల్లింపునకు సంబంధించిన వివరాల కోసం విశ్వవిద్యాలయ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని తెలియజేశారు.ప్రమాదవశాత్తు కిందపడి..● యువకుడి మృతి నెల్లూరు(క్రైమ్): పిట్టగోడపై కూర్చొని నీళ్లు తాగుతుండగా ప్రమాదవశాత్తు కిందపడి ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు గాయత్రినగర్ రెండో వీధిలో పవన్ సాయికుమార్ (26) తన భార్య, తల్లి, సోదరితో కలిసి నివాసం ఉంటున్నాడు. అతను నగరంలోని ఓ ప్రముఖ వస్త్ర షోరూమ్లో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య గర్భవతి కావడంతో బుధవారం రాత్రి ఇంట్లోనే సీమంతం చేశారు. అనంతరం సాయి బంధువులతో కలిసి మిద్దైపె నిద్రపోయాడు. గురువారం తెల్లవారుజామున ఇంట్లోకి వచ్చి వాటర్ బాటిల్ తీసుకుని మెట్లెక్కి మిద్దైపెకి వెళ్లాడు. మెట్ల చివరన ఉన్న పిట్టగోడపై కూర్చొని నీళ్లు తాగుతుండగా ప్రమాదవశాత్తు కిందపడడంతో తలకు తీవ్రగాయమైంది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు సాయికుమార్ను 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు మృతుడి తల్లి రత్నమ్మ దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. ప్రత్యేక నోడల్ అధికారిగా కలెక్టర్నెల్లూరురూరల్: రాష్ట్ర సచివాలయంలో గురువారం నిర్వహించిన సదస్సులో కలెక్టర్ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. ఆయన్ను భూ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక నోడల్ అధికారిగా సీఎం చంద్రబాబు నియమించారు. -
అధికారం మనదే.. వేసేయ్ పాగా
సాక్షి, టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు చెలరేగిపోతున్నారు. అధికారం అండతో జాతీయ రహదారి అనుకుని ఎక్కడ ప్రభుత్వ భూములు కనిపిస్తే అక్కడ పాగా వేస్తున్నారు. విలువైన స్థలాలను దర్జాగా కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. భూముల ధరలకు రెక్కలు రావడంతో.. సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రమైన వెంకటాచలం మండలంలో జాతీయ రహదారి ఆనుకుని ఉన్న గ్రామాల్లో భూముల ధరలు కొన్నేళ్ల నుంచి విపరీతంగా పెరిగాయి. ఒక్కో అంకణం ధర రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలకుపైగా పలుకుతోంది. జాతీయ రహదారి పక్కన నిర్మాణాలు చేపడితే వ్యాపారానికి అనువుగా ఉండడంతో అక్రమార్కుల కన్ను విలువైన ప్రభుత్వ భూములపై పడింది. సర్వేపల్లి ముఖ్యనేత అండతో దర్జాగా ప్రభుత్వ భూములు ఆక్రమించి చకచకా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. ● వెంకటాచలం మండలం ఎర్రగుంట వద్ద జాతీ య రహదారి ఆనుకుని సుమారు రూ.50 కోట్ల విలువ చేసే మూడెకరాల ప్రభుత్వ భూమి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. గత నాలుగు రోజుల నుంచి కొంత భూమిని జేసీబీతో చదును చేయించి పనులు చేస్తున్నారు. సర్వేపల్లి ముఖ్యనేత అండతోనే ఈ భూ ఆక్రమణలకు దిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఆక్రమణల గురించి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● గొలగమూడి క్రాస్రోడ్డు వద్ద జాతీయ రహ దారి ఆనుకుని పోతురాజు చెరువు ఉంది. జాతీయ రహదారి, చెరువుకు మధ్యలో రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. ఈ విలువైన స్థలాలను ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మిస్తే వ్యాపారాలకు అనువుగా ఉంటుందని వాటిపై కొందరు కన్నేశారు. కాకుటూరు గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడి అండతో రూ.1.50 కోట్ల విలువ చేసే సుమారు 150 అంకణాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు. రెండు చెరువులకు సాగునీరు సరఫరా చేసే పంట కాలువను సైతం ఆక్రమించి ధ్వంసం చేశారు. ఆక్రమిత భూమిలో నిర్మాణాలు చేపడుతున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. ● కాకుటూరు గ్రామంలో సర్వే నంబర్లు 84,85 లలో ఉన్న రూ.2కోట్ల విలువ చేసే 0.36 సెంట్ల ప్రభుత్వ భూమిని నెల్లూరు నగరానికి చెందిన ఓ టీడీపీ నేత ఇటీవల ఆక్రమించి అక్రమ కట్టడాలు నిర్మించారు. ఈ విషయంపై స్థానికులు పలు దఫాలు రెవెన్యూ, ఇరిగేషన్, అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంకటాచలంలో హద్దు మీరుతున్న తమ్ముళ్ల భూకబ్జాలు ఆక్రమణల చెరలో రూ.కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు ఆక్రమణదారులపై చర్యలేవీ? కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను టీడీపీ నేతల అండతో కొందరు దర్జాగా ఆక్రమించడాన్ని స్థానికులు చూసి విస్తుపోతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఆక్రమణలకు గురికాకుండా కాపాడుకుంటూ వచ్చిన విలువైన భూములు కబ్జా చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు తలదాచుకునేందుకు సెంటు భూమిలో గుడిసెలు వేస్తే వెంటనే వాలిపోయి తొలగించే అధికారులు కోట్ల విలువ చేసే స్థలాలను దర్జాగా ఆక్రమిస్తే చర్యలు తీసుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇరిగేషన్ కాలువ ఆక్రమణకు గురికావడంతో తమ గ్రామ చెరువులకు సాగునీరు సక్రమంగా అందదని ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు మండిపడుతున్నారు. కాకుటూరులోని సర్వే నంబర్లు 84,85లోని ప్రభుత్వ భూమి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించినా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆక్రమణదారులకు సర్వేపల్లి ముఖ్యనేత అండదండలు ఉండడంతో అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
సంక్షోభంలో వ్యవసాయం
● రైతులను అప్పుల్లోకి నెట్టిన ప్రభుత్వం ● వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి వాకాడు: రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభంలో ఉందని, రైతులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయారని వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి విమర్శించారు. వాకాడులోని స్వగృహంలో వాకాడు, కోట, చిట్టమూరు మండలాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు గురువారం ఆయన్ను కలిశారు. అలాగే రైతులు కలిసి తమ బాధలను వివరించారు. ఈ సందర్భంగా రామ్కుమార్రెడ్డి మాట్లాడుతూ రెండేళ్లుగా పెరిగిన సేద్యపు ఖర్చులు, పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడం, దళారుల దోపిడీ వంటి కారణాలతో రైతులు అప్పులపాలవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నష్టపోయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పాలకులు ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేపట్టి లాభాలతో విర్రవీగుతూ ప్రజలను గాలికొదిలేశారన్నారు. త్వరలోనే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఈనెల 9వ తేదీన జరిగే దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్రెడ్డి వర్ధంతిపై స్థానికులతో ఆయన చర్చించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యుడు కొడవలూరు భక్తవత్సలరెడ్డి, వాకాడు, చిట్టమూరు మండలాల కన్వీనర్లు సుధాకర్నాయుడు, శ్రీనివాసులురెడ్డి, నాయకులు రాజారెడ్డి, నాగూర్రెడ్డి, రాజశేఖర్రెడ్డి, సుధాకర్రెడ్డి, పెంచలరెడ్డి, వెంకటేశ్వర్లురెడ్డి, రవి, శేషురెడ్డి, శ్రీహరిరెడ్డి, శిశికుమార్రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
మానవత్వానికి ప్రతీక రెడ్క్రాస్
నెల్లూరు(అర్బన్): ప్రకృతి వైపరీత్యాలు, రోడ్డు ప్రమాదాలు, అంటువ్యాధుల విజృంభణ, యుద్ధాలు.. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ముందుండి సేవలందించే సంస్థగా రెడ్క్రాస్ గుర్తింపు పొందింది. మే 8వ తేదీన రెడ్క్రాస్ వ్యవస్థాపకుడు, నోబెల్ శాంతి బహుమతి గృహీత హెన్రీ డ్యూనాంట్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. సేవలతో మానవత్వానికి ప్రతీకగా రెడ్క్రాస్ నిలుస్తోంది. ఇలా మొదలై.. 1859లో ఇటలీలో జరిగిన సోల్ఫెరీనో యుద్ధంలో గాయపడిన సైనికుల దుస్థితిని చూసి హెన్రీ డ్యూనాంట్ వారికి సేవలందించేందుకు స్వచ్ఛంద సేవా సంస్థ అవసరాన్ని గుర్తించారు. ఈ ఆలోచనే 1863లో అంతర్జాతీయ రెడ్క్రాస్ కమిటీ ఏర్పాటుకు దారితీసింది. భారతదేశంతోపాటు నేడు 190 దేశాల్లో సేవలు కొనసాగుతున్నాయి. సేవే పరమావధిగా.. రెడ్క్రాస్ ప్రధానంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంది. ప్రథమ చికిత్స శిక్షణను చేపడుతుంది. వరదలు, తుఫాన్, భూకంపాలు వచ్చినప్పుడు అనాథలు, వృద్ధులకు సేవలందించడంలో, ఆశ్రయం కల్పించడంలో కీలకపాత్ర పోషిస్తోంది. నెల్లూరు నగరంలో ఎంతోమంది దాతల సాయంతో రెడ్క్రాస్ స్థాపించబడింది. నేడు రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. జిల్లా రెడ్క్రాస్ సంస్థ ఎన్నో అవార్డులు అందుకుంది. వాటిలో ప్రధానంగా బ్లడ్బ్యాంక్, తలసేమియా చికిత్స కేంద్రం, కేన్సర్ ఇన్స్టిట్యూట్, సింహపురి సంజీవిని జెనరిక్ మందుల షాపు, యూత్ రెడ్క్రాస్, పల్లిపాడులోని పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమం, ఏఆర్వీ కేంద్రం, ప్రకృతి విపత్తుల సంస్థ ఇలా 14 ప్రాజెక్ట్లున్నాయి. అంతా తామై.. ప్రధానంగా కేన్సర్ ఆస్పత్రి ద్వారా, బ్లడ్బ్యాంక్ ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 30 వేల మంది రోగులను ఆదుకుంటోంది. అలాగే వరదలు, కరోనా లాంటి విపత్కర సమయాల్లో నెల్లూరు రెడ్క్రాస్ సేవలకు ఎంతో ఘన కీర్తి ఉంది. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో రక్తసంబంధీకులు సైతం తమ వారి మృతదేహాలను ఖననం చేసేందుకు ముందుకు రాకపోతే రెడ్క్రాస్ నేతలు, వలంటీర్లు అంతా తామై గౌరవప్రదంగా అంత్యక్రియలు చేశారు. రోజూ అన్నదానం చేస్తూ లక్షలాది మంది ఆకలి తీర్చారు. అలాగే రవాణా లేక సుదూర ప్రాంతాలకు నడిచి వెళ్తున్న కార్మికులకు ఎన్టీఆర్ నగర్ తదితర ప్రాంతాల్లో తాత్కాలిక వసతి ఏర్పాటు చేసి వారి రవాణాకు బస్సులు ఏర్పాటు చేశారు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ స్వచ్ఛంద రక్తదానాన్ని రెడ్క్రాస్ ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో గవర్నర్, మంత్రుల చేతుల మీదుగా నెల్లూరు రెడ్క్రాస్ అవార్డులు దక్కించుకుంటూ సేవల్లో ముందు వరుసలో ఉంది. యుద్ధభూమి నుంచి ప్రారంభమైన సేవలు నెల్లూరులో 14 ప్రాజెక్ట్లు రాష్ట్రంలోనే నంబర్ వన్ స్థానం ప్రపంచ రెడ్క్రాస్ దినోత్సవం నేడు -
కాకాణి రమణారెడ్డి ప్రజల మనిషి
● ఈ ప్రాంతంతో ఆయనకు విడదీయలేని బంధం ● ప్రజల కోసం పరితపించిన దార్శనీకుడు ● మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపొదలకూరు: మాజీ సమితి అధ్యక్షుడు కాకాణి రమణారెడ్డి ప్రజల మనిషి అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారు. గోవర్ధన్రెడ్డి తండ్రి రమణారెడ్డి ఐదో వర్ధంతిని పొదలకూరు మండలం తోడేరు గ్రామంలో గురువారం నిర్వహించారు. ఘాట్ వద్ద కాకాణి కుటుంబ సభ్యులు ఘనంగా నివాళుర్పించారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ రమణారెడ్డికి ఈ ప్రాంతంతో విడదీయలేని బంధం ఉన్నట్లు చెప్పారు. ప్రజల కోసం నిరంతరం పరితపించిన దార్శనికుడన్నారు. ఆయన నిబద్ధత వెలకట్టలేనిదని, ప్రజల కోసం ఆలోచించే గుణం తమకు ఎల్లవేళలా స్ఫూర్తిదాయకమన్నారు. కష్టకాలాన్ని అధిగమించేందుకు ఓర్పు, నేర్పుతోపాటు కష్టాలను ఎదుర్కొని తట్టుకునే మనో నిబ్బరాన్ని తండ్రి నుంచి నేర్చుకున్నట్టు పేర్కొన్నారు. ఆయన 18 ఏళ్లు సమితి ప్రెసిడెంట్గా రాజకీయాల్లో కొనసాగారన్నారు. రమణారెడ్డి చూపిన బాటలో పయనిస్తూ ప్రజాసేవలో ముందుకు వెళుతున్నామని, ఇదే ఆయనకు మేమిచ్చే ఘన నివాళిగా పేర్కొన్నారు. రమణారెడ్డి వర్ధంతి సందర్భంగా స్వచ్ఛందంగా తరలివచ్చిన ఆత్మీ యులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితారెడ్డి, వైస్ ఎంపీపీ వేణుంబాక చంద్రశేఖర్రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ గోగిరెడ్డి గోపాల్రెడ్డి, నాయకులు బచ్చల సురేష్కుమార్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, వీరి చలపతిరావు, ఎం.వెంకటశేషయ్య, రావుల దశరథరామయ్య గౌడ్, దాసరి భాస్కర్గౌడ్, ఇంద్రసేన్గౌడ్, కేతు రామిరెడ్డి, ఏనుగు శశిధర్రెడ్డి, జి.లక్ష్మీకల్యాణి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, ఎస్కే అంజాద్, జి.వేణుగోపాల్రెడ్డి, కిషోర్, ఎ.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
దోపిడీ కేసులో నిందితుల అరెస్ట్
● వెలుగులోకి దొంగతనాలు ● రూ.7 లక్షల సొత్తు స్వాధీనం నెల్లూరు(క్రైమ్): దోపిడీ కేసులో నిందితులను పోలీసులు విచారించే క్రమంలో కారు, ఇంట్లో దొంగతనం కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో నిందితులను అరెస్ట్ చేసి సుమారు రూ.7 లక్షలు విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు నగర ఏఎస్పీ దీక్ష, చిన్నబజారు ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావుతో కలిసి తన కార్యాలయంలో గురువారం నిందితుల వివరాలను వెల్లడించారు. చిట్వేలు మండలం బక్రాపురం కొత్తపల్లికి చెందిన ఈశ్వరయ్య ఈనెల రెండో తేదీ తెల్లవారుజామున నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ బయట ఉండగా నలుగురు వ్యక్తులు కారులో వచ్చారు. ఎక్కడికి వెళ్లాలని ఈశ్వరయ్యను అడగ్గా చిట్వేలని చెప్పాడు. వారు తాము కడపకు వెళ్తున్నామని వస్తే వదిలిపెడతామని ఆయన్ను కారులో ఎక్కించుకున్నారు. కొద్దిదూరం తీసుకెళ్లి కత్తితో చంపుతామని బెదిరించి రూ.7,200 నగదు, సెల్ఫోన్ దోచుకెళ్లారు. ఈశ్వరయ్య ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. దొంతాలి క్రాస్రోడ్డు వద్ద.. ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ఎస్సై అయ్యప్ప తన సిబ్బందితో కలిసి సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితులు తిరుపతి కొర్లగుంటకు చెందిన ఎస్.మోహిత్సాయి, చంద్రగిరి మండలానికి చెందిన ఎస్.జయకుమార్, వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల ప్రాంతానికి చెందిన పాతనేరస్తుడు పి.రాజా, ప్రకాశం జిల్లా రాచర్ల మండలం రామాపురానికి చెందిన ఎం.వెంకటరమణారెడ్డిగా గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం వారిని దొంతాలి క్రాస్రోడ్డు వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. విచారించగా దోపిడీ కేసుతోపాటు తిరుపతి తూర్పు అర్బన్ పోలీస్స్టేషన్ పరిధిలో షిఫ్ట్ డిజైర్ కారు, వేదాయపాళెం స్టేషన్ పరిధిలోని శ్రీలంక కాలనీలో ఇంట్లో దొంగతనం చేసినట్లు అంగీకరించారు. దీంతో నిందితులని అరెస్ట్ చేసి దోపిడీ కేసులోని రూ.7,200ల నగదు, కారు, ఇంటి దొంగతనం కేసులోని 22.230 గ్రాముల బంగారు ఆభరణాలు, 50 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ చెప్పారు. రాజాపై వేంపల్లి పోలీస్స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉందని తెలిపారు. నిందతులని అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన ఇన్స్పెక్టర్, ఎస్సై, క్రైమ్ పార్టీ హెచ్సీ జె.సురేష్బాబు, పీసీలు ఎస్వీ శ్యామ్, ఎం.సుబ్బారావు, సీహెచ్కె.వర్ధన్, ఎన్.దయాశంకర్, కె.వేణు, కె.దేవానాయుడిని ఏఎస్పీ అభినందించారు. -
ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన సేవలందించాలి
● స్టేట్ విజిలెన్స్ జాయింట్ కమిషనర్ డీసీకే నాయక్ పొదలకూరు : ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాలని స్టేట్ విజిలెన్స్ జాయింట్ కమిషనర్ డీసీకే నాయక్ అన్నారు. పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను తనిఖీ చేసి మందుల స్టాక్ను పరిశీలించారు. సీహెచ్సీలో రోగులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలు, కాన్పులు, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీహెచ్సీలో సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయన్నారు. సీహెచ్సీలో సర్జన్ పోస్టు ఖాళీగా ఉందన్నారు. ప్రస్తుతం సీహెచ్సీని 30 పడకల నుంచి 50 పడకలకు అప్గ్రేడ్ చేసేందుకు సిఫార్సు చేస్తామన్నారు. 50 పడకల ఆస్పత్రిగా మార్చితే మరికొన్ని వైద్యనిపుణుల పోస్టులు మంజూరయ్యేందుకు అవకాశం ఉంటుందన్నారు. సీహెచ్సీలోని వైద్యసేవలపై పూర్తి నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. ఆయన వెంట డీసీహెచ్ఎస్ డాక్టర్ పరిమళ, సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసాద్, వైద్యాధికారులు ఉన్నారు. -
మాతృ, శిశు ఆరోగ్య సేవలకు కిమ్స్లో ప్రాధాన్యం
నెల్లూరు(అర్బన్): మాతృ, శిశు ఆరోగ్య సేవలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ నాణ్యమైన వైద్య సేవలందించేందుకు కిమ్స్ కడల్స్ విభాగాన్ని ప్రారంభిస్తున్నామని కిమ్స్ స్పెషాలిటీ ఆస్పత్రి యూనిట్ హెడ్ డాక్టర్ రోహిణి ప్రియలక్ష్మి తెలిపారు. గురువారం ఆమె వివరాలను హాస్పిటల్లో వివరించారు. హైరిస్క్ ప్రెగ్నెన్సీ మేనేజ్మెంట్, ఆధునిక ఎన్ఐసీయూ (నియోనేటల్), 24 గంటలు అత్యవసర సేవలు అందించడం జరుగుతుందన్నారు. తల్లీశిశువు సురక్షితంగా ఉండేందుకు ఆధునిక లేబర్ రూమ్స్, అత్యాధునిక వైద్యపరికరాలు, భద్రతా ప్రమాణాలతో కిమ్స్ కడల్స్ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బి.భాస్కర్రావు ఆధ్వర్యంలో వైద్యుల సమక్షంలో శనివారం ప్రత్యేక విభాగాన్ని ప్రారంభిస్తామన్నారు.జనారణ్యంలోకి చుక్కలదుప్పిఉదయగిరి: దాహార్తిని తీర్చుకునేందుకు అటవీ ప్రాంతం నుంచి చుక్కలదుప్పి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల సమీపానికి గురువారం ఉదయం వచ్చింది. కుక్కలు దాడి చేసేందుకు దానిని వెంబడించాయి. గమనించిన వైద్యశాల సెక్యూరిటీ సిబ్బంది కుక్కల బారినుంచి దుప్పిని రక్షించారు. అనంతరం అటవీ రేంజ్ అధికారి బీఎస్ కుమార్రాజాకు సమాచారం అందించారు. ఆయన ఆదేశాల మేరకు ఏబీఓ బచ్చల వెంకటేశ్వర్లు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిశీలించి దుప్పికి నీరు తాగించి, గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక పశువైద్యశాలకు తరలించారు. చికిత్స తర్వాత దుప్పిని దుర్గం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. అదుపుతప్పి కోళ్ల వ్యాన్ బోల్తా● డ్రైవర్కు స్వల్ప గాయాలు ● సుమారు 700 కోళ్ల మృతి దగదర్తి: చిత్తూరు నుంచి చీరాలకు వెళ్తున్న ఐషర్ వ్యాన్ గురువారం తెల్లవారుజామున అల్లూరు రోడ్డు రైల్వే వంతెన వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. సుమారు 700 కోళ్లు మృతిచెందాయి. అతివేగంతో వెళ్తున్న వ్యాన్ అల్లూరు రోడ్డు రైల్వే వంతెన వద్ద ఏర్పాటుచేసిన మలుపు దగ్గరకు రాగానే అదుపుతప్పి బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. హైవే మొబైల్ సిబ్బంది, దగదర్తి పోలీసులు వంతెనపై ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై జంపాని కుమార్ తెలిపారు. రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు ప్రారంభంసంగం: మండలంలోని దువ్వూరు గ్రామంలో 13వ రాష్ట్రస్థాయి పురుషుల, మహిళ బీచ్ కబడ్డీ చాంపియషిప్ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు, టీడీపీ నాయకురాలు ఆనం లీలా కై వల్య హాజరై క్రీడా జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. రాష్ట్ర, జిల్లా కబడ్డీ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు, నాయకులు, యువత, పరిసర గ్రామాల ప్రజలు భారీగా విచ్చేశారు. నాలుగు రోజులపాటు పోటీలను 15 మంది టెక్నికల్ ప్రత్యేక బృందం పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. ప్రజాభిప్రాయం మేరకే అనుమతులు● జేసీ వెంకటేశ్వర్లుసైదాపురం: ప్రజాభిప్రాయం మేరకే మైనింగ్కు అనుమతులు ఇస్తామని జాయింట్ కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక కృష్ణా మైకా మైన్స్ కంపెనీ ఆధ్వర్యంలో గురువారం పర్యావరణంపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మొలకలపూండ్ల, చాగణం రెవెన్యూ పరిఽధిలోని సర్వే 528, 505లో 10.02 హెక్టార్లలో మైనింగ్ కార్యకలాపాలను నిర్వహించేందుకు పర్యావరణ అనుమతి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ప్రజల మనోభావాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ అధికారి అశోక్కుమార్, తహసీల్దార్ సుభద్ర, స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు పాల్గొన్నారు. -
వైభవంగా జొన్నవాడ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
బుచ్చిరెడ్డిపాళెం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడలోని మల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. సాయంత్రం ఆలయ అర్చకులు స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం పెన్నా నది వద్ద నుంచి పుట్టమన్నును తీసుకొచ్చి నవధాన్యాలు చల్లి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఆలయ చైర్మన్ తిరువూరు అశోక్రెడ్డి, ఆలయ ఈఓ అర్వభూమి శ్రీనివాసులురెడ్డి, పాలక మండలి సభ్యులు, లలితా పరమేశ్వరి ఆశ్రమ పీఠాధిపతి రామాయణ మహేష్స్వామి పాల్గొన్నారు. జీపీసీఎంఎస్ ఓటర్ల జాబితా విడుదల నెల్లూరు(వేదాయపాళెం): జూన్ 12న నిర్వహించనున్న గిరిజన ప్రాథమిక సహకార మార్కెటింగ్ సంఘ డైరెక్టర్ల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాను విడుదల చేసినట్లు ఆ సంఘ చైర్మన్, డివిజనల్ మేనేజర్ ఎమ్మార్సీవీ గిరిబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీడీఏ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని మండలాల్లోని తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో ఓటర్ల జాబితాలను ప్రదర్శించామని చెప్పారు. ఓటర్ల జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే తగిన ఆధారాలతో ఈ నెల 14న ఐటీడీఏ ప్రధాన కార్యాలయంలో సమర్పించాలని కోరారు. ఉపాధి శ్రామికుల సంఖ్యను పెంచండి నెల్లూరు(పొగతోట): ఉపాధి హామీ పనులకు హాజరయ్యే శ్రామికుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్ మండలాధికారులను ఆదేశించారు. గురువారం డ్వామా కార్యాలయం నుంచి వివిధ మండలాల ఏపీఓలు, ఈసీలు, టీఏలతో జూమ్కాన్ఫరెన్స్ ద్వారా పీడీ మాట్లాడారు. ఈ నెల 11వ తేదీ నాటికి నిత్యం 50 వేల మంది శ్రామికులు పనులకు హాజరయ్యేలా చూడాలన్నారు. శ్రామికుల వేతన బకాయిలు మంజూరయ్యాయని తెలిపారు. పెండింగ్లో ఉన్న వేతన బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీల్లో అవసరమైన పనులు గుర్తించి శ్రామికులకు పనులు కల్పించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయి సిబ్బందిపై ఉందన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 136 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత జలదంకి(కావలి): కలిగిరి నుంచి కావలి వైపు రేషన్ బియాన్ని తరలిస్తున్న లారీని జలదంకి వద్ద కలిగిరి సీఐ సుబ్బారావు, జలదంకి ఎస్సై లతీఫున్నీసా గురువారం పట్టుకున్నారు. అనంతరం లారీని పోలీస్స్టేషన్కు తరలించి పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించారు. లారీలో 138 బస్తాల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా మని వారు తెలిపారు. శ్రీవారి దర్శనానికి 6 గంటలు తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు 71,029 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,184 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూ పంలో హుండీలో రూ.3.07 కోట్లు సమర్పించా రు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 6 గంటల సమ యం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగ లుగుతున్నారు. కాగా సర్వదర్శనం టోకెన్లు కలిగి న భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
కండలేరు నుంచి నీటి విడుదల
రాపూరు: చైన్నె నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు, నెల్లూరు, తిరుపతి జిల్లాల రైతులు, ప్రజల అవసరాల నిమిత్తం నీటిని కండలేరు జలాశయం నుంచి బుధవారం విడుదల చేశారు. తొలుత గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగుగంగ ఎస్ఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కండలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్న పవర్ప్లాంట్ యూనిట్ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కండలేరు జలాశయంలో 43 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. చైన్నె నగర ప్రజలకు, పరిశ్రమలకు, తిరుపతి, నెల్లూరు జిల్లా ప్రజలకు, రైతులకు తాగు, సాగునీటి అవసరాల నిమిత్తం 130 రోజుల్లో 13.78 టీఎంసీలను నీటిని విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. తిరుపతి జిల్లాలో 70 వేల ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 54 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. చైన్నె నగరానికి తాగునీటి కోసం 5 టీఎంసీలు, రాపూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి ప్రాంతాలకు తాగునీటి కోసం 2, స్వర్ణముఖి బ్యారేజ్కి 2, మేనకూరు పారిశ్రామికవాడకు ఒక టీఎంసీని విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈఈ గజేంద్రరెడ్డి, డీఈ అనిల్బాబు, ఏఈ అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మా రూట్.. సపరేటు
● సర్వేపల్లిలో మద్యం దుకాణాల్లో ‘ఎస్’ ట్యాక్స్ వసూలు ● పుట్టగొడుగుల్లా బెల్టు షాపులు.. అందులో ధరలు మరింత ౖపైపెకి.. ● ఒక్కో బాటిల్పై రూ.50 నుంచి రూ.80 వరకు అమ్మకాలు ● పట్టించుకోని ఎకై ్సజ్ అధికారులు సాక్షి టాస్క్ఫోర్స్: సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతలు ప్రతి అవకాశాన్ని రాబడి వనరులుగా మార్చుకుంటున్నారు. అధికార పార్టీ ముఖ్యనేత అండదండలతో ప్రకృతి వనరుల నుంచి.. వివిధ రంగాల వ్యాపారులనూ దోచుకుంటున్నారు. ఆఖరికి మందుబాబులనూ వదలడం లేదు. నియోజకవర్గంలో ఊరూరా బెల్టుషాపుల ఏర్పాటుకు ఏకంగా బహిరంగ వేలం పెట్టిన సదరు నేతలు, అక్కడే అధిక ధరలకు అమ్ముతున్నారనుకుంటే.. తాజాగా దుకాణాల్లోనూ ఎమ్మార్పీపై అధిక ధరలకు విక్రయాలు సాగిస్తున్నారు. అడిగితే.. ‘ఎస్’ ట్యాక్స్ కట్టాలంటూ నిర్వాహకులు చెబుతున్నారని మద్యం ప్రియులు ధ్వజమెత్తుతున్నారు. ఇక ఏకంగా మద్యం దుకాణాల పక్కనే అనధికారికంగా మినీబార్లను తలపించే రీతిలో పర్మిట్ రూమ్లను ఏర్పాటు చేసి మరీ వ్యాపారం చేస్తున్నారు. తమ కళ్ల ముందే మద్యం విక్రయాల్లో నిబంధనలు ఉల్లంఘనలు జరుగుతున్నా.. ఎకై ్సజ్ అధికారుల కళ్లకు కనిపించకపోవడం దారుణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మొత్తం 28 గెజిట్ మద్యం దుకాణాలను ఏర్పాటు చేశారు. ఇందులో వెంకటాచలంలో 6, పొదలకూరులో 6, ముత్తుకూరులో 8, మనుబోలులో 3, తోటపల్లిగూడూరు మండలంలో 5 దుకాణాలు ఉండగా, ఆయా దుకాణాల పరిధిలో విస్తృతంగా బెల్టు షాపులను ఏర్పాటు చేసేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు విపరీతంగా ఎగబడడంతో నిర్వాహకులంతా సిండికేట్ అయి ఒక్కో బెల్టు షాపునకు భారీ మొత్తంలో వేలం పాటలు పెట్టి మరీ అనుమతులిచ్చారు. దీంతో బెల్టుషాపులతోపాటు దుకాణాల నుంచి ‘ఎస్’ ట్యాక్స్ డిమాండ్ చేయడంతో ఎమ్మార్పీ కంటే అదనంగా వసూలు చేసి దోచుకుంటున్నారు. దుకాణాల వద్ద అయితే చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్పై రూ.10 లెక్కన వసూలు చేస్తుండగా, మిగతా బ్రాండెడ్ మద్యంపై రూ.50 నుంచి రూ.80 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఎందుకు ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువగా అమ్ముతున్నారని ప్రశ్నిస్తే క్యాషియర్లు మాత్రం నీళ్లు నములుతున్నారు. మామూళ్ల మత్తులో ఎకై ్సజ్ శాఖ సర్వేపల్లి నియోజకవర్గంలో సుమారు 250పైగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి మందుబాబులను దోచుకుంటున్నారని సమాచారం. కొన్ని గ్రామాల్లో నేతల మధ్య ఉన్న పోరు కారణంగా పోటాపోటీగా బెల్టు షాపులు తెరుచుకున్నాయి. నిబంధనల ప్రకారం మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధరకే మద్యం విక్రయాలు చేయాల్సి ఉంది. అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మార్పీ ధర కంటే రూ.10 అదనంగా అమ్ముతున్నారని ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చినా మామూళ్ల మత్తులో పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంకటాచలంలోని మద్యం దుకాణం వద్ద టీడీపీ సానుభూపతిపరులే ఎమ్మార్పీ ధర కంటే అదనంగా మద్యం అమ్మకాలు చేపట్టడంపై విమర్శలు చేయడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొన్ని గ్రామాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా బెల్టు షాపుల్లో మద్యం విక్రయాలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మహిళలు మండి పడుతున్నారు. గ్రామాల్లో బెల్టు షాపుల గురించి ఎకై ్స జ్ అధికారులకు, సిబ్బందికి సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏ గ్రామం నుంచి అయితే ప్రజలు బెల్టు షాపుల గురించి సమాచారం ఇస్తున్నారో వెంటనే ఎకై ్సజ్శాఖ సిబ్బంది సంబంధిత బెల్టు షాపుల నిర్వాహకులకు ఫోన్ చేసి జాగ్రత్తగా అమ్మకాలు చేసుకోవాలని సూచిస్తున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని గ్రామాల్లో బెల్టు దుకాణాలు లేకుండా చర్యలు చేపట్టాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సర్వేపల్లి నియోజకవర్గంలో దోపిడీకి కాదేది అనర్హం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. విలువైన ప్రభుత్వ భూముల్లో పాగా వేసి అక్రమ గ్రావెల్ దోచుకుంటున్నారు. ఏకంగా పెన్నానదిలోకి రోడ్లేసి ఇసుక కొల్లగొడుతున్నారు. బొగ్గు బూడిద రవాణా నుంచి పోర్టు నుంచి వెళ్లే సరుకుల వాహనాలు ‘ఎస్’ ట్యాక్స్ను వసూలు చేస్తుండగా తాజాగా మద్యంపైనా వసూలు చేస్తున్నట్లు మద్యం ప్రియులు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. మద్యంను ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం ఏదొక దుకాణం వద్ద అధిక ధరల అమ్మకాలపై గొడవలు జరుగుతున్నా.. ఎకై ్సజ్శాఖ అధికారులు పట్టించుకోక పోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. -
ప్రతి గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి
● మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కోవూరు: నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో బుధవారం నెల్లూరులోని తన నివాసంలో కోవూరు నియోజకవర్గానికి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు, పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి మాట్లాడుతూ నిరంతరం ప్రజల మధ్య ఉండి పార్టీ కార్యక్రమాలను చేరవేయాలన్నారు. బూత్ కమిటీల పనితీరును సమగ్రంగా సమీక్షించిన ఆయన, ఎక్కడ లోపాలున్నాయో గుర్తించి వెంటనే సరిదిద్దాలని ఆదేశించారు. ప్రతి బూత్లో ఓటర్ల వివరాలు సక్రమంగా నమోదు చేయడం, కొత్త ఓటర్ల నమోదు, తొలగింపులపై అప్రమత్తంగా ఉండటం వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత పెంచేలా కృషి చేయాలన్నారు. యువత, మహిళలను పెద్దఎత్తున పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయాలని, సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, జిల్లా ఉపాధ్యక్షుడు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు శివుని నరసింహారెడ్డి, ఇందుకూరుపేట మండల అధ్యక్షుడు మావులూరు శ్రీనివాసులురెడ్డి, బుచ్చి రూరల్ అధ్యక్షుడు చెర్లో సతీష్రెడ్డి, బుచ్చి మున్సిపాలిటీ అధ్యక్షుడు షేక్ షాహుల్, విడవలూరు మండల అధ్యక్షుడు కాటంరెడ్డి నవీన్రెడ్డి, కోవూరు మండల అధ్యక్షుడు అత్తిపల్లి అనూప్రెడ్డి, నియోజకవర్గ బూత్ కమిటీల ఇన్చార్జి కొండూరు లక్ష్మీనారాయణరెడ్డి, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు అనపల్లి ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద వాగ్వాదం
● అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారని ఫిర్యాదు ● లేఅవుట్ను పరిశీలించిన ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్పొదలకూరు: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద బుధవారం వాగ్వాదం చోటు చేసుకుంది. పట్టణంలోని సత్యనారాయణ లేఅవుట్లో ఇటీవల ప్రజాప్రయోజనాల కోసం కేటాయించిన 286 అంకణాలను ప్లాట్లుగా మార్పుచేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్ దీపిక విచారణ చేశారు. ఆమె విచ్చేస్తున్న సందర్భంగా ప్రజాప్రయోజన స్థలానికి సంబంధించి గతంలో ఫిర్యాదు చేసిన వారికి నోటీసులివ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానంలో కేసు నడుస్తున్న లేఅవుట్లో ప్రజాప్రయోజన స్థలాన్ని పది ప్లాట్లుగా మార్చి ఇటీవల నాలుగింటిని రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో పంచాయతీ సెక్రటరీ యశ్వంత్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై హనీఫ్ కొన్నవారు, అమ్మిన వారిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లను అక్రమంగా చేశారని జిల్లాస్థాయి అధికారికి ఫిర్యాదు చేయడంతో స్పందించి విచారణ నిర్వహించారు. అయితే ఇరువర్గాల వారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు చేరుకుని డాక్యుమెట్లను విచారణాధికారికి సమర్పించారు. ఓ వర్గం వారు ప్రజాప్రయోజన స్థలాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని ప్రశ్నించారు. పంచాయతీ ఆధీనంలో ఉన్న స్థలంలో వారు మూడురోజుల క్రితం వాలీబాల్ కోర్టు, పార్కును ఏర్పాటు చేశారు. మరో వర్గం వారు అన్ని రకాల డాక్యుమెంట్లు ఉన్నాయని తమకే స్థలం చెందుతుందని వాదనలు వినిపించారు. బహిరంగ మార్కెట్లో స్థలం సుమారు రూ.4 కోట్ల వరకు ధర పలుకుంది. ● రికార్డులను పరిశీలించిన దీపిక సత్యనారాయణ లేఅవుట్, సత్యనారాయణ ట్రేడర్స్ రెండు చోట్ల స్థలాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇరువర్గాలు, పంచాయతీ సెక్రటరీ వద్ద స్టేట్మెంట్ రికార్డు చేశామన్నారు. ఇందుకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక రూపొందిస్తామన్నారు. ఆమె వెంట సబ్రిజిస్ట్రార్ శోభమ్మ ఉన్నారు. -
వాణిజ్య గ్యాస్ ధరల పెంపు దారుణం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): వాణిజ్య గ్యాస్ ధరల పెంపు దారుణమని పలువురు నేతలు అన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బుధవారం ఖాళీ సిలిండర్లతో నెల్లూరులోని ఆజాద్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రదాన కార్యదర్శి యామాల మధు మాట్లాడుతూ కేంద్రం వాణిజ్య సిలిండర్పై ఏకంగా రూ.993 పెంచడంతో చిన్న టిఫిన్ సెంటర్ల నిర్వాహకులపై పెనుభారం పడిందన్నారు. మూడు నెలల వ్యవధిలో 81 శాతం గ్యాస్ ధరలను పెంచడం దారుణమన్నారు. 2014లో రూ.400 ఉన్న డొమెస్టిక్ గ్యాస్ ధర నేడు రూ.1,000కి చేరువలో ఉందన్నారు. ఇది నరేంద్రమోదీ వైఫల్యానికి నిదర్శనమన్నారు. గ్యాస్ ధరలను తగ్గించాలని లేకపోతే రానున్న రోజుల్లో పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు రమణయ్య, సిరాజ్, సుధాకర్, అజీజ్, లీలామోహన్, షాన్వాజ్, వనజ, శీనయ్య, అహ్మద్, మహీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
వెన్నుపోటు బాబుకు గునపం గుర్తే కరెక్ట్
● బాబు, పవన్.. ఒంటరిగా పోటీ చేయగలరా? ● జగన్ పాలన, కూటమి పాలనపై ప్రజల్లో చర్చ ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ముత్తుకూరు (పొదలకూరు) : వెన్నుపోటు చంద్రబాబుకు గునపం గుర్తే కరెక్ట్గా సరిపోతుందని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పునరుద్ఘాటించారు. మండలంలోని ఈపూరు, రొయ్యలపాళెంలో బుధవారం కాకాణి పర్యటించారు. దువ్వూరు విశ్వమోహన్రెడ్డి, నిరంజన్రెడ్డి ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న శ్రీమహాలక్ష్మి అమ్మవారి ఆలయ ఐదో వార్షికోత్సవ ప్రత్యేక పూజల్లో కాకాణి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈపూరు అనంతరాజు వేణుగోపాల్ గృహంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి, చంద్రబాబు పాలనపై ప్రజలు చర్చించుకుంటున్నట్లు తెలిపారు. ఏ ఒక్క వర్గం కూటమి పాలనలో సంతృప్తిగా లేరని, పొరుగు రాష్ట్రాల విజయాలను చూసైనా పవన్కల్యాణ్, చంద్రబాబు నేర్చుకోవాల్సి ఉందన్నారు. వీరిద్దరూ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయగలరాని ప్రశ్నించారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంటరిగా పోటీ చేసి అఖండ విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో ప్రజ లు అనేక ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. జిల్లాలో మహానాడు ఎక్కడ జరపాలని టీడీపీ నాయకులు పోట్లాడుకుంటున్నార న్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని సీట్లు తమవేనని స్పష్టం చేశారు. చంద్రబాబు ఎన్టీయార్ను నుంచి నమ్మిన పార్టీ నేతలను, కార్యకర్తలను ప్రధానంగా ప్రజలను గునపంతో పొడవడం అలవాటు చేసుకున్నందునే గునపం గుర్తు ఆయనకు సరిపోతుందన్నారు. తాను జోస్యం చెప్పడం లేదని ప్రజల నాడిని బట్టి వచ్చే ఎన్నికల సరళిని వివరిస్తున్నట్లు తెలిపారు. వాస్తవాలు చెబితే టీడీపీకు చెందిన బీద రవిచంద్ర జీర్ణించుకోలేక తాను జోస్యం చెపుతున్నానంటున్నాడన్నారు. కూటమి పాలనలో జరుగుతున్న మోసాలను తాము స్పష్టంగా ప్రజల దృష్టికి తీసుకుని వెళుతున్నామని, తమ ప్రభుత్వంలో ప్రతి వర్గానికి మేలు జరిగినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా గ్రామాల్లో పనులు జరగడం లేదన్నారు. సీఎస్ఆర్ నిధుల కేటాయింపులో అవకతవకలకు పాల్పడుతున్నారని సైకిళ్ల పంపిణీ వ్యవహారంలో డీలర్ల నుంచి కమీషన్లను దండుకుంటూ ప్రజాసేవ చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఒక్కసారైనా పొత్తులు లేకుండా ఎన్నికల బరిలో నిలిచాడా అని ప్రశ్నించారు. తమిళనాడులో విజయ్ ఒంటరిగా పోటీ చేసి పూర్తి మెజార్టీ రాలేకున్నా అతిపెద్ద పార్టీగా విజయం సాధించినట్లు తెలిపారు. అధికారం ఉన్నా లేకున్నా ఎల్లప్పుడు ప్రజలతోనే ఉంటామని, వారి సమస్యలపై స్పందించి పోరాటం చేస్తామని వెల్లడించారు. పార్టీ మండల కన్వీనర్ విష్ణువర్ధన్రెడ్డి, నాయకులు దువ్వూరు విశ్వమోహన్రెడ్డి, దువ్వూరు నిరంజన్రెడ్డి, దవ్వూరు తేజారెడ్డి, అలపాక శ్రీనివాసులు, పాముల శ్రీనివాసులు పాల్గొన్నారు. -
హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలు
నెల్లూరురూరల్: వెంకటగిరిలోని ప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా సంస్థ ప్రతినిధులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హ్యాండ్లూమ్స్ టెక్నాలజీపై మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సులో శిక్షణ ఇచ్చి కేంద్ర ప్రభుత్వ శాఖచే సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన వారికి మెరిట్ ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తామన్నారు. ఇంటర్మీడియట్ (ఎంపీసీ), ఐటీఐ ఉత్తీర్ణులైన వారు నేరుగా రెండో సంవత్సరంలో చేరొచ్చని, నెలకు రూ.2500 స్టై ఫండ్ ఇస్తామన్నారు. వివరాలకు 93999 36872, 98661 69908 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచిచారు.దువ్వూరు సమీపంలో రోడ్డు ప్రమాదం● బస్సును ఢీకొట్టిన లారీ సంగం: మండలంలోని దువ్వూరు సమీపంలో నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కనిగిరి నుంచి చైన్నె వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. బస్సులోని ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజేష్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మిగిలిన ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానాలకు పంపించారు. అలాగే వాహనాల రాకపోకలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. లారీ ముందు భాగం దెబ్బతింది. శ్రీవారి దర్శనానికి 8 గంటలుతిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 76,240 మంది స్వామిని దర్శించుకున్నారు. 28,257 మంది తలనీలాలు అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.44 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేనివారు 8 గంటల్లో, ప్రత్యేక ప్రవేశ టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వ దర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
ఓట్లు తొలగించే ప్రమాదముంది
● నాయకులు, కార్యకర్తలు జాగ్రత్త వహించండి● ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి ఆత్మకూరు: ‘గ్రామాలకు చెందిన ఓటర్లు ఉద్యోగ, వ్యాపార పనుల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉంటే ఆ ఓట్లను తొలగించే ప్రమాదం ఉంది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు జాగ్రత్త వహించాలి’ అని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి సూచించారు. పట్టణంలోని తన కార్యాలయంలో బుధవారం పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ (స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్)లో ఓటర్ల జాబితాను సరిచూసే కార్యక్రమం ఆత్మకూరు నియోజకవర్గంలో పదిరోజుల అనంతరం ప్రారంభం కానుందన్నారు. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లను తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ వారి ఓటును తొలగింపబడకుండా చూసుకోవాలన్నారు. అనంతరం పార్టీ కమిటీల జాబితాను వెంటనే అందజేయాలని ఆయన నాయకులను కోరారు. కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు సుధాకర్రెడ్డి, నాయకులు బొమ్మిరెడ్డి రవికుమార్రెడ్డి, సీహెచ్ కామాక్షయ్య నాయుడు, ఎన్ఆర్ఐ మీరామొహిద్దీన్, కె.కిశోర్, టి.అశోక్, అండ్రా సుబ్బారెడ్డి, రావూరు శ్రీనివాసులురెడ్డి, బొలిగర్ల వెంకటేశ్వర్లు, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
