breaking news
SPSR Nellore District Latest News
-
కనులపండువగా వెంగమాంబ గ్రామోత్సవం
దుత్తలూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన నర్రవాడ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం రాత్రి వెంగమాంబ, గురవయ్యనాయుడు దంపతుల గ్రామోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఉదయం నర్రవాడలోని వెంగమాంబ ఆలయంలో వెంగమాంబ, గురవయ్య దంపతులకు విశేష పుష్పాలంకరణ, పూజలు, హోమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వెంగమాంబ దంపతులను దర్శించుకున్నారు. హోమగుండంలో ఎండు కొబ్బరి వేసి మొక్కులు తీర్చుకున్నారు. సంతానం లేని మహిళలు అమ్మవారి సన్నిధిలో వరపడ్డారు. రాత్రికి వెంగమాంబ పుట్టినిల్లు అయిన వడ్డిపాళెంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో వెంగమాంబ దంపతుల ఉత్సవమూర్తులను విశేషంగా అలంకరించి ప్రత్యేక వాహనంపై కొలువుదీర్చి గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. నర్రవాడ, గుదేవారిపాళెం, ఉలవవారిపాళెం, తదితర గ్రామాల్లో గ్రామోత్సవం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, బాణసంచా వెలుగుల నడుమ వేడుకగా సాగింది. కాగా ఉత్సవాల్లో మూడోరోజు మంగళవారం కూడా వెంగమాంబ దంపతుల గ్రామోత్సవాన్ని నిర్వహించనున్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా ఖాతా ఓపెన్
ఉదయగిరి: జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారింది. గత ప్రభుత్వంలో నాడు–నేడు కింద చేపట్టిన పనులకు కొత్తగా మళ్లీ బిల్లులు పెట్టి నిధులు కాజేసిన విషయం వారం రోజుల క్రితం వెలుగు చూసింది. ఈ విషయంపై విచారణ చేపడుతుండగానే తాజాగా ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పనకు మంజూరైన నిధులను పనులు చేయకుండానే అప్పనంగా దిగమింగిన విషయం వెలుగులోకి వచ్చింది. సమగ్ర శిక్షలో పనిచేసే పలువురు ఉద్యోగులు సిండికేట్గా ఏర్పడి ప్రజాధనాన్ని దోచేశారు. ఈ అవినీతి వ్యవహారంలో పలువురు చిన్నస్ధాయి ఉద్యోగుల నుంచి ముఖ్యఅధికారి వరకు పాత్ర ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అవినీతికి పునాది ఇలా.. జిల్లాలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్యన ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.2.59 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో పాఠశాలల్లో భవనాల కు మరమ్మతులు, మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణ పనులు చేపట్టారు. ఆయా పనులకు రూ.1.55 కోట్ల మేర చెల్లించారు. ఈ చెల్లింపులు అన్నీ స్కూల్ ఖాతాల నుంచి జరిగాయి. అగిపోయిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించే నిమిత్తం 2024లో సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ కార్యాలయం వివరాలు కోరింది. ఇక్కడే అవినీతికి పునాది పడింది. పక్కాగా స్కెచ్ జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో పనిచేసే అవుట్ స్సోరింగ్ ఉద్యోగి, మరి కొంతమంది సైట్ ఇంజినీర్లు, కార్యాలయంలోని ఒకరిద్దరు సిబ్బంది, ముఖ్యఅఽధికారి కలిసి నిధుల దోపిడీకి పక్కాగా స్కెచ్ వేశారు. గతంలో చేసిన పనులకే మళ్లీ బిల్లులు పెట్టే ఆలోచన చేశారు. సుమారు రూ.కోటి వరకు బకాయిలు ఉన్నట్లు స్టేట్ ప్రాజెక్ట్ కార్యాలయానికి నివేదిక ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అవినీతిలో పలువురు ఉద్యోగుల పాత్ర ఈ అవినీతి వ్యవహారంలో జిల్లాలో విఽవిధ మండలాల్లో పనిచేస్తున్న ఏడుగురు సైట్ ఇంజినీర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగి, సమగ్ర శిక్ష కార్యాలయంలో పనిచేసే ఓ సీనియర్ అసిస్టెంట్ పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. వీరు ముందుగానే ఏపీసీతో అవగాహనకు వచ్చి చేసిన పనులకు మళ్లీ బిల్లులు పెట్టారు. ఏపీసీ, ఈఈ ఉమ్మడి ఖాతా నుంచి తన బినామీలతో చెక్కుల ద్వా రా నిధులు డ్రా చేశారు. ఈ పరంపరలో మనుబోలులో పనిచేసిన ఓ మహిళా సైట్ ఇంజినీర్(ప్రస్తుతం ఉద్యోగానికి రాజీనామా చేశారు) తన భర్త పేరుతో 2025 ఏప్రిల్ 5న రూ.14.32 లక్షలు డ్రా చేయడం వెలుగుచూసింది. ఇలా పలువురు సైట్ ఇంజినీర్లు తమ బినామీల పేరుతో రూ.80 లక్షల మేర నిధులు డ్రా చేసి పంచుకున్నట్లు తెలుస్తోంది. ఒకప్పడు సాధారణ జీవితం గడిపిన వీరు నేడు లగ్జరీ కార్లతో పాటు విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు తెలుస్తోంది. అవుట్స్సోరింగ్ ఉద్యోగి బ్యాంకు ఖాతాల్లో కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. ఈఈ సుబ్బరాయుడు ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా ఆయన పేరుతో చెక్కలపై ఫోర్జరీ సంతకాలు చేసిన నిధులు డ్రా చేసినట్లు సమాచారం. సమగ్ర విచారణ జరిపితే అవినీతి తిమింగలాల బాగోతం వెలుగుచూసే అవకాశం ఉంది. స్పిల్ఓవర్ పనుల పేరుతో రూ.80 లక్షలు స్వాహా చేసిన పనులకే మళ్లీ బిల్లులు ఏపీసీ,ఈఈ పేరుతో దర్గామిట్ట కెనరా బ్యాంకులో జాయింట్ ఖాతా దాని నుంచి బినామీ పేర్లతో నిధుల డ్రా అవుట్స్సోరింగ్ ఉద్యోగి, ఏడుగురు సైట్ ఇంజినీర్లు కీలక పాత్ర స్పిల్ ఓవర్ పేరుతో నిధులు కాజేసేందుకు నిబంధనలకు వ్యతిరేకంగా నెల్లూరు దర్గామిట్ట కెనరా బ్యాంకులో ఏపీసీ డీ వెంకటసుబ్బయ్య, ఈఈ సుబ్బారాయుడు 2025 జనవరిలో జాయింట్ ఖాతా ఓపెన్ చేశారు. గతంలో ఇలా ఎప్పుడు ఖాతాలు తెరవలేదు. వాస్తవంగా అకౌంట్ సెక్షన్ నుంచి నేరుగా పాఠశాలల జాయింట్ ఖాతాల్లో నిధులు జమచేసేవారు. పాఠశాలల్లో చేపట్టిన పనులకు స్కూల్ కమిటీ చైర్మన్, హెచ్ఎం చెక్కులు జారీ చేసేవారు. కానీ అలా చేయకుండా కెనరా బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేసి బినామీల ద్వారా నిధులు కాజేశారు. -
ఓటర్.. నో టెన్షన్
సీతారామపురం : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (సర్)పై జాతీయ ఎన్నికల కమిషన్ ఓటర్లకు ఊరట కలిగించింది. అన్ మ్యాప్డ్ ఓటర్లను భయపెడుతున్న అంశంపై వివరణ ఇస్తూ తాజాగా శుభవార్త చెప్పింది. 2025, 2002 ఓటరు జాబితాల్లో ఓట్లు మ్యాప్ కాకపోయినా ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పిస్తే సరిపోతుందని తెలిపింది. అయితే ఎన్నికల కమిషన్ గుర్తించిన ఆధార్తో పాటు 13 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదోక దాన్ని మాత్రం సమర్పించాలని షరతు పెట్టింది. జిల్లాలో 2025 ఓటర్ల జాబితా ప్రకారం 19,74,240 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్ల వివరాలన్నీ 2002 జాబితాతో సరిపోల్చడమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ముఖ్యఉద్దేశం. అయితే ప్రస్తుతం ఉన్న ఓటర్లలో చాలామంది 2002 జాబితాతో పోల్చితే మ్యాప్ కావడం లేదు. దీంతో చాలామంది అన్మ్యాప్డ్గా మిగిలిపోతున్నారు. దీంతో వారంతా తమను ఓటర్లుగా తొలగిస్తారనే భయంతో ఉన్న నేపథ్యంలో అన్మ్యాప్డ్ ఓటర్లకు ఎన్నికల కమిషన్ వివరణతో కొంత ఆందోళన తగ్గింది. 2002, 2025 జాబితాల్లో లేకపోతే ప్రస్తుతం జరుగుతున్న సర్ ప్రక్రియలో 2002 2025 ఓటరు జాబితాలు అత్యంత కీలకం. రెండు జాబితాల్లో ఓటరుగా ఉండడం లేదా తల్లిదండ్రులు వివరాలు కలిగి ఉండాలి. అప్పుడే ఓటరుగా కొనసాగిస్తారు. అయితే రెండు జాబితాల్లో పేర్లు లేని వారు ఏమి చేయాలంటే కొత్తగా ఓటు నమోదు ఫారం–6 నింపి ఇస్తే సరిపోతుంది. వారి పేరు కూడా కొత్తగా వచ్చే ఓటరు జాబితాలో వస్తుంది. డబుల్ ఓటర్లకు.. ట్రబులే ప్రస్తుతం ఉన్న ఓటరు జాబితాలో చాలా మందికి రెండు చోట్ల ఓటు హక్కు ఉంది. అయితే గతంలో ఎన్నికల కమిషన్ చేపట్టే స్పెషల్ సమ్మరి డివిజన్ (ఎస్ఎస్ఆర్)లో దానిని గుర్తించేందుకు డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్ పద్ధతిని వాడినా సరైన ఫలితం లభించేది కాదు. ఈ క్రమంలో ప్రస్తుతం చేపట్టే సర్లో మాత్రం డబుల్ ఓటర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రెండు చోట్ల ఓటు ఉన్నా ఒక్కచోటే ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వాలి. అలా కాదని రెండు చోట్ల ఇచ్చినా వారు సమర్పించే గుర్తింపు కార్డులతో పట్టుబడే అవకాశం ఉంది. దీంతో డబుల్ ఓటర్లకు ట్రబుల్ మొదలైంది అని చెప్పొచ్చు. అన్మ్యాప్డ్ కాకపోయినా. 2002 ఓటరు జాబితాలో ప్రస్తుత ఓటరు వివరాలు లేకపోయినా, వారి తల్లిదండ్రుల వివరాలు లేకపోయినా మ్యాపింగ్ అయి ఉంటే చాలని, ఎన్యూమరేషన్ ఫారం ఇస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. అయితే అన్మ్యాప్డ్ ఓటర్లకు నోటీసులు ఇస్తామని, తాము గుర్తించిన 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి సమర్పిస్తే సరిపోతుందని ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది. 1987 జూలై 1వ తేదీ నాటికి ఓటరు జన్మించి ఉంటే తనకు సంబంధించిన గుర్తింపు కార్డులో ఒక్క దాన్ని ఇస్తే సరిపోతుంది. 1987 జూలై 1నుంచి 2004 డిసెంబర్ 2వ తేదీ మధ్యన జన్మించిన ఓటరైతే తన ఒక్క గుర్తింపు కార్డుతో పాటు తల్లిదండ్రుల్లో ఒకరి వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. 2004 డిసెంబర్ 2 తర్వాత జన్మించిన ఓటర్ అయితే తన గుర్తింపు కార్డుతో పాటు తల్లిదండ్రుల ఇద్దరి గుర్తింపు కార్డులను సమర్పిస్తే సరిపోతుంది. 2004 తరువాత విదేశాల నుంచి వచ్చి ఇండియాలో ఉంటే అతని పాస్పోర్టు, వీసాలను సమర్పించి ఓటుహక్కు పొందొచ్చు. 2002 జాబితాలో తల్లిదండ్రుల పేర్లు లేకపోయినా భయం అవసరం లేదు ఎన్యూమరేషన్ ఫారం నింపితే చాలు దానితో పాటు 13 రకాల గుర్తింపు పత్రాల్లో దేనినైనా సమర్పిస్తే సరి 2002, 2025 జాబితాలో పేరులేకున్నా ఫారం–6 ఇస్తే ఓటరుగా నమోదు ఇప్పటి వరకు ఫారం ఇవ్వలేదు ఇప్పటి వరకు మా ఇంటికి వచ్చి ఫారం ఎవ్వరూ ఇవ్వలేదు. 67వ బూత్లో ఓటరు జాబితా 917 నంబరులో ఓటు ఉంది. ఫారం ఇవ్వలేదని అడిగితే మీది కనిపించడం లేదని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఫారం ఇవ్వకపోవడంతో ఎప్పుడు పూరించి ఇవ్వాలో అర్ధం కావడం లేదు. – గంధళ్ల రాజమ్మ, మరుపూరు, పొదలకూరుఓటర్లకు పూర్తి సమాచారం తెలియదు సర్ విషయంలో ప్రజలకు అనేక సందేహాలు ఉన్నాయి. బీఎల్వోలు ఇంటింటికి వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు అందించడం లేదు. మా ఇంట్లో మూడు ఓట్లు ఉన్నాయి. వీఆర్ఏ వచ్చి నా ఒక్క ఓటుకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారం మాత్రమే అందించాడు. మిగిలిన రెండు ఓట్లపై వీఆర్ఏకు అవగాహన లేదు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఇలా ఉంటే పట్టణ ప్రాంతాల్లో అందుకు భిన్నంగా ఉంది. సర్ విషయాలపై ఓటర్లకు అవగాహన కల్పిండంలేదు. దీంతో ఓటర్లు అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. ఓట్లు తొలగిస్తారేమోనని ఆందోళనలో ఉన్నారు. సమయం తక్కువగా ఉన్నందున అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. –బోయాజ్, న్యాయవాది, సోమశిల -
ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడిస్తారు?
● ఎస్ఎఫ్ఐ నాయకుల ధర్నా నెల్లూరు(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.త్రివిక్రమ్, వెన్ను నరేంద్ర డిమాండ్ చేశారు. సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. అనంతరం డీఆర్వో విజయకుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా విద్యారంగ సమస్యల పరిష్కారానికి సరైన ప్రణాళిక విడుదల చేయకపోవడం సిగ్గు చేటన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయనందున సెమిస్టర్ పరీక్షల సందర్భంగా హాల్టికెట్లు ఇవ్వకుండా యాజమాన్యాలు విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేస్తున్నట్లు ఆరోపించారు. చదువు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. దీనికి కూటమి ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. నూతన విద్యార్థులకు ప్రవేశపెట్టే ముఖ ఆధారిత హాజరు (ఎఫ్ఆర్ఎస్)తో తీవ్రంగా నష్టపోతారన్నారు. సంక్షేమ హాస్టళ్లలో ఉండే వారికి రూ.3 వేలకు మెస్ చార్జీలను పెంచాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సుమంత్, యశ్వంత్, ముజమిల్, బాలు, అస్మత్, పవన్, రషీద్ తదితరులు పాల్గొన్నారు. -
కన్నీటి వెతలు తీరేదెన్నడు?
● పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● 136 వినతుల అందజేతనెల్లూరు(క్రైమ్): భర్త మృతిపై లోతుగా దర్యాప్తు చేయాలి. భర్త మృతిచెందడంతో అత్తింటివారు ఇబ్బందులు పెడుతున్నారు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటిగాథ. సమస్యలను పరిష్కరించాలని వారు పోలీసు ఉన్నతాధికారులను కోరారు. సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 136 వినతులు వచ్చాయి. వాటిని పరిశీలించిన ఎస్పీ అజిత వేజెండ్ల ఆయా ప్రాంత పోలీసు అధికారులతో మాట్లాడారు. వినతులు పునరావృత్తం కాకుండా చట్టపరిధిలో విచారించాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శించరాదన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నెల్లూరు రూరల్, డీటీసీ డీఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, గిరిధర్, మహిళా పోలీస్స్టేషన్, కంట్రోల్రూమ్, ఎస్బీ – 1, 2 ఇన్స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, భక్తవత్సలరెడ్డి, జి.దశరథరామారావు, బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● హైదరాబాద్కు చెందిన కృతిరెడ్డి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైంది. ట్రేడింగ్లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని నమ్మించి రూ.10 లక్షలు తీసుకుని మోసగించిందని ఏఎస్పేటకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ● నా భర్త వ్యవసాయాధికారిగా పనిచేస్తూ జూన్ 15వ తేదీన అనుమానాస్పదంగా మరణించాడు. దానిపై లోతుగా దర్యాప్తు జరిపి అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఓ మహిళ కోరారు. ● నా భర్త మృతిచెందాడు. పెద్ద కుమారుడు, కోడలు నా ఆస్తిని వారి పేరుపై రాయించుకున్నారు. అంతటితో ఆగకుండా మానసికంగా వేధిస్తున్నారు. విచారించి న్యాయం చేయాలని రాపూరు ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు అర్జీ ఇచ్చారు. ● నా భర్త చనిపోయాడు. బీమా డబ్బులు వచ్చాయి. వాటిని ఇచ్చేయాలని అత్తింటివారు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని వేధిస్తున్నారని కావలికి చెందిన ఓ మహిళ వినతిపత్రమిచ్చారు. -
అధికారులు వచ్చారు.. వెళ్లారు
● ఆందోళనలో తీగపాళెం గ్రామస్తులు చిల్లకూరు: క్రిస్సిటీ ఏర్పాటులో భాగంగా తీర ప్రాంతంలోని తమ్మినపట్నం రెవెన్యూ పరిధిలో భూములను సేకరించారు. వాటికి దగ్గరగా తీగపాళెం అనే గ్రామం ఉంది. దీనికి చుట్టూ 15 ఎకరాల భూమిని భవిష్యత్ అవసరాల కోసం అలాగే వదిలేశారు. ఇటీవల ఆ భూమిని సేకరించేందుకు ఏపీఐఐసీ ప్రయత్నించింది. కొలతలు వేశారు. అయితే దీనిని గ్రామస్తులు అడ్డుకున్నారు. మరోసారి సోమవారం అధికారులు గ్రామానికి వచ్చి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సేకరించాలనే విషయాలను చర్చించి వెళ్లిపోయారు. తమకు ఎలాంటి సమాచారం అందజేయకుండా అధికారులు పర్యటించడంపై స్థానికులు ఆందోన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికారులతో కలిసి వస్తే తమకు భరోసా ఉంటుందని అలా కాకుండా ఎవరికి వారుగా పర్యటించి సర్వేలు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. -
ఖాళీ బిందెలతో మహిళల ధర్నా
ఆత్మకూరురూరల్: పట్టణంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చడంతో మహిళలు సోమవారం ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో మున్సిపల్ పరిధిలోని బట్టేపాడు రోడ్డు సమీపంలోని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద సీపీఎం పట్టణ కార్యదర్శి డేవిడ్రాజు ఆధ్వర్యంలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. తాగడానికి, వంట చేసుకోవడానికి, రోజువారి అవసరాలకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ నివాస ప్రాంతం కొండప్రాంతం ఏటవాలుగా ఉండడంతో పైభాగంలోని ఇళ్లకు తాగునీరు చేరడం లేదని వాపోయారు. ప్రత్యేకంగా వాల్వులు ఏర్పాటు చేసి నీటి సరఫరాను మెరుగుపర్చాలని, లేదంటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదన్నారు. నెలలో ఎక్కువ రోజులు ఇదే సమస్య పునరావృతమవుతోందని వాపోయారు. -
ప్రశ్న రావణ్ నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలింపు
వెంకటాచలం: దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ను గన్నవరం పోలీసులు సోమవారం నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. జనసేన నాయకుడు గరికపాటి శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గన్నవరం పోలీసులు ఆదివారం ప్రశ్న రావణ్ను గన్నవరం కోర్టుకు హాజరు పర్చగా కోర్టు 14 రోజులు రిమాండ్ వి ధించింది. దీంతో గన్నవరం పోలీసులు సోమవా రం ఉదయం ప్రశ్న రావణ్ను నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చెముడుగుంట వద్ద నున్న నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. 54.94 శాతం సర్ డిజిటలైజేషన్ నెల్లూరు (అర్బన్): జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సమగ్ర సవరణ జాబితాకు సంబంధించి ఇప్పటి వరకు 10,84,562 ఓటర్ల ఫారాలను డిజిటలైజేషన్ చేసి 54.94 శాతం లక్ష్యాన్ని చేరుకున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 19,74, 240 మంది ఓటర్లుండగా, 19,43,973 ఫారాలను ఇంటింటికి తిరిగి బీఎల్వోలు పంపిణీ చేశారని, 98.47 శాతం ప్రగతి సాధించామని చెప్పారు. ఫారాలు తీసుకున్న ఓటర్లందరూ తమ వివరాలను నమోదు చేసి వెంటనే బీఎల్వోలకు అందజేసి ఓటును నిలుపుకోవాలని సూచించారు. 13లోగా సీజ్ చేసిన వాహనాలను తీసుకెళ్లాలి నెల్లూరు (టౌన్): రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో పన్నులు చెల్లించని, ఫిట్నెస్ లేని వాహనాలను సీజ్ చేసినట్లు డీటీసీ బీ చందర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే సదరు వాహనాలకు సంబంధించి డిమాండ్ నోటీసులు జారీ చేశామని చెప్పారు. ఈ నెల 13వ తేదీలోగా వాహనాల యజమానులు నెల్లూరులోని ఉప రవాణాశాఖ కార్యాలయంలో సంప్రదించి పన్నులు, ఫిట్నెస్ అపరాధ రుసుం చెల్లించి వాహనాలను తీసుకెళ్లాలని, లేకుంటే బహిరంగ వేలం వేస్తామని తెలిపారు. శ్రీవారి దర్శనానికి ఆరు గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
ఆశతో వస్తున్నారు.. ఆవేదనతో వెళ్తున్నారు
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● క్షేత్రస్థాయిలో పట్టించుకోవడం లేదని ప్రజల ఆవేదననెల్లూరు(అర్బన్): ‘అయ్యా.. మా సమస్యలపై క్షేత్రస్థాయిలో అధికారుల చుట్టూ తిరిగాం. మండల స్థాయిలో పరిష్కారం కాకపోవడంతో వ్యయప్రయాసాలకోర్చి జిల్లా కేంద్రానికి వచ్చాం. ఇక్కడైనా గోడు విని వాటిని పరిష్కరించండి’ అని ప్రజలు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీ స్థాయిలో వచ్చారు. అర్జీదారులతో కలెక్టరేట్ కిటకిటలాడింది. ప్రజల నుంచి కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, ఇతర జిల్లా అధికారులు అర్జీలు స్వీకరించారు. టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు నేను నడవలేను. ఎవరైనా ఎత్తుకుని కుర్చీలో కూర్బోబెడితే అలాగే ఉంటా. నాకు 88 శాతం వైకల్యం ఉన్నట్లు సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. గతం నుంచి నాకు రూ.4,000 పింఛన్ వస్తోంది. అయితే 80 శాతం కన్నా ఎక్కువ వికలత్వం ఉంటే రూ.15 వేలు పెన్షన్ ఇవ్వాలి. వైఎస్సార్సీపీ అభిమానులమని టీడీపీ వారు రూ.15 వేలు పింఛన్కు రాయకుండా రెండేళ్లుగా అడ్డుకున్నారు. కలెక్టర్ స్పందించి నాకు న్యాయబద్ధంగా రావాల్సిన విధంగా పింఛన్ రూ.15 వేలు ఇప్పించాలి. – పెద్ది కోటేశ్వరి, పద్మనాభసత్రం, కొడవలూరు మండలం ఫ్యామిలీ పెన్షన్ రాకుండా చేశారు మా అమ్మ ఆయుష్ విభాగంలో ఏఎన్ఎంగా పనిచేస్తూ 2012లో రిటైర్డ్ అయ్యారు. 2020లో ఆమె మృతిచెందారు. నాకు పెళ్లి కాలేదు. ఏ ఆధారం లేని పెళ్లికాని సింగిల్ పర్సన్కు ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చే జీఓ ఉంది. అయినా ఆయుష్ శాఖ వారు ఆరేళ్లుగా పెన్షన్ ఫైలు నడపకుండా చేశారు. చిన్నపాటి సాంకేతిక కారణాలంటూ తిప్పుకొన్నారు. ఇప్పుడు ఆ శాఖలోని ఉద్యోగులు కూడా మారారు. కలెక్టర్ జోక్యం చేసుకుని ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. – వడ్లపూడి మాధురి, నెల్లూరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై.. ఆర్టీసీలో పీటీడీ అవుట్ సోర్సింగ్ కార్మికులకు ప్రభుత్వ ఎంఓయూ ప్రకారం కాంట్రాక్టర్లు వేతనాలు ఇవ్వడం లేదు. ఇచ్చే వేతనాల్లో కూడా భారీ తేడాలున్నాయి. అందువల్ల కాంట్రాక్టర్ను కలెక్టర్ పిలిపించి సక్రమంగా వేతనాలు వచ్చేలా చర్యలు చేపట్టాలి. ఉద్యోగులకు బ్యాంక్ ఖాతాల ద్వారానే జీతాలివ్వాలి. ఆర్టీసీ ఆస్పత్రిలో వైద్యసౌకర్యం కల్పించాలి. మహిళా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు మెటర్నిటీ సెలవులివ్వాలి. ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే మేనేజ్మెంట్ ఎక్స్గ్రేషియాను ప్రకటించాలి. ప్రతినెలా ఐదోతేదీలోపు జీతాలందేలా చూడాలి. – యామాల మధు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి అర్జున్ వేధిస్తున్నా చర్యల్లేవు నేను ఏఎస్పేట మండలం చిరమన పీహెచ్సీలో అవుట్ సోర్సింగ్ విధానంలో ఎఫ్ఎన్ఓగా పని చేస్తున్నాను. నేను, మరో కాంట్రాక్ట్ నర్సు డ్యూటీ నుంచి ఇంటికి వెళ్లేప్పుడు రొడ్డం నాగేంద్ర అనే వ్యక్తి వెంబడిస్తున్నాడు. తరచూ మాపై ఆర్టీఐ పెడుతున్నాడు. మాటలతో వేధిస్తున్నాడు. ఈ విషయమై డీఎంహెచ్ఓ కూడా కలెక్టర్కు తెలిపారు. ఆయన చర్యలు తీసుకోమని ఎస్పీకి తపాలా ద్వారా ఆదేశాలు జారీ చేశారు. ఇలా పలుమార్లు జరిగినా పోలీసులు నాగేంద్రపై చర్యలు తీసుకోవడం లేదు. మాకు రక్షణ కల్పించాలి. – దొరసానమ్మ, అవుట్ సోర్సింగ్ ఎఫ్ఎన్ఓ, ఆత్మకూరు -
మహోన్నత వ్యక్తి బాబూ జగ్జీవన్రామ్
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు(పొగతోట): బాబూ జగ్జీవన్రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతికి, సమసమాజ స్థాపనకు అహర్నిశలు కృషి చేసిన మహోన్నత నాయకుడని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, దేశ ఉప ప్రధానిగా, సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా సేవలందించిన జగ్జీవన్రామ్ వర్ధంతిని సోమవారం నెల్లూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ జగ్జీవన్రామ్ వెనుకబడిన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఆయన జీవిత ప్రస్థానం భావితరాలకు స్ఫూర్తి అన్నారు. నేటి యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. -
ఎయిడ్స్ రహిత సమాజమే లక్ష్యం
● ఏపీ శాక్స్ జేడీ డాక్టర్ మంజుల నెల్లూరు(అర్బన్): ఎయిడ్స్ రహిత సమాజం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఏపీ శాక్స్ జేడీ డాక్టర్ మంజుల పిలుపునిచ్చారు. సోమవారం నెల్లూరులోని డీఎఫ్ఐటీ కార్యాలయంలో జిల్లా ఎయిడ్స్, టీబీ నివారణాధికారి డాక్టర్ ఖాదర్వలీ అధ్యక్షతన ఐసీటీసీ, పీపీటీసీ, డీఎస్ఆర్సీ, ఏఆర్టీ కేంద్రాలు, ఎన్జీఓ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ హెచ్ఐవీ పాజిటివ్గా నిర్ధారణైన వారిని తప్పనిసరిగా ఏఆర్టీ కేంద్రంలో నమోదు చేయాలని, ఇండెక్స్ టెస్టింగ్పై అవగాహన కల్పించాలని అన్నారు. హెచ్ఐవీ బాధితులకు సకాలంలో వైరల్ లోడ్ పరీక్షలు నిర్వహించి, ఫలితాలకు అనుగుణంగా మందులు అందించాలని సూచించారు. అలాగే హెచ్ఐవీ ఉన్న గర్భిణుల విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ సకాలంలో పరీక్షలు, చికిత్సతోపాటు మానసికంగా ధైర్యం కలిగించేలా కౌన్సెలింగ్ అందించాలని తెలిపారు. డీఎంహెచ్ఓ సుజాత మాట్లాడుతూ అధికారులు, ఎన్జీఓలు సమన్వయంతో పనిచేసి ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. పెద్దాస్పత్రి సెక్యూరిటీ గార్డుపై దాడి● పోలీసులకు ఫిర్యాదు నెల్లూరు(అర్బన్): నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వెంకయ్యపై ఓ రోగి బంధువు దాడి చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అడ్మిషన్ వార్డులో ఓ కుటుంబానికి చెందిన సీ్త్ర, పురుషుడు వాదోపవాదాలు వేసుకుంటూ అరుస్తున్నారు. డ్యూటీలో ఉన్న వెంకయ్య అక్కడికి వెళ్లి గొడవ పెట్టుకోవడం, సాటి రోగులకు ఇబ్బంది పెట్టడం సరికాదని సర్ది చెప్పాడు. ఏదైనా ఉంటే బయటకు వెళ్లి మాట్లాడుకోవాలన్నాడు. బయటకు వెళ్లమని చెప్పడంతో కోపోద్రిక్తుడైన రోగి అటెండర్ కిరణ్కుమార్ అనే వ్యక్తి వెంకయ్యపై చేయి చేసుకున్నాడు. దీంతో అతను కిందపడ్డాడు. ఈ క్రమంలో గందరగోళం నెలకొంది. రోగులు భయాందోళనకు గురయ్యారు. సెక్యూరిటీ వారు తమ ఇన్చార్జి రమణయ్యకు తెలిపి ఆయన సహకారంతో దర్గామిట్ట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంకా కేసు నమోదు చేయలేదు. ఓ లాయర్ వచ్చి రాజీ చేసుకోవాలని సెక్యూరిటీ గార్డుకు సూచించినట్టు సమాచారం. లేకుంటే ఇబ్బంది పడతారని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా డ్యూటీలో ఉన్న తమపై చేయిచేసుకోవడంపై సెక్యూరిటీ సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. తమకు రక్షణ లేకపోతే విధులు ఎలా నిర్వర్తించాలని ఆవేదన చెందుతున్నారు. ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు ● ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిరసన నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘ప్రశ్నించే వారిపై కూటమి ప్రభుత్వం అక్రమ పోలీస్ కేసులు బనాయిస్తోంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తే ఉద్యమాలు తప్పవు’ అని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ మున్నా హెచ్చరించారు. నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. మున్నా మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను, వైఫల్యాలను ఎండగడుతున్న జర్నలిస్టులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా కార్యకర్తలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి సమయంలో అరెస్ట్ చేయటం సరికాదన్నారు. ప్రశ్న రావణ్పై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారన్నారు. తప్పు చేస్తే ప్రశ్నిస్తానని చెప్పిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు రాష్ట్రంలో జరుగుతున్న దారుణ పరిస్థితులపై ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు రామరాజు, జిలానీఖాన్, గౌస్బాషా, బాదుల్లా, నాగూర్, మనోహర్, అశోక్, మస్తాన్, తదితరులు పాల్గొన్నారు. -
సర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండండి
● టీడీపీ అక్రమాలకు పాల్పడితే సహించొద్దు ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మనుబోలు: సర్ ప్రక్రియ విషయంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అప్రమత్తం చేశారు. సోమవారం మనుబోలుకు వచ్చిన కాకాణి మీడియాతో మాట్లాడుతూ సర్ ప్రక్రియను అడ్డుపెట్టుకుని టీడీపీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని, వైఎస్సార్సీపీ బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. టీడీపీ దొంగ ఓట్లు చేర్పించకుండా చూడాల్సిన బాధ్యత బీఎల్ఏలదే అన్నారు. చంద్రబాబు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు అధికారులకు ఆదేశాలిస్తున్నారని ఆరోపించారు. ఎక్కడైనా బీఎల్ఓలు పారదర్శకంగా వ్యవహరించకుండా పక్షపాతంగా వ్యవహరిస్తే తన దృష్టికి తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు. బూత్ లెవెల్ అధికారులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే వైఎస్సార్సీపీ నాయకులు ఉపేక్షించొద్దన్నారు. జిల్లాలో ఎక్కడ పొరపాట్లు జరిగినా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళుతామని తెలిపారు. టీడీీపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ప్రతిఘటించాలే తప్ప చూస్తూ ఊరుకోవద్దన్నారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం, అనర్హులను తొలగించడం బీఎల్ఓల బాధ్యతన్నారు. అధికారులు చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. మంత్రి నారాయణ, మున్సిపల్ కమిషనర్ ఇద్దరూ కలిసి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరు బట్టబయలైందన్నారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరించాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. దీనికి ముందు మనుబోలుకు చెందిన వైఎస్సార్సీపీ నేత కోసూరు కోటేశ్వరగౌడ్ తల్లి, మాజీ ఉప సర్పంచ్ సుశీలమ్మ మరణించడంతో సోమవారం ఆమె పార్ధీవ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట పార్టీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్రెడ్డి, మన్నెమాల సాయిమోహన్రెడ్డి, కసిరెడ్డి ధనుంజయరెడ్డి, దాసరి భాస్కర్గౌడ్, చల్లా నవకోటి, చిట్టమూరు అజయ్రెడ్డి, ఆవుల తులసీరామ్, కేవీఆర్గౌడ్, గిరి, మహేంద్రవర్మ, శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. -
వ్యాక్సిన్తో రేబిస్ నుంచి రక్షణ
● డీఏహెచ్ఓ డాక్టర్ రమేష్ నాయక్ నెల్లూరు(వేదాయపాళెం): పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా యాంటీ రేబిస్ టీకాలు వేయించడం ద్వారా ప్రాణాంతక వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ కె. రమేష్ నాయక్ తెలిపారు. ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా సోమవారం నెల్లూరులోని వెటర్నరీ పాలి క్లినిక్ ప్రాంగణంలో ఉచిత యాంటీ రేబిస్ టీకాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పెంపుడు జంతువుల యజమానులకు అవగాహన కల్పించారు. రమేష్ నాయక్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 31,100 డోసుల యాంటీ రేబిస్ వ్యాక్సిన్ను అన్ని ప్రభుత్వ పశువైద్యశాలల్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఇన్చార్జి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.మాలకొండయ్య మాట్లాడుతూ కుక్కలు, పిల్లులు తదితర పెంపుడు జంతువులకు ప్రతి ఏడాది తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ వి.సుజాత, నారాయణ డెంటల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కణ్ణన్, ఫౌండేషన్ ఫర్ యానిమల్స్ కార్యదర్శి ఉమాదేవి, రాష్ట్ర వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ టి.జయప్రకాష్, డాక్టర్ జి.కృష్ణమూర్తి, డాక్టర్ జె.చైతన్య కిశోర్, జేవీఓ ఎం.అరుణ, పొదిలి శ్రీనివాసులు, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. -
14న ఫ్యాప్టో ఆధ్వర్యంలో ర్యాలీ
నెల్లూరు(టౌన్): దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఈనెల 14వ తేదీన ఫ్యాప్టో ఆధ్వర్యంలో భారీస్థాయిలో ర్యాలీ నిర్వహించి నెల్లూరు కలెక్టరేట్ వద్ద పికెటింగ్ను నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా చైర్మన్ కంచర్ల మధుసూదన్రావు, రాష్ట్ర పరిశీలకుడు ఎన్వీ రమణయ్య తెలిపారు. ఆదివారం నెల్లూరులోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న యూటీఎఫ్ కార్యాలయంలో ఫ్యాప్టో ఆధ్వర్యంలో పలు ఉపాధ్యాయ సంఘాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పోరాటానికి సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ 12వ పీఆర్సీ వెంటనే నియమించాలన్నారు. 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ డీఏలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను మానసిక క్షోభకు గురిచేస్తున్న టెట్ను రద్దు చేయాలనే డిమాండ్లతో ప్రభుత్వంపై పోరుబాట పట్టామన్నారు. ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ జావీద్ మాట్లాడుతూ కలెక్టరేట్ వద్ద భారీ స్థాయిలో జరిగే పికెటింగ్ను జయప్రదం చేయాలని కోరుతూ తాలూకా కేంద్రాలలో సన్నాహక సభలు నిర్వహించాలని నాయకులకు సూచించారు. అలాగే 14న కలెక్టరేట్ వద్దకు ఉపాధ్యాయ లోకం తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కో చైర్మన్ ప్రసాద్, నాయకులు వీవీ శేషులు, నరసింహం, గురవయ్య, చలపతిశర్మ, దశరథరాములు, కృష్ణ, తమీమ్ అన్సారీ, బాలరాగయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. -
‘వెంకయ్య నాయకుడు’ పుస్తక పరిచయం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): దేశ మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడిపై రాసిన పుస్తక పరిచయ కార్యక్రమం ఆదివారం నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో ఘనంగా జరిగింది. సీనియర్ పాత్రికేయుడు మాశర్మ రచించిన వెంకయ్య నాయకుడు పుస్తక పరిచయ కార్యక్రమానికి మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ, ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విచ్చేసి మాట్లాడారు. వెంకయ్య గురించి ఎంత చెప్పినా తక్కువేనన్నారు. రెండు పర్యాయాలు కేంద్రమంత్రిగా, ఉప రాష్ట్రపతిగా దేశానికి ఎంతో సేవ చేశారన్నారు. ఆయనకు ఉన్న అపారమైన అనుభవంతో రాజ్యసభలో పలు కీలక బిల్లులు ఆమోదింపజేశారన్నారు. ఆయన ప్రాంభించిన అమృత్ 2.0 పథకం ఇప్పటికీ కొనసాగుతోందన్నారు. రాష్ట్రానికి 7 లక్షల టిడ్కో ఇళ్లు మంజూరు చేయించారన్నారు. వెంకయ్య లాంటి రాజకీయ నాయకులు చాలా అరుదుగా ఉన్నారు. ఆయన జీవితం భవిష్యత్ తరాలకు రాజకీయ మహాగ్రంథంమని చెప్పారు. ఆయన సలహాలు, అనుభవం దేశానికి ఎంతో అవసరమన్నారు. -
నేడు ‘డయల్ యువర్ ఎస్ఈ’
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ వినియోగదారులు సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ పరిధిలో ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని ఎస్ఈ రాఘవేంద్రం సోమవారం నిర్వహించనున్నారు. నెల్లూరు విద్యుత్ భవన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. వినియోగదారులు ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య 0861 – 2320427 నంబర్కు ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు. ● తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం సీఎండీ శివశంకర్ ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వినియోగదారులు 89777 16661 నంబర్కు ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12:30 గంటల మధ్య ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు. వసతి గృహంలో మంత్రి తనిఖీలుకావలి: పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలో ఉన్న బాలికల సంక్షేమ వసతి గృహాలను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాలవీరాంజనేయ స్వామి ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల కోసం అన్ని రకాల వసతులు కల్పించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థానాలకు ఎదగాలని కోరారు. కార్యక్రమంలో వార్డెన్, సిబ్బంది పాల్గొన్నారు. కుక్కను తప్పించబోయి..● ఆటో బోల్తా ● ఇద్దరికి గాయాలు వరికుంటపాడు: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో 565 జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. ఉదయగిరికి చెందిన నరేష్, అంకమ్మ చేపలు తీసుకుని ఆటోలో వేంపాడు పంచాయతీ భోగ్యంవారిపల్లిలో అమ్మకానికి తీసుకెళ్తున్నారు. అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన కుక్కను తప్పించే ప్రయత్నంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో నరేష్, అంకమ్మలకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో వారిని ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అంకమ్మకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పతికి తీసుకెళ్లారు. ఉప్పు కాలువలో మృతదేహం తోటపల్లిగూడూరు(పొదలకూరు): మండలంలోని కోడూరు పంచాయతీ పరిధిలోని పాతపాళెం ఉప్పు కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని ఆదివారం స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు కాలువ వద్దకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీయించారు. మృతుడి ఆచూకీ కోసం ఆరాతీస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నట్టు వెల్లడించారు. -
చెలరేగిపోతున్న గ్రావెల్ మాఫియా
● పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు ● ప్రభుత్వాదాయానికి గండి వింజమూరు(ఉదయగిరి): ఉదయగిరి నియోజకవర్గంలోని పలు మండలాల్లో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతోంది. పగలూ, రాత్రనే తేడా లేకుండా అధికార పార్టీ నేతలు తరలిస్తూ రూ.లక్షలను ఆర్జిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు రాయల్టీ రూపంలో రావాల్సిన సొమ్ము పచ్చనేతల జేబుల్లోకి వెళ్తోంది. చెరువులు, భూముల్లో యథేచ్ఛగా వ్యవహారాన్ని సాగిస్తున్న అక్రమార్కులపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో సమస్య రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తోంది. ప్రతి చోటా ఇంతే.. కలిగిరి మండలంలో సోమశిల ఉత్తర కాలువ అభివృద్ధిలో కాలువపై వేసిన మట్టిని ట్రాక్టర్లు, జేసీబీల ద్వారా రాత్రివేళ విచ్చలవిడిగా తరలిస్తున్నారు. మూడు నెలలుగా ఈ దందా సాగుతున్నా, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అర్ధరాత్రి వేళ ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న మట్టిని ఇరిగేషన్ అధికారులు అడ్డుకొని వాహనాలను పోలీసులకు రెండ్రోజుల క్రితం అప్పగించారు. వీటిని విడిపించేందుకు పోలీసులపై తీవ్రమైన రాజకీయ ఒత్తిడి వచ్చిందని తెలుస్తోంది. హెచ్చరించినా మారని తీరు వింజమూరులోని మలపరాజు చెరువు, వాగు తదితర ప్రాంతాల్లో మట్టిని రాత్రి వేళ అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వాదాయానికి గండికొడుతున్నారు. కలిగిరి మండలం భట్టువారిపాళెంలో పొలాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ను తరలిస్తున్న జేసీబీలను వింజమూరు పోలీసులు ఇటీవల పట్టుకొని హెచ్చరించి వదిలేశారు. అయినా ఇదే పంథాను కొనసాగించడంతో జేసీబీ, టిప్పర్ను స్వాధీనం చేసుకున్నారు. దుత్తలూరు, ఉదయగిరి, వరికుంటపాడు మండలాల్లోని ఇరిగేషన్ చెరువుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్నా, సంబంధిత అధికారుల చర్యలు శూన్యంగా ఉంటున్నాయి. -
సర్.. సందేహాలు తీర్చుకోండిలా..!
● అందుబాటులోకి బుక్ ఎ కాల్ విత్ బీఎల్వో సేవలు సీతారామపురం: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో చేపడుతున్న ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ మందకొడిగా సాగుతోంది. జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో 2953 పోలింగ్ కేంద్రాలు.. 19,74,240 మంది ఓటర్లున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికో బీఎల్వో ఉన్నారు. ఈ నెల 14 వరకు ప్రక్రియ కొనసాగనుంది. ఆలోపు గణన పత్రాల డిజిటలైజేషన్కు సంబంధించి ఓటర్లకు ఎలాంటి సందేహాలున్నా, అధికారుల వద్దకెళ్లకుండా నేరుగా బీఎల్వోనే పరిష్కారం చూపేలా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బుక్ ఎ కాల్ విత్ బీఎల్వో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓటర్లు సైతం దీన్ని సద్వినియోగం చేసుకుంటే కొంత మేర వెసులుబాటు లభించనుంది. ఈసీఐఎన్ఈటీ యాప్తో.. మొబైల్లో ఈసీఐఎన్ఈటీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో బుక్ ఎ కాల్ విత్ బీఎల్వో ఆప్షన్ను ఎంచుకోవాలి. అక్కడి వివరాల ఆధారంగా మీ ప్రాంత బీఎల్వోను ఎంపిక చేస్తే నేరుగా వారికి కాల్ రిక్వెస్ట్ వెళ్తుంది. 48 గంటల్లోపు వారు సంప్రదించి సందేహాలను నివృత్తి చేయనున్నారు. ఎన్యూమరేషన్ పత్రం అందకపోతే ఇంటికొచ్చి ఇస్తారు. సదరు పత్రాలను పూర్తి చేసి అందజేయాల్సి ఉంటుంది. ప్రతి ఓటరు రెండు కలర్ ఫొటోలు, ఏదో ఒక గుర్తింపు కార్డును ఫారంతో పాటు జతపర్చాల్సి ఉంటుంది. -
ఎవరు పట్టించుకుంటారో తెలియడం లేదు
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినా, గౌరవ వేతనాన్ని అందించలేదు. సెప్టెంబర్తో పదవీ కాలం పూర్తి కానుంది. అసలు ఎవరు పట్టించుకుంటారో తెలియడంలేదు. – పోలు సుజాత, ఎంపీటీసీ, భైరవరం బకాయిలు అందజేయాలి గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మాకు గౌరవ వేతనాన్ని అందించారు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితే లేదు. ఎంపీటీసీలను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత. వెంటనే చెల్లించేలా చూడాలి. – కాలిచప్పిడి వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ, దుత్తలూరు బిట్ – 2 -
రైతుకు నష్టం.. ప్రభుత్వానికి ఆదాయం
నెల్లూరు(వేదాయపాళెం): కూటమి ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను స్వేచ్ఛగా విక్రయించుకుని ఇతర ప్రాంతాలకు తరలించే విషయంలోనూ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వారికి తీరని వేదనను మిగులుస్తోంది. పంటలను తమకు అనుకూలమైన సమయంలో కోతలు కోసుకుని, అధిక ధర ఉన్న ప్రాంతాలకు తరలించి విక్రయించుకునే అవకాశం గతంలో ఉండేది. అయితే ఈనెల ఒకటో తేదీ నుంచి కొత్తగా ఈ పర్మిట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో పంటలను నేరుగా మార్కెట్కు తరలించే రైతులు ఆన్లైన్లో పర్మిట్ పొందేందుకు అనేక అవస్థలు పడుతున్నారు. ఎన్నో ఇబ్బందులు ఆన్లైన్ డేటాలో ప్రభుత్వం ముందుగానే పొందుపరిచిన వివరాల్లో ఏ ఒక్కటి పూర్తిగా నమోదు కాకపోయినా ఈ పర్మిట్ జారీ కావడం లేదు. వ్యవసాయంతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం కూడా నేర్చుకోవాలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. గతంలో మాన్యువల్ విధానంలో సంబంధిత గుమాస్తాకు తెలియజేసి రూట్ పర్మిట్లో నాలుగు నుంచి ఐదు గంటల వరకు అదనపు రవాణా సమయాన్ని నమోదు చేయించుకుని, ఆ గడువులోగా గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకునేవారు. ప్రస్తుతం ఆన్లైన్ విధానంలో ప్రాంతాల వారీగా కంప్యూటర్లో ముందుగానే రవాణా సమయాన్ని నిర్ణయించి, అదే ప్రకారం ఈ పర్మిట్ జారీ చేస్తున్నారు. దీంతో సమయం చాలా తక్కువగా ఉంటోందని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హడావుడిగా వాహనాలు నడపాల్సి వస్తోందని, ప్రమాదాలు జరిగితే తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని తీవ్ర మనస్థాపం వ్యక్తం చేస్తున్నారు. వారిపై భారం అవినీతిని అరికట్టడానికే ఈ పర్మిట్ విధానాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, రైతులకు కొత్తగా ఎలాంటి ప్రయోజనం లేకపోగా ఖర్చుల భారం పెరిగి నష్టపోవాల్సి వస్తోంది. గతంలో పర్మిట్ రాసే గుమాస్తాకు మార్కెటింగ్ ఫీజుతోపాటు అదనంగా కొంత నగదు చెల్లిస్తే సరిపోయేదని, ప్రస్తుతం ఆన్లైన్ ఖర్చులు, టోల్గేట్ల వద్ద మామూళ్లు, నిఘా విభాగాలకు చెల్లించాల్సిన మొత్తాలను ట్రేడర్లు తమ నగదులోనే మినహాయించుకుంటున్నారని అన్నదాతలు వాపోతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న కొత్త విధానాల వల్ల ప్రజలకు నష్టమే తప్ప, ఎలాంటి లాభం ఉండటం లేదని రైతులు, లైసెన్స్డ్ ట్రేడర్లు, ట్రాన్స్పోర్టర్లు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో పంట దిగుబడులు తగ్గే అవకాశముందని ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చరిస్తున్నప్పటికీ ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కేవలం ఆదాయార్జనే ధ్యేయంగా మార్కెటింగ్ శాఖను ఉసిగొల్పి రైతులపై భారం మోపుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. లక్ష్యం నెరవేరేనా? గతేడాది జిల్లా మార్కెటింగ్ శాఖకు రూ.38 కోట్ల మార్కెటింగ్ ఫీజు వసూళ్ల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆ శాఖ అధికారులు లక్ష్యాన్ని అధిగమించి రూ.39 కోట్లకు పైగా వసూలు చేశారు. దీంతో ఈ ఏడాది ఏకంగా రూ.42.44 కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల దీనిని చేరుకోవడం తలకుమించిన భారంగా మారుతుందని మార్కెటింగ్ శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు, సరైన దిగుబడులు రాకపోవడం, కొన్ని ప్రాంతాల్లో పంటలు ఎండిపోవడంతో ఈసారి ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదని రైతులు చెబుతున్నారు. దీంతో మార్కెటింగ్ శాఖ కూడా లక్ష్యాలను చేరుకునే పరిస్థితులు కనిపించడం లేదని శాఖ సిబ్బంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి తొలి త్రైమాసికంలో కేవలం రూ.7 కోట్ల వసూలు మాత్రమే నమోదైంది. ఈ పరిస్థితిని బట్టి ఈ ఏడాది మొత్తం వసూలు రూ.28 కోట్లలోపే ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో పంట దిగుబడులు తగ్గితే సెస్ వసూళ్లు కూడా గణనీయంగా తగ్గుతాయని భావిస్తున్నారు. జిల్లాలో ఎనిమిది మార్కెట్ కమిటీలు ఉండగా, 21 మార్కెటింగ్ టోల్గేట్ల ద్వారా సంబంధిత సిబ్బంది నిత్యం తనిఖీలు నిర్వహిస్తూ సెస్ వసూళ్లపై దృష్టి సారిస్తున్నారు. పంట రవాణాకు ఈ పర్మిట్ అమలు కొత్త విధానంతో ఒరిగిందేమీ లేదు ఖజానా నింపేందుకు కొత్త ఎత్తుగడ ఆన్లైన్ టైమింగ్తో ఇబ్బందులు పడుతున్న ట్రాన్స్పోర్టర్లుమాన్యువల్, ఈ పర్మిట్లను అనుమతిస్తున్నాం ఆన్లైన్ విధానానికి రైతులు, ట్రాన్స్పోర్టర్లు, ట్రేడర్లు ఇంకా అలవాటు కాలేదు. కాబట్టి మాన్యువల్ పర్మిట్ను కూడా అనుమతిస్తున్నాం. ఎవరికై నా ఎటువంటి సందేహాలుంటే తమ సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకోవచ్చు. – పి.అనితకుమారి, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారిణి -
ముత్యాలమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
చిల్లకూరు: మండల తీర ప్రాంతంలోని తూర్పుకనుపూరులో ఉన్న ముత్యాలమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పొంగళ్లు పెట్టి మొక్కులు చెల్లించారు. ఉదయం అమ్మవారికి పలు రకాల అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశారు. భక్తులతో ఆలయంలోని క్యూలు పూర్తిగా నిండిపోయాయి. అలాగే పోలేరమ్మ గుడి వద్ద కూడా భక్తులు నైవేద్యాలను సమర్పించి ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆలయ ఈఓ నవీన్కుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ దశరథరామిరెడ్డి పర్యవేక్షించారు. -
గంగ నీరందక..
