breaking news
SPSR Nellore District Latest News
-
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడి మృతి
నెల్లూరు సిటీ: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు.. కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాళేనికి చెందిన నాగరాజు కుమారుడు నిఖిల్(24) నారాయణ ఆస్పత్రిలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నారు. ఈనెల 2వ తేదీ రాత్రి నెల్లూరు రూరల్ పరిధిలోని పద్మావతి గ్రీన్ సిటీలో నిఖిల్ మద్యంలో విషద్రావణాన్ని కలుపుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికులు గమనించి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు నిఖిల్ను ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. దాదాపు 19 రోజుల పాటు చికిత్స పొందుతున్న యువకుడు శనివారం మృతిచెందారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులకు మృతుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాకాణితో ప్రసన్న భేటీ
కోవూరు: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డిని ఆయన నివాసంలో మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి శనివారం భేటీ అయ్యారు. కూ టమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ పటిష్టతపై సుదీర్ఘంగా చర్చించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, కోవూరు నియోజకవర్గ పరిశీలకుడు కొండూరు అనిల్బాబు, నాయకులు గొల్లపల్లి విజయకుమార్, కలువ బాలశంకర్రెడ్డి ఉన్నారు. -
ఆటో డ్రైవర్ నిజాయితీ
● 15 సవర్ల బంగారం, రూ.10 వేల నగదు బ్యాగ్ అప్పగింత ఆత్మకూరు: బంగారం, నగదు దొరికితే గుట్టుచప్పుడు కాకుండా దాచిపెట్టుకునే రోజుల్లో సుమారు రూ.15 లక్షల విలువ గల బంగారు నగలు, రూ.10 వేల నగదుతో ఉన్న బ్యాగ్ను అప్పగించి ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నాడు. పట్టణంలోని సీఐ కార్యాలయంలో ఎస్సైలు జిలానీ, బి.సాయిప్రసాద్లతో సీఐ జి.గంగాధర్ శనివారం వివరాలు వెల్లడించారు. మురగళ్లకు చెందిన ఆటో డ్రైవర్ రమణయ్య గ్రామం నుంచి పలువురు ప్రయాణికులతో ఆత్మకూరుకు వస్తున్నాడు. ఈ క్రమంలో శివాలయం వద్ద దాసరి అమృతలక్ష్మి ఆటోను ఎక్కి ఆత్మకూరులోని బస్టాండ్ వద్ద దిగింది. ఈ క్రమంలో నెల్లూరుకు అప్పుడే బస్సు బయలుదేరుతుండడంతో ఓ బ్యాగ్ను ఆటోలో మరిచి మిగిలిన రెండు బ్యాగ్లతో వెళ్లిపోయింది. కొద్దిసేపటికి రమణయ్య ఆటో సీటులో ఉన్న బ్యాగ్ను గమనించి పరిశీలించగా బంగారు నగలు, నగదు అందులో ఉన్నాయి. దీంతో కొద్దిసేపు ఎదురుచూడగా ఎవరూ రాకపోవడంతో తనకు మరో బాడుగ రావడంతో సమీపంలో ఉన్న తనకు తెలిసిన దుకాణంలో ఆ బ్యాగ్ను అప్పగించి ఎవరైనా వస్తే సమాచారం ఇవ్వాలని చెప్పి వెళ్లాడు. ఈ నేపథ్యంలో అమృతలక్ష్మి బస్సులో నెల్లూరుపాళెం దాటిన తర్వాత బ్యాగును పోగొట్టుకున్న విషయం తెలుసుకుని ఆత్మకూరుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి ఆటోను గుర్తించారు. అతని నంబర్ తెలుసుకుని ఫోన్ చేయగా తనకు బ్యాగ్ దొరికిందని, దుకాణంలో అప్పగించిన విషయం చెప్పి కొద్దిసేపట్లోనే ఆ బ్యాగ్ను పోలీసులకు అప్పగించాడు. నిజాయితీగా వ్యవహరించిన ఆటో డ్రైవర్ రమణయ్యను పోలీసులు అభినందించారు. కేసును గంటల వ్యవధిలో ఛేదించిన ఎస్సైలను, ఐడీ పార్టీ సిబ్బందిని ఎస్పీ అజితా, డీఎస్పీ వేణుగోపాల్లు అభినందించారు. -
బాతులను మేపేందుకు వెళ్లి మృత్యువాత
ముత్తుకూరు(పొదలకూరు): బాతులను మేపేందుకు వెళ్లిన వ్యక్తి మద్యం మత్తులో చెరువులోకి దిగి మృతిచెందిన ఘటన మండలంలోని వల్లూరులో శనివారం జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. తోటపల్లిగూడూరు మండలం సౌత్ఆములూరు గ్రామానికి చెందిన ఉప్పు మస్తాన్(45) ముత్తుకూరు మండలం వల్లూరు చెరువు వద్ద బాతులను మేపేందుకు వచ్చారు. ఈ క్రమంలో మద్యం సేవించిన మస్తాన్ బాతులను తోలుకుని రావడానికి చెరువు నీళ్లలోకి దిగి ఊపిరాడక మృతి చెందాడు. తల్లి వెంకమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైలు ఢీకొని మహిళ మృతి నెల్లూరు (క్రైమ్): రైలు ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతిచెందిన ఘటన వేదాయపాళెం రైల్వేగేటు వద్ద శనివారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల మేరకు.. వేదాయపాళెం రైల్వేగేటు వద్ద రైలు రానున్న నేపథ్యంలో గేటు వేశారు. ఈ క్రమంలో ఓ మహిళ పట్టాలు దాటేందుకు ప్రయత్నించే సమయంలో రైలు రావడాన్ని గుర్తించలేదు. దీంతో వేగంగా వస్తున్న రైలు ఢీకొనడంతో కొంతదూరంలో ఆమె ఎగిరిపడింది. దీంతో తీవ్రగాయాలైన మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మహిళ వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రైల్వే ఎస్సై ఎన్.హరిచందన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో బోల్తా ● మహిళ మృతి గూడూరురూరల్: మండలంలోని తిరువెంగళాయపల్లి సమీపంలో శనివారం మధ్యాహ్నం ఆటో బోల్తా పడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ మృతిచెందింది. రూరల్ ఎస్సై తిరుపతయ్య వివరాల మేరకు.. మండలంలోని చెంబడిపాళెం గ్రామానికి చెందిన పొట్టేళ్ల కృష్ణమ్మ(34), మరికొంతమందితో కలిసి గొల్లపల్లి సమీపంలో పనులకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కృష్ణమ్మను గూడూరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కూలి పనులకెళ్లి జీవనం సాగిస్తున్న కృష్ణమ్మ మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. -
టీడీపీ నేత బరితెగింపు
● దళితుడి భూమిని ఆక్రమించేందుకు యత్నం ● సాగులో ఉన్న జామాయిల్ నరికివేత మర్రిపాడు: అధికార మదంతో గ్రామస్థాయిలో చోటా నేతలు కూడా రెచ్చిపోతున్నారు. ఏళ్లుగా సాగులో ఉన్న భూముల్లో పంటను ధ్వంసం చేసి ఆక్రమించేందుకు యత్నించిన ఘటన నాగినేనిగుంటలో వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నాగినేనిగుంట గ్రామంలో కాలేపల్లి రామయ్య అనే దళితుడికి మూడు దశాబ్దాల క్రితం సర్వే నంబర్ 288/1లో మూడెకరాల భూమిని ప్రభుత్వం మంజూరు చేసింది. ఆయన ఎన్నో సంవత్సరాలుగా భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే గతంలో గ్రామానికి చెందిన టీడీపీ చోటా నేత గిద్దలూరు జిలానీ కన్ను ఆ భూమిపై పడింది. అధికారం ఉంది కదా అని అందులో సాగులో ఉన్న జామాయిల్ మొక్కలను సైతం నరికివేసి ఆ పొలం తనదంటూ రైతును బెదిరించడం మొదలుపెట్టాడు. దీనిపై అప్పట్లో పలువురు పెద్దలు, గ్రామానికి చెందిన వారు సర్ది చెప్పడంతో కొంత వెనక్కు తగ్గిన జిలానీ మళ్లీ రెండు రోజుల క్రితం రామయ్య పొలంలోని మొక్కలను మరోసారి నరికేశాడు. ఇదేమని ప్రశ్నిస్తే పొలంలోకి వస్తే నిన్ను కూడా నరుకుతా అంటూ జిలానీ బెదిరించినట్లు రామయ్య తెలిపారు. దీనిపై తాము గతంలోనే పోలీసులు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, మళ్లీ తమ భూమిలోని మొక్కలను నరికివేసి నష్టం కలిగించారని, ఇప్పుడు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. జిల్లా ఉన్నతాధికారులైనా చొరవ చూపి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం నాగినేనిగుంట సర్వే నంబర్ 288 పూర్తి విస్తీర్ణం 10 ఎకరాలు ఉంది. ఇందులో గతంలో ఆరుగురికి పట్టాలు మంజూరు చేశారు. హద్దులు చూపలేదు. దీనిపై రికార్డులు పూర్తిస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – అనిల్కుమార్ యాదవ్, తహసీల్దార్ -
ఖాళీగా ఉండకుండా బీరసాగు
గతంలో ఉపాధి హామీ ఎఫ్ఏగా పనిచేసేవాడ్ని. పనుల నుంచి అకారణంగా తొలగించారు. దీంతో వ్యవసాయం బాట పట్టి బీరను సాగు చేస్తున్నా. వెలికంటిపాళెం, వరదాపురం గ్రామాల్లో పండిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతున్నా. జాగ్రత్తలు పాటిస్తే కూరగాయల సాగు లాభదాయంగా ఉంటుంది. ఎకరాల్లో సాగు చేస్తే ఆశించిన లాభాలొచ్చే అవకాశం తక్కువ. రెండు నుంచి మూడు ఎకరాల్లో సాగుతో కుటుంబం ఇబ్బంది లేకుండా జీవించొచ్చు. – దయాకర్రెడ్డి, యువ రైతు, వెలికంటిపాళెం ● -
ఆడబిడ్డలకు రక్షణ కరువు
నెల్లూరురూరల్: రాష్ట్రంలో ఆడపిల్లలు, మహిళలకు రక్షణ కరువైందని, రోజుకో దుస్సంఘటనలు జరుగుతున్నా పాలకులు ఏమి చేస్తున్నారని, పోలీస్ వ్యవస్థ పని చేస్తోందానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో శనివారం ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ఎక్కడ చూసినా దాడులు, దోపిడీలు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు ఎక్కువయాయన్నారు. మొన్న నెల్లూరు, నిన్న మదనపల్లి, నేడు విజయవాడ.. ఇలా రోజుకో ఘటన వెలుగు చూస్తున్నా.. కూటమి పాలనలో రాజకీయ కక్షలు తప్ప.. బాలికలు, మహిళల మానప్రాణాలకు భద్రత లేదని విచారం వ్యక్తం చేశారు. మద్యం, గంజాయితోనే ఈ దారుణాలు రాష్ట్రంలో అడుగడుగునా మద్యం ఏరులై పారుతుండగా.. గంజాయి గుప్పుమంటోందని, వీటి మత్తులో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు జరుగుతున్నాయన్నారు. జగన్మోహన్రెడ్డి సీఎం ఉన్న సమయంలో బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలించి, కఠిన నిబంధనలను తీసుకొచ్చారన్నారు. మదనపల్లి ఘటన మద్యం మత్తులో జరిగిందని సాక్షాత్తూ హోం మంత్రి అనిత అంగీకరించారని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వస్తే నెల్లోనే గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తానని చెప్పిన చంద్రబాబు వైఫల్యం కారణంగానే మహిళలపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. కీచకుల కొమ్ముకాస్తున్న ప్రభుత్వం ఆడపిల్లల పాలిట కీచకులకు రాష్ట్ర ప్రభుత్వం కొమ్ము కాస్తోందని ఆరోపించారు. సీఎంకు బావమరిది, లోకేశ్ మామ, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచరుడు మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడితే పోక్సో చట్టం కింద శిక్షించకుండా, కేవలం పార్టీ నుంచి సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు. రాష్ట్రంలో పోలీసులు అన్యాయం చేసిన వారిని విడిచి పెట్టి, రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు నమోదు చేసి, భయపెట్టేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆడ వారిపై చేయివేస్తే అదే ఆఖరి రోజవుతుందని చంద్రబాబు సినిమా డైలాగ్లు చెప్పారని, రోజుకో అఘాయిత్యం జరుగుతుంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. జగనన్న పాలనలోనే మహిళలకు రక్షణ జగనన్న సీఎంగా ఉన్నప్పుడు బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడాలంటే వణికిపోయే పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. దిశ యాప్ తెచ్చి, మహిళలకు పూర్తి రక్షణ కల్పించారని, తప్పు చేస్తే తప్పించుకోలేమనే భావనను ప్రతి ఒక్కరికీ కలిగించారన్నారు. తన తండ్రిని అక్రమ కేసులో పోలీస్లు విచారణకు రావాలని నోటీసులు జారీ చేస్తున్నారని, సిద్ధంగా ఉన్నా.. వాయిదాలేస్తున్నారన్నారు. గుమ్మళ్లదిబ్బలో బాలిక విషయంలో తప్పు చేసిన వారిని శిక్షించడాన్ని మాని, అండగా నిలిచి పరామర్శిస్తే తమపై కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. ఆ కుటుంబాన్ని ఎమ్మెల్యేతో పాటు మైనార్టీ నేతలు పరామర్శించారని, అయితే వారికెందుకు నోటీసులివ్వలేదో సమాధానం చెప్పాలన్నారు. పార్టీ జోనల్ మహిళాధ్యక్షురాలు గౌరి, అంగన్వాడీ వింగ్ జిల్లా అధ్యక్షురాలు లావణ్య, నెల్లూరు రూరల్ మహిళాధ్యక్షురాలు రమాదేవి, జెడ్పీటీసీ శేషమ్మ, నిర్మలమ్మ, ఎంపీటీసీ లక్ష్మీ కల్యాణి, సర్వేపల్లి మహిళాధ్యక్షురాలు సంధ్యారాణి పాల్గొన్నారు. రాష్ట్రంలో రోజుకో దుస్సంఘటనలు ప్రభుత్వం ఉందా..? పోలీస్ వ్యవస్థ పనిచేస్తోందా..? వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత -
అవినీతిలో సోమిరెడ్డి కొత్త పుంతలు
● ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్రెడ్డి మనుబోలు: ప్రజా సమస్యలను పూర్తిగా గాలికొదిలిన సోమిరెడ్డి.. అవినీతిలో మాత్రం కొత్త పుంతలు తొక్కుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని బద్దెవోలు, తోటపల్లిగూడూరు మండలం పేడూరులో శనివారం పర్యటించిన ఆయన మాట్లాడారు. ఓవైపు సాగునీరు, యూరియా అందక రైతులు అష్టకష్టాలు పడుతుంటే, సోమిరెడ్డి మాత్రం దొంగ బిల్లులు చేసుకుంటూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. కాగితాలపూరులో సాగునీరందక పంటలు ఎండిపోతుంటే, ఆయన మాత్రం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు లిఫ్ట్ ద్వారా అందిస్తామంటూ మరో రకంగా అవినీతికి పాల్పడేందుకు తెరలేపారని ఆరోపించారు. టీడీపీ పాలనలో కాలం చెల్లిన విత్తనాలను సరఫరా చేయడంతో అవి మొలకెత్తక కర్షకులు ఇక్కట్ల పాలయ్యారని విమర్శించారు. రైతులను పూర్తిగా గాలికొదిలిన సర్కార్.. వ్యవసాయమంటే దండగనే రీతిలో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. జగనన్న పాలనలో రైతులకు అన్ని సమకూర్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మారిస్తే.. ప్రస్తుతం వారు ఘోర అవమానాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ధాన్యానికి కనీస మద్దతు ధరను కల్పించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మొక్కుబడిగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, అన్నదాతలను మభ్యపెట్టాలని చూస్తే తమ పార్టీ తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. జగనన్న పాలనే కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని చెప్పారు. ఎన్నికలెప్పుడు జరిగినా తమ పార్టీ ఘన విజయం సాధించడం తథ్యమని పేర్కొన్నారు. బద్దెవోలులో పార్టీ నేత, సర్పంచ్ ఉగ్గుమూడి శశికుమార్రెడ్డి తండ్రి రామిరెడ్డి మరణించడంతో ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి వెంకటసుదీప్ కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నేతలు బొమ్మిరెడ్డి హరగోపాల్రెడ్డి, కసిరెడ్డి ధనుంజయరెడ్డి, గుండాల ఆదినారాయణ, జానకిరామిరెడ్డి, కడివేటి చంద్రశేఖర్రెడ్డి, ముంగర రవీంద్రరెడ్డి, గుంజి రమేష్, దాసరి భాస్కర్గౌడ్, గోపీనాథ్రెడ్డి, ఆవుల తులసీరామ్, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అజాతశత్రువు గౌతమ్రెడ్డి
● వాడవాడలా ఘన నివాళి ● భారీ స్థాయిలో అన్నదానం ఆత్మకూరు: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి అజాతశత్రువని, చిన్న వయస్సులోనే ఆయన మరణించడం బాధాకరమని పలువురు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక మున్సిపల్ బస్టాండ్ వద్ద మేకపాటి గౌతమ్రెడ్డి నాలుగో వర్ధంతిని పార్టీ శ్రేణులు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు పేర్నేటి కోటేశ్వరరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆదిశేషయ్య, జెడ్పీటీసీ పెమ్మసాని ప్రసన్నలక్ష్మి మాట్లాడారు. ఆత్మకూరు నియోజకవర్గంలో పారిశ్రామికాభివృద్ధికి 130 ఎకరాల్లో ఎమ్మెస్సెమ్ఈ పార్కును ఏర్పాటు చేయించిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. గౌతమ్రెడ్డి లేని లోటు తీర్చలేనిదన్నారు. ఆయన ఆశయసాధన కోసం మేక పాటి విక్రమ్రెడ్డి నేతృత్వంలో సమష్టిగా కృషి చేద్దామ ని పిలుపునిచ్చారు. అనంతరం భారీ స్థాయిలో అన్నదానాన్ని నిర్వహించారు. పార్టీ పట్టణాధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్రెడ్డి, సుధాకర్రెడ్డి, మున్సిపల్ విభాగ రాష్ట్ర కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పులిమి రమేష్రెడ్డి, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు నందా ఓబులేసు, పంచాయతీ విభాగ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి రవికుమార్రెడ్డి, మైనార్టీ నేత మీరామొహిద్దీన్, ఎంపీపీ పద్మజారెడ్డి, పర్వీన్, కల్పనారెడ్డి, వైస్ ఎంపీపీ ప్రమీల, మర్రిపాడు మండల కన్వీనర్ చెన్ను వెంకటేశ్వరరెడ్డి, గంగవరపు శ్రీనివాసులురెడ్డి, నోటి వినయ్కుమార్రెడ్డి, తోడేటి మణి, విష్ణు, రహీం, కలామ్, ప్రతాప్, బాలఅంకయ్య, ఆండ్రా సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర చరిత్రలో ఇది దారుణమైన బడ్జెట్
రాష్ట్ర చరిత్రలో ఇది దారుణమైన బడ్జెట్. రైతులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ ప్రభుత్వం పబ్లిసిటీ, ఈవెంట్ మేనేజ్మెంట్కే పరిమితమైంది. కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుంటోంది. ఈ వివరాలను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ప్రజలకు వెల్లడించాలి. ఏ ఒక్క రంగానికీ సరైన కేటాయింపుల్లేవు. రైతులు యూరియా కోసం రోడ్డెక్కారు. రూ.6 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, ఇంకా ఆరోగ్యశ్రీ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. పేదల ఆరోగ్యం, విద్యపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోంది. అన్నదాత సుఖీభవ, పేదలకు మూడు గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలు సక్రమంగా అమలు కాలేదు. – షేక్ అలీ అహ్మద్, వైఎస్సార్సీపీ నేత, ఏఎంసీ మాజీ చైర్మన్ ● -
నేదురుమల్లి జనార్దనరెడ్డి ఆశయాలు కొనసాగిస్తాం
● రామ్కుమార్రెడ్డి కోట: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి దివంగత నేదురుమల్లి జనార్దనరెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని ఎన్బీకేఆర్ విద్యాసంస్థల కరస్పాండెంట్, నేదురుమల్లి ఫౌండేషన్ చైర్మన్ రామ్కుమార్రెడ్డి తెలిపారు. జనార్దనరెడ్డి 91వ జయంతిని శుక్రవారం విద్యానగర్లో ఘనంగా నిర్వహించారు. నేదురుమల్లి సుబ్బరామిరెడ్డి కళాభవన్లో జనార్దనరెడ్డి చిత్రపటానికి ఆయన తనయులు నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, గౌతమ్రెడ్డి, ఇంకా అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, ఎన్బీకేఆర్ విద్యాసంస్థల అధ్యాపకులు, సిబ్బంది నివాళులర్పించారు. అనంతరం ఫౌండేషన్ ఆద్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా పాల్గొన్నారు. నెల్లూరు రెడ్క్రాస్ బ్లడ్బ్యాంక్, నోవా బ్లడ్బ్యాంక్, గూడూరు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ బ్లడ్బ్యాంక్, మెడీప్లస్ బ్లడ్బ్యాంక్ సిబ్బంది దాతల నుంచి 682 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. అనంతరం రామ్కుమార్రెడ్డి మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడేలా సేవా కార్యక్రమాలను చేపడతామన్నారు. ఎన్బీకేఆర్ విద్యాసంస్థలతో జనార్దనరెడ్డికి ఎనలేని అనుబంధం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొడవలూరు భక్తవత్సలరెడ్డి, షనీల్రెడ్డి, రామకృష్ణారెడ్డి, విజయకుమార్రెడ్డి, కోడూరు కల్పలత, మీరారెడ్డి, రేష్మ, హరీష్ చంద్రారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు కోటయ్య పాల్గొన్నారు. -
ఏ వర్గానికీ న్యాయం జరగలేదు
కూటమి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల రాష్ట్రంలోని ఏ వర్గానికి న్యాయం జరగలేదు. గత ప్రభుత్వంలోని పలు పథకాల పేర్లు మార్చి నిధుల్లో, లబ్ధిదారుల్లో కోత విధించారు. అయితే మేము అంతా చేశామని కూటమి నేతలు చెప్పుకొంటున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్కటైనా సామాజిక పింఛన్ను మంజూరు చేయలేదు. బడ్జెట్ కేటాయింపులు పరిశీలిస్తే సంక్షేమ పథకాలు లేనట్టేనని తెలుస్తోంది. ఏ పథకాన్ని పరిశీలించినా పూర్తిస్థాయిలో నిధుల కేటాయింపు జరగలేదు. ఈ విషయాలను రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. – బి.మాలకొండారెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, చేజర్ల ● -
మార్కెట్లోకి మారుతి ఎస్యూవీ ఈ–విటారా
నెల్లూరు(టౌన్): నెల్లూరులోని భార్గవి నెక్సా మారుతి సుజుకి షోరూంలో శుక్రవారం మారుతి తొలి ఎస్యూవీ ఈ–విటారా కారును నగర ఏఎస్పీ దీక్ష చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేశారు. భార్గవి నెక్సా మేనేజింగ్ డైరెక్టర్ కొండా నిరంజన్రెడ్డి మాట్లాడుతూ ఈ కారు 49 కేడబ్ల్యూహెచ్, 61కే డబ్ల్యూహెచ్ కలిగిన రెండు బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుందన్నారు. ఒకసారి చార్జింగ్ చేస్తే 543 కిలోమీటర్లు ప్రయాణించవచ్చన్నారు. బ్యాటరీతో కలిపి ప్రారంభ ధర రూ.15.66 లక్షలు ఉందన్నారు. బ్యాటరీ ప్యాక్పై 8 ఏళ్లు వారెంటీ లేదా 1.60 లక్షల కిలోమీటర్లు ఉందన్నారు. ప్రారంభంలో బుక్ చేసుకున్న వారికి ఉచిత హోమ్ చార్జర్, ఇన్స్టాలేషన్ చేయునున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొండా ఈశ్వర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
కౌలు రైతులకు అన్యాయం
నెల్లూరు(దర్గామిట్ట): కూటమి ప్రభుత్వం కౌలు రైతులకు అన్యాయం చేస్తోందని పలువురు నేతలు అన్నారు. శుక్రవారం నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షను కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. సీసీఆర్ చట్టాన్ని సవరిస్తామని చెప్పారని, కులాలతో సంబంధం లేకుండా భూమిలేని కౌలు రైతుకు రూ.20 వేలు అన్నదాత సుఖీభవ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పటికి మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టారన్నారు. కౌలు రైతుల సంక్షేమం కోసం కొత్త చట్టాన్ని తీసుకు ప్రభుత్వం దగా చేసిందన్నారు. పంట రుణాలు ఇవ్వడం, పంటలు పోయిన సమయంలో నష్ట పరిహారం ఇప్పించడంలో నట్టేట ముంచిందన్నారు. బడ్జెట్లో కూడా తగినంత కేటాయింపుల్లేవన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు మంగలి పుల్లయ్య, గంటా లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. -
మర్యాదపూర్వకంగా..