9 నుంచి ఆవాజ్ రాష్ట్ర మహాసభలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఈనెల 9, 10వ తేదీల్లో నెల్లూరులో ఆవాజ్ మూడో రాష్ట్ర మహాసభలు జరుగుతాయని జిల్లా కార్యదర్శి రషీద్ తెలిపారు. నెల్లూరులోని ఆవాజ్ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 9వ తేదీ ఉదయం భారత రాజ్యాంగం – లౌకికవాదం ఎదుర్కొంటున్న సమస్యలపై సదస్సు జరుగుతుందన్నారు. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రు, ఆవాజ్ వ్యవస్థాపకులు గఫూర్ తదితరులు హాజరవుతారన్నారు. మతసామరస్యానికి, లౌకికత్వానికి ప్రతీక అయిన జిల్లాలో మొదటిసారిగా నిర్వహిస్తున్న సభలను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో ఆవాజ్ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ రఫీ, నాయకులు జానీబాషా, చాన్బాషా, కోశాధికారి సర్దార్ అహ్మద్, జిల్లా కమిటీ సభ్యులు నాయబ్ రసూల్, ఫయాజ్, రవూఫ్, మునీర్ అహ్మద్, బషీర్ తదితరులు పాల్గొన్నారు. -
56 ప్రాంతాల్లో వేసవి శిక్షణ శిబిరాలు
నెల్లూరు(టౌన్): ఈనెలాఖరు వరకు జిల్లా వ్యాప్తంగా 56 కేంద్రాల్లో వేసవి శిక్షణ శిబిరాలు కొనసాగుతాయని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్కే జసీమ్ తెలిపారు. మంగళవారం నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ క్రీడలకు శిక్షణ ఇస్తున్న కోచ్లకు పరికరాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శిబిరాలకు హాజరువుతున్న క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీయాలన్నారు. క్రీడలతో మానసిక, శారీరక ఒత్తిడి తగ్గుతుందన్నారు. సెట్నల్ సీఈఓ, జిల్లా పారిశ్రామిక డిప్యూటీ డైరెక్టర్ శ్రీధర్బాబు మాట్లాడుతూ ఉన్నత క్రీడాకారులుగా ఎదగడానికి వేసవి శిబిరాలు మంచి అవకాశమన్నారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆనం మహేష్రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం శాప్లీగ్స్ లాంటి టోర్నమెంట్లను ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ కె.గురుప్రసాద్, ఎస్సీజీఎఫ్ఐ సెక్రటరీ దేవిక, రమణయ్య, వివేకానంద, ఏసీ సుబ్బారెడ్డి, ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ సూచనలతో ఆర్థిక సాయం
కావలి: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలతో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ఓ కుటుంబానికి అండగా నిలిచారు. కావలి రూరల్ మండలం ఒట్టూరు గ్రామానికి చెందిన సింగోటి రాజేష్ అనే యువకుడు ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా వైద్య ఖర్చుల నిమిత్తం ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లోకి పడిపోయింది. జువ్వలదిన్నె షిప్పింగ్ హార్బర్ సందర్శనకు వచ్చిన జగన్మోహన్రెడ్డికి బాధిత కుటుంబం విషయం చెప్పింది. ఆయన సూచనల మేరకు ప్రతాప్కుమార్రెడ్డి ఒట్టూరు గ్రామాల నాయకులను, రాజేష్ తండ్రి ప్రసాద్ను మంగళవారం కార్యాలయానికి పిలిపించి చికిత్స నిమిత్తం రూ.2 లక్షల నగదు అందచేశారు. ప్రసాద్ కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు. -
రేపట్నుంచి రాష్ట్రస్థాయి బీచ్ కబడ్జీ పోటీలు
సంగం: మండలంలోని దువ్వూరులో ఈ నెల 7 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ చాంపియన్షిప్ పోటీలను నిర్వహించనున్నట్లుగా జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ సతీష్ తెలిపారు. రాష్ట్రస్థాయి బీచ్ కబడ్జీ పోటీలకు ఎంపికై న జిల్లా పురుష, మహిళల జట్లకు టీషర్టులను మంగళవారం అందజే శారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో తొలిసారిగా 26 జిల్లాల నుంచి మహిళలు, పురుషుల జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజనం, వసతి సౌకర్యాలను కల్పిస్తున్నామని చెప్పారు. జిల్లా పురుషుల జట్టుకు 16 మంది, మహిళల జట్టకు 10 మంది క్రీడాకారులను ఎంపిక చేశామని తెలిపా రు. వారిలో ప్రతిభ కనబరిచిన 6 మంది పురుషులు, 6 మంది మహిళలను తుది జట్లలోకి తీసుకుంటా మని చెప్పారు. జిల్లా జట్టులో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సునీల్, నవీన్ వంటి ప్రముఖ క్రీడాకారులు ఉండడం గర్వకారణమన్నారు. ఈ పోటీల్లో నెల్లూరు జట్టు ఫైనల్స్కు చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. -
మద్యం మత్తులో యువకుల బీభత్సం
● ఆటో డ్రైవర్పై దాడి ● మహిళా ప్రయాణికులపై దాడికి యత్నం కావలి: మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆటో డ్రైవర్పై దాడిచేసిన ఘటన మంగళవారం జలదంకి – గట్టుపల్లి క్రాస్రోడ్డు వద్ద జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కావలికి చెందిన కుప్పు సాయిసునీల్, షేక్ సుభాని జలదంకిలో మద్యం తాగి కావలి వైపు మోటార్బైక్పై వేగంగా వెళ్తున్నారు. ఇదే సమయంలో కావలి నుంచి బ్రాహ్మణక్రాకకు వెళ్తున్న ఆటోలో ముగ్గురు మహిళా ప్రయాణికులున్నారు. వీరు క్రాస్రోడ్డు వద్ద ఆగి కొబ్బరి బోండాలు, పండ్లు కొనుగోలు చేస్తున్నారు. అదే సమయంలో అత్యంత వేగంగా సాయిసునీల్, సుభాని వేగంగా వచ్చి ఆటోను బైక్తో ఢీకొట్టి పడిపోయారు. మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు ఆటో డ్రైవర్ ప్రవీణ్పై దాడిచేసి తరుముకున్నారు. అంతటి ఆగకుండా రాళ్లతో ఆటోను ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. మహిళా ప్రయాణికులపై దాడి చేయబోయారు. స్థానికులు వారిని వారించగా యువకులు తిరగబడి దాడికి యత్నించారు. గందరగోళం చేసి కావలికి వస్తే మీ సంగతి చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. అయితే స్థానికులు ధైర్యం చేసి వారిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. జలదంకి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశామని ఎస్సై లతీఫున్నీసా తెలిపారు. ఇద్దరిపై కావలిలోని వివిధ పోలీస్స్టేషన్లలో పలు కేసులున్నట్లు వెల్లడించారు. -
రాజకీయ దురంధరుడు కలికి
● యానాదిరెడ్డికి ఘన నివాళి కావలి: మాజీ మంత్రి కలికి యానాదిరెడ్డి రాజకీయ దురంధరుడని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి అన్నారు. కలికి 20వ వర్ధంతి కార్యక్రమం మంగళవారం పట్టణంలోని ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ వద్ద ఘనంగా జరిగింది. రామిరెడ్డి, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కలిసి యానాదిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా యానాదిరెడ్డి వర్ధంతి నిర్వహించడం సంతోషకరమని తెలిపారు. ఎంతోమంది యువకులకు రాజకీయ ఓనమాలు నేర్పి వారికి దిశానిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అనంతరం వైఎస్సార్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో దామిశెట్టి సుధీర్నాయుడు, పందిటి కామరాజు, విజయ్కుమార్రెడ్డి, జంపాని రాఘవులు, మెట్టుకూరి రామిరెడ్డి, గంధం ప్రసన్నాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
కేజీబీవీ టీచర్లు, ప్రిన్సిపల్స్కు బదిలీల కౌన్సెలింగ్ నేడు
నెల్లూరు(టౌన్): జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్, పీజీటీలు, సీఆర్టీలకు బుధవారం బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కావలిలోని కేజీబీవీలో పనిచేస్తున్న ప్రిన్సిపల్ ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్నారు. అదే విధంగా 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆరుగురు పీజీటీలు, సీఆర్టీలున్నారు. వీరికి తప్పనిసరిగా బదిలీలు జరుగనున్నాయి. అదే విధంగా మరో 11 మంది రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ సమగశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇసుక వాహనాలు నిబంధనలు పాటించాల్సిందే● ఇన్చార్జి డీడీ శ్రీనివాసరావు నెల్లూరు(టౌన్): జిల్లాలో ఇసుక రవాణా చేస్తున్న వాహనదారులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా గనుల, భూగర్భ శాఖ ఇన్చార్జి డీడీ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి వాహనాన్ని టార్పాలిన్తో పూర్తిగా కప్పాలన్నారు. ముందు భాగంలో ఉచిత ఇసుక వాహనం అంటూ బోర్డును అమర్చాలన్నారు. వినియోగదారుల నుంచి తప్పనిసరిగా రసీదు తీసుకోవడంతోపాటు తనిఖీల సమయంలో దానిని సంబంధిత అధికారులకు చూపించాలన్నారు. పాఠశాలలు, ఆస్పత్రుల్లాంటి ప్రాంతాల వద్ద జాగ్రత్తగా వాహనాన్ని నడపాలన్నారు. ఇసుక రవాణా చేసే అన్ని వాహనాల్లో తప్పనిసరిగా జీపీఎస్ పరికరం అమర్చాలన్నారు. లేకపోతే డ్రైవర్ మొబైల్లో జీపీఎస్ యాప్ డౌన్లోడ్ చేసి రవాణా పూర్తయ్యే వరకు ఆన్లో ఉంచాలన్నారు. ఉచిత ఇసుకను అధిక మొత్తంలో నిల్వ చేయడం లేదా డంపింగ్ చేయడం, వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడం పూర్తి నిషేధమన్నారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విధులకు వచ్చి.. గుండెపోటుకు గురై..● ఆత్మకూరులో ఫార్మసిస్ట్ మృతి ఆత్మకూరు: అతను ఉదయం ఇంటి నుంచి విధులకు వచ్చాడు. ఈ క్రమంలో గుండెపోటుకు ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో మంగళవారం జరిగింది. ఆస్పత్రి సిబ్బంది వివరాల మేరకు.. కలువాయికి చెందిన వడిదారి పెంచలయ్య (43) కొంతకాలంగా కాంట్రాక్ట్ పద్ధతిలో ఫార్మసిస్ట్గా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఊరి నుంచి వచ్చి విధుల్లో ఉన్న సమయంలో గుండెనొప్పిని గ్యాస్ సమస్యగా భావించి మాత్రలు వేసుకునేందుకు ఉపక్రమిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే సిబ్బంది ఎమర్జెన్సీ వార్డుకు తీసుకెళ్లారు. డాక్టర్లు చికిత్స చేస్తుండగా అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. పెంచలయ్య మృతి వార్త తెలుసుకున్న ఏపీ హంస (ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్) జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్రావు, కార్యదర్శి బి.కమల్ కిరణ్, పట్టణాధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు వెంకట్రావు సంతాపం తెలిపారు. పెంచలయ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని..● వ్యక్తి దుర్మరణం బిట్రగుంట: జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలైన ఘటన బోగోలు మండలం కోవూరుపల్లి వద్ద మంగళవారం రాత్రి జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. బోగోలు మండలం ముంగమూరుకు చెందిన గొత్తల నాగరాజు (35) అల్లూరులోని కెనరా బ్యాంక్లో ఉద్యోగం చేస్తూ కావలిలో నివాసం ఉంటున్నాడు. బ్యాంక్ విధులు ముగించుకుని మోటార్బైక్పై కావలికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఘటనా స్థలాన్ని బట్టి చూస్తే బైక్ను ఏ వాహనం ఢీకొన్నట్లుగా లేదని అర్థమవుతోంది. అదుపుతప్పి పడటంతో వెనుక నుంచి వాహనం అతడిపైకి ఎక్కడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని నాగరాజు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.150 సన్నవి : రూ.50 పండ్లు : రూ.30 -
హక్కుల సాధనకు ఉద్యమిద్దాం
గతంలో జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాలు డెడ్ స్టోరేజ్కి చేరి తాగునీరు లేని పరిస్థితులను చూశాం. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులకు సాగునీటి భరోసా కల్పించారు. జలయజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్ట్లను పూర్తి చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం భవిష్యత్ తరాలకు భరోసా. అటువంటి పథకాన్ని సాధించుకునేందుకు అట్టడుగు స్థాయి నుంచి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి. హక్కుల సాధన కోసం అందరూ కలిసి ఉద్యమించాలి. –ఆనం విజయకుమార్రెడ్డి, నెల్లూరు రూరల్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త -
ప్రభుత్వం మెడలు వంచుదాం
అమరావతిలో నిర్మాణాలకు చేస్తున్న ఖర్చులో కొంత భాగం కేటాయిస్తే రాష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతాయి. జిల్లాలోని రైతాంగం పెన్నాపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవసరం ఎంతైనా ఉంది. సాగునీటి ప్రాజెక్ట్లు పూర్తయితే వేలాది హెక్టార్ల భూములు సాగులోకి వస్తాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమైన ప్రాజెక్టులపై దృష్టి పెట్టడంలేదు. సంగం బ్యారేజ్కు మాజీ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అన్న పేరును తీసేయడం బాధాకరం. భవిష్యత్ తరాల కోసం ప్రభుత్వం మెడలు వంచి ప్రాజెక్టులు సాధించుకుందాం. –మేకపాటి విక్రమ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
90 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి
రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను 90 శాతం మాజీ సీఎం వైఎస్ జగన్ పూర్తి చేశారు. 10 శాతం పనులు పూర్తి చేయాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పనులు పెండింగ్ పెట్టింది. చంద్రబాబు తన శిష్యుడు తెలంగాణ సీఎం రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర రైతులను తాకట్టుపెట్టారు. అమరావతి నిర్మాణానికి రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్తో తక్కువ ఖర్చుతో అమరావతి ఏర్పాటవుతుంది. ప్రాజెక్టుల సాధన కోసం గ్రామ స్థాయి నుంచి ప్రజలు ఏకమై ఉద్యమించాలి. –శివశంకర్రెడ్డి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ● -
తెలంగాణ నీటి దోపిడీకి చంద్రబాబు మద్దతు
సీమ ప్రాజెక్ట్ సాధనకు పోరాడుతాం వెలుగొండకు మోకాలడ్డు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: చంద్రబాబు రైతాంగం పాలిట జలద్రోహి అని, ఆయన పాలనలో ఏనాడు ఒక్క ప్రాజెక్ట్ను ప్రారంభించనూ లేదు.. పూర్తి చేయనూ లేదని, దివంగత వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన జలప్రాజెక్ట్లనూ ప్రభుత్వం మారాక తుంగలో తొక్కారని వైఎస్సార్సీపీ టాస్క్ఫోర్స్ చైర్మన్ సాకే శైలజానాథ్, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి దుయ్యబట్టారు. వైఎస్సార్, వైఎస్ జగన్ దూరదృష్టితోనే ప్రాజెక్ట్ల నిర్మాణం చేప ట్టి పూర్తి చేశారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం సీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేసే అత్యంత గొప్ప ప్రాజెక్ట్ అన్నారు. అటువంటి ప్రాజెక్ట్ను చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టి రైతుల గుండెల్లో గునపాలు దింపారని మండిపడ్డారు. చంద్రబాబు అటకెక్కించిన పథకాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై నగరంలోని వేదాయపాళెం ఆర్ఎస్ఎన్ కల్యాణ మండపంలో రైతులు, రైతు సంఘాల నేతలు, మేధావులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తలు, నాయకులతో కాకాణి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం మంగళవారం జరిగింది. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, జిల్లా రైతు సంఘ అధ్యక్షుడు నరసింహారెడ్డి, రాష్ట్ర మహిళా జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీసునంద, కోవూరుకు చెందిన బత్తుల విజయ్కుమార్, సూళ్లూరుపేటకు చెందిన గీతానందరెడ్డి, ఉదయగిరికి చెందిన వెంకట్రెడ్డి, నెల్లూరురూరల్కు చెందిన రాంప్రసాద్రెడ్డి, కొడవలూరు దామోదర్రెడ్డి, ఆత్మకూరుకు చెందిన ఏ కోటిరెడ్డి, వెంకటగిరికి చెందిన దశరథరామిరెడ్డి, భాస్కర్గౌడ్, చిలుకూరు సురేష్,సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ నెల్లూరు సుబ్బు, తదితరులు ప్రసంగించారు. ఉదయగిరి వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేక పాటి రాజగోపాల్రెడ్డి, విజయ డెయిరీ మాజీచైర్మన్ రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు తెలంగాణ నీటి దోపిడీపై మాట్లాడలేకపోయారని, రేవంత్రెడ్డి సీఎం అయ్యాక ఏకంగా ఆయనకు రాజకీయ ప్రయోజనం కల్పించేందుకు సీమతోపాటు నెల్లూ రు, ప్రకాశం జిల్లాలను తాకట్టు పెట్టారన్నారు. జిల్లా రైతాంగానికి మేలు చేసిన సీఎంలు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే అని గుర్తు చేశారు. అప్పట్లో వరుసగా తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న సమగ్ర సోమశిల విషయంలో ఒక అడుగు నీటి మట్టాన్ని కూడా చంద్రబాబు పెంచలేకపోయారన్నారు. వైఎస్సార్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే సమగ్రసోమశిలతో పాటు స్వర్ణముఖి బ్యారేజీలను పూర్తి చేసి రైతాంగానికి అంకితం చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు హయాంలో 35 టీఎంసీలను మాత్రమే సోమశిలలో నిలువ చేస్తున్న క్రమంలో వైఎస్సార్ తన సొంత జిల్లాలో ఒక గ్రామాన్ని ఖాళీ చేయించి 78 టీఎంసీల సమగ్ర సోమశిలకు కృషి చేశారన్నారు. వైఎస్ జగన్ సంగం, నెల్లూరు బ్యారేజీలను పూర్తి చేసి మేకపాటి గౌతమ్రెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పేర్లను పెడితే టీడీపీ ప్రభుత్వం వచ్చి వెంటనే తొలగించిందన్నారు. వైఎస్ జగన్ కృషితో కండలేరు వరద కాలువ పరిమాణాన్ని 24 వేల క్యూసెక్కులకు పెంచగా, చంద్రబాబు ఆ పనులు కూడా ఆపేశారన్నారు. సీమతోపాటు నెల్లూరు ప్రజల గుండెల్లో గునపాలు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్తో ముక్కారు పంటలతో సస్యశ్యామలం వైఎస్సార్, వైఎస్ జగన్ దూరదృష్టితోనే ప్రాజెక్ట్ల నిర్మాణం సమగ్ర సోమశిల, స్వర్ణముఖి, నెల్లూరు, సంగం బ్యారేజ్లు ఘనత వీరిదే రైతాంగం ఐక్యంగా సర్కారు మెడలు వంచకపోతే జిల్లా ఎడారే రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రులు శైలజానాథ్, కాకాణి గోవర్ధన్రెడ్డి సాకే శైలజానాథ్ మాట్లాడుతూ శ్రీశైలంలో 800 అడుగుల డెడ్ స్టోరేజీ ఉన్నప్పుడు సైతం తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా రోజుకు 8 టీఎంసీల నీటిని తరలిస్తోందన్నారు. 854 టీఎంసీలు నీరుంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమ, నెల్లూరుకు నీటిని తరలించే అవకాశముందన్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి ప్రాజెక్ట్ వల్ల దిగువ కృష్ణాకు వరద జలాలు తగ్గిపోయాయన్నారు. తెలంగాణ నీటి దోపిడీ వల్ల ప్రాజెక్ట్ 854 అడుగులకు చేరడం గగనంగా మారిందన్నారు. ఈ పరిస్థితిని గమనించిన జగన్మోహన్రెడ్డి సీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని సీమతో పాటు నెల్లూరుకు తరలించేందుకు ప్రాజెక్టును ప్రారంభించారన్నారు. ఈ పథకం పూర్తయితే ప్రతి రోజూ కూడా 3 టీఎంసీలు ఈ ప్రాంతానికి చేరేవన్నారు. రైతుల నీటి కష్టాలు తీర్చడం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డికే సాధ్యమైందన్నారు. బ్యారేజీలను వైఎస్సార్ పూర్తి చేస్తే, నెల్లూరు, సంగం బ్యారేజీలను జగన్మోహన్రెడ్డి పూర్తి చేశారన్నారు. చంద్రబాబు కాలంలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్నారు. -
కేసులకు భయపడకుండా పోరాటం
హక్కుల సాధన కోసం, ప్రశ్నించే వారిపై ప్రభుత్వం కేసులు బనాయిస్తోంది. కేసులు పెట్టిన భయపడేది లేదు. ప్రజలు, రైతుల హక్కుల సాధన కోసం పోరాటం చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులను మోసం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చీకటి ఒప్పందాలను ప్రజల్లోకి తీసుకుపోవాలి. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి రైతుల పక్షపాతి. మాజీ సీఎం ఆదేశాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లి ఉద్యమించి ప్రాజెక్ట్లు సాధించుకుందాం. –నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, వెంకటగిరి వైఎస్సార్సీపీ సమన్వయకర్త -
రూమ్స్ కోసం టీడీపీ నేతల బెదిరింపులు
● హోటళ్ల నిర్వాహకుల ఆందోళన ● రెవెన్యూ, పోలీస్ అధికారుల నుంచి కూడా ఒత్తిళ్లు ● 115 లాడ్జీలు, హోటల్స్, గెస్ట్ఇన్లు, గెస్ట్హౌస్ల బుకింగ్ ● వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారికి తప్పని తిప్పలు నెల్లూరు సిటీ: తెలుగుదేశం పార్టీ మహానాడు కారణంగా సామాన్యులకు తిప్పలు తప్పేలా లేవు. ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు కోవూరు నియోజకవర్గంలోని కొడవలూరు కిసాన్ సెజ్లో ఆ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన భూమి పూజ బుధవారం జరుగుతుంది. అలాగే మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. మహానాడుకు జిల్లాల నుంచి తరలివచ్చే నాయకులు, కార్యకర్తల కోసం నెల్లూరు నగర, రూరల్ టీడీపీ నాయకులు హోటళ్లు, లాడ్జీలను తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. అన్నీ మాకే.. నెల్లూరు నగరపాలక సంస్ధపరిధిలో మొత్తం 85 లాడ్జీలు, హోటళ్లు, 30 గెస్ట్హౌస్లు, గెస్ట్ఇన్లు ఉన్నాయి. నగర, రూరల్ నియోజకవర్గంలోని ముఖ్యనేతలు తమ బలాన్ని వినియోగించి ఆ మూడురోజులపాటు ఎవరికీ గదులు ఇవ్వకూడదని హుకుం జారీ చేశారు. తాము పంపిన వారికే రూమ్స్ ఇవ్వాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులకు కూడా రూమ్స్ లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో టీడీపీ అధిస్టానం నుంచి ఓ నేతకు ఫోన్ కాల్ రావడంతో తప్పని పరిస్థితిలో కొన్నింటిని కేటాయించారని తెలుస్తోంది. తీవ్ర ఇబ్బందులు పనులు, ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలకు వివిధ జిల్లాల ప్రజలు నిత్యం నెల్లూరు నగరానికి వస్తుంటారు. హోటళ్లలో గదులు తీసుకుంటుంటారు. మహానాడు జరిగే రోజుల్లో వచ్చే సామాన్య ప్రజలకు తప్పేలా లేవు. ఆ మూడు రోజులు నెల్లూరు నగరంలో నరకం కనిపిస్తుందని అర్థమవుతోంది. ఫంక్షన్లకు వచ్చారంటే ఎక్కడ ఉండాలనేది ప్రశ్నార్థకంగా మారింది. ఓవైపు ఎండల మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గదులు అందుబాటులో లేకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముంది.ఇదేం కర్మ ఓ మేడమ్..! రూమ్స్ ఇవ్వాల్సిందే... మీ ఓనర్కు చెప్పు..!టీడీపీ నేతలు ఓవైపు, రెవెన్యూ, కార్పొరేషన్, పోలీసు అధికారుల నుంచి మరోవైపు ఒత్తిళ్లు వస్తుండటంతో మాకేంటి ఈ కర్మ అని హోటళ్ల నిర్వాహకులు లబోదిబోమంటున్నారు. కొందరు నాయకులు ఉచితంగా రూమ్స్ ఇవ్వాలని హుకుం జారీ చేయడంతో తాము నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, నేతల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నా పట్టించుకోవడం లేదు. -
ఆర్టీసీ డిపోను ప్రైవేట్పరం చేస్తే ఉద్యమిస్తాం
● సీపీఎం, సీపీఐ నాయకులు నెల్లూరు సిటీ: నెల్లూరులోని ఆర్టీసీ డిపో–2ను ప్రైవేట్పరం చేస్తే సహించేది లేదని, ఉద్యమిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ హెచ్చరించారు. 2 డిపోను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ 86 రోజులుగా డిపో ఎదుట కార్మికులు చేస్తున్న నిరసన కార్యక్రమాలకు మద్దతుగా మంగళవారం వామపక్ష నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూలం రమేష్ మాట్లాడుతూ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను స్వాగతిస్తామన్నారు. అయితే వాటిని సంస్థ ఆధ్వర్యంలోనే నడపాలన్నారు. ప్రైవేటీకరణ పేరుతో రూ.వేల కోట్లు ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం దుర్మార్గమన్నారు. సీపీఐ జిల్లా నాయకుడు రామరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు మానుకోవాలని లేదంటే ఐక్య పోరాటాలతో తగిన గుణపాఠం చెబుతామన్నారు. కార్యక్రమంలో నాయకులు సాగర్, మాదాల వెంకటేశ్వర్లు, మోహన్రావు, సునీల్, వెంకమరాజు, పులిగండ్ల శ్రీరాములు, ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు పాల్గొన్నారు. -
ఆస్తి కోసం అక్కపై దాడి
చిల్లకూరు: తండ్రి ఆస్తి కోసం ఓ వ్యక్తి అక్కపై దాడి చేసిన ఘటన గూడూరు రూరల్ పరిధిలోని తిప్పవరప్పాడు గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన పద్మమ్మ, శంకరయ్య అనే వారి మధ్య కొంతకాలంగా తండ్రి ఆస్తి విషయమై వివాదం నెలకొంది. ఈ క్రమంలో శంకరయ్య తన అక్క పద్మమ్మపై దాడికి పాల్పడటంతో ఆమె గాయపడి గూడూరు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఆస్పత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు.రౌడీషీటర్పై పీడీ యాక్ట్● కడప కేంద్ర కారాగారానికి తరలింపు నెల్లూరు(క్రైమ్): తీరు మారని రౌడీషీటర్లపై ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే పలువురిపై పీడీ యాక్ట్లు నమోదు చేసి కడప కేంద్ర కారాగారానికి తరలించారు. నెల్లూరు రామచంద్రాపురానికి చెందిన పి.మనోహర్ అలియాస్ మనుపై నవాబుపేట పోలీస్స్టేషన్లో రౌడీషీట్ ఉంది. అతను ప్రస్తుతం బంగ్లాతోటలో నివాసం ఉంటున్నాడు. హత్య, హత్యాయత్నం కిడ్నాప్, దాడి తదితర తొమ్మిది కేసులున్నాయి. పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినా అతని తీరులో మార్పురాలేదు. నేరాలకు పాల్పడుతూనే ఉన్నాడు. దీంతో కలెక్టర్ హిమాన్షు శుక్లా ఉత్తర్వుల మేరకు మంగళవారం మనోహర్పై పీడీ యాక్ట్ నమోదు చేసి కడప కేంద్ర కారాగారానికి తరలించినట్లు ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్రెడ్డి తెలిపారు. రౌడీషీటర్లు సత్ప్రవర్తతో మెలగాలని, ప్రజా జీవనానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యుత్ వైర్ల చోరీకోట: పొలాల్లో మోటార్లకు ఉన్న విద్యుత్ వైర్లు చోరీకి గురవుతున్నాయని మండలంలోని వెంకన్నపాళెం, తిన్నెలపూడి గ్రామాల రైతులు మంగళవారం ఎస్సై పవన్కుమార్కు ఫిర్యాదు చేశారు. రాత్రివేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు మోటార్లకు ఉన్న వైర్లను తస్కరిస్తున్నారని, దీంతో నష్టపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిరోజులుగా సుమారు 50 మంది రైతులకు చెందిన వైర్లు చోరీ జరిగినట్లు వెల్లడించారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. కండలేరులో 43.190 టీఎంసీల నీరురాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారానికి 43.190 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 400, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
తెలంగాణ సీఎంకు తాకట్టుపెట్టారు
నీటి కోసం యుద్ధాలు జరుగుతాయని చదువుకున్నాం. ప్రస్తుతం అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర రైతులకు ప్రయోజనం చేకూర్చే ప్రాజెక్టును రాష్ట్ర ముఖ్యమంత్రి తన శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి తాకట్టుపెట్టడం దురదృష్టకరం. నేను వ్యవసాయంపై ఆధారపడి పైకి వచ్చాను. 2014 నుంచి 2019 వరకు కరువును చూశాం. వర్షాలు లేక ప్రాజెక్టులు ఎండిపోయాయి. జగన్ సీఎం అయిన తరువాత పుష్కలంగా వర్షాలు కురిశాయి. ఆయన రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలు, రైతులను వెన్నుపోటు పొడిచారు. రైతాంగం తిరగబడి చంద్రబాబును తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. –పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ ● -
చివరి భూములకు సాగునీరందాలి
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రై తు వ్యతిరేకి. గతంలో వ్యవసాయం దండగ అని మా ట్లాడారు. ఆయన తన శిష్యుడు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టాడు. రైతులకు వెన్నుపోటు పొడిచాడు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేయడం వల్ల తలెత్తే పరిణామాలు, నష్టాలను రైతులకు వివరించాలి. సోమశిల ప్రాజెక్ట్ నుంచి కావలి ప్రాంతంలోని చివరి భూములకు సాగునీరంది రెండు పంటలు పండాలంటే రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం. –రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే -
కలెక్టర్కు సమస్యలు ఏకరువు
● అప్పసముద్రంలో కలెక్టర్ పల్లె వీక్షణ ● ఫిర్యాదులు స్వీకరిస్తూ.. పరిష్కారాలకు ఆదేశాలు ● గంటన్నరలో ముగిసిన పర్యటన ఉదయగిరి: పల్లె వీక్షణలో భాగంగా అప్పసముద్రంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం పర్యటించారు. సుడిగాలి పర్యటన చేస్తూ గంటన్నర వ్యవధిలో పల్లెవీక్షణను పూర్తిచేశారు. తొలుత చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించి వర్మికంపోస్టును రైతులకు అందించాలని సూచించారు. అనంతరం అక్కడే ఉన్న పశువుల తాగునీటి తొట్టెను పరిశీలించి మొక్కలు నాటారు. ఆ తరువాత ఎస్సీకాలనీలో పర్యటించారు. ఆరికొండ మాలకొండయ్య ట్రైసైకిల్ కోసం అర్జీ ఇవ్వగా మంజూరుకు ఆదేశాలు ఇచ్చారు. అప్పసముద్రం గ్రామ వీధుల్లో పర్యటించి విద్యార్థులు, గ్రామస్తులతో ముచ్చటించారు. స్థానిక సమస్యలు, అధికారుల పనితీరుపై ఆరాతీశారు. అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఓవర్హెడ్ ట్యాంకును పరిశీలించి నీటిలో ఫ్లోరిన్ శాతాన్ని పరీక్షించారు. అనంతరం సచివాలయం వద్ద ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అప్పసముద్రం నుంచి నర్రవాడ జాతీయ రహదారిని కలిపే గ్రావెల్ రోడ్డును మంజూరు చేయాలని కోరగా అంగీకారం తెలిపారు. అప్పసముద్రానికి దుత్తలూరుకు బదులుగా ఉదయగిరి ఫీడర్ నుంచి సరఫరా ఇవ్వాలని, విద్యుత్ లైన్మెన్ల కొరతను వెంటనే పరిష్కారించాని ఎస్పీడీసీఎల్ ఎస్ ఈ రాఘవేంద్రను అదేశించారు. స్థానిక ఎంపీపీ స్కూల్లో ఉపాధ్యాయులు లేరని తెలుసుకుని విద్యాశాఖ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మళ్లీ బడులు తెరిచేలోగా నియమించాలని డీఈఓకు ఆదేశాలు ఇచ్చారు. దాసరిపల్లి గ్రామ సమస్యలను టీచర్ జాఫర్ మొయినుద్దీన్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఆక్రమణకు గురైన పాతూరు చెరువును పరిశీలించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కలెక్టర్ అదేశించారు. పదో తరగతి ఫలితాల్లో మండలస్థాయిలో ప్రతిభకనబర్చిన విద్యార్థులను కలెక్టర్ అభినందించి ప్రశంసాపత్రాలు జ్ఞాపికలు అందజేశారు. భూములు, నూతన పింఛన్లు, ఆరోగ్య సేవల కోసం పలువురు కలెక్టర్కు అర్జీలు ఇవ్వగా ఆర్డీఓకు అందజేసి పరిష్కారించాలని ఆదేశించారు. గ్రామస్థాయిలో అధికారులు, సిబ్బంది పనితీరులో లోపాలు స్పష్టంగా కనిపించినా కలెక్టర్ వారిని మందలించకపోవడం విశేషం. కాగా కలెక్టర్ షెడ్యూల్లో ఉపాధి పనుల పరిశీలన ఉన్నప్పటికి వెళ్లలేదు. సీఈఓ శ్రీధ ర్, డీపీఓ వసుమతి, వ్యవసాయశాఖ జేడీ సత్యవాణి, జిల్లా ఉద్యాన అధికారి సుబ్బారెడ్డి, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, డ్వామా పీడీ శ్రీనివాసప్రసాద్, ఆర్డీఓ పావని, డిప్యూటీ కలెక్టర్లు సన్నీ వంశీ పాల్గొన్నారు. -
కామాక్షితాయి భూమికి ఎసరు
బుచ్చిరెడ్డిపాళెం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భూబకాసురుల ఆగడాలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వ జాగా ఎక్కడ కనిపిస్తే అక్కడ పాగా వేస్తున్నారు. చివరకు ఆలయ భూములను సైతం కబ్జా చేసేందుకు వెనకాడడం లేదు. తాజాగా జొన్నవాడలోని కామాక్షితాయి ఆలయానికి చెందిన సుమారు రూ.6 కోట్లకుపైగా విలువైన భూమిపై కొందరు అక్రమార్కులు కన్నేశారు. భూమిని ఆక్రమించి లేఅవుట్ వేసి సొమ్ము చేసుకునేందుకు రాజకీయ అండతో రంగంలోకి దిగినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ సదరు భూమి ని కొందరు ఆక్రమించేందుకు యత్నించారు. అయితే గ్రామస్తుల ఫిర్యాదుతో ఆ ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. మళ్లీ అదే భూమిపై కన్నేసిన దుండగులు ఆక్రమణకు చదును చేసే పనులు చేపడుతుండడంపై భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. జొన్నవాడలోని కామాక్షితాయి ఆలయ సమీపంలో పెట్రోల్ బంకు పక్కన సర్వే నంబరు 129లో సుమారు 90 సెంట్ల భూమి ఉంది. ఈ భూమి అధికారిక రికార్డుల్లో ఆలయానికి చెందిన పూలతోటగా నమోదై ఉంది. 2024లో ఈ భూమిపై కన్నేసిన కొందరు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించి లేఅవుట్ వేసేందుకు ప్రయత్నించారు. అయితే గ్రామస్తుల ఫిర్యాదుతో అధికారులు జోక్యం చేసుకుని ఆ ప్రయత్నాలను అడ్డుకున్నారు. విచారణలో భూమి దేవస్థానానికి చెందినదేనని నిర్ధారణ కావడంతో తాజాగా దేవదాయ శాఖ నిషేధిత భూముల జాబితాలో (22ఏ) కూడా చేర్చినట్లు సమాచారం. బ్రహ్మోత్సవాల వేళ కబ్జాకు యత్నం ఈ నెల 7వ తేదీ నుంచి కామాక్షితాయి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు ఆలయ భూమిని జేసీబీతో చదును చేస్తుండడంపై స్థానిక రాజకీయ నాయకుల అండతో లేఅవుట్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రహ్మోత్సవాల హడావుడిని అవకాశంగా తీసుకుని భూమిని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఆలయ ఈఓ వెంకట శ్రీనివాసులురెడ్డి స్పందిస్తూ సంబంధిత భూమి దేవస్థానానికి చెందినదేనని స్పష్టం చేశారు. భూమిని చదును చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. తహసీల్దార్కు సైతం ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆలయ భూమి ఆక్రమణకు గురికాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాజకీయ అండతో మళ్లీ కబ్జాకు యత్నం బ్రహ్మోత్సవాల హడావుడిలో చదును పనులు గతంలోనూ అక్రమ రిజిస్ట్రేషన్లు అప్పట్లో గ్రామస్తుల ఫిర్యాదుతో అడ్డుకట్ట -
సీమ ఎత్తిపోతల పథకంతోనే నెల్లూరు సస్యశ్యామలం
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం అందుబాటులోకి వచ్చి ఉంటే.. జిల్లా ముక్కారు పంటలతో సస్యశ్యామలంగా మారేది. చంద్రబాబు రాజకీయ స్వార్థానికి కరువు ప్రాంతంగా మారనుంది. ఆయన ఆది నుంచి జల ప్రాజెక్ట్లకు వ్యతిరేకి. జిల్లాలోని సోమశిల, నెల్లూరు, సంగం, స్వర్ణముఖి బ్యారేజ్లతో పాటు సోమశిల ఉత్తర కాలువ ప్రాజెక్ట్లు ఆయన పాలనకు దృష్టాంతంగా నిలుస్తాయి. ఆ నాడు వైఎస్సార్ పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులర్ కెపాసిటీ పెంచి సమగ్ర సోమశిలను సాకారం చేయకపోయి ఉంటే.. ఈ పాటికి జిల్లా మరో కరువు ప్రాంతంగా మిగిలిపోయేది. వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, ఆయన తనయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో జల ప్రాజెక్ట్ల అభివృద్ధిని పరుగులు పెట్టించి.. గంగమ్మను ఉరకలెత్తించి జిల్లాను సస్యశ్యామలం చేశారు. చంద్రబాబు 17 ఏళ్లు అధికారంలో ఉండి.. జిల్లాలో ఇది తాను నిర్మించి ప్రజలకు అంకింతం చేశానని చెప్పుకునే ఒక్క ప్రాజెక్ట్ లేదంటే అతిశయోక్తి లేదు. జిల్లా జలనిధి సోమశిల పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు అయితే.. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ముంపు గ్రామాల ప్రజలు, రైతులకు పరిహారం చెల్లించకుండా ప్రాజెక్ట్ పనులు నిలిపివేయడంతో ఆయన హయాంలో 35–40 టీఎంసీలకే పరిమితమైంది. సమగ్ర సోమశిల నెరవేర్చిన వైఎస్సార్ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే రెండేళ్లలోనే సమగ్ర సోమశిలను సాకారం చేశారు. దశాబ్దాలుగా కల్లలుగా మిగిలిపోయిన జిల్లా రైతుల సమగ్ర సోమశిల కలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 35–40 టీఎంసీలకే పరిమితమైన సోమశిల అభివృద్ధికి జలయజ్ఞం ద్వారా శ్రీకారం చుట్టారు. ముంపు గ్రామాలకు పరిహారం చెల్లించడం, అటవీ శాఖ అనుమతులు చకచకా తీసుకుని 2007–08 నాటికి జలాశయంలో నీటి సామర్థ్యాన్ని 72 టీఎంసీలకు పెంచి సింహపురి రైతుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. వైఎస్సార్ కేవలం రెండేళ్లల్లోనే రెట్టింపు స్థాయిలో నీటి నిల్వలను పెంచగలిగారు. చంద్రబాబు తొలుత తొమ్మిదిన్నరేళ్లు సీఎంగా ఉండీ సోమశిలలో నిల్వ సామర్థ్యాన్ని కనీసం ఒక్క టీఎంసీ కూడా పెంచలేకపోయారు. కృష్ణమ్మను ఒడిసి పట్టి.. సోమశిలకు మళ్లించి.. ఏటా వృథాగా సముద్రంలో కలుస్తున్న కృష్ణానది వరద నీటిని శ్రీశైలం డ్యాం ద్వారా రాయలసీమతోపాటు నెల్లూరుకు మళ్లించేందుకు ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కేవలం 1,500 క్యూసెక్కుల కెపాసిటి కలిగి ఉండేది. దీన్ని అధికారికంగా 44 వేల క్యూసెక్కులకు పెంచే విధంగా హెడ్ రెగ్యులేటర్తో పాటు కాలువలను ఆధునికీకరించారు. అయితే వాస్తవంగా 1.10 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో రోజుకు దాదాపు 10 టీఎంసీలకుపైగా తరలించే విధంగా అభివృద్ధి చేశారు. ఆ విధంగా కృష్ణమ్మను ఒడిసి పట్టి.. సోమశిలకు మళ్లించారు. ఆ నాడు వైఎస్సార్ పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్తో పాటు కాలువలను అభివృద్ధి చేయకపోయి ఉంటే.. నెల్లూరుతోపాటు రాయలసీమ సైతం ఎడారిగా మారేది. 2 లక్షల నుంచి 5.84 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఆ నాడు వైఎస్సార్ చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా పెన్నార్డెల్టాతో పాటు మెట్టప్రాంత భూముల ను సస్యశ్యామలం చేసేందుకు రూ.220 కోట్లతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. సోమశిల ప్రాజెక్ట్ ద్వారా అప్పటి వరకు 2 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ ఉంటే.. దాన్ని ఏకంగా 5,84,500 ఎకరాలకు స్థిరీకరించారు. వాకాడు వద్ద స్వర్ణముఖిపై 35 ఎంటీఎస్ కెపాసిటితో బ్యారేజీని నిర్మించి ఆ ప్రాంత రైతులకు, స్థానికులకు సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చేశారు. ఎత్తిపోతల పథకం వస్తే.. ముక్కారు పంటలే ఎత్తిపోతల పథకం పూర్తయితే శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీలు తరలించే వెసులుబాటు ఉండేది. దీంతో రాయలసీమతోపాటు నెల్లూరు జిల్లాలో ప్రధాన ప్రాజెక్ట్లు, ఊరూరా చెరువులు నిరంతరం జలకళతో నిండుకుండలా మారేవి. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు. తెలుగుగంగ, ఎఫ్ఆర్సీసీ, గాలేరు, నగరి ఆయకట్టుకు సాగునీరు, చైన్నెకు తాగునీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారానే విడుదల చేయాలి. అయితే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను శ్రీశైలం ప్రాజెక్ట్లో 841 అడుగుల నీటిమట్టం వద్ద అమర్చారు. ప్రాజెక్ట్లో 841 అడుగుల కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు గరిష్టంగా 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంది. అంతకు దిగువకు నీటిమట్టం ఉంటే 2 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించే వీలుంది. ఈ తరుణంలో ప్రాజెక్ట్లో 800 అడుగుల నీటి మట్టం ఉన్నా.. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నిత్యం 3 టీఎంసీలు నీటిని తోడుకునే విధంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దూకుడుగా ఈ ప్రాజెక్ట్కు రూపకల్పన చేశారు. 20 శాతం పనులు జరిగిన సమయానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయడంతో వ్యతిరేకించినప్పటికీ దాదాపు 80 శాతం పనులను పూర్తి చేశారు. దివంగత సీఎం వైఎస్సార్ పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ కెపాసిటీ పెంచకపోతే జిల్లా ఎడారే మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలోనే జిల్లా పెండింగ్ ప్రాజెక్ట్లకు మోక్షం రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే శ్రీశైలం ద్వారా రోజుకు మూడు టీఎంసీలు చంద్రబాబు పాలన.. జిల్లాకు శాపం చంద్రబాబు మౌనం.. సీమకు శాపంశ్రీశైలం దిగువన తాగు, సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు కృష్ణా బోర్డు అనుమతిచ్చిన మేరకే నీటిని విడుదల చేస్తూ రెండు రాష్ట్రాలు విద్యుదుత్పత్తి చేయాలన్నది నిబంధన. కానీ 2014 నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్కు వరద ప్రవాహం ప్రారంభం కాకున్నా ప్రాజెక్ట్లో 800 అడుగుల నీటి మట్టంతో డెడ్ స్టోరేజీలో ఉన్నప్పటికీ నీటిని శ్రీశైలం దిగువన ఎలాంటి అవసరాలు లేనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 4 టీఎంసీలు, కల్వకుర్తి నుంచి 0.4 టీఎంసీలు, ఎస్ఎల్పీసీ నుంచి 0.5 టీఎంసీలు, పాలమూరు, రంగారెడ్డి, డీఎం ఎత్తిపోతల ద్వారా 2 టీఎంసీలు వెరశి రోజుకు 6.95 టీఎంసీలు తరలించుకుపోతోంది. అయినా చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. ఈ పరిస్థితుల్లో రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే తెలంగాణతో పోటీగా రోజుకు 3 టీఎంసీలు తరలించి సీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు జలకళతో విలసిల్లేవి. చంద్రబాబు ఈ పథకాన్ని పక్కన పెట్టడంతో ఈ ప్రాంతాలకు శాపంగా పరిణమించనుంది. వైఎస్సార్ హయాంలో 72 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి పెరిగిన సోమశిలను తర్వాతి పాలకులు పట్టించుకోలేదు. వైస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక.. సోమశిల ప్రాజెక్ట్లకు సంబంధించి పెండింగ్ అటవీభూములు, పరిహారాలు చెల్లింపులను క్లియర్ చేసి 78 టీఎంసీల కెపాసిటికి పెంచి సమగ్ర సోమశిలను సాకారం చేశారు. అదే సమయంలో వైఎస్సార్ హయాంలో శ్రీకారం చుట్టి సంగం, నెల్లూరు బ్యారేజీలను అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్ రెండేళ్ల కరోనా వంటి విపత్తును సైతం ఎదుర్కొని వీటిని పూర్తి చేసి రైతులకు అంకితం చేశారు. వీటితోపాటు సోమశిల–కండలేరు, కండలేరు– స్వర్ణముఖి కాలువ కెపాసిటిని రెట్టింపు చేశారు. సోమశిల ఉత్తర కాలువ విస్తరణతోపాటు కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. -
విద్యుత్ సంస్థకు రూ.60 లక్షల మేర..