● ఆందోళనలో అన్నదాతలు సైదాపురం: కండలేరు జలాశయంలో నీరున్నా మండల కేంద్రమైన సైదాపురం చెరువు ఆయకట్టు రైతుల ఖరీఫ్ సాగు సందిగ్ధంలో పడింది. ఈ ఏడాది చెరువులో చుక్కనీరు లేక ఖాళీగా దర్శనమిస్తోంది. గడిచిన ఐదేళ్లపాటు నీరు విడుదల చేయగా ఈసారి ఆ పరిస్థితి లేదు. దీంతో రెండు వందల ఎకరాల నిమ్మతోటలు ఎండుముఖం పట్టాయి. అలాగే అంతర్ పంటలకు కూడా నీరు అందకపోవడంతో రైతులు సాగు చేసుకోలేని దుస్థితి వచ్చింది. సైదాపురం చెరువుకు జోగిపల్లి కాలువ ద్వారా ఏటా గంగ నీరు విడుదల అవుతుండేది. ఈ సీజన్ మొదలైనా కండలేరు జలాశయం నుంచి చుక్కనీరు విడుదల కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
మత్తు.. యువత చిత్తు
నెల్లూరు(క్రైమ్): ఒకప్పుడు మహా నగరాలకే పరిమితమైన మాదకద్రవ్యాల విష సంస్కృతి ఇప్పుడు జిల్లాలోనూ వేగంగా విస్తరిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ను తీసుకొస్తున్న ముఠాలు యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నాయి. తొలుత సరదాగా ప్రారంభమైన అలవాటు క్రమేపీ వ్యసనంగా మారి జీవితాలను నాశనం చేస్తోంది. అనేక ప్రాంతాల్లో డ్రగ్స్ విక్రయాలు చాపకింద నీరులా సాగుతుండగా, ఇటీవల నగర పోలీసులు నిరర్వహించిన దాడుల్లో మరోమారు ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి.. జిల్లాకు చెందిన పలువురు యువత ఉన్నత చదువులు, ఉద్యోగరీత్యా కర్నాటక, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఉంటున్నారు. అక్కడ స్నేహితులతో కలిసి పార్టీలకు హాజరయ్యే క్రమంలో కొందరు డ్రగ్స్కు అలవాటు పడుతున్నారు. అనంతరం వ్యసనానికి సరిపడా నగదు కోసం విక్రయదారులుగా మారుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలుతోంది. ఇటీవల నెల్లూరులో పోలీసులు నిర్వహించిన దాడిలో ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు. వారిలో ఒకరు బెంగళూరులో చదువుకునే సమయంలో డ్రగ్స్కు బానిసైనట్లు విచారణలో వెల్లడైంది. నిందితులు అక్కడ ఎండీఎంఏ గ్రాము రూ.1,500కు కొనుగోలు చేసి నగరంలో రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తూ లాభాలు పొందుతున్నట్లు గుర్తించారు. ఈ కేసులో సరఫరాదారులు, వ్యసనపరుల వివరాలను సేకరిస్తూ లోతుగా పోలీసు దర్యాప్తు సాగుతోంది. మొక్కుబడి చర్యలకే.. రాష్ట్ర ప్రభుత్వం మాదకద్రవ్యాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ఈగల్ వ్యవస్థ జిల్లాలో మొక్కుబడి చర్యలకే పరిమితమైందన్న విమర్శలున్నాయి. నెల్లూరు నగరంలో గుట్టుచప్పుడు కాకుండా కొంతకాలంగా డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నా ముందస్తు సమాచారం లేకపోవడం ఆ విభాగ పనితీరును తెలియజేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో అనేక కేసుల్లో.. నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయిస్తూ అక్కడి పోలీసులకు పట్టుబడ్డారు. వారిలో కొందరు జిల్లాలోనూ అమ్మకాలు సాగించినట్లు అక్కడి పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఓ డ్రగ్ పెడ్లర్ ఫోన్ను తెలంగాణ పోలీసులు పరిశీలించగా నెల్లూరుకు చెందిన కొందరు డాక్టర్లు, ఇంజినీరింగ్ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. గతేడాది జిల్లాకు చెందిన ఓ యువకుడు విజయవాడలో డ్రగ్స్ సేవిస్తుండగా అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. స్టేషన్ వద్ద నుంచి నిందితుడు కారుతో సహా పరారయ్యాడు. అతని కోసం అక్కడి పోలీసులు బుచ్చిలోనూ సోదాలు చేశారు. డ్రగ్స్తో అనర్థాలు డ్రగ్స్లో కొన్నింటిని ముక్కుతో పీలుస్తారు. కొన్నింటిని సిగరెట్లో నింపుకొని పొగ తాగుతున్నారు. కొన్నింటిని శీతల పానీయీలు లేదా మద్యంలో చల్లుకుని తాగుతారు. ఇవి కాకుండా మాత్రల రూపంలో, ఇంజెక్షన్ల రూపంలో ఉంటాయి. డ్రగ్స్ నేరుగా మెదడుపై, కేంద్ర నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. శరీరంలోని ఇతర వ్యవస్థపైనా దారుణమైన దుష్ప్రభావాలు చూపుతాయి. మానసిక సమస్యలు వెంటాడుతాయి. చివరకు అకాల మరణాలకు కారమణవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి జిల్లాలో డ్రగ్స్ కల్చర్ క్రమేపీ విస్తరిస్తుండటం యువత, విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మాదకద్రవ్యాల సరఫరా గొలుసును పూర్తిగా ఛేదించి యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడేందుకు పోలీస్ అధికారులు మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లాలో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్ యువతే లక్ష్యంగా మాదకద్రవ్యాల ముఠాలు పోలీసుల దాడుల్లో వెలుగులోకి అనేక విషయాలు ఎండీఎంఏ గ్రాము రూ.4 వేల నుంచి రూ.5 వేలునెల్లూరులో.. గతంలో నెల్లూరు నగరానికి చెందిన ఓ యువకుడు చైన్నెతోపాటు విదేశాలకు చెందిన వ్యక్తుల నుంచి కొకెయిన్, ఎల్ఎస్డీ, ఎండీఎంఏ వంటి మాదకద్రవ్యాలను కొనుగోలు చేసి నెల్లూరు నగరంలో విద్యార్థులకు విక్రయిస్తూ పోలీసులకు చిక్కాడు. గూడూరుకు చెందిన ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ధనలక్ష్మీపురంలో మాదకద్రవాల తయారీకి పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. -
అంగరంగ వైభవంగా..
● వెంగమాంబ బ్రహ్మోత్సవాలు ప్రారంభం దుత్తలూరు: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన నర్రవాడ వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలు నిలుపు కార్యక్రమంతో ఘనంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. వెంగమాంబ, గురవయ్య దంపతుల విగ్రహాలను వేద పండితులు వేకువజాము నుంచే పూలతో అలంకరించి పూజలు చేశారు. గణపతి, సహస్రనామ, కుంకుమార్చన పూజలను జరిపారు. హోమ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ప్రధాన ధర్మకర్త వేమూరి ముసలయ్య దంపతులు పాల్గొని పూర్ణాహుతిని సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. సంతానం లేని మహిళలు అమ్మవారి సన్నిధిలో వరపడ్డారు. పలువురు తమ వాహనాలకు పూజలు చేయించారు. పొంగళ్లను మహిళలు పొంగించి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. ఎండు కొబ్బరిని హోమగుండంలో వేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఏర్పాట్లను ఈఓ ఆళ్ల శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. వెంగమాంబ ఇష్టదైవమైన వడ్డిపాళెంలోని రేణుక ఎల్లమ్మ గుడిలో గణపతి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, పంచామృత, సుగంధ ద్రవ్యాలతో విగ్రహమూర్తులకు అభిషేకాలు నిర్వహించారు. విద్యుద్దీపాలంకరణతో ఆలయ పరిసరాలు శోభాయమానంగా మారాయి. వెంగమాంబ, వినాయకుడు, దుర్గాదేవి తదితర దేవతామూర్తుల కటౌట్లు ఆకర్షణగా నిలిచాయి. అట్టహాసంగా నిలుపు కార్యక్రమం నర్రవాడ పంచాయతీ మజరా గ్రామమైన వడ్డిపాళెంలో గల వెంగమాంబ పుట్టినిల్లయిన దేవర ఇంట్లో పసుపు దంచే కార్యక్రమాన్ని ముత్తయిదువులు వైభవంగా చేపట్టారు. పరిసర ప్రాంతాలు, జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి ఉత్సవానికి మహిళలు భారీగా హాజరై పసుపు దంచేందుకు పోటీపడ్డారు. అనంతరం పసుపు, కుంకుమను నర్రవాడలోని అమ్మవారి దేవస్థానం వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. కాగా వెంగమాంబ, గురవయ్యనాయుడి దంపతుల గ్రామోత్సవాన్ని సోమవారం నిర్వహించనున్నారు. -
గౌరవ వేదన
● ఎంపీటీసీలకు రెండేళ్లుగా అందని వేతనం ● సర్వసభ్య సమావేశాలకే పరిమితం ● సెప్టెంబర్లో ముగియనున్న పదవీ కాలందుత్తలూరు: కూటమి ప్రభుత్వంలో పాలన గాడి తప్పుతోంది. ఎన్నికల హామీలను గాలికొదిలిన సర్కార్.. పాలన వ్యవహారాల్లో సైతం ఇస్టానుసారంగా వ్యవహరిస్తోంది. పలుచోట్ల అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయడంలేదనే విమర్శలూ లేకపోలేదు. టీడీపీ సర్కార్ ఏర్పడి రెండేళ్లు దాటినా, ఎంపీటీసీలకు గౌరవ వేతనాన్ని మంజూరు చేయలేదు. గతంలో చెల్లింపు జిల్లాలోని 37 మండలాల్లో 541 ఎంపీటీసీలున్నా రు. వాస్తవానికి వీరికి ప్రతి నెలా గౌరవ వేతనంగా రూ.మూడు వేలను ఇవ్వాల్సి ఉంది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో వీరికి రెండు విడతలుగా ఈ మొత్తాన్ని అందజేశారు. ఆపై ఎన్నికలు రావడం.. అందులో టీడీపీ గెలు పొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఈ ఊసే లేదు. బడ్జెట్లను పలుమార్లు ప్రవేశపెట్టినా, ప్రజా ప్రతినిధుల ఖాతాల్లో నిధులు జమకాలేదు. సర్వ సభ్య సమావేశాలకు హాజరుకావడం మినహా ప్రజ ల సమస్యలను పరిష్కరించే పరిస్థితే లేదని పలువురు ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పరిధిలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ప్రయోజనం ఉండటంలేదనే భావన వీరిలో వ్యక్తమవుతోంది. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం.. అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుపై పలుచోట్ల సమాచారాన్నీ ఇవ్వకపోవడంపై వీరిలో ఆవేదన వ్యక్తమవుతోంది. జిల్లాలో ఇలా.. -
కండలేరులో 31.26 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 31.26 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు.కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 30, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. వడదెబ్బకు రైతు కూలీ మృతివాకాడు: మండల కేంద్రమైన వాకాడు బంగ్లా సెంటర్ గిరిజన కాలనీకి చెందిన సాతాను గోపాలయ్య (60) అనే రైతు కూలీ ఆదివారం సవళ్ల పొలాల వద్ద వడదెబ్బకు గురై మృతిచెందాడు. గ్రామస్తుల కథనం మేరకు.. గోపాలయ్య వ్యవసాయ కూలీ పనులతోపాటు సవళ్ల పొలాల్లో పలువురికి కాపలా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తాను కాపలా ఉంటున్న పొలం వద్ద కూలీ పనులు చేశాడు. మధ్యాహ్నం పచ్చిగడ్డి కోసుకుని ఇంటికి తిరిగొచ్చే ప్రయత్నంలో కుప్పకూలాడు. సాయంత్రం అటువైపుగా వెళ్లిన సహచర కాపలాదారులు గుర్తించి గోపాలయ్య కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. అప్పటికే అతను చనిపోయాడు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలున్నారు. నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.50 సన్నవి : రూ.20 పండ్లు : రూ.10 -
11న జాతీయ లోక్ అదాలత్
● పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ నెల్లూరు (లీగల్): జూలై 11న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్లో వివిధ కోర్టుల్లో పెండింగ్ కేసులను పరిష్కరించడంలో అధికార యంత్రాంగం చర్యలు తీసుకుని సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ జి.శ్రీనివాస్ కోరారు. జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారం కోసం వివిధ శాఖల అధికారులతో శనివారం జిల్లా కోర్టు హాలులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి వైజే పద్మశ్రీ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయ మూర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజీపడదగిన కేసుల నిమిత్తం మధ్యవర్తిత్వం ద్వారా వివాదాల ను పరిష్కరించుకోవడానికి మంచి అవకాశమని తెలిపారు. ఈ సమావేశంలో కండలేరు జలాశయం భూ సేకరణ వివాదాల పరిహారం, తెలుగు గంగ ప్రాజెక్ట్ కేసులు, మార్కెట్ విలువ, పునరావాస తదితర విషయాలపై అధికారులతో చర్చ జరిగింది. కార్యక్రమంలో తెలుగు గంగ ప్రాజెక్ట్ డిప్యూటీ కలెక్టర్ వంశీకృష్ణ, అడిషనల్ ఎస్పీ సౌజన్య, మున్సిపల్ కమిషనర్ నందన్, రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్టీసీ, ఇన్సూరెన్స్, బ్యాంకు అధికారులు, వివిధ కోర్టుల న్యాయమూర్తులతో పాటు ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు సత్తు అంకయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యప్పరెడ్డి, ప్రభుత్వ న్యాయవాది చుండూరి శ్రీహరి నారాయణ పాల్గొన్నారు. -
దుశ్శాసనపర్వంపై డీఎస్పీ విచారణ
కావలి: జిల్లాలో సంచలనం రేపిన కావలి పట్టణంలోని కచ్చేరిమిట్టలో ఒంటరి గిరిజన మహిళను టీడీపీ నేత, మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం, ఆయన అనుచరులు కలిసి వివస్త్రను చేసి దాడి చేసిన ఘటనపై కావలి డీఎస్పీ వీవీ రమణకుమార్ శనివారం విచారణ చేపట్టారు. ఆ మహిళ కుమారుడి ప్రేమ వ్యవహారంలో యువతి బంధువర్గం ఆమెను ఒంటరిగా ఉన్న సమయంలో రాత్రి వేళ దాడి చేయడమే కాకుండా వివస్త్రను చేసి, కులం పేరుతో దూషించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై రెండో పట్టణ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు డీఎస్పీ నేరస్థలాన్ని పరిశీలించి, బాధితురాలితో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించారు. చుట్టు పక్కల నివాసాల వారిని కూడా విచారించారు. అనంతరం డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ గత నెల 19న బాధితురాలిపై ఘటన జరిగినప్పటికీ.. వివిధ కారణాలతో అదే నెల 26వ తేదీ కేసు నమోదు చేశారన్నారు. అయితే నెల్లూరులో రొట్టెల పండగ నేపథ్యంలో బందోబస్తు డ్యూటీలో ఉండడం, సీఎం పర్యటనలతో వరుస కార్యక్రమాల నేపథ్యంలో సకాలంలో విచారణ చేపట్టలేకపోయామన్నారు. శుక్రవారం విచారించేందుకు వచ్చినప్పటికి బాధితురాలు వైద్య పరీక్షలకు వెళ్లడంతో అందుబాటులోలేకపోవడంతో శనివారం మరో మారు వచ్చి విచారించామన్నారు. అయితే నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఇప్పుడే విచారణ చేపట్టామని, నిజానిజాలు తెలుసుకున్న తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని డీఎస్పీ చెప్పారు. ఎట్టకేలకు కదిలిన పోలీసులు గిరిజన మహిళను టీడీపీ నేతలు వివస్త్రను చేసి కొట్టిన ఘటనను పోలీసులు నీరుగార్చే కుట్రలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో శనివారం డీఎస్పీ విచారణ చేపట్టారు. ఈ దారుణం గత నెల 19వ తేదీ జరిగినా.. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసులు వారం రోజుల పాటు కేసు నమోదు చేయకుండా తొక్కిపెట్టారు. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ఈ ఘటనపై ఎప్పుడైతే మీడియాకు వెల్లడించారో.. ఆ వెంటనే హడావుడిగా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మీడియాల్లో కథనాలు రావడం, మహిళా ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, కుల సంఘాలు ఈ ఘటనపై గళమెత్తడంతో ప్రజామద్దతు ఊపందుకుంది. అయితే గిరిజన మహిళపై జరిగిన అకృత్యాన్ని కొట్టిపారేందుకు ఆమె కులం, మతం పేరుతో కుట్రలకు పదును పెట్టారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి రెండు సార్లు, ఎమ్మెల్సీ, మాజీ ఎస్టీ కమిషన్ చైర్మన్, వైఎస్సార్సీపీ గిరిజన సంఘ నాయకులు, ఆదివాసీ సంఘ నేతలు తరలిరావడం, తమ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో ఎట్టలకే పోలీసులు విచారణకు దిగారని, ఈ కేసును ఏమాత్రం తారుమారు చేసినా రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మారే అవకాశాలు ఉన్నాయని సమాచారం. -
జెడ్పీలో పది మందికి పదోన్నతులు
నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు రికార్డు అసిస్టెంట్లకు జూనియర్ సహాయకులుగా, ఎనిమిది మంది ఆఫీస్ సబార్డినేటర్లకు రికార్డు అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు శనివారం జెడ్పీ కార్యాలయంలో పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులను జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, సీఈఓ వసుమతి, డిప్యూటీ సీఈఓ బ్రహ్మయ్య అందజేశారు. ఈ సందర్భంగా అరుణమ్మ మాట్లాడుతూ జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో పదోన్నతులు, కారుణ్య నియామకాలు సకాలంలో చేస్తున్నామన్నారు. 2021 నుంచి ఇప్పటి వరకు 257 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించామని తెలిపారు. కాగా ఇందుకు సహకరించిన జెడ్పీ చైర్పర్సన్, సీఈఓ, డిప్యూటీ సీఈఓలకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లక్కాకుల పెంచలయ్య, కార్యదర్శి దేవా ప్రసన్నకుమార్ కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో జెడ్పీ అధికారి ముజీబ్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకుడు మాబాషా తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి దర్శనానికి 15 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 10 కంపార్ట్మెంట్లలో భక్తలు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 71,668 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 32,975 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.16 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఆర్ఐఈ నిర్మాణ పనుల పరిశీలన వెంకటాచలం: మండలంలోని సరస్వతీనగర్ వద్ద జరుగుతున్న రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్ఐఈ) భవన నిర్మాణ పనులను మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు శనివారం పరిశీలించారు. పనుల వివరాలపై అధికారులను ఆరాతీసిన అనంతరం ఆయన మాట్లాడారు. 2016లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా తానున్న సమయంలో అప్పటి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్తో కలిసి సంస్థ నిర్మాణానికి పునాది రాయిని వేశామని వివరించారు. వివిధ కారణాలతో ఎంతో కాలంగా ఆగిన నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది పూర్తయితే బీఎస్సీ, బీఏ, బీఈడీ, ఎంఈడీ, పీహెచ్డీ వంటి ఉపాధ్యాయ విద్య కోర్సులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. విద్యపై పరిశోధనలు చేయడం, ఉపాధ్యాయులు, విద్యాబోధకుల నైపుణ్యాలను పెంచడం.. ప్రభుత్వ పథకాలైన ఆరెమ్మెస్ఏ, ఐసీటీ వంటి వాటిని పాఠశాలల్లో మరింత సమర్థంగా అమలు చేసేందుకు సాయపడుతుందని పేర్కొన్నారు. సర్ ప్రత్యేక శిబిరాలు నేడు నెల్లూరు(అర్బన్): కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సర్ గణన ఫారాలను డిజిటలైజ్ చేసేందుకు గానూ ప్రత్యేక శిబిరాలను ఆదివారం ఏర్పాటు చేశామని కలెక్టర్ హిమాన్షు శుక్లా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి ఓటరు తమ ఫారాన్ని పూర్తి చేసి బీఎల్వోకు అందజేయాలని కోరారు. ● జిల్లాలో 19,74,240 మంది ఓటర్లకు గానూ 19,31,907 మందికి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి 97.86 శాతం మేర ప్రగతిని సాధించామని తెలిపారు. 8,58,138 ఫారాలను డిజిటలైజ్ చేసి, 43.47 శాతం టార్గెట్ను రీచ్ అయ్యామని చెప్పారు. -
పనులను త్వరగా పూర్తి చేయిస్తాం
చిల్లకూరు: పాఠశాలల్లో చేపట్టిన నాడు–నేడు పనులు ఇంకా కొంతమేర నిలిచిపోయి ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేసేలా చర్యలు చేపడుతామని ఏపీ స్టేట్ పాఠశాలల మౌలిక వసతుల కల్పన డైరెక్టర్ మువ్వా రామలింగం అన్నారు. ఆయన చిల్లకూరు మండలంలోని నెలబల్లిరెట్టపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం తనిఖీ చేశారు. ముందుగా అక్కడి విద్యార్థుల స్కిల్ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో నాడు–నేడు పనుల్లో కొన్ని పూర్తి కాగా, మరికొన్ని ఆలస్యమవుతున్నాయన్నారు. ప్రతి పాఠశాలలో నిలిచిపోయిన మౌలిక వసతుల కల్పనకు చెందిన నిధులను త్వరగా అందించి పనులు పూర్తి చేయిస్తామన్నారు. ఆయన వెంట ఎంఈఓ రవూఫ్, హెచ్ఎం విజయలక్ష్మి ఉన్నారు. కారును ఢీకొన్న ట్రాక్టర్ ● ఒకరికి గాయాలు కోట: కారును ట్రాక్టర్ ఢీకొన్న ఘటన మండలంలోని చంద్రశేఖరపురం వద్ద ప్రధాన రహదారిపై శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. చిట్టేడు వైపు కట్టెల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొంది. ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడడంతో కట్టెలన్నీ పడి ట్రాఫిక్ స్తంభించింది. కారులో ఉన్న రమేష్ అనే వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరుపుతున్నట్లు ఎస్సై పవన్కుమార్ తెలిపారు. లేఅవుట్కు భారీగా గ్రావెల్ తరలింపు ● మైన్స్ ఆర్ఐ పరిశీలన అనుమసముద్రంపేట: ఏఎస్పేటలోని సర్వే నంబర్లు 144/3బీ, 144/3సీ, 145/1ఏ, 145/2లో అభివృద్ధి చేస్తున్న లేఅవుట్కు భారీ ఎత్తున గ్రావెల్ తరలిస్తున్నారనే సమాచారంతో మైన్స్ శాఖ అధికారులు శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మైన్స్ శాఖ ఆర్ఐ సీహెచ్ స్వాతి, స్థానిక వీఆర్వో కృష్ణప్రసాద్తో కలిసి లేఅవుట్ ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ సుమారు 35 టిప్పర్ల మేర గ్రావెల్ నిల్వలు ఉండటాన్ని గమనించి, వాటికి సంబంధించిన అనుమతులు, రికార్డులపై సంబంధిత వ్యక్తులను వివరణ కోరినట్లు తెలిసింది. లేఅవుట్ అభివృద్ధి పనులకు అవసరమైన రెవెన్యూ, మైన్స్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ తదితర శాఖల అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై కూడా అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. కాగా అక్రమాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వెంగమాంబ బ్రహ్మోత్సవాలకు నిలుపు నేడు దుత్తలూరు: ప్రసిద్ధ వెంగమాంబ పేరంటాలు బ్రహోత్సవాల్లో భాగంగా అమ్మవారి పుట్టినిల్లు అయిన వడ్డిపాళెంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో ఆదివారం తొలిరోజు నిలుపు, పసుపు దంచే కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశారు. చెస్లో మెరిసిన నెల్లూరీయులు నెల్లూరు (టౌన్): మహారాష్ట్రలోని నాగపూర్లో గత నెల 30వ తేదీ నుంచి ఈనెల 4వ తేదీ వరకు నిర్వహించిన నేషనల్ అండర్–7 బాయ్స్ అండ్ గర్ల్స్ చెస్ చాంపియన్షిప్ పోటీల్లో నెల్లూరు క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. రాయ్ చెస్ అకాడమీకి చెందిన వియాన్ కృష్ణ అండర్–7 విభాగంలో జాతీయస్థాయిలో నాలుగో స్థానం సాధించారు. బాలికల అండర్–7 విభాగంలో శ్రీహిత రొంపిచర్ల జాతీయ స్థాయిలో 13వ స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా శనివారం అకాడమీలో అబ్దుల్ అజీజ్, రమణబాబు, మౌనిక, విష్ణు, బషీర్, మహేంద్ర, షరీఫాలు క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. -
ప్రతి పనికీ ఓ రేటు
● ఏఎన్ఎం ప్రమోషన్ రెగ్యులరైజేషన్ కోసం రూ.2500 వసూలు ● హెల్త్ అసిస్టెంట్ నుంచి రూ.మూడు వేలు ● నాలుగు నెలలుగా ముందుకు కదలని ఫైళ్లు ● సిండికేట్గా మారి పంచుకుంటున్న వైనం ● వైద్యశాఖలో ఇదీ దుస్థితి నెల్లూరు(అర్బన్): మితిమీరిన లంచాలకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కేరాఫ్గా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి పనికీ ఓ రేటును నిర్ణయించి ఉద్యోగుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. డాక్టర్ల సరెండర్ లీవులు, ఎర్న్డ్ లీవుల కు సైతం గతంలో ఇలానే వ్యవహరించారనే ఆ రోపణలు అప్పట్లోనే వచ్చాయి. తాజాగా సర్వీ స్ రెగ్యులరైజేషన్ కోసం ఫైళ్లు నడపకముందే ప్రమోషన్ పొందిన సచివాలయ ఏఎన్ఎంల నుంచి హెల్త్ అసిస్టెంట్ల వరకు లంచాలను అడ్డంగా వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా, అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముక్కుపిండి మరీ.. జిల్లాలో గతంలో పనిచేస్తున్న 294 మంది సచివాలయ గ్రేడ్ – 3 ఏఎన్ఎంలకు గ్రేడ్ – 2లుగా ఉద్యోగోన్నతులు కల్పించి వైద్యశాఖలో విలీనం చేశారు. వాస్తవానికి ఏ క్యాడర్లో ఉన్న వ్యక్తికై నా ప్రమోషన్ కల్పిస్తే ఏడాది తర్వాత వారి సర్వీస్ను జిల్లా వైద్యశాఖ క్రమద్ధీకరించాలి. దీన్ని సకాలంలో చేస్తేనే ఇంక్రిమెంట్ సైతం వస్తుంది. దీనికి గానూ ఏఎన్ఎం పనిచేస్తున్న పీహెచ్సీ నుంచి ఎస్సార్, ఇతర వివరాలతో కూడిన దరఖాస్తును స్వీకరించి ఫైల్ను వైద్యశాఖ క్లర్కు నడపాలి. ఇలా జిల్లాలో ఉద్యోగోన్నతి పొందిన సచివాలయ ఏఎన్ఎంలకు మార్చితో సంవత్సరం పూర్తయింది. అయితే నాలుగు నెలలుగా దరఖాస్తులను స్వీకరించకుండా ఇబ్బందులకు గురిచేశారు. ఇప్పుడు ఫైల్ను నడపకముందే సర్వీస్ రెగ్యులరైజేషన్కు గానూ ఒక్కొక్కరూ రూ 2500 వరకు ఇచ్చుకోవాలని చెప్పి ఇప్పటికే ఎక్కువ శాతం మంది నుంచి వసూలు చేశారు. మిగిలిన వారు సైతం ఇస్తేనే అందరి సర్వీస్ ఫైల్ ఒకేసారి ముందుకు కదులుతుందని, లేని పక్షంలో ఆలస్యం చేస్తామని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారని సమాచారం. ఇలా 294 మంది నుంచి వసూలు చేసిన మొత్తం అక్షరాలా రూ.7.35 లక్షలు. హెల్త్ అసిస్టెంట్ల పరిస్థితీ ఇంతే.. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో 112 మంది హెల్త్ అసిస్టెంట్లు గతేడాది రెగ్యులరయ్యారు. వీరికి సైతం సంవత్సరం గడువు ముగిసింది. సర్వీస్ ఫైల్ను ముందుకు నడపాల్సి ఉండగా, వైద్యశాఖలో రూ.మూడు వేల చొప్పున ముందుగానే వసూలు చేస్తున్నారనే విమర్శలు జోరందుకున్నాయి. ఇలా వీరందరి నుంచి వసూలు చేస్తే రూ.3.36 లక్షలవుతుంది. కాళ్లరిగేలా తిరుగుతూ.. ముందుగా లంచాలిచ్చిన ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు తమ సర్వీస్ రెగ్యులరైజేషన్ ఫైల్ను పెట్టాలని కోరుతూ సంబంధిత సెక్షన్ సిబ్బంది చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. దీనిపై వైద్యశాఖలోని యూనియన్ నేతల వద్ద తమ గోడును పలువురు వెళ్లబోసుకున్నారు. వేళ్లన్నీ ఆ సీటువైపే.. సర్వీస్ క్రమబద్ధీకరణ పేరుతో లంచాలకు ఓ సీనియర్ అసిస్టెంట్ తెరలేపారని తెలుస్తోంది. తమను డిమాండ్ చేసి మరీ డబ్బులు వసూలు చేశారని ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు పేర్కొంటున్నారు. ఇందులో కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు వాటాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఫైళ్లు నడిపి చేతికి ఆర్డర్ ఇచ్చాక.. ఏఎన్ఎం లేదా ఇతర సిబ్బంది మనస్ఫూర్తిగా రూ.500ను క్లర్క్ చేతిలో పెట్టేవారు. అయితే ఈసారి అందుకు భిన్నంగా ముందుగానే లంచాన్ని ఫిక్స్ చేసి సిండికేట్గా ఏర్పడి వసూలు చేస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. జిల్లా పాలనాధికారులు స్పందించి పరిస్థితులను చక్కదిద్దాలని కోరుతున్నారు. -
కాలయాపన
పాఠశాలల్లో ఖాళీ పోస్టులకు మిగులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నామని చెప్తూ కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 250కుపైగా సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉంది. గతేడాది నిర్వహించిన బదిలీల అనంతరం జిల్లాలో 406 మంది మిగులు స్కూల్ అసిస్టెంట్లు ఉన్నారనే లెక్కలను జిల్లా విద్యాశాఖ అధికారులు తేల్చారు. గత విద్యా సంవత్సర ప్రారంభం నుంచి నేటి వరకు జిల్లాలో దాదాపు 250 మందికిపైగా ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందడం, ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లడం లేదా స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. దీంతో ఈ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. -
రేపట్నుంచి డిపార్ట్మెంటల్ పరీక్షలు
నెల్లూరు(అర్బన్): జిల్లాలో ఈనెల 6 నుంచి 11వ తేదీ వరకు మే–2026 సెషన్కు సంబంధించిన డిపార్ట్మెంటల్ పరీక్షలు నిర్వహిస్తున్నామని డీఆర్వో విజయకుమార్ తెలిపారు. ఆయన శనివారం కలెక్టరేట్లోని తన చాంబర్లో పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరులో రెండు, కావలిలో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పక్కాగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి ముందుగానే చేరుకోవాలని కోరారు. ఉదయం సెషన్కు 9.15 గంటల తర్వాత, మధ్యాహ్నం సెషన్కు 2.15 గంటల తర్వాత పరీక్షా కేంద్రంలోనికి అభ్యర్థులను అనుమతించేది లేదని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్వాచ్, బ్లూటూత్ వంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు పూర్తిగా నిషేధమన్నారు. పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్కు పాల్పడితే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో పరీక్షల నిర్వహణ అధికారులు పాల్గొన్నారు. -
తమ్ముళ్లకే ఉపాధి హామీ
వెంకటాచలం: మండలంలోని సర్వేపల్లి గ్రామంలో గత వైఎస్సార్సీపీ పాలనలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అవసరమైన పనులను ఎంపిక చేసి ప్రజలకు పని దినాలను కల్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ను టీడీపీ నాయకులు తొలగించే ప్రయత్నం చేశారు. అయితే ఆ ఫీల్డ్ అసిస్టెంట్ కోర్టును ఆశ్రయించడంతో తొలగించే ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటి నుంచి గ్రామంలో ఉపాధి పనులు జరగలేదు. అయితే రెండు నెలల క్రితం ఫీల్డ్ అసిస్టెంట్ ప్రమేయం లేకుండా మేట్ చేత ఉపాధి పనులు ప్రారంభించారు. ఈ పనులకు వాస్తవంగా కొద్ది మంది కూలీలు మాత్రమే హాజరయ్యారు. కానీ గ్రామంలోని 20 మందికి పైగా టీడీపీ నాయకులు, వారి కుటుంబ సభ్యుల పేర్లను మస్తర్లలో చేర్చి ఉపాధి నిధులు వారి ఖాతాల్లో జమ చేశారు. నెల్లూరు నగరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో పనిచేసే వ్యక్తి, అతని భార్య పనులకు హాజరు కాకపోయినా వారి ఇద్దరి ఖాతాల్లో ఉపాధి హామీ పథకం నగదును జమ చేశారు. అలాగే ప్రైవేటు ఫ్యాక్టరీలలో పనిచేసే వ్యక్తులు, వృద్ధాప్య పింఛన్ పొందుతూ మంచానికే పరిమితమైన వ్యక్తికి ఉపాధి నిధులు జమ చేశారు. ఈ విషయంపై గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు వాస్తవాలను బయటకు తీసి రెండు రోజుల క్రితం ఎన్ఆర్ఈజీఎస్ అధికారులకు, ఎంపీడీఓకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. గ్రామంలో జరిగిన ఉపాధి పనుల్లో అవినీతికి పాల్పడినవారిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే వాళ్లకు ఉపాధి నగదు జమ 20 మందికి పైగా పేర్లతో నిధుల స్వాహా విచారణ జరపాలని అధికారులకు గ్రామస్తుల ఫిర్యాదు అవినీతికి కాదేదీ అనర్హం అనట్లుగా మారిపోయింది కూటమి ప్రభుత్వ తీరు. ఇప్పటికే అక్రమ గ్రావెల్, ఇసుక, మట్టి తవ్వకాలతో సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ నేతలు సర్వం దోచుకుంటున్నారు. ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేకపోవడంతో వారి అవినీతి, అక్రమాలకు అడ్డే లేకుండాపోతోంది. తాజాగా వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో టీడీపీ నాయకుల అవినీతి బాగోతం బయటపడింది. విచారణ జరుపుతాం ఉపాధి హామీ పనుల్లో అక్రమాలపై ఏపీఓ వెంకటేశ్వర్లును వివరణ కోరగా సర్వేపల్లిలో పని చేయనివారికి ఉపాధి నిధులు జమ చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. ఈవిషయంపై గ్రామానికి విచారణ జరుపుతామని తెలిపారు. -
ఈ – సైన్ కష్టాలేమిటి సర్..?
● ఆధార్.. ఓటరు ఐడీలోని పేర్లలో వ్యత్యాసాలతో చిక్కులు ● ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు ఆటంకాలు ● వలస ఓటర్ల అగచాట్లు సీతారామపురం: మెట్ట ప్రాంతమైన ఉదయగిరి నియోజకవర్గం నుంచి వేలాది మంది ప్రజలు ఉపాధి నిమిత్తం తెలంగాణ, కర్ణాటక, చైన్నె, గోవా, పుణె తదితర ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకు వలసెళ్లి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరందరూ సొంతూళ్లకు తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ (సర్)లో భాగంగా వలస వాసుల కోసం ఆన్లైన్ ద్వారా ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణకు అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. అయితే ఈ ప్రక్రియ కోసం చేస్తున్న యత్నాలు ఫలించడంలేదు. వివరాలన్నీ నింపాక.. చివర్లో భంగపాటు వెబ్సైట్లోకి వెళ్లి వివరాలన్నీ నింపాక ఆఖర్లో ఈ – సైన్ కావడంలేదు. దీంతో గంటల పాటు పడిన శ్రమ వృథా అవుతోందని వలస ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో కుటుంబసభ్యులు, గ్రామస్తులకు వీరు ఫోన్ చేసి ఎన్యూమరేషన్ పత్రాలను ఎలా నింపాలని ఆరాతీస్తున్నారు. మరోవైపు ఆన్లైన్ యాప్లు, పోర్టళ్ల ద్వారా వివరాలు నమోదు చేయడంపై చాలా మంది బీఎల్వోలకు అవగాహన కరువవడం.. సాంకేతికతపై పట్టు లేకపోవడంతో ప్రక్రియ కాస్త కుంటుపడుతోంది. ప్రధాన ఇబ్బందులు ఓటరు ఐడీ (ఎపిక్ కార్డు)లో ఉన్న పేరు.. ఆధార్లో ఉన్న పేరులో అక్షరాలు కొంచెం వేర్వేరుగా ఉన్నా.. తప్పులున్నా ఈ సైన్ కావడం లేదు. పుట్టిన తేదీ, ఇతర వివరాల్లో తేడాలున్నా నమోదు ఫెయిలనొస్తోంది. ఓటరు ఐడీ.. ఆధార్ నంబర్కు, ప్రస్తుత ఫోన్ నంబర్ లింక్ కాకపోయినా ఓటీపీ రావడం లేదు. కొన్ని సందర్భాల్లో ఎక్కువ మంది ఓటర్లు పోర్టల్ను తెరుస్తుండటంతో పేజీ లోడ్ కాక సెషన్ ఎకై ్స్పర్ అని చూపుతోంది. ఆధార్లో ఇంటి పేరు ఉండగా.. ఓటరు గుర్తింపు కార్డులో ఇది లేకపోవడం, వయస్సు వేరుగా ఉండటం తదితర కారణాలతో ఆన్లైన్లో సర్ వివరాలను సమర్పించడంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. బీఎల్వోలను సంప్రదించాల్సిందే ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్న వారి ఎన్యూమరేషన్ పత్రాలను స్థానికంగా ఉన్న తల్లిదండ్రులు లేదా కుటుంబసభ్యులు తీసుకొని వివరాలు నింపి సంతకం చేసివ్వాలని అధికారులు సూచిస్తున్నారు. వలసెళ్లిన వారు సెలవులు దొరక్క.. వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని రాలేక.. ఏమి చేయాలో పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. సాధ్యం కావడంలేదు సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాన్ని ఆన్లైన్లో నింపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లోకి వెళ్లా. ఓటర్ ఐడీతో లాగినై వివిధ దశల్లో పత్రాలన్నీ నింపా. ఈ – సైన్ చేస్తే ప్రక్రియ పూర్తవుతుందనుకునే సమయంలో చివర్లో ఫెయిలని వస్తోంది. ఆధార్లో పేరుకు ముందు ఇంటి పేరు.. ఓటరు కార్డులో మాత్రం తర్వాత ఉంది. దీంతో గంటసేపు యత్నించినా ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించడం సాధ్యం కాలేదు. చివరికి బీఎల్వోను ఆశ్రయించాల్సి వచ్చింది. – మహబూబ్ షరీఫ్, సీతారామపురం -
అల్లూరి జీవితం స్ఫూర్తిదాయకం
నెల్లూరు(అర్బన్): స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు నేటి యువతకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. సీతారామరాజు జయంతిని పురస్కరించుకుని శనివారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం సీతారామరాజు చేసిన త్యాగం, చూపిన ధైర్యసాహసాలు చిరస్మరణీయమన్నారు. గిరిజన హక్కుల పరిరక్షణ కోసం బ్రిటిష్ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం చరిత్రలో సువర్ణాధ్యాయమన్నారు. ఆయన దేశభక్తి, విలువలు, సేవాగుణం, పోరాట స్ఫూర్తితో సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ పవన్తేజ, డీఆర్వో విజయకుమార్, సమాచార శాఖ డీడీ వేణుగోపాల్రెడ్డి, సెట్నల్ ఇన్చార్జి సీఈఓ శ్రీధర్బాబు, మేనేజర్ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొని సీతారామరాజుకు నివాళులర్పించారు. -
ఇది సర్కారు అమానవీయమే
● గిరిజన మహిళను వివస్త్రను చేసిన కేసును నీరుగార్చే కుట్రను సహించం ● ఎస్టీ మహిళను బీసీ – ఈగా మార్చి అట్రాసిటీ కేసు లేకుండా చేసే పన్నాగం ● మహిళలకు పట్టిన పీడ దుర్యోధన దండు, దుశ్శాసన సేన ● ఈ కేసు విషయంలో అన్యాయం చేస్తే ఆదివాసీల ఆగ్రహం తప్పదు సాక్షిప్రతినిధి, నెల్లూరు: కావలి పట్టణంలోని కచ్చేరిమిట్టలో టీడీపీ నేతలు అధికార మదంతో గిరిజన మహిళను వివస్త్రను చేసి అమానవీయంగా కొట్టారని, ఈ ఘటన జరిగి రెండు వారాలైనా అధికార పార్టీ ఎమ్మెల్యేతోపాటు పోలీసులు నిందితులను రక్షించే పాత్ర పోషిస్తున్నారని, ఇది ముమ్మాటికి సర్కారు దాష్టీకమేనని ఆదివాసీ నాయకులు మండి పడ్డారు. శనివారం ఆంధ్రప్రదేశ్ ఆదివాసి ఎరుకుల సేవా సంఘ అధ్యక్షుడు దేవరకొండ శంకరరావు, పల్నాడు జిల్లా అధ్యక్షుడు మేడా పోతురాజు, వైస్ ప్రెసిడెంట్ కుంభా వెంకటకోటయ్య, అధికార ప్రతినిధి దాసా సుబ్రహ్మణ్యం, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు సోగాల ఆనంద్, మహిళా కమిటీ సభ్యురాలు దేవరకొండ రమణి, తిరుపతి జిల్లా అధ్యక్షుడు నాయుడు మునిరాజు, కమిటీ సభ్యులు సురేష్, దేవరకొండ ప్రసాద్ తదితరులు బాధిత మహిళ నివాసానికి చేరుకుని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, ఈ విషయంలో అధికార పార్టీ నాయకులు, పోలీసులు ఎటువంటి అన్యాయం చేసినా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దేవరకొండ శంకరరావు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, నిత్యం ఎక్కడొక చోట మహిళలు, చివరికి పసిపిల్లలపైనా అత్యాచారాలు, హత్యలు, మృతదేహాలు కనపడకుండా చేయడాలు, వారిని చిత్రహింసలు పెట్టి ఆత్మహత్యలు చేసుకునే విధంగా కొట్టడాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఒక దుర్యోధన దండు, ఒక దుశ్శాసన సేన మహిళలకు పట్టిన పీడ అన్నారు. ఒక దుశ్శాసనడు ఒక ఎస్సీ మహిళను నడిరోడ్డు మీద అమానవీయంగా అవమానించినా ఇంత వరకు చర్యల్లేవన్నారు. తిరుపతిలో ఒక దుశ్శాసన సైనికుడు ఒక మహిళను వేధించి వెంటాడి వెంటాడి ఆమె డబ్బును, ఆస్తిని కూడా స్వాధీనం చేసుకొని ఆమె మీదే తిరిగి కేసు పెట్టారన్నారు. మంగమ్మ, కళావతి, తిరుపతమ్మ, ఇప్పుడు ఈమె. ఇట్లా అనేక మంది మహిళలను ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి వారికి భద్రత లేకుండా చేస్తున్నారు. పల్నాడు జిల్లా అధ్యక్షుడు మేడా పోతురాజు మాట్లాడుతూ విజయవాడ, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల నుంచి ఆంధ్రప్రదేశ్ ఆదివాసి ఎరుకల సేవా సంఘం నాయకులందరూ కావలిలో జరిగిన అమానుషమైన ఘటనలో బాధితురాలికి అండగా ఉండేందుకు వచ్చామన్నారు. టీడీపీ నేతలు ఆ మహిళ ఇంట్లోకి ప్రవేశించి, కులం పేరుతో దూషించి, వివస్త్రను చేసి కొట్టిన ఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ రాష్ట్రంలో అనేక మంది గిరిజన మహిళలపైన దాడులు జరుగుతూనే ఉన్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదన్నారు. గత నెల 19న కావలిలో గిరిజన మహిళ ఘటన జరిగితే.. పోలీసులు వారం రోజుల పాటు కేసు నమోదు చేయకపోవడం, కేసు నమోదు చేశాక తహసీల్దార్ శ్రావణ్కుమార్ బీసీఈగా, ఒక మైనార్టీ ముస్లింగా చిత్రీకరించడం దారుణమన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును నీరుగార్చే కుట్రగా కనిపిస్తుందన్నారు. చట్టాలేం తేలిగ్గా లేవు, ఎవరూ కూడా ఊరుకునే పరిస్థితి లేదు, సమాజం చూస్తా ఊరుకోదు. ఎరుకలుగా తామంతా ఆమెకు మద్దతు ఇస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకు పూర్తి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని. ఒక ఎరుకల మహిళను ఈ రకంగా ఇబ్బంది పెట్టిన వ్యక్తులను ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎస్సీ, ఎస్టీ కమిషన్ నుంచి, సెంట్రల్ కమిషన్ నుంచి కూడా నోటీసులు అందుకుంటారని హెచ్చరించారు. -
జిల్లాలో ఇలా..
