breaking news
SPSR Nellore District Latest News
-
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
మైనింగ్తో నాకెలాంటి సంబంధం లేదు నెల్లూరు రూరల్: భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికల నేపథ్యంలో అన్ని శాఖల అధికారుల అప్రమత్తంగా ఉండాలని జేసీ కార్తీక్ ఆదేశించారు. కలెక్టరేట్లోని శంకరన్ సమావేశ మందిరంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిటీతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 1077, 79955 76699, 0861 – 2331261 కంట్రోల్ రూమ్ నంబర్లు, డివిజన్, మండల కేంద్రాల్లోని కాల్ సెంటర్లు, స్థానిక సచివాలయాలను సంప్రదించాలని కోరారు. డీఆర్వో హుస్సేన్న్సాహెబ్, జెడ్పీ సీఈఓ మోహన్రావు, మత్స్యశాఖ జేడీ శాంతి, విద్యుత్ శాఖ ఎస్ఈ విజయన్, ఇరిగేషన్, సోమశిల, తెలుగుగంగ ప్రాజెక్ట్ ఎస్ఈలు దేశ్నాయక్, వెంకటరమణారెడ్డి, రాధాకృష్ణారెడ్డి, డీపీఓ శ్రీధర్రెడ్డి, జిల్లా ఉద్యానాధికారి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీసుల విచారణలో బిరదవోలు వెల్లడి సాక్షిప్రతినిధి, నెల్లూరు: రాజకీయ కక్షతోనే తనపై అక్రమ కేసును కూటమి నేతలు బనాయించారని, మైనింగ్తో తనకెలాంటి సంబంధం లేదంటూ పోలీసుల కస్టడీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బిరదవోలు శ్రీకాంత్రెడ్డి వెల్లడించారని సమాచారం. పొదలకూరు మండలం తాటిపర్తి మైనింగ్ కేసులో మూడు రోజుల పోలీస్ కస్టడీ గురువారంతో ముగిసింది. చివరి రోజున డీటీసీలో పోలీస్ అధికారులు ఆయనకు 23 ప్రశ్నలేయగా, లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. తనది మనుబోలు మండలం మడమనూరు అని.. రాజకీయంగా మాజీ మంత్రులు అనిల్కుమార్యాదవ్, కాకాణి గోవర్ధన్రెడ్డితో పరిచయమని.. తమ ఊరి సమస్యలపై వీరితో మాట్లాడేవాడినని.. రుస్తుం మైన్స్తో పాటూ క్వార్ట్జ్ వ్యాపారాలతో ఎలాంటి సంబంధం లేదని.. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసని బిరదవోలు వెల్లడించారని తెలిసింది. -
ఆరు లేన్లున్నా.. ఆర్తనాదాలే
ప్రమాద ఘంటికలు దారుణ వైఫల్యం ● 11 నెలల్లో 15 మంది మృతి.. 54 మందికి గాయాలు ● ఇటీవల ఏడుగురి దుర్మరణం ● అతివేగం, నిద్రమత్తే కారణం ● ప్రమాదాల నివారణకు చర్యలు శూన్యం ● ఉలవపాడులోని జాతీయ రహదారిపై ఇదీ పరిస్థితిఅటు.. ఇటు మూడు వరుసలు.. వాహనాలు వెళ్లేందుకు వీలుగా తీర్చిదిద్దిన జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఆరు లేన్లుగా ఉన్నా.. ప్రయాణికుల ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. అతివేగం, నిద్రమత్తు తదితర కారణాలతో హైవేపై జరుగుతున్న యాక్సిడెంట్లతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ప్రయాణమంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. సింగరాయకొండ నుంచి తెట్టు వరకు ప్రమాదాలు నిత్యకృత్యమవుతున్నాయి. – ఉలవపాడు ఇటీవల జరిగిన ప్రమాదాలు -
బలవంతపు భూసేకరణ దారుణం
మాట్లాడుతున్న అజయ్కుమార్ ఉదయగిరి: పరిశ్రమల పేరిట రాష్ట్రంలోని రైతుల నుంచి భూములను బలవంతంగా సేకరించేందుకు ప్రభుత్వం యత్నిస్తుండటం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు అజయ్కుమార్ పేర్కొన్నారు. స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్లో కార్యకర్తలతో సమావేశాన్ని గురువారం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు, ప్రజల పొట్టగొట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించారు. కరేడులో ఇండోసోల్ కంపెనీకి ఎనిమిది వేల ఎకరాలను కట్టబెట్టేందుకు యత్నించడం సిగ్గుచేటని విమర్శించారు. తమ భూములను ఇవ్వబోమంటూ నెల రోజులుగా రైతులు, ప్రజలు పోరాటాలు చేస్తున్నా, ప్రభుత్వంలో కనీస స్పందన లేకపోవడం దారుణమన్నారు. లింగసముద్రం మండలం మాలకొండ ఆలయం చుట్టూ ఉన్న నాలుగు గ్రామాల పరిసర భూముల్లో 19 చదరపు కిలోమీటర్ల మేర ఇనుప ఖనిజం ఉందని, వీటిని జిందాల్ కంపెనీకి కట్టబెట్టేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. వరికుంటపాడు పంచాయతీ జంగంరెడ్డిపల్లె తిప్పపై ఇచ్చిన మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని సంఘాలతో కలిసి చలో కరేడు కార్యక్రమాన్ని ఈ నెల 18న నిర్వహించనున్నామని వెల్లడించారు. సీపీఎం నేతలు కాకు వెంకటయ్య, కోడె రమణయ్య, ఫరిద్దీన్బాషా, వెంకటేశ్వర్లు, కామాక్షమ్మ తదితరులు పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబు
పరేడ్ గ్రౌండ్లో చేసిన ఏర్పాట్లుకవాతు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది గౌరవ వందనం స్వీకరిస్తున్న ఎస్పీ కృష్ణకాంత్ నెల్లూరు(క్రైమ్): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు నెల్లూరు నగరంలోని పోలీసు కవాతు మైదానం సిద్ధమైంది. పోలీస్ వందనం స్వీకరణ, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. గురువారం ఎస్పీ జి.కృష్ణకాంత్ సన్నాహక ఏర్పాట్లను పరిశీలించారు. కవాతు రిహార్సల్స్ను పరిశీలించారు. భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలిచ్చారు. శుక్రవారం జెండా వందనానికి విచ్చేసే ముఖ్యఅతిథులకు గౌరవార్థం ఇచ్చే వందన సమర్పణ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ప్రతి ఒక్కరిని డీఎంఎఫ్డీ ద్వారా తనిఖీ చేయాలన్నారు. ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు. ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, ఎస్బీ, ఏఆర్ డీఎస్పీలు ఎ.శ్రీనివాసరావు, ఎస్.చంద్రమోహన్, ఆర్ఐలు అంకమరావు, రాజారావు, హరిబాబు, పౌల్రాజు, శ్రీనివాసులురెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ డి.వెంకటేశ్వరరావు, ఆర్ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. -
భలే కేటుగాళ్లు
తిరుపతి క్రైమ్: సెల్ఫోన్లు చోరీ చేసి అందులోని బ్యాంక్ ఖాతా నగదు హాంఫట్ చేస్తున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం ఈస్ట్ పోలీస్ స్టేషన్లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్కు చెందిన హరికృష్ణ, అన్నమయ్య జిల్లాకు చెందిన అశోక్, నెల్లూరు జిల్లాకు చెందిన గడ్డం కాసిరెడ్డి ముఠాగా ఏర్పడి నగరంలో సెల్ఫోన్ల చోరీకి పాల్పడేవారు. వాటిలో ఫోన్ పే, గూగుల్ పేను పరిశీలించి అందులో నగదును సరికొత్త ఎత్తుగడలతో కొట్టేసేశారు. ఏటీఎం సెంటర్ వద్ద కాపు కాసి, అక్కడ వచ్చే వారికి తమ వారు హాస్పిటల్లో ఉన్నారని, డబ్బులు చాలా అవసరమని ఫోన్ పే చేస్తామని, కావాలంటే కమీషన్ కూడా ఇస్తామని నమ్మిస్తారు. ఇలా చెప్పి వీరంతా రూ.3.6 లక్షలు కాజేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. హరికృష్ణ నుంచి రూ.లక్ష, 40 సెల్ఫోన్లు, అశోక్ నుంచి రూ.90 వేలు, 6 ఫోన్లు, కసిరెడ్డి నుంచి రూ.90 వేలు, మూడు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు ఛేదనలో ప్రతిభ చూపిన ఈస్ట్ సీఐ శ్రీనివాసులు, ఎస్సై హేమాద్రి, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. సెల్ఫోన్లు చోరీ చేసి బ్యాంక్ ఖాతాల్లో నగదు హాంఫట్ ముగ్గురి అరెస్ట్ నిందితులు హైదరాబాద్, అన్నమయ్య జిల్లా, నెల్లూరు వాసులు -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం
● రూ.8 లక్షల ఆస్తి నష్టం ● లబోదిబోమంటున్న బాధితులు కొడవలూరు: విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో రేకుల ఇల్లు దగ్ధమవడంతో ఓ కుటుంబం సర్వం కోల్పోయింది. ఈ ఘటన మండలంలోని గండవరం పూలతోట గాడికయ్యల్లో గురువారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గోళ్ల ప్రసాద్, లక్ష్మి దంపతులు కూలీ పనులకు వెళ్తుంటారు. రోజూలాగే గురువారం ఉదయం పనికెళ్లారు. వారింట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. వస్తువులు పూర్తిగా తగులబడే వరకూ చుట్టుపక్కల వారు గుర్తించలేకపోయారు. కొంతసేపటి తర్వాత వాసన రావడం, కిటికీలో నుంచి పొగ వస్తుండటంతో గుర్తించి బాధితులకు సమాచారం అందించారు. వారు ఇంటికి చేరుకోగా అప్పటికే బీరువా, రిఫ్రిజిరేటర్, మంచం, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయింది. పనికెళ్లి పొదుపు చేసి బీరువాలో దాచిన రూ.3 లక్షల నగదు, రూ.3 లక్షల విలువైన బంగారు నగలు, రూ.2 లక్షల విలువైన సామగ్రి తగులబడిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. గ్రామానికి చెందిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి వారిని పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. -
ఇచ్చేదే అరకొర.. అందులోనూ కోతే
జిల్లా క్రీడాప్రాధికార సంస్థలో పనిచేస్తున్న కోచ్లు, నాలుగో తరగతి ఉద్యోగులు ఏడాదిగా జీతాల్లేక అవస్థ పడుతున్నారు. వీరి కష్టాన్ని గుర్తించి ప్రతి నెలా అందజేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురిచేసింది. తాజాగా వీరికి మరో షాక్ ఇచ్చింది. ఏడాదికి సంబంధించిన జీతాల్లో సగాన్నే జమ చేసి గందరగోళానికి గురిచేసింది. అసలు ఇలా ఎందుకు వ్యవహరించారనే అంశంపై ఎవరి వద్దా స్పష్టత లేకపోవడం గమనార్హం. ● డీఎస్ఏ ఉద్యోగులపై ప్రభుత్వం చిన్నచూపు ● ఏడాదిగా జీతాల్లేక ఆర్తనాదాలు ● ఎట్టకేలకు జమచేసినా.. అదీ సగమే ● క్రీడారంగ అభివృద్ధెలా..? నెల్లూరు(స్టోన్హౌస్పేట): క్రీడాప్రాధికార సంస్థ నిర్వహణ తీరు లోపభూయిష్టంగా మారింది. వాస్తవానికి ఇక్కడ పనిచేసే కాంట్రాక్ట్ కోచ్లు, నాలుగో తరగతి ఉద్యోగులకు ఇచ్చే జీతమే స్వల్పం. ఈ మొత్తాన్నీ ఏడాది పాటు నిలిపి వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. దీనిపై కలెక్టర్ మొదలుకొని ప్రజాప్రతినిధులు, రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎలాంటి ప్రయోజనం లభించలేదు. ఈ అంశమై ‘జీతాల్లేవ్.. క్రీడల్లో శిక్షణ ఇచ్చేదెలా’ అనే శీర్షికన సాక్షిలో జూన్ 29న కథనం ప్రచురితమైంది. దీంతో రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ అధికారులు రెండు నెలల తర్వాత సమావేశాన్ని ఏర్పాటు చేసి జీతాలిస్తామని ప్రకటించారు. అకౌంట్ చూసి.. నిర్ఘాంతపోయి..! ఎట్టకేలకు వారి బ్యాంక్ ఖాతాల్లో జీతాలు బుధవారం రాత్రి జమయ్యాయి. అయితే సగమే పడటంతో నిర్ఘాంతపోవడం వారి వంతైంది. ఇలా ఎందుకు వ్యవహరించారనే విషయమై రాష్ట్ర, జిల్లా క్రీడాప్రాఽధికార సంస్థ అధికారులు నోరు మెదపడంలేదు. జమైంది ఇలా.. డీఎస్ఏలో పనిచేసే కోచ్లకు జీతం రూ.21,500 కాగా, జమైంది రూ.12 వేలు. డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆకౌంటెంట్లకు రూ.20 వేల జీతం కాగా, వచ్చింది రూ.15 వేలే. ఆఫీస్ సబార్డినేట్, గ్రౌండ్స్ మార్కర్, స్వీపర్, వాచ్మెన్, ఇండోర్ స్టేడియం అటెండర్లు, క్లీనర్లకు రూ.15 వేలు ఇవ్వాల్సి ఉండగా, రూ.ఎనిమిది వేలను అందజేశారు. స్విమ్మింగ్ పూల్ స్వీపర్లు, వాచ్మెన్లు, ఎలక్ట్రీషియన్, వెంకటగిరి, గూడూరు సబ్ సెంటర్ల కేర్ టేకర్లు, ఓజిలి సబ్ సెంటర్ వాచ్మెన్కు ఇచ్చే జీతం రూ.15 వేలు కాగా, రూ.ఎనిమిది వేలనే జమ చేశారు. అప్పులను ఎలా తీర్చాలో..? వీరికిచ్చే జీతాలు అంతంతమాత్రమే. ఏడాది పాటు వేతనాలను నిలిపి అందులోనూ సగమే జమచేయడంతో ఉద్యోగులు కన్నీటిపర్యంతమయ్యారు. అప్పులను ఎలా తీర్చాలో పాలుపోక వీరు సతమతమవుతున్నారు. ఈ పరిణామాలతో జిల్లాలో క్రీడా రంగం అస్తవ్యస్థంగా మారే ప్రమాదం ఉంది. జీవితాలు బాగుండాలంటే క్రీడల్లో పాల్గొనాలని చెప్పే అధికారులు, ప్రజాప్రతినిధులు వీరిని విస్మరిస్తున్నారు. ఈ ఏడాది క్రీడా పరికరాలు, మైదానాల అభివృద్ధికి ఎలాంటి ఆర్థిక సాయం చేయని కూటమి ప్రభుత్వం ఉద్యోగులనూ విస్మరించి తన మార్కును ప్రదర్శించింది. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం శాప్ అధికారులకు తెలియజేశాం సగం జీతాలే జమయ్యాయనే అంశాన్ని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ అధికారులకు తెలియజేశాం. పూర్తిగా జీతాలొచ్చేందుకు అధికారులతో కలిసి యత్నిస్తాం. – యతిరాజ్, డీఎస్డీఓ -
18న చలో కరేడు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన తలపెట్టిన చలో కరేడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ పిలుపునిచ్చారు. నెల్లూరులోని బాలాజీనగర్లో ఉన్న ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూములు ఇచ్చేది లేదని గ్రామసభలో రైతులు తే ల్చిచెప్పారన్నారు. అయితే ఎమ్మెల్యే, కలెక్టర్ గ్రామ రైతుల మధ్య చీలిక తెచ్చి భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చలో కరేడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలిన కోరారు. అనంతరం పోస్టర్ విడుదల చేశారు. సమావేశంలో నాయకులు రాంబాబు, చండ్ర రాజగోపాల్, దామా అంకయ్య, షాన్వాజ్, మాదాల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. ఎర్రచందనం కేసులో ఒకరికి ఏడాది జైలుతిరుపతి లీగల్: ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న కేసులో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రాపూరు మండలం పంగిలి గ్రామానికి చెందిన కె.నరసింహులుకు ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.శ్రీకాంత్ గురువారం తీర్పు చెప్పారు. కోర్టు లైజనింగ్ ఆఫీసర్లు బాబు ప్రసాద్, రఘు, ఫారెస్ట్ అధికారి చక్రపాణి తెలిపిన వివరాల మేరకు.. 2014 మార్చి 5వ తేదీ నెల్లూరు డివిజన్, రాపూర్ ఫ్లైయింగ్ స్క్వాడ్ ఫారెస్ట్ సిబ్బంది సైదురాజులపల్లి రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేశారు. ఆ సమయంలో గూడ్స్ క్యారియర్ వాహనం ఫారెస్ట్ సిబ్బందిని చూసి వారికి దూరంగా ఆగింది. ఆ వాహనంలోని ముగ్గురు పరారయ్యారు. అయితే వారిలో నిందితుడు నరసింహులును మాత్రం ఫారెస్ట్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. 436 కిలోల 17 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నరసింహులును విచారించగా మరో ఇద్దరి పేర్లను తెలిపాడు. దీంతో ఫారెస్ట్ సిబ్బంది వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. నేరం నరసింహులుపై మాత్రం రుజువు కావడంతో న్యాయమూర్తి అతడికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. మరో ఇద్దరిపై కేసును కొట్టేస్తూ తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీసీ నిర్మల వాదించారు. నెల్లూరు జైలుకు తరలింపు నెల్లూరు(అర్బన్): కోర్టు శిక్ష విధించిన నరసింహులును నెల్లూరు జైలుకు తరలిస్తున్నట్లు ఫారెస్ట్ రాపూరు రేంజర్ రవీంద్ర తెలిపారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలించినా, రవాణాకు సహకరించినా కేసులు తప్పవని ఆయన హెచ్చరించారు. -
డివిజన్లు విద్యుత్ సర్వీసులు స్మార్ట్ మీటర్లు
● ఇప్పటికే పలు ప్రభుత్వ, వాణిజ్య సంస్థల్లో మీటర్ల ఏర్పాటు ● మాకొద్దు మహాప్రభో అంటున్నా పట్టించుకోని సర్కార్ ● పూటపూటకూ మారనున్న టారిఫ్తో ప్రజల బెంబేలు ● రీచార్జి చేస్తేనే ఇంట్లో కరెంట్ నెల్లూరు (వీఆర్సీసెంటర్): సీఎం చంద్రబాబు మార్కు మోసాల్లో తాజాగా మరొకటి చేరింది. స్మా ర్ట్ మీటర్లను బిగించబోమంటూ గతంలో కల్లబొల్లి కబుర్లు చెప్పిన ఆయన తాజాగా వీటి ఏర్పాటు దిశగా అడుగులేస్తున్నారు. ఈ పరిణామం ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. అసలీ స్మార్ట్ మీటర్ల గోల ఏమిటానని వారు ఆందోళనకు గురవుతున్నారు. గుడ్లు తేలేస్తున్నారు.. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి స్మార్ట్ మీటర్ల ఏర్పాటు దిశగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థల్లో వీటిని ఏర్పాటు చేశారు. తదనంతరం 200 యూనిట్లు వాడే ప్రతి గృహంలోనూ బిగించే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నెలకొల్పారు. పాత మీటర్ల స్థానంలో వీటిని ఏర్పాటు చేశాక, విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయి. దీనిపై వినియోగదారులతో పాటు వామపక్ష పార్టీల నేతలు వ్యతిరేకిస్తున్నారు. సబ్స్టేషన్ల వద్ద ధర్నాలనూ చేపడుతున్నారు. నాలుగింతలు అధికంగా.. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విద్యుత్ సర్వీసులు 9,64,379 ఉండగా, ఇందులో వ్యవసాయ సర్వీసులు 1,46,185. ప్రస్తుతానికి వీటిని మాత్రం స్మార్ట్ మీటర్ల నుంచి మినహాయించారు. నగరంలోని ఓ పిండిమిల్లు యజమానికి గతంలో నెలకు రూ.ఆరు బిల్లొచ్చేది. అయితే స్మార్ట్ మీటర్ను ఏర్పాటు చేశాక, ఏకంగా రూ.26 వేలొచ్చింది. మరో దుకాణ యజమానికి నెలకు రూ.మూడు వేల బిల్లు వస్తుండగా, ఆపై ఇది రూ.ఐదు వేలకు పెరిగింది. టారిఫ్ తంటాలు ఈ విధానంతో టారిఫ్ సైతం మారనుంది. గతంలో పాత మీటర్లు ఉన్న సమయంలో రోజంతా ఒకే టారిఫ్తో నెల బిల్లొచ్చేది. అయితే వినియోగించే యూనిట్లు అధికమయ్యే కొద్దీ ఇది మారుతూ ఉండేది. 0 – 30 యూనిట్ల వరకు ఒక టారిఫ్.. 31 – 75.. 76 – 125.. 126 – 225.. 226 – 400.. 400 –500 యూనిట్ల వరకు ఉండేది. అయితే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒకలా.. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మరోలా.. సాయంత్రం నుంచి తెల్లవారు వరకు మరో టారిఫ్లో బిల్లులొచ్చే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ మీటర్ ధర రూ.20 వేలకుపైగా ఉంటుంది. ఏర్పాటు సమయంలో ప్రజల నుంచి ఎలాంటి నగదును కట్టించుకోకుండా, మీటర్ ధర మొత్తాన్ని బిల్లులో కలుపుతారేమోననే అనుమానం తలెత్తుతోంది. ఇక అంతా ప్రీపెయిడే.. వాస్తవానికి గతంలో నెలంతా వాడుకున్న యూనిట్లకు లెక్క కట్టి రీడింగ్ తీసి బిల్లులిచ్చేవారు. దీన్ని 15 రోజుల్లో చెల్లించే వెసులుబాటు ఉండేది. అయితే ఇక నుంచి ఈ అవకాశం ఉండదు. మొబైల్ ఫోన్లలో ప్రీపెయిడ్ తరహాలో ఇక ముందే రీచార్జి చేసుకోవాలి. ఒకవేళ ఇది పూర్తయితే విద్యుత్ సరఫరా నిలిచిపోయే ప్రమాదమూ ఉంది. ఇది సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మోత మోగుతున్న విద్యుత్ బిల్లులు ‘విద్యుత్ స్మార్ట్ మీటర్లకు తాము వ్యతిరేకం.. వీటిని ఏర్పాటు చేస్తే పగలగొట్టండి’ అంటూ గతంలో టీడీపీ నేతలు సృష్టించిన హడావుడి అంతా ఇంతా కాదు. తాము అధికారంలోకి వస్తే ఈ ప్రక్రియను ఉపసంహరిస్తామంటూ ఎన్నికల సమయంలో హామీలనూ గుప్పించారు. తీరా కొలువుదీరాక, వీటిని బిగించే ప్రక్రియను ముమ్మరం చేయడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సంస్థలకు వీటిని ఏర్పాటు చేశారు. ఆపై గృహాల్లోనూ బిగించేందుకు ఉపక్రమించడంపై ప్రజలు మండిపడుతున్నారు. -
అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ నియామకం
నెల్లూరు (లీగల్): నెల్లూరు బార్ అసోసియేషన్ సభ్యుడు, న్యాయవాది అన్వర్బాషాను నెల్లూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్గా నియమిస్తూ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జారీ చేసింది. ప్రభుత్వం తరఫున సివిల్ కేసులను వాదించనున్నారు. పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. కిలో పొగాకు గరిష్ట ధర రూ.280 కలిగిరి: కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.280 బుధవారం లభించింది. జనరల్ క్లస్టర్కు చెందిన రైతులు 379 బేళ్లను తీసుకురాగా, 200 బేళ్లను కొనుగోలు చేయగా, వివిధ కారణాలతో 179ను తిరస్కరించారు. కిలో పొగాకుకు గరిష్ట ధర రూ.280.. కనిష్ట ధర రూ.140.. సరాసరిగా రూ.197.69 లభించిందని వేలం నిర్వహణాధికారి శివకుమార్ వివరించారు. 19 కంపెనీలు పాల్గొన్నాయన్నారు. డీసీపల్లిలో 125 బేళ్ల విక్రయం మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రంలో 125 బేళ్లను బుధవారం విక్రయించామని నిర్వహణాధికారి రాజశేఖర్ తెలిపారు. వేలానికి 263 బేళ్లు రాగా, వీటిలో 125ను విక్రయించగా, మిగిలిన వాటిని వివిధ కారణాలతో తిరస్కరించామని చెప్పారు. 14287.1 కిలోల పొగాకును విక్రయించగా, రూ.31,67,732.60 వ్యాపారం జరిగిందన్నారు. గరిష్ట ధర కిలో రూ.280.. కనిష్ట ధర రూ.140.. సగటు ధర రూ.221.72గా నమోదైందని వివరించారు. వేలానికి పది కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారని పేర్కొన్నారు. మైనింగ్ అనుమతులపై ఆందోళన వరికుంటపాడు: వరికుంటపాడు పంచాయతీలోని జంగంరెడ్డిపల్లి భాస్కరాపురం కొండ తిప్పను మైనింగ్ కోసం ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టడాన్ని రైతు కూలీ, అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య నేతలు ఖండించారు. వరికుంటపాడు, జంగంరెడ్డిపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణను బుధవారం నిర్వహించారు. తిప్పను మైనింగ్కు ఇస్తే నివాస ప్రాంతం ప్రమాదంలో పడుతుందని.. మేకలు, పశువులు తిరగలేకపోతాయని.. పేలుళ్లకు ఇళ్లు దెబ్బతినడంతో పాటు పంటలు నాశనమవుతాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏఐఎఫ్టీయూ నేత లక్ష్మీరెడ్డి మాట్లాడారు. అభివృద్ధి పేరుతో గ్రామాలను నాశనం చేయడాన్ని మానుకోవాలని, మైనింగ్ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు కూలీ సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమణయ్య తదితరులు పాల్గొన్నారు. ● రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనా సంస్థ చైర్మన్ ప్రసాద్ను వరికుంటపాడు పంచాయతీ మేధావుల ఫోరం ప్రతినిధులు విజయవాడలో కలిసి అర్జీని అందజేశారు. అనుమతులను తక్షణమే నిలిపేయాలని కోరారు. రైతులకు విరివిగా రుణాల మంజూరు ఉదయగిరి: ఉదయగిరిలోని వివిధ బ్యాంకులు రైతులకు విరివిగా రుణాలను మంజూరు చేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ మణిశేఖర్ పేర్కొన్నారు. స్థానిక సీ్త్ర శక్తి భవనంలో బ్యాంకర్లతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకర్లు వారికి కేటాయించిన లక్ష్యాలను నిర్దేశించిన గడువులోపు నూరు శాతం సాధించాలని సూచించారు. డెయిరీ ఫామ్ను ప్రోత్సహించేందుకు ఎక్కువ సంఖ్యలో రుణాలివ్వాలన్నారు. రికవరీ శాతాన్ని పెంచాలని పేర్కొన్నారు. జన సురక్ష పథకంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. బ్యాంకర్లు ఇతర శాఖల అధికారులు తన దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరిస్తానన్నారు. ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని కోరారు. మెరుగైన సేవలందించాలని సూచించారు. ఖాతాదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక పరిపుష్టి సాధించేలా అధికారులు చూడాలని కోరారు. సమావేశంలో అధికారులు కాశయ్య, రవిశంకర్ జయదేవ్, ఎంపీడీఓలు అప్పాజీ, గోపి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
చీకటి జీఓలు రద్దు చేయాలంటూ..
నెల్లూరు(టౌన్): ప్రభుత్వ విద్యాసంస్థల్లోకి విద్యార్థి సంఘాల నాయకులు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన చీకటి జీఓలను రద్దు చేయాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు సునీల్ డిమాండ్ చేశారు. బుధవారం వీఆర్సీ సెంటర్లో జీఓలను రద్దు చేయాలంటూ పత్రాలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై ఏడాదిగా విద్యార్థి సంఘాల నాయకులు ఉద్యమాలు చేస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. జీఓను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు షారూఖ్, ఆశిర్, ఖాదర్ మస్తాన్, నవీన్, చరణ్, వంశీ పాల్గొన్నారు. -
ఏంటిది అధ్యక్షా..
బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు మాధవ్ బుధవారం నెల్లూరుకు విచ్చేశారు. ఆ పార్టీ సమావేశం కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగింది. ఈ సందర్భంగా వీఆర్సీ నుంచి కస్తూర్బా వరకు ర్యాలీ నిర్వహించారు. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. నేతలు, కార్యకర్తల అత్యుత్సాహం వల్ల ఓ ప్రైవేట్ అంబులెన్స్ చిక్కుకుపోయింది. అలాగే వీఆర్సీ వద్ద నడిరోడ్డుపై బాణసంచా కాల్చడంతో అటుగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు ట్రాఫిక్లో చిక్కుకున్న అంబులెన్స్ -
ప్లాస్టిక్ భూతం అంతమెప్పటికో..?
నెల్లూరు(బారకాసు): నగరంలో ప్లాస్టిక్ వినియోగం నానాటికీ తీవ్రమవుతోంది. దీన్ని ఉపయోగిస్తే ప్రమాదం సంభవిస్తుందనే అంశంపై విస్తృతంగా ప్రచారం చేసిన నగరపాలక సంస్థ తదనంతరం మిన్నకుండిపోయింది. మొదట్లో ప్లాస్టిక్ విక్రేతలు తదితరులపై దాడులు జరిపి జరిమానాలు విధించిన సందర్భాలూ ఉన్నాయి. దీంతో కొన్నాళ్ల పాటు తగ్గిన ఈ ప్రక్రియ తిరిగి యథాస్థితికి చేరుకుంది. నగరంలో ఇలా.. నగరంలోని స్టోన్హౌస్పేట, రేబాలవారివీధి, చిన్నబజార్, పెద్దబజార్, పణతులవారివీధి తదితర ప్రాంతాల్లో హోల్సేల్ ప్లాస్టిక్ దుకాణాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడి నుంచి భారీగా వ్యాపారం జరుగుతోంది. తోపుడు బండ్లు, చిరు వ్యాపారులు, పూల దుకాణాలు, కూరగాయల మార్కెట్ తదితరులు నిషేధిత ప్లాస్టిక్ను విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. వస్త్ర సంచులను వినియోగించాలని ఎంతో మంది ప్రచారం చేస్తున్నా, ఎలాంటి ప్రయోజనం కానరావడంలేదు. సంబంధిత అధికారులు ఇప్పటికై నా దీనిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తగ్గుముఖం పట్టిన తనిఖీలు పుంజుకుంటున్న వినియోగం పర్యావరణ పరిరక్షణ ప్రశ్నార్థకం..? చర్యలు చేపడతాం ప్లాస్టిక్ నియంత్రణకు త్వరలోనే చర్యలు చేపడతాం. నిషేధిత ప్లాస్టిక్ను ఎవరూ వినియోగించరాదు. డ్రైవ్లను తర చూ చేపట్టి ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తాం. వీటికి దూరంగా ఉండాలి. – కనకాద్రి, ఎంహెచ్ఓ, నగరపాలక సంస్థ -
సర్వేపల్లి కాలువలో మృతదేహం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు ఆత్మకూరు బస్టాండ్ (పీఎస్ఆర్ బస్టాండ్) సమీప సర్వేపల్లి కాలువలో బుధవారం గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి నవాబుపేట పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని కాలువలో నుంచి బయటకు తీశారు. మృతుడి వయసు సుమారు 30 నుంచి 35 ఏళ్లలోపు ఉండొచ్చని భావిస్తున్నారు. ఎరుపు రంగు హాఫ్హ్యాండ్స్ టీషర్ట్, బ్లాక్ లోయర్ ధరించి ఉన్నాడు. మృతదేహం ఉబ్చి దుర్ఘంధం వెదజల్లుతోంది. దీంతో చనిపోయి రెండు రోజులై ఉండొచ్చని తెలుస్తోంది. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడు ప్రమాదవశాత్తు నీటిలో పడ్డాడా?, ఆత్మహత్య చేసుకున్నాడా?, ఇతర కారణం ఉందా? అనేది పోస్టుమార్టంలో తెలియాల్సి ఉంది. మృతుడి వివరాలు తెలిసిన వారు 94407 96306 ఫోన్ నంబర్కు తెలియజేయాలని నవాబుపేట ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
మద్దతు ధరకు ధాన్యం కొనాలి
● జేసీ కార్తీక్ను కోరిన రైతు సంఘాల నాయకులు నెల్లూరు(అర్బన్): జిల్లాలో ఎడగారు వరి పంటకు సంబంధించి ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతు సంఘాల నాయకులు జేసీ కార్తీక్ను కోరారు. బుధవారం జేసీ అన్ని పార్టీల రైతు సంఘాల నాయకులు, మిల్లర్ల అసోసియేషన్ నాయకులు, అధికారులతో నెల్లూరు కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. ఈ సీజన్లో ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదని, రైతు నష్టపోకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు చేపట్టాలో తెలపాలని ఆయన కోరారు. దీంతో రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చిరసాని కోటిరెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం కూడా ప్రభుత్వం తూతూమంత్రంగా చర్యలు చేపట్టిందన్నారు. కేవలం లక్ష టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేసి చేతులు దులుపుకొందన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రస్తుతం జిల్లాలో పండిస్తున్న కేఎన్ఎం 733, ఎంటీయూ 1010 లాంటి రకాలన్ని కూడా ఏ–గ్రేడ్కు చెందినవేనన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పుట్టి రూ.19,770కు మిల్లర్లు కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. వర్షాలు కురుస్తున్నాయని, ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు కూడా సమయం లేదని వివరించారు. ఈ సాకుతో మిల్లర్లు మద్దతు ధర తగ్గించకుండా ఉండేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని కోరారు. సాగు ఖర్చు ఈ ఏడాది 20 శాతం అదనంగా పెరిగిందన్నారు. ప్రభుత్వం మాత్రం 3 శాతమే మద్దతు ధర పెంచిందన్నారు. ఈ స్థితిలో రైతులు నష్టపోతున్నారన్నారు. ఇంకా నష్టపోకుండా ఉండాలంటే ప్రస్తుత మద్దతు ధరకు మిల్లర్లు కొనుగోలు చేయాల్సిందేనని తెలిపారు. ఇదే విషయాన్ని ఏకగ్రీవంగా ఇతర నాయకులు కూడా తెలిపారు. దీంతో జేసీ స్పందిస్తూ మిల్లర్లకు తగిన ఆదేశాలు జారీ చేస్తామన్నారు. కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు చండ్ర రాజగోపాల్, మూలె వెంగయ్య, శ్రీనివాసులు, రమణయ్య, వ్యవసాయ శాఖ జేడీ సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.పాల్గొన్న నాయకులు, అధికారులు -
హాస్పిటళ్లలో ఆకస్మిక తనిఖీలు
నెల్లూరు(అర్బన్): డీఎంహెచ్ఓ సుజాత ఆదేశాల మేరకు జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారిణి (డీఐఓ) ఉమామహేశ్వరి బుధవారం హాస్పిటళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నెల్లూరులోని విజయానంద్ ఆర్థోపెడిక్ ఆస్పత్రి, సుమ స్కిన్ అండ్ లేజర్ క్లినిక్, లక్ష్మి ఆర్థోకేర్ సెంటర్, ఆకర్ష్ హాస్పిటల్ తదితరాలకు వెళ్లారు. ఏపీ అల్లోపతి క్లినికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2002 నిబంధనల ప్రకారం ఆస్పత్రి నిర్వహణ జరుగుతుందో? లేదా? పరిశీలించారు. రికార్డులు చూశారు. ఉమామహేశ్వరి మాట్లాడుతూ ఆస్పత్రుల్లో ధరల పట్టికను ప్రదర్శించాలన్నారు. స్కానింగ్ వివరాల నివేదికను ప్రతి నెలా వైద్యశాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. రిజిస్ట్రేషన్లు లేకుండా ఎవరైనా వైద్యం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
తల్లి, కుమారుడి అదృశ్యం
నెల్లూరు(క్రైమ్): తల్లి, కుమారుడు అదృశ్యం ఘటనపై నెల్లూరు వేదాయపాళెం పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. భక్తవత్సలనగర్లో ప్రకాష్ కుటుంబం నివాసం ఉంటోంది. అతడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఈనెల నాలుగో తేదీన భార్య, చిన్నకుమారుడు ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. బాధిత కుటుంబ సభ్యులు వారి కోసం గాలించారు. జాడ తెలియరాకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.స్వగ్రామానికి వెళ్తుండగా.. ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ఆత్మకూరు: మండలంలోని వాశిలి గ్రామం వద్ద నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఆత్మకూరు ఎస్సై ఎస్కే జిలానీ, స్థానికుల కథనం మేరకు.. వాశిలి గ్రామానికి చెందిన షేక్ అన్వర్ (59) అనే వ్యక్తి నవరంగ మేళం బృందంలో సభ్యుడిగా ఉన్నాడు. బుధవారం ఉద యం ఆత్మకూరుకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి టీవీఎస్ మోపెడ్పై వస్తున్నాడు. గ్రామంలోకి వెళ్లేందుకు రోడ్డు క్రాస్ చేస్తుండగా నెల్లూరు నుంచి బద్వేల్ వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో వాహనాలు రోడ్డు పక్కన గుంతలో పడిపోయాయి. అన్వర్ అక్కడికక్కడే మృతిచెందా డు. సమాచారం అందుకున్న ఎస్సై జిలానీ ఘట నా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇంటి పెద్ద అన్వర్ మృతి చెందడంతో ఆ కుటుంబీకులు తీవ్రంగా రోదిస్తున్నారు. ప్రభుత్వంఆదుకోవాలని కోరారు. చోరీ సొత్తు రికవరీఉదయగిరి: ఉదయగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చోరీకి పాల్పడిన బాల నేరస్తుడిని అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై కె.ఇంద్రసేనారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. జూన్ 10వ తేదీ రాత్రి ఏఎంసీ కార్యాలయ కిటికీలు ధ్వంసం చేసి లోనికి ప్రవేశించి కంప్యూటర్లు, ఇతర సామగ్రి చోరీ చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పట్టణంలోని షబ్బీర్ కాలనీకి చెందిన ఓ బాలుడు చోరీ చేసినట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడిని జువనైల్ కోర్టులో హాజరుపరిచామని ఎస్సై తెలిపారు.492 బస్సుల కేటాయింపునెల్లూరు సిటీ: మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి జిల్లాలో 492 బస్సులను కేటాయించినట్లు ఆర్టీసీ ప్రజా రవాణా శాఖ అధికారి షేక్ షమీమ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మకూరు డిపో పరిధిలో పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు కలిపి 61, కందుకూరులో 60, కావలిలో 90, నెల్లూరు డిపో–1లో 91, డిపో–2లో 90, రాపూరులో 49, ఉదయగిరిలో 51 బస్సులను సిద్ధం చేశామన్నారు. శుక్రవారం నెల్లూరులోని ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లో మంత్రి నారాయణ ఈ పథకాన్ని ప్రారంభిస్తారన్నారు. త్వరలో విజయవాడలో యానాది గర్జననెల్లూరు(స్టోన్హౌస్పేట): ఎస్టీ వర్గీకరణ కోసం త్వరలో విజయవాడలో యానాది గర్జన నిర్వహిస్తామని యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్రాధ్యక్షుడు కేసీ పెంచలయ్య తెలిపారు. నెల్లూరులోని వెన్నెలకంటి రాఘవయ్య భవన్లో బుధవారం రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన నాయకులతో సమావేశం నిర్వహించి తీర్మానాలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఎస్టీ వర్గీకరణపై, యానాదుల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకూ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో నేతలు బాపట్ల బ్రహ్మయ్య, తలపల చెంచు మల్లికార్జునరావు, బాకుల మురళి, తిరువెళ్ల శీను, నీలం సురేంద్ర, మానికల మురళి తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కల్తీపై తనిఖీలు
నెల్లూరు(అర్బన్): వ్యవసాయ పంటలకే పరిమితం కాకుండా వివిధ రంగాల ఉత్పత్తుల్లో కల్తీ చేస్తున్న యూరియాను కనుగొనేందుకు పెద్ద ఎత్తున తనిఖీలను నిర్వహించాలని జేసీ కార్తీక్ ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో యూరియాను ప్లయ్ ఉడ్, పెయింట్ పరిశ్రమలు, పశువుల దాణా తదితరాల్లో అక్రమంగా వినియోగిస్తున్నారనే వార్తలొస్తున్న తరుణంలో, తనిఖీలు చేయాలని సూచించారు. యూరియా పక్కదారి పట్టడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ క్రమంలో వ్యవసాయ, విజిలెన్స్, ఇండస్ట్రీస్, రవాణా, పొల్యూషన్ బోర్డు, ఎకై ్సజ్ శాఖల నుంచి ప్రతినిధులను తీసుకొని ఒక టీమ్ను ఏర్పాటు చేయనున్నామన్నారు. యూరియాను వ్యవసాయం కాకుండా ఇతర ఉత్పత్తుల్లో వినియోగించారని తేలితే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. -
మహాసభల జయప్రదానికి పిలుపు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): నెల్లూరు నగరంలో ఈనెల 17 నుంచి 19వ తేదీ వరకు జరిగే సీపీఐ జిల్లా మహాసభలు, 20 నుంచి 25వ తేదీ వరకు ఒంగోలులో నిర్వహించే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య పిలుపునిచ్చారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. కోటమిట్ట షాదీమంజిల్లో జిల్లా సభలు జరుగుతాయన్నారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు సిరాజ్, మధు, షాన్వాజ్, మహిళా సంఘం నాయకురాలు శిరీషా, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. డివైడర్ను ఢీకొట్టి కారు బోల్తానెల్లూరు సిటీ: రూరల్ పరిధిలోని ధనలక్ష్మీపురం వద్ద డివైడర్ను ఢీకొట్టి కారు బోల్తాపడి ఘటన బుధవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కారు ముత్తుకూరు వైపు వేగంగా వెళ్తోంది. డ్రైవర్ దానిని అదుపు చేయలేకపోవడంతో డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. వాహనంలోని నలుగురు వ్యక్తులకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు వారిని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. కారు బోల్తా పడిన సమయంలో ఎదురు నుంచి వాహనాలు రాకపోవడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై రూరల్ పోలీసులకు ఫిర్యాదు అందలేదు. చుండి మోడల్ స్కూల్ ఎంపికవలేటివారిపాలెం: ఉత్తమ పాఠశాలగా మండలంలోని చుండి మోడల్ స్కూల్ ఎంపికై నట్లు ప్రిన్సిపల్ పడమటి వెంకటేశ్వరరావు బుధవారం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పది పాఠశాలలను ఎంపిక చేయగా అందులో చుండి స్కూల్ ఉందన్నారు. యాజమాన్యాల వారీగా పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత, అత్యధిక సరాసరి మార్కులు సాధించిన స్కూళ్లను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఈనెల 15వ తేదీన విజయవాడలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం అవార్డు ప్రదానం చేస్తారన్నారు.కండలేరులో 26.8 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో బుధవారం నాటికి 26.8 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 5,900 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,800, పిన్నేరు కాలువకు 20, లోలెవల్ కాలువకు 40, మొదటి బ్రాంచ్ కాలువకు 80 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
ప్రయాణికుడి ముసుగులో నేరాలు
నెల్లూరు(క్రైమ్): ప్రయాణికుడి ముసుగులో రైళ్లలో నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నేరగాడిని నెల్లూరు రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం నెల్లూరు రైల్వే డీఎస్పీ జి.మురళీధర్ స్థానిక కార్యాలయంలో వివరాలను వెల్లడించారు. నెల్లూరు రైల్వే సీఐ ఎ.సుధాకర్ తన సిబ్బంది, ఆర్ఫీఎఫ్ ఇన్స్పెక్టర్లు పి.రమేష్గౌడ్, హజరిలాల్ గుర్జార్తో కలిసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రైళ్లు, రైల్వేస్టేషన్లలో నేరాల నియంత్రణ, మత్తు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడిలో భాగంగా నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఆ బృందాలు నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్లో తనిఖీలు చేపట్టాయి. జనశతాబ్ది రైలు దిగి అనుమానాస్పదంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన కె.గోవర్ధన్ అలియాస్ కార్తీక్ అర్వింద్రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. కావలి, నెల్లూరు, గూడూరు ప్రాంతాల్లో రైళ్లలో చోరీలకు పాల్పడినట్లు వెల్లడించాడు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి రూ.12 లక్షల విలువైన 143 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు ల్యాప్టాప్లను స్వాధీ నం చేసుకున్నారు. చిన్నతనం నుంచే.. నిందితుడు చిన్నతనం నుంచే వ్యసనాలకు బానిసై సులభ మార్గంలో నగదు సంపాదించేందుకు రైళ్లలో ప్రయాణికరుని ముసుగులో చోరీలకు పాల్పడసాగాడు. జనరల్ టికెట్ తీసుకుని దివ్యాంగులు, జనరల్ బోగిల్లో ఎక్కేవాడు. అదును చూసి ఏసీ బోగిల్లోకి వెళ్లి నిద్రిస్తున్న ప్రయాణికుల నగల బ్యాగ్లు, ల్యాప్టాప్లను చోరీ చేసేవాడు. అతనిపై హైదరాబాద్తోపాటు నంద్యాల, కర్నూలు, విజయవాడ, తిరుపతిల్లో కేసులున్నాయి. నిదితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన సీఐ, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్లు, నెల్లూరు, గూడూరు రైల్వే ఎస్సైలు హరిచందన, చెన్నకేశవ, సిబ్బంది దయాకర్, మణికంఠ, కిరణ్ తదితరులను డీఎస్పీ అభినందించారు. అంతర్రాష్ట్ర నేరగాడి అరెస్ట్ రూ.12 లక్షల సొత్తు స్వాధీనం -
సెమీ కండక్టర్ పరిశ్రమలో పెట్టుబడులు
నెల్లూరు రూరల్: భారత్లో సెమీ కండక్టర్ పరిశ్రమలో పెట్టుబడులను జపాన్ తదితర దేశాలు పెడుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. తిరుపతిలోని టెక్నాలజీ పార్కులో రూ.400 కోట్లతో పరిశ్రమను స్థాపించనున్నారని తెలిపారు. కార్యకర్తలను కలిసి చాయ్ పే కార్యక్రమంలో అందర్నీ సమన్వయం చేయాలనే ఉద్దేశంతో యాత్రను చేపడుతున్నామని పేర్కొన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్రెడ్డి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్రెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి, వాకాటి నారాయణరెడ్డి, రవిచంద్రరెడ్డి, కందికట్ల రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్కు రాఖీ కట్టిన కాకాణి పూజిత
నెల్లూరు (స్టోన్హౌస్పేట): వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత, డాక్టర్ అశ్వంత్రెడ్డి దంపతులు మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగన్మోహన్రెడ్డిని కాకాణి పూజిత శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి రాఖీ కట్టారు. జిల్లా అధికారులు, ఎంపీడీఓలకు రేపు శిక్షణ నెల్లూరు (పొగతోట): పంచాయతీరాజ్ అడ్వాన్స్మెంట్ ఇన్డెక్స్పై ఈ నెల 14వ తేదీన లైన్ డిపార్ట్మెంట్స్ జిల్లా అధికారులు, డివిజనల్ అభివృద్ధి అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు, ఉప మండల పరిషత్ అధికారులు, కంప్యూటర్ ఆపరేట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ మోహన్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 14న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. శిక్షణ కార్యక్రమానికి అందరు తప్పకుండా హాజరుకావాలని తెలిపారు. సీఐడీ కేసులో కాకాణికి బెయిల్ మంజూరు నెల్లూరు (లీగల్): ప్రభుత్వ భూముల రికార్డులను తారుమారు చేశారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై పొదలకూరు పోలీసులు నమోదు చేసిన తర్వాత సీఐడీ అధికారులు దర్యాప్తు చేస్తున్న అక్రమ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ నెల్లూరు 2వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎల్.శారదారెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కొక్కరు రూ.25 వేలు ఆస్తి విలువ కలిగిన ఇద్దరు జామీన్దారులు పూచీకత్తు, రూ.25 వేలు వ్యక్తిగత బాండు కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. సీఐడీ పోలీసుల విచారణకు కాకాణి సహకరించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, పి. ఉమామహేశ్వర్ రెడ్డి, ఎంవీ విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు లేకపోయినా, రాజకీయ కక్షతో గోవర్ధన్రెడ్డిని 14వ నిందితుడిగా కేసు బనాయించారని వాదనలు వినిపించారు. అనంతరం పోలీసుల తరఫున ప్రత్యేక పీపీ మాల్యాద్రి వాదనలు వినిపిస్తూ కేసు దర్యాప్తు దశలో ఉందని కాకాణికి బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి శారదరెడ్డి గోవర్ధన్రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. బీజేపీ జేబు సంస్థగా ఈసీ నెల్లూరు (వీఆర్సీసెంటర్): కేంద్ర ఎన్నికల కమిషన్ను బీజేపీ తన జేబు సంస్థగా మార్చేసుకుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారపురెడ్డి కిరణ్కుమార్రెడ్డి ఆరోపించారు. నగరంలోని ఇందిరాభవన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం కల్పించిన ఓటు చోరీకి గురవుతోందని రాహుల్గాంధీ ఆధారాలతో నిరూపించి శాంతియుతంగా నిరసన చేస్తుండగా, పలువురు ఎంపీలను అరెస్ట్ చేయడం ప్రజాసామ్యంలో చీకటి రోజు అన్నారు. దేశ ఎన్నికల కమిషన్ను ఏర్పాటు చేసే క్రమంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా బీజేపీ రాజ్యాంగ సంస్థలను నిర్వీ ర్యం చేస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ సంజయ్కుమార్, ఉపాధ్యక్షుడు తలారి బాసుధాకర్, తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీలో ఉద్యోగోన్నతులు, కారుణ్య నియామకాలు
నెల్లూరు (పొగతోట): జిల్లా పరిషత్ పరిధిలో పనిచేస్తున్న 17 మంది ఉద్యోగులకు ఉద్యోగోన్నతులు కల్పించారు. జెడ్పీలో పని చేస్తూ మరణించిన ఇద్దరు ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియమకాల కింద ఉద్యోగావకాశాలు కల్పించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, జెడ్పీ సీఈఓ మోహన్రావు మంగళవారం అందజేశారు. జెడ్పీ చైర్పర్సన్ అరుణమ్మ మాట్లాడుతూ తాను బాధ్యతలు స్వీకరించిన 2021 నుంచి ఇప్పటి వరకు 137 మంది ఉద్యోగులకు ఉద్యోగోన్నతలు, 83 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఈ నెలఖారులోపు 25 మంది రికార్డు అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రీయల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్కాకుల పెంచలయ్య, వి దేవప్రస్నకుమార్ చైర్పర్సన్ అరుణమ్మ, సీఈఓ మోహన్రావులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ అధికారులు రవికుమార్, సుబ్రహ్మణ్యం, వాసుదేవరావు, ఉద్యోగులు ముజీర్, అనిల్కుమార్, భీమ్రెడ్డి పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం
వరికుంటపాడు: ఖాళీ భూములు కనిపిస్తే అంగబలం, ఆర్థిక బలం ఉన్నోళ్లు విలువైన ప్రభుత్వ భూములు కాజేస్తున్నారు. తాజాగా మండలంలోని తూర్పుబోయమడుగుల అలివేలు మంగాపురం రెవెన్యూ పరిధిలో బీసీ కాలనీకి ఆనుకొని తారురోడ్డు పక్కనే ఉన్న సర్వే నంబరు 140, 141లోని విలువైన ప్రభుత్వ భూమి ఉంది. ఇక్కడ ఎకరం భూమి రూ.5 లక్షలపైమాటే. స్థానికేతరుడైన పావూలూరి మాల్యాద్రి అనే వ్యక్తి ఇటీవల ఈ భూమికి పక్కనే కొంత భూమిని కొనుగోలు చేశాడు. తాజాగా దాని పక్కనే ఉన్న సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు మంగళవారం జేసీబీలతో ముళ్లచెట్లు తొలగిస్తూ, భూమిని చదును చేశారు. మండల రెవెన్యూ అధికారులు, స్థానిక అధికార పార్టీ నేతల సహ కారం లేకుండా అతను ఇంత సాహసం చేయగలడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికులకు ఈ విషయం తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ‘మేము ఇక్కడ పుట్టి పెరిగినా మా గ్రామంలో మాకు ఒక్క గజం భూమి కూడా లేదు. అలాంటిది ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తి తనకు ఉన్న భూమితో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కూడా ఎలాంటి పత్రాలు లేకుండా ఆక్రమించడం అన్యాయం అని మండిపడ్డారు. భూ ఆక్రమణపై గ్రామస్తులు రెవెన్యూ సిబ్బందికి తీసుకెళ్లినా కనీసం స్పందించి అటువైపు కూడా రాలేదు. రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి కబ్జాను ఆపి ప్రభుత్వ భూమిని రక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అడ్డుకున్న గ్రామస్తులు, కనిపించని రెవెన్యూ అధికారులు -