● దెబ్బతిన్న 363 స్తంభాలు, 142 ట్రాన్స్ఫార్మర్లు ● ఇన్సులేటర్ ఫ్లాష్ ఓవర్తో విద్యుత్ సరఫరాకు అంతరాయం నెల్లూరు సిటీ: జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి కురిసిన ఈదురు గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా నెల్లూరు జిల్లా సర్కిల్ పరిధిలో విద్యుత్ సంస్థకు తీవ్రనష్టం వాటిల్లింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం విద్యుత్ భవన్లోని తన చాంబర్లో ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం మీడియా సమావేశం నిర్వహించి నష్టం వివరాలను వెల్లడించారు. జిల్లాలో 11 కేవీలైన్ స్తంభాలు 225, ఎల్టీ స్తంభాలు 138, ట్రాన్స్ఫార్మర్లు 142 దెబ్బతిన్నాయని తెలిపారు. 18 కిలోమీటర్ల మేర 11కేవీ, 2 కిలోమీటర్లమేర ఎల్టీ విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయని వివరించారు. సుమారు రూ.60 లక్షల మేర నష్టం వాటిల్లిందని వెల్లడించారు. ఇన్సులేటర్ ఫ్లాష్ ఓవర్తో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందన్నారు. ఇన్సులేటర్ ఫ్లాష్ ఓవర్ జరిగిన ప్రాంతాలను గుర్తించడం కష్టతరం కావడంతో సరఫరా పునరుద్ధరణలో జాప్యం జరిగిందన్నారు. విద్యుత్ సిబ్బంది అర్ధరాత్రి వరకు శ్రమించి లైన్లకు మరమ్మతులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించారని తెలిపారు. భవిష్యత్లో ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమర్ధవంతంగా చర్యలు చేపడుతామన్నారు. విద్యుత్ లైన్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకుండా ప్రజలు సహకరించాలని కోరారు. -
తమిళనాట విజయ్ కొత్త అధ్యాయం
కోవూరు: తమిళనాట తలపతి విజయ్ కొత్త అధ్యాయం లిఖించారని, ప్రజల ఆంక్షాలను లోతుగా అర్థం చేసుకుని, వారి విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా సమర్థవంతమైన పాలన అందించాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆకాంక్షించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న విజయ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పరిపాలనతో తమిళనాడు దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాల కల్పన, విద్యా రంగ బలోపేతం, ఆరోగ్య సేవల మెరుగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, గ్రామీణాభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం, సామాజిక న్యాయ సాధనలో ప్రభుత్వం ముందడుగు వేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. వడదెబ్బకు ఇద్దరు రైతుల మృతి మర్రిపాడు: మండలంలోని సన్నువారిపల్లి గ్రామానికి చెందిన రైతులు గంగిరెడ్డి చెన్నారెడ్డి (55), చాగం రామస్వామి (66) సోమవారం వడదెబ్బకు గురై మృతి చెందారు. ఎండకు పొలం పనులకు వెళ్లిన వారు ఇంటి వచ్చాక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారని బంధువులు తెలిపారు. ఒకే రోజు ఇద్దరు రైతులు వడదెబ్బతో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రెండో పంటకు సోమశిల జలాల విడుదల సోమశిల: జిల్లా జలనిధి సోమశిల జలాశయం నుంచి రెండో పంటకు సాగునీటిని సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ వేలూరి కేశవచౌదరి సోమవారం విడుదల చేశారు. తొలుత ఇరిగేషన్ అధికారులతో కలిసి గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్నార్ డెల్టా ఆయకట్టు పరిధిలో 2,02,322, కనుపూరు కాలువ ఆయకట్టు పరిధిలో 27వేలు, కావలి కాలువ ఆయకట్టు పరిధిలో 74,000, దక్షిణ కాలువ ఆయకట్టు పరిధిలో 20వేల ఎకరాలకు సెప్టెంబర్ నెలాఖరు వరకు 35.98 టీఎంసీల నీటిని అందించనున్నట్లుగా తెలిపారు. కండలేరు కాలువ ఆయకట్టు పరిధిలోని 1,24,000 ఎకరాలకు 13.78 టీఎంసీల నీటిని అందించనున్నట్లుగా వివరించారు. ఉత్తరకాలువ పరిధిలో అభివృద్ధి పనులు చేపడుతున్న కారణంగా ఈ దఫా నీటిని విడుదల చేయడం లేదని తెలిపారు. ప్రాజెక్ట్ డీఈలు మల్లికార్జున, విజయ్బాబు, జేఈఈలు నిఖిల్, శరత్చంద్ర పాల్గొన్నారు. ఏఐఎస్–63కు అనుగుణంగా స్కూల్ బస్సులుండాలి నెల్లూరు (టౌన్): రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు స్కూల్ బస్సులు ఏఐఎస్–63 నిబంధనలకు అనుగుణంగా ఉండాలని నెల్లూరు ఆర్టీఓ మదాని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇతర పత్రాలను నవీకరించుకోవాలన్నారు. ప్రతి స్కూల్ బస్సును రవాణా అధికారులు తనిఖీ చేసి లోపాలను సూచిస్తారని తెలిపారు. వాటిని సరిచేసుకుని తిరిగి బస్సులను రవాణా అధికారికి చూపించి అనుమతి పొందిన తరువాతే రోడ్డుపై తిప్పాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన స్కూల్ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇన్చార్జి డీఎస్ఓగా పుల్లయ్య బాధ్యతల స్వీకరణ నెల్లూరు(పొగతోట): జిల్లా పౌర సరఫరాల శాఖ ఇన్చార్జి అధికారి (డీఎస్ఓ)గా పుల్లయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు డీఎస్ఓగా పనిచేసిన లీలారాణి బదిలీపై వెళ్లారు. ఆమె స్థానంలో కావలిలో ఏఎస్ఓగా పనిచేస్తున్న పుల్లయ్యను ఇన్చార్జి డీఎస్ఓగా నియమించడంతో బాధ్యతలు చేపట్టారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లును డీఎస్ఓ మర్యాదపూర్వకంగా కలిశారు. -
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై సదస్సు నేడు
● మాజీ మంత్రి కాకాణి నెల్లూరురూరల్: రాయలసీమ ఎత్తిపోతల కార్యాచరణపై జిల్లాలోని ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, రాయలసీమ ప్రాంతానికి చెందిన ప్రధాన నాయకులు, రైతులతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నామని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి తెలిపారు. నగరంలోని గాంధీనగర్లోని ఆర్ఎస్ఎన్ కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం ఉదయం 10 గంటలకు రాయలసీమ ఎత్తిపోతల కార్యాచరణ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించన్నునారు. ఈ సమావేశ ఏర్పాట్లను మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా రైతులతో పాటు రైతు సంఘాల నాయకులు కూడా పాల్గొని చర్చించాలన్నారు. అందరితో సమాలోచనల తర్వాత భవిష్యత్ కార్యాచరణపై ప్రణాళిక సిద్ధం చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి, చంద్రబాబు మెడలు వంచి రాయలసీమ ఎత్తిపోతలను సాధించి నెల్లూరు జిల్లా రైతాంగానికి భవిష్యత్లో సాగునీటి కష్టాలు రాకుండా చర్యలు చేపడుతామన్నారు. -
అకాల వర్షం.. అపార నష్టం
● జిల్లాలో దెబ్బతిన్న 604 హెక్టార్లలోని ఉద్యాన పంటలు ● రూ. 15.60 కోట్ల మేర పంట నష్టం నెల్లూరు(వేదాయపాళెం): జిల్లాలో ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షం ఉద్యాన రైతులకు అపార నష్టాన్ని కలిగించింది. ఈదురుగాలులతో పాటు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి జిల్లాలోని ఏడు మండలాల్లో 477 మంది రైతులకు చెందిన 604 హెక్టార్లలోని మామిడి,డ్రాగన్ఫ్రూట్, బొప్పాయి, నిమ్మ పంటలకు నష్టం వాటిల్లింది. కావలి మండలంలోని ఆర్సీపాళెంలో 35 మంది రైతులకు చెందిన 50 హెక్టార్లలోని మామిడి తోటల్లోని మామిడి కాయలు రాలిపోయాయి. జలదంకి మండలం గట్టుపల్లి, చోడవరం, చినక్రాక గామాల్లో 114 మంది రైతులకు చెందిన 200 హెక్టార్లలోని మామిడి చెట్లు నేలకొరగడంతో పాటు పండ్లు రాలిపోవడంతో అపార నష్టం సంభవించింది. కలిగిరి మండలం కుమ్మరకొండూరు, వెలగపూడి, గుడ్లదొన, లక్ష్మీపురం గ్రామాల్లో 30మంది రైతులకు చెందిన 111హెక్టార్లలోని మామిడి, బొప్పాయి చెట్లు నేలకొరగడం, కాయలు రాలిపోవడంతో నష్టం వాటిల్లింది. మర్రిపాడు మండలం చిన్నమాచనూరు, కదిరినేనిపల్లి గ్రామాల్లో 9 మంది రైతులకు చెందిన 10 హెక్టార్లలోని మామిడి, నిమ్మ, డ్రాగన్ప్రూట్ చెట్ల కొమ్మలు విరగడంతో పాటు పండ్లు రాలిపోయాయి. సైదాపురం మండలం వేములచేడు, పాడూరు, చాగణం, కొమ్మిపాడు, పోతుగుంట, చీకవోలు గ్రామాల్లో 283 మంది రైతులకు చెందిన 192 హెక్టార్లలోని మామిడి, బొప్పాయి, నిమ్మ చెట్లు నేలకొరగడం, పండ్లు రాలిపోవడంతో నష్టం సంభవించింది. పొదలకూరు మండలం పీజీ పట్నం, ఇనుకుర్తి, ఆర్వై పాళెం గ్రామాల్లో 39 మంది రైతులకు చెందిన 30 హెక్టార్లలో మామిడి, నిమ్మచెట్ల పండ్లు రాలిపోవడం, చెట్లు నేలకొరిగాయి. మనుబోలు మండలం అక్కంపేట, మడమనూరు గ్రామాల్లో ఐదుగురు రైతులకు చెందిన 12హెక్టార్ల లో మామిడి చెట్ల పండ్లు రాలిపోవడంతో నష్టం సంభవించింది. కాగా అకాల వర్షంతో జిల్లాలోని ఉద్యాన రైతులకు సుమారు రూ.15.60 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లుగా ప్రాథమికంగా అంచనా వేశామని జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఎంవీ సుబ్బారెడ్డి తెలిపారు. జిల్లాలో ఇంకా ఎక్కడైనా ఉద్యాన పంటలకు నష్టం జరిగి ఉంటే పరిశీలించి తుది నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన వెల్లడించారు. -
అత్తారింటికి పెనుశిల లక్ష్మీనరసింహుడు
రాపూరు: పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో ఆరురోజులపాటు బ్రహ్మోత్సవాలు జరుపుకొన్న అనంతరం పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, చెంచులక్ష్మీని వివాహం చేసుకుని సతీసమేతంగా గోనుపల్లి గిరిజనవాడలోని అత్తారింటికి ఆదివారం చేరుకున్నారు. మండలంలోని గోనుపల్లి ఆలయంలో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి ఉత్సవమూర్తులను బ్రహ్మోత్సవాల ముందు రోజు పెంచలకోనకు పల్లకిలో తీసుకెళ్తారు. ముగిసిన తర్వాత ఉత్సవ విగ్రహాలను గోనుపల్లి గ్రామానికి తీసుకురావడం ఆచారం. కోనలోని క్రేన్ మండపం వద్ద స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో కొలువుదీర్చి వివిధ పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. బోయలు కాలినడకన గోనుపల్లికి బయలుదేరారు. అధికారులు, వేద పండితులు పెంచలకోన ఆర్చి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి వీడ్కోలు పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లను గోనుపల్లి గిరిజన కాలనీవద్ద ఉన్న చెంచురాజు ఇంటికి దొడ్డిదారిలో తీసుకొచ్చారు. శ్రీవారి కల్యాణం అనంతరం స్వామి దొంగదారిలో గ్రామానికి వచ్చారని నానుడి. పెంచలస్వామి గిరిజన వనిత అయిన చెంచులక్ష్మీదేవిని వివాహం చేసుకోవడంతో ఆయన్ను తమ అల్లుడిగా భావిస్తారు. గోనుపల్లి నుంచి ఉత్సవమూర్తులు కోనకు వెళ్లే సమయంలో స్వామిని గిరిజనులు పెళ్లికొడుకును చేసి అల్లుడికి ఇవ్వాల్సిన కట్నకానుకల కింద ఆరిమొలతాడు, ఇంజేటి గడ్డ, పుట్టతేనె మొదలైనవి సమర్పిస్తారు. అలాగే స్వామి తిరిగి వచ్చే సమయంలో అడవి ఫలాలను అందించారు. శ్రీవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు గిరిజన కాలనీలోనే ఉంచడంతో గిరిజనులు తమ కొత్తఅల్లుడికి ప్రత్యేక పూజలు చేసి పండగ జరుపుకొన్నారు. అనంతరం గోనుపల్లిలో గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఏసీ జనార్దన్రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు చెన్ను తిరుపాల్రెడ్డి, ఉప ప్రధానార్చకులు సీతా రామయ్యస్వామి, పెంచలయ్యస్వామి భక్తులు పాల్గొన్నారు. -
టీడీపీలో ఉండలేం.. వైఎస్సార్సీపీలో చేరుతాం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘తెలుగుదేశంలో ఆధిపత్య పోరు ఉంది. ఆ పార్టీలో మేము కొనసాగలేం. వైఎస్సార్సీపీలో చేరుతాం’ అని నెల్లూరులోని 53, 54 డివిజన్లకు చెందిన పలువురు ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నెల్లూరు నగర ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డికి చెప్పారు. ఆయన ఆదివారం జనార్దనరెడ్డి కాలనీకి వచ్చారు. ఈ సందర్భంగా 54వ డివిజన్కు చెందిన సీనియర్ నాయకులు ఎస్కే మంజు అహ్మద్, ఎస్కే దస్తగిరి ఎమ్మెల్సీ వద్దకెళ్లి తాము అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీలో చేరుతామని చెప్పారు. రెండురోజుల క్రితం 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీకి చెందిన టీడీపీ సీనియర్ నేత బాగి వెంకటరమణ 100 మంది అనుచరులతో కలిసి ఎమ్మెల్సీ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో ఆ రెండు డివిజన్ల నుంచి పెద్దఎత్తున టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. -
ఈదురు గాలుల బీభత్సం
నెల్లూరు (పొగతోట)/మర్రిపాడు/కలిగిరి (ఉదయగిరి): జిల్లాలో ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారింది. ఉరుములు, మెరుపులు, పెనుగాలులకు వర్షం తోడుకావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. నెల్లూరు నగరంలో గురువారం రాత్రి 7 గంటల తరువాత ఒక్కసారిగా ఈదురుగాలు ప్రారంభమయ్యాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అర్ధరాత్రి వరకు కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాలేదు. నగర రోడ్లపై వెళ్తున్న ద్విచక్ర వాహనచోదకులు ఈదురు గాలులకు పట్టుతప్పి పడిపోయారు. కొందరు బైక్లను రోడ్డు పక్కన నిలిపేసి దుకాణాల్లో తలదాచుకున్నారు. నగరంలో అనేక ప్రాంతాల్లో చెట్ల కొమ్మ లు విరిగిపడ్డాయి. ఇంటిపైన ఉన్న రేకులు, గేట్లకు ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రేకులు ఎగిరిపోయి పక్క ఇళ్లపై పడ్డాయి. భారీ ఈదురు గాలులు వీయడంతో పలు చోట్ల పూరిళ్లు, రేకుల ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. మరి కొన్ని ప్రాంతాల్లో మామిడి, నిమ్మ తోటల్లో కాయ లు నేలరాయి. రోడ్డు పక్కన ఉన్న భారీ వృక్షాలు నేలకొరిగి రోడ్డుకు అడ్డంగా పడడంతో ఆయా మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మర్రిపాడు మండలం చిన్నమాచనూరులో ఈదురు గాలుల బీభత్సం సృష్టించాయి. దీంతో పలు ప్రాంతాల్లో రోడ్లపై చెట్లు నేలకూలాయి. పూరి గుడిసెల పైకప్పులు లేచిపోగా, విద్యుత్ స్తంభాల విరిగినట్లు, తీగలు తెగిపడ్డాయి. కలిగిరి మండలం కుమ్మరకొండూరులో నోటి రవీంద్రమ్మ, కందులవారిపాళెం ఎస్సీ కాలనీలో దారా మాలకొండయ్యకు చెందిన రేకుల ఇళ్లకు సంబంధించి పైకప్పులు ఎగిరిపోయాయి. ఇంటిపైన ఉన్న సిమెంట్ రేకుల కప్పులు పూర్తిగా దెబ్బతిన్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా అనేక గ్రామాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాకపోవడంతో చీకట్లోనే మగ్గుతున్నాయి. ఉరుమురులు, పిడుగులతో వర్షం జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి వరకు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంత రాయం చీకట్లో పట్టణాలు, పల్లెలు పలు చోట్ల రేకుల, పూరిళ్లు ధ్వంసం నెలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు పండ్ల తోటల్లో రాలిన కాయలు -
గౌడ సంక్షేమ సంఘం కార్యవర్గ ఏర్పాటు
నెల్లూరు(వేదాయపాళెం): గౌడ సంక్షేమ సంఘం సంఘం విస్తృత స్థాయి ఆదివారం నెల్లూరులో జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా తిరకా శీనయ్యగౌడ్, ఉపాధ్యక్షుడిగా వెంపులూరి భాస్కర్ గౌడ్, అసోసియేట్ అధ్యక్షుడిగా దద్దోలు రమణయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శిగా రమణయ్య గౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఉదయగిరి శ్రీనివాసులు గౌడ్, గౌరవాధ్యక్షుడిగా అన్నం దయాకర్ గౌడ్, గౌరవ సలహాదారులుగా ఉదయగిరి నరసింహులు గౌడ్, బి.వెంకటేశ్వర్లు గౌడ్, కోసూరు బాలయ్య గౌడ్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామ్గోపాల్ గౌడ్ మాట్లాడారు. -
ఆక్సిజన్ ప్లాంట్.. మూలకు..!
● అల్లూరులో మూతపడిన వైనం ● నిర్లక్ష్యంగా కూటమి ప్రభుత్వ తీరు ● ప్రైవేట్ పైనే ఆధారం ● ప్రజల సొమ్ము వృథా అల్లూరు: కరోనా సమయంలో ఆక్సిజన్ సరఫరాను నిరంతరాయంగా అందించేందుకు అల్లూరు ప్రభుత్వాస్పత్రిలో ఏర్పాటు చేసిన ప్లాంట్ మూలనపడింది. కూటమి ప్రభుత్వ తీరు కారణంగా ప్రైవేట్ కాంట్రాక్టర్లు సరఫరా చేసే ఆక్సిజన్పైనే ఆస్పత్రి అధికారులు ఆధారపడాల్సి వస్తోంది. ఎమర్జెన్సీ వార్డులు, ఆపరేషన్ థియేటర్లలోకి సులువుగా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు పైప్లైన్లను కూడా అప్పట్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు అవేమీ ఉపయోగంలో లేవు. ఇలా ఎందుకో.. పీఎం కేర్ కింద అల్లూరు ప్రభుత్వాస్పత్రిలో ప్లాంట్ను 2021 అక్టోబర్ రూ.62 లక్షలతో పెట్టారు. కోవిడ్ రెండో వేవ్ సమయంలో పేషెంట్ల కోసం నాటి ప్రభుత్వం దీనిని ఏర్పాటు చేయించింది. అయితే దీనిని వినియోగించుకోవడం లేదు. ప్రైవేట్ కాంట్రాక్టర్ సరఫరా చేసే ఆక్సిజన్పైనే ఆధారపడుతున్న పరిస్థితులున్నాయి. ప్రత్యేకంగా ప్లాంట్ ఉన్నా కూడా భారీ మొత్తంలో నిధులను వినియోగిస్తున్నారు. ఉన్న ప్లాంట్ను బాగు చేయించకుండా అధికారులు ప్రైవేట్ కాంట్రాక్టర్కు మాత్రం పెద్దపీట వేస్తున్నారు. నెలకు 5 – 6 టన్నులు అవసరం అల్లూరు ప్రభుత్వాస్పత్రికి నెలకు 5 నుంచి 6 టన్నుల ఆక్సిజన్ అవసరమవుతుంది. దీనిని ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేస్తుంటారు. సంవత్సరానికి రూ.లక్షల్లో ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ప్లాంట్ను వినియోగంలోకి తెస్తే ప్రభుత్వ ఖజానాపై భారం పడదు. -
నేడు ‘డయల్ యువర్ ఎస్ఈ’
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగదారులు సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు సోమవారం ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ రాఘవేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య 0861 – 2320427 నంబర్కు ఫోన్ చేసి సమస్యలను చెప్పాలని సూచించారు. ● తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో సీఎండీ శివశంకర్ ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నారు. జిల్లా నుంచి వినియోగదారులు 89777 – 16661 నంబర్కు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు.బంగారం, వెండి చోరీనెల్లూరు(క్రైమ్): ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని దుండగులు తాళాలు పగులగొట్టి బీరువాలోని బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించుకెళ్లారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలం ఎల్బీఎస్ నగర్లో నవీన్ కుటుంబం నివాసం ఉంటోంది. అతని సోదరికి తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. దీంతో నవీన్ తన కుటుంబంతో కలిసి గతనెల 29వ తేదీన తమిళనాడులోని తిరుపోరూర్కు వెళ్లారు. నవీన్ కుటుంబం శనివారం రాత్రి ఇంటికొచ్చిచూడగా మెయిన్ డోర్ తాళాలు పగులగొట్టి ఉన్నాయి. బీరువా లాకర్లోని 59 గ్రాముల బంగారు ఆభరణాలు, 450 గ్రాముల వెండి వస్తువులు కనిపించలేదు. బాధితులు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఐదు కేజీల గంజాయి స్వాధీనం● తునిలో కొనుగోలు ● తమిళనాడు వాసి అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): రైల్వే పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి ఐదు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్లో శనివారం రాత్రి నెల్లూరు రైల్వే సీఐ ఎ.సుధాకర్ పర్యవేక్షణలో సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. టాటానగర్ – ఎర్నాకులం ఎక్స్ప్రెస్ రైలుదిగి ప్లాట్ఫారంపై అనుమానాస్పదంగా ఉన్న తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాకు చెందిన ప్రకాశంను అదుపులోకి తీసుకున్నారు. అతడి బ్యాగ్లో ఐదు కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకుని రైల్వే పోలీస్స్టేషన్కు తరలించారు. నిందితుడిని విచారించగా కాకినాడ జిల్లా తునిలో కేజీ గంజాయి రూ.3 వేల చొప్పున కొనుగోలు చేసి తమ ప్రాంతంలో కేజీ రూ.10 వేలకు అమ్మేందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించడంతో అరెస్ట్ చేశారు. తనిఖీల్లో కావలి, నెల్లూరు రైల్వే ఎస్సై వెంకటరావు, హరిచందన పాల్గొన్నారు. నరసింహకొండపై సినిమా పాటలు..● ఆలయ ఈఓ ఆగ్రహం నెల్లూరు సిటీ: రూరల్ మండలంలోని నరసింహకొండపై వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి కల్యాణోత్సవం జరిగింది. మండపానికి సమీపంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వేదిక ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి కొందరు సినిమా పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఈఓ గోపీ అక్కడికి చేరుకుని ఓ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ర తీసుకుని అక్కడ్నుంచి తరిమి కొట్టారు. అనంతరం పాటలు పెట్టిన మైక్సెట్ వారిని కూడా కర్రతో కొట్టారు. దీంతో వారు ఈఓ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆదివారం పెద్దల సమక్షంలో రాజీ చేశారు. అటవీ ప్రాంతంలో పరిశీలనరాపూరు: పెంచలకోన అటవీ ప్రాంతాన్ని ఆదివారం జిల్లా అటవీ శాఖాధికారి మహబూబ్ బాషా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రం సమీపంలోని వెలుగొండ అటవీ ప్రాంతమైన పెంచలకోన అడవుల్లో మంటలు అదుపులోకి తీసుకొచ్చినట్లు వైఎస్సార్ జిల్లా చిట్వేలి ప్రాంతం నుంచి మంటలు వ్యాపించాయన్నారు. గుర్తించిన అటవీ శాఖ, బేస్ క్యాంప్ సిబ్బంది బ్లోయర్ల సహయంతో అదుపు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 40 మంది సిబ్బంది నాలుగు బృందాలుగా ఏర్పడి మంటలను ఆర్పుతున్నారని వివరించారు. వెంకటగిరి నుంచి ఎస్బీఆర్ఎఫ్ టీమ్ను రంగంలోకి దింపుతున్నామని, ఫైర్ సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారన్నారు. గాలులు ఉధృతంగా ఉండటంతో మంటలు వ్యాప్తి చెందుతున్నాయన్నారు. అటవీ ప్రాంతంలోని గడ్డిని తగులబెట్టడంతో మంటలు చెలరేగాయన్నారు. అదనపు బలగాలను రప్పిస్తున్నట్లు వివరించారు. సోమవారం నాటికి పూర్తి స్థాయిలో మంటలను అదుపు చేస్తామన్నారు. -
వాణిజ్య గ్యాస్ ధరలు తగ్గించాలంటూ..
● సీపీఎం ఆధ్వర్యంలో నెల్లూరులో నిరసన నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ ధరలను పెంచడం దారుణమని సీపీఎం నేతలు అన్నారు. నెల్లూరులో ఆదివారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నగర కమిటీ ఆధ్వర్యంలో బాలాజీనగర్ సెంటర్ నుంచి జ్యోతిరావు పూలే విగ్రహం వరకు, రూరల్ కమిటీ ఆధ్వర్యంలో వనంతోపు సెంటర్ నుంచి కొండాయపాళెం సెంటర్ వరకు ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లులు మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వాణిజ్య గ్యాస్ ధరను ఒకేసారి రూ.993 పెంచడం దారుణమన్నారు. గోదావరి బేసిన్లో పుష్కలంగా గ్యాస్ నిక్షేపాలున్నా రాష్ట్ర పాలకుల వైఫల్యం కారణంగా ప్రజలు భారం మోయాల్సి వస్తోందని ఆరోపించారు. గోదారి గ్యాస్ నిక్షేపాల్లో రాష్ట్రానికి వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని గ్యాస్ను గుజరాత్కు తరలిస్తున్నా పాలకులు చోద్యం చూస్తున్నారన్నారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయడమే బీజేపీ అజెండాగా మారిందని ఆరోపి ంచారు. ధర పెంపుతో చిన్న టిఫిన్ దుకాణాలు, వ్యాపారస్తులు, హోటళ్లపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. చివరకు సామాన్య ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. హోటళ్లలో ఇప్పటికే జీఎస్టీ పేరుతో అధిక మొత్తం వసూలు చేస్తున్నారు. చిన్నపాటి టిఫిన్ దుకాణాలు మూతపడే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే పెంచిన వాణిజ్య గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాల్లో నేతలు సూర్యనారాయణ, శ్రీనివాసులు, నరసింహ, చిరంజీవి, సుబ్బమ్మ, చెంగయ్య, పెంచలయ్య, శ్రీధర్, కొండా ప్రసాద్, పెంచల నరసయ్య, శ్రీనివాసులు, నాగేశ్వరరెడ్డి, రఘురామయ్య, వజ్రమ్మ, భారతి, గోపీ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన హుండీల లెక్కింపు
అనుమసముద్రంపేట: ఏఎస్పేటలోని ప్రము ఖ క్షేత్రమైన హజరత్ ఖాజానాయబ్ రసూల్ దర్గా హుండీ లెక్కింపు ఆదివారంతో ముగిసింది. గత 22 నెలల తర్వాత హుండీలు లెక్కింపునకు కోర్టు ఆదేశాల మేరకు వక్ఫ్బోర్డు అధికారులు అనుమతివ్వడంతో ఈ లెక్కింపు ప్రక్రి య పది రోజులుగా కొనసాగింది. 22 హుండీలను లెక్కించగా రూ.3,18,37,833 నగదు, 98.55 గ్రాముల బంగారం, 12.991 కేజీల వెండి వచ్చినట్లు దర్గా ఈఓ హుస్సేన్ తెలిపారు. ఈ నగదు మొత్తాన్ని బ్యాంకులో జమ చేసిన ట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్బోర్డు అధికారులు సయ్యద్ ఎస్డీ ఆదాం, షఫీ, ఇబ్రహీం బేగ్, ఎస్కే రవూఫ్, ఎండీ హుస్సేన్, ఖాజా మొహిద్దీన్, దర్గా ఇన్స్పెక్టర్ కుదావన్, దర్గా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 16 గంటలు తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ ఏటీజీహెచ్ వద్దకు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 91,005 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 36,257 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.37 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 16 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
ప్రశాంతంగా ‘నీట్’
● 92 మంది విద్యార్థులు గైర్హాజరు నెల్లూరు (టౌన్): ఎంబీబీఎస్, బీడీఎస్ల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్కు ఆదివారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 92 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లాలో నెల్లూరులో మొత్తం 12 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరిగిన ఈ పరీక్షకు మొత్తం 3,486 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే నెల్లూరులోని 9 కేంద్రాల్లో 3015 మందికి 2954 మంది హాజరు కాగా, 61 మంది గైర్హాజరయ్యారు. గూడూరులోని 3 కేంద్రాల్లో 471 మందికి 450 మంది హాజరు కాగా, 21 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. కేంద్రాల ముఖ ద్వారాల వద్ద విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతించారు. అయితే కొన్ని కేంద్రాల్లో సరిపడా ఫ్యాన్లు లేకపోవడంతో మరో వైపు మండుతున్న ఎండలకు ఉక్కపోతకు విద్యార్థులు ఇబ్బందులు పడినట్లు సమాచారం. విద్యార్థులతో పాటు వచ్చిన తల్లిదండ్రులకు తాగునీరు, వేచి ఉండేందుకు వసతులు లేక ఎండ వేడిమి తాళలేక ఇబ్బందులు పడ్డారు. -
అనుమతా.. మాకెందుకు
● యథేచ్ఛగా అదనపు గదుల నిర్మాణం ● పట్టించుకోని కమిషనర్నెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థ పరిధిలో ఎవరైనా భవన నిర్మాణం చేయాలంటే ముందస్తుగానే ఎన్ఎంసీలోని పట్టణ ప్రణాళికా విభాగానికి దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు పరిశీలించి అనుమతి ఇచ్చారు. తర్వాత నిబంధనల మేరకు నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. అయితే బారకాసు సెంటర్లో ఉన్న మున్సిపల్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ యూనియన్ భవన ప్రాంగణంలో జరుగుతున్న అదనపు గదుల నిర్మాణానికి కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతి లేదని సమాచారం. అయినా సంబంధిత అధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరించడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవన ప్రాంగణంలోనే నిర్మాణం జరుగుతోందని స్పందించడం లేదని ఆరోపణలున్నాయి. ప్రజలకు ఒకలా.. అసోసియేషన్కు మరోలా నిబంధనలు ఉంటాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కమిషనర్ నందన్ నిత్యం నూతన భవన నిర్మాణాల వద్దకెళ్లి అనుమతులున్నాయా?, నిబంధనల మేరకే పనులు జరుపుతున్నారా అని పరిశీలిస్తుంటారు. ఆయనకు ఈ అదనపు గదుల నిర్మాణం కనిపించడం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
ట్రావెల్స్ బస్సు బీభత్సం
కావలి: ఓ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా మితిమీరిన వేగంతో వెళ్తూ కావలి శివారు నుంచి జమ్మలపాళెం వరకు బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, నాలుగు గేదెలు సైతం చనిపోయాయి. ఈ విషాద ఘటనలు ఆదివారం కావలి మండలం బుడమగుంట క్రాస్, జలదంకి మండలం జమ్మలపాళెం మధ్య జరిగాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కావలి నుంచి కలిగిరి వైపు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంగా వెళ్తోంది. ఈ క్రమంలో తిమ్మసముద్రం గ్రామానికి చెందిన దేవరపల్లి వెంకటేశ్వర్లు (46) కావలికి బైక్పై వస్తుండగా ఎదురుగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో డ్రైవర్ బస్సును ఆపకుండా వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో జమ్మలపాళేనికి చెందిన దేవరపల్లి కొండయ్య గేదెలను మేపుకొని ఇంటికి తోలుకెళ్తుండగా డ్రైవర్ అదే వేగంగా వచ్చి ఆరు గేదెలను ఢీకొట్టాడు. దీంతో నాలుగు అక్కడికక్కడే మృతిచెందగా రెండు ప్రాణాపాయస్థితిలో ఉన్నాయి. డ్రైవర్ బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు. దీంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. కావలి – ఉదయగిరి హైవేపై కర్రలు అడ్డంగా వేయడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. బస్సు యాజమాని వచ్చి నష్టపరిహారం చెల్లించే వరకు వదిలేది లేదని భీష్మించుకున్నారు. మిగతా వాహనచోదకులు బతిమిలాడినా.. ససేమిరా అనడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బస్సును పక్కన పెట్టి రాకపోకలను పునరుద్ధరించారు. కావలి శివారులో బైకిస్ట్ను ఢీకొనడంతో దుర్మరణం జమ్మలపాళెం వద్ద ఆరు గేదెలను ఢీకొట్టడంతో నాలుగు మృతి గ్రామస్తులు బస్సును అడ్డుకుని ఆందోళన -
జిల్లాలో రెండేళ్లుగా నిర్విరామంగా అక్రమ దందా
జిల్లాలో గ్రావెల్ మాఫియా గునపాలతో ప్రకృతి గుండె కోతతో విలపిస్తోంది. కూటమి నేతలు ప్రభుత్వ, అటవీ భూములు, కుంటలు, చెరువుల్లో విచ్చలవిడిగా తవ్వకాలు చేస్తున్నారు. కొండలను, గుట్టలను వదలకుండా నేలమట్టం చేసేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల బినామీల కనుసన్నల్లో ఈ అక్రమ దందా నిర్విరామంగా సాగుతోంది. ఊరూరా భారీ యంత్రాలు పెట్టి.. బావుల్లాంటి గోతులు పెట్టి గ్రావెల్ తవ్వి రేయింబవళ్లు విరామం లేకుండా టిప్పర్లతో తరలిస్తున్నారు. అడ్డుకోవాల్సిన మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, విజిలెన్స్ శాఖలు ‘పచ్చ’ నోట్ల మత్తులో జోగుతున్నాయి. ఇష్టారీతిన తవ్వేస్తున్న గుంతల్లోకి నీళ్లు చేరడంతో అభం శుభం తెలియని పిల్లలు అందులో పడి మృత్యువాత పడి తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుతున్నా.. అధికార యంత్రాంగానికి కనువిప్పు మాత్రం కలగడం లేదు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి నేతలు ప్రకృతి వనరులు యథేచ్ఛగా దోచుకుంటున్నారు. ప్రభుత్వ, అటవీ భూములు, చెరువులు, కుంటల్లో ఎలాంటి అనుమతులు లేకుండా రేయింబవళ్లు భారీ యంత్రాలతో అక్రమంగా గ్రావెల్ తవ్వుకుంటూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. జిల్లాలో సిటీ నియోజకవర్గం మినహాయించి మిగతా అన్ని నియోజకవర్గాల్లో గ్రావెల్ భూములు ఉండడంతో స్థానిక ఎమ్మెల్యేలకు వరప్రసాదినిగా మారింది. పచ్చ నోట్ల మత్తులో పడి ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు. అధికార మదంతో తమకెవరి అనుమతులు అవసరం లేదన్నట్లుగా టీడీపీ నేతలు వ్యవహరిస్తూ.. ప్రభుత్వ ఖజానాకు రాయల్టీ ఎగ్గొట్టి యథేచ్ఛగా గ్రావెల్ దందాను కొనసాగిస్తున్నారు. రూ.100 కోట్లపై మాటే.. జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి, గూడూరు, కావలి, సర్వేపల్లి తదితర నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు బినామీలను పెట్టుకుని వారి కనుసన్నల్లో గ్రావెల్ దందా కొసాగిస్తున్నారు. రెండేళ్లుగా ఒక్కొక్క నియోజకవర్గంలో రూ.100 కోట్ల మేర గ్రావెల్ సంపదను దోచుకున్నట్లు తెలుస్తోంది. భారీ యంత్రాలతో నిబంధనలు పాటించకుండా, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. గ్రావెల్ దందాలో సర్వేపల్లి మొదటి స్థానంలో ఉంటే.. కావలి, ఆత్మకూరు, ఉదయగిరి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయనే ఆరోపణలకు ఆయా ప్రాంతాల్లో తవ్వేసిన గ్రావెల్ గుంతలు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఎక్కడ ఎంతెంత.. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం మండలంలో రామదాసుకండ్రిగలో సుమారు 35 ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేపడుతూనే ఉన్నారు. సర్వేపల్లి పంచాయతీ పరిధిలో 100 ఎకరాలకు పైగా భూముల్లో కోట్లాది రూపాయల విలువ చేసే గ్రావెల్ను ఇప్పటి వరకు తరలించారు. ఇక కందలపాడులోని సర్వే నంబరు 57లో 174.67 ఎకరాల కొండపోరంబోకు (కందలపాడు తిప్ప) భూముల్లో సుమారు 45 ఎకరాల్లో అక్రమ గ్రావెల్ తరలించినట్లు అంచనాలు ఉన్నాయి. ఒక్క వెంకటాచలం మండలంలోనే లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ను తరలించడం గమనార్హం. ఇక పొదలకూరుకు సమీపంలో చిట్టేపల్లి తిప్ప సర్వే నంబర్ 707లో గ్రావెల్ ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. కొండ సైతం కరిగిపోతోంది. మరుపూరుకు సమీపంలోని ఎస్టీల అనుభవంలో ఉన్న సుమారు 70 ఎకరాల్లో నుంచి గ్రావెల్ అక్రమంగా తరలించారు.ఇందుకోసం రాచబాటలను కూడా నిర్మించారు. కందలపాడులో కుంటను తలపించేలా గ్రావెల్ తవ్వకాలుఅనుమతుల్లేవు.. నిబంధనలు పాటించరు ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువుల్లో యథేచ్ఛగా తవ్వకాలు కొండలు, గుట్టలనూ వదలని వైనం ఒక్కొక్క నియోజకవర్గంలో రూ.100 కోట్లకు పైనే దోచుకున్న కూటమి నేతలు గుంతల్లో పడి అభంశుభం తెలియని పిల్లలు మృత్యువాత 2014–19 మధ్య వెంకటాచలంలో 9 మంది పిల్లలు.. తాజాగా సైదాపురం వద్ద ఇద్దరు బిడ్డలు.. చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం ప్రాణాలు పోతున్నా పట్టించుకోని అధికారులు జిల్లాలో అక్రమ గ్రావెల్ తవ్వకాలతో ఏర్పడిన గోతుల్లో ఉన్న నీటిలో పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. 2014–19 మధ్య కాలంలో వెంకటాచలం మండలంలో టీడీపీ నేతలు తవ్విని అక్రమ గ్రావెల్ గుంతల్లో పడి 9 మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. రెండేళ్లల్లో ఐదారు మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. తాజాగా సైదాపురం వద్ద ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. రెవెన్యూ, ఇరిగేషన్, అటవీశాఖ భూముల్లో అడ్డగోలుగా తవ్వకాలు జరుగుతున్నా ఆయా శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. కళ్ల ముందు అవినీతి జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, విజిలెన్స్ చోద్యం చూస్తున్నారు. అధికార పార్టీ నేతలకు జీ హుజూర్ అంటున్నారు. కనీసం జిల్లా పాలనాధికారి కూడా స్పందించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా అధికారుల స్పందించి అక్రమార్కులపై కొరడా ఝళిపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
శభాష్.. స్టూడెంట్స్
● ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు కలెక్టర్ అభినందనలు నెల్లూరురూరల్: ఇటీవల విడుదలైన పదో తర గతి ఫలితాల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించిన నేపథ్యంలో విద్యార్థులను కలెక్టర్ హిమాన్షు శుక్లా శనివారం తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు. అత్యధిక మార్కులు సాధించిన కావలి, ఉదయగిరి, పొదలకూరు పరిధిలోని విద్యార్థులు ఏ సంతోష్ (584), వీవీ సూర్య ప్రణీత్ (574), సీహెచ్ వినీత (574), పి ప్రవీణ్కుమార్ (574), ఆకుల సంతోష్ (562), జె నిరంజన్ (561), ఎం సాయిశశాంక్రెడ్డి (561), కార్తీక్ (558)లకు కలెక్టర్ చేతుల మీదు గా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు శోభారాణి, తదితరులు పాల్గొన్నారు. వెంకయ్యస్వామి సూక్తి స్ఫూర్తిదాయకం ● మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెంకటాచలం: ‘నీవు తిన్నది నీది కాదు, నీవు పెట్టినదే నీది’ అన్న భగవాన్ శ్రీవెంకయ్యస్వామి సూక్తి సమాజానికి నిరంతరం స్ఫూర్తిదాయకమని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. మండలంలోని గొలగమూడిలో శనివారం భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి చారిత్రక ప్రస్థానాన్ని చాటి చెప్పే విశ్వంభరుడు గ్రంథాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ పుస్తక రచయిత దంపూరు రామకృష్ణ, ప్రచురణకర్త నాగినేని లక్ష్మయ్యనాయుడుని ఈ సందర్భంగా అభినందించారు. ఆయన మాట్లాడుతూ వెంకయ్యస్వామి ఆశ్రమం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా అన్నదానం, విద్యాదానం, గోసంరక్షణ వంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం మంచి విషయమన్నా రు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి, వెంకయ్యస్వామి ఆశ్రమ ఏఓ పి.బాలసుబ్రహ్మణ్యం, స్వర్ణభారత్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ తదితరులు పాల్గొన్నారు. నారాయణలో ఏఐ వర్క్షాపు నెల్లూరు (టౌన్): నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ఎంబీఏ, ఎంసీఏ, సీఎస్ఈ, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విబాగాలు సంయుక్తంగా ఏఐ వర్క్షాపు–2026ను నిర్వహించారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ హైదరాబాద్ ప్రాంతీయ విభాగాధిపతి జేవీఆర్ఎస్ ప్రసాద్ ‘ఎసెన్షీయల్స్ ఆఫ్ ఏఐ’ అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారి తీస్తుందన్నారు. విద్యార్థులు భవిష్యత్ ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకోవాలంటే ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి రంగాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. నైపుణ్యాలతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సమస్య పరిష్కార సామర్థ్యం, క్రియేటివ్ థింకింగ్ అవసరమన్నారు. టీసీఎస్ వంటి ప్రముఖ సంస్థల్లో కెరీర్ అవకాశాలు, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, అసరమైన నైపుణ్యాలపై సూచనలు అందజేశారు. కళాశాల డైరెక్టర్ దత్తాత్రేయశర్మ, ప్రిన్సిపల్ రవిప్రసాద్, ఎంబీఏ డీన్ గంగినేని ధనుంజయ్, వివిధ విభా గాధిపతులు రాజేంద్ర, పెంచలయ్య, రామ్మోహన్, వరప్రసాద్,, మాల్యాద్రి, ప్లేస్మెంట్ అధికారులు పాల్గొన్నారు. ఆక్వా సాగులో వైరస్లను నిరోధించాలి కోట: ఆక్వా సాగులో విజృంభిస్తున్న వైరస్లను సీడ్ తయారీలోనే గుర్తించి కట్టడి చేస్తే సాగు లాభదాయకంగా మారుతుందని మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కిరణ్కుమార్ సూచించారు. నేషనల్ సర్వైలెన్స్ ప్రోగ్రాం ఫర్ ఆక్వాటెక్ ఎనిమల్ డిసీజ్లో భాగంగా కాకినాడ, చైన్నె సంయుక్త బృందం మండలంలోని శ్రీనివాససత్రంలో ఉన్న టెక్నోమిన్ రొయ్యల హేచరీని సందర్శించారు. హేచరీలో పోస్ట్ లార్వా నమూనాలను సేకరించారు. ట్రాన్స్లూసెంట్ పోస్ట్, లార్వల్ డిసీజ్ సహా ఇతర వ్యాధుల గుర్తింపునకు ప్రయోగశాలకు పంపించారు. సిద్ధవరంలోని రొయ్యల గుంతల నుంచి నీటిని, రొయ్యల నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆక్వా రైతులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీఓలు రెడ్యానాయక్, చైతన్య, ఫీల్డ్ అస్టెంట్లు వంశీ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ స్థలాలు ప్రైవేట్కు కట్టబెట్టడం దారుణం
● ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం ● రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగ సంఘ నాయకులు నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వం నెల్లూరు నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ డిపో–2ను మూసివేసి రూ.300 కోట్లు విలువ చేసే ఐదెకరాల భూమిని పినాకిల్ ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టడం దారుణమని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగ సంఘ నాయకులు ధ్వజమెత్తారు. నగరంలోని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో వివిధ సంఘాల నాయకులు శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజయ్కుమార్ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ బస్సులు నిర్వహణ పేరుతో ప్రైవేట్ కంపెనీకి విలువైన భూమిని కట్టబెట్టడం దారుణమని తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న దాదాపు 500 మంది కార్మికులను ఇతర డిపోలకు బదిలీ చేస్తున్నారన్నారు. చుట్టు పక్కల గ్రామాలకు రోజూవారీ తిరుగుతున్న ఆర్టీసీ బస్సులను ఇతర డిపోలకు కేటాయిస్తుందన్నారు. దీంతో ఆయా ప్రాంతాలకు బస్సుల సంఖ్య తగ్గుతుందన్నారు. ఈ నెల 4న వీఆర్సీ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్టాండు వరకు చలో ఆర్టీసీ–2 డిపో కార్యక్రమానికి పిలుపునిచ్చామన్నారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ జిల్లా కార్యదర్శి రమణయ్య, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు, యానాదయ్య తదితరులు పాల్గొన్నారు. -