మందకొడిగా ప్రక్రియ ● 35 శాతం సైతం కాని డిజిటలైజేషన్ ● జాప్యంపై డీఆర్వోకు మాజీ మంత్రులు కాకాణి, నల్లపరెడ్డి ఫిర్యాదు ● వ్యవహారంలోకి చొరబడిన పచ్చ నేతలు ● జలదంకిలో దొంగ ఓట్ల కోసం తప్పుడు సమాచారం ● బట్టబయలు చేసిన వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం గందరగోళంగా మారుతోంది. ఈ ప్రక్రియతో తమ ఓటు ఉంటుందా.. ఊడుతుందాననే ఆందోళన ఎంతో మందిలో నెలకొంటోంది. ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజేషన్ చేయడంలో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. మరో పది రోజుల్లో గడువు ముగియనుండటంతో ఆలోపు ఇది సాధ్యమేనాననే ప్రశ్న పలువురిలో వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ వ్యవహారంలోకి టీడీపీ నేతలు చొరబడి దొంగ ఓట్లను నమోదు చేయించే కుట్రకు తెరలేపారు. జలదంకిలో సాగుతున్న ఈ ఉదంతాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బట్టబయలు చేశారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. గడువు దగ్గర పడుతున్నా, డిజిటలైజేషన్ అంశంలో గందరగోళం నెలకొంది. మరోవైపు బీఎల్వోలకు అదనపు బాధ్యతలను అప్పగించడంతో ఒత్తిడి పెరిగి కార్యక్రమంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నారు. ఈ వ్యవహారంపై డీఆర్వోకు మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి శుక్రవారం ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల కనుసన్నల్లో.. టీడీపీ నేతల కనుసన్నల్లో బీఎల్వోలు పనిచేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దొంగ ఓట్ల నమోదులో పచ్చ నేతలకు వీరు సహకరిస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో సాగే ఈ ప్రక్రియను పారదర్శకంగా జరపాల్సి ఉన్నా, నిబంధనలను కాలరాయడంపై ప్రతిపక్ష పార్టీల్లో ఆందోళన నెలకొంది. 35 శాతం కాని డిజిటలైజేషన్ కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కోవూరు, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, గూడూరు నియోజకవర్గాల పరిధిలోని 19,21,131 ఓటర్లకు గానూ 99 శాతం మేర ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలు పంపిణీ చేశారు. అయితే దాదాపు 35 శాతం డిజిటలైజేషన్ సైతం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ నెల 14 వరకు గడువుండటంతో ఆలోపు మిగిలిన మేర నమోదు చేయడం కష్టమేననే భావన రాజకీయ పార్టీల్లో వ్యక్తమవుతోంది. దొంగ ఓట్లు చేర్చేందుకు కుట్ర ఉదయగిరి నియోజకవర్గంలోని జలదంకి మండలం కమ్మవారిపాళెం పంచాయతీ మజరా విజయనగరంలో ఎక్కువ మంది వలసెళ్లారు. దీంతో ఇక్కడ కేవలం 15 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఇందులో నలుగురు మృతి చెందడంతో ఈ సంఖ్య 11కు చేరింది. అయితే టీడీపీ నేతలతో స్థానిక బీఎల్వో కుమ్మకై ్క అక్కడ 76 ఓట్లున్నాయని చూపారు. దొంగ ఓట్లు చేర్చే కుట్ర జరుగుతుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అడ్డుకున్నారు. దీంతో వ్యవహారం బట్టబయలైంది. నెల్లూరు నగర నియోజకవర్గంలో కార్పొరేషన్ ఉద్యోగులను అధికార పార్టీ నేతల కార్యాలయంలోనే కూర్చోబెట్టి ఓటర్ల చేర్పులు చేయించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నియోజకవర్గం ఓటర్లు పంపిణీ చేసిన శాతం డిజిటలైజ్ శాతం ఫారాలు అయినవి కావలి 2,41,702 2,30,466 95.35 1,01,617 42.04 ఆత్మకూరు 2,17,309 2,12,845 97.95 98,668 45.40 కోవూరు 2,69,146 2,63,140 97.77 1,07,731 40.03 నెల్లూరు సిటీ 2,39,870 2,36,478 98.59 82,106 34.23 నెల్లూరు రూరల్ 2,82,312 2,72,581 96.55 93,609 33.16 సర్వేపల్లి 2,34,393 2,29,712 98.00 92,143 39.31 గూడూరు 2,46,086 2,45,753 99.86 80,361 32.66 ఉదయగిరి 2,43,422 2,37,157 97.43 1,03,339 42.45 మొత్తం 19,74,240 19,28,132 97.66 7,59,574 38.47 -
మంత్రి ఇలాకాలో ఇసుక దందా
కాపలా కాసి ఫొటోలు తీయండి ● రాత్రి వేళల్లో పెన్నానది నుంచి ఇసుక అక్రమ రవాణా ● పెన్నా పొర్లు కట్ట ప్రాంతం నుంచి మంత్రి పేరు చెప్పి తరలింపు ● మంత్రికి 48వ డివిజన్ ఇన్చార్జి ఫిర్యాదు ● నెల రోజులుగా నడుస్తున్న ఇసుక దందా ● మంత్రి అనుచరుడు పట్టాభి కీలకం ● మంత్రికి ఫిర్యాదు చేసిన ఇసుక దందా వాయిస్ వైరల్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగర నియోజకవర్గంలో రాత్రి వేళల్లో ఇసుక దందా నడుస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా పెన్నా నది నుంచి భారీ స్థాయిలో ఇసుక తరలించి తమ్ముళ్లు జేబులు నింపుకుంటున్నారు. నగరంలోని పెన్నా పొర్లు కట్ట ప్రాంతంలో భారీ యంత్రాలు పెట్టి ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. ప్రస్తుతం పెన్నానదిలో గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు పర్యావరణ కోసం ఇసుక తవ్వకాలపై నిషేధం ఉంది. అయినప్పటికి మంత్రి అనుచరులు ఇసుక దందాను కొనసాగిస్తున్నారు. మంత్రి నారాయణ తన ఎన్ టీం, డివిజన్ నాయకులతో శుక్రవారం ఫోన్ కాల్ మాట్లాడుతున్న సమయంలో 48వ డివిజన్ ఇన్చార్జ్ మాట్లాడుతూ మీ పేరు చెప్పి ఇసుక దందా చేస్తున్నట్లు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఆ ఆడియో వాయిస్ సోషల్ మీడియలో వైరల్గా మారింది. మంత్రి పేరు చెప్పి.. నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న పొర్లుకట్ట ప్రాంతంలో ఇసుక దందా నిర్వహిస్తున్నారు. మంత్రి అనుచరుడు పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభి ఇసుక అక్రమ రవాణా సాగిస్తున్నారని మంత్రి అనుచరులు ఆయనకు ఫిర్యాదు చేయడం దుమారం రేపింది. రాత్రి, పగలు తేడా లేకుండా భారీ వాహనాలతో ఇసుక రవాణా సాగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పెన్నానదిలో నిషేధం ఉన్నప్పటికి యంత్రాలు పెట్టి తవ్వకాలు చేస్తున్నారని తెలిపారు. స్థానికంగా స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి టిప్పర్లకు లోడింగ్ చేస్తున్నారని భారీ వాహనాలతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నట్లు మంత్రి దృష్టికి తెచ్చారు. దీంతో మంత్రి తనకు ఇసుక దందా నడుపుతున్న విషయం తెలియదని, నా పేరు వాడుకుని పట్టాభి ఆయన పేరు చెప్పుకుని కృష్ణయాదవ్ ఇలా దందా చేస్తారంటూ ఆయన మండిపడ్డారు. ఇసుక దందా చేస్తే ఫొటోలు తీసి తనకు పంపమనడంపై నేతలు పెదవి విరిచారు. నెల రోజులుగా దందా నడుస్తుంటే మంత్రికి తెలియదా? అంటూ నిట్టూర్చారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు మంత్రికి ఫిర్యాదు చేస్తే రాత్రి వేళల్లో కాపలా కాసి ఫొటోలు తీసి పంపమని మంత్రి చెప్పడంపై సర్వత్రా విస్మయానికి గురి చేసింది. గతంలో 3వ డివిజన్ దీనదయాళ్నగర్ ప్రాంతంలో ఇసుక దందా జరుగుతుంటే నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి రాత్రివేళ కాపలా కాసి ఫొటోలు తీశాడని, అలాగే మీరు చేయాలని మంత్రి చెప్పడంపై నేతలు నోరెళ్లబెట్టారు. అక్రమ రవాణా అడ్డుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వాలి కానీ కాపలా కాసి ఫొటోలు తీయమనడం ఏమిటని మంత్రి తీరుపై స్థానిక టీడీపీ నేతలే మండి పడుతున్నారు. ఇసుక దందా విషయంలో తనకు చెడ్డ పేరు వస్తుందని సంతపేట సీఐకు ఫోన్ చేసి, టిప్పర్లతో ఇసుక తరలిస్తే సీజ్ చేయాలని, ట్రాక్టర్లతో అయితే వదిలేయాలని చెప్పడం కొసమెరుపు. -
బీఎల్ఓలు అప్రమత్తంగా ఉండాలి
నెల్లూర(అర్బన్): కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న సర్ కార్యక్రమంలో పాల్గొంటున్న బూత్ లెవల్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. నగరంలోని వెంగళరావునగర్లో నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను ఆర్డీఓ అనూషతో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, ఓటర్ల వివరాల ధ్రువీకరణ, కొత్త ఓటర్ల నమోదు తదితర అంశాలపై ఆరాతీసిన అనంతరం ఆయన మాట్లాడారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు. ఫోన్ చేసిన ఓటర్లందరికీ సమాచారాన్ని అందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేలా కృషి చేయాలని కోరారు. సర్ ప్రక్రియ పరిశీలన అనుమసముద్రంపేట: ఏఎస్పేట మండలంలో సర్ ప్రక్రియను ఆత్మకూరు ఆర్డీఓ భూమిరెడ్డి పావని శుక్రవారం పరిశీలించారు. ‘సచివాలయంలోనే అంతా’ అనే శీర్షికన సాక్షిలో కథనం గురువారం ప్రచురితమైన నేపథ్యంలో ఆమె స్పందించారు. ఏఎస్పేటలో ఆమె పర్యటించడంతో ఇంటింటికీ బీఎల్వోలు వెళ్లి ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టారు. స్వయంగా ఇళ్లకెళ్లి ప్రక్రియను ఆమె పరిశీలించారు. సర్ ప్రక్రియలో మండలం చాలా వెనుకబడి ఉందని, అంగన్వాడీ నిర్వాహకులు సహకారం అందించాలని సూచించారు. అనుకున్న సమయానికే ప్రక్రియను పూర్తి చేయనున్నామని ఆమె వెల్లడించారు. ఇన్చార్జి తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ప్రతిపాదనలు నెల్లూరు (టౌన్): రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లాలోని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈ నెల 15లోపు ప్రతిపాదనలను పంపాలని డీఈఓ బాలాజీరావు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. వివరాలకు www.deo.ne llore.50webs.comను సంప్రదించాలని సూచించారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు నిండిపోయి.. కృష్ణ తేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. స్వామివారిని 66,304 మంది గురువారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 31,811 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.89 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
కారులో మంటలు
● తప్పిన ప్రమాదం వెంకటాచలం: వేగంగా వెళుతున్న కారులో ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగలు రావడంతో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఈ ఘటన శుక్రవారం వెంకటాచలం సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గూడూరుకు చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు కారులో మైపాడు బీచ్కు వెళ్లారు. తిరిగి సొంతూరికి వస్తుండగా వెంకటాచలం టోల్ప్లాజా సమీపానికి చేరుకోగానే కారులో నుంచి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ కారును రోడ్డుపక్కన నిలిపివేశాడు. టోల్ప్లాజా సిబ్బంది వెంటనే స్పందించి కారులో ఉన్న ఐదుగురిని సురక్షితంగా బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆవును కాపాడిన స్థానికులుసంగం: మండలంలోని సంగం బస్టాండ్ సెంటర్ సమీపంలోని కాలువలో ప్రమాదవశాత్తు పడిన ఆవును స్థానికులు సురక్షితంగా బయటకు తీసిన ఘటన శుక్రవారం జరిగింది. ఆవు పడిపోవడాన్ని గమనించిన స్థానికులు వెంటనే తాళ్లు తీసుకొచ్చారు. మూగజీవానికి కట్టి, ఎంతో శ్రమించి పైకి లాగారు. సీహెచ్సీలో నిధుల స్వాహాపై విచారణవెంకటాచలం: మండలంలోని వెంకటాచలం క్లస్టర్ ఆరోగ్య కేంద్రం (సీహెచ్సీ)లో నిధుల స్వాహా జరిగాయనే ఆరోపణలపై శుక్రవారం రాష్ట్రస్థాయి ప్రత్యేక కమిటీ బృందం విచారణ చేపట్టింది. పరికరాల కొనుగోలు, వివిధ అభివృద్ధి పనుల పేరుతో డబ్బు దుర్వినియోగం చేసినట్లు కొందరు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. మే నెలలో జిల్లా స్థాయి అధికారులు విచారణకు వచ్చారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడు సహకరించకపోవడంతో ఉన్నతాధికారులు రాష్ట్ర స్థాయి ప్రత్యేక కమిటీచే విచారణకు ఆదేశించారు. దీంతో తాడేపల్లిలోని డీఎస్హెచ్ కార్యాలయం నుంచి ముగ్గురు అధికారులు, నెల్లూరులోని డీసీహెచ్ఎస్ కార్యాలయం మరొక అధికారి విచ్చేశారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సీహెచ్సీలో జరిగిన పనుల గురించి సిబ్బందితో మాట్లాడి పరిశీలించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వైద్యుడిని విచారించారు. అతని వద్ద ఉన్న పలు రికార్డులను పరిశీలించారు. నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.50 సన్నవి : రూ.20 పండ్లు : రూ.10 -
నాన్న ఇంకా రాలేదా..
● బిడ్డలకు భోజనం తీసుకెళ్తూ.. ● ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణంపొదలకూరు: భార్య మధ్యాహ్న భోజనం వండి పిల్లల కోసం క్యారేజీ సిద్ధం చేసి భర్తకు ఇచ్చింది. అతను పట్టణంలో చదువుతున్న తన బిడ్డల వద్దకు మోటార్బైక్పై బయలుదేరాడు. అయితే విధి చిన్నచూపు చూసింది. ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబళించింది. నాన్న వస్తాడని ఎదురు చూస్తున్న పిల్లలకు కన్నీరే మిగిలింది. ఈ ఘటన మండలంలోని ఇనుకుర్తి వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. పొదలకూరుకు సమీపంలోని డేగపూడి గ్రామానికి చెందిన టి.రవీంద్ర (42) వ్యవసాయంతోపాటు పట్టణంలోని ట్రాక్టర్ల ట్రక్కులు తయారు చేసే కంపెనీలో పనిచేస్తుంటాడు. పొదలకూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో అతని కుమార్తె టెన్త్, కుమారుడు 6వ తరగతి చదువుతున్నారు. వారికి మధ్యాహ్న భోజనం అందజేసేందుకు డేగపూడి నుంచి పొదలకూరుకు మోటార్బైక్పై రవీంద్ర బయలుదేరాడు. ఇనుకుర్తి గ్రామం పెట్రోలు బంక్ వద్ద రాపూరు డిపోకి చెందిన రాజంపేటకు వెళ్లే బస్సు రవీంద్ర బైక్ను ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పిల్లలను ఉన్నత చదువులు చదివించి వృద్ధిలోకి తీసుకురావాలని రవీంద్ర తపించేవాడు. అతను పట్టణంలో అందరికీ సుపరచితుడు కావడంతో ప్రమాద స్థలానికి చేరుకున్నారు. భార్యాపిల్లలు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. పొదలకూరు సీఐ వెంకట్రావ్, ఎస్సై హనీఫ్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ నిర్వహించారు. ఆర్టీసీ బస్సును స్టేషన్కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. -
ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి
● జేసీ వెంకటేశ్వర్లు బుచ్చిరెడ్డిపాళెం: జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించామని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం ఆయన బుచ్చిరెడ్డిపాళెంలోని మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి ఎస్ఐఆర్పై మున్సిపల్ కమిషనర్ చినబాబుతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బుచ్చి – 3 సచివాలయాన్ని తనిఖీ చేసి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేస్తూ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 97 శాతం ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందన్నారు. ఇప్పటి వరకు 36 శాతం డిజిటలైజేషన్ చేసినట్లు తెలిపారు. కోవూరు నియోజకవర్గంలో 97.69 శాతం ఫారాల పంపిణీ పూర్తికాగా, 38.4 శాతం డిజిటలైజేషన్ చేసినట్లు వివరించారు. బుచ్చిరెడ్డిపాళెంలో 96 శాతం ఫారాల పంపిణీ పూర్తికాగా, 40 శాతం డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ, మండల తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
వెంగమాంబ..వలసవాసుల ఆరాధ్య దైవం
రేపట్నుంచి ఐదురోజులపాటు బ్రహ్మోత్సవాలు ● లక్షలాదిగా తరలిరానున్న భక్తులు ● ఏర్పాట్లు పూర్తిదుత్తలూరు: వలసవాసుల ఆరాధ్య దైవంగా, భక్తుల కొంగు బంగారంగా పేరొందిన వెంగమాంబ పేరంటాలు బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. మండలంలోని నర్రవాడలో వెలసిన అమ్మవారి ఆలయంలో ఆదివారం నుంచి ఐదురోజులపాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. సాధారణంగా అత్యధిక సార్లు జూన్ నెలలోనే నిర్వహిస్తారు. అయితే ఈసారి అధిక జ్యేష్ట మాసం రావడంతో ఉత్సవాలు జూలై నెలలో నిర్వహించాల్సి వస్తోంది. ఇతర జిల్లాలు, రాష్ట్రాలు, దేశంలోని పలు ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయ ధర్మకర్తల మండలి, దేవదాయ శాఖ, ఇతర శాఖల అధికారులు తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుద్ధ్యం, రవాణా, పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటిరోజు నిలుపు కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి. సంతానం లేని మహిళలు సంతాన ప్రాప్తి కోసం అదేరోజు అమ్మవారిని ప్రార్థిస్తూ వరబడతారు. ఉత్సవాలు ఇలా.. 6న వెంగమాంబ, గురవయ్య నాయుడు దంపతుల గ్రామోత్సవం, 7న గ్రామోత్సవం నిర్వహిస్తారు. 8న ప్రధాన ఘట్టమైన కల్యాణోత్సవం, పసుపు, కుంకుమ ఉత్సవం, రాత్రి ప్రదానోత్సవం జరుగుతాయి. 9న భక్తుల పొంగళ్ల కార్యక్రమం, ఎడ్లబండలాగు పందేలు నిర్వహించనున్నారు. భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది. పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేయగా, వివిధ స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నాయి. ప్రస్తుత ఆలయంలో చివరిసారిగా.. వెంగమాంబ ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి కోసం రూ.12 కోట్ల ప్రతిపాదనలు పంపగా, ఇప్పటికే రూ.6 కోట్లు మంజూరై టెండర్ల దశలో ఉన్నట్లు దేవదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాల నాటికి ప్రస్తుతం ఉన్న ఆలయ నిర్మాణాన్ని తొలగించనున్నారు. దీంతో ఈసారి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. -
పేరు శిక్షణ.. చేసింది నిధుల భక్షణ
ఉదయగిరి: కూటమి ప్రభుత్వంలో అవినీతి జడలు విప్పి నాట్యం చేస్తోంది. ప్రభుత్వ పెద్దలు తమ స్థాయిలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుండగా, కొందరు అధికారులు తామేమీ తక్కువ కాదన్నట్లు అందినకాడికి దోచుకుంటున్నారు. గత నెల మొదటి వారంలో మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి, రెండో తరగతులకు బోధించే ఉపాధ్యాయులకు ఆరు రోజులపాటు ఎఫ్ఎల్ఎన్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం తొమ్మిది కేంద్రాల్లో (నెల్లూరులో రెండు కేంద్రాలు, వెంకటాచలం, రావూరు, కావలి, వింజమూరు, గూడూరు, ఆత్మకూరు, కోవూరు) జరిగిన ఈ శిక్షణలో రోజూ సుమారు 2,500 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వారికి భోజనం, టిఫిన్, టీ, స్నాక్స్ తదితర ఏర్పాట్ల కోసం ప్రభుత్వం ఒక్కొక్కరికి రోజుకు రూ.300 చొప్పున కేటాయించింది. ఈ నిర్వహణ బాధ్యతలను సమగ్రశిక్షలోని ఓ ముఖ్య అధికారి తనకు అనుకూలమైన ఏజెన్సీలకు అప్పగించినట్లు ఆరోపణలున్నాయి. భోజనంలో చేతివాటం జిల్లాలో శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులకు రోజుకు సుమారు రూ.7.50 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంది. అయితే అందులో సగం కూడా ఖర్చు చేయకుండా నాసిరకం భోజనం, స్నాక్స్ సరఫరా చేసి మిగిలిన మొత్తాన్ని కాజేశారనే ఆరోపణలున్నాయి. ఏజెన్సీలు కేవలం ఒక్కొక్కరికి రూ.150 మాత్రమే ఖర్చు చేసి మిగిలిన మొత్తాన్ని స్వాహా చేసినట్లు తెలిసింది. ఈ శిక్షణ కార్యక్రమాలకు మొత్తం రూ.50 లక్షలు కేటాయించగా, అందులో సుమారు రూ.25 లక్షల వరకు చేతివాటం చూపినట్లు టీచర్లు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారం అంతా సమగ్రశిక్షలోని ఓ అధికారికి తెలిసే జరిగిందని, ఇందులో అధిక శాతం వాటా ఆయనకే వెళ్లిందనే ప్రచారం కూడా జరుగుతోంది. వింజమూరులో నిరసన వింజమూరులో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో మొదటి రోజే భోజనం, స్నాక్స్ నాణ్యతపై టీచర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రెండో రోజు నుంచి స్థానికంగా ఉన్న ఓ వంట మాస్టర్కు ఒక్కో వ్యక్తికి రూ.150 చొప్పున చెల్లించి భోజనం, టీ, స్నాక్స్, టిఫిన్ సరఫరా చేసినట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా అన్ని శిక్షణ కేంద్రాల్లో ఇదే తరహాలో చేతివాటం జరిగినట్లు పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. అవినీతి మరక జిల్లాలో సమగ్రశిక్ష ఆధ్వర్యంలో జరుగుతున్న, గతంలో జరిగిన పలు పనుల్లోనూ అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలున్నాయి. ఇటీవల వింజమూరు మండలం నల్లగొండ్ల, శంఖవరం ప్రాథమిక పాఠశాలల ప్రహరీకి సంబంధించి పనులు చేయకుండానే రూ.21.89 లక్షల నిధులు కాజేసిన వ్యవహారంపై కలెక్టర్ ఆదేశాలతో విచారణ కొనసాగుతోంది. ఇవే కాకుండా మరిన్ని అక్రమాలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారాల్లో ఆ శాఖలో పనిచేస్తున్న సిబ్బందితోపాటు ముఖ్య అధికారి పాత్రపైనా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి స్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పలువురు ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాలు అధికార వర్గాలకు తెలిసినా ‘తమకెందుకులే’ అన్న ధోరణితో వ్యవహరిస్తుండటమే అవినీతికి మరింత ఊతమిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్లో చేతివాటం? స్నాక్స్, భోజన ఏర్పాట్లలో కక్కుర్తి నాసిరకంగా సరఫరా చేసి రూ.25 లక్షల స్వాహా? ఏజెన్సీల పేరుతో వెండర్ నియామకం చేతివాటంలో ముఖ్య అధికారి పాత్రపై ఆరోపణలు -
అక్రమ మద్యం, గంజాయిని కట్టడి చేయాలి
● ఎకై ్సజ్ డైరెక్టర్ రాహుల్దేవ్ శర్మ నెల్లూరు(క్రైమ్): అక్రమ మద్యం, గంజాయిని కట్టడి చేయాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డైరెక్టర్ రాహుల్దేవ్ శర్మ అధికారులను ఆదేశించారు. నెల్లూరు ఎకై ్సజ్ డీసీ కార్యాలయంలో శుక్రవారం ఆయన నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎకై ్సజ్ స్టేషన్ల వారీగా నమోదైన కేసుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా రాహుల్దేవ్ శర్మ మాట్లాడుతూ పొరుగు మద్యం జిల్లాలోకి రాకుండా సరిహద్దులో పటిష్ట నిఘాను ఏర్పాటు చేయాలన్నారు. నాటుసారా తయారీ, విక్రయాలు, బెల్ట్ దుకాణాలు, బహిరంగ మద్యపానంపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను కట్టడి చేయాలన్నారు. మద్యం దుకాణాల లైసెన్స్ల గడువు మరో మూడునెలల్లో ముగియనున్నందున ఫీజుల వసూళ్లను వేగవంతం చేయడంతోపాటు దుకాణాల్లో అనధికార మద్యం నిల్వలు ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల మేరకే విక్రయాలు జరిగేలా చూడాలన్నారు. పెండింగ్ కేసుల్లో దర్యాప్తును త్వరితతిన పూర్తిచేయాలని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న నిందితులను అరెస్ట్ చేసి చార్జ్షీట్లు దాఖలు చేయాలన్నారు. ఎన్డీపీఎస్, గంజాయి కేసుల్లోని నిందితులను తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేయాలని సూచించారు. సమావేశంలో డీసీఎం శంకరయ్య, ఏసీ పి.దయాసాగర్, ఎకై ్స జ్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
రెండు కుటుంబాల్లో చీకట్లు
● ఆశల్ని చిదిమేసిన ఘోర రోడ్డుప్రమాదం కోట: రోడ్డు ప్రమాదం రెండు పేద కుటుంబాల్లో చీకట్లు నింపింది. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్న ఇద్దరు స్నేహితులు విగతజీవులుగా మారడం అందరిన్నీ కంటతడి పెట్టించింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని చంద్రశేఖరపురం వద్ద ప్రధాన రహదారిపై గురువారం రాత్రి మృత్యుశకటంలా దూసుకొచ్చిన గాయత్రి రొయ్యల కంపెనీ బస్సు చక్రాల కింద సంగారపు శివకుమార్ (21), కలివేల శ్రీనాథ్(21) నలిగి ప్రాణాలొదిలారు. కేసవరం గ్రామానికి చంద్రయ్య, లక్ష్మమ్మ నిరుపేద వ్యవసాయ కూలీలు. వారి కుమారుడైన శివకుమార్ ఏఎంఆర్ సంస్థలో పనిచేస్తూ తల్లిదండ్రులకు అండగా ఉన్నాడు. అదేవిధంగా వంజివాకకు చెందిన కరివేల రమణయ్య, కోటమ్మ దంపతుల కుమారుడైన శ్రీనాథ్ ఏఎంఆర్ సంస్థలో పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. వాటర్ క్యాన్ కోసం వెళ్లి.. ఊనుగుంటపాళెంలో ఉన్న ఏఎంఆర్ చెక్పోస్ట్ వద్ద గురువారం రాత్రి డ్యూటీకి వెళ్లిన శివకుమార్, శ్రీనాథ్ వాటర్ క్యాన్ తీసుకెళ్లేందుకు చంద్రశేఖరపురానికి వచ్చి రోడ్డు పక్కన నిలిబడి ఉన్నారు. వేగంగా దూసుకొచ్చిన రొయ్యల కంపెనీ బస్సు ముందు ట్రక్కు ఆటోను ఢీకొట్టి, రోడ్డుపై నిలబడి ఉన్న ఇద్దరి మీదుగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వారు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. శుక్రవారం అక్కడ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. పరారీలో ఉన్న బస్సు డ్రైవర్ వెంకటరమణయ్య కోసం గాలిస్తున్నట్లు ఎస్సై పవన్కుమార్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
దుకాణాల్లో తనిఖీలు
ఉదయగిరి: ఉదయగిరిలో, మర్రిపాడు మండలంలోని కృష్ణాపురం గ్రామంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ శాఖ ఇన్స్పెక్టర్ షేక్.మొహిసిన్ తన సిబ్బందితో కలిసి దుకాణాలను పరిశీలించారు. కాటాలపై ముద్రలు లేకపోవడం, కాలం చెల్లిన వస్తువులు విక్రయించడం, వస్తువులపై కస్టమర్ కేర్ నంబర్, తయారు తేదీ, ముగింపు గడువు తేదీ లేకపోవడం గుర్తించి ఏడు కేసులు నమోదుచేసి రూ.30 వేలు ఫైన్ విధించారు. ఆయన వెంట సిబ్బంది సుబ్బారావు, శ్రీనివాసులు, శ్రీకాంత్ ఉన్నారు. బస్సు, ఆటో ఢీ● ఒకరికి గాయాలు కోట: మండలంలోని కోట క్రాస్రోడ్డు సమీపంలోని చల్లకాలువ వంతెన వద్ద ప్రధాన రహదారిపై గురువారం ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్కు గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. విద్యానగర్ నుంచి వాకాడు వైపు వెళ్తున్న ట్రక్కు ఆటో, గూడూరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ఆటో రోడ్డుపై బోల్తా పడింది. దాని డ్రైవర్ సైఫుల్లాకు గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్లో కోట ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం గూడూరుకు తీసుకెళ్లారు. ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ జరుపుతున్నారు. మహిళ అనుమానాస్పద మృతిగూడూరు: పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో గురువారం ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఒకటో పట్టణ పోలీసుల కథనం మేరకు.. సొసైటీ ప్రాంతానికి చెందిన వలయానందపురానికి చెందిన గోపిదేవి పార్వతి (36)కి 14 సంవత్సరాల క్రితం వెంకటేశ్వర్లు అనే వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. ఇటీవల కాలంలో కుటుంబంలో వివాదాలు నెలకొన్నట్లు పోలీసులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం స్థానికులు సమాచారంతో ఆమె ఇంటి వద్దకు వెళ్లి చూడగా చనిపోయి ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై శిరీష తెలిపారు. రాజరాజేశ్వరి ఆలయ హుండీ కానుకల లెక్కింపునెల్లూరు(బృందావనం): రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో హుండీ కానుకల లెక్కింపు గురువారం జరిగింది. కార్యనిర్వహణాధికారి కోవూరు జనార్దన్రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది మార్చి 24 నుంచి జూలై 2వ తేదీ వరకు భక్తులకు అమ్మవారికి కానుకల రూపంలో రూ.27,76,900, అలాగే అన్నదానం హుండీ ద్వారా రూ.80,098లు సమర్పించారన్నారు. కార్యక్రమంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జంజనం శ్రీనివాసరావు, జిల్లా దేవదాయ శాఖకు చెందిన నెల్లూరు ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీనివాసబాబు, ధర్మకర్తల మండలి చైర్మన్ ఏలూరు శిరీష, సభ్యులు, ప్రధాన అర్చకులు సూరావఝుల రఘురామమూర్తి, పోలీసులు, ఎస్బీఐ విశ్రాంత, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్పై ప్రత్యేక దృష్టి ● డీపీఓ వసుమతి నెల్లూరు(పొగతోట): ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా సకాలంలో పూర్తిచేయాలని డీపీఓ వసుమతి మండల అధికారులను ఆదేశించారు. గురువారం నెల్లూరులోని కార్యాలయం నుంచి వివిధ మండలాల అధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. ఇంటింటికీ వెళ్లి ఫారాలు అందజేయాలన్నారు. పూర్తి సమాచారంతో వాటిని సేకరించాలన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇంటి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని తెలిపారు. -
ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చూడాలి
నెల్లూరు(అర్బన్): కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిన నేపథ్యంలో ఉద్యోగుల విభజనకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు – 2025 అమల్లో భాగంగా ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చూడాలని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి సూచించారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్లో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నాయకులతో డీఆర్వో విజయకుమార్ సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రపతి ఉత్తర్వులపై సమీక్షించారు. ఈ సందర్భంగా పెంచలరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల హక్కులు, సేవా ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాలన్నారు. డిప్యూటీ కేడర్లో అప్డేట్ ప్యానెల్ను తయారు చేయాలని, ఉద్యోగుల సేవా హక్కులకు సంపూర్ణ రక్షణ క ల్పించాలన్నారు. సీనియారిటీని కాపాడాలని, పదోన్నతులకు రక్షణ కల్పించాలని, ఉద్యోగుల అభిష్టాలకు ప్రాధాన్యమిచ్చి కేటాయింపులు జరపాలని కోరారు. తమ అభ్యంతరాలు తెలిపేందుకు తగినంత గడువునివ్వాలని, ఎస్సీ, ఎస్టీ నిష్పత్తి పరిక్షణ జరగాలంటూ తదితర 13 అంశాలను డీఆర్వోకు తెలిపారు. అలాగే సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు కలెక్టర్కు ధన్యవాదాలు తెలిపారు. డీఆర్వో మాట్లాడుతూ నాయకుల అభిప్రాయాలు కలెక్టర్కు తెలిపి ఎవరికీ నష్టం జరగకుండా రాష్ట్రపతి ఉత్తర్వులు అమలయ్యేలా చూస్తామన్నారు. -
5న స్విమ్మింగ్ జిల్లా జట్ల ఎంపిక
నెల్లూరు (టౌన్): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జిల్లా స్విమ్మింగ్ క్రీడాకారుల జట్లను ఆదివారం ఎంపిక చేయనున్నామని స్విమ్మింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి సనత్కుమార్, మధు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్ – 1 (ఏ)లో 17 నుంచి 18 ఏళ్లలోపు ఉండి.. 2008 – 09 మధ్య జన్మించిన వారు అర్హులని చెప్పారు. గ్రూప్ – 1 (బీ)కి సంబంధించి 15 నుంచి 16 ఏళ్లలోపు ఉండి 2010 – 11 మధ్య పుట్టిన వారు అర్హులని వివరించారు. గ్రూప్ – 2లో 13 నుంచి 14 ఏళ్లలోపు ఉండి.. 2012 – 13 మధ్య.. గ్రూప్ – 3లో 11 నుంచి 12 ఏళ్లలోపు ఉండి 2014 – 15 మధ్య జన్మించిన వారు అర్హులని చెప్పారు. హాజరయ్యే వారు స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గుర్తింపు కార్డును తీసుకురావాలని కోరారు. వయస్సు ధ్రువీకరణ, ఆధార్ కార్డుతో పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 18, 19వ తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న 11వ సబ్ జూనియర్స్, జూనియర్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ రాష్ట్ర స్థాయి ఆక్వాటిక్ పోటీల్లో పాల్గొననున్నారని చెప్పారు. గ్రూప్ – 2 ప్రిలిమినరీ పరీక్షలకు ఉచిత శిక్షణ నెల్లూరు(వేదాయపాళెం): ఏపీపీఎస్సీ గ్రూప్ – 2 ప్రిలిమినరీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణను అందించనున్నామని బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు వెంకటలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను శోధన్నగర్లోని బీసీ స్టడీ సర్కిల్ భవన్లో ఈ నెల 17లోపు అందజేయాలని కోరారు. వంద మందికి రెండు నెలల ఉచిత శిక్షణతో పాటు స్టయ్పండ్, స్టడీ మెటీరియల్ను అందజేయనున్నామని పేర్కొన్నారు. డిగ్రీ మార్కులు, మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నామని, తరగతులను ఈ నెల 27న ప్రారంభించనున్నామని వివరించారు. వివరాలకు 93815 54779, 93902 39588 నంబర్లను సంప్రదించాలని సూచించారు. క్రిస్ సిటీలో త్వరితగతిన పనులు చిల్లకూరు / కోట: తీర ప్రాంత గ్రామాలైన తమ్మినపట్నం, కొత్తపట్నం రెవెన్యూ పరిధిలో చేపడుతున్న క్రిస్ సిటీలో పనులను త్వరగా పూర్తి చేసి పరిశ్రమల యాజమాన్యాలకు అందుబాటులోకి తీసుకురావాలని పరిశ్రమల శాఖ రాష్ట్ర సెక్రటరీ యువరాజ్ పేర్కొన్నారు. ఈ గ్రామాల్లో దాదాపు 900 ఎకరాల్లో పనులను చేపడుతుండగా, వివిధ కారణాలతో జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలో అధికారులతో పాటు కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో గురువారం చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వర్షాకాలంలో పనులు సాగడం కష్టతరంగా మారనుందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని త్వరగా పూర్తి చేసేందుకు యత్నించాలని సూచించారు. అనంతరం మౌలిక వసతుల కల్పనకు చేపడుతున్న పనుల వివరాలతో కూడిన మ్యాప్ను పరిశీలించి.. పలు మార్పులు, చేర్పులను సూచించారు. గూడూరు ఆర్డీఓ అరుణకుమారి, చిల్లకూరు, కోట మండలాల తహసీల్దార్లు గోపీనాథ్రెడ్డి, జేజే రావు, ఆర్ఐ పూర్ణ, సర్వేయర్ మల్లికార్జున్, వీఆర్వో బాలాజీ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 27 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 78,067 మంది బుధవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 31,158 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.39 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
గిరిజన మహిళ కేసును తారుమారు చేస్తే సహించేదిలేదు
మహిళలపై పేట్రేగిపోతున్న కూటమి నేతలు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి కచ్చేరిమిట్ట ఘటన లో న్యాయం పక్షాన నిలబడి దోషులను శిక్షిస్తారా? నిందితుల కొమ్ముకాస్తూ దోషులుగా నిలబడతారా? అంటూ పోలీసులకు మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీ ఎస్టీ కమిషన్ చైర్మన్, ఎమ్మెల్సీ కుంభా రవి బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ విభాగం అధ్యక్షుడు సురేంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి మాస్వార్నింగ్ ఇచ్చారు. గిరిజన మహిళను వివస్త్ర చేసి, దారుణంగా కొట్టితే అధికార పార్టీ ఎమ్మెల్యే చెప్పాడని పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం తగదని హితవు పలికారు. ఎవరైనా మహిళల జోలికి వచ్చినా, మహిళల మీద చేయి వేసినా.. ఆ రోజే వాళ్లకు ఆఖరి రోజు అవుతుందంటూ చంద్రబాబు ఆవేశంగా చెబుతాడని, నిన్న కూడా గూడూరులో ఇదే డైలాగ్లు చెప్పాడన్నారు. ఆయన పార్టీ నేతలు అత్యంత దారుణానికి తెగబడితే, ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. ఈ కేసును ఏదో ఒక రకంగా నీరుగార్చేందుకు, నిందితులను కాపాడేందుకు బాధితులనే నిందితులుగా చిత్రీకరించడానికి పోలీసులు బరితెగిస్తున్నారన్నారు. కావలి 24వ వార్డు టీడీపీ నేత, మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం, ఆయన వర్గీయుల చేతిలో సభ్య సమాజం తలదించుకునే రీతిలో అవమానానికి గురైన గిరిజన మహిళను గురువారం పరామర్శించి ఓదార్చారు. వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, అన్ని విధాలుగా అండగా ఉండి న్యాయం జరిగే వరకు జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్రెడ్డి, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పందిటి కామరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి నాయబ్ రసూల్, నాయకులు ప్రసాద్రెడ్డి, కందుర్తి కామయ్య, కనమర్లపూడి వెంకటనారాయణ, కలికి శ్రీనివాసులరెడ్డి, ద్రోణాదుల వెంకట్రావు జంపాని రాఘవులు, ఆకుమాని శ్రీనుబాబు, మహిళా నేతలు పద్మమ్మ, సీతమ్మ, నాగేశ్వరమ్మ, సుమలత, కళ్యాణి, కీర్తిప్రియ తదితరులు పాల్గొన్నారు. -
సచివాలయంలోనే అంతా..