రూ.4 కోట్ల చావిడి స్థలానికి ఎసరు
సాక్షి టాస్క్ఫోర్స్: పొదలకూరు పట్టణ నడిబొ డ్డున పోలీస్ స్టేషన్, బిట్–2 సచివాలయం బిల్డింగ్ మధ్యలో ఉన్న రూ.4 కోట్ల విలువైన 34 అంకణాల ప్రభుత్వ స్థలాన్ని ప్రస్తుతం తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న ఓ తహసీల్దార్ సహకారంతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కొట్టేసేందుకు ఆ వ్యక్తి విఫలయత్నమయ్యాడు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చివరి నిమిషంలో రికార్డుల పరిశీలనలో ఈ విషయం తెలియడంతో రిజిస్ట్రేషన్ ఆగిపోయింది. సదరు తహసీల్దార్ తనకు స్వయాన బావమరిది అయిన వ్యక్తితో కలిసి ప్రభుత్వ భూమిని కాజేసే కుట్రకు బరి తెగించాడు. ప్రభుత్వ స్థలాన్ని తన బావమరిదికి కట్టబెట్టేందుకు ఆ స్థలాన్ని పిత్రార్జితంగా మార్చేందుకు డెత్ సర్టిఫికెట్లతో నకిలీ పత్రాలను సృష్టించారు. అయితే డాక్యుమెంట్లు నియమాలకు విరుద్ధంగా ఉన్నాయని గుర్తించి సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించారు. అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయించి విలువైన స్థలాన్ని దక్కించుకునేందుకు ఆ వ్యక్తి ప్రయత్నిస్తున్న వైనం తాజాగా బయటపడింది. దశాబ్దాలుగా చావిడి స్థలంగా రెవెన్యూ రికార్డుల్లో పోలీస్స్టేషన్ పక్కనున్న సర్వే నంబరు 191– 1ఏ లోని 34 అంకణాల స్థలం దశాబ్దాలుగా రెవె న్యూ రికార్డుల్లో గ్రామ చావిడి భూమిగా ఉంది. ప్రస్తు తం ఈ స్థలం విలువ బహిరంగ మార్కె ట్లో రూ.4 కోట్ల వరకు పలుకుతోంది. దాదాపు పదేళ్ల క్రితం వరకు ఇక్కడ చావిడి ఉండేది. ఈ స్థలంలో వీఆర్వోలు తమ విశ్రాంతి గదులను నిర్మించుకునేందుకు ప్రయత్నించడంతో అప్పట్లో పెద్ద గొడవ కూడా జరిగింది. ఈ స్థలం రెవెన్యూదా? లేక పంచాయతీరాజ్దా? తేల్చుకునేందుకు రెండు శాఖల అధికారులు పెద్ద కసరత్తు కూడా చేశారు. స్థల వివాదంపై అప్పట్లో వీఆర్వోల సంఘం అధ్యక్షుడు రవిశేఖర్, అప్పటి సర్పంచ్ నిర్మలమ్మ, ఎంపీపీ కోనం చినబ్రహ్మయ్య మధ్య వివాదం నెలకొని పోలీసు కేసులు కూడా అయ్యాయి. ఈ అంశంపై కోర్టును ఆశ్రయించడంతో అక్కడ రెవెన్యూ భవనం నిర్మించుకునేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో భవనం నిర్మించుకునేందుకు కలెక్టర్ నుంచి అనుమతులు కూడా పొందారు. పిత్రార్జితమంటూ రంగంలోకి.. అయితే పట్టణానికి చెందిన విజయకుమార్ అనే వ్యక్తి ఆ స్థలం తమ పిత్రార్జితమని 2023 సెప్టెంబరులో రంగంలోకి దిగాడు. డెత్ సర్టిఫికెట్లు తయారు చేసుకుని ఆ స్థలాన్ని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని సబ్రిజిస్ట్రార్ వద్దకు వెళ్లి తన వద్ద ఉన్న నకిలీ డాక్యుమెంట్లను సమర్పించాడు. సబ్రిజిస్ట్రార్ డాక్యుమెంట్లు నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని అనుమా నం వచ్చి నిలిపివేశారు. అయితే విజయకుమార్ ఎలాగైనా విలువైన స్థలాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. దీనిపై రెవెన్యూ అధికారులు చొరవ తీసుకుని వెంటనే జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి విలువైన స్థలాన్ని కాపాడాల్సిందిగా పట్టణ ప్రజలు కోరుతున్నారు. నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్కు విఫలయత్నం ఆ స్థలం గ్రామ చావిడిగా దశాబ్దాలుగా రెవెన్యూ రికార్డుల్లో.. న్యాయపరమైన చిక్కులు లేకుండా తిరుపతి జిల్లా తహసీల్దార్ సలహాలు సదరు అధికారి అండదండలతో స్థలం కబ్జాకు కుయుక్తులు -
రోడ్డెక్కితే.. చలాన్ వాతే
రోడ్డెక్కిన వాహనదారులను దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం మాస్టర్ స్కెచ్ వేసింది. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డుల పేరుతో రూ.కోట్లను ఖజానాలో వేసుకుంది. కార్డులు జారీ చేయకుండా చలాన్ పేరుతో రూ.కోట్ల దోపిడీ చేస్తోంది. డిజిటల్ టెక్నాలజీకి తానే ఆధ్యుడనని చెప్పుకునే సీఎం చంద్రబాబు, తిరిగి ఫిజికల్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వాహనదారులకు కార్డుల భారం లేకుండా డిజిటల్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఫిజికల్ గా కార్డు లేకపోయినా .. యాప్ ఓపెన్ చేసి చూపించినా సరిపోయేది. కూటమి ప్రభుత్వం వచ్చి దోపిడీకి తెర తీసింది. ఒక వైపు విచ్చలవిడిగా మద్యం విక్రయాలు సాగించి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, మరో వైపు చలానాలు రాస్తూ వాహనచోదకుల జేబులకు చిల్లు పెడుతోంది.నెల్లూరు(టౌన్): డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డుల విషయంలో వాహనదారుల పరిస్థితి సంకటంగా మా రింది. కార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లించినా జారీ చేయని పరిస్థితి. రవాణాశాఖలో సేవలు సులభతరం చేశామని, కార్యాలయానికి రా కుండానే అన్ని సేవలు మీ ముంగిట పొందవచ్చని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్, ఆర్సీ కార్డుల కోసం రవాణా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటుంది. వాహనం రోడ్డు ఎక్కితే చాలు లైసెన్స్, ఆర్సీలు చూపించమని అటు రవాణా శాఖాధికారు లు, ఇటు పోలీసు అధికారులు దబాయిస్తున్నారు. కార్డుల కోసం డబ్బులు చెల్లించామని, కార్డులు ఇంకా ఇవ్వలేదని చెప్పినా.. చలానా రాసి చేతిలో పెడుతున్నారు. కొంత మంది వ్యాలెట్ యాప్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న కార్డును చూపితే అది ఒరిజనల్ లేక డూప్లికేటా మాకు తెలియదు కార్డు ఉంటే చూపించు వదిలివేస్తామని చెబుతున్నారు.కార్డుల భారం తగ్గించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వంజిల్లాలో నెల్లూరు ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంతోపాటు ఆత్మకూరు, కావలి, కందుకూరుల్లో రవాణాశాఖ కార్యాలయాలు ఉన్నాయి. ప్రతి రోజు జిల్లా వ్యాప్తంగా సగటున 500కు పైగా వాహన రిజిస్ట్రేషన్లు, పర్మినెంట్ లైసెన్స్లు జారీ చేస్తుంటారు. ఫిజికల్ కార్డుల కోసం ప్రభుత్వాలు అదనంగా ప్రతి కార్డుకు రూ.235 వసూలు చేసేవి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాహనదారులపై కార్డుల భారం తొలిగించింది. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులను సెల్ఫోన్లో వ్యాలెట్ యాప్లో అందుబాటులో ఉంచింది. పోలీసు, రవాణా అధికారులకు అడిగినప్పుడు సేవ్ చేసుకున్న కార్డు చూపిస్తే సరిపోతుంది. పొరపాటున కార్డు మరిచిపోతే వాహనచోదకులపై చలాన్లు రాసే పరిస్థితి ఉండడంతో ఈ విధానానికి స్వస్తి పలికింది. డిజిటల్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.వాహనదారులపై అధికారుల వేధింపులువాహనం రోడ్డు ఎక్కితే చాలు పోలీసు, రవాణా అధికారులు తనిఖీ సమయంలో డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు చూపించమని వేధింపులు ఎక్కువయ్యాయంటూ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్డులకు డబ్బులు చెల్లించినా డౌన్లోడ్ చేసుకున్న కార్డు చూపిస్తే సరిపోతుందనే ప్రభుత్వ మార్గదర్శకాలు ఎక్కడా లేకపోవడంతో ఫిజికల్ కార్డులు చూపించాలని, లేదంటే కేసులు, చలాన్ రాస్తామని చెబుతున్నారు. కొంత మంది అధికారులు వాహనదారులు డౌన్లోడ్ చేసుకున్న కార్డులు చూపిస్తే మిన్నకుంటున్నారు. ఎక్కువ మంది అధికారులు ఫైన్ విధిస్తుండడంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికై నా కార్డు లు ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి ఉంది. కనీసం సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు చూపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నారు. కార్డులను త్వరగా ముద్రించి వాహనదారులకు అందజేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.డీఎల్, ఆర్సీ కార్డుల పేరుతో ఖజానాకు ‘రూ.కోట్ల’లైసెన్స్, ఆర్సీ కార్డుకు రూ.235 చెల్లింపుడిజిటల్ టెక్నాలజీకి తానే ఆధ్యుడనని గప్పాలు కొట్టుకునే చంద్రబాబు గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన డిజిటల్ విధానాన్ని స్వస్తి పలికడమే కాకుండా వాహనదారులను దోచుకుంటున్నారు. గతేడాది నవంబరు నుంచి మళ్లీ కార్డుల జారీ కోసం ప్రత్యేకంగా డబ్బులు చెల్లించుకోవడం ప్రారంభించారు. లైసెన్స్ జారీ, రిజిస్ట్రేషన్ సమయంలో ప్రభుత్వ చలానాతో పాటు కార్డుకు ప్రత్యేకంగా రూ.235 వసూళ్లు చేస్తున్నారు. గతేడాది నవంబరు నుంచి డబ్బులు చెల్లించినా వాహనదారులకు ఇంత వరకు కార్డులు అందలేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్షకు పైగా లైసెన్స్, ఆర్సీ కార్డులు రావాల్సి ఉందని రవాణా అధికారులు చెబుతున్నారు. దాదాపు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్టుల కోసం రూ.2.35 కోట్లకు పైగా డబ్బులు చెల్లించారు. ఇదంతా వాహనదారులను దోపిడీ చేసేందుకు ప్రభుత్వం మాస్టర్ స్కెచ్ వేసినట్లు అర్థమవుతోంది. కార్డుల విషయంలో నేటికి రాష్ట్ర ప్రభుత్వానికి క్లారిటీ లేదు. కార్డుల ముద్రణ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలా లేదా ఏదైనా సంస్థకు అప్పజెప్పాలా అనే సందిగ్ధంతలో ఉంది. కార్డులు ఎప్పుడు ముద్రిస్తారా మాకు ఎప్పుడు వస్తాయో అంటూ వాహనదారులు మండిపడుతున్నారు.కార్డులు ఇంకా రాలేదుడ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు ఇంకా రాలేదు. కార్డులను ముద్రించాల్సి ఉంది. త్వరలోనే వాటిని ముద్రించి ఆయా జిల్లాలకు పంపుతారు. కార్డులు వచ్చిన వెంటనే వాహనదారులు ఇచ్చిన అడ్రస్కు వారి ఇళ్లకే పంపుతాం. కార్డుల కోసం రవాణా కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు. – చందర్, డీటీసీ, నెల్లూరు -
రెవెన్యూ శాఖ వినతులే అధికం
నెల్లూరు రూరల్: ప్రతి వారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రెవెన్యూ శాఖకు సంబంధించిన వినతులే అధికంగా వస్తున్నాయి. ఈ సోమవారం జేసీ కె.కార్తీక్ తదితరులు ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. మొత్తం 411 వినతులందాయి. రెవెన్యూ శాఖవి 141, పోలీస్ శాఖవి 62, మున్సిపల్ శాఖవి 40, సర్వేవి 30, పంచాయతీరాజ్ శాఖవి 38 తదితరాలున్నాయి. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు వినతులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో హుస్సేన్ సాహెబ్, డ్వామా పీడీ గంగాభవాని, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, హౌసింగ్ పీడీ వేణుగోపాల్, డీఎంహెచ్ఓ సుజాత, హార్టికల్చ ర్ ఏడీ సుబ్బారెడ్డి, విద్యుత్ ఎస్ఈ విజయన్ తదితరులు పాల్గొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, పాస్టర్లపై దాడులు, అక్రమ కేసులను అరికట్టాలంటూ కలెక్టర్ కార్యాలయం వద్ద నెల్లూరు క్రైస్తవ సమాఖ్య వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బిషప్ డాక్టర్ ఎండీ ప్రకాశం మాట్లాడుతూ అనేక పోరాటాల తర్వాత సిక్కులకు, బౌద్ధులకు ఎస్సీ హోదా కల్పించి దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు ఇంత కాలమైనా నిరాకరించడం ప్రాథమిక హక్కులకు విరుద్ధమన్నారు. దళిత క్రైస్తవ మహాసభ అధ్యక్షుడు డాక్టర్ ఎలీషాకుమార్ కలివెల మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పాస్టర్లు, సిస్టర్లపై, చర్చిలపై దాడులను, అక్రమ కేసులు బనాయించడాన్ని అరికట్టాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అనంతరం జేసీకి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో డేనియల్, బెనహర్ బాబు, డేవిడ్, దయాసాగర్, క్రాంతికుమార్, ప్రభుకుమార్, రాజశేఖర్, హృదయకుమార్ తదితరులు పాల్గొన్నారు. సూపర్సిక్స్ కోసం.. సూపర్సిక్స్ పథకాలను మంజూరు చేయాలని జిల్లా అంధుల సమాఖ్య అధ్యక్షుడు ఎస్కే జకావుల్లా, ఉపాధ్యక్షుడు దుర్గాబాబు, షేక్ మస్తాన్, ఎస్కే సనావుల్లా, ఎస్కే జిలానీ తదితరులు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాన్ని నెల్లూరులో ఏర్పాటు చేయాలన్నారు. దివ్యాంగులందరికీ ఇండిపెండెంట్ రేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు. సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలన్నారు. శాశ్వత ఉపాధి కల్పించాలన్నారు. గృహాలను ప్రభుత్వం నిర్మించాలన్నారు. అక్రమ మైనింగ్పై చర్యలకు డిమాండ్ సైదాపురం, గూడూరుల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ నిర్వహించే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ సెక్రటరీ, అక్రమ మైనింగ్ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు ఎం.రాజేష్ కుమార్ వినతిపత్రం అందజేశారు. సైదాపురంలోని కేఎస్ఆర్, సిద్ధి వినాయక, షిర్డీ సాయి, శోభారాణి, వెంకటకనకదుర్గ, ఉమామహేశ్వర మైకా మైన్స్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని ఆరోపించారు. అధికారులు తనిఖీలు చేసి నోటీసులిచ్చినా మాఫియా లెక్కచేయడం లేదన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నట్లు చెప్పారు. సమితి గౌరవాధ్యక్షుడు పి.శ్రీనివాసులురెడ్డి, ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ, శివకుమార్, పాల్రాజ్, షేక్ షఫీ తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ 411 వినతుల అందజేత -
ప్రో కబడ్డీ రెఫరీగా శ్రీనివాసరావు
ఉలవపాడు: యువ ఆంధ్ర ప్రో కబడ్డీ సీజన్–1 రెఫరీగా కరేడు గ్రామానికి చెందిన సాదం శ్రీనివాసరావు ఎంపికైనట్లు ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ యలమంచిలి శ్రీకాంత్ సోమవారం తెలిపారు. ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు విజయవాడలో జరిగే సీజన్–1లో రిఫరీగా వ్యవహరిస్తారన్నారు. ఆంధ్ర కబడ్డీ రిఫరీస్ బోర్డు నుంచి ఎంపిక చేసినట్లు తెలిపారు. అసోసియేషన్ రెఫరీస్ బోర్డు చైర్మన్ మురళీకుమార్, కన్వీనర్ రవీంద్ర, ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కరరావు, సెక్రటరీ పూర్ణచంద్రరావులకు శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. -
ఒక్క రాత్రిలోనే..
● సీజ్ చేసిన మైన్ నుంచి వైట్ క్వార్ట్ ్జ తరలింపు ● రెవెన్యూ అధికారులకు సమాచారం ● దీంతో ఆగిన తంతుపొదలకూరు: సీజ్ చేసిన అటవీ భూముల్లోని వైట్ క్వార్ట్ ్జను గుర్తుతెలియని వ్యక్తులు నాలుగురోజుల క్రితం రాత్రివేళ టిప్పర్లలో తరలించారు. ఈ ఖనిజానికి డిమాండ్ ఉంది. ఇక్కడ నాణ్యమైంది లభ్యమవుతుండటంతో జేసీబీతో నాలుగు టిప్పర్లలో లోడ్ చేసి తరలించారు. ఈ సమాచారం రెవెన్యూ అధికారులకు తెలియడంతో తిరిగి రాయిని తరలించే ప్రయత్నాన్ని వాయిదా వేసినట్లు తెలిసింది. గతంలో మండలంలోని మొగళ్లూరు గ్రామానికి సమీపంలో ఉన్న అటవీ భూముల్లో మైనింగ్ చేస్తుండగా అధికారులు దాడులు నిర్వహించారు. వెలికి తీసిన రాయితోపాటు, మైన్ను సీజ్ చేశారు. ఈ సమాచారాన్ని రెవెన్యూ అధికారులకు అందజేశారు. ఈ మైన్పై కేసులు కూడా నడుస్తున్నాయి. మైనింగ్ అధికారులు అప్పట్లో నోటీసులను సైతం అందజేశారు. అయితే మైనింగ్కు అలవాటు పడిన గూడూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇక్కడి నాణ్యత కలిగిన రాయిని వదులుకునేందుకు ఇష్టం లేక కొంతకాలంగా అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. స్థానికంగా ఎవరూ సహకరించకపోవడంతో ఆ వ్యక్తి సాహసించలేకపోయాడు. నాలుగురోజుల క్రితం కొందరు ముందుకురావడంతో ఒక్క రాత్రే ట్రెంచ్ కొట్టిన మైన్ వద్దనున్న రాయిని తరలించాడు. ఆరోజు రాత్రి వర్షం కురిసిన నేపథ్యంలో కాపలా ఉన్న వారు ఇళ్లకు వెళ్లడంతో క్వార్ట్ ్జను తరలించేందుకు అనుకూలంగా మారినట్టు తెలిసింది. మరుసటిరోజు సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ మైన్ వద్ద కాపలాను కట్టుదిట్టం చేశారు. ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.నిఘా పెంచాం వైట్ క్వార్ట్ ్జను గుర్తుతెలియని వ్యక్తులు తరలించినట్టు సమాచారం అందిన వెంటనే ఆ ప్రాంతంలో నిఘా పెంచాం. తలారులను రాత్రి వేళ కూడా కాపలా ఉండాలని ఆదేశించాం. మైనింగ్ అధికారులకు సమాచారం అందజేయడం జరుగుతుంది. – బి.శివకృష్ణయ్య, తహసీల్దార్, పొదలకూరు -
ఆల్బెండాజోల్ మాత్రల పంపిణీ నేడు
నెల్లూరు రూరల్: జిల్లాలో 1 – 19 సంవత్సరాల మధ్య వయసున్న వారికి నులిపురుగుల నివారణ మాత్రలను తప్పకుండా అందించాలని కలెక్టర్ ఆనంద్ సోమవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఆల్బెండాజోల్ మాత్రలను పంపిణీ చేయాలన్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశామన్నారు. పూరిల్లు దగ్ధమై ఆస్తి నష్టంమనుబోలు: పూరిల్లు దగ్ధమైన ఘటన మండలంలోని నాయుడుపాళెం గ్రామంలో సోమవారం జరిగింది. బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన రావూరు సుబ్బారాయుడు, వెంకటరమణమ్మ దంపతులు ఇంటికి తాళం వేసి పని నిమిత్తం వెంకటాచలం మండలం కురిచెర్లపాడుకు వెళ్లారు. తిరిగొచ్చేలోపు పూరింటి పైనున్న 11 కేవీ ఎల్టీ లైన్ వైర్లు ఒకదానికొకటి రాసుకుని నిప్పురవ్వలు ఇంటిపై పడి మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను ఆర్పాలని ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. పొదలకూరు నుంచి వచ్చిన ఫైరింజిన్ మంటలను ఆర్పినా అప్పటికే నష్టం జరిగిపోయింది. ఇంట్లో ఉన్న రూ.2 లక్షల నగదు, మూడున్నర సవర్ల నల్లపూసల దండ, రెండు ఉంగరాలు, రెండు పుట్ల ధాన్యం అగ్నికి ఆహుతయ్యాయి. నిత్యావసర వస్తువులు, దుస్తులు, 100 కేజీల బియ్యం కాలిపోవడంతో ఆ కుటుంబం వీధిన పడింది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
ప్రేమ పేరుతో మోసం
నెల్లూరు(క్రైమ్): ‘నంద్యాలకు చెందిన కె.రమేష్ ప్రేమ పేరుతో మోసం చేశాడు. పెళ్లి చేసుకోవాలని అడుగుతుండగా మొహం చాటేసి మరో యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. అతడిపై చర్యలు తీసుకోవాలి’ అని కొడవలూరుకు చెందిన ఓ యువతి కోరారు. ‘వింజమూరు ప్రాంతానికి చెందిన బాబు ప్రేమిస్తున్నాని, పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు. ఇద్దరం కలిసి సహజీవనం చేశాం. పెళ్లి చేసుకోవాలని అడిగితే నిరాకరిస్తున్నాడు’ అని ఉదయగిరికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్హాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 98 మంది విచ్చేసి తమ ఫిర్యాదులను ఏఎస్పీ సీహెచ్ సౌజన్యకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె ఆయా ప్రాంత పోలీసు అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ చెంచు రామారావు, డీటీసీ ఇన్స్పెక్టర్ మిద్దె నాగేశ్వరమ్మ, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని.. ● కువైట్లో ఉద్యోగం ఇప్పిస్తానని అనంతసాగరానికి చెందిన తులసీధర్ నమ్మించాడు. రూ.3 లక్షల నగదు తీసుకుని కువైట్కు తీసుకెళ్లి ఉద్యోగం ఇప్పించలేదు. నగదు తిరిగివ్వలేదు. ఇటీవల నిలదీయగా చంపుతానని బెదిరిస్తున్నాడని అనంతసాగరానికి చెందిన ఓ వ్యక్తి వినతిపత్రం ఇచ్చాడు. ● నా భర్త మరణించాడు. అత్తింటివారు ఆయన ఆస్తి ఇవ్వకుండా వేధిస్తున్నారు. నాకు జీవనాధారం కష్టమైంది. అవస్థలు పడుతున్నానని కొండాపురానికి చెందిన ఓ మహిళ అర్జీ సమర్పించారు. ● నా కుమార్తె ఈనెల రెండో తేదీ నుంచి కనిపించడం లేదు. మా మండలానికి చెందిన ఓ యువకుడిపై అనుమానం ఉంది. విచారించి కుమార్తె ఆచూకీని తెలియజేయాలని లింగసముద్రంకు చెందిన ఓ మహిళ కోరారు. ● నాకు ముగ్గురు కుమారులు. నా పేరుపైనున్న ఆస్తులు పంచాలని కొడుకులు, కోడళ్లు వేధిస్తున్నారు. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని నెల్లూరు రూరల్ పరిధికి చెందిన ఓ వృద్ధురాలు ఫిర్యాదు చేశారు. ● నెల్లూరుకు చెందిన పృథ్వీరాజ్తో నాకు వివాహమైంది. అతను వ్యసనాలకు బానిసై అదనపుకట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని తమిళనాడుకు చెందిన ఓ మహిళ వినతిపత్రమిచ్చారు. ● నా భర్త చైన్నెలో పనిచేస్తున్నాడు. ఇద్దరు ఆడపిల్లలున్నారు. అతను మమ్మల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడు. చైన్నెలో మరో వివాహం చేసుకున్నట్లు ఫొటోలు పంపాడు. విచారించి చర్యలు తీసుకోవాలని వెంకటాచలసత్రంకు చెందిన ఓ వివాహిత కోరారు. న్యాయం చేయాలని పోలీసులకు వినతులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 98 ఫిర్యాదులు చట్ట పరిధిలో విచారిస్తామన్న ఏఎస్పీ సౌజన్య -
బాలుడి అదృశ్యం.. డ్రోన్తో వెతుకులాట
నెల్లూరు సిటీ: ఒకటో తరగతి చదువుతున్న బాలుడు అదృశ్యమవగా ఏడుగంటల్లోనే పోలీసులు ఆచూకీ కనుకున్నారు. వారి కథనం మేరకు.. రూరల్ మండలంలోని పాతవెల్లంటి గ్రామంలో పాదర్తి నారాయణ, రమణమ్మ దంపతులకు మనోజ్ అనే కుమారుడు ఉన్నాడు. సోమవారం కుమారుడు అల్లరి చేస్తున్నాడని తండ్రి మందలించాడు. ఇంట్లో తల్లిదండ్రులు ఎవరి పనిలో వారుండగా మనోజ్ వీధిలోకి వెళ్లాడు. ఆడుకోవడానికి వెళ్లి ఉంటాడని తొలుత భార్యాభర్తలు భావించారు. అయితే ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెంది రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి వెతకడం మొదలుపెట్టా రు. డ్రోన్ను ఉపయోగించి ఆ ప్రాంతంలో జల్లెడ పట్టారు. పక్కవీధిలోని ఇంటి మిద్దైపె ఉన్నట్లు గుర్తించారు. మనోజ్ డ్రోన్ను చూసి ఆ శబ్దానికి కిందకు దిగాడు. ఆచూకీ లభ్యం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
35 బైక్లు, రెండు ఆటోల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నవాబుపేట పోలీస్స్టేషన్ పరిధిలోని సోమవారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు నగర డీఎస్పీ పి.సింధుప్రియ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు బృందాలుగా ఏర్పడి బోడిగాడితోట, అహ్మద్నగర్, బర్మాషెల్గుంట నాలుగు వైపులా దిగ్భందించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. యజమానితోపాటు కుటుంబ సభ్యుల వివరాలను సేకరించారు. వాహనపత్రాలను పరిశీలించారు. పత్రాలు, నంబర్ ప్లేట్లు సక్రమంగా లేని 35 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలను స్వాధీనం చేసుకుని నవాబుపేట పోలీస్స్టేషన్కు తరలించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నేరనియంత్రణ, అసాంఘిక కార్యక్రమాల కట్టడే లక్ష్యంగా నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్లకు ప్రజలు సహకరించాలని డీఎస్పీ కోరారు. ప్రజలు తమవంతు బాధ్యతగా అనుమానాస్పద వ్యక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, మత్తు పదార్థాల వినియోగంపై డయల్ 112, 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. సెర్చ్లో నవాబుపేట ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్రెడ్డి, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. -
కారు బోల్తా పడి..
● వృద్ధుడి మృతి, ముగ్గురికి గాయాలు దగదర్తి: మండలంలోని సున్నపుబట్టి సమీపంలో అటవీ ప్రాంతం వద్ద హైవేపై సోమవారం కావలి వైపు వేగంగా వెళ్తున్న కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతిచెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరు నుంచి తెనాలికి కారులో రత్నరాజు, అతని భార్య విజయకుమారి, కోడలు సుహాసిని, అల్లుడు వంశీ ప్రయాణిస్తున్నారు. వంశీ వాహనం నడుపుతున్నాడు. అటవీ ప్రాంతం వద్దకు రాగానే కారు అదుపుతప్పి బోల్తా పడింది. రత్నరాజు (83) అక్కడికక్కడే మృతిచెందాడు. విజయకుమారి చేతికి తీవ్ర గాయమైంది. సుహాసిని, వంశీ స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైవే అంబులెన్సులో నెల్లూరుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జంపాని కుమార్ తెలిపారు. -
కారు బోల్తా పడి..
● వృద్ధుడి మృతి, ముగ్గురికి గాయాలు దగదర్తి: మండలంలోని సున్నపుబట్టి సమీపంలో అటవీ ప్రాంతం వద్ద హైవేపై సోమవారం కావలి వైపు వేగంగా వెళ్తున్న కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతిచెందారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. బెంగళూరు నుంచి తెనాలికి కారులో రత్నరాజు, అతని భార్య విజయకుమారి, కోడలు సుహాసిని, అల్లుడు వంశీ ప్రయాణిస్తున్నారు. వంశీ వాహనం నడుపుతున్నాడు. అటవీ ప్రాంతం వద్దకు రాగానే కారు అదుపుతప్పి బోల్తా పడింది. రత్నరాజు (83) అక్కడికక్కడే మృతిచెందాడు. విజయకుమారి చేతికి తీవ్ర గాయమైంది. సుహాసిని, వంశీ స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైవే అంబులెన్సులో నెల్లూరుకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జంపాని కుమార్ తెలిపారు. -
ప్రో కబడ్డీ రెఫరీగా శ్రీనివాసరావు
ఉలవపాడు: యువ ఆంధ్ర ప్రో కబడ్డీ సీజన్–1 రెఫరీగా కరేడు గ్రామానికి చెందిన సాదం శ్రీనివాసరావు ఎంపికైనట్లు ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ యలమంచిలి శ్రీకాంత్ సోమవారం తెలిపారు. ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు విజయవాడలో జరిగే సీజన్–1లో రిఫరీగా వ్యవహరిస్తారన్నారు. ఆంధ్ర కబడ్డీ రిఫరీస్ బోర్డు నుంచి ఎంపిక చేసినట్లు తెలిపారు. అసోసియేషన్ రెఫరీస్ బోర్డు చైర్మన్ మురళీకుమార్, కన్వీనర్ రవీంద్ర, ప్రకాశం జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కరరావు, సెక్రటరీ పూర్ణచంద్రరావులకు శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. -
విద్యార్థిని మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి
● 40 రోజుల్లో ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య మామూళ్ల మత్తులో అధికారులు కార్పొరేట్ విద్యా సంస్థల ధనదాహానికి విద్యార్థుల బలిదానాలు హృదయాలను కలచివేస్తున్నాయి. మార్కులు, ర్యాంక్ల పేరుతో సరస్వతీ పుత్రులను చిదిమేస్తున్నారు. బిడ్డల భవిష్యత్తే తమ జీవితాశయమని తల్లిదండ్రులు తినీతినక కడుపులు మాడ్చుకుని, రెక్కలు ముక్కలు చేసుకుని రూ.లక్షలు తెచ్చి కార్పొరేట్ చేతుల్లో పోస్తున్నారు. బిడ్డలను చదివించమని వదిలి పెడితే.. చావును చూపించి శవాలను తిరిగి పంపిస్తున్నారు. కన్నవారికి కడుపు కోత మిగుల్చుతున్నారు. వేళకు పిడికెడు నాణ్యమైన మెతుకులు కూడా పెట్టకుండా మానవత్వం మరిచి మారీచుడిల్లా వ్యవహరిస్తున్నారు. అనధికారికంగా పాఠశాలలు, కళాశాలలు నిర్వహిస్తున్న యాజమాన్యాల నుంచి అధికారులు మామూళ్లు దండుకుంటున్న విషయం జగద్వితమే. అనుమతుల్లేకుండా హాస్టళ్లు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు జరుగుతున్నప్పుడైనా స్పందించాల్సిన విద్యాశాఖ అధికారులు ఏ కోశాన దయ, మానవత్వం లేకుండా తమకేమి సంబంధం లేదంటూ తప్పుకుంటున్నారు. నగరంలోని అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఆర్ఎన్ఆర్ జూనియర్ కళాశాలలో నిబంధనలకు విరుద్ధంగా హాస్టల్ నిర్వహిస్తోంది. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాచపాళేనికి చెందిన హేమశ్రీ పదో తరగతిలో మంచి మార్కులు సాధించడంతో తమ కళాశాలలో చేర్పించమని ఆ విద్యార్థిని తల్లిదండ్రులపై ఒత్తిడి చేసి ఇంటర్లో ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో జాయిన్ చేసుకున్నారు. ఈ కళాశాల హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. బాగా చదువుకునే విద్యార్థిని ఇంకా బాగా చదవాలంటూ ఒత్తిడి చేయడంతో తట్టుకోలేక సెక్షన్ మార్చాలని యాజమాన్యానికి విన్నవించుకుంది. తల్లిదండ్రులు కూడా తమ కుమార్తె సెక్షన్ మార్చాలని కళాశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో ఒత్తిడిని తట్టుకోలేని హేమశ్రీ అనుమానాస్పద స్థితిలో ఆదివారం తనవు చాలిచింది. ఇలా యాజమాన్యాల నిర్వాహకం, ఒత్తిళ్లు తట్టుకోలేక జిల్లాలో కేవలం 40 రోజుల వ్యవధిలోనే ముగ్గురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గడిచిన 40 రోజుల వ్యవధిలో ముగ్గురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినా జిల్లా ఇంటర్ బోర్డు, ఉన్నతాధికారుల్లో చలనం లేదు. కనీసం అటు వైపు వెళ్లి తనిఖీ చేసిన సందర్భాలు లేవు. కార్పొరేట్ కళాశాలల్లో వసతులు, విద్యార్థులపై ఒత్తిడి, నాసిరకం భోజనంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా, కార్పొరేట్ యాజమాన్యాల నుంచి రూ.లక్షల్లో మామూళ్లు తీసుకుంటున్న ఇంటర్ బోర్డు అధికారులు కళాశాలలు, హాస్టల్స్ వైపు కన్నెత్తి చూడటం లేదని మండి పడుతున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై కనీసం జిల్లా అధికారి నుంచి కూడా స్పందన రాకపోవడంతో విద్యావేత్తలు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్బోర్డు అధికారులు మామూళ్ల మత్తులో తూలుతుండగా మరో వైపు కార్పొరేట్ యాజమాన్యాలు ధన దాహంతో చెలరేగి పోతున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ ఆనంద్ స్పందించి అనుమతి లేని హాస్టల్స్, కళాశాలలను తనిఖీ చేసి వాటిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు కళాశాల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ● జిల్లాలో 30కు పైగా జూనియర్ కళాశాలల హాస్టల్స్ ● ఒక్క దానికి కూడా అనుమతి లేదు ● రూ.లక్షల్లో ఫీజులు.. దారుణ వసతులు ● ర్యాంకుల పేరుతో తీవ్రస్థాయిలో ఒత్తిడి ● తట్టుకోలేక బలవన్మరణాలు నెల్లూరు (టౌన్): జిల్లాలో ఉన్న 137 కార్పొరేట్, ప్రైవేట్ ఇంటర్ జూనియర్ కళాశాలల్లో సుమారు 40 వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఆయా కళాశాలలకు సంబంధించి 30 వరకు అనధి కార హాస్టల్స్ నిర్వహిస్తున్నారు. ఈ హాస్టల్స్ల్లో 15 వేల మందికి పైగా విద్యార్థినీ, విద్యార్థులు ఉంటున్నారు. వీటిల్లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణకు చెందిన 10 హాస్టళ్లు ఉన్నాయి. ఇంటర్లో అకడమిక్, హాస్టల్కు కలిపి కళాశాలను బట్టి రూ.60 వేల నుంచి రూ.2.70 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇవికాకుండా పరీక్ష ఫీజు, హాస్టల్ డిపాజిట్, ప్రాక్టికల్స్, గేమ్స్ తదితర పేర్లుతో మరో రూ.5 వేల నుంచి రూ.7 వేలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన మంత్రి నారాయణ తమకు చెందిన విద్యా సంస్థలు, హాస్టల్స్ల్లోనే నాసిరకమైన భోజనం, వసతుల లేమి, ఒత్తిడితో కూడిన చదువులు ఉండడంతో ఎంతో మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆశలు సమాధి చేసి.. ప్రాణాలు తీసి.. పేదింటి తల్లిదండ్రుల నుంచి శ్రీమంతుల వరకు తమ బిడ్డల భవిష్యత్పై ఎన్నెన్నో ఆశలు పెట్టుకుంటున్నారు. పేదింటి కుటుంబాలు అయితే తమ స్థోమతకు సరిపోకపోయినా.. కూలినాలీ చేసి, ఒక పూట తిని, మరో పూట పస్తులుండి, అప్పులు చేసి మరీ బిడ్డలను కార్పొరేట్ విద్యా సంస్థల్లో చేర్పిస్తున్నారు. ధనదాహంతో మునిగిపోయిన యాజమాన్యాలు విద్యార్థులపై మార్కులు, ర్యాంక్ల పేరుతో తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు పెంచుతున్నారు. కష్టమని చెప్పినా.. నిర్బంధంగా చదవాల్సిందే అంటూ పెంచుతున్న ఒత్తిడికి తట్టుకోలేక తనువులు చాలించే పరిస్థితిలోకి జారిపోతున్నారు. ఘటన జరిగిన తర్వాతైనా ఆయా తల్లిదండ్రులకు బాసటగా నిలుస్తారా అంటూ అదీ ఉండడం లేదు. బిడ్డ చనిపోతే.. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేర్పించాంటూ చేతులు దులుపుకుంటున్నారు. కనీసం సమాచారం చెప్పే దిక్కుకూడా లేకుండా తాళాలు వేసి వెళ్లిపోతున్నారు. అనుమతి లేకుండానే నిర్వహణ జిల్లాలో జూనియర్ కళాశాలల పేరిట నిర్వహిస్తున్న ఏ హాస్టల్కు ప్రభుత్వ అనుమతి లేదు. కొన్ని యాజమాన్యాలు ఒకే భవనంలో కళాశాల, హాస్టల్ నిర్వహిస్తుండగా, మరికొన్ని యాజమాన్యాలు కళాశాల ఒకచోట, హాస్టల్ మరొక చోట నిర్వహిస్తున్న పరిస్ధితి ఉంది. ఏ ఒక్క హాస్టల్కు ఫైర్ సర్టిఫికెట్ లేదు. ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ప్రాణాలు వదలాల్సిన భయానక పరిస్థితి ఉంది. హాస్టల్స్ల్లో వసతులు అధ్వానంగా ఉంటున్నాయి. కారాగారాలను తలపించే విధంగా భవనాలు, ఇరుకు గదుల్లో ఐదుగురు నుంచి ఏడుగురు విద్యార్థులను ఉంచుతున్నారు. హాస్టల్ పేరుతో రూ.లక్షలు గుంజుతున్నా నాణ్యమైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ర్యాంకులు పేరుతో ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు తరగతులు, స్టడీ అవర్స్ పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నారు. విద్యార్థులు చదవలేమని చెప్పినా ఆయా యాజమాన్యాలు బలవంతంగా వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. భోజనం బాగాలేదని, హాస్టల్స్ల్లో మరుగుదొడ్లు, ఇరుకు గదుల్లో మేం పడుకోలేకున్నామని తల్లిదండ్రులకు చెప్పినా ఏదో రకంగా సర్దుకుపోమ్మని సలహా ఇస్తున్నారు. ● బీసీ విద్యార్థి సంఘం నెల్లూరు (అర్బన్) : నగరంలోని ఆర్ఎన్ఆర్ కళాశాల విద్యార్థిని హేమశ్రీ అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ చేపట్టడంతోపాటు అందుకు కారణమైన కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బీసీ విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో జేసీ కార్తీక్కకు ఆ సంఘ నాయకులు వినతిపత్రం ఇచ్చారు. ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్, జిల్లా అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ మెంబర్ మురళీకృష్ణయాదవ్ మాట్లాడుతూ విద్యార్థిని అనుమానాస్పద మృతిపై పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఉదయం 8.30 గంటలకు తల్లిదండ్రులకు హేమశ్రీ ఫోన్ చేసి ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, చదువుల్లో నన్ను ఇబ్బంది పెడుతున్నారంటూ ఫోన్ చేసిందన్నారు. ఆ తర్వాత అర్ధగంటలోపే విద్యార్థిని మృతి చెందడం వెనుక ఉన్న ఒత్తిడి, ఇబ్బందులపై విచారణ జరిపించాలన్నారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమైన 3 నెలల్లోనే నెల్లూరులోని వివిధ కార్పొరేట్ కళాశాలల్లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. ఇందుకు కారణమైన వారిని శిక్షించాలన్నారు. ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు విజయ్, బాలాజీ, సుధీర్యాదవ్, నాయబ్లు పాల్గొన్నారు. హాస్టల్స్ను పర్యవేక్షించే అఽధికారం లేదు ఇంటర్ జూనియర్ కళాశాలలకు సంబంధించి నిర్వహిస్తున్న హాస్టల్స్ను పర్యవేక్షించే అధికారాలు మాకు లేవు. విద్యార్థిని ఆత్మహత్యపై ఆర్ఎన్ఆర్ జూనియర్ కళాశాల యాజమాన్యానికి నోటీసులు జారీ చేశాం. ఆ కళాశాలకు తనిఖీకి వెళ్లితే తాళం వేసి ఉంది. విద్యార్థిని ఆత్మహత్యపై విచారించి కళాశాల యాజమాన్యమే కారణమని తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అన్ని కళాశాలలను తనిఖీ చేస్తాం. అనుమతి లేని వాటిని సీజ్ చేసి చర్యలు చేపడతాం. – వరప్రసాదరావు, ఆర్ఐఓ యాజమాన్యాలపై కేసు నమోదు చేయాలి రాష్ట్రంలో అనుమతి లేకుండా హాస్టల్స్ను నిర్వహిస్తున్న కళాశాలల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. వాటిని వెంటనే సీజ్ చేయాలి. విద్యార్థుల ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపి కారణమైన కళాశాల గుర్తింపు రద్దు చేయాలి. కళాశాల, హాస్టల్స్ నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేయాలి. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – నరహరి, రాష్ట్ర అధ్యక్షుడు, పేరెంట్స్ అసోసియేషన్ -
మద్యం కేసులో కాకాణికి బెయిల్ మంజూరు
నెల్లూరు (లీగల్): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై ఇందుకూరుపేట ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన అక్రమ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ నెల్లూరు 4వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ నిషాద్ నాజ్ షేక్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు ఒక్కొక్కరు రూ.25 వేలు ఆస్తి విలువ కలిగిన ఇద్దరు జామీన్దారుల పూచీ కత్తు, రూ.25 వేలు, వ్యక్తిగత బాండ్ సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ఎకై ్సజ్ అధికారుల విచారణకు కాకాణి సహకరించాలని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ కేసులో కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, పి.ఉమామహేశ్వర్రెడ్డి, ఎంవీ విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కాకాణిపై ఆరోపణలకు ఎలాంటి ప్రాథ మిక ఆధారాలు లేవని, కేవలం రాజకీయ కక్షతో 8వ నిందితుడిగా కేసు బనాయించారని వాదనలు వినిపించారు. అనంతరం ఇందుకూరుపేట ఎకై ్సజ్ అధికారుల తరఫున ఏపీపీ లీలాకుమారి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కాకాణి గోవర్ధన్రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. రైల్వే కోర్టు మేజిస్ట్రేట్ బదిలీ నెల్లూరు (లీగల్): నెల్లూరు రైల్వే కోర్టు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పాలమంగళం వినోద్ను కర్నూలు జిల్లా డోన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేస్తూ ఏపీ హైకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తు తం నెల్లూరు రైల్వే కోర్టు మేజిస్ట్రేట్ వినోద్ ఏపీ జ్యుడీషియల్ అకాడమీలో ట్రైనింగ్లో ఉన్నా రు. ట్రైనింగ్ తర్వాత డోన్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు తీసుకొంటారు. పోలీస్ కస్టడీకి బిరదవోలు నెల్లూరు (లీగల్): వైఎస్సార్సీపీ నేత బిరదవోలు శ్రీకాంత్రెడ్డిని విచారణ నిమిత్తం మూడు రోజు లు పోలీస్ కస్టడీకి ఇస్తూ నెల్లూరు 5వ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జి ఎన్.సరస్వతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పొదలకూరు మండలం తాటిపర్తిలో అక్రమ మైనింగ్ చేసినట్లు పొదలకూ రు పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయన్ను విచారించడానికి నెల్లూరు రూరల్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ బిరదవోలు శ్రీకాంత్రెడ్డి ఈ కేసులో 12వ నిందితుడిగా ఉన్నారని విచారించ డానికి 7 రోజులు కస్టడీ అవసరం ఉందన్నారు. బిరదవోలు శ్రీకాంత్రెడ్డి తరఫున సీనియర్ న్యా యవాది కె.రాజశేఖర్ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాంత్రెడ్డిని ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణ నిమిత్తం నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి తీసుకోవాలని, 14వ తేదీ విచారణాంతరం సా యంత్రం ఐదు గంటలకు వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరిచాలన్నారు. విచారణ సమయంలో థర్డ్ డిగ్రీ ఉపయోగించొద్దని, న్యాయవాది సమక్షంలో ఆయన్ను విచారణ చేయాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. -
వాహనమిత్ర అమలు చేయాలి
నెల్లూరు రూరల్: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన వాహన మిత్ర పథకాన్ని లైసెన్సు కలిగిన ప్రతి డ్రైవర్కు అమలు చేయాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఆటోడ్రైవర్లకు గత ప్రభుత్వం కంటే మిన్నగా ఇస్తామని కూటమి పెద్దలు హామీలిచ్చారన్నారు. ప్రతి ఆటోడ్రైవర్కు రూ.25 వేలు ఇవ్వాలన్నారు. సోమవారం భారీగా తరలివచ్చిన ఆటోడ్రైవర్లు కలెక్టరేట్ ఎదుట కదం తొక్కారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఉపాధి కోల్పోతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే జీఓ నంబరు 21 పేరుతో ట్యాక్స్లు, జరిమానాలు భారీగా పెంచడంతో ఆర్థికంగా తమపై భారం పడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం నెల్లూరు జిల్లా ఆటోకార్మిక సంఘం ఆధ్వర్యంలో వీఆర్ కాలేజీ గ్రౌండ్ నుంచి 500 మంది ఆటో డ్రైవర్లు కలెక్టరేట్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించి, ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు టీవీవీ ప్రసాద్, ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఓ సురేష్, రాజా మాట్లాడుతూ ఇప్పటికే ఆర్థిక భారాలతో సతమతమవుతున్న ఆటో కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఉచిత బస్సు నిర్ణయంతో జీవితాలు మరింత దుర్భరంగా మారే పరిస్థితి అనివార్యమవుతుందన్నారు. గత ప్రభుత్వం ఆటో కార్మికులకు ఏటా రూ.10 వేల వాహనమిత్ర పథకం ద్వారా సాయాన్ని అందించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండో సంవత్సరం గడుస్తున్నా.. ఆటోకార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోలేదన్నారు. వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చే విధానాన్ని ప్రైవేట్ ఏజెన్సీకి ఇవ్వకుండా ఆపాలని ఆర్టీఏ అధికారుల ద్వారానే ఫిట్నెస్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని కోరారు. పెనాల్టీలు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు తగ్గించాలన్నారు. బ్యాంకు నుంచి వాహనాల కొనుగోలుకు రూ.4 లక్షల రుణాన్ని సబ్సిడీతో కూడిన వడ్డీ లేని రుణాలు మంజూరు చేయాలన్నారు. మండలాల్లో ఆటో పార్కింగ్ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు స్వర్ణా బాబురావు డి లవన్కుమార్, నున్న సురేష్ రాధయ్య, పెంచలయ్య, రవీంద్ర శ్యాంసన్, ఎం.సుధాకర్ విజయ్, హరి, దయాసాగర్, అశోక్, జిల్లా నలుమూలల నుంచి 500 మంది ఆటో కార్మికులు పాల్గొన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఉపాధి కోల్పోతాం జీఓ నంబర్ 21 పేరుతో పన్నులు, జరిమానాల భారం కలెక్టరేట్ ఎదుట కదం తొక్కిన ఆటో డ్రైవర్లు -
ఉచిత బస్సు ‘కొందరికే’
●నెల్లూరు ఒంగోలు మధ్య ఎక్స్ప్రెస్లు లేవు. అన్నీ డీలక్స్, సూపర్ డీలక్స్ బస్సులే. ఉన్న ఎక్స్ప్రెస్లు కావలి–నెల్లూరు మధ్య తిరిగే నాన్స్టాప్ బస్సులే. వీటిల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి లేదు. మహిళలు ఎవరైనా ఒంగోలుకు వెళ్లాంటే పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సులో కావలి వరకు వెళ్లి.. అక్కడి నుంచి మరో బస్సులో ఒంగోలుకు వెళ్లాల్సి ఉంటుంది. నెల్లూరు నుంచి కందుకూరు వెళ్లాలన్నా.. ఇదే పరిస్థితి. ●నెల్లూరు నుంచి గూడూరుకై నా పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సులు ఉన్నాయి. నాయుడుపేట, సూళ్లూరుపేటకు వెళ్లాంటే నేరుగా ఆర్డినరీ బస్సులు కూడా లేవు. కనీసం గూడూరు నుంచి కూడా ఆర్డినరీలు లేవు. నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించనున్న పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ‘కొందరికే’ ఉపయోగపడుతోంది. ఎక్స్ప్రెస్ల్లో ఉచితం అంటూనే నాన్స్టాప్గా నడిచే ఎక్స్ప్రెస్ల్లో ‘నో ఫ్రీ’ అంటూ కొర్రీలు పెట్టింది. ప్రస్తుతానికి నిబంధనలు ఇవే ఉన్నప్పటికీ.. ప్రారంభించే సమయానికి ఇంకెన్నీ కండీషన్లు ఉంటాయోనని చర్చ ఆర్టీసీ అధి కారులు, ఉద్యోగుల్లోనూ ఉంది. మరో మూడు రోజుల్లో ఉచిత బస్సును ప్రారంభించాల్సి ఉన్నా.. ఇంతవరకు అధికారులకు మార్గదర్శకాలు రాలేదు. 70 శాతం బస్సుల్లో అనుమతి ఉన్నా.. జిల్లాలో నెల్లూరు–1, నెల్లూరు–2, ఆత్మకూరు, కందుకూరు, కావలి, రాపూరు, ఉదయగిరిలో మొత్తం 7 డిపోలు ఉన్నాయి. ఆయా డిపోల్లో 642 బస్సులు వివిధ మార్గాల్లో నడుస్తున్నాయి. అయితే ఇందులో 341 పల్లెవెలుగు, 31 అల్ట్రా పల్లెవెలుగు, 52 ఎక్స్ప్రెస్లు కలిపి 424 (70 శాతం) బస్సుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ఎక్స్ప్రెస్ కేటగిరీల్లోని నాన్స్టాప్ బస్సుల్లో అనుమతి లేకపోవడం వల్ల పెద్దగా ఒరిగేమీ ఉండదు. పట్టణాల నుంచి పల్లెలకు ఉండేవి, నడిచేవి పల్లె వెలుగులు మాత్రమే. ప్రధానంగా నెల్లూరు నుంచి కావలి, గూడూరు, ఆత్మకూరు మార్గాల్లో పల్లె వెలుగుతోపాటు అల్ట్రా పల్లెవెలుగు బస్సులు ఉన్నాయి. ఎక్కువగా ప్రయాణికులు నాన్స్టాప్ బస్సులనే ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఈ ఉచిత ప్రయాణం అందరికీ ఉపయోగపడే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. అదనంగా 30 బస్సుల కేటాయింపు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు 30 బస్సులను మాత్రమే అదనంగా కేటాయించారు. బడి బస్సులు 25, మరో 5 బస్సులను కేటాయించారు. గత ఆరు నెలల నుంచి ఆర్టీసీ అధికారుల నుంచి ప్రభుత్వం దశల వారీగా జిల్లాలో ఎన్ని బస్సులు అవసరం? ఎంత మంది డ్రైవర్లు, కండెక్టర్లు అవసరమో అడుగుతూ వచ్చింది. దీంతో అధికారులు సూచించిన మేరకు బస్సులు కేటాయింపు జరగకపోవడంతో ఫ్రీ బస్సు సర్వీసులను ఎలా నిర్వహించాలో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. డొక్కు బస్సుల్లోనే ప్రయాణం ప్రతి రోజూ జిల్లాలో బస్సుల్లో 1.50 లక్షల నుంచి 1.70 లక్షలు మందికిపైగా ప్రయాణికులు వివిధ ప్రాంతాల కు రాకపోకలు సాగిస్తుంటారు. మహిళలు 70 వేల నుంచి 80 వేలు వరకు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం జిల్లాలో ఉన్న 642 బస్సుల్లో 15 లక్షల కి.మీ. తిరిగిన బస్సులు 100 ఉండగా, 10 లక్షలు కి.మీ. తిరిగిన బస్సులు 200 వరకు ఉన్నాయి. కొత్త బస్సులు 100 ఉండగా, 200 బస్సులు కండీషన్లో ఉన్నాయి. కండీషన్లో లేని బస్సుల్లో ఎక్కువ శాతం పల్లెవెలుగు బస్సులు కావడం గమనార్హం. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసిన తరువాత ఎక్కువ మంది మహిళా ప్రయాణికులు పెరిగే అవకాశం ఉంది. అయితే ఆ బస్సుల్లో లోడ్ పెరగడం ద్వా రా బస్సుల పరిస్థితి అంతంత మాత్రంగా ఉండడంతో ప్రయాణం సజావుగా సాగేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మూలన పడేందుకు సిద్ధంగా ఉన్న బస్సులకు రంగులు అద్ది రోడ్ల పైకి తీసుకు వస్తున్నారు. 100 మంది ఆన్కాల్ డ్రైవర్ల నియామకం జిల్లాలో డ్రైవర్లు 1,119, కండక్టర్లు 923 మంది ఉన్నారు. వీరు కాకుండా 110 మంది ఆన్కాల్ డ్రైవర్స్ ఉన్నారు. అయితే కొత్తగా మరో 100 మంది ఆన్కాల్ డ్రైవర్స్ను అధికారులు నియామకం చేసుకుంటున్నారు. అయితే ఆన్కాల్ డ్రైవర్స్ నియమించుకునే క్రమంలో వారి పూర్తిస్థాయి డ్రైవింగ్పై అనుభవాన్ని పరీక్షిస్తున్నారు. గతంలో లారీలు, ప్రైవేట్ బస్సులు, భారీ వాహనాలు నడిపిన అనుభవం ఉంది. అయితే ఆయా డ్రైవర్లు వందల మంది ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాహనాలు నడుపుతారా అనే సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. పాత, తుప్పు పట్టిన బస్సులకు పసుపు రంగులు వేసి కలరింగ్ చేస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులకు తిప్పలు తప్పవా? ప్రతి రోజూ ఉదయాన్నే విద్యార్థులు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లేందుకు, ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు సర్వీసులను ఆశ్రయిస్తుంటారు. అయితే మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో ఒక్కసారిగా మహిళలు అధికంగా ఎక్కితే ఉదయం, సాయంత్రం సమయాల్లో విద్యార్థులు, ఉద్యోగులకు సీట్లు దొరికే పరిస్థితి ఉండదు. దీంతో అధికారులు ఏమి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంటుంది. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ల్లోనే అవకాశం నాన్స్టాప్ల్లో ఉచిత ప్రయాణం లేదంట మరో మూడు రోజులే ఉన్నా.. ఇంకా అందని మార్గదర్శకాలు మల్లగుల్లాలు పడుతున్న ఆర్టీసీ అధికారులు బస్సులను కండీషన్లో ఉంచుతాం ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. బస్సులను కండీషన్లోఉండేలా చూసుకుంటున్నాం. ఇంకా ఉచిత ప్రయాణానికి సంబంధించి మార్గదర్శకాలు అందలేదు. వచ్చిన వెంటనే కార్యాచరణ చేపడుతాం. – షేక్ షమీమ్, జిల్లా ప్రజా రవాణాశాఖ అధికారి -