కేసుల పరిష్కారం న్యాయ పక్షంగా ఉండాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ ● స్థానిక కోర్టుల్లో ఆకస్మిక పరిశీలన ఆత్మకూరు: దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించడంతోపాటు, తీర్పులు న్యాయ పక్షంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి శ్రీనివాస్ చెప్పారు. పట్టణంలోని సీనియర్ సివిల్ జడ్జి, జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి శనివారం ఆకస్మిక పరిశీలన చేశారు. ఏడాది కాలంలో పరిష్కారమైన కేసుల వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ కేసులో న్యాయం చేయడంలో న్యాయాధికారులు, న్యాయవాదులు ముందుండాలని పిలుపునిచ్చారు. కోర్టుల్లో ఏమైనా సమస్యలు ఉంటే తెలపాలని ఆయన కోరగా, పలువురు న్యాయవాదులు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జిని పలువురు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి బి గాయత్రి, జూనియర్ సివిల్ జడ్జి ఎల్ జగదీష్కుమార్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె వెంకట రమణమ్మ, కార్యవర్గ సభ్యులు బి రాధాకృష్ణ, న్యాయవాదులు కె మహదేవరెడ్డి, ఎల్వీ రమణయ్య, నందా ఓబులేసు, తిరుపతమ్మ, వెంకటేశ్వర్లు, ఎస్కే నజీర్బాషా, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
సోమశిల: జిల్లాకే జలనిధి అయిన సోమశిల ప్రాజె క్ట్ నెలవైన గ్రామంలోనే రెండు నెలలుగా తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా.. ఫలితం లేకపోవడంతో ఆగ్రహించిన మహిళలు బిందెలతో రోడ్డెక్కి నిరసనకు దిగారు. ఈ ఘటన అనంతసాగరం మండలం సోమశిలలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే గ్రామంలోని కలువాయి రోడ్డు కాలనీలో సుమా రు 150 కుటుంబాలు ఉన్నాయి. పెన్నానదిలో ఉన్న బోర్ల నుంచి నేరుగా ఇళ్లకు కుళాయి కనెక్షన్ల ద్వారా ఆ కుటుంబాలకు తాగునీటి సరఫరా చేస్తున్నారు. రెండు నెలల నుంచి నీరు సక్రమంగా అందకపోవడంతో స్థానికులు ఎన్నోసార్లు పంచాయతీ అధికారులకు విన్నవించుకున్నా.. ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానిక టీడీపీ నేత వద్దకు వెళ్లి సమస్యను వివరించారు. అయితే ఆ నాయకుడు ‘మేము బిందెలతో నీళ్లు తెచ్చి మీ ఇళ్లలో పోయాలా’ అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారని మహిళలు వాపోయారు. తాగునీరు సక్రమంగా అందక ప్రజలు నానా అవస్థలు పడుతు న్నా సమస్యను ఎవరూ పట్టించుకోకపోవడంతో బిందెలతో ప్రధాన రహదారిలో రాస్తారోకోకు దిగారు. దీంతో ఆర్టీసీ బస్సులు, పలు వాహనాలు దాదాపు గంట పాటు నిలిచిపోయాయి. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
అగ్ని ప్రమాదంలో పూరిల్లు దగ్ధం
● నిలువనీడ కోల్పోయిన కుటుంబం వరికుంటపాడు: మండలంలోని తూర్పురొంపిదొడ్ల గ్రామంలో శుక్రవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో యసారుపు లక్ష్మమ్మకు చెందిన పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. దీంతో ఆ కుటుంబం నిలువనీడ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సమాచారం అందుకున్న వెంటనే గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అలాగే విద్యుత్ లైన్లను తొలగించి, కొంతమేర సామగ్రిని బయటకు తీసేందుకు సహకరించారు. అయితే అప్పటికే ఇల్లు పూర్తిగా కాలిపోయింది. పేదరికంలో జీవిస్తున్న ఈ కుటుంబానికి ఇల్లు లేకపోవడంతోపాటు సాగు భూమి కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వం చొరవ తీసుకుని ఇంటి స్థలం కేటాయించాలని బాధిత కుటుంబం కోరింది. -
జిల్లా ప్రగతికి సమన్వయంతో కృషి
నెల్లూరురూరల్: జిల్లా ప్రగతికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తిరుపతి ఎకనామిక్ రీజియన్ సీఈఓ ముఖేష్కుమార్ మీనా అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులతో మాట్లాడి జిల్లా ప్రగతికి ఆయా శాఖలు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని పారిశ్రామికంగా, ప్రాధాన్యత రంగాల్లో జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. జిల్లా ప్రగతికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమార్, సీపీఓ నరసింహారావు, ఆర్డీఓలు అనూషా, పావని, సత్యనారాయణ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
సీసీటీఎన్ఎస్ డేటా ఎంట్రీపై ఎస్పీ సమీక్ష
నెల్లూరు(క్రైమ్): స్మార్ట్ పోలీసింగ్లో భాగంగా సీసీటీఎన్ఎస్ డేటా ఎంట్రీ పనితీరుపై ఎస్పీ అజిత వేజెండ్ల శుక్రవారం నెల్లూరు ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్స్టేషన్ల రైటర్లు, సీసీటీఎన్ఎస్ ఆపరేటర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సీసీటీఎన్ఎస్లో వివిధ అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నమోదు చేయాలన్నారు. సమాచార నమోదులో నిర్లక్ష్యం, తప్పులు జరిగితే జిల్లా ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పారు. ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించి నమోదు చేయాలని సూచించారు. సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే జిల్లాకు మంచి ర్యాంక్ వస్తుందన్నారు. సాంకేతిక సమస్యలు ఎదురైతే వెంటనే పైఅధికారులకు తెలియజేసి పరిష్కరించుకోవాలన్నారు. ఉత్తమ పనితీరు చూపిన సిబ్బందిని అభినందించారు. ప్రతినెలా పనితీరు ఆధారంగా రివార్డులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, డీసీఆర్బీ, పీసీఆర్, ఎస్బీ ఇన్స్పెక్టర్లు ఎన్.రామారావు, భక్తవత్సలరెడ్డి, బి.శ్రీనివాసరెడ్డి, స్టేషన్ రైటర్లు, సీసీటీఎన్ఎస్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య నెల్లూరు(క్రైమ్): కుటుంబ కలహాలో?, ఆర్థిక ఇబ్బందులో?, అనారోగ్యమో మరే ఇతర కారణమో తెలియదు గానీ గుర్తుతెలియని వ్యక్తి గూడ్సు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నెల్లూరు కొండాయపాళెం గేటు సమీపంలో చైన్నె వైపు వెళ్లే పట్టాలపై శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతుడు 5.4 అడుగుల ఎత్తు ఉన్నాడు. వయస్సు సుమారు 30 నుంచి 35 ఏళ్లలోపు ఉండొచ్చని భావిస్తున్నారు. పింక్ రంగు ఫుల్ హ్యాండ్స్ చొక్కా, పాచి రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు.రైల్లోంచి పడి.. ● గుర్తుతెలియని వ్యక్తి మృతి కొడవలూరు: రైల్లోంచి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన కొడవలూరు – పడుగుపాడు రైల్వేస్టేషన్ల మధ్య 179 కి.మీ వద్ద శుక్రవారం జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. మూడో రైల్వే ట్రాక్ పక్కన పడమర వైపు మృతదేహం ఉంది. శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా రైల్లోంచి పడి చనిపోయి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారించినట్లు రైల్వే ఎస్సై కె.వెంకట్రావు తెలిపారు. వయస్సు 40 – 45 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. బ్లూ కలర్ కట్ బనియన్, బ్లూ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు 92475 75630 ఫోన్ నంబర్కు తెలియజేయాలని రైల్వే ఎస్సై కోరారు. కల్యాణం.. కమనీయం రాపూరు: పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి కల్యాణోత్సవం రమణీయంగా జరిగింది. వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం 9:50 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషాలంకరణ చేసి, పల్లకిలో కొలువుదీర్చి కల్యాణ మండపానికి వేంచేపు చేశారు. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. అనంతరం పుష్పయాగం చేశారు. కాగా ఈ ముహూర్తానికి పలు నూతన జంటలు కోనలో ఒక్కటయ్యాయి. ● బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి స్వామి ఉభయనాంచారులతో రఽథంపై కొలువుదీరి, కోన తిరువీధుల్లో ఊరేగారు. అలాగే స్వామి గజ వాహనంపై కోన మాడవీధుల్లో విహరించారు. ఏకాంతసేవ నిర్వహించారు. ● శనివారం ఉదయం 7 గంటలకు వసంతోత్సవం, 9 గంటలకు చక్రస్నానం, స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు తెప్పోత్సవం, 9 గంటలకు అశ్వ వాహనసేవ, 11 గంటలకు ధ్వజావరోహణం జరుగుతాయి. -
వాటర్ ప్లాంట్ ఆధీనంపై హైకోర్టు స్టే
● ప్రైవేట్ స్థలంలో నిర్మాణం ● దళితులకు గుక్కెడు నీళ్లిచ్చేందుకు రాజకీయాలుముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని తాళ్లపూడిలో దళితులకు మంచినీటిని అందజేసేందుకు వీపీఆర్ నిర్మించిన ఆర్ఓ ప్లాంట్ చుట్టూ రాజకీయాలు రాజుకున్నాయి. అధికారమే అండగా ప్లాంట్ ప్రభుత్వ స్థలంలో ఉందని, అందువల్ల పంచాయతీ నిర్వహిస్తుందని ఏప్రిల్ 24వ తేదీన తీర్మానం చేశారు. అయితే ప్రభుత్వ స్థలంలో లేదని తమ స్థలంలో ఉందని మెట్టా కుటుంబీకులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో తీర్మానంపై కోర్టు స్టే విధించింది. ప్లాంట్ ప్రభుత్వ స్థలంలో నిర్మించినట్టు తహసీల్దార్ నిర్ధారించారని పంచాయతీ సెక్రటరీ తీర్మానంలో సూచించారు. కాగా గ్రామ ఎస్సీలు ఈ ప్లాంట్పై ఆధారపడ్డారు. వారికి న్యాయం జరగదనే ఉద్ధేశంతో కోర్టును ఆశ్రయించారు. దీంతో ప్లాంట్పై పెత్తనం చెలాయించి దళితులకు మంచినీటిని ఎగ్గొట్టే పన్నాగానికి బ్రేక్ పడినట్టు అయ్యింది. ఇటీవల ఎమ్మెల్యే సోమిరెడ్డి తాళ్లపూడి గ్రామానికి విచ్చేసిన సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు కొందరు ఎస్సీ కాలనీకి చెందిన వారు టీడీపీకి ఓటేయలేదని చెప్పడంతో ప్లాంట్కు ఉన్న విద్యుత్ కనెక్షన్ను తొలగించారు. దీంతో ప్రజలు నీటి కోసం తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిణామంపై రాజకీయాలు సృష్టించి వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో తప్పులు చేసినట్టుగా ఆరోపించారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు వాస్తవాలను వెల్లడించి వారి ఆరోపణలను తిప్పికొట్టారు. -
మెప్మా పీడీగా కిరణ్కుమార్
నెల్లూరు(బారకాసు): నెల్లూరు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఎం కిరణ్కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నగరంలోని మెప్మా కార్యాలయంలో శుక్రవారం ఆయన పీడీగా బాధ్యతలు స్వీకరించారు. ఈయన కడప మెప్మా పీడీగా పనిచేస్తూ బదిలీపై నెల్లూరు మెప్మా పీడీగా నియమితులయ్యారు. కడప మెప్మా ఇన్చార్జి పీడీగా కూడా కొనసాగనున్నారు. ఇప్పటి వరకు నెల్లూరు మెప్మా పీడీ, ఇన్చార్జి డీఎస్ఓగా విధులు నిర్వర్తిస్తున్న లీలారాణి రిలీవ్ అయ్యారు. ఈమెకు ప్రస్తుతం ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. 13న జెడ్పీ స్థాయీ సంఘాల సమావేశాలు నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలను ఈ నెల 13న నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ శ్రీధర్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన ఏడు స్థాయీ సంఘాల సమావేశాలు జరుగుతాయని చెప్పారు. జెడ్పీ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు జరిగే సమావేశాలకు జెడ్పీ సభ్యులు, ఆయా శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలని కోరారు. డీసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు నెల్లూరు (టౌన్): డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ప్రవేశం కోసం నిర్వహించే డీసెట్ దరఖాస్తు గడువును ఈ నెల 5వ తేదీ వరకు పొడిగించినట్లుగా జిల్లా విద్యాశాఖాధికారి ఆర్ బాలాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో మరికొన్ని డీఎల్ఈడీ కళాశాలలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉందన్నారు. అందువల్ల డీసెట్కు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గడువును పొడిగించినట్లుగా తెలిపారు. పూర్తి వివరాల కోసం https://cse.ap.gov.in,https://apdee.cet.apcfss.in వెబ్సైట్లను సంప్రదించాలని సూచించారు. నేత్రపర్వంగా ప్రసన్న విశ్వేశ్వరుని కల్యాణం ఇందుకూరుపేట: మండలంలోని మైపాడులోని అన్నపూర్ణాంబ సమేత ప్రసన్న విశ్వేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు బండారు ప్రభాకర్శర్మ ఆధ్వర్యంలో ఆదిదంపతుల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి వేద మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ కల్యాణాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి కల్యాణోత్సవాన్ని తిలకించి తన్మయం చెందారు. అనంతరం గజ వాహనంపై ఆదిదంపతులను కొలువుదీర్చి గ్రామోత్సవం జరిపారు. కల్యాణోత్సవానికి ఉభయకర్తలుగా గంపల రామసుబ్బయ్య జ్ఞాపకార్థంగా కుటుంబసభ్యులు వ్యవహరించారు. 91.32 శాతం మందికి పింఛన్ల పంపిణీ నెల్లూరు(పొగతోట): సామాజిక పింఛన్ల నగదు పంపిణీ ప్రక్రియ జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ప్రారంభమైంది. జిల్లాలో మొత్తం 2,88,093 మంది లబ్ధిదారులు ఉండగా, తొలిరోజు 2,63,087 మందికి సచివాలయ సిబ్బంది పింఛన్లు అందజేశారు. డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి బుచ్చిరెడ్డిపాళెం మండలంలో పర్యటించి పింఛన్ లబ్ధిదారులకు నగదు అందజేసి పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు. -
సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్ర వెలకట్టలేనిది
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ● వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా మేడే వేడుకలునెల్లూరురూరల్: సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జయకుమార్రెడ్డి ఆధ్వర్యంలో మేడే వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, రూరల్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఆనం విజయ్కుమార్రెడ్డి, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మీసునంద, ట్రేడ్ యూనియన్ నాయకులతో కలిసి కాకాణి వేడుకల్లో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరించి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ను కట్ చేసి ట్రేడ్ యూనియన్ నాయకులు, కార్మికులకు తినిపించారు. మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ మేడేను పురస్కరించుకుని వైఎస్సార్సీపీ తరపున జిల్లా ప్రజలకు, కార్మిక లోకానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మికుల హక్కుల సాధన కోసం వైఎస్సార్సీపీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. కూటమి ప్రభుత్వం కార్మికులను వంచిస్తోందన్నారు. పారిశుధ్య కార్మికుల పట్ల సమాజం సానుకూల దృక్పథంతో ఉండాలన్నారు. సమాజ ప్రగతికి, అభివృద్ధికి కార్మికులు చిందిస్తున్న స్వేదం, వారి త్యాగాలు ఎంతో విలువైనవన్నారు. రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కార్మికులకు అండగా నిలిచిందన్నారు. ప్రస్తుత కూటమి పాలనలో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.కూటమి ప్రభుత్వంలో కార్మికులకు సరైన గుర్తింపు, మద్దతు కరువైందన్నారు. జగనన్న ప్రభుత్వ హయాంలో కార్మికులకు అన్ని విధాలా మంచి జరిగిందన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయితేనే కార్మిక లోకానికి, ట్రేడ్ యూనియన్కు మళ్లీ మంచిరోజులు వస్తాయన్నారు. రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్కుమార్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మే డేను జరపడం ఆనందదాయకమన్నారు. జగన్మోహన్రెడ్డి కార్మికులను ఎన్నడూ మరవరని తెలిపారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేస్తున్న కాకాణి గోవర్ధన్రెడ్డి, ఆనం విజయకుమార్రెడ్డి, ట్రేడ్ యూనియన్ నాయకులు కార్మికులకు దుస్తులు పంపిణీ చేస్తున్న కాకాణి పూజిత ఆటో నడుపుతున్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి నెల్లూరురూరల్: కార్మిక లోకానికి వైఎస్సార్సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ, నగర వైఎస్సార్సీపీ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. నగరంలోని వీఆర్సీ సెంటర్లో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటో కార్మిక సంఘ నాయకులు మేడేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాల్గొని కార్మిక సంఘాల నేతలతో కలిసి సరదాగా ఆటో నడిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిందని ఆయన గుర్తుచేశారు. -
క్రీడా శాఖపై నిర్లక్ష్య నీడలు
నెల్లూరు(టౌన్): జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వివిధ రకాల కోర్టులున్నాయి. ప్రధానంగా వాలీబాల్, ఖోఖో, బాస్కెట్బాల్, ఫుట్బాల్, క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్, కబడ్డీ, వెయిట్ లిఫ్టింగ్, సాఫ్ట్బాల్ తదితర వాటిల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం అథ్లెటిక్స్కు ఇద్దరు, బ్యాట్మింటన్కు ఒకరు, ఫుట్బాల్కు ఇద్దరు, స్విమ్మింగ్కు ఒకరు, వెయిట్ లిఫ్టింగ్కు ఒకరు మాత్రమే కోచ్లున్నారు. వాలీబాల్, బాస్కెట్బాట్, ఖోఖో, హాకీ, క్రికెట్, సాఫ్ట్బాల్, కబడ్డీ తదితర వాటికి లేరు. కోచ్లను కూడా శాప్ ఆధ్వర్యంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన రిక్రూట్ చేస్తున్నారు. అయితే ప్రధాన క్రీడలకు కోచ్లు లేకపోవడంతో క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. ఖోఖోకు సంబంధించి విశ్రాంత డీఎస్డీఓ యతిరాజ్ శాప్ అనుమతితో శిక్షణ ఇస్తున్నారు. క్రీడాకారులు వచ్చి ఎవరికి వారే ఆడుకుని వెళ్తున్న పరిస్థితి వచ్చింది. దూరంగా.. గతంలో జిల్లాలో స్టేట్, నేషనల్ స్పోర్ట్స్ మీట్లు విరివిగా నిర్వహించేవారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంతమేర నిధులను విడుదల చేయగా, దాతల నుంచి సేకరించి పోటీలు నిర్వహించేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల కాలంలో జిల్లాలో ఎప్పుడూ స్టేట్, నేషనల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించిన పరిస్థితి లేదు. క్రీడా పరికరాలు కూడా సరిపడా లేవు. మైనర్ ఖర్చులకు కూడా శాప్ నుంచే నిధులు రావాల్సి ఉంటుంది. సరిపడా కోచ్లు, పరికరాలు లేకపోవడంతో స్టేడియానికి క్రీడాకారుల రాక తగ్గిపోయింది. మైదానాన్ని చదును చేయాలన్నా దాతలపై ఆధారపడాల్సి వస్తోంది. గతంలో చిన్నచిన్న పనులకు కలెక్టర్ నిధులు మంజూరు చేసే వారు. ఇప్పుడు అలా లేదు. ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్ శిలాఫలకాలకే పరిమితం2012వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 10 గ్రీన్ఫీల్డ్ స్టేడియాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకు అనుగుణంగా స్టేడియాల ఏర్పాటుకు శంకుస్థాపనలు చేశారు. ఒక్కొక్కటి నిర్మాణానికి రూ.2.10 కోట్లు నిధులు మంజూరు చేశారు. స్టేడియం ఏర్పాటుకు భూమిని సేకరించారు. అయితే ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. 2016లో క్రీడా వికాస కేంద్రాలను ఉదయగిరి, ఆత్మకూరు, కోవూరు (విడవలూరు), కావలి, గూడూరు (కోట) ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఒక్కో దానికి రూ.2 కోట్లు కేటాయించారు. అయితే ఎక్కడా నిర్మాణాలను పూర్తి చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లయినా ఆ ఊసే లేదు. ఆత్మకూరు, కోవూరు ప్రాంతాల్లో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించినట్లు చెబుతున్నారు. క్రీడా అకాడమీని మొదలుపెట్టాలని ప్రాధికార సంస్థ అధికారులు 2025లో ప్రతిపాదనలు పంపించినట్లు తెలిసింది. దీనిపై అడుగు ముందుకు పడలేదు. రెండేళ్లుగా నిధులు విడుదల చేయని ప్రభుత్వం ఏసీ స్టేడియంలో కోచ్ల కొరత అరకొరగానే స్పోర్ట్స్ మెటీరియల్ స్టేట్, జాతీయ స్పోర్ట్స్ మీట్లకు దూరం గత ప్రభుత్వ హయాంలో జోరుగా ఆడుదాం ఆంధ్రాఒకప్పుడు నిత్యం క్రీడాకారులతో కళకళలాడిన జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కూటమి ప్రభుత్వంలో కళ విహీనంగా మారింది. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో సరిపడా కోచ్లు లేరు. గతంలో నిత్యం రాష్ట్ర, జాతీయ స్పోర్ట్స్ మీట్లు జరిగేవి. పలు క్రీడల్లో శిక్షణ తీసుకునేందుకు క్రీడాకారులు పోటీ పడేవారు. వైఎస్సార్సీపీ హయాంలో ఆడుదాం ఆంధ్రా పేరుతో పోటీలు జరిపి ప్రోత్సహించారు. రెండేళ్లుగా క్రీడలు కనుమరుగయ్యాయి.అక్టోబర్లో రాష్ట్ర స్థాయి పోటీలు రాష్ట్ర స్థాయి బీచ్ ఫుట్బాల్ పోటీలు ఈ ఏడాది అక్టోబర్లో నిర్వహించనున్నారు. క్రీడా అకాడమీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం. దీనిపై శాప్ అధికారులు విజిట్ చేశారు. ప్రస్తుతం క్రీడా మెటీరియల్ ఉంది. కోచ్లను నియమించాలని ప్రతిపాదనలు పంపాం. ఈ విషయంశాప్ పరిశీలనలో ఉంది. ఈనెలాఖరు వరకు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. జిల్లా కేంద్రం, మున్సిపాలిటీలు, మండల కేంద్రాల్లో దాదాపు 60 క్యాంపులు ఉంటాయి. సమ్మర్ క్యాంపులకు మెటీరియల్ కోసం నెల క్రితం ఇండెంట్ పంపించాం. శాప్ నుంచి నిధులు కేటాయించనున్నారు. – ఎస్కే జసీమ్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి -
చికెన్ వ్యర్థాల వాహనం స్వాధీనం
సోమశిల: మండల కేంద్రమైన అనంతసాగరం మీదుగా గురువారం అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న చికెన్ వ్యర్థాల వాహనాన్ని పోలీసులు స్వా ధీనం చేసుకున్నారు. వారి కథనం మేరకు.. మినీలారీలో బెంగళూరు నుంచి మండల పరిధిలోని రేవూరు గ్రామానికి వ్యర్థాలను తరలిస్తున్నారు. పోలీసులు తనిఖీలు చేస్తూ ఈ వాహనాన్ని స్వాధీనం చేసుకుని స్థానిక స్టేషన్కు సమీపంలోని ఏఎంసీ యార్డు ప్రాంగణానికి తరలించారు. దీంతో స్థానికులు దుర్వాసన భరించలేకున్నా రు. అనారోగ్యం బారిన పడేలా ఉన్నామని స్టేషన్కు వెళ్లి చెప్పినా శుక్రవారం సాయంత్రం వరకు వాహనాన్ని అక్కడ్నుంచి తొలగించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కండలేరులో 43.540 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 43.540 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 400, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నాయని, వాటిని తిప్పి కొట్టేందుకు కార్మిక సంఘాలు ఉద్యమాలను ఉద్ధృతం చేయాలని సీపీఎం జిల్లా, నగర కార్యర్శులు మూలం రమేష్, కత్తి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో నగర, రూరల్ సీపీఎం కమిటీలు, సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు. ఏబీఎం కాంపౌండ్ నుంచి ఆర్టీసీ డిపో వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు ప్రాణాలను ఫణంగా పెట్టి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్స్ను తీసుకొచ్చిందన్నారు. కార్మికులను బానిసలుగా మార్చే నూతన లేబర్కోడ్స్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ కార్మికుల పొట్టకొడుతున్నాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకుని ప్రజలు, కార్మికుల పక్షాన నిలబడాలని, లేని పక్షంలో వారే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సీపీఎం, సీఐటీయూ నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, మోహన్రావు, మస్తాన్బీ, కొండాప్రసాద్, నాగేశ్వరరావు, చండ్రా రాజగోపాల్, అరిగెల రమమ్మ, షాహీనాబేగం, సుధాకర్, పెంచల నరసయ్య ,సతీష్, శ్రీనివాసులరెడ్డి, నజీర్, ఉడతా ప్రసాద్, నరసింహ, తదితరులు పాల్గొన్నారు. -
భారీగా వసూళ్లు
బాలికా విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమనే మహోన్నత ఆశయంతో దివంగత పొణకా కనకమ్మ అడుగులేశారు. ఆమె చొరవ పుణ్యమానని నగరంలో పొణకా కనకమ్మ కస్తూరిదేవి విద్యాలయ కమిటీ పేరిట స్కూల్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ పేద పిల్లలకు ఉచితంగా విద్యను బోధిస్తూ ఎంతో మందికి ఆసరాగా నిలిచారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ఈ ప్రాంగణంలో గత విద్యా సంవత్సరంలో జీవీకే సీబీఎస్ఈ స్కూల్ను ఏర్పాటు చేసి.. బాలికలకు మాత్రమే ప్రవేశమని ప్రకటించారు. అయితే దీనికి విరుద్ధంగా కమిటీ మెంబర్లు వ్యవహరిస్తున్నారు. భారీ మొత్తంలో ఫీజులను వసూలు చేయనుండటమే కాకుండా రానున్న అకడమిక్ ఇయర్ నుంచి కో ఎడ్యుకేషన్కు సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేయడం విస్మయానికి గురిచేస్తోంది. కస్తూరిదేవి విద్యాలయ ఆస్తులను పరిరక్షించాలి. బాలికలకు ఉచిత విద్య కోసం నెలకొల్పిన దీని ప్రాంగణంలో కార్పొరేట్ స్కూల్ను ఏర్పాటు చేయడం దుర్మార్గం. పొణకా కనకమ్మ ఆశయ సాధనకు అనుగుణంగా బాలికలకు ఉచిత విద్యనందించాలి. జీవీకే స్కూల్కు అనుమతులిచ్చిన జిల్లా, రాష్ట్ర విద్యాశాఖ అధికారులపై చర్యలు చేపట్టాలి. – సురేంద్రనాథ్రెడ్డి, కన్వీనర్, పొణకా కనకమ్మ ఆశయసాధన సమితి నెల్లూరు(టౌన్): ధనదాహంతో జీవీకే వ్యవహరిస్తూ.. పొణకా కనకమ్మ ఆశయానికి తూట్లు పొడుస్తోంది. బాలికలకు ఉచిత విద్యను అందించాలనే లక్ష్యానికి మంగళం పాడుతోంది. విద్యార్థుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. గర్ల్స్కు ఫ్రీ ఎడ్యుకేషన్ను అందించేందుకు గానూ ఏర్పాటు చేసిన కస్తూరిదేవి విద్యాలయ కమిటీ ప్రాంగణంలో కార్పొరేట్ స్కూల్ను ఏర్పాటు చేయడంపై నెల్లూరు ప్రజలు మండిపడుతున్నారు. ఈ ఆస్తుల పరిరక్షణ కోసం గతంలో ఉద్యమం చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి.. ఈ పరిణామాలపై ప్రస్తుతం మౌనంగా ఉండడం చర్చకు దారితీస్తోంది. 103 ఏళ్ల క్రితమే.. బాలికలకు ఉచిత విద్యను అందించాలనే లక్ష్యంతో తోటపల్లిగూడూరు మండలం పోట్లపూడికి చెందిన పొణకా కనకమ్మ.. 1923లో పొగతోటలో 2.4 ఎకరాల్లో కస్తూరిదేవి విద్యాలయ కమిటీ పేరిట స్కూల్ను ఏర్పాటు చేశారు. అనంతరం సదరు స్థలంతో పాటు మరో రూ.20 వేలను రేబాల కుటుంబానికిచ్చి, దర్గామిట్టలో 21.81 ఎకరాలను కస్తూరిదేవి విద్యాలయ కమిటీకి బదలాయించారు. అప్పట్లో బెజవాడ గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించారు. ఆయన మరణానంతరం కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించిన జక్కా వెంకటరామిరెడ్డి 1998లో జీవీకే రెడ్డిని కమిటీలోకి తీసుకొచ్చారని తెలుస్తోంది. కాలక్రమంలో కమిటీకి అధ్యక్షుడైన ఆయన.. దొడ్ల శేషారెడ్డిని సెక్రటరీ, కరస్పాండెంట్గా నియమించారు. రెండేళ్ల క్రితం జీవీకే స్కూల్ ఏర్పాటు కస్తూరిదేవి విద్యాలయ కమిటీ ప్రాంగణంలోని నాలుగెకరాల్లో 2025 – 26 విద్యా సంవత్సరంలో జీవీకే ఇంటర్నేషనల్ సీబీఎస్ఈ స్కూల్ను ఏర్పాటు చేశారు. నర్సరీ, పీపీ – 1, 2తో పాటు ఒకటి నుంచి ఏడో తరగతి వరకు అనుమతి పొందారు. ఆపై పదో తరగతి వరకు పర్మిషన్ తెచ్చుకున్నారని జిల్లా విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. గత విద్యా సంవత్సరంలో బాలికలకే అడ్మిషన్లు ఇచ్చారు. అయితే రానున్న అకడమిక్ ఇయర్ నుంచి కో ఎడ్యుకేషన్ కింద నిర్వహించనున్నామంటూ నోటిఫికేషన్ను జారీ చేశారు. దీనికి గానూ జిల్లా విద్యాశాఖకు ఐదు నెలల క్రితమే దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తోంది. డాక్యుమెంటేషన్ మేరకే అనుమతులు జీవీకే స్కూల్ను ఎంఈఓ తనిఖీ చేశారు. పాఠశాలను ఏర్పాటు చేసేందుకు మేనేజ్మెంట్ కమిటీ రెజల్యూషన్ చేసింది. అన్ని పత్రాలను అధికారులకు పంపాం. కో ఎడ్యుకేషన్కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. – బాలాజీరావు, డీఈఓ విద్యాలయ ఆస్తులను పరిరక్షించాలి బాలికల ఉచిత విద్యకు మంగళం రూ.లక్షల్లో వసూళ్లు పొణకా కనకమ్మ ఆశయానికి తూట్లు ఏడాది క్రితం నాలుగెకరాల్లో జీవీకే గర్ల్స్ సీబీఎస్ఈ స్కూల్ ఏర్పాటు ఈ విద్యా సంవత్సరం నుంచి కో ఎడ్యుకేషన్కు నోటిఫికేషన్ మౌనవ్రతం దాల్చిన రూరల్ ఎమ్మెల్యే బాలికలకు ఉచిత విద్యను అందించాల్సిన కమిటీ సభ్యులు దానికి విరుద్ధంగా ఫీజుల వసూళ్ల పర్వానికి తెరలేపారు. రూ.62 వేల నుంచి రూ.లక్ష వరకు గుంజుతున్నారని తెలుస్తోంది. రానున్న రోజుల్లో దీన్ని పెంచే అవకాశముందని సమాచారం. మరోవైపు ఈ పరిణామాలపై జిల్లాలోని పలువురు ప్రముఖులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. అందరూ కలిసి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానిస్తు న్నారు. ఇంత జరుగుతున్నా, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి మౌనవ్రతం దాల్చడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఆయన ఉద్యమించిన అంశాన్ని గుర్తుచేస్తున్నారు. జీవీకే స్కూల్లో వసూలు చేస్తున్న ఫీజులకు వ్యతిరేకంగా.. పేద పిల్లలు చదువుకునేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
నిమ్మ ధరలు పతనం
పొదలకూరు: నిమ్మ ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి ఎగుమతులు పెరగడంతోపాటు రైతులు నాణ్యమైన కాయలను మార్కెట్కు తీసుకురాకపోవడం కారణాలుగా వ్యాపారులు వెల్లడిస్తున్నారు. కిలో రూ.175 నుంచి రూ.145 పడిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో ధరలు కిలో రూ.70 నుంచి రూ.145 వరకూ పలుకుతోంది. ఈ ఏడాది కాయల ధరలు బాగా పెరిగింది. బస్తా టాప్ ధర రూ.15 వేలకు వెళ్లింది. రెండు రోజుల క్రితం వరకు బస్తా రూ.10 వేల నుంచి రూ.13 వేల వరకు అమ్ముడైంది. అయితే ఒక్కసారిగా ధరలు పతనం కావడంతో రైతులు ఢీలా పడ్డారు. ధరలు బాగా పెరిగినప్పుడు పిందెలను కూడా కోయించి మార్కెట్కు తరలించేవారు. అయితే గురువారం పరిస్థితి మారిపోవడంతో రైతులు ఉసురూమంటూ తక్కువ ధరకే కాయలను అమ్ముకోవాల్సి వచ్చింది. గడ్డుకాలమే.. రానున్న రోజుల్లో నిమ్మ ధరలకు గడ్డుకాలమే ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ఏపీలో ఏలూరు, తెనాలి తదితర పెద్ద మార్కెట్లు, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఎగుమతులు చేస్తుండటంతో ఇక్కడి కాయలకు డిమాండ్ తగ్గుతుంది. దీంతో ధరలు సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా ధరలు పతనం కావడంతో రైతులు సైతం కాయలను వేలంవెర్రిగా మార్కెట్కు తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. పిందెలను కోయడం తగ్గిస్తారనే అభిప్రాయం నెలకొంది. ఢిల్లీ మార్కెట్కు ఇతర రాష్ట్రాల నుంచి ఎగుమతులు బాగా పెరుగుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. దీంతో ఇక్కడ డిమాండ్ తగ్గి ధరలు తగ్గిపోతాయంటున్నారు. అయితే ఈ ఏడాది ఆశించిన దానికంటే ఎక్కువగా ధరలు పలికాయి. ఒక్కసారిగా కిలో రూ.30 తగ్గిన వైనం ఇతర ప్రాంతాల నుంచి పెరిగిన ఎగుమతులు నాణ్యమైన కాయలు రావడం లేదంటున్న వ్యాపారులుఎగుమతులు పెరిగాయి బయటి రాష్ట్రాల నుంచి కాయల ఎగుమతులు పెరిగాయి. దీంతో ఇక్కడ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. భవిష్యత్లో సైతం ధరలు పెరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. నాణ్యత కలిగిన కాయలను రైతులు మార్కెట్కు తీసుకురావడం లేదు. ఫలితంగానే వారు ఆశించిన ధరలు గిట్టుబాటు కాలేదు. – ఎం.బాలకృష్ణారెడ్డి, నిమ్మ వ్యాపారి, పొదలకూరు యార్డు -
వ్యసనాలకు బానిసై దొంగతనాలు
● నిందితుడి అరెస్ట్ ● రూ.8 లక్షల విలువైన బంగారు ఆభరణాల స్వాధీనంనెల్లూరు(క్రైమ్): మహిళల బంగారు ఆభరణాలు అపహరిస్తున్న ఓ దొంగను పోలీసులు అరెస్ట్చేశారు. శుక్రవారం నెల్లూరు నగర ఏఎస్పీ దీక్ష తన కార్యాలయంలో సంతపేట ఇన్స్పెక్టర్ వైవీ సోమయ్యతో కలిసి నిందితుడి వివరాలను వెల్లడించారు. నెల్లూరులోని రెండు ప్రాంతాల్లో నిద్రిస్తున్న మహిళల మెడల్లోని బంగారు గొలుసులను గుర్తుతెలియని దుండగులు అపహరించారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇన్స్పెక్టర్ సోమయ్య పర్యవేక్షణలో ఎస్సై బాలకృష్ణ తన సిబ్బందితో కలిసి పాతనేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెంచారు. శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయం సమీపంలో కోటమిట్ట మెక్లిన్స్రోడ్డు ప్రాంతానికి చెందిన పాతనేరస్తుడు సయ్యద్ అతిక్ అర్బాస్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. చోరీలిలా.. విచారణలో గతేడాది ఏప్రిల్లో రంగనాయకులపేట గొల్లవీధిలో ఇంటి తలుపు తెరిచి నిద్రిస్తున్న సునందమ్మ మెడలోని రెండు సవర్ల బంగారు ఆభరణాలు, మే నెలలో సంతపేట కొండూరువారి వీధిలో ఇంటి మేడపై నిద్రపోతున్న ఇందిరా మెడలోని రెండు సవర్ల బంగారు గొలుసు, ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీన మహిళా ప్రాంగణం సమీపాన రామచంద్రారెడ్డినగర్లో ఇంటి తలుపులు తెరిచి నిద్రిస్తున్న యశోద మెడలో 18 గ్రాముల బంగారు సరుడు, 26వ తేదీన మెక్లిన్స్ రోడ్డులో ఇంటి తలుపులు తెరిచి నిద్రిస్తున్న తురక వెంకటరమణమ్మ మెడలోని ఆరుగ్రాముల తాళిబొట్టు, గుండ్లు, కాసులను అపహరించినట్లు బయటపడింది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రూ.8 లక్షల విలువైన 56 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ తెలిపారు. నిందితుడిపై కోవూరు, నవాబుపేట పోలీస్స్టేషన్లలో కేసులున్నాయని చెప్పారు. సులభ మార్గంలో.. నిందితుడు గతంలో బంగారు పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. చెడువ్యసనాలకు, జల్సాలకు అలవాటుపడి సులభ మార్గంలో డబ్బు సంపాదించేందుకు దొంగగా మారాడని ఏఎస్పీ తెలిపారు. రాత్రివేళల్లో తిరుగుతూ తలుపులు తెరిచి, మిద్దెలపై నిద్రిస్తున్న మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలు అపహరించి వాటిని కరిగించి కడ్డీలుగా మార్చి అమ్మి సొమ్ము చేసుకునేవాడని వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన ఇన్స్పెక్టర్, ఎస్సైలు బాలకృష్ణ, అనిల్రెడ్డి, సిబ్బందిని దీక్ష అభినందించారు. -
పెద్దచెరువును కొల్లగొడుతున్నారు
కావలి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. టీడీపీ నాయకుల అండదండలతో కావలి పెద్దచెరువును కొల్లగొడుతున్నారు. అక్రమంగా గ్రావెల తవ్వకాలు చేపడుతూ పెద్దఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయినా అధికారులు ఇంత వరకు ఒక్క వాహనం పట్టుకుని జరిమానా విధించిన దాఖలాలు లేవు. కూటమి నాయకులు, కార్యకర్తలే సూత్రధారులుగా ఉండడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా కావలి నియోజకవర్గంలో 130 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి వందల కోట్ల రూపాయలను గడించారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కొన్నిరోజులుగా విజిలెన్స్ విచారణ చేపడుతున్నారు. ఈ విచారణ సాగుతుండగానే మరోవైపు దర్జాగా ప్రభుత్వ భూమిని ఆక్రమించి లేఅవుట్లు వేస్తున్నారు. ఈ లేఅవుట్లకు కావలి పెద్దచెరువు నుంచి యంత్రాల సాయంతో రేయింబవళ్లు అక్రమంగా గ్రావెల్ను తరలిస్తున్నారు. గత రెండు,మూడు రోజులుగా కావలి పెద్దచెరువు నుంచి వందల టిప్పర్ల గ్రావెల్ను తరలిస్తున్నా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు కన్నెత్తి చూడలేదు. రెండో పట్టణ పోలీస్స్టేషన్ మీదుగానే నిత్యం తరలివెళ్తున్నా కనీసం పోలీసులు అధికారులు కూడా అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కావలి పెద్దచెరువులో గ్రావెల్ అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని ప్రజలు కోరుతున్నారు. దేవదాయ శాఖ భూముల్లో అక్రమ తవ్వకాలు వెంకటాచలం: సర్వేపల్లి నియోజకవర్గ కేంద్రమైన వెంకటాచలం పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మకాలనీ సమీపంలోని దేవదాయశాఖకు చెందిన సీతమ్మ సత్రం భూముల్లో కొందరు అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నారు. సర్వేపల్లి ముఖ్యనేత అండదండలతో గత కొన్ని రోజులుగా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తూ టిప్పర్ల ద్వారా రైల్వే పనులకు తరలిస్తున్నారు.గ్రావెల్ తవ్వకాలతో ఇందిరమ్మకాలనీ సమీపంలో భారీ గుంతలు ఏర్పడుతున్నాయని స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా నిర్వాహకులు లెక్క చేయడం లేదు. గ్రావెల్ గుంతల్లో చిన్నారులు, గేదెలు పడి చనిపోయే ప్రమాదం ఉందని స్థానికులు మొరపెట్టుకుంటున్నా వినిపించుకోవడం లేదు. సామాన్యులు ఇళ్ల నిర్మాణాలకు ట్రక్కు గ్రావెల్ను తరలించే ప్రయత్నాలు చేసినా వెంటనే అధికారులు వాలిపోయి అడ్డుకుంటున్నారు. కానీ టిప్పర్లతో నిరంతరం గ్రావెల్ను అక్రమ రవాణా చేసే వారి జోలికి వెళ్లకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని గ్రావెల్ అక్రమ తవ్వకాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఏసీబీ వలలో లైన్మెన్
మనుబోలు: ఓ వ్యక్తి నుంచి రూ.లక్ష లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ లైన్మెన్ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన మండలంలోని కట్టువపల్లి సబ్స్టేషన్ వద్ద గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని కొలనకుదురులో ఎలిమేటి రామసుబ్బమ్మకు చెందిన రొయ్యల గుంతలను నెల్లూరుకు చెందిన షుకూర్ అహ్మద్ ఇటీవల కొనుగోలు చేశారు. విద్యుత్ కనెక్షన్ను తన భార్య నజీమా పేరుపై మార్చుకోవాలనుకున్నారు. దీనికి గానూ ఆన్లైన్లో ఏప్రిల్ 16న దరఖాస్తు చేసుకున్నారు. ఆపై కట్టువపల్లి సబ్స్టేషన్ లైన్మెన్ మల్లె రమేష్ను సంప్రదించగా, రూ.1.5 లక్షల లంచమిస్తే పైఅధికారులతో మాట్లాడి సర్వీస్ను మార్పు చేయిస్తానని చెప్పి, అదే రోజు రూ.50 వేలను షుకూర్ అహ్మద్ నుంచి తీసుకున్నారు. మరుసటి రోజున మిగిలిన మొత్తాన్ని ఇవ్వాలని సూచించారు. అయితే ఇవ్వలేకపోవడంతో దరఖాస్తును రిజెక్ట్ చేయించారు. దీనిపై షుకూర్ అహ్మద్ ప్రశ్నించగా, మిగిలిన రూ.లక్షను చెల్లిస్తేనే సర్వీస్ను మార్పు చేయిస్తానని రమేష్ చెప్పారు. తన వద్ద అంత డబ్బు లేదని, త్వరలోనే ఇస్తానని చెప్పి విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్లాన్ ప్రకారం రూ.లక్షను గురువారం ఇస్తానని చెప్పిన అహ్మద్.. ఏసీబీ అధికారులను అలర్ట్ చేశారు. కట్టువపల్లిలో రూ.లక్షను అహ్మద్ నుంచి రమేష్ తీసుకుంటుండగా, ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకొని నగదును స్వాధీనం చేసుకున్నారు. రమేష్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు, ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సిటీలో నయా జోష్
● కూటమి ప్రభుత్వంపై విసిగిపోయిన టీడీపీ కార్యకర్తలు ● వైఎస్సార్సీపీలో పెరిగిన చేరికలు నెల్లూరురూరల్: నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలో కొత్త జోష్ నెలకొంది. ఈ రెండు సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా పెరిగింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి నేతృత్వంలో కొత్త జోష్ నెలకొంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిటీలో టీడీపీ నేతల అవినీతి, అక్రమాలకు అంతే లేకుండా పోయింది. రోడ్ల మరమ్మతులు, మొక్కల పెంపకం తదితర వాటి పేరుతో ప్రజా సొమ్మును నేతలు స్వాహా చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను పర్వతరెడ్డి ఎండగడుతూ అవినీతి, అక్రమాలపై గళమెత్తుతున్నారు. డివిజన్లలో ఆయన పర్యటిస్తూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు. వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకునేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత రావడం, వైఎస్సార్సీపీపై నమ్మకం పెరగడంతో ఇతర పార్టీల నుంచి అనేక మంది వచ్చి పర్వతరెడ్డి సమక్షంలో కండువా కప్పుకొంటున్నారు. విస్తృతంగా.. వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ వంటి అనుబంధ సంఘాలతో సమన్వయం పెంచుతూ ఉపాధ్యాయులు, మేధావులను పార్టీ వైపు ఆకర్షించే యత్నం చేస్తున్నారు. సమావేశాలు, చర్చావేదికల ద్వారా పార్టీ సిద్ధాంతాలను చంద్రశేఖర్రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై ఆయన మండలిలో, బయట ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రజల సమస్యల కోసం ఎంత దూరమైనా వెళ్తారనే నమ్మకం కార్యకర్తల్లో బలపడుతోంది. ఇటీవల టీడీపీకి చెందిన అనేక మంది వైఎస్సార్సీపీలో చేరడం కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను తెలియజేస్తోంది. -
డివిజన్లలో ఇదీ తీరు..