● ఇంటింటికీ వెళ్లాలనే ఆదేశాలు బేఖాతర్ అనుమసముద్రంపేట: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలు సేకరించి ఓటర్లకు అవగాహన కల్పించాలనే ఉన్నతాధికారులు ఆదేశాలు కొన్ని చోట్ల బేఖాతర్ అవుతున్నాయి. స్థానిక ఏఎస్పేట – 1 సచివాలయంలోనే ధ్రువీకరణ ప్రక్రియను బీఎల్వోలు గురువారం నిర్వహించారు. దీంతో పెద్ద సంఖ్యలో ఓటర్లు అక్కడికి చేరుకున్నారు. తమ పనులను మానుకొని సచివాలయానికి రావాల్సి వస్తోందని, ఇంటింటికీ వచ్చి ఫారాలను సేకరించాల్సిన అధికారులు కార్యాలయంలోనే ప్రక్రియను పూర్తి చేయడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ విషయమై ఇన్చార్జి తహశీల్దార్ వెంకటేశ్వర్లును సంప్రదించగా, సచివాలయానికి ఎవరూ రావాల్సిన అవసరం లేదని, బీఎల్వోలే ఇంటి వద్దకొచ్చి ఎన్యూమరేషన్ ఫారాలను అందిస్తారని చెప్పారు. ప్రక్రియ ఈ నెల 14న ముగియనుండటంతో కలెక్టర్ ఆదేశాలతో అన్ని శాఖల సిబ్బందిని విధుల్లో వినియోగించుకుంటున్నామని వివరించారు. ఓటర్లు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని బదులిచ్చారు. -
కూటమి ప్రభుత్వంలోనే విధ్వంసం
● ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ చిల్లకూరు: ‘కూటమి ప్రభుత్వంలోనే ప్రకృతి వనరుల విధ్వంసం జరుగుతోంది. అయితే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ఆపాదించేలా సీఎం చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది’ అని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ విమర్శించారు. గూడూరులోని సనత్ నగర్లో ఉన్న పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చిల్లకూరు మండలానికి వచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యపడుతుందని, గత ప్రభుత్వంలో విధ్వంస పాలన కొనసాగిందనడం చూస్తుంటే గురువింద సామెత గుర్తుకు వస్తోందన్నారు. కూటమి పాలన వచ్చాక నేతలు ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తూ జేబులు నింపుకొంటున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో గుర్తుండిపోయేవి ఏవైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశం గర్వించేలా మెడికల్ కళాశాలలు, పోర్టులు, పరిశ్రమలు, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారన్నారు. ఒకరిద్దరికి పింఛన్ ఇచ్చేందుకు ప్రతినెలా ఎంతమేర ఖర్చు చేస్తున్నారని, ఇది ప్రభుత్వ సొమ్ము కాదా? ప్రజలపై భారం పడదా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ను ఒక్క నిమిషంలో అరెస్ట్ చేస్తామని చంద్రబాబు అన్నారని, అలా జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. గూడూరు నియోజకవర్గంలో మీ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధి పనితీరును మీరే బయట పెట్టారని, అలాగే విద్యాశాఖ మంత్రి పనితీరును కూడా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తాగునీరు అందించలేని స్థితిలో.. ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు గూడూరు పట్టణ ప్రజలకు తాగునీటిని పూర్తి స్థాయిలో అందించలేని స్థితిలో నేడు పాలన చేస్తున్నారని ఎమ్మెల్సీ మండిపడ్డారు. నెల రోజుల నుంచి సక్రమంగా తాగునీరు అందక ప్రజలు అవస్థలు పడుతుంటే ప్రజా ప్రతినిధులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఆర్డీఓ, మున్సిపల్ ప్రత్యేక అధికారి అరుణకుమారితోపాటు మున్సిపల్ కమిషనర్ మల్లికార్జునరావుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ బొమ్మిడి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు షేక్ సుభాన్, మేధావుల ఫోరం కన్వీనర్ నందవరం సుబ్బారావు, నాయకులు డేగపూడి వేణురెడ్డి, డేగపూడి కృష్ణారెడ్డి, మణి, వెంకటేశ్వర్లు, నేతలు పాల్గొన్నారు. -
అల్లకల్లోలంగా సముద్రం
● వేట నిలిపి ఒడ్డుకు చేరిన మత్స్యకారులు వాకాడు: సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. మండలంలోని తూపిలిపాళెం వద్ద సముద్రంపై వేట సమయంలో వాతావరణ పరిస్థితులు భయాందోళన కలిగించేలా గురువారం కనిపించాయి. కడలిలో ఏ క్షణాన ఏమి జరుగుతుందోనని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గంటలు నిశ్శబ్దంగా ఉన్న సముద్రం, ఒక్కసారిగా ఉగ్రరూపంతో మారి అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరం నుంచి దాదాపు ఐదు నాటికల్ మైళ్ల దూరంలో ఒక్కసారిగా సుడులు తిరుగుతూ భయాందోళన కలిగిస్తుండటంతో వేట చేసే బోట్లు ఒక్కచోట నిలవక తిరగబడుతున్నాయని మత్స్యకారులు తెలిపారు. దీంతో వేటను నిలిపేసి ఒడ్డుకు వీరు పరుగులు తీశారు. -
ఆదాయంతో పాటు ఆరోగ్యం ముఖ్యం
నెల్లూరు(పొగతోట): గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక గ్రూపు మహిళలు ఆదాయంతో పాటు ఆరోగ్యం సక్రమంగా ఉండేలా చూడాలని సెర్ఫ్ సీఈఓ వాకాటి కరుణ పేర్కొన్నారు. నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలతో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. సమాజంలో అందరూ మంచి అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. ప్రతి మండలంలో కిచెన్ గార్డెన్లను ఏర్పాటు చేయాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల అవసరాన్ని బట్టి సీ్త్ర నిధి రుణాలను మంజూరు చేయాలని పేర్కొన్నారు. సీసీలందరికీ మొబైల్ ఫోన్లను రెండు నెలల్లో అందజేయనున్నామని వెల్లడించారు. జిల్లాలో టీమ్ వర్క్ అద్భుతంగా ఉందని, ఇదే విధంగా ముందుకుసాగాలని సూచించారు. సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. ఏసీఎల్పీ కార్యక్రమం ద్వారా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఫుడ్ బాస్కెట్ను అన్ని మండలాల్లో ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రభుత్వం నుంచి రెండెకరాలను తీసుకొని అందులో వివిధ రకాల పంటలను సాగు చేసిన చేజర్ల ఏపీఎం సృజనను అభినందించారు. డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, ఏపీడీ రాజు తదితరులు పాల్గొన్నారు. -
తిరునాళ్లలో జోరుగా జూదం
● పట్టించుకోని పోలీసులు కొండాపురం: గొట్టిగొండాల గ్రామంలో కోటా అంకమ్మ తల్లి తిరునాళ్ల జరుగుతున్నాయి. గురువారం ఆలయ ప్రాంగణంలో జోరుగా డైమండ్ డబ్బా, మూడు ముక్కలాట జరిగాయి. సుమారు 20, 30 మంది వ్యక్తులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వాటిని నిర్వహించారు. తిరునాళ్ల పెద్ద స్థాయిలో జరుగుతుంది. కొండాపురం, కలిగిరి, వింజమూరు పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. కొండాపురం ఎస్సై కాసుల శ్రీనివాసులు ఘటనా స్థలంలోనే ఉన్నారు. అయినా జూదం జరుగుతుంటే కనీసం పట్టించుకోలేదని భక్తులు ఆరోపించారు. ఆలయ కమిటీ సభ్యు లు జూద నిర్వాహకుల నుంచి రూ.300 రుసు ము వసూలు చేసి రశీదు ఇస్తున్నారు. ఈ తంతు మొత్తం పోలీసులకు తెలిసే జరిగిందని భక్తులు అంటున్నారు. టీడీపీ నాయకులు ప్రమేయం ఉందని విమర్శిస్తున్నారు. ఈ విషయంపై కొండాపురం ఎస్సైని వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులో లేరు. -
అటవీ భూమి ఆక్రమణకు యత్నం
● అడ్డుకున్న అధికారులు చిల్లకూరు: కూటమి ప్రభుత్వంలో భూ కబ్జాల పర్వం పెరిగిపోతోంది. గ్రామాలకు సమీపంలో ఉండే అటవీ భూములను సైతం ఆక్రమించేందుకు సిద్ధ పడుతున్నారు. అడ్డుకున్న వారిని బెదిరించి భూముల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అటవీ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన వారిని గురువారం అటవీ అధికారులు అడ్డుకున్న ఘటన మండలంలోని అన్నంబాక సమీపంలో జరిగింది. గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు ఊరికి సమీపంలో ఉన్న 112 ఎకరాల అటవీ భూమిలో కొంత భాగంలో ఉన్న చెట్లు తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ అధికారులు అక్కడికి చేరుకుని పనులను నిలిపివేశారు. దీంతో అధికార పార్టీకి చెందిన పెద్దలు అధికారులపై ఒత్తిడి తెచ్చి వదిలేయాలని చెప్పినట్టు తెలిసింది. ఏకంగా.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడున్న అటవీ భూమిలో గ్రావెల్ తవ్వేందుకు అనుమతి కోసం అధికార పార్టీ నాయకులు ప్రయత్నించారు. అయితే అటవీ అధికారులు అందుకు ససేమిరా అన్నారు. ఈ క్రమంలోనే నాయకులు భూమిని ఏకంగా ఆక్రమించేందుకు ప్రయత్నం చేయడం కలకలం రేపింది. భూ ఆక్రమణ విషయంపై అటవీ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.కండలేరులో 31.89 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 31.89 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయిగంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 30, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 70 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
మహిళపై ఘోర అఘాయిత్యం
– కాకాణి గోవర్ధన్రెడ్డి రాష్ట్రంలో మహిళల మాన, ప్రాణాలకు భద్రత లేదని, అధికారం అండతో కూటమి నేతలు పేట్రేగిపోతున్నారని, రెండేళ్లుగా ఎంతో మంది బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు జరిగినా.. ఒక్కరిపైనా ఇంత వరకు చర్యలు లేవని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో మహిళలపై కూటమి నాయకులే అఘాయిత్యాలు దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నా చంద్రబాబు, పవన్కళ్యాణ్ చూస్తూ ఉండిపోతున్నారని ధ్వజమెత్తారు. తమ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా యాప్ తెచ్చి, మహిళలకు రక్షణ కల్పించడంతోమహిళల వైపు చూడాలంటే భయపడేవారన్నారు. ఒక మహిళను నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి వివస్త్రను చేసి అత్యంత పాశావికంగా టీడీపీ మాజీ కౌన్సిలర్, ఆయన వర్గీయులు దాడి చేస్తే రెండు వారాలైనా చర్యలు చేపట్టకపోవడం సభ్య సమాజాన్ని విస్మయానికి గురి చేస్తుందన్నారు. ఘోర అవమాన భారంతో బాధితురాలు కుంగిపోతుంటే.. ఆమె సామాజిక హోదాపై కూడా ప్రశ్నలు లెవనెత్తడం బాధాకరమన్నారు. ఆమె ఏ సామాజిక వర్గమైనా మహిళనే కదా? అని ప్రశ్నించారు. ఈ దుస్సంఘటనపై పట్టణంతోపాటు జిల్లా మొత్తం ఆందోళన వ్యక్తం చేస్తుంటే బాధితుల్ని ఏదో రకంగా బెదిరించి కేసును ముందుకు సాగకుండా చేయాలన్న దుర్మార్గమైన ఆలోచనతో దొంగ సర్టిఫికెట్లు సృష్టించారన్నారు. జన్మతః ఏదైతే కులంలో పుడుతామో అదే కొనసాగుతుందని మనం మారమంటే మారదని విశదీకరించాడు. పోలీసులు నిందితులకు కొమ్ము కాస్తున్నారని స్పష్టంగా తెలుస్తుందన్నారు. గిరిజన మహిళకు జరిగిన అన్యాయం కోణంలో తామంతా పోరాడుతున్నామన్నారు. – గుండా సురేంద్రబాబు, వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు ఒక గిరిజన మహిళను నిర్బయంగా వివస్త్రను చేసి విచక్షణారహితంగా కొట్టాగలిగారంటే.. అధికార బలంతోనే ఈ దురాగతానికి తెగించారని ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ గుండా సురేంద్రబాబు దుయ్యబట్టారు. తనకు జరిగిన అవమానాన్ని చెప్పలేక చెబుతుంటే అందరి కళ్లు చెమర్చాయన్నారు. గిరిజన మహిళకు తామంతా అండగా ఉంటామని, తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతోనే ఇక్కడికి వచ్చామన్నారు. ఈ ఘటనపై కావలి పోలీసులు, రెవెన్యూ అధికారులు స్పందించిన తీరు ఆక్షేపణీయమన్నారు. రాష్ట్ర హోమంత్రి అనిత మౌనం వహించడం శోచనీయమన్నారు. గిరిజన సంక్షేమశాఖా మంత్రి ఉన్నా లేనట్టేనని ఆమెను గూర్చి మాట్లాడడం సమయం వృథా చేయడమేనన్నారు. ఈ రాష్ట్రంలో గిరిజనులపై జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావన్నారు. ఈ రోజు కావలిలో జరిగిన దారుణం ఒకటైతే.. సర్వేపల్లి ని యోజకవర్గంలో ఒక గిరిజనుడిని పీక కోసే దారుణానికి తెగించారన్నారు. సుగాలిప్రీతి విషయం కావొచ్చు... అనంతరపురంలో ఒక ఇంటర్మీడియట్ అమ్మాయిని చంపేశారన్నారు. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదన్నారు. శాంతిభద్రతల్లో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఎస్టీ, మానవహక్కుల కమిషన్లకు, రాష్ట్రపతికి ఫిర్యాదులు చేస్తాం న్యాయపోరాటం ద్వారా బాధ్యుల భరతం పడతాం పోలీసులకు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, సురేంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి మాస్ వార్నింగ్ నేరస్తులకు కాపు కాయడం సిగ్గుచేటు – రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి కావలి చరిత్రలో ఒక మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పన ఇంతటి దారుణమైన, జుగప్సాకరమైన ఘటన ఏ రోజు జరగలేదని, ఒక గిరిజన మహిళను వివస్త్రను చేసి అత్యంత క్రూరంగా కొట్టిన నిందితులకు ఎమ్మెల్యే కాపు కాయడం సిగ్గు చేటని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి దుయ్యబట్టారు. ఘటన జరిగి రెండు వారాలవుతున్నా.. పోలీసులు చర్యలు చేపట్టకపోవడంతో నిందితులు కాలరేగరేసుకుని తిరుగుతున్నారు. నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే దానికి కారణం ఇక్కడి రాజకీయ నాయకులే అని స్పష్టం చేశారు. ఆ గిరిజన మహిళకు జరిగింది ముమ్మాటికి ఘోర అవమానమే అని, ఈ తరుణంలో ఎమ్మెల్యే పరామర్శించి, అండగా ఉండాల్సింది పోయి.. రాజకీయాలు చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. ఇక్కడి పోలీసులు కూడా నేరస్తులకు కొమ్ముకాయడం విస్మయం గొలుపుతుందన్నారు. కనీసం మంచి చేయడం పోయి ద్రోహం చేయడం ఈ రాష్ట్రంలోనే చూస్తున్నామన్నారు. ఇటువంటి దురదృష్టకరమైన ఘటనపై కొంతమంది మీడియా ప్రతినిధులు బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి.. ప్రజలను తప్పుదోవ పట్టించే కథనాలు రాయడం బాధాకరమన్నారు. మైనార్టీలకు ఇక్కడ ఎవరు వ్యతిరేకంగా మాట్లాడడం లేదని, ఒక గిరిజన మహిళకు జరిగిన అన్యాయాన్నే ప్రశ్నిస్తున్నామన్నారు. ఒక వేళ ఆ మహిళ కుమారుడు తప్పు చేసి ఉంటే దానిపై చట్టప్రకారం వెళ్లాలే కానీ, తల్లిపై విచక్షణారహితంగ దాడికి దిగడం మానవత్వమా అని ప్రశ్నించాడు. అధికార బలంతోనే ఈ దురాగతం కేసును నీరుగార్చే కుట్రపై జాతీయస్థాయి పోరాటం – ఎమ్మెల్సీ కుంభా రవిబాబు కావలిలో జరిగిన దుస్సంఘటన యావత్ రాష్ట్రాన్ని విస్మయం కలిగించేదని, ఇలా దురదుష్టకరమైన దారుణమని ఎమ్మెల్సీ కుంభా రవిబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ కేసును తొక్కిపెట్టాలని అధికార పార్టీ ఎమ్మెల్యే, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అత్యంత గర్హనీయమన్నారు. ఈ కేసును నీరుగార్చే కుట్రపై జాతీయ స్థాయిలో పోరాటం చేస్తామన్నారు. గత నెల 19న ఈ ఘటన జరిగినా ఈ నాటికి నిందితులపై ఎటువంటి చర్యల్లేవన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇబ్రహీంను ఏ–1గా చేర్చాల్సి పోలీసులు ఏ–6గా నమోదు చేయడం ఎవరి ప్రమేయంతో జరిగిందో అర్థమవుతుందన్నారు. ఈ దురాగతంపై వైఎస్సార్సీపీ గళమెత్తడంతో హడావుడిగా అట్రసిటీ కేసు నమోదు చేశారన్నారు. బాధితురాలి తండ్రి ఎస్టీ అని అప్పటి తహసీల్దార్ ధ్రువీకరిస్తే.. ఆయన కుమార్తె బీసీఈ అని ఇప్పటి తహసీల్దార్ శ్రావణ్కుమార్ సర్టిఫై చేయడం ఏమిటని నిలదీశారు. ఈ ఉదంతాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్కు అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేస్తామన్నారు. తమ పార్టీ తిరుపతి, అరకు ఎంపీలు గురుమూర్తి, గురుమూర్తి, తనూజారాణితోపాటు ముఖ్య నేతలందరం కలిసి జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లేందుకు పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపడుతామన్నారు. రాజకీయం, మతపరం చేయకండి మహిళల రక్షణపై ప్రభుత్వానివి ప్రగల్భాలే నిందితులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే కావలి ఉమెన్ ఫోర్స్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి పట్టణలోని కచ్చేరిమిట్టలో గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేయడం ఘోర అఘాయిత్యమే. ఈ దారుణానికి రాజకీయం, మతపరమైన రంగులు పులమొద్దని కావలి ఉమెన్ ఫోర్స్ సభ్యులు సీ శారద, జి. లావణ్య, ఎస్కే ఫాతిమా, టి. విద్యావతి, ఎస్కే నూర్జహాన్, ఎం. పార్వతీశంకర్, ఎం. కవిత, ఎస్. సుహాసిని తదితరులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బాధితురాలి కుమారుడు తమ ఆడపిల్లను ప్రేమిస్తున్నాడన్నాడనే కారణంతో ఆరుగురు వ్యక్తులు ఆమెను నడివీధిలోకి లాగి బరితెగించి వివస్త్రను చేసి గాయపడేలా దాడి చేసిన దుస్సంఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందన్నారు. గత నెల 19వ తేదీ ఈ దారుణం జరిగినా.. వారం క్రితం వెలుగు చూసినా.. అటు రాజకీయ నాయకులు, ఇటు పోలీసులు తొక్కి పెట్టడం విచారమన్నారు. మహిళల భద్రత తమకు అత్యంత ప్రధానమని ప్రకటించుకున్న ప్రభుత్వం ఎందుకు ఇంత వరకు నిందితులను ఆరుగురిని అరెస్ట్ చేసి, కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేయలేదని మహిళ తరఫున ప్రశ్నిస్తున్నామన్నారు. ఈ అమానుషాన్ని దారి మళ్లించే దిశగా రాజకీయ, మతం ముసుగులు వేస్తూ నిందితుల మతస్తులైన మహిళలతో ప్రెస్మీట్ పెట్టించి రెండు కుటుంబాల సమస్యను రాజకీయం చేస్తున్నారని నిందారోపణలు చేయడం అత్యంత గర్హనీయమన్నారు. ముస్లిం యువతిని గిరిజన యువకుడు ప్రేమించడంలో తప్పు ఏముందని? ఇష్టం లేకుంటే, తమ బిడ్డకే నచ్చ చెప్పుకోవాలే కానీ, కొడుకు ప్రేమించాడని అతని తల్లిపై ఇంతటి అఘాయిత్యానికి దిగడం వెనుక ఎవరి అండ ఉందో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అర్థమవుతుందన్నారు. మహిళా హోంమంత్రి ఈ అన్యాయాన్ని తెలిసి ఎలా పట్టించుకోకుండా ఉన్నారని నిలదీశారు. స్థానిక ప్రజాప్రతినిధి బాధిత మహిళను పలకరించి ధైర్యం చెప్పి, తక్షణమే ఈ దురాగతానికి పాల్పడిన దుర్మార్గులను కఠినంగా శిక్షించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ తక్షణమే బాధిత మహిళకు అండగా నిలబడుతున్నామని ప్రకటించి, బాధిత మహిళను కలవాలన్నారు. చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బాధిత మహిళ వైపు నిలబడి, తక్షణమే నిందితులపై కఠిన చర్యలకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. -
ఓట్లు తొలగించేందుకు కుట్రలు
● ముస్లిం, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్బాషా నెల్లూరు(పొగతోట): ముస్లిం, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నవారి ఓట్లు తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ ముస్లిం, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఖాదర్బాషా అన్నారు. నెల్లూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనార్టీ ఓట్ల పరిరక్షణే వైఎస్సార్సీపీ ధ్యేయమని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మైనార్టీ ఓట్ల పరిరక్షణకు ‘ఎస్ఐఆర్’ ప్రక్రియపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఆయన చేసిన మేలు వల్ల వేలాది మంది మైనార్టీ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. గతంలో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలకు దారితీసిన ఎన్ఆర్సీ, సీసీఐ వంటి నల్లచట్టాల తరహాలో ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియ సాగుతోందన్నారు. ఈ విషయంపై ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. భారతదేశంలో పుట్టి పెరిగినప్పటికీ ఆధార్, రేషన్కార్డులు, పాస్పోర్టు వంటి గుర్తింపు కార్డులు కాదని తల్లిదండ్రుల పాత ఓటు అడగడం సమంజసం కాదన్నారు. ఈ విచిత్ర నిబంధనల వల్ల వివిధ రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లు తొలగించారన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ముప్పన్నారు. తిరుపతిలో జరిగిన క్షేత్రస్థాయి పరిశీలనలో టీడీపీ, బీజేపీ, జనసేనకు చెందిన బీఎల్ఏలు ఎవరూ ప్రజలకు అందుబాటులో లేరన్నారు. కేవలం వైఎస్సార్సీపీ బీఎల్ఏలు మాత్రమే ఇంటింటికీ వెళ్తూ ఓట్ల వెరిఫికేషన్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటున్నారన్నారు. పీఎం విదేశాలకు వెళ్లినప్పుడు మైనార్టీలపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ స్వదేశంలో మ్రాతం సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 14వ తేదీ వరకు ఓట్ల వెరిఫికేషన్ అవకాశం ఉందన్నారు. ముస్లింలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రస్తుతం మసీదులు, ఉర్దూ పాఠశాలల్లో ప్రత్యేక క్యాంపులు నడుస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు ఉందో లేదో సరిచూసుకోవాలన్నారు. ఓటు లేనిపక్షంలో వెంటనే వైఎస్సార్సీపీ బీఎల్ఏలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. సమావేశంలో రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు సయ్యద్ హంజా హుస్సేని, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ సిద్ధిఖ్ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి నిర్వాకం..రోగులకు ఇక్కట్లు
●నెల్లూరు(అర్బన్): జిల్లాకు రెఫరల్ ఆస్పత్రిగా ఉన్న నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో కీలకమైన వైద్య పరీక్షలకు ఆటంకాలు ఏర్పడనున్నాయి. మెడికల్ కళాశాలకు అనుబంధంగా కొనసాగుతున్న మైక్రోబయాలజీ విభాగానికి చెందిన డిస్ట్రిక్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ (డీపీహెచ్ఎల్)ను ఆత్మకూరుకు తరలిస్తున్నారు. సిబ్బందితోపాటు యంత్ర పరికరాలను కూడా తీసుకెళ్తుండటంతో పెద్దాస్పత్రిలో రోగులకు అందుతున్న పలు రకాల వైద్య పరీక్షలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. అంత దూరం ఎలా వెళ్లాలి? 2013లో నెల్లూరు మెడికల్ కళాశాల ఏర్పాటు అయినప్పటి నుంచి మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో భాగంగా డీపీహెచ్ఎల్ పనిచేస్తోంది. ఇక్కడ రోజూ ఎన్నో రకాల రక్త పరీక్షలు, యూరిన్, బ్లడ్ కల్చర్ వంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం డీపీహెచ్ ల్యాబ్ను ఇతర ప్రాంతాలకు తరలించే ప్రక్రియలో భాగంగా ఆత్మకూరు ఆస్పత్రికి తీసుకెళ్తున్నారు. దీనిపై రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాము అంత దూరం ఎలా వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వం పెద్దాస్పత్రిలో కొత్త వసతులు కల్పించకపోగా ఇలాంటి చర్యలు తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖరీదైన పరీక్షలకు బయటకెళ్లాల్సిందే.. పెద్దాస్పత్రిలో రోజూ సుమారు 1,300 నుంచి 1,600 వరకు ఓపీ నమోదవుతోంది. ఇన్పేషెంట్లు 500 నుంచి 600 వరకు ఉంటున్నారు. పలు వ్యాధులకు సంబంధించి, ఆపరేషన్ల సమయంలో వైద్యులు అనేక రకాల రక్త పరీక్షలు సూచిస్తుంటారు. సీజనల్ వ్యాధులు ప్రబలే సమయంలో స్క్రబ్ టైఫస్, లెప్టోస్పైరోసిస్, డెంగీ (ఎలీసా) వంటి ఖరీదైన పరీక్షలు చేయాల్సి ఉంటుంది. అలాగే ఇన్ఫెక్షన్ తగ్గకపోతే బ్లడ్, యూరిన్ కల్చర్ పరీక్షలు కూడా అవసరమవుతాయి. ఇవన్నీ ఒకే రోగికి ఒక్కోసారి చేయాల్సి వస్తుంది. బయట చేయించుకోవాలంటే సుమారు రూ.4 వేలకు పైగా ఖర్చవుతుంది. ప్రస్తుతం వై – టెక్ ఆటోమేటిక్ అనే మెషినరీని తరలిస్తుండటంతో ఇలాంటి పరీక్షలన్నీ పేద రోగులు ప్రైవేట్ ల్యాబ్లలో డబ్బులు చెల్లించి చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. దీంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. పేరుకే పెద్దాస్పత్రిగా ఉన్నా కీలకమైన పరీక్షలు అందుబాటులో ఉండవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఏం చెబుతున్నారంటే.. మెడికల్ కళాశాలలు ఏర్పడక ముందు నెల్లూరులో జిల్లా ఆస్పత్రి ఉండేది. ఇదే విధంగా పాడేరు, ఏలూరు, ఒంగోలు ప్రాంతాల్లో కూడా జిల్లా ఆస్పత్రులుండేవి. అప్పట్లో డీపీహెచ్ ల్యాబ్ల ద్వారా మైక్రోబయాలజీ పరీక్షలు నిర్వహించేవారు. మెడికల్ కళాశాలలు ఏర్పడిన తర్వాత జిల్లా ఆస్పత్రుల భవనాలు, సిబ్బంది, మైక్రోబయాలజీ ల్యాబ్లను వాటికి అనుబంధంగా కొనసాగించారు. కాగా కళాశాల ఏర్పడి 13 ఏళ్ల తర్వాత ల్యాబ్ను ఆత్మకూరు ఆస్పత్రికి తరలించే చర్యలు చేపట్టారు. తరలింపు సమయంలో ఇక్కడ కొత్త మెషినరీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేయకపోవడం సమస్యగా మారుతోంది. కొత్త సౌకర్యాలు కల్పించకుండానే ఉన్నవాటిని తరలించడం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ వేలాది మంది వచ్చే పెద్దాస్పత్రిలోనే ఇలాంటి మెషినరీ ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని, లేకుంటే రోగులు తీవ్రంగా నష్టపోతారని వారు చెబుతున్నారు. పెద్దాస్పత్రిలో మైక్రోబయాలజీ మెషినరీ ఆత్మకూరుకు తరలింపు డెంగీ, స్క్రబ్, లెప్టోస్పైరోసిస్ వంటి ఖరీదైన పరీక్షలకు బ్రేక్ ఈ ప్రభుత్వంలో కొత్త సౌకర్యాలు నిల్ ఉన్నవాటికే ఎసరుప్రభుత్వం దృష్టికి ఇబ్బందులు మైక్రోబయాలజీలో ఉన్న మెషినరీని తరలించవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. ఇక్కడ కొత్తవి ఏర్పాటు చేశాక తరలించాలని కోరాం. రోగుల ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. – డాక్టర్ బెన్హర్, ఇన్చార్జి ప్రిన్సిపల్, ప్రభుత్వ మెడికల్ కళాశాల -
ఖాకీల మెడకు ‘దుశ్శాసన పర్వం’?
సాక్షి, టాస్క్ఫోర్స్: కావలి పట్టణం కచ్చేరిమిట్టలో గత నెల 19న స్థానిక వార్డు మాజీ కౌన్సిలర్, టీడీపీ తన వారితో కలిసి గిరిజన మహిళను వివస్త్రను చేసి విచక్షణా రహితంగా కొట్టిన ఘటన ఖాకీల మెడకు చుట్టుకోనుంది. రెండో పట్టణ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై గిరిజన సంఘ నేతలు, ఎమ్మెల్సీలు న్యాయపోరాటానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. కావలి టీడీపీ ముఖ్య నేత ఒత్తిడితో బాధితురాలిచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకపోగా, ఆమె కుమారుడిపై కౌంటర్ కేసు పెడతామని, ఈ కేసుతో అతనిపై గూండా యాక్ట్ పెడుతామని, రౌడీషీట్ ఓపెన్ చేస్తామని, కుటుంబానికి దక్కకుండా ఎన్కౌంటర్ చేస్తామని రాజీ పత్రం రాయించారని బాధితురాలు స్వయంగా మీడియా ముందు చెప్పడం తెలిసిందే. ఈ ఘటనను తొక్కి పెట్టడం, వారం రోజుల తర్వాత బాధితురాలి ఫిర్యాదుతోపాటు ఆమె కుమారుడిపై కౌంటర్ కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఇవి ఆరోపణలు మాత్రమే కాదని, నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ప్రైవేట్ కేసులతో కోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. అన్ని ఆధారాలతో ఎస్సీ, ఎస్టీ కమిషన్తోపాటు మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఇప్పటికే వైఎస్సార్సీపీ మహిళా నేతలు చెప్పడం విదితమే. రెండు రోజుల్లో కార్యాచరణ అమలు ఈ ఘటనను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. ఈ కేసు విషయంలో ఎందాకై నా న్యాయపోరాటం చేస్తామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ద్వారా చెప్పించారు. తాజాగా వైఎస్ జగన్ ఆదేశాలతో కాకాణి, రామిరెడ్డి ఆధ్వర్యంలో బాధిత గిరిజన మహిళకు అండగా నిలుస్తూ ఆమెకు న్యాయం జరిగే వరకు పోటారానికి సిద్ధమవుతూ ఆ పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు, మాజీ ట్రైకార్ చైర్మన్ (ఎస్టీ కార్పొరేషన్) గుండా సురేంద్ర, ఎమ్మెల్సీ, మాజీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవితోపాటు ఎస్టీ విభాగానికి చెందిన రాష్ట్ర, జిల్లా నేతలు గురువారం కావలికి తరలి వస్తున్నారు. ఘటనా స్థలం వీడియోలు, ఫొటోలతో కేసు దాఖలు చేయడంతోపాటు ఆ రోజు నుంచి స్టేషన్లోని ఫుటేజీలను పరిశీలించాలని కోరుతూ నివేదించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అట్టుడుకుతున్న కావలి గిరిజన మహిళను వివస్త్రను చేసిన ఘటనను వెలుగు చూడనీయకుండా స్థానిక వార్డు మాజీ కౌన్సిలర్ టీడీపీ ముఖ్యనేత అండతో పోలీసుల సహకారంతో రెడ్బుక్ వార్నింగ్లతో అడ్డుకోవడంతో ఆ వీధికే తెలిసిన సమాచారం మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డి వెల్లడించడం, సాక్షి పత్రిక బట్టబయలు చేయడంతో ఆ రోజు నుంచి పట్టణం మొత్తం పాకిపోవడంతో ఇదే విషయమై ఎక్కడికక్కడ చర్చించుకోవడం గమనార్హం. ప్రేమించడం నేరకాదు. ఒక వేళ వేధిస్తే సదరు యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలే కానీ, అతని తల్లిని వివస్త్రను చేసి దారుణంగా కొట్టి ఇది నేరం కాదనట్లు, ఆమెకు సంఘీభావం తెలిపిన సామాజిక మహిళ కార్యకర్త సీ శారదను, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిని తప్పు పట్టడాన్ని సైతం పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ ఘటనను ఎనిమిది రోజులుగా తొక్కిపెట్టడం, కేసు నమోదు చేసి ఐదు రోజులుగా ఈ విషయమై పోలీసులు తదుపరి చర్యలు తీసుకోకపోవడంతో వీరి వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని రోజులుగా నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తున్న తీరు వారి మెడకు చుట్టుకోక తప్పదని ప్రజాసంఘాల నేతలు అంటున్నారు. వివస్త్రను చేసిన ఘటనపై వారం తర్వాత బాధితురాలి కేసుతో పాటు కౌంటర్ కేసు నమోదు ఈ వ్యవహారంపై న్యాయపోరాటానికి గిరిజన సంఘ నేతలు, ఎమ్మెల్సీలు సిద్ధం ఘటనా స్థలంలో టీడీపీ నేతల పైశాచికంపై వీడియోలు, ఫొటోల సేకరణ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించాలని కోర్టుకు నివేదించాలని నిర్ణయం నేడు బాధితురాలికి వైఎస్సార్సీపీ గిరిజన సంఘ నేతలు, ఎమ్మెల్సీలు, కాకాణి, రామిరెడ్డి పరామర్శ వ్యక్తిగత హక్కులను కాలరాసిన పోలీసులు టీడీపీ ముఖ్య నేత చెప్పారని కావలి రెండో పట్టణ పోలీసులు ఈ కేసును నీరుగార్చేందుకు సామదాన దండోపాయాలను ప్రదర్శించారు. ఎట్టకేలకు ఈ విషయం బయటకు పొక్కడంతో విధిలేని పరిస్థితుల్లో కేసు నమోదు చేయడంతోపాటు బాధితురాలిని తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆమెకు సంబంధించిన వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు ఒరిజనల్స్ బయటకు తీసి సామాన్యులైన నిందితులకు అందజేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం నిందితులు, వారి తరఫున ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గిరిజన మహిళకు సంబంధించిన వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలను ఒరిజనల్స్ ప్రదర్శించారు. ఇది ఆమె వ్యక్తిగత స్వేచ్ఛను, హక్కులను కాలరాయడమే అని న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. -
చచ్చినా.. దక్కదు పింఛన్
నెల్లూరు (పొగతోట): చచ్చినా పింఛన్ రాదు.. ఈ వాక్యం చదవడానికి కష్టంగా ఉన్నా, ప్రస్తుత ప్రభుత్వ నిర్వాకంతో ఇది అక్షర సత్యంగా నిలుస్తోంది. సర్కార్ కొలువుదీరి రెండేళ్లు దాటినా, నేటికీ నూతనంగా ఒక్కటీ మంజూరు చేయలేదు. మరణించిన వారి కుటుంబాల్లో ఎవరికో అరకొరగా మంజూరు చేస్తూ చేతులు దులుపుకొంటోంది. వీటిని కొత్తగా అందుకోవాలనే ఆశతో దరఖాస్తు చేసుకునేందుకు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు నెలలుగా నిరీక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇలా 50 వేల మందికిపైగా వెయిట్ చేస్తున్నారంటే సమస్య తీవ్రత ఏమిటో ఇట్టే అర్థమవుతోంది. ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యథ బీవీనగర్కు చెందిన దివ్యాంగుడు రవిశంకర్ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు యత్నించినా, ప్రయోజనం శూన్యం. వెంకటేశ్వరపురానికి చెందిన నారాయణమ్మ భర్త మరణించడంతో, పెన్షన్ నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలు, సచివాలయాల చుట్టూ రెండేళ్లుగా ప్రదక్షిణలు చేస్తున్నా, ఇదే పరిస్థితి. ఇలాంటి వారు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నారు. సాకులు చూపుతూ.. కోతలు విధిస్తూ వివిధ కారణాలు చూపి పింఛన్లను తొలగించేందుకు కూటమి సర్కార్ కుయుక్తులు పన్నుతోంది. వైకల్య శాతాన్ని సాకుగా చూపి దివ్యాంగులకు.. విద్యుత్ బిల్లులు, ఇతర కారణాలను బూచిగా చూపుతూ వృద్ధులు, ఒంటరి మహిళలకు పింఛన్లను తొలగించేందుకు కుట్రలను రచిస్తోంది. దివ్యాంగులపైనా కర్కశం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో దివ్యాంగ శాతాన్ని అధికంగా నమోదు చేయించి పింఛన్లు మంజూరు చేశారనే కుట్ర కోణాన్ని తెరపైకి టీడీపీ తెచ్చింది. పరిశీలన అంటూ కొత్త నాటకానికి కూటమి సర్కార్ తెరలేపింది. ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ క్రమంలో వీరందరికీ నోటీసులిచ్చి ఇబ్బందులకు గురిచేశారు. ఫలితంగా దివ్యాంగులు, మంచానికే పరిమితమైన వారు, డయాలసిస్ బాధితులు.. డాక్టర్ల చుట్టూ తిరగలేక నానా అవస్థలు పడ్డారు. ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నాడంతా సజావుగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పింఛన్ల కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా సజావుగా అందజేసేవారు. అర్హత ఉండి ఇంటి దగ్గరే పూర్తి వివరాలను వలంటీర్ అప్లోడ్ చేస్తే కొత్తగా మంజూరయ్యేవి. అయితే ఇవేవీ ఇప్పుడు కానరావడంలేదు. లెక్కలకు.. వాస్తవానికి పొంతనేదీ..? అధికారుల లెక్క మేరకు జిల్లా వ్యాప్తంగా పింఛన్లు అందుకుంటున్న లబ్ధిదారుల్లో ప్రతి నెలా 500 నుంచి వెయ్యి మందికిపైగా మరణిస్తున్నారు. ఒకవేళ ఇలానే 1000 మంది మరణించినా, ఈ రెండేళ్లలో 24 వేల పింఛన్లనే తొలగించాలి. అయితే 32 వేలకుపైగా కోత విధించింది. ప్రతి నెలా వేల సంఖ్యలో తొలగిస్తూ.. కొత్తగా మంజూరు చేయకుండా కూటమి ప్రభుత్వం కుతంత్రాలు చేస్తోంది. గత టీడీపీ హయాంలో ఎవరైనా మరణిస్తే కొత్తగా మంజూరు.. అయితే నేడు.. కుటుంబాలకు దాన్నీ దూరం చేసి.. సర్కార్ కొలువుదీరిన రెండేళ్లలో నూతనంగా ఒక్కరికీ కేటాయించని వైనం కోతలు విధిస్తూ.. ఆర్భాటపు ప్రచారం చిల్లకూరులో సీఎం పంపిణీ చేయడంపై విస్మయం ఎలాంటి ఆదరవు లేకుండా ప్రభుత్వమిచ్చే పింఛన్ మొత్తంతోనే బతుకుబండినీడుస్తున్న ఎన్నో కుటుంబాలకు అంతులేని శోకాన్ని ప్రస్తుత కూటమి సర్కార్ మిగిలిస్తోంది. టీడీపీ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు దాటినా, నేటికీ ఒక్కటంటే ఒక్కటీ కొత్తగా మంజూరు చేయలేదు. పైగా ఉన్న వాటికి కోత విధిస్తూ.. తామేదో చేశామని గొప్పలు చెప్పుకొంటున్న తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి పుణ్యమానని ఎంతో మంది వీటిని పొందుతూ సంతోషంగా ఉండేవారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు కుటిల రాజకీయాలకు తెరలేపి అర్హుల సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతో రకరకాల కొర్రీలను తెరపైకి తీసుకొస్తున్న తీరుపై ప్రజానీకం భగ్గుమంటోంది. కొత్తగా మంజూరు చేస్తామని గత ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి.. ప్రస్తుతం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న ఈయన పింఛన్ల పంపిణీ నిమిత్తం చిల్లకూరుకు బుధవారం రావడంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ఇంత తేడానా..? వాస్తవానికి జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2024 జనవరిలో జిల్లా వ్యాప్తంగా 3,19,121 మంది లబ్ధిదారులు పింఛన్లను అందుకునేవారు. అయితే ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నాటికి ఈ సంఖ్యను 2,86,663కు కూటమి ప్రభుత్వం పరిమితం చేసింది. అంటే ఈ రెండేళ్లలో 32,458 మందిని తగ్గించి వారికి వేదనను మిగిల్చారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను మరింత తగ్గించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందనే సమాచారం కలవరాన్ని రేపుతోంది. -
కిట్టు.. రాదండీ ఒట్టు
పాఠశాలలను పునఃప్రారంభించి మూడు వారాలుగత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి.. సర్కారీ పాఠశాలల్లో అమలు చేసిన సంస్కరణలకు ప్రస్తుత ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. నాడు – నేడు.. అమ్మఒడి.. విద్యార్థులకు కిట్ల పంపిణీ.. ఇలా ప్రతి అంశంలోనూ అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ.. స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూళ్ల బాట పట్టేలా పరోక్ష సహకారాన్ని అందిస్తోంది. వారు వ్యవహరిస్తున్న ప్రతి అంశం ఈ వ్యవహారాన్ని తేటతెల్లం చేస్తోంది. వాస్తవానికి గతంలో స్కూళ్లు తెరిచిన రోజే విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను అందజేసి వారి ముఖంలో చిరునవ్వును నింపేవారు. అయితే ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు వారాలు గడుస్తున్నా, వీటిని ఇవ్వకుండా కర్కశ ధోరణిని కూటమి సర్కార్ అవలంబిస్తోంది. పర్యావసానంగా పిల్లలను బడిలో చేర్పించేందుకు గానూ అప్పుల కోసం పేరెంట్స్ పడుతున్న తిప్పలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. గత వైఎస్సార్సీపీ హయాంలో.. మొదటి రోజే జగనన్న విద్యాకానుక కిట్లు -
జైన్ గోల్డ్ వజ్రాభరణాల మేళా ప్రారంభం
నెల్లూరు(బృందావనం): నెల్లూరు ఆచారివీధి పాత జెడ్పీ ఆఫీస్ సెంటర్లో ఉన్న జైన్ గోల్డ్ షోరూంలో ‘జైన్ గోల్డ్ వజ్రాభరణాలు మేళా – 2026’ను మంగళవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మణిలాల్జైన్, నరేంద్రజైన్, శాశ్వత్జైన్ మాట్లాడారు. సుమారు 60 సంవత్సరాల నుంచి ఖాతాదారుల మన్ననలు పొందుతున్నట్లు చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే ఆభరణాలతో మేళాను నిర్వహిస్తున్నామన్నారు. ఇది ఈనెల 4వ తేదీ వరకు ఖాతాదారులకు అందుబాటులో ఉంటుందన్నారు. ప్రముఖ డిజైనర్లతో, నేటి, రేపటి తరానికి నచ్చే ఆభరణాలు రూపొందించి ఖాతాదారుల కోసం అందుబాటులో ఉంచామన్నారు. మొజాంబిక్ రూబీ డైమండ్ నెక్లెస్, పాన్మారకీస్ హారాలు, టెన్నిస్ బ్రాస్లెట్స్, ఎంగేజ్మెంట్ నుంచి కాక్టెయిల్ ఉంగరాలు వరకు, పాత రోజుల ఫ్యాషన్కు సంబంధించి అడిగా నెక్లెస్, పెండెంట్సెట్స్ ప్రదర్శన, అమ్మకానికి ఉంచామన్నారు. -
విషాద ప్రయాణం
సంగం: వారంతా నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండగకు సంతోషంగా బయలుదేరారు. అయితే అనుకోని ప్రమాదం విషాదం నింపింది. మండలంలోని తరుణవాయి సమీపంలో నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక మృతిచెందింది. యువతి తీవ్రంగా గాయపడింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతం నుంచి రొట్టెల పండగకు 20 మంది ట్రక్కు ఆటోలో బయలుదేరారు. ఇది తరు ణవాయి వద్దకు వచ్చింది. నెల్లూరు నుంచి వెళ్తున్న ఓ వాహనాన్ని బొగ్గు లారీ ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ట్రక్కు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న దేవగుడి కరిష్మా (16) అనే పదో తరగతి విద్యార్థిని అక్కడికక్కడే చనిపోయింది. రమీజా అనే యువతికి తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్ సిబ్బంది ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. లారీని డీసీపల్లి టోల్ప్లాజా వద్ద గుర్తించి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కరిష్మా నంద్యాల జిల్లా రుద్రవరం మండలం నర్సాపురంచాగలమర్రి ప్రాంతానికి చెందిన దేవగుడి మస్తాన్, సైదా దంపతుల కుమార్తెగా గుర్తించారు. ట్రక్కు ఆటోను ఢీకొట్టిన బొగ్గు లారీ బాలిక మృతి, యువతికి తీవ్ర గాయాలు రొట్టెల పండగకు వెళ్తుండగా జరిగిన ఘటన -
వైద్యులు.. ఆపద్బాంధవులు
● చికిత్స చేసి పునర్జన్మనిచ్చేది వారే.. ● నేడు డాక్టర్స్ డేనెల్లూరు(అర్బన్): రోగి ప్రాణాలను కాపాడటంలో వైద్యుల పా త్ర అమూల్యమైనది. వైద్య వృత్తి అనేది ఉద్యోగం కాదు. సేవా ధర్మం. పేద, ధనిక అనే తేడా లేకుండా రోగి ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా విసుగు, విరామం లేకుండా అంకిత భావంతో వైద్యం చేస్తారు. తెల్లని చొక్కా ధరించి చిరునవ్వుతో రోగిని పలకరిస్తారు. అలాంటి వారిని ప్రజలు దైవంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం జూలై ఒకటో తేదీన డాక్టర్స్ డే నిర్వహిస్తారు. రెండు వేల మంది జిల్లాలో క్లినిక్లు, ఆస్పత్రులు సుమారు వెయ్యి వరకు ఉన్నాయి. ప్రభుత్వపరంగా 52 పీహెచ్సీలు, 28 అర్బన్ హెల్త్ సెంటర్లు, 10 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, రెండు ఏరియా ఆస్పత్రులు, ఒక జిల్లా హాస్పిటల్తోపాటు జిల్లా కేంద్రంలో బోధనాస్పత్రి ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో సుమారు 2 వేల మంది డాక్టర్లు పని చేస్తున్నారు. కరోనా సమయంలో.. కరోనా మహమ్మారి సమయంలో డాక్టర్లు తమ ప్రాణాలు పణంగా పెట్టి ప్రజలకు సేవలందించారు. నెల్లూరు పెద్దాస్పత్రికి చెందిన ఇద్దరు డాక్టర్లు మృతిచెందారు. మరో జూనియర్ డాక్టర్ కూడా అలాగే చనిపోయాడు. పలు ప్రైవేట్ ఆస్పత్రులు కోవిడ్ సమయంలో తలుపులు వేసుకున్నా.. కాపాడింది మాత్రం ప్రభుత్వ వైద్యులేనని చెప్పొచ్చు. అక్కడక్కడా ప్రైవేట్ డాక్టర్లు కూడా నిజాయితీగా పని చేశారు. -
చైతన్యపై కేసులు రాజకీయ కక్ష సాధింపే..
● వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నెల్లూరురూరల్: వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యపై అక్రమంగా కేసులు నమోదు చేయడం దారుణమని, ఇది రాజకీయ కక్ష సాధింపేనని ఆ విభాగం జిల్లా అధ్యక్షుడు ముంగమూరు ఆశ్రిత్రెడ్డి విమర్శించారు. మంగళవారం నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజధాని ప్రాంత రైతుల ఆహ్వానం మేరకు ఉండవల్లి గ్రామానికి వెళ్లిన సీఆర్డీఏ రైతు పరిరక్షణ కమిటీ నాయకులు, చైతన్యపై ముందస్తు ప్రణాళికతో దాడులు జరిగాయని ఆరోపించారు. నాయకులపై తప్పుడు ప్రచారం చేసి, చైతన్యను లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్ చేశారన్నారు. విద్యార్థి సమస్యలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, డీఎస్సీ అవకతవకలు, వెల్ఫేర్ హాస్టళ్ల సమస్యలపై పోరాడినందుకే చైతన్యను టార్గెట్ చేస్తున్నారన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఆయన వెనక్కి తగ్గరని, పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. విభాగం రాష్ట్ర కార్యదర్శి నేలటూరి మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో వైఎస్సార్సీపీ నాయకులు తిరగకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. సిటీ అధ్యక్షుడు ఎండీ తౌఫిక్ మాట్లాడుతూ రాజధాని రైతులు మోసపోయామని గ్రహించి వైఎస్సార్సీపీని ఆశ్రయిస్తున్నారన్నారు. రైతుల పక్షాన నిలబడుతున్న చైతన్యపై రౌడీషీటర్ ముద్ర వేయాలని ప్రయత్నించడం దారుణమన్నారు. సమావేశంలో విద్యార్థి విభాగం నాయకులు అజయ్, శ్రీకృష్ణ, సతీష్బాబు, అహ్మద్, షోయబ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి
నెల్లూరు(వేదాయపాళెం): ఎల్నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యమైనప్పటికీ రైతులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి అధిక దిగుబడులు సాధించాలని ప్రకృతి వ్యవసాయం (ఏపీసీఎన్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయ్కుమార్ సూచించారు. నెల్లూరులోని ప్రకృతి వ్యవసాయం డీపీఎం కార్యాలయంలో ఫార్మర్ మాస్టర్ ట్రైనర్లతో మంగళవారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సీడ్ పెల్లైటెజేషన్, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానాలను ప్రతి గ్రామంలో అమలు చేయాలని సూచించారు. సీడ్ పెల్లైటెజేషన్ విధానం ద్వారా విత్తనాల మొలక శాతం పెరగడంతో పాటు తక్కువ తేమలోనూ మొక్కలు బలంగా పెరుగుతాయని తెలిపారు. ఈ విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.కన్నయ్య, రీజినల్ టెక్నికల్ కో ఆర్డినేటర్ సీహెచ్ రవిచంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. -
బోటు మనదే.. వేట మనదేనంటూ సీఎం ప్రగల్భాలు
● రెచ్చిపోతున్న తమిళనాడు, పాండిచ్చేరి మెకనైజ్డ్ బోట్లు ● గతంలో ఒకట్రెండే.. ఇప్పుడు పదుల సంఖ్యలో దండయాత్ర ● జీవనం కోసం నిత్య పోరాటంలో ఆంధ్రా జాలర్లు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఇకపై బోటు.. వేట.. సంపద మనదేనంటూ కావలి మండలం తుమ్మలపెంటలో మత్స్యకారుల జీవన భృతి విడుదల సందర్భంగా సినిమా స్టయిల్లో డైలాగ్లను సీఎం చంద్రబాబు ఇటీవల వదిలారు. తమ జీవితాలు, బతుకులను నాశనం చేస్తున్న పొరుగు రాష్ట్రాల బోట్లపై స్థానిక మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో నిర్బంధించిన పాండిచ్చేరి బోట్లను మంత్రి లోకేశ్ డైరెక్షన్లో.. టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు నేతృత్వంలో వదిలేశారు. ఈ ఉదంతంతో ఉడికిపోతున్న గంగపుత్రులను మభ్యపెట్టేందుకు ఆ మరుసటి రోజు నుంచే ఆంధ్రా తీరంలో పాండిచ్చేరి, తమిళ బోట్లపై వివిధ శాఖలతో వారం రోజులు గస్తీ చేపట్టారు. ఆ వెంటనే చేపల వేటపై నిషేధం అమల్లోకి రావడంతో గస్తీ టీమ్ వెనక్కొచ్చేసింది. ఈ క్రమంలో కావలికి చంద్రబాబు వచ్చి సాగర తీరంలో తంబీల దొంగాటలు సాగవని.. పోలీస్, మత్స్య, మైరెన్ తదితర శాఖల సిబ్బందితో నిరంతరం గస్తీ కాస్తున్నామంటూ గొప్పలు చెప్పారు. తిరిగి వేట ప్రారంభమైన అనంతరం పాండిచ్చేరి, తమిళ బోట్ల తీరం వెంబడి వేట సాగిస్తున్నా.. కట్టడి చేయలేక అధికారులు చేతులెత్తేశారు. ఇప్పుడు భారీగా.. గతంలో ఒకట్రెండు మెకనైజ్డ్ బోట్లతో వచ్చే పాండిచ్చేరి, తమిళనాడు జాలర్లు ఇప్పుడు పదుల సంఖ్యలో వస్తున్నా.. అధికార యంత్రాంగం ముఖం చాటేసింది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో నాలుగు బోట్లను నిర్బంధించిన ఆర్నెల్ల కాలంలో ఒక్క పడవ సైతం ఆంధ్రా తీరంపై వచ్చేందుకు సాహసించలేదు. అయితే వీటిని వదిలేసిన మరుసటి రోజు నుంచే రెట్టింపు స్థాయిలో తీరంవైపు దూసుకొస్తున్నాయని స్థానిక మత్స్యకారులు అప్పట్లోనే ఆందోళన వ్యక్తం చేశారు. తాజాగా వేట నిషేధం తర్వాత పదుల సంఖ్యలో బోట్లు రాష్ట్రంలోని తీరంలోకి ప్రవేశించి ఇక్కడి మత్స్య సంపదను దోచుకుంటున్నారు. అత్యాధునిక బోట్లతో మెరుపు వేగంతో సరిహద్దులు దాటొచ్చి గద్దల్లా తన్నుకుపోతున్నారు. ఇక్కడి మత్స్యకారులపై దాడులకూ తెగబడుతున్నారు. విలువైన వలలను ధ్వంసం చేస్తున్నారు. కడలూరు టు సూర్యలంక తమిళనాడులోని కడలూరు తీరం నుంచి రాష్ట్రంలోని బాపట్ల జిల్లా సూర్యలంక వరకు సుమారు 160 నాటికల్ మైళ్ల దూరం ఉంది. తిరుపతి జిల్లాలోని వాకాడులో గల గోవిందరావు పట్టపుపాళెం, జిల్లాలోని అల్లూరు మండలం ఇస్కపల్లి పట్టపుపాళెం, ప్రకాశం జిల్లా రామాయపట్నం, చాకిచర్ల పట్టపుపాళెం, ఊర్లపాళెం, పాకల పట్టపుపాళెం, టంగుటూరు మండలం తాళ్లపాళెం, కొత్తపట్నం బీచ్, మడనూరు ప్రాంతాల్లో దాడులకూ తెగబడుతున్నారు. నాలుగు బోట్లు మాయం మత్స్యకారులు తమ ప్రాణాలకు తెగించి పాండేచ్చేరికి చెందిన నాలుగు మెకనైజ్డ్ బోట్లను ఎనిమిది నెలల క్రితం పట్టుకున్నారు. వీటిని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఉంచారు. ఈ ఉదంతంపై ఎఫ్ఐఆర్లను పోలీసులు నమోదు చేశారు. అయితే టీడీపీ బడానేతలు రంగంలోకి దిగి మత్స్యకారుల పెద్దలతో డీల్ కుదుర్చుకొని వాటిని వదిలేశారు. ఈ పరిణామాంపై మత్స్యకారులు కన్నెర్ర చేశారు. దీని వెనుకున్న పెద్దలపై కసితో రగిలిపోయారు. వీరిని మత్స్యకారులు చితకబాది వారిపై దురాయి విధించి జరిమానా కట్టించుకున్నారు. తీర ప్రాంతం నెల పాటు అట్టుడికినా ప్రభుత్వం అటువైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మెహన్రెడ్డి జువ్వలదిన్నెలో పర్యటించి మత్స్యకారుల్లో భరోసా నింపారు. దీంతో బెంబేలెత్తిన ప్రభుత్వం కావలి మండలం తుమ్మలపెంటలో చంద్రబాబు పర్యటన పెట్టి మత్స్యకారులను బుజ్జగించేందుకు యత్నించారు. ఇకపై తమిళ తంబీల దొంగాటకు చెక్ పెట్టిస్తామని ప్రగల్భాలు పలికారు. అయితే హామీని అధికారులు నెరవేర్చలేదు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో కనీస చర్చలూ జరపలేదు. రెచ్చిపోతూ.. తమిళనాడులోని నాగపట్నం, కడలూరు, పాండిచ్చేరిలోని కారైకల్ తీర ప్రాంతాల నుంచి మత్స్య సంపద ఎగుమతవుతోంది. కొందరు వ్యాపారులు మత్స్యకారులను కూలీలుగా పెట్టుకొని అత్యాధునిక బోట్లు, వలలతో వచ్చి మత్స్య సంపదను కొల్లగొడుతున్నారు. ఇక్కడి జాలర్లను రెచ్చగొట్టే రీతిలో ప్రవర్తిస్తున్నారు. దాడులు చేస్తూ సంపదను దోచుకెళ్తున్నారు. వీరి బరితెగింపును అడ్డుకోలేక.. వేటను సాగించలేక జాలర్లు రగిలిపోతున్నారు. మోసం చేసిన కూటమి సర్కార్ ఇక్కడి మత్స్య సంపదను తమిళ జాలర్లు దోచుకెళ్తున్నారు. అడ్డుకోబోయిన మన వారిపై దాడులకు తెగబడుతున్నారు. కూటమి సర్కార్ చేసిన ద్రోహంతో గంగపుత్రులు రగిలిపోతున్నారు. వీరిని మభ్యపెట్టేందుకు.. మోసపూరితమైన సినిమా డైలాగ్లు చెప్పి.. చివరికి చేతులెత్తేశారు. వచ్చే నెలాఖరు వరకు సమయమిస్తున్నాం. ఈలోపు పక్క రాష్ట్రాలతో చర్చలు జరిపి తీర ప్రాంతంలోకి పాండేచ్చేరి బోట్లు రాకుండా చూడాలి. అలా కాని పక్షంలో ప్రభుత్వంతో పోరాటం చేస్తాం. – కొండూరు, అనిల్బాబు, ఆఫ్కాఫ్ మాజీ చైర్మన్ గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జువ్వలదిన్నె పిషింగ్ హార్బర్ను రూ.288.80 కోట్లతో చేపట్టి దాదాపు 90 శాతం మేర పూర్తి చేశారు. అప్పట్లోనే ప్రారంభానికి రంగం సిద్ధం చేశారు. అయితే మిగిలిన పనులను పూర్తి చేయకపోగా పట్టించుకోవడాన్ని టీడీపీ సర్కార్ మానేసింది. మత్స్యకారుల బోట్లకు పెట్రోల్ బంక్, చేపలను నిల్వ ఉంచుకునేందుకు కోల్డ్ స్టోరేజ్, ఐస్ ఫ్యాక్టరీలను నిర్మించాల్సి ఉంది. ఫిషింగ్ హార్బర్పై సర్కార్ నిర్లక్ష్యం హద్దులు మీరి.. వాస్తవానికి సముద్రంలో వేట సాగించేందుకు గానూ కొన్ని నిబంధనలను కేంద్ర మత్స్యశాఖ విధించింది. తీర ప్రాంత రాష్ట్రాల మధ్య సరిహద్దులు మీరకూడదనే ఆంక్షలున్నాయి. ఈ మేరకు సాధారణ తెప్పలు, బోట్లతో తీరం నుంచి 8 కిలోమీటర్ల (ఐదు నాటికల్ మైళ్లు) వరకు వేట చేసుకోవచ్చు. బోట్ల సామర్థ్యాన్ని బట్టి మరింత ముందుకూ వెళ్లొచ్చు. ఇంజిన్ బోట్లయితే 23 కిలోమీటర్ల (12 నాటికల్ మైళ్లు) అవతలే వేట చేసుకోవాలి. అయితే తమిళ జాలర్లు అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటొస్తున్నారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని మత్స్యకారులు వేట సాగించే చిన్న బోట్లు, తెప్పలను ఢీకొని వారి మత్స్య సంపదను దోచేస్తున్నారు. -
బాబూ.. చెన్నూరు గుర్తుందా..?