కొంటే.. కూర‘గాయాలు’
నెల్లూరు (పొగతోట): జిల్లాకు కూరగాయలు సరఫరా చేసే ప్రధాన ఏసీ కూరగాయల మార్కెట్ అవినీతిమయమైంది. ఈ మార్కెట్లో అధికారులు అనేక పర్యాయాలు తనిఖీలు చేసినా, కేసులు పెట్టినా వ్యాపారుల్లో మార్పు రావడం లేదు. అధికారులు తనిఖీ సమయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అధికారులు వెళ్లిన తర్వాత వ్యాపారుల తీరు షరా మామూలుగానే మారుతోంది. తూకాల్లో మోసాలు, కుళ్లిపోయిన, పుచ్చిపోయిన కూరగాయలను వినియోగదారులకు అంటగడుతున్నారు. వ్యాపారులు నిత్యం వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఈ తంతు నిత్యం జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కేజీకి 850 గ్రాములే.. కేజీ కూరగాయలు తీసుకుని బయటకు వచ్చి తూకం వేస్తే 850 గ్రాములు మాత్రమే ఉంటున్నాయి. వినియోగదారులు తూకం వేసి పరిశీలించుకునేందుకు ధర్మకాటా ఏర్పాటు చేశారు. ధర్మకాటా బోర్డు మాత్రం కనిపిస్తోంది. కానీ కాటా కనిపించదు. నిత్యం వేలాది మంది వినియోగదారులు ఇక్కడ కూరగాయలు కొనుగోలు చేస్తూ మోసపోతున్నారు. ఈ విషయంపై అదికారులకు ఫిర్యాదులందినా నామమాత్రపు చర్యలతో సరిపెట్టుకుంటున్నారనే విమర్శలున్నాయి. గతంలో జిల్లాలో పనిచేసిన జాయింట్ కలెక్టర్ ఈ మార్కెట్పై నిఘా పెట్టి, తరచూ తనిఖీ చేయడంతో ఆయన ఉన్నంత కాలం వ్యాపారులు నిజాయితీగా వ్యవహరించారు. ఆయన వెళ్లిపోయాక కొత్తగా వచ్చిన ఏ అధికారి కూడా పట్టించుకోకపోవడంతో తిరిగి యథారాజా తథ ప్రజాగా మారారు. ఒక పక్క మండిపోతున్న ధరలు మరో వైపు తుకాల్లో మోసాలు వ్యాపారులు సిండికేట్గా దోపిడీ వినియోగదారుల జేబులకు చిల్లు కుళ్లినవి, పుచ్చినవి అంటగడుతున్నారు నెల్లూరుకు వచ్చిన సమయంలో ఇంటికి వెళ్లేటప్పుడు మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేస్తాం. వ్యాపారులు వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. కుళ్లినవి, పుచ్చినవి అంటగడుతున్నారు. ఇవేమని ప్రశ్నిస్తే భలే కొన్నావ్లే పోవయ్యా అంటూ ఛీదరించుకుంటున్నారు. అధికారులు చొరవ తీసుకొని వినియోగదారులు నష్టపోకుండా చూడాలి. – విజయేంద్రబాబు, పొదలకూరు వ్యాపారులకు నోటీసులిస్తాం వినియోగదారులు నష్టపోకుండా ప్రత్యేక దృష్టి సారిస్తాం. వినియోగదారులను నష్టపరుస్తున్న వ్యాపారులపై దృష్టి పెట్టి నోటీసులు అందించి కేసులు నమోదు చేస్తాం. నిత్యం ధర్మకాటా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. – అనితకుమారి, మార్కెటింగ్ ఏడీ -
చేపల వేటకెళ్లి ఇద్దరు యువకుల మృతి
కావలి (జలదంకి): చేపల వేటకు వెళ్లి మత్స్యకార యువకులు ప్రమాదవశాత్తు సముద్రంలో పడి గల్లంతై ఇద్దరు మృతి చెందిన ఘటన కావలి మండలం తుమ్మలపెంట సముద్రతీరంలో ఆదివారం జరిగింది. ఈ ఘటనలో మరొక యువకుడిని మైరెన్ పోలీసులు కాపాడి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు.. తుమ్మలపెంట పల్లెపాళెంకు చెందిన శ్రీహరి–వెంకటేశ్వరమ్మ కుమారుడు వెయ్యాల విష్ణు (20), శ్రీను–సావిత్రమ్మ కుమారుడు అయ్యాల శివకృష్ణ (19), మరో యువకుడు గొల్లపోతు నాగాచార్యులు కలిసి మొయ్యవల తీసుకుని సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. విష్ణు, శివకృష్ణ సుడిగుండంలో చిక్కుకుని గల్లంతయ్యారు. కొంత దూరంలో ఉన్న నాగాచార్య నీటిలో కొట్టుకుంటూ కేకలు వేశాడు. దీంతో మైరెన్ పోలీసులు స్పందించి స్థానిక మత్స్యకారులతో కలిసి బోటులో వెళ్లి నాగాచార్యను ఒడ్డుకు చేర్చారు. అప్పటికే నీట మునిగి అపస్మారక స్థితిలో ఉన్న విష్ణు, శివకృష్ణలను బోటులో ఒడ్డుకు తీసుకువచ్చారు. అయితే అప్పటికే వారు మృతి చెందారు. అనంతరం ఇద్దరి యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. దీనిపై రూరల్ ఎస్సై తిరుమలరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరొకరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన మైరెన్ పోలీసులు తుమ్మలపెంట సముద్రతీరంలో ఘటన పల్లెపాళెంలో విషాదఛాయలు -
తుక్కు ఫోన్లు.. చెత్త యాప్లు
ఉదయగిరి: జిల్లా వ్యాప్తంగా 12 ఐసీడీఎస్ ప్రాజెక్ట్ల పరిధిలో 2,934 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటిల్లో 1,24,680 మంది పిల్లలు, బాలింతలు 13,098, గర్భిణులు 11,663 మంది ఉన్నారు. వీరికి అన్నీ సేవలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఉన్న పనిభారంతో సతమవుతున్న కార్యకర్తలకు అదనపు యూప్లు పేరుతో మరింత భారం పెంచారు. దీంతో కార్యకర్తలు మరింత మానసిక ఆవేదన చెందుతున్నారు. కొత్త యాప్లకు సపోర్టు చేయని సెల్ఫోన్లు అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం పంపిణీలో పారదర్శకత కోసం గత ప్రభుత్వం అందజేసిన 2జీ ఫోన్ల ద్వారా నమోదు చేయించింది. అప్పటి విధులకు ఆ ఫోన్లు పని చేశాయి. కానీ కూటమి ప్రభుత్వం కొత్త ఫోన్లు ఇవ్వకుండా 5జీ సపోర్టు యూప్లతో అప్లోడ్ చేయాలని చెబుతున్నారు. అసలే అరకొర సిగ్నల్స్, పనిచేయని యూప్లతో కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. దీంతో విసుగు చెందిన కార్యకర్తలు కొత్త ఫోన్లు అయినా ఇవ్వండి లేదా కొత్త యూప్లు రద్దు అయినా చేసి పాత యూప్లు కొనసాగించండంటూ పలువురు కార్యకర్తలు తమ నిరసన గళం వినిపిస్తున్నారు. జిల్లాలో ఒక్క ఉదయగిరి తప్ప అన్ని ప్రాజెక్ట్ల్లోని పనిచేసే కార్యకర్తలు తమకిచ్చిన సెల్ ఫోన్లను ప్రాజెక్ట్ కేంద్రాల్లో ఇచ్చారు. రేషన్ పంపిణీలో ఇబ్బందులు కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చి విధానంలో లబ్ధిదారులకు సరుకులు ఇవ్వాలంటే యూప్లో ముఖ ఆధారిత గుర్తింపు తప్పని సరి. ప్రస్తుతం అంగన్వాడీ కార్యకర్తల వద్ద ఉన్న పాత ఫోన్లు సపోర్టు చేయకపోవడంతో ఫేస్ క్యాప్చర్ కావడం లేదు. దీంతో చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు రేషన్ ఇవ్వడంలో ఇబ్బంది తలెత్తుతోంది. గతంలో కుటుంబంలో ఎవరూ వచ్చిన ఆహారం ఇచ్చే అవకాశం ఉండేది. కానీ కొత్త యూప్లో ఆ అవకాశం లేదు. దీంతో కార్యకర్తలు లబ్ధిదారులకు, అధికారులకు సమాధానం చెప్పలేక మానసిక ఆందోళనకు గురువుతున్నారు. పైగా యూప్లతోనే కుస్తీ పట్టాల్సిన రావడంతో పిల్లలపై దృష్టి పెట్టేందుకు సమయం సరిపోవడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలలు, బాలింతలు, గర్భిణుల ఆరోగ్యానికి, పోషకాహారానికి భరోసాగా నిలుస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు కూటమి ప్రభుత్వం కుంపటిగా మారింది. పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, పిల్లలకు క్రమశిక్షణ, ఆట పాటలతో కూడిన విద్యను అందించడంతోపాటు కిశోర బాలికల వ్యక్తిత్వ వికాసంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీ సిబ్బందిపై పనిభారం పెరగడంపై అష్టకష్టాలు పడుతున్నారు. పని భారం తగ్గిస్తామని చెప్పిన కూటమి కొత్త యాప్లు తీసుకొచ్చి ఒత్తిడి మరింత పెంచింది. తుక్కు ఫోన్లు, చెత్త యాప్లతో విసిగిపోయిన వర్కర్లు ప్రభుత్వం తమికిచ్చిన సెల్ఫోన్లను ఆయా ప్రాజెక్ట్ కేంద్రాల్లో జమ చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ముఖ ఆధారిత గుర్తింపుతో రేషన్ పంపిణీ సపోర్టు చేయకపోవడంతో నమోదు కాని పరిస్థితి పని భారం.. అధికారుల ఒత్తిళ్లు విసిగిపోయిన అంగన్వాడీలు ఐసీడీఎస్ కార్యాలయల్లో ఫోన్ల అప్పుగింత మానసిక వేదనతో సతమవుతున్న కార్యకర్తలు ఫేస్ క్యాప్చర్ తీసివేయాలి ముఖ ఆధారిత గుర్తింపు విధానం (ఫేస్ క్యాప్చర్) తీసి వేయాలి. ఈ విధానంలో లబ్ధిదారులు కచ్చితంగా కేంద్రం వద్దకే రావాలి. వారి ఫోన్లకు వచ్చే ఓటీపీ చెప్పాలంటే భయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఫోన్లు కొత్త యాప్లకు సపోర్టు చేయడం లేదు. సిగ్నల్స్ లేకపోవడంతో ఒక్కరికే గంటల తరబడి సమయం కేటాయించాలి వస్తుంది. మాన్యువల్ విధానమే కొనసాగించాలి. – శ్రీదేవి, అంగన్వాడీ యూనియన్ లీడర్ అధికారుల వేధింపులు ఆపాలి పని చేయని ఫోన్లు ఇచ్చి కార్యకర్తలపై అధికారులు ఒత్తిడి తెచ్చి వేధింపులకు గురి చేయడం మానుకోవాలి. కొత్త యాప్లు ప్రవేశపెట్టి అంతే స్పీడ్తో పాత ఫోన్లు ఎలా పని చేస్తాయనేది అధికారులకు తెలియదా?. అంగన్వాడీ కార్యకర్తలు చేసే పనులకు, వారికి ఇచ్చే వేతనం చూస్తే ప్రభుత్వం వారితో వెట్టి చాకిరి చేయిస్తోంది. ప్రభుత్వం పని తగ్గ వేతనం అమలు చేసి వారితో పనులు చేయించాలి. – కాకు వెంకటయ్య -
అక్రమ కేసుల్లో అరెస్ట్లకు అత్యుత్సాహం
సాక్షిప్రతినిధి, నెల్లూరు: కూటమి నేతల ఆదేశాలతో వైఎస్సార్సీ నేతలపై అక్రమ కేసులు బనాయించిన దర్గామిట్ట పోలీసులు ఇరకాటంలో పడ్డారు. పోలీసులుగా తమ విధులు వదిలేసి పచ్చ పార్టీకి విదేయులుగా వ్యవహరించి అడ్డంగా దొరికిపోయారు. లాఠీచార్జి ఘటనలో పోలీసుల దుందుడుకుగా వ్యవహరించడంతో స్పెషల్ బ్రాంచ్ హెడ్కానిస్టేబుల్ పక్కకు తప్పుకునే క్రమంలో ఆయనకై ఆయనే తట్టుకుని కింద పడిపోయాడు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ శ్రేణుల పాత్ర ఏమాత్రం లేదు. పోలీసులు నమోదు చేసిన ఘటనకు సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో ఇప్పుడేమి చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఈ ఫొటోలను న్యాయమూర్తి ముందు పెడితే పోలీసులపైనే చర్యలు తీసుకునే అవకాశం ఉందని న్యాయకోవిదులు చెబుతున్నారు. అడ్డుగోలుగా కేసులు ఘటనకు దారితీసిన పరిస్థితులు వాస్తవానికి భిన్నంగా ఉన్నప్పటికీ ఇవేమి తమకు పట్టవంటూ కూటమి నేతలు సూచించిన పేర్లను కేసుల్లో ఇరికించి పోలీసులు జైలుకు పంపుతున్నారు. ఇటీవల కావలి ఎస్బీ హెడ్కానిస్టేబుల్ చేయి విరిగిన ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. హెడ్కానిస్టేబుల్ ఫొటోలు తీస్తూ తనకు తాను తట్టుకుని కింద పడితే వైఎస్సార్సీపీ నేతలు నెట్టివేయడంతో కింద పడ్డానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వాస్తవాలు పరిశీలించకుండానే ఎస్బీహెడ్కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించడంతోపాటు ఆయన్ను నెట్టివేయడంతో కిందపడి చేయి విరిగిందంటూ నాన్బెయిల్బుల్ సెక్షన్లతో తొలుత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డితోపాటు కౌన్సిలర్ బొబ్బల శ్రీనివాసయాదవ్, పాతపాటి ప్రభాకర్రెడ్డిపై కేసు నమోదు చేశారు. రెండు రోజుల తర్వాత కూటమి నేతలు ఇచ్చిన జాబితా ప్రకారం వైఎస్సార్సీపీ కోవూరు మండల అధ్యక్షుడు అత్తిపల్లి అనురూప్రెడ్డితోపాటు 17 మంది వైఎస్సార్సీపీ నేతలపై అక్రమంగా కేసులు బనాయించారు. 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉండగా నిబంధనలు అతిక్రమించి ఆందోళన చేశారని ప్రసన్నకుమార్రెడ్డితోపాటు మరికొందరుపై మరో కేసు నమోదు చేశారు. బైక్ ర్యాలీ చేశారని యువకులపై ఇంకో కేసు నమోదు చేశారు. ముందు ప్రసన్నకుమార్రెడ్డి ఉంటే.. వెనుక పక్కన కిందపడిన హెడ్కానిస్టేబుల్ (వృత్తాల్లో చూడొచ్చు)పోలీసుల తోపులాటలో పడిన హెచ్సీ, మరో వ్యక్తిఇద్దరు కూటమి ఎమ్మెల్యేల ఆదేశాలతో ఈ కేసులో మాజీమంత్రి ప్రసన్నకుమార్రెడ్డితోపాటు 20 మందిని నిందితులుగా చేర్చారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వారి కోసం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్తోపాటు చైన్నె, బెంగళూరు, వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ కోవూరు మండల అధ్యక్షుడు ఎ. అనూప్రెడ్డిని అరెస్ట్ చేసిన తీరును చూస్తే దర్గామిట్ట పోలీసుల అత్యుత్సాహం కనిపిస్తోంది. ఆయనేమి ఉగ్రవాది కాదు, ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. అటువంటి వ్యక్తి ఇంటిని అర్ధరాత్రి పూట భారీగా పోలీసులు చుట్టుముట్టి భయానక వాతావరణం సృష్టించడం చూస్తే పోలీసులు ఎవరి మెప్పు కోసం పనిచేస్తున్నారో అర్థమవుతోంది. ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. మరికొందరి కోసం వారి కుటుంబ సభ్యులపై తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నారు. వాస్తవానికి తమకు ఆ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నప్పటికి పోలీసులు అవేమిపట్టించుకోకుండా కూటమి పెద్దలను మెప్పించే ప్రయత్నంలో ఉన్నారు. వైఎస్ జగన్ పర్యటన సక్సెస్తో జీర్ణించుకోలేని కూటమి నేతలు తోపులాటలో హెడ్కానిస్టేబుల్ గాయపడ్డాడని 20 మందిపై అక్రమ కేసులు ఇప్పటికే కోవూరు మండల కన్వీనర్ అనూప్రెడ్డి అరెస్ట్ మరికొందరి కోసం హైదరాబాద్తోపాటు వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాల గాలింపు వెలుగులోకి వచ్చిన ఆయనకై ఆయనే తట్టుకుని పడిన చిత్రాలు -
చిత్రం సాక్షిగా దొరికిన ఖాకీలు
అక్రమ కేసుల్లో జిల్లా కేంద్ర కారాగార రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితో ములాఖత్, టీడీపీ కిరాయి ముష్కరుల దాడి ఘటన నేపథ్యంలో కోవూరు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు గత నెల 31వ తేదీన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరుకు వచ్చారు. అయితే జగన్ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున నిర్బంధ ఆంక్షలు విధించారు. అయితే ఆంక్షలను లెక్క చేయని వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు భారీగా తరలిరావడంతో కూటమి నేతలు జీర్ణించుకోలేకపోయారు. పోలీసులను ఉసిగొల్పడంతో ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం ఆర్అండ్బీ గెస్ట్హౌస్ సమీపంలో వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులపై అకారణంగా ఒక్కసారిగా లాఠీచార్జి చేశారు. దీంతో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డితోపాటు పలువురికి గాయాలయ్యాయి. తనతోపాటు పార్టీ శ్రేణులపై లాఠీచార్జి చేయడాన్ని గర్హిస్తూ ప్రసన్నకుమార్రెడ్డి పోలీసుల చర్యలపై నిరసన వ్యక్తం చేస్తూ అక్కడే రోడ్డుపై బైఠాయించారు. లాఠీచార్జి జరుగుతున్న సమయంలో అక్కడున్న ఎస్బీ హెడ్కానిస్టేబుల్ మాలకొండయ్య ఫొటోలు తీసేందుకు వెనక్కి వెనక్కి వెళుతూ తనను తానే తట్టుకుని పడిపోతున్నట్లు ఫొటోలు, వీడియోలు బయటకు వచ్చాయి. సదరు హెడ్కానిస్టేబుల్ కింద పడిపోవడానికి లాఠీచార్జి చేస్తున్న పోలీసుల దూకుడుతోనే జరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ ఘటనకు కొంచెం దూరంలో పార్టీ శ్రేణులతో ప్రసన్నకుమార్రెడ్డి రోడ్డుపై బైఠాయించిన దృశ్యం అదే చిత్రంలో కనిపిస్తోంది. హెడ్కానిస్టేబుల్ కింద పడుతున్నప్పుడు, పడిన తర్వాత ఆయనకు దగ్గరల్లో కేసులో పేర్కొన్న ఏ వ్యక్తి లేరని ఫొటోలు, వీడియోలతో తేలిపోయింది. దీనిని బట్టి చూస్తే కూటమి నేతలు ఓ పథకం ప్రకారం వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేయించేందుకు హెడ్కానిస్టేబుల్ను ఉపయోగించుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ నేతలకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులకు తెలిసినప్పటికీ కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమ కేసులు నమోదు చేశారని తెలుస్తోంది. పోలీసులు తమపై పెట్టిన అక్రమ కేసులపై వైఎస్సార్సీపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటకు రావడం వాస్తవాలకు సాక్ష్యంగా నిలుస్తోంది. తాజా పరిణామాలతో పోలీసులు ఇరకాటంలో పడ్డారు. ఎలాగైనా తామే కరెక్ట్ అని నిరూపించుకునే పనిలో పడ్డారు. -
అందుబాటులో 1100 కాల్ సెంటర్
● కలెక్టర్ ఆనంద్ నెల్లూరు రూరల్: పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారానికి 1100 కాల్ సెంటర్ అందుబాటులో ఉందని కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టోల్ ఫ్రీ నంబరు ప్రభుత్వ ప్రజాఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఒక భాగమని, ఇది పౌరులు లేవనెత్తిన సమస్యలను సంబంధిత విభాగాలకు పంపి సకాలంలో పరిష్కరించేలా చేస్తుందన్నారు. ప్రభుత్వ సేవలు, స్థాని క సమస్యలు ఇతర ప్రజాసమస్యలకు సంబంధించిన సమస్యలను నివేదించడానికి పౌరులు ఏ ఫోన్ నుంచి అయినా 1100కు ఉచితతంగా కాల్ చేయొచ్చు అన్నారు. ఫిర్యాదులను తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో సౌలభ్యం కోసం నమోదు చేసుకోవచ్చునని, దీన్ని వినియోగించుకోవాలన్నారు. పాఠశాల విద్యార్థులకు నేటి నుంచి పరీక్షలు ● డీఈఓ బాలాజీరావు నెల్లూరు(అర్బన్): జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు సంబంధించి 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మొదటి నిర్మాణాత్మక మదింపు (ఎస్ఏఎంపీ–1) పరీక్షలు సోమవారం నుంచి జరుగుతాయని డీఈఓ బాలాజీ రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు మూడు రోజుల పాటు, 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు నాలుగు రోజుల పాటు టైం టేబుల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయన్నారు. 11వ తేదీ ప్రథమ భాష తెలుగు, గణితం 12న ద్వితీయ భాష హిందీ, సామాన్యశాస్త్రం/భౌతికశాస్త్రం, 13న తృతీయ భాష ఆంగ్లం, సాంఘిక శాస్త్రం, 14న ప్రధాన భాష సంస్కృతం, జీవశాస్త్రం పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ప్రతి సబ్జెక్ట్కు 35 మార్కులతో పాటు ప్రతి సబ్జెక్ట్లో తరగతి గది ప్రతిస్పందనలు, రాత పనులు, ప్రాజెక్ట్ పనులుకు ఒక్కొక్కటికి 5 మార్కులు చొప్పున ఉపాధ్యాయులు పరీక్షలు నిర్వహించి మొత్తం 50 మార్కులకు మదింపు చేస్తారని తెలిపారు. విద్యార్థులు పరీక్షలు రాసిన తర్వాత ఉపాధ్యాయులు జవాబులను మూల్యాంకనం చేసి ఆ మార్కులను మదింపు పుస్తకంలోని ఓఎంఆర్లో నమోదు చేసి, స్కాన్ చేసి లీప్ యాప్ద్వారా అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించారు. పరీక్ష ఫలితాలను రాష్ట్ర స్థాయిలో మదింపు చేసి ప్రస్తుత విద్యాప్రమాణాల మీద, తదుపరి చర్యలపైన ఉపాధ్యాయులకు సూచనలు చేస్తారన్నారు. శిలాఫలకం ధ్వంసం కేసులో ఇద్దరి అరెస్ట్ ● కావలి డీఎస్పీ శ్రీధర్ కావలి (జలదంకి): తమ్మలపెంట పట్టపుపాళెంలో జల్జీవన్ మిషన్ శిలాఫలకం ధ్వంసం కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు కావలి డీఎస్పీ కే శ్రీధర్ తెలిపారు. ఆదివారం కావలి డీఎస్పీ తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివవరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ తమ్మలపెంట పట్టపుపాళెంలో 2021లో ప్రభుత్వ పథకం జల్జీవన్ మిషన్, రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఇటీవల ధ్వంసం చేశారు. ఈ కేసులో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పామంజి యానాదయ్య, కోడూరు జకరయ్య ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి జేసీబీతో శిలాఫలకాన్ని ధ్వంసం చేసి ట్రాక్టర్ల ద్వారా శిథిలాలను బయటకు తరలించారని తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఈ మేరకు వారిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. మిగిలిన ఐదుగురిని అరెస్ట్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ రాజేశ్వరరావు, ఎస్సై తిరుమలరెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
కరాటే పోటీల్లో బంగారు పతకం
కలిగిరి: మండలంలోని బసిరెడ్డిపాళెం గ్రామానికి చెందిన బోరెడ్డి సరిత తంజావూరులో నిర్వహించిన మూడో ఇంటర్నేషనల్ ఓపెన్ కరాటే చాంపియన్షి ప్ – 2025లో ప్రతిభ చూపి ప్రథమ స్థానంలో నిలిచింది. పెరియార్ మణియమ్మై ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆండ్ కళాశాల ఆవరణలో ‘కింగ్ షిటో – ర్యూ స్పోర్ట్స్ కరాటే డో ఇండియా’ ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో ఇంటర్నేషనల్ పోటీలు జరిగాయి. మొదటి స్థానంలో నిలిచిన సరితకు నేషనల్ కరాటే ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, సినీ నటుడు సుమన్, జాతీయ కార్యదర్శి డాక్టర్ పియూ ష్జైన్ బంగారు పతకం, ట్రోఫీ అందజేశారు. తనకు శిక్షణ ఇచ్చిన లక్ష్మీసామ్రాజ్యం, రవికి సరిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. -
కేసు నమోదు చేయాలంటూ..
● ఆర్ఎన్ఆర్ కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా ● నేతలను తరిమికొట్టిన పోలీసులు నెల్లూరు(అర్బన్): విద్యార్థిని ఆత్మహత్య ఘటనపై పోలీసులు ఆర్ఎన్ఆర్ జూనియర్ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఆశ్రిత్రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంద్ర డిమాండ్ చేశారు. ఆదివారం ఆ కళాశాల వద్ద ఆయా సంఘాల నేతలు, కార్యకర్తలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆశ్రిత్రెడ్డి, నరేంద్ర మాట్లాడుతూ విద్యార్థిని ఆత్మహత్య ఉదయం జరిగినప్పుడు సాయంత్రం వరకు తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యం చెప్పకపోవడం దారుణమన్నారు. ఈ వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపి కేసు నమోదు చేయాల్సి ఉందన్నారు. విద్యాశాఖాధికారులు కళాశాలకు వచ్చి పరిశీలించకపోవడం శోచనీయమన్నారు. ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి న్యాయం చేసేవిధంగా కలెక్టర్ స్పందించి కళాశాల గుర్తింపును రద్దు చేసి సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. న్యాయం అడిగితే.. విద్యార్థి నేతలు కళాశాల వద్ద ధర్నా నిర్వహించడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అయినా కదలకపోవడంతో తరిమికొట్టారు. ఈ ఘటనలో ఎస్ఎఫ్ఐ నాయకులను ఈడ్చి వేయడంతో చొక్కాలు చినిగిపోయాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతుంటే పోలీసులు కళాశాల యాజమాన్యానికి అనుకూలంగా తమపై దౌర్జన్యం చేయడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి సంఘం నాయకులు తౌఫిక్, అబిద్, ఉస్మాన్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సరసింహ, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు నాగేంద్ర, చైతన్య, జగదీష్, సుకుమార్, యశ్వంత్, సురేంద్ర, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
నెల్లూరు(స్టోన్హౌస్పేట): ‘కూటమి ప్రభుత్వంలో మహిళల పరిస్థితి చూస్తుంటే బాధ వేస్తోంది. వారికి రక్షణ కరువైంది. రాష్ట్రంలో మత్తు పదార్థాలు విపరీతంగా దొరుకుతున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోంది’ అని వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత అన్నారు. నెల్లూరులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆమె ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత జగనన్న ప్రభుత్వం మహిళలకు అండగా నిలిచిందన్నారు. వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. వారికి పదవులు ఇచ్చినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు మరోలా ఉన్నట్లు చెప్పారు. అంగన్వాడీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తుంటే వారి సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. 5జీ ఫోన్లు ఇవ్వలేక సొంత ఖర్చులతో పనిచేయమని చెప్పడం దారుణమన్నారు. మహిళల సమస్యలపై ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. జగనన్నకు కృతజ్ఞతలు నియోజకవర్గ స్థాయిలో పనిచేసే తనను మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డికి పూజిత కృతజ్ఞతలు తెలిపారు. పదవికి వన్నె తెచ్చేలా బాధ్యతాయుతంగా పనిచేస్తానన్నారు. తన తండ్రి కాకాణి గోవర్ధన్రెడ్డి జైలుకు వెళ్లి 75 రోజులైందన్నారు. ఆయన బయటకు వస్తారని ప్రతిరోజూ అనుకుంటున్నామన్నారు. కేసులపై కేసులు వేసి తమను మానసికంగా వేధిస్తున్నప్పుడు జగనన్న ఫోన్లో మాట్లాడి ఓదార్చడమే కాకుండా నెల్లూరుకు వచ్చి నాన్నను కలిసి ధైర్యం చెప్పారని, ఆయన రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, వైఎస్సార్సీపీ నాయకులు, జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలు కాకాణికి అండగా ఉన్నారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కాకుటూరు లక్ష్మీసునంద, అంగన్వాడీ విభాగం రాష్ట్ర కార్యదర్శి వెంకటజ్యోతి, జెడ్పీటీసీ సభ్యురాలు ఎంబేటి శేషమ్మ, ఆత్మకూరు మహిళా అధ్యక్షురాలు, జెడ్పీటీసీ ప్రసన్న, సర్వేపల్లి నియోజకవర్గ అధ్యక్షురాలు సంధ్యారాణి, నెల్లూరు రూరల్ అధ్యక్షురాలు రమాదేవి, నెల్లూరు సిటీ అధ్యక్షురాలు ధనుజారెడ్డి, ఇంకా శారద, బషీరా, ముంతాజ్, హైమ, వసంత తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత -
సోదరుడికి రాఖీ కట్టేందుకు వచ్చి..
● పాముకాటుకు గురై మహిళ మృతి సంగం: ఓ మహిళ తమ్ముడికి రాఖీ కట్టి తన ఇంట్లోకి వెళ్లింది. అక్కడున్న నాగుపాము కాటుకు గురై చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన మండలంలోని అన్నారెడ్డిపాళెం పల్లిపాళెం గ్రామంలో జరిగింది. సంగం మండలం అన్నారెడ్డిపాళెం పల్లిపాళేనికి చెందిన పాకం రావమ్మ (50) కొన్ని సంవత్సరాలుగా బుచ్చిరెడ్డిపాళెంలో పనులు చేసుకుంటోంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా శనివారం ఉదయం అన్నారెడ్డిపాళెం పల్లిపాళెంలో ఉంటున్న తన తమ్ముడు కనిసిరి హజరత్తయ్య వద్దకు వెళ్లి రాఖీ కట్టింది. పక్కనే ఉన్న తన ఇంటిని చూసేందుకు రావమ్మ వెళ్లింది. అప్పటికే అక్కడున్న నాగుపాము ఆమెను కాటు వేసింది. కేకలు వేయడంతో హజరత్తయ్య, గ్రామస్తులు బుచ్చిరెడ్డిపాళెంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రావమ్మ రాత్రి మృతిచెందింది. ఆదివారం ఉదయం పల్లిపాళెంలో అంత్యక్రియలు చేశారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆమె ఇంట్లోకి వెళ్లిన బంధువులకు కాటువేసిన నాగుపాము కనిపించడంతో కొట్టి చంపేశారు. -
కన్నపేగు విలవిల
● కుమార్తె మృతితో గుండెలవిసేలా రోదించిన తల్లిదండ్రులు నెల్లూరు(క్రైమ్): చదువుల్లో రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందనుకున్న కుమార్తె అర్ధాంతరంగా తనువు చాలించడంతో కన్నపేగు విలవిల్లాడింది. కుమార్తె మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తూ కుప్పకూలిపోయారు. వారి రోదన చూపరులను కంటతడి పెట్టించింది. వివరాలిలా ఉన్నాయి. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాచపాళెం గ్రామానికి చెందిన పి.తిరుమలయ్య, వేదవతి దంపతులకు హేమశ్రీ (16), మరో కుమార్తె, కుమారుడు సంతానం. తిరుమలయ్య శ్రీసిటీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఉన్నతంలోనే పిల్లలను చదివిస్తున్నాడు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా హేమశ్రీ చిన్నతనం నుంచే చదువుల్లో చురుకుగా ఉండేది. పదో తరగతిలో 550 మార్కులు సాధించింది మండల టాపర్గా నిలిచింది. కుమార్తె మంచి మార్కులు సాధించడంతో భవిష్యత్లో మరింతగా చదువుల్లో రాణించి ఉన్నత స్థితిలో ఉంటుందని తల్లిదండ్రులు కలలుగన్నారు. ఆమెను నెల్లూరు అన్నమయ్య సర్కిల్ సమీపంలోని ఆర్ఎన్ఆర్ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరంలో చేర్పించారు. కళాశాల హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. కొంతకాలంగా ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని ఆమె తల్లిదండ్రులకు చెప్పి బాధపడుతూ ఉండేది. తల్లిదండ్రులు ఆదివారం కళాశాల ప్రిన్సిపల్తో మాట్లాడతామని చెప్పారు. ఈక్రమంలోనే హేమశ్రీ మృతిచెందింది. నెల్లూరుకు చేరుకున్న తల్లిదండ్రులు కుమార్తె మృతిని తట్టుకోలేక రోదిస్తూ కుప్పకూలిపోవడం చూపరులను సైతం కంట తడిపెట్టించింది. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. కుమార్తెను కళాశాల వారే పొట్టన పెట్టుకున్నారని వారు ఆరోపించారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె మృతి వెనుక అనుమానాలున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
నిమ్మ ధరలు ౖపైపెకి..
నిమ్మ ధరలు పెరిగాయని సంతోష పడాలా?, దిగుబడి లేనందుకు బాధపడాలో అర్థం కాని స్థితిలో రైతులున్నారు. శ్రావణ మాసం నేపథ్యంలో ఇటీవల స్వల్పంగా ధరలు పెరిగాయి. తాజాగా అమాంతం ఒక కిలో రూ.30 నుంచి రూ.50కి చేరింది. బస్తా కాయలు ప్రస్తుతం మార్కెట్లో రూ.4 వేలకు అమ్ముతున్నారు. నెలాఖరుకు ధరలు మరింతగా పెరగొచ్చని తెలుస్తోంది.బస్తా కాయలు రూ.4 వేలు ● ధరలు మరింత పెరిగే అవకాశం ● బయట మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్ ● దిగుబడి తగ్గి రైతుల దిగాలుపొదలకూరు: ఈ ఏడాది నిమ్మ మార్కెట్ సంక్షోభంలో కొట్టుమిట్టాడింది. ధరలు పతనమై కిలో కాయలు రూ.15కు కూడా అమ్ముడుపోలేదు. చాలామంది రైతులు తోటల్లోనే కాయలను వదిలిలేయాల్సి వచ్చింది. అయితే పండగల సీజన్ రావడంతో కొంత ఊపిరి పీల్చుకున్నా ధరలు తాత్కాలికంగా ఉంటాయని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. అక్టోబర్ నుంచి వర్షాలు మొదలైతే కాయల ఎగుమతి పూర్తిగా తగ్గిపోతుంది. కాగా దసరా వరకు రైతులకు నష్టం వాటిల్లకుండా ధరలు ఉంటాయని చెప్పుకొస్తున్నారు. సంక్షోభం నుంచి కోలుకుంటూ.. ఈ ఏడాది సీజన్లో సైతం ధరలున్నా కాయల్లేక, ఒకవేళ కాయలుంటే ధరల్లేక రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆరేళ్ల నాడు ఇలాంటి పరిస్థితే వచ్చింది. వ్యాపారులు కొనుగోలు చేసిన కాయలను పారబోసేవారు. గతేడాది ఇదే సీజన్లో బస్తా రూ.9 వేల వరకు అమ్ముడుపోయింది. కాయలు ఉన్నన్ని రోజులు ధరలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. తీరా తోటల్లో కాయలు లేకపోవడంతో ఇప్పుడు డిమాండ్ మెల్లగా పెరిగింది. ఢిల్లీ మార్కెట్ పుంజుకోవడంతో ధరలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనివల్ల ప్రత్యేకంగా ఒనగూరే ప్రయోజనం ఉండదని రైతులు చెబుతున్న మాట. చాలామంది తోటల్లో కాయలు పలచబారి లేకుండాపోతున్నాయి. కాయలున్న ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఈ ప్రాంతంలో 4 వేల ఎకరాల్లో తోటలన్నాయి. నిమ్మను మెట్టరైతులను వేరుచేసి చూడలేని పరిస్థితి ఉంది. ఎన్ని కష్టా లు, నష్టాలొచ్చినా ఈ సాగును వీడటం లేదు. మార్కెట్కు వచ్చిన నిమ్మకాయలు ధరలు పెరగడం మంచిదే.. ధరలు పెరగడం మంచి పరిణామమే. అయితే నెలరోజులు ముందుగా పెరిగుంటే చాలామంది రైతులు బాగుపడేవారు. తోటల్లో కాయలు లేని తర్వాత పెరగడం వల్ల తక్కువ మందికి ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం కాయలున్న రైతులకు ఆర్థికంగా కొంత మేలు జరుగుతుంది. – పి.పెంచలనారాయణరెడ్డి, నిమ్మ రైతు, మొగళ్లూరు ఆటుపోట్లు మామూలే.. ఈ ప్రాంత నిమ్మ రైతులకు ధరల్లో ఆటుపోట్లు మామూలైపోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా నిమ్మను వీడలేం. ఒక ఏడాది ఆదాయం వస్తే మరో ఏడాది నష్టం వస్తుంటుంది. అంతమాత్రాన సాగును వదిలిపెట్టేది ఉండదు. నిమ్మలోనే జీవించడం వల్ల మాకు నష్టం వచ్చినా పట్టించుకోం. – కేపీ నారాయణరెడ్డి, నిమ్మ రైతు, అంకుపల్లి ఢిల్లీ మార్కెట్కు పంపుతున్నాం మార్కెట్లో ధరలు ఆశాజనకంగా ఉండటంతో వ్యాపారంలో వేగం పెరిగింది. అయితే తోటల్లో కాయలు తగ్గుముఖం పడుతున్నందునే ధరలు పెరుగుతున్నాయి. ఢిల్లీ మార్కెట్కు ఎగుమతి చేయడం జరుగుతుంది. ఇటీవల వరకు ఆ మార్కెట్ వ్యాపారులు కాయలను వద్దనేవారు. ఇప్పుడు కావాలంటున్నా కాయలు తగినన్ని లేకపోవడంతో ఉన్నవాటినే పంపుతున్నాం. – ఎం.బాలకృష్ణారెడ్డి, వ్యాపారి, నిమ్మ మార్కెట్, పొదలకూరు ● -
13న ప్రత్యేక విద్యుత్ అదాలత్
● ఈఈ సోమశేఖర్రెడ్డి వెల్లడి నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఈనెల 13వ తేదీ బుధవారం పొదలకూరులో ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆ శాఖ నెల్లూరు రూరల్ డివిజన్ ఈఈ సోమశేఖర్రెడ్డి తెలిపారు. నగరంలోని విద్యుత్ భవన్లో ఉన్న కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రూరల్ డివిజన్ పరిధిలోని రాపూరు, నెల్లూరు రూరల్, పొదలకూరు, ముత్తుకూరు సబ్ డివిజన్ పరిధిలోని రాపూరు, సైదాపురం, పొదలకూరు, మనుబోలు, కలువాయి, నెల్లూరు రూరల్, ముత్తుకూరు, తోటపల్లిగూడూరు మండలాలతోపాటు విరుపూరు, కోడూరు, వెంకటాచలం, కావేరినగర్, బుజబుజనెల్లూరు, నారాయణరెడ్డిపేట సెక్షన్ల విద్యుత్ వినియోగదారుల సమస్యలపై ఈ అదాలత్ జరుగుతుందన్నారు. పొదలకూరు విద్యుత్ సబ్స్టేషన్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి సీజీఆర్ఎఫ్ చైర్మన్ వి.శ్రీనివాస ఆంజనేయమూర్తి, ఆర్థిక సభ్యులు మధుకుమార్, సభ్యురాలు విజయలక్ష్మి, ఎస్పీడీసీఎల్ జిల్లా ఎస్ఈ విజయన్, డిస్కం అధికారులు విచ్చేస్తారన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగదారలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ఆర్ఐఎంసీకి విద్యార్థి ఎంపిక
సంగం: మండలంలోని సిద్ధీపురం గ్రామానికి చెందిన డేగా చంద్రిల్రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకమైన డెహ్రాడూన్లోని రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కళాశాల (ఆర్ఐఎంసీ)లో సీటు సాధించాడు. 8వ తరగతి ప్రవేశం కోసం గత సంవత్సరం డిసెంబర్లో ప్రవేశపరీక్ష జరిగింది. చంద్రిల్రెడ్డి ప్రతిభ చూపాడు. ఇంటర్మీడియట్ వరకు చదువుకునే అవకాశం ఉంది. అతను 6, 7 తరగతుల బుచ్చిరెడ్డిపాళెంలోని ఓ ప్రభుత్వ పాఠశాలు చదవడం విశేషం. తండ్రి డేగా మనోహర్రెడ్డి, తల్లి పవిత్ర తమ బిడ్డ సాధించిన విజయానికి సంతోషం వ్యక్తం చేశారు. ఎయిర్స్ఫోర్స్ అధికారి కావడమే తన లక్ష్యమని చంద్రిల్రెడ్డి చెబుతున్నాడు.48 మద్యం బాటిళ్ల స్వాధీనందుత్తలూరు: దుత్తలూరు పంచాయతీ పరిధిలోని కమ్మవారిపాళెం మలుపు వద్ద అనధికారికంగా నిర్వహిస్తున్న బెల్టుషాపుపై ఆదివారం దుత్తలూరు పోలీసులు దాడులు నిర్వహించారు. ఉన్నతాధికారుల సమాచారం మేరకు ఉదయగిరి సీఐ వెంకట్రావు, దుత్తలూరు ఎస్సై ఆదిలక్ష్మి తన సిబ్బందితో దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన 48 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బైక్● యువకుడికి గాయాలుదగదర్తి: మండలంలోని ఉలవపాళ్ల హైవే సర్వీస్ రోడ్డుపై ఆర్టీసీ బస్సును వెనుక నుంచి మోటార్బైక్ ఢీకొనడంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. ఆదివారం కావలి నుంచి నెల్లూరు వైపు పల్లెవెలుగు బస్సు వెళ్తోంది. ఉలవపాళ్ల సర్వీసు రోడ్డు స్టాప్లో ప్రయాణికులు దిగారు. లోపల ఉండిపోయిన ఓ ప్రయాణికురాలు బస్సు ఆపాలని అడగడంతో డ్రైవర్ నిలిపాడు. అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ బైక్పై వెళుతూ ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి ఢీకొన్నాడు. అతడి కుడి కాలుకు తీవ్ర గాయమైంది. వెంటనే బంధువులు కావలి హాస్పిటల్కు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జంపాని కుమార్ తెలిపారు.పోలీసుల అదుపులో జూదరులువిడవలూరు: పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఘటన మండలంలోని ముదివర్తి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఆదివారం మధ్యాహ్నం ముదివర్తి గ్రా మం పాత ఇసుక ర్యాంపు సమీపంలో వేపచెట్టు కింద కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారని సమాచారం అందడంతో ఎస్సై పి.నరేష్ తన సిబ్బందితో వెళ్లి దాడులు చేశారు. అదే గ్రామానికి చెందిన ఎస్కే బాబు, షేక్ హనీఫ్, మారుబోయిన విష్ణుకుమార్, తంగం శ్రీనివాసులును అదుపులోకి తీసుకున్నారు. రూ.4 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని పోలీస్స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచనున్నట్లు ఎస్సై తెలియజేశారు.● మనుబోలు: మండలంలోని మనుబోలు దళితవాడలో పేకాట స్థావరంపై ఆదివారం ఎస్సై శివరాకేష్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. స్థానికులిచ్చిన సమాచారంతో దాడులు చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4,200 నగదు స్వాధీనం చేసుకున్నారు.15 నుంచి రాపూరమ్మ జాతరరాపూరు: మండల కేంద్రంలోని గ్రామదేవత రాపూరమ్మ జాతర ఈనెల 15వ తేదీ నుంచి జరుగుతుందని నిర్వాహకులు ఆదివారం తెలిపారు. ప్రాచీన కాలంనాటి ఈ ఆలయంలో 15న ఉదయం అభిషేకం, అంకురార్పణ, అమ్మవారి ఆహ్వానం, 16న పూలంగిసేవ, అన్నదానం, గంగపెట్టె ఊరేగింపు, 17న గ్రామ పొంగళ్లు, రాత్రి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.కండలేరులో 25.917 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 25.917 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 5,280 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,700, పిన్నేరు కాలువకు 20, లోలెవల్ కాలువకు 40, మొదటి బ్రాంచ్ కాలువకు 80 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
విషాద ప్రయాణం
ఉలవపాడు: బాలుడికి తిరుమలలో పుట్టు వెంట్రుకలు తీయించి.. దైవ దర్శనం చేసుకుని సంతోషంగా సొంతూరికి చేరుకోవాలని ఆ కుటుంబం అనుకుంది. అన్ని ఏర్పాట్లు చేసుకుని తుఫాన్ వాహనంలో బయలుదేరింది. అయితే విధి మరోలా తలచింది. మృత్యు ప్రయాణంగా మారడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఉలవపాడు దాటి చాగల్లు సమీపంలోకి వచ్చే సమయంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడుకు చెందిన ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు, శనివారం వైద్యశాలలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. ఇద్దరూ సచివాలయ ఉద్యోగులు చిన వెంకటేశ్వర్లు సుభాషిణిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ కష్టపడి సచివాలయంలో ఉద్యోగాలు సాధించారు. వెంకటేశ్వర్లు పిడుగురాళ్లలో వెల్ఫేర్ అసిస్టెంట్గా, సుభాషిణి డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. మూడేళ్ల కుమారుడితో జీవితం సంతోషంగా సాగుతున్న సమయంలో రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని కకావికలం చేసింది. వెంకటేశ్వర్లు తన భార్యను, తల్లి వెంకటనరసమ్మ, కుమారుడు తేజస్విని అభినయకృష్ణను పోగొట్టుకున్నాడు. దైవదర్శనం కోసం వారితోపాటు వెళ్తూ సుభాషిణి తండ్రి యర్రం శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయాడు. వెంకటేశ్వర్లు అన్న శ్రీనివాసరావు భార్య రుక్మిణమ్మ మరణించడంతో ఆ కుటుంబంలో అంతులేని విషాదం నెలకొంది. రైల్లో వెళ్లాలని అనుకుని.. ఆ కుటుంబం తొలుత తిరుపతికి రైలులో వెళ్లాలనుకుని ప్లాన్ చేసుకుంది. అందులో ప్రయాణం ప్రశాంతంగా ఉంటుందని శ్రీనివాసరావు అన్నాడు. చిన్నపిల్లలు రైలులో ఇబ్బందులు పడతారు, కారులో అయితే ప్రశాంతంగా పడుకుని నిద్రపోతారు కదా అని వెంకటేశ్వర్లు అనడంతో పిడుగురాళ్లకు చెందిన గంగరాజు అనే వ్యక్తికి సంబంధించిన తుఫాన్ వాహనాన్ని బాడుగకు మాట్లాడుకున్నారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు బయలుదేరి మధ్యలో టీ తాగేందుకు ఆగారు. తిరిగి బయలుదేరిన అరగంటలోపే ప్రమాదం జరిగిందని శ్రీనివాసరావు తెలిపారు. మృతదేహాల అప్పగింత ఉలవపాడు సీహెచ్సీలో వెంకటనరసమ్మ, సుభాషిణితోపాటు బాలుడు అభినయ్కృష్ణకు శనివారం పోస్టుమార్టం నిర్వహించారు. గ్రామం నుంచి బంధువులు వచ్చి మృతదేహాలను చూసి చలించిపోయారు. నెల్లూరులో యర్రం శ్రీనివాసరావు మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. రుక్మిణమ్మ గుంటూరులో సాయంత్రం చికిత్స పొందుతూ మృతిచెందింది. ఇంకా పోస్టుమార్టం నిర్వహించలేదు. ఉలవపాడు వైద్యశాలలో వారి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. పెరిగిన రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య తొలుత తిరుపతికి రైల్లో వెళ్లాలని అనుకుని.. తుఫాన్ వాహనంలో బయలుదేరి అనంతలోకాలకు.. -
నృసింహునికి తులసీ దళార్చన
రాపూరు: శ్రావణ పౌర్ణమి సందర్భంగా పెంచలకోనలో పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, చెంచులక్ష్మీదేవికి శనివారం తులసీ దళార్చన అత్యంత వైభవంగా జరిగింది. నిత్య కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. మేళతాళాల నడుమ శ్రీవారి నందనంలోని ప్రత్యేక మండపంలో తులసీ దఽళాలతో ప్రత్యేక పూజలు, ఆదిలక్ష్మీదేవికి కుంకుమార్చన సేవ జరిగింది. రాత్రి బంగారు గరుడ వాహనంపై స్వామి ఉత్సవ విగ్రహం కొలువుదీర్చి అలంకరించారు. కోనలోని మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహించారు. ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన కారు● ఒకరి మృతి, నలుగురికి గాయాలు ● రాజుపాళెం వద్ద ఘటన ఉలవపాడు: రెండు ద్విచక్ర వాహనాలను కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందగా నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన 16వ నంబర్ జాతీయ రహదారిపై రాజుపాళెం జంక్షన్ వద్ద శనివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. భీమవరం గ్రామానికి చెందిన దేవండ్ల ప్రశాంత్ (28), కల్యాణ్, ఏడేళ్ల వయసున్న సాయికృష్ణ బైక్పై ఉలవపాడు నుంచి భీమవరం వెళ్లడానికి రాజుపాళెం జంక్షన్ వద్ద మలుపు తిరుగుతున్నారు. ఈ సమయంలో గూడూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న కారు ప్రశాంత్ బైక్ను వేగంగా ఢీకొట్టింది. తర్వాత రోడ్డుమార్జిన్ వైపునకు దూసుకొచ్చింది. ఈ సమయంలో రాజుపాళెం నుంచి ఉలవపాడుకు మరో బైక్పై వెళ్తున్న జొన్నాబత్తిన గిరి, మురళీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రశాంత్ మృతిచెందాడు. కల్యాణ్, సాయికృష్ణ తీవ్రంగా, మిగిలిన ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ సిబ్బంది ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉలవపాడులోని సీహెచ్సీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పథకాలు అందాలంటే జగనన్న రావాలి
గుడ్లూరు: ప్రభుత్వ పథకాలు సక్రమంగా ప్రజలకు అందాలంటే ముఖ్యమంత్రిగా జగనన్న రావాలని మాజీ ఎమ్మెల్యే, కందుకూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జి బుర్రా మధుసూదన్యాదవ్ అన్నారు. శనివారం మండలంలోని చేవూరులో ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ కార్యక్రమం నిర్వహించారు. ఆయన ప్రతి ఇంటికీ వెళ్లి బాబు మోసాలను తెలియజేస్తూ ప్రజలతో మాట్లాడారు. అంబేడ్కర్ను చూస్తే రాజ్యాంగం, అబ్దుల్ కలాంను చూస్తే రాకెట్లు, ఉపగ్రహాలు గుర్తుకు వచ్చినట్లు చంద్రబాబును చూస్తే దగా, నయవంచన గుర్తుకు వస్తాయన్నారు. బాబు ఎన్నో పథకాలు ఇస్తానని ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారన్నారు. వృద్ధులకు నూతన పెన్షన్ రాలేదన్నారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇవ్వలేదన్నారు. 50 ఏళ్లకే పెన్షన్ అని చెప్పి బడుగు, బలహీనవర్గాలను మోసం చేశారన్నారు. జగన్మోహన్రెడ్డి కన్నా ఎక్కువ పథకాలిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల గురించి పట్టించుకోవడం మానేశారన్నారు. సుపరిపాలన కాదు మోసపూరిత పరిపాలన తల్లికి వందనం తప్ప ఇంకా ఏ పథకం ఇవ్వలేదన్నారు. అది కూడా అరకొరగా ఇచ్చి కోతలు పెట్టారన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం పెట్టామన్నారు. కానీ ఆ డబ్బులు అందరికీ వేయడం లేదన్నారు. చంద్రబాబు ఇటీవల సుపరిపాలన అనే కార్యక్రమం పెట్టారని, అది మోసపూరిత పరిపాలన అన్నారు. ఎన్నికలప్పుడు ఎక్కువ సంక్షేమ పథకాలు అందిస్తామని హామీలిచ్చి అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని తెలియజేశారు. ప్రజలు కూడా ఈ ప్రభుత్వంలో పథకాలు సక్రమంగా అందడం లేదని, జగనన్న ఉన్నప్పుడే పథకాలు సక్రమంగా పడ్డాయని తెలియజేశారు. గడిచిన కాలంలో ప్రజలను ఎలా మోసం చేశారనేది క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఎంత నష్టపోయారని ప్రజలకు వివరించారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ పులి రమేష్, మండల అధ్యక్షుడు కాపులూరి కృష్ణయాదవ్, ఉపాధ్యక్షుడు బిళ్లా రమణయ్య, జిల్లా నాయకులు తోకల కొండయ్య, చీమలరాజా, రాష్ట్ర నాయకులు గణేశం గంగిరెడ్డి, నియోజకవర్గ నాయకులు నల్లమోతు చంద్రమౌళి, పాలవల్లి అమర్నాథ్రెడ్డి, షేక్ రహీమ్, చల్లా విఘ్నేష్, నక్కల శరత్, నక్కల రామకృష్ణ, ఎందేటి శేషయ్య, ఇమ్మని నరసింహారావు, ఎల్లంటి శ్రీను, ఏలియా, సుబ్బరాయుడు, నరసింహ, శ్రీను, మల్లికార్జున, రవికాంత్రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే, కందుకూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జి బుర్రా చేవూరులో బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ వైఎస్సార్సీపీ జెండా ఆవిష్కరణ -
పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ..