కోవూరు: వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బట్టేపాటి విజయలక్ష్మి శుక్రవారం మాజీ మంత్రి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితారెడ్డిని నెల్లూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మాజీ మంత్రి వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని ఆయన నివాసంలో విజయలక్ష్మి కలిశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి బట్టేపాటి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు. -
అనుబంధ విభాగాల కమిటీల్లో అవకాశం
నెల్లూరు రూరల్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ జిల్లా అనుబంధ విభాగాల కమిటీల్లో పలువురికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. యువత జిల్లా ఉపాధ్యక్షుడిగా చిలకూరు సాయిప్రసాద్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా దేవరెడ్డి సుధాకర్రెడ్డి, సెక్రటరీలుగా బందిల శ్రీనివాసులు, బందిల మస్తానయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబరుగా కృష్ణారెడ్డి సునీల్రెడ్డి నియమితులయ్యారు. ● మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా ఊటుకూరు యామినిరెడ్డి, జనరల్ సెక్రటరీలుగా కనుమూరు సుప్రియరెడ్డి, బొరాగా ప్రసన్న, సెక్రటరీలుగా షేక్ షంషీర్, రావూరి అనిత, యనమంతల సుబ్బమ్మ, పి.మాధవికి అవకాశం కల్పించారు. ● రైతు విభాగం కమిటీ ఉపాధ్యక్షుడిగా దువ్వూరు శేషారెడ్డి, జనరల్ సెక్రటరీలుగా కోటంరెడ్డి శ్రీకాంత్రెడ్డి, సెక్రటరీలుగా మూకూరు శ్రీనివాసులు, రవీంద్రారెడ్డి మేదనూలు, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నడిపాటి ఈశ్వరయ్యను నియమించారు. ● బీసీ సెల్ కమిటీ ఉపాధ్యక్షుడిగా బి.రమేష్ యాదవ్, జనరల్ సెక్రటరీగా ముమ్మిడి శ్రీనివాసులు, సెక్రటరీగా చెన్నూరు హరికృష్ణకు అవకాశం దక్కింది. ● ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడిగా ఇనమాల వెంకటాద్రి, జనరల్ సెక్రటరీలుగా బుదార్తి దయాకర్, పల్లాపు గోపాల్, సెక్రటరీగా కుదురు శ్రీనివాసులు, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా డి.కుమార్ నియమితులయ్యారు. ● పబ్లిసిటీ వింగ్ ఉపాధ్యక్షుడిగా వేమారెడ్డి షానిల్రెడ్డి, జనరల్ సెక్రటరీగా చెన్నూరు శ్రీహరిరెడ్డి, సెక్రటరీగా ఎర్రాబోతు మణి, జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడిగా ముద్దూరు గంగయ్య (జోసెఫ్), సెక్రటరీగా బి.ప్రభుచరణ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా దుప్పి కామేశ్వరరావుకు అవకాశం దక్కింది. ● వైఎస్సార్ టీయూసీ కమిటీ ఉపాధ్యక్షుడిగా చెన్నారెడ్డి బాబురెడ్డి, జనరల్ సెక్రటరీగా దువ్వూరు సాయికృష్ణారెడ్డి, సెక్రటరీగా పెరిమళశెట్టి శివకుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా తూమూరు శాంతిని నియమించారు. ● లీగల్ సెల్ కమిటీ ఉపాధ్యక్షుడిగా మాకాణి రాఘవేంద్రరావు, జనరల్ సెక్రటరీలుగా బోసి మనోజ్కుమార్, పురి వెంకటనాగేంద్ర, సెక్రటరీలుగా కావలపూడి నవకోటి, మాకాణి లక్ష్మి, ఎస్టీ సెల్ జనరల్ సెక్రటరీగా కొట్టిపాటి నాగరాజు, సెక్రటరీలుగా ప్రసాద్ గునాపాటి, చింతంపూడి వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కె.లోక కల్యాణ్ను నియమించారు. ● మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీగా షేక్ బిక్కు సాహెబ్, సెక్రటరీగా షేక్ బాషా, గిద్దలూరు అబ్దుల్ షుకూర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా షేక్ మజా అహ్మద్, స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీలుగా మద్దిలి రమే ష్, గర వంశీ, పంచాయతీరాజ్ విభాగం జనరల్ సెక్రటరీగా దువ్వూరు నాగూర్రెడ్డి, సెక్రటరీగా దువ్వూరు శ్రీనివాసులురెడ్డి, మున్సిపల్ విభాగం జనరల్ సెక్రటరీగా చింతంరెడ్డి కృష్ణప్రసాద్రెడ్డి, సెక్రటరీగా కండ్రా నారాయణరెడ్డి, ఆర్టీఐ వింగ్ కమిటీ జనరల్ సెక్రటరీగా కుడుముల వెంకటకృష్ణయ్య, సెక్రటరీగా అశోక్ గజపతిరాజుకు అవకాశం కల్పించారు. ● వలంటీర్స్ వింగ్ జనరల్ సెక్రటరీగా పాదర్తి మధుసూదన్రెడ్డి, సెక్రటరీగా పుచ్చలపల్లి రంగనాథ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పొక్కల సూర్యం కైలాశం, గ్రీవెన్స్ సెల్ క మిటీ జనరల్ సెక్రటరీగా మద్దిల యాకేష్, సెక్రటరీగా చుట్టి పెంచలయ్య, జిల్లా వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీగా మణికంట సంగానపల్లి, సెక్రటరీగా పురి కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా వీవీ కోటేశ్వరరావును నియమించారు. ● ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ల సంఘం జనరల్ సెక్రటరీగా వెడిచెర్ల శ్రీనివాసులురెడ్డి, సెక్రటరీగా గద్ది ఆనందరావు, వీవర్స్ వింగ్ జనరల్ సెక్రటరీగా పొలిశెట్టి సుధీర్, సెక్రటరీగా కొండా కోటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా బుర్రా చంద్రమోహన్, ఇంటలెక్చువల్ ఫోరం జనరల్ సెక్రటరీగా గొట్టికాటి రవీంద్రారెడ్డి, సెక్రటరీగా నరమాల వెంకటరమణయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా డేగాపూడి వేణురెడ్డి, అంగన్వాడీ వింగ్ కమిటీ జనరల్ సెక్రటరీగా ధానా సంపూర్ణ, ఎగ్జిక్యూటివ్ మెంబర్ జె.సుగుణను నియమించారు. ● సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీలుగా పాలంపర్తి లోక కల్యాణ్రెడ్డి, వంనదనాల వెంకయ్య, సెక్రటరీగా పాలాగాటి సాయికృష్ణారెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా సూరిబత్తిన నాగార్జున, ఐటీ వింగ్ కమిటీ జనరల్ సెక్రటరీగా దువ్వూరు విజయ్కుమార్రెడ్డి, సెక్రటరీగా షేక్ ఇమ్రాన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ధనుంజయ పరమాల నియమితులయ్యారు. ● డాక్టర్ వింగ్ సెక్రటరీగా పుల్లిమేటి రమేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పుత్తూరు విజయ్కుమార్ ఆచారి, బూత్ కమిటీ వింగ్ సెక్రటరీగా మనుబోలు రూపేష్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా తాటిపర్తి మధుసూదన్రెడ్డి, దివ్యాంగుల విభాగం జనరల్ సెక్రటరీగా పల్లం వెంకటేశ్వర్లు, సెక్రటరీగా దమ్మాయి వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పరుచూరి గోపీ అవకాశం కల్పించారు. -
ఐటీడీఏ.. అంతా అస్తవ్యస్తం
● ఇన్చార్జి ఏపీఓలే దిక్కు ● ఏపీఓ అడ్మిన్దే పెత్తనం ● పనుల్లో మాత్రం అలసత్వం ● నాటుకోళ్ల పథకం అమలుపై నిర్లక్ష్యంనెల్లూరు(స్టోన్హౌస్పేట): నెల్లూరులో సమీకృత గిరిజన అభివృద్ధి ప్రాజెక్ట్ (యానాదులు) జిల్లా ప్రధాన కార్యాలయం ఉంది. ఇక్కడి అధికారులు బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, మార్కాపురం, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గిరిజనుల సమస్యలను పరిష్కరించి వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలి. రెగ్యులర్ పీఓ లేకపోవడంతో పనులు నత్తనడకన జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టు 3 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంది. ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జిల్లాలోని 103 విద్యాసంస్థలను పర్యవేక్షించాలి. అయితే ఆమెకే ఇన్చార్జి పీఓ బాధ్యతలు ఇవ్వడంతో ఇక్కడ ఆశించిన మేరకు పనులు జరగడం లేదనే విమర్శలున్నాయి. విద్యాసంస్థల్లోని పది, ఇంటర్మీడియట్ విద్యార్థుల చదువు, వారి స్టడీ అవర్స్, మెనూ ప్రకారం ఆహారం అందజేస్తున్నారా? తదితర అంశాలపై కూడా పర్యవేక్షణ కొరవడిందని, వార్డెన్లు సమయానికి పనులు చేయడం లేదని గురుకులాలు, రెసిడెన్షియల్ సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. ఏపీఓల పరిస్థితి ఇదీ జిల్లా ప్రధాన కార్యాలయంలో ఎవరు ఏ పనిచేస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ శాఖలో ఐదుగురు ఏపీఓలున్నారు. అగ్రిక్చలర్, హార్టికల్చర్, రెవెన్యూ, ఫిషరీస్ విభాగాలను ఆయా జిల్లాల్లో ఏపీఓలే పర్యవేక్షించాలి. ప్రభుత్వం గిరిజనులకు ఎలాంటి పథకాలు ప్రకటించకపోవడంతో వారికి నిర్దిష్ట కార్యాచరణ లేకుండా పోయింది. ఇక ఏపీఓ అడ్మిన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి ఎప్పుడొస్తారో, ఎప్పుడొళ్తారో సిబ్బందికే తెలియడం లేదు. ఆయన ఇతర జిల్లాకు చెందిన వ్యక్తి. ప్రతి శనివారం తన ఊరికెళ్లి బుధవారం మళ్లీ కార్యాలయానికి వస్తున్నారు. కాగా పర్యటనల పేరుతో వెళ్లిపోవడంతో అర్జీదారులు సమస్యలు చెప్పడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో సమస్యలు గతంలో తిరుపతిలో నిర్వహించిన ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ – 1 ఉచిత కోచింగ్కు డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి రూ.50 లక్షలు కేటాయించారు. ఏడుగురు గ్రూప్ – 1 పోస్టులకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన స్వచ్ఛంద సంస్థకు రూ.25 లక్షలు మాత్రమే చెల్లించారు. మిగిలిన నగదును ఇటీవల డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ మంజూరు చేసినా చెల్లించేందుకు ఇన్చార్జి పీఓ, అడ్మిన్ ఏపీఓ సముఖంగా లేరని సమాచారం. ఇంకా మూలాపేటలో ఇళ్లు, దుకాణాల మధ్య ఉన్న డిగ్రీ హాస్టల్ను సురక్షితమైన ప్రదేశానికి మార్చడానికి ప్రయత్నాలు జరగడం లేదు. ఐటీడీఏలో వార్డెన్లుగా పనిచేస్తున్న కొందరిపై వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించే దిక్కు కూడా లేకుండా పోయింది. సిబ్బందిపై వచ్చిన ఫిర్యాదులు నిజమని ఆర్టీఏ ద్వారా వెల్లడైనా చర్యల్లేవు. ఇప్పటికై నా సంబంధిత ఉన్నతాధికారులు కార్యాలయంపై విచారణ జరిపి త్వరగా రెగ్యులర్ పీఓను నియమించాలని యూనియన్ల నాయకులు కోరుతున్నారు.ఈ పథకం ఏమైందో.. గిరిజనుల అభివృద్ధి కోసం ఓ స్వచ్ఛంద సంస్థ నాటుకోళ్ల పెంపకానికి ఓ పథకాన్ని రూపొందించి డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి ఐటీడీఏకు ప్రతిపాదనలు పంపించింది. తిరుపతి జిల్లాలో డక్కిలి, వెంకటగిరి మండలాల్లో 368, నెల్లూరు జిల్లాలో తోటపల్లిగూడూరు, ముత్తుకూరు మండలాల్లో 368 కోళ్లను బ్యాక్యార్డు పౌల్ట్రీ పథకంలో భాగంగా లబ్ధిదారులకు అందజేయాలనేది ఆలోచన. అయితే ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దీనికి ఏపీఓ అడ్మిన్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలున్నాయి. ఆ మండలాల్లో ఎవరికి ఈ పథకాన్ని అందజేయాలో, కోడిపిల్లల పెంపక నిర్వహణకు అవసరమైన రూ.15 వేలు ఎవరికివ్వాలో స్పష్టత లేదు. ఈ విషయంలో కమీషన్ ఆశిస్తున్నట్టు సమాచారం.గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పాటైన ఐటీడీఏలో అస్తవ్యస్త పరిస్థితులున్నాయి. పీఓ బదిలీ జరిగి నాలుగు నెలలైంది. అప్పట్నుంచి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్కు పీఓ ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. ఈ మధ్య కాలంలో అనేక పనులు మందుకు సాగని పరిస్థితి ఉంది. సమస్యలున్న వారు ఇబ్బంది పడుతున్నారు. -
క్రికెట్ బెట్టింగ్పై ఉక్కుపాదం
నెల్లూరు(క్రైమ్): ‘క్రికెట్ బెట్టింగ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదిలేదు. బెట్టింగ్లు ఆడినా, నిర్వహించినా కఠిన చర్యలు తప్పవు’ అని ఎస్పీ అజిత వేజెండ్ల హెచ్చరించారు. శుక్రవారం నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఆమె విలేకరులతో మాట్లాడారు. టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్పై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. లాడ్జీలు, హోటళ్లు, గెస్ట్ఇన్ల్లో నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. క్రికెట్ బెట్టింగ్పై సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ప్రజలను కోరారు. సమాచారం అందించే వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఆన్లైన్ యాప్ల్లో, ట్రేడింగ్ల్లో డిపాజిట్లు పెడితే అధిక లాభాలు వస్తాయని నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిబ్బందికి అభినందన క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టుచేసిన బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ కె.సాంబశివరావు, ఎస్సై పి.విజయ్ శ్రీనివాస్, హెడ్కానిస్టేబుళ్లు కేవీ సుధాకర్, సీహెచ్ రమేష్, జయరామయ్య, శివకుమార్, కానిస్టేబుళ్లు శ్రీహరి, పార్థసారథి, సాయికిశోర్, లాజర్ను ఎస్పీ అభినందించి నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. పీఏసీఎస్ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలునెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలోని 78 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో (పీఏసీఎస్) విధులు నిర్వహిస్తున్న సిబ్బంది శుక్రవారం నెల్లూరులోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.రామానాయుడు, కొండూరు గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ చిన్నపాటి డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం మీనవేషాలు లెక్కిస్తోందన్నారు. గత సంవత్సరం నుంచి రాష్ట్ర సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి ఎన్నిసార్లు విన్నవించినా స్పందించలేదని వాపోయారు. 24వ తేదీన రాష్ట్రంలోని అన్ని పీఎసీఎస్ల ఉద్యోగులతో విజయవాడలో మహాదీక్షలు చేపడతామన్నారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలకు సైతం వెనుకాడే ప్రసక్తి లేదన్నారు. కార్యక్రమంలో నేతలు కరుణాకర్రెడ్డి, శ్రీధర్రెడ్డి, రాధయ్య, మల్లికార్జురెడ్డి, శ్రీనివాసులురెడ్డి, ఖాజామస్తాన్, సుబ్బారావు, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. స్వగ్రామానికి వెళ్తూ..● రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి కలిగిరి: మండలంలోని నాగిరెడ్డిపాళెం సెంటర్ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం తెట్టు గ్రామానికి చెందిన యాకసిరి మధు (25) బేల్దారి పనులు చేస్తుంటాడు. అతను పని నిమిత్తం వింజమూరు వచ్చి తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. వింజమూరు నుంచి చిల్లకర్రతో వెళ్తున్న ట్రాక్టర్ నాగిరెడ్డిపాళెం సెంటర్ వద్ద చీమలవారిపాళెం వైపు వెళ్లేందుకు యూటర్న్ తిరుగుతోంది. ఈ క్రమంలో బైక్ ట్రాక్టర్ ట్రక్కును ఢీకొట్టింది. మధు రోడ్డుపై పడి తలకు తీవ్రగాయాలై మృతిచెందాడు. బైక్ పూర్తిగా ధ్వంసమైంది. కలిగిరి ఏఎస్సై రామచంద్రయ్య ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలుతిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ కృష్ణతేజ అతిథి గృహం వద్దకు చేరుకుంది. గురువారం అర్ధరాత్రి వరకు 57,682 మంది స్వామిని దర్శించుకున్నారు. 27,020 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.65 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు 12 గంటల్లో, ప్రత్యేక టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. నిమ్మధరలు (కిలో) పెద్దవి: రూ.83 సన్నవి: రూ.70 పండ్లు: రూ.40 -
కాకాణికి మరోసారి నోటీసులు
నెల్లూరు రూరల్: నగరంలోని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి నివాసానికి పోలీసులు శుక్రవారం మరోసారి వెళ్లి నోటీసులను అందజేశారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు ఈ నెల 24న హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి కోవూరు స్టేషన్కు ఈ నెల 14న హాజరుకావాలంటూ నోటీసులను అక్కడి పోలీసులు జారీ చేశారు. అయితే ఆ రోజు వద్దని, 19న ఇంటి వద్దే విచారిస్తామంటూ నోటీసులిచ్చారు. తీరా ఆ రోజున ఉదయం పది నుంచి మధ్యాహ్నం 12 వరకు నిరీక్షించినా, ఖాకీలు రాలేదు. తాజాగా 24న విచారణకు హాజరుకావాలని, ఒకవేళ ఏదైనా పనులుంటే మరో తేదీని సూచించాలని కాకాణిని కోరారు. అయితే వీటికి తాను భయపడేదిలేదని, విచారణకు హాజరవుతానని ఆయన చెప్పారు. వైఎస్సార్సీపీలో పలువురికి పదవులు నెల్లూరు రూరల్: జిల్లాకు చెందిన పలువుర్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో నియమిస్తూ ఉత్తర్వులను పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం జారీ చేసింది. ఎస్సీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా కావలి నియోజకవర్గానికి చెందిన దాసరి శివాజీ, జిల్లా ఆర్గనైజేషనల్ సెక్రటరీగా నీలపరెడ్డి హరిప్రసాద్రెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గ యువత అధ్యక్షుడిగా డాక్టర్ ప్రణీత్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షురాలిగా కమతం శోభ, విద్యార్థి విభాగ ఆత్మకూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా బొర్రా విష్ణువర్ధన్రెడ్డి, నియోజకవర్గ అంగన్వాడీ వింగ్ అధ్యక్షురాలిగా గోపిరెడ్డి పద్మను నియమించారు. -
కేసులకు భయపడేదిలేదు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ● విచారణకు వస్తామంటూ.. రాని పోలీసులు నెల్లూరు రూరల్: కోవూరు మండలంలోని గుమ్మళ్లదిబ్బలో అఘాయిత్యానికి గురై బాలిక మృతి చెందిన ఘటనలో కుటుంబాన్ని పరామర్శించి.. నైతిక బాధ్యత వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినందుకు తనపై అక్రమ కేసును బనాయించారని, వీటికి భయపడేదిలేదని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నిస్తూనే ఉంటానని తేల్చిచెప్పారు. పోలీసుల కోసం వేచి చూసి.. ఉదయం పది గంటలకు ఇంటికొచ్చి విచారిస్తామన్న పోలీసుల కోసం మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయన వేచి చూశారు. పలు కార్యక్రమాలను వాయిదా వేసి మరీ నిరీక్షించినా, వారు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. మాజీ మంత్రిగా వ్యవహరించిన వ్యక్తిపై ఖాకీలు వ్యవహరిస్తున్న తీరు సక్రమంగా లేదని చెప్పారు. కూటమి నేతలకు వత్తాసు పలుకుతూ.. ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెట్టడం దుర్మార్గమని చెప్పారు. జిల్లాలో పోలీసులుండేది ప్రజల రక్షణకా.. లేకా తమ పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టి వేధించేందుకానని ప్రశ్నించారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు ఎక్కడో పట్టణాలకే పరిమితమైన గంజాయి.. ప్రస్తుత ప్రభుత్వంలో జిల్లాలు, గ్రామాలకూ పాకిందని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. ఇటీవల మృతి చెందిన మైనర్ బాలిక కుటుంబానికి అండగా నిలిచి ఎక్స్ వేదికగా, మీడియా ద్వారా పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ప్రశ్నిస్తే, నోటీసులిచ్చారని ఆరోపించారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించామంటూ కేసును నమోదు చేసి విచారణకు ఈ నెల 14న రావాల్సిందిగా పోలీసులు కోరారన్నారు. తానెళ్లే సమయానికి మా ఇంటి వద్దకొచ్చి బందోబస్తు, ఇతర కారణాలతో ఇప్పుడు రావొద్దని, 19న తామే మీ ఇంటికొస్తామని పోలీసులు చెప్పారన్నారు. ఈ క్రమంలో తాను వారి కోసం నిరీక్షించగా, విచారణకు వస్తారో, రారో కూడా చెప్పలేదని విమర్శించారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని ఆరోపించారు. బాలిక కుటుంబసభ్యుల వివరాలను తానెక్కడా బహిర్గతం చేయలేదని గుర్తుచేశారు. వీరిని కోవూరు ఎమ్మెల్యే, వక్ఫ్ బోర్డు చైర్మన్, పరామర్శించి.. గంజాయి వల్లే జరిగిందంటూ అక్కడే వ్యాఖ్యలు చేశారని తెలిపారు. తనకు నోటీసులిచ్చి.. వారికి ఎందుకు జారీ చేయలేదని ప్రశ్నించారు. తన కుమార్తె పూజితకు వాట్సాప్ ద్వారా నోటీసులను పోలీసులు పంపారన్నారు. విచ్చలవిడిగా గంజాయి అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే గంజాయిని అంతం చేస్తానని చంద్రబాబు ప్రకటించారని, అయితే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలైనా ఏ ప్రయోజనం లేదని ధ్వజమెత్తారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా గంజాయి విచ్చలవిడిగా లభ్యమవుతోందని తెలిపారు. అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టి వేధించడం తప్ప.. అభివృద్ధి, సంక్షేమంపై సర్కార్ దృష్టి సారించడంలేదని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు అందక అప్పులపాలై పలువురు ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారని చెప్పారు. -
అధికారుల డుమ్మా
● కలెక్టరేట్లో ఉద్యోగుల గ్రీవెన్స్ డే ● హాజరుకాని కొన్ని శాఖల ఆఫీసర్లునెల్లూరు(టాస్క్ఫోర్స్): ప్రభుత్వోద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు నెల్లో ఒక రోజు ప్రత్యేకంగా గ్రీవెన్స్ డేను నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం ఆశించిన మేర ఫలితాలను ఇవ్వడం లేదు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి జేసీ ఎంవెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్కుమార్ హాజరై అర్జీలను స్వీకరించారు. కాగా దీనికి జిల్లా స్థాయి అధికారులు గైర్హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి ఎంతో ఆశతో వచ్చిన ఉద్యోగులకు తీవ్ర నిరాశే మిగిలింది. నామమాత్రంగానే.. పరిష్కార వేదికకు జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు హాజరై, తమ సిబ్బంది ఎదుర్కొంటున్న సర్వీస్పరమైన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే తాజా సమావేశానికి కేవలం కొన్ని శాఖల అధికారులు మాత్రమే వచ్చారు. వీరిలో వ్యవసాయ, గృహ నిర్మాణ, విద్య, ఆర్డబ్ల్యూఎస్, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ, ఆర్టీసీ, వైద్యారోగ్య శాఖల అధికారులు మాత్రమే ఉన్నారు. దీంతో తమ అర్జీలు ఎవరికివ్వాలో తెలియక ఉద్యోగులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. నిరాశతో వెనుదిరిగి.. ఉద్యోగోన్నతులు, ఇంక్రిమెంట్లు, బదిలీలు, పీఎఫ్ సెటిల్మెంట్లు వంటి దీర్ఘకాలిక సమస్యలతో సతమతమవుతున్న కింది స్థాయి ఉద్యోగులు ఈ కార్యక్రమాన్ని తమకు దొరికిన అవకాశంగా భావించారు. సుదూర ప్రాంతాల నుంచి ప్రయాసపడి కలెక్టరేట్కు చేరుకున్నారు. అయితే సంబంధిత శాఖాధిపతులు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మా సమస్యను విన్నవించుకుందామని వస్తే, కనీసం అర్జీ తీసుకునే అధికారి కూడా లేరు.. నెలకోసారి జరిగే కార్యక్రమానికి కూడా వీరు రాకపోతే మా గోడు ఎవరికి చెప్పుకోవాలని ఒక బాధిత ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందిస్తారా..? జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా భావించే గ్రీవెన్స్ డే విషయంలో ఉన్నతాధికారుల అలసత్వం చర్చనీయాంశంగా మారింది. విధులకు డుమ్మా కొట్టిన అధికారులపై ఎలాంటి చర్యలు చేపడతారో వేచి చూడాలి. ఇప్పటికై నా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి, గ్రీవెడ్స్డేకు అందరు అధికారులు హాజరయ్యేలా చూడాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. తప్పక హాజరుకావాలి ప్రభుత్వోద్యోగుల గ్రీవెన్స్డేకు అన్ని శాఖల అధికారులు తప్పక హాజరుకావాలి. రానివారికి తగిన సూచనలిచ్చి సమస్యలు పరిష్కరించేలా చూస్తాం. అన్ని శాఖల అధికారులు వచ్చేలా చర్యలు చేపడతాం. – విజయ్కుమార్, డీఆర్వో -