చెన్నూరు గ్రామ వ్యూ ●రాష్ట్ర విభజనానంతరం జరిగిన తొలి ఎన్నికల్లో గెలిచి సీఎం హోదాలో చెన్నూరుకు చంద్రబాబు విచ్చేశారు. ఆ ఎలక్షన్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలుపొందిన ప్రజాప్రతినిధి ఆయన మాయలో పడి అధికారం కోసం పార్టీ ఫిరాయించి టీడీపీ పంచన చేరారు. పార్టీ అధినేతను గూడూరు నియోజకవర్గానికి తీసుకొచ్చి తన ఇమేజ్ను పెంచుకోవాలనే ఉద్దేశంతో జన్మభూమి మూడో విడత కార్యక్రమాన్ని అస్త్రంలా వాడేందుకు పన్నాగం పన్నారు. ఇందులో భాగంగా చెన్నూరును ఎంపిక చేసి భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన చంద్రబాబు ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని మోడల్ విలేజ్గా మారుస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించారు. దీంతో తమ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని స్థానికులు ఆశించారు. అయితే ఇది జరిగి తొమ్మిదేళ్లయినా, ఇందులో ఏదైనా జరిగిందానంటే శూన్యమనే చెప్పొచ్చు. ఈ పరిణామాలతో గ్రామస్తులు ఉసూరుమంటున్నారు. పంచాయతీ: చెన్నూరు (మున్సిపాల్టీలో నేడు విలీనం) హామీలిచ్చిన తేదీ – జనవరి పది, 2017 జనాభా – 15 వేలు చేనేతలు: ఐదు వేలు ఎస్సీ, ఎస్టీలు – దాదాపు ఏడు వేలు ఇతరులు – సుమారు మూడు వేలు చిల్లకూరు: హామీలివ్వడం.. ఆపై వీటిని విస్మరించడం సీఎం చంద్రబాబుకే చెల్లుతుంది. 2014 – 19 మధ్య ఇదే తరహాలో వ్యవహరించి ఎంతో మందికి అంతులేని ఆవేదనను మిగిల్చారు. తాజాగా సూపర్ సిక్స్ పేరిటా ఎంతో మందిని వంచించారు. ఇదే కోవలో ఏకంగా గ్రామస్తులనే నమ్మించి దగా చేసిన ఉదంతానికి తొమ్మిదేళ్లు దాటుతోంది. అతీగతీ లేని భూగర్భ డ్రైనేజీ నీటి నిల్వ ఒట్టి మాట.. రెండో హామీ కింద భూగర్భ డ్రైనేజీ అని ప్రకటించారు. గ్రామంలోని సుమారు ఐదు వేల ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాలతో పాటు వర్షం కురిసే సమయంలో వచ్చే నీరు రోడ్లపై పారకుండా దీన్ని ఏర్పాటు చేసి పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తామని ప్రకటించారు. అయితే దీనికి సంబంధించిన ప్రతిపాదనలను సర్కార్కు అందించకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసి గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. మొదటి హామీలో భాగంగా ఐదు వేల ఎకరాల ఆయకట్టు ఉన్న చెన్నూరులో వెయ్యెకరాల విస్తీర్ణంలోని చెరువును తెలుగుగంగ నీటితో ఏడాది మొత్తం నిల్వ ఉండేలా చర్యలు చేపడతామని ఆర్భాటంగా ప్రకటించారు. అయితే ఇది నేటికీ కార్యరూపం దాల్చలేదు. నియోజకవర్గం: గూడూరు 21చెన్నూరు సిల్క్తో ప్రపంచ గుర్తింపు గూడూరుకు అతి సమీపంలో ఉండే చెన్నూరులోని చేనేతలు 80వ దశకం వరకు తయారు చేసిన సిల్క్కు మంచి గిరాకీ ఉండేది. ఆనాడు ఇక్కడి స్కిల్ చొక్కాను ధరిస్తే ఆ కుటుంబానికి ఒక హోదా ఉండేదని భావించేవారు. ఈ స్థాయిలో గుర్తింపు పొందిన గ్రామాన్ని తన దత్తత గ్రామంగా జనవరి పది, 2017న చంద్రబాబు ప్రకటించారు. గ్రామాన్ని దత్తత తీసుకుంటామని ఆర్భాటంగా ప్రకటన సూపర్ సిక్స్ తరహాలో నాడే ఆరు హామీలు ఇందులో అమలైంది శూన్యం విస్మరించిన ముఖ్యమంత్రి ఇప్పుడైనా కరుణిస్తారానని స్థానికుల ఆశ -
వైఎస్ జగన్తో పర్వతరెడ్డి భేటీ
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి, పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత అంశాలు, నియోజకవర్గ పరిణామాలతోపాటు పలు కీలక అంశాలపై చర్చించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్ పారా లీగల్ వలంటీర్లకు అవగాహన సదస్సు నెల్లూరు (లీగల్): ప్రజా ప్రయోజిత, న్యాయసేవలపై పారాలీగల్ వలంటీర్ల (న్యాయసేవా సహాయకులు)కు అవగాహన సదస్సును జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా భవన్లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా లోక్అదాలత్ శాశ్వత న్యాయమూర్తి రామశ్రీనివాసరావు మాట్లాడారు. సామాన్య ప్రజలు.. న్యాయ వ్యవస్థకు మధ్య వారధిగా పనిచేసే వారే పారా లీగల్ వలంటీర్లని చెప్పారు. న్యాయ సాయం కోసం వచ్చే బాధితులకు కౌన్సెలింగ్ చేస్తూ ఉచిత న్యాయసేవల సంస్థలను ఆశ్రయించేలా కృషి చేయాలని సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పద్మశ్రీ, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ గోపాల్రెడ్డి, లోక్ అదాలత్ సభ్యులు కోటేశ్వరరావు, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. వందేభారత్ వేళల్లో స్వల్ప మార్పులు నెల్లూరు సిటీ: చైన్నె సెంట్రల్ నుంచి నరసాపూర్ (20677) మధ్య నడిచే వందేభారత్ వేళల్లో స్వల్ప మార్పులను రైల్వే అధికారులు చేశారు. గతంలో నెల్లూరు రైల్వేస్టేషన్కు ఉదయం 8.29కు వచ్చి 8.30కు బయల్దేరేది. తాజాగా సవరించిన మేరకు బుధవారం నుంచి 8.41కు చేరుకొని 8.42కు బయల్దేరనుంది. -
దుశ్శాసనపర్వానికి ‘రెడ్బుక్’ రక్షణ
● కొడుకు ప్రేమిస్తే.. తల్లిని వివస్త్ర చేసి కొట్టడం నేరం కాదా..? ● గిరిజన మహిళపై దాష్టీకంలో నిందితుల రక్షణకే కౌంటర్ కేసు ● కులం, మతం పేరుతో పోలీస్, రెవెన్యూ శాఖ ఆపసోపాలు సాక్షి టాస్క్ఫోర్స్: కావలి పట్టణం కచ్చేరిమిట్టలో టీడీపీ నేతలు గిరిజన మహిళపై సాగించిన దుశ్శాసనపర్వాన్ని వెలుగు చూడనీయకుండా అధికార పార్టీ ముఖ్యనేత కనుసన్నల్లో పోలీసులు వ్యూహాత్మకంగా సమాధి చేసేందుకు ‘రెడ్బుక్’ వార్నింగ్కు తెగబడ్డారు. గత నెల 19వ తేదీ రాత్రి ఘటన జరిగితే.. వారం తర్వాత 26వ తేదీ హడావుడిగా బాధితురాలి కేసుతోపాటు ఆమె కుమారుడిపై కౌంటర్ కేసు నమోదు చేయడం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి కావలి పట్టణంలో ఈ దారుణం జరిగినా.. బయటకు పొక్కనీయకుండా అధికార బలంతో తొక్కిపెట్టారని వెల్లడించడంతో ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని పోలీసులు రెండు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ఈ కేసును అడ్డు పెట్టుకుని గిరిజన మహిళను వివస్త్రను చేసి, కులం పేరుతో దూషించిన కేసును కోర్టు వరకు వెళ్లనీయకుండా నిందితులకు రక్షణ కల్పించేందుకు రాజీ చేయాలని భావించే ఆమె కుమారుడిపైనా కేసు బనాయించారని స్పష్టమవుతోంది. పోలీసుల బరితెగింపు కొడుకు ప్రేమిస్తే తల్లిని వివస్త్ర చేసి విచక్షణారహితంగా కొట్టడం నేరం కాదనే రీతిలో పక్షపాతంగా కావలి పోలీసులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. బాధితురాలే స్వయంగా తనను పోలీసులు ఏ విధంగా బెదిరించారో మీడియా ముందు స్పష్టం చేసింది. తనను వివస్త్రను చేసి, కొట్టినట్లు విషయం బయటకు వస్తే నీ కొడుకుపై కూడా కేసు ఉంది.. అతనిపై గూండా యాక్ట్ పెడతామని, రౌడీషీట్ ఓపెన్ చేస్తామని, కుటుంబానికే దక్కకుండా ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారని చెబుతోంది. నిందితులు మీడియా సమావేశంలో పోలీసుల అండదండలతోనే బతుకుతున్నామంటూ చెప్పడం చూస్తే వారికి పోలీసుల రక్షణ ఉందనే వాస్తవ పరిస్థితిని స్పష్టం చేసింది. దీన్ని బట్టి దుశ్శాన పర్వానికి అధికార పార్టీ ముఖ్య నేత ఆదేశాలతోనే పోలీసులు రెడ్బుక్ వార్నింగ్తో సమాధి కట్టేశారని అర్థమవుతోంది. ఈ ఉదంతంలో పోలీసులు నమోదు చేసిన ఈ రెండు కేసులే ఇందుకు అద్దం పడుతున్నాయి. ఈ ఘటన జరిగి 12 రోజులు దాటినా.. ఈ వ్యవహారంలో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తే ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. కేసు తారుమారుకు ఆపసోపాలు గిరిజన మహిళకు జరిగిన అవమాన ఉదంతం తెలిసిన కావలి పట్టణ ప్రజలు ఓ పక్కన ఛీకొడుతుంటే.. మరో పక్కన పోలీసులు రెవెన్యూ అధికారులతో కలిసి కేసు తారుమారు చేసేందుకు కులం, మతం పేరుతో ఆపసోపాలు పడుతున్నారు. ఆమెకు సంబంధించిన కులం, మతం, ఆధార్, ఓటరుకార్డులు ఇలా వ్యక్తిగతమైన ఒరిజనల్ సర్టిఫికెట్లను బయటకు తెచ్చారు. ‘కులం’ పుట్టుకతోనే నిర్ణయించబడుతుందని, అనుసరిస్తుందనే కీలక న్యాయసూత్రాన్ని విస్మరించి.. బాధితురాలు ముస్లింగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం దారుణమని న్యాయవిజ్ఞలు అభిప్రాయపడుతున్నారు. మహిళ కులాంతర, మతాంతర విహహం చేసుకున్నంత మాత్రాన ఆమె జన్మతః కులం మారదని సుప్రీం కోర్టు చెబుతుందని అంటున్నారు. సహజ న్యాయసూత్రాలకు భిన్నంగా ఆమె కులాన్ని, మతాన్ని మార్చేసి కేసును నీరుగార్చేందుకు పోలీసులు, రెవెన్యూ కుట్రలు చేస్తున్నారనే ఆరోపణలకు జరుగుతున్న పరిణామాలు బలం చేకూర్చుతున్నాయి. బాధితురాలికి ప్రజామద్దతు పెరుగుతున్న నేపథ్యంలో కేవలం అనుకూల మీడియాతో ప్రెస్మీట్ పెట్టించి సరికొత్త డ్రామాలకు డైవర్షన్ రాజకీయాలకు తెర తీశారనే ప్రచారం జరుగుతోంది. ఎస్టీ కమిషన్, మానవహక్కుల సంఘానికి ఫిర్యాదులు..? గిరిజన మహిళకు జరిగిన అన్యాయంపై వీడియో ఆధారాలతో ఎస్టీ కమిషన్తోపాటు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదులు చేసేందుకు గిరిజన సంఘాలు సిద్ధమవుతున్నాయని సమాచారం. ఒకటి.. రెండు రోజుల్లో కావలికి తరలివచ్చి.. బాధితురాలిని పరామర్శించి తమ మద్దతును ప్రకటిస్తారని సమాచారం. -
అగ్నిమాపక శాఖ ఏర్పాట్లపై ఆరా
నెల్లూరు(క్రైమ్): రొట్టెల పండగ సందర్భంగా బారాషహీద్ దర్గా ఆవరణలో అగ్నిమాపక శాఖ చేపట్టిన ఏర్పాట్లను ఆ శాఖ డైరెక్టర్ డి.మురళీమోహన్ సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. భద్రతాపరంగా తీసుకుంటున్న చర్యలపై ఆయన సమీక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో ఫైర్ ఇంజిన్లు వేగంగా ఘటనా స్థలానికి చేరుకునేలా మార్గాల్లో తోపుడు బండ్లు, ఇతర అడ్డంకుల్లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. ఆయన వెంట జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి వాకా శ్రీనివాసరెడ్డి, సిబ్బంది ఉన్నారు. మిద్దైపె వాకింగ్ చేస్తూ..● కిందపడి వృద్ధుడి మృతి నెల్లూరు(క్రైమ్): ఇంటి మిద్దైపె వాకింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడిన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు సరస్వతి నగర్లో శ్రీనివాసులురెడ్డి (73) నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలంగా మెడనొప్పితో బాధపడుతున్నాడు. రాత్రివేళ నిద్రలో మెలకువ వచ్చినప్పుడు ఇంటి వరండాలో, మిద్దైపె వాకింగ్ చేయడం అలవాటు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున నిద్రలేచిన శ్రీనివాసులురెడ్డి భార్యను లేపి కొబ్బరినీళ్లు తాగారు. నిద్రరావడం లేదని మిద్దైపెకి వెళ్లి వాకింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మొదటి అంతస్తు పైనుంచి కింద వరండాలో పడిపోయాడు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని శ్రీనివాసులురెడ్డిని 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పంట కాలువలో మృతదేహంఅల్లూరు: మండలంలోని అల్లూరు ప్రధాన రహదారి బోడిసత్రం గ్రామం సమీపంలో పంట కాలువలో సోమవారం ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పరిశీలించారు. మృతుడిని అల్లూరు తూర్పువీధికి చెందిన చిక్కిరేణి వెంకట సుబ్బయ్య (40)గా గుర్తించారు. అతను బియ్యం స్టోర్లో కూలీ పని చేస్తున్నాడు. భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఏమైందో గానీ కాలువలో విగతజీవిగా కనిపించాడు. అనుమానాస్పదగా మృతిగా కేసు నమోదు చేశారు. నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.50 సన్నవి : రూ.20 పండ్లు : రూ.10 -
ఆర్థిక లావాదేవీలతోనే వ్యక్తి హత్య
● నిందితుడి అరెస్ట్ ఉదయగిరి: వింజమూరు మండలం ఊటుకూరుకు చెందిన దేవరకొండ గోవిందులు హత్య కేసులో నిందితుడు షేక్ జలీల్ను అరెస్ట్ చేశారు. ఉదయగిరి సీఐ ఎన్.వెంకట్రావు స్థానిక కార్యాలయంలో సోమవారం వివరాలను వెల్లడించారు. గోవిందులు ఈనెల 20వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. పక్కరోజు అతని భార్య నాగరత్తమ్మ వింజమూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 24న దుత్తలూరు మండలం గుండెమడుగల అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహం గోనెసంచిలో ఉన్నట్లు బీట్ అధికారి ఓంప్రకాశ్ పోలీసులకు సమాచారమివ్వగా వెళ్లి పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా జలీల్ అనే వ్యక్తి ఊటుకూరు సమీపంలో కౌలుకు నిమ్మ తోటలు సాగు చేస్తున్నట్లు గుర్తించారు. గోవిందులు, నాగరత్తమ్మ ఆ తోటలో కూలీలుగా పనిచేస్తున్నారు. జలీల్.. గోవిందుల వద్ద కొంత నగదు అప్పుగా తీసుకున్నాడు. తిరిగి చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. గోవిందులను హత్య చేయాలని జలీల్ నిర్ణయించుకున్నాడు. 20వ తేదీన తన తోటలో పనిచేసే రమణయ్య ద్వారా గోవిందులును రప్పించాడు. తోటలో అప్పు విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పథకం ప్రకారం జలీల్ గడ్డపారతో గోవిందులు తలపై కొట్టి హత్య చేశాడు. మృతదేహాన్ని గోనెసంచిలో ఉంచి అటవీ ప్రాంతంలో పడేశాడు. నాగరత్తమ్మ ఇచ్చిన సమాచారంతో జలీల్ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఈ ఘటనలో జలీల్కు సహకరించిన రమణయ్య పరారీలో ఉన్నాడని, అతడిని త్వరలో అరెస్ట్ చేస్తామని సీఐ తెలిపారు. -
కష్టాలు.. కన్నీటి సుడులు
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● వినతులు అందజేసిన ప్రజలునెల్లూరురూరల్: కాళ్లరిగేలా తిరుగుతున్నా సమస్యలకు పరిష్కారం మాత్రం దొరకడం లేదని పలువురు అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి దూర ప్రాంతాల నుంచి అనేకమంది తరలివచ్చారు. డీఆర్వో విజయ్కుమార్, డిప్యూటీ కలెక్టర్లు కేశవర్ధన్రెడ్డి, వంశీకృష్ణ, సర్వే ల్యాండ్ రికార్డుల డీడీ నాగశేఖర్ తదితరులు వినతులు స్వీకరించారు. మెరుగైన వసతులు కల్పించాలి బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు హాస్టళ్లలో మెరుగైన వసతులు, భద్రత కల్పించాలని ఆలిండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యునైటెడ్ ఫోరం సామాజిక కార్యకర్తలు కోరారు. ఏలూరు జిల్లాలోని ఎస్సీ బాలికల హాస్టల్లో జరిగిన ఘటనను ఫోరం నాయకులు తీవ్రంగా ఖండించారు. దుప్పటి కావాలని అడిగిన బాలికను అర్ధరాత్రి సమయంలో హాస్టల్ నుంచి బయటకు పంపించిన ఘటన బాధాకరమన్నారు. కార్యక్రమంలో డి.పద్మజ, వి.రాజమ్మ, ఉషారాణి, ప్రభావతి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మామిడి, పొగాకు రైతుల సమస్యలపై.. జిల్లాలో మామిడి, పొగాకు ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆదుకోవాలని బీజేపీ నాయకుడు మిడతల రమేష్ డిమాండ్ చేశారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ సుమారు 25 వేల ఎకరాల్లో మామిడి, 45 వేల ఎకరాల్లో పొగాకు సాగు చేసిన రైతులు నష్టాల్లో ఉన్నారని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, పరిశ్రమల కొనుగోళ్లు తగ్గడంతో మామిడి ధరలు పడిపోయాయని పేర్కొన్నారు. ప్రభుత్వం కిలో పొగాకును రూ.200కు తగ్గకుండా కొనుగోలు చేస్తామని ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం సగటున రూ.160కే కొనుగోళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో నరాల సుబ్బారెడ్డి, చిట్టిబాబు, ఆదినారాయణ, అల్లూరు నాగేంద్రసింగ్, ఏవీ సుబ్బయ్య, ముజీబ్, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. శ్మశాన భూమి ఆక్రమణ ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామంలోని శ్మశాన భూమి ఆక్రమణలను తొలగించాలంటూ గ్రామస్తులు బీజేపీ ఆధ్వర్యంలో డీఆర్వో విజయ్కుమార్కు వినతిపత్రం అందజేశారు. కొందరు పెత్తందారులు భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. పనిభారం తగ్గించాలంటూ.. అంగన్వాడీ కార్యకర్తలపై అదనపు పనిభారాన్ని తగ్గించాలని సీఐటీయూ నగర కార్యదర్శి జి.నాగేశ్వరరావు, గౌరవాధ్యక్షురాలు రెహనా బేగం, కార్యదర్శి సుజాతమ్మ డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ జనగణన విధులను అంగన్వాడీలపై అదనపు భారంగా మోపుతున్నారన్నారు. ఇప్పటికే ఇచ్చిన ట్రైనింగ్లు, డ్యూటీలను రద్దు చేయాలని కోరారు. కుమ్మర మాన్యం ఆక్రమణ మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని 3.32 ఎకరాల కుమ్మర మాన్యం భూమిని కాపాడాలని ఆంధ్రప్రదేశ్ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షులు పెళ్లూరు సుమన్ ప్రజాపతి డిమాండ్ చేశారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ చాలా ఏళ్లుగా కుమ్మర కులస్తుల ఆధీనంలో ఉన్న ఈ భూమికి సంబంధించి అల్లంపాటి వేణుగోపాల్రెడ్డి, ఆయన తండ్రి చిన్నారెడ్డి రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లు నమోదు చేసుకుని పాస్ పుస్తకాలు పొందారని ఆరోపించారు. తహసీల్దార్ను సంప్రదించగా కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారని పేర్కొన్నారు. న్యాయం చేయాలని కోరుతూ జూలై 8న మర్రిపాడు రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో మోచర్ల మధు ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు.ృ సమస్యలు పరిష్కరించాలంటూ.. విద్యుత్ శాఖ ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ అనుబంధ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్నారు. ఎనర్జీ అసిస్టెంట్లకు జేఎల్ఎం, జేఎల్ఎంలకు ఏఎల్ఎం పదోన్నతుల హామీలను అమలు చేయాలన్నారు. విద్యుత్ సబ్స్టేషన్ల ప్రైవేటీకరణ ప్రయత్నాలను నిలిపివేయాలని, ఉద్యోగులకు బీమా సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జాకీర్ హుస్సేన్, ప్రసాద్, జి.నాగయ్య, సుమన్, గిరిబాబు, హరి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఏఐఎంఎస్ యాప్ రద్దుకు డిమాండ్ రైతులకు ఎరువుల సరఫరాలో ఇబ్బందులు కలిగిస్తున్న ఏపీ ఏఐఎంఎస్ యాప్ను వెంటనే రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యాప్ అమలుతో రైతులకు అవసరమైన యూరియా సకాలంలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కౌలు రైతుల వివరాలు యాప్లో సరిగా నమోదు కాకపోవడంతో వారు భూ యజమానులపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. ప్రస్తుతం 15 రోజులకు ఒకసారి ఇస్తున్న ఎరువులను వారానికి ఒకసారి అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తుళ్లూరు గోపాల్, మూలివెంగయ్య, జనార్ధన్, పుల్లయ్య, వెంకటరామరాజు తదితరులు పాల్గొన్నారు. -
బాధిత మహిళకు న్యాయం చేయాలి
● వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ డిమాండ్ నెల్లూరురూరల్: కావలిలో మహిళపై జరిగిన దారుణం సభ్య సమాజం తలదించుకునేలా ఉందని, నిందితులపై చర్యలు తీసుకుని ఆమెకు న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు పోతురాజు చంద్రశేఖర్ అన్నారు. సోమవారం నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి ఒత్తిళ్లకు తావు లేకుండా పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి, వాస్తవాలను వెలికితీయాలని కోరారు. బాధితురాలికి పూర్తి రక్షణతోపాటు వైద్య, న్యాయ సహాయం అందించాలని కోరారు. రాష్ట్ర ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీ బదనాపురి గోపాల్ మాట్లాడుతూ మహిళలను అవమానించే ఇలాంటి ఘటనలు సమాజానికి మచ్చ అన్నారు. ఈ కేసులో చట్టాన్ని ఉల్లంఘించిన వారెవరైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళకు వైఎస్సార్సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. సమావేశంలో నెల్లూరు రూరల్ మహిళా అధ్యక్షురాలు పోతురాజు రమాదేవి, మురళి తదితరులు పాల్గొన్నారు. -
నానాజీ దిగజారుడు వ్యాఖ్యలపై ఆగ్రహం
● పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నాయకులు చిల్లకూరు: కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటుగా వ్యక్తిగత దూషణలకు దిగడం సరైన పద్ధతి కాదని ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు సనత్ నగర్లో ఉన్న పార్టీ కార్యాలయం నుంచి సోమవారం ఎమ్మెల్సీ, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్, నాయకులు ఒకటో పట్టణ పోలీస్స్టేషన్కు చేరుకుని ఎస్సై శిరీషాకు నానాజీపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా ఉన్న నానాజీ దిగజారి మాట్లాడటం దారుణమన్నారు. వైఎస్సార్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన నానాజీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు బొమ్మిడి శ్రీనివాసులు, షేక్ సుభాన్, అన్నం మురళి, పూర్ణచంద్ర, జోగి వినోద్, కార్ల దీప్తి, బుజ్జా మాధవ్, సర్వేపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఉదయగిరిలో.. ఉదయగిరి: పంతం నానాజీపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీస్స్టేషన్లో వైఎస్సార్సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. అనంతరం స్టేషన్ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమైన నేతలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందన్నారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలపై తప్పుడు కేసులు మోపి స్టేషన్లకు పిలిపించి చిత్రహింసలు పెడుతున్నారని చెప్పారు. ఇసుక, మట్టి, విలువైన ఖనిజ సంపదను దోచేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టడం ఖాయమని, అప్పుడు తప్పు చేసిన అధికారులతోపాటు, టీడీపీ నేతలకు తగిన గుణపాఠం చెబుతామన్నారు. కార్యక్రమంలో నేతలు పల్లాల కొండారెడ్డి, షేక్ అలీ అహ్మద్, దస్తగిరి అహ్మద్, ఏంఏ సలీమ్, దస్తగిరి అహ్మద్, అక్కి భాస్కర్రెడ్డి, ఆర్.శ్రీనివాసరెడ్డి, చింతంరెడ్డి సుబ్బారెడ్డి, మందలపు తిరుపతి నాయుడు, కాటం రవీంద్రరెడ్డి, ఇర్మియా, వై.ప్రభాకర్రెడ్డి, చెన్నరాయుడు, జక్కం శ్రీనివాసరెడ్డి, బాలగురువయ్య తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో 99.41 శాతం పల్స్పోలియో నమోదు
నెల్లూరు(అర్బన్): జిల్లాలో 99.41 శాతం పల్స్పోలియో నమోదైనట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ సుజాత తెలిపారు. జిల్లాలో ఐదేళ్లలోపు 2,67,750 మంది చిన్నారులుండగా తొలిరోజు ఆదివారం 2,54,510 మందికి పల్స్పోలియో చుక్కలను వేసి 95.05 శాతం లక్ష్యాన్ని సాధించారు. రెండో రోజు సోమవారం ఇంటింటి సర్వే ద్వారా మరో 12,045 మందికి చిన్నారులకు పల్స్పోలియో చుక్కలను వేసి మరో 4.99శాతం నమోదు చేశారు. రెండు రోజులకు కలిపి 2,66,180 మందికి చుక్కలు వేసి 99.41శాతం ప్రగతి సాధించారు. మంగళ వారం కూడా ఇంటింటి సర్వే కొనసాగించి 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేయనున్నట్లు డీఎంహెచ్ఓ తెలిపారు. 7 నుంచి విద్యుత్ ఉద్యోగుల క్రీడా పోటీలు నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఏపీ ట్రాన్స్కో వారి ఉత్తర్వుల మేరకు 2026–27 సంవత్సరానికి సంబంధించిన స్పోర్ట్స్ క్యాలెండర్ ప్రకారం ఇంటర్ సర్కిల్ క్యారమ్స్, చెస్, బాల్బ్యాడ్మి ంటన్ పోటీలను జూలై 7 నుంచి 9వ తేదీ వరకు నెల్లూరుక్లబ్లో నిరహించనున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ నెల్లూరు స్పోర్ట్స్, గేమ్స్ సెక్రటరీ రామస్వామి వేలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ క్రీడా పోటీలకు సంబంధించి విద్యుత్ ఉద్యోగుల ఎంపికలను జూలై 1న విద్యుత్ భవన్లో నిర్వహించనున్నట్లు చెప్పా రు. ఆసక్తి కలిగిన విద్యుత్ ఉద్యోగులు ఎంపికలకు హాజరుకావాలని కోరారు. వివరాలకు 90308 02038, 98660 70775, 995129 4829, 9848714330 నంబర్లను సంప్రదించాలని సూచించారు. రేపట్నుంచి సోమశిలలో చేపల వేట నిషేధం సోమశిల: సోమశిల జలాశయంలో జూలై 1 నుంచి రెండు నెలల పాటు చేపల వేటను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఎఫ్డీఓ సుధీర్ తెలిపారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో స్థానిక జాలర్లు, చేపల వ్యాపారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్డీఓ మాట్లాడుతూ చేపలు గడ్లు పెట్టే సమయాన్ని దృష్టిలో ఉంచుకుని జలాశయంలో చేపల వేటను నిషేధించినట్లు తెలిపారు. నిషేధ కాలంలో జలాశయ పరిసర ప్రాంతాల్లో వలలతో సంచరించడం, చేపలు పట్టడం, విక్రయించడం చట్టవిరుద్ధమన్నారు. నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా చేపల వేటకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, పడవలు, వలలను సైతం సీజ్ చేస్తామని హెచ్చరించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం నెల్లూరు (టౌన్) : జిల్లాలోని ఆసక్తి కలిగిన ఉపాధ్యాయులు వచ్చే నెల 10వ తేదీలోపు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యా శాఖాధికారి ఆర్ బాలాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. http://nationalawrdstoteachers.ed ucation. gov. in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతో పాటు సంబంధిత సర్టిఫికెట్లను విద్యాశా ఖ కార్యాలయానికి పంపించాలని తెలిపారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 91,793 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 31,221 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.38 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు సకాలంలో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. -
ఆగని భూ ఆక్రమణలు
మర్రిపాడు: మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. భూ ఆక్రమణలపై పత్రికల్లో కథనాలు రావడం.. రెవెన్యూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేయడం, ఆక్రమణదారులు యథావిధిగా వాటిని పక్కనపెట్టి మళ్లీ కబ్జాలకు పాల్పడటం షరా మామూలైంది. ఇది రెవెన్యూ అధికారుల పనితీరుకు అద్దం పడుతుతోందని జనం అంటున్నారు. తాజాగా మరోసారి పెగళ్లపాడు గ్రామంలోని సర్వే నంబర్ 6లో భూమిని చదును చేసి ఆక్రమణకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వివాదాలు కొనసాగుతూనే.. 34 ఎకరాల పరిధిలో ఉన్న భూమిలో గ్రామానికి చెందిన డీలర్ దుద్దుకుంట శేఖర్ సుమారు 12 ఎకరాలను చదును చేసి ఆక్రమించేందుకు యత్నించినట్లు గ్రామస్తులు చెబుతున్న మాట. ఇదే గ్రామంలో గతంలో కూడా సుమారు 12 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు పేర్కొంటున్నారు. గతంలోనూ ప్రభుత్వ భూములపై వివాదాలున్నాయి. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా ఉన్న ప్రాంతాలను చదును చేయడం, కంచెల ఏర్పాటు, సాగు ప్రయత్నాలపై ఫిర్యాదులు వెళ్లినట్లు గ్రామస్తులు గుర్తుచేస్తున్నారు. అయితే శాశ్వత చర్యలు కనిపించలేదు. చెలరేగిపోతూ.. మండలంలో హైలెవల్ కెనాల్ భూసేకరణ పనులు జరుగుతుండడంతో గతంలో రెవెన్యూ రికార్డుల్లో భూములను అందజేసిన వారు, అదే విధంగా ఆయా గ్రామాల్లోని నాయకులు మళ్లీ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. రెవెన్యూ అధికారులకు అర్జీలు సమర్పించినా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారే కానీ పట్టించుకోకపోవడంతో ఆక్రమణదారులు చెలరేగిపోతున్నారు. ఒకసారి కఠినంగా వ్యవహరిస్తే మళ్లీ ఆ భూమిలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేయరని, రెవెన్యూ అధికారులు మాత్రం హెచ్చరిక బోర్డులతో సరిపెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. -
అధికారంలో ఉంటే.. వివస్త్రను చేస్తారా? చంపేస్తారా?
ఆంధ్రప్రదేశ్: అధికారంలో ఉన్నాం.. ఏం చేసినా చెల్లు బాటు అయిపోతుంది. మమ్మల్ని కేసులు ఏం చేయలేవు.. అనే ధోరణితో టీడీపీ నేతలు అరాచ కాలకు పాల్పడుతున్నారు. అధికారంలో ఉంటే మహిళలను వివస్త్రను చేస్తారా? చంపేస్తారా? రౌడీషీట్లు ఓపెన్ చేస్తారా? అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని టీడీపీ నేతలు, పోలీసులు, రెవెన్యూ అధికారులు తెలుసుకోవాలని, తప్పు చేసిన ప్రతి ఒక్కరూ చట్టపరంగా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. పట్టణంలోని కచ్చేరిమిట్టలో టీడీపీ నేతల చేతిలో వివస్త్రకు, దాడికి గురైన బాధితురాలిని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డితో కలిసి కాకాణి సోమవారం పరామర్శించారు. తన విషయంలో టీడీపీ నేతలు, పోలీసులు వ్యవహరించిన చర్యలను కన్నీరు ము న్నీరవుతూ బాధితురాలు వివరించారు. నీకు జరిగిన అవమానం, అన్యాయం తెలుసుకుని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. ధైర్యంగా ఉండమని, న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం చేస్తామని వైఎస్ జగన్ మాటగా ధైర్యం చెప్పారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. అనంతరం కాకాణి మీడియాతో మాట్లాడుతూ కావలి పట్టణంలో ఎరుకుల మహిళపై జరిగిన ఘటన అమానవీయమన్నారు. సభ్య సమాజంలో ఇలాంటి దారుణాన్ని తామెన్నడూ చూడలేదన్నారు. కూటమి పాలనలో మహిళలు తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఎక్కడా లేదన్నారు. మహిళను కులం పేరుతో దూషిస్తూ, జుట్టు పట్టుకుని వీధిలోకి లాగి, బట్టలు ఊడదీసి వివస్త్రను చేశారన్నారు.న్యాయం అడిగితే.. రౌడీషీట్లు పెడతారా?తనపై జరిగిన దాడికి న్యాయం చేయమని గాయాలు, అవమానంతో బాధిత మహిళ పోలీస్స్టేషన్కు వెళ్తే చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకుని ‘నీ కొడుకుపై కేసు నమోదైంది. నిన్ను కొట్టిన విషయం బయటకు రాకుండా ఉంటే, మీ కొడుకుపై ఎలాంటి కేసు లేకుండా పంపించేస్తామ ని’ బెదిరించడం ఏమిటని పోలీసులను కాకాణి నిలదీశారు. ఒకవేళ కేసు పెడతామని భీష్మించుకుంటే, నీ కొడుకుపై గూండా యాక్ట్ పెడతామని, రౌడీషీట్ తెరుస్తామని, జైల్లో పెడతామని, కుటుంబానికి దక్కకుండా చేస్తామని టూటౌన్ పోలీసులు భయపెట్టి రాజీపత్రం రాయించి, ఇద్దరి మధ్య ఎలాంటి వివాదా లు లేవని, ఇకపై ఒకరి జోలికి ఒకరు పోమని బలవంతంగా సంతకం పెట్టించి కేసును క్లోజ్ చేశామని చెప్పారన్నారు.తహసీల్దార్ ఏ విధంగా సర్టిఫికెట్ ఇస్తారుబాధితురాలిని బలవంతంగా తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి వేలిముద్రలు వేయించుకుని కులం, మతం సర్టిఫికెట్లు జారీ చేశారంటూ కాకాణి ధ్వజమెత్తారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం జన్మతః ఏ కులం, మతానికి చెందుతారో, అదే కులం ఉంటుందనే విషయం తహసీల్దార్కు తెలియదా? అని ప్రశ్నించారు. తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చిన తహసీల్దార్ ఉద్యోగంలో ఉంటాడా? జైలుకు వెళ్లకుండా తప్పించుకుంటాడా? అని కాకాణి నిలదీశాడు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వ్యవహరించిన తీరుపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ఈ రోజు గిరిజన కుటుంబం పడుతున్న బాధ కంటే వంద రెట్లు ఎక్కువ బాధను అధికారులు భవిష్యత్లో అనుభవించక తప్పదన్నారు.నేరస్తుల కాపు కాస్తున్న ఎమ్మెల్యేకావలిని కాపు కాస్తానని చెప్పిన ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి నేరస్తుల కాపు కాస్తున్నాడని కాకాణి ధ్వజమెత్తారు. కచ్చేరిమిట్టలో చుట్టు పక్కల ఉన్న మహిళలను విచారిస్తే, గిరిజన మహిళపై దాడి చేయడానికి ప్రధాన కారకుడు మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం అని చెబుతున్నారని, ఇలాంటి వ్యక్తిని సమర్థించడమే దారుణమన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన ఏ విధంగా సాగుతుందో ప్రజలు గమనిస్తున్నారని, మహిళలపై చేయి వేస్తే ఆ రోజే ఆఖరి రోజు అవుతుందన్న ఆయన మాటలు క్షేత్రస్థాయిలో నిజం కావడం లేదన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాదిరిగా ఎన్నికల ముందు సుగాలి ప్రీతి హత్యను అడ్డం పెట్టుకుని హడావుడి చేసి అధికారంలోకి వచ్చాక మరిచిపోయే సంస్కృతి మాది కాదన్నారు. దాడికి గురైన బాధిత మహిళకు కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగకపోతే జరిగేంత వరకు ఆమెకు మద్దతుగా ఉంటామన్నారు. ఒక వేళ చేయలేకపోతే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బాధిత మహిళను అన్ని విధాల ఆదుకొని న్యాయం చేస్తామన్నారు.ఆ తల్లి ఏం తప్పు చేసింది– మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ఆమె కొడుకు మీ ఆడ బిడ్డను ప్రేమిస్తే.. మీ ఆడబిడ్డ ఆమె కుమారుడిని ప్రేమించింది. పిల్లలు ప్రేమించుకుంటే.. ఆ తల్లి ఏం తప్పు చేసిందని, ఎమ్మెల్యే అండ చూసుకుని టీడీపీ నేతలు ఆ మహిళను ఇంట్లో నుంచి వీధిలోకి జుట్టు పట్టుకుని లాక్కొచ్చి, వివస్త్రను చేసి విచక్షణా రహితంగా కొడతారని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి నిలదీశారు. ఈ ఘటన అత్యంత హేయం, అమానవీయమన్నారు. ఇలాంటి ఘటనకు పాల్పడ్డారంటే అధికారంలో ఉన్నామనే కదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అనుచరులు చేసిన దారుణాన్ని కావలి పట్టణమే కాదు.. రాష్ట్రం మొత్తం యావగించుకుంటుందన్నారు. అటువంటి వారిని ఎమ్మెల్యే వెనుకేసుకుని సభ్య సమాజానికి ఏం చెబుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. కావలి నియోజకవర్గంలో రాక్షస పాలన నడుస్తుందన్నారు. ఒక గిరిజన మహిళకు అన్యాయం జరిగి దాదాపు 10 రోజులు అవుతుంటే ఇప్పటి వరకు అధికార పార్టీ నాయకులు పరామర్శించక పోగా బాధితులపైనే అసత్య ఆరోపణలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే ఒత్తిడితో ఏ1 నిందితుడిని ఏ 6గా చేర్చి కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బాధిత గిరిజన మహిళకు న్యాయం జరిగేంత వరకు వైఎస్సార్సీపీ అండగా నిలబడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పందిటి కామరాజు, కనమర్లపూడి వెంకటనారాయణ, బీసీ భవన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటరావు, బోగోలు మండల కనీ్వనర్ మద్దిబోయిన వీరరఘు, గుండ్లపల్లి మురళీయాదవ్, నాయకులు కుందర్తి కామయ్య, కృష్ణారెడ్డి, పేరం వెంకటేశ్వర్లు, ఎండ్లూరి ఏసుదాసు, మహిళా నేతలు సీతమ్మ, దామేర్ల నాగేశ్వరమ్మ, సుమలత, కీర్తిప్రియ, పద్మమ్మ తదితరులు పాల్గొన్నారు. -
బకాయిలు చెల్లించకపోవడం దారుణం
నెల్లూరు(టౌన్): కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడం దారుణమని ఏపీటీఎఫ్ నాయకులు అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ పిచ్చిబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించి పాస్ మార్కులను 35గా నిర్ణయించాలన్నారు. పీఆర్సీ కమిటీని నియమించి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్ బాధ్యులు సులోచనమ్మ, శీనయ్య, విజయభారతి, కిశోర్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 115 మంది చిన్నారుల అప్పగింతనెల్లూరు(క్రైమ్): భారీ పోలీస్ భద్రతా ఏర్పాట్ల మధ్య రొట్టెల పండగ జరుగుతోంది. సోమవారం ఎస్పీ అజిత వేజెండ్ల, ఏఎస్పీ సీహెచ్ సౌజన్య బందోబస్తును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలిచ్చారు. పోలీసు అధికారులు 450 మంది చిన్నారులకు ఆర్ఎఫ్ఐడీ ట్యాగింగ్ చేశారు. తప్పిపోయిన 115 మంది చిన్నారులను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. పోగొట్టుకున్న ఎనిమిది సెల్ఫోన్లు, రూ.46 వేల నగదును బాధితులకు అందజేశారు. పిక్ పాకెటింగ్కు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా బాంబ్, డాగ్స్క్వాడ్లు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నా కుమారుడిని స్వదేశానికి తీసుకురండి● ప్రభుత్వానికి తండ్రి వినతిబుచ్చిరెడ్డిపాళెం: ఫిలిప్పీన్స్లో చిక్కుకున్న తన కుమారుడు బరిగల ప్రేమ్చంద్ను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని బుచ్చిరెడ్డిపాళెం పట్టణానికి చెందిన బరిగల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. 2023లో తన కుమారుడిని ఎంబీబీఎస్ చదివించేందుకు సింహపురి ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీని ఆశ్రయించామన్నారు. అప్పులు చేసి రూ.16 లక్షలను దాని ప్రతినిధి సుధాకర్రెడ్డికి చెల్లించామని చెప్పారు. అయితే కాలేజీకి కేవలం రూ.40 వేలే చెల్లించడంతో తమ కుమారుడి వీసా పునరుద్ధరణ జరగలేదన్నారు. వీసా గడువు ముగియడంతో ప్రస్తుతం ప్రేమ్చంద్ ఫిలిప్పీన్స్లో అనధికారికంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అనే భయంతో ఇబ్బందులు పడుతున్నాడని తెలిపారు. తాను బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నానని, ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నానని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడికి ఏదైనా అపాయం జరిగితే తాము తట్టుకోలేమని, మోసం చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కండలేరులో 32.510 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 32.510 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్ కాలువకు 30, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
ఇంటి నుంచి గెంటేశారు
● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వృద్ధుడి ఫిర్యాదు నెల్లూరు(క్రైమ్): ‘నాకు ఇద్దరు కుమారులున్నారు. ఆస్తిని వారికి సమానంగా పంచాను. అయినా బాగోగులు పట్టించుకోవడం లేదు. పెద్ద కుమారుడు నన్ను ఇంటి నుంచి గెంటేశాడు’ అంటూ బిట్రగుంట పరిధికి చెందిన ఓ వృద్ధుడు ఫిర్యాదు చేశాడు. సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 69 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్లకు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, డీసీఆర్బీ, మహిళా పోలీస్స్టేషన్, ఎస్బీ ఇన్స్పెక్టర్లు ఎన్.రామారావు, టీవీ సుబ్బారావు, బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● నా తల్లి ఇటీవల మృతిచెందారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. లోతుగా విచారించి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని విడవలూరుకు చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు. ● బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని గుంటూరుకు చెందిన సంపత్, రామాజంనేయులు, వారి స్నేహితులైన వంశీకృష్ణ, రత్నకుమారిలు రూ.3.96 లక్షలు తీసుకున్నారు. నకిలీ కాల్ లెటర్ ఇచ్చి మోసం చేశారు. విచారించి న్యాయం చేయాలని బిట్రగుంట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కోరారు. ● నా కుమార్తె అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. త్వరితగతిన ఆచూకీ కనుగొని అప్పగించాలని బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఓ మహిళ కోరారు. -
పోలియో రహిత సమాజమే లక్ష్యం
● డీఎంహెచ్ఓ సుజాత ● జిల్లా వ్యాప్తంగా చిన్నారులకు చుక్కల మందు నెల్లూరు(అర్బన్): పోలియో రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని డీఎంహెచ్ఓ సుజాత అన్నారు. పల్స్ పోలియో 2026 కార్యక్రమాన్ని ఆదివారం నెల్లూరులోని శెట్టిగుంటరోడ్డులో ఉన్న వైవీఎం మున్సిపల్ పాఠశాలలో ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్తో కలిసి డీఎంహెచ్ఓ ప్రారంభించారు. 5 ఏళ్లలోపు వయసున్న పలువురు చిన్నారులకు చుక్కల మందు వేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ 2,67,750 మంది చిన్నారులకు రెండు చుక్కల చొప్పున ఓరల్ పోలియో వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. వీరికోసం 1,620 పోలియో బూత్లు ఏర్పాటు చేశామన్నారు. హైరిస్క్ ప్రాంతాల్లో 83 మొబైల్ బూత్లను, ప్రయాణాల్లో ఉన్న పిల్లలకు చుక్కలు వేసేందుకు 88 ట్రాన్సిట్ బూత్లు పెట్టామన్నారు. తొలిరోజు మిస్సయిన పిల్లల కోసం సోమ, మంగళ వారాల్లో ఇంటింటి సర్వే ద్వారా చుక్కల మందు వైద్యసిబ్బంది వేస్తారన్నారు. కార్యక్రమంలో డెమో అధికారి కనకరత్నం, స్టాటిస్టికల్ అధికారి సహన, మెడికల్ ఆఫీసర్లు డా.ధనలక్ష్మి, డా.మౌనిక, డా.కార్తీక్, ఐసీడీఎస్ సూపర్వైజర్ విజయలక్ష్మి, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. తొలిరోజు 95.05 శాతం మందికి.. తొలిరోజు 2,54,510 పిల్లలకు వైద్యసిబ్బంది చుక్కల మందు వేశారు. 95.05 శాతం నమోదైంది. డీఎంహెచ్ఓ సుజాత మాట్లాడుతూ హైరిస్క్ ప్రాంతాలైన గిరిజన కాలనీలు, ఇటుకబట్టీలు, తోటల్లో పనిచేసే చోట తల్లిదండ్రులతో ఉండే పిల్లలను గుర్తించి చుక్కల మందు వేసి 100 శాతం విజయాన్ని అందుకుంటామన్నారు. సహకరించిన అంగన్వాడీ, ఆర్ఎంపీ, పీఎంపీలతోపాటు స్వచ్ఛంద సంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రావెల్ టిప్పర్ల ఇష్టారాజ్యం● త్రుటిలో తప్పిన ప్రమాదం ● చర్యలు తీసుకోవాలని జనం డిమాండ్ కావలి: గ్రావెల్ టిప్పర్లు ఇష్టారాజ్యం తిరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం కావలి నుంచి బ్రాహ్మణక్రాక, కృష్ణాపాడు మీదుగా నెల్లూరుకు ఆర్టీసీ బస్సు బయలుదేరింది. దారిలో కావలి విట్స్ కళాశాల వద్ద ఉన్న స్టాప్లో ఆగి ప్రయాణికులను ఎక్కించుకుంటోంది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న సీతారామ లారీ సర్వీస్కు చెందిన టిప్పర్ బస్సును రాసుకుంటూ వెళ్లే పరిస్థితి లేక ఆగిపోయింది. ఈ ఘటనలో బస్సు కుడివైపు భాగం స్వల్పంగా దెబ్బతింది. అయితే ప్రమాదం పెద్దది కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక్కసారిగా జరిగిన ఘటనతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. టిప్పర్ల రాకపోకలపై ఆందోళన పట్టణ పరిసర ప్రాంతాల నుంచి అక్రమ గ్రావెల్ తరలింపులో భాగంగా టిప్పర్లు పగలు, రాత్రి తేడా లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతున్నాయి. దీంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో భారీ వాహనాల రాకపోకలపై అధికారులు దృష్టి సారించాలని, ముఖ్యంగా పగటి సమయంలో టిప్పర్లు తిరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
కసుమూరు దర్గాలో నిలువు దోపిడీ
● హుండీ నిర్వాహకుల బలవంతపు వసూళ్లు ●పట్టించుకోని అధికారులువెంకటాచలం: దక్షిణాది రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన కసుమూరు మస్తాన్వలీ దర్గాను దర్శించుకునే భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. హుండీల్లో నగదును వేయాలని హుండీ కాంట్రాక్టర్లు బహిరంగంగా డిమాండ్ చేస్తున్నా, అధికారులు అడ్డుకట్టేయకపోవడంపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. నెల్లూరు నగరంలోని బారాషహీద్ దర్గా వద్ద నిర్వహించే రొట్టెల పండగకు వచ్చే భక్తుల్లో 50 శాతానికిపైగా ఇక్కడి దర్గాను దర్శించుకోవడం ఆనవాయతీగా వస్తోంది. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. దర్గాలో అదనపు హుండీలను కాంట్రాక్టర్లు ఏర్పాటు చేసి, అందులో నగదును వేయాలని చెప్పడంతో భక్తులు ఆదివారం గొడవకు దిగారు. తమకు ఇష్టముంటే వేస్తామని.. మీరు బలవంతంగా సమర్పించాలని చెప్పడమేమిటని ప్రశ్నించారు. గొడవతో అర్ధగంటపాటు ఎవర్నీ దర్శనం చేసుకోనీయకుండా నిలిపేశారు. మూడు రోజులుగా ఇదే తంతు.. హుండీ నిర్వాహకులు బలవంతపు వసూళ్లకు మూడు రోజులుగా పాల్పడుతున్నా.. రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టించుకోకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. సాధారణ రోజుల్లో దర్గాలో రెండు హుండీలే ఉంటాయి. భక్తులు తమకు తోచినంత నగదును అందులో సమర్పిస్తారు. అయితే గంధ మహోత్సవం, రొట్టెల పండగ సందర్భాల్లో దర్గా ప్రాంగణంలో అదనపు హుండీలను కాంట్రాక్టర్లు ఏర్పాటు చేసి, ప్రతి చోటా సిబ్బందితో బలవంతపు వసూళ్లకు పాల్పడుతుండటం వివాదాస్పదమవుతోంది. -
అప్రమత్తంగా విధులు నిర్వహించాలి
● ఎస్పీ అజిత వేజెండ్ల నెల్లూరు(క్రైమ్): భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఎస్పీ అజిత వేజెండ్ల పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆమె దర్గా పరిసర ప్రాంతాలు, క్యూలైన్లు, ఘాట్ ఏరియా తదితర ప్రాంతాల్లో బందోబస్తును పరిశీలించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులకు ఇబ్బందులు కలుగకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. తప్పిపోయిన చిన్నారులు, వ్యక్తుల విషయంలో తక్షణ స్పందనతో చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి దర్గా పరిసరాలను పరిశీలించారు. -
తూపిలిపాళెంలో తమిళ బోట్ల హల్చల్
● మా బతుకులు ఇంతేనా? ● స్థానిక మత్స్యకారుల ఆవేదనవాకాడు: కొన్నేళ్లుగా తమిళ జాలర్లు హద్దులు దాటి మత్స్య దోపిడీ, దాడులకు పాల్పడుతున్నా శాశ్వత చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని స్థానిక మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. ఆదివారం తమిళ జాలర్ల బోట్లు వాకాడు మండలం తూపిలిపాళెం తీరంలో హల్చల్ చేశాయి. స్థానిక మత్స్యకారుల వివరాల మేరకు.. ఇటీవల జువ్వలదిన్నె వద్ద తమిళ జాలర్లు బోట్లను జిల్లా మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు. అయితే తిరిగి వాటిని వదిలేయడంతో తమిళ జాలర్లు జిల్లా తీరం వెంబడి తమ అక్రమ వేటకు మళ్లీ స్పీడు పెంచారు. ఈ క్రమంలోనే 25 రోజులుగా ఆంధ్రా సరిహద్దుల్లో నిబంధనలకు విరుద్ధంగా తీరానికి అతి దగ్గర్లో వేట చేసి మత్స్యసంపదను దోచుకుపోవడం జరుగుతోంది. స్పీడు బోట్లతో సముద్రంపై హద్దులు దాటి తమ పరిధిలోకి చొచ్చుకొచ్చి అక్రమంగా వేట చేసి తమకేమీ మిగల్చకుండా విలువైన మత్స్యసంపదను దోచుకుపోతున్నారని జిల్లా మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 52 స్పీడు బోట్లతో.. నాలుగు వారాల వ్యవధిలోనే చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేట మండల పరిధిలోని సముద్రంలో సుమారు 52 స్పీడు బోట్లు ఒక్కసారిగా పరిధి దాటి వందల టన్నుల మత్స్యసంపదను దోచుకుపోవడం జరిగింది. దీనిని గమనించిన స్థానిక మత్స్యకారులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై రాళ్లదాడికి దిగడంతో తప్పించుకుని ఒడ్డుకు చేరుకున్నారు. పొరుగు రాష్ట్రాల స్పీడు బోట్ల దందాకు ఎవరూ అడ్డుకట్ట వేయలేకపోతున్నారని, మా బతుకులు ఇంతేనా అని మత్స్యకారులు బాధపడుతున్నారు. రెండు నెలల వేట విరామం కాలం తర్వాత అరకొరగా లభిస్తున్న మత్స్య సంపదతో జీవనం సాగిస్తున్న తమకు పొరుగు జాలర్లు ఒక్క చేపను కూడా దొరకనివ్వకుండా నోట్లో మట్టి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా స్పీడు బోట్లు 8 నాటికల్ మైళ్ల దూరం పైన సముద్రంలో వేట చేయాలి. అలా కాకుండా నిబంధనలు అతిక్రమించి 2 నాటికల్ మైళ్ల దూరంలోనే వేట చేస్తున్నాయి. తాము ఏడాది మొత్తం పస్తులతో అలమటించినా.. ఎవరూ పట్టించుకోరా అని స్థానికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. -
కబ్జా చేశాం.. అడిగేదెవరు..