● తమిళనాడు వాసి సైకిల్ యాత్ర ఉదయగిరి: పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తమిళనాడులోని కోయంబత్తూర్కు చెందిన ముత్తు సెల్వన్ సైకిల్ యాత్ర చేపట్టారు. శనివారం ఉదయగిరికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు మూడు రాష్ట్రాల్లో యాత్ర పూర్తి చేసి విద్యార్థులకు, ప్రజలకు, పర్యావరణంపై అవగాహన సదస్సులు, కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. పెద్ద సంఖ్యలో మొక్కలు నాటామన్నారు. అన్ని రాష్ట్రాలతోపాటు ప్రపంచంలోని ఏడు దేశాల్లో యాత్ర చేస్తానన్నారు. -
నీ ఇంటికి వస్తా.. నీ అంతు చూస్తా..
కావలి (జలదంకి): పదేళ్లు ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలందించిన రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డిని ప్రస్తుత ఎమ్మెల్యే దగుమాటి కృష్ణారెడ్డి పరుష పదజాలంతో దూషించారు. చట్టసభలో శాసన సభ్యుడిగా ఉండి.. మారో మాజీ శాసన సభ్యుడిని నోటికొచ్చినట్లు, ఒక వీధి రౌడీలా మాట్లాడిన తీరుపై ప్రజలు యావగించుకుంటున్నారు. తుమ్మలపెంటలో గుర్తుతెలియని వ్యక్తులు జల్జీవన్ మిషన్ పథకానికి సంబంధించి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలాకాన్ని ధ్వంసం చేసిన నేపథ్యంలో పరిశీలించేందుకు శనివారం వచ్చారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి అదుపు తప్పి మాట్లాడుతూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతాప్రెడ్డి నీ అంతు చూస్తా, నీ ఇంటికి వస్తా. శవాల మీద పరిగలు ఏరుకునేవాడివి. నువ్వు నా వెంట్రుక, గోటికి కూడా పనికిరావు. నీ భార్యా పిల్లలతో కూర్చోని మాట్లాడుకో.. ఖబడ్దార్’ అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. అనంతపురం, బెంగళూరు నుంచి రౌడీలను తెచ్చి కావలిలోని లాడ్జిల్లో పెట్టి నీచ రాజకీయాలు చేస్తున్నాడని, కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేటట్లు చేయిస్తున్నాడని, కులాల మధ్య చిచ్చుపెట్లే రాజకీయాలు చేస్తున్నాంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి కృష్ణారెడ్డి మాట్లాడిన భాష ఏమిటని కావలి నియోజకవర్గ ప్రజల్లో చర్చ మొదలైంది. పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తిపై ఇలా వీధి రౌడీలా మాట్లాడడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ వాళ్లే శిలాఫలకాన్ని కూల్చి వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తి పొలంలో శిథిలాలు వేసి, తమపైనే అక్రమ కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తుమ్మలపెంట వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై కావలి రూరల్ పోలీసులను వివరణ కోరగా తమ్మలపెంట పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇద్దరు వైఎస్సార్సీపీ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారితో శిలాఫలకం కూల్చింది తామే అని చెప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్కుమార్రెడ్డిపై ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పరుష పదజాలం ఆ భాషపై సర్వత్రా విమర్శలు -
ఆస్పత్రుల రిజిస్ట్రేషన్, రెన్యువల్ తప్పనిసరి
● ప్రైవేట్ ఆస్పత్రుల్లో డీఎంహెచ్ఓ తనిఖీ నెల్లూరు (అర్బన్): ప్రైవేటు ఆస్పత్రులు, క్లినిక్లు నిర్వహిస్తున్న డాక్టర్లు తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీఎంహెచ్ఓ సుజాత తెలిపారు. నమోదు చేసుకుని గడువు ఐదేళ్లు పూర్తవుతున్న వారు ఒక నెల రోజులు మందుగానే ఆన్లైన్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా శనివారం డీఎంహెచ్ఓ సుజాత నగరంలోని నారాయణ, అపోలో, ఎనెల్ తదితర పలు ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా ఆస్పత్రుల్లో రోగులకు అందుతున్న సేవలు, వివరాల రికార్డులను పరిశీలించారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనల ప్రకారం నడుస్తున్నాయా.. లేదా తెలుసుకునేందుకు 13 మంది అధికారులను బృందాలుగా ఏర్పాటు చేసి ఈ నెల 13వ తేదీ వరకు తనిఖీలు జరిపిస్తున్నామన్నారు. ఆస్పత్రులను ఆంధ్రప్రదేశ్ అల్లోపతి క్లినికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ 2002 ప్రకారం నమోదు చేసుకోకుండా ఉంటే అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం తప్పనిసరిగా పొల్యూషన్, ఫైర్, బయోమెడికల్ వేస్టేజి లైసెన్సులు కలిగి ఉండాలన్నారు. ఆస్పత్రులు అందిస్తున్న సేవలు, అందుకు వసూలు చేస్తున్న ధరలు బోర్డులో ప్రదర్శించాలన్నారు. ఓపీ, ఐపీ రిజిస్టర్లు, కేస్షీట్లు పక్కాగా ఉండాలన్నారు. ఈ తనిఖీల్లో ఎపిడిమియాలజిస్ట్ డాక్టర్ భాస్కర్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. 21 నుంచి విద్యుత్ క్రీడాకారుల ఎంపిక నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఏపీఈపీడీసీఎల్ నేతృత్వంలో ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఇంటర్ సర్కిల్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా సర్కిల్ స్పోర్ట్స్, గేమ్స్ సెక్రటరీ రామస్వామివేలు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ఆసక్తి, అర్హత ఉన్న జిల్లా సర్కిల్లో విధులు నిర్వహిస్తున్న విద్యుత్ ఉద్యోగులు, జూనియర్ లైన్మెన్ గ్రేడ్–2 ఉద్యోగులు అర్హులని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల ఎంపిక ఈ నెల 11వ తేదీ ఉదయం 9 గంటలకు నగరంలోని స్టౌన్హౌస్పేటలోని మైడ్రీమ్ క్లబ్లో సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాలకు 90308 02038, 98851 84450 నంబర్లను సంప్రదించాలని కోరారు. రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్కు చాకిచర్ల విద్యార్థి ఉలవపాడు: రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్కు చాకిచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చైతన్యకృష్ణ ఎంపికై నట్లు వ్యాయామ అధ్యాపకుడు ఓగుబోయిన శ్రీనివాసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఈ నెల 10వ తేదీలో విశాఖపట్నం పోలీస్పరేడ్ గ్రౌండ్లో జరిగే సబ్ జూనియర్ షాట్ఫుట్ విభాగంలో నెల్లూరు జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు. నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన పారా స్పోర్ట్స్ క్రీడల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపికై నట్లు తెలిపారు. విద్యార్థి ఎంపిక కావడంతో హెచ్ఎం జనార్దన్ అభినందనలు తెలిపారు. -
లులు సంస్థతో లాలూచీలు ఆపండి
నెల్లూరు సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థ అయిన లులుకు రూ.400 కోట్లు విలువ చేసే స్థలాన్ని కట్టబెట్టే ప్రయత్నాన్ని విరమించుకోవాలని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. నగరంలోని ఆర్టీసీ ప్రాంగణంలోని ఆ యూనియన్ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎ. నారాయణరావు, జిల్లా కార్యదర్శి ఓవీ ప్రసాద్ మాట్లాడారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న గవర్నర్పేట–1, 2 డిపోలకు సంబంధించిన రూ.400 కోట్లు విలువ చేసే స్థలాలను 99 ఏళ్లకు తక్కువ లీజుకు లులు సంస్థకు కట్టబట్టడాన్ని తప్పుపట్టారు. లీజుకి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 174 జీఓను వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ సెక్రటరీ బీ మాలాద్రి, జిల్లా ప్రచార కార్యదర్శి వీఎస్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు ఏ వెంకటేశ్వర్లు, నానో ఆపరేషన్ నాయకులు ఎం పాపయ్య, రాష్ట్ర మెయింటినెన్స్ కమిటీ సభ్యులు అశోక్కుమార్, నెల్లూరు–1 డిపో అధ్యక్షుడు మల్లికార్జున, కార్యదర్శి ఎం.పెంచలయ్య, నెల్లూరు–2 డిపో కార్యదర్శి కే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రూ.400 కోట్ల స్థలాన్ని కట్టబెట్టే ప్రయత్నం విరమించుకోవాలి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు -
80 శాతం బియ్యం బ్లాక్ మార్కెట్కే..
సాక్షి, టాస్క్ఫోర్స్: ఆత్మకూరు నియోజకవర్గం డెల్టా, మెట్ట ప్రాంతంగా ఉంది. ఇక్కడి పేద ప్రజలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యంలో 80 శాతానిపైగా బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నట్లు సమాచారం. ఆత్మకూరు పట్టణంలోని పలు రేషన్ దుకాణాదారుల నుంచి కేజీ రూ.10 కొనుగోలు చేసి ఏజెంట్లకు రూ.15 చొప్పున విక్రయిస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని టెంకాయతోపు రహస్య ప్రాంతంలో స్టాక్ చేసి రాత్రి వేళల్లో మినీ వ్యాన్ల ద్వారా కావలి, నెల్లూరు, తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనంతసాగరం మండలంలో వెంగంపల్లి, చిలకలమర్రి గ్రామాల్లో సేకరించిన రేషన్ బియ్యాన్ని స్టాక్ ఉంచి వారం రోజులకొకసారి నెల్లూరు శివార్లలోని రైస్మిల్లులకు తరలిస్తుంటారు. రెండు రోజుల క్రితం అనంతసాగరం మండలం నుంచి తరలించిన 9.5 టన్నుల రేషన్ బియ్యాన్ని కోవూరు సమీపంలో పట్టుకున్న విషయం తెలిసిందే. రేషన్ బియ్యం పంపిణీ మొదలు పెట్టిన వారం రోజులకే (7వ తేదీ నాటికే) ఒక అనంతసాగరం మండలం నుంచే తొమ్మిదిన్నర టన్నుల రేషన్ సేకరించారంటే మిగిలిన మండలాల్లో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. మంత్రి ఆనం ప్రాతినిథ్యం వహించే అనంతసాగరం మండలంలో బుట్టి మహేష్రెడ్డి అనే వ్యక్తి ప్రధాన సూత్రదారుడిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఆయన ఆధ్వర్యంలో కృష్ణారెడ్డి, గోపాల్రెడ్డి, సుబ్బారెడ్డి, వేముల రెడ్డి ఈ బియ్యాన్ని సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరో బ్యాచ్కు చెందిన నలుగురు వ్యక్తులు కొత్తగా రేషన్ బియ్యాన్ని సేకరించే పని మొదలు పెట్టారని సమాచారం. గతంలోనూ వెంగంపల్లి కేంద్రంగా టీడీపీ నాయకులు రేషన్ బియ్యం దందా కొనసాగిస్తూ పట్టుబడిన విషయం తెలిసిందే. -
నెలకు 913 టన్నుల బియ్యం పక్కదారి
పేదలకు చేరాల్సిన బియ్యం పచ్చ మాఫియాలకు వ్యాపారంగా మారింది. ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లో పచ్చనేతల రేషన్ బియ్యం దందా ఆకాశమే హద్దుగా సాగుతోంది. అధికారుల అండదండలతో గోదాముల నుంచే దోపిడీకి తెరతీస్తున్నారు. రాత్రివేళల్లో టన్నుల కొద్దీ బియ్యం మిల్లులకు తరలిపోతున్నా.. ప్రతి నెలా రూ.కోట్లు చేతులు మారుతున్నా సివిల్ సప్లయీస్, పోలీస్, విజిలెన్స్ శాఖలు పచ్చ మాఫియా బియ్యం బండ్లకు పచ్చజెండా ఊపుతున్నారు. రేషన్ బియ్యానికి పాలిష్ పట్టి.. బ్రాండెడ్ బ్యాగుల్లో ప్యాకింగ్ చేసి మార్కెట్లో అత్యధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారు. రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టించడం కోసమే నెల్లూరు, కోవూరు, కావలి, కందుకూరుల్లో ప్రత్యేకంగా రైస్ మిల్లులు ఉన్నాయి. ● ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లో వ్యాపారం ● ఇందు కోసమే ప్రత్యేకంగా కొన్ని మిల్లులు ● ఆ విషయం తెలిసినా సివిల్ సప్లయీస్, విజిలెన్స్ పట్టించుకోని వైనం ● ప్రతి నెలా 70 శాతం బియ్యం ఇతర రాష్ట్రాలకు, దేశాలకు అక్రమ రవాణా ● పాలిష్ పట్టి అధిక ధరలకు విక్రయం ● స్థానికులు సమాచారంతో పట్టుకున్నా నిబంధనలకు విరుద్ధంగా సీఎస్ డీటీలే రిలీజ్ ● జేసీ అధికారాలను లాగేసుకుంటున్న సీఎస్ డీటీలు సాక్షి, టాస్క్ఫోర్స్: సర్వేపల్లి నియోజకవర్గంలోని 205 రేషన్ షాపుల ద్వారా బియ్యం అక్రమ రవాణా నిరాటంకంగా జరుగుతూనే ఉంది. 91,371 మంది కార్డు హోల్డర్లలో కొందరు నేరుగా రేషన్ షాపుల డీలర్లకే అమ్ముకుని నగదు తీసుకుంటున్నారని సమాచారం. మరికొందరు ఆటోల్లో ఇళ్లకు వచ్చి బియ్యం కొనుగోలు చేసే వారికి అమ్ముకుంటున్నారు. డీలర్లు కిలోకు రూ.12 ఇస్తుండగా, ఇళ్లకు వచ్చి సేకరించే వారు రూ.15 కొనుగోలు చేస్తున్నారు. పొదలకూరు చుట్టు పక్కల ప్రాంతాల్లో రేషన్ బియ్యం కొనుగోలు చేసేందుకు ఓ ఏజెంట్ ఉన్నాడు. ఆయనకే డీలర్లు తాము సేకరించిన బియ్యాన్ని అందజేయాల్సి ఉంటుంది. తోటపల్లిగూడూరు, ముత్తుకూరు పరిసర ప్రాంతాల్లో మరికొందరు ఏజెంట్లు ఉన్నారు. మనుబోలు, వెంకటాచలం మండలాల నుంచి రేషన్ బియ్యం సేకరించేందుకు నెల్లూరు చెందిన ఏజెంట్లు వస్తున్నట్లు తెలిసింది. ప్రతినెలా సగటున 913 టన్నుల బియ్యం పక్కదారి పడుతున్నట్లు ప్రచారం ఉంది. రూ.లక్షల్లో రేషన్ బియ్యం వ్యాపారాన్ని సాగిస్తున్నారు. పొదలకూరు మీదుగా వెంకటగిరి, కలువాయి మండలాల నుంచి కూడా నెల్లూరు మిల్లులకు అక్రమంగా రాత్రి వేళల్లో తోలుతున్నారు. గతంలో పొదలకూరు పోలీసులకు అక్రమం రేషన్ బియ్యం తోలుతున్న పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి. నెల్లూరు(పొగతోట): పచ్చ నేతల అండదండలతో రేషన్ మాఫియా రెచ్చిపోతోంది. పేద ప్రజల బియ్యం భారీ స్థాయిలో అక్రమ రవాణా జరుగుతోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం అండగా నిలుస్తోంది. గతంలో చాటుమాటుగా సాగే ఈ వ్యాపారం ప్రస్తుతం బహిరంగంగానే జరుగుతోంది. ఈ రేషన్ మాఫియా నేరుగా ఎంఎల్ఎస్ పాయింట్ల గోడౌన్ల నుంచే బియ్యాన్ని నేరుగా మిల్లులకు తరలించే స్థాయికి ఏ స్థాయికి బరితెగించింది. ముఖ్యంగా జిల్లాలో ఎమ్మెల్యేలు, మంత్రుల కనుసన్నల్లోనే ఈ వ్యాపారం జరుగుతోంది. ప్రధానంగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ సమీప బంధువు సివిల్ సప్లయీస్ శాఖ డైరెక్టర్గా ఉండడంతోపాటు ఈ మాఫియాకు కీలక నేతగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ రవాణాతో రూ.కోట్లల్లో దందా ఈ మాఫియా అధికార యంత్రాంగాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టి ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు తరలించి రూ.కోట్లు గడిస్తోంది. గతంలో బియ్యం అక్రమ రవాణాకు మాఫియా డాన్గా వ్యవహరించిన కీలక వ్యక్తికి షిప్ (ఓడ)లో 20 శాతం వాటా ఉంది. అధికార పార్టీకి చెందిన ఒక సామాన్యమైన వ్యక్తి ఓడలో పార్టనర్ స్థాయికి ఎదిగాడంటే, దీన్ని బట్టి బియ్యం అక్రమ రవాణా ఏస్థాయిలో జరుగుతుందో ఇట్టే అర్థమవుతోంది. జిల్లా నలుమూలల నుంచి, ప్రకాశం, కడప, తిరుపతి జిల్లాల నుంచి అక్రమంగా తరలించిన రేషన్ బియ్యాన్ని నెల్లూరు నగరంలోని రైస్ మిల్లుల్లో పాలిష్ పడుతున్నారు. నగరంలో ఉన్న 100కు పైగా రైస్ మిల్లుల్లో సుమారు 15 పెద్ద రైస్ మిల్లులు పేదల బియ్యం పాలిష్ మాత్రమే పట్టుతాయి. ఆయా రైస్ మిల్లుల్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయరు.. మిల్లింగ్ చేయరు. ప్రతి నెలా మామూళ్లు జిల్లా వ్యాప్తంగా 1,513 చౌకదుకాణాలు ఉన్నాయి. 7.21 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. చౌకదుకాణాల ద్వారా ప్రతి నెలా 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరికీ ప్రతి నెలా మామూళ్లు అందుతున్నాయి. ప్రతి డీలర్ నెల్లూరు ఎన్టీఆర్నగర్కు చెందిన ఈ మాఫియా డానుకు మాత్రమే బియ్యం ఇవ్వాలని తీర్మానం చేశారు. ఆయా నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులకు ప్రతి నెలా రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలు ముడుపులు అందుతున్నాయి. అధికారులకు, పోలీసులకు, విజిలెన్స్ అధికారులకు మామూళ్లు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బియ్యం సేకరణ ప్రతి నెలా కార్డుల సంఖ్య అధారంగా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి చౌకదుకాణాలకు రేషన్ సరఫరా చేస్తారు. చౌకదుకాణాల డీలర్లు ప్రతి నెలా 25 నుంచి 30వ తేదీ వరకు దివ్యాంగులు, 65 ఏళ్ల వయస్సు దాటిన కార్డుదారులకు ఇంటింటికి వెళ్లి బియ్యం పంపిణీ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటువంటి లబ్ధిదారులు 92 వేల మంది ఉన్నారు. డీలర్లు దివ్యాంగులు, వృద్ధుల పేరు చెప్పి చుట్టుపక్కల ఉండే కార్డుదారులకు బియ్యం పంపిణీ చేసినట్లు వేలిముద్రలు వేయించుకుని నగదు ఇస్తున్నారు. కార్డుదారుల నుంచి కేజీ బియ్యం రూ.12 నుచి రూ.13లకు డీలర్లు కొనుగోలు చేస్తున్నారు. డీలర్లు సేకరించిన బియ్యాన్ని మాఫియా డాన్కు కేజీ రూ.17 నుంచి రూ.20లకు విక్రయిస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని పాలిష్ పట్టి బహిరంగ మార్కెట్లో కేజీ రూ.50 నుంచి రూ.60లకు విక్రయిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ విధులు సీఎస్డీటీలు వాహనాలు, లారీలను తనిఖిలు చేసే అధికారం సీఎస్డీటీలకు ఉన్నాయి. అనుమానం వచ్చిన వాహనాలను పట్టుకున్న సమయంలో బయట వ్యక్తులు ఆరుగురి ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించాలి. వారి సమక్షంలో శాంపిల్స్ సేకరించాలి. అవి పీడీఎస్, నాన్ పీడీఎస్ అని నిర్ధారణ కోసం డీఎం కార్యాలయానికి పంపించాల్సి ఉంది. అప్పటి వరకు వాహనాన్ని పోలీసు స్టేషన్కు తరలించాల్సి ఉంది. పీడీఎస్ అయితే కేసు నమోదు చేసి పట్టుకున్న బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించాలి. నాన్ పీడీఎస్ బియ్యం అయితే వాహనానికి జాయింట్ కలెక్టర్ రిలీజింగ్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంది. దీనికి సంబంధించి ఫైల్ నిర్వహించాల్సి ఉంది. ఈ మధ్య కాలంలో రెండు వాహనాలకు పట్టుకున్న అఽధికారులు జాయింట్ కలెక్టర్ అనుమతి లేకుండా సీఎస్డీటీలే రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చేశారు. జాయింట్ కలెక్టర్ విధులను సైతం సీఎస్డీటీలు లాగేసుకోవడం వెనుక అధికార పార్టీ నేతలు, రేషన్ మాఫియా అండదండలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతసాగరం నుంచి తరలిస్తుండగా పట్టుకొన్న రేషన్ బియ్యం మినీ లారీ (ఫైల్) కోవూరు: నియోజకవర్గంలో కోవూరు, కొడవలూరు, ఇందుకూరుపేట, విడవలూరు, బుచ్చిరెడ్డిపాళెంల్లో మొత్తం 208 రేషన్ షాపులు, 98,600 కార్డులు ఉన్నాయి. సివిల్ సప్లయీస్ శాఖ డైరెక్టర్ కోవూరు నియోజకవర్గ నేత కావడంతో చంద్రశేఖరపురంలోని ఓ రైస్ మిల్లును అడ్డాగా చేసుకుని ఇక్కడ రేషన్ దందా సాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నెలకు సగటున 980 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతున్నాయి. గత ప్రభుత్వంలో ఇంటివద్దకే రేషన్ బియ్యం సరఫరా జరిగేది. దీంతో ఎక్కడా బియ్యం పక్కదారి పట్టేందుకు అవకాశం లేకుండాపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ షాపులనే కబ్జా చేసిన మాఫియా నేరుగా ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి, రేషన్ షాపుల నుంచి బహిరంగంగా తరలిస్తున్నారు. చాలా మంది షాపుల వద్దకు వెళ్లి బియ్యం తెచ్చుకోకపోవడంతో ఇది అక్రమార్కులకు అనుకూలంగా మారింది. కొంతమంది డీలర్లు మీరు రేషన్ బియ్యం తినరు కదా మీకెందుకు బియ్యం వాటి బదులు కేజీకి రూ.10 డబ్బులిస్తామంటూ బేరం మాట్లాడుకొంటున్నారు. గతంలో బుచ్చిరెడ్డిపాళెంలోని కొట్టాల దగ్గర ఉన్న రైస్మిల్లు ఉంది. కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురం వద్ద ఓ రైస్ మిల్లు, కోవూరు మండలంలోని జమ్మిపాళెం రోడ్డులో ఉన్న రైసుమిల్లులకు తరలించి పాలిష్పట్టించి, బ్రాండెడ్ బ్యాగుల్లో ప్యాక్ చేసి పోర్టుల ద్వారా విదేశాలకు, తమిళనాడుకు తరలిపోతున్నాయి. రేషన్ గోడౌన్ల నుంచే దోపిడీ దందా చంద్రశేఖరపురం మిల్లులో పాలిష్ కఠిన చర్యలు తీసుకుంటాం బియ్యం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బియ్యం అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక దృష్టి సారిస్తాం. బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. టోల్ప్లాజాల వద్ద రాత్రి సమయాల్లో తనిఖిలు నిర్వహిస్తున్నాం. ఫిర్యాదులు అందితే వెంటనే స్పందించి తనిఖిలు నిర్వహించి వాహనాలను సీజ్ చేస్తున్నాం. – విజయకుమార్, డీఎస్ఓ రెండు రోజుల కిందట అనంతసాగరం మండలం నుంచి కోవూరు సమీపంలోని రైస్ మిల్లుకు తరలిస్తున్న 190 బస్తాల (9.5 టన్నులు) రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. చౌకదుకాణాల ద్వారా రేషన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమై మొదటి వారంలోనే ఒక రేషన్ షాపు నుంచి ఈ స్థాయిలో బియ్యం అక్రమ రవాణా చేశారంటే పరిస్థితి అర్థమవుతోంది. బియ్యం మాఫియా డాన్కు గుడిపల్లిపాడులో సొంత రైస్ మిల్లుతోపాటు మరో మూడు రైస్ మిల్లులను లీజుకు తీసుకుని బియ్యం పాలిష్ పట్టేందుకు మాత్రమే నిర్వహిస్తున్నాడు. ఉదయగిరి, కావలి, కందుకూరు, ఆత్మకూరు, కలువాయి, రాపూరు, వింజమూరు, పొదలకూరు తదితర ప్రాంతాల నుంచి బియ్యం సేకరిస్తున్నారు. ఆ బియ్యాన్ని గోదాము లు, నిమ్మ, మామిడి, బత్తాయి తోట్ల నిల్వ ఉంచు తున్నారు. రాత్రి సమయాల్లో సమయం చూసుకుని నెల్లూరులోని రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. -
పేదల కడుపు కొడుతున్న పచ్చ నేతలు
ఉదయగిరి: ఉదయగిరి నియోజకవర్గంలో 246 చౌక దుకాణాల పరిధిలో సుమారు 89 వేల రేషన్ కార్డులు ఉన్నాయి. రేషన్ డీలర్లు దళారులను ఏర్పాటు చేసుకుని లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి కావలి, కొడవలూరు, నెల్లూరుల్లో రైస్మిల్లులకు తరలిస్తున్నారు. వీరికి స్థానికంగా పోలీసులు, సివిల్ సప్లయీస్ శాఖలు అండగా ఉంటున్నాయి. అక్కడి నుంచి ముత్తుకూరు పోర్టుకు చేర్చి శ్రీలంకతోపాటు ఆఫ్రికన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారని సమాచారం. ఉదయగిరి నియోజకవర్గం నుంచి పీడీయస్ బియ్యాన్ని కావలి, జలదంకి మండలాలకు చెందిన ఇద్దరు వ్యాపారులు సేకరించి అక్రమంగా బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్థానిక వ్యాపారులు డీలర్లు, లబ్ధిదారుల నుంచి రూ.15 వరకు కేజీ బియ్యం కొనుగోలు చేస్తారు. వారు రేషన్ వ్యాపారం చేసే అక్రమార్కులకు రూ.21లకు అమ్ముతారు. వారు రేషన్ మాఫియాకు రూ.29లకు విక్రయిస్తారు. మూడు నెలల క్రితం జలదంకి మండలానికి చెందిన ఓ పచ్చ నేత అక్రమంగా బియ్యం తరలిస్తుండగా చామదలలో స్థానికులు పట్టించారు. కానీ పోలీసులు లారీలో ఉన్న సరుకులో కొంత భాగం అటోకు ఎక్కించి లారీలో సరుకు బిట్రగుంటలోని ఓ రైస్మిల్లుకు తరలించి నేర తీవ్రతను తగ్గించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. రెండు నెలల క్రితం కొండాపురం మండలం మర్రిగుంటలో అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యంను పోలీసులు పట్టుకుని, బొలేరో వాహనం సీజ్ చేసి కేసు నమోదు చేశారు. -
ఆయిల్పామ్ రైతుల విలవిల
వింజమూరు, కొండాపురం, దుత్తలూరు, జలదంకి, ఆత్మకూరు, ఏఎస్పేట, వెంకటాచలం, పొదలకూరు, చేజర్ల, కలువాయి, దగదర్తి, బాలాయపల్లి, వెంకటగిరి, దొరవారిసత్రం. ఉద్యాన పంటల్లో ప్రసిద్ధి గాంచిన ఆయిల్పామ్ సాగు విషయంలో ప్రభుత్వ విధానాల్లో స్థిరత్వం లేక రైతులు ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. ఇటీవల 10 శాతం దిగుమతి సుంకాన్ని తగ్గించడం సాగుదారుల పాలిట శాపంగా మారింది. దీంతో టన్ను ధర తగ్గడంతో నష్టపోతున్నారు.● దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించిన ప్రభుత్వం ● టన్నుకు రూ.3,600 వరకు నష్టం ● ఆందోళనలో సాగుదారులు ● కనీస ధర రూ.22 వేల కోసం డిమాండ్ సాగు ఎక్కడంటే.. ఉదయగిరి: ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఆయిల్పామ్ 7,500 ఎకరాల్లో ఉంది. జిల్లాలో పాతికేళ్ల నుంచి ఈ పంట సాగు చేస్తున్నారు. మొదట్లో సాగు బాగున్నా, మధ్యలో ధరల్లో ఒడిదుడుకుల వల్ల రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. కొన్నిచోట్ల తోటలు తొలగించి ప్రత్యామ్నాయ పంటలు వేశారు. గత నాలుగేళ్ల నుంచి ధరలు ఆశాజనకంగా ఉండటం, ప్రభుత్వం రాయితీ ఇవ్వడంతో సాగుపై రైతులు ఆసక్తి చూపారు. ధర పతనం గెలల ధర పడిపోతుండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాం 2022లో టన్ను గెలలకు అత్యధికంగా రూ.22,500 ధర లభించింది. ఇప్పటి వరకు ఇదే రికార్డు ధర. అయితే వివిధ కారణాలతో 2023, 2024 సంవత్సరాల్లో గెలల సగటుఽ ధర ఏ దశలోనూ రూ.15 వేలకు చేరుకోలేదు. కాగా ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు టన్ను రూ.20 వేలు దాటింది. అయితే కేంద్ర ప్రభుత్వం పామాయిల్పై దిగుమతి సుంకం 27 శాతం నుంచి 10 శాతానికి తగ్గించడం రైతులకు శాపంగా మారింది. ఆయిల్ కంపెనీలు వివిధ దేశాల నుంచి తక్కువ ధరకు పామాయిల్ దిగుమతి చేసుకుంటున్నాయి. ఫలితంగా దేశీయంగా ఉత్పత్తి అవుతున్న గెలల ధర రూ.20,935 నుంచి ఏకంగా రూ.17,340కు పడిపోయింది. ప్రభుత్వం ఇలాగే దిగుమతి సుంకాన్ని కొనసాగిస్తే ధరలు మరింత దిగజారే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. కేంద్ర వ్యవసాయ ధరల నిర్ణాయక కమిటీ సూచించిన విధంగా ఆయిల్పామ్ గెలల కనీస ధర టన్నుకు రూ.22 వేలుగా నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు.ఏడు నెలలుగా ఆయిల్పామ్ గెలల ధరలు (టన్ను) -
వృత్తి చేపల వేట.. ప్రవృత్తి నాటకాలు
కందుకూరు రూరల్: అవనిగడ్డ నాగేశ్వరరావు.. ఈయన వృత్తి సముద్రంలో చేపలు పట్టడం.. ప్రవృత్తి స్టేజీపై నాటకాలు ఆడటం.. నేర్పించడం. బ్రహ్మంగారి నాటకంపై ఆసక్తి పెంచుకుని సిద్ధయ్య పాత్రలో నటిస్తూ.. దర్శకుడిగా కూడా రాణిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఉలవపాడు మండలం రామాయపట్నంలో పల్లెపాళేనికి చెందిన అవనిగడ్డ వెంకటేశ్వర్లు –నాగమ్మలకు పదిమంది పిల్లలున్నారు. వీరిలో మూడో సంతానమైన నాగేశ్వరరావు ఆరో తరగతి వరకే చదివాడు. నాటకాలపై ఆసక్తి పెరగడంతో పెదగంజాంకు చెందిన ఎం.సుబ్బారెడ్డి అనే గురువు వద్ద నేర్చుకున్నారు. సుదన్వార్జున డ్రామాలో నారదుడి పాత్ర వేశాడు. అందులో నాగేశ్వరరావు ప్రతిభ చూసిన గురువు బ్రహ్మంగారి నాటకంలో సిద్ధయ్య పాత్రకు సిద్ధం చేశారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో సుమారు 80 ప్రదర్శనలిచ్చారు. సిద్ధయ్య పాత్ర చేస్తూనే బ్రహ్మంగారి నాటకంపై మంచి పట్టు సాధించి దానికి దర్శకుడిగా మారాడు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో 25 గ్రూపులకు నేర్పించాడు. ముందుండి.. నాటక ప్రదర్శనలో ఏదైనా పాత్రకు వేషధారుడు లేకపోతే నాగేశ్వరరావు పూర్తి చేసేవాడు. కుటుంబ జీవనం కోసం చేపల వేటకు వెళ్తూనే మరోవైపు నాటకాలు నేర్పిస్తున్నాడు. బ్రహ్మంగారి నాటకం గ్రూపులో సుమారు పదిహేను మంది పాత్రధారులుంటారు. వారికి పద్యాలతోపాటు, ఆటపాటలతో నటన నేర్పించాలి. ఒక్కో గ్రూపునకు 3 నుంచి 4 నెలల వరకు సమయం పడుతుంది. ఇంటి నుంచి వెళ్లాడంటే ఆరునెలలకు ఒకసారి తిరిగొస్తాడు. అదే విధంగా గ్రామంలో ఉచితంగా పంచాంగం చూసి మూహుర్తాలు చెబుతుంటాడు. కందుకూరులోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ‘తప్పిపోయిన కుమారుడు’ నాటిక పుస్తకావిష్కరణ శనివారం జరగనుంది. ఇందులో నాగేశ్వరరావును సన్మానించనున్నారు.పౌరాణిక నాటకాలు అంతరించిపోతున్నాయిపౌరాణిక నాటకాలు అంతరించిపోతున్నాయి. బ్రహ్మంగారి నాటకం, చెంచులక్ష్మి, చింతామణి ప్రదర్శనలు కరువయ్యాయి. టీవీలు, సెల్ఫోన్లతో కాలం గడిపేస్తున్నారు. నాటకాలపై ఆసక్తి ఉన్న మాలాంటి వారు నేర్పిస్తామన్నా ఆసక్తి చూపడం లేదు. ఎక్కడో కొందరు మాత్రమే నేర్చుకుంటున్నారు. – అవనిగడ్డ నాగేశ్వరరావు బ్రహ్మంగారి నాటకంలో సిద్ధయ్య పాత్రలో 80 ప్రదర్శనలు దర్శకుడిగా 25 గ్రూపులకు శిక్షణ -
ట్యాంకర్ను ఢీకొట్టిన మినీలారీ
● డ్రైవర్ మృతి ఉలవపాడు: చెట్లకు నీరు పట్టే హైవే అథారిటీ ట్యాంకర్ను మినీలారీ ఢీకొట్టడంతో డ్రైవర్ మృతిచెండాడు. ఈ ఘటన జాతీయ రహదారిపై వీరేపల్లి జంక్షన్ వద్ద శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. తమిళనాడుకు చెందిన మినీలారీ చైన్నె నుంచి విజయవాడకు వెళ్తోంది. వీరేపల్లి వద్ద చెట్లకు ట్యాంకర్ ద్వారా నీరుపడుతున్నారు. మినీలారీ వేగంగా వచ్చి ట్యాంకర్ను వెనుక నుంచి ఢీకొట్టింది. మినీలారీ డ్రైవర్ మహ్మద్ రియాజ్ (35)కు తీవ్రగాయాలయ్యాయి. 108 అంబులెన్స్ సిబ్బంది అతడిని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనా స్థలాన్ని ఎస్సై అంకమ్మ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలలో ఉంచారు. -
డిమాండ్ ఉంటుంది
ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం అనేక రాయితీలు ఇస్తోంది. ఉచితంగా మొక్కలు పంపిణీ చేస్తున్నాం. అంతర పంటల సాగుకు ఎకరాకు రూ.5,200 చొప్పున నాలుగేళ్లపాటు ఇస్తున్నాం. వింజమూరు, దుత్తలూరు మండల కేంద్రాలల్లో గెలల సేకరణ కేంద్రం ఉంది. త్వరలో కలిగిరి మండలం కొత్తపేటలో మూతబడిన ఫ్యాక్టరీని పునరుద్ధరించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మెట్ట ప్రాంత రైతులకు ఆయిల్పామ్ సాగు లాభాలు కురిపిస్తోంది. మన దేశంలో ఎప్పుడూ పామాయిల్కు డిమాండ్ ఉంటుంది. అందువల్ల ధరలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – జయశ్రీ, ఉద్యానాధికారిణి, ఉదయగిరి -
లారీ ఢీకొని యువకుడి దుర్మరణం
● మరో వ్యక్తికి గాయాలు మర్రిపాడు: మండల కేంద్రమైన మర్రిపాడు హెచ్పీ పెట్రోల్ బంకు సమీపంలో శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. ఆత్మకూరు మండలం రామస్వామిపల్లి నుంచి మోటార్బైక్పై మహమ్మద్ (20), ఆకాష్ బద్వేల్కు బయలుదేరారు. మర్రిపాడులోని నెల్లూరు – ముంబై జాతీయ రహదారి సమీపంలో హెచ్పీ పెట్రోల్ బంకు సమీపంలో గుర్తుతెలియని లారీ బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో మహమ్మద్ మృతిచెందగా ఆకాష్ గాయపడ్డాడు. సమాచారం అందుకున్న మర్రిపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ ఆగకుండా వెళ్లిపోయింది. -
ఆర్టీసీ బస్టాండ్లో గంజాయి స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు దాడులు చేశారు. పోలీసుల వాహనాన్ని చూసి ఇద్దరు నిందితులు పరారవగా ఇద్దరు చిక్కారు. శుక్రవారం చిన్నబజారు పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు నిందితుల వివరాలను వెల్లడించారు. తమిళనాడుకు చెందిన నాగప్పన్ మణికంఠ, ఓ బాలుడు మద్యం, గంజాయికి బానిసై నిత్యం మత్తులో తేలుతున్నారు. వారి వ్యసనాలను తీర్చుకునేందుకు సరిపడా నగదు కోసం గంజాయి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఇప్పటికే విక్రయాలు చేస్తున్న చైన్నె సెంట్రల్కు చెందిన సూర్య, ఎలన్ జరియన్ను కలిశారు. అందరూ కలిసి ఈనెల 7వ తేదీ నవజీవన్ ఎక్స్ప్రెస్లో కావలికి చేరుకున్నారు. అక్కడ గుర్తుతెలియని వ్యక్తి నుంచి రెండు కేజీల గంజాయిని కొనుగోలు చేశారు. అనంతరం నలుగురూ కలిసి ఆర్టీసీ బస్సులో నెల్లూరుకు వచ్చారు. చైన్నె వెళ్లేందుకు బస్సు కోసం వేచిచూడసాగారు. పక్కా సమాచారంతో.. పోలీస్ వాహనాన్ని చూసి ఇద్దరి పరారీ మరో ఇద్దరిని పట్టుకుని స్టేషన్కు తరలింపుఆర్టీసీ బస్టాండ్లో గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావుకు సమాచారం అందింది. ఆయన ఆదేశాల మేరకు ఎస్సై అయ్యప్ప తన సిబ్బందితో కలిసి బస్టాండ్కు చేరుకున్నారు. పోలీసుల వాహనాన్ని చూసి నిందితులు పరారవగా వెంబడించారు. నాగప్పన్ మణికంఠ, మైనర్ బాలుడు చిక్కగా మరో ఇద్దరు మాత్రం పరారయ్యారు. పట్టుబడిన నిందితుల నుంచి రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మణికంఠను అరెస్ట్ చేయగా, బాలుడిని జువనైల్ హోంకు తరలించారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
జల్జీవన్ మిషన్ పథకం శిలాఫలకం ధ్వంసం
కావలి (జలదంకి): కావలి మండలం తుమ్మలపెంటలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం జల్జీవన్ మిషన్ పథకం నిర్మాణానికి ఆవిష్కరించిన శిలాఫలకాన్ని గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో రూ.33 కోట్ల నిధులతో జల్జీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలనే లక్ష్యంతో పథకానికి శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కొంతమేర పనులు జరిగాయి. తర్వాత ఎన్నికలు రావడంతో ఆ పనులు నిలిచిపోయాయి. అయితే శిలాఫలకంలో వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకుల పేర్లు ఉన్నాయి. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు శిలాఫలకాన్ని రాత్రికి రాత్రి కూల్చి వేశారని స్థానిక వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. -
వరాలిమ్ము... వరలక్ష్మి
శ్రావణ శుక్రవారం సందర్భంగా సంప్రదాయాలను అనుసరించి వరలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. శుభదాయకమైన ఈ పవిత్రమైన రోజున మహిళలు తెల్లవారుజామునే లేచి కలశాలను అలంకరించి, అష్టైశ్వర్యాలు కలిగించే అష్టలక్ష్ములను ఆరాధించారు. సంప్రదాయ వస్త్రధారణతో ఆలయాలను సందర్శించారు. నెల్లూరు నగరంలోని రాజరాజేశ్వరి ఆలయం, ఇరుకలల పరమేశ్వరి ఆలయం, ఫత్తేఖాన్పేటలోని మహాలక్ష్మి ఆలయం, మాగుంటలేవుట్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. ఆలయాలన్నీ రంగురంగుల పుష్పాల తోరణాలతో అంగరంగ వైభవంగా అలంకరించారు. మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు చేసి, సువాసిత ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ఇంటింటా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి, కలశాలను స్వర్ణలంకారాలతో, పుష్పాలతో అలంకరించి వ్రతకథ పఠించారు. కుటుంబ శ్రేయస్సు, భర్త దీర్ఘాయువు, సంతానాభివృద్ధి కోసం మహిళలు దీక్షగా ఉపవాసం ఆచరించి అమ్మవారిని ప్రార్థించారు. పలు ఆలయాల్లో హారతులు, మంగళకరమైన భక్తిగీతాలతో ఆధ్యాత్మికత నిండిపోయింది. వరలక్ష్మి వ్రతం భక్తుల జీవితాల్లో సిరిసంపదలు నింపాలని మహిళలు ఆకాంక్షించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్స్, నెల్లూరు -
గంగా కావేరి ఎక్స్ప్రెస్ రైల్లో పొగలు
● బోగీల్లోంచి దూకేసిన ప్రయాణికులు మనుబోలు: బిహార్లోని చాప్రా నుంచి చైన్నె వెళ్తున్న గంగా కావేరి (నంబరు 12670) ఎక్స్ప్రెస్ రైల్లో బ్రేక్ బైండింగ్ కారణంగా పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ అప్రమత్తమై రైలు ఆపడంతో ప్రయాణికులు బోగీల్లోంచి దిగేశారు. ఈ ఘటన మనుబోలు సమీపంలో రైల్వే ట్రాక్పై శుక్రవారం జరిగింది. రైలు మనుబోలు చెరువు సమీపంలోకి వచ్చే సరికి ఇంజిన్ వెనుక బోగీ కింద నుంచి భారీగా పొగలు రావడంతో గమనించిన డ్రైవర్ ఆపారు. సమాచారం అందుకున్న రైల్వే సాంకేతిక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేపట్టారు. సుమారు అర్ధగంట పాటు రైలు ఆగిపోయింది. మరమ్మతుల అనంతరం రైలు చైన్నె బయలుదేరింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరిగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొందరు ప్రయాణికులు నడుచుకుంటూ కాగితాలపూరు క్రాస్రోడ్డు, మనుబోలుకు చేరుకుని గమ్యస్థానాలకు వెళ్లారు. ఉత్సాహంగా క్రీడాకారుల ఎంపిక నెల్లూరు (స్టోన్హౌస్పేట): హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్చంద్ జయంతి పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఎంపికల్లో క్రీడాకారులు ఉత్సాహంగా హాజరయ్యారు. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో రెండో రోజు శుక్రవారం బాస్కెట్ బాల్, ఖోఖో, హాకీ, వాలీబాల్ క్రీడాంశాల్లో 22 ఏళ్ల లోపు సీ్త్ర, పురుషుల క్రీడా జట్ల ఎంపికలకు 305 మంది క్రీడాకారులు హాజరయ్యారని డీఎస్డీఓ ఆర్కే యతిరాజ్ తెలిపారు. శనివారం ఉదయం 9 గంటలకు బ్యాడ్మింటన్ క్రీడాంశంలో క్రీడా పోటీలు, జిల్లా జట్ల ఎంపికలను నిర్వహించనున్నామన్నారు. 190 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత ● సివిల్ సప్లయీస్, పోలీసుల సంయుక్త తనిఖీ కోవూరు: నెల్లూరు– ముంబై జాతీయ రహదారిలో ఆత్మకూరు వైపు నుంచి కోవూరు వైపు వెళ్తున్న వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 190 బస్తాల రేషన్ బియ్యాన్ని సాలుచింతల వద్ద సివిల్ సప్లయీస్, పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. అనంతసాగరం నుంచి కోవూరు మండలంలోని ఒక రైస్ మిల్లుకు ఈ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచా రం రావడంతో సివిల్ సప్లయీస్ డిప్యూటీ తహసీల్దార్ బాలకోటమ్మ, కోవూరు ఎస్సై రంగనాథ్గౌడ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం తనిఖీ లు చేపట్టారు. ఓ వాహనంలో రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. బియ్యంతోసహా వాహ నాన్ని పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం సివిల్ సప్లయీస్ గోదాముకు తరలించారు. -
చెరువును తవ్వేస్తున్నారు
దగదర్తి : మండలంలోని వెలుపోడు పంచాయతీ కామినేనిపాళెం చెరువులో టీడీపీ నేతలు టిప్పర్లతో గ్రావెల్ తరలిస్తున్నారు. 24 గంటలు టిప్పర్లతో యథేచ్ఛగా గ్రావెల్ తరలిస్తున్నప్పటికీ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతోపాటు దగదర్తి మండలం ఉలవపాళ్ల, దామవరం, సున్నపుబట్టి, కౌరుగుంట, మబ్బుగుంటపాళెం, అనంతవరం చెరువుల్లో పోరంబోకు, మేత పోరంబోకు భూముల్లో గ్రావెల్ తవ్వకాలతో ప్రకృతి సహజ స్వరూపం కోల్పోతున్నాయి. ప్రధానంగా దగదర్తి మండలం దామవరం వద్ద ఎయిర్పోర్ట్కు కేటాయించిన భూములు, పారిశ్రామిక అవసరాల కోసం ఏపీఐఐసీ సేకరించిన భూముల్లోనూ గ్రావెల్ను ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ముఖ్యంగా ఇఫ్కో భూముల్లోనూ వెనుక వైపు నుంచి భారీగా తవ్వేస్తున్నారు. -
ఓటమి భయంతోనే టీడీపీ అరాచకం
నెల్లూరు (స్టోన్హౌస్పేట): వైఎస్సార్ కడప జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ అరాచకాలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ బీసీ సంఘాల జిల్లా నాయకులు మండిపడ్డారు. పులివెందులలో ఎమ్మెల్సీ రమేష్యాదవ్పై జరిగిన అరాచకమైన దాడిని ఖండిస్తూ గురువారం నగరంలోని మినీబైపాస్ రోడ్డులో మహాత్మా జ్యోతిరావుపూ లే విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ప్రజల విశ్వాసానికి దూరం కావడం వల్లే పోలీసుల సాయంతో ఉప ఎన్నికల్లో గెలిచి పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానం వైఎస్సార్సీపీదేనని, దురదుష్టవశాత్తూ ప్రమాదంలో ఆ జెడ్పీటీసీ మరణిస్తే ఇప్పుడు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారన్నారు. పదవీ కాలంలో ఏడాదే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఈ ఎన్నికల్లో రూ.కోట్లల్లో డబ్బు ఖర్చుపెట్టి, అధికార దుర్వనియోగానికి పాల్పడుతుందన్నారు. గాయపడిన వారిపైనే కేసులా? మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత నియోజకవర్గంలో తాము జెడ్పీటీసీని కై వసం చేసుకున్నామని చెప్పుకోవడానికి చంద్రబాబు అత్యంత నీచానికి దిగజారుతున్నారన్నారు. ఎమ్మెల్సీ రమేష్యాదవ్తోపాటు తమ పార్టీ నాయకులు వేల్పులు రాముపై దాడి చేసి హత్య చేయడానికి ప్రయత్నించారన్నారు. టీడీపీ గూండాల దాడిలో గాయపడి చావుబ్రతుల్లో ఉన్న వేల్పుల రాము మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారన్నారు. కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ స్థాయిని మరిచి విడ్డూరంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతూ లోకేశ్ చెప్పినట్లు చేస్తూ వైఎస్సార్సీపీ నేతలపై కేసులు బనాయిస్తున్న ఐపీఎస్ అధికారులతో సహా ఎవరూ చట్టానికి అతీతులు కారన్న విషయం మరిచి పోవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర మహిళా విభాగం సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పులివెందులలో టీడీపీని గెలిపించే బాధ్యత ఖాకీలపై పెట్టారా? గీత దాటిన అధికారులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు వైఎస్సార్సీపీ బీసీ సంఘాల జిల్లా నాయకులు -
గ్రావెల్, మట్టి దోపిడీ.. పట్టించుకునే నాథుడేడీ?