23 నుంచి సైన్స్ సమగ్ర మహోత్సవం
నెల్లూరు (టౌన్): జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైన్స్ సమగ్ర మహోత్సవంలో భాగంగా సైన్స్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈ నెల 23 నుంచి నిర్వహించనున్నామని డీఈఓ బాలాజీరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఇండియా, ఆసియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించే దిశగా కార్యక్రమం జరగనుందని వివరించారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న ముగ్గురు విద్యార్థులు టీమ్గా ఏర్పడి గైడ్ టీచర్ సాయంతో మోడల్ను రూపొందించాలని కోరారు. పాల్గొనాలనుకునే వారు తమ ఆలోచనలను ఈ నెల 22లోపు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ప్రతి పాఠశాల నుంచి గరిష్టంగా పది టీమ్లు పాల్గొనవచ్చని చెప్పారు. పాఠశాల స్థాయిలో ఈ నెల 23న.. మండల స్థాయిలో 24, 25న.. జిల్లా స్థాయిలో ప్రదర్శనను 26న నిర్వహించనున్నారని వివరించారు. ప్రతి జిల్లా నుంచి రెండు ప్రాజెక్టులను ఎంపిక చేయనున్నామని వెల్లడించారు. ప్రతి జిల్లా నుంచి ఒక ప్రాజెక్టు లేదా మోడల్ను ఎంపిక చేసి.. బహుమతులు, సర్టిఫికెట్లను సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఈ నెల 28న అందజేయనున్నారని తెలిపారు.యరటపల్లి కుటుంబానికి ప్రసన్న పరామర్శచిల్లకూరు: మండలంలోని తీర ప్రాంతంలో ఉన్న వరగలి గ్రామానికి చెందిన యరటపల్లి కుటుంబాన్ని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రన్నకుమార్రెడ్డి పరామర్శించారు. గూడూరు ఏఎంసీ మాజీ చైర్మన్ యరటపల్లి జానకిరామిరెడ్డి ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అందుబాటులో లేని కారణంగా వరగలి గ్రామానికి ప్రసన్నకుమార్రెడ్డి గురువారం చేరుకొని జానకిరామిరెడ్డి కుమారుడు చరణ్కుమార్రెడ్డితో పాటు కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడారు. తన తండ్రి శ్రీనివాసులురెడ్డితో జానకిరామిరెడ్డి సన్నిహితంగా ఉండే వారిని, యరటపల్లి కుటుంబంతో తమకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయని గుర్తుచేసుకున్నారు. పార్టీ నేతలు కలువ బాలశంకర్రెడ్డి, కాటంరెడ్డి దినేష్రెడ్డి, వేమారెడ్డి మురళీమోహన్రెడ్డి, శ్రీధర్రెడ్డి, శరత్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.కాకాణిని కలిసిన రామిరెడ్డినెల్లూరు రూరల్: మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డిని నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. కావలిలో ఈ నెల 23న నిర్వహించనున్న కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆయ న్ను ఆహ్వానించారు.విమానాశ్రయ భూముల నష్టపరిహారంపై విచారణదగదర్తి: దగదర్తి విమానాశ్రయ భూముల నష్టపరిహారంపై దామవరం పంచాయతీ కార్యాలయంలో విచారణను కావలి ఆర్డీఓ వంశీకృష్ణ నిర్వహించారు. భూ సేకరణకు సంబంధించి సర్వే నంబర్ 1 / 1 లో సుమారు 418 ఎకరాల్లో గుర్తించిన లబ్ధిదారుల్లో అర్హులను గుర్తించేందుకు గానూ దీన్ని జరిపారు. మిగిలిన వారిని విచారించేందుకు గానూ మరోసారి సభను నిర్వహించనున్నామని వెల్లడించారు. ఎకరాకు రూ.13 లక్షల పరిహారాన్ని అందించేందుకు ఉత్తర్వులను ప్రభుత్వం ఇటీవల జారీ చేసింది. భూసేకరణను త్వరలోనే పూర్తి చేసి పరిహారాన్ని అందజేయనున్నామని ప్రకటించారు. తహసీల్దార్ లాజరస్, ఆర్ఐ ప్రియాంక తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమల స్థాపనలో సమస్యలు పరిష్కరిస్తాం
కొడవలూరు: ఇఫ్కో కిసాన్ సెజ్లో పరిశ్రమల స్థాపనలో ఎదురవుతున్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని పరిశ్రమల శాఖ డైరెక్టర్ శుభమ్ బన్సల్ పేర్కొన్నారు. మండలంలోని రాచర్లపాడు ఇఫ్కో కిసాన్ సెజ్ కార్యాలయంలో పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. పరిశ్రమల స్థాపనలో ఎదురవుతున్న సమస్యలను ఆరాతీశారు. పెట్టుబడిదారులను ఆకర్షించి పరిశ్రమల పార్కును త్వరితగతిన పూర్తిగా నింపాలని సూచించారు. సెజ్లో పరిశ్రమల అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపునకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందించనుందని హామీ ఇచ్చారు. పరిశ్రమల శాఖ జీఎం చంద్రశేఖర్, ఏపీఐఐసీ జెడ్ఎం శివకుమార్, ఉప పరిశ్రమల డైరెక్టర్ శ్రీధర్, ఇఫ్కో కిసాన్ సెజ్ సీఈఓ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
యూరియా కోసం తీరని వెతలు
బారులుదీరిన రైతులు స్థానిక సొసైటీ కార్యాలయంలో యూరియా కోసం రైతన్నలు గంటల తరబడి క్యూలో బుధవారం బారులుదీరారు. సొసైటీ కార్యాలయంలో ఉన్న 500 యూరియా బస్తాలను పంపిణీ చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ఉదయం నుంచే టోకెన్ల కోసం క్యూల్లో నిలబడ్డారు. గతంలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని పోలీసుల సహకారంతో సొసైటీ అధ్యక్షుడు రాజశేఖర్ పంపిణీ చేయించారు. యూరియాను అధికార యంత్రాంగం సరిపడా సరఫరా చేయలేకపోతుండటంతో అధిక ధరలు చెల్లించి ప్రైవేట్ దుకాణాల్లో కొనలేక ఇలా పడిగాపులు కాయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. – సీతారామపురం -
శ్రీవారి దర్శనానికి ఆరు గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని నాలుగు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 70,509 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 18,058 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.2 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి ఆరు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. విశిష్ట సంఖ్యను నమోదు చేసుకోండి మర్రిపాడు: ప్రభుత్వం నిర్దేశించిన మేరకు రైతు విశిష్ట సంఖ్యను నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి పేర్కొన్నారు. విశిష్ట సంఖ్య నమోదుపై మండలంలోని రామానాయుడుపల్లిలో రైతులకు బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వాలు అందించే వివిధ పథకాలు, సబ్సిడీ విత్తనాలు, యూరియా, పీఎం కిసాన్ తదితరాలను పొందేందుకు ఇది తప్పనిసరని చెప్పారు. పీఎం కిసాన్ నగదు జమయ్యాక లక్ష మంది రైతులు ఇంకా నమోదు చేసుకోవాల్సి ఉందని తెలిపారు. ఈ – క్రాప్ను తప్పక నమోదు చేయించుకోవాలని సూచించారు. ప్రక్రియ ఈ నెల 20తో ముగియనుందని తెలిపారు. కాగా విత్తనాలు సకాలంలో అందడంలేదని పలువురు రైతులు తెలియజేశారు. ఏడీ నర్సోజీరావు, జిల్లా వనరుల కేంద్ర వ్యవసాయాఽధికారి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. 24న సైక్లింగ్ క్రీడాకారుల ఎంపిక నెల్లూరు(స్టోన్హౌస్పేట): అండర్ – 18 బాలబాలికల జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలను నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ నెల 24న ఉదయం ఏడు గంటలకు నిర్వహించనున్నామని జిల్లా క్రీడాభివృద్ది అధికారి పాండురంగారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల సైక్లింగ్ క్రీడాకారులు www.sports.ap.gov.inలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఇక్కడ ప్రతిభ చూపిన వారు ఎన్టీఆర్ జిల్లాలో ఫిబ్రవరి 28, మార్చి ఒకటిన నిర్వహించనున్న రాష్ట్రస్థాయి శాప్ లీగ్ సైక్లింగ్ టోర్నీలో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారని పేర్కొన్నారు. ఇతర జిల్లాల వారు నెల్లూరు జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించాలనుకుంటే, ఇక్కడ చదువుతు న్న విద్యాసంస్థలకు సంబంధించిన స్టడీ సర్టిఫికెట్ను పొందుపర్చాలని కోరారు. క్రీడాకారులు తమ సొంత సైకిల్ను తెచ్చుకోవాలని, వివరాలకు 88862 28444, 95813 72472 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ధాన్యం సేకరణపై ఉద్యోగులకు శిక్షణ నెల్లూరు(పొగతోట): ధాన్యం సేకరణకు సంబంధించి మండల స్థాయి ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నామని సివిల్ సప్లయ్స్ డీఎం అర్జున్రావు పేర్కొన్నారు. ధాన్యం సేకరణపై కార్యాలయంలో అధికారులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వచ్చే నెల మొదటి వారంలో ధాన్యం కొతలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని, 161 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని వివరించారు. జిల్లా స్థాయిలో శిక్షణ కార్యక్రమాలను పూర్తి చేశామని.. టెక్నికల్ అసిస్టెంట్లు, మండల స్థాయిలో ఉద్యోగులకు ప్రత్యేకంగా నిర్వహించనున్నామని వెల్లడించారు. రైతులు నష్టపోకుండా ప్రభుత్వం నిర్దేశించిన మద్దతు ధరకు మించి విక్రయించేలా చర్యలు చేపట్టనున్నామని వెల్లడించారు. -
పింఛన్లకు నిరీక్షణే
ఎలాంటి ఆసరా లేకుండా బతుకుబండినీడుస్తున్న ఎంతో మందికి పింఛన్లు ఊరటగా నిలుస్తాయి. ప్రతి నెలా మందుల కొనుగోలుకు దీని ద్వారా వచ్చే మొత్తమే పండుటాకులకు కీలకం. దివ్యాంగులు, వితంతువులదీ ఇదే పరిస్థితి. అయితే వీరిలో ఎంతో మంది అర్హులకు మంజూరు చేసి ఆదుకోవాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. టీడీపీ సర్కార్ కొలువుదీరి 20 నెలలు దాటినా, నేటికీ ఒక్క పింఛన్ను సైతం మంజూరు చేయలేదంటే వారు ఎంత కర్కశంగా వ్యవహరిస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది. మరోవైపు ఉన్న వాటిని సైతం తొలగించేందుకు కుట్రలు పన్నుతుండటంతో పొందుతున్న వారు దినదిన గండం.. నూరేళ్లు ఆయుష్షు అనే చందంగా కాలం గడుపుతున్నారు.నాడంతా సజావుగా..నిజానికి పింఛన్ల కోసం గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. అర్హత ఉంటే ఇంటి వద్దే పూర్తి వివరాలను వలంటీర్ అప్లోడ్ చేస్తే కొత్తవి మంజూరు చేసేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పింఛన్ పోర్టల్ యాప్ను ఓపెన్ కాకుండా చేశారు.నెల్లూరు(పొగతోట): ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించడం.. ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావడం.. సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. 2014లో ఇదే తరహాలో వ్యవహరించి గద్దెనెక్కిన ఆయన తాజాగా ఇదే ఫార్ములాను అవలంబిస్తున్నారు. ఆయన మార్కు రాజకీయాలకు పింఛన్లు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. వీరు అధికారంలోకి వచ్చి 20 నెలలైనా, నేటికీ కొత్తగా ఒక్క పింఛన్ను సైతం మంజూరు చేయకపోవడం గమనార్హం.ఎడతెగని నిరీక్షణటీడీపీ ప్రభుత్వం కొలువుదీరాక.. మరణించిన వారి కుటుంబాలకు మాత్రమే పింఛన్లను మంజూరు చేశారు. దీని కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇతరులకు కల్పించలేదు. ఫలితంగా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు నెలలుగా నిరీక్షిస్తున్నారు. పింఛన్ను పొందేందుకు ఎన్టీఆర్నగర్కు చెందిన దివ్యాంగుడు మస్తాన్ చేయని యత్నం లేదు. అయినా నేటికీ ఫలితం శూన్యం. డైకస్రోడ్డుకు చెందిన వసంతమ్మ భర్త మరణించడంతో దీన్ని పొందేందుకు అధికారుల చుట్టూ 15 నెలలుగా తిరుగుతున్నా, ప్రయోజనం మృగ్యమైంది. స్టోన్హౌస్పేటకు చెందిన లక్ష్మీదేవి పరిస్థితీ ఇంతే కావడం గమనార్హం. ఇలా అర్హులెంతో మంది ఉన్నా, వీరిపై కనికరం చూపే నాథుడే కరువయ్యారు.పరిశీలన పేరిట నోటీసులుపింఛన్ల పరిశీలన పేరుతో 43 వేల మంది దివ్యాంగులకు నోటీసులను గతేడాదిలో జారీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దివ్యాంగ శాతాన్ని అధికంగా నమోదు చే యించుకొని పింఛన్లు మంజూరు చేశారనే దుష్ప్ర చారాన్ని తెరపైకి తెచ్చి, ఈ వ్యవహారానికి ప్రస్తుత సర్కార్ పూనుకుంది. ఇదే క్రమంలో వీరందరికీ నోటీసులిచ్చి ఇబ్బందులకు గురిచేసింది. ఈ పరిణామాలతో దివ్యాంగులు, మంచానికే పరిమితమైన వారు, డయాలసిస్ రోగులు.. డాక్టర్ల చుట్టూ తిరగలేక నానా అవస్థ పడ్డారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు అందోళనకు దిగడం.. వ్యతిరేకత వస్తోందనే సత్యాన్ని ఆలస్యంగా గ్రహించిన సర్కార్ ఈ విధానాన్ని కొంతకాలం పక్కనబెట్టింది.ప్రభుత్వం ఆదేశాలిస్తే కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా 3.06 లక్షల మంది లబ్ధిదారులకు నగదును ప్రతి నెలా ఒకటినే పంపిణీ చేస్తున్నాం. వితంతువులకు మంజూరు చేస్తున్నాం. పూర్తి వివరాలతో వీరు దరఖాస్తు చేసుకోవాలి. వీటిని ఎంపీడీఓ పరిశీలించిన అనంతరం అప్లోడ్ చేస్తారు. అర్హులకు మంజూరవుతున్నాయి. – నాగరాజకుమారి, పీడీ, డీఆర్డీఏరెండేళ్లలో ఇంత వ్యత్యాసమా..?వాస్తవానికి జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2024 జనవరిలో జిల్లా వ్యాప్తంగా 3,19,121 మందికి పింఛన్లను అందజేసేవారు. అయితే ఈ ఏడాది ఇదే నెల నాటికి దీన్ని 3.06 లక్షలకు ప్రస్తుత సర్కార్ కుదించింది. అంటే రెండేళ్లలో 13 వేల మందికి ఆసరా లేకుండా చేసింది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదనే చర్చా నడుస్తోంది.రకరకాల కొర్రీలతో కోత కొత్తగా మంజూరు చేసి ఆదుకోవాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. వివిధ కారణాలు చూపి ఇస్తున్న వాటినీ తగ్గించేందుకు కుయుక్తులు పన్నుతోంది. వైకల్య శాతాన్ని చూపి దివ్యాంగులకు.. విద్యుత్ బిల్లులు, ఇతర కారణాలతో వృద్ధులు, ఒంటరి మహిళలకు కోత విధించేందుకూ యత్నాలను సాగిస్తోంది. -
జగనన్న హయాంలో రైతులకు పెద్దపీట
● యూరియాను అందించలేని స్థితిలో ప్రస్తుత సర్కార్ ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పొదలకూరు: గత సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో అన్నదాతలకు పెద్దపీటేసి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలను అందజేసి ఆదుకున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు, నేదురుమల్లి, విరువూరులో బుధవారం ఆయన పర్యటించారు. గత సర్కార్లో కిడ్నీ బాధితులకు నెలకు అందజేసిన రూ.10 వేలతో తానింకా జీవించి ఉన్నానని విరువూరు గ్రామానికి చెందిన మహిమలూరు వెంకయ్య భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలో రైతులు సస్యశ్యామలంగా పంటలు పండించుకునే వారని, ధాన్యానికి గిట్టుబాటు ధరలు లభించేవని చెప్పారు. టీడీపీ పాలనలో యూరియాను అందించలేకపోతున్నారని, కర్షకులను అధోగతి పాల్జేశారని దుయ్యబట్టారు. పంటలకు కనీస మద్దతు ధరను కల్పించాలని డిమాండ్ చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేయకపోతే తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. అర్హత కలిగిన వారికి గతంలో ఏటా రెండుసార్లు పింఛన్లను మంజూరు చేసేవారని, అయితే ప్రస్తుత సర్కార్ కొలువుదీరాక వీటి ఊసేలేదని విమర్శించారు. జగన్మోహన్రెడ్డి పాలన.. చంద్రబాబు పరిపాలనపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని వివరించారు. డైవర్షన్ పాలిటిక్స్ అభివృద్ధి, సంక్షేమాన్ని గాలికొదిలి డైవర్షన్ పాలిటిక్స్కు చంద్రబాబు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. జిల్లాలో పార్టీ శ్రేణులకు ఎలాంటి నష్టం వాటిల్లినా అందరం కలిసి పోరాటం చేస్తామన్నారు. అధికారమున్నా.. లేకపోయినా ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని ఉద్యమిస్తున్నామని పేర్కొన్నారు. నేదురుమల్లిలో నన్నం రమేష్, శారద దంపతుల కుమార్తె చందూషా, పొదలకూరులో నూతన దంపతులు యాకోబు, కృపామేరీని ఆశీర్వదించారు. విరువూరులో కుటుంబసభ్యులను కోల్పోయిన రామ్మోహన్రెడ్డి, పెంచలనాయుడ్ని పరామర్శించారు. నేతలు గోగిరెడ్డి గోపాల్రెడ్డి, బచ్చల సురేష్కుమార్రెడ్డి, అంజద్, రమేష్, పెంచలనాయుడు, చంద్రమౌళి, తిరుపాల్రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
నెల్లూరు (టౌన్): ఇంటర్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 81 సెంటర్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా ప్రథమ సంవత్సరానికి సంబంధించి 26,935 మంది, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 26,469 మంది చొప్పున మొత్తం 53,404 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి. జిల్లాలో ప్రశ్నపత్రాల స్టోరేజీకి 33 పాయింట్లను ఏర్పాటు చేశారు. ఈ స్టోరేజీ పాయింట్ల నుంచి పరీక్ష కేంద్రాలకు ప్రశ్న పత్రాలను పరీక్షకు అరగంట ముందుగా పోలీసు పహారాతో తీసుకెళ్లనున్నారు. పకడ్బందీగా నిర్వహణ ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని 81 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను బిగించాలని ఆదేశించారు. ఈ పరీక్షల్లో జంబ్లింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు 81 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 81 మంది డిపార్ట్మెంట్ అధికారులను నియమించారు. వీరితో పా టు మరో 800 మందికి పైగా ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ను అరికట్టేందుకు నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఐదు సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ను అమలు చేయనున్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని ఆన్లైన్ సెంటర్లు, జిరాక్స్ సెంటర్లను మూయించనున్నారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా జాగ్రత్తలు చేపట్టనున్నారు. 12 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు ఇంటర్ పరీక్షలకు సంబంధించి జిల్లాలో 12 సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించారు. వీటిలో కోవూరు, తోటపల్లిగూడూరు, మర్రిపాడు, బిట్రగుంట, ఆత్మకూరు, ఉదయగిరి, రాపూరు, కుల్లూరు, చేజర్ల, రాపూరు, పొదలకూరు, బుచ్చిరెడ్డిపాళెం, అల్లూరు పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల్లో అదనంగా అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, ప్రభుత్వ అధ్యాపకులను నియమించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రైవేట్ అధ్యాపకులకూ విధులు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు తొలిసారిగా ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులను నియమించనున్నారు. ఒక కళాశాలకు చెందిన అధ్యాపకులు మరో కళాశాలలో ఇన్విజిలేటర్లుగా విధులు నిర్వహించనున్నారు. ప్రైవేట్ అధ్యాపకులను ఇన్విజిలేటర్లుగా నియమిస్తే పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఒక అంగీకారానికి వచ్చి పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు అవకాశం కల్పించే పరిస్థితి ఉంటుంది. విద్యార్థులు కూడా ఒకరి పేపర్లు ఒకరు చూసి రాసుకునే విధంగా ప్రైవేట్ అధ్యాపకులు అవకాశాన్ని కల్పిస్తారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రైవేట్ కళాశాలలకు పెద్ద ఎత్తున కొమ్ము కాస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. వీరితో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న కొంతమంది స్కూల్ అసిస్టెంట్లను కూడా ఇన్విజిలేటర్లుగా నియమించనున్నారని తెలిసింది. ఈ నెల 23 నుంచి నిర్వహణ జిల్లా వ్యాప్తంగా 81 కేంద్రాల ఏర్పాటు సమస్యాత్మకమైనవిగా 12 గుర్తింపు సీసీ కెమెరాలతో నిఘా హాజరుకానున్న 53,404 మంది విద్యార్థులు జంబ్లింగ్ విధానం అమలు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులు 81 మంది చొప్పున నాలుగు ఫ్లయింగ్, ఐదు సిట్టింగ్ స్క్వాడ్ల నియామకం 800 మందికిపైగా ఇన్విజిలేటర్లు తొలిసారి ప్రైవేట్ అధ్యాపకులకూ విధులు సజావుగా జరిగేలా చర్యలు ఇంటర్ పబ్లిక్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేస్తున్నాం. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛగా పరీక్షలు రాసేలా చర్యలు చేపడుతున్నాం. పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు తావులేకుండా ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను నియమించాం. అన్ని సెంటర్లలో సీసీ కెమెరాలను బిగించాలని ఆదేశాలు జారీ చేశాం. మాస్ కాపీయింగ్ పాల్పడినట్లు రుజువైతే ఆయా కళాశాలల యాజమాన్యాలపై ఇంటర్బోర్డు నిబంధనల మేరకు చర్యలు చేపడతాం. – వరప్రసాదరావు, ఆర్ఐఓ -
ప్రతిసారి నిరాశే
అన్ని వర్గాలను దగా చేశారు చంద్రబాబు ప్రభుత్వం మూడు బడ్జెట్లు ప్రవేశ పెట్టినప్పటికీ ప్రతిసారి ప్రజలకు నిరాశే మిగులుతోంది. సూపర్సిక్స్లో భాగంగా ఇచ్చిన హామీల్లో మహిళలకు ఆడబిడ్డ నిధి ఇవ్వలేదు. అలాగే డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ ఊసే లేదు. యువతకు నిరుద్యోగ భృతి అంటూ మభ్యపెట్టారు. పింఛన్ల కోసం 50 సంవత్సరాల వయస్సు పైబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎదురు చూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి డ్వాక్రా మహిళలను చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారు. కార్పొరేట్ సంస్థలపై ఉన్న శ్రద్ధ హామీలు నెరవేర్చడంలో లేదు. రాష్ట్రంలో మోసం తప్ప అభివృద్ధి కనిపించడం లేదు. – కొడవలూరు భక్తవత్సలరెడ్డి, వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యుడుఎన్నికల సమయంలో సూపర్సిక్స్ పేరుతో హామీలిచ్చి వాటికి రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దారుణం. చంద్రబాబు చేసిన మోసానికి ఇది మరో నిదర్శనం. కొత్త పింఛన్లు మంజూరు లేదు. ఆడబిడ్డ నిధికి పైసా కూడా విడుదల చేయకపోవడం దుర్మార్గం. విద్యారంగానికి తక్కువ మొత్తం కేటాయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తున్నా నిరుద్యోగ భృతిపై ఆ ఊసే లేదు. దీనిపై ప్రశ్నిస్తున్నా స్పందన లేదు. నిధులు కేటాయించి ప్రతి నిరుద్యోగికి డబ్బులు అందజేయాలి. లేకుంటే వచ్చే ఎన్నికల్లో యువత గుణపాఠం చెబుతుంది. – ఊటుకూరు నాగార్జున, 13వ డివిజన్ కార్పొరేటర్, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ● -
అఘాయిత్యాలపై ఏం చర్యలు తీసుకున్నారు?
● శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ధనలక్ష్మి నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘మహిళలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయాయి. ఇంత జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత ఏం చర్యలు తీసుకున్నారు’ అని శ్రామిక మహిళా సమన్వయ కమిటీ (సీఐటీయూ) రాష్ట్ర కన్వీనర్ ధనలక్ష్మి ప్రశ్నించారు. నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో బుధవారం మున్సిపల్ ఫెడరేషన్ శ్రామిక మహిళా రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళ ఒంటిపై చేయి వేస్తే తాట తీస్తానని పవన్ కళ్యాణ్ అన్నారన్నారు. వేలాది మంది మహిళలు అపహరణకు గురవుతున్నా, బాలికలపై హత్యలు, లైంగికదాడులు జరుగుతున్నా ఆయన, హోంమంత్రి ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. మహిళా కార్మికులపై రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని, అక్రమంగా తొలగిస్తున్నారని ఆరోపించారు. వారిపై లైంగిక వేధింపులు నిరోధించేందుకు ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం నిర్వహించిన ఎన్నికల్లో మున్సిపల్ ఫెడరేషన్ శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్గా విజయవాడకు చెందిన విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సదస్సులో ఉమామహేశ్వరరావు, వజ్రమ్మ, విజయమ్మ, వెంగమ్మ, వరలక్ష్మి, సునీల్, పెంచలనరసయ్య తదితరులు పాల్గొన్నారు. -
పీఏసీఎస్ ఉద్యోగుల ఆందోళన బాట
● నేటి నుంచి డీసీసీ బ్యాంక్ వద్ద ధర్నా నెల్లూరు(వీఆర్సీసెంటర్): పెండింగ్లో ఉన్న సమస్యల్ని పరిష్కరించాలంటూ మూడు నెలల నుంచి వివిధ రూపాల్లో ప్రాథమిక సహకార సంఘాల ఉద్యోగులు (పీఏసీఎస్) నిరసన తెలుపుతున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు జిల్లాలోని 78 పీఏసీఎస్ల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది గురువారం నుంచి ఆందోళనను ఉధృతం చేయనున్నారు. నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద ఉన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) ఎదుట ధర్నా చేపట్టనున్నారు. ఇప్పటి వరకూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావడం, విధులు బహిష్కరించడం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన డిమాండ్లు జీఓ నంబర్ 36ను వెంటనే అమలు చేసి, 2019 నుంచి 2024 వరకు పెండింగ్లో ఉన్న వేతన సవరణ చేయాలి. అప్పటి వరకు మధ్యంతర భృతి ఇవ్వాలి. పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలి. 2019 సంవత్సరం తర్వాత సహకార సంఘాల్లో చేరిన వారిని రెగ్యులర్ చేయాలి. ఉద్యోగులకు రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా కల్పించాలి. పీఏసీఎస్ల ద్వారా రైతులకు రుణాలందించేలా చర్యలు తీసుకోవాలి. బదిలీలకు సంబంధించి 3 సంవత్సరాల నిబంధన ఎత్తివేయాలి. కెపాసిటీ టు పే నిబంధనకు సంబంధం లేకుండా ఉద్యోగుల జీతాలు డీఎల్ఎస్ఎఫ్ ద్వారా చెల్లించాలి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను డీఎల్ఈసీ ద్వారా భర్తీ చేయాలి.కలెక్టరేట్ ఎదుట వీఆర్ఏల ధర్నానెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట బుధవారం వీఆర్ఏలు ధర్నా చేశారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, నామినీలుగా పనిచేస్తున్న వారిని వీఆర్ఏలుగా గుర్తించాలని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని వీఆర్సీ గ్రౌండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఎనిమిది సంవత్సరాల నుంచి వీఆర్ఏలకు ఒక్క రూపాయి వేతనం పెరగలేదన్నారు. నామినీలుగా ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారిని వీఆర్ఏలుగా గుర్తించకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం దృష్టికి అనేక దఫాలుగా తీసుకెళ్లినా ఒక్క సమస్య పరిష్కరించలేదన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లచ్చయ్య, ఓబులేసు, సుబ్బయ్య, అంకయ్య, శ్రీను పాల్గొన్నారు. పొలం ఆక్రమణకు యత్నంనెల్లూరు రూరల్: అనంతసాగరం మండలం ఆమనిచిరువెళ్లలో కొనుగోలు చేసిన 11 ఎకరాల పట్టా భూమిని ఆత్మకూరు సీఐని అడ్డుపెట్టుకుని ఆక్రమించుకోవాలని చూస్తున్నారని అదే మండలానికి చెందిన వెంగంపల్లికి చెందిన బట్రెడ్డి రోసిరెడ్డి ఆరోపించారు. బుధవారం నెల్లూరులోని ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆమనిచిరువెళ్ల గ్రామానికి చెందిన గాలిబోయిన రమణయ్య, నాగేంద్ర, కిశోర్, మేకల అశోక్, వనిపెంట రమణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, సర్పంచి శేషయ్య సదరు భూమిలో నాటిన ఫెన్సింగ్ రాళ్లను ఈనెల 5వ తేదీన ధ్వంసం చేశారన్నారు. గడ్డపారతో దాడికి యత్నించి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఎస్సైకి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోలేదన్నారు. సీఐకు ఆధారాలు సమర్పించినా దాడి చేసిన వారితో కుమ్ముకై ్క చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. తహసీల్దార్ చెప్పినా సీఐ పట్టించుకోవటం లేదని వాపోయారు. రక్షణ కల్పించాలని కోరారు. -
మద్యం మత్తులో కాలువలో పడి..
● ఒడిశా వాసి మృతి చిల్లకూరు: పొట్టకూటి కోసం పరిశ్రమలో పనిచేసేందుకు వచ్చిన ఓ కార్మికుడు పండగ రోజున ఫూటుగా మద్యం తాగి మత్తులో కాలువలో పడి మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ఓడూరు పంచాయతీలో ఉన్న ఓ రొయ్యల పరిశ్రమలో ఒడిశా రాష్ట్రానికి చెందిన కొందరు కార్మికులు పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్రానికి చెందిన నలుగురు కార్మికులు శివరాత్రి రోజున పరిశ్రమ సమీపంలోని బెల్టు దుకాణంలో మద్యం బాటిళ్లు కొనుగోలు చేశారు. సమీపంలో ఉన్న కల్వర్టు వద్ద అందరూ కలిసి ఫూటుగా తాగారు. వారిలోని దశరధి నాయక్ (43) అనే కార్మికుడు అందరి కన్నా వెనుకగా వచ్చే క్రమంలో కాలువలో పడిపోయాడు. సహచర కార్మికులు మరుసటిరోజు విధులకు వెళ్లారు. అయితే దశరధి నాయక్ డ్యూటీకి రాకపోవడంతో పరిశ్రమ సూపర్వైజర్ కాంట్రాక్టర్ను అడగ్గా అతను చెప్పకుండా వెళ్లిపోయాడని తెలిపాడు. బుధవారం ఉదయం కాలువలో మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై సురేష్బాబు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. పరిశ్రమ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఆదుకోండయ్యా..
అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడు ● మందులు కొనలేని స్థితిలో పేద కుటుంబం ● దివ్యాంగ పింఛన్ కోసం ఎదురుచూపులుసోమశిల: ఆటపాటలతో సాగాల్సిన ఆ బాలుడి జీవితం కష్టాల్లో ఉంది. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నాడు. ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలంలోని పాతదేవరాయపల్లి గ్రామంలో చిచ్చు గురవయ్య, సుభాషి ణి దంపతులు నివాసముంటున్నారు. వారి కుమారుడు సంతోష్ వయస్సు 12 సంవత్సరాలు. వీరిది రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. కాగా ఎనిమిదేళ్లుగా సంతోష్ ఎముకలు, నరాల బలహీనత, కిడ్నీల వ్యాధితో బాధపడుతున్నాడు. కొంచెం దూరం కూడా నడవలేడు. తోటిపిల్లలతో ఆడుకోలేడు. తనకు తెలియకుండానే మూత్ర విసర్జన జరుగుతుండటంతో బ్యాగ్ ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు అనేక ప్రాంతాల్లోని హాస్పిటళ్లలో చూపించారు. అయినా లాభం లేకుండా పోయింది. మందులు తప్పనిసరిగా వాడాలని వైద్యులు చెప్పారు. పింఛన్ కోసం.. తల్లిదండ్రులు రోజూ కూలీ పనికి వెళ్తేనే సంతోష్కు మాత్రలు కొనుగోలు చేయగలరు. వాటికి నెలకు రూ.5 వేలు, ఇతర అవసరాలకు మరో రూ.4 వేలు ఖర్చవుతుంది. అయితే అంత మొత్తం ఖర్చుచేసే స్థితిలో ఆ కుటుంబం లేదు. గతంలో నెల్లూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లగా డాక్టర్లు పరీక్షించి 74 శాతంతో సదరం సర్టిఫికెట్ అందజేశారు. సంతోష్కు పింఛన్ కోసం తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ మంజూరు కాలేదు. పింఛన్ వస్తే కొంత ఆసరాగా ఉంటుందని పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగారు. ప్రభుత్వం నూతన పెన్షన్లు విడుదల చేస్తే మీ అబ్బాయికి వస్తుందని అధికారులు చెబుతున్నారు. దీంతో తల్లిదండ్రులు బాధపడుతున్నారు. బిడ్డకు మందులు కొనేందుకు నానా కష్టాలు పడాల్సి వస్తోందని అంటున్నారు. ఉన్నతాధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు. -
కొండను తవ్వేస్తున్నారు.. స్పందించండి
నెల్లూరు రూరల్: సైదాపురం మండలంలోని మొలకలపూండ్ల వద్ద ఉన్న పుణ్యక్షేత్రమైన సిద్ధేశ్వరస్వామి కొండను మైనింగ్ చేసి దోచుకుంటున్నారని అదే గ్రామానికి చెందిన ఆదురు బద్రీనాథ్ ఆరోపించారు. బుధవారం నెల్లూరులోని జర్నలిస్ట్ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొండకు గిరి ప్రదక్షిణ బాట కూడా ఉందన్నారు. ఇక్కడ్నుంచి 200 మీటర్లు వదిలి మైనింగ్ పనులు చేసుకోవచ్చని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. అయితే ఒగ్గు కృష్ణయ్య, ఆదూరు కిశోర్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి పేరు చెబుతూ కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా భారీ యంత్రాలతో, బాణసంచా పేల్చి ఖనిజాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే, ఎంపీ, మైనింగ్ అధికారులను కోరినా స్పందన లేదన్నారు. దేవదాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లినా చర్యలు శూన్యమన్నారు. తెలుగుగంగ కాలవను కూడా ఆక్రమించి మైనింగ్ చేయాలని చూస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ స్పందించాలని కోరారు. మైనింగ్ లీజును రద్దు చేయాలన్నారు. -
మోసపోయి..
● డబ్బులిస్తే కొలువులు ఇప్పిస్తామంటూ మోసాలు ● పీజీఆర్ఎస్కు తరలివస్తున్న బాధితులునెల్లూరు(క్రైమ్): ‘నాకు వాళ్లు.. వీళ్లు తెలుసు. నేనెంత చెబితే అంత. భారీ ప్యాకేజీతో నీకు జాబ్ వచ్చేస్తుంది. కాకపోతే దీనికి కొంత మొత్తం ఖర్చవుతుంది. అది చూసుకుంటే సరిపోతుంది. వెంటనే ఆఫర్ లెటర్ పంపేస్తారు’ ఇలాంటి మాటలకు మోసపోతున్న వారి సంఖ్య జిల్లాలో పెరుగుతోంది. ప్రతి సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి బాధితులు పెద్దసంఖ్యలో వచ్చి పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసి న్యాయం చేయాలని అభ్యర్థిస్తున్నారు. అనేక కారణాలు చదువుకు తగిన ఉద్యోగాలు రానివారు ఎంతోమంది జిల్లాలో ఉన్నారు. వారిని, తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ శాఖలు, ప్రముఖ ప్రైవేట్ సంస్థలు, ఐటీ రంగం, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, దీంతో జీవితంలో స్థిరపడొచ్చని ఆశచూపుతూ ఉచ్చులోకి దింపి పెద్ద మొత్తంలో నగదు కాజేస్తున్నారు. డబ్బులు జేబుల్లోకి వెళ్లగానే ముఖం చాటేస్తున్నారు. మరికొందరు తమకున్న పలుకుబడితో బాధితులపైనే బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఎక్కువ మొత్తంలో డబ్బులు పోగొట్టుకున్నవారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదులు చేస్తున్నారు. కొందరు డబ్బులు పోతేపోయాయి పరువు పోతుందని, ఉన్నతవిద్య అభ్యసించి కూడా మోసపోయారంటారని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఉద్యోగాల పేరిట మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. ఏం చేస్తారంటే.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ క్రమపద్ధతిలో జరుగుతుంది. ముందుగా ప్రకటన ఇచ్చి రాతపరీక్ష నిర్వహించి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. డబ్బులు కట్టించుకుని ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వరు. దీనిపై అవగాహన లేనివారు మోసాలకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో మోసగాళ్లు ఇచ్చే ప్రకటనలు, నకిలీ కన్సల్టెన్సీలను నమ్మి వారిని సంప్రదిస్తున్నారు. దేశ, విదేశాల్లోని ప్రముఖ ప్రైవేట్ కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీల్లో రూ.లక్షల్లో ప్యాకేజీ ఇస్తామని చెప్పిన వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా డబ్బు ఇచ్చేస్తున్నారు. దీంతో చివరకు మోసపోయి గుండెలు బాదుకుంటున్నారు. ఉద్యోగ ప్రకటన ఇచ్చిన వెబ్సైట్ సరైనదో కాదో పరిశీలించాలి. అందులో ఉన్న ఫోన్ నంబర్కు కాల్చేసి వివరాలు తెలుసుకోకుండా ఆ సంస్థ ప్రధాన కార్యాలయం లేదా శాఖా కార్యాలయానికి వెళ్లి నిర్ధారించుకోవాలి. ప్రైవేట్ కంపెనీలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాల విషయంలోనూ ఆయా కార్యాలయాలను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలి. ఇందుకూరుపేటకు చెందిన ఇద్దరికి అనంతపురానికి చెందిన ఓ వ్యక్తి వాట్సాప్ ద్వారా పరిచయమయ్యాడు. సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పిస్తానని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షలు తీసుకుని మోసగించారు. దీంతో బాధితులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నెల్లూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు కొందరి వద్ద రూ.15 లక్షలు తీసుకుని మోసగించారు. కోట పరిధికి చెందిన ఓ వ్యక్తికి దుబాయిలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి హైదరాబాద్ వాసి రూ.4.50 లక్షలు తీసుకున్నాడు. -
మోడల్ సౌర గ్రామాల అభివృద్ధికి చర్యలు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(దర్గామిట్ట): పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద జిల్లాలో ఆరు గ్రామాలను మోడల్ సౌర గ్రామాలుగా అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. బుధవారం నెల్లూరులోని తన చాంబర్లో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 5 వేల మందికి పైగా జనాభా కలిగిన ఊర్లను మోడల్ సౌర గ్రామాలుగా పరిగణనలోకి తీసుకుంటారన్నారు. ఈ పథకం ద్వారా గ్రామంలోని ప్రతి ఇంటికీ సౌర ఆధారిత హోం లైటింగ్, నీటి సరఫరా వ్యవస్థలు, వ్యవసాయ అవసరాలకు పంపులు, వీధి దీపాల ఏర్పాటు వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. తొలివిడతగా లేగుంటపాడు, బిట్రగుంట, మహిమలూరు, కలివెలపాళెం, మనుబోలు, కాకుపల్లి గ్రామాలను ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. ఉత్తమ ప్రదర్శన చూపిన ఊరిని జిల్లాలో మోడల్ సౌర గ్రామంగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహంగా రూ.కోటి మంజూరు చేస్తుందన్నారు. స్వర్ణ వార్డు, గ్రామ కార్యాలయాల ద్వారా ఈ పథకంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. మండల స్థాయిలో ఎంపీడీఓలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, విద్యుత్ శాఖ ఎస్ఈ రాఘవేంద్ర, ఈఈ బాలచంద్ర, డిప్యూటీ సీఈఓ మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. పులి వాహనసేవలో మూలస్థానేశ్వరుడునెల్లూరు(బృందావనం): మహా శివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం రాత్రి పులి వాహనసేవ వేడుకగా జరిగింది. ఉదయం చప్పర ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. సంప్రదాయంగా స్వామి, అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు చేశారు. ఉభయకర్తలుగా ఎనమలమంద శ్రీనివాసులు, లక్ష్మి దంపతులు తదితరులు వ్యవహరించారు. కార్యక్రమాలను ధర్మకర్తల మండలి చైర్మన్ పుట్టా వెంకట అజయ్కుమార్రెడ్డి, సభ్యులు కార్యనిర్వహణాధికారి అర్వభూమి వెంకటశ్రీనివాసులురెడ్డి పర్యవేక్షించారు. -
రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘రాష్ట్రంలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. బెల్టు షాపులు అధికమయ్యాయి’ అని ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివకుమారి, మ స్తాన్బీ అన్నారు. నెల్లూరు బాలాజీ నగర్లో మంగళవారం ఐద్వా జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూపర్సిక్స్ పథకాలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలను సూపర్గా కొనసాగిస్తున్నట్లు ఆరోపించారు. మహిళలపై దాడులు, బాలికలపై లైంగికదాడులు, హత్యలు పెరిగాయన్నారు. ఈనెల 22వ తేదీన మండలాల్లో ఐద్వా సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపడుతామన్నారు. కార్యక్రమంలో పద్మ, సుబ్బమ్మ, ప్రమీల, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలకు మాత్రలు అందించాలి
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(అర్బన్): పిల్లల ఆరోగ్య సంరక్షణ, ఎదుగుదలకు నులిపురుగల నివారణ మాత్రలను తప్పనిసరిగా అందించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరులోని ఈఎస్ఆర్ఎం హైస్కూల్ విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను అందించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కలెక్టర్ పలువురు విద్యార్థుల చేత మాత్రలను మింగించారు. ఆయన మాట్లాడుతూ పిల్లల్లో నులిపురుగులు చేరడం వల్ల రక్తహీనతకు గురై నీరసిం పోతారన్నారు. ఈరోజు మాత్రలు వేసుకోని పిల్లలను గుర్తించి 24న వారికి అందించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ సుజాత, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ యశ్వంత్, డెమో అధికారి కనకరత్నం తదితరులు పాల్గొన్నారు. 5,35,499 మందికి.. జిల్లాలో నిర్వహించిన ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం విజయవంతమైందని డీఎంహెచ్ఓ డాక్టర్ వి.సుజాత తెలిపారు. నగరంలోని పలు పాఠశాలల్లో కార్యక్రమాన్ని ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్క రోజే 5,35,499 మందికి మాత్రలను మింగించామన్నారు. 93 శాతం నమోదైనట్లు చెప్పా రు. మిగిలిన వారి చేత ఈనెల 24న మాత్రలు మింగిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన విద్యాశాఖ, సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ, వైద్యసిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. -
ప్యాకేజీకి అమ్ముడుపోయే సంస్కృతి నీదే
● రూప్కుమార్పై గిరిజన నేత జయవర్ధన్ విమర్శలు నెల్లూరు(బారకాసు): ‘మా ఉద్యమం వెనుక ఎవరో ఉన్నారని, ప్యాకేజీలు ఇస్తున్నారని విమర్శలు చేయడం సరికాదు. ప్యాకేజీకి అమ్ముడుపోయే సంస్కృతి రూప్కుమార్ యాదవ్కు మాత్రమే ఉంది’ అని గిరిజన నేత తలపల జయవర్ధన్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక విషయంలో ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని స్పందించి నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం స్థానిక కార్పొరేషన్ కార్యాలయం ఎదుట పలువురు గిరిజన నేతలు అంబేడ్కర్, వెన్నెలకంటి రాఘవయ్య చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జయవర్దన్ మీడియాతో మాట్లాడారు. మాజీ మేయర్ పొట్లూరి స్రవంతి విషయంలో ప్రభుత్వం తప్పు చేసిందన్నారు. దీనిని సవరించుకునే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. రాజ్యాంగబద్ధంగా గిరిజనులకు కేటాయించిన స్థానంలో వేరే వర్గానికి అవకాశం కల్పించడం బాధాకరమన్నారు. ఇలాంటి పొరపాట్లతో గిరిజనులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని వేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గిరిజన ప్రజా సంఘాల నేతలు బాపట్ల వెంకటపతి యానాది, భక్తుల లక్ష్మణ శేఖర్, చౌటురి శ్రీనివాసులు, ఏడుకొండలు, కందల రమేష్, ఏకశిర మురళి, సురేంద్ర, ఏకుల సుధీర్, చేవూరు శ్రీనివాసులు, శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు. -
పంచాయతీ కార్యదర్శుల మెడపై కత్తి
ఉదయగిరి: సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం కూటమి నేతలు అనేక అడ్డదారులు తొక్కారు. సంపద సృష్టించి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించారు. తీరా అధికారం చేపట్టిన తర్వాత హామీలను మరిచిపోయారు. సంపద సృష్టికి బదులు విచ్చలవిడిగా అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్నారు. ఇప్పటికే మద్యం, విద్యుత్ సర్చార్జీలు పెంచడం ద్వారా కోట్ల ఆదాయం గడించిన ప్రభుత్వం ప్రస్తుతం గ్రామీణ ప్రజలపై పన్నుపోటు మోపుతోంది. ముక్కుపిండి పన్నులు వసూలు చేయాలంటూ పంచాయతీ కార్యదర్శుల మెడపై కత్తి వేలాడదీసింది. ఈ నెలాఖరులోగా లక్ష్యాలు సాధించకపోతే సస్పెండ్ చేస్తామంటూ వారిని బెదిరింపులకు గురిచేస్తోంది. ఉదయం నుంచి రాత్రి వరకు తిరుగుతున్నా పన్నులు వసూళ్లు కాకపోతుండడంతో ఏం చేయాలో తెలియక పంచాయతీ కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు.ఇదీ పరిస్థితిజిల్లావ్యాప్తంగా 4.08 లక్షల పన్ను అసెస్మెంట్లు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.50.02 కోట్ల పన్నులు వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఈనెలాఖరులోగా వంద శాతం పూర్తిచేయాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీచేసింది. లక్ష్యాలు అధిగమించకపోతే మండలానికి ఒకరిద్దరు కార్యదర్శుల చొప్పున సస్పెండ్ చేస్తామంటూ అధికారులు బెదిరిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో రూ.20.66 కోట్లకు పైగా పన్నులు వసూలు చేశారు. గతంలో ఇంటి పన్నులకు సంబంధించి మార్చిలో నోటీసులు జారీచేసి ఆ మరుసటి నెలలో వసూలు చేసేవారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం పాత ప్రక్రియకు స్వస్తిచెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి నెలాఖరులోగా వంద శాతం వసూలు చేయాలని ఒత్తిడి తేవడం, మార్చి వరకు సమయం ఉందంటూ ప్రజలు పన్నులు చెల్లించకపోవడంతో కార్యదర్శులు నలిగిపోతున్నారు. కొందరు తీవ్ర మానసిక వేదనకు గురవుతూ సెలవులపై వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఫ్యాక్టరీలు, పెద్ద గోదాముల యజమానులు నెలాఖరులో పన్నులు చెల్లిస్తామని చెబుతుండటంతో అనుకున్న లక్ష్యాలకు ఆటంకంగా మారుతోందని కొందరు వాపోతున్నారు.ఆన్లైన్ విధానంతో సమస్యలుప్రభుత్వం పన్నుల వసూళ్లకు కొత్తగా తీసుకొచ్చిన ఆన్లైన్ విధానం అనేక ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఎవరైతే ఇంటి, కుళాయి పన్నులు చెల్లించాలనుకుంటున్నారో వారు తమ సెల్ఫోన్ నుంచే నగదు కట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వారు తక్కువగా ఉండటం, వారికి స్మార్ట్ఫోన్లు లేకపోవడం చెల్లింపులకు పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. అలాంటి వారినుంచి పన్నులు వసూలు చేయడం సవాలుగా మారుతోందని కార్యదర్శులు చెబుతున్న మాట. ఒకే ఇంటి నంబర్లో పన్ను చెల్లింపు ప్రారంభిస్తే అందులో ఏమైనా చిన్న సమస్య ఎదురైతే మరో 24 గంటల వరకు సర్వర్ స్తంభిస్తోంది. దీంతో ఆ ఇంటి పన్ను తిరిగి చెల్లించాలంటే ఒకరోజు ఆగాలి. ఇలాంటి సాంకేతికపరమైన సమస్యలు ఉన్నందున అనేక ఇబ్బందులు పడుతున్నారు.ప్రాణాలతో చెలగాటంకార్యదర్శులు గ్రామాల్లో చెత్త సేకరణ ప్రక్రియ పర్యవేక్షించాల్సి ఉంది. అందులో ప్రభుత్వం నుంచి ప్రజలకు వచ్చే ఐఆర్వీఎస్ కాల్స్లో పనితీరు 50 శాతం తగ్గితే కార్యదర్శులకు ఇబ్బందులు తప్పడం లేదు. అదేవిధంగా వివిధ సర్వేల నిమిత్తం ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పన్నుల వసూళ్లకు సంబంధించి లక్ష్యాలను నిర్ణయించడంతో పనిఒత్తిడి పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక మండల పరిషత్ అధికారులు పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి పెంచుతుండటంతో వయస్సు పైబడిన వారు బీపీ, షుగర్ తదితర వ్యాధుల బారిన పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. అధికారంలోకి వస్తే ఉద్యోగులకు మంచి చేస్తామని ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు పనిఒత్తిడి పెంచి తమ ప్రాణాలతో చెలగాటమాడున్నారని పలువురు వాపోతున్నారు. -
కొనసాగుతున్న ‘కరెంటోళ్ల జనబాట’
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలో కరెంటోళ్ల జనబాట కార్యక్రమం కొనసాగుతోంది. మంగళవారం ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం నెల్లూరు టౌన్ డివిజన్ పరిధిలోని బీవీ నగర్ విద్యుత్ సెక్షన్ పడారుపల్లిలో పర్యటించి వినియోగదారుల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ వదులుగా ఉన్న లైన్లు, డ్యామేజైన స్తంభాలు, తక్కువ ఎత్కులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు, కాలంచెల్లిన లైన్లపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిని సత్వరమే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో నెల్లూరు టౌన్ ఈఈ శ్రీధర్, డీఈఈ అశోక్, ఏఈ రామ్ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. -
గిరిజనుల సమస్యలపై వినతి