విలువైన భూముల ఆక్రమణ సురే దశరథరామిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు మేత పోరంబోకుతోపాటు చెరువు స్థలాలు, వాగు పోరంబోకు భూములను కూడా ఆక్రమించి సాగు చేస్తున్నారు. దాదాపు రూ.1.50 కోట్ల విలువైన భూముల్లో సాగు చేస్తున్నారు. మేత పోరంబోకు భూమి విషయంలో ప్రశ్నిస్తే దాడులు చేయడమే కాకుండా తప్పుడు కేసులు పెడుతున్నారు. దీంతో గ్రామస్తులు భయపడుతున్నారు. – గువ్వల శ్రీధర్రెడ్డి కావలి: జలదంకి మండలం చోడవరం గ్రామంలో పశువుల మేత కోసం కేటాయించిన పోరంబోకు భూమి ఆక్రమణకు గురైంది. సుమారు రూ.4 కోట్ల విలువైన భూమి కబ్జాకు గురవడంతో పశువులను మేపేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చోడవరం ఏర్పడిన సమయంలో గ్రామంలోని పశువులు అన్ని కాలాల్లో మేత మేసేందుకు సర్వే నంబర్ 282లో 40 ఎకరాలకు పైగా భూమిని పోరంబోకు భూమిగా వదిలివేశారు. వర్షాలు కురిసిన సమయంలో వ్యవసాయ పనులు, పంటల సాగు కొనసాగుతున్నప్పుడు గ్రామంలోని పశువులు ఈ భూమిలోకి వెళ్లి మేత మేసేవి. జామాయిల్ సాగు.. కొన్ని సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన సురే దశరథరామిరెడ్డి కుటుంబం సర్వే నంబర్ 282లోని సుమారు 10 ఎకరాలకు పైగా భూమిని ఆక్రమించి జామాయిల్ సాగు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అతడిని ఆసరాగా చేసుకుని మరికొందరు రైతులు కూడా మేత పోరంబోకు భూముల్లో జామాయిల్, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. దీంతో గ్రామంలోని పశువులకు మేత లేకుండా పోయింది. తమ పశువులను మేత పోరంబోకు భూముల్లోకి తీసుకెళ్తే సురే దశరథరామిరెడ్డి, అతని అనుచరులు దాడులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఆక్రమణలతో గ్రామంలో అశాంతి దశరథరామిరెడ్డి కుటుంబం టీడీపీలో ఉంది. ప్రభుత్వ భూములను ఆక్రమించడమే కాకుండా ప్రైవేట్ భూములపై కూడా కన్నేస్తున్నారని స్థానికులు అంటున్నారు. తమను ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతూ గ్రామంలో అశాంతి పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి దశరథరామిరెడ్డి ఆక్రమించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భూములపై విచారణ జరిపి మేత పోరంబోకు భూమిని కబ్జాల నుంచి విడిపించాలని కోరుతున్నారు. ఈ విషయాన్ని గతంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకోకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. రూ.4 కోట్ల విలువైన మేత పోరంబోకు భూమి కబ్జా పశువులకు మేత లేక రైతుల ఇబ్బందులు ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతున్నారని గ్రామస్తుల ఆరోపణలు -
పంతం నానాజీపై చర్యలు తీసుకోవాలి
కావలి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఉద్దేశ పూర్వకంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న కాకినాడ రూరల్ ఎమ్మె ల్యే పంతం వెంకటేశ్వరరావు (నానాజీ)పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదివారం కావలి వైఎస్సార్సీపీ నేతలు ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, వ్యక్తిగతంగా అవమానించే పదజాలంలో కేవలం రాజకీయ లబ్ధికోసం దిగజారి మాట్లాడడం రాజకీయాల్లో మంచి పద్ధతి కాదన్నారు. ఇటువంటి వ్యాఖ్యల వల్ల వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు వైఎస్సార్ కుటుంబం అభిమానులు కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. తక్షణమే పంతం నానాజీతో పాటు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటి వంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్రెడ్డి, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, పందిటి కామరాజు, గుండ్లపల్లి మురళీ యాదవ్, మాల్యాద్రి, వెంగళశెట్టి కళ్యాణి, జ్యోతి, పద్మ, సుమలత, పట్టణ మహిళ అధ్యక్షురాలు సీతారావమ్మ, సీనియర్ నాయకురాలు దామేర్ల నాగేశ్వరమ్మ, చేవూరు పద్మ, గూడ్లూరు మాల్యాద్రి, పరుసు మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. -
అండగా ఉంటామని వైఎస్సార్సీపీ నేతల భరోసా
కావలి: ఈ నెల 19న కావలి పట్టణం కచ్చేరిమిట్టకు చెందిన గిరిజన మహిళపై జరిగిన దారుణ ఘటనను తెలుసుకున్న కావలి వైఎస్సార్సీపీ నేతలు ఆదివారం ఆమె నివాసానికి తరలివెళ్లారు. సభ్య సమాజం తలదించుకునే రీతిలో టీడీపీ నేత లు అమానుషానికి బరితెగించారని, ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. తాము అండగా ఉంటామని ఆమెకు ధైర్యం చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం రాష్ట్రంలో మహిళలపై ఇలాంటి దారుణాలు జరుగుతునే ఉన్నాయన్నారు. స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు కొందరు అదే ప్రాంతంలో ఉన్నటు గిరిజన మహిళను నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి వివస్త్ర చేసి తీవ్రంగా కొట్టి గాయపరిచారన్నారు. ఈ విషయమై అదే రోజు కావలి 2వ పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయకపోగా బాధితులను బెదిరించి రాజీ చేసుకోవాలని సూచించడంతో బాధిత మహిళ ఎవరికి చెప్పుకోవాలో తెలియక భయంతో పది రోజులుగా అజ్ఞాతంలో ఉందన్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసులు బాధితురాలిని బెదిరించేందుకు ఆమె పెట్టిన కేసు ను నమోదు చేస్తూ, ఆమె కుమారుడిపై నిందితురాల్లో ఒకరు స్నానం చేస్తుండగా పిట్ట గోడ ఎక్కి చూశారంటూ కేసు కూడా వారం తర్వాత ఈనెల 26వ తేదీన నమోదు చేయడంలోనే పోలీసుల వైఖరి తెలుస్తుందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కావలిలో రెడ్బుక్ రాజ్యాంగం పాలన నడుస్తుందన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ కావలి పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్రెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పందిటి కామరాజు, జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్నాంజనేయులు, మాజీ కౌన్సిలర్లు గుడ్లూరు మాల్యాద్రి, ఎస్కే రహంతుల్లా, పేరం వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధి నెల్లూరు వెంకటేశ్వర్లు, కలికి శ్రీనివాసులురెడ్డి, ఎస్కే నాయబ్ రసూల్, పరసు మాల్యాద్రి. ద్రోణాదుల వెంకట్రావు ఆత్మకూరు శ్రీనుబాబు, వైఎస్సార్సీపీ మహిళా నేతలు వెంగళశెట్టి కళ్యాణి, జ్యోతి, పద్మ, సుమలత, సీతారావమ్మ, దామెర్ల నాగేశ్వరమ్మ, చేవూరు పద్మ, తదితరులు ఉన్నారు. -
భక్తులకు బారా కష్టాలు
గంధం బిందెల వద్ద మతపెద్దలు నెల్లూరు (బారకాసు): రొట్టెల పండగ సందర్భంగా హాజరయ్యే భక్తులకు వసతుల కల్పనే తమ ప్రాధాన్యమని మంత్రులు, ప్రజాప్రతినిధులు చెప్తున్నా, క్షేత్రస్థాయిలో అది వాస్తవ విరుద్ధంగా ఉంది. మండిపోయే ఎండలతో కాళ్లు కాలుతూ భక్తులు హాహాకారాలు చేస్తున్నా.. తాగునీటి వసతి లేక అల్లాడుతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఏటా నిర్వహించే ఈ మహోత్సవానికి లక్షలాది మంది వస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సంఖ్య పెరుగుతుందే గానీ తగ్గేదంటూ ఉండదు. ఇవన్నీ తెలిసినా తమకెందుకులేనని నగరపాలక సంస్థ లైట్ తీసుకుందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అన్నీ వెతలే.. ● ఆదివారం నాడు భానుడి భగభగలు తారస్థాయికి చేరాయి. అశేషంగా హాజరైన భక్తజనానికి నిలువు నీడ కరువైంది. ఫలితంగా చెట్లు, అవసరమైన జాగా కోసం వీరు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ● తాగునీటి సౌకర్యాన్ని కల్పి ంచడంలో కార్పొరేషన్ యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. దీంతో గుక్కెడు నీటి కోసం నానా అవస్థలు పడాల్సి వచ్చింది. చలివేంద్రాలను నామమాత్రంగా ఏర్పాటు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని పలువురు పేర్కొన్నారు. ● బారాషహీదులను దర్శించుకునేందుకూ భక్తులకు అగచాట్లు తప్పలేదు. కిలోమీటర్ మేర క్యూ చేరుకుంది. వీరి కాళ్లు కాలకుండా పట్టలను ఏర్పాటు చేసే అవకాశమున్నా.. నీటిని చల్లి ఉపశమనం కల్పించే ఆస్కారమున్నా, ఆ దిశగా ఎవరూ చర్యలు చేపట్టలేదు. ● చాంతాడంత క్యూలో ఉన్న వారికి ఆహారం, మంచినీటిని అందించాలనే కనీస ఆలోచన ఎవరికీ రాకపోవడం శోచనీయం. ఈ వ్యవహారాలను చూస్తే వక్ఫ్ బోర్డు, దర్గా కమిటీ పనితీరు ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది. ఎమ్మెల్యే కోటంరెడ్డిని నిలదీసిన భక్తులు దర్గాకు విచ్చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని భక్తులు నిలదీశారు. గుక్కెడే మంచినీరిచ్చే దిక్కులేదని.. ఎండ వేడిమికి చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని ఆరోపించారు. మరోవైపు ప్రజాప్రతినిధులు, అధికారుల సిఫార్సులున్న భక్తులు దర్గాలోకి నేరుగా వెళ్లి దర్శనం చేసుకోగలుగుతున్నారు. దర్గా ప్రాంగణంలో సిమెంట్ రోడ్డు లేని చోట క్వారీ డస్ట్ను వేసి చదును చేశారు. దీనిపై నీరు చల్లాల్సి ఉన్నా, అలా చేయలేదు. దీంతో మట్టి ఎగిరి కళ్లలో పడటంతో భక్తులు అసహనానికి గురయ్యారు. ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించా ల్సిన మేయర్ సుజాత, కమిషనర్ నందన్ తమ ప్రచారం కోసం ఫొటోలకే పరిమితమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. వసతుల కల్పనలో అధికార యంత్రాంగం వైఫల్యం ఫొటోలకే పరిమితమైన మేయర్, కమిషనర్ షహీదుల సమాధుల దర్శనానికి బారులు ఆహారం, మంచినీటిని అందించడంలో వక్ఫ్ బోర్డు నిర్లక్ష్యం ఏటా పండగ పేరిట రూ.కోట్లను తమ ఖజానాలో వేసుకుంటున్న వైనం అధికార పార్టీ నేతలు, ఆఫీసర్ల సిఫార్సులకే ప్రాధాన్యం -
నరికేస్తాం.. తరలించేస్తాం..
వరికుంటపాడు: మండలంలోని తూర్పుకొండారెడ్డిపల్లిలో చెరువు అభివృద్ధికి ఎఫ్డీఆర్ పేరుతో రూ.4.70 లక్షల విలువైన కాంట్రాక్ట్ పనులు బీజేపీ నేతకు అప్పజెప్పారు. అదే అదనుగా సదరు వ్యక్తి చెరువు అభివృద్ధి పనులను గాలికొదిలేసి అవినీతి పనులకు పదునుపెట్టాడు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ వేప, నల్లతుమ్మ, తెల్లతుమ్మ చెట్లను నరికి వేస్తూ జేబులు నింపుకుంటున్నాడు. అంతటితో ఆగకుండా చెరువు కింద ఆయకట్టు కాలువ అభివృద్ధి అని చెప్పి కాలువకు రెండు వైపులా రూ.లక్షల విలువ చేసే టేకు, వేపచెట్లను తొలగించడం అతని అక్రమాలకు పరాకాష్టగా చేరింది. కనీసం ముందస్తు సమాచారం లేకుండా ఇష్టానుసారంగా చెట్లను తొలగించడంపై పోలీస్స్టేషన్లో ఆ నాయకుడిపై గ్రామస్తులు, రైతులు ఫిర్యాదు చేశారు. తీవ్ర విమర్శలు తూర్పుకొండారెడ్డిపల్లి చెరువుతో పాటు పక్కన ఉండే చెట్ల నరికివేతపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. అసలు అభివృద్ధి పనులు చేస్తున్నారా లేక అవినీతి పనులు చేస్తున్నారా అని గ్రామస్తులు నిలదీస్తున్నారు. చెరువు కట్టకు ఇరువైపులా ఉండే రైతుల పొలాల హద్దుల్లో సంవత్సరాల తరబడి చెట్లను కాపాడుకుని పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఎలాంటి సమాచారం లేకుండా చెట్లను కొట్టడంపై శుక్రవారం గ్రామస్తులందరూ ఎదురు తిరిగి కర్ర తరలించకుండా అడ్డుకున్నారు. కాగా దీనిపై కూటమి నేతల్లో సైతం కుమ్ములాటకు దారితీస్తోంది. అభివృద్ధి ముసుగులో వాల్టా చట్టానికి తూట్లు ఇష్టానుసారంగా వృక్షాల నరికివేత రైతుల పొలాల్లోని టేకు చెట్లకు ఎసరు సదరు నేతపై పోలీసులకు ఫిర్యాదు కూటమి ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు మూడు పువ్వులు, ఆరు కాయలు అనే చందంగా మారింది. చేపట్టే ప్రతి పనిలోనూ ఏదో ఒక విధంగా అక్రమాలకు తెరలేపుతున్నారు అధికార పార్టీ నేతలు. మండలంలోని తూర్పుకొండారెడ్డిపల్లిలో చెరువు అభివృద్ధి పేరుతో బీజేపీ నేత పక్కనే ఉన్న రైతుల పొలాల్లో ఉండే విలువైన టేకు చెట్లను సైతం కొట్టి తరలిస్తుండడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెట్లను నరకకూడదు తూర్పుకొండారెడ్డిపల్లి చెరువు కట్ట అభివృద్ధి కోసం రూ.4.75 లక్షల నిధులు కేటాయించాం. ఈ చెరువు కట్ట మీద జంగిల్ క్లియరెన్స్ చేయమని చెప్పాం. కానీ చెరువు లోపల ఉండే వేప, నల్లతుమ్మ చెట్లు నరికివేతపై మాకు సంబంధం లేదు. ఆ చెట్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు సంబంధించినది. రైతు పొలాల్లో ఉండే చెట్లు నరకకూడదు. – ఆది రమేష్, ఇన్చార్జి ఇరిగేషన్ ఏఈ -
దుశ్శాసనులను కఠినంగా శిక్షించాలి
కావలి (నెల్లూరురూరల్): కావలి పట్టణం కచ్చేరిమిట్టలో గిరిజన మహిళ వివస్త్రను చేసి, పాశవికంగా దాడి చేసిన ఘటనను సామాజిక మహిళా కార్యకర్త సి. శారద శనివారం ఒక ప్రకటనలో ఖండించారు. సభ్యసమాజం తలదించుకునే ఈ దారుణాన్ని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. ఆధునిక యుగంలో అన్ని రంగాల్లో ముందుకు వచ్చి తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్న మహిళలకు ఈ సభ్య సమాజంలో ఇలాంటి దుర్మార్గం జరగడం అత్యంత గర్హనీయం. మహిళలకు అండగా ఉంటామనే అధికార పార్టీ నేతలు నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసులను నమోదు చేసి, కఠిన శిక్షలు పడేలా బాధితురాలి వైపు నిలబడాలని డిమాండ్ చేశారు. ఒక మహిళ రాష్ట్రపతిగా ఉన్న ఈ దేశంలో, ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఈ దారుణం జరగడం అత్యంత హేయమన్నారు. కావలి ఘటన చూస్తే.. మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన దుర్ఘటను గుర్తు తెస్తుందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు బాధితురాలిని కలిసి భరోసా ఇవ్వాలని కోరారు. నిందితులు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారో ఆ రాజకీయ పార్టీ వారి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పులి వాహనంపై చాముండేశ్వరిదేవి ఇందుకూరుపేట: బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని గంగపట్నంలో కొలువైన చాముండేశ్వరీదేవి అమ్మవారు పులి వాహనంపై శనివారం విహరించారు. మేళతాళాలు.. విద్యుద్దీప వెలుగులు.. బాణసంచా నడుమ గ్రామం నుంచి పల్లిపాళెం వరకు ఊరేగించారు. కాగా అమ్మవారికి సింహ వాహనసేవను ఆదివారం నిర్వహించనున్నారు. పూజా కార్యక్రమాలను అలయ అర్చకులు అనిల్, రామకృష్ణ ఆధ్వర్యంలో జరిపారు. ఈఓ తాతా శ్రీనివాసరావు పాల్గొన్నారు. నేత్రపర్వంగా శ్రీవారి కల్యాణం రాపూరు: జిల్లాలోని పెంచలకోన క్షేత్రం భక్తులతో శనివారం కిక్కిరిసింది. పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, ఆంజనేయస్వామికి సుప్రభాతం, అభిషేకం, పూలంగిసేవను నిర్వహించారు. స్వామి వారి నిత్య కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి వివిధ పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ దేవదేవేరుల కల్యాణాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. అన్నదానం చేశారు. దేవదేవేరుల ఉత్సవ విగ్రహాలను తిరుచ్చిపై ఉంచి సహస్రదీపాలంకరణ మండపంలో ఊంజల్ సేవను నిర్వహించారు. -
పొగాకు రైతుపై సర్కార్ పగ
● గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్తో నిరసన ● ట్రాక్టర్లతో భారీ ర్యాలీ ● అడ్డుకున్న పోలీసులు ● ఆర్డీఓకు వినతిపత్రం అందజేత సోమశిలలో 38.16 టీఎంసీలు సోమశిల: సోమశిల జలాశయంలో శనివారం సాయంత్రానికి 38.16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వివిధ కాలువలకు 3550 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. రాస్తారోకో.. మర్రిపాడు: పొగాకు రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో మర్రిపాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి నిరసనగా నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై రాస్తారోకోను రైతులు చేపట్టి వాహన రాకపోకలను రెండు గంటలకుపైగా అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రైతు నేతలతో పోలీసులు చర్చలు జరిపి ఆందోళనను విరమించాలని కోరారు. అయితే ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతిని నిరాకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం రైతు సంఘ నేతలను ఖాకీలు అడ్డుకొని నిరసనను విరమించాలని ఒత్తిడి చేయడంపై కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపైనే పడుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. ఆత్మకూరు: పొగాకు సాగు ఖర్చులు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నామని.. పంటను అమ్ముకుందామంటే గిట్టుబాటు ధరల్లేక కంపెనీలు కుమ్మకై ్క తమను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నాయని.. మంచి ధర కల్పించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు నినదించారు. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్తో మర్రిపాడు నుంచి డీసీపల్లి మీదుగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీని సంఘటిత కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఆత్మకూరు రైతు సంఘ నేతలు శనివారం నిర్వహించారు. ఆత్మకూరుకు కొన్ని ట్రాక్టర్లు చేరుకోవడంతో స్థానిక నెల్లూరుపాళెం సమీపంలో సీఐ గంగాధర్, ఎస్సై జంపాని కుమార్ అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతుల్లేవని, పట్టణంలోకి ప్రవేశించరాదని చెప్పడంతో ఇదేమి అన్యాయమని రైతులు ప్రశ్నించారు. ర్యాలీని తాము ప్రశాంతంగా నిర్వహిస్తున్నామని, దీన్ని అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. అయినా పోలీసులు అంగీకరించకపోవడంతో ట్రాక్టర్లను రోడ్డు పక్కన పెట్టి రైతులు దిగేసి.. అక్కడే నిరసన చేపట్టారు. సీఎం ఆదేశాలు బేఖాతర్ కిలో రూ.200కు తగ్గకుండా ఫ్లాట్ఫారాల్లో పొగాకును కొనుగోలు చేస్తారని సీఎం ఇటీవల పేర్కొన్నా, ఆయన ఆదేశాలు బేఖాతరయ్యాయని రైతు సంఘ నేతలు ఆరోపించారు. తేలిక నేలల్లో పండే నాణ్యమైన పొగాకు ఈ ప్రాంతంలో ఉత్పత్తవుతున్నా, దానికి తగిన ధరను చెల్లించకుండా రైతుల వద్ద దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఆపై అక్కడే సీఐకు వినతిపత్రాన్ని అందజేశారు. ఆర్డీఓకు వినతిపత్రం ఆత్మకూరు ఆర్డీఓ పావనికి వినతిపత్రాన్ని సంఘటిత కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు అందజేశారు. రైతు సంఘ నేతలు చండ్ర రాజగోపాల్, మూలి వెంగయ్య, కృష్ణప్రసాద్, లక్ష్మీపతి, అన్వర్బాషా, నారాయణస్వామి, ఆత్మకూరు నాగయ్య, శివప్రసాద్, బడుగు శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆర్డీఓకు వినతిపత్రమిస్తున్న రైతులుమాట్లాడుతున్న నేతలు ట్రాక్టర్ల ర్యాలీని నిలిపేసిన పోలీసులు -
తహసీల్దార్ పట్ల దురుసుగా ప్రవర్తించారని..
● రెవెన్యూ సిబ్బందికి, పోలీసులకు వివాదం నెల్లూరు(అర్బన్): రొట్టెల పండగ జరిగే బారాషహీద్ దర్గా ఆవరణాన్ని ఆనుకుని నెల్లూరు రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఉంది. తహసీల్దార్ కూడా దర్గా వద్ద విధుల్లో ఉన్నారు. అయితే ఏమి జరిగిందో ఏమో ఓ సీఐ విధి నిర్వహణలో ఉన్న తన పట్ల దురుసుగా, అనుచితంగా ప్రవర్తించాడని తహసీల్దార్ సుధీర్ ఆరోపించారు. ఈ మేరకు కార్యాలయ రెవెన్యూ సిబ్బంది మొత్తం ఆందోళన చేసేందుకు దర్గా మొదటి గేటు వద్దకు చేరుకున్నారు. ప్రధాన గేటు వద్ద బైఠాయించేందుకు ప్రయత్నం చేశారు. విషయం తెలిసిన ఆర్డీఓ అనూష, ఏఎస్పీ అక్కడికి చేరుకుని పోలీసులు, రెవెన్యూ సిబ్బందితో మాట్లాడారు. దీంతో తహసీల్దార్కు సంబంధిత సీఐ క్షమాపణ చెప్పడంతో గొడవ సర్దుమణిగింది. -
తన టిప్పరే మృత్యు శకటమైంది
● మరమ్మతులు చేస్తుండగా డ్రైవర్ దుర్మరణం ముత్తుకూరు(పొదలకూరు): తను ప్రతినిత్యం తోలే టిప్పరే ఆ డ్రైవర్కు మృత్యు శకటంగా మారింది. టిప్పర్ కింద పడుకుని రిపేరు చేస్తున్న డ్రైవర్పైకి ప్రమాదవశాత్తు టిప్పర్ దొర్లడంతో అక్కడికక్కడే మృతిచెందిన విషాద ఘటన మండలంలోని జంగాలకండ్రిక వద్ద శనివారం జరిగింది. ముత్తుకూరు ఎస్సై డీవీ కొండారెడ్డి కథనం మేరకు.. తోటపల్లిగూడూరు మండలం వరకవిపూడి గ్రామానికి చెందిన నల్లబాయి విజయ్కుమార్(36) టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. టిప్పర్ మరమ్మతులకు గురికావడంతో జంగాలకండ్రిక గ్రామ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి సరిచేస్తుండగా ఒక్కసారిగా టిప్పర్ వెనుక్కు దొర్లింది. దీంతో టిప్పర్ కింద ఉన్న విజయకుమార్ టైర్ల కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ నిర్వహించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. టైర్ పంక్చరై అదుపుతప్పిన ఎలక్ట్రిక్ బస్సు ● స్వల్ప గాయాలతో బయటపడిన ప్రయాణికులు మనుబోలు: వేగంగా వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు హఠాత్తుగా టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పింది. ఈ ఘటన మనుబోలు, వెంకటాచలం మండలాల సరిహద్దులోని జాతీయ రహదారిపై చవటపాళెం క్రాస్రోడ్డు వద్ద శనివారం జరిగింది. వివరాలు.. తిరుపతి నుంచి 35 మంది ప్రయాణికులతో ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు నెల్లూరు వైపు వస్తోంది. బస్సు చవటపాళెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా ముందు టైరు పగిలిపోవడంతో అదుపుతప్పింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా బస్సును పక్కనే ఉన్న పొలాల్లోకి మళ్లించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో స్వల్పగాయాలైన ప్రయాణికులను 108 అంబులెన్స్లో వెంకటాచలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అధికారులు ప్రయాణికులను వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు చేర్చారు. మనుబోలు ఎస్సై శివరాకేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిరంతర పర్యవేక్షణ అవసరం నెల్లూరు(క్రైమ్): రొట్టెల పండగ నేపథ్యంలో నిరంతర పర్యవేక్షణ అవసరమని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. బారాషహీద్ దర్గాలో బందోబస్తును శనివారం ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వాహనాలను పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపేలా చూడాలన్నారు. ప్రత్యేక పాస్లు కలిగిన వాహనాలు మినహా ఇతర వాహనాలు దర్గాలోపలికి అనుమతించరాదన్నారు. బాంబ్ స్క్వాడ్, డాగ్స్క్వాడ్లతో నిరంతర తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించినా, గైర్హాజరైనా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్పీ అజిత వేజెండ్ల, ఏఎస్పీలు సౌజన్య, దీక్ష ఉన్నారు. నాలుగు డ్రోన్ కెమెరాలు భక్తుల భద్రతను పటిష్టం చేసేందుకు పోలీసుశాఖ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తీసుకొచ్చింది. మంత్రి పొంగూరు నారాయణ నాలుగు నైట్ విజన్ డ్రోన్ కెమెరాలను ఎస్పీ అజితకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాత్రివేళల్లోనూ నిరంతర ఏరియల్ సర్వైలైన్స్ నిర్వహిస్తామన్నారు. వక్ఫ్బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, కమిషనర్ నందన్, టీడీపీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ఉన్నారు. భక్తిశ్రద్ధలతో ప్రాకారోత్సవం నెల్లూరు(బృందావనం): త్రయోదశి సందర్భంగా మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం రాత్రి స్వామివారికి చిన్నవెండినంది ప్రాకారోత్సవం వేడుకగా నిర్వహించారు. భక్తులు స్వామివార్లను, నందీశ్వరుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
బతకాలని లేదు.. చావనివ్వండి
● పురుగు మందు తాగబోయిన వ్యక్తి ● సకాలంలో కాపాడిన పోలీసులు సీతారామపురం: జీవితంపై విరక్తి చెంది పురుగు మందు తాగబోయిన వ్యక్తిని పోలీసులు కాపాడి కుటుంబసభ్యులకు అప్పగించిన ఘటన శనివారం జరిగింది. పోలీసుల కథనమ మేరకు.. మండలంలోని బసినేనిపల్లి గ్రామానికి చెందిన బసిరెడ్డి సుబ్బారెడ్డి హైదరాబాద్లో రాపిడో డ్రైవరుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో తన భార్యతో విభేదించి స్వగ్రామమైన బసినేనిపల్లికి వచ్చాడు. అప్పసముద్రం వైపు వెళ్లి నిర్జీవ ప్రదేశంలో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడాలని నిర్ణయించుకుని చివరిసారిగా తన తండ్రి రఘురామిరెడ్డికి విషయం చెప్పాడు. దీంతో ఆయన వెంటనే పోలీసులను ఆశ్రయించగా స్పందించిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో సుబ్బారెడ్డి ఉన్న ప్రదేశాన్ని గుర్తించి ప్రత్యేక వాహనంలో దాసరిపల్లి హైవే సమీపాన వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోతున్న సుబ్బారెడ్డిని రక్షించారు. అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన పోలీసు సిబ్బందిని పలువురు అభినందించారు. -
రొట్టెల పండగకు వస్తూ విషాదం
● కారు అదుపుతప్పి యువకుడి మృతి ● మరో వ్యక్తికి తీవ్రగాయాలు మర్రిపాడు: అనంతపురానికి చెందిన నలుగురు మిత్రులు నెల్లూరు రొట్టెల పండగకు వస్తూ మర్రిపాడు మండలం చుంచులూరు సమీపంలోని శనివారం కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు.. నెల్లూరు బారాషహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండగకు అనంతపురం నగరానికి చెందిన హరినాథ్, రఘునాథ్, నికిత్, సాయి(30) అనే స్నేహితులు కారులో బయలుదేరారు. చుంచులూరు వద్ద హైవేపై కారు డివైడర్ను ఢీకొనడంతో డ్రైవింగ్ చేస్తున్న సాయి అనే యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన రఘునాథ్ను ప్రాథమిక చికిత్స అనంతరం నెల్లూరులోని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాల మార్చురీకి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు. -
తమిళ బోటు నిర్బంధం
● జువ్వలదిన్నె హార్బర్కు తరలింపు ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని నేలటూరుపాళెం సముద్ర తీరానికి రెండు కిలోమీటర్ల దూరంలో తమిళనాడుకు చెందిన మత్స్యకార పడవ అక్రమంగా చేపల వేటకొచ్చి స్థానిక మత్స్యకారుల వలలను కోస్తుండగా గస్తీ తిరుగుతున్న పోలీసులు నిర్బంధించారు. దుగరాజపట్నం కోస్టల్ సెక్యూరిటీ వివరాల మేరకు.. అక్రమ వేటకొచ్చిన తమిళ బోటు నేలటూరుపాళేనికి చెందిన మత్స్యకారుల వలలను కోయడంతో, ఇంజిన్ చిక్కుకొని కదల్లేని స్థితికి చేరుకుంది. అదే సమయంలో కృష్ణపట్నం సంయుక్త సముద్ర గస్తీ బృందం ఘటన స్థలానికి చేరుకొని పడవను అదుపులోకి తీసుకున్నారు. మత్స్యశాఖ అధికారులతో కలిసి తదుపరి చర్యల నిమిత్తం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కు తరలించారు. -
ఆనందాల కుటుంబంలో పుట్టెడు శోకం
● కొత్తకోడూరు బీచ్లో మునిగి బాలుడి మృతి, బాలిక గల్లంతు తోటపల్లిగూడూరు(పొదలకూరు): వారు ఎంతో ఆనందంతో నెల్లూరు రొట్టెల పండగకు వచ్చా రు. సముద్ర స్నానం చేద్దామని తోటపల్లిగూడూరు మండలం కొత్తకోడూరు బీచ్కు వెళ్లారు. సరదాగా నీటి లో మునుగుతూ అలల తాకిడికి ఆనందించారు. అంతలోనే ఆ కుటుంబంలోని బాలుడు అలల తాకిడికి మృతిచెందగా మరో బాలిక గల్లంతు కాగా ఓ బాలికను రక్షించారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా సోమల మండలం కందుకూరు గ్రామానికి చెందిన మహ్మద్ రఫీ కుటుంబం శనివారం రొట్టెల పండగకు వచ్చారు. నెల్లూరులో రొట్టెలను పట్టుకుని సరదగా సముద్ర స్నానం చేసేందుకు కొత్తకోడూరు బీచ్కు వెళ్లారు. ఈ క్రమంలో సముద్రంలో స్నానం చేస్తున్న మహ్మద్ సోఫియాన్(11), నఫీసా రుక్సానా, ముంతహిర సమీన్ అలల తాకిడికి గురయ్యారు. సోఫియాన్ మృతిచెందగా నఫిసా రుక్సాన గల్లంతయ్యారు. సమీన్ను అక్కడి వారు కాపాడారు. ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. రుక్సానా కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఘటనా స్థలానికి పోర్టు సీఐ రఘుబాబు, తోటపల్లిగూడూరు ఎస్సై వీరంద్రబాబు చేరుకుని విచారణ చేపట్టారు. కాగా ఈ ఘటనతో మహ్మద్ రఫీ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. గల్లంతైన రుక్సానా కోసం ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. -
నిర్బంధం, దాడి అవాస్తవం
నెల్లూరు (క్రైమ్): వరికుంటపాడు మండలం గణేష్పురానికి చెందిన ఎస్. రవీంద్రరెడ్డిని కొండాపురం పోలీసులు అక్రమంగా నిర్బంధించి కొట్టారంటూ సామాజిక మాధ్యమాలు, కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు పూర్తి అవాస్తవమని కావలి డీఎస్పీ వీవీ రమణకుమార్ స్పష్టం చేశారు. శనివారం నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో కలిగిరి సీఐ సుబ్బారావుతో కలిసి మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. డీఎస్పీ మాట్లాడుతూ రవీంద్రరెడ్డిపై కొండాపురం పోలీసుస్టేషన్లో రౌడీషీట్ ఉందనీ, ప్రతి ఆదివారం పోలీసుస్టేషన్లో నిర్వహించే కౌన్సెలింగ్కు హాజరుకావడం లేదని, ఇదే సమయంలో నగదు తీసుకుని మోసగించాడంటూ ఒకరు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారన్నారు. దీంతో ఎస్సై అతన్ని తీసుకురావాలని ఇద్దరు కానిస్టేబుల్స్ను పంపగా వారిపై రవీంద్రరెడ్డి దురుసుగా ప్రవర్తించారన్నారు. అనంతరం ఆయన్ను పోలీసుస్టేషన్కు తీసుకువచ్చి ఫిర్యాదుపై విచారించి, సత్ప్రవర్తనతో ఉండాలని స్థానిక తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసి పంపించినట్లు తెలిపారు. -
చుక్కల మందుతో భద్రత
● జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు 2,67,750 మంది ● 6,656 పోలియో బూత్ల ఏర్పాటునెల్లూరు(అర్బన్): జిల్లాలో శిశు పక్షవాతం(పోలియో)ను నివారించేందుకు ఆదివారం నుంచి మూడ్రోజుల పాటు పోలియో చుక్కల మందును వైద్యశాఖ ఆధ్వర్యంలో వేయనున్నారు. ఇటీవల ఇంటింటి సర్వే చేసి అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోని చిన్నారులు జిల్లాలో 2,67,750 మంది ఉన్నట్టు వైద్యశాఖ లెక్కలు తేల్చింది. జిల్లాలో 52 పీహెచ్సీలు, 28 అర్బన్హెల్త్ సెంటర్లు, మున్సిపల్ కార్పొరేషన్లో ఒక ట్రాన్సిట్ కేంద్రం పరిధిలో చుక్కల మందు వేస్తారు. మొత్తం 1,620 బూత్లతో పాటు 83 మొబైల్ బూత్లు, 88 ట్రాన్సిట్ బూత్లు జిల్లాలో ఏర్పాటు చేశారు. ఈ బూత్లలో చుక్కల మందు వేసేందుకు 6,656 మందిని నియమించారు. అలాగే రూట్ సూపర్వైజర్లు 252 మందిని, మొబైల్ టీమ్స్లో 166 మందిని కలిపి మొత్తం 7,074 మంది సేవలందించనున్నారు. 5,206 వ్యాక్సిన్ క్యారియర్స్ను, 78 పెద్ద కోల్డ్ బాక్సులను ఏర్పాటు చేసి జాగ్రత్తగా పోలియో కేంద్రాలకు చేర్చారు. మొదటి రోజు పోలియో బూత్ల వద్ద చుక్కల మందువేస్తారు. మందు వేయించిన చిన్నారికి ఓటర్ లాగానే వేలికి సిరా చుక్క వేస్తారు. రెండోరోజు, మూడో రోజు ఇంటింటి సర్వే ద్వారా ఎక్కడైనా పిల్లలు మిగిలిపోయి ఉంటే వారికి కూడా చుక్కల మందు వేస్తారు. నగరంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. -
రొట్టెల పండగకు ‘కూటమి’ రంగు
నేతల గుప్పెట్లో పండగ నెల్లూరు(బృందావనం): రొట్టెల పండగ. ఇది మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. శుక్రవారం నుంచి మంగళవారం వరకు ఐదురోజులపాటు నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో జరుగుతుంది. అయితే పండగలో ‘కూటమి’ పెద్దల జోక్యం మితిమీరిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంప్రదాయాలు తెలిసిన వారిని దూరం పెట్టి రాజకీయంగా అనుకూలంగా ఉన్నవారికి బాధ్యతలు అప్పగించారనే అసంతృప్తి ముస్లిం సామాజిక వర్గంలో వ్యక్తమవుతోంది. అటు ఆర్థిక, ఇటు రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచనలతో కొందరు కూటమి పెద్దలు చేసిన నిర్వాకం ఇప్పుడు చర్చకు దారి తీసింది. వారి తీరును ప్రశ్నిస్తే ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందోనని లోలోన మదనపడుతున్నారు. తమవారికే అవకాశం గతంలో సంప్రదాయాలపై అవగాహన ఉన్న 20 నుంచి 30 మంది సభ్యులతో ఫెస్టివల్ కమిటీలు ఏర్పాటు చేసి ఎలాంటి వివాదాలకు తావులేకుండా పండగ నిర్వహించేవారనేది కొందరి మతపెద్దలు మాట. ప్రస్తుతం రాజకీయ జోక్యం పెరగడంతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కమిటీ ఏర్పాటులో తమ అనుయాయులకు, తమకు అనుకూలంగా ఉండేవారికి అవకాశాలు కల్పించారనే విమర్శలున్నాయి. పండగ నిర్వహణపై అవగాహన ఉన్నవారు ఉంటే లోటుపాట్లను ప్రశ్నించే అవకాశం ఉంటుందని, అయితే ఇలాంటి అవకాశం లేకుండా చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్, మతపెద్ద సయ్యద్ సమీ దర్గా సంప్రదాయాలు సక్రమంగా పాటించడం లేదని, ధార్మిక కార్యక్రమాల్లో రాజకీయాల జోక్యం ఏమిటంటూ ప్రశ్నించడం దుమారం రేపింది. డిప్యూటీ మేయర్ దూరం రొట్టెల పండగ ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశాలకు డిప్యూటీ మేయర్ తహసీన్ హాజరుకాకపోవడంపై కూడా చర్చ జరుగుతోంది. మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, కలెక్టర్, ఎస్పీ తదితరులతో జరిగిన సమావేశాల్లో మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అయితే ముస్లిం వర్గానికి చెందిన డిప్యూటీ మేయర్ను ఆహ్వానించారా? లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆహ్వానం ఉన్నప్పటికీ కొందరి ఆధిపత్య ధోరణుల కారణంగా ఆమె దూరంగా ఉన్నారనే చర్చ కూడా జరుగుతోంది. మితిమీరి.. ధార్మిక కార్యక్రమాల్లో కొందరు కూటమి నేతలు మితిమీరి రాజకీయ పెత్తనం చేయడం ముస్లిం వర్గాన్ని అసహనానికి గురిచేస్తోందని సమాచారం. రొట్టెల పండగలో గంధమహోత్సవం ప్రధాన ఘట్టం. 12 గంధం బిందెలుతో ఉత్సవం భక్తిప్రపత్తులతో వేడుకగా సాగుతుంది. గతేడాది ఏ మాత్రం అవగాహన లేని వారు గంధాన్ని లేపనం చేసి తమతో తీసుకెళ్లిపోయారన్న విమర్శలు వచ్చాయి. ఈ సంవత్సరం అటువంటి లోటుపాట్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా భక్తిభావం, ధార్మిక కార్యక్రమాలపట్ల అవగాహన ఉన్న వారిని గంధ మహోత్సవానికి ఎంపిక చేస్తే బాగుంటుందని మతపెద్దలు ఆనాటి ఘటనలను గుర్తుచేసుకుని చెబుతున్నారు. కూటమి పెద్దలు తమకు అనుకూలమైన 12 మందిని గంధ మహోత్సవానికి ఎంపిక చేసే ప్రక్రియలో తలమునకలై ఉన్నారని సమాచారం. మితిమీరిన ఆయా పార్టీల పెద్దల జోక్యం సంప్రదాయాలు తెలిసిన వారిని దూరం పెట్టి.. అవగాహన లేని వారికి అందలం ప్రశ్నిస్తే ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని మౌనం బారాషహీద్ దర్గా రొట్టెల పండగను రాజకీయ నాయకులు తమ ఆధిపత్యంలోకి తీసుకున్నారని నెల్లూరు జిల్లా సాదత్ మషాయీఖ్ వెల్ఫేర్ కమిటీ (మహనీయులు పూర్వీకుల వంశావళి, పీఠాధిపతుల సంక్షేమ సంఘం) ఆందోళన వ్యక్తం చేసింది. సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, గంధ మహోత్సవం పవిత్రతను కూడా విస్మరిస్తున్నారని ఆరోపించింది. చిన్నబజార్లోని నెల్లూరు పెద్ద దర్గాలోని సయ్యద్ ఖాజాపీర్ మకాన్ అసార్ఘర్లో గురువారం పీఠాధిపతి కేఎస్ఎస్ బాబాసాహెబ్ బందానవాజ్, సాదత్ సయ్యద్ ఫయాజ్ రిజ్వీ, సర్దార్ హుస్సేన్ సాహిబ్, అబుల్ హసన్ హుస్సేన్ సాహిబ్, మౌలానా ఇస్తియాఖ్ అహ్మద్లు మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న రొట్టెల పండగ, బారాషహీద్ దర్గా గంధ మహోత్సవంలో స్థానిక మత పెద్దలు, సాదత్ పూర్వీకుల వంశావళి (మషాయీఖ్)కి తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలను కోరుతున్నప్పటికీ స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ఇష్టానుసారంగా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల సంప్రదాయాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. -
విద్యుత్ బిల్లులను నేడూ చెల్లించొచ్చు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం సెలవైనా జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు యథావిధిగా పనిచేయనున్నాయని ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు నెల్లూరు(అర్బన్): జిల్లాలో ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేశారని తెలిస్తే సదరు వైద్యులపై కఠిన చర్యలు చేపడతామని డీఎంహెచ్ఓ సుజాత స్పష్టం చేశారు. గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై జిల్లా స్థాయి సలహా మండలి సభ్యులతో సంతపేటలోని డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ చట్టాన్ని స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు ఉల్లంఘించారని తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1800 233 2447ను సంప్రదించాలని కోరారు. చట్టం కింద రిజిస్టరైన ప్రతి డాక్టర్.. గర్భిణులకు సంబంధించిన వివరాలను ఆన్లైన్ పోర్టల్లో ఫారం – ఎఫ్లో తప్పక నమోదు చేయాలని కోరారు. చట్ట జిల్లా స్థాయి సలహా సంఘ చైర్పర్సన్ డాక్టర్ కిరణ్, పీడియాట్రిక్స్ అసోసియేషన్ ప్రొఫెసర్ లక్ష్మీప్రసన్న, అనాటమీ అసోసియేట్ ప్రొఫెసర్ స్వర్ణారెడ్డి, డీఐఓ ఉమామహేశ్వరి, డెమో అధికారి కనకరత్నం, ఎన్జీఓలు కవితారెడ్డి, శ్రీనివాసరావు, కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. మరోసారి ప్రభుత్వ భూముల ఆక్రమణ..? ● గతంలోనూ వివాదాలు మర్రిపాడు: మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ, కొండ పొరంబోకు భూముల ఆక్రమణలపై గతంలో ఆరోపణలు వెల్లువెత్తగా, తాజాగా పెగళ్లపాడులోని సర్వే నంబర్ 6లో భూమిని చదును చేసి కబ్జాకు యత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 34 ఎకరాల పరిధిలోని భూమిలో 12 ఎకరాలను చదును చేసి ఆక్రమించేందుకు గ్రామానికి చెందిన డీలర్ దుద్దుకుంట శేఖర్ యత్నించారని పేర్కొన్నారు. ఇదే ప్రాంతంలో గతంలో సుమారు 12 ఎకరాలు కబ్జాకు గురయ్యాయని తెలిపారు. గ్రామంలోని ప్రభుత్వ భూములపై వివాదాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అప్పట్లో ఫిర్యాదు చేసినా, శాశ్వత చర్యలు కానరావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూముల రక్షణ కోసం ప్రత్యేక సర్వేను నిర్వహించి.. ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. -
జాతీయ రహదారి నిర్మాణానికి సర్వే
ముత్తుకూరు(పొదలకూరు): భారతమాల ప్రయోజన ప్రాజెక్టులో భాగంగా జాతీయ రహదారి నిర్మాణానికి గురువారం గోపాలపురంలో అధికారులు సర్వే నిర్వహించారు. నారికేళపల్లి గ్రామం వద్ద నుంచి ముత్తుకూరు మీదుగా కృష్ణపట్నం గ్రామ పంచాయతీ గోపాలపురం, కృష్ణపట్నం పోర్టు వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణం కోసం సర్వే చేశారు. మండల సర్వేయర్ మస్తాన్, మరి కొందరు సహాయక బృందం సర్వేలో పాల్గొన్నారు. 5.175 కి.మీ మేరకు కృష్ణపట్నం పోర్టు వరకు రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. గోపాలపురం ప్రాంతంలో రహదారి నిర్మాణానికి అధిక భాగం నివాస గృహాలు ఖాళీ చేయాల్సి వస్తుంది. స్లాబ్లతో కూడిన భవనాలు, రేకుల ఇళ్లు, ఖాళీ స్థలాలు, పంచాయతీ ఆస్తులు తదితర వివరాలను అధికారులు నమోదు చేసుకున్నారు. మార్కెట్ ధరను బట్టి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లిస్తుందని వెల్లడించారు. బాధితులు తమ అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చన్నారు. పట్టా స్థలాలతో పాటు పోరంబోకు స్థలాల్లో ని నిర్మాణాలను కూడా అధికారులు పరిశీలించారు. -
1,743 మందితో భారీ బందోబస్తు
● 99 సీసీ కెమెరాలు, 26 డ్రోన్లతో పర్యవేక్షణ నెల్లూరు(క్రైమ్): రొట్టెల పండగ నేపథ్యంలో ఎస్పీ అజిత వేజెండ్ల పర్యవేక్షణలో నగర ఏఎస్పీ దీక్ష బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లాతోపాటు వివిధ జిల్లాకు చెందిన 1,743 మంది పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. దర్గా ఆవరణలో పోలీసు అవుట్ పోస్టు పెట్టారు. దర్గా ఆవరణ, పరిసర ప్రాంతాలు, పార్కింగ్ ప్రదేశాల్లో 96 సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానించారు. సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం కలిగిన సిబ్బంది 24 గంటలూ దర్గా పరిసరాలను నిశితంగా పరిశీలించనున్నారు. 24 డ్రోన్లతో నిఘాను పటిష్టం చేశారు. ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలుగకుండా మూడు ప్రధాన డైవర్షన్ పాయింట్లు, రెండు భారీ వాహనాల మళ్లింపు మార్గాలుు, 21 పార్కింగ్ ప్రాంతాలు, 20 మూవింగ్ పార్టీలు, 95 ట్రాఫిక్ నియంత్రణ పాయింట్లను ఏర్పాటు చేశారు. బట్వాడిపాళెం జంక్షన్, డీపీఓ పాయింట్, కేవీఆర్ జంక్షన్, పొదలకూరు రోడ్డు జంక్షన్ వద్ద బారికేడ్లను పెట్టారు. -
అంతా గోప్యం..