ఆత్మకూరు: నియోజకవర్గంలో చెరువులు, కొండలు, తిప్ప ప్రాంతాల్లో గ్రావెల్ను తమ్ముళ్లు విచ్చలవిడిగా తవ్తేస్తున్నారు. పెద్ద ఎత్తున్న గ్రావెల్, మట్టి దోపిడీ జరుగుతున్నా.. పట్టించుకొనే నాథుడేడి అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆత్మకూరు మేజర్ చెరువు, ముస్తాపురం చెరువుల నుంచి మట్టిని నిత్యం సుమారు 10 టిప్పర్లల్లో యథేచ్ఛగా లేఅవుట్లకు తరలిస్తున్నారు. చేజర్ల మండలం టీకేపాడు ఎర్రకుంట (చిన్న చెరువు) నుంచి కాకివాయికి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించారు. ఏఎస్పేట మండలం కొండమీదకొండూరు తిప్ప ప్రాంతం నుంచి గ్రావెల్ను ఆత్మకూరు, ఏఎస్పేట మండలాల్లో ఏర్పాటు చేస్తున్న వెంచర్లకు తరలిస్తూ దోచుకుంటున్నారు. ఏఎస్పేట మండలం హసనాపురం చెరువు నుంచి క్యూబిక్ మీటర్ల కొద్దీ మట్టిని తరలించడంతో లోతైన గుంతలు ఏర్పడ్డాయి. అనంతసాగరం మండలం వెంకటరెడ్డిపల్లి, మంచాలపల్లి చెరువులతోపాటు అటవీ ప్రాంతం నుంచి అనంతసాగరం, సోమశిల సమీపంలోని హైవేలో వెంచర్లకు తరలిస్తున్నారు. -
సైనికుల సమస్యల పరిష్కారానికి చర్యలు
నెల్లూరు(అర్బన్): నల్సా వీర్ పరివార్ సహాయత యోజన పథకంలో భాగంగా గురువారం నెల్లూరులోని జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో లీగల్ సర్వీసెస్ క్లినిక్ను జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాలతో ఇక్కడ సేవా క్లినిక్ను ప్రారంభించామన్నారు. ఇక్కడ ప్యానెల్ లాయర్, పారా లీగల్ వలంటీర్ను నియమించడం జరుగుతుందన్నారు. వీరు వారంలో ఒకరోజు సైనిక సంక్షేమ భవనంలో అందుబాటులో ఉంటారని తెలిపారు. సైనికులు, మాజీ సైనికులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. టోల్ ఫ్రీ నంబర్ 15100కి కూడా ఫోన్ చేసి తమ సమస్యలు వివరించవచ్చన్నారు. అనంతరం సైనిక సంక్షేమాధికారి, మాజీ సైనికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమాధికారి హరికృష్ణ, మాజీ వింగ్ కమాండర్ శ్యామ్ప్రసాద్, అసోసియేషన్ నాయకులు కళాధర్, రత్నయ్య పాల్గొన్నారు. -
18 నుంచి వెంకయ్యస్వామి ఆరాధనోత్సవాలు
● ఏర్పాట్లపై ఆర్డీఓ సమీక్ష వెంకటాచలం: మండలంలోని గొలగమూడిలో భగవాన్ వెంకయ్యస్వామి 43వ ఆరాధనోత్సవాలు ఈనెల 18 నుంచి 24వ తేదీ వరకు జరుగుతాయని నెల్లూరు ఆర్డీఓ అనూష తెలిపారు. గొలగమూడిలోని ఆశ్రమ పరిపాలనా కార్యాలయంలో ఆర్డీఓ గురువారం అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై శాఖల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భక్తులు పెద్ద ఎత్తున రానున్న నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. నెల్లూరు ఆర్టీసీ, ఆత్మకూరు బస్టాండ్ల నుంచి గొలగమూడి గ్రామం వరకు ప్రత్యేక బస్సులు నడపాలని చెప్పారు. పారిశుధ్యంపై పంచాయతీ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల దర్శన సందర్భంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా క్యూ లైన్లు పెట్టాలన్నారు. ముఖ్యంగా రథోత్సవం, తెప్పోత్సవం రోజున పోలీస్, విద్యుత్, అగ్నిమాపక శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అత్యవసర మందులతోపాటు అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని వైద్యాధికారులకు సూచించారు. సమావేశంలో ఆశ్రమ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం, నెల్లూరు రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సర్వేపల్లిలో బరి తెగింపు
పొదలకూరు: సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం, పొదలకూరు, ముత్తుకూరు, మనుబోలు మండలాల్లో అధికార పార్టీ నాయకులు అక్రమంగా గ్రావెల్ను తరలిస్తున్నారు. ముత్తుకూరు పిడతాపోలూరు చెరువులో మట్టిని ఇష్టానుసారం అక్రమంగా సమీపంలోని లే అవుట్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మనుబోలు మండలంలో అవసరాన్ని బట్టి తరచుగా గ్రావెల్ తవ్వుతున్నారు. ఫిర్యాదులు అందితే కొద్ది రోజులు ఆపి తర్వాత గ్రావెల్ను తరలిస్తున్నారు. వెంకటాచలం మండలంలో అక్రమంగా గ్రావెల్ రూ.కోట్లలో నిర్వహిస్తున్నారు. సర్వేపల్లి పంచాయతీ నాగబొట్లకండ్రిక గ్రామ అటవీ భూముల్లో స్వయంగా ముఖ్య నాయకుడు కనుసన్నల్లో ముత్తుకూరు మండలం సాగరమాల ప్రాజెక్ట్ (హైవే రోడ్డు నిర్మాణం), నెల్లూరు లేఅవుట్లకు తరలిస్తున్నారు. ప్రతినిత్యం రూ.20 లక్షల విలువైన గ్రావెల్ను అటవీ భూముల్లో తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు అధికార ఒత్తిళ్లతో పట్టించుకోవడం లేదు. పొదలకూరు మండలం తాటిపర్తి పంచాయతీ కొల్లకందుకూరు తిప్ప నుంచి పది రోజులుగా గ్రావెల్ను నెల్లూరు లే అవుట్లకు తరలిస్తున్నారు. ప్రతి నిత్యం 20 టిప్పర్లు తరలిపోతున్నాయి. టిప్పర్కు రూ.5 వేలు వసూలు చేసి ప్రతి నిత్యం రూ.లక్ష సంపాదిస్తున్నారు. గ్రావెల్ను యంత్రాలతో లోడి టిప్పర్లకు నింపి పంపుతున్నారు. -
‘కనుపూరు చెరువు మట్టి’ కేసులో కాకాణికి బెయిల్
నెల్లూరు (లీగల్): కనుపూరు చెరువు నుంచి మట్టిని అక్రమంగా తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినట్లు వెంకటాచలం పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ నెల్లూరు 4వ అదనపు అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి నిషాద్ నాజ్ షేక్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కొక్కరు రూ.25 వేలు ఆస్తి విలువ కలిగిన ఇద్దరు జామీన్దారుల పూచీకత్తు, రూ.25,000 వ్యక్తిగత బాండ్ సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల విచారణకు కాకాణి సహకరించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో కాకాణి తరఫున సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి పి.ఉమామహేశ్వర్రెడ్డి, ఎంవీ విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో కాకాణిపై ప్రాథమిక ఆధారాల్లేవని, కేవలం రాజకీయ కక్షతో మొదటి నిందితుడిగా కేసు బనాయించారని వాదనలు వినిపించగా, వెంకటాచలం పోలీసులు తరఫున పీపీ మాల్యాద్రి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కాకాణికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. -
కేజీఎఫ్ తరహాలో గ్రావెల్ దందా
కావలి (జలదంకి): కావలి నియోజకవర్గంలో కేజీఎఫ్ తరహాలో గ్రావెల్ దందా జరుగుతోంది. గ్రావెల్ మాఫియాకు కాసులు కురిపిస్తుంది. మండలంలోని ఇప్పటికే కావలి పెద్ద చెరువు, కొత్తపల్లి, రాజువారిచింతలపాళెం, రుద్రకోట, బుడమగుంట, ముసునూరు, గౌరవరం చెరువుల్లో గ్రావెల్ కొల్లగొట్టిన ఘనులు తాజాగా తాళ్లపాళెం, ఆముదాలదిన్నె చెరువుల్లో రేయింబవళ్లు గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్నారు. ఇక బోగోలు మండలంలో ముంగమూరు, కొండబిట్రగుంట, పాతబిట్రగుంట, కడనూతల, కోవూరుపల్లి, బోగోలు, కప్పరాళ్లతిప్ప తదితర ప్రాంతాల్లో నాణ్యమైన గ్రావెల్ను తవ్వేస్తున్నారు. అల్లూరు మండలం నార్తుఅములూరులో గ్రావెల్ దందా ఓ రేంజ్లో సాగుతోంది. రోజుకు వంద టిప్పర్లకు పైగా గ్రావెల్ అక్రమ రవాణా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే టీడీపీ నేతలు రాత్రి, పగలు తేడా లేకుండానే గ్రావెల్ తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం టిప్పర్ రూ.10 వేల వరకు పలుకుతోంది. ఈ లెక్కన నిత్యం రూ.2 కోట్ల వరకు గ్రావెల్ వ్యాపారం జరుగుతోంది. మమ్మల్ని అడిగేదెవరు, మమ్మల్ని అడ్డుకునేదెవరు అంటూ అక్రమ గ్రావెల్ దందా కొనసాగిస్తూ లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు. తాజాగా తాళ్లపాళెం, ఆముదాలదిన్నె చెరువుల్లో కొద్ది రోజులుగా మూడు జేసీబీలు పెట్టి 50 నుంచి 60 ట్రాక్టర్లతో రేయింబవళ్లు గ్రావెల్ను అక్రమంగా లేఅవుట్లకు తరలిస్తూ దోచుకుంటున్నారు. ఈ విషయమై ఇరిగేషన్ అధికారులు సైతం మాట్లాడేందుకు భయపడుతున్నారు. -
అవినీతి మత్తు.. గ్రావెల్ ఎత్తు
ఉదయగిరి: నియోజకవర్గంలో పలు మండలాల్లో మట్టి, గ్రావెల్ మాఫియాలు బరి తెగిస్తున్నాయి. చెరువులు, శ్మశానాలు, ప్రభుత్వ భూముల్లో అక్రమంగా గ్రావెల్, మట్టి తవ్వేసి జేబులు నింపుకుంటున్నా రు. వ్యవసాయ భూములు చదును, లేఅవుట్లు, ఇతర అవసరాల కోసం జరుగుతున్న దోపిడీలో అధికారు లు మామూళ్లు మత్తులో జోగుతూ అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. వింజమూరులోని మల్లపరాజు వాగు చెరువు, పాతూరు, యర్రబల్లిపాళెం చెరువుల్లో రేయింబవళ్లు విచ్చలవిడిగా మట్టి తరలిస్తున్నారు. ఈ మూడు చెరువుల్లో సుమారు 50 వేల క్యూబిక్ మీటర్ల మట్టిని అక్రమార్కులు తరలించినట్లు అంచనా. అదే అనుమతులు తీసుకుని ఉంటే.. ప్రభుత్వానికి సుమారుగా రూ.2.25 కోట్లు రాబడి వచ్చేదని అధికారులు చెబుతున్నారు. వరికుంటపాడు మండలం జడదేవి, తూర్పు బోయమడుగు ల, విరువూరు, టి.కొండారెడ్డిపల్లి, జి.కొండారెడ్డి పల్లి తదితర గ్రామాల్లో అక్రమంగా గ్రావెవెల్ రవాణా సాగుతోంది. దుత్తలూరు మండలం తెడ్డుపాడు, దుత్తలూరు, నందిపాడు, నర్రవాడ పంచాయతీల్లో మట్టి, గ్రావెల్ అక్రమ దందాకు అంతూపంతూ లేదు. కలిగిరి, జలదంకి, కొండాపురం మండలాల్లో అయితే ప్రభుత్వ భూముల నుంచి మట్టి తరలింపు జరుగుతోంది. పెద్ద ఎత్తున మట్టి, గ్రావెల్ తరలిస్తున్నా రెవె న్యూ, పోలీసు, ఇరిగేషన్ అధికారులు తగిన చర్యలు చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఆటవిక రాజ్యంలో ఉన్నామా?
వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల ఘటన చూశాక ఆంధ్రప్రదేశ్లో ఉన్నా మా? ఆటవిక రా జ్యంలో ఉన్నామా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎమ్మెల్సీ రమేష్యాదవ్, వైఎస్సార్సీపీ నేత వేల్పుల రాముపై టీడీపీ గూండాలు దాడి చేసి గాయ పరచడం చేస్తే ప్రజాస్వామ్యం బతికి బట్ట కట్టడం కష్టంగా అనిపిస్తోంది. ఓ శాసనమండలి సభ్యుడికే పోలీసులు కనీస రక్షణ లేకపోతే సామాన్యుడి పరిస్థితి ఏమిటి. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ప్రజలను భయాందోళనకు గురి చేసి గెలవాలని చూడడం హేయమైన చర్య. ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వాతంత్య్రాన్ని, ఎన్నికల స్వేచ్ఛకు భంగం కలిగించే వారిపై కఠిన చర్య తీసుకోవాలి. ఎన్నికల కమిషనర్ తక్షణమే జోక్యం చేసుకొని చర్యలు చేపట్టాలి. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. – మేకపాటి విక్రమ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఆత్మకూరు పులివెందుల ఘటన అరాచకానికి పరాకాష్ట పులివెందుల ఘటన టీడీపీ అరాచకానికి పరాకాష్టగా ఉంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి విజయం కోసం అడ్డుదారులు తొక్కుతున్నారు. సాఫీగా ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదని, ముందస్తు వ్యూహంలో భాగంగా భౌతికదాడులకు తెగిస్తున్నారు. ఎమ్మెల్సీ రమేష్యాదవ్తోపాటు మరొకరిపై హత్యాయత్నం జరగడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. అధికారం మదంతో ఎల్లో సైకో బ్యాచ్ వ్యవహరిస్తున్న తీరు భవిష్యత్లో స్వేచ్ఛాయుత ఎన్నికలకు గొడ్డలిపెట్టుగా మారుతోంది. గత ఐదేళ్ల ఫ్యాక్షనిజానికి దూరంగా ఉన్న సీమ పల్లెల్లో టీడీపీ తిరిగి తెస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. వారిని భయపెట్టి బూత్లు ఆక్రమించి ఎన్నికల్లో లబ్ధిపొందే ప్రయత్నం చేయడం తగదు. – మేకపాటి రాజగోపాల్రెడ్డి, ఉదయగిరి సమన్వయకర్త బ్రిటిష్ పాలనను తలపిస్తున్న కూటమి కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రత్యర్థులపై దాడులు చేయడం, ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెట్టడం, జైళ్లకు పంపడం చూస్తుంటే బ్రిటిష్ పాలన కొనసాగుతుందా అనే అనుమానం కలుగుతుంది. వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్సార్సీపీ నేత వేల్పుల రాముపై నేతలపై దాడి చేయడాన్ని ప్రజాస్వామ్య వాదులు తీవ్రంగా ఖండించాలి. ప్రజాస్వామ్యంలో ఓ ప్రతిపక్ష పార్టీకి చెందిన శాసనమండలి సభ్యుడికి రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు రక్షణ ఉంటుందా. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం తమ అధికారంతో ప్రజలను భయాందోళనలకు గురి చేసి, గెలవాలని చూస్తుంది. ఎన్నికల స్వేచ్ఛ ఆటంకం కలిగించే వారిపై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. – కాకాణి పూజిత, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ -
స్పోర్ట్స్ కాంప్లెక్స్లో క్రీడా పోటీలు
నెల్లూరు(స్టోన్హౌస్పేట): జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి క్రీడా పోటీలు, జట్ల ఎంపికలను గురువారం ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ప్రారంభించినట్లు క్రీడాభివృద్ధి అధికారి ఆర్కే ఎతిరాజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ తొలిరోజు అథ్లెటిక్స్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, కబడ్డీ క్రీడాంశాల్లో అండర్ – 22 విభాగంలో పోటీలు, ఎంపికలు చేపట్టామన్నారు. జిల్లా నలుమూలల నుంచి 275 మంది క్రీడాకారులు హాజరయ్యారన్నారు. ఈ ఎంపికల్లో భాగంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి ఖోఖో, బాస్కెట్బాల్, హాకీ, వాలీబాల్ క్రీడాంశాల్లో పోటీలు,ఎంపికలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులకు ఇబ్బందుల్లేకుండా చూడండి నెల్లూరు(స్టోన్హౌస్పేట): బీసీ వసతి గృహంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యులు మురళీకృష్ణ యాదవ్, యేసోబు శ్రీనివాసులు కోరారు. కోడూరులోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో ఆహారం కల్తీ జరిగి విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని తెలుసుకుని గురువారం ప్రిన్సిపల్, విద్యార్థినులతో చర్చించారు. అనంతరం భోజనశాలకు వెళ్లి పరిశీలించారు. గురుకుల పాఠశాలలో విద్యుత్ సమస్యపై స్థానిక ఏఈతో మాట్లాడారు. దాడిని ఖండిస్తున్నాం పులివెందులలో వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై రౌడీమూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని మురళీకృష్ణ యాదవ్ తెలిపారు. పిడుగుపాటుకు గేదె, ఆవుల మృత్యువాతవింజమూరు(ఉదయగిరి): మండలంలోని రెండు గ్రామాల్లో రైతులకు చెందిన ఒక గేదె, రెండు ఆవులు గురువారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతిచెందాయి. స్థానికుల కథనం మేరకు.. తక్కెళ్లపాడులో కాకి కన్నయ్య సుమారు రూ.80 వేల విలువైన తన గేదెను ఇంటిముందు కట్టేశాడు. పిడుగుపడి గేదె మృతిచెందింది. జువ్విగుంటపాళెంలో వీరబ్రహ్మేంద్ర ఆశ్రమంలో ఉన్న రెండు ఆవులు పిడుగుపాటుకు గురై చనిపోయాయి. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు. కాగా ఉదయగిరి మండలం ఆర్లపడియలో పిడుగుపాటుకు నాలుగు మేకలు మృతిచెందాయి. గ్రామానికి చెందిన ఆశీర్వాదం అటవీ ప్రాంతంలో మేకలు మేపుకొంటుండగా ఒక్కసారిగా పిడుగుపడడంతో జీవాలు మృతి చెందాయి. మరో రెండు మేకల పరిస్థితి విషమంగా ఉంది. బకాయిల విడుదలకు డిమాండ్నెల్లూరు(వీఆర్సీసెంటర్): చేనేత రంగానికి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పముజుల హరి డిమాండ్ చేశారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేత కార్మికుల ఆత్మహత్యలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. రూ.127.87 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. సహకార సంఘాలకు ట్రిఫ్ట్ ఫండ్ కింద రావాల్సిన రూ.17 కోట్లకు బదులుగా రూ.5 కోట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, చేనేత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శేషయ్య, నేతలు వెంకటసురేష్, పముజుల చంద్రశేఖర్రావు, బైనా రాజశేఖర్ పాల్గొన్నారు. యువతిపై లైంగికదాడికి యత్నంఇందుకూరుపేట: మతిస్థిమితం లేని యువతిపై ఓ కామాంధుడు లైంగికదాడికి యత్నించాడు. ఈ ఘటన మండంలోని కొత్తూరు మజరా మేనాటిపాళెంలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. ఇందుకూరుపేటకు చెందిన మైనంపాటి శీనయ్య కల్లు తాగేందుకు మేనాటిపాళెం వెళ్లాడు. అక్కడ ఓ యువతి ఒంటరిగా తిరుగుతుండగా బలాత్కరం చేయబోయాడు. ఇంతలో ఆమె తల్లి చూడటంతో శీనయ్య అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నాగార్జునరెడ్డి తెలిపారు. -
మహిళపై దాష్టీకం
సోమశిల: కూటమి ప్రభుత్వంలో మహిళలపై దాడులు, హత్యాయత్నాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పోలీసులు నిందితులకు సహకరిస్తూ బాధితులపైనే కేసులు బనాయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. చేజర్ల మండలంలోని మడపల్లి గ్రామానికి చెందిన దళిత మహిళపై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. బాధితురాలు, స్థానికుల కథనం మేరకు.. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన వసంతమ్మకు వివాహమై పిల్లలున్నారు. భర్త మృతిచెందగా బిడ్డలను పోషించుకునేందుకు ప్రభుత్వ భూమిని సాగు చేస్తోంది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి, అతని బంధువులు సదరు భూమిని లాక్కునేందుకు కొన్నిరోజులుగా ప్రయత్నిస్తున్నారు. చంపేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని వసంతమ్మ ఆరోపించారు. పలుమార్లు రెవెన్యూ అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా సమాధానం చెప్పకుండా తమపైనే కేసులు బనాయిస్తామన్నారు. అసలు ప్రభుత్వ భూములు మీరెందుకు సాగు చేస్తున్నారని చేజర్ల తహసీల్దార్ మురళి అన్నారని ఆమె తెలిపారు. వసంతమ్మ పొలంలో కూరగాయల సాగు చేస్తుండగా బుధవారం సుబ్బారెడ్డి ట్రాక్టర్తో దున్నేందుకు వెళ్లాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వసంతమ్మను నానా రకాలుగా మాట్లాడి విచక్షణారహితంగా దాడికి పాల్పడటంతో గాయపడింది. పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా వారిపై ఎటువంటి చర్యలు తీసుకోరని బాధితురాలు తీవ్ర మనస్తాపానికి గురై పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను బాధిత కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితురాలి కుమార్తె గురువారం మాట్లాడుతూ సుబ్బారెడ్డిని అడిగితే.. నేనేమైనా చేస్తా.. మీరు తక్కువ కులానికి చెందినవారు.. నేను తలుచుకుంటే మీ బట్టలు కూడా లేకుండా చేస్తామని బెదిరించాడని వాపోయింది. ఎస్సై, తహసీల్దార్ అతడికి సహకరిస్తూ మా మీదకి దాడిచేసేందుకు వస్తున్నారంటూ ఆవేదన చెందారు. అమ్మ చనిపోతే మాకు దిక్కెవరని, న్యాయం జరిగేలా చూడాలని రోదిస్తూ తెలియజేశారు. దాడి చేయడంతో ఆత్మహత్యాయత్నం నిందితులకు పోలీస్, రెవెన్యూ అధికారుల సహకారం బాధిత కుటుంబం ఆరోపణ -
చెలరేగుతున్న తమ్ముళ్లు
కందుకూరు: అధికారాన్ని అడ్డం పెట్టుకుని నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతుంది. సాగునీటి చెరువులను లక్ష్యంగా చేసుకుని భారీ దోపిడీకి పాల్పడుతోంది. కొండికందుకూరు చెరువు నుంచి పెద్ద ఎత్తున మట్టి, కోవూరు, కొండముడుసుపాళెం చెరువుల నుంచి భారీగా గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్నారు. గుడ్లూరు మండలం ఏలూరుపాడు చెరువు నుంచి రైల్వేలైన్ అభివృద్ధి పనుల కోసం 6,500 క్యూబిక్ మీటర్ల మట్టి తవ్వుకునేందుకు అనుమతి తీసుకున్న కాంట్రాక్టర్లు దాదాపు 13 వేల క్యూబిక్ మీటర్ల వరకు మట్టి తవ్వకాలు చేశారు. కేవలం 90 సెం.మీ. లోతులోనే మట్టి తవ్వకాలు చేయాలని నిబంధన ఉన్నా మూడు మీటర్ల లోతు వరకు ఈ చెరువులో మట్టి తవ్వకాలు చేసినా ఇరిగేషన్శాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. పాజర్ల, తెట్టు, ఏలూరుపాడు చెరువుల్లో ఇష్టారాజ్యం గ్రావెల్ తవ్వకాలు చేశారు. లింగసముద్రం మండలంలోని రాళ్లపాడు ప్రాజెక్ట్ను సైతం గ్రావెల్ మాఫియా వదలడం లేదు. అయినా సరే ప్రాజెక్ట్ అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. లింగసముద్రం కొత్తచెరువు, యర్రారెడ్డిపాళెంలో ప్రభుత్వ భూములు, మాలకొండరాయునిపాళెం చెరువు, చినపవని, పెదపవని, మొగిలిచర్ల సాగునీటి చెరువుల్లో గ్రావెల్ తవ్వకాలు భారీగా సాగాయి. ఉలవపాడు మండలంలోని రాజుపాళెం, వీరేపల్లి, భీమవరం, బద్దిపూడి చెరువుల నుంచి గ్రావెల్, కరేడు చెరువు నుంచి మట్టిని యథేచ్ఛగా గ్రావెల్ను తరలించేశారు. వాస్తవానికి చెరువుల్లో గ్రావెల్ తవ్వకాలకు ఒక క్యూబిక్ మీటర్కు రూ.106 చెల్లించాల్సి ఉంది. కానీ గ్రావెల్ మాఫి యా ఎటువంటి అనుమతులు తీసుకోవడం లేదు. ఒక్క రూపాయి కూడా రాయల్టీ చెల్లించడం లేదు. -
2024 – 25 ఏడాదికి బోర్డు అనుమతి
కందుకూరు: పొగాకు రైతులను ఆదుకునే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం కేవలం మాటలు, ఉత్తుత్తి ప్రకటనలకే పరిమితమైంది. రెండు నెలలుగా కొనుగోళ్లపై ఆడుతున్న నాటకాలే ఇందుకు నిదర్శనం. పొగాకు బోర్డు ప్రకాశం రీజియన్ పరిధిలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 11 వేలం కేంద్రాలున్నాయి. వీటిలో జిల్లాలో కందుకూరు–1, 2, కలిగిరి, డీసీపల్లిలో ఉన్నాయి. 11 కేంద్రాల పరిధిలో 2024 – 25 ఏడాదికి 105.27 మిలియన్ కేజీలను అమ్ముకునేందుకు బోర్డు అనుమతిచ్చింది. మార్చి 10, 19వ తేదీల్లో రెండు దశల్లో అన్ని కేంద్రాల్లో వేలం ప్రక్రియ ప్రారంభమైంది. వేలం ప్రారంభమయ్యాక.. రైతులకు మద్దతు ధర కరువైంది. కేవలం బ్రైట్ గ్రేడ్కు మాత్రమే కేజీకి రూ.280 ఇచ్చిన వ్యాపారులు, మిగిలిన వాటిపై ధరల్ని దారుణంగా తగ్గించారు. ఇప్పటి వరకు వచ్చిన సరాసరి ధర చూస్తే కేజీకి కేవలం రూ.241 మాత్రమే. మద్దతు ధర కోసం అన్నదాతలు రెండు నెలలుగా పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నారు. వేలం ప్రక్రియను అడ్డుకోవడంతోపాటు, రోడ్లపైకి వచ్చి పొగాకు తగులబెట్టి తమ నిరసనను తెలుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీశారు. మద్దతు ధరలు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దిగొచ్చిన ప్రభుత్వం వేలంలో పోటీని పెంచేందుకు మార్క్ఫెడ్ను రంగంలోకి దించుతున్నట్లు ప్రకటన చేసింది. కానీ నేటికీ ఏ కేంద్రంలోనూ మార్క్ఫెడ్ వేలం ప్రక్రియలో పాల్గొనలేదు. నాడు.. నేడిలా.. గతంలో ఒకసారి పొగాకు మార్కెట్లో ధరల సంక్షోభం ఏర్పడినప్పుడు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్క్ఫెడ్ను రంగంలోకి దించి కొనుగోలు చేయించారు. దీంతో వ్యాపారుల మధ్య పోటీ నెలకొని ధరలు పెరిగే పరిస్థితి వచ్చింది. నేటి కూటమి ప్రభుత్వం మాత్రం గత రెండు నెలలుగా కేవలం ఉత్తుత్తి ప్రకటనలకే పరిమితమైంది అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభోత్సవానికి తూర్పువీరాయపాళెం వచ్చిన సీఎం చంద్రబాబు మార్క్ఫెడ్ ద్వారా రూ.273 కోట్లతో 20 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటన చేయడం గమనార్హం. ఇప్పటికే మార్క్ఫెడ్ వేలం ప్రక్రియలో పాల్గొని రైతులను ఆదుకునే సూచనలు కనిపించడం లేదు. ఈలోగా వేలం ప్రక్రియ దాదాపు పూర్తికావడం ఖాయం. అంటే రైతులను పొగాకు రైతులను ఆదుకునే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని స్పష్టమవుతోంది.105.25 మిలియన్ కేజీలు ఉత్పత్తి అంచనా -
చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం
● డీఆర్వో హుస్సేన్ సాహెబ్ నెల్లూరు(అర్బన్): చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వ అధిక ప్రాధాన్యమిస్తోందని జిల్లా రెవెన్యూ అధికారి హుస్సేన్ సాహెబ్ అన్నారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చేనేత వస్త్రాల స్టాల్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో డీఆర్వో మాట్లాడుతూ పాశ్చాత్య మోజులో పడి చేనేత రంగాన్ని మరిచిపోకూడదన్నారు. దేశంలో ఈ రంగానికి గుర్తింపు, ప్రత్యేక స్థానం ఉన్నట్లు చెప్పారు. మనదేశంలో తయారు చేసిన నేత వస్త్రాలు వివిధ దేశాల్లో ఖ్యాతిని గడించాయన్నారు. కార్మికులను గౌరవించుకోవడం, చేనేత కళను బతికించుకోవడం కోసం వారానికి ఒక రోజైనా ప్రజలు నేత వస్త్రాలను ధరించాలని కోరారు. అనంతరం పలువురు కార్మికులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఏడీ శ్రీనివాసరెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖాధికారి మారుతి ప్రసాద్, ఎల్డీఎం మణిశేఖర్, డీసీఓ గుర్రప్ప, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ సుధాకర్, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టినెల్లూరు(క్రైమ్): నగరంలో నేరాల నియంత్రణ చర్యల్లో భాగంగా సమస్యాత్మక ప్రాంతాలపై పోలీసు అధికారులు దృష్టి సారించారు. నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎవరెవరు నివాసం ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? తదితర వివరాలను సేకరిస్తున్నారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్ల కదలికలపై నిఘా పెంచారు. నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. గురువారం రాత్రి నెల్లూరు నగరంలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు అధికారులు పర్యటించి స్థానికులతో మాట్లాడారు. నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. అసాంఘిక కార్యకలాపాలు, మత్తు, మాదక ద్రవ్యాల విక్రయాలు, రౌడీషీటర్లు, ఈవ్టీజర్ల వేధింపులను గుర్తిస్తే వెంటనే సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని సూచించారు. నేర నియంత్రణకు తాము తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నగర ఇన్స్పెక్టర్లు సీహెచ్ కోటేశ్వరరావు, జి.వేణుగోపాల్రెడ్డి, జి.దశరథరామారావు, కె.రోశయ్య, కె.శ్రీనివాసరావు, కె.సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
18,870 బంగారు కుటుంబాల ఎంపిక
● కలెక్టర్ ఆనంద్ నెల్లూరు(అర్బన్): ీప–4 కింద జిల్లాలో 18,870 బంగారు కుటుంబాలను, సుమారు 5 వేల మంది మార్గదర్శిలను ఎంపిక చేశామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. గురువారం అమరావతి సచివాలయం నుంచి పీ–4 కార్యక్రమంపై కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు కలెక్టరేట్లోని శంకరన్ హాలు నుంచి జేసీ కార్తీక్, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. సీఎస్ అడిగిన ప్రశ్నలకు కలెక్టర్ సమాధానమిచ్చారు. జిల్లా వ్యాప్తంగా 30 వేల నిరుపేద కుటుంబాలను ఈనెల 15వ తేదీలోగా ఎంపిక చేసి ఆర్థిక అసమానతలు తొలగించేందుకు కృషి చేస్తామన్నారు. కాన్ఫరెన్స్లో డీఆర్వో హుస్సేన్ సాహెబ్, సీపీఓ నరసింహారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి సత్యవాణి, పరిశ్రమల శాఖ జీఎం మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.8. లక్షల ఇన్సూరెన్స్ సొమ్మును కాజేశారు
కోవూరు/నెల్లూరు(అర్బన్) : నా భర్త మరణాంతరం ఇన్సూరెన్స్ సంస్థ నుంచి వచ్చిన రూ.8 లక్షల మొత్తాన్ని గిరిజన సంఘ నేతలమని చెప్పుకునే యానాదుల సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసీ పెంచలయ్య, జిల్లా మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉషా కలిసి కాజేశారని మండలంలోని గుమ్మలదిబ్బ సమీపంలో ఉన్న గాంధీ జనసఘం గిరిజన కాలనీకి చెందిన ఈగ మార్తమ్మ ఆరోపించారు. గిరిజన సంఘ నేతలమని చెబుతూ గిరిజనులనే మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి కోవూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా, బుధవారం జాయింట్ కలెక్టర్ కే కార్తీక్ను కలిసి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. బాధిత గిరిజన మహిళ ఈగ మార్తమ్మ భర్త పసుపులేటి సురేందర్ ఆటోడ్రైవర్గా పనిచేస్తూ కుటుంబ సమస్యలతో 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కోవూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదు కాగా, అందుకు సంబంధించి బీమా కంపెనీ నుంచి 2023లో రూ.8 లక్షల ఇన్సూరెన్స్ పరిహారం ఇండియన్ బ్యాంక్లోని ఆమె ఖాతా(033310 100222548)లో జమయ్యాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న గిరిజన సంఘ నేత కేసీ పెంచలయ్య కుట్రపూరితంగా వ్యవహరించి ఈ డబ్బులు నీవి కావు, నీ అకౌంట్లోకి పొరపాటున వచ్చాయని మార్తమ్మకు చెప్పారు. ఆ తర్వాత ఆమె బ్యాంక్ ఖాతా నుంచి గిరిజన సంఘ మహిళా నేత చెంబేటి ఉషా ఖాతా (0111917603)కు రూ.7 లక్షలు ట్రాన్స్ఫర్ చేసుకున్నారని మారతమ్మ ఆరోపిస్తోంది. పెంచలయ్య, ఉషా వద్దనే ఏటీఎం, పాస్బుక్ తనకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, ఏటీఎం కార్డు, ఆధార్ వంటి ముఖ్యమైన పత్రాలన్నీ కేసీ పెంచలయ్య, ఉషా వద్దనే ఉంచుకుని, మిగతా డబ్బు లు కూడా కాజేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, అధికారులు జోక్యం చేసుకుని నాకు న్యాయం చేయాలని, గిరిజన సంఘా లు, మహిళా సంఘాలు స్పందించాలని కోరారు. బ్యాంక్ లావాదేవీలపై సమగ్ర విచారణ జరిపి, తనను మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. అమాయక గిరిజనులను మోసం చేస్తున్నారు.. జేసీకి వినతిపత్రం అందించిన తర్వాత బాధితులు ఈగ మార్తమ్మ, గరునాధం చందు మాట్లాడుతూ యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా చలామణి అవుతున్న కల్లూరు చిన పెంచలయ్య, చెంబేటి ఉషా అమాయక గిరిజన మహిళలకు రావాల్సిన నగదు కాజేస్తున్నారని ఆరోపించారు. అట్రాసిటీ కేసుల్లో న్యాయం చేస్తామని బాధితుల ఆధార్ కార్డు, పాస్బుక్లు, ఏటీఎం, పాన్కార్డులు వీరి చేతుల్లో పెట్టుకుని బ్యాంకు ఖాతాకు నాయకుల ఫోన్ నంబర్లు లింక్ చేయించుకున్నారన్నారు. అట్రాసిటీకి సంబంధించిన ప్రభుత్వం అందించే నష్టపరిహారం బ్యాంకు ఖాతాలో పడిన వెంటనే చెంబేటి ఉషా ద్వారా బాధితులను పిలిపించుకుని అరకొర చేతిలో పెట్టి పెద్ద మొత్తంలో నగదు కాజేస్తున్నారన్నారు. సజ్జాపురం గ్రామానికి చెందిన గురునాధం చందు భర్త వినోద్ను అగ్రవర్ణాల వారు విచక్షణారహితంగా కొట్టిన నేపథ్యంలో వచ్చిన పరిహారం మొత్తం రూ 1.75 లక్షలను కాజేశారన్నారు. మా మాదిరింగా ఎంతో మంది వీళ్ల చేతిలో మోసపోయారని తెలిపారు. గిరిజనులనే మోసం చేసిన ఆ సంఘ నేతలు బాధితురాలు మారతమ్మ ఆవేదన పోలీసులకు, జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు -
చేయూత ఇవ్వక చేనేతకు చుక్కలు
నేతన్న నేస్తంతో ఆర్థిక ఉపశమనం చేనేత వృత్తిలో 40 ఏళ్లగా ఉన్నాను. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నేతన్న నేస్తం నా కుటుంబానికి ఆర్థికంగా ఉపశమనం కలిగించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మాకు ఎటువంటి మేలు చేయడం లేదు. గత ప్రభుత్వంలో మూలన పడేసి మగ్గాలు మళ్లీ వేగం పుంజుకున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. పాలకులు స్పందించకపోతే అందమైన మన చేనేత సంప్రదాయం కనుమరుగవుతుంది. – బొడిచెర్ల రవి, సంగం గిట్టుబాటు ధర కూడా రావడం లేదు రోజంతా కుటుంబం కష్టపడినా రూ.300కు మించి గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. ప్రభుత్వాలు ముడి సరుకుల మీద ధరలు తగ్గించాలి. జీఎస్టీని తగ్గిస్తే చేనేత వస్త్రాలకు డిమాండ్ పెరిగి కొంచమైనా లాభాలు వస్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా బతుకులు మళ్లీ గుంతలో పడ్డాయి. వైఎస్సార్సీపీ హయాంలో నేతకు పెట్టుబడి సాయంతోపాటు అనేక పథకాలు మా కుటుంబానికి ఎంతో దోహదపడ్డాయి. – మాసాబత్తుల రమణమ్మ, నారాయణరెడ్డి పేట అనాదిగా నేత వృత్తినే నమ్ముకుని కుటుంబాలను పోషించుకునే చేనేతల జీవితాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొత్త వెలుగులు నింపారు. గతంలో ఆర్థిక చేయూత లేక మగ్గాలను వదిలేసిన నేత సంప్రదాయ కుటుంబాలు మళ్లీ పగ్గం పట్టాయి. వరుసగా ఐదేళ్లు వారి ఖాతాల్లో ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ జమ కావడంతో కదిలిన మగ్గం అవిశ్రాంతంగా సాగాయి. అప్పుల ఊబిలో నుంచి తేరుకున్నాయి. సహకారం అందించాలి ప్రభుత్వాలు చేనేత రంగానికి సహకారం అందించాలి. అనేక సమస్యలు ఎదు ర్కొంటున్న వారికి గతం ప్రభుత్వం ఇచ్చిన పథకాలను పునరుద్ధరించాలి. చేనేతలకు కేటాయించిన 11 రకాల రిజర్వేషన్ నిబంధనలను ఉల్లంఘించి పవర్లూమ్ మగ్గాలపై వస్త్రాలను తయారు చేస్తున్నారు. ఆప్కోకు పాలక పార్టీల చేయూత తగ్గిపోయింది. హెల్త్ స్కీంను, కచ్చితంగా అమలు చేయాలి. – బుధవరపు బాలాజీ, చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షుడు ● చంద్రబాబు దగా జాబితాలో నేతన్నలు ● వైఎస్సార్సీపీ హయాంలో ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ అమలు ● ఐదేళ్లలో ప్రతి కుటుంబానికి రూ.1.20 లక్షల సాయం ● అప్పుల ఊబి నుంచి తేరుకున్న చేనేత కుటుంబాలు ● కూటమి రాకతో కుప్పకూలిన బతుకులు ● ఆర్థిక సాయం ఎగనామం ● మగ్గాలకు 200, పవర్లూమ్స్కు 500 యూనిట్ల ఉచిత కరెంట్కు పంగనామం ● మళ్లీ మొదటికొచ్చిన నేతన్నల జీవితాలు ● జాతీయ చేనేత దినోత్సవం నేడు ●కూటమి ప్రభుత్వం నెరవేర్చని హామీలతో.... నెల్లూరు(స్టోన్హౌస్పేట): మన సంస్కృతి, సంప్రదాయాన్ని ఉట్టిపడేలా కనిపించేవి చేనేత వస్త్రాలు. అగ్గిపెట్టెలో ఇమిడే చీరలను నేసి చరిత్ర సృష్టించిన చేనేతలు అనాదిగా చంద్రబాబు పాలనలో దగాకు గురయ్యారు. చేనేతలను ఆదుకునేందుకు దివంగత సీఎం ఎన్టీఆర్ జనతా వస్త్రాల పథకానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకున్నా.. ఆ పథకానికి మంగళం పలికారు. తాను అధికారంలో ఉన్న 14 ఏళ్లు నేతన్నలకు చుక్కలు చూపించారు. వైఎస్సార్ హయాంలో చేనేతలను ఆదుకున్నారు. తిరిగి ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గత ప్రభుత్వాలకు భిన్నంగా చేనేతల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఏటా రూ.24 వేల వంతున ఐదేళ్లలో ఆయా కుటుంబాలకు రూ.1.20 లక్షల ఆర్థిక సాయంతోపాటు, నవరత్నాల పథకాల ద్వారా ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేశారు. ఆదుకోలేని చేనేత సొసైటీలు జిలాల్లో 280కు పైగా చేనేత సొసైటీలు ఉన్నాయి. నేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ వారి జీవితాలను ఆనందంగా గడిపేలా ఈ సొసైటీలు పని చేశాయి. నేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ ఉండే సొసైటీలు నేడు కేవలం పుస్తకాల్లో రాసుకునేందుకే సంఖ్య సరిపోతుంది. జిల్లాలో కేవలం సౌత్మోపూరు, బుచ్చిరెడ్డిపాళెం, నారాయణరెడ్డిపేట, ఇందుకూరుపేట, నెల్లూరు స్టోన్హౌస్పేట సొసైటీలు మాత్రం అంతో ఇంతో కార్మికులకు పని కల్పిస్తున్నాయి. అయినా ఆ సొసైటీలు కల్పించే పనులతో ఏ కుటుంబం బతికే పరిస్థితి లేకపోవడంతో చేనేత కార్మికులు రకరకాల పనులతో జీవితం సాగిస్తున్నారు. జిల్లాలో నేతన్న నేస్తం పథకం అమలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన పథకాలతోపాటు అదనంగా నేత మగ్గాలకు 200 యూనిట్లు, పవర్లూమ్స్కు 500 యూనిట్లు ఉచితంగా సరఫరా చేస్తామని నెరవేర్చలేని హామీలిచ్చింది. వీటితో మరో 25 రకాల హామీలిచ్చినా.. అధికారంలోకి వచ్చి రెండో ఏడాది గడుస్తున్నా.. చేనేత వర్గాలకు ఇచ్చిన హామీలు ఆయా కుటుంబాలకు అందని పరిస్థితి ఏర్పడింది. నూలు, రంగుల ధరలు, జీఎస్టీల దెబ్బ చేనేత పరిశ్రమ మూతపడే స్థాయికి చేరుకుంది. మగ్గం ఉన్న ప్రతి ఒక్కరూ కష్టాలను ఎదుర్కొంటున్నారు. కష్టపడి నేసిన వస్త్రాలు మార్కెట్ చేయాల్సిని ఆప్కో సంస్థ చేస్తున్న పనులు ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఆప్కో నిర్వహించాల్సిన చేనేత సంఘాల ఎన్నికలకు డబ్బులు కూడా లేకపోవడంతో ఏ విధంగా సహాయ పడలేని పరిస్థితి ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. తమను ఏ విధంగా ఆదుకోలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత జాతీయ దినోత్సవాన్ని ఆర్భాటంగా నిర్వహించడం సిగ్గు చేటని నేతన్నలు దుయ్యబడుతున్నారు. -
ఎవరికీ ఇబ్బంది లేకుండా భూసేకరణ
ఉలవపాడు: ప్రజలందరితో మాట్లాడి అందరిని సమన్వయం చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా భూ సేకరణపై ముందుకెళ్తామని కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. బుధవారం కరేడు, ఉప్పరపాళెం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఆయన మాట్లాడుతూ కరేడు ప్రాంతంలో మూడు గ్రామాలు తరలించాల్సిన అవసరం ఉందని, ఆ గ్రామాల్లో సుమారు 70 నుంచి 100 మందితో మాట్లాడినట్లు కలెక్టర్ చెప్పారు. వారికి భూసేకరణకు సంబంధించి చాలా అనుమానాలను ఈ మేరకు నివృత్తి చేశామని, వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్తో పాటు సిబ్బందిని నియమించినట్లు పేర్కొన్నారు. ఎకరాకు రూ.20 లక్షలతోపాటు అదనంగా తోటలు, ఆక్వా కల్చర్ ఉంటే అదనంగా వారికి నగదు అందిస్తామని, రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. 80 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చారని చెప్పారు. అందులో 13 ఎకరాలకు రూ.2.50 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు బుధవారం జమ అయినట్లు తెలిపారు. ముందుగా ఉప్పరపాళెం గ్రామస్తులతో కలెక్టర్ మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమకు ఒకేచోట ఇళ్లు ఇవ్వాలని కోరారు. హైవేపై గుడ్ న్యూస్ స్కూల్ వద్ద గ్రామాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మీకు నచ్చిన చోట భూమి లేకుంటే భూమికొని అయినా ఇస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఇల్లు కట్టించి ఇస్తామని తెలిపారు. చట్ట ప్రకారం ఇవ్వాల్సిన సదుపాయాలన్ని కల్పిస్తామని చెప్పారు. కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. ఉప్పరపాళెంలోని అంగన్వాడీ కేంద్రంలో భోజనాన్ని కలెక్టర్ పరిశీలించారు. కరేడు 1వ సచివాలయాన్ని సందర్శించి అక్కడ హైవే పక్కన భూములు కోల్పోనున్న రైతులతో మాట్లాడారు. వారి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శ్రీపూజ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ సురేష్తోపాటు రెవెన్యూ, పంచాయతీరాజ్ సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ ఆనంద్ స్పష్టీకరణ ఉప్పరపాళెం, కరేడులో పర్యటన -
విద్యార్థులకు అస్వస్థత.. తల్లిదండ్రుల ఆందోళన
తోటపల్లిగూడూరు: మండలంలోని కోడూరులో ఉన్నడాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల కళాశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి ఆరుగురి విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. కళాశాలలో రెండేళ్లుగా మంచినీటి సమస్య ఉందని, నాణ్యమైన భోజనం అందించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు అనేక సార్లు నిరసనలు వ్యక్తం చేసినా కళాశాల యాజమాన్యం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉన్నతాధికారుల పరిశీలన సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల కళాశాలలో ఫుడ్ పాయిజన్ విషయం వెలుగులోకి రావడంతో బుధవారం ఆ శాఖ జిల్లా కన్వీనర్ ప్రభావతి, స్థానిక తహసీల్దార్ పద్మావతి, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఎంఈఓ జయరామనాయుడు తదితరులు కళాశాల, హాస్టల్, మెస్ భవనాలను పరిశీలించారు. విద్యార్థినుల అస్వస్థతకు ఫుడ్ పాయిజన్ కారణమని కోడూరు పీహెచ్సీ వైద్యాఽధికారి హేనా స్పష్టం చేయడంతో ఆ కోణంలో పరిశీలించారు. తల్లిదండ్రుల నిరసన కళాశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి ఆరుగురు విద్యార్థులను అస్వస్థతకు గురైన విషయం తెలియడంతో విద్యార్థునులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున కళాశాలకు చేరుకొన్నారు. తమ బిడ్డలకు ఏమైందో అంటూ ఆందోళనలతో గంటల పాటు కళాశాల గేట్లు ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. పాఠశాల పేరెంట్స్ కమిటీ మెంబర్లు, కళాశాల ప్రిన్సిపల్ ఎస్తేరమ్మ నిర్లక్ష్య వైఖరి వల్లే విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తుందని ఆరోపించారు. రెండేళ్ల కలుషిత తాగునీరు, భోజనం సక్రమంగా లేదంటూ విన్నవించినా ఆమె పట్టించుకోలేని మండిపడ్డారు. తల్లిదండ్రులు నిలదీస్తే మా బిడ్డలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఫీల్డ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులు
● విధుల్లో నిర్లక్ష్యంపై డ్వామా పీడీ గంగాభవాని ఆగ్రహం పొదలకూరు : ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయకుండా కూలీలకు పనిదినాలు కల్పించకుండా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు షోకాజ్ నోటీసులను అందజేస్తామని డ్వామా పీడీ గంగాభవాని చెప్పారు. పొదలకూరు ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం పొదలకూరు, కలువాయి, సైదాపురం, రాపూరు మండలాల్లోని ఏపీఎంలు, టీఏలు, ఈసీలు, ఫీల్డ్ అసిస్టెంట్లతో పీడీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఈ క్లస్టర్ పనితీరు బాగలేదన్నారు. ఏ మండలంలోనూ లక్ష్యాలను అధిగమించే పరిస్థితి లేదన్నారు. ఆగస్టు నెలాఖరు నాటికి లక్ష్యాలను పూర్తి చేయకుంటే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. జిల్లాకు 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద రూ.125 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. అయితే ఈ మొత్తాన్ని రూ.70 కోట్లకు కుదించడం జరిగిందన్నారు. కూలీలకు వేతన బకాయిలు రూ.48 కోట్లు ఉండగా రూ.32 కోట్లు చెల్లించామని, మిగిలిన మొత్తం త్వరలోనే చెల్లిస్తామన్నారు. ఎఫ్ఏలు పనిచేయడం లేదు క్షేత్ర సహాయకులు (ఎఫ్ఏలు) గ్రామాల్లో సక్రమంగా పనిచేయడం లేదని డ్వామా పీడీ అభిప్రాయపడ్డారు. కొత్తగా నియామకం జరిగిన ఎఫ్ఏలు ఏడాది పూర్తయినా క్షేత్రస్థాయిలో కూలీల వద్ద పనులు చేయించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీల వద్ద కనీసం 4 గంటలు పనిచేయిస్తే వారికి రూ.300 గిట్టుబాటు అవుతుందన్నారు. కొన్ని పంచాయతీల్లో పనులే పెట్టడం లేదని, అలాంటి వారికి షోకాజ్ నోటీసులను అందజేసి నెలాఖరు వరకు పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఏపీడీ గాయత్రిదేవి, పొదలకూరు ఎంపీడీఓ నరసింహారావు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీపై దాడి దారుణం
● మాజీ మంత్రి అనిల్కుమార్ నెల్లూరు(స్టోన్హౌస్పేట): పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్సీ రమేష్పై బుధవారం టీడీపీ నాయకులు దాడి చేయడాన్ని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు పోలుబోయిన అనిల్కుమార్యాదవ్ ఖండించారు. రెడ్బుక్ రాజ్యాంగంతో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దాడులకు పాల్పడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వ్యక్తి స్వాతంత్య్రాన్ని, ఎన్నికల స్వేచ్ఛను హరించే ఇలాంటి వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్ర ఐటీ సంయుక్త కార్యదర్శిగా దోరశిల నెల్లూరు (స్టోన్హౌస్పేట): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన దోరశిల వెంకటరామిరెడ్డిని పార్టీ రాష్ట్ర ఐటీ విభాగ సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
5 నెలలు.. 11 కేసులు
నెల్లూరు(క్రైమ్): గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు రైల్వే పోలీసులు చర్యలు తీసుకున్నారు. రైళ్లు, రైల్వేస్టేషన్లలో తనిఖీలు నిర్వహిస్తూ అక్రమార్కులను అరెస్ట్ చేసి సరుకును స్వాధీనం చేసుకుంటున్నారు. ఒడిశా, ఏఓబీ సరిహద్దు ప్రాంతాల నుంచి జిల్లా మీదుగా తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు రోడ్డు, రైలు మార్గాన గంజాయి పెద్దఎత్తున తరలివెళ్తోంది. అక్రమార్కులు ఒడిశా, ఏఓబీ ప్రాంతాల్లో కేజీ రూ.3 వేల చొప్పున కొనుగోలు చేసి తమ ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలకు.. ఒడిశా, విశాఖ వైపు నుంచి తిరుపతి, చైన్నె, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లే రైళ్లలో అక్రమ రవాణా సాగుతోందని నెల్లూరు రైల్వే పోలీసులు గుర్తించారు. డీఎస్పీ జి.మురళీధర్ పర్యవేక్షణలో సీఐ ఎ.సుధాకర్ ఆర్పీఎఫ్, స్థానిక పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రైళ్లు, జిల్లాలోని కావలి, నెల్లూరు, గూడూరు రైల్వేస్టేషన్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని ఎక్కడ? ఎవరి వద్ద కొనుగోలు చేశారు? ఎవరికి సరఫరా చేస్తున్నారు? ఏ ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు? తదితర వివరాలను సేకరించి అరెస్ట్లు చేస్తున్నారు. సరఫరాదారులపై సైతం కేసులు నమోదు చేస్తున్నారు. కేసులిలా.. గడిచిన ఐదునెలల్లో గంజాయి అక్రమ రవాణాపై కావలిలో రెండు, నెల్లూరులో ఆరు, గూడూరులో మూడు కేసులు నమోదు చేశారు. మొత్తంగా 11 కేసులు నమోదు చేసి 96 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 14 మంది నిందితులను అరెస్ట్చేశారు. నిందితలందరూ దాదాపు ఇతర రాష్ట్రాలకు చెందినవారే. అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో కట్టడి చేసేంత వరకూ తనిఖీలు కొనసాగిస్తామని సీఐ ఎ.సుధాకర్ తెలిపారు. అదేక్రమంలో రైళ్లలో మత్తు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తిస్తే ఈగల్ టోల్ఫ్రీ నంబర్ 1972, లేదా 139 నంబర్కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని సూచిస్తున్నారు. రైళ్లలో పెద్ద ఎత్తున గంజాయి అక్రమ రవాణా తనిఖీలు చేపట్టిన రైల్వే పోలీసులు 96 కేజీల గంజాయి స్వాధీనం -
అవగాహనతో చెక్
రక్తనాళాల్లో రక్తప్రససరణ తగ్గితే వచ్చే మార్పులపై ప్రజలు అవగాహన పెంచుకోవాలి. అధిక బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఊబకాయం ఉన్నవారు, ధూమపానం, మద్యపానం చేసేవారు వాస్క్యులర్సర్జన్ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ప్రధానంగా 45 సంవత్సరాలు నిండిన వారు క్రమం తప్పకుండా రక్తప్రసరణకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది. లక్షణాలున్నట్టు గుర్తిస్తే చికిత్స పొందాలి. దీంతో కాళ్లు, వేళ్లను తొలగించాల్సిన పరిస్థితి ఉండదు. ప్రారంభంలోనే గుర్తిస్తే కేవలం మాత్రల ద్వారానే వాస్క్యులర్ సమస్యలు తగ్గించవచ్చు. రోజూ కనీసం 20 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ధూమపానం నిలిపి వేయడం ద్వారా రక్తప్రసరణ మెరుగు పరుచుకోవచ్చు. – డాక్టర్ వై.సుదర్శన్రెడ్డి, వాస్క్యులర్ సర్జన్, మెడికవర్ ఆస్పత్రి -
ఆటోలో వెళ్తుండగా..