ఆత్మకూరు డివిజన్లో 89.45.. కావలి డివిజన్లో 87.98.. నెల్లూరు డివిజన్లో 87.37 శాతం ఉత్తీర్ణత నమోదైంది.ఎయిడెడ్, మున్సిపల్ యాజమాన్య పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం మిగిలిన వాటితో పోలిస్తే తగ్గింది. ఎయిడెడ్లో 70.47.. మున్సిపల్ పాఠశాలల్లో 71.69 శాతం నమోదైంది. మున్సిపల్ స్కూళ్లను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతామని చెప్తున్న మంత్రి నారాయణ ఈ విషయంలో ఏ సమాధానం చెప్తారో వేచిచూడాల్సి ఉంది. ఎయిడెడ్లో 500కుపైగా మార్కులు సాధించిన వారు 40.. ఏపీఎమ్మెస్లో 205.. ఏపీఆర్జేసీలో 91.. ఏపీఎస్డబ్ల్యూఆర్లో 148.. ఏపీటీడబ్ల్యూఆర్ఎస్లో 20 .. ప్రభుత్వ 87.. ప్రభుత్వ ఆశ్రమ్లో ఏడు.. కేజీబీవీలో 107, ఎంజేపీఏబీసీలో 28, మున్సిపల్లో 283, జెడ్పీలో 1593.. ప్రైవేట్లో 7581 మంది.. మొత్తం 10,190 మంది దక్కించుకున్నారు. తగ్గిందిలా.. మేనేజ్మెంట్ల వారీగా.. 500 మార్కులకుపైగా.. 145 పాఠశాలల్లో ఆల్ పాస్ జిల్లాలోని 145 పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత నమోదైంది. 116 ప్రైవేట్.. 24 జెడ్పీ.. మూడు కేబీబీవీ.. ప్రభుత్వ, ఏపీఎస్డబ్ల్యూఆర్ స్కూళ్లు ఒకటి చొప్పున సాధించాయి.రెండింట్లో సున్నా..! మాగుంట లేఅవుట్లోని శ్రీకృష్ణ విబ్గ్యోర్.. నార్తురాజుపాళెంలోని హయగ్రీవ విద్యానికేతన్ పాఠశాలల్లో ఒక్కరూ పాస్ కాలేదు. -
కార్మిక లోకం.. మీకు సలాం
ప్రతి చెమట చుక్కలో ఒక జీవితం దాగుతుంది. సూరీడు నిప్పులు కురిపిస్తున్నా.. వాన వెల్లువెత్తినా కుటుంబాలను పోషించడానికి కార్మికులు నిత్యం కష్టపడుతుంటారు. రోజువారీ వేతనాల కోసం బరువులు మోసేవారెందరో. నిశ్శబ్దంగా శ్రమిస్తూ సమాజాన్ని ముందుకు నడిపించే కార్మి కుల కృషిని గుర్తు చేసుకునే రోజే మేడే. వారి హక్కుల పరిరక్షణ కోసం ఎన్నో సంస్థలు, సంఘాలు పనిచేస్తున్నా.. కష్టానికి తగిన ప్రతిఫలం అందడం లేదు. వేతనాల కోసం ఎన్నో చట్టాలు వచ్చినా ప్రయోజనం శూన్యం. మేడేను ఏటా నిర్వహిస్తున్నా, న్యాయం జరగడం లేదు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
న్యాయమూర్తులకు వీడ్కోలు
నెల్లూరు (లీగల్): నెల్లూరు అదనపు జిల్లా కోర్టుల న్యాయమూర్తులు తేజోవతి, శ్రీనివాస్, సరస్వతి, సోమశేఖర్, సిరిపిరెడ్డి సుమ బదిలీ అయ్యారు. ఈ క్రమంలో వీరికి వీడ్కోలు సభను నెల్లూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కోర్టు ఆవరణలోని అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ హాజరై వారి సేవలను కొనియాడారు. అనంతరం సత్కరించారు. ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు సత్తు అంకయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పులిమి అయ్యప్పరెడ్డి, నాగరాజయాదవ్, ఉపాధ్యక్షుడు జల్లి పద్మాకర్ తదితరులు పాల్గొన్నారు. -
హైకోర్టు ఉత్తర్వులున్నా.. డోంట్కేర్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : అధికారాన్ని అడ్డం పెట్టుకుని సర్వేపల్లిలో టీడీపీ నేతల అరాచక దోపిడీ ‘నభూతో నభవిష్యతి’ అన్నట్లుగా సాగుతోంది. దీపం ఉండానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే రీతిలో ఎడాపెడా ప్రకృతిని చెరబట్టి ఖనిజాల సంపదను దోచుకుంటున్నారు. ఆ పార్టీ నేతలు విసిరే ముష్టికి కక్కుర్తి పడిన అధికార యంత్రాంగాలు వృత్తి ధర్మాన్ని తాకట్టు పెట్టేశారు. మైనింగ్, రెవెన్యూ, విజిలెన్స్ శాఖలు అయితే ముఖం చాటేసి తమ స్వామిభక్తిని చాటుకుంటుంటే.. ఇక పోలీస్ శాఖ మాత్రం ఖాకీ చొక్కాలు విడిచేసి ఊడిగం చేసే స్థాయికి చేరింది. ప్రకృతి ఖనిజ సంపదను తమ సరిహద్దులు దాటించే వరకు రక్షణ కల్పిస్తున్నారు. ప్రజల బతుకుదెరువు అయిన పంట భూములను కబళిస్తుంటే.. అడ్డుపడే వారిని బెదిరించి స్టేషన్లో నిర్బంధించి మరీ సాయ పడుతున్న పరిస్థితికి దిగజారారు. అనుమతులు లేకున్నా.. హైకోర్టు స్టే ఉన్నా.. ఎక్కడైనా మైనింగ్ చేయాలంటే.. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత పర్యావరణ అనుమతులు పొందాల్సి ఉంది. అయితే టీడీపీ నేతలకు ఈ నిబంధనలతో పనిలేదు. మైనింగ్పై ప్రజావ్యతిరేకత నేపథ్యంలో సాక్షాత్తు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన స్టే ఉత్తర్వులు ఉన్నా.. డోంట్ కేర్ అనే రీతిలో ధిక్కరించి, మైనింగ్, పోలీస్, రెవెన్యూ, విజిలెన్స్ శాఖల అండదండలతో విచ్చలవిడిగా అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. సర్వేపల్లిలో రెండేళ్లుగా రూ.వందల కోట్ల విలువైన ఇసుక, గ్రావెల్ను కొల్లగొట్టుతున్నా.. తాజాగా క్వార్ట్ ్జ, ఫెల్స్పర్, వర్ముఖ్లైట్ వంటి అత్యంత ఖరీదైన ఖనిజాన్ని దోచుకెళ్తున్నా.. అడ్డుకునేందుకు ఈ శాఖల యంత్రాంగాలు దమ్ము, ధైర్యం ప్రదర్శించలేకపోతున్నాయి. పొదలకూరు మండలం ముదిగేడు గ్రామ సమీపంలోని మైన్ నుంచి కొద్ది రోజులుగా అత్యంత విలువైన క్వార్ట్ ్జ, ఫెల్స్పర్, వర్ముఖ్లైట్ వంటి ఖనిజాలను వెలికితీసి నిత్యం వందల టన్నులు ఎగుమతులు చేస్తున్నారు. అయితే ఇక్కడ మైనింగ్ చేయడానికి హైకోర్టు స్టే విధించి ఉంది. దీనికి కనీసం పర్యావరణ అనుమతులివ్వలేదు. అయినా అడ్డగోలుగా ఖనిజాన్ని తవ్వేసి దోచుకెళ్తున్నారు. 2022లో ముదిగేడులో మైనింగ్ వ్యవహారం అప్పట్లో పెద్ద వివాదమైంది. బ్లాస్టింగ్తో దగ్గరలోని నిమ్మతోటలకు, రైతులకు, చుట్టు పక్కల మేతకు వెళ్లే పశువులకు ప్రమాదం పొంచి ఉందని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 2022 మే 6న గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ మైనింగ్కు పర్యావరణ అనుమతులు లేవని చెప్పడంతో, పర్యావరణ అనుమతులు ఉంటేనే మైనింగ్ చేయాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే హైకోర్టు ఉత్తర్వులతో అప్పటి మైనింగ్ అధికారులు మైనింగ్ను నిలిపివేశారు. అప్పటి వరకు వెలికి తీసిన క్వార్ట్ ్జ, ఫెల్స్పర్, వర్ముఖ్లైట్ అక్కడ గుట్టలు గుట్టలుగా ఉండిపోయాయి. ఈ ఖనిజాన్ని కూడా పర్యావరణ శాఖ అనుమతులు మేరకే తరలించాలని స్పష్టంగా పేర్కొంది. అయితే కోర్టు స్టే ఉత్తర్వులను ధిక్కరించి అధికారమే అండగా రెచ్చపోతూ టీడీపీ నేతలు వెలికి తీసిన ఖనిజాన్ని అక్రమంగా పక్క రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల గ్రామస్తులు ప్రశ్నించిన తర్వాత కొద్ది రోజులు నిలిపివేసిన వారు తిరిగి విలువైన ఖనిజాన్ని కల్యాణపురంలో పొలాన్ని లీజుకు తీసుకుని యార్డు ఏర్పాటు చేసి తరలించి గ్రేడింగ్ చేయిస్తున్నారు. తాజాగా గ్రామస్తులు ప్రశ్నిస్తే తమకు అనుమతులు వస్తాయని, తమ వద్ద తరలింపునకు సంబంధించిన పేపర్స్ ఉన్నాయని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. అనుమతులు ఉంటే రాత్రి వేళల్లో గ్రామం మీదుగా కాకుండా అడ్డదారుల్లో ఎందుకు రాయిను తరలిస్తున్నారని ప్రశ్నలకు వారి నుంచి సమాధానం రావడం లేదు. అధికార పార్టీ ముఖ్య నేత కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకోసం భారీగానే ముడుపులు ముట్టాయని గ్రామంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రెండు వారాల క్రితం పోలీసులు మైనింగ్ వద్దకు వెళ్లి పరిశీలించి ఖనిజాన్ని తరలించొద్దని నామమాత్రంగా హెచ్చరించినట్లు సమాచారం. అనుమతులు ఎవరిచ్చారు పర్యావరణ అనుమతులు లేకున్నా.. అక్రమ తవ్వకాలు సర్వేపల్లిలో బరితెగించిన టీడీపీ నేతలు సర్వం స్వాహా ముఖ్యనేత నేతృత్వంలో ఇప్పటికే ఇసుక, గ్రావెల్, బూడిద అక్రమ రవాణా తాజాగా పొదలకూరులో క్వార్ట్ ్జ, ఫెల్స్పర్, వర్ముఖ్లైట్ ఖనిజాల అక్రమ రవాణా దగ్గర్లోని యార్డుకు నిత్యం వందల టన్నుల తరలింపు నిరోధించే దమ్ము మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలకు లేవు ఇతరులు అడ్డుకునేందుకు వెళ్తే పోలీసుల మోహరింపు గతంలో మైనింగ్ జరగకపోయినా కాకాణిపై కోకొల్లలుగా కేసులు నమోదు మైనింగ్కు అనుమతుల్లేవు పొదలకూరు మండలం ముదిగేడులోని మైనింగ్కు ఎటువంటి అనుమతుల్లేవు. పర్యావరణ శాఖ నుంచి అనుమతులు ఇవ్వలేదు. ఇక్కడి మైనింగ్ చేయొద్దని హైకోర్టు స్టే ఉత్తర్వులు ఉన్నాయి. గతంలో తవ్విన మెటీరియల్ తరలించొద్దని ఆదేశాలు ఉన్నాయి. మైనింగ్ను అడ్డుకుంటాం. ఖనిజ సంపదను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసరావు, మైనింగ్ ఏడీ, నెల్లూరు మైనింగ్ వద్ద చాలా రోజులుగా వెలికితీసిన క్వార్ట్ ్జ, ఫెల్స్పర్ ఖనిజం తరలింపునకు ఎవరు అనుమతులిచ్చారో చెప్పడం లేదు. మైన్ యజమాని హైదరాబాద్కు చెందిన వారికి బల్క్గా అమ్ముతున్నట్లుగా తెలుస్తోంది. వారు ఇక్కడ అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకుని రాయిను గ్రేడింగ్కు తరలిస్తున్నారు. మైన్కు పర్యావరణ అనుమతులు లేవని గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. న్యాయస్థానం ఉత్తర్వులను సైతం బేఖాతరు చేసి మైన్ వద్ద ఉన్న రాయిను ఇష్టానుసారం తరలించడంపై మండి పడుతున్నారు. వెంటనే మైనింగ్ అధికారులు చొరవతీసుకుని చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. -
రాష్ట్రంలోనే పెట్రో కష్టాలు
పొదలకూరు: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ కష్టాలను ప్రజలు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని పొదలకూరు, నేదురుమల్లి గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. డీజిల్ లభ్యం కాక పంటల సాగులో దుక్కి దున్నకాలకు ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఆయన ఎదుట ఆవేదనను వ్యక్తం చేశారు. కొత్తగా పింఛన్లు మంజూరు కావడంలేదని తెలియజేశారు. తమ ప్రాంతంలో చుక్కల భూముల సమస్యను నాటి సీఎం జగన్మోహన్రెడ్డి పరిష్కరించారని, అయితే ప్రస్తుత ప్రభుత్వంలో ఇది మళ్లీ మొదటికొచ్చిందని వాపోయారు. ఏ ఒక్క పథకాన్నీ సక్రమంగా అమలు చేయడంలేదని తెలియజేశారు. ప్రభుత్వ వైఫల్యంతోనే.. చంద్రబాబు వైఫల్యంతోనే పెట్రోల్, డీజిల్కు కొరత ఏర్పడిందని కాకాణి గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. దీంతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తనకు సుదీర్ఘ రాజకీయ అనుభవముందని.. ఎలాంటి సమస్యనైనా చిటికెలో పరిష్కరిస్తానంటూ ప్రగల్భాలు పలకడమే తప్ప చంద్రబాబుతో ప్రజలకు ఒరిగిందేమీలేదని విమర్శించారు. తల్లికి వందనం పేరిట ప్రతి బిడ్డకూ రూ.15 వేల చొప్పున అందజేస్తానని ఎన్నికలకు ముందు ప్రకటించి.. తల్లులను ప్రస్తుతం నట్టేట ముంచారని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం కొలువుదీరాక కొత్తగా పింఛన్లను మంజూరు చేసిన దాఖలాల్లేవని చెప్పారు. మళ్లీ చుక్కల భూముల సమస్యలు తమ ప్రభుత్వ హయాంలో చుక్కల భూములకు నాటి సీఎం జగన్మోహన్రెడ్డి పరిష్కారాన్ని చూపి పట్టా భూములుగా మార్చి రైతులకు అందజేశారని, అయితే ఆయనకు పేరొస్తుందనే దురుద్దేశంతో సమస్యను కూటమి ప్రభుత్వం మళ్లీ మొదటికి తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తే, తిరిగి వాటిని సృష్టించి తప్పుడు కేసులను బనాయిస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో భూ వివాదాలను సృష్టించి రైతులను వేధిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ను సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కూటమిపై వ్యతిరేకత బాగా పెరిగిందని వెల్లడించారు. తమ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యే ఉంటుందని తెలిపారు. వీరికి ఎలాంటి సమస్యొచ్చినా ముందుందేది తామేనని స్పష్టం చేశారు. అనంతరం పొదలకూరు కల్యాణ మండపంలో ఎస్సీ సెల్ నేత పెంచలప్రసాద్, సుభాషిణి వివాహానికి హాజరై ఆశీర్వదించారు. నేదురుమల్లిలో ప్రమాదవశాత్తూ వన్నం హరీష్ మృతి చెందడంతో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. నేతలు బచ్చల సురేష్కుమార్రెడ్డి, వాకాటి శ్రీనివాసులురెడ్డి, అంజద్, వేణుగోపాల్రెడ్డి, వాకాటి శివప్రసాద్రెడ్డి, ఉడతా రమేష్, పెంచలనాయుడు, విజయభాస్కర్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. కూటమి పాలనలో కన్నీరు పెడుతున్న పల్లెలు రెండో కారు పంటల సాగుకు కష్టాలు ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
గ్రావెల్.. దోచేయ్
● విజృంభిస్తున్న మాఫియా ● గుంతలమయమైన ఐటీఐ స్థలం ● రూపు కోల్పోతున్న సంగం కొండ ● రెచ్చిపోతున్న టీడీపీ నేతలు సంగం: సంగంలోని గ్రావెల్ను సమీప మండలాలకు తరలిస్తూ మాఫియా సొమ్ము చేసుకుంటోంది. ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలో భారీగా లేఅవుట్లను వేస్తుండటం వీరికి ఆదాయ వనరుగా మారింది. ఇలా అక్రమంగా రవాణా చేస్తూ భారీగా దోచుకుంటున్నారు. సంగం కొండ, తిరుమన తిప్ప కొండను కొల్లగొడుతున్నారు. మండలంలోని బడా నేతలు చికెన్ వ్యర్థాల మాఫియాగా ఏర్పడగా.. చోటా నేతలు గ్రావెల్ మాఫియాగా మారి సొమ్ము చేసుకుంటున్నారు. యంత్రాలతో రేయింబవళ్లూ.. సంగం తిరుమనతిప్పలోని సర్వే నంబర్ 252లో 5.4 ఎకరాల ప్రభుత్వ భూమిని ఐటీఐ కళాశాల భవన నిర్మాణానికి కేటాయించారు. అయితే దీన్ని చేపట్టకపోవడంతో కొంతకాలం ఆత్మకూరులో నిర్వహించారు. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేయడంతో సంగం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని లగడపాటి రాజగోపాల్ ఫౌండేషన్ వద్ద ప్రస్తుతం జరుపుతున్నారు. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో మేలురకం గ్రావెల్ ఉండటంతో టీడీపీ చోటా నేతల కన్ను దీనిపై పడింది. దీంతో ఇక్కడ యంత్రాలను పెట్టి రేయింబవళ్లూ తరలిస్తున్నారు. సంగం తిప్ప బీరాపేరు వైపు, కొరిమెర్ల పంపింగ్ స్కీమ్ సమీపంలోని తిప్పను సైతం కొల్లగొడుతున్నారు. దీంతో గుంతలు ఏర్పడి రూపు కోల్పోతోంది. వేసవిలో మూగజీవాలు తిరిగేందుకు సైతం ఈ గుంతలు అవరోధంగా మారడంతో పలు సందర్భాల్లో సంగంలోకి వస్తున్నాయి. మాఫియా ఇంత విచ్చలవిడిగా రెచ్చిపోతున్నా, అడ్డుకోవడంలో అధికారులు మీనమేషాలను లెక్కిస్తున్నారు.ట్రాక్టర్లో గ్రావెల్ తరలింపు ఐటీఐ కళాశాల స్థలంలో ఏర్పడిన భారీ గుంతలు చర్యలు చేపడతాం గ్రావెల్ తరలింపుపై విచారణ జరిపి చర్యలు చేపడతాం. రెవెన్యూ, మైనింగ్ అనుమతుల్లేకుండా గ్రావెల్ను తరలించడం నేరం. – వెంకటేశ్వర్లు, ఇన్చార్జి తహసీల్దార్ -
‘పది’ ఫలితాల విడుదల నేడు
నెల్లూరు (టౌన్): పదో తరగతి ఫలితాలను గురువారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారని డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. results.bse.ap. gov.in, మనమిత్ర వాట్సాప్ నంబర్ 95523 00009, లీప్ మొబైల్ యాప్, డిజీ లాకర్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చని వివరించారు. మాఫియాలతో పాలనను సాగించలేరు చిల్లకూరు: రాష్ట్రంలో మాఫియాలతో పాలనను కొనసాగించలేరని, పరిస్థితి ఇదే విధంగా ఉంటే ప్రజలు తిరుగుబాటు చేయాల్సి వస్తుందని సీపీఐ నేత నారాయణ పేర్కొన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వ్యక్తిగత కారణలతో హాజరైన ఆయన స్థానిక ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో విలేకరులతో బుధవారం మాట్లాడారు. దేశంతో పాటు రాష్ట్రంలో మాఫియా పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడులు చేసి హతమారుస్తున్నారని ఆరోపించారు. చిత్తూరు జిల్లా వీ కోట వద్ద ఓ విలేకరిని హత్య చేయడాన్ని కిరాతక చర్యగా అభివర్ణించారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించేలా పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కొమ్మి నారాయణ, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్, జమాలుల్లా, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు. అధునాతన స్పీడ్ బోట్ల తయారీకి శ్రీకారం ముత్తుకూరు (పొదలకూరు): సముద్రంలో చేపల అక్రమ వేటను నిరోధించడంలో భాగంగా అధునాతన స్పీడ్ బోట్లను తయారు చేసేందుకు గానూ రూ.30 లక్షలను కలెక్టర్ హిమాన్షు శుక్లా ముందస్తుగా విడుదల చేశారు. దీంతో పనులకు శ్రీకారం చుడుతూ పూజా కార్యక్రమాలను మత్స్యకారులు బుధవారం నిర్వహించారు. తమిళనాడులోని నాగపట్నం వద్ద ఉన్న పీఎస్ స్టీల్ బోట్ పనులను పరిశీలించి రెండు స్టీల్ బాడీ డీప్సీ ఫిషింగ్ నౌకలు (అధిక వేగం కలిగిన 650 హెచ్పీ)ను తయారు చేసేందుకు దక్షిణ ప్రాంతానికి చెందిన మత్స్యకారులు సిద్ధమయ్యారు. మత్స్యశాఖ ఏడీ చాంద్బాషా తదితరులు పాల్గొన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బదిలీ నెల్లూరు (లీగల్): జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వాణిని విజయవాడ మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేశారు. వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు సీనియర్ సివిల్ జడ్జి పద్మను ఇక్కడ నియమిస్తూ ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు బుధవారం జారీ చేసింది. శ్రీవారి దర్శనానికి 16 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 68,980 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 26,511 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.09 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 16 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. భూముల పరిశీలన దుత్తలూరు: మండలంలోని ముత్తరాశిపల్లి, రాఘవరెడ్డిపల్లి గ్రామ సమీపాల్లో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ పరిశ్రమకు కేటాయించిన భూములను ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ శివకుమార్ బుధవారం పరిశీలించారు. రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమల స్థావనతో మెట్ట ప్రాంతం అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశీలనలో గుర్తించిన అంశాలను నివేదిక రూపంలో ఉన్నతాధికారులకు అందజేయనున్నామని వెల్లడించారు. తహసీల్దార్ యనమల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
గ్యాస్ సిలిండర్ లీకై ఇల్లు దగ్ధం
● త్రుటిలో తప్పిన ప్రాణాపాయం ● రూ.20 లక్షల నష్టం కొడవలూరు: గ్యాస్ సిలిండర్ లీకై మంటలు వ్యాపించి ఇల్లు దగ్ధమైంది. ఇంటి యజమాని సహా కుటుంబ సభ్యులకు త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన మండలంలోని పద్మనాభసత్రంలో బుధవారం చోటుచేసుకొంది. బాధితుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కూట్ల మల్లికార్జున, మిగిలిన నలుగురు కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం మధ్యాహ్నం భోజనానికి ఉపక్రమించారు. అదే సమయంలో వంటింట్లో నుంచి గ్యాస్ సిలిండర్ ద్వారా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ మంటల ధాటికి పల్లెంలోని భోజనాన్ని అలాగే వదిలేసి కుటుంబ సభ్యులంతా బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో మంటలు ఇల్లంతా వ్యాపించాయి. మంటల ధాటికి ఇంట్లోని సర్వం బుగ్గిపాలయ్యాయి. ఇంటిని ఇటీవలే ఆధునిక హంగులతో నిర్మించుకున్నారు. అగ్నిమాపక వాహనం వచ్చే సమయానికే మంటల ధాటికి ఇంట్లోని ఏసీలు, ల్యాప్టాప్లు, టీవీ, పీఓబీ సీలింగ్, డబుల్ కాట్ మంచాలు, బీరువాలు తదితర గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. గ్యాస్ సిలిండర్ లీకై న విషయాన్ని గుర్తించకపోవడం వల్ల ప్రమాదం జరిగింది. దాదాపు రూ.20 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. రెవెన్యూ అధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరు, నష్టం వివరాలను సేకరించారు. -
సింహ వాహనంపై లక్ష్మీనృసింహుడు
నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ మండలంలోని వేదగిరి లక్ష్మీనరసింహస్వామి సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గిరిప్రదక్షిణ ఉత్సవానికి భక్తులు భారీగా హాజరయ్యారు. ఆలయ చైర్మన్ అచ్యుత్రెడ్డి, ఈఓ గిరి తదితరులు పాల్గొన్నారు. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య ముత్తుకూరు(పొదలకూరు): కుటుంబ కలహాల కారణంగా విజయవాడ ప్రాంతానికి చెందిన ఎస్కే అబ్దుల్లా(38) అనే కార్మికుడు ఏపీ జెన్కో ప్రాజెక్టు కాలనీలో బుధవారం తాను ఉన్న గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఏపీ జెన్కోలో యాక్టివ్ పవర్ సిస్టమ్స్ కంపెనీ ద్వారా మూడో యూనిట్లో ఓవరాలింగు వర్క్ చేసేందుకు రెండు రోజుల క్రితం వచ్చారు. కార్మికుడు మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కృష్ణపట్నం ఎస్సై శ్రీనివాసరెడ్డి తెలిపారు. పెళ్లికెళ్లి వస్తుండగా.. ● బైక్ అదుపుతప్పి దంపతులకు తీవ్రగాయాలు దగదర్తి: వివాహానికి వెళ్లి వస్తుండగా ఉలవపాళ్ల జాతీయ రహదారి వద్ద బైక్ అదుపుతప్పడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. జమ్మలపాళెంలోని ఓ కల్యాణ మండపంలో బుధవారం జరిగిన వివాహానికి అనంతవరం గ్రామానికి చెందిన నరసింహారావు, కామాక్షి దంపతులు బైక్పై వెళ్లి వస్తుండగా ఉలవపాళ్ల వద్దకు రాగానే వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో నరసింహారావు కాలుకు తీవ్ర గాయం కాగా కామాక్షి తలకు గాయాలయ్యాయి. హైవే మొబైల్ సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని హైవే అంబులెన్స్లో నెల్లూరుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జంపాని కుమార్ తెలిపారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి నెల్లూరు సిటీ: రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి జారిపడి మృతిచెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. బిహార్ రాష్ట్రానికి చెందిన రాజేష్కుమార్ యాదవ్(28) గత కొంత కాలంగా అనారోగ్య కారణంగా తమిళనాడులోని కాట్పాడిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం తిరిగి తన ఊరికి వెళ్లేందుకు కుటుంబ సభ్యులతో కలిసి అమృత్భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కారు. రాజేష్ మరుగుదొడ్డికి వెళ్తున్నట్లు కుటుంబసభ్యులకు చెప్పి వెళ్లారు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూడగా రాజేష్ కనిపించలేదు. దీంతో వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించగా కొమ్మరపూడి సమీపంలో రైలు పట్టాలపై రాజేష్ మృతదేహం పడి ఉండడాన్ని స్థానికుల సమాచారంతో గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రైల్వే ఎస్సై హరిచందన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ను ఢీకొన్న కారు ● యువకులకు గాయాలు సంగం: బైక్ను కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని కొరిమెర్ల సమీపంలో నెల్లూరు–ముంబై జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. సంగం గ్రామానికి చెందిన వికాస్, వీరేంద్రలు ద్విచక్ర వాహనంపై కొరిమెర్ల నుంచి వస్తుండగా ఆత్మకూరు వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కారు వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న వికాస్, వీరేంద్రలకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై రాజేష్ స్థానికుల సహాయంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
త్రుటిలో తప్పిన పెద్ద ప్రమాదం
● గంట పాటు ట్రాఫిక్కు అంతరాయం చిల్లకూరు: ఓవర్టేక్ చేసే క్రమంలో లారీ కారును ఢీకొనడంతో కారు వ్యతిరేక దిశలోకి తిరిగి నిలిచిపోయింది. ఈ ఘటనతో వెనుక వచ్చే వాహనదారులు ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బుధవారం వరగాలి క్రాస్ రోడ్డు వద్ద జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు, ఇద్దరు వ్యక్తులు శ్రీకాళహస్తిలో జరిగిన ఉత్తరక్రియలకు కారులో వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో చిల్లకూరు పోలీస్స్టేషన్–వరగాలి క్రాస్రోడ్డు సమీపంలో నాయుడుపేట వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ఓ లారీ వేగంగా కారును అధిగమించే ప్రయత్నం చేయగా, కారును డ్రైవర్ రోడ్డు మార్జిన్ దింపేశాడు. తిరిగి ఎక్కే సమయంలో లారీ ఢీకొనడంతో లారీ ఢీకొనడంతో కారు టైర్లు పగిలిపోయి వ్యతిరేక దిశలో ఆగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెనుక వస్తున్న వాహనాలు కి.మీ మేర నిలిచిపోవడంతో ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు గంటకుపైగా సమయం పట్టింది. -
బఫర్ జోన్లలో అక్రమ లేఅవుట్లు
● పంట కాలువలు కనిపించకుండా ప్లాట్ల అమ్మివేత ● లబోదిబోమంటున్న కొనుగోలుదారులు కావలి రూరల్: ఒకవైపు నుడా పర్మిషన్లతో లేఅవుట్లు వేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ కొంతమంది బడా వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. బఫర్ జోన్లను సైతం వదలకుండా పంట కాలువలను ఆక్రమించి పంట భూములను చదును చేసి కొనుగోలుదారులకు అక్రమ ప్లాట్లను అంటగడుతున్నారు. వంటకాలువలు కనిపించకుండా పరదాలు కట్టి స్థలాలను విక్రయిస్తుండడంతో తీరా మోసపోయిన పలువురు కొనుగోలుదారులు విషయం తెలుసుకుని మనోవేదనకు గురవుతున్నారు. ఇలా ఆముదాలదిన్నె గ్రామ పంచాయతీ బిట్– 2లో ఆరు ప్లాట్లు అక్రమ అమ్మకం జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదు. తేలిపోయిన టీడీపీ ఆరోపణలు గత ప్రభుత్వంలో 127 ఎకరాలు ఆక్రమణకు గురైందని టీడీపీ నేతలు ఆరోపణలు చేసినా దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారు. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నా.. 127 ఎకరాలకు సంబంధించి ఎలాంటి పురోగతి లేకుండా నిజ నిర్ధారణ కాలేదు. టీడీపీ నేతల ఆరోపణలు రుజువు కాకుండాపోయింది. ప్రస్తుత ప్రభుత్వంలో.. గత కొంతకాలంగా ఆముదలదిన్నె గ్రామ పంచాయతీలో 12 ఎకరాల లేఅవుట్ స్థలంలో పంట కాలువలను ఆక్రమించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రియల్ యజమాని దానికి స్పందించి పంట కాలువలను పునర్నిర్మించగా, కానీ పక్కనే ఉన్న మరో యజమాని మూడు ఎకరాలలో లేఅవుట్లు వేసి నూడా అప్రూవల్ తీసుకోకుండా వాటిలో ఆరు ప్లాట్ల అమ్మకాలు జరిపారు. వారి ప్లాట్లలో ఉన్న పంట కాలువలను పునరుద్ధరించకుండా వారి స్థలాల్లోనే కట్టుబడి చేయాల్సి ఉండగా ఇప్పటికీ దానిపై స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై ఇరిగేషన్ డీఈ మొహమ్మద్ ఖాన్ను సంప్రదించగా స్థానిక రెవెన్యూ సిబ్బందికి తెలియజేశామని, ఒకవైపు విజిలెన్స్ అధికారులు కూడా తనిఖీలు చేస్తున్నారని, వీలైనంత త్వరలో వాటిపై చర్యలు తీసుకుని పంట కాలువలను పూర్తిగా పునరుద్ధరిస్తామని తెలిపారు. కొనుగోలుదారులు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని, పూర్తి సమాచారంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లి కొనుగోలు చేయాలని కోరారు. -
తమ్ముళ్లకు స్పెషల్.. డ్రమ్ములకు డీజిల్
● సొసైటీ బంకులో కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు సంగం: డీజిల్, పెట్రోల్ కొరత ఉన్న నేపథ్యంలో డ్రమ్ములు, క్యాన్లకు డీజిల్ పడితే చర్యలు తప్పవని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా తెలుగు తమ్ముళ్లకు స్పెషల్ ట్రీట్మెంట్ లభిస్తోంది. సంగం మండలంలో ఆరు పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటిలో సహకార సంఘం పెట్రోల్ బంకు కూడా ఉంది. ఐదు పెట్రోల్ బంకుల్లో డీజిల్ అయిపోవడంతో ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు సంగం వ్యవసాయ పరపతి సహకార సంఘం (సొసైటీ) పెట్రోల్ బంకులకు పరుగులు తీశాయి. అయితే సంగానికి చెందిన దేశం నేతలు తమ ట్రాక్టర్లలో ఖాళీ డ్రమ్ములు వేసుకుని డీజిల్ మొత్తం నింపుకుని వెళ్లడంతో అప్పటి వరకు వేచిచూస్తున్న వాహనదారులు విస్మయం వ్యక్తం చేశారు. ప్రశ్నించిన వారిని ఇది సొసైటీ బంకు అని దబాయించడం గమనార్హం. -
మహిళపై దాడి కేసులో ముగ్గురికి జైలు
కోవూరు: ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి మహిళపై దాడి చేసి, గాయపరిచిన కేసులో ముగ్గురు నిందితులకు కోవూరు కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ బుధవారం తీర్పునిచ్చింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కోవూరు పట్టణంలోని పూలతోట వీధికి చెందిన ముత్యాల సులక్షణ ఇంట్లోకి, అదే వీధికి చెందిన పల్లిబోయిన నాగమ్మ, పల్లిబోయిన శ్రీనివాసులు, కొప్పల సరోజనమ్మ అనే వ్యక్తులు 2022 జనవరి 13వ తేదీన అక్రమంగా ప్రవేశించారు. పాత కక్షల నేపథ్యంలో దౌర్జన్యం చేసి, ఆమెను విచక్షణారహితంగా కొట్టి గాయపరిచారు. ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో నేరం రుజువు కావడంతో అడిషనల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఎస్.శివ నమ్రత బుధవారం తీర్పు వెలువరించారు. పల్లిబోయిన నాగమ్మకు ఒక నెల సాధారణ జైలు శిక్ష, పల్లిబోయిన శ్రీనివాసులు, కొప్పల సరోజనమ్మకు మూడు నెలల జైలు శిక్ష, ముగ్గురు నిందితులకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ ఎన్.సుకన్య వాదనలు వినిపించారు. చోరీ జరిగినా.. కేసే లేదు ● వారం రోజుల క్రితం 14 సవర్ల బంగారం అపహరణ ● ఆలస్యంగా వెలుగులోకి.. వరికుంటపాడు: మండలంలోని వేంపాడు పంచాయతీ భోగ్యంవారిపల్లి గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఈనెల 21వ తేదీ అర్ధరాత్రి సమయంలో గ్రామానికి చెందిన శేషమ్మ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు వెళ్లి ఇంట్లోని బీరువాలో ఉన్న సుమారు 14 సవర్ల బంగారాన్ని అపహరించారు. ఘటనపై బాధితులు 22వ తేదీ 100 నంబర్కు కాల్ చేసి సమాచారం అందించారు. అదేరోజు ఎస్సై ఎం.రఘునాథ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం క్లూస్ టీమ్ను రప్పించి వేలిముద్రలు సేకరించారు. ఈ వ్యవహారాన్ని బాధితులు బుధవారం మీడియా ఎదుట వాపోవడంతో విషయంలోకి వెలుగులోకి వచ్చింది. అయితే వారం రోజులు గడిచినా ఇప్పటివరకు కేసు నమోదు కాలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సై రఘునాథ్ను సాక్షి వివరణ కోరగా పూర్తి వివరాలు సేకరించిన అనంతరం కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తామని చెప్పారు. లారీని ఢీకొన్న కారు దగదర్తి: నెల్లూరు వైపు నుంచి ఒంగోలుకు వెళ్తున్న కారు వేగంగా ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న ఘటన ఉలవపాళ్ల జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా, గాయపడిన ముగ్గురిని హైవే అంబులెన్స్లో కావలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జంపాని కుమార్ తెలిపారు. -
బుచ్చిలో భారీ అగ్నిప్రమాదం
● దగ్ధమైన వాహనాలు, సామగ్రి ● సుమారు రూ.10 లక్షల నష్టం బుచ్చిరెడ్డిపాళెం: పట్టణంలోని లైలా హాల్ సమీపంలో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న శ్రీలక్ష్మీనరసింహస్వామి సేల్స్ పాయింట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీలక్ష్మీనరసింహస్వామి సేల్స్ పాయింట్కు చెందిన షెడ్డులో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఇందులోని పాత, పనికిరాని వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. మంటల ధాటికి అగ్నిజ్వాలలు పక్కనే ఉన్న ఇనుప అంగడికి కూడా వ్యాపించాయి. అక్కడ నిల్వ ఉంచిన భారీ మొత్తంలోని ప్లాస్టిక్ సామగ్రి అగ్నికి ఆహుతైంది. దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు ఊపిరాడక ఇబ్బంది పడ్డారు. తప్పిన పెను ప్రమాదం మంటలు సమీపంలోని జామాయిల్ తోట వైపు వ్యాపించకుండా స్థానికులు సమయస్ఫూర్తితో వ్యవహరించి అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. షెడ్డులో ఉన్న ఖరీదైన ఫోర్ వీలర్ వాహనాలను చాకచక్యంగా బయటకు తీయడంతో భారీ ఆస్తి నష్టం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో అక్కడి గడ్డికి నిప్పంటుకుని మంటలు వ్యాపించాయా? లేక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో పనికిరాని వాహనాలతో పాటు, ప్లాస్టిక్ సామగ్రి కాలిపోవడంతో సుమారు రూ.10 లక్షల నష్టం వాటిల్లి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు -
నష్ట పరిహారం చెల్లించాలని ధర్నా
ఆత్మకూరు: విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసే క్రమంలో షాక్కు గురై స్తంభంపై నుంచి పడి ఓ కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందడంతో బాధిత కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు, సీఐటీయూ, సీపీఎం నాయకులు ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరికి చెందిన రామ్ప్రసాద్ (20) అనే యువకుడు విద్యుత్ వైర్లు బిగించే పని కోసం ఆత్మకూరు సబ్ డివిజన్ ప్రాంతంలో ఓ కాంట్రాక్టర్ కింద పనులు చేస్తున్నాడని, మంగళవారం సాయంత్రం నల్లగొండలో పనులు చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్కు గురై స్తంభంపై నుంచి జారి పడి తీవ్ర గాయాలపాలై మరణించారన్నారు. ఈ నేపథ్యంలో సదరు కాంట్రాక్టర్ తనకు సంబంధం లేనట్లుగా పరారయ్యాడని, బాధిత కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఏఓ స్వప్నకు వినతి పత్రం అందజేశారు. నాయకులు శివప్రసాద్, లక్ష్మీపతి, డేవిడ్రాజు, నాగయ్య, రమణయ్య, హజరత్తయ్య, మహేష్ పాల్గొన్నారు. -
మొరాయిస్తున్న సర్వర్
జనన, మరణాల వివరాలను వైద్యశాఖకు చెందిన వెబ్సైట్లో నమోదు చేయాలి. ఆ తర్వాత సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసివ్వాలి. ఇందుకోసం కేవలం ఒకే ఒక్క డేటా ఎంట్రీ ఆపరేటర్ను నియమించారు. కంప్యూటర్ కూడా ఒకటే ఉంది. దీనికితోడు సర్వర్ మొరాయిస్తూ వెబ్సైట్ పనిచేయకపోవడంతో వివరాల నమోదులో జాప్యం జరుగుతోంది. రెండు నెలల క్రితం నిబంధనల్లో మార్పులు చేశారు. అప్పట్నుంచి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసినా పట్టుమని పదిమందికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వలేకపోతున్నారు. ఒక్కోరోజు ముగ్గురికి, నలుగురికి మాత్రమే ఇస్తున్నారు. మరోరోజు ఎనిమిది మందికి మాత్రమే దక్కుతుంది. దీంతో బాధితులు సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి పెద్దాస్పత్రి చుట్టూ తిరుగుతున్నారు. -
చావుకొస్తోంది..!
జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను పొందేందుకు బాధితులు నరకం చూస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వాటిని కేవలం వారం రోజుల్లోనే మంజూరు చేసేవారు. కూటమి ప్రభుత్వంలో అడ్డమైన నిబంధనలు చేర్చడంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆస్పత్రిలో పడిగాపులు కాస్తున్నారు. ఇక్కడికి ఎక్కువగా నిరుపేదలు వస్తుంటారు. వారు ఆస్పత్రి అధికారులను ప్రశ్నించలేక తమకు ఎప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. నెల్లూరు(అర్బన్): పెద్దాస్పత్రిలో రోజూ అవుట్ పేషెంట్ల (ఓపీ) సంఖ్య 1,500, ఇన్పేషెంట్ల సంఖ్య 450 నుంచి 500 వరకూ ఉంటోంది. రోజూ సుమారు 15 నుంచి 20 వరకు కాన్పులు జరుగుతున్నాయి. అలాగే చికిత్స పొందుతూ ముగ్గురు నుంచి ఐదుగురి వరకు చనిపోతున్నారు. కాన్పు జరిగాక తల్లిదండ్రులు సర్టిఫికెట్ ఇవ్వాలని కోరుతూ ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటారు. తమ బిడ్డను స్కూల్లో చేర్చాలన్నా.. అంగన్వాడీ కేంద్రంలో చేర్పి ంచాలన్నా.. ఇతర అవసరాలకు బర్త్ సర్టిఫికెట్ కచ్చితంగా అవసరం. అలాగే ఎవరైనా మృతిచెందితే వారి కుటుంబ సభ్యులు మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంటుంటారు. బీమా పరిహారం, ప్రభుత్వ సాయం, వితంతు పెన్షన్ తదితరాలు పొందాలంటే ఇది తప్పనిసరి. అందువల్లే బాధిత కుటుంబం వారు త్వరగా మరణ ధ్రువీకరణ పత్రాన్ని పొందాలని ఆరాటపడుతూ ఆస్పత్రి చుట్టూ తిరుగుతున్నారు. ఒకరే ఉండటంతో.. జనన, మరణ ధ్రువపత్రాలిచ్చేందుకు అభ్యర్థులకు చెందిన ఆధార్కార్డు, ఆస్పత్రిలో డిశ్చార్జి అయిన స్లిప్, కుటుంబ సభ్యుల సమాచారం తదితర వివరాలను ఆన్లైన్లో ముందుగా నమోదు చేయాలి. ఆధారాలతో కూడిన ఫొటో స్టాట్ కాపీలు అప్లోడ్ చేయాలి. ఇవన్నీ చేయడానికి కేవలం ఒకే ఒక్క డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈఓ) మాత్రమే ఉన్నారు. ఆపరేటర్ సెలవు పెడితే పత్రాల మంజూరు జరగడం లేదు. కనీసం ఇద్దరు వ్యక్తులు ఉండి రెండు కంప్యూటర్లను ఏర్పాటు చేస్తేనే రద్దీ తగ్గుతుంది. అయితే సూపరింటెండెంట్ ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో పత్రాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోందని విమర్శలున్నాయి. 400 వరకు పెండింగ్ పెద్దాస్పత్రిలో జనన, మరణ ధ్రువీకరణపత్రాలు 400 వరకు పెండింగ్లో ఉన్నాయి. సర్వర్ మెరాయిస్తుండటంతోపాటు ఒకే డీఈఓ ఉండటంతో పత్రాలను సకాలంలో ఇవ్వకుండా తిప్పుకొంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించి సకాలంలో పత్రాలను మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పెద్దాస్పత్రిలో జనన, మరణ పత్రాల మంజూరులో జాప్యం పెండింగ్లో 400 వరకు సర్టిఫికెట్లు సర్వర్ సమస్య అంటూ చేతులెత్తేసిన వైద్యశాఖ రోజుకు ఐదారుగురికి కూడా ఇవ్వలేకపోతున్న వైనం నెలల తరబడి తిరుగుతున్న బాధితులుసర్వర్ సమస్యపై ఈ–మెయిల్ పెట్టాం సర్వర్ మొరాయిస్తుండడంతో జనన, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరులో జాప్యం జరుగుతోంది. సర్వర్ సమస్యను సూపరింటెండెంట్ మాధవి దృష్టికి తీసుకెళ్లి సరి చేయాలని వైద్యశాఖకు ఈ–మెయిల్ పెట్టించాం. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది. ఆలస్యం కాకుండా పత్రాలు ఇచ్చేలా చర్యలు చేపడుతున్నాం. – డాక్టర్ కళారాణి, అడ్మినిస్ట్రేటివ్ హెచ్ఓడీ -
పేద కుటుంబానికి రూ.లక్ష సాయం
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండల కేంద్రంలోని యర్రబల్లిపాళేనికి చెందిన మూలే జనార్ధన్రెడ్డి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇంటర్, ఎనిమిదో తరగతి కుమార్తెల చదువు ఆగిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో వారి పరిస్థితి గురించి వింజమూరుకు చెందిన వైఎస్సార్సీపీ నేత కర్నాటి ప్రభాకర్రెడ్డి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వారికి భరోసాగా ఉంటానని హామీ ఇచ్చారు. తన వంతుగా రూ.లక్ష నగదును బ్యాంక్ ద్వారా మృతుడి భార్య జ్యోతి అకౌంట్లో జమ చేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో మంగళవారం మృతుడి భార్యాబిడ్డలు కలిసిన నేపథ్యంలో వారికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. పిల్లల చదువులకు సంబంధించి భవిష్యత్లో కూడా తన వంతు సాయం కొనసాగుతుందన్నారు. కష్టకాలంలో పేద కుటుంబానికి అండగా నిలిచిన మేకపాటికి బాధిత కుటుంబ సభ్యులతోపాటు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. -
పోక్సో కేసులో నిందితుల అరెస్ట్
కోట: విద్యానగర్లోని ఓ ప్రైవేట్ కళాశాల నుంచి ఈనెల 15వ తేదీన బాలిక అదృశ్యమైన ఘటనపై విచారణ జరిపి నిందితులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పవన్కుమార్ మంగళవారం తెలిపారు. బాలికను అపహరించిన నెల్లూరుకు చెందిన దావూద్తోపాటు అతడికి సహకరించిన సలీం, షమీర్, మునీర్, హర్షియాపై పోక్సో కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు ఎస్సై వెల్లడించారు. ట్రావెల్స్ బస్సు ఢీకొని..● ట్రాక్టర్ డ్రైవర్ మృతి చిల్లకూరు: ట్రావెల్స్ బస్సు ఢీకొని ఓ డ్రైవర్ మృతిచెందిన ఘటన మంగళవారం జరిగింది. చిల్లకూరు కథనం మేరకు.. మండలంలోని నెలబల్లిరెట్టపల్లికి చెందిన చిరమన వెంకటేశ్వర్లు (53)కు భార్య, ముగ్గురు ఆడపిల్లలున్నారు. గ్రామంలో ఉన్న ట్రాక్టర్ యజమాని వద్దకు వెళ్లి యాక్టింగ్ డ్రైవర్గా ఉంటానని చెప్పాడు. అతను బోరులో వేసేందుకు అవసరమైన రాయిని నెల్లూరులో డెలివరీ చేయాలని చెప్పాడు. దీంతో వెంకటేశ్వర్లు గ్రామం నుంచి ట్రాక్టర్లో బయలుదేరాడు. పది నిమిషాలకు జాతీయ రహదారి ఎక్కి కోట క్రాస్రోడ్డు సమీపంలోకి వచ్చేసరికి మైసూర్ నుంచి విజయవాడకు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ కొంతదూరం వెళ్లి పడగా ట్రక్కు అక్కడే నిలిచిపోయింది. వెంకటేశ్వర్లు రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతిచెందాడు. బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. కొంతమంది వేరే బస్సుల్లో వెళ్లిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అలాగే ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్సై సురేష్బాబు మాట్లాడుతూ బస్సును స్టేషన్కు తరలించి డ్రైవర్ను విచారిస్తున్నామన్నారు. కేసు నమోదు చేశారు. రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య మనుబోలు: రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని మనుబోలు రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. మనుబోలు రైల్వేస్టేషన్ సమీపంలోని డౌన్లైన్లో 145/8 కిలోమీటర్ వద్ద ఓ వృద్ధుడి మృతదేహాన్ని సిబ్బంది గుర్తించారు. తల వేరుగా, మొండెం వేరుగా ఉంది. వయస్సు 70 సంవత్సరాలని భావిస్తున్నారు. ఐదున్నర అడుగుల ఎత్తు, చామనఛాయతో ఉన్నట్లు తెలిపారు. వైట్కలర్ ఫుల్ హ్యాండ్ షర్టు, బ్లూ కలర్ గళ్లలుంగీ ధరించి ఉన్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. -
బ్రహ్మోత్సవం.. ముక్కోటి దేవతలకు ఆహ్వానం
● పెంచలకోనకు పోటెత్తిన భక్తులు ● శేష వాహనంపై నృసింహుడురాపూరు: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని వేదపండితులు నిర్వహించారు. దేవతలారా రారండి ఐదురోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయండంటూ గరుత్మంతుడి ద్వారా ముక్కోటి దేవతలకు ఆహ్వానం పంపారు. వివిధ పూజా కార్యక్రమాలు జరిగాయి. స్వామిని తిరుచ్చిపై కొలువుదీర్చి నాలుగు తిరుమాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. అక్కడ్నుంచి ధ్వజస్తంభం వద్దకు చేరుకుని అర్చకులు గరుత్మంతుడి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. ధ్వజస్తంభానికి అభిషే కాలు నిర్వహించారు. తొలుత అష్టదిగ్భంధనం చేసి వేద, దివ్య, మంగళవాయిద్యాలు, వేదమంత్రాల నడుమ గరుత్మంతుడి చిత్రపటాన్ని ధ్వజస్తంభంపైకి ఎగురవేశారు. కార్యక్రమంలో డీసీ జనార్దనరెడ్డి, ఫెస్టివల్ కమిటీ సభ్యులు చెన్నుతిరుపాల్రెడ్డి, ఉప ప్రధానార్చకులు పెంచలయ్యస్వామి, సీతా రామయ్యస్వామి, టీటీడీ పాంచరాత్ర ఆగమ పండితులు రామానుజాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. ● బ్రహ్మోత్సవాల్లో జరిగే ధ్వజారోహణానికి ఎంతో విశిష్టత ఉంది. గరుత్మంతుడికి పూజలు అభిషేకాలకు ఉపయోగించిన ప్రసాదాలను స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. సంతానం లేని మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రసాదాన్ని స్వీకరించారు. ● స్వామి, అమ్మవార్లకు క్రేన్ మండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను పీఠంపై ఉంచి పాలు, తేనె, నెయ్యి, పెరుగు, పండ్లరసాలు, చందనం, పసుపు, కుంకుమ, కొబ్బరినీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ● లక్ష్మీనరసింహస్వామికి కాణిపాకంలోని వరసిద్ధి వినాయక దేవస్థానం నుంచి ఈఓ పెంచలకిషోర్ తమ సిబ్బందితో కలిసి పట్టువస్త్రాలు సమర్పించారు. ● బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మి దేవేరులను తిరుచ్చిలో కొలువుదీర్చి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి ఊంజల్సేవ నిర్వహించారు. ● రాత్రి 10 గంటలకు స్వామి, అమ్మవార్లను శేషవాహనంపై ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో నేడు బుధవారం ఉదయం 5 గంటలకు పూలంగిసేవ, 8 గంటలకు హంస వాహనసేవ, 11:50 గంటలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపాలంకారసేవ నిర్వహిస్తారు. రాత్రి 10 గంటలకు బంగారు హనుమంత వాహనంపై శ్రీవారి క్షేత్రోత్సవం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. -
కూటమి ప్రభుత్వానికి పట్టని సమస్యలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): పెట్రోల్, డీజిల్ కొతర కారణంగా రైతులు, ప్రజలు అవస్థలు పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి అన్నారు. నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడురోజుల నుంచి ఇంధనం లేకపోవడంతో జిల్లాలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రధానంగా వరికోతల సమయం కావడంతో పెట్రోల్ బంకులకు వెళ్తున్న రైతులకు డీజిల్ పట్టడం లేదని ఆరోపించారు. అధికార యంత్రాగం మాత్రం పెట్రోల్, డీజిల్ సమస్య లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికే జిల్లాలో చాలా బంకులు మూసివేశారని, కొన్నింట్లో నో స్టాక్ బోర్డులు పెడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రామరాజు, మాలకొండయ్య, సిరాజ్, షాన్వాజ్, ఆదినారాయణ, లీలామోహన్, సాయిలత, వనజ, హేమలత, అజీజ్, ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. -
తమ్ముళ్ల బరితెగింపు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ప్రకృతి వనరులను దోచుకోవడంలో తమ్ముళ్లు బరితెగిస్తున్నారు. రాత్రీ.. పగలనే తేడా లేకుండా గ్రావెల్, ఇసుకను కొల్లగొడుతున్నారు. మైనింగ్కు అనుమతుల్లేకపోయినా.. ప్రభుత్వానికి రాయల్టీలు చెల్లించకుండానే గ్రావెల్ దోపిడీ మూడు లోడ్లు.. ఆరు ట్రిప్పులు అనే తీరున సాగుతోంది. అడ్డుకోగా.. రెచ్చిపోయి ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం మండలం పల్లిపాళెం సమీపంలో గ్రావెల్ అక్రమ రవాణా రాత్రి వేళ జరిగింది. ఈ క్రమంలో రాయల్టీని చెల్లించాలని ఏఎమ్మార్ సంస్థ ప్రతినిధులు అడ్డుకోగా, తమ్ముళ్లు రెచ్చిపోయారు. అధికారం తమదని.. మీకెందుకు చెల్లించాలంటూ బూతులతో హడలెత్తించారు. మైనింగ్ రాయల్టీ ఇన్స్పెక్టర్ బృందాన్నీ లెక్కచేయలేదు. చివరికి పోలీసులు ఎంట్రీ ఇచ్చి సర్దుకోవాలని సలహా ఇచ్చి పంపిన ఘటన విస్మయానికి గురిచేసింది. వెంచర్లకు యథేచ్ఛగా.. ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు గ్రావెల్ దందాను సాగిస్తున్నారు. అనుమతుల్లేకపోయినా, తవ్వి వెంచర్లకు రవాణా చేస్తున్నారు. సంగంలోని కొండను తవ్వేసిన వీరి కన్ను తాజాగా పల్లిపాళెం సమీపంలోని ప్రభుత్వ భూములపై పడింది. జేసీబీని పెట్టి కొల్లగొడుతున్నారు. నాలుగు రోజులుగా ఇది జరుగుతోందని తెలుసుకున్న ఏఎమ్మార్ సంస్థ ప్రతినిధులు తరలింపును సోమవారం అర్ధరాత్రి అడ్డుకున్నారు. ప్రతి వాహనానికి రాయల్టీని చెల్లించి రవాణా చేసుకోవాలని సూచించగా, మాఫియా రెచ్చిపోయింది. ఈలోపు మైనింగ్ రాయల్టీ ఇన్స్పెక్టర్, వారి బృందం సైతం అక్కడికి చేరుకుంది. అయితే మాఫియా మరింతగా రెచ్చిపోయి స్థానికంగా కొందరు యువతను పిలిపించి నానా హంగామా చేశారు. అఽధికార పార్టీ అండ ఉన్న తమపై మీ రుబాబు ఏమిటంటూ రెచ్చిపోయారు. ఏఎమ్మార్ సంస్థ ప్రతినిధులపై బండబూతులతో చెలరేగిపోయారు. ఓ దశలో దాడులకు పాల్పడే పరిస్థితి నెలకొనడంతో పోలీసులకు ఫోన్లో సంస్థ ప్రతినిధులు సమాచారమిచ్చారు. ఆపై చేరుకున్న ఖాకీలు, గ్రావెల్ అక్రమ రవాణాను అడ్డుకోకపోగా, మాఫియాకు వెన్నుదన్నుగా నిలిచి సర్దుబాటు చేశారు. అర్ధరాత్రి తవ్వకాలు, పోలీసుల సమక్షంలోనే ఏమ్మార్ సంస్థ ప్రతినిధులపై టీడీపీ నేతల దౌర్జన్యంఅధికారికంగా అనుమతులు జిల్లాలో మైనింగ్ రాయల్టీ అధికారిక అనుమతులను ఏఎమ్మార్ సంస్థ పొందింది. దీనికి గానూ దాదాపు రూ.14 కోట్లను ప్రభుత్వానికి ప్రతి నెలా చెల్లిస్తోందని సమాచారం. దీంతో జిల్లాలోని నలుమూలలా తమ ఏజెంట్లను వీరు నియమించి, ఎక్కడ మైనింగ్ జరుగుతున్నా అక్కడ వాలిపోతున్నారు. మరోవైపు జిల్లాలో అనధికారికంగానే మైనింగ్ జరుగుతోంది. అయితే సదరు సంస్థ మాత్రం అక్రమ రవాణాను ప్రోత్సహిస్తూ వాహనానికి రూ, వందల్లో వసూలు చేస్తోంది. అధికారిక అనుమతులున్న చోటే వసూలు చేయాల్సి ఉన్నా, మిగిలిన చోట్ల సంస్థ దండుకుంటోంది. జిల్లాలో ఈ సంస్థకు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో గ్రావెల్ మాఫియాతో గొడవలు జరగడం, పోలీస్ శాఖ సర్దుబాటు చేయడం పరిపాటిగా మారుతోంది. గ్రావెల్, మైనింగ్ రవాణాలో ఏఎమ్మార్ సంస్థకు అధికారిక అనుమతులు రాయల్టీగా ప్రతి నెలా రూ.14 కోట్లను సర్కార్కు చెల్లించేలా ఒప్పందం అక్రమంగా తరలిస్తూ దోచుకుంటున్న టీడీపీ నేతలు సంగం మండలంలో అడ్డుకున్న ప్రతినిధులు బూతులతో రెచ్చిపోయిన వైనం అధికారులు ఫిర్యాదు చేశారు పల్లిపాళెంలో గ్రావెల్ను తరలిస్తున్న విషయం మా దృష్టికొచ్చింది. మైనింగ్ అధికారులు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేత నరేష్కు ఏఎమ్మార్ సంస్థ సిబ్బందితో వాగ్వాదం చోటుచేసుకుందనే ఫిర్యాదు అందింది. పరిశీలిస్తున్నాం. – రాజేష్, ఎస్సై, సంగం -
క్రిస్ సిటీతో భారీగా ఉపాధి
గూడూరు రూరల్: భారీ పారిశ్రామిక హబ్గా గూడూరు రూపుదిద్దుకోనుందని, ప్రతిష్టాత్మక క్రిస్ సిటీ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు లక్ష మందికిపైగా ఉపాధి లభించనుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా వెల్లడించారు. ప్రాజెక్ట్ పురోగతి, జాతీయ రహదారుల విస్తరణపై స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. చిల్లకూరు మండలంలో ఏర్పాటు చేయనున్న క్రిస్ సిటీ ప్రాజెక్ట్ పనులు శరవేగంతో జరుగుతున్నాయని చెప్పారు. భూమి కోల్పోయిన బాధితులకు అందాల్సిన రూ.30 కోట్ల పరిహారాన్ని వచ్చే వారంలో నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నామని ప్రకటించారు. జాతీయ రహదారి పనుల్లో జరుగుతున్న ఆలస్యంపై ఆసహనం వ్యక్తం చేశారు. పనులు నిర్వహిస్తున్న మూడు ప్రధాన కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి.. పనులెక్కడ నిదానంగా జరుగుతున్నాయో గుర్తించి తక్షణమే వేగవంతం చేయాలని చెప్పారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్డీఓ సత్యనారాయణ, డీఎస్పీ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. -
జగనన్న చలువతోనే సొంతింటి కల సాకారం
● పేదలకు ఒక్క గృహాన్నైనా చంద్రబాబు కట్టారా..? ● క్రెడిట్ చోరీలో సిద్ధహస్తుడు ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మనుబోలు: గత సీఎం జగన్మోహన్రెడ్డి చలువతోనే పేదలకు సొంతింటి కల సాకారమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని జగనన్న కాలనీని మంగళవారం సందర్శించారు. అక్కడి సౌకర్యాలను పరిశీలించిన అనంతరం లబ్ధిదారులతో ముచ్చటించారు. ఎన్నో ఏళ్లుగా అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతున్న తమకు ఇళ్ల స్థలాలను జగనన్న ఇవ్వడమే కాకుండా గృహాలను నిర్మించిచ్చారని వారు తెలియజేశారు. జగనన్న చిత్రపటానికి క్షీరాభిషేకాన్ని లబ్ధిదారులు నిర్వహించారు. అనంతరం కాకాణి మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన మంచి పనులు కళ్ల ముందే కనిపిస్తున్నాయని చెప్పారు. ఇళ్లను కాదు.. ఊళ్లనే తమ ప్రభుత్వం అప్పట్లో నిర్మించిందని గుర్తుచేశారు. మనుబోలులోని జగనన్న కాలనీలో 300 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను కేటాయించగా, ఇందులో 120 మంది నిర్మాణాలను ప్రారంభించారని తెలిపారు. 40 గృహాలు పూర్తవ్వగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. జగనన్న దయతోనే తమ సొంతింటి కల సాకారమైందని లబ్ధిదారులు అంటున్నారని, నిజమైన నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఇదేననిపిస్తోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి 22 నెలలైనా, కనీసం ఒక్క ఇంటినైనా నిర్మించారానని ప్రశ్నించారు. 2.5 లక్షల ఇళ్లను కట్టామంటూ నాయుడుపేటలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో అవాస్తవాలను సీఎం చంద్రబాబు మాట్లాడారని విమర్శించారు. గతంలో తాము కేటాయించి పూర్తి చేసిన ఇళ్లను ఇప్పుడు చంద్రబాబు ప్రారంభిస్తూ, తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. క్రెడిట్ చోరీలో ఆయన సిద్ధహస్తులని విమర్శించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం.. నాలుగుసార్లు సీఎంగా వ్యవహరించిన చంద్రబాబు ఎప్పుడైనా ఇంత పెద్ద ఎత్తున పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించి నిర్మించిచ్చిన దాఖలాలు ఉన్నాయానని ప్రశ్నించారు. నోరు మెదపడంలేదు.. ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగిందంటూ అసెంబ్లీ, నెల్లూరులో ఆరోపణలు చేసిన సోమిరెడ్డికి ఇప్పుడు కాంట్రాక్టర్లతో డీల్ కుదరడంతో నోరు మెదపడంలేదని విమర్శించారు. జగనన్న కాలనీల్లో ఆయన పర్యటిస్తే, జరిగిన అభివృద్ధి కంటికి కనిపిస్తుందన్నారు. చంద్రబాబు వంద జన్మలెత్తినా ఇలాంటి కాలనీలను నిర్మించలేరని చెప్పారు. తాము నిర్మించిన కాలనీల్లో కనీస వసతులను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలేదని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి మరోసారి సీఎం అయ్యాక అన్ని వసతులను కల్పిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ నేతలు బొమ్మిరెడ్డి హరగోపాల్రెడ్డి, ముంగర రవీందర్రెడ్డి, గుండాల ఆదినారాయణ, మారంరెడ్డి ప్రదీప్రెడ్డి, దాసరి భాస్కర్గౌడ్, దువ్వూరు సుధాకర్రెడ్డి, గుమ్మడి వెంకటసుబ్బయ్య, సూరపనేని కిశోర్నాయుడు, ఆవుల తులసీరామ్, గుంజి రమేష్, సన్నారెడ్డి జానకిరామిరెడ్డి, చల్లా నవకోటి, కోసూరు కోటేశ్వరగౌడ్, కేవీఆర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆపరేషన్ చేయించుకునే ఆర్థిక స్తోమతలేదు
నేను కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం కావలి ఏరియా వైద్యశాలలోని కాన్పుల విభాగానికి వచ్చాను. కొన్ని నెలలుగా ఇక్కడ కు.ని. ఆపరేషన్లు చేయడం లేదని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చేయించుకుందామంటే అంత ఆర్థిక స్తోమత లేదు. – జడ ప్రవళిక, సర్వాయపాళెం, కావలి మండలం ప్రైవేట్ ఆస్పత్రిలో చేయించుకోవాలనుకుంటున్నా.. నాకు ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుందామని కావలి ఏరియా వైద్యశాలకు వెళ్తే ప్రస్తుతం ఇక్కడ కు.ని. ఆపరేషన్లు చేయడం లేదని చెప్పడంతో డబ్బులు సమకూర్చుకొని ప్రైవేట్ ఆస్పత్రిలో చేయించుకుందామని అనుకుంటున్నాను. – ఒంగోలు భార్గవి, జలదంకి ● కాన్పుల విభాగంలో ఇద్దరు డాక్టర్లు, ఎనిమిది మంది సిబ్బంది ● పది నెలలుగా ఒక్క కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయని వైనం ● సౌకర్యాలున్నా.. సేవలు శూన్యం తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలునెల్లూరు(పొగతోట): గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ఆదేశించారు. నగరంలోని జెడ్పీ కార్యాలయంలో గల తన చాంబర్లో పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని సూచించారు. జెడ్పీ నిధులతో మంజూరు చేసిన పనులను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ప్రారంభం కాని వాటిని రద్దు చేసి, ఆ స్థానంలో కొత్త పనుల మంజూరుకు అవసరమైన ప్రతిపాదనలను పంపాలని కోరారు. వర్కుల్లో నాణ్యత లోపించకుండా ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. సీఈఓ శ్రీధర్రెడ్డి, పీఆర్ ఎస్ఈ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డీసీపల్లిలో 414 పొగాకు బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 414 బేళ్లను మంగళవారం విక్రయించారని నిర్వహణాధికారి సునీల్కుమార్ తెలిపారు. వేలానికి 477 బేళ్లు రాగా, వీటిలో 414ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. 57,699.7 కిలోల పొగాకును విక్రయించగా, రూ.1,41,19,350.30 వ్యాపారం జరిగిందని వివరించారు. గరిష్టంగా రూ.250.. కనిష్టంగా రూ.220.. సగటు ధర రూ.244.70గా నమోదైందని వెల్లడించారు. ఎనిమిది కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారన్నారు. కావలి ఏరియా వైద్యశాలలోని కాన్పుల విభాగం ‘కుని’కి పాట్లు పడుతోంది. పేదింటి మహిళలకు కాన్పులు, కుటుంబ నియంత్రణ వైద్య సేవలు అందించేందుకు మెరుగైన సౌకర్యాలు, తగినంత వైద్య సిబ్బంది ఉన్నప్పటికీ సేవలు శూన్యంగా మారాయి. పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్లకు, చుట్టు పక్కల మండలాల్లోని పీహెచ్సీలకు నిత్యం పదుల సంఖ్యలో గర్భిణులు వైద్య సేవల కోసం వస్తుంటారు. అయితే ప్రధానంగా వీరందరికి కాన్పులు, కుటుంబ నియంత్రణచేపట్టాలంటే ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఏరియా వైద్యశాలకు తీసుకువస్తుంటారు. అయితే ఇక్కడి కు.ని. ఆపరేషన్లు చేయకపోవడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ●కావలి: జిల్లా కేంద్రం తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన కావలి పట్టణంలోని ఏరియా వైద్యశాలలో ఉన్న కాన్పుల విభాగం నిరుపయోగంగా మారింది. కాన్పులు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేందుకు అవసరమైన అత్యాధునిక వసతులతోపాటు కూడా ఆపరేషన్ థియేటర్, అవసరమైన ఇద్దరు డాక్టర్లు, ఒక ఏఎన్ఎం, సూపర్వైజర్, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక ల్యాబ్ టెక్నిషియన్, జూనియర్ అసిస్టెంట్, ఎఫ్ఎన్ఓ, మరో ఉద్యోగి ఉన్నారు. అయితే 10 నెలలుగా ఈ కాన్పుల విభాగంలో ఒక్కటంటే ఒక్క కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన పాపాన పోలేదు. వీరికి నెలలకు రూ.లక్షల్లో జీతాలు చెల్లిస్తున్నప్పటికీ.. ఒక ఆపరేషన్ కూడా జరగకపోవడంతో ప్రజాధనం ఏ విధంగా దుబారా అవుతుందో అర్థమవుతోంది. జీజీహెచ్కు రెఫర్.. కావలి పట్టణంలో ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. వీటితోపాటు కావలి మండలం తుమ్మలపెంట, సర్వాయపాళెం, బోగోలు మండలంలోని కోవూరుపల్లి, జలదంకి, కొండాపురం, గట్టుపల్లి ప్రాంతాల నుంచి నిత్యం పదుల సంఖ్యలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం వచ్చే ప్రతి ఒక్కరినీ నేరుగా నెల్లూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)కి రిఫరల్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అసలే పేదరికం.. ఊరుకాని ఊరికెళ్లి అక్కడ మూడు రోజుల పాటు ఉండాల్సి రావడంతో ఖర్చులు పెరిగి పోతుండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆపరేషన్ చేయించుకొనే మహిళలను ఆశా, ఏఎన్ఎం నెల్లూరు జీజీహెచ్కు తీసుకెళ్లాలంటే ఆటో ఖర్చులకు చేతి డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి ఆశా, ఏఎన్ఎంలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించాలనే టార్గెట్లు పెట్టడం, ప్రభుత్వం సైతం ఖర్చులకు నిధులివ్వకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో వారు వ్యయప్రయాసలు పడుతున్నారు. కొద్దో గొప్పో ఆర్థిక స్థోమత ఉన్న వాళ్లు స్థానికంగానే ప్రైవేట్ వైద్యశాలను ఆశ్రయించి వేల రూపాయిలు వెచ్చించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేని వారు, ముఖ్యంగా గిరిజనులు కు.ని. ఆపరేషన్కు దూరమవుతున్నారు. ఈ క్రమంలో మరోసారి గర్భం దాల్చుతున్న పరిస్థితి నెలకొంది. మరి కొందరు అయితే ఇక్కడే కు.ని. ఆపరేషన్లు చేయించుకునేందుకు ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ విషయమై డీఎంహెచ్ఓ సుజాతను సంప్రదించగా, కావలిలోని కాన్పుల విభాగంలోని డాక్టర్లు ఇద్దరు ఉన్నారని, వారికి ఆపరేషన్ చేసే సామర్థ్యం లేకపోవడంతో ప్రస్తుతం వారు శిక్షణ పొందుతున్నారని, వీలైనంత త్వరలోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మొదలు పెడుతామన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కావలి ఏరియా వైద్యశాలలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగేటట్లు చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
కూటమి ప్రభుత్వ కక్షసాధింపు చర్యలు
నెల్లూరు రూరల్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి ఆరోపించారు. అక్రమ కేసులో నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న పార్టీ కందుకూరు నియోజకవర్గ పరిశీలకుడు కామిరెడ్డి సత్యనారాయణరెడ్డితో మంగళవారం ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బయట విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమాన్ని సైతం సర్కార్ చేపట్టడంలేదని, పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే వారు తగిన బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని పది కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 74,286 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 33,186 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.44 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. గిరిజన నిరుద్యోగులకు ఉచిత శిక్షణ నెల్లూరు(వేదాయపాళెం): జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతకు డేటా ఎంట్రీ ఆపరేటర్, బేల్దారి, బ్యూటీషియన్, టైలరింగ్, డ్రైవింగ్ తదితర రంగాల్లో ఉచిత శిక్షణను ఇవ్వనున్నామని ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు కొండాయపాళెం గేట్ సమీపంలోని కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు సమగ్ర కార్యాచరణ నెల్లూరు రూరల్: పర్యావరణ పరిరక్షణకు సమగ్ర కార్యాచరణతో పనిచేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. నగరంలోని తన క్యాంప్ కార్యాలయంలో జిల్లా స్థాయి అటవీ, వన్యప్రాణి పరిరక్షణ కమిటీతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసి అటవీ భూముల ఆక్రమణలు, అక్రమ రవాణాను కట్టడి చేయాలని ఆదేశించారు. ఎర్రచందనం రక్షణకు ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు తీర ప్రాంతాల్లో ఆలివ్ రిడ్లీ తాబేళ్ల సంరక్షణ, అటవీ అగ్ని ప్రమాదాల నివారణ వంటి కీలక అంశాలపై చర్చించారు. పెనుశిల లక్ష్మీనరసింహ వన్యప్రాణి అభయారణ్యానికి సంబంధించిన ఎకో సెన్సిటివ్ జోన్ మాస్టర్ ప్లాన్ పురోగతిని సమీక్షించారు. రిజర్వ్ అటవీ ప్రాంతాలకు వెలుపల ఉన్న రెవెన్యూ భూముల్లో పర్యాటక అభివృద్ధికి అనుకూలమైన ప్రదేశాలను గుర్తించాలని సూచించారు. ఆలివ్ రిడ్లీ తాబేళ్ల సంరక్షణలో భాగంగా ట్రీ ఫౌండేషన్ రూపొందించిన రెండు అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. డీఎఫ్ఓ మహబూబ్బాషా, నెల్లూరు, ఆత్మకూరు ఆర్డీఓలు అనూష, పావని, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, డీపీఓ వసుమతి, ఏపీఐఐసీ జెడ్ఎం శివకుమార్, జిల్లా సర్వే, ల్యాండ్ రికార్డుల డీడీ నాగశేఖర్, సుప్రజ ధరిణి తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ విలువలను పరిరక్షించాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): భారత రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ఎంతో అవసరమని రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ట్రాన్స్కో సీఎండీ విజయానంద్ పేర్కొన్నారు. నగరంలోని విద్యుత్ భవన్లో ఏపీఎస్ఈబీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాజ్యాంగ విలువలను కాపాడేలా ప్రతి ఒక్కరూ ప్రవర్తించినప్పుడే అంబేడ్కర్కు ఘన నివాళులర్పించిన వారవుతామని తెలిపారు. వేసవిలో రోజూ అత్యధికంగా 14,586 మెగావాట్ల విద్యుత్ను వినియోగిస్తున్నారని చెప్పారు. అనంతరం ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ మాట్లాడారు. అంబేడ్కర్ అడుగుజాడల్లో నడిచి డిస్కమ్ అభివృద్ధి పథంలో పయనించేలా ఉద్యోగులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ గురవయ్య, జేసీ వెంకటేశ్వర్లు, ట్రెయినీ కలెక్టర్ పవన్కుమార్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ జనార్దన్నాయడు, జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ నేతలు కిరణ్, శివశంకర్, రమేష్బాబు, జయరామయ్య, పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో మెజార్టీ బంకుల్లో నోస్టాక్ బోర్డులు
● డీజిల్ దొరక్క ఇబ్బందులు పడుతున్న వాహనదారులు ● అత్యవసరమంటే 10 నుంచి 20 లీటర్లు మాత్రమే సరఫరా ● మధ్యలోనే నిలిచిపోతున్న ట్రావెల్స్ వాహనాలు ● డీజిల్ లేక ఆగిన నిత్యావసర సరుకుల రవాణా వాహనాలు ● ధరలు పెంచుతున్న వ్యాపారులు ● ధాన్యం, బియ్యం రవాణా వాహనాలపై తీవ్ర ప్రభావం ● ఇసుక, గ్రావెల్, సిలికా మాఫియాకు సమృద్ధిగా డీజిల్ సరఫరా ● ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత కూటమి ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ సంక్షోభంగా ప్రజాభిప్రాయం వెల్లడవుతోంది. చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి చెబుతుండగా, ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కేవలం ఈ రాష్ట్రంలోనే ఏర్పడడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ పనులకు ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు, ట్రాన్స్పోర్టు రంగంలోని బైక్లు, ఆటోలు మొదలు ట్రావెల్స్, గూడ్స్ రవాణా వాహనాలు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోతుంటే.. ఇసుక, గ్రావెల్, సిలికా తరలించే మాఫియా వాహనాలకు ఇంధనం సమృద్ధిగా దొరుకుతుండడం గమనార్హం. నిప్పులు చెరిగే ఎండలో నెల్లూరు నగరంలో ఆటోలు, కార్లు, బైక్లు బార్లు తీరిన దృశ్యాలు ప్రజలను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నెల్లూరులోని మన్సూర్నగర్ ప్రాంతంలోని పెట్రోల్ బంకు వద్ద బారులు తీరిన ఆటోలునెల్లూరు (టౌన్): కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం, ముందు చూపు కొరవడి జిల్లా అధికార యంత్రాంగం కారణంగా జిల్లాలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం రోజు రోజుకు జఠిలమవుతోంది. మూడు రోజులుగా ఈ సమస్య ఉన్నప్పటికీ అధికారులు, ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడంతో ఆదివారం నుంచి మొదలైన సమస్య రెండో రోజూ సోమవారానికి మరింత సంక్షోభ స్థితికి చేరింది. ఓ వైపు నిప్పులు చెరిగే ఎర్రటి ఎండలో ద్విచక్రవాహనాదారుల నుంచి ఆటోలు, కార్లు, ట్రాక్టర్లు, మినీ వాహనాలు పెట్రోల్ బంకుల ముందు బారులు తీరుతున్నాయి. 10 లీటర్ల్ల డీజిల్ దొరకాలంటే వాహనదారులకు చుక్కలు కనబడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయిల్ బంకుల్లో డీజిల్ సరఫరాపై నో స్టాక్ బోర్డులు పెట్టారు. పలుకుబడి ఉన్న, రాజకీయ నాయకులకు మాత్రమే డీజిల్ను సరఫరా చేస్తూ సామన్య ప్రజలను ఆయిల్ బంకుల యాజమానులు ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రవాణా చార్జీలు అమాంతం పెరుగుదల జిల్లాల్లో ప్రధానంగా ధాన్యం, బియ్యం, నిత్యావసర సరుకులను రవాణా చేసే వాహనాలు వేల సంఖ్యలో ఉన్నాయి. వీటితో పాటు ప్రయాణికులను రవాణా చేసే ఆటోల వారు సైతం డీజిల్కు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలను వ్యాపారులు అమాంతంగా పెంచారు. సరిపడా డీజిల్ దొరక్క ప్రతిరోజు జిల్లా నుంచి హైదరబాద్, బెంగళూరు, విశాఖపట్నం వెళుతున్న ట్రావెల్స్ బస్సులను పదుల సంఖ్యలో నిలిపివేసిన పరిస్థితి నెలకొంది. మరికొన్ని బస్సుల్లో చార్జీలు పెంచడం గమనార్హం. సోమవారం హైదరాబాద్, విశాఖపట్నం నుంచి ప్రయాణికులతో చెన్నె వెళుతున్న కేవీఆర్, ఎంఆర్ఎం, సాలీమర్ తదితర 7 ట్రావెల్స్ బస్సులు డీజిల్ లేక సోమవారం తెల్లవారుజామున కొడవలూరు మండలం రామన్నపాళెం రైల్వే గేటు సమీపంలో నిలిచిపోయాయి. దీంతో బస్సుల్లో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ట్రావెల్స్ బస్సుల డ్రైవర్లు సమీపంలోని బంకుల యాజమానులను బతిమిలాడితే రెండు మూడు బస్సులకు 10 నుంచి 20 లీటర్లు మాత్రమే సరఫరా చేశారు. దీంతో ఆయా బస్సుల్లోని ప్రయాణికుల్లో కొంత మంది అధక ధరలతో బాడుగ కార్లు మాట్లాడుకుని వెళ్లగా, మరి కొంతమంది తమ సొంత కార్లును పిలిపించుకుని వెళ్లారు. ఇసుక, గ్రావెల్, చికెన్ వేస్ట్ మాఫియాకు మాత్రం డీజిల్ సరఫరా జిల్లాలో ఇసుక, గ్రావెల్, చికెన్ వేస్ట్, బూడిద మాఫియాలకు మాత్రం సమృద్ధిగా డీజిల్ దొరుకుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివిధ రకాల రవాణా వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోతే.. ఈ వాహనాలు మాత్రం విచ్చలవిడిగా తిరుగుతుండడంపై సర్వత్రా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరికి అర్ధరాత్రి సమయంలో లైట్లు ఆపేసి డీజిల్ కొట్టి పంపిస్తున్నట్లు తెలిసింది. పలుకుబడి కలిగిన, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులకు ఆయా బంకులు యాజమానులు డీజిల్ను సరఫరా చేస్తున్నారు. ఎక్కువగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీ అనుచరులకే ఈ వాహనాలు ఉన్నాయి. ఇంధన ధరలు పెంచడానికేనా! నెల్లూరు (పొగతోట): జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత వెనుక డబుల్ ఇంజిన్ కూటమి సర్కార్ ఇంధన ధరలు పెంచాలనే కుట్ర ఉందని వాహన యజమానులు ఆరోపిస్తున్నారు. రెండు రోజుల్లోనే జిల్లాలో అనేక రంగాలు కుప్పకూలాయి. జిల్లాలో 243 పెట్రోలు బంకులు ఉండగా జిల్లాకు ప్రతి నిత్యం 375 కిలోలీటర్ల. పెట్రోలు, 738 కిలోలీటర్ల డీజిల్ సరఫరా అయ్యేది. వాస్తవానికి జిల్లాలో రోజుకు 314 కి.లీ. పెట్రోలు, 568 కి.లీ. డీజిల్ వినియోగం జరుగుతోంది. అయితే గత రెండు రోజులుగా జిల్లాకు అరకొరగా సరఫరా కావడంతో ఈ పరిస్థ్థితి తలెత్తినట్లు బంకుల యజమానులు చెబుతున్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వంతోపాటు ఆయిల్ రిఫైన్ కంపెనీలపై పడే భారాన్ని తగ్గించేందుకే ఇలాంటిని పరిస్థితిని సృష్టించారని బంకుల యజమానులు అభిప్రాయపడుతున్నారు. సీఎన్జీ బంకుల్లో సైతం వాహనాలు బారులు తీరి ఉన్నాయి. బంకుల్లో ప్రజలు అడిగినంత పెట్రోలు, డీజిల్ నింపడంలేదు. డీజిల్ కొరతతో అంబులెన్స్లు సైతం సేవలు అందించలేని పరిస్థితులు ఉన్నాయి. ఆటోలపై ఆధారపడి ప్రయా ణం చేసే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వాహనాలపై కార్యాలయాలకు వెళ్లే అధికారులు సైతం పెట్రోలు, డీజిల్ కొరతతో అవస్థ పడుతున్నారు. నిమ్మ మార్కెట్కు డీజిల్ సెగ పొదలకూరు : డీజిల్ కొరత స్థానిక ప్రభుత్వ నిమ్మ మార్కెట్పై ప్రభావం చూపుతోంది. డీజిల్ కొరతతో తోటల్లో నుంచి కాయలను మార్కెట్కు తరలించేందుకు ఆటోలు రావడమే కష్టంగా మారిందని రైతులు ఆందోళన చెందుతుంటే.. మార్కెట్ నుంచి కాయలను ఉత్తర భారత దేశానికి ఎగుమతి చేసేందుకు వ్యాపారులు కూడా ఆందోళన చెందాల్సి వస్తోంది. సోమవారం బీహార్ ప్రాంతానికి ఎగుమతులను వద్దన్న అక్కడి వ్యాపారులు తర్వాత డీజిల్ ఎలాగైనా తామే పట్టిస్తామనడంతో స్థానిక వ్యాపారులు కాయలను కొనుగోలు చేశారు. ప్రస్తుతం బస్తా కాయలు రూ.14 వేల నుంచి రూ.15 వేల వరకు ధరలు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖరీదైన సరకును ఢిల్లీ, బీహార్, మధుర, లక్నో, వారణాశి తదితర ప్రాంతాలకు సకాలంలో చేర్చకపోతే వ్యాపారులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. వందల కి.మీ. వెళ్లాల్సిన లారీలు డీజిల్ కొరత వల్ల మధ్యలో నిలిచిపోతే పచ్చి సరుకు పాడై నష్టాలు చవిచూడాల్సి వస్తుందని వ్యాపారులు టెన్షన్ పడుతున్నారు. -
బాబు పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు(వేదాయపాళెం): చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతోందని, బాధితులపైనే తిరిగి కేసులు నమోదు చేస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. ఏబీన్ రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్సీపీ శ్రేణులు గతంలో జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఇచ్చిన ఫిర్యాదుల పురోగతిని తెలుసుకునేందుకు సోమవారం ఆయన ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ, అడిషనల్ ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో డీఎస్పీతో మాట్లాడి వెనుతిరిగారు. అనంతరం ఎస్పీ కార్యాలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర రాజధానిగా మావిగన్ పేరును ప్రస్తావించగానే చంద్రబాబులో కలవరం మొదలైందన్నారు. దాని పర్యవసానమే తమ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులపై ఏబీఎన్ రాధాకృష్ణ ద్వారా అనుచిత వ్యాఖ్యలు పలికించారని తెలిపారు. ఈ విషయమై తాము నిరసనలు తెలిపి ఫిర్యాదులు చేస్తే ఇప్పటి వర కు పోలీసులు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా తాము, తమ పార్టీ శ్రేణులు ఏబీఎన్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపితే సిబ్బందిని అడ్డుకున్నామని ఒక కేసు, డీఎస్పీ విధులకు ఆటంకం కలిగించామని మరో కేసు నమోదు చేయించడం విడ్డూరంగా ఉందన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తాము ఇచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ఇప్పటి వరకు పోలీసులు ఎటువంటి రసీదులు ఇవ్వలేదని, ఈ విషయమై తాము పోలీసులను అడిగితే దాటవేత, నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తున్నారన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ఫిర్యాదుల పురోగతి గురించి తాము అడిగితే సెల్ఫోన్కు మెసేజ్ వస్తుందని సమాధానం ఇచ్చి తప్పించుకునేందుకు చూస్తున్నారని, అవసరమైతే న్యాయ పోరాటానికి కూడా తాము సిద్ధమేనని తెలిపారు. ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోకపోగా తిరిగి తమపైనే కేసులు నమోదు చేయించడం చంద్రబాబు నియంతృత్వపాలనకు నిదర్శనమన్నారు. 40 ఏళ్ల సీనియర్ను అని చెప్పుకునే చంద్రబాబు ప్రతిపక్షాల పట్ల అణచివేత ధోరణితో అభాసుపాలవుతున్నారన్నారు. బాబు పాలనలో మహిళలపై దాడులు పెరిగిపోయాయన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు టోల్గేట్లో పనిచేసే మహిళలపై అనుచితంగా ప్రవర్తించి, వారిని దుర్భాషలాడి, దాడి చేసి గాయపరచిన కూడా ఇప్పటి వరకు వారిపై చర్యలు తీసుకోకపోవడం బాబు అహంకార ధోరణికి అద్ధం పడుతుందన్నారు. ప్రజలు అన్ని విషయాలను క్షుణ్ణంగా గమనిస్తున్నారని తగిన సమయంలో టీడీపీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సభ్యసమాజం సిగ్గుపడేలా రాధాకృష్ణ వ్యాఖ్యలు నెల్లూరురూరల్ పార్టీ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీ నాయకులు, కుటుంబంలోని మహిళలపై ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను సభ్య సమాజం ముక్తకంఠంతో ఖండిస్తోందన్నారు. రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదన్నారు. నెల్లూరు నగరంలో ట్రీప్ల్లాంటేషన్లో టీడీపీ నాయకుల అవినీతి భాగోతాన్ని తమ పార్టీ నాయకులు గణాంకాలతో సహా బట్టబయలు చేశారని తెలిపారు. దీంతో టీడీపీ నాయకుల అవినీతిని కప్పిపుచ్చేందుకు అధికారులు అవస్థలు పడుతున్నారన్నారు. పార్టీ మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, నాయకులు పేర్నేటి కోటేశ్వరరెడ్డి, ధనూజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ట్రీ ప్లాంటేషన్లో అవినీతి ఎమ్మెల్సీ, నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో ట్రీ ప్లాంటేషన్ పేరుతో అంతులేని అవినీతి జరుగుతుందని తాము నిరూపించామని తెలిపారు. దీంతో మంత్రి నారాయణ, అవినీతితో సంబంధమున్న నాయకులు యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మొక్క నాటేందుకు రూ.5వేలు, నిర్వహణకు రూ.6,588 చొప్పున అంచనాలు సిద్ధం చేసి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ అవినీతి భాగోతం ప్రజలకు తెలియడంతో సీమరాజ అనే పెయిడ్ ఆర్టిస్ట్ను తీసుకొచ్చి నాటకాలు ఆడిస్తున్నారని, నగర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఈ అవినీతి, అక్రమాలపై జనవరి 26 తేదీన తాము లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశా మని గుర్తుచేశారు. -
దొంగతనం కేసులో పురోగతి లేదు
● ఎస్పీ దృష్టికి తీసుకెళ్లిన బాధితులు ● పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నెల్లూరు(క్రైమ్): ‘మా ఇంట్లో గతేడాది సెప్టెంబర్లో దొంగతనం జరిగింది. రూ.లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలను దుండగులు అపహరించుకెళ్లారు. కావలి రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతవరకూ ఎలాంటి పురోగతి లేదు. త్వరితగతిన నిందితుడిని కనుక్కుని సొత్తును రికవరీ చేయాలి’ అని కావలికి చెందిన ఓ మహిళ కోరారు. నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాలేదు. మీరైనా విచారించి న్యాయం చేయండంటూ బాధితులు ఉన్నతాధికారులను కోరారు. జిల్లా నలుమూలల నుంచి 148 మంది విచ్చేసి వినతులను ఎస్పీ అజిత వేజెండ్లకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె చట్టప్రకారం విచారణ జరిపి న్యాయం చేస్తామని భరోసానిచ్చారు. ప్రజా వినతుల పట్ల అలసత్వం ప్రదర్శించరాదని ఆయా ప్రాంత పోలీసు అధికారులకు సూచించారు. వినతుల్లో అధికశాతం మహిళలకు చెందినవే. కార్యక్రమంలో కావలి, డీటీసీ, మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీలు వీవీ రమణకుమార్, గిరిధర్, సత్యనారాయణ, మహిళా పోలీస్స్టేషన్, కంట్రోల్రూమ్, ఎస్బీ– 2 ఇన్స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, భక్తవతల్సరెడ్డి, బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● నా భర్త లక్ష్మణ్ వీఆర్వోగా పనిచేస్తున్నాడు. మూడునెలల క్రితం ఆయన అదృశ్యమయ్యాడు. ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఇంతవరకూ కేసులో ఎలాంటి పురోగతి లేదు. పీజీఆర్ఎస్లో చెప్పినా ఫలితం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నా భర్త ఆచూకీ తెలియజేయాలని వింజమూరుకు చెందిన పావని వినతిపత్రమిచ్చారు. ● ఐటీ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని కర్నూలుకు చెందిన కె.ప్రదీప్కుమార్, ఒంగోలుకు చెందిన వెంకటసురేంద్ర నా వద్ద రూ.1.25 లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం ఇప్పించకపోవడంతో నగదును తిరిగివ్వాలని అడగ్గా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వేదాయపాళేనికి చెందిన ఓ యువతి కోరారు. ● నా కుమార్తె ఈనెల 21వ తేదీ నుంచి ఆమె కనిపించడం లేదు. నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. త్వరితగతిన ఆచూకీ కనుక్కుని అప్పగించాలని నవాబుపేట ప్రాంతానికి చెందిన ఓ వివాహిత అర్జీ ఇచ్చారు. -