● ఎస్ఐఆర్పై 11 జిల్లాల కలెక్టర్లతో సమీక్ష ● మీడియాకు నో ఎంట్రీ నెల్లూరు(అర్బన్): ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా (ఎస్ఐఆర్) ప్రక్రియను ఎన్నికల సంఘం చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో బూత్ లెవల్ ఆఫీసర్లతో ఇంటింటి సర్వే జరుగుతోంది. దీనిపై సమీక్షించేందుకు గానూ 11 జిల్లాల కలెక్టర్లు, ఎంపిక చేసిన బీఎల్వోలతో కలెక్టరేట్లో సమావేశాన్ని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు గురువారం చేపట్టారు. ప్రకాశం, మార్కాపురం, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాలతో పాటు నెల్లూరు జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషనర్ నవీన్కుమార్, రాష్ట్ర సీఈఓ వివేక్యాదవ్, కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు పాల్గొని.. ఇంటింటి సర్వేలో వస్తున్న ఇబ్బందులు, సమస్యలపై ఆరాతీశారు. విమర్శలు రాకుండా వాస్తవాలతో కూడిన ఓటర్ల జాబితాను తయారు చేసేందుకు సూచనలు చేశారు. ప్రక్రియను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం సర్వే వివరాలను డిజిటలైజ్ చేయాలని సూచించారు. వివరాలను బయటకు పొక్కనీయకుండా.. ఎస్ఐఆర్ పేరుతో కొన్ని వర్గాల ఓట్లను తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమీక్షలో వివరాలు బయటకు పొక్కకుండా కలెక్టర్ హిమాన్షు శుక్లా జాగ్రత్తలు తీసుకున్నారు. మీడియాకు సమాచారం లేకుండా సమావేశాన్ని గో ప్యంగా నిర్వహించారు. బీఎల్వోలందర్నీ పిలవకుండా ఎంపిక చేసిన అతి కొద్ది మందినే ఆహ్వానించి క్షేత్రస్థాయిలో జరుగు తున్న సర్వే తీరును సమీక్షించారు. వివరాలను మీ డియాకు ఇవ్వొద్దంటూ సమాచార, పౌరసంబంధా ల శాఖను ఆదేశించారు. తమకు ఓట్లేయని వారి పే ర్లను జాబితా నుంచి తొలగించేలా అధికార పార్టీకి చెందిన నేతలు ఎన్నికల కమిషన్ ద్వారా చేయిస్తున్నారంటూ ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ లాంటి వారు సభలు, సమావేశాల ద్వారా శాసీ్త్రయంగా ఆరోపిస్తున్నారు. సమావేశాలను రహస్యంగా జరపడాన్ని చూస్తే ఇలాంటి ఆరోపణలకు బలం చేకూరుతోందని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా పారదర్శకంగా సమీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. -
నేటి నుంచి విద్యుత్ భద్రతా వారోత్సవాలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు శుక్రవారం నుంచి జూలై 2వ తేదీ వరకు విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం తెలిపారు. గురువారం నెల్లూరులోని విద్యుత్ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సామర్థ్యం, నిబంధనల అమలు, జాగ్రత్త, విద్యుత్ భద్రతను నిర్ధారించడం’ అనే నినాదంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విద్యుత్ ప్రమాదాలను తగ్గించడం, వినియోగదారుల్లో భద్రతా అవగాహన పెంచడం వారోత్సవాల ప్రధాన ఉద్దేశమన్నారు. జిల్లాలోని అన్ని విద్యుత్ డివిజన్ల పరిధిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. విద్యుత్ పనులు చేసే సిబ్బందికి అవసరమైన శిక్షణ, నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పిస్తామన్నారు. షార్ట్ సర్క్యూట్ ప్రమాదాల నివారణకు ప్రజలు నాణ్యమైన విద్యుత్ వైర్లు వినియోగించాలని, విద్యుత్ లోడ్కు అనుగుణంగా పరికరాలు వాడాలని సూచించారు. దెబ్బతిన్న వైర్లు, పాత వైరింగ్ను మార్చుకోవాలని, ఎర్తింగ్ సదుపాయం తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ఏసీలు, ఇతర విద్యుత్ పరికరాలకు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించుకోవడంతోపాటు లైసెన్స్ కలిగిన ఎలక్ట్రీషియన్లతోనే పనులు చేయించుకోవాలని సూచించారు. వారోత్సవాల సందర్భంగా విద్యుత్ సిబ్బంది వినియోగదారులకు భద్రతా చర్యలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు. -
రెప్పపాటులో ప్రమాదం.. మహిళ మృతి
● లారీని ఢీకొట్టిన ఆటో ● 10 మంది మహిళలకు తీవ్రగాయాలు మనుబోలు: ఆ మహిళలంతా ఇంటి నుంచి కూలీ పనికి బయలుదేరారు. అయితే హైవేపై లారీ ఆగి ఉంది. దీనిని ఆటో ఢీకొట్టడంతో ఓ మహిళ చనిపోయింది. మరో 10 మంది, డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మనుబోలు మండల కేంద్రం పరిధిలోని జాతీయ రహదారిపై పోలీస్స్టేషన్కు సమీపంలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మండలంలోని మడమనూరు సమీపంలో ఉన్న రొయ్యల ఫ్యాక్టరీకి గూడూరు మండలం చెన్నూరు నుంచి మహిళా కూలీలతో ఆటో వెళ్తోంది. పోలీస్స్టేషన్ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న సీహెచ్ సంతోషి, లక్ష్మి, టి.ఉష, ఎం.శివకుమారి, జి.సుజాత, పి.బుజ్జమ్మ, ఎస్కే హుస్సేన్బీ, కె.శ్రీలత, ఎం.మంగమ్మ, ఎస్కే జిలేఖ, విజయలక్ష్మి, డ్రైవర్ శివకుమార్ తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో మహిళలంతా చెల్లాచెదురుగా పడిపోయారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా కొద్దిసేపు భయానకంగా మారింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గూడూరు, నెల్లూరులోని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన గూడూరు మాళవ్యా నగర్కు చెందిన సీహెచ్ సంతోషి (26) నెల్లూరులో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈమెకు భర్త రాంబాబు, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అడ్డదిడ్డంగా పార్కింగ్ మండల పరిధిలోని జాతీయ రహదారిపై పలుచోట్ల లారీలను ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తున్నారు. మనుబోలు బీసీ కాలనీ దారి, కాగితాలపూరు క్రాస్రోడ్డు, కొండూరుసత్రంలోని హోటళ్ల వద్ద నిత్యం రోడ్డుపైనే పదుల సంఖ్యలో లారీలు ఆపుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల ఎదురుగా బీసీ కాలనీ వద్ద ఈ పరిస్థితి ఉంది. దీంతో నిత్యం రద్దీ గా ఉండే హైవే ఇరుకుగా మారి తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. లారీలను అడ్డదిడ్డంగా రోడ్డుపై నిలుపుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగానే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. -
అరాచకాలను గమనిస్తున్నారు..
బాబు పాలనలో కరువే.. ● రైతుల ప్రయోజనాలే లక్ష్యం ● లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ● వందలాది మందితో సోమశిల జలాశయ సందర్శన ఆత్మకూరు: రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కమిటీ ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను సాధించుకునేందుకు ప్రాణాలర్పించేందుకైనా సిద్ధమని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన చలో సోమశిల కార్యక్రమం విజయవంతమైంది. దీనికి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వెంకటగిరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల సమన్వయకర్తలు నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, ఆనం విజయకుమార్రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో కాకాణి మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో కుదుర్చుకున్న లోపాయికారీ ఒప్పందంతో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వీర్యం చేశారని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా అక్కడి సీఎం మాటలతో ఈ విషయం తేటతెల్లమైందని చెప్పారు. దేశంలో చంద్రబాబు లాంటి రైతు ద్రోహి మరెవరూ ఉండరని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రైతాంగ ప్రయోజనాల కోసం జలయజ్ఞం పనులను దివంగత సీఎం వైఎస్సార్ చేపట్టారని గుర్తుచేశారు. జిల్లాలోని మెట్ట ప్రాంతాలు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలనే మహోన్నత ఆశయంతో లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి గత సీఎం జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేసి రూ.3500 కోట్లను వెచ్చించి 50 శాతం మేర పూర్తి చేశారని వివరించారు. అయితే ఇది పూర్తయితే ఆయనకు ఎక్కడ మంచి పేరొస్తుందనే ఉద్దేశంతో నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఇలాంటి చీకటి ఒప్పందాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుతూ భూసేకరణ చేస్తోందని, రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా.. చంద్రబాబు దాని ఊసెత్తడంలేదని విమర్శించారు. రైతాంగం నష్టపోతే వారి శాపాలు బాబుకు తప్పవని స్పష్టం చేశారు. విడ్డూరంగా టీడీపీ నేతల వ్యాఖ్యలు పర్యావరణ అనుమతుల్లేవంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారని, అయితే ఎలాంటి పర్మిషన్లు లేకుండానే వివిధ రూపాల్లో ఎనిమిది టీఎంసీలను తెలంగాణ ప్రభుత్వం తరలించుకుపోతుండటం వారికి కనిపించడంలేదానని ప్రశ్నించారు. నెల్లూరు, సంగం బ్యారేజీల నిర్మాణాన్ని గత సీఎం జగన్మోహన్రెడ్డి పూర్తి చేశారని చెప్పారు. గత టీడీపీ పాలనలో సోమశిల జలాశయాన్ని 36 టీఎంసీలకు మించి నింపలేదని, అయితే ముంపు ప్రాంతాల వారికి నష్టపరిహారాన్ని దివంగత సీఎం వైఎస్సార్ చెల్లించి తొలిసారిగా 72 టీఎంసీలను నిల్వ చేశారని తెలిపారు. కూటమి రెండేళ్ల పాలనలో బ్యారేజీల పేర్లు తొలగించడం మినహా ఏమి చేశారని ప్రశ్నించారు. రైతులకు యూరియానే అందించలేని చంద్రబాబు.. భవిష్యత్తులో సాగునీటినీ ఇవ్వలేరని దుయ్యబట్టారు. ఉద్యమంలా వస్తున్న తమ పార్టీ శ్రేణులను అడ్డుకునేందుకు వందలాది మంది ఖాకీలను మోహరించారని, ఇలా చేస్తుండటంతోనే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దెబ్బతిని శాంతిభద్రతలు ప్రశ్నార్థకంగా మారాయని చెప్పారు. లిఫ్ట్ ఇరిగేషన్ను సాధించేంత వరకు పోరాటాలను చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆదిశేషయ్య, పార్టీ మున్సిపల్ విభాగ కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు, పార్టీ మండల కన్వీనర్లు బిజివేముల పిచ్చిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ఎంపీపీలు పద్మజారెడ్డి, పెయ్యల సంపూర్ణమ్మ, రఘునాథరెడ్డి, మాజీ సర్పంచ్ లక్ష్మీదేవి, కల్పనారెడ్డి, రహీం, కొప్పోలు వెంకటేశ్వర్లు, లింగాబత్తిన హరీష్, బాలఅంకయ్య, రాజశేఖర్రెడ్డి, వరప్రసాద్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అడ్డుకున్న పోలీసులు జలాశయ గేట్లను డీఎస్పీ వేణుగోపాల్, సీఐ గంగాధర్, పోలీసులు మూసేసి పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు. కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. జలాశయ మనుగడను కాపాడేందుకు.. లిఫ్ట్ ఇరిగేషన్ సాధన కోసమే చలో సోమశిల కార్యక్రమాన్ని చేపట్టామని నేతలు తెలిపారు. దీంతో కొద్ది మంది వెళ్లేందుకు అనుమతిచ్చారు. పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా జై జగన్.. రైతు ద్రోహి చంద్రబాబు అని భారీగా నినాదాలు చేశారు. డ్యామ్ వద్దకు నేతలతో భారీగా చేరుకున్నారు. జలాశయ సందర్శనకు ర్యాలీగా వస్తున్న నేతలు బహిరంగ సభలో మాట్లాడుతున్న కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రాజెక్ట్ను సందర్శిస్తే ప్రభుత్వానికి నష్టమేమిటి..? కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు చేస్తున్న అరాచకాలను రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి పేర్కొన్నారు. రైతాంగానికి విఘాతం కలిగేలా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని చంద్రబాబు గ్రహణం పట్టించారని ఆరోపించారు. దీన్ని నిర్వీర్యం చేస్తే కావలికి సాగునీరు ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని సాధించుకునేందుకు పార్టీలకతీతంగా కృషి చేయాలని కోరారు. సోమశిల ప్రాజెక్ట్ను తాము సందర్శిస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమిటని కాకాణి ప్రశ్నించారు. వారి చీకటి ఒప్పందాలను ప్రజల ముందుకు తెస్తున్నామనే భయంతోనే తమ గొంతు నొక్కేందుకు అడుగడుగునా పోలీసులను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ఇలాంటి అప్రజాస్వామిక ఆంక్షలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైతు ద్రోహిగా మారిన చంద్రబాబును బ్రిటిష్ పాలకులను తరిమినట్లే రాష్ట్ర ప్రజలు త్వరలోనే తరిమికొడతారని పేర్కొన్నారు. రాయలసీమ అని ఉండటంతో ఈ ప్రాజెక్ట్ కేవలం చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించిందని, జిల్లాకు ఏమి ఉపయోగం ఉంటుందని కొందరు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రైతులకు మేలు చేసింది వైఎస్సార్ కుటుంబమేనని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. బాబు పాలనలో కరువు కాచుకొని ఉంటుందని చెప్పారు. జలయజ్ఞం ద్వారా ఎన్నో ప్రాజెక్టులను నిర్మించి.. సాగునీటిని అందించి పాడి పంటలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత దివంగత వైఎస్సార్కే దక్కుతుందని కొనియాడారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా సోమశిల జలాశయానికి అదనపు జలాలొచ్చేలా గత సీఎం జగన్మోహన్రెడ్డి ఎన్నో చర్యలు చేపడితే, దాన్ని కూటమి ప్రభుత్వం నిలిపేయడం దారుణమని చెప్పారు. -
గరుడ వాహనంపై నారసింహుడు
రాపూరు: పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి మూలమూర్తి గురువారం చందనాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలమూర్తికి ఎటువంటి ఆభరణాలు, పుష్పాలు లేకుండా చందనంతో అలంకరించారు. ఉదయం 8 గంటలకు స్వామి నిత్య కల్యాణ మండపంలో లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవి, ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. స్వాతి నక్షత్రం కావడంతో స్వామికి శాంతి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతిని జరిపించారు. అనంతంరం కల్యాణాన్ని కనులపండువగా చేశారు. రాత్రి స్వామి బంగారు గరుడ వాహనంపై కొలువుదీర్చి మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. -
కోర్కెలు తీరాలి.. మళ్లీ రావాలి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రొట్టెల పండగకు సర్వం సిద్ధమైంది. కోర్కెల రొట్టెల కోసం దేశ, విదేశాల నుంచి తరలివస్తున్నారు. భక్తజన తరంగాలతో స్వర్ణాల చెరువు సరికొత్త శోభను సంతరించుకుంది. శుక్రవారం నుంచి ఈ నెల 30 వరకు ఐదు రోజుల పాటు పండగను అంగరంగవైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. దర్గా ప్రాంగణం కళకళలాడుతోంది. ఏర్పాట్లు పూర్తి సొందల్మాలిని శుక్రవారం.. గంధ మహోత్సవాన్ని శనివారం.. రొట్టెల పండగను ఆదివారం.. తహలీల్ ఫాతేహాను సోమవారం.. ముగింపు వేడుకలను మంగళవారం నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. పారిశుధ్యానికి పెద్ద పీటేస్తూ దాదాపు ఆరు వేల మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తించేలా కేటాయించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను పోలీస్ యంత్రాంగం చేసింది. దర్గా ప్రాంగణం, పార్కింగ్ ప్రదేశాల్లో సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించనున్నారు. గజ ఈతగాళ్లతో నిరంతర గస్తీ స్వర్ణాల చెరువులో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అన్ని చర్యలను మత్స్యశాఖ చేపట్టింది. 15 బోట్లు.. షిఫ్ట్కు 15 మంది చొప్పున మొత్తం 45 మంది గజ ఈతగాళ్లను నియమించారు. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, అన్నమయ్య, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి 125 మంది అగ్నిమాపక సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. రొట్టెలు మార్చుకుంటూ.. స్వర్ణాల చెరువులో కేరింతలు కొడుతూ.. రొట్టెల పండగకు సర్వం సిద్ధం నేటి నుంచి ఐదు రోజుల పాటు నిర్వహణ దేశ, విదేశాల నుంచి వస్తున్న భక్తజనం సందడిగా దర్గా ప్రాంగణం -
ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ఏర్పాటు
● జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 52 సర్వీసులు నెల్లూరు సిటీ: నెల్లూరు బారాషహీద్ దర్గాలో ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న రొట్టెల పండగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షమీమ్ తెలిపారు. గురువారం ఆమె వివరాలు వెల్లడించారు. నెల్లూరు నుంచి కసుమూరుకు 20, రైల్వేస్టేషన్ నుంచి కసుమూరుకు 10, వెంకటాచలం నుంచి కసుమూరుకు 2, నెల్లూరు నుంచి ఏఎస్పేటకు 8, ఆత్మకూరు నుంచి ఏఎస్పేట మీదుగా నెల్లూరు వరకు 12 బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సీ్త్ర శక్తి, దివ్యాంగ శక్తి పథకాలు వర్తిస్తాయని పేర్కొన్నారు. ● రొట్టెల పండగకు వచ్చే భక్తుల కోసం నెల్లూరు నుంచి చైన్నెకి 2, బెంగళూరుకు 4, కడపకు 3, విజయవాడకు 5 ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు షమీమ్ తెలిపారు. ఈనెల 28వ తేదీన ఏఎస్పేట నుంచి హైదరాబాద్కు 2, ఏఎస్పేట నుంచి బెంగళూరుకు 1 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు వెల్లడించారు.కారు, ఆటో ఢీ ● ముగ్గురికి తీవ్రగాయాలు జలదంకి(కావలి): జలదంకి మండలం లింగరాజుఅగ్రహారం క్రాస్రోడ్డు వద్ద గురువారం కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. కావలి నుంచి జలదంకి మండలం నాగిరెడ్డిపాళేనికి ఇద్దరు మహిళా ప్రయాణికులతో వెళ్తున్న ఆటో, జలదంకి మండలం బ్రాహ్మణక్రాక నుంచి కావలి వైపు వెళ్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలోని శాంతమ్మ, అలేఖ్య, డ్రైవర్ శ్రీకాంత్ తీవ్రంగా గాయపడ్డారు. కారులోని ఐదుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు ఎయిర్ బ్యాగ్లు తెరుచుకోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఆటో మూడు భాగాలుగా విడిపోయి రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో ఆ ప్రాంతమంతా బీభత్సంగా మారింది. మద్యం మత్తులో యువకుడి హల్చల్● జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం బుచ్చిరెడ్డిపాళెం: పట్టణంలోని ముంబై జాతీయ రహదారిపై గురువారం మద్యం మత్తులో ఓ యువకుడు హల్చల్ చేసి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగించాడు. ద్విచక్ర వాహనాన్ని రహదారిపై అడ్డంగా నిలిపివేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులతో అతను వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు కల్పించుకుని యువకుడిని శాంతింపజేయడానికి ప్రయత్నించినా వినిపించుకోలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. -
దొంగల హల్చల్
● జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో చోరీలు ● దగదర్తిలో నగదు, బంగారం, వెండి అపహరణ జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో దొంగలు హల్చల్ చేశారు. ఆలయాలు, ఇళ్లు, మద్యం షాపుల్లో చోరీలకు పాల్పడ్డారు. దగదర్తి: మండల కేంద్రమైన దగదర్తి మల్లయ్యమిట్ట ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగిన చోరీ కలకలం రేపింది. సుమారు రూ.4 లక్షల నగదు, ఏడు సవర్ల బంగారు నగలు, 750 గ్రాముల వెండి వస్తువులను చోరీ చేశారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. షేక్ అలీమ్ ప్రధాన రహదారి పక్కన నివాసం ఉంటూ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం అతని భార్య, కుమారుడు సమీపంలోని వెలుపొడు గ్రామానికి వెళ్లారు. అలీమ్ రాత్రి ఇంటి వద్ద నిద్రించే సమయంలో తలుపులకు తాళం వేయలేదు. బీరువా తాళాన్ని అక్కడే ఉంచి ఆరుబయట నిద్రపోయాడు. బుధవారం ఉదయం భార్య, కుమారుడు ఇంటికి చేరుకుని బీరువాను పరిశీలించగా అందులో ఉన్న నగదు, బంగారు నగలు, వెండి వస్తువులు కనిపించకపోవడంతో చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. డాగ్ స్క్వాడ్ను పిలిపించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెండు వైన్ షాపుల్లో.. దుత్తలూరు: మండల కేంద్రమైన దుత్తలూరులో రెండు వేర్వేరు చోట్ల ఉన్న వైన్ షాపుల్లో మంగళవారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఒక దుకాణంలో రూ.లక్ష నగదు, మరో దుకాణంలో కొద్దిపాటి నగదు, మద్యాన్ని అపహరించారు. బుధవారం ఉదయం గమనించిన సిబ్బంది ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండు ఆలయాల్లో.. వరికుంటపాడు: మండలంలోని తూర్పుచెన్నంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోరీలు జరిగాయి. స్థానికులు కథనం మేరకు.. రామాలయం, అంకాలమ్మ ఆలయాల్లో హుండీలను గుర్తుతెలియని దుండగులు పగులగొట్టారు. సుమారు రూ.10 వేల వరకు నగదును చోరీ చేశారు. గ్రామస్తుల సమాచారంతో ఎస్సై మధుసూదన్రావు, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. చోరీకి పాల్పడిన దొంగలను త్వరితగతిన గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు కోరారు. మండలంలో ఉండే 24 పంచాయతీల్లో వరుస చోరీలు జరుగుతున్నాయి. రూ.లక్షల విలువచేసే నగలు వెండి వస్తువులు చోరీకి గురవుతున్నాయి. అయినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. -
జీవనాడికి శాపం
నేడు చలో సోమశిల ● రాయలసీమ ఎత్తిపోతల పథకంతో నెల్లూరు సస్యశ్యామలం ● ఈ ప్రాజెక్ట్ పూర్తయితే శ్రీశైలం ద్వారా రోజుకు 3 టీఎంసీలు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, ఆయన తనయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలోని జల ప్రాజెక్ట్ల అభివృద్ధిని పరుగులు పెట్టించి.. గంగమ్మను ఉరకలెత్తించి సస్యశ్యామలం చేస్తే.. చంద్రబాబు పాలనలో శాపంగా మారుతోంది. 1996 నుంచి 2026 వరకు ఆయన అధికారంలో ఉన్న ప్రతిసారీ జల ప్రాజెక్ట్లకు గ్రహణం పట్టుకుంటుంది. చంద్రబాబు పాలనలో 35–40 టీఎంసీలకే పరిమితమైన సోమశిలను దివంగత వైఎస్సార్ జలయజ్ఞం ద్వారా 72 టీఎంసీల సామర్థ్యానికి పెంచితే.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో 78 టీఎంసీలతో సమగ్ర సోమశిల కల సాకారమైంది. దివంగత వైఎస్సార్ హయాంలో ఏటా వృథాగా సముద్రంలో కలుస్తున్న కృష్ణానది వరద నీటిని శ్రీశైలం డ్యాం ద్వారా రాయలసీమతోపాటు నెల్లూరుకు మళ్లించేందుకు ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటిని 44 వేల క్యూసెక్కులకు పెంచే విధంగా కాలువలను ఆధునికీకరించారు. ఆ విధంగా కృష్ణమ్మను ఒడిసి పట్టి.. సోమశిలకు మళ్లించారు. ఆ నాడు వైఎస్సార్ పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్తోపాటు కాలువలను అభివృద్ధి చేయకపోయి ఉంటే, నెల్లూరుతోపాటు రాయలసీమ సైతం ఎడారిగా మారేవి. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక సోమశిల ప్రాజెక్ట్లకు సంబంధించి పెండింగ్ అటవీ భూములు, పరిహారాలు చెల్లింపులను క్లియర్ చేసి 78 టీఎంసీల కెపాసిటికి పెంచి సమగ్ర సోమశిలను సాకారం చేశారు. అదే సమయంలో వైఎస్సార్ హయాంలో శ్రీకారం చుట్టి సంగం, నెల్లూరు బ్యారేజీలను అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ జగన్ రెండేళ్ల కరోనా వంటి విపత్తును సైతం ఎదుర్కొని వీటిని పూర్తి చేసి రైతులకు అంకితం చేశారు. వీటితోపాటు సోమశిల–కండలేరు, కండలేరు– స్వర్ణముఖి కాలువ కెపాసిటీని రెట్టింపు చేశారు. సోమశిల ఉత్తర కాలువ విస్తరణతోపాటు కొత్త రిజర్వాయర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎత్తిపోతల పథకం వస్తే.. ముక్కారు పంటలే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతికూల పరిస్థితులనూ ఎదురించి దాదాపు 80 శాతం మేర పూర్తి చేసిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పూర్తిగా నిలిపివేశారు. ఎత్తిపోతల పథకం పూర్తయితే శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 3 టీఎంసీలు తరలించుకునే అవకాశం ఏర్పడేది. రాయలసీమతోపాటు నెల్లూరు జిల్లాలో ప్రధాన ప్రాజెక్ట్లు, ఊరూరా చెరువులు జలకళతో నిండుకుండలా మారేవి. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు. తెలుగుగంగ, ఎఫ్ఆర్సీసీ, గాలేరు, నగరి ఆయకట్టుకు సాగునీరు, చైన్నెకు తాగునీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారానే విడుదల చేయాలి. అయితే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను శ్రీశైలం ప్రాజెక్ట్లో 841 అడుగుల నీటిమట్టం వద్ద అమర్చారు. ప్రాజెక్ట్లో 841 అడుగుల కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు గరిష్టంగా 44 వేల క్యూసెక్కులు తరలించే అవకాశం ఉంది. 2014–19 మధ్య కాలంలో చంద్రబాబు ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ ప్రభుత్వం తన ప్రాజెక్ట్ కాలువలను శ్రీశైలంలో 800 అడుగుట నీటి మట్టంలో నిర్మించారు. దీంతో ప్రాజెక్ట్లో 800 అడుగుల నీటి మట్టం ఉన్నప్పటికీ నీటిని ఎలాంటి అవసరాలు లేనప్పటికీ శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 4 టీఎంసీలు, కల్వకుర్తి నుంచి 0.4 టీఎంసీలు, ఎస్ఎల్పీసీ నుంచి 0.5 టీఎంసీలు, పాలమూరు, రంగారెడ్డి, డీఎం ఎత్తిపోతల ద్వారా 2 టీఎంసీలు వెరశి రోజుకు 6.95 టీఎంసీలు తరలించుకుపోతోంది. అయినా చంద్రబాబు సర్కార్ నోరు మెదపలేదు. నెల్లూరు రూరల్: రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధనే ధ్యేయంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా వైఎస్సార్సీపీ గురువారం చలో సోమశిల ప్రాజెక్ట్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నాయకులకు, ముఖ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కన్వీనర్, మాజీమంత్రి సాకే శైలజానాథ్, మాజీ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డితోపాటు పలువురు సీమ నేతలు, ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి సోమశిల ప్రాజెక్ట్ను సందర్శించనున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ ఏర్పాటు జరిగితే సీమ జిల్లాలతోపాటు నెల్లూరు జిల్లా రైతాంగానికి, ప్రజలకు ఎక్కువగా మేలుజరుగుతుందని, అలాంటి కీలకమైన ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం పక్కన పెట్టడం వల్ల తీరని నష్టం జరగబోతోందని, అందువల్లనే వైఎస్సార్సీపీ రైతుల పక్షాన, ప్రజల పక్షాన పోరుబాట పట్టిందని కాకాణి పేర్కొన్నారు. జిల్లాలోని రైతులు, ప్రజలు ఈ కార్యక్రమానికి తరలివచ్చి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా చూడాలన్నారు. ఈ తరుణంలో ప్రాజెక్ట్లో 800 అడుగుల నీటి మట్టం ఉన్నా.. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నిత్యం 3 టీఎంసీలు నీటిని తోడుకునే విధంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దూకుడుగా ఈ ప్రాజెక్ట్కు రూపకల్పన చేశారు. 20 శాతం పనులు జరిగిన సమయానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయడంతో వ్యతిరేకించినప్పటికీ దాదాపు 80 శాతం పనులను పూర్తి చేశారు. ప్రభుత్వం మారడం ఈ ప్రాజెక్ట్కు శాపంగా పరిణమించింది. తీవ్ర వర్షాభావం నెలకొన్న సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే తెలంగాణతో పోటీగా కనీసం రోజుకు 3 టీఎంసీలు తరలించుకుంటే సీమ జిల్లాతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలు జలకళతో విలసిల్లేవి. చంద్రబాబు ఈ పథకాన్ని పక్కన పెట్టడంతో ఈ ప్రాంతాలు కరువులో చిక్కుకునే ప్రమాదం ఉంది. సీమకు ద్రోహం.. -
గుండు చేస్తే రూ.400
● బారాషహీద్ దర్గాలో తలనీలాల పేరుతో దోపిడీ ● కమిటీ సభ్యుడికే బాధ్యతలునెల్లూరు(బారకాసు): దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్న సామెతను నెల్లూరు బారాషహీద్ దర్గాలో ఓ కమిటీ సభ్యుడు సీరియస్గా తీసుకున్నాడు. ఒక్కొక్కరికి గుండు చేసేందుకు రూ.400 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏటా జరిగే రొట్టెల పండగకు దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. తమ కోర్కెలు తీరితే తలనీలాలు సమర్పిస్తామని అనేకమంది మొక్కుకుంటారు. దర్గా ప్రాంగణం మొత్తంగా ఒకేచోట తలనీలాలు సమర్పించేందుకు ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ చెప్పిన మొత్తాన్ని భక్తులు ఇస్తేనే గుండు చేస్తారు. తమ వారికే.. రొట్టెల పండగ కోసమని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు తమ జేబులు నింపుకొనేందుకు ఒక్కొక్కరికి ఒక్కో అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. అందులో భాగంగా తలనీలాలు సమర్పించే ప్రత్యేక స్టాల్ను కమిటీలోని ఓ సభ్యుడికి అప్పగించారన్న ఆరోపణలున్నాయి. ఏడాదికి ఒకసారి జరిగే పండగ సమయంలో వచ్చిన అవకాశాన్ని వారు వదులుకోలేదు. ఈనెల 26వ తేదీ నుంచి రొట్టెల పండగ మొదలవుతుంది. అందుకు ముందు నుంచే ఈ దోపిడీకి తెరలేపినట్లు తెలుస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తలనీలాలు సమర్పించాలంటే ఒక్కొక్కరి నుంచి రూ.400 చొప్పున వసూలు చేస్తున్నారు. లోకల్గా ఉన్న వారి నుంచి రూ.300, కమిటీ సభ్యులకు తెలిసిన వారైతే వారి నుంచి నామమాత్రం రుసుం ఇలా రకరకాలుగా తీసుకుంటున్నారు. ఐదు రోజులపాటు జరిగే పండగకు లక్షలాది మంది భక్తులు రానున్నారు. ఈ దోపిడీని అరికట్టాలని, నామమాత్రపు రుసుం వసూలు చేయాలని భక్తులు కోరుతున్నారు. -
సవాలక్ష షరతులు..రాయితీలకు కొర్రీలు
సవాలక్ష షరతులు.. రాయితీలకు కొర్రీలు నెల్లూరు(వేదాయపాళెం): జిల్లాలోని ఉద్యాన రైతులకు కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. ఉద్యాన తోటల పెంపకానికి విరివిగా ప్రోత్సాహకాలను అందజేస్తున్నట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఉద్యాన సాగులో అత్యంత కీలకమైన పెంట్హౌస్లు, పందిళ్లు, షేడ్నెట్లు, డ్రై ప్లాట్ఫామ్స్, స్ప్రింక్లర్లు, స్ప్రేయర్లు వంటి మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ ప్రోత్సాహం కరువైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన రెండేళ్లలో ప్రభుత్వం అరకొరగా నిధులను మంజూరు చేయగా వాటిని కూడా పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదు. సవాలక్ష ఆంక్షలతో కొర్రీలు పెట్టడంతో ప్రోత్సహకాలను రైతులు వినియోగించకోక నిధులు తిరిగి వెనక్కి వెళ్లినట్లు సమాచారం. కాగితాల్లోనే కేటాయింపులు 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లా ఉద్యానశాఖకు సుమారు రూ.12 కోట్ల మేర నిధులు మంజూరయ్యాయి. జిల్లా వ్యాప్తంగా కేవలం 4,812 మంది లబ్ధిదారులకు రూ.8.48 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మిగిలిన మొత్తం ఆర్థిక సంవత్సరం ముగియడంతో తిరిగి ఖజానాకు చేరిపోయాయి. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.11.07 కోట్లు కేటాయించారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం మొదలై మూడు నెలలు గడచిపోతున్నా ఒక్క రైతుకు నిధులు ఇచ్చిన దాఖలాలు లేవని ఉద్యాన రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా మామిడి, నిమ్మ, బొప్పాయి, డ్రాగన్ఫ్రూట్, పూల తోటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ సాగుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు, ప్రోత్సాహం, యంత్ర సామగ్రి, శిక్షణ ప్రభుత్వం అందించాల్సి ఉంది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉద్యాన రైతులకు ఏ విధమైన ఆదరణ, భరోసా, సరైన మార్కెటింగ్ లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. సాగుకు దూరమై.. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పంటలు వేసుకుని పందిళ్లు నిర్మించుకుని చెట్లు బతికిన తర్వాత దశల వారీగా బిల్లులు అందజేస్తే అప్పుడు 50 శాతం సబ్సిడీ నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ఆంక్షలు పెట్టడంతో కుదేలవుతున్నారు. సాగుకు పెట్టుబడులు లేక పొలాలను సాగు చేయకుండా వదిలేయాల్సిన పరిస్థితులు ప్రస్తుత ప్రభుత్వంలో నెలకొన్నాయని ఎస్సీ, ఎస్టీ రైతులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది అర్హత గల ఉద్యాన రైతులు ఉన్నారు. అయినా గతేడాది కేవలం 4,812 మందికి 50 శాతం సబ్సిడీ రుణాలు అందజేసి ప్రభుత్వం చేతులు దులుపుకొందని రైతులు బాహాటంగా విమర్శిస్తున్నారు. ఉద్యాన రైతులకు కూటమి మొండిచేయి గతేడాది జిల్లాకు రూ.12 కోట్లు మంజూరు అందులో రూ.3.52 కోట్లు వెనక్కి ఈ ఏడాది మూడు నెలలు గడిచినా అందని సాయం మొక్కలు బతికితేనే 50 శాతం సబ్సిడీ నిబంధన సాగుకు దూరమవుతున్న ఎస్సీ, ఎస్టీ రైతులుప్రోత్సాహం అందించాం 2025–26 ఆర్థిక సంవత్సతంలో 4,812 మంది లబ్ధిదారులకు ప్రోత్సాహం అందించాం. రూ.8.48 కోట్లు అచీవ్వెంట్ సాధించాం. ఈ ఏడాది రూ.11.07 కోట్ల నిధులు మంజూరయ్యాయి. – ఎంవీ సుబ్బారెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి -
బరితెగిస్తున్న ఇసుకాసురులు
సాక్షి టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వం కొలువుదీరాక రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఇసుక, గ్రావెల్ మాఫియాలు చెలరేగిపోతున్నాయి. ఈ కోవలోనే జిల్లాలోని అనంతసాగరం మండలం పడమటి కంభంపాడులో గల పెన్నానదిలో ఇసుక రీచ్ను రాష్ట్రంలోనే తొలిసారిగా అనధికారంగా ప్రారంభించారు. నిత్యం భారీగా.. పడమటి కంభంపాడు అనధికార రీచ్లో పరిమితికి మించి నిత్యం వందల చొప్పున లారీలు, టిప్పర్లలో ఇసుకను లోడ్ చేయిస్తూ కొందరు టీడీపీ నేతలు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. లారీ కెపాసిటీని బట్టి పది చక్రాల వాహనానికి రూ.పది వేలు, 12 చక్రాల వాహనానికి సుమారు రూ.15 వేలను వసూలు చేస్తున్నారు. ఇక్కడి ఇసుకకు ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో మంచి డిమాండ్ ఉండటంతో భారీగా విక్రయించి వెనుకేసుకుంటున్నారు. దుర్భరంగా రోడ్లు మండల పరిధిలోని ఉప్పలపాడు చెరువుకట్ట నుంచి సోమశిల వరకు ప్రధాన రహదారి పూర్తిగా మట్టి రోడ్డుగా మారిపోయింది. ఇసుక లారీలు వందల సంఖ్యలో పరిమితికి మీరి అధిక టన్నేజీతో తిరుగుతుండటంతో ఈ దారంతా గుంతలమయంగా దర్శనమిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు సోమశిల వెళ్లే వీల్లేక ఆర్టిసీ బస్సులు నిలిచిపోయాయి. రహదారిని దుర్భరంగా మార్చిన వారిపై స్థానికులు మండిపడుతున్నారు. ఇలానే వదిలేస్తే రీచ్ వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. పట్టించుకునేవారేరీ..? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారంలోపే కొందరు పచ్చ నేతలకు రీచ్ను అనధికారికంగా అప్పగించి లోడింగ్ను అక్రమంగా ప్రారంభించారు. ఈ విషయం మీడియాలో బయటపడటంతో పార్టీ అధిష్టానం సైతం ఆగ్రహం వ్యక్తం చేసిందని సమాచారం. అయితే వారు అధికారంలో ఉండటంతో ఏమీ చేయలేక నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇలానే మరికొద్ది రోజులు సమీపంలో తవ్వుకుంటూ వెళ్తే జలాశయానికే ముప్పు వాటిల్లే ప్రమాదముందని సమీప గ్రామాల వారు పేర్కొంటున్నారు. భారీ యంత్రాలతో.. పెన్నాలో ప్రస్తుతం హిటాచీ మెషీన్లను ఏర్పాటు చేసి భారీ లారీలు, టిప్పర్లకు లోడ్ చేస్తున్నా, కనీస చర్యలు కరువవుతున్నాయి. ముడుపులు అందుతుండటంతోనే జిల్లా మైనింగ్ అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా వీటిని నిరోధించాలని కోరుతున్నారు. కాగా ఈ విషయమై తహసీల్దార్ వీరవసంతరావును సంప్రదించగా, ఆయన చెప్పిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. రెవెన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇసుక అక్రమ దందా రోజూ సాగుతుండగా, తమకు సమాచారం లేదని ఆయన బదులిచ్చారు. లక్షల టన్నుల అక్రమ రవాణా పేట్రేగిపోతున్న మాఫియా మట్టి రోడ్లుగా మారిన ప్రధాన రహదారులు రీచ్వైపు కన్నెత్తి చూడని అధికారులు పీకేపాడులో ఇదీ తీరు -
సమన్వయకర్తలే టార్గెట్..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్సీపీ నేతలు రోడ్డెక్కితే.. కూటమి ప్రభుత్వానికి కూసాలు కదులుతున్నాయి. చంద్రబాబు, లోకేశ్ రెడ్బుక్ను అడ్డు పెట్టుకుని.. పోలీసులపై ఒత్తిళ్లు పెంచి ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసుల పరంపర కొనసాగిస్తున్నారు. తండ్రీకొడుకుల అసమర్థ పాలనను ప్రశ్నించినా.. ఎన్నికల హామీలు, మోసాలు, వెన్నుపోట్లపై నిలదీసినా.. అవినీతి, అక్రమాలు, కుంభకోణాలపై నిగ్గదీసినా కేసులే. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలను టార్గెట్ చేసి బనాయించిన అక్రమ కేసులకు లెక్కేలేదు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు చేసినా నేరంగా మారింది. రెడ్బుక్ రాజ్యంలో రాజ్యాంగం బందీ అధికార పార్టీ తన ప్రతీకార రెడ్బుక్ రాజకీయాలకు ఖాకీలను కవచంగా ఉపయోగించుకుంటోంది. ప్రశ్నించే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి కేసులను ఆయుధంగా చేసుకుని అణచివేయడం అప్రజాస్వామ పాలనకు అద్దం పడుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన భారత రాజ్యాంగం జిల్లాలో అపహాస్యం పాలవుతోంది. లోకేశ్ రెడ్బుక్ రాజ్యంలో రాజ్యాంగం బందీగా మారింది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు చేయడం కూడా నేరమన్నట్లుగా వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. డీఎస్సీలో అక్రమాలను ప్రశ్నించడమే నేరం మెగా డీఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాలను ప్రశ్నించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి కుటుంబ సభ్యుల విద్యాసంస్థలపై దాడులకు చినబాబు రెడ్బుక్ ఉసిగొల్పింది. ఎమ్మెల్సీకి జరిగిన అన్యాయాన్ని వెలుగెత్తి చాటేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పార్టీ సమన్వయకర్తలపై మరోసారి రెడ్బుక్ రాజ్యాంగం అక్రమ కేసులు బనాయించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డికి సంఘీభావంగా నెల్లూరు వీఆర్సీ సెంటర్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన ప్రదర్శించడం కూడా పెద్ద నేరమన్నట్లుగా ఒకే రోజు ఒకే ఘటనపై రెండు అక్రమ కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా మిగిలింది. అందులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డిని రెండు కేసుల్లో ఏ1గా ఉంచడం వెనుక రెడ్బుక్ కట్ర కోణం దాగి ఉంది. వైఎస్సార్సీపీ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, సమన్వయకర్తలు ఆనం విజయకుమార్రెడ్డి, మేకపాటి రాజగోపాల్రెడ్డిలను ఆ కేసుల్లో ఇరికించడం కూడా రెడ్బుక్ కుట్రకోణంలో భాగమేనని సృష్టమవుతోంది. ప్రశ్నించే గొంతుకలకు సంకెళ్లు శాంతియుత నిరసనలు చేసినా నేరమే ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ కేసులు నమోదు జిల్లాలో ఎనిమిది మంది వైఎస్సార్సీపీ సమన్వయకర్తలపై అక్రమ కేసులు జిల్లా అధ్యక్షుడు కాకాణిపై 26 అక్రమ కేసులు.. తాజాగా మరొకటి ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డిపై ఒకే రోజు రెండు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్ల వ్యవధిలో జిల్లాలో వైఎస్సార్సీసీ సమన్వయకర్తలను టార్గెట్ చేశారు. తమ నియోజకవర్గాల్లో జరిగిన అవినీతి, అక్రమాలను ప్రశ్నించడమే నేరమైనట్లు, పార్టీ పిలుపు మేరకు ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించడం అసాంఘిక కార్యక్రమైనట్లు అక్రమ కేసులు బనాయించడం జరుగుతోంది. ఇప్పటికే జిల్లాలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై 26 అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. మాజీ ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి మాజీ మంత్రులు అనిల్కుమార్యాదవ్, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డితోపాటు నెల్లూరు రూరల్, ఉదయగిరి సమన్వయకర్తలు ఆనం విజయకుమార్రెడ్డి, మేకపాటి రాజగోపాల్రెడ్డిలపై అక్రమ కేసులు నమోదు చేశారు. -
డీ సెట్ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలి
నెల్లూరు(అర్బన్): డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో ప్రవేశాలకు గానూ జూలై ఒకటిన నిర్వహించనున్న డీ సెట్కు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. దరఖాస్తు చేసుకున్న 813 మంది అభ్యర్థులకు పరీక్షను పొట్టేపాళెంలోని అయాన్ డిజిటల్ సెంటర్, జై శ్రీరామ్ ఇన్ఫ్రా అండ్ ఐటీ సొల్యూషన్స్ కేంద్రాల్లో నిర్వహించనున్నామని వివరించారు. తమ అడ్మిట్ కార్డులను apdeecet. apcfss. in నుంచి డౌన్లోడ్ చేసుకోవాని కోరారు. వివరాలకు 94404 58428 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలకు వినతి
● రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి ● ఎస్పీకి వినతిపత్రం అందజేత నెల్లూరు(క్రైమ్): సోషల్ మీడియా వేదికగా తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి కోరారు. ఈ మేరకు నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అజితకు వినతిపత్రాన్ని బుధవారం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. సోషల్ మీడియా వేదికగా కొంతకాలంగా మధు, మనోహర్, హరీష్, శ్రీను, కిశోర్ తనపై అసత్య ప్రచారాలు చేస్తూ, అవమానకర పోస్టులు పెడుతూ తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. సదరు వ్యక్తులపై కావలి ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో ఈ నెల 14న ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాల ని కోరగా, ఎస్పీ సానుకూలంగా స్పందించారని వివరించారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారు కావలి నియోజకవర్గంలో అధికార పార్టీ సాగిస్తున్న అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించేవారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. చెన్నాయపాళెం చెరువులో పగలూ, రాత్రనే తేడా లేకుండా వందలాది టిప్పర్ల్ల ద్వారా గ్రావెల్ను అక్రమార్కులు 20 రోజులుగా తరలిస్తున్నారని చెప్పారు. ఈ విషయమై కలెక్టర్ను గ్రామ రైతులు కలిసి వినతిపత్రాన్ని అందజేశారని పేర్కొన్నారు. ఆర్డీఓతో మాట్లాడి తగు చర్యలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చినా, పరిస్థితిలో నేటికీ ఎలాంటి మార్పులేదని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో విషయాన్ని తన దృష్టికి తీసుకురాగా, ఆర్డీఓను కలిసి పరిస్థితిని వివరించామన్నారు. కావలి, మన్నంగిదిన్నె, బుడంగుంట చెరువులు, చింతలపాళెం తిప్ప ప్రాంతాల్లో జరుగుతున్న గ్రావెల్ అక్రమ రవాణాను అరికట్టాలని కోరామని తెలిపారు. మైనింగ్, విజిలెన్స్, ఇరిగేషన్ శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, స్థానిక ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ప్రమేయం కారణంగా తామేమీ చేయలేమని కొందరు ఇరిగేషన్ అఽధికారులు చెప్పారని ఆరోపించారు. ఈ క్రమంలోనే టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకోగా జరిగిన ఘర్షణలో గ్రావెల్ మాఫియాపై చర్యలు చేపట్టకుండా గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు, మరో ముగ్గురిపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులను నమోదు చేశారని చెప్పారు. అక్రమాలు, అన్యాయాలను కట్టడి చేయడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. కావలిలో అక్రమ కేసులు పరిపాటిగా మారాయని ధ్వజమెత్తారు. అక్రమ మైనింగ్ను గతంలో తాము ఖండించామని, ఈ వ్యవహారంలో కొందరు వీడియో తీయగా సంబంధం లేని తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. కొందరు మీడియా ప్రతినిధులు, నేతలపైనా కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. దగదర్తి మండలం బోడిగుడిపాడులో పంచాయతీ స్థల వివాదంలో కొందరిపై పోలీసుల సమక్షంలో టీడీపీ నేతలు దాడులు చేశారని, బాధితులు ఫిర్యాదు చేసినా ఇంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పారు. ఈ అంశాలన్నింటినీ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు చేపట్టాల్సిందిగా కోరామని పేర్కొన్నారు. పార్టీ కావలి పట్టణాధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్రెడ్డి, దగదర్తి మండల కన్వీనర్ వెలినేని మహేష్నాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు కనమర్లపూడి వెంకటనారాయణ, అల్లూరు పంచాయతీ కన్వీనర్ దండే కృష్ణారెడ్డి, ఎస్సీ జిల్లా సెల్ అధ్యక్షుడు పందిటి కామరాజు, కందుర్తి కామయ్య, గుడ్లూరు మాల్యాద్రి, చిన్న పుల్లయ్య, చిన్న ప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. గిరిజన మహిళపై అమానుషం కావలిలోని 23వ వార్డులో గిరిజన మహిళను టీడీపీ నేతలు వివస్త్ర చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారనే విశ్వసనీయ సమాచారం తనకు ఉందని ప్రతాప్కుమార్రెడ్డి ఆరోపించారు. ఈ విషయం ఇంకా బయటకు పొక్కలేదని, జరిగిన దారుణం త్వరలోనే వెలుగులోకి వస్తుందని ఆయన చెప్పారు. -
ప్రశ్నిస్తే కేసు.. నిలదీస్తే జైలు.. నిరసన తెలిపితే నేరం..!