● బ్యాగ్లోని నగదు మాయం నెల్లూరు(క్రైమ్): ఓ మహిళ ఆటోలో వెళ్తుండగా బ్యాగ్లోని నగదు మాయమైన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు హరనాథపురంలో వరలక్ష్మీదేవికి రాజరాజేశ్వరి గుడి ప్రాంతానికి చెందిన పద్మ రూ.లక్ష నగదు ఇవ్వాల్సి ఉంది. దీంతో గతనెల 21వ తేదీన ఆమె గుడివద్దకు వెళ్లగా పద్మ నగదు ఇచ్చింది. దానిని బ్యాగ్లో పెట్టుకుని ఆటోలో కోర్టు వద్దకు బయలుదేరింది. కొద్దిదూరం వెళ్లాక ఇద్దరు వ్యక్తులు అదే ఆటోలో ఎక్కారు. ఆమె కోర్టు వద్ద దిగి భర్తతో కలిసి ఇంటికి వెళ్లింది. భోజనం చేసిన అనంతరం బ్యాగ్ను తెరిచి చూడగా నగదు కనిపించలేదు. బాధితురాలు మంగళవారం చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటోలో తనతోపాటు ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులే నగదు మాయం చేసి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.ప్రమాదవశాత్తు చెరువులో పడి..● వ్యక్తి మృతి నెల్లూరు(క్రైమ్): ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందిన ఘటన నెల్లూరు బారాషహీద్ దర్గా సమీప స్వర్ణాల చెరువులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ప్రగతి నగ ర్కు చెందిన సుభాన్ (45) అవివాహితుడు. మటన్ అంగట్లో, కూలీ పనులు చేసుకుంటూ జీవ నం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన అతను తరచూ ఇంటికి వచ్చేవాడు కాదు. బారాషహీద్ దర్గా పరిసరాల్లో తిరుగుతూ రాత్రివేళల్లో అక్కడే ఉండేవాడు. సోమవారం ప్రమాదవశాత్తు స్వర్ణా ల చెరువులో పడి మునిగిపోయాడు. మంగళవా రం మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న దర్గామిట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. బాధిత కుటుంబ సభ్యులకు సమా చారం అందించారు. మృతుడి సోదరుడు జిలానీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.తాళం వేసిన ఇళ్లే లక్ష్యంఉదయగిరి: పట్టణంలో సోమవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. పోలీసుల కథనం మేరకు.. అగ్రహారం వీధికి చెందిన షేక్ అబ్దుల్ షరీఫ్ తన కుటుంబ సభ్యులతో ఆరుళ్లలో జరుగుతున్న గంధ మహోత్సవానికి వెళ్లారు. మంగళవారం ఉదయం ఇంటికి చేరుకున్నారు. ప్రధాన ద్వారం తాళాలు ధ్వంసం చేసి ఉండటాన్ని గుర్తించి లోపలికెళ్లి పరిశీలించారు. నాలుగు బీరువాల తాళాలు తీసి రూ.70 వేలు, నాలుగు బంగారు గాజులు, ఐదు ఉంగరాలు, వెండి వస్తువులు చోరీకి గురైనట్లు గుర్తించారు. కరీమావీధికి చెందిన షేక్ హుస్సేనీ కుటుంబం హైదరాబాద్లో ఉంటోంది. వారింట్లో కూడా గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి రూ.10 వేలు నగదు, వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి తన సిబ్బందితో వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్టీమ్ వేలిముద్రలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
హైవేపై రోడ్డు ప్రమాదం
● ఒకరి మృతి, ఇద్దరికి తీవ్రగాయాలు వరికుంటపాడు: మండలంలోని భోగ్యంవారిపల్లె సమీపంలో 565 జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరుకు చెందిన పూల రాజేంద్ర (44) తన బంధువులతో కలిసి శ్రీశైలం నుంచి నెల్లూరుకు కారులో వస్తున్నారు. దుత్తలూరు నుంచి ఒంగోలుకి మరో కారు వెళ్తోంది. భోగ్యంవారిపల్లి సమీపానికి వచ్చేసరికి రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో రాజేంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్స్లో నెల్లూరులోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. సమాచారం తెలుసుకున్న వరికుంటపాడు ఎస్సై ఎం.రఘునాథ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): ఓ కార్యాలయంలో చోరీకి పాల్పడిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం వేదాయపాళెం పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు వివరాలను వెల్లడించారు. రంగనాయకులపేట మహాలక్ష్మమ్మగుడి సమీపంలో నివాసం ఉండే పి.జిలానీబాషాకు కల్లూరుపల్లి హౌసింగ్బోర్డు ప్రాంతానికి చెందిన పి.అష్రఫ్ ఖాన్ వరుసకు తమ్ముడు. జిలానీ నెల్లూరు రూరల్ మండలం జీవీఆర్ఆర్ కళాశాల సమీపంలో ఖాన్ ప్రాపర్టీస్ కార్యాలయం నిర్వహిస్తున్నాడు. కుదువలో ఉన్న తన 50 గ్రాముల బంగారు ఆభరణాలను ఈనెల ఒకటో తేదీన విడిపించాడు. ఆభరణాలతోపాటు రూ.50 వేల నగదును బ్యాగ్లో పెట్టి కార్యాలయంలోని కప్బోర్డులో ఉంచాడు. ఆ సమయంలో అష్రఫ్ ఖాన్ సైతం అతడి వెంట ఉన్నాడు. అనంతరం ఇద్ద రూ బయటకు వెళ్లిపోయారు. మరుసటి రోజు సాయంత్రం జిలానీ కార్యాలయానికి రాగా బ్యాగ్ కనిపించలేదు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగతనం చేసింది అష్రఫ్ ఖాన్, అతడికి సన్నిహితుడైన బాలు డిగా గుర్తించారు. మంగళవారం గొలగమూడి క్రాస్రోడ్డుకు కొద్దిదూరంలోని ఓ స్కూల్ సమీపంలో వారి అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. 50 గ్రాముల బంగారు ఆభరణాలు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. అష్రఫ్ను అరెస్ట్ చేయగా బాలుడిని జువనైల్ హోంకు తరలించారు. కేసును ఛేదించిన ఇన్స్పెక్టర్, ఎస్సై నవీన్, పీఎస్సై సాయికల్యాణ్, సిబ్బందిని నగర డీఎస్పీ సింధుప్రియ అభినందించారు. -
గ్రామంలో ఉన్నారని..
● సీపీఎం నేతల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉలవపాడు: 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్న రామకృష్ణాపురం గ్రామంలో తిరుగుతున్నారని సీపీఎం నాయకులను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్రామంలో ఇంటింటి సర్వే జరుగుతోంది. సర్వే అవసరం లేదు.. డాక్యుమెంట్లు ఇవ్వొద్దని గిరిజనులకు నేతలు చెబుతున్న సమయంలో 20 మంది పోలీసులు వచ్చి స్టేషన్కు తరలించారు. వారిలో సీపీఎం ఉలవపాడు ప్రాంతీయ కార్యదర్శి జీవీబీ కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లాకార్యదర్శి పుల్లయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మూలి వెంగయ్య ఉన్నారు. తర్వాత పూచీకత్తుపై విడుదల చేశారు. -
ఎల్లో మీడియాది దుష్ప్రచారం
కందుకూరు: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందిన నల్లపరెడ్డి అజిత్కుమార్రెడ్డి వైఎస్సార్సీపీ నాయకుడంటూ ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆ పార్టీ నేతలు అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అజిత్కుమార్రెడ్డి గత ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కోసం ఉలవపాడు మండలంలో అనుచరులతో కలిసి ప్రచారం నిర్వహించారన్నారు. తెలుగుదేశం అభ్యర్థుల కోసం పనిచేశారనేది బహిరంగ రహస్యమేనన్నారు. అతను అజిత్కుమార్రెడ్డి ఏడాదిన్నర కాలంగా వైఎస్సార్సీపీకి దూరంగా ఉంటున్నారని, ప్రస్తుత నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ను అతను ఇప్పటి వరకు కలిసిన దాఖలాల్లేవని స్పష్టం చేశారు. అసత్య ప్రచారం మాని వాస్తవాలు తెలుసుకో వాలన్నారు. సమావేశంలో కార్యక్రమంలో ఉలవపాడు మండలాధ్యక్షుడు నన్నం పోతురాజు, జిల్లా అధికార ప్రతినిధి ముప్పవరపు కిశోర్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ వెలిచర్ల ధనకోటి, నియోజకవర్గ ఐటీ వింగ్ అధ్యక్షుడు పాలవల్లి అమరనాథరెడ్డి, యువజన అధ్యక్షుడు మద్దసాని నవీన్కృష్ణయాదవ్, సోషల్ మీడియా అధ్యక్షుడు కాపులూరి మధుసూదన్, సీనియర్ నాయకులు అమ్మనబ్రోలు బ్రహ్మయ్య, మండల సోషల్ మీడియా అధ్యక్షుడు ఆలూరి మధుబాబు తదితరులు పాల్గొన్నారు. అజిత్కుమార్రెడ్డి టీడీపీ అభ్యర్థుల కోసం పనిచేశాడు విలేకరుల సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు -
జలాశయానికి కృష్ణా జలాలు
● 36 టీఎంసీలు దాటిన సోమశిల సోమశిల: జలాశయానికి కృష్ణా జలాల ఇన్ఫ్లో క్రమక్రమంగా పెరుగుతోంది. కృష్ణా జలాలు రాక ముందు 28.660 టీఎంసీలు నిల్వ ఉన్నా యి. మంగళవారం నాటికి 36 టీఎంసీలు దాటింది. జలాశయానికి గత నెల 11వ తేదీ నుంచి వరద జలాలు వస్తున్నాయి. మంగళవారం నాటికి 14,105 క్యూసెక్కులకు చేరుకుంది. జలాశయం నుంచి పెన్నార్ డెల్టాకు క్రస్ట్గేట్ల ద్వారా 1100, పవర్ టర్నెల్ ద్వారా 2,500, ఉత్తరకాలువకు 370, కండలేరు కాలువకు 6 వేల క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. -
భూములను మింగేస్తున్న ‘పోరంబోకు’లు
కలువాయి (సైదాపురం): అధికారమే అండగా కూటమి పార్టీల నేతలు చెలరేగిపోతున్నారు. కంటికి కనిపించిన ఇసుకనూ, మట్టినీ వదల్లేదు. ఇప్పుడు చెరువులు, అటవీ, పోరంబోకు భూములనూ కబ్జా చేస్తున్నారు. తాజాగా కలువాయి మండలం 598 సర్వే నంబర్లోని కుల్లూరు ఎర్ర చెరువును ఆనుకుని ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ భూములను సైతం దాదాపు 20 ఎకరాలను మంగళవారం దర్జాగా కబ్జా చేసి చదును చేశారు. అడిగేవారు ఎవరూ లేకపోవడంతో స్ధానిక ఎమ్మెల్యే పేరు చెప్పుకుని గ్రామ రెవెన్యూ అధికారి సహకారంతో దర్జాగా ఎర్ర చెరువు పోరంబోకు, రిజర్వ్ ఫారెస్టు భూములను చదును చేసి చుట్టూ కంచె కూడా వేశారు. ఈ విషయంపై గ్రామస్తులు పిఱ్యాదు చేయడంతో ఇన్చార్జి తహసీల్దార్ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి అక్కడ జరిగే పనులను అడ్డుకున్నారు. ఘటనా స్థలం నుంచి ఫారెస్ట్ అధికారులకు ఇన్చార్జి తహసీల్దార్ ఫోన్ చేయగా వారు స్విచ్ఛాఫ్ చేసుకుని ఉండడం గమనార్హం. దీన్ని బట్టి అటవీ శాఖ అధికారుల హస్తం కూడా గ్రామస్తులు భావిస్తున్నారు. మూడు రోజుల నుంచి ఎవరికీ తెలియకుండా బ్రాహ్మణపల్లి, వెంకటరెడ్డిపల్లి రిజర్వ్డ్ ఫారెస్ట్లో 20 ఎకరాల భూమిని చదువు చేయడాన్ని చూసి రెవెన్యూ అధికారులు అవాక్కయారు. గ్రామ రెవెన్యూ అధికారి గ్రామంలోకి వచ్చినప్పటి నుంచి ఇటీవల కుల్లూరు గ్రామంలో భూ ఆక్రమణలు పెరిగిపోయాయిని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటీవల ఎర్ర చెరువు అలుగు ప్రాంతాన్ని ఆక్రమిస్తున్న విషయంపై పత్రికల్లో వచ్చిన కథనాలకు ఆత్మకూరు ఆర్డీఓ పావని స్పందించి పనులు వెంటనే ఆపాలని అప్పటి తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల మళ్లీ కూటమి నాయకులు భూములు చదును చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందరికీ తెలిసే ప్రదేశం కాదు కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా మూడు రోజుల నుంచి పనులు చకచకా చేసేస్తున్నారు. రిజర్వ్ ఫారెస్టు చెరువు పోరంబోకు పొలాల్లో ఆక్రమణలు చేపడితే చర్యలు తప్పవని ఇన్చార్జి తహసీల్దార్ వెంకటేశ్వర్లు వారిని హెచ్చరించారు. -
ఇతర జిల్లాల రైస్మిల్లర్లతో ధాన్యం కొనుగోళ్లు
నెల్లూరు (పొగతోట): రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ఇతర జిల్లాల రైస్మిల్లర్లతో ధాన్యాన్ని కొనుగోలు చేయించేలా చర్యలు చేపడుతున్నామని డీఎస్ఓ విజయకుమార్ పేర్కొన్నారు. నగరంలోని జిల్లా పౌరసరఫరాల కార్యాలయంలో ప్రకాశం, వైఎస్సార్ కడప, తిరుపతి జిల్లాల రైస్మిల్లర్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెలాఖరు నుంచి కోతలు ప్రారంభమయ్యే అవకాశమున్న నేపథ్యంలో, జిల్లానే కాకుండా ఇతర జిల్లాల రైస్మిల్లర్లతో కొనుగోలు చేయించేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. రైతులు నష్టపోకుండా ప్రభు త్వం ప్రకటించిన మద్దతు ధరకే కొనుగోలు చేయనున్నామని పేర్కొన్నారు. సివిల్ సప్లయ్స్ డీఎం అర్జున్రావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీకి ఓట్లు వేశామని.. ● దౌర్జన్యంగా ఆక్రమించి రోడ్డు వేశారు నెల్లూరురూరల్: గత ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీకి ఓటు వేశామనే అక్కసుతో మా పట్టా పొలంలో టీడీపీ వర్గీయులు అక్రమంగా రోడ్డు నిర్మాణం చేపట్టారని వెంకటాచలం మండలం తిక్కవరపాడు గ్రామస్తులు తమలపాకుల ఏడుకొండలు, తమలపాకుల వెంకటేశ్వర్లు, తమలపాకుల రామయ్య పేర్కొన్నారు. నగరంలోని స్థానిక ప్రెస్క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తిక్కవరపాడులోని సర్వే నంబర్ 2120–2, 5, 9ల్లో 7.68 ఎకరాల విస్తీర్ణంలో తమకు వారసత్వంగా 3.48 ఎకరాల వ్యవసాయ భూమి సంక్రమించిందని తెలిపారు. మా పొలానికి చుట్టు పక్కల ఉన్న టీడీపీ నేతలు అధికార, అంగబలంతో ఈ నెల 2, 3 తేదీల్లో శని, ఆదివారాల్లో జేసీబీలు, ట్రాక్టర్లతో అక్రమంగా రోడ్డు నిర్మాణం సాగించారని వాపోయారు. ఆ సమయంలో తాము పొలం దగ్గర ఉండి ఉంటే చంపేసే వాళ్లని ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు స్టే, రెవెన్యూ కోర్టు ఆర్డర్లను ధిక్కరించి రోడ్డు నిర్మాణం చేపట్టారని బాధితులు తెలిపారు. కలెక్టర్, రెవెన్యూ అధికారులు స్పందించి నిష్పక్షపాతంగా విచారణ జరిపి న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ సమావేశంలో బాధితులు తమలపాకుల ఏడుకొండలు, వెంకటేశ్వర్లు, రామయ్య, పద్మమ్మ, శ్రీదేవమ్మ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం నెల్లూరురూరల్: జిల్లాలోని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖలో 12 ప్రాజెక్ట్ల పరిధిలోని 28 అంగన్వాడీ కార్యకర్తలు, 168 అంగన్వాడీ హెల్పర్లకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆనంద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5 నుంచి 26వ తేదీ సాయంత్రంలోగా అభ్యర్థులు తమ పరిధిలోని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులై, జూలై 2025 నాటికి 21 సంవత్సరాలు నిండి, 35 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. వివాహిత మహిళ అయి ఉండాలని, అవివాహితులు అనర్హులని తెలిపారు. పోస్టుల ఎంపిక ప్రక్రియ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రూల్ ఆఫ్ రిజిర్వేషన్ మేరకు జరుగుతుందన్నారు. ఆయా ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఏ కులం నిర్ణయించబడిందో సదరు కులానికి చెందిన వారే అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ హ్యాబిటేషన్స్లోని పోస్టులకు ఆయా సామాజికవర్గాలు మాత్రమే అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ హ్యాబిటేషన్లోని పోస్టులకు 10వ తరగతి పాసైన వారు లేని పక్షంలో ఆ తదుపరి తరుగతుల వారు అర్హులన్నారు. ఆయా ఖాళీల వివరాలను సంబంధిత గ్రామ, వార్డు సచివాలయ నోటీసు బోర్డుల్లో ప్రచురించడం జరుగుతుందన్నారు. సీడీపీఓలు పత్రిక ప్రకటనల్లో నోటిఫికేషన్ జారీ చేస్తారన్నారు. కిలో పొగాకు గరిష్ట ధర రూ.280 కలిగిరి: కలిగిరిలోని పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం కిలో గరిష్ట ధర రూ.280 లభించింది. జనరల్ క్లస్టర్కు చెందిన రైతులు 331 పొగాకు బేళ్లను అమ్మకానికి తీసుకురాగా 212 బేళ్లను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా వేలం నిర్వహణాధికారి శివకుమార్ మాట్లాడుతూ కిలో పొగాకు గరిష్ట ధర రూ.280, కనిష్ట ధర రూ.160 పలుకగా, సరాసరి రూ.226.79 లభించిందన్నారు. వేలంలో 19 కంపెనీలు పాల్గొన్నాయని వివరించారు. -
మత్తు పదార్థాల విక్రయాలపై నియంత్రణేదీ?
రెడ్బుక్ రాజ్యాంగం.. అక్రమ కేసులు, అరెస్ట్లు కూటమి అధికారంలోకి వచ్చాక పోలీస్ వ్యవస్థ పూర్తిగా ప్రతిపక్ష నేతలపై రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేసే పనిలో నిమగ్నం కావడంతో నేరస్తులు చెలరేగిపోతున్నారు. గంజాయి, మత్తు మాదక ద్రవ్యాలు, మద్యం విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతున్నాయి. జిల్లాలో నేరస్తులను గుర్తించి, వారిపై నిఘా ఉండడంతోపాటు వారి దినచర్యలను పర్యవేక్షించి కటకటాలపాల్జేయాల్సిన పోలీస్ యంత్రాంగం నిర్వీర్యం అయిపోయింది. ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు, అరెస్ట్లు, కస్టడీలు, విచారణలతో కాలక్షేపం చేస్తోంది. ● ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో నెల్లూరుకు చెందిన ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించి వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఆ ఇద్దరు యువకులు ఎవరిని హత్య చేస్తున్నారో కూడా వారికే తెలియదు. కేవలం రూ.30 వేలిచ్చి హత్య చేసేందుకు కిరాయి ముఠా పిలిపించుకుని దారుణ హత్యలో పాల్గొనేలా చేసింది. వీరు కేవలం గంజాయి మత్తు కోసం ఈ దారుణ ఘటనకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ● హైదరాబాద్లో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కేతావత్ చందు రాథోడ్ హత్యకు గురయ్యాడు. గత నెల 15న మార్నింగ్ వాకింగ్కు వెళ్లి ఇంటికి వస్తుండగా కిరాయి హంతకులు కళ్లల్లో కారం కొట్టి తుపాకీతో కాల్చి చంపారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ దారుణ హత్యలో నెల్లూరు జిల్లాకు చెందిన అర్జున్, రాంబాబు సుపారీ తీసుకుని భాగస్వామ్యం అయ్యారు. అక్కడి పోలీసులు నిందితులను కావలి సమీపంలోని ముసునూరు టోల్గేట్ వద్ద అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ● గతంలో హైదరా బాద్లోని ఓ అపార్ట్మెంట్లో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం సమాచారంపై పోలీసులు దాడులు చేస్తే నెల్లూరుకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కుమారుడు పట్టుబడ్డాడు. అతనే ఆర్గనైజర్గా తేల్చారు. జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధికి కీలక అనుచరుడు కావడంతో రంగంలోకి దిగి కేసు మాఫీ కోసం అష్టకష్టాలు పడ్డారు. ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం మత్తు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపింది. అక్రమార్కుల బెండు తీసి కటకటాల వెనక్కి నెట్టింది. జిల్లాలో నేరాలు గణనీయంగా తగ్గాయి. ప్రజలు హాయిగా జీవించారు.’ ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. జిల్లాలో క్రమేపి శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయి. విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు, బెల్టుషాపులు, మాదక ద్రవ్యాల సరఫరా పెరిగింది. నేరాలు, మారణహోమాలు మితిమీరాయి.’ సాక్షిప్రతినిధి, నెల్లూరు: జిల్లా కేంద్రం నుంచి మారుమూల ప్రాంతాల వరకు నేరప్రవృత్తి పేట్రేగి పోతోంది. ప్రధానంగా నెల్లూరు నగరంలో నేరమేథం వేళ్లూనుకుంటోంది. గంజాయి, మత్తు ఉత్ప్రేరకాలకు బానిసలైన యువత విచక్షణ కోల్పోయి నేరాలకు పాల్పడుతోంది. వ్యసనాలను తీర్చుకునేందుకు డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఒంటరిగా వెళుతున్న వారిని కత్తులతో బెదిరించి అందినకాడికి దోచుకుంటున్నారు. ఎదురు తిరిగిన వారిపై దాడులకు తెగబడుతున్నారు. ఈ పరిణామాలతో ఇళ్లు విడిచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంటోంది. జిల్లాలో జరుగుతున్న హత్యలు, హత్యాయత్నాలు, దాడుల్లో అధిక శాతం గంజాయి మత్తులోనే జరుగుతున్నాయని పోలీసుల విచారణలో తేలింది. నెల్లూరు నగరంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. దాడులు, దౌర్జన్యాలు, హత్యలు నిత్యకృత్యంగా మారాయి. గంజాయి దొరకని ప్రాంతం లేదు. యువత, విద్యార్థులు లక్ష్యంగా విక్రయాలు సాగిస్తున్నారు. తొలుత ఫ్యాషన్కు అలవాటు పడిన వారు క్రమేపి బానిసలై మత్తు లేకపోతే బతకలేని స్థితిలోకి వెళ్లిపోతున్నారు. శివారు ప్రాంతాల్లోనే గంజాయి విక్రయాలు నెల్లూరు నగరంలోని కపాడిపాళెం, పొర్లుకట్ట, భగత్సింగ్కాలనీ, పాతచెక్పోస్టు, ఎన్టీఆర్నగర్, హరనాథపురం ఎక్స్టెన్షన్ ఏరియా, వెంగళ్రావునగర్, కొత్తూరు, పుత్తాఎస్టేట్, రాజీవ్గృహకల్ప సమీపం, విజయమహల్గేటు తదితర ప్రాంతాల్లో గంజాయి మత్తులో యువత నేరాలకు పాల్పడుతున్నారు. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధితుల్లో కొందరు పోలీసులకు ఫిర్యాదులు చేస్తుండగా మరి కొందరు భయంతో పోలీసుస్టేషన్ల వరకు వెళ్లడం లేదు. ఇదే అదనుగా భావించిన కొందరు నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. లాఠీ దెబ్బలను మాన్పుతున్న మత్తు ఇంజెక్షన్లు చాలా మంది యువకులు గంజాయి ఇచ్చే మత్తు చాలక, కేన్సర్ రోగులకు చివరి దశలో ఇచ్చే శక్తి వంతమైన మార్ఫిన్, పెథిడిన్, ఫోర్ట్విన్, ఫినార్గోన్ వంటి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్లు వేసుకొంటున్నారని పోలీసుల విచారణలో తేలింది. సమాచారం. వీటిని వాడడం వల్ల శరీరం మొత్తం మత్తు ఆవహించి, మొద్దుబారిపోతోంది. ఈ ఇంజెక్షన్ వేసుకున్న వారికి నొప్పి కూడా తెలియదంట. పోలీసులు లారీతో చావబాదినా ఈగ వాలినట్లు కూడా ఉండదని, దీంతో పోలీసులు ఎన్నిసార్లు లాఠీలు ఝుళిపించినా.. నిజాలు బయటకు రావడం లేదని తెలుస్తోంది. .. అడ్డాగా నెల్లూరు కళ్లల్లో మత్తు.. చేతుల్లో కత్తులు, తుపాకీలు.. మాటా మాటకే కత్తులు ఝళిపిస్తున్నాయి. సుపారీలతో తుపాకీలు పేలుతున్నాయి. పాత కక్షలు, ఆస్తి తగాదాలు, మద్యం మత్తులో విభేదాలు నరమేధానికి ప్రేరేపిస్తున్నాయి. చిన్న గొడవలు రక్తపాతాన్ని సృష్టిస్తున్నాయి. రాత్రి పూటే కాదు పగలు కూడా రహదారుల్లో తిరగాలంటే వెన్నులో వణుకు పుడుతోంది. ఎక్కడ కత్తి కరుస్తుందో అనే ఆందోళన కనబడుతోంది. సుపారీ నేరాలు నెల్లూరు నుంచి అంతర్ జిల్లాలు, అంతర్రాష్ట్ర స్థాయి వరకు ఎగబాకాయి. ఎక్కడ నేరం జరిగినా.. నేరస్తుల మూలాలు నెల్లూరులోనే చూపిస్తున్నాయి. నేరాలను నియంత్రించాల్సిన పోలీసులు ఈ పనికి స్వస్తి పలికి.. రెడ్బుక్ రాజ్యాంగంతో ప్రత్యర్థి పార్టీ నేతలపై అక్రమ కేసులు, అరెస్ట్ల్లో తలమునకలు అవుతున్నారు. గడిచిన ఏడాది కాలంగా జిల్లాలో జరిగిన మారణహోమం ఇందుకు దర్పణం.ఏడాది కాలంలో జిల్లాలో ఘటనలు మచ్చుకు కొన్ని.. నెల్లూరు ప్రగతినగర్లో గంజాయి, మద్యం మత్తులో కొందరు యువకులు కారు డ్రైవర్ను అతి కిరాతకంగా హత్య చేశారు. ముత్తుకూరు బస్టాండ్ వద్ద గంజాయి మత్తులో ఇద్దరు యువకులు ఓ మహిళను చంపుతామని బెదిరించి రెండు సెల్ఫోన్లను దోచుకెళ్లారు. తల్పగిరికాలనీ వద్ద నాగేంద్రను కత్తులతో చంపుతామని బెదిరించి అతని ఫోన్పే నుంచి రూ.5 వేల నగదును దుండగులు ట్రాన్సఫర్ చేయించుకున్నారు. టిఫిన్ విషయంలో మాటామాటా పెరిగి టెంపో ట్రావెల్స్ నిర్వాహకుడు అల్లాభక్షును మత్తులో ఉన్న రంగనాయకులపేటకు చెందిన షేక్ ఇషాక్ హత్య చేశాడు. మద్యం మత్తులో మాటామాటా పెరగడంతో సుల్తాన్ అనే వ్యక్తిని ఇద్దరు హత్య చేశారు. గంజాయి మత్తులో ఉన్న కొందరు నెల్లూరు సుజాతమ్మకాలనీలోని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. మత్తులో ఉన్న ముగ్గురు యువకులు రైల్వేస్టేషన్ వద్ద బైక్పై వెళుతున్న బ్యాంకు ఉద్యోగిని చంపుతామని కత్తులతో బెదిరించి నగదు దోచుకున్నారు. ఇటీవల నెల్లూరు నగరంలోని అయ్యప్పగుడి సెంటర్లో ఓ యువకుడు హోటల్ కెళ్లి టిఫన్ ఆర్డర్ ఇచ్చాడు. తనకంటే వెనకున్న ఓ వ్యక్తి ఆర్డర్ ఇచ్చారు. ముందుగా తాను టిఫిన్ ఆర్డర్ ఇచ్చినా వెనకొచ్చిన వ్యక్తికి ఇచ్చాడని కారణంతో ఇద్దరు మధ్య జరిగిన చిన్న వివాదంతో దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. నెల్లూరు రామలింగాపురం రైల్వే బ్రిడ్జి సమీపంలో రౌడీషీటర్ కత్తి రవి (32)ని దారుణంగా హత్య చేసిన నిందితులు. ఆర్థిక విభేదాల నేపథ్యంలో ముత్యాలపాళెంలో ఎం.పౌల్ (35)ను దారుణంగా హత్య చేసిన నిందితులు. కొండాపురం మండలంలో తిరుపాల్ (55) అనే వ్యక్తిని దారుణంగా హత్య చేసి 25 మేకలను అపహరించుకెళ్లారు. ఉదయగిరిలో జనం చూస్తుండగానే వరుసకు బావను బావమరుదులే హత్య చేశారు. ఆస్తి తగాదాలే కారణం. కలువాయి మండలంలోని పల్లంకొండలో గోపి అనే యువకుడు దారుణ హత్యకు గురైయ్యాడు. కొడవలూరు మండలం టపాతోపు వద్ద హిజ్రా నాయకురాలు హాసీనిని ప్రత్యర్థులు దారుణంగా చంపారు కొడవలూరు మండలం మిక్కిలింపేట వద్ద బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన స్టీల్వ్యాపారి రమేష్ హత్యకు గురైయ్యాడు. నెల్లూరు ఉడ్హౌస్ సంఘంలో సస్పెక్ట్ షీటర్ కళ్యాణ్ను పాతకక్షల నేపథ్యంలో హత్య చేసిన దుండగులు. ఇందిరాగాంధీనగర్లో రౌడీషీటర్ సుజనకృష్ణ అలియాస్ చింటూను స్నేహితులే కిరాతకంగా హత్య చేశారు. తాజాగా జాకీర్ హుస్సేన్నగర్ న్యూకాలనీలో మద్యం మత్తులో దూషించాడని భర్త శ్రీనివాసకుమార్ను హత్య చేసిన భార్య. అంతర్రాష్ట్ర స్థాయిలో నేరాల మూలాలు ఇక్కడే గంజాయి, మద్యం, మత్తు ఇంజెక్షన్లతో విచక్షణ కోల్పోతున్న యువకులు సుపారీ హత్యలకు తెగబడుతున్న యువత గంజాయి బ్యాచ్కు అధికార పార్టీ నేతల అండదండలు హంతకులను వెనకేసుకొస్తుండడంతో పోలీసుల మౌనం ఆరు నెలల్లో ఒక్క నెల్లూరులోనే 20 పైగా హత్యలు అక్రమ కేసులు, అరెస్ట్లతో నేర నియంత్రణను మరిచిన ఖాకీలు సింహపురిలో తిరగాలంటే భయం.. భయం ప్రతి నెలా నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ సమన్వయ సమావేశంలో కలెక్టర్, ఎస్పీలు అన్ని శాఖల సమన్వయంతో జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూనే ఉన్నారు. వారి ఆదేశాలను బేఖాతరు చేస్తూ అధికారులు మొక్కుబడి చర్యలకే పరిమితమవుతున్నారు. అడపాదడపా దాడులతో సరిపెట్టుకుంటున్నారు. మత్తు, మాదక ద్రవ్యాల నిర్మూనలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఈగల్ ఊసే జిల్లాలో లేకుండాపోయింది. అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ప్రజల రక్షణకు పటిష్ట చర్యలు తీసుకున్నామని, బీట్లు పెంచామని, డ్రోన్లతో నిఘా పెట్టామని పోలీసులు చెబుతున్నప్పటికీ ప్రజలకు మాత్రం తగినంత భరోసా దొరకడం లేదు. -
జోనల్–4 ప్రెసిడెంట్గా కాకాణి పూజిత
నెల్లూరు (స్టోన్హౌస్పేట): వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జోన్ల వారీగా రాష్ట్ర విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి కుమార్తె కాకాణి పూజితను నెల్లూరు, ప్రకాశం, అన్నమ్మయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల(జోన్–4)కు వర్కింగ్ ప్రెసిడెంగ్గా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాకాణి గోవర్ధన్రెడ్డిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి, దాదాపు 70 రోజులుగా జిల్లా జైల్లో అక్రమ నిర్బంధంలో ఉంచింది. కాకాణిని అరెస్ట్ చేసి సర్వేపల్లిలో వైఎస్సార్సీపీని బలహీనపరచాలని కూటమి నేతలు భావించారు. తన తండ్రిని జైల్లో పెట్టిన తర్వాత పార్టీ కేడర్కు తానున్నాంటూ భరోసా కల్పిస్తూ పార్టీ నేతలకు అండగా నిలిచారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న పూజిత సేవలను వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తిస్తూ పార్టీ జోనల్ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి తనపై పెట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. -
జిల్లాలో ఇలా..
● రెంట్ రూపంలో ఏటా కోట్లాది రూపాయలు అద్దె భవనాలు.. అరకొర వసతుల నడుమ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు కునారిల్లుతున్నాయి. భవనాలకు రెంట్ రూపంలో ఏటా కోట్లాది రూపాయలను చెల్లిస్తున్నా, వసతులు మాత్రం దుర్భరంగా మారాయి. ఆట బొమ్మల కొరతతో చిన్నారులు పాత వాటితోనే కాలక్షేపం చేయాల్సి వస్తోంది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇక్కడ సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ● ఆట బొమ్మల్లేక పాత వాటితోనే కాలక్షేపం ● అమలుకు నోచుకోని మెనూ ● అంగన్వాడీ కేంద్రాల్లో ఇదీ దుస్థితి ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం నెల్లూరు (పొగతోట): జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు దుర్భర స్థితికి చేరుకుంటున్నాయి. కేంద్రాల్లో అభివృద్ధి, మౌలిక వసతులపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో చిన్నారులు, బాలింతలు, గర్భిణులు, సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు. వీటిని అధునాతనంగా తీర్చిదిద్దుతామని పాలకులు చెప్పినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ మాత్రం మారడంలేదు. చాలా చోట్ల సొంత గూడు లేకపోవడంతో, సమస్య ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదీ తీరు.. జిల్లాలో 2934 అంగన్వాడీ కేంద్రాలుండగా, ఇందులో 732 అద్దె భవనాల్లో కార్యకలాపాలను సాగిస్తున్నాయి. ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు 65,215.. మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 52,635.. గర్భిణులు 12,843.. బాలింతలు 11,461 మంది ఉన్నారు. వాస్తవానికి ఇక్కడ చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు ఆట వస్తువులతో ఉత్తేజపరుస్తుంటారు. అయితే సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ఇవి నేటికీ సరఫరా కాలేదు. అదే గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పరికరాలను క్రమం తప్పకుండా అందజేసేవారు. నాసిరక బియ్యం సరఫరా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందజేస్తారు. అయితే సన్న బియ్యానికి బదులు ముతక బియ్యాన్ని సరఫరా చేశారని తెలుస్తోంది. మరోవైపు గర్భిణులు, బాలింతలకు నెలకు మూడు కిలోల చొప్పున బియ్యం.. కిలో కందిపప్పు, అర లీటర్ నూనె,, ఐదు లీటర్ల పాలు.. 25 కోడిగుడ్లు.. కిలో అటుకులు.. రెండు కిలోల రాగిపిండి.. 250 గ్రాముల డ్రై ఫ్రూట్స్.. తదితరాలను ఇవ్వాల్సి ఉన్నా, పూర్తిస్థాయిలో అందజేయడంలేదు. మెనూ అమలూ అంతంతే.. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆహారాన్ని సోమవారం నుంచి శనివారం వరకు అందించాల్సి ఉంది. అయితే మెనూ అమలు అంతంతమాత్రంగా ఉందనే ఫిర్యాదులొస్తున్నాయి. ఆ సమయంలో అధికారులు తనిఖీలకెళ్తే, ముందుగా సమాచారం తెలుసుకొని నాణ్యమైన వాటిని పంపిణీ చేస్తున్నారనే విమర్శలున్నాయి. వీటి బలోపేతానికి గత ప్రభుత్వ హయాంలో పెద్ద పీట వేసినా, నేడంతా అస్తవ్యస్తంగా మారింది. అద్దెల రూపంలో నెలకు రూ.35 లక్షలు జిల్లాలోని 732 అంగన్వాడీ కేంద్రాలకు సుమారు రూ.35 లక్షలకుపైగా అద్దెను ప్రతి నెలా చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి రూ.4.2 కోట్లను సమర్పిస్తున్నారు. శాశ్వత భవనాల నిర్మాణాల దిశగా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పంపడంలో విఫలమవుతున్నారు. భవన నిర్మాణాలకు భూముల్లేవనే సాకు చూపి ఏటా అద్దె రూపంలో నిధులను భారీగా వెచ్చిస్తున్నారు. నెరవేరని సంకల్పం అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలకు గానూ జెడ్పీ నుంచి నిధులను చైర్పర్సన్ ఆనం అరుణమ్మ విడుదల చేశారు. అయితే వీటిని సద్వినియోగం చేసుకొని, నిర్మాణాలను చేపట్టడంలో ఐసీడీఎస్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఇదే అంశమై జెడ్పీ సర్వసభ్య, స్థాయీ సంఘ సమావేశాల్లో తరచూ ప్రస్తావిస్తున్నా, ఎలాంటి పురోగతి కానరావడంలేదు. ఇప్పటికై నా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపి నిర్మాణాలను చేపట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఐసీడీఎస్ ప్రాజెక్టులు – 7 కేంద్రాలు – 2934 అద్దె భవనాల్లో ఉండేవి – 732 చెల్లించే మొత్తం రూ.ఆరు వేలు (పట్టణాల్లో) రూ.రెండు వేలు (పల్లెల్లో) ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు – 65,215 మూడు నుంచి ఆరేళ్లలోపు వారు – 52,635 గర్భిణులు – 12,843 బాలింతలు – 11,461ప్రతిపాదనలను పంపాం అంగన్వాడీ కేంద్రాల్లో పాత ఆట వస్తువులే ఉన్నాయి. వీటితోనే సరిపెడుతున్నాం. కొత్త వాటి కోసం ప్రతిపాదనలను పంపాం. త్వరలో వచ్చే అవకాశముంది. అద్దె భవనాలకు సంబంధించి ఏటా ఇదే పరిస్థితి నెలకొంది. స్థలాల్లేని కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. – హేనాసుజన్, ఐసీడీఎస్ పీడీ -
చెక్ పవర్ రద్దుకు కుట్రలు
వెంకటాచలం పంచాయతీలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులను చేయించాం. పనులపై రాజకీయ కక్షతో ఇప్పటివరకు రెండుసార్లు విచారణ జరిపించారు. అవినీతికి సంబంధించిన ఒక్క ఆధారం లభించకపోవడంతో పునర్విచారణకు కమిటీని నియమించారు. పంచాయతీలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన నగదును సర్పంచ్ భర్త అకౌంట్లో జమ చేయడం తప్పెలా అవుతుంది. పనులు చేయకుండా నిధులను దుర్వినియోగం చేసినట్లు ఎక్కడా నిరూపించలేకపోయారు. చెక్పవర్ను రద్దు చేయాలనే ఇన్ని కుట్రలు చేస్తున్నారు. – మందల రాజేశ్వరి, వెంకటాచలం సర్పంచ్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి కుట్రలు.. భేతాళ కథలను తలపిస్తున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో కీలక నేత, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్యను వీరు టార్గెట్ చేశారు. గతేడాది డిసెంబర్లో ఓ మహిళతో తప్పుడు కేసు పెట్టించి 18 రోజుల పాటు జైల్లో నిర్బంధించి వేధింపులకు గురిచేశారు. కనుపూరు చెరువులో మట్టి అక్రమ తవ్వకాలు చేశారనే కేసులో ఆయన పేరును ఇటీవల చేర్చగా, హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. తెరపైకి కుట్రలు వెంకటశేషయ్యపై తప్పుడు కేసులు మోపి జైలుకు పంపినా సంతృప్తి చెందని కూటమి నేతలు తాజాగా మరో అడుగు ముందుకేశారు. వెంకటాచలం సర్పంచ్గా ఉన్న ఆయన భార్య రాజేశ్వరి చెక్పవర్ను రద్దు చేయించేందుకు కుట్రలు పన్నారు. ఇందులో భాగంగానే వెంకటాచలం పంచాయతీలో అక్రమాలు జరిగాయని, విచారణ జరిపి వాస్తవాలను బహిర్గతం చేయాలంటూ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలో ఇప్పటికి రెండుసార్లు విచారణ జరిపారు. అయితే నిధుల దుర్వినియోగంపై ఆధారాల్లేక మిన్నకుండిపోయారు. పచ్చ పత్రిక కథనం.. పునర్విచారణ విచారణ సక్రమంగా జరగలేదని, పంచాయతీ నిధుల్లో రూ.64.54 లక్షలను సర్పంచ్ భర్త అకౌంట్కు మళ్లించారంటూ ఓ పచ్చ పత్రికలో కథనాన్ని ఇటీవల ప్రచురించారు. దీంతో జిల్లా అధికారులు పునర్విచారణకు ఆదేశిస్తూ జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్రెడ్డితో కమిటీని నియమించారు. అవినీతికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో అధికారులపై కూటమి నేతలు ఒత్తిడి తీసుకొచ్చి, పునర్విచారణకు కమిటీని నియమించేలా చేశారు. వెంకటాచలం గ్రామ సచివాలయం వైఎస్సార్సీపీ బీసీ నేత వెంకటశేషయ్య కుటుంబంపై రాజకీయ వేధింపులు ఓ కేసులో జైల్లో 18 రోజుల నిర్బంధం తాజాగా మరొకటి నమోదు భార్య, సర్పంచ్ రాజేశ్వరి చెక్పవర్ రద్దుకు కుతంత్రాలు -
నగలు, నగదు మాయం
నెల్లూరు(క్రైమ్): ఓ రియల్ ఎస్టేట్ కార్యాలయ కప్బోర్డులో ఉంచిన నగల బ్యాగ్, నగదు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. రంగనాయకులపేట మహాలక్ష్మి గుడి సమీపంలో పి.జిలానీబాషా నివాసం ఉంటున్నారు. అతను జీవీఆర్ఆర్ కళాశాల సమీపంలో రియల్ ఎస్టేట్ కార్యాలయం నిర్వహిస్తున్నాడు. కుదువలో ఉన్న తన 50 గ్రాముల బంగారు ఆభరణాలను ఈనెల ఒకటో తేదీన జిలానీ విడిపించారు. ఆభరణాలతోపాటు రూ.50 వేల నగదును బ్యాగ్లో పెట్టి కార్యాలయంలోని కప్బోర్డులో ఉంచారు. మరుసటిరోజు సాయంత్రం కార్యాలయానికి వచ్చిచూడగా బ్యాగ్ కనిపించలేదు. దీంతో బ్యాగ్ మాయమైన ఘటనపై బాధితుడు ఆదివారం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో అష్రాఫ్ అనే వ్యక్తిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మోసంపై కేసు నమోదునెల్లూరు సిటీ: రైస్మిల్లు యజమాని ఫిర్యాదు మేరకు దళారిపై నెల్లూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. నెల్లూరు బంగ్లాతోటకు చెందిన వడ్లమూడి వెంకటేశ్వర్లుకు నరుకూరు మార్గంలో రైస్మిల్లు ఉంది. అందులోని బియ్యాన్ని హైదరాబాద్లో అమ్ముతానని విజయవాడకు చెందిన దళారి కోట సత్యనారాయణ తీసుకెళ్లి వేరే ప్రాంతంలో తక్కువ ధరకు విక్రయించి మోసం చేశాడని బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్ గుంజి వేణు ఆదివారం తెలిపారు.కేజీబీవీలపై ప్రత్యేక దృష్టి● విద్యాశాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ దేవరాజు కడప ఎడ్యుకేషన్: ‘కేజీబీవీలపై ప్రత్యేక దృష్టి సారించాలి. వాటిల్లో చదువుతున్న విద్యార్థులను మట్టిలో మాణిక్యాలుగా తీర్చిదిద్దాలి’ అని రాష్ట్ర విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ దేవరాజు పిలుపునిచ్చారు. ఆదివారం కడప నగర శివార్లలోని గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలలో జీసీడీఓ దార్ల రూతు ఆరోగ్య మేరీ అధ్యక్షతన కేజీబీవీల్లో పనిచేసే ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్ట్ టీచర్లకు ఇన్ సర్వీస్ రెసిడెన్షియల్ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి రాయలసీమ పరిఽధిలోని కడప, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, కర్నూలు, నంద్యాలతోపాటు నెల్లూరు జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా దేవరాజు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు ఆర్థికంగా వెనుకబడిన వారేనన్నారు. అలాంటి వారికి సేవ చేయడాన్ని అదృష్టింగా భావించాలని కోరారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి అభివృద్ధి బాటలోకి తీసుకొచ్చే వారే నిజమైన ఉపాధ్యాయులన్నారు. సమగ్రశిక్ష ఏపీసీ నిత్యానందరాజులు మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా మరిన్ని కొత్త విషయాలను నేర్చుకుని తరగతి గదిలో విద్యార్థులకు నేర్పించి వారి ఎదుగుదలకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష కార్యాలయ సూపరింటెండెంట్ ప్రేమకుమారి, సెక్టోరియల్ అధికారి వీరేంద్రరావు, ఏఎస్ఓ సంజీవరెడ్డి, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. -
ఏటీఎం కార్డులు తారుమారు చేస్తూ..