నెల్లూరు(బారకాసు): మాజీ మేయర్ పొట్లూరి స్రవంతి మంగళవారం ఢిల్లీలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జుయెల్ ఓరంను కలిశారు. అలాగే పార్లమెంట్ సభ్యుడు, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ కమిటీ నాయకుడు ఫగ్గన్ సింగ్ కులస్తేను కూడా కలిశారు. గిరిజన సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. 21, 22 తేదీల్లో క్రికెట్ జట్ల ఎంపికలునెల్లూరు(స్టోన్హౌస్పేట): 2026 – 27 సంవత్సరానికి నెల్లూరు జిల్లా అండర్ – 19, 23 క్రికెట్ జట్ల ఎంపికలు నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతాయని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.రాజశేఖరరెడ్డి, కార్యదర్శి కె.శ్రీనివాసులు మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. 21న అండర్ – 19, 22న అండర్ – 23 క్రికెట్ జట్ల ఎంపికలు నిర్వహిస్తామన్నారు. క్రీడాకారులు వైట్ అండ్ వైట్ డ్రెస్కోడ్, సొంత కిట్, జనన ధ్రువీకరణపత్రం, ఆధార్కార్డుతో రావాలని సూచించారు. ఉత్సాహంగా జిల్లా స్థాయి చెస్ పోటీలునెల్లూరు(స్టోన్హౌస్పేట): శాప్ లీగ్ పోటీల్లో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహించిన జిల్లా స్థాయి చెస్ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పాండురంగారావు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీలు బీవీ రమణయ్య, ఎం.దేవిక ఈ పోటీలను ప్రారంభించారు. డీఎస్డీఓ మాట్లాడుతూ అండర్ – 13, 15, 17, 19 విభాగాల్లో బాలురు 144 మంది, బాలికలు 47 మంది పోటీల్లో తలపడుతున్నారని తెలిపారు. ప్రతిభ చూపిన వారిని ఈనెల 21, 22 తేదీల్లో రాష్ట్ర స్థాయిలో తిరుపతిలో జరిగే పోటీలకు జిల్లా తరఫున పంపిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ ఫిడే ఇన్స్ట్రక్టర్ అబ్దుల్ అజీజ్, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రైలు ఢీకొని వ్యక్తి మృతికావలి రూరల్: కావలి – తెట్టు రైల్వేస్టేషన్ల మధ్య 231/4 – 6 పోస్టుల మధ్య దిగువ లైన్లో మంగళవారం రైలు ఢీకొని గుర్తుతెలియని వృద్ధుడు మృతిచెందాడు. అతని వయసు 60 – 65 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మరణించినట్లు రైల్వే ఎస్సై వెంకట్రావు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.పారిశ్రామిక వినియోగదారుల పరిష్కార వేదిక నేడునెల్లూరు(వీఆర్సీసెంటర్): పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక తిరుపతిలో బుధవారం జరుగుతుందని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్కడి సీఎండీ కార్యాలయంలో ఉదయం 10:30 నుంచి 11:30 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పారిశ్రామిక వినియోగదారులు నేరుగా పాల్గొని సమస్యలు చెప్పొచ్చన్నారు. ఇంకా విద్యుత్ శాఖ టోల్ఫ్రీ నంబర్ 1800 425 155333, వాట్సాప్ నంబర్ 91333 1912కు సమస్యలు చెబితే పరిష్కరిస్తామని తెలియజేశారు. కండలేరులో 56.100 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 56.100 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,200, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 240, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.82 సన్నవి : రూ.70 పండ్లు : రూ.40 -
ఒక్క రూపాయి కేటాయించలేదు
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళల సంక్షేమానికి నిధులు కేటాయించలేదు. పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాట నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు. ఆడబిడ్డ నిధి కింద ఏటా రూ.1,500 ఇస్తామని హామీ ఇచ్చి బడ్జెట్లో మాత్రం ఆ పథకానికి రూపాయి కేటాయించలేదు. మహిళలను చంద్రబాబు నిండా మోసం చేశారు. కూటమి ప్రభుత్వం ఒక్క నూతన పింఛన్ కూడా అందజేయలేదు. నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేసింది. నేడు కూటమి పాలనలో ఆ పరిస్థితి లేదు. అన్ని వర్గాలను బడ్జెట్ నిరాశపరిచింది. – మొయిళ్ల గౌరి, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగ జోనల్ అధ్యక్షురాలు -
బంగారు ఉంగరం కోసమే వృద్ధుడి హత్య
చిల్లకూరు: జల్సాలకు అలవాటుపడి అప్పలపాలైన ఓ యువకుడు బంగారు ఉంగరం కోసమే వృద్ధుడిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 13వ తేదీన జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. చిల్లకూరు పోలీస్స్టేషన్లో మంగళవారం గూడూరు ఒకటో పట్టణ ఇన్స్పెక్టర్ శేఖర్బాబు వివరాలు వెల్లడించారు. నెలబల్లిరెట్టపల్లికి చెందిన ఎడ్డేం రమణారెడ్డి (83) తన గేదెలను రోజూ సమీపంలోని పొలాల్లోకి మేతకు తీసుకెళ్తుంటాడు. అదే గ్రామానికి చెందిన పసుపులేటి శ్రీనివాసులు అనే యువకుడు బెట్టింగ్లు ఆడుతూ జల్సాలు చేసి అప్పులపాలయ్యాడు. అతను గేదెలు మేపేందుకు ఒంటరిగా వెళ్లే రమణారెడ్డి వేలికి ఉన్న బంగారు ఉంగరాన్ని గమనించాడు. దొంతాల చెరువు సమీపంలో ఉన్న జామాయిల్ తోటలోకి రమణారెడ్డి గేదెలను తీసుకెళ్లిన సమయంలో శ్రీనివాసులు కర్రతో దాడి చేశాడు. దీంతో వృద్ధుడు బోర్లా పడ్డాడు. మరోసారి కర్రతో తలపై మోదడంతో మృతిచెందాడు. శ్రీనివాసులు ఉంగరాన్ని తీసుకుని పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. బూదనం సమీపంలోని బస్షెల్టర్ వద్ద అనుమానాస్పదంగా ఉన్న శ్రీనివాసుల్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించాడు. సమావేశంలో ఎస్సై సురేష్బాబు, సిబ్బంది విష్ణు, జయరామయ్య, నాగరాజు పాల్గొన్నారు. -
తహసీల్దారా.. మజాకా..!
నెల్లూరు(టాస్క్ఫోర్స్): జిల్లాలో అధికార దుర్వి నియోగం పతాక స్థాయికి చేరింది. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన ఓ తహసీల్దార్ కంచె చేను మేసిన చందంగా వ్యవహరించారు. నిబంధనలకు నీళ్లొదిలి ఏకంగా రూ.రెండు కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని తన అత్త, భార్యకు కట్టబెట్టారు. క్రమబద్ధీకరణ ముసుగులో సాగిన ఈ భూ భాగోతం విస్మయానికి గురిచేస్తోంది. జరిగిందిదీ.. నగరంలోని భక్తవత్సలనగర్.. రెవెన్యూ వర్గాల్లో ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. ఇక్కడ సర్వే నంబర్ 437, 438లో ఉన్న సుమారు 52 అంకణా ల ప్రభుత్వ స్థలాన్ని ఓ తహసీల్దార్ తన సొంతం చేసుకున్నారు. ఈ స్థలం విలువ సుమారు రూ.రెండు కోట్లు ఉంటుందని అంచనా. అయితే దీన్ని నేరుగా కాకుండా వ్యూహాత్మకంగా తన కుటుంబసభ్యుల పేరుపైకి మార్చారు సదరు అధికారి. 2019 ఎన్నికల సమయంలో హడావుడిగా జారీ చేసిన జీఓ నంబర్ 225ను అడ్డం పెట్టుకొని, ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ పేరుతో కథ నడిపించారు. మొదటి విడతలో 30 అంకణాల స్థలాన్ని తన అత్త పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారు. కొన్నాళ్లకు అదే స్థలాన్ని అత్త నుంచి తన భార్య పేరుపైకి గిఫ్ట్ డీడ్ ద్వారా బదలాయించారు. 2023లో మరో 22 అంకణాల స్థలాన్ని నేరుగా భార్య పేరుపైనే రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ తతంగంలో మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల సహకారం సైతం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విలువైన భూమిని అత్త, భార్యకు కట్టబెట్టిన వైనం బహిరంగ మార్కెట్లో విలువ రూ.రెండు కోట్లకుపైనే పతాక స్థాయికి చేరిన అధికార దుర్వినియోగం ఇతర శాఖల అధికారుల పాత్రపైనా అనుమానాలు వెబ్ల్యాండ్లో మాత్రం ప్రభుత్వ స్థలమే.. ఇంత తంతు జరిగి నా, వెబ్ ల్యాండ్ రికార్డుల్లో మాత్రం సదరు స్థలం ప్రభుత్వ భూమిగానే ఇప్పటికీ నమోదై ఉంది. సాధారణంగా రిజిస్ట్రేషన్ జరిగితే ఇందులోనూ పేరు మారాలి. అయితే ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు. దీని బట్టి చూస్తే ఉన్నతాధికారుల కళ్లుగప్పి అడ్డదారిలో ఈ వ్యవహారాన్ని నడిపించారనే అంశం స్పష్టమవుతోంది. సమగ్ర విచారణ జరిపితే మరిన్ని నిజాలు వెలుగుచూసే అవకాశముంది. విచారణకు ఆదేశించాం ఈ విషయమై విచారణ చేపట్టాల్సిందిగా నెల్లూరు ఆర్డీఓను ఆదేశించాం, నివేదిక ఆధారంగా చర్యలు చేపడతాం. – విజయ్కుమార్, డీఆర్వో -
నర్సరీల ఏర్పాటుకు ప్రతిపాదనలు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలోని అనువైన ప్రాంతాల్లో ఉద్యాన నర్సరీలను ఐదేళ్ల లీజు ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్లోని శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఉద్యానాధికారులతో మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడా రు. కలువాయి, సైదాపురం, దుత్తలూరులోని కోల్డ్ స్టోరేజీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో ఫాంపాండ్స్ను పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉద్యానాధికారులు వినూత్నంగా ఆలోచించి మెరుగైన ఫలితాలను సాధించాలని కోరారు. మోడరన్ నర్సరీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పా రు. జిల్లాలో అమలు చేస్తున్న పనుల పురోగతిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఉద్యానాధికారి రమణారెడ్డి వివరించారు. డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తదితరులు పాల్గొన్నారు. -
‘తల్లికి వందనం’లోనూ మోసమే
రాష్ట్ర బడ్జెట్లో విద్యావ్యవస్థకు అరకొరగా నిధులిచ్చారు. అమ్మఒడి పేరిట గత ప్రభుత్వ హయాంలో నిధులను సక్రమంగా మంజూరు చేసేవారు. అయితే తల్లికి వందనం పేరిట ప్రస్తుత సర్కార్ మోసం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 87,41,885 మంది పిల్లలు చదువుతుంటే, వారికి ఏడాదికి రూ.15 వేల చొప్పున రూ.13.112 కోట్లను చెల్లించాల్సి ఉంది. అయితే గతేడాది 21 లక్షల మందిని తగ్గించి 66 లక్షల మందికే చెల్లించినట్లు చూపారు. అందులోనూ రూ.ఎనిమిది వేల నుంచి రూ.పది వేల చొప్పునే అందించారు. ఇవ్వాల్సిన మొత్తాన్ని తక్కువ చేసి చూపించేందుకు యత్నిస్తున్నారు. – పర్వతాల లలితారెడ్డి, వైఎస్సార్సీపీ మహిళాధ్యక్షురాలు, చిల్లకూరు మండలం -
నిందితులను కఠినంగా శిక్షించాలి
నెల్లూరు రూరల్: సత్యసాయి జిల్లాలోని హిందూపూర్ నియోజకవర్గంలో గల చిలమత్తూరు మండలానికి చెందిన టీడీపీ నేత నాగేంద్ర.. బాలికలను బంధించి, వారి నగ్న వీడియోలను రికార్డ్ చేసి బెదిరించిన ఉదంతం సోషల్ మీడియాలో వైరలవుతోందని, తక్షణమే కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత తన ఎక్స్ వేదికగా స్పందించారు. పోక్సో చట్టం, బీఎన్నెస్ సెక్షన్ల మేరకు కేసు నమోదు చేయకుండా వ్యవహరించడం తగదన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని ఆరోపించారు. పోలీసులు వెంటనే చర్యలు చేపట్టి నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని కోరారు. చంద్రబాబు తన రాజకీయ సౌలభ్యాన్ని మానుకొని రాష్ట్రంలో శాంతిభద్రతలపై దృష్టి సారించాలని సూచించారు. -
ప్రజలను వంచించిన రాష్ట్ర బడ్జెట్
● వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేశారు ● హామీల అమలుకు మంగళం ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తోటపల్లిగూడూరు (పొదలకూరు): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్ ప్రజలను పూర్తిగా దగా చేసిందని, సంక్షేమ పథకాలకు అరకొర నిధులను కేటాయించి ఎన్నికల హామీలకు మంగళం పాడారనే అంశం స్పష్టమవుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. తోటపల్లిగూడూరు మండలం చిన్నచెరుకూరు, వరిగొండ గ్రామాల్లో మంగళవారం పర్యటించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, రైతులకు ఏ మాత్రం భరోసా ఇవ్వలేదని విమర్శించారు. మాట తప్పని జగన్మోహన్రెడ్డిని.. హామీలిచ్చి మోసగించే చంద్రబాబు నైజాన్ని ప్రజలు గుర్తించారని చెప్పారు. రైతులకు యూరియాను అందజేయకుండా అనేక ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో దేన్నీ నిలబెట్టుకోకుండా నిలువునా ముంచారని ఆరోపించారు. సంక్షేమ పథకాలను అమలు చేయలేననే విషయాన్ని బడ్జెట్ ద్వారా స్పష్టం చేశారని దుయ్యబట్టారు. రైతుల ఆత్మహత్యలు పెరిగాయని.. యూరియా అందక కర్షకులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేయాలి జిల్లాలో రైతులు పండించే ధాన్యానికి మద్దతు ధరను ప్రకటించి.. కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేశారు. జిల్లా యంత్రాంగం మొక్కుబడిగా ప్రకటనలు చేస్తూ, ఆచరణలో అమలు చేయడంలేదని విమర్శించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. రైతులకు తమ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చిన్నచెరుకూరుకు చెందిన పార్టీ నేత కోడూరు పురంధర్రెడ్డిని పరామర్శించారు. వరిగొండలో దువ్వూరు సరోజనమ్మ భౌతికకాయానికి నివాళులర్పించారు. పార్టీ రాష్ట్ర సెక్రటరీ చిల్లకూరు సుధీర్రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ ఉప్పల శంకరయ్యగౌడ్, గూడూరు విష్ణువర్ధన్రెడ్డి, దశరథరామిరెడ్డి, దీపక్రెడ్డి, సునీల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
యాప్ ద్వారా రుణాల రికవరీలు
● ఏజీఎం కామాక్షయ్య నెల్లూరు(పొగతోట): సీ్త్రనిధి రుణాలను యాప్ ద్వారా రికవరీ చేసేలా చర్యలు తీసుకోవాలని సీ్త్ర నిఽఽధి ఏజీఎం కామాక్షయ్య ఏపీఎంలు, సీసీలు, మేనేజర్లకు సూచించారు. సోమవారం నెల్లూరు డీఆర్డీఏ కార్యాలయం నుంచి సీ్త్ర నిధి మేనేజర్లు, ఏపీఎంలు, సీసీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్లో ఏజీఎం మాట్లాడారు. జిల్లాలో 1,219 గ్రామ సంఘాలున్నాయన్నారు. 819 సంఘాలు సీ్త్రనిధి రికవరీ యాప్ ద్వారా రుణాలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. 150 గ్రామ సంఘాలకు వీఓఏలు లేరన్నారు. మిగిలిన 250 సంఘాలు రికవరీ యాప్ను వినియోగించడం లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ సంఘాలు ఆ యాప్ ద్వారా చెల్లింపులు చేసే చర్యలు తీసుకోవాలని సూచించారు. యాప్ ద్వారా చెల్లింపుల్లో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. కారుణ్య నియామకపత్రాల అందజేతనెల్లూరు(క్రైమ్): ముగ్గురు పోలీసు కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం కింద టైపిస్టులుగా ఉత్తర్వులను సోమవారం జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల తన కార్యాలయంలో అందజేశారు. ఏఆర్ కానిస్టేబుల్ సూరి అంకయ్య మృతిచెందగా అతని కుమార్తె సింధూకు, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఎంవీ శ్రీనివాసులురెడ్డి చనిపోగా అతని కుమారుడు సూర్యతేజరెడ్డికి, నవాబుపేట కానిస్టేబుల్ జి.శివకుమార్ మృతిచెందగా ఆయన సతీమణి స్వరూపకు నియామకపత్రాలను ఎస్పీ అందజేశారు. క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా ఎస్పీ వారికి సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, ఏఓ చంద్రమౌళి, సూపరింటెండెంట్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై అలసత్వం తగదు ● డీఆర్వో విజయ్కుమార్ నెల్లూరు(దర్గామిట్ట): ప్రజా సమస్యల పరిష్కరించడంలో అధికారుల నిర్లక్ష్యం తగదని జిల్లా రెవెన్యూ అధికారి విజయ్కుమార్ తెలిపారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో అన్ని శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహించిన ఓ ఆర్డీఓ స్థాయి అధికారి, డీఎస్పీలకు మెమోలు జారీ చేసిన సంఘటనలు పలుచోట్ల జరిగాయన్నారు. వాటిని గుర్తించి జిల్లాలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే ప్రభుత్వ శాఖల బ్యాంక్ ఖాతాల వివరాలు వెంటనే నివేదించాలన్నారు. ఈపీటీఎఫ్ నమోదులో జిల్లాలో చాలామంది అధికారులు నిర్లక్ష్య వైఖరి విడనాడాలని తెలిపారు. అనంతరం శాఖల వారీగా పనితీరును సమీక్షించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, డ్వామా పీడీ గంగాభవాని, డీబీసీడబ్ల్యూఓ వెంకటలక్ష్మమ్మ పాల్గొన్నారు.నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.65 సన్నవి : రూ.55 పండ్లు : రూ.35 -
ప్రశ్నిస్తున్నా పట్టించుకోవడం లేదు
ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో నేతలు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఇంతకాలమైనా భృతి ఊసే లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించలేదు. నిరుద్యోగ భృతిపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా నిధులు కేటాయించి ప్రతి నిరుద్యోగికి డబ్బులు అందజేయాలి. లేకుంటే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గుణపాఠం చెబుతారు. – సాయిఆదిత్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ విద్యార్థి జేఏసీ -
సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరుతో మోసం
● పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● 132 వినతుల అందజేతనెల్లూరు(క్రైమ్): సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసు ఉన్నతాధికారులను కోరారు. సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 132 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్లకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె చట్టపరిధిలో విచారించి న్యాయం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, మహిళా పోలీసుస్టేషన్, డీసీఆర్బీ, ఎస్బీ ఇన్స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, ఎన్.రామారావు, డి.వెంకటేశ్వరరావు, బి.శ్రీనివాసరెడ్డి, ఫిర్యాదుల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● వాట్సాప్ ద్వారా అనంతపురం ప్రాంతానికి చెందిన రాజు పరిచయమయ్యాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఒక్కొక్కరి వద్ద రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం ఇప్పించకుండా, నగదు తిరిగివ్వకండా ఇబ్బంది పెడుతున్నాడు. విచారించి న్యాయం చేయాలని ఇందుకూరుపేటకు చెందిన ఓ వ్యక్తి, అతని స్నేహితుడు కోరారు. ● సంతపేటకు చెందిన వెంకట్రావు చిట్స్ వేయించుకుని నగదు తిరిగివ్వకుండా మోసగించాడని నెల్లూరు రూరల్ పరిధికి చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు. ● భర్త చెడు వ్యసనాలకు బానిసై మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడు. అత్తమామలు వేధిస్తున్నారు. విచారించి తగిన చర్యలు తీసుకోవాలని బిట్రగుంటకు చెందిన ఓ మహిళ వినతిపత్రమిచ్చారు. ● అనుమతి లేకుండా నా పొలంలో పెద్దకుమారుడు, కోడలు, మనుమడు నారు వేశారు. ఇదేంటని అడిగితే దాడిచేశారు. విచారించి చర్యలు తీసుకోవాలని కోట పరిధికి చెందిన ఓ వృద్ధురాలు కోరారు. ● నా కుమార్తె ఈనెల 3వ తేదీ నుంచి కనిపించడం లేదు. ఆమె ఆచూకీ కనుక్కోవాలని కలిగిరికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు. ● నాపై మజ్ముల్ అనే వ్యక్తి దాడిచేసి గాయపరిచాడు. ప్రస్తుతం కేసు కోర్టులో విచారణలో ఉంది. కేసు ఉపసంహరించుకోవాలని మనుషులతో బెదిరిస్తున్నాడని చిన్నబజారుకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. -
కన్నీటి సంద్రం
● పెళ్లికి వచ్చిన యువకుడు ● స్నేహితులతో ఈతకెళ్లి మృత్యువాత ● మరొకరి గల్లంతు ● ఉలవపాళ్లలో విషాదందగదర్తి: సరదాగా ఈత కొడదామని వెళ్లిన ఆ యువకులను విధి వంచించింది. అలల మధ్య చిక్కుకుని ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరొకరు గల్లంతైన విషాద ఘటన సోమవారం బోగోలు మండలం తాటిచెట్లపాళెం తీరాన చోటుచేసుకుంది. దీంతో దగదర్తి మండలం ఉలవపాళ్ల గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. స్థానికుల కథనం మేరకు.. కొంగి దీపక్ (18) చైన్నెలో ఉంటూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 12న తన పెద్దమ్మ సునీత కుమారుడు ఫిలిప్ వివాహానికి హాజరయ్యేందుకు తల్లి, సోదరితో కలిసి ఉలవపాళ్లకు వచ్చాడు. తండ్రి గతంలోనే ప్రమాదంలో మరణించగా, తల్లి చైన్నె విమానాశ్రయంలో చిన్న ఉద్యోగం చేస్తూ పిల్లలను చదివిస్తోంది. ‘నాలుగు రోజులుండి వస్తానమ్మా’ అని దీపక్ అడగడంతో, కొడుకు సంతోషం కోసం సరేనని ఆమె చైన్నె వెళ్లిపోయింది. కానీ అదే తన కొడుకుతో ఆఖరి మాట అవుతుందని ఆ తల్లి కలగనలేదు. తల్లిదండ్రుల మృతితో.. నూనె లోకేశ్ జీవితం మొదటి నుంచీ కష్టాలతోనే సాగింది. హైదరాబాద్లో ఉండేవారు. తల్లిదండ్రులు అనారోగ్యంతో కన్నుమూయడంతో నాలుగేళ్ల క్రితం ఉలవపాళ్లలోని మేనమామ ఉసురుపాటి చినమస్తాన్ దగ్గరకు చేరాడు. కూలీ పనులకు వెళ్తుంటాడు.ఏం జరిగిందంటే? సోమవారం మధ్యాహ్నం దీపక్, లోకేశ్, కప్పల ఇమ్మానుయేలు కలిసి తాటిచెట్లపాళెం సముద్ర తీరానికి వెళ్లారు. ఇమ్మానుయేలుకు ఈత రాకపోవడంతో ఒడ్డునే ఉండిపోయాడు. దీపక్, లోకేశ్ నీటిలోకి దిగారు. ఆ సమయంలో అలల ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో మునిగిపోయారు. కళ్లముందే స్నేహితులు గల్లంతవడంతో భయంతో ఇమ్మానుయేలు బంధువులకు సమాచారం అందించాడు. తీరానికి చేరుకున్న బంధువులు, స్థానికులు వెతకగా దీపక్ మృతదేహం లభ్యమైంది. లోకేశ్ జాడ ఇంకా తెలియరాలేదు. -
పబ్లిక్ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు : డీఆర్వో
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో ఈ నెల 23వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్, మార్చి 16వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో ఆదేశించారు. సోమ వారం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో ఇంటర్, పదోతరగతి పరీక్షలపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ సెంటర్ల వద్ద తగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు సకాలంలో చేరుకునేలా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఆర్ఐఓ వరప్రసాద్ మాట్లాడుతూ ఈనెల 23 నుంచి మార్చి 24 తేదీ వరకు 81 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 53,404 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారని చెప్పారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే కంట్రోల్ రూము నంబర్ 0861–2320312ను సంప్రదించాలని సూచించారు. డీఈఓ ఆర్. బాలాజీరావు మాట్లాడుతూ జిల్లాలోని 174 కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలను మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. 174 సెంటర్లలో 28,589మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని చెప్పారు. అలాగే మార్చి 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఏపీ ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు, మార్చి 16 నుంచి 28వ తేదీ వరకు ఏపీ ఓపెన్ స్కూల్ పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు, తనిఖీ బృందాలను నియమించినట్లు వివరించారు. -
అక్రమ సబ్ డివిజన్ రద్దు చేయాలి
వంశపారంపర్యంగా వస్తున్న పట్టా పొలంలో ఎటువంటి భాగ పరిష్కారాలు లేకుండానే ఓ వ్యక్తి కొనుగోలు చేసి ఏకంగా సబ్ డివిజన్ చేసుకున్నారని, దీనిని రద్దు చేయాలని కలువాయికి చెందిన పలువురు రైతులు వినతిపత్రం అందజేశారు. తమ పట్టా భూమికి సంబంధించి సోమశిల దక్షిణకాలువ నిర్మాణంలో భూసేకరణ పరిహారం కూడా అందిందన్నారు. రికార్డులు తారుమారు చేసి ఏకంగా సబ్ డివిజన్ ఇష్టం వచ్చినట్లు చేసుకోవడమే కాకుండా లేఅవుట్కు సిద్ధం చేశారని, తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్కు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో మృతి
● బైక్పై వెళ్తూ కింద పడిన యువకుడు● అతని పైనుంచి వెళ్లిన బస్సు● అక్కడికక్కడే మృతివింజమూరు(ఉదయగిరి): రోడ్డు ప్రమాదంలో అనుమసముద్రంపేట మండలం రాజోలు గ్రామానికి చెందిన వింజమూరు కూరపాటి సురేంద్ర (27) మృతిచెందాడు. ఈ ఘటన వింజమూరు పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. రాజోలు గ్రామానికి చెందిన సురేంద్ర ఆత్మకూరులోని అపోలో మెడికల్ షాపులో పనిచేసేవాడు. ఒకటిన్నర నెల క్రితం వింజమూరు అపోలో మెడికల్ షాపులో విధుల్లో చేరాడు. సోమవారం రాత్రి బంగ్లా సెంటర్కు మోటార్బైక్పై బయలుదేరాడు. వైఆర్జేసీ కాలేజీ సమీపంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద సిమెంట్ రోడ్డు మార్జిన్ సక్రమంగా లేకపోవడంతో ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. ఇదే సమయంలో ఉదయగిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వింజమూరు బస్టాండ్ నుంచి ఉదయగిరి వెళ్తోంది. స్పీడ్ బ్రేకర్ వద్ద సురేంద్రపై ముందు చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సురేంద్రకు భార్య, రెండేళ్ల వయస్సున్న కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరుకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. సిమెంట్ రోడ్డు మార్జిన్లకు ఇరువైపులా మట్టి పోసే విషయంలో ఆర్అండ్బీ అధికారులు నిర్లక్ష్యం వహించడతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఒక్క మాత్రతో నులిమేద్దాం..