జిల్లాకు 148 ట్యాంకర్ల డీజిల్ మంజూరు
● కలెక్టర్ వెల్లడి నెల్లూరురూరల్: జిల్లాకు 148 ట్యాంకర్ల డీజిల్ మంజూరైనట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. సోమవారం ఆయన అధికారులతో చమురు సరఫరా పరిస్థితిపై చర్చించారు. జిల్లాలో 271 డీజిల్ అవుట్లెట్లు ఉన్నాయని, వాటిలో 40 షాపుల్లో నిల్వలు కొంత తక్కువగా ఉన్నాయన్నారు. ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీల్ యాజమాన్యాలతో చర్చించామన్నారు. రవాణా విషయంలో జాప్య నివారణకు ఎస్పీతో కూడా మాట్లాడామన్నారు. కృష్ణపట్నం పోర్టు, కడప, చిత్తూరు నుంచి డీజిల్ అందుతుందన్నారు. వరి, రొయ్యల సాగుకు సరిపడా డీజిల్ అందిస్తామని, ఇందు కోసం ప్రతి షాపు దగ్గర ఒక వీఆర్ఓ, హోంగార్డును ఆధార్ కార్డుల పరిశీలనకు ఏర్పాటు చేశామన్నారు.స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాక నేడునెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర ఎనర్జీ సెక్రటరీ, ఏపీ ట్రాన్స్కో సీఎండీ ఎన్.విజయానంద్ మంగళవారం నెల్లూరు నగరానికి రానున్నారు. విద్యుత్ భవన్లో ఏపీ ఎస్ఈబీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియన్ ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్, పలువురు విద్యుత్ ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.జీతాలివ్వండి మహాప్రభో..● డీఆర్డీఏలో ఇదీ పరిస్థితి నెల్లూరు(పొగతోట): డీఆర్డీఏ ఉద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు అందక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకటి నుంచి 5వ తేదీలోపు అందాల్సిన జీతాలు 28వ తేదీ వచ్చిన ఇంతవరకు జమ కాలేదు. ఈఎంఐలు, ఇతర అవసరాల కోసం వేతనాలపై ఆధారపడి జీవనం సాగించే ఉద్యోగులు అనేక అవస్థలు పడుతున్నారు. డీఆర్డీఏలో జిల్లా వ్యాప్తంగా వివిధ హోదాల్లో 200 నుంచి 250 మంది పనిచేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, అనేక మండలాలు పాత జిల్లాల్లో విలీనం చేయడం తదితర కారణాలతో జీతాల మంజూరులో జాప్యం జరుగుతోందని అధికారులు సమాధానమిస్తున్నారు. మరోనెల కూడా వస్తోందని అయినా వేతనాలు అందుతాయో లేదోనని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 డ్రమ్ముల్లో చికెన్ వ్యర్థాల పట్టివేతమర్రిపాడు: మండలంలో చుంచులూరుక్రాస్ రోడ్డు వద్ద చికెన్ వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని మర్రిపాడు ఎస్సై కాసుల శ్రీనివాసరావు సోమవారం పట్టుకున్నారు. ఆయన కథనం మేరకు.. కడప నుంచి అనుమతి లేకుండా వ్యర్థాలను తరలిస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు. తనిఖీల్లో భాగంగా బొలెరో వాహనంలో సుమారు 20 డ్రమ్ముల చికెన్ వ్యర్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహన డ్రైవర్, యజమానిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం రెవెన్యూ అధికారుల సమక్షంలో స్వాధీనం చేసిన వ్యర్థాలను గ్రామం బయట పూడ్చివేశారు. -
సమస్యలు అనేకం.. పరిష్కారం గగనం
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● పోటెత్తిన అర్జీదారులునెల్లూరురూరల్: ‘అయ్యా.. క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. మీరైనా కనికరించండి’ అంటూ అర్జీదారులు వేడుకున్నారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, ట్రెయినీ కలెక్టర్ పవన్ తేజ, డీఆర్వో విజయ్కుమార్ తదితరులు ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. పరిహారం చెల్లించాలంటూ.. వింజమూరు మండలం గుండెమడకల రిజర్వాయర్ ప్రభావంతో నష్టపోయిన రైతులకు తక్షణం అవార్డు ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలని మాజీ చైర్పర్సన్ చెంచలబాబుయాదవ్, గ్రామ రైతులు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ రిజర్వాయర్ పనులు ఆగిపోవడంతో పాత చెరువు ఆయకట్టు కింద ఉన్న సుమారు 1,000 ఎకరాల మాగాణి భూములు బీడుగా మారినట్లు చెప్పారు. సుమారు రూ.78 కోట్లు చెల్లిస్తే రైతులకు న్యాయం జరిగి, కట్ట నిర్మాణం కూడా పూర్తవుతుందని పేర్కొన్నారు. గోవధ నిషేధించండి గోవధను నిషేధించాలని కల్లూరుపల్లిలోని శ్రీమావిస్ జైన్ పశుసేవా కేంద్రం వ్యవస్థాపకులు దినేష్ జైన్ సురేష్ జైన్, జలదీప్ జైన్ వినతిపత్రం సమర్పి ంచారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గోసేవ కోసం కేంద్రం చట్టం తీసుకురావాలన్నారు. ఆయిల్ కొరత లేకుండా చూడండి జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా చూడాలని వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ కలెక్టర్ హిమాన్షు శుక్లాను కోరారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణ కలువాయి మండలంలోని కుల్లూరులో గుంజి రవి ప్రభుత్వ స్థలాలు, గ్రామస్తుల డీ– పట్టాల భూములను ఆక్రమిస్తున్నారని అదే గ్రామానికి చెందిన దేవరకొండా శ్రీరాములు, దేవరకొండ వెంకట సుబ్బయ్య, తుపిలి లక్ష్మమ్మ, ఏగు నరసింహులు అధికారులకు ఫిర్యాదు చేశారు. రవి పనులు చేయిస్తానని ప్రలోభాలకు గురిచేసి, ప్రభుత్వ, ఆర్అండ్బీ భూముల్లో దారులు లేకుండా గుంతలు తవ్వి, పెద్ద గేట్లు పెట్టారన్నారు. అతను అనుచరులతో కలిసి సర్వే నంబర్ 667–2బీ, 723–1, 733, 552/1లో ఆక్రమణలు చేసి వేరే వారికి కూడా అమ్మడం జరిగిందని అర్జీలో పేర్కొన్నారు. పొదుపు సమస్యలపై వినతి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం వారు కలెక్టర్ను కలిసి పొదుపు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు గురించి అర్జీ సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ నెల్లూరులో ఆన్లైన్ నమోదు పేరుతో పొదుపు మహిళలపై మెప్మా అధికారులు చేస్తున్న వేధింపులను ఆపాలన్నారు. రుణానికి ప్రభుత్వం తరఫున వడ్డీ మాఫీ ఇవ్వడం లేదన్నారు. -
స్వగ్రామానికి వెళ్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి దుత్తలూరు: బైక్ అదుపుతప్పి ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని సోమలరేగడ సమీపంలో 167 బీజీ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసుల కథనం మేరకు.. దుత్తలూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పీట్ల నవీన్ (22) వరికోత మెషీన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయగిరి మండలంలోని ఓ గ్రామంలో పనికి వెళ్లాడు. తిరిగి బైక్పై స్వగ్రామానికి బయలుదేరాడు. సోమలరేగడ సమీపంలో బైక్ అదుపు తప్పింది. స్థానికులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. సిబ్బంది నవీన్ను చికిత్స నిమిత్తం ఉదయగిరి వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు వైద్యశాలకు తీసుకెళ్తుండగా మృతిచెందాడు. నవీన్కు తల్లిదండ్రులు, ఇద్దరు సోదరీమణులున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రబాబు అసమర్థత వల్లే కొరత
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరురూరల్: కూటమి ప్రభుత్వ వైఫల్యం, చంద్రబాబు అసమర్థత వల్లే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత దాపురించిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. నగరంలోని ఓ పెట్రోల్ బంకును సోమవారం సందర్శించి ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిశీలించారు. డీజిల్, పెట్రోల్ కోసం వచ్చిన రైతులు, వాహనదారులతో మాట్లాడారు. ఉదయం నుంచి బంకుల చుట్టూ తిరుగుతున్నామని, ఎక్కడా డీజిల్ పట్టలేదని కాకాణి ఎదుట క్యాన్లు పట్టుకుని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి పాలనలో రైతులకు, సాధారణ ప్రజలకు కష్టాలు తప్పడం లేదని, చంద్రబాబుకు ముందు చూపులేని కారణంగానే పెట్రోల్ బంకుల వద్ద కి.మీ. మేర వాహనాలు బారులు తీరి గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఇంధన కొరత కారణంగా నిత్యావసర సరుకుల రవాణాపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు, రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఇంధనం పుష్కలంగా దొరుకుతోందని, అక్కడ ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వాలు లేకపోయినా ధరలు తక్కువగా ఉండడమే కాకుండా, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా దొరుకుతుందన్నారు. ఇంధనం దొరక్క నెల్లూరు దాటి వెళ్లలేక వందలాది వాహనాలు హైవే పక్కన నిలిచిపోయాయన్నారు. చంద్రబాబు కేవలం మీడియాలో ఆవేదన వ్యక్తం చేయడం తప్ప, క్షేత్రస్థాయిలో సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాడని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. చంద్రబాబు తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి డ్రామాలు ఆడటం మానేసి, వెంటనే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి రాష్ట్రానికి సరిపడా పెట్రోల్, డీజిల్ సరఫరా అయ్యేలా చూడాలన్నారు. ఒక వైపు సివిల్ సప్లైస్ మంత్రి రాష్ట్రంలో ఎక్కడా ఇంధన కొరత లేదని చెబుతుంటే, మరో వైపు క్షేత్రస్థాయిలో అధికారులు ఆంక్షలు విధిస్తున్నారని, ఈ పొంతన లేని మాటలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఆయిల్ సరఫరాను పునరుద్ధరించి పెట్రోల్ బంకుల వద్ద రద్దీని తగ్గించి, సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఆనందం ఆవిరి
● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతినెల్లూరు(క్రైమ్): అతను కుమారుడు పుట్టాడని ఆనందంలో ఉన్నాడు. భార్యాబిడ్డను చూసేందుకు మోటార్బైక్పై బయలుదేరాడు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు రూరల్ మండలం కొండ్లపూడి గ్రామానికి చెందిన పి.సునీల్ (30) సెంట్రింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య ఇటీవల కుమారునికి జన్మనిచ్చి మినగల్లులోని పుట్టింట్లో ఉంటోంది. ఆదివారం సునీల్ తిరుమలకు వెళ్లి దైవదర్శనం చేసుకుని సోమవారం నెల్లూరుకు వచ్చాడు. అనంతరం భార్య, కుమారుడిని చూసేందుకు ఇంటి నుంచి బైక్పై మినగల్లుకు బయలుదేరాడు. జొన్నవాడ ఆర్చివద్ద దేవరపాళెం నుంచి నెల్లూరు వైపు వేగంతో వెళ్తున్న బొలెరొ వాహనం ఢీకొంది. సునీల్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి తండ్రి వెంకయ్య ఈ మేరకు నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ వేణు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. -
9వ హుండీ ద్వారా రూ.20.22 లక్షల రాబడి
అనుమసముద్రంపేట: ఏఎస్పేట దర్గాలో హుండీ కానుకల లెక్కింపును రెండు రోజుల సెలవుల అనంతరం తిరిగి సోమవారం ప్రారంభించారు. 9వ హుండీని లెక్కించగా రూ.20,22,100 నగదు, 3.800 గ్రాముల బంగారు, 800 గ్రాముల వెండి వచ్చినట్లుగా దర్గా ఈఓ హుస్సేన్ తెలిపారు. ఇప్పటి వరకు 9 హుండీల లెక్కింపు పూర్తయిందని, మొత్తం రూ.1,55,82, 071 రాబడి వచ్చిందని ఆయన వివరించారు. మరో పది రోజుల పాటు హుండీల లెక్కింపు కొనసాగుతుందని తెలిపారు. డ్వామా పీడీ బాధ్యతల స్వీకరణ నెల్లూరు(పొగతోట): జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వా మా) పీడీగా సీవీ శ్రీనివాసప్రసాద్ డ్వామా కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి జిల్లా డ్వామా పీడీగా పని చేస్తున్న ఆయన బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇక్కడ పీడీగా విధులు నిర్వహిస్తున్న గంగాభవాని తిరుపతి జిల్లా డివిజనల్ డెవలప్మెంట్ అఽధికారిణిగా బదిలీ అయ్యారు. నూతన పీడీని డ్వామా అడిషనల్ పీడీ స్వరూప్, ఏపీఓలు, టీఏలు, జేఏసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరిగేషన్ సెంట్రల్ డివిజన్ ఈఈగా ఆనంద్బాబు నెల్లూరు(వేదాయపాళెం): జలవనరుల శాఖ నెల్లూరు సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా ఆనంద్బాబు రామలింగాపురంలోని ఇరిగేషన్ కార్యాలయంలో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గూడూరు డివిజన్ డీఈఈగా విధులు నిర్వహిస్తున్న ఆయన పదోన్నతిపై అత్యంత కీలకమైన నెల్లూరు సెంట్రల్ డివిజన్ ఈఈగా నియమతులయ్యారు. జిల్లాలోని ఆత్మకూరు, గూడూరు డివిజన్లలో డీఈఈగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. పెరమన వీఆర్వోపై సస్పెన్షన్ వేటు సంగం: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన మండలంలోని పెరమన వీఆర్వో ఎం కేశవమూర్తిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్ కార్యాలయం, ఎంఆర్ఐ ద్వారా అందిన అర్జీలపై నిర్ణీత సమయంలో నివేదికలు సమర్పించకపోవడం, గ్రామ సచివాలయంలో అందుబాటులో లేకపోవడం, పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన అర్జీల విచారణకు హాజరుకాకపోవడం, ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోకపోవడం, క్రమశిక్షణ లోపించడం, తదితర అంశాలను తీవ్రంగా పరిగణించి సస్పెన్షన్ విధించినట్లుగా అందులో పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కు వగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 30 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 79,878 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,037 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.94 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటలకుపైగా సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. కాగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
కొన్ని మూత.. మరి కొన్నింట్లో లిమిట్
పొదలకూరు : పెట్రోల్, డీజిల్ సంక్షోభం నేపథ్యంలో సోమవారానికి పొదలకూరులోని కొన్ని బంకులు మూతపడగా, నిల్వలు ఉన్న కొన్ని బంకుల ముందు బైక్లు, ఆటోలు, ట్రాక్టర్లు బారులు తీరుతున్నాయి. దీంతో బైకులకు పెట్రోల్ రూ.100, ఆటోలకు డీజిల్ రూ.200, కారుకు రూ.500 అంతకు మించి పట్టడం లేదు. ముత్తుకూరు మండలంలో డీజిల్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. సుమారు 90 శాతం పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. అరకొర బంకుల్లో కొద్దిపాటి ఇంధనం అందుబాటులో ఉండగా అక్కడ వాహనదారులు బారులు తీరుతున్నారు. పెట్రో ల్ ఉంటే డీజిల్ లేదని, డీజిల్ ఉంటే పెట్రోల్ అందుబాటులో లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వైభవంగా లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవాలు
రాపూరు: పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గోనుపల్లిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత లక్ష్మీనృసింహుడు అత్తారింటి నుంచి బయలుదేరి పెంచలకోనకు చేరుకున్నాడు. ఈ ప్రథమ ఊరేగింపుతో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్లు ప్రధాన అర్చకులు పెంచలస్వామి, సీతారామయ్య స్వామి తెలిపారు. గోనుపల్లిలోని ఆలయంలో ఉన్న ఉత్సవమూర్తులను దేవాదాయ సిబ్బంది గిరిజన కాలనీకి తీసుకొచ్చారు. అక్కడ గిరిజనులు సంప్రదాయబద్ధంగా ఆథిత్యం ఇచ్చి పూజలు చేశారు. అనంతరం గోనుపల్లి నుంచి ఉభయ నాంచారులతో బయలుదేరిన లక్ష్మీనరసింహుడి పల్లకిని బోయలు కాళ్లకు పాదరక్షల్లేకుండా మోసుకుంటూ కోనకు చేరుకున్నారు. అలంకార మండపంలో బ్రహ్మోత్సవాల అంకుర్పారణ కార్యక్రమం జరిగింది. -
సమృద్ధిగా ఆయిల్ నిల్వలు ఉన్నాయి
● కలెక్టర్ హిమాన్షు శుక్లా ● రామన్నపాళెం సమీపంలోని బంక్లో ఆకస్మిక తనిఖీ కోవూరు : జిల్లాలో ఇంధన కొరత లేదని, ఆయిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. కొడవలూరు మండలం రామన్నపాళెం రైల్వే గేటు సమీపంలోని ఓ పెట్రోల్ బంకును కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి స్టాక్ పొజిషన్, డిప్ రీడింగ్ తదితర అంశాలను స్వయంగా పరిశీలించారు. బంకు నిర్వాహకులతో మాట్లాడారు. ఎక్కడా ఇబ్బంది రానియొద్దని సూచించారు. జిల్లాకు అవసరమైన ఆయిల్ సరఫరా నిరంతరం కొనసాగుతోందని కలెక్టర్ వివరించారు. ముఖ్యంగా కడప, చిత్తూరు డిపోలతోపాటు కృష్ణపట్నం పోర్టు నుంచి క్రమం తప్పకుండా సరఫరా జరుగుతోందని చెప్పారు. జిల్లాకు మరికొన్ని గంటల్లోనే వివిధ ఆయిల్ కంపెనీలకు చెందిన ట్యాంకర్లు చేరుకుంటాయన్నారు. జిల్లాలో 243 పెట్రోల్ బంకుల్లోనూ నిల్వలు సరిపడా ఉన్నాయని, ప్రతి బంక్ వద్ద పరిస్థితిని ఎస్పీ, జాయింట్ కలెక్టర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. ఎక్కడైనా కృత్రిమ కొరత సృష్టించినా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అపోహలను సృష్టించే వారిపై నిఘా ఉంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి లీలారాణి, తహసీల్దార్ సుబ్బయ్య, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
అసత్య ప్రచారాలను నమ్మొద్దు
నెల్లూరు రూరల్: జిల్లాలో పెట్రోల్, డీజిల్కు ఎక్కడా కొరత లేదని.. అసత్య ప్రచారాలను నమ్మొద్దని జేసీ వెంకటేశ్వర్లు కోరారు. జిల్లాలో ఇంధన కొరత ఉందంటూ వస్తున్న వదంతుల నేపథ్యంలో కలెక్టరేట్లోని శంకరన్ సమావేశ మందిరంలో డీఎస్ఓ లీలారాణితో కలిసి విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. జిల్లాలోని 243 పెట్రోల్ బంకుల్లో నిల్వలు సరిపడా ఉన్నాయని వెల్లడించారు. సరఫరా సక్రమంగా కొనసాగుతున్నా, కొరత ఉందనే వదంతుల నేపథ్యంలో కొన్ని చోట్ల రద్దీ కనిపిస్తోందని తెలిపారు. అవసరమైన మేరకే కొనుగోలు చేయాలని కోరారు. క్యాన్లు, బాటిళ్లలో నింపడాన్ని నిషేధించామని పేర్కొన్నారు. వ్యవసాయం, ఆక్వా రంగాలకు తగినంత డీజిల్ను నిరంతరం సరఫరా చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టామని ప్రకటించారు. ప్రతి ఫిల్లింగ్ స్టేషన్ను పర్యవేక్షించేందుకు తహసీల్దార్లు, సీఎస్డీటీలను నియమించి.. నిల్వల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. అప్పు ప్రాతిపదికన ఆయిల్ కంపెనీలు సరఫరా చేయని కారణంగా జిల్లాలోని 15 బంకుల్లో మాత్రమే చమురు తాత్కాలికంగా అందుబాటులో లేదని, మిగిలిన అన్ని చోట్ల పరిస్థితి సాధారణంగానే ఉందన్నారు. నో స్టాక్ బోర్డులు పెట్టినా.. కృత్రిమ కొరతను సృష్టించేందుకు యత్నించినా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇబ్బందులు ఏర్పడితే 94922 73897 నంబర్ను సంప్రదించాలని సూచించారు. ఏఎస్ఓ లక్ష్మీనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
చేపల చెరువుల్లో పరిశీలన
ఉదయగిరి: జలదంకి, కలిగిరి మండలాల్లో చేపల చెరువులను జిల్లా మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ శాంతికుమారి ఆదివారం పరిశీలించారు. జలదంకి మండలంలోని చిన్నక్రాక మత్స్యకార సహకార సంఘ పరిధిలో గల కాకుటూరు, పెద్దకొండూరు, తిమ్మసముద్రం, మర్రిమాను, చిన్నక్రాక చెరువుల్లో చేపల అక్రమ వేటకు సంబంధించిన సమాచారంతో ఆమె పరిశీలించారు. చిన్నక్రాక మత్స్యకార సహకార సంఘంలోని బోగస్ సభ్యులను తొలగించి.. ఎన్నికలను నిర్వహించి నూతన పాలకవర్గాన్ని ఏర్పాటు చేసేంత వరకు ఈ చెరువుల్లో చేపలు పట్టడాన్ని నిలిపేయాలని ఉత్తర్వులను హైకోర్టు జారీ చేసింది. దీనిపై అవగాహన కల్పించే నిమిత్తం ఆమె వచ్చి సొసైటీ సభ్యులతో మాట్లాడారు. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి చేపల వేటను సాగిస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని ఆమె స్పష్టం చేశారు. మత్స్యశాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ చాంద్బాషా తదితరులు పాల్గొన్నారు. -
మహా ధర్నా విజయవంతానికి పిలుపు
నెల్లూరు రూరల్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలోని ధర్నా చౌక్లో మే ఆరున నిర్వహించనున్న మహా ధర్నాను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్కార్ కొలువుదీరి 22 నెలలు దాటినా.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించలేదని ఆరోపించారు. దశలవారీ పోరాటంలో భాగంగా చేపట్టిన మహా ధర్నాకు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి మాట్లాడారు. పీఆర్సీ కమిటీని గత ప్రభుత్వం ప్రకటించి ఐఆర్ను అమలు చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుత సర్కార్ వెంటనే పీఆర్సీ కమిటీని నియమించి 30 శాతం ఐఆర్ను ఇవ్వడంతో పాటు పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధి రఘురామ్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేంద్ర, ప్రసాద్రెడ్డి, ప్రసాద్, నెల్లూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివశంకర్రెడ్డి, మునీర్జాన్, ప్రకాశం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణారెడ్డి, కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పరిహారంలోనూ టీడీపీ ‘పచ్చ’పాతం
తరతరాలుగా సంప్రదాయ వృత్తి వేటనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న మత్స్యకారుల విషయంలో తెలుగుదేశం పార్టీ ద్రోహం ఎప్పటికప్పుడు బయట పడుతూనే ఉంది. వేట సాగితే కానీ పూట గడవని మత్స్యకారులకు కడలే జీవనాడి. భీతిల్లే అలల్లో ఊయలలు ఊగినంతగా అలవొకగా జలరాసిపై అనునిత్యం సాగర మదనం చేస్తే కానీ బతుకు బండి నడవదు. నిర్మానుష్య కల్లోల కడలిలోని అగాధ జలనిధిలో సాహస సమరంతో వేట సాగిస్తేనే భవిష్యత్. ఇల్లు విడిచి కడలిలోకి వెళ్తే.. తిరిగొచ్చే వరకు ప్రాణాలను పణంగా పెట్టి అనుక్షణం ప్రకృతి విసిరే సవాళ్లను ఎదుర్కొనే గంగపుత్రులను ఆదుకునే విషయంలో సర్కారు మీన వేషాలు వేస్తోంది. చేపలను తూకం వేస్తున్న మత్స్యకారులు (ఫైల్)వైఎస్సార్సీపీ పాలనలో 19,329 మంది టీడీపీ పాలనలో 12,192 మంది మత్స్యకార భరోసాను తగ్గించి పెద్దకాపునవుతాసాక్షి ప్రతినిధి, నెల్లూరు: మత్స్యకారుల బతుకులపై తెలుగుదేశం పార్టీ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. గంగపుత్రులంటే సీఎం చంద్రబాబుకు ఆది నుంచి చిన్నచూపే. టీడీపీ నాలుగు దశాబ్దాల ప్రస్తావనలో 23 ఏళ్లు అధికారంలో ఉంటే.. అత్యధికంగా చంద్రబాబు ఇప్పటి వరకు 16 ఏళ్లకు పైగా అధికారాన్ని వెలగబెట్టారు. అయితే ఏ నాడు మత్స్యకారుల సంక్షేమానికి, అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. వారిని ఓటు బ్యాంక్గానే చూశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వేలాది మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. వీరంతా కేవలం సముద్రంలో చేపల వేటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. అయితే వీరి అభివృద్ధికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని సైతం దక్కనీయకుండా చంద్రబాబు, లోకేశ్ కుట్రలకు బరి తెగించారు. తమ భుక్తి అయిన వేట సాగించే సమయంలో తమిళ బోట్లు మత్స్య సంపదను దోచుకెళ్తుంటే ప్రాణాలకు తెగించి పట్టుకున్న బోట్లను వదిలేసి తీరని ద్రోహం చేశారు. ఇవే సవాలక్ష నిబంధనలు ఈ ఏడాది వేట నిషేధ పరిహారం కోసం ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు విధించింది. ఏప్రిల్ 14వ తేదీ నాటికి లైసెన్స్ రెన్యూవల్ అయి ఉండాలి. వేట చేసే బోటుకు జరిమానా విధించి ఉండకూడదు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ భరోసా వర్తిస్తుంది. వేట చేసే మత్స్యకారుడికి 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. లబ్ధిదారులు సామాజిక పింఛన్ తీసుకుంటుంటే వారికి ఈ పథకం వర్తించదు. విద్యుత్ 200 యూనిట్లు కంటే ఎక్కవ వాడకూడదు. నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. మోటారైజ్డ్ బోటులో ఆరుగురు, సంప్రదాయ పడవలో ముగ్గురు మాత్రమే వేట సాగిస్తూ ఉండాలంటూ నిబంధనలు పెట్టింది. ఈ నెల 29వ తేదీలోగా లబ్ధిదారుల ఫైనల్ జాబితా సిద్ధం కానున్నట్లు సమాచారం. వేట నిషేధంపైనా కఠిన నిబంధనలు వేట నిషేధింపైనా చంద్రబాబు సర్కారు కఠిన నిబంధనలు విధించింది. ఈ సమయంలో నిబంధనలు అతిక్రమించిన మత్స్యకారులకు ఏపీ సముద్ర మత్స్య క్రమ బద్ధీకరణ చట్టం ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. అతిక్రమిస్తే బోట్లును స్వాధీనం చేసుకోవడంతోపాటు జరిమానా విధించి, ప్రభుత్వం తరఫున ఇస్తున్న అన్ని రకాల రాయితీలు రద్దు చేస్తామంటూ రాష్ట్ర మత్స్యశాఖ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. వైఎస్సార్సీపీ పాలనలోనే సంక్షేమం, అభివృద్ధి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో మత్స్యకార కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించడంతోపాటు వారి అభివృద్ధికి చర్యలు చేపట్టారు. టీడీపీ పాలనలో వేట నిషేధ కాలంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 3 వేలు – 3,500 మధ్య కుటుంబాలకు పరిహారం అందిస్తే వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద 19,329 మందికి లబ్ధి చేకూర్చారు. టీడీపీ పాలనలో అరకొరగా రూ.4000 ఇస్తున్న పరిహారాన్ని ఏకంగా రూ.10 వేలకు పెంచి అందించిన ఘటన వైఎస్ జగన్కే దక్కుతోంది. లబ్ధిదారుల ఎంపికలోనూ ఉదారంగా వ్యవహరించారు. అందరితోపాటు సంక్షేమ పథకాలతోపాటు వేట నిషేధ సాయాన్ని అందించారు. ఏటా రూ.19.33 కోట్లు అందించారు. ఇక డీజిల్పై సబ్సిడీని రూ.9లకు పెంచి ఆ మొత్తాన్ని అందించారు. ఇక ప్రమాదవశాత్తు వేట సమయంలో మరణించిన మత్స్యకారుడి కుటుంబానికి టీడీపీ పాలనలో రూ.5 లక్షలు ఉంటే.. దాన్ని రూ.10 లక్షలకు పెంచి ఆ కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలిచారు. 50 ఏళ్లకే పింఛన్ మొత్తం అందించారు. మత్స్యకార భరోసా లబ్ధిదారులు గంగపుత్రుల బతుకులపై కొనసాగుతున్న కుట్రలు, కుతంత్రాలు వేట నిషేధ కాలంలో పరిహార లబ్ధిదారుల ఎంపికలో కొర్రీలు ఏటా రూ.20 వేలిస్తామని సవాలక్ష నిబంధనల పేరుతో అర్హుల్లో కోతలు తొలి ఏడాది ఎగనామం.. మలి ఏడాదిలో లబ్ధిదారుల తగ్గింపు ప్రకృతి విపత్తుల నేపథ్యంలో తరచూ వేటకు విరామం తాజాగా పునరుత్పత్తి కాలంగా రెండు నెలల పాటు వేట నిషేధం కష్టకాలంలో సాయం చేయకపోగా తీరంలో వేట సాగించినా భారీ జరిమానాలు.. కేసుల నమోదు హెచ్చరికలు మొన్న బోట్లు మాయం చేసి ద్రోహానికి తెగింపు భవిష్యత్ కలల ప్రాజెక్ట్ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రైవేట్ పరం చేసే కుట్ర దగా.. దగా.. భారీగా లబ్ధిదారుల కుదింపు..! మత్స్యకారులపై టీడీపీ ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలు, ద్రోహాలు కొనసాగుతూనే ఉన్నాయి. మత్స్యకారులకు సంక్షేమ పథకాలు అమలు చేయడంలోనూ, వారి భావితరాల అభివృద్ధికి ఏ నాడు చొరవ తీసుకోని చంద్రబాబు గతంలోనే కాకుండా ప్రస్తుతం కూడా వారిని దగాకు గురి చేస్తున్నారు. ఏటా మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో మత్స్యకార భరోసాగా రూ.20 వేలిస్తామని హామీల్చిన చంద్రబాబు.. తొలి ఏడాది ఎగనామం పెట్టారు. రెండో ఏడాదిలోనూ గతంలోని లబ్ధిదారుల సంఖ్యను కుదించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 19,329 మంది లబ్ధిదారులు ఉంటే, టీడీపీ పాలనలో గతేడాది 12,192 మందికే లబ్ధి చేకూర్చారు. ఈ ఏడాది ఇంకా కూడా లబ్ధిదారుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని మత్స్యశాఖ అధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. తాజాగా జరుగుతున్న ఎన్యుమరేషన్లోనూ లబ్ధిదారులను తగ్గించేందుకు సవాలక్ష నిబంధనలు పెట్టడాన్ని మత్స్యకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏటా ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు రెండు నెలల పాటు మత్స్యసంపద పునరుత్పత్తి కాలంగా భావించి సముద్రంలో వేట నిషేధం అమలు అవుతోంది. ఈ వేట నిషేధ కాలంలోనూ సాయం అందించడంలో గతంలో చంద్రబాబు ‘పచ్చ’ పాతం చూపించారు. పరిహారం ఒక్కొక్క కుటుంబానికి రూ.2000, ఆ తర్వాత రూ.4000 లెక్కన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 3 వేల నుంచి 3,500 మందికే వేట నిషేధ లబ్ధిని అందించిన పరిస్థితి. అర్హులు దరఖాస్తులు చేసుకున్నా.. అనేక కొర్రీలు వేసి అనర్హులుగా ప్రకటించి వారి పట్ల అమానవీయత చూపించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఇక మత్స్యకారుల వేటకు డీజిల్పై లీటర్కు రూ.6 సబ్సిడీని ప్రకటించినా.. ఏనాడు ఆ సబ్సిడీని దక్కించుకున్న పాపాన ఏ మత్స్యకారుడు పోలేదు. వేట సమయంలో మత్స్యకారుడు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షల బీమా ఉన్నప్పటికీ అనేక కుటుంబాలకు ఆ బీమా పరిహారం కూడా దక్కక.. కుటుంబ పెద్దను కోల్పోయి దిక్కులేక రోడ్డున పడిన కుటుంబాలే అధికంగా ఉన్నాయి. -
బీసీలకు సముచిత స్థానం కల్పించాలి
● బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు కృష్ణయ్య నెల్లూరు(వేదాయపాళెం): బీసీలకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో సముచిత స్థానం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. నెల్లూరులోని యాదవ ట్రస్ట్ భవన్లో ఆదివారం సమావేశం నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీసీలు ఐక్యంగా పోరాడితేనే అన్ని రంగాల్లోసముచిత స్థానం సాధించగలమన్నారు. పలు తీర్మానాలు చేసి ఏకగ్రీవంగా ఆమోదించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలి. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. రూ.2 లక్షల కోట్లతో ప్రత్యేక అభివృద్ధి పథకం ప్రకటించాలి. విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలి. రాజ్యాంగాన్ని సవరించి బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలి. పారిశ్రామిక పాలసీలో 50 శాతం కోటా అమలు చేయాలి. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల నియామకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి. ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలి. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశంలో ఎంపీ బీద మస్తాన్రావు, నేతలు వై.నాగేశ్వరరావు, శ్రీనివాసులు యాదవ్, నడవడి ముత్యంగౌడ్, బొమ్మి నాగకిషోర్, శ్రీనివాసయాదవ్, వెంకటజ్యోతి, వెంకటసుబ్బయ్య, కిషోర్ యాదవ్, డీఏ లక్ష్మీయాదవ్, ఇందిర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ స్థలమే కదా.. కబ్జా చేసేద్దాం
● అధికార పార్టీ నేతల ప్రమేయం ● ఆ స్థలంలో మట్టి తోలకం ● చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులుఉదయగిరి: ఉదయగిరి మండల కేంద్రానికి కూతవేటు దూరంలో కొండాయపాళెం పంచాయతీ పరిధిలో విలువైన ప్రభుత్వ భూముల కబ్జా పర్వం కొనసాగుతోంది. దీని వెనుక అధికార పార్టీకి చెందిన పలువురు వ్యక్తుల ప్రమేయం ఉండటంతో రెవెన్యూ అధికారులు మౌనంగా ఉన్నారనే విమర్శలున్నాయి. తాజాగా కొండాయపాళెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 1297 – 1లో విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారు. టీడీపీ నేత అండదండలతో ఓ వ్యక్తి అందులో ఆదివారం యథేచ్ఛగా అనుమతి లేకుండా వెంకట్రావుపల్లి చెరువు నుంచి గ్రావెల్ తరలించారు. ఈ భూమి ఉదయగిరి – గండిపాళెం రోడ్డు మార్గంలో ఉండటంతో మంచి గిరాకీ పలుకుతోంది. ప్రస్తుతం ఆక్రమణకు గురైన స్థలం విలువ మార్కెట్ రేటు ప్రకారం రూ.25 లక్షలు ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఫేక్ పట్టా సృష్టించి.. ప్రస్తుతం మట్టి తోలి చదును చేస్తున్న స్థలం సర్వేలో మొత్తం విస్తీర్ణం 3.50 ఎకరాలుంది. ఈ భూమికి కొంతమంది ఫేక్ పట్టా సృష్టించి హస్తగతం చేసుకోవాలనే ప్రయత్నాలు జరిగాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ భూమి అన్యాక్రాంతం కాకుండా కొందరు జిల్లా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ వివాదం ప్రస్తుతం ఆర్డీఓ కోర్టులో విచారణలో ఉంది. టీడీపీ అధికారంలోకి రావడంతో విలువైన భూమిపై కన్నేసిన అధికార పార్టీ నేతలు రెవెన్యూ అధికారులతో కుమ్మకై ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారు. 10 సెంట్ల భూమిని ఆక్రమించి పక్కనే ఉన్న వెంకట్రావుపల్లి చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలించి చదును చేస్తున్నారు. ఇంతా జరుగుతున్న రెవెన్యూ అధికారులు అక్రమణదారులపై చర్యలు తీసుకోలేదు. ఫిర్యాదు చేయకుండా.. ఆక్రమణ విషయం రెవెన్యూ ఉన్నతాధికారులకు తెలియడంతో రెవెన్యూ సిబ్బంది స్పందించి పనులు నిలిపివేయించారు. కానీ ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయాల్సి ఉన్నా స్థానికంగా వీఆర్వో పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని తెలిసింది. ఇప్పుటికే ఉదయగిరి పట్టణంలోని జాతీయ రహదారి వెళ్తున్న బైపాస్ మార్గంలో విలువైన ప్రభుత్వ స్థలాలు రెవెన్యూ అధికారులు, సిబ్బంది సహకారంతో స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. ఇప్పుటికై నా తహసీల్దార్ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై వీఆర్వో మాలకొండయ్య స్పందిస్తూ ఆక్రమణదారులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
నిల్వ చేసిన చికెన్తో ఆహార పదార్థాలు
● గుర్తించిన గూడూరు ఆర్డీఓ చిల్లకూరు: గూడూరు పట్టణంలోని పలు చికెన్ దుకాణాలతోపాటుగా బైపాస్ ప్రాంతంలోని ఓ హోటల్లో ఆదివారం ఆర్డీఓ సత్యనారాయణ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా సంఘం థియేటర్ ప్రాంతంలోని ఓ దుకాణంలో ఫ్రీజర్లో చికెన్ను నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అలాగే బైపాస్ ప్రాంతంలోని ఓ హోటల్లో తనిఖీలు చేయగా అక్కడ కూడా ఫ్రీజర్లో నిల్వ చేసిన చికెన్తో కస్టమర్లకు ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారని తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యం దెబ్బతింటే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అనంతరం చికెన్పై ఫినాయిల్ పోసి బయట పార వేయించారు. ఆర్డీఓ మాట్లాడుతూ వారానికి ఒకసారి హోటళ్లు, చికెన్ షాపులను తనిఖీ చేశామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ప్రసాద్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. -
చికెన్ వ్యర్థాల వాహనం పట్టివేత
సంగం: మినీలారీలో చికెన్ వ్యర్థాలు తరలిస్తుండగా మండలంలోని గాంధీజన సంఘం సమీపంలో ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేసి అందులో సుమారు 25 డ్రమ్ము ల వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వ్యర్థాలను సమీపంలోని కొండ ప్రాంతంలో పూడ్చిపెట్టారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆరోగ్య సమస్యలతో టీచర్ ఆత్మహత్య కోట: మండలంలోని ఉత్తమ నెల్లూరు జెడ్పీ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బల్లి ప్రసాద్ (54) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్సై పవన్కుమార్ కథనం మేరకు.. ప్రసాద్ గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. ఉదయం టిఫిన్ తీసుకొస్తానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన అతను విద్యానగర్లో తెలుగుగంగ కాలువ సమీపంలో పెట్రోల్ పోసుకుని కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి భార్య దైవకృప కొత్తపాళెం పాఠశాలలో ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రసాద్ మృతదేహానికి పలువురు ఉపాధ్యాయులు నివాళులర్పించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. న్యూరో సమస్యలపై అవగాహన తప్పనిసరి నెల్లూరు(అర్బన్): రోజురోజుకూ ఎక్కువవుతున్న ఫిట్స్, పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, పార్కిన్సన్స్, కాళ్లు తిమ్మిర్లు లాంటి అనేక రకాల న్యూరో సమస్యలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజేశ్వరి, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవి అన్నారు. ఆదివారం నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో నారాయణ మెడికల్ కళాశాల న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ సంపత్కుమార్, పెద్దాస్పత్రి న్యూరాలజిస్ట్ డాక్టర్ ఫణికుమార్ ఆధ్వర్యంలో న్యూరో అప్డేట్ 2026 అనే ప్రతిష్టాత్మక సదస్సు జరిగింది. నారాయణ కళాశాల న్యూరాలజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ సంపత్కుమార్ మాట్లాడుతూ అటాక్సియా, ఏఎల్ఎస్, ఎస్ఎంఏ, తలనొప్పి, డిమెన్సియా, న్యూరో ఇమ్యునాలజీ, న్యూరో మస్క్యులర్ డిజార్డర్స్ తదితరాలపై సమగ్రంగా వివరించారు. బేసిక్స్ టు బెస్ట్ ప్రాక్టీసెస్ అనే ప్రధాన థీమ్తో ఈ సదస్సు నిర్వహించారు. దేశంలోని ప్రముఖ న్యూరాలజిస్టులు, ఎపిలెప్టాలిజిస్టులు, న్యూరో ఇమ్యునాలజీ నిపుణులు పాల్గొని తాజా వైద్య విధానాలు, జబ్బను నిర్ధారించే విధానాలు, చికిత్సల గురించి ప్రసంగించారు. కార్యక్రమంలో ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ డాక్టర్ మస్తాన్బాషా, పలువురు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మోదీ పాలనలో ప్రజాస్వామ్యానికి పాతర నెల్లూరు(వీఆర్సీసెంటర్): దేశంలో ప్రజాస్వామ్యానికి పాతర వేసేలా మోదీ పాలన సాగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర కార్య దర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. తిరుపతిలో జరగనున్న ఏఐటీయూసీ మహాసభలకు నెల్లూరు నుంచి వెళ్తున్న ప్రత్యేక వాహనాలకు సంతపేటలో ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మోదీ పాలనలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఢీలిమిటేషన్ బిల్లుతో భవిష్యత్లో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు ప్రజా సమస్యలను గాలికొదిలేశారని దుయ్యబట్టారు. వరి, మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధరల్లేక అల్లాడిపోతున్నా పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. డయల్ యువర్ ఎస్ఈ నేడు నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ రాఘవేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య 0861 – 2320427 నంబర్కు ఫోన్ చేసి సమస్యలను చెప్పాలని కోరారు. -
జనగణనలో పాల్గొనాలి : జేసీ
నెల్లూరు(బారకాసు): జనగణన కార్యక్రమంలో ప్రతి కుటుంబం బాధ్యతగా పాల్గొని వివరాలను నమోదు చేసుకోవాలని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరు వీఆర్సీ సెంటర్ నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు 5కే రన్ జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ వరకు ప్రజలు స్వయంగా ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. మే ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి గణన చేపడతారన్నారు. దేశ ప్రగతికి జనగణన కీలకమన్నారు. కమిషనర్ నందన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. కచ్చితమైన జనాభా గణాంకాలు అభివృద్ధి ప్రణాళికలు, ఉపాధి అవకాశాలు, పరిశ్రమల స్థాపనకు దోహదపడతాయన్నారు. 5కే రన్ వీఆర్సీ సెంటర్ నుంచి రామలింగాపురం, మినీబైపాస్, మాగుంట లేఅవుట్, కేవీఆర్ సర్కిల్, కొండాయపాళెం గేట్ మీదుగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు జరిగింది. ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
డీజిల్ అయిపోయి నిలిచిన లారీ
● హైవేపై రెండు గంటల పాటు నిలిచిన ట్రాఫిక్ దగదర్తి: కావలి నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న ఓ లారీ శనివారం అల్లూరు రోడ్డు రైల్వే వంతెన వద్దకు రాగానే డీజిల్ అయిపోయి నిలిచిపోయింది. దాని వెనుకే వడ్లపొట్టుతో వెళ్తున్న ట్రాక్టర్ నిలిచిపోయింది. దీంతో వంతెనపై ఒకవైపు వెళ్లే రహదారి కావడంతో నెల్లూరు వైపు వెళ్లే వాహనాలు జాతీయ రహదారిపై భారీగా నిలిచి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. డ్రైవర్ డీజిల్ కోసం దగ్గరలోని ఉలవపాళ్ల ఐఓసీ పెట్రోల్ బంక్కు వెళ్లగా అక్కడ డీజిల్ లేకపోవడంతో వంతెనపై లారీ అలాగే నిలిచిపోయి సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. భారీగా ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు రెండు గంటల పాటు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైవే మొబైల్ సిబ్బంది, దగదర్తి పోలీసులు క్రేన్ సహాయంతో లారీని రహదారిపై పక్కకు తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. పెట్రోల్ బంక్లో డీజిల్ లేకపోవడంతో పలువురు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
జిల్లాలో ఇలా..
ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వేసవి తీవ్రతకు మానవులతో పాటు పశుపక్షాదులు విలవిల్లాడుతున్నాయి. వడదెబ్బ ఎక్కడ తగులుతుందోననే భయంతో రాకపోకలు సాగించాలంటేనే పలువురు జంకుతున్న పరిస్థితి నెలకొంది. దీని నుంచి ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో విద్యార్థులకు వేసవి సెలవులను ఇవ్వడం పరిపాటి. ఈ తరుణంలో వీరికి హాలిడేస్ శుక్రవారం ప్రారంభమయ్యాయి. అయితే అంగన్వాడీ కేంద్రాలకొచ్చే చిన్నారులకు మాత్రం ప్రకటించడంలో సర్కార్ చోద్యం చూస్తోంది. ఫలితంగా కొందరు రావడంలేదు. ఆయాలు కష్టపడి కొందర్ని తీసుకొస్తున్నా.. వేసవి తాపం, ఉక్కపోతతో వీరు నానా ఇక్కట్లు పడుతున్నారు. ● వేసవి తీవ్రతతో విలవిల ● తగ్గిన హాజరు శాతం ● సెలవులను ప్రకటించని సర్కార్ ● పక్క రాష్ట్రాల్లో మాత్రం హాలిడేస్ ఉదయగిరి: చిన్నారుల ఇబ్బందులు టీడీపీ ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడంలేదు. వేసవి తీవ్రతతో అంగన్వాడీ కేంద్రాలకు వీరెలా వస్తారనే కనీస ఆలోచన సర్కార్కు రాకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఇక్కడ సెలవులను నేటికీ ప్రకటించకుండా చోద్యం చూస్తోంది. అదే పక్క రాష్ట్రాల్లో వీటికి హాలిడేస్ను ఇచ్చారు. ఎండలు మండుతున్న తరుణంలోనూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తూ వికటాట్టహాసం చేస్తోంది. ఎందుకింత నిర్లక్ష్యం..? రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించారు. అయితే అంగన్వాడీ కేంద్రాలకు దీన్ని వర్తింపజేయకపోవడంతో అక్కడికి చిన్నారులను పంపేందుకు తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారు. ఎండల ధాటికి పెద్దలే ఇళ్లు దాటి బయటకు రాలేకపోతుంటే వీరినెలా పంపుతామని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కొందరు వస్తున్నా, చాలీచాలనీ ఇరుకు గదులు.. ఫ్యాన్లు లేకపోవడం.. గాలి.. వెలుతురు లేక విలవిల్లాడుతున్నారు. అదే విధంగా కేంద్రాల్లో పనిచేసే ఆయాలు, టీచర్లకు చెరో 15 రోజులు సెలవులివ్వాల్సి ఉంది. ఆ సమయంలో వీరిలో ఎవరో ఒకరు ఉండాలి. అయితే దీనిపైనా నేటికీ స్పష్టత కొరవడింది. మేలో పరిస్థితి ఇంకెలా ఉంటుందోననే ఆందోళన మొదలైంది. పౌష్టికాహార పంపిణీలో ఇక్కట్లు కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడంలో వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలను పెంచకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నారు. కందిపప్పు, బియ్యం, ఆయిల్ మినహా మిగిలిన వాటిని బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. ప్రతి చిన్నారికి రూ.రెండు చొప్పున ప్రభుత్వం నిత్యం అందిస్తోంది. ఈ మొత్తంతో పౌష్టికాహారాన్ని ఎలా పెట్టగలమని ప్రశ్నిస్తున్నారు. వేసవిలో చిన్నారులను కేంద్రాల్లో ఉంచాలని చెప్తున్న ప్రభుత్వం, వారికి స్నాక్స్ను అందించడంలో శ్రద్ధ చూపడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయ్య.. బాబోయ్ కొన్ని కేంద్రాల్లో ఫ్యాన్లున్నా, ఉక్కపోతతో చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. వీరిని సముదాయించలేక ఆయాలకు తంటాలు తప్పడంలేదు. విద్యుత్ సరఫరా లో అంతరాయాలు సైతం ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. కేంద్రాలకొచ్చి పౌష్టికాహారాన్ని తీసుకోవాల్సిన గర్భిణులు, బాలింతల వెతలు అన్నీ ఇన్నీ కావు. అంగన్వాడీ సెంటర్ డిమాండ్లు పెడచెవిన తమపై విపరీతమైన పనిభారం మోపడం ఎంత వరకు సబబని అంగన్వాడీ వర్కర్లు ప్రశ్నిస్తున్నారు. వేతనాలను పెంచాలని.. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ ఓవైపు వీరు పోరాటాలు చేస్తున్నా, ప్రభుత్వానికి కనికరం కరువైంది. కేంద్రాలకు వేసవి సెలవులను ప్రకటించకుండా కక్షపూరిత ధోరణిని అవలంబిస్తోందని యూనియన్ నేతలు మండిపడుతున్నారు. -
పూడికతీత లేకుండా నీటి విడుదలా?
● మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి ఆత్మకూరు : నియోజకవర్గంలోని అనేక పంట కాలువలు పూడికతీతకు నోచుకోక మరమ్మతులకు గురై సాగునీరు సజావుగా సాగే పరిస్థితి లేదని, ఈ విషయం తెలిసి కూడా పట్టించుకోకపోవడం ఏమిటని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి నిలదీశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండో పంటకు సాగునీరు విడుదల చేసేందుకు ఐఏబీ సమావేశంలో 49 టీఎంసీల నీటిని 4.47 లక్షల ఎకరాలకు వినియోగించేలా నిర్ణయించారని, ఈ నేపథ్యంలో మరమ్మతులకు గురైన సాగునీటి కాలువలు మరమ్మతులకు గురైన విషయం అధికారులు తెలపకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గతంలో మోంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న కాలువలు, చెరువుల మరమ్మతులకు నియోజకవర్గంలో 199 పనులకు ఎఫ్డీఆర్ నిధులను వినియోగించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు అనంతరం ఆ పనులు ఎంత మేరకు జరిగాయో నేటికీ ప్రకటించలేదన్నారు. సుమారు రూ.10 కోట్లకుపైగా ప్రతిపాదనలతో ఎఫ్డీఆర్ పనులకు నిధులు కేటాయించారని, ఏ మండలంలో ఏ మేరకు పనులు జరిగాయో తెలపాలని డిమాండ్ చేశారు. అనంతసాగరం, ఏఎస్పేట, సంగం, మర్రిపాడు, చేజర్ల మండలాల్లో సుమారు 45 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే 165 చెరువులను అధికారులు పరిశీలించి కట్టలు పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
వీఎస్యూకు బస్సు వితరణ
వెంకటాచలం: మండలంలోని కాకుటూరు వద్దనున్న విక్రమ సింహపురి యూనివర్సిటీ(వీఎస్యూ)లో ఎన్ఎస్ఎస్ కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు సెయిల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్థ అందజేసిన బస్సును వీసీ అల్లం శ్రీనివాసరావు శనివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ సెయిల్ కంపెనీ తమ సీఎస్సార్ నిధులతో బస్సును వీఎస్యూకు అందజేయడం చాలా సంతోషకరమన్నారు. ఈ బస్సు ద్వారా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు సులువుగా చేరుకుని, అవగాహన సదస్సులు, అభివృద్ధి కార్యక్రమాలు చురుగ్గా నిర్వహించే అవకాశం కలుగుతుందన్నారు. సెయిల్ కంపెనీ సీఎస్సార్ హెడ్ డేవిడ్ ఆల్బర్ట్ పీటర్ మాట్లాడుతూ విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా తమ సంస్థ పలు సేవా కార్యక్రమాలు చేపడుతుందన్నారు. వీఎస్యూ లాంటి విద్యాసంస్థలతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో వీఎస్యూ ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, ప్రిన్సిపల్ సీహెచ్ విజయ తదితరులు పాల్గొన్నారు. -
అనుమానాస్పద స్థితిలో..
పొలానికి వెళ్లి.. విగతజీవిగా మారి విడవలూరు: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతిచెందిన ఘటన మండలంలోని దంపూరు పంచాయతీ గోల్కొండతోపు గ్రామ పొలాల్లో శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామానికి చెందిన కుప్పా కామేశ్వరమ్మ (62) శనివారం మధ్యాహ్నం పొలం పనుల కోసం విడవలూరు మండలంలోని గోల్కొండతోపులో తన పొలం వద్దకు చేరుకుని పనులు చేసుకుంటోంది. ఈ క్రమంలో సాయంత్రం ఆమె పొలంలో స్పృహ లేకుండా పడిపోయి ఉండటాన్ని గమనించిన కొందరు వ్యక్తులు స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం అందించారు. సీఐ దుర్గాప్రసాద్, ఎస్సై నరేష్కుమార్ ఘటనా స్థలానికి చేరుకునేసరికి కామేశ్వరమ్మ మృతిచెందిందని నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. కామేశ్వరమ్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే ఈ పొలం విషయంలో గతంలో ఎన్నోసార్లు స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తులకు, కామేశ్వరమ్మకు గొడవలు జరిగి పోలీస్స్టేషన్ను, తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమైపె దాడి జరిగి ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే గోల్కొండతోపునకు చెందిన గతంలో పొలం కవులకు చేసిన ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్కు తరలించడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పూడ్చిన స్థితిలో బాలుడి మృతదేహం ● 15 రోజుల క్రితం అదృశ్యం చిల్లకూరు: తండ్రి పనిచేసే ప్రాంతానికి వచ్చిన చిన్నారి కనిపించడం లేదని రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు విచారణ చేస్తున్న క్రమంలోనే బాలుడి మృతదేహం లభ్యం కావడం గూడూరులో శనివారం సంచలనం కలిగించింది. గూడూరు రూరల్ పరిధిలోని చెన్నూరుకు చెందిన ఓ గిరిజన కుటుంబ వేములపాళెం సమీపంలోని సవక తోటల్లో పనులకు వెళ్తుంటారు. ఈనెల 10వ తేదీన తమ ఎనిమిదేళ్ల కుమారుడిని కూడా పనుల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని వచ్చే సమయంలో తమ కుమారుడు లేకపోవడంతో ఇంటికి వెళ్లి ఉంటాడని భావించారు. అయితే అక్కడ కూడా లేకపోవడంతో మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి బాలుడి కోసం పలు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. అయితే శుక్రవారం వేములపాళెంలోని సవకతోట యజమాని చెట్లకు నీరు కడుతున్న సమయంలో ఓ మృతదేహం పూడ్చి పెట్టి బయటకు కనిపిస్తోందని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. ఇన్చార్జి డీఎస్పీ గిరిధర్, సీఐ శేఖర్బాబు, ఎస్సై తిరుపతయ్య, వైద్యులు, తహసీల్దార్ ప్రసాద్లతో పాటుగా ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి చూడగా అదృశ్యమైన బాలుడిగా గుర్తించారు. అనంతరం శవ పంచనామా చేసినట్లు తెలిసింది. అయితే ఎనిమిదేళ్ల బాలుడు మృతికి కారణం ఆ తోటలో పనిచేసే 16 ఏళ్ల బాలుడే అనే విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరూ మైనర్లు కావడంతో పోలీసులు పూర్తి వివరాలను వెల్లడించేందుకు ఆసక్తిని కనపరచడం లేదు. న్యాయ సలహా తీసుకున్న అనంతరం వివరాలను వెల్లడించగలమని పోలీసులు తెలిపారు. -
సీహెచ్సీలో కలెక్టర్ తనిఖీలు
కోవూరు: పట్టణంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆకస్మికంగా శనివారం తనిఖీ చేశారు. వివిధ విభాగాలను పరిశీలించి.. రోగులకు అందుతున్న వైద్యసేవలను ఆరాతీశారు. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డితో కలిసి హాస్పిటల్ ప్రాంగణాన్ని పరిశీలించారు. రోజుకు ఎన్ని సర్జరీలు జరుగుతున్నాయనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో ముచ్చటించారు. ప్రసూతి విభాగంలోని బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్యమందించడమే తమ లక్ష్యమని వివరించారు. ఆస్పత్రిలో గైనకాలజిస్ట్ సేవలు అత్యవసరమనే అంశాన్ని గుర్తించామని, త్వరలోనే భర్తీ చేయనున్నామని హామీ ఇచ్చారు. 24 గంటలూ వైద్యసేవలు అందుబాటులో ఉండేలా చూడాలని డీసీహెచ్ఎస్ పరిమళను ఆదేశించారు. వైద్యులు సునీల్బాబు, సలావుద్దీన్, వంశీకృష్ణ, జ్యోతిప్రభ, సురేష్, పద్మావతి, సంధ్య, సరోజ తదితరులు పాల్గొన్నారు. -
తమ్ముళ్ల తన్నులాట
కోవూరు: క్రమ శిక్షణకు మారు పేరు అని చెప్పుకొనే టీడీపీ నేతలు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సమక్షంలోనే తన్నులాడుకున్న ఘటన జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. గతంలో ఎమ్మెల్యే ఇచ్చిన హామీని గుర్తు చేసిన నేపథ్యంలో స్థానికులపై నోటిదురుసుకు తెగబడడం ఆ పార్టీ నేతల అహంకారానికి పరాకాష్టగా నిలుస్తోంది. ఈ ఘటన కోవూరులోని సాయిబాబా మందిరంలో శుక్రవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఎన్నికల ముందు సాయిబాబా మందిర అభివృద్ధికి రూ.5 లక్షల డొనేషన్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఆమె సాయిబాబా మందిరానికి వచ్చి అక్కడ భజన కార్యక్రమంలో ఉన్న మహిళా భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మందిరానికి డొనేషన్ ఇస్తామని హామీ ఇచ్చారని ఆ మహిళా భక్తులు గుర్తు చేశారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ నేత మల్లారెడ్డి ఆ మహిళలను అవమానిస్తూ మాట్లాడారు. వీళ్లంతా బలిసినోళ్లే.. గుడికి డబ్బులు అవసరమైతే వాళ్లు సమకూర్చుకోగలరు... మీరు డొనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ నోటి దురుసుతో మాట్లాడారు. ఎమ్మెల్యే డొనేషన్ ఇస్తామంటే ఇవ్వొద్దనేందుకు నీవెవరంటూ మరో వర్గం రెచ్చిపోయింది. ఎమ్మెల్యే సమక్షంలోనే మాటా మాటా పెరగడంతో చినికి చినికి గాలివానగా మారినట్లు రెండు వర్గాలు తున్నుకున్నాయి. ప్రశాంతంగా ఉండాల్సిన సాయిబాబా మందిరం రాజకీయ రణరంగంగా మారింది. ఈ దృశ్యాలన్నీ మందిరంలోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తం కావడంతో తమ అరాచకాలు ఎక్కడ బయటకు వస్తాయోనని వాటిని ధ్వంసం చేశారు. టీడీపీ నేతల వ్యవహార తీరుతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇరువర్గాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే సమక్షంలో సాయిబాబా మందిరంలో ఘటన మహిళలను అవమానిస్తూ నోరుపారేసుకున్న టీడీపీ నేత ఆయనపై రెచ్చిపోయిన మరో వర్గం నేతలు చినికి చినికి గాలివానగా మారిన వైనం ఘర్షణ తర్వాత సీసీ కెమెరాలు ధ్వంసం టీడీపీ నేత నోటి దురుసు ప్రవర్తన ఆధారాలు మాయం చేసేందుకేననే ఆరోపణలు ఇరువర్గాలపై కేసులు నమోదు -
పవిత్రమైన మందిరంలో దాడులా..?
నెల్లూరు రూరల్: కోవూరులోని సాయిబాబా మందిరంలో భక్తుల సమక్షంలో టీడీపీ లోని వర్గాలు దాడులకు పాల్పడటం హేయమని, దీన్ని అడ్డుకోవాల్సిన ఎమ్మె ల్యే ప్రశాంతిరెడ్డి అక్కడే ఉండి చోద్యం చూడటంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత లు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేర కు నగరంలోని పార్టీ జిల్లా కార్యాల యంలో విలేకరులతో కోవూరు నియోజకవర్గ నేతలు శనివారం మాట్లాడారు. ఘటనకు సంబంధించిన వీడియోలు ఎక్కడ బయటపడి వైరలవుతాయనే ఉద్దేశంతో భక్తులను చెదరగొట్టారని, ఆపై సీసీ కెమెరాల హార్డ్ డిస్క్లను తీసుకెళ్లారని ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు నిర్వాహకులు వెళ్తే, ఇష్టానుసారంగా మాట్లాడారని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిపించింది ప్రజలకు సుపరిపాలనను అందించేందుకేనని, అయితే అందుకు విరుద్ధంగా.. ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి వాటికే పరిమితమవడం మినహా నియోజకవర్గానికి ఆమె చేసిందేమీలేదని విమర్శించారు. అక్రమాలకు వత్తాసు పలుకుతూ.. కోవూరు పంచాయతీ కార్యదర్శి అనేక అక్రమాలు, అవకతవకలకు పాల్పడుతుంటే ఎమ్మెల్యే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోందని తెలిపారు. పంచాయతీలో నీళ్లు రావడంలేదని కార్యదర్శిని ప్రశ్నిస్తే, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. పనిచేసిన ప్రతి కార్యాలయంలో రికార్డులను మాయం చేయడంలో సదరు వ్యక్తి దిట్ట అని విమర్శించారు. నాటి సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో వందల కోట్లను వెచ్చించి సచివాలయాలను నిర్మించారని, అయితే ఇందులో ప్రస్తుతం పది శాతాన్నైనా అభివృద్ధికి ఖర్చు చేశారానని ప్రశ్నించారు. కోవూరులో రౌడీయిజం, గూండాయిజం, మాదకద్రవ్యాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. ప్రజల కోసం తాము నిరంతరం పోరాటా లు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. తప్పులను సరిదిద్దుకోకపోతే ఎమ్మెల్యేకు ప్రజలే బుద్ధి చెప్తారని స్పష్టం చేశారు. పా ర్టీ మండల కన్వీనర్లు అనూప్రెడ్డి, సతీష్రెడ్డి, శేషగిరిరావు, రైతు విభాగ జిల్లా అధ్యక్షుడు నరసింహులురెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జునరెడ్డి, కార్యదర్శి ప్రసాద్రెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, మాజీ సర్పంచ్ ఉమా, జనార్దన్, చెంచురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మలేరియాను నిర్మూలిద్దాం
నెల్లూరు(అర్బన్): మలేరియాను పూర్తి స్థాయిలో నిర్మూలిద్దామని డీఎంహెచ్ఓ సుజాత, మలేరియా నివారణాధికారి డాక్టర్ అంశుధర్ పేర్కొన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయం నుంచి వివిధ ప్రాంతాల మీదుగా అవగాహన ర్యాలీని శనివారం నిర్వహించారు. అనంతరం జరిపిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. వైద్యశాఖ చేపట్టిన చర్యల ఫలితంగా మలేరియా కేసులు దాదాపు కనుమరుగయ్యాయని వివరించారు. ఇల్లు, పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూడాలని కోరారు. ఏడీఎంహెచ్ఓ ఖాదర్వలీ, ఎన్సీడీ అధికారి యశ్వంత్, ఎపిడమిక్ జిల్లా అధికారి భాస్కర్, అసిస్టెంట్ మలేరియాధికారి జయరామ్ తదితరులు పాల్గొన్నారు. -
పాలిసెట్కు 274 మంది గైర్హాజరు
నెల్లూరు (టౌన్): పాలిటెక్నిక్లోని కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన పాలిసెట్ను శనివారం నిర్వహించారు. 2773 మందికి గానూ 2499 మంది హాజరయ్యారు. జిల్లాలోని 19 కేంద్రాల్లో పరీక్షను జరిపారు. ఏపీజీబీ ఆఫీసర్స్ ఎన్నికలు నెల్లూరు(పొగతోట): ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ ఎన్నికలను నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును బ్యాంక్ అధికారులు వినియోగించుకున్నారు. విద్యుత్ సంస్థలో భారీగా ఉద్యోగోన్నతులు నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి భారీగా ఉద్యోగోన్నతులు లభించాయి. మెరిట్, సీనియార్టీ ఆధారంగా 46 మందికి ఇవి లభించాయని ఎస్ఈ రాఘవేంద్రం తెలిపారు. నగరంలోని విద్యుత్ భవన్లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో వీరికి ఉద్యోగోన్నత పత్రాలను అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. జూనియర్ లైన్మెన్ నుంచి సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు ఇవి లభించాయని వెల్లడించారు. విద్యుత్ బిల్లులను నేడూ చెల్లించొచ్చు నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ బిల్లులను ఆదివారం యథావిధిగా చెల్లించొచ్చని ఎస్పీడీసీఎల్ ఎస్ఈ రాఘవేంద్రం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని బిల్లుల వసూలు కేంద్రాలు పనిచేయనున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కేసులు నెల్లూరు(పొగతోట): డీజిల్, పెట్రోల్కు కృత్రిమ కొరత సృష్టించేలా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కొందరు వ్యవహరిస్తున్నారు. బంకుల నుంచి అధిక మొత్తంలో డీజిల్ను కొనుగోలు చేసి డ్రమ్ముల్లో నిల్వ ఉంచుతున్నారు. ఈ విషయమై ఫిర్యాదులు అందడంతో నగర పరిసర ప్రాంతాల్లో తనిఖీలను సివిల్ సప్లయ్స్ అధికారులు శనివారం చేపట్టారు. ఇలా వ్యవహరించే వారిపై కేసులు నమోదు చేయనున్నామని హెచ్చరించారు. పెట్రోల్ బంకులపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి.. అధికంగా కొనుగోలు చేసిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి కొరత లేదని తెలిపారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. స్వామివారిని 69,270 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 33,180 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.89 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
గిట్టుబాటు ధర కల్పించాలి
మొక్కజొన్న పంటను సాగు చేసిన రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి. దళారులు కుమ్మకై ్క రైతులను దోచుకుంటున్నారు. పాలకులు, అధికారులు స్పందించి పంట కొనుగోలుకు పరిమితులు విధించకుండా తేమ శాతం నిబంధనలను సడలించి నాణ్యత పేరుతో నిబంధనలు విధించకుండా పూర్తి పంటను కొనుగోలు చేయాలి. – చిన్నా, మొక్కజొన్న రైతు, బసినేనిపల్లి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి తక్షణమే ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. కొనుగోలు కేంద్రాలకు తరలించే స్తోమత లేక డబ్బులు అత్యవసరమై దళారులు చెప్పిన ధరకే పంటను అమ్ముకుని నష్టపోవాలసిన పరిస్థితి పొంచి ఉంది. పంట చేతికి వచ్చి మూడు వారాలు అవుతున్నా ఇంకా ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. – రత్తయ్య, మొక్కజొన్న రైతు, బసినేనిపల్లి ఎకరాకు రూ.20 వేల వరకు నష్టం ప్రస్తుతం మార్కెట్లో మొక్కజొన్న ధర క్వింటాల్ రూ.1,500 నుంచి రూ.1,600 మధ్యే కొనుగోలు చేస్తున్నారు. ఇది ప్రభుత్వం ప్రకటించిన కనీసం మద్దతు ధర కంటే చాలా తక్కువ. ఎకరాకు సుమారు రూ.40 వేల వరకు పెట్టుబడి అవుతోంది. దళారులు తక్కువ ధరకే కొంటుండడంతో ఎకరాకు 20 వేల వరకు నష్టం వాటిల్లుతోంది. – పుల్లయ్య, మొక్కజొన్న రైతు, బసినేనిపల్లి -
ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు
● బ్లాక్స్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ నెల్లూరు(క్రైమ్): ‘రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాం’ కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. నెల్లూరు జాతీయ రహదారిపై బ్లాక్స్పాట్లను శుక్రవారం కలెక్టర్, ఎస్పీ అజిత పరిశీలించారు. గతేడాది, ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై ఆరాతీశారు. బ్లాక్స్పాట్లలో ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, సీసీ టీవీ నిఘాను పెంచాలని, ట్రాఫిక్ ఉల్లంఘనులపై చర్యలు తీసుకోవాలని పోలీస్ ఽఅధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ సూచికలు, హెచ్చరిక బోర్డులు, లైటింగ్ను ఏర్పాటు చేయాలన్నారు. ఫుట్పాత్ల ఆక్రమణలను తొలగించాలన్నారు. మితిమీరిన వేగం, డ్రంక్ అండ్ డ్రైవ్పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రహదారి లోపాలను తక్షణమే సరిదిద్దాలని సంబంధిత అధికారులకు సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని, మద్యం మత్తు, మితిమీరిన వేగంతో వాహనాలను నడపరాదన్నారు. వారి వెంట ఆర్డీఓ అనూష, పోలీసు అధికారులు, పలు శాఖల అధికారులు, సిబ్బంది తదితరులున్నారు. కార్మికుల వేతనాలపై నిర్ణయం నెల్లూరురూరల్: 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి నామినల్ మస్తర్ రోల్ కార్మికుల కనీస వేతనాలను కమిటీ నిర్ణయించింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్లో సమావేశం జరిగింది. నెల్లూరు ఉప కార్మిక కమిషనర్, జిల్లాలోని ఇంజినీరింగ్ వర్క్స్ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. కార్మికుల నైపుణ్య స్థాయి ఆధారంగా రోజువారీ వేతనాలను ఖరారు చేశారు. అన్స్కిల్డ్ కార్మికులకు రోజుకు రూ.615, సెమీస్కిల్డ్ వారికి రూ.735, స్కిల్డ్ వారికి రూ.870, హైలీ స్కిల్డ్ కార్మికులకు రూ.990 వేతనంగా నిర్ణయించారు. ఇక మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే కార్మికులకు పైవేతనాలపై అదనంగా 20 శాతం, కార్పొరేషన్ పరిధిలో పనిచేసే వారికి 25 శాతం అదనపు భత్యం చెల్లించాలన్నారు. ఈ నిర్ణయాలను ఉప కార్మిక కమిషనర్ సీహెచ్ విజయకుమార్రెడ్డి అధికారికంగా ప్రకటించారు. -
హమ్మయ్య.. నీడ దొరికింది
పనుల నిమిత్తం ఎండలో తిరిగేవారికి కాస్తంత సమయం దొరికితే చాలు నీడలో సేదతీరి హమ్మయ్య అనుకుంటారు. మూగజీవాల పరిస్థితి అలా కాదు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా అవి పడుతున్న బాధలు వర్ణనాతీతం. చిల్లకూరు మండలం తీర ప్రాంతంలోని కాకువారిపాళెం సమీపంలోని సిలికా భూమిలో ఉన్న వేపచెట్టు కింద శుక్రవారం సుమారు వంద జీవాలు చేరాయి. గ్రామానికి చుట్టుపక్కల ఈ భూములు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతంలోని పెంపకందారులు ఆ భూములకు అటువైపుగా ఉండే పడవ భూముల (వరినాటే భూములు) వద్దకు జీవాలను మేతకు తీసుకెళ్తుంటారు. అయితే మధ్యాహ్నం వేళలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాటిని ఆ భూమిలో ఉన్న వేపచెట్టు కిందకు చేరుస్తుంటారు. ఆకలి సంగతి దేవుడెరుగు.. ముందు నీడలో సేద తీరుతాం అన్నట్టుగా ఉంటాయి ఆ మూగజీవాలు. – చిల్లకూరు చెట్టు కింద సేద తీరుతున్న జీవాలు -
ఆకలి కేకలు..
కూటమి నేతలే ఎఫ్ఏలు నెల్లూరు(పొగతోట): టీడీపీ ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉపాధి హామీ శ్రామికులకు నెలల తరబడి వేతనాలు అందడంలేదు. ఫలితంగా వీరు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంటోంది. దీంతో ఉపాధి పనులకు హాజరయ్యే శ్రామికుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా తగ్గిపోయింది. జిల్లా వ్యాప్తంగా నిత్యం లక్ష మంది హాజరవుతుండగా, ప్రస్తుతం ఈ సంఖ్య వేలకు పతనమైంది. అంతులేని నిరీక్షణ గతంలో బ్యాంక్ ఖాతాల్లో వేతనాలు వార వారం జమయ్యేవి. అయితే ప్రస్తుతం నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ఈ క్రమంలో పనులకు అధిక శాతం మంది ముఖం చాటేస్తూ.. వ్యవసాయ సంబంధిత వర్కులకెళ్తున్నారు. జనవరికి సంబంధించిన జీతాలను చెల్లించి.. ఆపై వేయలేదు. ఇలా జిల్లాలో రూ.20 కోట్లకుపైగా పెండింగ్లో ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన నిధులను రెండు రోజుల క్రితం మంజూరు చేశారని సమాచారం. ఇవి శ్రామికుల బ్యాంక్ ఖాతాల్లో జమయ్యేందుకు మరో పది రోజులు పట్టే అవకాశం ఉంది. సన్నగిల్లిన అవకాశాలు జిల్లాలో జాబ్కార్డులు కలిగిన శ్రామికులు నాలుగు లక్షల మంది ఉన్నారు. రెండేళ్ల క్రితం వరకు పనులకు నిత్యం లక్ష మంది హాజరయ్యేవారు. ఈ వర్కులతో జిల్లాలో నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన మెటీరియల్ కాంపొనెంట్ నిధులు మంజూరయ్యేవి. అయితే ప్రస్తుతం పనులకొచ్చే వారి సంఖ్య తగ్గిపోవడంతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర భవన నిర్మాణాలకు నిధులు విడుదలయ్యే అవకాశాలు సన్నగిల్లిపోయాయి. గతంలో ఏటా రూ.వందల కోట్లతో పనులు చేపట్టగా, ప్రస్తుతం ఆ పరిస్థితే లేదు. ఉన్నవి పూర్తయితేనే కొత్తవి.. ఉపాధి హామీ పథకంలో నూతన విధానాలతో పంచాయతీల్లో 20 పనులకే అనుమతులిస్తున్నారు. ఇవి పూర్తయ్యాకే ఇతర వాటి కోసం డిమాండ్ పెట్టాల్సి ఉంది. పంచాయతీల్లో గతంలో వార వారం డిమాండ్ పెట్టే వారు. ఈ– కేవైసీ పూర్తి చేసుకున్న శ్రామికుల ఫొటోలే అప్లోడ్ అవుతున్నాయి. ఇవి కాని వారు పనులకు హాజరైనా వేతనాలు జమయ్యే అవకాశాల్లేవు. నాలుగు నెలలుగా అందని వేతనాలు రూ.20 కోట్లకుపైగా పెండింగ్ ఉపాధి శ్రామికుల హాహాకారాలు రోజురోజుకూ తగ్గిపోతున్న వచ్చే వారి సంఖ్య గ్రామ పంచాయతీల్లో కూటమి నేతలే ఎఫ్ఏలుగా అవతారమెత్తడంతో పనులు ముందుకు సాగడంలేదు. ఉపాధిలో నూతన నిబంధనలు వీరికి మింగుడుపడటం లేదు. బోగస్ మస్టర్లేసుకొని నిధులను స్వాహా చేయాలనే ఆలోచనలకు బ్రేకులుపడ్డాయి. జిల్లాలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న 500 మంది ఎఫ్ఏలను తొలగించి వారి స్థానాల్లో అధికార పార్టీ నేతలు పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వీరి కనుసన్నల్లో వర్కులు జరుగుతున్నాయి. వీరు చెప్పిన వారికే పనులు లభిస్తున్నాయి. ఈ తరుణంలో ఆశించిన స్థాయిలో వర్కుల్లేకపోవడం.. వేతనాలు సక్రమంగా రాకపోవడంతో ఇతర వాటివైపు శ్రామికులు మొగ్గు చూపుతున్నారు. -
పిల్లలతో భిక్షాటన చేయిస్తే కఠిన చర్యలు
నెల్లూరు(పొగతోట): చిన్నపిల్లలతో భిక్షాటన చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్, జిల్లా బాలల సంరక్షణ అధికారి బి.సురేష్ హెచ్చరించారు. భిక్షాటన చేసే బాలలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఏర్పాటు చేశారు. ఆయన ఆదేశాల మేరకు శుక్రవారం బృంద సభ్యులు నెల్లూరులోని ఆర్టీసీ బస్టాండ్, వీఆర్సీ సెంటర్, ఆత్మకూరు బస్టాండ్, అయ్యప్పగుడి సెంటర్ ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్న బాలలను గుర్తించారు. నలుగురు బాలికలు, ఒక బాలుడిని గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం పిల్లలను సీడబ్ల్యూసీ ఆదేశాల ప్రకారం తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ బాలల చేత భిక్షాటన చేయించే వ్యక్తికి 5 సంవత్సరాల కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధించడం జరుగుతుందన్నారు. భిక్షాటన కోసం బాలలను దివ్యాంగులను చేసే వారికి 10 సంవత్సరాల కారాగార శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తారన్నారు. కార్యక్రమంలో ఏఎస్సైలు వై.శ్రీహరి, డి.సతీష్, రాంబాబు, సిబ్బంది సుమలత, రత్నం, సుజాత, శైలజ పాల్గొన్నారు. -
మలేరియా.. చాలా డేంజర్
● అవగాహనతోనే చెక్ ● జిల్లా వైద్యశాఖలో కాకి లెక్కలు ● వరల్డ్ మలేరియా డే నేడునెల్లూరు(అర్బన్): ప్రజలకు సోకే ప్రాణాంతక వ్యాధుల్లో మలేరియా ఒకటి. ప్రతి సంవత్సరం దేశంలో లక్షలాది మంది ఈ వ్యాధిన పడుతున్నారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితిని పరిశీలించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25వ తేదీని వరల్డ్ మలేరియా డేగా ప్రకటించింది. ఇందులో భాగంగా జిల్లాలో వైద్యశాఖ ఆధ్వర్యంలో శనివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దోమ కాటుతోనే వ్యాప్తి మలేరియా ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వస్తుంది. ఇది దోమ లాలాజలంలో నివాసం ఏర్పరుచుకుంటుంది. ఆడ అనాఫిలస్ అనే దోమ కుట్టినప్పుడు దాని లాలాజలం ద్వారా ప్లాస్మోడియం అనే సూక్ష్మజీవి మానవుని రక్తంలోకి ప్రవేశిస్తుంది. తర్వాత మలేరియా అనే జబ్బును కలిగిస్తాయి. నీటిగుంతలు ఎక్కువగా ఉండే చోట దోమల పునరుత్పత్తి జరిగి వాటి ద్వారా రోగం వస్తుంది. వర్షాకాలంలో నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో దోమలు ఎక్కువగా విస్తరిస్తాయి. ఈ లెక్కలేంటో.. జిల్లాలో సీజనల్లో వివిధ ప్రాంతాల్లో ఒకప్పుడు వందలాది కేసులు నమోదయ్యేవి. అయితే ఆ ప్రాంతాలతోపాటు మరికొన్నిచోట్ల కొన్నేళ్లుగా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయినా అడపాదడపా ప్రైవేట్ ఆస్పత్రుల్లో కేసులు తరచూ నమోదవుతూనే ఉన్నాయి. సంవత్సరం మొత్తంగా వందలాదిగా వస్తున్నా వైద్యశాఖలో మాత్రం జిల్లా మొత్తానికి కలిపి 5 లేదా 10 కేసులు మాత్రమే నమోదవుతున్నట్టు కాకిలెక్కలు చూపుతున్నారు. ఉదాహరణకు శంకరాగ్రహారంలోని ఒక ప్రజా వైద్యశాలలో రెండు నెలల డేటాను పరిశీలిస్తే పదుల సంఖ్యలో రోగులున్నట్లు తేలింది. అలాగే నారాయణ, మెడికవర్, అపోలో, కిమ్స్, పెద్దాస్పత్రి, జయభారత్ ఆస్పత్రి ఇలా పలుచోట్ల మలేరియా కేసులు వస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. వైద్యశాఖలో ఒకటో, రెండో నమోదు చూపి చేతులు దులుపుకొంటున్నారని విమర్శలున్నాయి. ఎన్నో రకాలు మలేరియాను కలిగించే పరాన్న జీవులు ఐదు రకాలుగా ఉన్నాయి. అవి ప్లాస్మోడియం ఫాల్సిపారం, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరియే, ప్లాస్మోడియం ఓవాలే, ప్లాస్మోడియం నోలెసి. మన ప్రాంతంలో ప్రధానంగా మూడు రకాలు మలేరియాను కలిగిస్తాయి. వీటిలో ప్లోస్మోడియం ఫాల్సిపారం అత్యంత ప్రమాదకరమైంది. ప్రాణా పాయం సంభవించవచ్చు. ఈ రకమైన జీవి మనిషి మెదడును కూడా దెబ్బతీస్తుంది. రక్తపరీక్షల్లో వైవాక్స్ మలేరియా అయితే రెండు వారాలు పూర్తిగా చికిత్స తీసుకోవాలి. ఫాల్సిపారం మలేరియా అయితే మూడు రోజులపాటు ఏసీటీ చికిత్స తీసుకోవాలి. డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలి. సంవత్సరం ప్రభుత్వ లెక్కలు ప్రైవేట్ ఆస్పత్రిలో.. 2021 12 63 2022 3 56 2023 1 62 2024 6 73 2025 5 67 2026 0 21 లక్షణాలు ఏంటంటే? జ్వరంతోపాటు చలి, వణుకు, తలనొప్పి, వాంతులు, వికారం, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తే మలేరియా జబ్బు కావచ్చు. దీనిని తెలుసుకునేందుకు రక్త పరీక్షలు చేయించుకోవాలి. నిర్ధారణ అయితే చికిత్స చేయించుకోవాలి. ఇళ్ల చుట్టూ నిలువ నీరు లేకుండా చూసుకోవాలి. దోమలు కుట్టకుండా మస్కిటో నెట్స్ ఉపయోగించాలి. జ్వరం వస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. నీటి ట్యాంక్లను మూసేయాలి. దోమల నిర్మూలన జరిగితే మలేరియా కూడా నియంత్రణ జరిగినట్టే. జిల్లాలో ఇలా.. నియంత్రణలో కేసులు జిల్లాలో మలేరియా కేసులను నియంత్రించగలిగాం. 2026లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ప్రజలు దోమకాటుకు దూరంగా ఉండాలి. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు కుట్టకుండా, పుట్టకుండా చూసుకోగలిగితే మలేరియాను పారదోలినట్టే. – డాక్టర్.టి.అంశుధర్, ఇన్చార్జి జిల్లా మలేరియా నివారణాధికారి, వైద్యశాఖనిర్మూలనే అంతిమ లక్ష్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు 2030 నాటికి మలేరియాను నిర్మూలించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. చలి, వణుకుతో కూడిన జ్వరం వస్తుంటే ప్రజలు సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి రక్తపరీక్షలు చేయించుకోవాలి. మలేరియా నిర్ధారణ అయితే ఖర్చు లేకుండా చికిత్స అందిస్తున్నాం. ప్రజలు కూడా అవగాహన కలిగి ఇల్లు, పరిసరాల్లో నీరు నిలబడే గుంతలు లేకుండా చూసుకోవాలి. దోమతెరలు వాడాలి. – డాక్టర్ సుజాత, డీఎంహెచ్ఓ, జిల్లా వైద్యశాఖ -
అన్నదాతల ఆరుగాలం కష్టానికి కూటమి ప్రభుత్వం ‘మద్దతు’ కరువైంది. దళారుల దోపిడీకి ఇప్పటికే ధాన్యం రైతులు, తాజాగా జొన్న, మొక్కజొన్న రైతులు బలైపోతున్నా.. సర్కారులో కనీసం కనికరం కరువైంది. రైతులతో దళారులు ధరలాట ఆడుతున్నారు. నానాటికి సాగు ఖర్చులు పెరుగుతుంటే.. ఏటే
సీతారామపురం: కూటమి ప్రభుత్వం.. రైతుల పాలిట శాపంగా, నెత్తిన కుంపటిగా తయారైంది. ఆరుగాలం కష్టపడి పంటలు పండించే ఏ రైతును ఈ ప్రభుత్వం విడిచి పెట్టడం లేదు. వ్యవసాయం అంటే.. అన్నదాతలు దడుచుకునే పరిస్థితిని సృష్టిస్తోంది. సర్కారు నిర్లక్ష్యం, దళారుల దోపిడీ ఖాతాలో తాజాగా మొక్కజొన్న రైతులు చేరారు. తక్కువ సమయంలో పంట చేతుకుందుతుందని ఎన్నో ఆశలతో మొక్కజొన్న సాగు చేసిన రైతులను నష్టాల ఊబిలోకి కూర్చేసింది. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా.. ధరలు మాత్రం పాతాళానికి పడిపోయాయి. పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు జిల్లాలో 4 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేయగా అందులో ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల్లో 1200 ఎకరాల్లో సాగు చేస్తే.. మెట్ట ప్రాంతమైన ఒక్క సీతారామపురం మండలంలోనే దాదాపు 400 ఎకరాల్లో సాగు చేశారు. మూడు వారాల క్రితం పంట చేతికొచ్చినా ప్రభుత్వం ఎప్పుడు పంట కొనుగోలు చేస్తుందా? అని రైతులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా.. నేటికీ దిక్కులేని పరిస్థితి నెలకొంది. మొక్కజొన్న పంట ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50 వేలు పెట్టుబడి అవుతుందని, ఈ దఫా ఆ పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. మొక్కజొన్న క్వింటాల్ రూ.1500 నుంచి రూ.1600 మధ్యనే దళారులు కొనుగోలు చేస్తున్నారు. ఎకరాకు 25 క్వింటాళ్లు దిగుబడి వస్తే.. రూ.40 వేలు కూడా చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని రైతులు గొల్లుమంటున్నారు. గతేడాదిలో ప్రభుత్వం కింటాల్కు రూ. 2250 చెల్లించి మొక్కజొన్న కొనుగోలు చేసింది. ప్రస్తుతం మొక్కజొన్నకు కనీసం మద్దతు ధర రూ.2,400 ఉన్నా కూడా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు చెప్పిన ధరకే అమ్ముకోవాల్సిన గడ్డు పరిస్థితులు దాపురించాయి. ఇప్పటికే కొందరు అత్యవసర పరిస్థితుల్లో అడిగిన ధరకు తెగనమ్ముకుంటున్నారు. మద్దతు ధర ప్రకటించి.. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సాగు ఖర్చులు లెక్కించి క్వింటాల్కు రూ.2100 ధర నిర్ణయించి, ఆ మేరకు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. గతంలో ఎకరాకు 25 క్వింటాళ్లు పంట దిగుబడి వస్తే.. ప్రస్తుతం ఎకరాకు 25 నుంచి 28 క్వింటాళ్లు దాకా పంట దిగుబడి వచ్చిందన్నారు. ఇటీవల బసినేనిపల్లి ప్రాంతానికి చెందిన మొక్కజొన్న రైతులు కలెక్టర్ను కలిసి పంట కొనుగోలు కేంద్రం ఏర్పాటు, గిట్టుబాటు ధరపై మొర పెట్టుకున్నా నేటి వరకు ప్రయోజనం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా పాలకులు అధికార యంత్రాంగం స్పందించి మొక్కజొన్న పంటకు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో కూటమి సర్కారు నిర్లక్ష్యం పంట చేతికొచ్చి నెల గడిచినా కొనే దిక్కులేని పరిస్థితి నష్టానికి దళారులకు తెగనమ్ముకుంటున్న రైతులు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్దతు ధర ప్రకటించి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు -
టీడీపీలో నాబార్డు నిప్పు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లా టీడీపీలో నాబార్డు నిప్పు రాజుకుంది. ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య ఆధిపత్య పోరు తాజాగా బహిరంగ దాడిగా మారింది. ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్న విభేదాలు అధికారిక సమావేశంలో అసంతృప్తి మాటలు తూటాలై పేలాయి. మంత్రి నారాయణ ఒంటెద్దు పోకడలపై ఆయన పరోక్షంగా జరిగిన ఐఏబీ వేదికగా తాడోపేడో తేల్చుకుందామనే వరకు వెళ్లాయి. గురువారం జిల్లాలో రెండో పంటకు సంబంధించి ఐఏబీ సమావేశంలో కాలువల అభివృద్ధిపై జరిగిన చర్చలో నాబార్డు నిధులపైకి మళ్లింది. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో వివిధ శాఖల ద్వారా అభివృద్ధి పనులకు సుమారు రూ.200 కోట్లకు ప్రతిపాదనలు పంపిస్తే.. కేవలం రూ.50 కోట్లు నెల్లూరు నగరానికి మాత్రమే కేటాయించుకుని, మిగతా ప్రతిపాదనలు పక్కన పెట్టించడంలో మంత్రి నారాయణ చక్రం తిప్పారంటూ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తడంతో అధికార యంత్రాంగాన్ని విస్మయానికి గురి చేసింది. అయితే ఈ నిధులను తమ్ముళ్లకు దోచిపెట్టేందుకే డ్రెయినేజీ కాలువల పనులకే కేటాయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నారాయణ తీరుపై ఆనం రుసరుసలు నాబార్డు నిధులు మంజూరు, కేటాయింపుల్లో మంత్రి నారాయణ తీరుపై ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో అందుకు మరో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సైతం రుసరుసలాడారు. ఈ విషయంలో తాడోపేడో తేల్చుకుందామంటూ ఎమ్మెల్యేలకు వంతపాడడంతో అధికారులు సైతం నివ్వెరపోయారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి తొలుత ఈ అంశాన్ని లెవనెత్తడంతో మిగతా ఎమ్మెల్యేలు గళం కలిపారు. నాబార్డు నిధులకు సంబంధించి మన ప్రతిపాదనలు ఏమయ్యాయంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆక్రోశం వెళ్లగక్కారు. ఈ విషయంలో అధికారులను నిలదీయడంతో ఏమీ చెప్పలేక నీళ్లు నమిలారు. మిగిలిన నియోజకవర్గాల నుంచి చేసిన ప్రతిపాదనలను తోసిపుచ్చడంతో ఆయా ఎమ్మెల్యేలు మంత్రి నారాయణ తీరును ఆక్షేపిస్తున్నారు. నియోజకవర్గాలను కాదని నారాయణకు ఉన్న పరపతితో సిటీ నియోజకవర్గానికే కేటాయింపులు వచ్చేలా చేయడం, ఆ నిధులు సైతం తమ్ముళ్లు పంపకం చేసేందుకేననే ఆరోపణలున్నాయి. బహిరంగంగానే మంత్రి నారాయణపై ఆరోపణలు చేయడం ఆ పార్టీలోనే ఆధిపత్య పోరుపై మరోసారి ఉన్నట్లుగా తేటతెల్లమైంది. ఇటీవల నెల్లూరు సిటీలో నారాయణ మొక్కలతో సుందరీకరణ పేరుతో మొక్కల పెంపకానికి దాదాపు రూ.60 కోట్లు అవినీతి చేశాడంటూ ఎమ్మెల్యే చంద్రశేఖర్రెడ్డి ఆధారాలతో సహా బయట పెట్టినా.. అందుకు కౌంటర్ ఇచ్చేందుకు కూడా ఏ టీడీపీ నేత కూడా ముందుకు రాలేదంటూ మంత్రి నారాయణ తీరునే ఆక్షేపిస్తూ టీడీపీ ఎమ్మెల్యే ధ్వజమెత్తడం ఆ పార్టీ శ్రేణులను విస్మయపరుస్తోంది. అప్పటికీ.. ఇప్పటికీ తేడా ఏమీలేదు నిధుల కోసం పోరాటం తప్పడంలేదంటూ గత ప్రభుత్వంలో కింద కూర్చొని మాట్లాడే వాడని, ఇప్పుడు పైన కూర్చొని మాట్లాడుతున్నాను.. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమీలేదంటూ మంత్రి ఆనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం అందర్నీ విస్మయానికి గురి చేసింది. మంత్రి ఆనం బేల మాటలు, ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుందామంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీడీపీలో హాట్టాపిక్గా మారాయి. ప్రభుత్వంలో తన ప్రాభవం లేదని చెప్పకనే చెప్పినట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐఏబీ వేదికగా పేలిన అసంతృప్తి జిల్లా వ్యాప్తంగా రూ.200 కోట్లకు ప్రతిపాదనలు నగరానికే నిధులు.. నియోజకవర్గాలకు రిక్తహస్తాలు మా పరిస్థితేమిటంటూ గళమెత్తిన ఎమ్మెల్యేలు తాడోపేడో తేల్చుకుందామన్న మంత్రి ఆనం సాగునీటి సలహా మండలి సమావేశంమిగిలిన నియోజకవర్గాలకు రిక్తహస్తమా..?తమకే దిక్కులేదంటూ అసంతృప్తులు ఐఏబీ సమావేశం వేదికగా పలువురు ఎమ్మెల్యేలు తమ ఆదేశాలకే దిక్కులేదంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్కుమార్ మాట్లాడుతూ రైతులకు ధాన్యం గిట్టుబాట ధర విషయంలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళితే సరిగా స్పందించలేదన్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ లష్కర్లు లేని కారణంగా చివరి భూముల వరకు నీరు అందడమలేదన్నారు. ఉన్న లష్కర్లకు వేతనాలు చెల్లించడంలేదన్నారు. సోమిరెడ్డి మాట్లాడుతూ టీపీగూడూరు మండలంలో రెండో పంట సాగు చేసేందుకు రైతులు సిద్ధంగా లేరన్నారు. మాకే దిక్కులేకుండాపోయింది.. తాడోపేడో తేల్చుకుందాం