నెల్లూరు(క్రైమ్): ఏటీఎం కార్డులను తారు మారుచేసి నగదు కాజేస్తున్న అంతర్జిల్లాల మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం నెల్లూరులోని వేదాయపాళెం పోలీసుస్టేషన్లో ఇన్స్పెక్టర్ కె.శ్రీనివాసరావు నిందితుడి వివరాలను వెల్లడించారు. వైఎస్ఆర్ నగర్కు చెందిన జ్యోతికి నిప్పో సెంటర్లోని ఎస్బీఐ బ్యాంక్లో ఖాతా ఉంది. ఆమె తన భర్తతో కలిసి గతనెల 24వ తేదీన నిప్పో సెంటర్లోని ఎస్బీఐ ఏటీఎంలో నగదు డ్రా చేసేందుకు వెళ్లారు. అక్కడ గుర్తుతెలియని వ్యక్తి సాయం చేస్తున్నట్లు నటిస్తూ నకిలీ ఏటీఎం కార్డును వారికిచ్చి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి జ్యోతి ఖాతాలోని రూ.15 వేలు నగదు విత్డ్రా అయినట్లు ఫోన్కు మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఈనెల 2వ తేదీన వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ నేతృత్వంలో సిబ్బంది సాంకేతికత ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పాతనేరస్తుడు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం వేములపాడు గ్రామానికి చెందిన ముప్పరాజు సురేంద్రగా గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం నిప్పో సెంటర్ సమీపంలో అదుపులోకి తీసుకుని విచారించగా నగదు కాజేసినట్లు అంగీకరించడంతో అరెస్ట్ చేశారు. సురేంద్ర నుంచి రూ.1,000 నగదు, వివిధ బ్యాంక్లకు సంబంధించిన ఏడు ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ● ఏటీఎం కార్డులను మార్చేసి నగదు కాజేయడంంలో సురేంద్ర సిద్ధహస్తుడని, అతడిపై ఇప్పటికే మేదరమిట్ల, పొదిలి, గిద్దలూరు, కందుకూరు, కావలి, తెనాలి, తూర్పుగోదావరి జిల్లాల్లో సుమారు 12 ఏటీఎం చీటింగ్, దొంగతనం కేసులున్నాయని ఇన్స్పెక్టర్ చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఎస్సై జి.నవీన్, పీఎస్సై యు.సాయికల్యాణ్, సిబ్బందిని ఏఎస్పీ సీహెచ్ సౌజన్య అభినందించారు. అంతర్జిల్లాల మోసగాడి అరెస్ట్ నిందితుడిపై ఇప్పటికే 12 కేసులు -
అవయవదానంతో పునర్జన్మ
నెల్లూరు(అర్బన్): అవయవదానంతో పది మందికి పునర్జన్మను ప్రసాదించొచ్చని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. జాతీయ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలోని కస్తూర్బా కళాక్షేత్రంలో అవగాహన కార్యక్రమాన్ని ప్రభుత్వ వైద్య కళాశాల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం ఆయన మాట్లాడారు. అవయవదానంపై అవగాహన కల్పించేలా జిల్లా స్థాయిలో వైద్యులు కృషి చేయా లని కోరారు. అవయవదాన గొప్పదనాన్ని తెలుసుకొని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకురావాలని పిలుపునిచ్చారు. అనంతరం విశాఖపట్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వైద్యుడు రాంబాబు మాట్లాడారు. అవయవాల కొరతతో దేశంలో ఐదు లక్షల మంది మరణిస్తున్నారని చెప్పారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అవయవదాత భర్తకు సత్కారం గతంలో ఓ ప్రమాదంలో జ్యోతి అనే మహిళకు బ్రెయిన్డెడ్ అయింది. పుట్టెడు దుఃఖంలోనూ ఆమె అవయవాలను దానం చేసి పలువురు జీవితాల్లో వెలుగులను భర్త వెంకటరమణ నింపారు. దీంతో ఆయన్ను కలెక్టర్, వైద్యులు సత్కరించారు. కమిషనర్ నందన్, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ కొండేటి మాధవి, డీఎంహెచ్ఓ సుజాత, అపోలో ఆస్పత్రి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ శ్రీరామ్సతీష్, నారాయణ ఆస్పత్రి సూపరింటెండెంట్ దొరసానమ్మ తదితరులు పాల్గొన్నారు. -
నేడు పోలీస్ విచారణకు మాజీ మంత్రి అనిల్
కోవూరు: పోలీసుల విచారణకు మాజీ మంత్రి పోలుబోయిన అనిల్కుమార్యాదవ్ సోమవారం హాజరుకానున్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో ఆయనపై విచారణ కొనసాగుతోంది. వాస్తవానికి కోవూరు సర్కిల్ కార్యాలయంలో విచారణకు గత నెల 26న హాజరుకావాలని నోటీసులను జారీ చేయగా, వ్యక్తిగత కారణాలతో ఆ రోజు రాలేనని ఆయన తెలియజేశారు. దీంతో గత నెల 30న ఉదయం పదికి విచారణకు రావాలని మరోసారి నోటీసులిచ్చారు. అయితే మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా బందోబస్తు విధులను నిర్వర్తించాల్సి ఉండటంతో, ప్రక్రియను పోలీసులే వాయిదా వేశారు. తాజాగా విచారణకు సోమవారం హాజరుకావా లని నోటీసును ఇవ్వడంతో ఆయన రానున్నారు. యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా సోమశిల: చేజర్ల మండలంలోని తూర్పుకంభంపాడులో గల కుంట నుంచి మట్టిని రాత్రి వేళ అక్రమంగా తరలిస్తున్నారు. గ్రామానికి చెందిన టీడీపీ నేతలు, పచ్చమీడియాకు చెందిన ఓ విలేకరి సహకారంతో జేసీబీని ఏర్పాటు చేసి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా వందలాది ట్రిప్పుల్లో యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కుంటలో భారీ గుంతలు తీసి నాశనం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. కాగా ఈ విషయమై తహసీల్దార్ మురళిని సంప్రదించగా, విచారణ జరిపి చర్యలు చేపడతామని బదులిచ్చారు. తొలి రోజు విచారణ పూర్తి నెల్లూరు (లీగల్): సీఐడీ అధికారి ఆధ్వర్యంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తొలి రోజు విచారణ పూర్తయింది. ప్రభుత్వ భూముల రికార్డులను తారుమారు చేశారని వెంకటాచలం పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో జిల్లా కేంద్ర కారాగారంలో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న కాకాణిని కోర్టు అనుమతితో సీఐడీ పోలీసులు రెండు రోజుల విచారణ నిమిత్తం జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి ఆదివారం ఉదయం 11.30కు తరలించారు. న్యాయవాది సిద్ధన సుబ్బారెడ్డి సమక్షంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, డీఎస్పీ 26 ప్రశ్నలడిగారు. మధ్యవర్తులు.. వీఆర్వోలు సూర్యకుమార్, సాంబశివ సమక్షంలో విచారణ జరిగింది. అనంతరం సాయంత్రం 4.30కు జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. కండలేరు వరద కాలువకు నీటి విడుదల సోమశిల: సోమశిల జలాశయం నుంచి కండలేరు వరద కాలువకు నీటిని ఆదివారం విడుదల చేశారు. తొలుత గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి చీర, సారెను సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఈ బసిరెడ్డి వెంకటరమణారెడ్డి మాట్లాడారు. ఈ ఏడాది ఊహించిన దాని కంటే ముందే కృష్ణా జలాలొస్తున్నాయని చెప్పారు. కండలేరు వరద కాలువకు మూడు వేల క్యూసెక్కులను విడుదల చేశామని, క్రమేణా దీన్ని ఆరు వేలకు పెంచుతామని వివరించారు. ప్రాజెక్ట్ చైర్మన్ కేశవ చౌదరి, ఈఈ శ్రీనివాసులు, కలువాయి ఈఈ మహేష్, తెలుగుగంగ ఈఈ అనిల్కుమార్రెడ్డి, డీఈఈ రవీంద్రప్రసాద్, జేఈలు పాపిశెట్టి నిఖిల్, పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. ఇస్కాన్ మందిరంలో సాంస్కృతిక పోటీలు నెల్లూరు(బృందావనం): కృష్ణ జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకొని మినీబైపాస్రోడ్డులోని ఇస్కాన్ మందిరంలో విద్యార్థులకు సాంస్కృతిక పోటీలను ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ నెల్లూరు అధ్యక్షుడు డాక్టర్ శుఖదేవస్వామి మాట్లాడారు. బాల్యం నుంచే ఆధ్యాత్మిక చింతన, సనాతన సంస్కృతి, సంప్రదాయాలను వివరించాలనే సంకల్పంతో ఇలాంటి పోటీలను నిర్వహిస్తున్నా మని వివరించారు. నగర పరిధిలోని వివిధ విద్యాసంస్థల నుంచి 300 మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. రాధాకృష్ణులు, బలరాముడు, గోపికల వేషధారణల్లో బాలబాలికలు సందడి చేశారు. డాక్టర్ పల్లంరెడ్డి యశోధర, ఎస్పీ సతీమణి ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. -
లై డిటెక్టర్ టెస్ట్కు సిద్ధం
● తొలి రోజు విచారణలో సీఐడీ అధికారులతో కాకాణి సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఇది ముమ్మాటికీ అక్రమ కేసే.. న్యాయస్థాన అనుమతితో లై డిటెక్టర్ పరీక్షకు తాను సిద్ధమని.. తనపై అభియోగాలు మోపిన వారికీ దీన్ని నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సీఐడీ అధికారులను మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి కోరారని సమాచారం. జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న కాకాణి గోవర్ధన్రెడ్డిని.. ప్రభుత్వ భూములను తారుమారు చేశారనే కేసులో కోర్టు అనుమతితో సీఐడీ అధికారులు రెండు రోజుల విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నారు. తనపై కూటమి ప్రభుత్వం బనాయించిన మరో అక్రమ కేసుగా భావించాలే తప్ప, తనకు సంబంధం ఉందని మీరు ఎలాంటి ఆధారాన్ని చూపినా న్యాయస్థానానికెళ్లి తగిన శిక్షను విధించాలని న్యాయమూర్తిని కోరేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కాకాణి తెలిపారని సమాచారం. చెముడుగుంటలోని డీటీసీలో కాకాణి తరఫు న్యాయవాది సిద్ధన సుబ్బారెడ్డి సమక్షంలో తొలి రోజు 26 ప్రశ్నలేసి విచారించగా, దీనికి కాకాణి దీటుగా సమాధానమిచ్చారు. అసైన్మెంట్ కమిటీ సమావేశాల్లో అధికారులు ప్రతిపాదించిన భూములపైనే చర్చ జరుగుతుందని.. కొన్నిసార్లు చర్చ జరగకుండా, ఎమ్మెల్యేల సమ్మతితో సంబంధం లేకుండా, తమ సంతకాల్లేకుండానే జిల్లాలో లబ్దిదారులను ఎంపిక చేసి వీటిని కేటాయించిన సందర్భాలున్నాయనే అంశాన్ని గుర్తుచేశారని తెలిసింది. కాకుటూరు భూముల విషయంలో తమ ప్రభుత్వ హయాంలోనే కేసు నమోదు చేశారని, నియోజకవర్గంలో ఎక్కడైనా అవకతవకలు జరిగినా, ఎవరైనా అక్రమాలకు పాల్పడినా ఎవర్నీ ఉపేక్షించకుండా చర్యలు చేపట్టాలని ప్రతి సమావేశంలో అధికారులను కోరేవాడినన్నారని సమాచారం. తనకు సంబంధం లేని విషయాల్లో ఎన్నడూ జోక్యం చేసుకోలేదని, అధికారుల పరిధిలో ఉన్న విషయాలను ప్రజాప్రతినిధిగా సమీక్షిస్తే అది వారి పనితీరును ప్రభావితం చేస్తుందేమోననే ఉద్దేశంతో పూర్తిస్థాయి స్వేచ్ఛను కల్పించి విచారణ చేపట్టమనేవాడినన్నారని తెలిసింది. జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్ అధికారులు చేపట్టే చర్యలపై జోక్యం చేసుకుంటే తప్పుడు సంకేతాలెళ్లే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, భూముల విషయంలో జోక్యం చేసుకోలేదన్నారు. పక్షపాత ధోరణితో వ్యవహరించాలని అధికారులను తానెన్నడూ కోరలేదని కాకాణి స్పష్టం చేశారని సమాచారం. ప్రత్యర్థులను రాజకీయంగా ఎదుర్కోలేక అనేక అభియోగాలు మోపేవారని.. సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తన చేతిలో రెండుసార్లు ఓటమి పాలు కావడంతో అర్థరహిత విమర్శలు చేసేవారని, వీటిని తానెప్పుడూ పట్టించుకోలేదని తెలిపారని సమాచారం. -
వైద్యశాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
● ఏపీ హంస అసోసియేషన్ అధ్యక్షుడు చేజర్ల సుధాకర్రావు నెల్లూరు(అర్బన్): వైద్యశాఖలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్ (ఏపీ హంస) జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్రావు డిమాండ్ చేశారు. ఆదివారం నెల్లూరులోని అన్నమయ్య సర్కిల్ వద్ద ఉన్న యూటీఎఫ్ కార్యాలయంలో హంస జిల్లా, తాలూకాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్రావు మాట్లాడుతూ 1998 నుంచి ఏఎన్ఎంలుగా పనిచేస్తూ ఉద్యోగోన్నతులకు నోచుకోకుండా పలువురు రిటైర్డ్ కాబోతున్నారని చెప్పారు. వారికి వెంటనే ఉద్యోగోన్నతలు కల్పించాలని కోరారు. చాలాకాలంగా కాంట్రాక్టు విధానంలో పనిచేస్తూ రెగ్యులరైన హెల్త్ అసిస్టెంట్లకు, అలాగే ఆఫీస్ స–బార్డినేట్లకు పదోన్నతులు కల్పించాలని కోరారు. ఈ విషయాలపై పలుమార్లు డీఎంహెచ్ఓ సుజాతతో చర్చించామన్నారు. అనేక వినతుల నేపథ్యంలో ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓలకు పెండింగ్లో ఉన్న జీతాల సమస్యను రాష్ట్రస్థాయిలో క్లియర్ చేసినా జిల్లా స్థాయిలో చేయాల్సి ఉందన్నారు. కలెక్టర్, డీఎంహెచ్ఓతో చర్చించాక కో–ఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఓ బాధితుడికి కారుణ్య నియామకం పోస్టింగ్ ఇచ్చినందుకు ఏఓ నిశాంత్కి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నెల్లూరు జిల్లా శాఖ, నెల్లూరు రూరల్, బుచ్చి, కోవూరు, ఇందుకూరుపేట తాలూకా యూనిట్ల పరిధిలో ఉన్న ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో ఏపీ హంస గౌరవాధ్యక్షురాలు ఆర్.ఇందిర, సలహాదారు అరవ పరిమళ, అసోసియేట్ ప్రెసిడెంట్ నారాయణ రాజు, జిల్లా కోశాధికారి శేషగిరిరావు, ఉపాధ్యక్షులు రాజయ్య, గౌస్బాషా, అరుణారాణి, సుధాకర్రెడ్డి, మాధవ తదితరులు పాల్గొన్నారు. -
వాయిస్ ఫర్ సోషల్ జస్టిస్ కమిటీ ఏర్పాటు
నెల్లూరు రూరల్: వాయిస్ ఫర్ సోషల్ జస్టిస్ నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ ఫౌండర్, చైర్మన్ గరికపాటి చంద్రకుమార్ తెలిపారు. ఆదివారం నగరంలోని ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జాతీయ కోర్ కమిటీలో వైస్ చైర్మన్గా సీహెచ్ శ్రీనివాసరెడ్డి (తెలంగాణ), జాతీయాధ్యక్షుడిగా బాలాజీ శంకర్సింగ్ (కాకినాడ), కార్యదర్శిగా ఎన్.ఉషారాణి (తెలంగాణ), ఉపాధ్యక్షులుగా వై.రఘు (కర్ణాటక), సందీప్ కుమార్ (ఢిల్లీ), కార్యదర్శులుగా టి.సూరజ్సింగ్ (హిమాచల్ప్రదేశ్), విజయ్కుమార్ (చైన్నె) ను నియమించామన్నారు. ప్రజలకు ప్రాథమిక హక్కులను వివరిస్తామన్నారు. ప్రభుత్వాలు ప్ర జలను ఎలా మభ్యపెడుతున్నాయో సమాచార హక్కు చట్టం ద్వారా వెలికి తీస్తామన్నారు.చెస్ పోటీల్లో ప్రతిభనెల్లూరు(స్టోన్హౌస్పేట): జిల్లా చెస్ అసోసియేషన్, రాయ్ చెస్ అకాడమీ సంయుక్తంగా ఆదివారం నెల్లూరులో నిర్వహించిన జిల్లా స్థాయి అండర్ 19 (జూనియర్) బాలబాలికల చెస్ పోటీల్లో చాంపియన్లుగా వై.సాయిచక్రధర్, జి.హిమతేజశ్విని నిలిచారు. నిర్వాహకులు గూడూరు లక్ష్మి, ఆనం పద్మనాభరెడ్డి బహుమతులు అందజేశారు. ప్రతిభ చూపిన వారు ఈనెల 8, 9 తేదీల్లో కర్నూలులో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ చాంపియన్షిప్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఆర్బిటర్ మౌనిక, విష్ణు, బషీర్, ఫిడే ఇన్స్ట్రక్టర్ అజీజ్ పాల్గొన్నారు.రైలు పట్టాలపై తల పెట్టి.. యువకుడి ఆత్మహత్యకొడవలూరు: రైలు కింద పడి గుర్తుతెలియని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కొడవలూరు – కోవూరు రైల్వేస్టేషన్ల మధ్య 184 – 28 – 30 పోస్టుల వద్ద దిగువ లైన్లో ఆదివారం జరిగింది. రైల్వే ఎస్సై కె.వెంకట్రావు కథనం మేరకు.. సుమారు 25 సంవత్సరాల వయసున్న యువకుడు పురులియా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రాకను గుర్తించి సమీపానికి వచ్చాక పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను సూపర్ స్టైకర్స్, నంబర్ 12 అని ఉన్న నలుపు, బులుగు రంగు టీషర్ట్ ధరించి ఉన్నాడు. నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. యువకుడి వివరాలు తెలిసిన వారు 94406 27648 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. -
డీఎస్సీ ‘కీ’లో తప్పులు
● పరీక్ష నిర్వహణలో అలసత్వం ● ప్రాథమిక ‘కీ’ అస్తవ్యస్తం ● తుది దశలోనూ అదే దుస్థితి ● అభ్యర్థుల ఆందోళన సంగం: డీఎస్సీ పరీక్షలను నిర్వహించి ఉపాధ్యాయ ఉద్యోగాలిస్తామని కూటమి ప్రభుత్వం ఊదరగొట్టింది. అధికారంలోకి వచ్చిన ఏడాది అనంతరం నిర్వహించి మమ అనిపించింది. అయితే పరీక్ష పత్రం, ‘కీ’లో తప్పులు దొర్లడంపై డీఎస్సీ రాసిన వారు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది జూన్ 16న పరీక్షను నిర్వహించిన విద్యాశాఖ ప్రాథమిక ’కీ‘ని జూలై రెండున విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలను తెలియజేసేందుకు జూలై 12 వరకు గడువిచ్చింది. దీనిపై అప్పట్లోనే ఎంతో మంది అభ్యంతరాలను తెలియజేశారు. పరిష్కా రంలో విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్ట్ ఒకటిన విడుదల చేసిన ‘కీ’లో సైతం తప్పులు దొర్లడంతో అభ్యర్థులు తలలు పట్టుకొని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, విద్యాశాఖకు శాపనార్థాలు పెడుతున్నారు. నిర్లక్ష్యంతో తమ భవిష్యత్తు దెబ్బతింటుందని అభ్యర్థులు వాపోతున్నారు. ఇప్పటికై నా విద్యాశాఖ స్పందించాలని అభ్యర్థిస్తున్నారు. తప్పులు సరిచేయాలి సాంఘిక శాస్త్రంలో డీఎస్సీ పరీక్షను రాశాను. ప్రాథమిక కీలో తప్పులు దొర్లాయి. తుది కీలో సరిచేస్తారని భావించినా అది జరగలేదు. ఇప్పటికై నా న్యాయం చేయాలి. – మురళి, గాంధీజనసంఘం● -
డీలర్ల చేతివాటం
నెల్లూరు(పొగతోట): రేషన్ దుకాణాల డీలర్లు చౌకబారు పనులకు పాల్పడుతున్నారు. దివ్యాంగులు, 65 సంవత్సరాల వయసు దాటిన వృద్ధులకు వారి ఇళ్లకు వెళ్లి రేషన్ పంపిణీ చేయాలి. అయితే దీనిమాటున డీలర్లు అక్రమాలు చేస్తున్నారని విమర్శలున్నాయి. సాధారణ కార్డుదారుల ఇళ్ల వద్దకు కూడా వెళ్లి వేలిముద్రలు వేయించుకుని డబ్బులు ఇచ్చేస్తున్నారు. సదరు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ఇలా మూలపేటలోని ఓ దుకాణంలో జరుగుతున్నట్లు తెలిసింది. 91 వేలమంది జిల్లాలో 7.21 లక్షల రేషన్కార్డులున్నాయి. 1,513 చౌకదుకాణాల ద్వారా ప్రతినెలా 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ను అందించింది. అయితే కూటమి ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేసింది. డీలర్ల ద్వారా పంపిణీని ప్రారంభించింది. ఈ అవకాశం వచ్చిన మొదటి నెలనుంచే వారు అక్రమాలకు తెరలేపారు. ప్రస్తుతం ప్రతినెలా 25 నుంచి 30వ తేదీ వరకు దివ్యాంగులు, 65 ఏళ్ల పైబడిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. జిల్లాలో 91 వేల మందికి పైగా దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులున్నారు. అధికారులు చౌకదుకాణాల వారీగా వారి వివరాలను పంపించారు. తూకంతో సంబంధం లేకుండా థంబ్ వేసి రేషన్ పంపిణీ చేయాలి. నిబంధనల ప్రకారం కార్డుదారులు ఎంతమంది ఉన్నారో అన్ని కేజీలకు సంబంధించి తూకం సక్రమంగా చూసినప్పుడే బిల్లు యంత్రం నుంచి బయటకు వస్తుంది. అయితే దివ్యాంగులు, వృద్ధుల సడలింపు ఇచ్చారు. నగరంలోనే అధికంగా.. కొంతమంది బినామీ, బోగస్ కార్డులకు థంబ్ వేసి బియ్యంను చాటుమాటుగా తరలిస్తున్నారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా డీలర్లను ప్రశ్నిస్తే తినడానికి బియ్యం లేవు, ఇవ్వాలని కార్డుదారులు డిమాండ్ చేస్తున్నారని సమాధానం చెబుతున్నారు. నెల్లూరు నగరంలో ఈ తంతు అధికంగా నడుస్తోంది. అక్రమంగా సేకరించిన బియ్యాన్ని అల్లీపురంలోని ఓ రైస్మిల్లుకు తరలిస్తున్నట్లు సమాచారం. చౌకదుకాణాలకు సంబంధించిన రేషన్ బియ్యంను అధికారులు అనుమతిచ్చిన వాహనాల్లోనే రవాణా చేయాలి. కానీ విరుద్ధంగా మినీ వ్యానుల్లో మిల్లులకు తరలించేస్తున్నారు. పట్టపగలే పేదల బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. డీలర్లకు కూటమి నేతల అండదండలు ఉండటంతో రెచ్చిపోతున్నారు. అధికారులు సైతం నేతల ఒత్తిళ్లకు తలొగ్గి డీలర్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. బినామీ డీలర్లు నెల్లూరులోని కొన్ని దుకాణాలకు సంవత్సరాల ఏళ్ల తరబడి బినామీలు డీలర్లుగా ఉంటున్నారు. మూలాపేట ప్రాంతంలో ఓ షాపునకు అమెరికాలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ డీలర్గా వ్యవహరిస్తున్నాడు. ఇలా బినామీ పేర్లతో నడిచే దుకాణాలు జిల్లా వ్యాప్తంగా వందకు పైగా ఉన్నట్లు సమాచారం. చౌకదుకాణాలపై 6ఏ కేసులు నమోదు చేసిన సమయంలో, డీలర్లను సస్పెండ్ చేసిన సమయాల్లో నిర్వహణను పొదుపు మహిళలకు అప్పగిస్తారు. వారు మూడు నెలలు మాత్రమే దుకాణం నిర్వహించాలని నిబంధన ఉంది. జిల్లాలో పొదుపు మహిళల పేరుతో 200కు షాపులు ఏళ్ల తరబడి బినామీల పేర్లతో కొనసాగుతున్నాయి. నిబంధనల ప్రకారం ఆయా డివిజన్ల ఆర్డీఓలు ఖాళీగా ఉన్న చౌకదుకాణాల వివరాలు సేకరించి ప్రతినెలా నోటిఫికేషన్ ఇవ్వాలి. ఖాళీ అయిన షాపులకు డీలర్లను నియమించాలి. ఈ ప్రక్రియ నేడు కొనసాగడం లేదు. జిల్లా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపడితే డీలర్లు నిబంధనలు పాటించే అవకాశముంది. ఇళ్లకు వెళ్లి వేలిముద్రలు వేయించి డబ్బులిస్తున్న వైనం ఆపై రైస్మిల్లులకు బియ్యం తరలింపు కూటమి నేతల అండదండలతో బియ్యం దందావిచారించి చర్యలు తీసుకుంటాం ప్రతి నెలా 25 నుంచి 30వ తేదీ వరకు దివ్యాంగులు, 65 ఏళ్ల దాటిన వృద్ధులకు రేషన్ పంపిణీ చేయాల్సి ఉంది. ఈ నిబంధనలు పాటించని డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. పూర్తి స్థాయిలో పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే డీలర్లపై చర్యలు చేపడతాం. – విజయకుమార్, డీఎస్ఓ -
అప్పుడు జరిగితే..
వైఎస్సార్సీపీ హయాంలో చేసిన పనులకు సంబంధించి తీసిన ఫొటోను నేడు ఉపయోగిస్తూ ఈ కూటమి ప్రభుత్వంలో జరిపినట్లు బిల్లులు పెట్టుకుని నిధులను డ్రా చేస్తున్నట్లు విమర్శలున్నాయి. పారిశుద్ధ్య పనులను సంబంధించి 2024 ఫిబ్రవరి 6న డి.రవిచంద్ర పేరుతో రూ.5,12,610 డ్రా చేశారు. అప్పుడు ఆన్లైన్లో అప్లోడైన ఫొటోనే కూటమి ప్రభుత్వం వచ్చాక వినియోగించి 2024 జూలై 15వ తేదీన చౌడ నాగమణి పేరుతో రూ.2 లక్షలు డ్రా చేశారు. మళ్లీ ఇదే ఫొటోను ఆన్లైన్లో చూపిస్తూ 2024 డిసెంబర్ 10న తమ్మిరెడ్డి రవి పేరుతో రూ.2.05 లక్షలు డ్రా చేశారు. అక్కడితో ఆగకుండా అదే ఫొటోను ఉపయోగించి 2025 జనవరి 9న మరో రూ.2,46,500లు డ్రా చేశారు.మండలంలోని కోడూరు మేజర్ పంచాయతీలో భారీగా నిధుల దుర్వినియోగమైనట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో తెలుగు తమ్ముళ్లు తూతూమంత్రంగా పనులు చేపట్టి రూ.లక్షల ప్రజా ధనాన్ని దోచుకున్నారని, ఇందుకు కొందరు కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది సహకరించారనే ఆరోపణలున్నాయి.నకిలీ బిల్లులతో రూ.లక్షలు దారి మళ్లింపు ● తెలుగుదేశం నాయకులకు సహకరించిన సిబ్బంది ● గతంలో జరిగిన పనుల ఫొటోలను ఉపయోగిస్తున్న వైనం ● ఇద్దరు కార్యదర్శుల తీరుపై ఆరోపణలు తోటపల్లిగూడూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి పంచాయతీ ఖాతాలో రూ.11.50 లక్షలున్నట్లు రికార్డుల్లో ఉంది. అనంతరం విడతల వారీగా 15వ ఆర్థిక సంఘం బేసిక్ గ్రాంట్ నుంచి రూ.14.03 లక్షలు, టైట్ గ్రాంట్ అడ్జెస్ట్మెంట్ కింద మరో రూ.19.70 లక్షలు జమయ్యాయి. రూ.45.24 లక్షలకు గానూ ప్రస్తుతం కేవలం రూ.3.89 లక్షలున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏడాది కాలంలోనే దాదాపు రూ.41.76 లక్షల విలువైన పనులు చేసినట్లు చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. ఇలా బ్యాంక్ ఖాతాల్లోకి.. అధికారులు ఇష్టానుసారంగా పనులు చేపట్టి నిధుల దారి మళ్లింపునకు సహకరించారని ఆరోపణలున్నాయి. టీడీపీ నాయకుడు, వార్డు మెంబర్ అయిన తమ్మిరెడ్డి రవి పేరున పంచాయతీలో పనులు చేసినట్లు అప్పటి కార్యదర్శి గతేడాది జూలై నుంచి నవంబర్ వరకు రూ.18.50 లక్షల బిల్లులు పెట్టి నిధులు డ్రా చేశారు. అలాగే గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు మరో రూ.13.03 లక్షల పనులు అతను చేపట్టినట్లు తర్వాత వచ్చిన కార్యదర్శి గుంటి వెంకటేశ్వర్లు బిల్లులు పెట్టి నిధులను డ్రా చేశారు. ఇద్దరు కార్యదర్శులు ఒకే వార్డు మెంబర్ పేరుపైనే పెద్ద మొత్తంలో బిల్లులు పెట్టడంపై అనుమానాలకు తావిస్తోంది. ప్రజాప్రతినిధి అయిన వార్డు మెంబర్ పేరుతో బిల్లులు పెట్టడం, నిధులు డ్రా చేయడం చట్ట విరుద్ధం. కంప్యూటర్ ఆపరేటనరైన చౌడా నాగమణి పేరుతో గతేడాది జూలై నెలలో అప్పటి కార్యదర్శి శ్రీనివాసులు రూ.4 లక్షలు, ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ప్రస్తుత కార్యదర్శి వెంకటేశ్వర్లు మరో రూ.2.21 లక్షల బిల్లులు చేయడం గమనార్హం. తూతూమంత్రంగా.. ఏడాది పాలనలో పంచాయతీలో పారిశుద్ధ్య పనులు, వీధిలైట్ల కొనుగోలు, తాగునీటి సరఫరా, విద్యుత్ మోటార్ల కొనుగోళ్లు, మరమ్మతులు, జంగిల్ క్లియిరెన్స్ పనులకు రూ.లక్షలు వెచ్చించామని అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. అయితే తూతూమంత్రంగా చేపట్టిన పనులతోపాటు చేయని పనులకు సైతం నకిలీ బిల్లులు పెట్టి నిధులను దోచేశారని కొందరు అధికార పార్టీ కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. గ్రామసభలు, వార్డు సభ్యుల సంతకాలు, పంచాయతీ తీర్మానాలు లేకుండానే పనులు చేపట్టినట్లు రికార్డులు తయారు చేసి నిధులను దుర్వినియోగం చేశారని పలువురు వార్డు సభ్యులు చెబుతున్న మాట. ఫిర్యాదులొస్తే విచారణ చేస్తాం కోడూరు మేజర్ పంచాయతీలో నిధుల దుర్వి నియోగానికి సంబంధించి మాకు ఎలాంటి సమాచారం అందలేదు. ఫిర్యాదులొస్తే విచారణ జరుపుతాం. అవినీతి జరిగిందని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ పుట్టా రమణయ్య, డీఎల్పీఓ, నెల్లూరు -
చెడు వ్యసనాలకు యువత బానిస
● మత్తులో నెల్లూరులో హత్యలు మితిమీరుతున్నాయి ● రాజ్యసభ సభ్యుడు ఏఏ రహీం నెల్లూరు (వీఆర్సీసెంటర్): దేశంలో యువత చెడు వ్యసనాలకు బానిసై భవిష్యత్ను, జీవితాన్ని కోల్పోతున్నారని కేరళకు చెందిన రాజ్యసభ సభ్యుడు, డీవైఎఫ్ఐ ఆల్ ఇండియా అధ్యక్షుడు ఏఏ రహీం ఆందోళన వ్యక్తం చేశారు. ‘డ్రగ్స్ వద్దు–ఆరోగ్యం ముద్దు’, ‘డ్రగ్స్ అంతం డీవైఎఫ్ఐ పంతం’ నినాదాలతో శనివారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో యువత అయ్యప్పగుడి సెంటర్ నుంచి వేదాయపాళెం సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు రహీం మాట్లాడుతూ అంధ్రప్రదేశ్లో చెడు వ్యసనాలకు, డ్రగ్స్, గంజాయి సేవిస్తున్న యువత ఎక్కువవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులో యువత మత్తులో ఉంటూ ఏమి చేస్తున్నారో కూడా అర్థంకాక అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఈ క్రమంలో హత్యలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు నాయకులు యువతను ప్రధాన శక్తిగా వాడుకుంటూ యువశక్తిని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. విచ్చలవిడిగా జరిగే మద్యం అమ్మకాలను అరికట్టాలని, గంజాయి, డ్రగ్స్ను నివారించేందుకు అధికార యంత్రాగం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నెల్లూరు రూరల్ అధ్యక్ష, కార్యదర్శులు చైతన్య, శశి, సీపీఎం సీనియర్ నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, మోహన్రావు, కట్టా సతీష్ పాల్గొన్నారు. న్యాయ విజ్ఞాన సదస్సు నెల్లూరు (లీగల్): జిల్లా కోర్టు ఆవరణలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కే వాణి ఆధ్వర్యంలో శనివారం న్యాయవిజ్ఞాన సదస్సు జరిగింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీ శ్రీనివాస్ న్యాయ సేవాధికార సంస్థ ప్రయోజనాలను, లక్ష్యాలను వివరించారు. వరంగల్ ఇంజినీరింగ్ కాలేజీలో రెండో సంవత్సరం చదువుతున్న గండిపోయిన దివ్య తన ఆర్థిక ఇబ్బందులను తెలియజేస్తూ జిల్లా న్యాయసేవాధికార సంస్థకు అర్జీ పెట్టుకుంది. తన విద్యకు ల్యాప్టాప్ అవసరమని, తనకు కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేదని పేర్కొంది. ఈ విషయం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ దృష్టికి వచ్చింది. ఆయన మానవతా దృక్పథంతో కావలి విశిష్ట కాలేజీ కరస్పాండెంట్ సుధాకర్ ద్వారా ల్యాప్టాప్ కొనుగోలు చేయించి, న్యాయ విజ్ఞాన సదస్సులో ఆ విద్యార్థినికి బహూకరించారు. కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యుడు వేనాటి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయ్యప్ప రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
అధికారుల తీరుపై అసహనం
నెల్లూరు (పొగతోట): అంగన్వాడీ కేంద్రాలు, డీపీఆర్సీ భవన నిర్మాణానికి నిధులను మంజూరు చేసి నెలలు గడుస్తున్నా, అధికారుల్లో స్పందన లేదని జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అసహనం వ్యక్తం చేశారు. నగరంలోని జెడ్పీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన స్థాయీ సంఘ సమావేశాల్లో ఆమె మాట్లాడారు. డీపీఆర్సీ భవనానికి అనుమతులను ఆర్నెల్ల క్రితం మంజూరు చేస్తే, టెండర్ల ప్రక్రియను పూర్తి చేయలేదని చెప్పారు. వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఇసుక ఉచితమని ప్రభుత్వం చెప్తున్నా, ట్రాక్టర్కు రూ.నాలుగు వేలను చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. దీనికి సంబంధించిన సినరైజ్ జెడ్పీకి రావడంలేదన్నారు. అయితే ఇసుక ఉచితం కావడంతో ఇది రాదని అధికారులు బదులిచ్చారు. రీచ్కు ఎలా అనుమతిచ్చారు..? కలువాయి మండలం రాజుపాళెంలో రీచ్కు ఎలా అనుమతిచ్చారంటూ మైనింగ్ శాఖ అధికారులను జెడ్పీటీసీ అనిల్కుమార్రెడ్డి నిలదీశారు. 500 మీటర్ల పరిధిలో బోర్లుంటే అనుమతులను ఎలా మంజూరు చేశారని ప్రశ్నించారు. తెలుగురాయపురం రీచ్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఈ విషయమై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జెడ్పీ చైర్పర్సన్ ఆదేశించారు. పీ4 పథకానికి సంబంధించి పూర్తిస్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు అప్పగించాలన్నారు. నిధులు మంజూరు చేసినా.. పనులు ప్రారంభించరా..? ఇసుక ఫ్రీ అంటున్నా, అధిక ధరలకు విక్రయం జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అస్తవ్యస్తంగా జలజీవన్ మిషన్ పనులు జలజీవన్ మిషన్ పనులు అస్తవ్యస్తంగా మారాయని ఆనం అరుణమ్మ అసహనం వ్యక్తం చేశారు. విద్యుత్ తీగ తగలి పశువులు మరణించి ఆర్నెల్లవుతున్నా, బీమా అందలేదని, దీనిపై కలెక్టర్కు సమాచారమిచ్చినా నేటికీ స్పందన లేదని పేర్కొన్నారు. బెంగళూరు, చైన్నె నుంచి చికెన్ వ్యర్థాలు జిల్లాకు అధిక మొత్తంలో వస్తున్నాయని, వీటిని అరికట్టడంలో ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించారు. అనంతరం ఐసీడీఎస్, సాంఘిక సంక్షేమ శాఖలపై సమీక్షించారు. సీఈఓ మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
డీఎంహెచ్ఓ పేరిట మెసేజ్లు
సీహెచ్ఓలపై తీవ్ర ఒత్తిడి వైద్యులుపేదరికం నిర్మూలన పేరుతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పీ4 (పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్షిప్) ఉద్యోగుల పాలిట శాపంగా పరిణమించింది. సమాజంలోని ధనవంతులు నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకుని వారిని ఆర్థికంగా పరిపుష్టి చేసి బంగారు కుటుంబాలుగా మార్చాలన్నదే ఈ పీ4 ముఖ్య ఉద్దేశం. ఈ పథకాన్ని ముందుగా ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అఽధికారులు పేద కుటుంబాలను దత్తత తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ పథకానికి జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికార వర్గాల నుంచి స్పందన కరువైంది. ఈ క్రమంలో ప్రతి శాఖ అధికారికి టార్గెట్లు ఇచ్చి ప్రతి ఉద్యోగి రెండు కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ ఒత్తిడి పెంచుతున్నారు. ఉద్యోగం కావాలంటే పీ4 చేయండి...● పీ4 పథకాన్ని అమలు చేయాలని తీవ్ర ఒత్తిడి ● ఒక్కొక్కరూ రెండేసి కుటుంబాలను దత్తత తీసుకోవాలని ఆదేశాలు ● డీఎంహెచ్ఓ పేరిట గ్రూపుల్లో మెసేజ్లు ● లేదంటే ఉద్యోగాలు కష్టమంటూ హెచ్చరికలు నెల్లూరు (అర్బన్): అధికారంలోకి రావడానికి కూటమి అధినేత చంద్రబాబు అలవికాని అమలు ఇచ్చారు. నిరుపేదలను ఆర్థికంగా సంపన్నులను చేస్తానంటూ ‘పూర్ టు రిచ్’ పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన ఈ ప్రణాళికను ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల డబ్బులతో అమలు చేసే ఎత్తుగడ వేశారు. పబ్లిక్, ప్రైవేట్, పీపుల్, పార్ట్నర్షిప్ విధానంలో దాతల సొమ్ముతో ప్రభుత్వ ప్రచారానికి తెర తీశారు. వాస్తవానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్, జేసీ, డీఆర్వో, డీఎంహెచ్ఓ, ఇతర జిల్లా స్థాయి అఽధికారులు పేద కుటుంబాలను దత్తత తీసుకోవాల్సి ఉంది. అయితే వీరు ముఖం చాటేయడంతో నెల జీతంపై ఆధారపడి బతికే చిరు ఉద్యోగుల నుంచి జిల్లా అధికారుల వరకు ప్రతి ఒక్కరికి టార్గెట్ విధించి మెడపై కత్తి పెట్టారు. భారమంతా ఉద్యోగులపైనే వేస్తున్నారు. వైద్యశాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో సీహెచ్ఓలుగా (కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ లేదా ఎంహెల్హెచ్పీలు) పనిచేస్తున్న చిన్న ఉద్యోగులను ఆన్లైన్లో ముందుగా పీ4 రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని వైద్యశాఖ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ తీరును సీహెచ్ఓలు తీవ్రంగా నిరసిస్తున్నారు. డీఎంహెచ్ఓ శుక్రవారం నిర్వహించిన కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో మాత్రం పీ4 అనేది స్వచ్ఛందంగా జరగాలని పేర్కొన్నారు. కలెక్టర్ ఆదేశాలంటూ కూడా తెలిపారు. అయితే ఆచరణలో పెద్దలెవరూ పీ4కి ముందుకు రాలేదు. దీంతో వైద్యశాఖలోని చిన్న ఉద్యోగులపై బలవంతపు పీ4 రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. రూ.కోట్లకు పడగలెత్తిన నేతలు ఉండగా.. కూటమి పార్టీల్లో రూ.కోట్లకు పడగలెత్తిన నేతలు ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏడాది కాలంపైగా ఊరూరా ఆ పార్టీల నేతలు ఇసుక, మట్టి, గ్రావెల్, మద్యం, పేకాట, కోళ్ల పందేలు, అక్రమ వ్యాపారాలతో రూ.కోట్ల సంపాదించారు. వీరందరిని వదిలేసి తమ వంటి చిరు ఉద్యోగులపై భారం పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఆయుష్మాన్ భారత్ కింద విలేజ్ హెల్త్ క్లినిక్ల్లో 496 సీహెచ్ఓ పోస్టులున్నాయి. వీటిలో 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కాంట్రాక్ట్ పద్ధతిలో 476 మంది పని చేస్తున్నారు. వీరి జీతం కేవలం రూ.25 వేలు మాత్రమే. ఈ జీతంలోనే విలేజ్ హెల్త్ క్లినిక్కు ఉన్న ప్రాంతం నుంచి చార్జీలు భరించాలి. వైద్యశాఖ నుంచి మందులు, ఇతరత్రా సామగ్రి తరలించేందుకు జేబులో నుంచే రవాణా ఖర్చు భరించాలి. బీఎస్సీ నర్సింగ్ వంటి ఉన్నత కోర్సులు చదివి ఎన్నో ఆశలతో వైద్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేరిన వీరికి చివరకు నెలంతా కష్టపడితే ఖర్చులు పోను రూ.20 వేలు వరకు మాత్రమే మిగులుతోంది. అలాంటి చిన్న ఉద్యోగులను పీ4 కింద రిజిస్ట్రేషన్ చేయించుకుని బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ రెండు రోజుల నుంచి మెడికల్ ఆఫీసర్లు తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. డీఎంహెచ్ఓ పేరిట జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లు వైద్యశాఖ గ్రూపులో సీహెచ్ఓలకు టెక్ట్స్ మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు వాట్సాప్ గ్రూపులో పంపారు. శనివారం సాయంత్రం లోపు ఒక్కో సీహెచ్ఓ రెండు కుటుంబాలను దత్తత తీసుకుంటూ ఆన్లైన్లో పీ4 రిజిస్ట్రేషన్ తీసుకోవాలని సూచించారు. ఇది డీఎంహెచ్ఓ ఆదేశాలంటూ పేర్కొన్నారు. ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకోని వారందరూ ఇబ్బంది పడుతారంటూ ఓరల్గా హెచ్చరిస్తున్నారు. దీంతో అధికారులను, ప్రభుత్వ తీరును తిట్టుకుంటూ ఇప్పటికే పలువురు తమ పేర్లను పీ4 కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. పెద్దలను వదిలేసి తమను బలి చేయడమేంటని సీహెచ్ఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పొదలకూరు నిమ్మ ధరలు
పెద్దవి : రూ.24 సన్నవి : రూ.15 పండ్లు : రూ.5 నెల్లూరు పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు బ్రాయిలర్ : రూ.114 లేయర్ : రూ.112 బ్రాయిలర్ చికెన్ : రూ.210 స్కిన్లెస్ చికెన్ : రూ.234 లేయర్ చికెన్ : రూ.190 -
సిట్ అధికారుల రెండు రోజుల కస్టడీకి కాకాణి
నెల్లూరు (లీగల్): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని గుంటూరు సీఐడీ పోలీస్ అధికారులు విచారణ నిమిత్తం 3, 4 తేదీల్లో రెండు రోజుల కస్టడీకి ఇస్తూ నెల్లూరు 2వ అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి శారదరెడ్డి శనివారం ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ భూముల రికార్డులను తారుమారు చేశారని వెంకటాచలం పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో కాకాణిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గుంటూరు సీఐడీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై పోలీసులు తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రొసిక్యూటర్ వి.లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ ఈ కేసులో కాకాణి పాత్ర ఉందని, విచారించడానికి ఏడు రోజులు కస్టడీ అవసరం ఉందన్నారు, కాకాణి తరపు సీనియర్ న్యాయవాదులు రామిరెడ్డి రోజారెడ్డి, పి.ఉమామహేశ్వర్రెడ్డి, ఎంవీ విజయకుమారి, సిద్ధన సుబ్బారెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ కేసులో ప్రాథమిక ఆధారాల్లేవని, కేవలం రాజకీయ కక్షతో కాకాణిని 14వ నిందితుడిగా పోలీసులు చేర్చారని, పోలీస్ కస్టడీ ఇవ్వాల్సిన అవసరం లేదని వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి శారదరెడ్డి రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాకాణిని ఈ నెల 3వ తేదీ ఉదయం 8 గంటలకు విచారణ నిమిత్తం నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి గుంటూరు సీఐడీ పోలీసులు కస్టడీకి తీసుకోవాలని, 4వ తేదీ విచారణ అనంతరం సాయంత్రం 5 గంటలకు వైద్య పరీక్షలు చేయించి మెడికల్ సర్టిఫికెట్తో కోర్టులో హాజరుపరచాలని, విచారణ సమయంలో థర్డ్ డిగ్రీ ఉపయోగించవద్దన్నారు. న్యాయవాది సమక్షంలో గోవర్ధన్రెడ్డిని సీఐడీ పోలీసులు విచారణ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని..