● నేడు జాతీయ నులిపురుగుల నివారణ దినం ● 19 ఏళ్లలోపు 5,47,470 మంది ● 6,07,000 ఆల్బెండజోల్ మాత్రలు సిద్ధం నెల్లూరు(అర్బన్): చిన్నారుల్లో శారీరక, మానసిక ఎదుగుదలను నిరోధించి పోషకాలను గ్రహించి వారిని శక్తిహీనులుగా మారుస్తాయి నులిపురుగులు. అవి పిల్లల్లోని రక్తాన్ని పేగుల నుంచి శోషిస్తాయి. ఫలితంగా రక్తహీనత పెరిగిపోతుంది. తీసుకున్న ఆహారం సక్రమంగా జీర్ణం కాదు. ఆకలి మందగిస్తుంది. దీంతో పిల్లలు నీరసించిపోయి పనులు, చదువుపై ధ్యాస కోల్పోతారు. ఈ పరిస్థితిని గమనించిన భారత ప్రభుత్వం ఫిబ్రవరి 10వ తేదీని జాతీయ నులి పురుగుల నివారణ దినంగా ప్రకటించింది. మనరాష్ట్రంలో ఈనెల 17వ తేదీన ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో మంగళవారం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్యశాఖాధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 80 శాతం మంది పిల్లల్లో రక్తహీనత ప్రభుత్వం జరిపిన ఓ సర్వేలో పిల్లల్లో 80 శాతం రక్తహీనత ఉన్నట్టు గుర్తించారు. జిల్లాలో వైద్యశాఖ సర్వే లెక్కల ప్రకారం 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలు 5,47,470 మంది ఉన్నారు. వీరిలో కనీసం 4 లక్షల మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం నులిపురుగులేనని తేలింది. వీరి కోసం 6,07,000 మాత్రలను సిద్ధం చేశారు. 2,912 అంగన్వాడీ కేంద్రాలు, 2,594 ప్రభుత్వ, 811 ప్రైవేట్ పాఠశాలలు, 140 ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు ఒకేరోజు మాత్ర ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఆరోజు రాని వారికి ఈనెల 24వ తేదీన అందిస్తారు. నులిపురుగులకు చెక్ 1 నుంచి 19 ఏళ్లలోపు వారికి అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఉపాధ్యాయుల సహకారంతో నులిపురుగుల నివారణ మాత్రలు ఇవ్వబోతున్నాం. ఒక్క ఆల్బెండజోల్ మాత్రను నమిలి మింగించడం ద్వారా బిడ్డ పొట్టలోని పరాన్న జీవుల పెరుగుదలను అరికట్టొచ్చు. పురుగుల పునరుత్పత్తిని నివారించవచ్చు. తద్వారా పిల్లల ఆరోగ్యం, పోషకాహార స్థితి మెరుగుపడుతుంది. పాఠశాలల్లో హాజరు, ఏకాగ్రత పెరుగుతుంది. – వి.సుజాత, డీఎంహెచ్ఓ -
అయ్యా.. న్యాయం చేయండి
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● అర్జీలు స్వీకరించిన అధికారులునెల్లూరు(దర్గామిట్ట): ‘అయ్యా.. చాలాదూరం నుంచి వచ్చాం. మాపై కనికరం చూపండి’ అంటూ ప్రజలు కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్కుమార్, డిప్యూటీ కలెక్టర్ మురళి, డీపీఓ వసుమతి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కృష్ణకుమార్ అర్జీలను స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని శాఖల్లో అర్హత కలిగిన వారికి రానున్న నెలలోపు పదోన్నతులు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఇల్లు కూల్చారంటూ ఆవేదన -
నిరుద్యోగ భృతికి నిధులేవి?
అధికారంలోకి రాగానే ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేలు చొప్పున భృతి ఇస్తామని కూటమి నేతలు ఆర్భాటపు ప్రకటనలు చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్లోనూ ఆ పథకానికి నిధులు కేటాయించకపోవడం దారుణం. మోసం చేసిన చంద్రబాబుపై యువత ఆగ్రహంగా ఉన్నారు. మోసపు మాటలు చెప్పడం బాబు నైజమని మరోసారి తేలింది. ఇకనైనా నిరుద్యోగ భృతి అందించాలి. – డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, ఆత్మకూరు -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
నెల్లూరు (టౌన్): జేఈఈ మెయిన్స్లో సింహపురి విద్యార్థులు సత్తాచాటారు. ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్స్ పరీక్షలను గత నెల 21 నుంచి 29వ తేదీ వరకు ప్రతిరోజూ రెండు విడతల్లో నిర్వహించారు. ఫలితాలను నేషనల్ టెస్ట్ ఏజెన్సీ సోమవారం విడుదల చేసింది. అందులో వేనాటి కుషాల్రెడ్డి 99.94, ఎం యశ్వంత్రెడ్డి 99.88, ఈ శివకుశ్వంత్ 99.86, సీ శరణ్య 97.42 శాతం సాధించారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను ఏప్రిల్లో నిర్వహించనున్నారు. ఆనందంగా ఉంది శివకుష్వంత్ స్వస్థలం వేదాయపాళెం. తండ్రి జనార్ధన్ ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండగా, తల్లి ప్రవీణ గృహిణి. కుష్వంత్ జేఈఈ మెయిన్స్లో 99.86 శాతం సాఽధించారు. మెయిన్స్లో మంచి పర్సెంటేజీ రావడం ఆనందంగా ఉందని, అడ్వాన్స్డ్లో కూడా మంచి ర్యాంకు సాధించి ఐఐటీలో చదవడమే తన లక్ష్యమని తెలిపారు. -
రోడ్లు గుల్లగుల్ల..
టీడీపీ నేతలు బరితెగించారు. తమ ధన దాహం తీర్చుకునేందుకు పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు. జిల్లాకే వరప్రసాదిని అయిన జలనిధిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. అనేక గ్రామాలకు వెళ్లే రహదారుల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. అయితే అడ్డుకునే అధికారి లేరు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు మామూళ్ల మత్తులో జోగుతూ పచ్చపార్టీకి సాగిలపడి సాష్టాంగం పడుతున్నారు. పచ్చపార్టీ నేతలు సాగిస్తున్న దాష్టీకాలను ప్రశ్నిస్తే.. కేసులు పెడుతామంటూ బెదిరిస్తున్నారు. భారీ వాహనాల్లో పరిమితికి మించి ఇసుక లోడ్ చేసి రవాణా చేస్తుండడంతో రోడ్లు ఎక్కడికక్కడ మోకాల్లోతున కుంగిపోవడంతో కనీసం నడిచేందుకు కూడా వీల్లేని పరిస్థితి ఏర్పడింది. రహదారుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ తమ సర్వీసులను రద్దు చేయడంతో ఆయా గ్రామాల ప్రజలకు కి.మీ. మేర నడక తప్పడం లేదు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో అధికార పార్టీ పాలకుల ధనదాహానికి రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన రహదారులు విధ్వంసమవుతున్నాయి. వీరి దాష్టీకానికి ప్రజలు నరకయాతనలు అనుభవిస్తున్నారు. జిల్లా ప్రజలు, రైతాంగం భవిష్యత్ను ప్రమాదంలోకి నెట్టేస్తున్నా.. పర్యావరణాన్ని ధ్వంసం చేసేందుకు బరితెగిస్తున్నా.. ఇసుక దందాను ఆపే దమ్ము జిల్లా అధికార యంత్రాంగానికి లేదని విస్పష్టమవుతోంది. అనధికార రీచ్లు ఏర్పాటు చేసుకుని రేయింబవళ్లు బహిరంగంగానే ఇసుక దోపిడీ చేస్తున్నా.. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన రహదారుల వెంబడే ఇసుక వాహనాలు వెళ్తున్నా.. కట్టడి చేయలేక.. చావ కోల్పోయి చేష్టలుడిగి చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వ పాలన ప్రజలకు కంఠకంగా మారింది. జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎంపీలు వెనుక ఉండి బినామీలతో నడిపిస్తున్న ఇసుక దందా.. పెన్నా తీరంలోని గ్రామాలతో పాటు ఆయా మార్గాల్లోని గ్రామాల ప్రజలకు శాపంగా మారింది. భారీ వాహనాలతో పరిమితికి మించి అక్రమంగా సాగిస్తున్న ఇసుక దందాలకు పదికాలాల పాటు పదిలంగా ఉండాల్సిన రహదారులు గుల్లగుల్లగా మారుతున్నాయి.దండుగా వస్తున్న ఇసుక టిప్పర్లతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటున్న పరిస్థితి. అనుమతి లేని రీచ్ నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న టిప్పర్ ఢీకొని ఏడుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ కేసులో అనామకుడిని అరెస్ట్ చేసి.. అసలైన నిందితులను వదిలేశారు. భారీ ఇసుక టిప్పర్లతో రహదారులు దెబ్బతింటున్నాయి. ప్రజల ప్రాణాలు పోతున్నా.. రోడ్లు విధ్వంసం అవుతున్నా.. అధికార యంత్రాంగాలకు పట్టడం లేదు. ఎన్జీటీ ఆదేశాలు తుస్ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను తమ్ముళ్లు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ నేతల ఆదేశాలే చట్టాలుగా మార్చేసి యంత్రాలతో తవ్వకాలు చేస్తున్నారు. ఇటు పర్యావరణాన్ని పణంగా పెట్టి సోమశిల ప్రాజెక్ట్కు దిగువన వందల మీటర్ల దూరంలోనే పెన్నానదిలో 20 నుంచి 30 అడుగుల మేర తవ్వేస్తున్నారు. దీంతో భవిష్యత్లో ప్రాజెక్ట్ మనుగడకు ప్రమాదం తప్పదని పర్యావరణ హితులు హెచ్చరిస్తున్నారు. ఇక రైతులకు సాగునీరు పాకుండా కష్టాల్లోకి నెట్టేస్తున్నారు. కాలువలకు అడ్డంగా గట్టుకట్టి మరీ గ్రావెల్ వేసి రహదారులు నిర్మించి ఇసుక దందా కొనసాగిస్తున్నారు. భవిష్యత్ ప్రమాదాలను సైతం పట్టించుకోకుండా నిత్యం వేలాది టన్నులు ఇసుకను తోడేస్తూ ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ తమ్ముళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగాలు మాత్రం సాగిల పడి అఽధికారానికి గులాంగిరీ చేస్తూ ప్రకృతిని నాశనం చేస్తున్నారు. తెలుగురాయపురంలో బరితెగిస్తున్న తమ్ముళ్లు భారీ వాహనాలతో ఇసుక అక్రమ రవాణా అధిక లోడుతో రోడ్లు గుల్లగుల్ల ప్రశ్నిస్తే కేసులంటూ బెదిరింపులు ప్రజాప్రతినిధులకు నెలకు రూ.కోట్లలో మామూళ్లు పట్టించుకోని సంబంధిత రహదారుల శాఖ గుంతల రహదారిలో నడకే కష్టం బైక్లు, ఆటోలు, కార్లు సైతం వెళ్లలేని పరిస్థితి ఆ మార్గంలోని పల్లెలకు ఆర్టీసీ బస్సులు రద్దు ప్రజలకు శాపంగా కూటమి పాలన సోమశిలకు అతి సమీపంలో తెలుగురాయపురంలో ఇసుక రీచ్ను టీడీపీ నేతలు అనధికారికంగా నిర్వహిస్తున్నారు. ఈ రీచ్ నుంచి రేయింబవళ్లు సుమారు వందల టిప్పర్ల ద్వారా వేల మెట్రిక్ టన్నుల ఇసుకను కుల్లూరు సమీపంలోని రాజుపాళెం వద్ద (నేషనల్ హైవే 565 పక్కన) డంపింగ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి కర్ణాటక, చైన్నె ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. నిత్యం రీచ్ నుంచి వాహనాల్లో భారీగా లోడ్ చేసుకుని వెళ్తుండడంతో తెలుగురాయపురం నుంచి కొలవపల్లి, నూకనపల్లి, కలువాయి, బ్రాహ్మణపల్లి, వెంకటరెడ్డిపల్లి, కుల్లూరు వరకు రహదారి కొండలు, గుట్టలను తలపిస్తోంది. ఈ మార్గంలో బైక్లు, ఆటోలు కూడా నడిచే పరిస్థితి లేదంటే అతిశయోక్తి లేదు. భారీ టిప్పర్లు లోడ్ అధికమై రోజుకో చోట కుంగిపోయి ఇరుక్కుపోతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా తెలుగురాయపురం నుంచి కలువాయి రహదారి నరకాన్ని ప్రత్యక్షంగా చూపిస్తోంది. నాలుగు రోజుల క్రితం తెలుగురాయపురం రీచ్నుంచి వెళ్లే టిప్పర్ చక్రాలు కొలవపల్లి వద్ద రోడ్డు మార్జిన్లో కూరుకుపోయాయి. దీంతో ఆ రోడ్డు బ్లాక్ అవ్వడంతో రాకపోకలు నిలిచిపోయాయి. భారీ యంత్రాలు పెట్టి టిప్పర్ను బయటకు తీసి పంపారు. రూ.కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన బీటీ రోడ్డు పచ్చముఠాల ధనదాహానికి విధ్వంసమవుతున్నాయి. ప్రజాజీవనానికి తీవ్ర ఆటంకం కలుగుతున్నా అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదు. -
బడ్జెట్తో ప్రజలకు ఒరిగేదేమీ లేదు
నెల్లూరురూరల్ : కూటమి ప్రభు త్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో ప్రజలకు ఒరిగేదేమీ లే దని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి పేర్కొ న్నారు. సోమవా రం ఆయన రాష్ట్ర బడ్జెట్పై స్పందించారు. ఈ బడ్జెట్ వాస్తవాలకు దూరంగా, అంకెల గారడీ, అభూత కల్పనలతో ప్రజలను మోసం చేసేలా ఉందన్నారు. వాస్తవ పరిస్థితులకు బడ్జెట్లో చూపిన గణాంకాలకు ఏమాత్రం పొంతన లేవన్నారు. సూపర్సిక్స్ హామీలకు కూడా పూర్తిస్థాయిలో నిధుల కేటాయింపులు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా కొత్త పింఛన్లు ఇవ్వలేదన్నారు. ఈ రెండేళ్లలో ఎవరికీ 60 ఏళ్లు దాటలేదన్నట్లుగా ప్రభుత్వం నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందన్నారు. ఈ బడ్జెట్లో ఆడబిడ్డ నిధి కోసం నిధులు కేటాయిస్తారని ఎంతో ఆశగా ఎదురుచూసిన మహిళలకు నిరాశే మిగిలిందన్నారు. గత ప్రభుత్వంలో మహిళలకు ఏటా రూ.18వేలు లబ్ధి చేకూరిందన్నారు. చంద్రబాబు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, లేకపోతే నిరుద్యోగభృతి కింద ప్రతి నెలా రూ.3వేలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ప్రస్తావన కూడా బడ్జెట్లో లేదన్నారు. రైతులకు పంటల బీమా, ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన నాడు– నేడు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ, మహిళల ఆసరాకు బడ్జెట్లో కేటాయింపులు చేయలేదన్నారు. మహిళలు, రైతులు, యువత, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల వారిని ప్రభుత్వం మోసం చేసిందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేసిందన్నారు. బడ్జెట్ కేటాయింపుల ఆధారంగా అన్ని రంగాలు అభివృద్ధి పథంలో నడిచాయన్నారు. ప్రస్తుత బడ్జెట్ చంద్రబాబు, కూటమి నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం రూపకల్పన చేసినట్లుగా ఉందన్నారు. రెవెన్యూ ఉద్యోగులకు పదోన్నతులు నెల్లూరు(దర్గామిట్ట): ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ కలెక్టర్ హిమాన్షుశుక్లా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాయుడుపేట తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న కే స్వర్ణలతకు డిప్యూటీ తహసీల్దార్గా పదోన్నతి కల్పించి సైదాపురం తహసీల్దార్ కార్యాలయంలో నియమించారు. ఏఎస్పేటలో రీసర్వే డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్న కే విజయ్కుమార్కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ఎఫ్ఏసీ)గా పదోన్నతి కల్పిస్తూ నెల్లూరులోని తెలుగుగంగ ప్రాజెక్ట్లో పోస్టింగ్ ఇచ్చారు. గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న కే వెంకటేష్కు రీసర్వే డిప్యూటీ తహసీల్దార్గా పదోన్నతి కల్పిస్తూ ఏఎస్పేట తహసీల్దార్ కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. నెల్లూరు టీజీపీ స్పెషల్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న కే లీలారాణికి రీసర్వే డిప్యూటీ తహసీల్దార్గా పదోన్నతి కల్పిస్తూ కోట తహసీల్దార్ కార్యాలయంలో నియమించారు. -
ప్రాణాలు పోయినా.. హక్కులు కాపాడుకుంటాం
● గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్ష ● వెనక్కి తగ్గేది లేదంటున్న గిరిజన నేతలు బాపట్ల వెంకటపతి, తలపల జయవర్ధన్ ● గిరిజన ప్రాణాలకు హాని జరిగితే ఆ పాపం నీలం సాహ్నిదే నెల్లూరు (దర్గామిట్ట): గిరిజనుల హక్కులను కాపాడుకునేందుకు ప్రాణాలు పణంగా పెట్టేందుకు కూడా సిద్ధమేనని గిరిజన నేతలు బాపట్ల వెంకటపతి, తలపల జయవర్ధన్ స్పష్టం చేశారు. గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్షను సోమవారం ప్రారంభించారు. కొద్ది రోజులుగా గిరిజన సంఘాలు రిలే దీక్షలు చేస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా బాపట్ల వెంకటపతి, తలపల జయవర్ధన్ విలేకరులతో మాట్లాడారు. తమ హక్కుల సాధనకు శాంతియుతంగా దీక్షలు చేస్తుంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి నీచ రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు. నెల్లూరురూరల్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా భ్రష్టుపట్టించి, అడ్డగోలు దోపిడీతో రాజ్యమేలుతున్నాడని విమర్శించారు. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించడం శోచనీయమని, తమ ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే ఇందుకు ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిదే బాధ్య త అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేత పంట శ్రీనివాసులు రెడ్డి, గిరిజన నాయకులు యాకసిరి మురళి, చేవూరు శ్రీనివాసులు, ఏకుల సుధీర్, బత్తెన లక్ష్మణ శేఖర్, గందల రమేష్, సురేంద్ర, గిరిజనులు మద్దతు పలికారు. మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ ● ఈ నెల 26న ఎన్నికల ప్రక్రియ నెల్లూరు (బారకాసు): నెల్లూరు నగర మేయర్ స్థానానికి ఎన్నిక నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 26న కొత్త మేయర్ ఎన్నిక జరగనుంది. ఇందుకోసం ఆ రోజు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని పేర్కొంది. 2021లో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్గా గెలుపొందిన పొట్లూరి స్రవంతిపై ఇటీవల అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. దీంతో ఆమె మేయర్ పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఇన్చార్జి మేయర్గా డిప్యూటీ మేయర్ రూప్కుమార్యాదవ్ బాధ్యతలు చేపట్టారు. గిరిజన మహిళకు కేటాయించిన మేయర్ పదవిలో బీసీ ఉండడంతో వెంటనే ఎన్నిక నిర్వహించాలని మాజీ మేయర్ స్రవంతి కార్పొరేషన్ సాధారణ సర్వసభ్య సమావేశంలో నిరసన తెలియజేశారు. గిరిజన సంఘాలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడుతున్నాయి. ఈ పరిణామాలను ఢిల్లీ స్థాయిలో పెద్దలకు తెలియజేసేందుకు మాజీ మేయర్ వెళ్లారు. ఈ క్రమంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడం గమనార్హం. శ్రీవారి దర్శనానికి 10 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఓ మాదిరిగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. ఆదివారం 80,502 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 24,608 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కండలేరులో 56.280 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో సోమ వారం నాటికి 56.280 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1200, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 240, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల వంతున విడుదల చేస్తున్నట్లు వివరించారు. -
పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరురూరల్: వైఎస్సార్సీపీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి అన్నారు. జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మేజర్ పంచాయతీ నాయకులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. పార్టీ కమిటీల నియామకంపై చర్చించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో జెండాను భుజాన వేసుకుని మోసే వాళ్లను గుర్తుంచుకుని భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ విస్తృత స్థాయి కమిటీల రూపకల్పనకు నాంది పలికామన్నారు. పార్టీ అధికారంలో లేకున్నా ఉత్సాహంగా, ఉల్లాసంగా కమిటీల నియామకంలో నాయకులు, కార్యకర్తలు కలిసి పనిచేయడం అత్యంత సంతోషం కలిగించే విషయమన్నారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే వారికి పార్టీ పరంగా ఎల్లవేళలా అండగా నిలుస్తామన్నారు. పార్టీ నాయకులు ఎటువంటి అభిప్రాయ భేదాలకు తావు లేకుండా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలతో కలిసి పని చేయాలన్నారు. జగనన్న 2.0 లో కార్యకర్తలకు ప్రత్యేక స్థానం కల్పిస్తామని ఇప్పటికే జగన్మోహన్రెడ్డి ప్రకటించారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వ దుర్మార్గపు పోకడలతో ప్రజలను మోసం చేస్తోందని, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడంతో పాటు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్నారు. కూటమి ప్రభుత్వం 19 నెలల పాలనలో తీవ్ర ప్రజా వ్యతిరేకతను పోగేసుకుందన్నారు. సోమశిల జలాశయంలో సమృద్ధిగా నీరున్నా రైతులకు సాగునీరు అందించలేని అసమర్ధ ప్రభుత్వంగా కూటమిపై ముద్ర పడిందన్నారు. సోమిరెడ్డి వంటి నాయకులు ఇరిగేషన్ పనులు చేయకుండానే దొంగ బిల్లులు భోంచేయడం చూస్తే రైతులను అడ్డుపెట్టి ప్రజాధనాన్ని ఎలా దోచుకుంటున్నారో అర్ధమవుతుందన్నారు. సర్వేపల్లిలో నిద్రలేచినప్పటి నుంచి దోపిడీకి పాల్పడడం తప్ప, ప్రజల గురించి పట్టించుకునేనాథుడే కరువయ్యాడన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలిచి వారి సమస్యలను పరిష్కరించేందుకు పోరాటం చేద్దామన్నారు. జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. -
మహిళలను నమ్మించి.. వంచించారు
టీడీపీ ప్రభుత్వం మహిళలను నమ్మించి నయవంచనకు గురి చేసింది. ఆడబిడ్డ నిధి, దీపం పథకం, డ్వాక్రా సంఘాలకు సున్నావడ్డీ వంటి పథకాలకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. మోసపూరిత హామీలతో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఏడాదికి రూ.32,400 కోట్లు అవసరమైతే.. పైసా కూడా కేటాయించలేదు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకు రూ.5 వేల కోట్లు అవసరం అవుతాయి. కానీ ఎలాంటి కేటాయింపులు జరగలేదు. దీంతో మహిళలకు ఆయా పథకాల ద్వారా రూపాయి కూడా లబ్ధి కల్పించే అవకాశం లేదని విస్పష్టమైంది. దీపం పథకానికి రూ.4,083 కోట్లు అవసరమైతే.. రూ.2,601 కోట్లు మాత్రమే కేటాయించారు. దీంతో సగం మందికి కూడా ఈ పథకం డబ్బులు జమవుతాయనే నమ్మకం కూడా లేదు. సంక్షేమ పథకాలకు సైతం కోతలు విధించడం అన్యాయం. – తెనాలి నిర్మలమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు, పొదలకూరు -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 27 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,222 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 24,882 భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.20 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. పెద్ద పులి సంచారం ఉంది జాగ్రత్త ఉదయగిరి: శివరాత్రిని పురస్కరించుకుని ఉదయగిరి అటవీశాఖ పరిధిలో పెద్దపులి సంచరిస్తుందని, సిద్ధేశ్వరంలోని పురాతన దేవాలయానికి వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని సీఐ వెంకట్రావు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో శనివారం సీఐ విలేకరులతో మాట్లాడారు. ఆ ప్రాంతానికి ఎవరూ ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని సూచించారు. అటవీ ప్రాంతంలో క్షేత్రం ఉన్నందున స్నానం కోసం కోనేరులో తప్ప ఇతర వాగులు, వంకలు, బావుల్లో స్నానం చేయొద్దన్నారు. భక్తుల సౌకర్యార్థం వాహనాల కోసం ప్రత్యేకంగా పార్కింగ్లు ఏర్పాటు చేశామన్నారు. అటవీ ప్రాంతం కావడంతో మహిళలు విలువైన బంగారు అభరణాలు ధరించొద్దని పేర్కొన్నారు. పెరుమాళ్లపాడుకు భక్తులెవరూ రావొద్దు చేజర్ల: మండలంలోని పెరుమాళ్లపాడులో ఇసుక గర్భం నుంచి బయటపడిన నాగమల్లేశ్వరస్వామి ఆలయానికి భక్తులు ఎవరూ రావొద్దని పోలీసులు, రెవెన్యూ, దేవదాయశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. శనివారం ఆత్మకూరు సీఐ గంగాధర్, చేజర్ల తహసీల్దారు మస్తానయ్య, చేజర్ల ఎస్సై తిరుమలేశ్వరరావు ఆలయ పరిసరాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆలయం శిథిలావస్థలో ఉన్న కారణంగా మహాశివరాత్రి సందర్భంగా ఎటువంటి పూజా కార్యక్రమాలు, దర్శనాలు నిర్వహించడం లేదన్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ల్లో వస్తున్న సమాచారం నమ్మి భక్తులు ఎవరు రావద్దనారు. ఆలయం శిథిలం కావడంతో పాటు ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయన్నారు. పకడ్బందీగా ఇంటర్ పరీక్షలు నెల్లూరు (టౌన్): ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నట్లు ఆర్ఐఓ వరప్రసాదరావు తెలిపారు. శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లోని స్టోరేజీ పాయింట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో 33 ప్రాంతాల్లోని స్టోరేజీ పాయింట్లల్లో 17 మంది అధ్యాపకులను కస్టోడియన్లుగా నియమించినట్లు చెప్పారు. స్టోరేజీ పాయింట్లల్లో ప్రశ్నపత్రాలను నిల్వ ఉంచేందుకు ట్రంకుపెట్టెలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 81 సెంటర్లల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. -
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు
నెల్లూరురూరల్: కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను గాలికి వదిలేసింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించినా.. అసమర్థను నిలదీసినా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పోలీసుల తీరుపై ధ్వజమెత్తారు. కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బలో మైనార్టీ బాలిక గంజాయి బా్య్చ్ అఘాయిత్యానికి బలైపోయిన నేపథ్యంలో పరామర్శించినందుకు నమోదు చేసిన కేసులో శనివారం పోలీసుల విచారణకు కోవూరుకు కాకాణి బయల్దేరారు. ఈ క్రమంలో హడావుడిగా వచ్చిన కానిస్టేబుల్ కాకాణి నివాసానికి చేరుకుని ఈ రోజుకు విచారణకు రావొద్దని, 19వ తేదీన తామే మీ నివాసంలోనే విచారిస్తామంటూ మరో నోటీసు అందజేశారు. దీంతో కాకాణి తనపై అక్రమ కేసు నమోదు చేసి ఈ రోజు విచారణకు రావాలని 10వ తేదీ రాత్రి 9.30 గంటల సమయంలో హడావుడిగా వచ్చి ఎందుకు నోటీసులు ఇచ్చారో చెప్పాలని పోలీసులను ప్రశ్నించారు. తాను ఏం నేరం చేస్తే ఇంత అత్యుత్సాహం చూపిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. నాతోపాటు మైనర్ బాలిక కుటుంబాన్ని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, వక్ఫ్బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఇతర మైనార్టీ నాయకులు పరామర్శించి అదే రకమైన వ్యాఖ్యలే చేశారని, మరి తానొక్కడికే ఎందుకు నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటున్నారని ప్రశ్నించారు. అక్రమ కేసులు పెట్టి, ప్రశ్నించే తత్వాన్ని అణిచి వేయాలని చూస్తున్నారని, ఎన్ని అక్రమ కేసులు బనాయించి నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా, కూటమి నాయకులు చేస్తున్న అవినీతి, అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలపై తాను ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. ప్రభుత్వానికి రక్షక భటులుగా మారారు రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం పూర్తిగా ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ కూటమి నాయకుల కనుసన్నాల్లో పని చేస్తున్నారని, ప్రజలకు కాకుండా ప్రభుత్వానికి రక్షక భటుల్లా వ్యవహరిస్తున్నారని కాకాణి మండిపడ్డారు. నేరం చేసిన వారిపై చర్యలు తీసుకుంటే తప్పు లేదని, కూటమి నాయకుల ఆనందం కోసం తమపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తే పరిణామాలు రేపు అనుభవించాల్సి ఉంటుందన్నారు. గంజాయి అరికట్టలేకపోవడం పోలీసుల వైఫల్యం కాదా? మైనర్ బాలిక మృతి సమాజాన్ని కలిచి వేసిందని, ఆ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా నిలిచి పరామర్శించేందుకు వెళ్తే కేసులు కట్టడం కాదాని, చేతనైతే గంజాయిని అరికట్టి.. ఇలాంటి నేరాలు జరగకుండా చూడాలన్నారు. బాలికతో బలవంతంగా విష ద్రవం తాగించారని కేసు నమోదు చేశారని, కోవూరు, నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్లో ఆ బిడ్డకు సరైన వైద్యం అందలేదని బాలిక తండ్రే స్పష్టంగా చెప్పి కన్నీరుమున్నీరయ్యాడన్నారు. రాష్ట్రంలో మహిళలకు అసలు రక్షణ ఉందా అని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపలనే గంజాయి లేకుండా నిర్మూలిస్తానని స్టేట్మెంట్లు ఇచ్చాడని, 19 నెలలు అవుతున్నా గంజాయిని నిర్మూలించలేకపోతున్నారని, మారుమూల గ్రామాల్లో కూడా విచ్చలవిడిగా దొరుకుతుందన్నారు. ఏం నేరం చేశానని పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు నా తర్వాత వక్ఫ్బోర్డు చైర్మన్ అజీజ్, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి పరామర్శించారే వారిపై ఎందుకు కేసులు కట్టలేదు ప్రభుత్వం, పోలీసుల అసమర్థత కారణంగానే కాదా ఆ బాలిక చనిపోయింది? మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజం ప్రశ్నించారని ఆడపిల్లకు నోటీసులిస్తారా? కాకాణి పూజితమ్మ పైనా అక్రమ కేసు నమోదు చేసి వాట్సప్ ద్వారా నోటీసులు పంపించారన్నారు. పూజితమ్మ చేసిన తప్పు ఏమిటో తెలియడం లేదు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలను చూసి, విశ్లేషించి గంజాయి వల్లనే మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగిందని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిందని, మీడియా సమావేశంలో మాట్లాడింది తప్పన్నట్లు పోలీసులు నోటీసులు జారీ చేశారన్నారు. పూజితమ్మ ప్రశ్నించినట్లు తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అసత్యపు మాటలు మాట్లాడాడు. పోలీసులు అయనకు నోటీసులిచ్చి విచారణకు పిలవగలరా? అని ప్రశ్నించారు. సీబీఐ, సిట్ నివేదికలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలవలేదని స్పష్టం చేశారని గుర్తు చేశారు. అక్రమ కేసులకు బయపడే పరిస్థితి లేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసినా పోరాడి జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుంటామని, ఆ తర్వాత అందరి లెక్కలు సరిచేస్తామని హెచ్చరించారు. -
సాగునీటి రంగానికి మొండిచేయి
రాష్ట్ర బడ్జెట్లో సాగునీటి రంగానికి తీవ్ర నిరాశనే మిగిల్చింది. ఈ రంగానికి రూ.18,224 కోట్లు కేటాయించగా, కీలక ప్రాజెక్ట్ల నిర్మాణానికి రూ.9,906 కోట్లు కేటాయించారు. పోలవరం ప్రాజెక్ట్కే రూ.6 వేలు కోట్లు పోతే.. మిగిలిన నిధులతో ఏ ప్రాజెక్ట్లను పూర్తి చేస్తారు. మెట్ట రైతుల వరప్రసాదిని సోమశిల హైలెవల్ కెనాల్కు ఎంత మేర నిధులు కేటాయించారనేది స్పష్టంగా ప్రకటించలేదు. బడ్జెట్లో కేవలం ఆరు శాతం మాత్రమే సాగునీటి రంగానికి కేటాయించి చేతులు దులుపుకోవడం దారుణం. – లక్కు కృష్ణప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకుడు ● -
అబద్ధాలు, మోసాలు
కూటమి ప్రభుత్వం మూడో బడ్జెట్లో అన్నీ అబద్ధాలు, మోసాలే. సంక్షేమ పథకాలను అటకెక్కించారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.1500 బడ్జెట్లో పెట్టలేదు. సూపర్ సిక్స్ పథకాలకు మొండి చేయి చూపించారు. మిగిలిన పథకాలకు సైతం కోతల విధించారు. అప్పులతో కూడిన బడ్జెట్గా కనిపిస్తోంది. ఆత్మస్తుతి పరనిందతో బడ్జెట్ను రూపొందించారు. గత ప్రభుత్వంపై నిందలు వేయడం, వీరు ఉద్దరిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. రైతులు, సాధారణ ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎక్కడా ప్రభుత్వం అండగా నిలవలేకపోయింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్రెడ్డి నిధులను సంపూర్ణంగా కేటాయించారు. నాడు–నేడు, ఆరోగ్యశ్రీకు నిధులు కేటాయింపులు సక్రమంగా జరగలేదు. – కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ● -
తల్లికి వందనం.. మోసం
తల్లికి వందనం కింద కుటుంబంలో 12వ తరగతి లోపు ఎంత మంది చదువుకుంటుంటే అంత మందికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం వేస్తామని చెప్పిన ప్రభుత్వం తల్లులను మోసం చేసింది. గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కింద రూ 13 వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా రూ 9,407 కోట్లు విడుదల చేసింది. అనేక మందికి రూ.7 వేలు, రూ.9 వేలు వేసి మిగతా మొత్తాన్ని ఎగనామం పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా బడ్జెట్లో ఆ మేరకు నిధులు పెంచుతారా అంటే.. తూతూ మంత్రంగా కేవలం రూ.261 కోట్లను మాత్రమే బడ్జెట్లో పెంచింది. సరిపడా ఈ సంవత్సరం కూడా నిధులు ఇవ్వలేదు. అంటే ఈ సంవత్సరం కూడా తల్లులను ప్రభుత్వం మోసం చేయబోతోందని అర్థమవుతోంది. -
రైతాంగాన్ని నిరాశ పరిచిన బడ్జెట్
బడ్జెట్లో రైతులకు తీవ్ర నిరాళను మిగిల్చింది. గిట్టుబాటు ధరలు లేవు, కనీస మద్దతు ధర కరువైంది. కౌలు రైతుల ఊసేలేదు. ధరల స్థిరీకరణ నిధిని కేవలం రూ.500 కోట్లకు పరిమితం చేయడం దారుణం. అన్నదాత సుఖీభవ, జలవనరుల ప్రాజెక్ట్ల విస్తరణకు నిధులు తక్కువగా కేటాయించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయిస్తే నెల్లూరు జిల్లాకు కూడా మేలు జరిగేది. ఈ ప్రాజెక్ట్కు ప్రాధాన్యత ఇవ్వకపోవడం శోచనీయం. విత్తన సబ్సిడీ, యంత్ర పరికరాలకు ఇచ్చే సబ్సిడీ కేటాయింపులు కూడా లేవు. వ్యవసాయ రుణాలపై సున్నా వడ్డీ పథకానికి నిధులు ఇవ్వలేదు. – చిరసాని కోటిరెడ్డి, రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు -
నిరాశ, దగా బడ్జెట్
●రాష్ట్ర బడ్డెట్ అన్నీ వర్గాలను తీవ్ర నిరాశ పర్చింది. పీఆర్సీ, ఐఆర్ ప్రఽకటన వస్తోందని ఆశించిన ఉద్యోగులతోపాటు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్ మాటే లేదు. పొదుపు మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు సున్నా వడ్డీ ప్రస్తావనే కరువైంది. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఇచ్చే ధరల స్థిరీకరణకు మొక్కుబడిగా నిధులు కేటాయించారు. వెనుకబడిన ఉదయగిరి అభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయింపులు లేవు. రూ.లక్షల కోట్లు అప్పులు తప్ప... అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదు. మొత్తంగా దగా బడ్జెట్గా చెప్పక తప్పదు. – మేకపాటి రాజగోపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, ఉదయగిరి -
గారడీ లెక్కలు.. అప్పుల ప్రణాళికలే
రాష్ట్ర బడ్జెట్లో పేదలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సీబీఎస్ఈ కోర్సులను కూడా చేపట్టలేక రద్దు చేయడం చూస్తుంటే పేద పిల్లలకు సీబీఎస్ఈ చదువులు అక్కరలేదన్నట్లు ఉంది. బడ్జెట్ మొత్తం అప్పులు కుప్ప తప్ప.. సంక్షేమం, అభివృద్ధి ఏ కోశానా కనిపించలేదు. కేంద్రం వద్ద అప్పులు చేసేందుకే ద్రవ్య లోటు భారీగా చూపించారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీని, అన్నదాతలకు సాయం లేకుండా చేశారు. మహిళలకు రూ.1500 సాయం ఊసే లేదు. – మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ -
అన్నదాత సుఖీభవకు అరకొర
అన్నదాత సుఖీభవ తొలి ఏడాది ఎగనామం పెట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2.45 మంది రైతులకు రైతు భరోసా అందిస్తే.. కూటమి రెండో ఏడాది అమలు చేసినా.. కేవలం 1.80 లక్షల మందికి కూడా ఇవ్వకుండా లబ్ధిదారుల కోత పెట్టింది. ఈ సంవత్సరమైనా బడ్జెట్లో నిధులు పెంచుతారని ఎదురు చూసిన రైతులకు నిరాశ మిగిలింది. పరిశ్రమలకు నిధులేవి జిల్లాలో కొత్తగా పరిశ్రమలకు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. కొత్తగా పరిశ్రమలు గురించి ప్రస్తావించలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరైన నారంపేట పరిశ్రమల హబ్కు నిధులు ఇవ్వలేదు. నెల్లూరు రూరల్ మండలం ఆమంచర్ల వద్ద కూడా పరిశ్రమల హబ్ను ఏర్పాటు చేస్తున్నామని ఇటీవల కాలంలో పాలకులు ప్రకటించినప్పటికీ దానికి కూడా నిధులు కేటాయించలేదు. బకింగ్హామ్ కెనాల్ విస్తరణ ఊసే లేదు. నెల్లూరకు, చైన్నె, బెంగళూరు కారిడార్కు సంబంధించి గతంలో ప్రకటనలు చేసిన ప్రభుత్వం బడ్జెట్లో ఆ ఊసే ఎత్తలేదు. జిల్లాలో సుమారు 3.7 లక్షల మంది పింఛన్ దారులున్నారు. వీరిలో కొంతమంది మృత్యువాత పడ్డారు. కొత్తగా వితంతువులు, హెచ్ఐవీతో బాధపడుతున్నవారు, బెడ్ రిడన్ పేషెంట్లు 5 వేల మంది వరకు ఉన్నారు. కొత్త వారు దరఖాస్తు చేసుకుని పింఛన్లు కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నారు. వీరికి ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేయలేదు. బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. కూటమి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే ఉద్యోగం వచ్చే వరకు చదువుకున్న వారికి నిరుద్యోగ భృతి ఇస్తామని డప్పు కొట్టుకుంది. జిల్లాలో సుమారు 4 లక్షల మంది అర్హత కలిగిన నిరుద్యోగులున్నారు. అయినా బడ్జెట్లో వారి కోసం ఒక్క రూపాయి కేటాయించలేదు. ఆడబిడ్డ నిధి సంగతి మర్చిపోయారు. ఇలా అన్ని వర్గాలను నిరాశ పరిచిందని జిల్లా వాసులు ప్రభుత్వంపై మండి పడుతున్నారు. -
కూలి పనులకు వెళ్లి..