జిల్లాలో ప్రతిపక్ష నేతలపై కొనసాగుతున్న కేసుల పరంపర చూస్తుంటే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ హక్కులకు పోలీసులు కొత్త నిర్వచనం రచిస్తున్నారనిపిస్తోంది. అధికార పార్టీ రాజకీయ కక్ష సాధింపునకు పోలీస్ యంత్రాంగాన్ని పావుగా వాడుకుంటుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యాంగం చట్టాలను పక్కన పెట్టి.. ప్రతిపక్ష నేతలపై రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. ఒక నిరసనకు రెండు పోలీస్స్టేషన్లలో వైఎస్సార్సీపీ కీలక నేతలపై కేసులు బనాయించడం ప్రతీకార రాజకీయం పరాకాష్టకు చేరిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేక కేసులతో కట్టడి చేయాలనే ప్రయత్నాలు ప్రభుత్వ పాలకుల అసహనం, అసమర్థతకు నిదర్శనమని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
రైల్లో బాల కార్మికుల తరలింపు
● సంరక్షించిన అధికారులు నెల్లూరు(క్రైమ్): బిహార్ రాష్ట్రానికి చెందిన బాలురను రైల్లో అక్రమంగా తరలిస్తుండగా రైల్వే పోలీసులు ఇతర శాఖలను సమన్వయం చేసుకుని మంగళవారం అర్ధరాత్రి సంరక్షించారు. వారి కథనం మేరకు.. బిహార్ రాష్ట్రానికి చెందిన బాలురను పనుల నిమిత్తం తమిళనాడు రాష్ట్రం ఈరోడ్కు అమృత్ భారత్ రైల్లో తరలిస్తున్నారని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మంగళవారం రాత్రి నెల్లూరు రైల్వే పోలీసులకు సమాచారం అందించింది. రైల్వే డీఎస్పీ జి.మురళీధర్, సీఐ ఎ.సుధాకర్ నేతృత్వంలో నెల్లూరు, గూడూరు రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్, ఎహెచ్టీయూ, డీసీపీఓ సిబ్బంది బృందంగా ఏర్పడ్డారు. రైలు గూడూరులో ఆగగానే బృందం తనిఖీలు చేపట్టారు. నాయుడుపేటకు చేరుకునేలోపే వివిధ బోగీల్లో అక్రమంగా తరలిస్తున్న 14 మంది బాలురను సంరక్షించారు. వారిని పనుల నిమిత్తం ఈరోడ్కు తీసుకెళ్తున్న బిహార్ రాష్ట్రానికి చెందిన ఎండీ అబ్బాస్, వాదూద్, మహబూబ్, నజీమ్, అబ్బాస్తోపాటు మరో ఇద్దరు ఏజెంట్లను అదుపులోకి తీసుకుని నెల్లూరుకు తరలించారు. బాలురను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచిన అనంతరం సంరక్షణ కేంద్రానికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఏజెంట్లను రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. బుధవారం మురళీధర్ మాట్లాడుతూ ఒంగోలు, నెల్లూరు జిల్లాలో నిర్వహించిన తనిఖీల్లో 25 మంది బాలురను సంరక్షించి, 15 మంది ఏజెంట్లను అరెస్ట్ చేశామన్నారు. తనిఖీల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందిని రైల్వే డీఐజీ సత్య ఏసుబాబు అభినందించారు. ‘సర్’లో చురుగ్గా పాల్గొనాలి : కలెక్టర్నెల్లూరు రూరల్: కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో రాజకీయ పార్టీల ప్రతినిధులు భాగస్వాములు కావాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా కోరారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమ పురోగతిపై కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులకు ఓటు హక్కు కల్పించడం, అనర్హుల పేర్ల తొలగింపు, పారదర్శకమైన జాబితా రూపొందించడమే కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. డీఆర్వో విజయ్కుమార్, పార్టీల ప్రతినిధులు రసూల్, శ్రీనివాసులు, బాలసుధాకర్, శ్రీరామ్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లైటింగ్ పనులు చేస్తుండగా..● నాలుగో అంతస్తు నుంచి పడి వ్యక్తి మృతి కోవూరు: మండలంలోని ఇనమడుగు గ్రామానికి చెందిన మావిళ్ల నరేష్ (37) ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కిందపడి చనిపోయాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. నరేష్ బుధవారం కోవూరులోని ఓ నాలుగు అంతస్తుల భవనంలో లైటింగ్ పనులు నిర్వహిస్తున్న సమయంలో కాలుజారి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబానికి ఆధారంగా ఉన్న నరేష్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అటవీ ప్రాంతంలో మృతదేహం● ఊటుకూరు వాసిగా గుర్తింపు ● హత్యగా అనుమానం దుత్తలూరు: మండలంలోని బండకిందపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం కుళ్లిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించారు. బస్తాలో ఉన్న మృతదేహాన్ని స్థానికులు చూసి అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ సిబ్బంది పోలీసులకు చెప్పారు. దీంతో ఉదయగిరి సీఐ వెంకట్రావు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గోనెసంచిలో వరిగడ్డి వేసి అందులో మృతదేహాన్ని ఉంచినట్లు గుర్తించారు. క్లూస్ టీమ్ వచ్చి పరిసర ప్రాంతాల్లో ఆధారాలు సేకరించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడిని వింజమూరు మండలం ఊటుకూరుకు చెందిన దేవరకొండ గోవిందులు (55)గా గుర్తించారు. అతను చనిపోయి లేదా హత్య చేయబడి నాలుగు నుంచి ఐదురోజులై ఉంటుందని భావిస్తున్నారు. ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. నివేదిక అందగానే మృతికి గల కారణాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. బ్యాంక్లో షార్ట్ సర్క్యూటై ఫైళ్లు దగ్ధంకావలిరూరల్: పట్టణంలోని జేబీ కాలేజీ వద్ద ఉన్న బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బుధవారం షార్ట్ సర్క్యూటై ఫైళ్లు కాలిపోయాయి. సిబ్బంది కార్యాలయానికి ఉదయం 10 గంటలకు వచ్చారు. అప్పటికి విద్యుత్ సరఫరా లేదు. 10:40 గంటలకు కరెంట్ వచ్చింది. ఆ సమయంలో స్టోర్ రూమ్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి పాత ఫైళ్లు కొన్ని దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే వచ్చి బ్యాంక్లో మంటలను ఆర్పి వేశారు. ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదని స్టోర్ రూమ్లో అవసరం లేని పాత గోల్డ్ లోన్లు ఫైల్స్ మాత్రమే దగ్ధం అయ్యాయని మేనేజర్ సింగంశెట్టి ప్రియాంక తెలిపారు. ఏ విధమైన ఆస్తి నష్టం జరగలేదని, ఖాతాదారులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. -
రొట్టెల పండగకు పటిష్ట భద్రత
● ఎస్పీ అజిత నెల్లూరు(క్రైమ్): నెల్లూరు బారాషహీద్ దర్గాలో ఈనెల 26 నుంచి జరిగే రొట్టెల పండగకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశించారు. నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో రొట్టెల పండగ బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో ఎస్పీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దర్గా ప్రాంగణంలో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను అనుసంధానం చేయాలన్నారు. ప్రత్యేక పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేసి నిర్దేశిత ప్రాంతాల్లోనే వాహనాలు నిలిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. డాగ్స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో నిరంతర తనిఖీలు చేయలన్నారు. పోలీస్ సేవాదళ్ సభ్యులు వృద్ధులు, ప్రత్యేక అవసరాలున్న భక్తులు దర్గా సందర్శన, రొట్టెల మార్పిడికి సహాయం చేయాలన్నారు. స్వర్ణాల ఘాట్, బోటింగ్ పాయింట్ల వద్ద లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గంధం ఉరేగింపు, క్యూలైన్ల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు ప్రణాళికతో బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ఏఎస్పీ సీహెచ్ సౌజ న్య, నగర ఏఎస్పీ దీక్ష, దర్గామిట్ట ఇన్చార్జి ఇన్స్పెక్టర్ జీ వేణుగోపాల్రెడ్డి, సౌత్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి సెక్టార్ల వారీగా బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ జోన్లు తదితరాలను వివరించారు. కసుమూరు దర్గా, మైపాడు, కోడూరు బీచ్ల వద్ద బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు రూరల్ డీఎస్పీ జీ శ్రీనివాసరావు తెలిపారు. ఏఆర్ ఏఎస్పీ అప్పారావు, ఆత్మకూరు, ఏఆర్, హోమ్గార్డ్స్ డీఎస్పీలు వేణుగోపాల్, చంద్రమోహన్, రామకృష్ణ, నెల్లూరు నగర, రూరల్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
మామూళ్లు ఇచ్చుకో.. దోచుకో
సాక్షి టాస్క్ఫోర్స్: సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ దోపిడీదారులు చెలరేగిపోతున్నారు. సర్వేపల్లి ముఖ్యనేత అండతో గ్రావెల్ను కొల్లగొడుతున్నారు. పగలు , రాత్రి అనే తేడా లేకుండా అక్రమంగా గ్రావెల్ను తరలిస్తూ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. గ్రావెల్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన రవాణా, మైనింగ్, పోలీసు శాఖల అధికారులు మామూళ్ల మత్తులో అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అయితే కంటేపల్లి వద్ద రైల్వే అభివృద్ధి పనుల్లో భాగంగా అండర్ బ్రిడ్జి వద్ద అడ్డుగా ఉన్న గ్రావెల్ను తరలిస్తున్న టిప్పర్లను పోలీసులు అడ్డుకుని పోలీస్స్టేషన్కు తరలించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెంకటాచలం మండలంలోని రామదాసుకండ్రిగ, శ్రీకాంత్కాలనీ, నాగంబొట్లకండ్రిగ తదితర గ్రామాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా అక్రమ గ్రావెల్ రవాణా జరుగుతోంది. మైనింగ్ అనుమతులు లేకుండానే అక్రమంగా తవ్వకాలు చేస్తున్నా వారి జోలికి రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖల అధికారులు వెళ్లడం లేదు. గ్రావెల్ మాఫియా నుంచి నెలనెలా మామూళ్లు అందడంతోనే పోలీసులు గ్రావెల్ అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్లను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే నాలుగు రోజుల క్రితం కంటేపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనుల వద్ద ఉన్న గ్రావెల్ను తరలిస్తుంటే పోలీసులు అక్కడికి చేరుకుని మూడు టిప్పర్లను అడ్డుకుని వెంకటాచలం పోలీస్స్టేషన్కు తరలించారు. అండర్ బ్రిడ్జి నిర్మాణం కోసం తవ్విన గ్రావెల్ గుట్టలు నిర్మాణ పనులకు అడ్డుగా ఉండడంతో టిప్పర్ల ద్వారా బయటకు తరలిస్తుంటే పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో పోలీస్స్టేషన్కు తరలించిన మూడు టిప్పర్లలో రెండింటిని వదిలేశారు. ఒక్క టిప్పర్ను మాత్రమే పోలీస్స్టేషన్లో ఉంచడంతో సదరు టిప్పర్ నిర్వాహకుడు పోలీస్స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. అనుమతులు లేకుండా అక్రమంగా గ్రావెల్ను తరలిస్తున్న టిప్పర్ల జోలికి వెళ్లకుండా, రైల్వే అండర్బ్రిడ్జి నిర్మాణం కోసం తవ్విన గ్రావెల్ పనులకు అడ్డుగా ఉండడంతో బయటకు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకోవడం వెనుక అంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యనేత అండతో.. సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం, పొదలకూరు, ముత్తుకూరు మండలాల్లో సర్వేపల్లి ముఖ్యనేత అండతో గ్రావెల్ దోపిడీ నిర్విరామంగా సాగుతోంది. మైనింగ్ అనుమతులు లేకుండానే కోట్లాది రూపాయల విలువ చేసే గ్రావెల్ సంపదను కొల్లగొట్టారు. ప్రస్తుతం వెంకటాచలం మండలంలోని రామదాసుకండ్రిగ, నాగంబొట్లకండ్రిగ, శ్రీకాంత్కాలనీలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా గ్రావెల్ అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గ్రావెల్ రవాణాతో తమ గ్రామాలు దుమ్ముకొట్టుకుపోతున్నాయని, తాము బతికేదెలాగా అని గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేసినా లెక్క చేయకుండా గ్రావెల్ను తరలిస్తున్నారు. గ్రావెల్ టిప్పర్ల రద్దీతో తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని నాగంబొట్లకండ్రిగ గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిని బెదిరింపులకు గురిచేసి మరీ గ్రావెల్ రవాణా సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సర్వేపల్లిలో చెలరేగిపోతున్న గ్రావెల్ మాఫియా ముఖ్యనేత అండతో రేయింబవళ్లు తరలింపు కన్నెత్తి చూడని రెవెన్యూ,పోలీసు అధికారులు రైల్వే అండర్ బ్రిడ్జి పనులకు అడ్డుగా మట్టికుప్పలు తరలిస్తుండగా టిప్పర్లను పట్టుకున్న పోలీసులు వారి తీరుపై తీవ్ర విమర్శలు -
రూ.22.51 లక్షల ఉపాధి నిధుల స్వాహా
● ఎంపీడీఓ ఆఫీసు ఎదుట నల్లగొండ్ల, శంఖవరం గ్రామస్తుల ఆందోళన ● విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వింజమూరు(ఉదయగిరి):మండలంలోని నల్లగొండ్ల, శంఖవరం గ్రామాల్లో గత ప్రభుత్వంలో నాడు–నేడు కింద నిర్మించిన పాఠశాలల ప్రహరీలను చూపి కొత్తగా ఎంబుక్లు నమోదు చేసి ఉపాధి నిధులు రూ.22.51 లక్షలు స్వాహా చేశారని గ్రామస్తులు ఆరోపించారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. నిధుల స్వాహాపై అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కింద నల్లగొండ్ల పాఠశాలకు ప్రహరీ నిర్మాణం చేపట్టినట్లుగా తెలిపారు. అందుకు సంబంధించి బిల్లులు కూడా మంజూరయ్యాయని చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రహరీని చూపి ఉపాధి నిధులు రూ.9.71 లక్షలు స్వాహా చేశారని ఆరోపించారు. అలాగే శంఖవరం ప్రాథమికోన్నత పాఠశాల ప్రహరీని చూపి మరో రూ.12.80 లక్షలను స్వాహా చేసినట్లుగా తెలిపారు. ఇందులో ఎంఈఓ కార్యాలయంలో పనిచేసే ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగి పాత్ర ఉందని, ఆయన తన భార్య ఖాతాలో రెండు గ్రామాలకు సంబంధించి రూ.22.51 లక్షల నగదును వేయించుకున్నారని ఆరోపించారు. ఈ విషయమై సర్వశిక్ష అభియాన్ ఏఈ కృష్ణారెడ్డిని తాము ప్రశ్నించగా తనకు తెలియదని చెప్పారన్నారు. ఎంపీడీఓతో మాట్లాడగా 2020–21 సంవత్సరానికి సంబంధించిన పనులకు బిల్లులు చెల్లించాలని సర్వశిక్ష అభియాన్ అధికారులు తమను కోరగా వాటికి ఆమోదం తెలిపానని, మిగిలిన విషయాలు ఆ శాఖ అధికారులకే తెలియాలని చెప్పారన్నారు. నిధులు దుర్వినియోగంపై కలెక్టర్ విచారణ జరిపించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
జీజీహెచ్లో రాబందుల రాజ్యం
నెల్లూరు(అర్బన్): నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రాబందుల రాజ్యం నడుస్తోంది. మార్చురీ విభాగంలో శవాలకు పోస్టుమార్టం చేసేందుకు సైతం బేరసారాలు సాగిస్తున్నారు. జీజీహెచ్లోని మార్చురీకి పోస్టుమార్టం కోసం వచ్చే మృతదేహాల్లో ప్రమాదాలకు గురైన, ఆత్మహత్యలు చేసుకున్నవే ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో కుటుంబ సభ్యుల బాధను ఎవరూ తీర్చలేరు. అయితే మానవత్వంతో వ్యవహరించాల్సిన మార్చురీ సిబ్బంది పోస్టుమార్టం చేసేందుకు వేలాది రూపాయలను బాధిత బంధువుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న వారి నుంచి లంచాలు వసూలు చేయడంపై ‘సాక్షి’లో జనవరి 23న ‘జీజీహెచ్లో రాబందులు’, మార్చిలో ‘మార్చురీలో రాబందులు’ అనే శీర్షికల తో కథనాలు వెలువడ్డాయి. పత్రికల్లో ఎన్ని కథనాలొచ్చినా మాకెందుకు భయం..సిగ్గు అన్న చందంగా మారింది మార్చురీ సిబ్బంది తీరు. తాజాగా దారా మల్లికార్జున అనే బాధితుడు తన నుంచి లంచాలు ఎలా వసూలు చేశారో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవికి మంగళవారం రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాకు వీడియోను సైతం విడుదల చేయడంతో మార్చురీలో లంచాల బాగోతం మరోమారు వెలుగులోకి వచ్చింది. పోస్టుమార్టానికి రూ.5,500 వసూలు కోవూరు మండలం జమ్మిపాళెం గ్రామానికి చెందిన మల్లికార్జున పెదనాన్న నాగభూషణం బైకు యాక్సిడెంట్కు గురయ్యాడు. సర్వజన ఆస్పత్రికి తీసుకుని రాగా అక్కడ మృతి చెందాడు. అయితే పోస్టుమార్టం చేసేందుకు మార్చురీలో అటెండెంట్గా పనిచేసే ఒక ఉద్యోగి పెద్ద మొత్తంలో లంచం అడిగాడు. బేరసారాలు కుదిరాక రూ.2,500 నగదు రూపంలో ఇచ్చాడు. మిగిలిన నగదు చేతిలో లేకపోవడంతో సుధీర్ అనే అటెండెంట్ సూచించిన మేరకు గౌతమ్ అనే వ్యక్తికి రూ.3వేలు నగదును ఫోన్పే చేశాడు. ఈ విషయమై మల్లికార్జున ఆస్పతి సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేశాడు. తన లాగా మరొకరిని పీడించకూడదనే ఉద్దేశంతోనే ఫిర్యాదు చేస్తున్నానని బాధితుడు తెలిపారు. వేటుపడినా మారని తీరు గతంలో మార్చురీలో పని చేసే కొంతమంది డాక్టర్లు తమ కింది స్థాయి సిబ్బంది ద్వారా లంచాలు వసూలు చేసేవారు. అటెండెంట్ బాధితులను పీడించి వసూలు చేసిన సొమ్మును డాక్టర్లతో కలిసి పంచుకునేవారు. ఈ విషయమై ‘సాక్షి’లో కథనాలు రావడం, లంచాల గురించి ఇష్టం లేని ఒక డాక్టర్ వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బందిపై సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి సద రు వ్యక్తిని కలెక్టర్ సూచనతో ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే ఆ అటెండెంట్ కోర్టు కెళ్లి మళ్లీ తన ఉద్యోగం తెచ్చుకున్నాడు. అయితే సూపరింటెండెంట్ ఆరోపణలు వచ్చిన పాత స్థానంలోనే మళ్లీ పోస్టింగ్ ఇవ్వడంపై విమర్శలు జోరందుకున్నాయి. పని చేయని రెండు సీసీ కెమెరాలు మార్చురీలో లంచాల గోలపై స్పందించిన సూపరింటెండెంట్ ఇటీవల అక్కడ పదమూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. రెండు నెలలు గడవక ముందే కీలకమైన ప్రదేశంలో ఉండే రెండు కెమెరాలు పని చేయడం లేదు. లంచాల బాగోతం బయట పడుతుందనే వైర్లు కట్ చేసి పనిచేయకుండా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆస్పత్రి చైర్మన్ లేదా కలెక్టర్ స్పందించి మార్చురీలోని రాబందులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. పోస్టుమార్టంలో శవ బేరసారాలు మార్చురీ సిబ్బంది తీరుపై పలుమార్లు మీడియాలో కథనాలు అయినా తీరు మార్చుకోని వైనం బాధితుడి ఫిర్యాదుతో మరోమారు లంచాల వ్యవహారం వెలుగులోకి చోద్యం చూస్తున్న అధికారులు -
మద్యం మత్తులో హల్చల్.. యువకులకు రిమాండ్
ఆత్మకూరు: పట్టణంలో మద్యం మత్తులో కత్తితో హల్చల్ చేస్తూ ఓ కుటుంబాన్ని బెదిరించిన నలుగురు యువకులను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచగా 14 రోజులు రిమాండ్ విధించిందని సీఐ జీ గంగాధర్ తెలిపారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. మున్సిపల్ పరిధిలోని జ్యోతినగర్కు చెందిన వై ఆదర్శ్, ఏసీఎస్ఆర్కాలనీకి చెందిన కత్తి సుమంత్, ఎల్ఆర్పల్లి ప్రాంతానికి చెందిన భవాని గోవింద్, నల్లపరెడ్డిపల్లి గ్రామానికి చెందిన షేక్ సుహాన్బాబు సోమవారం సాయంత్రం మద్యం సేవించి 13వ వార్డులోని వెంకి అలియాస్ వెంకటేష్ ఇంటి వద్దకు వెళ్లి కత్తితో కుటుంబసభ్యులను బెదిరించారు. అనంతరం మద్యం షాపు వద్ద గొడవకు పాల్పడ్డారు. దీంతో యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించిందని సీఐ తెలిపారు. ఆయన వెంట ఎస్సై జంపని కుమార్ ఉన్నారు. -
సెలవుల వేళ.. విషాద ప్రయాణం
● డివైడర్ను ఢీకొన్న కారు ● అందులో ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు ● ముగ్గురికి తీవ్రగాయాలు ● ఒకరి పరిస్థితి విషమం ప్రమాదంలో దెబ్బతిన్న కారు కొడవలూరు: ఆ ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు. సెలవుల్ని సరదాగా గడుపుదామని కారులో బయలుదేరారు. అయితే ఊహించని ప్రమాదం జరిగి ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కొడవలూరు మండలం గండవరం ఫ్లయిఓవర్పై సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. విజయవాడకు చెందిన శ్రీకంఠం, కార్తికేయ, సూళ్లూరుపేటకు చెందిన రుషికేష్ ఓంకార్, ఉరవకొండకు చెందిన సుశ్రిత, హైదరాబాద్కు చెందిన సాకేత్రెడ్డి పంజాబ్లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నారు. వారంతా స్నేహితులు. మూడో సంవత్సరం పూర్తవ్వడంతో సెలవులిచ్చారు. దీంతో అన్ని ప్రాంతాలను సందర్శిస్తూ బంధువులను కలుస్తూ ఆనందంగా గడపాలని కారులో బయలుదేరారు. సోమవారం నాటికి విజయవాడ చేరుకున్నారు. అక్కడ శ్రీకంఠం, కార్తికేయ ఇళ్లకు వెళ్లి సరదాగా గడిపి రాత్రి 8 గంటల ప్రాంతంలో సూళ్లూరుపేటకు బయలుదేరారు. అర్ధరాత్రి గండవరం ఫ్లయిఓవర్పై వేగంగా వస్తూ డివైడర్ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతింది. కారు నడుపుతున్న రుషికేష్ ఓంకార్, ఇంకా సాకేత్రెడ్డి, శ్రీకంఠం తీవ్రంగా గాయపడ్డారు. సుశ్రిత, కార్తికేయ స్వల్పగాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురికి 108 అంబులెన్స్ ఈఎంటీ విజయ్, పైలట్ అబుబాకర్ అత్యవసర వైద్య సేవలందించి నెల్లూరులోని అపోలో హాస్పిటల్కు తరలించారు. సాకేత్రెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి వెల్లడించారు. కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
డీఎస్సీపై ప్రశ్నించినందుకే దాడులు
చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటు. డీఎస్సీలో జరిగిన అవకతవకలపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా, ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, మోసాన్ని చంద్రశేఖర్రెడ్డి ఆధారాలతో ప్రశ్నిస్తున్నందుకే కృష్ణ చైతన్య విద్యా సంస్థలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. మేము తప్పు చేస్తాం. ఎవరైనా ప్రశ్నిస్తే వారిని ఇబ్బందులకు గురిచేస్తాం.. భయపెడతాం.. వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తాం అనే ధోరణితో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. చంద్రబాబు, లోకేశ్ బెదిరింపులకు ఎవరూ భయపడేవాళ్లు లేరు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు, రాబోవు ఎన్నికల్లో మీకు బుద్ధి చెబుతారు. ఇది కేవలం చంద్రశేఖర్రెడ్డికి సంబంధించిన విద్యాసంస్థల సమస్య మాత్రమే కాదు, వేలాది మంది విద్యార్థుల భవిష్యత్కు సంబంధించిన విషయం. కూటమి నాయకులను ప్రశ్నించారని, రాజకీయ కక్షలతో విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం. కాలేజీలను నిజంగానే సంస్కరించాలి అనుకుంటే, ముందు నారాయణ విద్యాసంస్థలను సంస్కరించేందుకు చర్యలు చేపట్టాలి. కృష్ణచైతన్య కాలేజీల్లో ఎలాంటి తప్పులూ లేవు. చంద్రశేఖర్రెడ్డిని ఎదుర్కొనలేకే ఇలాంటి దాడులు చేస్తున్నారు.– కాకాణి పూజిత, రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ -
కృష్ణ చైతన్య విద్యాసంస్థలపై కక్ష సాధింపు
కూటమి ప్రభుత్వా న్ని ప్రశ్నించిన వారి పై, దాడులు చేయడం, బెదిరింపులకు పాల్పడడం పరిపాటిగా మారింది. ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి వంటి సౌమ్యుడిని సైతం రాజకీయంగా ధైర్యంగా ఎదుర్కొనలేక తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్ అడ్డదారులు తొక్కడం సిగ్గు చేటు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నేతలను, విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతోంది. ఇంతకన్నా దిగజారలేరు అనుకున్న ప్రతిసారీ మరింత దిగజారి ప్రవర్తించడం తండ్రీకొడులకు అలవాటుగా మారింది. జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన కృష్ణచైతన్య విద్యాసంస్థలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడం దుర్మార్గం. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి గమనిస్తున్నాను. ఎంతో మంది అనాథ పిల్లలకు, ఫీజులు కట్టలేని పేద విద్యార్థులకు చంద్రశేఖర్రెడ్డి కృష్ణచైతన్య విద్యాసంస్థలు ఉచితంగా విద్యను అందించి అండగా నిలిచింది. ఇది కేవలం ఒక సంస్థపై జరిగిన దాడి కాదు. ప్రశ్నించే గొంతులపై, ప్రజాస్వామ్య వ్యవస్థలపై, వైఎస్సార్సీపీపై జరిగిన దాడిగా మేము భావిస్తున్నాం. – కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీ మంత్రి -
హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్
– రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక, ప్రజావ్యతిరేకతను తట్టుకోలేక చంద్రబాబు, లోకేశ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. రెండేళ్లుగా కూటమి చేసిన మోసాలు, వెన్నుపోట్లను, డీఎస్సీ అక్రమాలను, అమరావతి భూ కుంభకోణాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు, దాడులతో భయభ్రాంతులకు గురి చేయాలని, ప్రశ్నించిన గొంతులను నొక్కాలని చూస్తున్నారు. డీఎస్సీ స్కామ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చారిత్రాత్మకం. విద్యా శాఖ మంత్రిగా లోకేశ్ అసమర్థుడు. నీతి నిజాయితీ ఉంటే తన శాఖలో జరిగిన కుంభకోణానికి బాధ్యత వహించి రాజీనామా చేయాలి. -
డీఎస్సీ కుంభకోణాన్ని ప్రశ్నించడమే నేరం
● ప్రజాదరణను ఓర్వలేకనే దాడులు ● కక్ష సాధింపు చర్యలను దీటుగా ఎదుర్కొంటాం ● రాజకీయంగా ఎదుర్కోలేకనే అడ్డదారులు తొక్కుతున్న కూటమి నేతలు ● కృష్ణచైతన్య విద్యాసంస్థల్లో అర్ధరాత్రి తనిఖీలను ముక్తఖంఠంతో ఖండించిన ఎమ్మెల్సీలు ● కదం తొక్కిన పార్టీ శ్రేణులు సాక్షిప్రతినిధి, నెల్లూరు: కూటమి ప్రభుత్వం రెండేళ్ల వెన్నుపోటు, మోసాలు, అసమర్థ పాలన, మెగా డీఎస్సీ పేరుతో సాగించిన కుంభకోణంపై ప్రశ్నించడమే నేరమన్నట్లుగా ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేయడాన్ని ఖండిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పార్టీ శ్రేణులతో కలిసి నెల్లూరులో కదం తొక్కారు. డీఎస్సీ కుంభకోణంపై సాక్ష్యాధారాలతో ప్రశ్నించిన ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ సమన్వయకర్త పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డికి చెందిన కృష్ణచైతన్య విద్యా సంస్థలపై ఇంటర్బోర్డు అధికారులు తనిఖీలు చేయడం, అనుమతుల పేరుతో వేధింపులకు దిగిన నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్సీలు 18 మంది సర్కారు దమననీతిపై దండయాత్ర చేశారు. సోమవారం చిల్డ్రన్స్పార్కు రోడ్డులోని రాంజీనగర్లోని చంద్రశేఖర్రెడ్డి నివాసానికి చేరుకున్న ఎమ్మెల్సీలు అక్కడి నుంచి ర్యాలీగా వీఆర్సీ సెంటర్ వరకు నిరసన ప్రదర్శనగా కొనసాగారు. నల్లకండువాలు ధరించి అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఫ్లకార్డులు, బ్యానర్లు చేతబూని ప్రభుత్వ దుర్నీతిని, దమన కాండలను నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలతో నిరసనను వ్యక్తం చేశారు.ఽ ఈ క్రమంలో అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు బయలుదేరిన వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, కేఆర్జే భరత్, శివరామిరెడ్డి, ఈసాక్బాషా, ఆర్ రమేష్యాదవ్, డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం, మేరిగ మురళీధర్, ఎన్. రామారావు, ఎం హనుమంతరావు, ఎండీ రూహుల్లా, డాక్టర్ ఎం.అరుణకుమార్, కవురు శ్రీనివాస్, జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్, ఉదయగిరి సమన్వయకర్తలు ఆనం విజయకుమార్రెడ్డి, మేకపాటి రాజారెడ్డి, నాయకులు పేర్నేటి కోటేశ్వరరెడ్డి, మందల శేషయ్య, ఆశ్రిత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
– రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ముందు నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల్లో తనిఖీలు నిర్వహించి ఆ తర్వాత చంద్రశేఖరరెడ్డి కాలేజీల్లో తనిఖీలు నిర్వహించాలి. నియమ నిబద్ధతతో విద్యాసంస్థలు నడుపుతున్న తమ పార్టీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి కళాశాలల్లో అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించడం రాజకీయ విద్వేషంగా భావిస్తున్నాం. అలవికాని హామీలిచ్చారు. అమలు చేయలేక.. ప్రజా వ్యతిరేకతను అణచివేసేందుకు ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అరెస్ట్లతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్ డీఎస్సీ స్కామ్పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి. లేకుంటే బాధ్యత వహించి రాజీనామా చేయాలి. -
వినతుల వెల్లువ
● పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి 162 మంది తమ సమస్యలను ఎస్పీ అజిత వేజెండ్ల దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలను విన్న ఆమె ఆయా ప్రాంత పోలీస్ అధికారులతో మాట్లాడారు. చట్టపరిధిలో వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, కావలి డీఎస్పీ వీవీ రమణకుమార్, ఇన్స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, భక్తవత్సలరెడ్డి, ఎన్.రామారావు, బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● అల్లూరు ప్రాంతానికి చెందిన వాణి, సుధామోహన్, జగదీష్ నాకు పరిచయమయ్యారు. ఉద్యోగం ఇప్పిస్తానని, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వచ్చేలా చేస్తామని నమ్మించి రూ.18 లక్షలు తీసుకుని మోసగించారు. నగదు అడుగుతుంటే చంపుతామని బెదిరిస్తున్నారని చిల్లకూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు. ● గతేడాది డిసెంబర్లో నా భర్త మోటార్బైక్పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్ర గాయపడ్డాడు. ప్రమాద ఘటనపై సమగ్రదర్యాప్తు జరిపి న్యాయం చేయాలని మర్రిపాడు ప్రాంతానికి చెందిన వివాహిత కోరారు. ● భర్త, అత్తమామలు అదనపుకట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధించడంతోపాటు ఇంటి నుంచి గెంటేశారు. విచారించి న్యాయం చేయాలని బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఓ వివాహిత వినితపత్రం ఇచ్చారు. ● వెంకటరమణయ్య అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడు. దగదర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. కేసును రాజీచేసుకోవాలని వెంకటరమణయ్య బెదిరిస్తున్నాడు. తగిన చర్యలు తీసుకోవాలని దగదర్తి ప్రాంతానికి చెందిన ఓ మహిళ కోరారు. ● నా భర్త విజయ్ ఒకటిన్నర నెల నుంచి కనిపించడం లేదు. చిల్లకూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. విచారణ వేగవంతం చేసి భర్త ఆచూకీ కనుక్కోవాలని వివాహిత అర్జీ సమ ర్పించారు. -
గంజాయి, మద్యం మత్తులో యువకుల వీరంగం
ఆత్మకూరు: పట్టణంలో గంజాయి, మద్యం మత్తులో యువకులు వీరంగం చేయడం పరిపాటిగా మారింది. సోమవారం 13వ వార్డులోని ఓ ఇంట్లోకి చొరబడి నలుగురు యువకులు గంజాయి మత్తులో కుటుంబ సభ్యులను కత్తితో బెదిరిస్తూ నానా దుర్భాషలాడారు. వారు ఫిర్యాదు చేయగా పోలీసులు వచ్చి అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిపైన దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. 13వ వార్డు దళితకాలనీ ప్రాంతంలో వెంకి అలియాస్ వెంకటేశ్వర్లు ఇంట్లోకి ఆదర్శ్, సుమంత్, బాబు, గోవింద్ అనే నలుగురు యువకులు మధ్యాహ్నంత 3.30 గంటల సమయంలో చొరబడ్డారు. ఇద్దరు లోపలికి వెళ్లగా మరో ఇద్దరు బయట ఉన్నారు. వెంకిని బయటకు రావాలని బెదిరించారు. అతను ఇంటి వద్ద లేడని మహిళలు చెబుతున్నా వినిపించుకోకుండా కత్తితో బెదిరిస్తూ నానా దుర్భాషలాడారు. వెంకి కనిపిస్తే ఇక్కడే చంపేస్తామంటూ వీరంగం చేశారు. ఇంట్లోని మహిళలు తీవ్రంగా భయాందోళనలకు గురయ్యారు. కొద్ది సేపటికి నలుగురు వెళ్లిపోయారు. దీంతో మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇంటి వద్ద నుంచి వచ్చిన నలుగురు యువకులు మున్సిపల్ బస్టాండ్ సమీపంలోని మద్యం దుకాణంలో ఉండగా ఇద్దరు పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లారు. అయితే సుమంత్, ఆదర్శ్ వారిపై తిరగబడ్డారు. ఎట్టకేలకు వారిని అదుపులోకి తీసుకుని చేతిలోని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో బాబు తప్పించుకున్నాడు. పట్టుబడిన గోవింద్, ఆదర్శ్, సుమంత్ను స్టేషన్కు తరలించారు. కాగా ఈ నెల మొదటి వారంలో ఏసీఎస్ఆర్కాలనీలో ఓ యువకుడు గంజాయి మత్తులో స్థానిక వ్యక్తిని బీరు బాటిల్తో తలపై గాయపరిచాడు. రెండు నెలల క్రితం టిడ్కో భవనాల్లో నివశిస్తున్న ఓ యువకుడు గంజాయి మత్తులో తండ్రిపై దాడి చేసి గాయపరిచాడు. ఓ ఇంటి కుటుంబ సభ్యులపై కత్తితో దాడికి యత్నం వీరిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైనే తిరగబడి దాడి ఎట్టకేలకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు -
డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలి
– వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ డీఎస్సీలో అక్రమాలు, అవినీతి జరగకుంటే వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలి. ఆ డీఎస్సీలో జరిగిన కుంభకోణాలను వెల్లడించారనే తమ పార్టీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డికి చెందిన కృష్ణచైతన్య విద్యా సంస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం దుర్మార్గం. నెల్లూరు నగరంలో 70 జూనియర్ కళాశాలలుంటే కేవలం చంద్రశేఖర్రెడ్డికి చెందిన జూనియర్ కళాశాలలపై దాడులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై గళం విప్పుతున్న వారి వ్యక్తిగత వ్యాపారాలు, ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. -
ఆలకించండి.. పరిష్కరించండి
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● సమస్యలు విన్నవించిన అర్జీదారులు నెల్లూరురూరల్: ‘సార్.. మేం చాలాదూరం నుంచి వచ్చాం. మా వినతులు పరిశీలించి న్యాయం చేయండి’ అంటూ ప్రజలు వేడుకున్నారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన భవన్లో సోమవారం ప్రజాసస్యల పరిష్కారవేదిక కార్యక్రమం జరిగింది. రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ, కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్కుమార్, ట్రెయినీ కలెక్టర్ పవన్తేజ, తెలుగుగంగ ప్రత్యేకాధికారులు కేశవర్ధన్రెడ్డి, వంశీకృష్ణ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగశేఖర్ తదితరులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జీవనాధారం తీసేస్తున్నారు తమ కుటుంబ జీవనాధారమైన వ్యవసాయ భూమికి నీటి వసతి లేకుండా చేస్తున్నారని చేజర్ల మండలం రెడ్డివారి కండ్రిక గ్రామానికి చెందిన లెక్కల మాలకొండారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు అర్జీ ఇచ్చిన అనంతరం మాట్లాడారు. తమ 20 ఎకరాల వ్యవసాయ భూమి నుంచి సుమారు 25 ఏళ్ల క్రితం సోమశిల కాలువ వెళ్లిందని, అప్పటి నుంచి కాలువపై పైపులు ఏర్పాటు చేసుకుని నీటిని వినియోగిస్తూ వ్యవసాయం చేసుకుంటున్నామని తెలిపారు. టీడీపీకి చెందిన వ్యక్తులు డీఈపై ఒత్తిడి తెచ్చి పైపులు తీయించి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అధికారులు సూచనల మేరకే పైపులు ఏర్పాటు చేసుకున్నామని, వాటి వల్ల ఇతర రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. రాజకీయ కారణాలతో వ్యవసాయానికి అడ్డంకులు సృష్టించకుండా అధికారులు స్పందించి, తమకు సాగు చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. డీఎస్సీలో అక్రమాలపై విచారణకు డిమాండ్ డీఎస్సీ నియామకాల ప్రక్రియలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జిల్లా కార్యదర్శి షేక్ మున్నా డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఆయన మాట్లాడుతూ అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళనలు, అనుమానాలను నివృత్తి చేసి అర్హులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి అమలు చేయాలన్నారు. ని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. అన్ని ఉద్యోగ నియామకాలను ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా నిర్వహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో ఉచిత కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే నిరుద్యోగ యువతకు అండగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. పునరావాసం కోసం ఎదురుచూపులు కండలేరు ముంపు గ్రామమైన వండ్లూరు ప్రజలకు తక్షణమే పునరావాసం కల్పించాలని బీజేపీ నాయకుడు మిడతల రమేష్ డిమాండ్ చేశారు. బాధితులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 32 ఏళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ముంపు బాధితులకు సరైన పునరావాసం కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అదే గ్రామానికి చెందిన కొందరికి ప్లాట్లు కేటాయించినప్పటికీ, కండలేరు జలాశయంలో చేపల వేటపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులు, దళితులు, బీసీ వర్గాల ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ముంపు బాధితులతో కలిసి రాష్ట్ర రాజధానిలో అధికారులను కలిసి సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. -
యోగా పోస్టర్ విజేతలకు బహుమతుల ప్రదానం
నెల్లూరు(టౌన్): జిల్లా స్థాయి యోగా పోస్టర్ పోటీల్లో విజేతలకు సోమవారం నెల్లూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో బహుమతులు ప్రదానం చేశారు. డీఈఓ బాలాజీరావు చేతుల మీదుగా విజేతలకు నగదు బహుమతులు, పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కావలి పాతూరు మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థి బున్సి సుదేశ్ ప్రథమ బహుమతి, మనుబోలు మండలం వీరంపల్లి జెడ్పీహెచ్ఎస్కు చెందిన అలకానంద ద్వితీయ స్థానాన్ని, ఇందుకూరుపేట ఎంకేఆర్ ఉన్నత పాఠశాల విద్యార్థి వాహిద్ తృతీయ స్థానాన్ని సాధించారు. విజేతలకు వరుసగా రూ.1000, రూ.750, రూ.500 నగదు బహుమతులతోపాటు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు, యోగ్యతా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సంబంధిత పాఠశాలల హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనధికార మద్యం విక్రయాలపై దాడులు● 36 కేసుల నమోదు ● ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి శ్రీనివాసులు నాయుడు నెల్లూరు(క్రైమ్): ఉన్నతాఽధికారుల ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా వారం రోజులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎ.శ్రీనివాసులు నాయుడు తెలిపారు. తనిఖీల వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. అక్రమంగా మద్యం నిల్వచేసి విక్రయిస్తున్న 36 మందిని అరెస్ట్ చేసి 280 క్వార్టర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న 67 మందిని అరెస్ట్చేశామని చెప్పారు. బహిరంగ మద్యసేవనాన్ని కట్టడి చేసేందుకు రూపొందించిన పోస్టర్లను జిల్లాలోని ప్రధాన కూడళ్లు, మద్యం దుకాణాల వద్ద ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మత్తు, మాదకద్రవ్యాలపై ఇతర శాఖల సమన్వయంతో కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తునామన్నారు. ప్రజలు తమ ప్రాంతాల్లో అనధికార మద్యం విక్రయాలు, అక్రమ నిల్వలు, ఇతర ఎకై ్సజ్ నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప ఎకై ్సజ్ అధికారులకు లేదా టోల్ఫ్రీ నంబర్ 14405కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. యువకుడి ఆత్మహత్యనెల్లూరు(క్రైమ్): ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. జనశక్తినగర్కు చెందిన అఖిల్ కుమార్ (27), ప ర్వీన్ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. అఖిల్ ఓ కంపెనీలో డెలివరీ బాయ్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతను ఓ మహిళతో మాట్లాడుతున్నాడని దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈనెల 17వ తేదీన పర్వీన్ తన పుట్టింటికి వెళ్లిపోయింది. అఖిల్ ఆదివారం సాయంత్రం భార్యకు ఫోన్ చేశాడు. వారిద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన అఖిల్ తన బెడ్రూమ్లో సీలింగ్కు ఉన్న ఇనుప పైపునకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాధిత కుటుంబ సభ్యులు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తప్పుల మీద తప్పులు చేస్తున్నారు
– కల్పలతారెడ్డి, ఎమ్మెల్సీ కూటమి ప్రభుత్వం ఒక తప్పును కప్పి పుచ్చుకునేందుకు తప్పుపై తప్పులు చేస్తుంది. 16 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం అర్హులకు అన్యాయం చేసింది. డీఎస్సీ అవినీతి, అక్రమాలపై సాక్ష్యాధారాలతో ప్రశ్నిస్తున్న తమ పార్టీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డికి చెందిన కళాశాలల్లో తనిఖీలు నిర్వహించి భయాందోళనలకు గురి చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. కూటమి ప్రభుత్వ బెదిరింపులకు భయపడే వారెవరూ మా పార్టీలో లేరు. రాష్ట్రంలో ప్రతి రంగంలో అవినీతి పెరిగిపోయింది. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన బాబు ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో ఘోరంగా విఫలమైంది. -
నారాయణ విద్యాసంస్థలపై దాడులు చేసే ధైర్యం ఉందా
ప్రతిపక్షాన్ని రాజకీయంగా ఎదుర్కొ నే దమ్ము, ధైర్యం చంద్రబాబు, లోకేశ్లకు లేదు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడడం దుర్మార్గం. డీఎస్పీ అక్రమాలను ప్రశ్నించిన తమ పార్టీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డికి చెందిన విద్యాసంస్థల్లో తనిఖీలు, ఆకస్మిక దాడులు చేస్తున్నారు. చంద్రశేఖర్రెడ్డి విద్యాసంస్థలపై జరిగిన దాడులను తమ పార్టీపై జరిగిన దాడిగా తాము భావిస్తున్నాం. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారం చేపడితే తాము కూడా ఇదే ఒరవడి, సంప్రదాయం కొనసాగిస్తే కూటమి నాయకులు తట్టుకోలేరు. విద్యాశాఖ మంత్రి లోకేశ్కు చిత్తశుద్ధి ఉంటే వందల సంఖ్యలో ఉన్న నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలపై దాడులు చేసే ధైర్యం చేయాలి. అక్రమంగా నిర్వహిస్తున్న హాస్టళ్లపై తనిఖీలు ఎందుకు జరపడం లేదు. ప్రశ్నించిన వారిపై అకమ కేసులు బనాయించి జైలుకు పంపుతున్నారు. – లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ -
కక్ష పూరితంగా అక్రమ తనిఖీలు
– తూమాటి మాధవరావు, ఎమ్మెల్సీ కూటమి ప్రభుత్వం అసమర్థ పాలనను, అవినీతి, అక్రమాలు ప్రశ్నించిన వారి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది. డీఎస్సీ అక్రమాలను నిగ్గదీసి ప్రశ్నించినందుకే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి విద్యా సంస్థల్లో రాజకీయ కక్ష పూరితంగా తనిఖీలు చేశారు. చంద్రశేఖరరెడ్డి నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో ఎంతో మంది పేదలకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. నారాయణ విద్యాసంస్థల్లో ఒక్కరికై నా ఉచితంగా చదువు చెప్పారా? కందుకూరు నియోజక వర్గంలోఒక మహిళ నుంచి రూ.15 లక్షలు తీసుకుని డీఎస్సీలో ఉద్యోగం ఇచ్చారు. నా వద్ద బ్యాంకు స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి. డీఎస్సీలో అడ్డగోలుగా ఉద్యోగాలు అమ్ముకున్నారు. కూటమి ప్రభుత్వ అక్రమాలను ఎండగడతాం. -
ఆర్టీసీని ప్రైవేట్పరం చేయొద్దు
● కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ టీయూసీ నిరసన నెల్లూరురూరల్: ఏపీఎస్ ఆర్టీసీని ప్రైవేట్పరం చేయొద్దని వైఎస్సార్ టీయూసీ జిల్లా అధ్యక్షుడు జయకుమార్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద సంఖ్యలో విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు, సాధారణ ప్రజలు రోజూ ఆర్టీసీ సేవలపై ఆధారపడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీ సేవలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు ప్రజల్లో, ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. ప్రైవేటీకరణ అమలైతే మారుమూల ప్రాంతాలకు రవాణా సేవలు తగ్గిపోయే ప్రమాదం ఉందన్నారు. అలాగే ప్రయాణ చార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉన్న సామాజిక రవాణా సేవలు దెబ్బతింటాయని, వేలాది మంది ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాల కంటే లాభాపేక్షకు ప్రాధాన్యం పెరిగే ప్రమాదం ఉందని, విద్యార్థులు, వృద్ధులు, మహిళలు తదితర వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు తగ్గిపోయే అవకాశం ఉందన్నారు. కొత్త బస్సులు కొనుగోలు చేయడంతోపాటు సిబ్బంది నియామకాలు చేపట్టి, ఆధునిక సౌకర్యాలతో సంస్థను అభివృద్ధి చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్కుమార్, నియోజకవర్గ అధ్యక్షులు నవీకుమార్రెడ్డి, చెన్నారెడ్డి, పరంధామయ్య, వంశీ, శ్రీకాంత్, పెంచలయ్య, నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. -
తురిమెర్లలో మహిళపై దాడి
దగదర్తి: మండలంలోని తురిమెర్లలో ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటన సీసీ టీవీ ఫుటేజీలో నమోదైంది. సోషల్ మీడియాలో వైరలైంది. బాధితురాలు, కుటుంబ సభ్యులు సోమవారం వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన కొల్లి కామేశ్వరమ్మ ఆదివారం మధ్యాహ్నం తన గేదెలను మేతకు తీసుకెళ్తోంది. ఈ సమయంలో ఘటాల కొండయ్య ఇంటి ప్రహరీని గేదెలు రాసుకుంటూ వెళ్లాయి. దీంతో కొండయ్య అత్త, కామేశ్వరమ్మ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న కొండయ్య ఆగ్రహానికి లోనై కామేశ్వరమ్మపై దాడి చేశాడు. ఆమెకు గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సోమవారం బాధితురాలి బంధువులు దగదర్తి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మహిళపై జరిగిన దాడిని గ్రామస్తులు ఖండించారు. నిందితుడిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు దగదర్తి ఎస్సై మహేంద్ర తెలిపారు. -
సమస్యలు పరిష్కారం కావడం లేదు
● రెవెన్యూ అధికారులపై మహిళ ఆరోపణలు నెల్లూరు(అర్బన్): ‘రెవెన్యూ అధికారులు సకాలంలో సమస్యలు పరిష్కరించడంలేదు. తిప్పుకొంటున్నారు. దొంగలు’ అంటూ నెల్లూరుకు చెందిన సుబ్బరామమ్మ అనే లాయర్ ఆరోపించారు. ఆమె తమ క్లెయింట్లకు సంబంధించిన సమస్యలపై తరచూ కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలిస్తుంటారు. సోమవారం ఆమె కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో, ఇతర జిల్లా అధికారుల ముందు, మంత్రి నారాయణ సమక్షంలోనే రెవెన్యూ అధికారులపై ఘాటుగా ఆరోపణలు చేశారు. ఈ మాటలు రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపాయి. చర్యలకు డిమాండ్ రెవెన్యూ వ్యవస్థను కించపరస్తూ మాట్లాడిన సుబ్బరామమ్మ అనే మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచలరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అధికారులను దొంగలంటూ కించపరచడం దారుణమని అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు. -
అంగరంగ వైభవంగా..
ఆత్మకూరు పట్టణ పరిధిలో ఆదివారం సాయంత్రం హనుమాన్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. బైపాస్రోడ్డులోని అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి రవితేజ కల్యాణ మండపం సెంటర్ మీదుగా పట్టణంలోకి మోటారు బైక్లపై కాషాయ జెండాలు చేతబట్టి యువకులు శోభాయాత్రలో పాల్గొన్నారు. ఏకలవ్య నగర్ యువకులు చేసిన కర్రసాము, పలు ప్రాంతాలకు చెందిన మహిళల కోలాట నృత్యం, దేవతా రూపాల వేషధారణలు ఆకట్టుకున్నాయి. శోభాయాత్రలో అయోధ్య బాలరాముడు, ఆంజనేయస్వామి, రాములవారి భారీ విగ్రహం వంటి పలు దేవతారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. – ఆత్మకూరు -
ఇసుక టిప్పర్ అదుపుతప్పి..
దుత్తలూరు: మండలంలోని తెడ్డుపాడు బీసీ కాలనీ సమీ పాన 565 జాతీయ రహదారిపై వంతెన గోడను టిప్పర్ ఢీకొట్టిన ఘటన ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన టిప్పర్ ఇసుక కోసం పెన్నానది ప్రాంతానికి వెళ్తోంది. ఈ తరుణంలో టిప్పర్ తెడ్డుపాడు బీసీ కాలనీ వద్దకు రాగానే అదుపుతప్పి వంతెన గోడను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ క్యాబిన్ ఊడి వంతెన కింద కాలువలో పడిపోయింది. గమనించిన స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని క్యాబిన్లో ఇరుక్కుపోయిన డ్రైవర్ నాగరాజును బయటకు తీశారు. అతనికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం 108 వాహనానికి సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని చికిత్స నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
యోగాతో ఒత్తిడి దూరం
నెల్లూరు(క్రైమ్): యోగాతో ఒత్తిడి దూరమవుతుందని ఎస్పీ అజిత వేజెండ్ల అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలోని పోలీసు కవాతు మైదానంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి యోగాసనాలు, ప్రాణాయామం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగాతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, క్రమశిక్షణ పెంపొందుతాయన్నారు. పోలీసు విధుల్లో ఒత్తిడి అధికంగా ఉంటుందని, యోగా, ధ్యానం అలవాటు చేసుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకుని విధులను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చన్నారు. ప్రస్తుతం శిక్షణ పొందుతున్న వారు సైతం యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఫిట్ పోలీస్–ఫిట్ సొసైటీ లక్ష్యంతో పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, ఫిట్నెస్కు జిల్లా పోలీసుశాఖ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, ఏఆర్ ఏఎస్పీ అప్పారావు, నగర ఏఎస్పీ దీక్ష, యోగా గురువు మురళి, డీఎస్పీలు ఘట్టమనేని శ్రీనివాసరావు, గిరిధర్, చంద్రమోహన్, రామకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
టెట్ నుంచి మినహాయించకుంటే ఉద్యమమే
కోట: ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలని, లేని పక్షంలో ఉద్యమానికి దిగుతామని బీటీఏ రాష్ట్ర కోశాధికారి ఎమ్మార్ చక్రవర్తి హెచ్చరించారు. కోట క్రాస్రోడ్డులోని ప్రాథమిక పాఠశాలలో బీటీఏ సమావేశం ఆదివారం జరిగింది. ముఖ్య అతిథిగా చక్రవర్తి హాజరై, సభ్యత్వ నమోదు, సంఘ నిర్మాణం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉపాధ్యాయులపై పనిఒత్తిడి పెంచేస్తున్నారని, రెండేళ్లలో ఉపాధ్యాయులకు ఇచ్చిన ఏ ఒక్క హామీకి పరిష్కారం చూపలేదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డేగ సుబ్రహ్మణ్యం, నాగరాజు, పీవీ కిష్టయ్య, శేఖర్, రమణయ్య, సుదర్శనమ్మ, చెంగమ్మ, సుజాత పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు
ఉదయగిరి రూరల్: ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొని ముగ్గురు వ్యక్తులు గాయపడిన ఘటన ఆదివారం ఉదయం పట్టణ సమీపంలోని గండిపాళెం వెళ్లే మార్గంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.. వరికుంటపాడు మండలం జి.కొండారెడ్డిపల్లికి చెందిన కె.వెంకటయ్య బైక్పై ఉదయగిరి వెళ్తున్నారు. అదే మార్గంలో ఉదయగిరి నుంచి శకునాలపల్లికి బైక్పై దుగ్గయ్య, పవన్కుమార్ వెళ్తున్నారు. పట్టణ సమీపంలోని రైస్ మిల్లు వద్దకు వెళ్లేసరికి రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో వెంకటయ్యకు తీవ్ర గాయాలు కాగా దుగ్గయ్య, పవన్కుమార్కు స్వల్ప గాయాలైంది. వీరిని స్థానికులు చికిత్స నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చవటపల్లి వద్ద.. మండలంలోని అప్పసముద్రం పంచాయతీ చవటపల్లి గ్రామానికి చెందిన పి.సుబ్బారెడ్డి బైక్పై ఉదయగిరి వెళ్తున్నారు. గ్రామ సమీపంలోని మలుపు వద్ద బైక్ అదుపుతప్పి పడింది. ఈ ప్రమాదంలో సుబ్బారెడ్డికి గాయాలు కావడంతో స్థానికులు గమనించి 108 వాహనంలో ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యుల పరీక్షించి మెరుగైన వైద్యం కోసం ఆత్మకూరు ఆస్పత్రికి తరలించారు.