ముత్తుకూరు (పొదలకూరు): ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో యువకుడు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇన్చార్జి ఎస్సై శ్రీనివాసులురెడ్డి వివరాల మేరకు.. చలివేంద్రం గ్రామానికి చెందిన కార్తీక్ (19), హర్షవర్ధన్ బైక్పై బయల్దేరారు. ఈ క్రమంలో ముత్తుకూరు సమీపంలోని మద్దిమాను వద్ద వాకాడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఘటనలో కార్తీక్ (19) మృతి చెందగా, హర్షవర్ధన్ తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరులోని ఓ ఆస్పత్రిలో క్షతగాత్రుడు చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యారంగాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం
నెల్లూరురూరల్: విద్యారంగాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని, బదిలీలు జరిగి 50 రోజులవుతున్న నూతన స్థానాల్లో చేరిన ఉపాధ్యాయులకు ఇంత వరకు జీతాలు ఇవ్వలేకపోవడం ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యానికి దర్పణమని ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘం నేతలు దుయ్యబట్టారు. తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం కలెక్టరేట్ ఎదుట ఫ్యాప్టో కో చైర్మన్ మాసప్రసాద్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై పలు మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఉపాధ్యాయులపై బోధనేతర కార్యక్రమాల భారాన్ని పెంచుతూ విద్యారంగం కునారిల్లేలా చేసిందన్నారు. ఫ్యాప్టో పరిశీలకులు ఎన్వీ రమణయ్య, రమేష్, పీవీ రమణ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా, కనీసం రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ, పెన్షన్, సరెండర్ లీవ్, డీఏ బకాయిలను చెల్లించకుండా తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తుందని ఆవేదన చెందారు. ప్రభుత్వం వెంటనే కొత్త పీఆర్సీ కమిటీని నియమించి ఐఆర్ విడుదల చేసి బకాయిలను వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో 12వ తేదీ రాష్ట్ర స్థాయిలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఫ్యాప్టో జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ శేషు మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయన్నారు. వెంటనే బకాయిలు చెల్లించాలని, బోధనేతర విధుల నుంచి ఉపాధ్యాయులను తప్పించాలని డిమాండ్ చేశారు. మరో డిప్యూటీ జనరల్ సెక్రటరీ హజరత్ మాట్లాడుతూ కామన్న్ సీనియారిటిని తుంగలో తొక్కి ప్రభుత్వ ఉపాధ్యాయులకే ఎంఈఓ–1 పోస్టులు ఇవ్వడం దుర్మార్గమన్నారు. వెంటనే కామనన్ సర్వీస్ రూల్స్ను తీసుకొచ్చి జెడ్పీ మేనేజ్మెంట్లో ఉన్న ఉపాధ్యాయులకూ న్యాయం చేయాలన్నారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నరసింహం, మురళీకృష్ణ, భాస్కర్రెడ్డి, మణి, సుబ్బు, చలపతి శర్మ, దశరథరాములు, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బదిలీ అయిన ఉపాధ్యాయులకు రెండు నెలలుగా జీతాల్లేవ్ కలెక్టరేట్ ఎదుట ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘం ధర్నా -
వ్యవసాయం చేసే రైతులకే అన్నదాత సుఖీభవ
కోవూరు: అన్నదాత సుఖీభవ పథకం ద్వారా వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే సాయం అందిస్తున్నట్లు, జిల్లాలో 1,95,866 మందికి రూ.131.6 కోట్ల నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. శనివారం కోవూరులోని పీవీఆర్ కన్వెన్షన్ హాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ– పీఎం కిసాన్ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఏదైనా కారణంగా లబ్ధి పొందని రైతులు ఆగస్టు 3 నుంచి నిర్వహించనున్న గ్రీవెన్స్ మాడ్యూల్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకుంటే లబ్ధి పొందవచ్చు అన్నారు. రెండు కారణాలతో లబ్ధి చేకూరని పరిస్థితి ఉందన్నారు. ఒకటి బ్యాంకు ఆధార్ లింకు లేకపోవడం, సరైన వివరాలు ఆన్లైన్లో దరఖాస్తు చేయకపోవడమే కారణమన్నారు. సాగు ధ్రువీకరణ పత్రాలు (సీసీఆర్ కార్డులు) కలిగిన వారికి రబీ సీజన్లో తొలి విడతగా రూ.10 వేలు, ఖరీఫ్ సీజన్లో రూ.10 వేల చెల్లిస్తామని తెలిపారు. జిల్లాలో యాక్టివ్గా లేని అకౌంట్ ఉన్న వాళ్లు 4000 మంది, ఆధార్ లింకేజీ కాని వాళ్లు 2 వేల మంది ఉన్నారని, వీరంతా వ్యవసాయశాఖాధికారులను సంప్రదించాలని సూచించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ రైతులందరికీ అవసరమైన మేర ఎరువులు, విత్తనాలు మొదలైనవి అందజేస్తామన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి మాట్లాడుతూ మూడు నెలలుగా వ్యవసాయ అనుబంధ శాఖలు లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశామన్నారు. 27 వేల మంది చనిపోయిన రైతులు, రాంగ్ సీడింగ్ చేసిన రైతులు 18 వేల మంది ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ పీడీ ఐ.మురళి, వ్యవసాయశాఖ ఏడీఏ అనిత, తహసీల్దార్ సీహెచ్ సుబ్బయ్య, ఎంపీడీఓ శ్రీహరిరెడ్డి, ఏఓ రజని, ఎంపీపీ పార్వతి, సర్పంచ్ వై.విజయ, అమరావతి, బుచ్చి మున్సిపల్ చైర్మన్ సుప్రజ, వివిధ రైతు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 1,95,866 మందికే లబ్ధి కలెక్టర్ ఓ ఆనంద్ -
మైనింగ్ ఆపకపోతే ప్రాణత్యాగానికై నా సిద్ధం
వరికుంటపాడు/ఉదయగిరి: వరికుంటపాడు పంచాయతీ జంగంరెడ్డిపల్లిలో ప్రభుత్వం మంజూరు చేసిన మైనింగ్ అనుమతులు ఆపకపోతే తాము ప్రాణత్యాగానికై నా సిద్ధమంటూ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు శనివారం ఆందోళనకు దిగారు. మైనింగ్తో ఈ ప్రాంతానికి జరిగే అనర్థాలపై ప్రజల మద్దతు కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో మహిళలు పెద్ద సంఖ్యలో వాల్పోస్టర్లు, ప్లకార్డులతో వరికుంటపాడు ప్రధాన రహదారిలో అవగాహనా ర్యాలీ చేపట్టారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న ఈ ర్యాలీని ఎస్సీ కాలనీ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. రెండు గంటలపాటు ఆందోళనకారులను కదలనీయకుండా పోలీసులు అటకాయించడంతో వాగ్వాదానికి దిగి నేలపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో కొంతమంది ఆందోళనకారులు పోలీసులను నెట్టుకుంటూ ముందుకు పరుగులు తీసి గ్రామ ముఖద్వారం వరకు చేరుకుని జాతీయ రహదారిపై నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆందోళనకారులను జాతీయ రహదారిపైకి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆందోళనకారులు,పోలీసుల మధ్య పలుమార్లు తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్తితి తీవ్రం కావడంతో పరిస్థితి ఎలా పరిణమిస్తుందోనన్న భయాందోళన స్థానికుల్లో కనిపించింది. పరిస్థితి అదుపుదాటుతుండటంతో ఉదయగిరి సీఐ కె.వెంకట్రావు 144 సెక్షన్ అమల్లో ఉన్నందున తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలని హెచ్చరించారు. జేఏసీ కన్వీనరు, గ్రామసర్పంచ్ దిలీప్కుమార్ ఘాటుగా స్పందిస్తూ శాంతియుత ర్యాలీని అడ్డుకునే హక్కు మీకు ఎవరు కల్పించారని పోలీసుల్ని నిలదీశారు. ప్రజలను చైతన్యం చేసేందుకు తాము చేస్తున్న పోరాటాన్ని పోలీసులు హింసాత్మక ఘటనగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. మా ప్రాణాలు పోతున్నా మీకు పట్టవా.. ఎవరి ప్రయోజనాలు ఆశించి మమ్మల్ని కట్టడి చేయాలని ప్రయత్నిస్తున్నారని పోలీసులను ప్రశ్నించారు. మమ్మల్ని అడ్డుకోవాలని ప్రయత్నించినా తమ పోరాటం ఆగదని, మైనింగ్ రద్దు చేయకపోతే తమ శవాలపై నడిచి మైనింగ్ చేసుకోవాలని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఆందోళనకారులు జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తారన్న సమాచారంతో వరికుంటపాడు, దుత్తలూరు, ఉదయగిరి ఎస్సైలు రఘునాథ్, ఆదిలక్ష్మి, శ్రీనివాసులు ఆధ్వర్యంలో భారీగా పోలీసులను జాతీయ రహదారి ప్రధాన కూడళ్ల వద్ద పహారా పెట్టారు. అయినా ఆందోళనకారులు లెక్క చేయకుండా గ్రామంలో ర్యాలీ చేపట్టి అనంతరం జాతీయ రహదారి వద్దకు చేరుకునే ప్రయత్నంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.అనంతరం జేఏసీ కన్వీ నర్ దిలీప్కుమార్, నాయకులు ఆండ్రా పరంధామిరెడ్డి, షేక్ పీరయ్య, సరాబు లక్ష్మీనారాయణ, సుంకర రాధాకృష్ణ, తదితరులను సీఐ వెంకట్రావు స్టేషన్కు పిలిపించి మరోసారి ఆందోళన కార్యక్రమాలు చేపడితే కేసులు పెడతామని తీవ్రంగా హెచ్చరించారు. అయితే దీనివెనుక టీడీపీకి చెందిన కొంత మంది నేతలు తెరవెనుక ఉండి ఆందోళనకారులను రెచ్చగొడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతులు రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదు ఆందోళన చేస్తున్న గ్రామస్తులను అడ్డుకున్న పోలీసులు, తోపులాట ఉద్రిక్తంగా మారిన పరిస్థితులు -
సాగుకు గడ్డు పరిస్థితి
● కండలేరు పంపింగ్ స్కీమ్కు రిపేర్లు ● ప్యానల్ బోర్డు మార్చేందుకు యత్నం ● ఎప్పటికి పూర్తవుతుందో స్పష్టత కరువు ● నీటి విడుదల వాయిదా ప్యానల్ బోర్డు మార్చాలి కండలేరు లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ నుంచి ఎడమ గట్టు కాలువకు నీటిని పంపింగ్ చేసేందుకు అంతా సిద్ధం చేశాం. అయితే హెవీ మోటార్లకు సంబంధించిన ప్యానెల్ బోర్డు ఎక్కడా లభ్యం కాలేదు. దీంతో బోర్డును తెప్పించే యత్నాల్లో ఉన్నాం. సాధ్యమైనంత త్వరగా నీటిని పంపింగ్ చేయనున్నాం. – విజయరామిరెడ్డి, తెలుగుగంగ డీఈ ●పొదలకూరు: కండలేరు పంపింగ్ స్కీమ్కు రిపేర్లు తలెత్తడంతో దాదాపు 20 వేల ఎకరాల్లో సాగుకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి కండలేరు ఎడమ గట్టు కాలువకు పంపింగ్ స్కీమ్ ద్వారా నీటిని విడుదల చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఈ తరుణంలో హెవీ మోటార్లకు విద్యుత్ను సరఫరా చేసే సబ్స్టేషన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో మరమ్మతులు చేయించారు. ఈ నేపథ్యంలో కాలువకు నీటిని పంపింగ్ చేసేందుకు శనివారం యత్నించగా, ప్యానల్ బోర్డులో ఏర్పడిన సాంకేతిక కారణాలతో వీలుపడలేదు. దీంతో బోర్డును పూర్తి స్థాయిలో మార్చేందుకు అధికారులు యత్నిస్తున్నారు. లభ్యంకాని సామగ్రి ఒక్కో మోటార్ 2050 హెచ్పీ సామర్థ్యం కలిగి ఉంది. పంపింగ్ స్కీమ్కు ఉపయోగించే సామగ్రి ఈ ప్రాంతంలో లభ్యం కాదు. ఫలితంగా చైన్నె, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి తెప్పించాల్సి ఉంది. కండలేరు ఎడమ గట్టు హైలెవల్ స్లూయిజ్ ద్వారా నీటిని విడుదల చేసేందుకు కాలువను నిర్మించారు. అయితే స్లూయిజ్ ఎత్తులో ఉండటంతో కండలేరు జలాశయంలో 35 టీఎంసీలకుపైగా నీరు నిల్వ ఉంటేనే, గ్రావిటీ ద్వారా కాలువకు అందుతుంది. అయితే ప్రస్తుతం 26 టీఎంసీలే నిల్వ ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ నిర్మాణం గ్రావిటీ ద్వారా ఎడమ కాలువకు నీరు అందకపోతే మెట్ట ప్రాంత రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా లోలెవల్ స్లూయిజ్ వద్ద లిఫ్ట్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సుమారు 6.5 కిలోమీటర్ల మేర రెండు పైప్లైన్లను నిర్మించి ఎడమ కాలువకు కలిపారు. గ్రావిటీ ద్వారా నీరందని సమయంలో లిఫ్ట్ సిస్టమ్ ద్వారా లోలెవల్ స్లూయిజ్ నుంచి కాలువకు అందిస్తారు. అయితే లిఫ్ట్ ప్రక్రియ తరచూ మరమ్మతులకు గురవుతుండటంతో అవసరాలకు నీటిని పంపింగ్ చేయలేకపోతున్నారు. సామగ్రిని తెప్పించేందుకు తెలుగుగంగ ఇంజినీరింగ్ అధికారులు తంటాలు పడుతున్నారు. -
హామీలతో మోసం.. టార్గెట్లతో భారం
సీహెచ్ఓలు తమకు జీతాలు పెంచాలని, ఇన్సెంటివ్స్ చెల్లించాలని కోరుతూ నాలుగు నెలల క్రితం సమ్మె బాట పట్టారు. 46 రోజులు సమ్మె చేశారు. ప్రభుత్వంతో జరిగిన చర్చల సందర్భంగా ఇన్సెంటివ్స్ మొత్తం ఒకేసారి చెల్లిస్తామని, సమ్మె కాలానికి జీతాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. జీతాలు పెంచే విషయం కూడా పరిశీలిస్తామని చెప్పి సమ్మె విరమింప చేసింది. అయితే హామీలకు విరుద్ధంగా సమ్మె చేశారంటూ ఒక్కో నెలలో రూ.5 వేలు చొప్పున రెండు నెలలకు రూ.10 వేలు జీతాలు కట్ చేసి మిగతా మొత్తాన్ని సీహెచ్ఓల ఖాతాలో జమ చేశారు. ఇన్సెంటివ్స్ మొత్తం ఇస్తామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రభుత్వం చేతిలో మోసపోయి తక్కువ జీతాలతో పని చేస్తున్న తమను ప్రభుత్వం మోసగించడమే కాకుండా పీ4 కింద పేద కుటుంబాలను దత్తత తీసుకోమని పేర్కొనడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వర్ణశోభిత సంధ్యవేళ
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ భానుడు తన తాపంతో భూమిని దహించగా, సంధ్య వేళకు కోపం వదిలేసి కాంతుల కళలను ఆవిష్కృతం చేశారు. ఎర్రని పువ్వులెరుపుతో నింగిని రంగుల హరివిల్లు చేసి, ప్రకృతి అందాలతో మనసులు మురిపించాడు. బారాషహీద్ దర్గా సమీపంలోని స్వర్ణాల చెరువు వద్ద వినీలాకాశం తనవైపు చూసే ప్రతి చూపును మంత్రముగ్దుల్ని చేసింది. నీలిగగనంలో కుంకుమ పువ్వుల వర్ణం చిమ్మినట్టుగా, నీటిపై ప్రతిబింబించిన ఆ కాంతులు స్వర్ణ శోభితంగా ఆవిర్భవించాయి. ప్రకృతి మాధుర్యాన్ని పెయింటింగ్ వేసినట్టుగా, రంగుల తోరణంగా శనివారం సాయంత్రం వర్ణశోభితంగా మారింది స్వర్ణాల చెరువు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
‘యాక్సిస్’ కుంభకోణంపై పోరాటం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలో జరిగిన యాక్సిస్ బ్యాంక్ కుంభకోణంపై దశల వారీగా పోరాటం చేస్తామని యానాదుల సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పెంచలయ్య స్పష్టం చేశారు. యాక్సిస్ బ్యాంక్ కుంభకోణంపై నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో పలు సంఘాలు, రాజకీయ పార్టీలతో శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనిపై పోలీసులు నేటికీ విచారణ జరపలేదని, కారకులను కాపాడేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. అమాయక గిరిజనుల పేరుతో ముత్తుకూరులోని బ్యాంక్లో రూ.కోట్లలో రుణాలు తీసుకోవడం దారుణమన్నారు. ఈ ఉదంతంపై అన్ని రాజకీయ పార్టీలతో కలిసి దశలవారీగా న్యాయ, ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కలెక్టరేట్ వద్ద నిరసనను సోమవారం చేపట్టనున్నామని పేర్కొన్నారు. సమగ్ర విచారణకు రాష్ట్ర ఎస్టీ కమిషన్కు పిర్యాదు చేస్తామన్నారు. సీపీఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, సీపీఐ జిల్లా కార్యదర్శి రామరాజు, ఏఆర్డీ చైర్మన్ బషీర్, రజక సంఘ నేతలు పద్మజ, పోలయ్య, రఘు, కోటయ్య, యానాదుల సంఘ నేతలు కృష్ణయ్య, రవీంద్రబాబు, ఉషా తదితరులు పాల్గొన్నారు.. -
అవయవదానంతో 8 మందికి పునర్జన్మ
● జీవన్దాన్ ఏపీ చైర్మన్ రాంబాబు నెల్లూరు(అర్బన్): అవయవదానంతో ఎనిమిది మందికి పునర్జన్మ ప్రసాదించవచ్చని జీవన్దాన్ ట్రస్ట్ ఏపీ చైర్మన్ డాక్టర్ రాంబాబు అన్నారు. శుక్రవారం సాయంత్రం నెల్లూరులో ఓ కన్వెన్షన్ హాల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం అపోలో ఆస్పత్రిలో క్యాంప్ ఉంటుందన్నారు. బ్రెయిన్డెడ్ అంటే ఏంటి?, అవయవదానాన్ని చట్టబద్ధంగా ఎలా చేయాలి? అనే అంశాలను వివరిస్తామన్నారు. మూడో తేదీన నేషనల్ ఆర్గాన్ డొనేషన్డేను పురస్కరించుకుని వీఆర్సీ సెంటర్ నుంచి భారీ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కార్యక్రమం జరుగుతుందన్నారు. జీవన్దాన్ సంస్థలో ఇప్పటికే 4,733 మంది అవయవాల కోసం రిజిస్టర్ చేసుకున్నారన్నారు. కార్యక్రమంలో వివిధ ఆస్పత్రుల ప్రతినిధులు డాక్టర్ శ్రీరాంసతీష్, బాలరాజు, డాక్టర్ సతీష్, శేఖర్రెడ్డి, రంజిత్రెడ్డి, సురేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మైనింగ్ ఆపాలంటూ రాస్తారోకో
వరికుంటపాడు: వరికుంటపాడు పంచాయతీ పరిధిలోని జంగంరెడ్డిపల్లి పల్లతిప్పలో మైనింగ్ కార్యకలాపాలు వెంటనే నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం స్థానికులు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రోడ్డుపై బైఠాయించారు. దీంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. వారు మాట్లాడుతూ ప్రజాభిప్రాయ సేకరణలో అందరూ ముక్తకంఠంతో మైనింగ్ రద్దు చేయాలని కోరామన్నారు. అయినా లీజు హక్కుదారులు తమ కార్యకలాపాలు ఆపలేదని, దీంతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ను కలిసి తమ గోడు వినిపించామన్నారు. వారి నుంచి స్పందన రాకపోవడంతో జేఏసీ ఏర్పాటు చేసి ఆందోళనకు దిగినట్లుగా చెప్పారు. మైనింగ్ చేస్తే నాలుగు గ్రామాల ప్రజల జీవనాధారం కోల్పోవడమే కాకుండా జంగంరెడ్డిపల్లిని వేరే ప్రాంతానికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మైనింగ్ను రద్దు చేయకపోతే న్యాయస్థానాల్లో న్యాయపోరాటానికి సిద్దమవుతామని తెలిపారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో ఎస్సై రఘునాథ్ తన సిబ్బందితో వెళ్లి ఆందోళనకారులతో మాట్లాడి రాస్తారోకోను విరమింపజేశారు. -
పామాయిల్ ఫ్యాక్టరీ కార్మికులకు స్వల్ప గాయాలు
ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని పంటపాళెంలో ఉన్న బుంగి పామాయిల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు కెమికల్ నీరు కలిసిన ప్రాంతంలో నడవడంతో గాయపడ్డారు. సేకరించిన సమాచారం మేరకు వివరాలు.. శుక్రవారం ఫ్యాక్టరీని శుభ్రం చేసేందుకు నీటిలో కెమికల్ కలిపినట్టుగా తెలుస్తోంది. నలుగురు కార్మికులు ఆ నీటిపై నడవడంతో వారి కాళ్లకు బొబ్బలు రేగి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే యాజమాన్యం ముత్తుకూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వారికి చికిత్స చేయించింది. నలుగురికి ప్రమాదమేమీ లేదని, కోలుకుంటున్నట్టు తెలిసింది.కసుమూరు దర్గాలో భక్తుల నిలువు దోపిడీ ● హుండీలో కానుకలు వేయకుండా అడ్డుకున్న ముజావర్లు వెంకటాచలం: దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన మండలంలోని కసుమూరు మస్తాన్వలీ దర్గాలో కొందరు ముజావర్ల కారణంగా భక్తులు నిలువు దోపిడీకి గురయ్యారు. శుక్రవారం కావడంతో ఉదయం నుంచి దర్గాకు భక్తులు పోటెత్తారు. వారు తమకు తోచిన కానుకలు (నగదు) హుండీల్లో వెళ్తుండగా కొందరు ముజావర్లు తమ చేతికివ్వాలని డిమాండ్ చేశారు. పలువురు భక్తులు చేసేదేమీలేక కానుకలు సమ ర్పించి వెళ్లారు. కొందరు మాత్రం ఎదురు తిరిగి మీకెందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. హుండీల్లో కానుకలు వేసేందుకు ఒప్పుకోమని చేతికి ఇవ్వాల్సిందేనని ముజావర్లు పట్టుబట్టారు. వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భక్తితో దర్గాకు వస్తే బలవంతపు వసూళ్లకు పాల్పడతారా అంటూ భక్తులు మండిపడ్డారు. అధికారులు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై దర్గా కేర్ టేకర్ అస్లాం మాట్లాడుతూ వివాదం గురించి తెలిసిన వెంటనే ముజావర్లు వసూళ్లకు పాల్పడకుండా చేశామని తెలిపారు. మరోసారి ఇలా జరిగితే వక్ఫ్ బోర్డు దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామన్నారు. అథ్లెటిక్స్ ఎంపికలు రేపు నెల్లూరు(స్టోన్హౌస్పేట): జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈనెల 3వ తేదీన సౌత్జోన్ మీట్ కమ్ సెలక్షన్స్ జరగనున్నాయని ఆ అసోసియేషన్ అధ్యక్షుడు కె.వెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలు 14, 16, 18, 20 సంవత్సరాల్లోపు బాలబాలికలకు ఉదయం 9 గంటలకు జరుగుతాయన్నారు. హాజరయ్యే వారు ధ్రువీకరణపత్రాలతో హాజరుకావాలన్నారు. ఆర్గనైజర్ విజయకుమార్ను 94418 75190కు ఫోన్ చేసి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఎంపికై న క్రీడాకారులు బాపట్లలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. -
సిండికేట్ వసూళ్లు ఇలా..
30 గనుల్లో లభించే మైకా క్వార్ట్ ్జను దిగుమతి చేసేందుకు చైనా, జపాన్ దేశాల్లో అనుమతి ఉంది. దీంతో ఆయా గనుల నుంచి వచ్చే ఖనిజాలను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇక్కడ లభించే ఖనిజం రకాలను బట్టి రూ.20 వేల నుంచి రూ.85 వేల వరకు ధర పలుకుతోంది. టన్ను రూ.20 వేల చొప్పున అమ్మితే సిండికేట్కు రూ.4 వేలు కప్పం కట్టాలి. అదే టన్ను రూ.85 వేలకు అమ్మితే రూ.20 వేల పైన ఇవ్వాలి. దానికితోడు మరో ముఖ్యనేతలకు ఇవ్వాల్సి వస్తోంది. దీంతో గనుల యజమానులు లబోదిబోమంటున్నారు. అలాగే కొన్ని యార్డులకు కూడా అనుమతులను మంజూరు చేశారు. వాటికి కూడా ఆ వంతునే నగదును సిండికేట్కు చెల్లించాలి. ముఖ్యంగా సైదాపురం మండలంలో వివిధ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను కూడా సిండికేట్ రాయుళ్లు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. కార్యాలయం కూడా సైదాపురం – ఊటుకూ రు మధ్యలో ఏర్పాటు చేయడం గమనార్హం. -
జాబ్మేళాలను సద్వినియోగం చేసుకోండి
ఆత్మకూరు: జాబ్మేళాలను నిరుద్యోగ యువత స ద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర దేవదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆంధ్రా ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం ప్రభుత్వ సలహాదారు, డీఆర్డీఓ మాజీ చైర్మన్ గుండ్రా సతీష్రెడ్డి సహకారంతో భారీ జాబ్మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా, నేరుగా మొత్తం 2,347 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. 93 కంపెనీలు పాల్గొన్నట్లు చెప్పారు. కలెక్టర్ ఒ.ఆనంద్, టిడ్కో చైర్మన్ అజయ్కుమార్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ సురేష్రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ కానిస్టేబుళ్ల తుది ఫలితాల విడుదల నెల్లూరు(క్రైమ్): కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించిన తుది ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఎంపికై న 158 మందితో కూడిన ఫైనల్ లిస్టును అధికారులు జిల్లా పోలీసు కార్యాలయంలో అందుబాటులో ఉంచారు. వీరు త్వరలో తొమ్మిదినెలలపాటు శిక్షణకు వెళ్లనున్నారు. -
ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటాం
● గిరిజన మహిళలకు బుర్రా భరోసా ఉలవపాడు: ‘మీరు ధైర్యంగా ఉండండి.. అండగా ఉంటా. ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటా’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ కందుకూరు ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ గిరిజన మహిళలకు భరోసా ఇచ్చారు. రామకృష్ణాపురం గిరిజన మహిళలు బెయిల్పై విడుదల కావడంతో వారిని శుక్రవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయ కక్షలో భాగంగా కేసులు నమోదయ్యాయి కాబట్టి, బాధపడాల్సిన అవసరం లేదన్నారు. ఇండోసోల్ కంపెనీకి భూములు ఇవ్వలేదని ప్రభుత్వం పెట్టిన కేసని అర్థమైందన్నారు. మహిళల్ని అర్ధరాత్రి అరెస్ట్ చేయకూడదన్నారు. కానీ పోలీసులు భయభ్రాంతులకు గురిచేయడానికి ఇలా చేశారన్నారు. నెల్లూరుకు వచ్చిన మాజీ సీఎం జగన్మోహన్రెడ్డికి కేసు గురించి తెలియజేశానన్నారు. జగనన్న రైతులకు అండగా ఉండాలని తెలియజేశారన్నారు. న్యాయవాదులతో మాట్లాడతానన్నారు. గిరిజన మహిళలు శిరీష, లలితమ్మ, సునీతలు తమను పోలీసులు అర్ధరాత్రి తీసుకుని వెళ్లి చాలా ఇబ్బంది పెట్టారని తెలిపారు. ఎంత భయపెట్టినా తాము మాత్రం భూమలు ఇచ్చేది లేదన్నారు. కరేడు గ్రామ రైతులందరూ వచ్చి ధర్నా చేయడం వల్ల సెక్షన్ తగ్గించారని, అందువల్లే బెయిల్ వచ్చిందని వారు బుర్రాకు తెలిపారు. మాజీ సీఎం జగన్ను కరేడుకు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు నన్నం పోతురాజు, కరేడు గ్రామ కన్వీనర్ సీతారామిరెడ్డి పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
నెల్లూరు(టౌన్): ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఆపస్, పీఆర్టీయూ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ బాలాజీరావుకు వినతిపత్రాన్ని శుక్రవారం అందజేసిన అనంతరం వారు మాట్లాడారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎంఈఓ – 1 పోస్టులను ఇవ్వరాదని కోరారు. బదిలీ చేసిన టీచర్లను వీలైనంత త్వరగా రిలీవ్ చేయాలని పేర్కొన్నారు. పాఠశాలలకు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యాన్ని సరఫరా చేయాలన్నారు. హైస్కూళ్లలో రిటైర్మెంట్ కారణంగా ఏర్పడిన సబ్జెక్ట్ టీచర్ ఖాళీలను వెంటనే వర్క్ అడ్జస్ట్మెంట్ లేదా క్లస్టర్ ఉపాధ్యాయులతో భర్తీ చేయాలని విన్నవించారు. ఆపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్కుమార్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్బాబు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ పాలనలో ఇచ్చిన రైతు భరోసా
నాడునేడు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నెల్లూరు(పొగతోట): కూటమి అధికారంలోకి వచ్చి అన్నదాతల ఆశలను చిదిమేసింది. ఆరుగాలం పండించిన పంటలకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కూడా దక్కక రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. సాగు పెట్టుబడిగా అన్నదాత సుఖీభవ పథకంతో ఏడాదికి రూ.20 వేలు ఇస్తామంటూ ప్రచారం చేసి తొలి ఏడాదిలోనే హామీని తుంగులో తొక్కేశారు. తాజాగా పీఎం కిసాన్ మొత్తాన్ని మినహాయించి రూ.14 వేలను మూడు విడతల్లో ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. నిబంధనల కొర్రీలు.. లబ్ధిదారుల సంఖ్యలో కోతలు అన్నదాతకు కూటమి ప్రభుత్వం గుండెకోత పెట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ రైతు భరోసా పథకంలో లబ్ధిదారులుగా ఉండి లబ్ధి పొందిన రైతుల్లో 28,299 మందిని తొలగించారు. ఈకేవైసీ, ఆధార్లింక్, బ్యాంకు అకౌంట్ లింకు కాలేదంటూ తదితర కారణాలు చూపి జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో రైతులను అనర్హులుగా ప్రకటించారు. జిల్లాలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2,14,667 మంది రైతులకు వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని అందజేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నదాత సుఖీభవ పథకానికి జిల్లా వ్యాప్తంగా 3.19 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆర్టీజీఎస్ వ్యాలిడేషన్ తర్వాత అర్హులైన రైతులు 1,98,514 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు స్వయంగా జిల్లా వ్యవసాయ అధికారిణి గత నెల 23న పత్రిక ప్రకటన విడుదల చేశారు. తాజాగా అధికారులు 1,86,368 మందిని అర్హులుగా తేల్చారు. కేవలం వారం రోజుల్లోనే ఫైనల్ చేసిన జాబితాల నుంచి 12,146 మంది లబ్ధిదారులను లేపేశారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం.. వైఎస్ జగన్ బ్రాండ్ చంద్రబాబు గతంలో 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పటికీ ఏనాడు అన్నదాతల కోసం ఎలాంటి పథకాన్ని అమలు చేయలేదు. ఆర్థికంగా ఆదుకున్నది లేదు. అధికారంలోకి వచ్చిన ప్రతి సారి రైతులను వంచనకు గురి చేసిన చరిత్ర చంద్రబాబుకు మాత్రమే ఉంది. 2004కు ముందు వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారు. వ్యవసాయమే దండగ అని వ్యాఖ్యానించిన చంద్రబాబు, 2014 ఎన్నికల్లో రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేస్తానని నిలువునా మోసం చేశారు. తాజా ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన వైఎస్సార్ రైతు భరోసా పథకం పేరును అన్నదాత సుఖీభవ పథకంగా మార్పు చేసి ఆర్థిక సాయం అందిస్తామని చెబుతున్నారు. వైఎస్సార్ రైతు భరోసా పథకం వైఎస్ జగన్ బ్రాండ్గా చెప్పొచ్చు.సంవత్సరం మొత్తం ఆర్థిక సాయం రైతులు (రూ.కోట్లల్లో) 2019–20 2,02,306 273.11 2020–21 2,43,502 328.72 2021–22 2,43,911 329.27 2022–23 2,14,667 289.80 2023–24 2,14,667 289.80 నెల్లూరురూరల్: రైతులకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్నారని కలెక్టర్ ఓ ఆనంద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అన్నదాత సుఖీభవ మొత్తం 1,95,866 మంది అర్హులను గుర్తించినట్లు పేర్కొన్నారు. తొలివిడతలో 1,86,146 మందికి నిధులు విడుదల చేస్తున్నామని, మిగిలిన అర్హులైన లబ్ధి దారులు ధ్రువీకరణ పత్రానలు అందజేస్తే వారికి సైతం నిధులిస్తామని తెలిపారు. మొదటి విడతలో రాష్ట్ర ప్రభుత్వం రూ.5 వేలు, పీఎం కిసాన్ కింద కేంద్రం రూ.రెండు వేల చొప్పున జమ చేయనున్నాయని చెప్పారు. -
నిధుల గోల్మాల్
సీతారామపురం: మండలంలో విధులు నిర్వర్తిస్తూ దీర్ఘకాల సెలవుపై వెళ్లిన ఓ ఎంపీడీఓ ఏకంగా రూ.11 లక్షలకుపైగా నిధులను స్వాహా చేశారనే చర్చ మండలంలో కొన్ని రోజులుగా జరుగుతోంది. గతేడాది అక్టోబర్ 4న విధుల్లో చేరిన సదరు అధికారి.. ప్రభుత్వ నిధులకు సంబంధించి ఎలాంటి లెక్కల్లేకుండా తన అనుచరులతో డ్రా చేయించారని తెలుస్తోంది. స్థానిక కెనరా బ్యాంక్లో గల ఎంపీడీఓ పెన్షన్ ఖాతా నుంచి ఈ మొత్తాన్ని డ్రా చేయించారని సమాచారం. ఆయన విధుల్లో చేరాక పెన్షన్ అకౌంట్కు పలు విడతలుగా ట్రైనింగ్ డబ్బులు సుమారు రూ.1.6 లక్షలు.. 15వ ఆర్థిక సంఘ నిధులతో చేపట్టిన పనుల నుంచి మినహాయించిన రికవరీ మొత్తాలు సుమారు రూ.మూడు లక్షలను బదిలీ చేయించి.. చెల్లించకుండానే వాటిని స్వాహా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు గుండుపల్లి వద్ద నేషనల్ హైవే పనుల్లో భాగంగా పాఠశాల, పంచాయతీ భవనంతో పాటు, ఇతర ప్రభుత్వ ఆస్తులకు కలెక్టర్ మంజూరు చేసిన నష్టపరిహారం రూ. 39,42,534 జమయ్యాయి. వీటిని ఉన్నతాధికారుల ఆదేశానుసారం వినియోగించాల్సి ఉన్నా, అందులో రూ.ఆరు లక్షలను బొక్కేశారని సమాచారం. కాగా ఈ విషయమై కార్యాలయ ఏఓను సంప్రదించగా, నగదు లావాదేవీలను ఎంపీడీఓ స్వయంగా చూసేవారని, సిబ్బంది ప్రమేయం లేదని బదులిచ్చారు.సీతారామపురం ఎంపీడీఓ కార్యాలయం నేషనల్ హైవే నష్టపరిహారం, కాంట్రాక్ట్ పనుల రికవరీ సొమ్ము రూ.11 లక్షలకుపైగా స్వాహా దీర్ఘకాల సెలవుపై వెళ్లిన ఎంపీడీఓపై ఆరోపణలు -
కుట్రలను ఛేదించి.. విజయవంతం చేశారు
మహిళలపైనా లాఠీచార్జి నెల్లూరు(స్టోన్హౌస్పేట): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి నెల్లూరు పర్యటనను అడ్డుకునేందుకు సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలకు పాల్పడినా, ప్రజలు తిప్పికొట్టి విజయవంతం చేశారని పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, ఎమ్మెల్సీ మేరిగ మురళి, పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి కుమార్తె కాకాణి పూజిత తదితరులు విలేకరులతో శుక్రవారం మాట్లాడారు. మాజీ సీఎం పర్యటనకు ప్రజలు రాకూడదనే దురుద్దేశంతో రోడ్లను తవ్వేయడం, జేసీబీలను అడ్డుపెట్టారని, ఇలాంటి పోకడలు దేశంలో ఎక్కడా లేదని మండిపడ్డారు. నిర్బంధాలను అధిగమించి వేలాదిగా ప్రజలు వచ్చారని, జగనన్నకు ఉన్న ఆదరణ ఏ పాటిదో దీని ద్వారా తెలుస్తోందన్నారు. జిల్లా రాజకీయాలను భ్రష్టు పట్టించారు కూటమి ప్రభుత్వం కొలువుదీరాక జిల్లా రాజకీయాలను భ్రష్టు పట్టించారని, పోలీసులిచ్చే నోటీసులను సంతోషంగా స్వీకరిస్తామని పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. అక్రమ కేసులను బనాయించి కాకాణి గోవర్ధన్రెడ్డిని జైలుకు పంపారని.. ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డారని చెప్పారు. వీరికి అండగా నిలిచేందుకు జిల్లాకు జగన్మోహన్రెడ్డి వస్తుంటే, ఆయన్ను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం చేయని యత్నం లేదని విమర్శించారు. ఆయన పర్యటనపై జిల్లా వాసులే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయాలతో సంబంధం ఉన్న చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారని తెలిపారు. జిల్లా కేంద్ర కారాగారం నుంచి ప్రసన్న నివాసం వరకు 7.7 కిలోమీటర్ల ప్రయాణంలో అడుగడుగునా జనాలు నీరాజనాలు పలికారని వివరించారు. చెట్లు.. గుట్టలతో ఉన్న ప్రాంతంలో అనుమతిస్తే, ఐదు రోజులు శ్రమించి హెలిప్యాడ్కు స్థలాన్ని సిద్ధం చేసుకున్నామని పేర్కొన్నారు. హెలిప్యాడ్, జైలు వద్ద పది మందికి మించి.. ప్రసన్న నివాసం వద్ద ఒక్కరూ ఉండకూడదని.. జగన్మోహన్రెడ్డితో పాటు మూడు వాహనాలకు మించి ఉండకూడదంటూ నిబంధన విధించారని, అయితే పోలీసులు మాత్రం 12 వాహనాల్లో వచ్చి ఆటంకాలు సృష్టించారని ఆరోపించారు. 35 రకాల కండీషన్లను పెట్టారని, ఎవరెవరు ఎక్కడెక్కడుంటారో జాబితా.. వాహనాల నంబర్లను ముందే ఇవ్వాలన్నారని, ఇదెక్కడి చోద్యమో అర్థం కావడంలేదని చెప్పారు. తమ పార్టీకి చెందిన మూడు వేల మంది నేతలకు నోటీసులిచ్చారని ధ్వజమెత్తారు. కార్యక్రమానికి ఎవర్నైనా తీసుకెళ్తే కేసు లు పెడతామని బెదిరించారని, పార్టీ మహిళా నేతల ఇళ్లకు మహిళా కానిస్టేబుళ్లు లేకుండా అర్ధరాత్రి వెళ్లి నోటీసులను ఇచ్చారని మండిపడ్డారు. కార్యకర్తలు రాకుండా రోడ్లను బారికేడ్లతో నిర్బంధించి దాదాపు మూడు వేల మంది పోలీసులను మోహరించారని, జగన్మోహన్రెడ్డికి రక్షణ కల్పించాల్సింది పోయి అడ్డుకునేందుకే ఆసక్తి చూపారని విమర్శించారు. కార్యకర్తలు వెనుకడుగేయలేదు జగన్మోహన్రెడ్డిపై ప్రజల్లో ఉన్న అభిమానానికి నెల్లూరు పర్యటన ఓ ఉదాహరణ అని ఆనం విజయకుమార్రెడ్డి, మేరిగ మురళి పేర్కొన్నారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ లాఠీచార్జి చేసినా, తమ కార్యకర్తల మనోధైర్యం చెక్కుచెదరలేదని తెలిపారు. ప్రజాభిమానాన్ని చూసి కూటమి నేతలు ఓర్వలేక మీడియా ద్వారా వారి అక్కసును వెళ్లగక్కుతున్నారని విమర్శించారు.జగనన్న భరోసా ఎంతో ధైర్యాన్నిచ్చింది కష్టాల్లో ఉన్న తమ కుటుంబానికి జగన్మోహన్రెడ్డి భరోసా ఇవ్వడం ఎంతో ధైర్యాన్నిచ్చిందని కాకాణి పూజిత పేర్కొన్నారు. దీనిపై కొన్ని పత్రికలు వక్రీకరించాయని, వారిని ఏమనాలో అర్థం కావడంలేదన్నారు. వేలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చారని చెప్పారు. కాకాణి గోవర్ధన్రెడ్డి ఎలాంటి తప్పూ చేయలేదని, అక్రమ కేసులతో జైల్లో నిర్బంధించారనే విషయాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని చెప్పారు. నిర్బంధాలను అధిగమించి వేలాదిగా తరలివచ్చిన అభిమానులు మాజీ సీఎం జగన్ పర్యటన గ్రాండ్ సక్సెస్ విలేకరులతో వైఎస్సార్సీపీ నేతలు తమ పార్టీ నేతలు, కార్యకర్తలను హోమ్ మంత్రి, డీజీపీ, ఐజీ, ఎస్పీ పర్యవేక్షణలో నిర్బంధించారని ప్రసన్నకుమార్రెడ్డి ఆరోపించారు. ఏడాది పాలనకే చంద్రబాబులో భయం మొదలైందని విమర్శించారు. పోలీసులు ఖాకీ చొక్కాలను తీసేసి పచ్చ చొక్కాలు తొడుక్కొని టీడీపీ కార్యకర్తల తరహాలో వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఒంగోలుకు చెందిన ఓ పోలీస్ తనపై లాఠీతో దాడి చేసి, గోళ్లతో రక్కి.. తిరిగి తనపైనే రెండు కేసులు పెట్టారని, అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రెస్ మీట్ను అడ్డుకునేందుకు పార్టీ కార్యాలయంపైకి టీడీపీ గూండాలను పంపారని, అయినా తాము ఆగిపోలేదని చెప్పారు. -
లారీని తప్పించబోయి..
● రోడ్డు ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి కావలి(జలదంకి): రోడ్డు ప్రమాదంలో ఓ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతిచెందాడు. కావలి రూరల్ పోలీసుల కథనం మేరకు.. విజయవాడకు చెందిన కోదాటి రాజు (47) ట్రావెల్స్ బస్సు డ్రైవరుగా పని చేస్తున్నాడు. అతడికి భార్య సంధ్య, ముగ్గురు పిల్లలున్నారు. బుధవారం సాయంత్రం 4:45 గంటలకు రాజు ఏలూరు నుంచి బెంగళూరుకు బయలుదేరిన బస్సుకు డ్రైవర్గా ఉన్నాడు. రాత్రి 11:50 గంటల సమయంలో కావలి మండలం అడవిరాజుపాళెం దాటిన తర్వాత పెట్రోల్ బంకు సమీపంలో జాతీయ రహదారిపై లారీ వెళ్తోంది. దాని డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో రాజు లారీని తప్పించేందుకు స్టీరింగ్ను ఎడమవైపునకు తిప్పాడు. ఆ సమయంలో మరో లారీ వెళ్తుండగా దానిని బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజు స్టీరింగ్, సీటు మధ్యలో ఇరుక్కుని మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ప్రయాణులకు స్వల్ప గాయాలయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కావలి రూరల్ సీఐ రాజేశ్వరరావు గురువారం తెలిపారు. -
నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు
నెల్లూరు(పొగతోట): అంగన్వాడీ కేంద్రాల పరిధిలో ఈనెల 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహించాలని ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్ సీడీపీఓలను ఆదేశించారు. గురువారం నెల్లూరులోని కార్యాలయంలో సీడీపీఓలతో నిర్వహించిన సమావేశంలో పీడీ మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ తల్లిపాలు పిల్లల ఆరోగ్యానికి, ఎదుగుదలకు ఎంత అవసరమో అవగాహన కల్పించాలన్నారు. పూర్తిస్థాయిలో ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో వారోత్సవాలను జరపాలన్నారు. శుక్రవారం కలెక్టర్ ఆనంద్ కార్యక్రమాలను ప్రారంభిస్తారని తెలియజేశారు. -
గుప్తనిధుల కోసం తవ్వకాలు
సైదాపురం: మండలంలోని తోచాం గ్రామంలో పురాతన శ్రీకృష్ణుని ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గురువారం గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించగా ఉడాయించాడు. ఊరి పొలిమేరల్లో అమ్మ వారి బొమ్మ వేసి పూజలు చేసిన ఆనవాళ్లను గుర్తించారు. దీంతో గ్రామస్తులు ఆలయానికి వెళ్లి పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తులు పూజలు చేసి విగ్రహాల వెనుకవైపు తవ్వకాలు చేశారు. కొద్దిరోజుల నుంచి సమీప ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆలయ పరిసర ప్రాంతలతోపాటు గ్రామంలో సంచరించినట్లు గుర్తించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కుటుంబాల్లో బెల్టు షాపుల చిచ్చు
ఉదయగిరి: కూటమి ప్రభుత్వం గ్రామగ్రామాన బెల్టు షాపులు ఏర్పాటు చేసి పచ్చని సంసారాల్లో చిచ్చురేపి నాశనం చేస్తోందని ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివమ్మ, మస్తాన్బీ అన్నారు. వారు గురువారం మండలంలోని కృష్ణారెడ్డిపల్లెలో జరిగిన ఉదయగిరి ప్రాంత ఐద్వా 3వ మహాసభలో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాల్లో మంచినీరు దొరకపోయినా పుష్కళంగా దొరుకుతోందన్నారు. బెల్టు షాపులతో మహిళలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాటిని అరికట్టాల్సిన ప్రభుత్వ అధికారులు మిన్నకుండిపోవడం దారుణమన్నారు. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్సిక్స్ హామీలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. భవిష్యత్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. అనంతరం 13 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం బెల్టు షాపులు ఎత్తివేయాలని ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఎంపీటీసీ విజయమ్మ, నాయకులు కామాక్షమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా పరిషత్లో పదోన్నతులు
నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో పనిచేస్తున్న ఆరుగురు సీనియర్ సహాయకులకు పదోన్నతులు కల్పించారు. ఉత్తర్వులను జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, సీఈఓ మోహన్రావు గురువారం అందించారు. వెంకటరమణయ్య, సీహెచ్ రామకృష్ణ, షేక్ ఇలియాజ్, ఎం.లీలామోహన్, ఎం.సుదర్శన, ప్రసన్నకుమార్ ప్రమోషన్ పొందిన వారిలో ఉన్నారు. కారుణ్య నియామకాలు ఇద్దరు ఉద్యోగాలు మరణించగా వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించారు. ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ 2024 ఏడాది నుంచి ఇప్పటివరకు వివిధ హోదాల్లో పనిచేస్తున్న 120 మందికి పదోన్నతులు కల్పించామన్నారు. 81 మంది ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాల ద్వారా అవకాశాలు ఇచ్చామన్నారు. ఉద్యోగులు, పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు లక్కాకుల పెంచలయ్య, వి.ప్రసన్న కుమార్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. -
5,489 కొత్త పింఛన్ల మంజూరు
నెల్లూరు(పొగతోట): జిల్లాలో 5,489 కొత్త పింఛన్లు మంజూరు చేయడం జరిగిందని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి సాధారణ పింఛన్తోపాటు కొత్తవి పంపిణీ చేస్తామని తెలియజేశారు.పురాతన ఆలయ పరిశీలనసోమశిల: చేజర్ల మండల పరిధిలోని పెరుమాళ్లపాడు పెన్నా నదిలో బయటపడిన నాగేశ్వరస్వామి ఆలయాన్ని గురువారం రాష్ట్ర దేవదాయ శాఖ స్థపతి పరమేశ్వరప్ప పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణం కోసం అవసరమైన నిధులు, స్థల పరిస్థితులు, నిర్మాణ అవసరాలు, పురాతన శిల్పకళ ప్రాముఖ్యత, సంబంధించిన వాటిపై ఆధ్యయనం చేసి, తగిన ప్రతిపాదనలతో నివేదిక సిద్ధం చేశామన్నారు. ఆయన వెంట సహాయ స్థపతి సురేంద్ర, గుంటూరు జిల్లా డీఈఈ సీహెచ్ శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా ఏఈఈ ఎ.మురళిమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
అనుమతులున్నా.. అడ్డుకొని
వెంకటాచలం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనకు కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. నెల్లూరు కేంద్ర కారాగారం వద్ద ఆయన దిగే హెలిప్యాడ్ వద్దకు అనుమతులతో వెళ్లే వారిని సైతం అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. వాస్తవానికి హెలిప్యాడ్ వద్దకెళ్లేందుకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి కుమార్తె పూజితకు పోలీసుల అనుమతి ఉంది. అయినా వీరి కార్లను జాతీయ రహదారిపైనే నిలిపేశారు. పూజిత కారులోని మహిళా సిబ్బందిని దింపేసి వెళ్లాలంటూ హుకుం జారీ చేశారు. మహిళా సిబ్బందిని తమ వెంట తీసుకెళ్లనీయరానంటూ ఖాకీలను ఆమె ప్రశ్నించారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం తగదని ఆమె హితవు పలికారు. మీడియాపైనా ఆంక్షలు విధించి జాతీయ రహదారి వద్దే నిలిపేశారు. కార్లను నిలిపి తనిఖీ చేస్తుండగా.. ఫొటోలు, వీడియోలు తీసి న విలేకరులపై అసహనాన్ని ప్రదర్శించారు. నెల్లూరులో రెడ్బుక్ కర్ఫ్యూ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నగరంలోని ప్రతి సెంటర్లో పోలీసులు బారికేడ్లు పెట్టి ప్రజలకు తీవ్ర ఇబ్బంది కల్పించారు. నగరంలోని ప్రధాన కూడళ్ల మొదలుకొని చిన్న వీధుల్లోనూ పోలీసులను మోహరించారు. ఉదయం ఐదు గంటల నుంచే అన్ని ప్రాంతాల్లో ప్రజల రాకపోకలపై ఇబ్బందులు సృష్టించడంతో సామాన్యులు ఇబ్బంది పడ్డారు. టూవీలర్స్ను కూడా వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం, షాపులు మూయించేయడంతో నగరమంతా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడే వాహనాలను నిర్దాక్షిణ్యంగా నిలిపివేశారు. స్కూళ్లు, డ్యూటీలు, పనులకు వెళ్లేందుకు స్థానికులు అష్టకష్టాలు పడ్డారు. -
బెదరని..
అడ్డంకులు అధిగమించి.. కంచెలు ఛేదించి ప్రసన్న కుటుంబీకులకు ఆత్మీయ పలకరింపు ● ముళ్ల పొదల్లోనూ కాలినడకన జైలు వద్దకు రాక ● అడుగడుగునా జయహో జగన్ నినాదాలు ● 8 కిలోమీటర్లు.. 2.14 గంటల ప్రయాణం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జననేత జగన్మోహన్రెడ్డి పర్యటనను విఫలం చేసేందుకు కూటమి నేతలు కుతంత్రాలు పన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకొని ఆంక్షల ఛట్రాన్ని బిగించారు. హెలిప్యాడ్ నుంచి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటి వరకు ఎవరూ లేకుండా చేయాలనే దురుద్దేశంతో బారికేడ్లను ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. అయితే వీరి కుట్రలు, పన్నాగాలు జన ప్రభంజనం ముందు చిన్నబోయాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానుల జై జగన్, జైజై జగనన్న నినాదాలతో నెల్లూరు హోరెత్తింది. అడుగడుగునా జనాభిమానం చెముడుగుంటలోని హెలిప్యాడ్కు గురువారం ఉదయం 10.30కు చేరుకున్న జగన్మోహన్రెడ్డికి పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన జిల్లా కేంద్ర కారాగారానికి 10.58కు చేరుకున్నారు. అక్రమ కేసులతో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డితో ములాఖతయ్యారు. జిల్లా కేంద్ర కారాగారం నుంచి 11.26కు బయల్దేరి సుజాతమ్మ కాలనీలోని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి మధ్యాహ్నం 1.40కు చేరుకున్నారు. ఆయనతో పాటు కుటుంబసభ్యులను పరామర్శించారు. టీడీపీ మూకలు సాగించిన విధ్వంసకాండపై వారిని ఆరాతీశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మధ్యాహ్నం 2.48కు అక్కడి నుంచి బయల్దేరి హెలిప్యాడ్కు చేరుకున్నారు. బెంగళూరుకు హెలికాప్టర్లో 3.15కు పయనమయ్యారు. కూటమిలో కలవరం జాతీయ రహదారి వెంబడి వాహనాలు బారులుదీరాయి. జగనన్నా అంటూ బస్సులు, లారీలు, కార్ల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున నినదించారు. ఆయన్ను చూసేందుకు వృద్ధులు, మహిళలు రోడ్లపైకొచ్చారు. చంద్రబాబు పాలన అత్యంత దారుణంగా ఉందని, తిరిగి మీరే సీఎం కావాలని నినాదాలు చేశారు. తల్లులు తమ పిల్లలకు ఆశీర్వాదం ఇప్పించారు. అశేష జనవాహినికి అభివాదం చేస్తూ జగన్మోహన్రెడ్డి ముందుకు సాగారు. మొత్తమ్మీద జననేత పర్యటన కూటమి నేతల్లో కలవరాన్ని రేకెత్తిస్తోంది. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మేరిగ మురళీధర్, లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ గురుమూర్తి, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, మాజీ మంత్రులు నారాయణస్వామి, అనిల్కుమార్యాదవ్, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, బుర్రా మదుసూధన్యాదవ్, బియ్యపు మధుసూదన్రెడ్డి, కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్, ఉదయగిరి, వెంకటగిరి సమన్వయకర్తలు ఆనం విజయకుమార్రెడ్డి, మేకపాటి రాజగోపాల్రెడ్డి, నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, కొండూరు అనిల్బాబు, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మలిరెడ్డి కోటారెడ్డి, కాకాణి పూజిత, అనిల్కుమార్రెడ్డి, అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అణువణువూ నిఘా జిల్లా జైలు ప్రాంతం నుంచి ప్రసన్న ఇంటి వరకు దారిపొడవునా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెట్టారు. జగన్మోహన్రెడ్డి భద్రత కంటే.. జనాన్ని కట్టడి చేసేందుకే ప్రాధాన్యమిచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి రాకతో సింహపురి జన ఝరిగా మారింది. రాప్తాడు.. పొదిలి.. రెంటపాళ్ల.. బంగారుపాళ్యం.. ఇలా పర్యటన.. పర్యటనకు మించిన జన సునామీ నెల్లూరును తాకడం కూటమి నేతల్లో వణుకు పుట్టించింది. జననేత పర్యటనను అడ్డుకునేందుకు ఊరూరా ఆంక్షలు విధించినా.. పెద్ద సంఖ్యలో చెక్పోస్ట్లు.. అడుగడుగునా బారికేడ్లు.. ముళ్ల, ఇనుప కంచెలను నెలకొల్పినా.. రహదారులను ధ్వంసం చేసినా, ఇవేవీ పార్టీ అభిమానులను అడ్డుకోలేకపోయాయి. వారిని నిర్బంధించలేకపోయాయి. పార్టీ శ్రేణులు, ప్రజలను కట్టడి చేసేందుకు అనేక అడ్డంకులు సృష్టించినా.. ఖాకీలు లాఠీలను ఝళిపించినా.. ఊహించని స్థాయిలో పోటెత్తారు.జగన్మోహన్రెడ్డి పర్యటనతో నెల్లూరు నగరం జనసంద్రమైంది. ఆంక్షలు, అడుగడుగునా అవాంతరాలను పోలీసులు సృష్టించినా, పార్టీ శ్రేణు లు, అభిమానులు ఏ మాత్రం లెక్క చేయలేదు. రెండుసార్లు లాఠీచార్జి చేసినా బెదరలేదు. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జిల్లా కేంద్ర కారాగారం నుంచి సుజాతమ్మ కాలనీలోని ప్రసన్నకుమార్రెడ్డి ఇంటికి చేరుకునేందుకే దాదాపు రెండు గంటలకుపైగా సమయం పట్టిందంటే ఏ స్థాయిలో అభిమానులు తరలివచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఎండను సైతం లెక్కచేయకుండా ఉప్పెనలా తరలివచ్చారు. కాన్వాయ్ వెంబడి జై జగన్, జయహో జగన్.. సీఎం.. సీఎం అని నినదిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.