● ట్రాక్టర్ బోల్తాపడి మహిళ మృతి మర్రిపాడు: మర్రిపాడు మండలం ఏపిలగుంట–శెట్టిసముద్రం మలుపు వద్ద పొగాకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో ఓ మహిళ మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పెగళ్లపాడు ఎస్సీ కాలనీకి చెందిన వారు కూలి పనుల నిమిత్తం పొగాకు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఏపిలగుంట వైపు నుంచి చిలకపాడుకు వస్తున్నారు. శెట్టి సముద్రం క్రాస్రోడ్డు వచ్చే సరికి కారుకు సైడ్ ఇవ్వబోయి ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న నాగమల్లేశ్వరి, సరస్వతి, రామలక్ష్మమ్మలకు గాయాలు కావడంతో 108 వాహనం ద్వారా ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగమల్లేశ్వరి(26) మృతి చెందారు. ఏఎస్సై నజీర్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సచివాలయ ఉద్యోగులపై కక్షసాధింపు తగదు
నెల్లూరు(అర్బన్): సమయపాలన లేకుండా వేకువజాము నుంచి అర్ధరాత్రి వరకు విధులు నిర్వర్తించేలా ఒత్తిడి చేస్తూ సచివాలయ ఉద్యోగులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడం తగదని యునైటెడ్ వెల్ఫేర్ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ప్రభుత్వ ఎంప్లాయీస్ అసోసియేషన్(యూడబ్ల్యూజీఈఏ) రాష్ట్ర అధ్యక్షురాలు గుజ్జల రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. పనిఒత్తిడితో బుడతవలస గ్రామ సర్వేయర్ రఘునాథ్ గుండెపోటుతో మరణించడం, అంతకు ముందు కొద్ది రోజులుగా రాష్ట్రంలో మరణించిన ఇతర సచివాలయాల ఉద్యోగుల మృతికి సంతాపంగా కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ముందుగా గాంధీబొమ్మ వద్ద బాపూజీకి నివాళులర్పించి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వీఆర్సీ కూడలి వరకు ప్రదర్శన నిర్వహించి అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ తామంతా ఉన్నతంగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నామన్నారు. తమతో శివరాత్రి పేరిట టాయిలెట్ల వద్ద విధులు నిర్వర్తించేలా చేయడం, వేకువజామున 4 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కాపలా ఉండమనడం దారుణమన్నారు. తీవ్రమైన ఒత్తిడి పెంచిన నేపథ్యంలో అనేక మంది ఉద్యోగులు మృత్యువాత పడ్డారన్నారు. ఇకనైనా ప్రభుత్వం తమను ఆఫీస్ అవర్స్లోనే విధులు నిర్వర్తించేలా వెసులుబాటు కల్పించాలన్నారు. రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ లోకేశ్, నాయకులు మురళీకృష్ణ, గౌరీశంకర్, శ్రీనివాసులు, బాలు పాల్గొన్నారు. దేవస్థానం భూమిని ఆక్రమించి జామాయిల్ సాగు ● బీజేపీ నేత నిర్వాకం దుత్తలూరు: మండలంలోని నర్రవాడ వెంగమాంబ పేరంటాలు దేవస్థానానికి సంబంధించిన భూమిని ఆక్రమించి జామాయిల్ నాటారని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పచ్చవ కరుణాకర్బాబు కలెక్టర్ హిమాన్షు శుక్లాకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మాట్లాడుతూ బీజేపీ నాయకుడు మేకపాటి మాల్యాద్రి వెంగమాంబ పేరంటాలు దేవస్థానానికి సంబంధించి దొడ్డకొండ వద్ద ఉన్న కొంత భూమిని ఆక్రమించి అక్రమంగా జామాయిల్ సాగుచేయడంతో పాటు భక్తుల తాగునీటి కోసం ఏర్పాటు చేసిన బోరును కూడా ఆక్రమించి కంచె వేశాడని తెలిపారు. అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించి భక్తుల మనోభావాలను కాపాడడంతో పాటు దేవస్థాన ప్రతిష్టకు భంగం కలగకుండా చూడాలని కోరారు. దీనిపై తహసీల్దార్ నాగరాజును వివరణ కోరగా తనకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఆక్రమణ జరిగి ఉంటే రెవెన్యూ సిబ్బందిని పంపించి చర్యలు తీసుకుంటామన్నారు. -
వీఆర్వోపై దాడి హేయం
● నిందితుడిని కఠినంగా శిక్షించాలి ● వీఆర్వోల సంఘం డిమాండ్ నెల్లూరురూరల్: కొండాపురం మండలం ఇసుకదామెర్ల వీఆర్వో మురళీకృష్ణపై అదే గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి దాడికి పాల్పడడం హేయమైన చర్య అని, వెంటనే అతన్ని కఠినంగా శిక్షించాలని జిల్లా వీఆర్వోల సంఘం కార్యదర్శి డీవీ రమణయ్య డిమాండ్ చేశారు. నగరంలోని జిల్లా జర్నలిస్ట్ భవనలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వీఆర్వోపై దాడి చేయడం అనాగరికమైన చర్యగా భావిస్తున్నామన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఎస్పీకి కూడా తెలియజేస్తామన్నారు. అదేవిధంగా మిగతా గ్రామ రెవెన్యూ అధికారులకు భరోసా కలిగించే విధంగా శిక్షలు అమలు చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామ రెవెన్యూ అధికారుల సమస్యల పట్ల దశల వారీ ఆందోళన కార్యక్రమంలో భాగంగా 16వ తేదీ సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి తహసీల్దార్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించామన్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఆందోళన కార్యక్రమాలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సంఘ గూడూరు డివిజన్ ప్రెసిడెంట్ గిద్దలూరు రమణయ్య, ఆత్మకూరు డివిజన్ ప్రెసిడెంట్ బీవీ శేషారెడ్డి, ఆత్మకూరు డివిజన్ సెక్రటరీ సూరిపోగు కృష్ణయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు కన్నెధార రవిశేఖర్ నాయుడు, గ్రేడ్–2 వీఆర్వో జనరల్ సెక్రటరీ మన్నేపలి రమేష్, గంప ఉదయ్తేజ, నెల్లూరు డివిజన్ కార్యవర్గ సభ్యులు చిన్నారావు చంద్రశేఖర్, ప్రసాద్రావు, గూడూరు డివిజన్ కార్యవర్గ సభ్యులు పుల్లయ్య, దాసరి హనుమంతయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు కంచి చంద్రశేఖర్, కార్యవర్గ సభ్యుడు నాగేంద్ర పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ఎడ్ల బల ప్రదర్శన పోటీలు
● వైఎస్సార్ కడప జిల్లా హవా ● భారీగా తరలివచ్చిన ప్రజలు కొడవలూరు: మండలంలోని గండవరంలో ఉదయకాళేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్థానిక జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో వైఎస్సార్ కడప జిల్లా ఎడ్ల జత హవా కనబరిచింది. కడప జిల్లాకు చెందిన పెరమర్ల శివకృష్ణ జోడి ప్రథమ బహుమతిగా రూ.లక్ష గెలుచుకోగా, అదే జిల్లాకు చెందిన డి.గురివిరెడ్డి, పి.తేజస్విరెడ్డిల సంయుక్త జోడి రెండో బహుమతిగా రూ.75 వేలు, మార్తాల సుబ్బారెడ్డి జోడి మూడో బహుమతిగా రూ.50 వేలు గెలుచుకున్నాయి. నంద్యాల రోలి మేడమ్కు చెందిన ఓ జోడి నాలుగో బహుమతిగా రూ.30 వేలు, మరో జోడి ఏడో బహుమతిగా రూ.10 వేలు గెలుచుకున్నాయి. ఐదో బహుమతి ప్రకాశం జిల్లా వీరాస్వామి చౌదరి జోడి రూ.20 వేలు, ఆరో బహుమతి కడప జిల్లా గుత్తి ఆదిల్రెడ్డి జోడి రూ.15 వేలు గెలుచుకున్నాయి. విజేతలకు పౌరసరఫరాల శాఖ రాష్ట్ర డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి బహుమతుల ప్రదానం చేశారు. ఆసక్తిగా సాగిన పోటీలు గండవరం హైస్కూల్లో శనివారం జరిగిన రాష్ట్ర స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఆసక్తిగా సాగాయి. ఇక్కడ రెండో సారి పోటీలు జరిగినప్పటికీ ప్రేక్షకులు భారీగా తరలివచ్చారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ ప్రేక్షకులు కదలకుండా చూస్తూ ఉండిపోయారు. పోటీలకు వినియోగించిన 2.100 కిలోల బండను చుండి వెంకటరెడ్డి జ్ఞాపకార్ధం కుమారుడు అమర్నాథ్రెడ్డి అందించారు. కొడవలూరు సీఐ ఎ.సురేంద్రబాబు, ఎస్సై సీహెచ్ కోటిరెడ్డి సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. స్థానిక నాయకులు పెనాక వెంకటేశ్వర్లురెడ్డి, ఈశ్వర్రెడ్డి, బచ్చు సురేష్ పాల్గొన్నారు. -
యథేచ్ఛగా గుప్త నిధుల తవ్వకాలు
సీతారామపురం: మండలంలోని మారంరెడ్డిపల్లి గ్రామ సమీపాన నల్లబండ పరిసర ప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా కొందరు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపడుతున్నట్లు పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం మారంరెడ్డిపల్లి గ్రామ సమీపాన గల చేలల్లో పైభాగాన గుప్త నిధులు, పురాతన విగ్రహాలు దొరికినట్లు ప్రచారం ఉంది. ఆ ప్రాంతమంతా రాజుల కాలంలో ఎంతగానో విరాజిల్లిందని, పురాతన కాలంలో అక్కడ దేవాలయాలు ఉండేవని, నిధి నిక్షేపాలు సైతం మెండుగా భూమిలో ఉంటాయనే నమ్మకంతో గత కొంతకాలంగా పరీక్షించిన ముఠా సభ్యులు నల్లబండ ప్రాంతంలో గుప్త నిధులు ఉన్నట్లు గుర్తించి కొద్ది రోజులుగా పగలు, రాత్రి అనే తేడా లేకుండా తవ్వకాలు జరుపుతున్నట్లు పలువురు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే మా చేలల్లో మేము తవ్వుకుంటున్నాం, మీకేమి సంబంధం అంటూ ఎదురు దాడికి దిగుతున్నట్లు పలువురు చెబుతున్నారు. ఇదిలా ఉంటే భూ యజమానికి కలలో ఆ ప్రాంతంలో గుప్త నిధులు కనిపించాయని, అందుకే అక్కడ వాటి కోసం తవ్వకాలు చేస్తున్నట్లు మరికొందరు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే అక్కడ నిమ్మకాయలు, పసుపు, కుంకుమ ప్యాకెట్లు, చేతికి బ్లౌజులు, పలుగు, పార, సుత్తి, సమ్మెట, గోతాలు వంటి వస్తువులు అక్కడ ఉండటంతో స్థానికుల ఆరోపణలు, అనుమానాలకు బలం చేకూరుతోంది. -
19న ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్
నెల్లూరు(దర్గామిట్ట): ఈ నెల 19న కలెక్టరేట్లో కలెక్టర్ హిమాన్షుశుక్లా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్డేను నిర్వహించనున్నట్లుగా డీఆర్వో విజయ్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20న నిర్వహించాల్సిన గ్రీవెన్స్డేను ఒకరోజు ముందుగా జరుపు తున్నామని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శైవక్షేత్రాలకు నిరంతర విద్యుత్ సరఫరా నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ ఆదేశాల మేరకు శివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలోని శైవక్షేత్రాలకు 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్ను సరఫరా చేయనున్నట్లుగా ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం తెలిపారు. నగరంలోని విద్యుత్భవన్లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలతో పాటు చిన్న శివాలయాలకు అంతరాయం లేకుండా సరఫరాను అందించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. విద్యుత్ సమస్య తలెత్తితో వెంటనే సిబ్బందికి తెలియజేయాలని కోరారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం నెల్లూరు (లీగల్): ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల కు సంబంధించి నెల్లూరులోని బార్ అసోసియేషన్ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10.30 గంటలకు మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మొత్తం 1,607 మంది ఓటర్లు ఉండగా, 1,380 మంది న్యాయవాదులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి ఘర్షణలకు తావులేకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుని సీసీ కెమెరాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. -
శేష వాహనంపై మూలస్థానేశ్వర స్వామి
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నెల్లూరులోని మూలాపేటలోని ఉన్న శ్రీభువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామికి శుక్రవారం శేష వాహనసేవ జరిగింది. – నెల్లూరు (బృందావనం) ప్రశ్నించినందుకు నోటీసులా?నెల్లూరు రూరల్: బాధితుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు నోటీసులివ్వడం దారుణమని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితకు నోటీసులివ్వడం నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. శాంతిభద్రతలను గాలికొదిలేసి రాజకీయ కక్ష సాధింపుల కోసం వ్యవస్థలను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. దీంతో దేశంలో అట్టడుగు ర్యాంక్కు ఏపీ పోలీస్ వ్యవస్థ పడిపోయిందన్నారు. -
ఉపాధ్యాయురాలికి కలెక్టర్ పరామర్శ
నెల్లూరు(దర్గామిట్ట): ఆటో డ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న టీచర్ హరితను కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం పరామర్శించారు. బాలాయపల్లి మండలంలో ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న హరిత గురువారం గూడూరు నుంచి బాలాయపల్లికి టాటా మేజిక్ వాహనంలో వెళ్తున్న సమయంలో డ్రైవర్ దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కలెక్టర్ పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. బాధితురాలిని ఓదార్చి ధైర్యం చెప్పారు. దాడి సమయంలో ఆమె చూపిన ధైర్యసాహసాలను ప్రత్యేకంగా అభినందించారు. కత్తిపోట్ల గాయాలున్నట్లు వైద్యులు చెప్పగా కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం తరఫున బాధితురాలి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆమెకు ధైర్యశాలి అవార్డు కోసం ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట డీఈఓ బాలాజీరావు ఉన్నారు. -
పంటలు ఎండుతున్నా పట్టని ప్రభుత్వం
పొదలకూరు : రైతులు భారీగా పెట్టుబడులు పెట్టి, ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంటలు ఎండిపోతున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని, పారుదల కాలువలు మరమ్మతులకు నోచుకోకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని చెన్నారెడ్డిపల్లిలో ఎండుతున్న వరి పైరును శుక్రవారం పరిశీలించిన కాకాణి మీడియాతో మాట్లాడారు. మోంథా, దిత్వా తుఫాన్లుతో ఇరిగేషన్ కాలువలు, చెరువులకు తీవ్ర నష్టం జరిగిందని, రూ.100 కోట్లు కలెక్టర్ నుంచి మంజూరు చేయించుకున్నారని తెలిపారు. అయితే రైతులను గాలికి వదిలేసి కాలువల మరమ్మతు చేపట్టలేదన్నారు. ఇరిగేషన్ శాఖలో దొంగ బిల్లులు చేయించుకుని నిధులు స్వాహా చేసేందుకు స్కెచ్ వేశారని ఆరోపించారు. సోమశిల దక్షిణ కాలువ పరిధిలోని 7ఆర్ ఉపకాలువ కింద చివరి ఆయకట్టు రైతులు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు పరిస్థితిని సమీక్షించి సాగునీరు అందివ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, పంటలు ఎండిన తర్వాత నీరు ఇచ్చినా ఉపయోగం ఉండదన్నారు. కలెక్టర్ ఇబ్బడి ముబ్బడిగా జలవనరుల శాఖకు పనులు ఇవ్వడం మానుకుని క్షేత్రస్థాయిలో ఏమి జరుగుతుందో తెలుసుకోవాల్సిందిగా సూచించారు. జిల్లాలో రైతుల పంటలు ఎండిపోవడం ఎప్పుడూ చూడలేదని, నీటి నిర్వహణ లేకపోవడం వల్లనే ఇలాంటి దుస్థితి ఏర్పడినట్లు విమర్శించారు. రైతుల సమస్యలు కూటమి నాయకులు, అధికారులకు పట్టడం లేదని, అడ్డంగా దోచుకోవడం ప్రశ్నిస్తే అక్రమ కేసులు పడుతున్నారన్నారు. జగన్మోహన్రెడ్డి పాలనలో రైతులు పాడి పంటలతో సస్యశ్యామలంగా వెలుగొందారన్నారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఇరిగేషన్ పనులు చేయకుండానే దొంగ బిల్లులు పేరిట దోపిడీకి పాల్పడడంతో కాలువల ద్వారా నీరు సరఫరా కాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. కాలువలు జమ్ము, నాచుతో నిండిపోయి నీరు సరఫరా కావడం లేదన్నారు. మరమ్మతులకు నోచుకోని ఇరిగేషన్ కాలువలు రూ.100 కోట్లు మంజూరైనా పనులెక్కడ చేశారు? మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి -
విచారణలు, నివేదికలు బుట్టదాఖలు
జిల్లా ఇరిగేషన్ శాఖ అవినీతికి అడ్డాగా మారింది. పారుదల కాలువల అభివృద్ధి పేరిట అక్రమార్కులు కల్పతరువుగా మార్చుకున్నారు. పైసా పని చేయకుండానే రూ.కోట్లల్లో నిధులు కాజేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విచారణ కమిటీలు సైతం అవినీతిని ధ్రువీకరించినా.. అక్ర మార్కులపై చర్యలు తీసుకున్న దాఖలాల్లేవంటే ఈ శాఖలో ఏ స్థాయిలో అవినీతి రాజ్యమేలుతోందో అర్థం చేసుకోవచ్చు. కూటమి అధికారంలోకి రాగానే అవినీతిపరులనే ముద్రపడిన కొందరు అధికారులను దొడ్డిదారిన డిప్యుటేషన్పై ఈ శాఖలో ఉన్నతస్థాయిలో కూర్చొబెట్టి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. విషయం రచ్చకెక్కినప్పుడు తాత్కాలికంగా పంపించడం, రోజుల వ్యవధిలోనే మళ్లీ పట్టం కట్టబెట్టడం రివాజుగా మారింది.నెల్లూరు (స్టోన్హౌస్పేట): నెల్లూరులోని నీటి పారుదల శాఖ.. అవినీతి పారుదల శాఖగా అవతరించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ శాఖలో కొందరు అధికారులు, ఉద్యోగులే అన్నీ తామై కీలకంగా వ్యవహరిస్తూ.. ఈ శాఖను భ్రష్టుపట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాము చెప్పినట్లు చేయని ఉద్యోగులు, అధికారులను డిప్యుటేషన్పై ఇతర దూర ప్రాంతాలకు నిర్దయగా బదిలీ చేయడం నుంచి ఇష్టారీతిన బిల్లులు పాస్ చేసుకునే వరకు సంబంధిత అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారంటూ ప్రతిపక్షం ఆధారాలతో సహా బట్టబయలు చేస్తున్నా.. చలనం లేని పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి పని తమ కనుసన్నల్లో జరిగేలా అధికార పార్టీ ముఖ్యనేతలు వ్యవహరిస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ప్రధానంగా గతేడాది మోంథా తుఫాన్ ప్రభావంగా వరదలకు చాలా చోట్ల ఇరిగేషన్ శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆయా కాలువలు, గండ్లు పూడ్చేందుకు తాత్కాలికంగా రూ.100 కోట్ల నిధులు మంజూరైతే.. ఆ నిధులన్నీ ఆవిరైపోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా పనులు ఏ నియోజకవర్గంలో ఎక్కడ మంజూరయ్యాయో తెలియని చిదంబర రహస్యంగా మారుతోంది. తమ ప్రాంతాల్లో ఏఏ పనులు.. ఎంత అంచనాలతో చేస్తున్నారు.. ఎంత మేరకు పనులు జరిగాయో తెలపాలంటూ సమాచార హక్కు చట్టం ద్వారా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఆనం విజయకుమార్రెడ్డి తదితరులు దరఖాస్తు చేసినా.. సరైన సమాచారం ఇవ్వకుండా చట్టధిక్కారానికి సైతం పాల్పడుతున్నారంటే.. ఏ స్థాయిలో వీరు బరితెగిస్తున్నారో అర్థమవుతోంది. ఐఏబీల్లో ఆర్భాటపు ప్రకటనలు.. పనుల్లో అక్రమాలు జిల్లాలో ప్రధానంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఇరిగేషన్ పనుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందంటూ ఆధారాలతో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి బట్టబయలు చేసినా.. సంబంధిత పనులపైనా.. అధికారులపైనా కనీస విచారణ జరిపి చర్యలు తీసుకున్న పాపాన పోవడం లేదు. రైతులకు ఉపయోగకరంగా చేపట్టాల్సిన పనులను ధనార్జనే ధ్యేయంగా తూతూ మంత్రంగా నిర్వహించి చేతులు దులుపుకుని, రూ.కోట్లు దిగమింగుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐఏబీ మీటింగ్ల్లో తీర్మానించిన తీర్మానాలు ఇంత వరకు ఒక్కటీ కూడా పూర్తి కాలేదు. నియోజకవర్గానికి కేటాయించిన పనుల వివరాలు కూడా చెప్పేవారు కరువయ్యారు. అధికార పార్టీ ముఖ్యనేతల ప్రమేయంతో ఆ శాఖ ఉద్యోగులు ఎలా పనిచేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అటు తప్పించి.. ఇటు కూర్చోబెట్టి గంగాధర్ అనే ఉద్యోగి కాంట్రాక్టర్ల నుంచి ఫోన్పే ద్వారా డబ్బులను అక్రమంగా తీసుకున్నారంటూ పక్కా ఆధారాలతో ఆరోపణలు వెల్లువెత్తడంతో అతనిపై చర్యలు చేపట్టకుండా కొన్ని రోజులు తప్పించి, మళ్లీ ఇప్పుడు విధుల్లోకి తీసుకొచ్చారనే విమర్శలు లేకపోలేదు. గంగాధర్, ఆయన కుమారుడు, కుటుంబ సభ్యుల ఖాతాల్లో డబ్బులను అక్రమంగా జమ చేశారనే పూర్తి ఆధారాలున్నా చర్యలను ఎందుకు చేపట్టలేదనే ప్రశ్నలకు ఆ శాఖ ఉన్నతాధికారుల వద్ద సమాధానం దొరకడం లేదు. అక్రమాలకు అడ్డాగా మారిన ఇరిగేషన్ శాఖలో అవినీతి జలగలపై విజిలెన్స్, ఏసీబీ శాఖలు కనీసం విచారణ చేపట్టకపోవడం వెనుక అధికార పార్టీ ముఖ్య నేతల ఒత్తిళ్లు ఉన్నట్లు సమాచారం. అక్రమార్కుల పాలిట కల్పతరువు రూపాయి పనిచేయకుండానే రూ.కోట్లల్లో ప్రజాధనం దోపిడీ కూటమి ప్రభుత్వం రాగానే అవినీతి అధికారులకు డిప్యుటేషన్పై అందలం వీరిని అడ్డం పెట్టుకుని దోచుకుంటున్న ప్రజాప్రతినిధి, కొందరు నాయకులు ఆరోపణలు, విచారణ కమిటీలు.. వీరి ముందు బలాదూర్ ఏ విచారణ నివేదికపైనా చర్యలు శూన్యం సంబంధిత అధికారులను తాత్కాలికంగా వెనక్కి పంపడం.. మళ్లీ దొడ్డిదారిన తెచ్చి కూర్చోబెట్టడం రివాజు నివ్వెరపోతున్న ఉద్యోగులు అనైతిక కార్యకలాపాలకు అడ్డా ఇరిగేషన్ శాఖ అనైతిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఒక డీఈఈ స్థాయి అధికారి అక్కడ పనిచేసే ఓ మహిళపై అఘాయిత్యానికి పాల్పడితే చర్యలు చేపట్టలేదు. పది రోజులు ఆయన్ను పక్కన బెట్టి మళ్లీ అదే సీటులో కూర్చోబెట్టారు. సదరు డీఈఈ వేధింపులకు గురైన మహిళే ఆయన మీద ఎటువంటి ఫిర్యాదు ఇవ్వకపోవడంతో ఆయన్ను మళ్లీ విధుల్లో కూర్చొబెట్టుతూ ఉత్తర్వులు ఇచ్చారంటే ఇంతకంటే దౌర్భగ్యం మరొకటి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అవినీతి అధికారులు, అక్రమార్కులతోపాటు అధికార పార్టీ ముఖ్యనేతకు ఆ శాఖ ఉన్నతాధికారి కొమ్ముకాస్తూ ఇరిగేషన్ శాఖను భ్రష్టు పట్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న తీరుపై ఆ శాఖ ఉద్యోగులే నివ్వెరపోతున్నారు. ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న కొందరు అధికారులకు అధికార పార్టీ ముఖ్య నేతల అండదండలు ఉండడంతో అవినీతి ఆరోపణలు వచ్చినా ఏ మాత్రం పట్టించుకోకుండా యథావిధిగా పనిచేస్తున్నారు. ఇటీవల సెంట్రల్ డివిజన్ మేనేజర్పై ఏకంగా విచారణకు ఆదేశించినా అవినీతి అక్రమాలపై విచారణ పూర్తి కాకుండానే క్వాలిటీ కంట్రోల్ ఈఈ ఆయన్ను సరెండర్ చేశారు. మళ్లీ వెంటనే విచారణ నిర్వహించామని, ఆయనపై ఆరోపణలేవీ లేవంటూ విచారణలు, నివేదికలు బుట్టదాఖలు చేశారు. క్వాలిటీ కంట్రోల్ విభాగం ఎంతో కచ్చితంగా పని చేయాల్సిన అవసరం ఉంది. ఏ పని ఏ స్థాయిలో చేశారో చెప్పాల్సిన క్వాలిటీ కంట్రోల్ ఉద్యోగుల్లో ఇలా ఒకరినొకరు వెనుకేసుకొస్తూ పనుల క్వాలిటీనే పక్కదారి పట్టిస్తున్నారంటూ ప్రతిపక్షం ఆరోపిస్తోంది. -
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటల సమ యం పడుతోంది. 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 61,632 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 24,435 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.28కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జొన్నవాడ ఆలయ అతిథి గృహంలో టీడీపీ సమావేశం బుచ్చిరెడ్డిపాళెం రూరల్: జొన్నవాడలోని మల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి ఆలయానికి చెందిన అతిథి గృహంలో టీడీపీ నాయకులు రాజకీయ సమావేశం నిర్వహించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం మేరకు.. గత ఆదివారం జొన్నవాడ గ్రామ సర్పంచ్ పెంచలయ్య ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు ఆలయ అతిథిగృహంలో పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వాస్తవానికి ఆలయ ఆవరణలో, ఆలయ భవనాల్లో రాజకీయ సమావేశాలు నిర్వహించకూడదు. రాజకీయాల గురించి మాట్లాడకూడదు. ఇవన్నీ పక్కనపెట్టి అధికార టీడీపీ నాయకులు ఏకంగా అమ్మవారి ఆలయానికి చెందిన అతిథిగృహంలో పార్టీ సమావేశం నిర్వహించడం అధికార అహంకారానికి అద్దం పడుతోందని పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి సంబంధించిన భవనంలో రాజకీయ సమావేశాన్ని ఎలా నిర్వహిస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పార్టీ సమావేశానికి ఎలా అనుమతి ఇచ్చారని ఆలయ అధికారులపై మండిపడుతున్నారు. ఈ విషయమై ఈఓ అర్వభూమి వెంకట శ్రీనివాసులరెడ్డిని వివరణ కోరగా అక్కడ జరిగింది రాజకీయ సమావేశం కాదని, గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న సమావేశమని తెలిపారు. శివరాత్రి ఏర్పాట్ల గురించి చర్చించారని పేర్కొన్నారు. అయితే ఆలయ అధికారులు, సిబ్బంది, ఇతర శాఖల అధికారులు లేరు కదా అని ప్రశ్నించగా సమాధానం దాట వేశారు. -
ఎండిన ఆశలు
మడిలో పగుళ్లు.. కర్షకుడి కళ్లల్లో కన్నీళ్లు ఎగువన సోమశిల, కండలేరు జలాశయాల్లో పుష్కలంగా నీళ్లు. దిగువన పొలాల్లో నీళ్లు లేక వెయ్యి ఎకరాల్లో అన్నదాతల ఆశలు ఎండిపోతున్నాయి. మడి మడిలో పగుళ్లు కర్షకుడి కళ్లల్లో కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో కాలువల అభివృద్ధి పేరుతో రూ.కోట్లు ఖర్చు చేసినా.. సోమశిల దక్షిణ కాలువ పరిధిలోని 7 ఆర్ ఉప కాలువలో తట్టడు మట్టి తీసిన పాపాప పోలేదు. ఈ కాలువ కింద సుమారు 3 వేల ఎకరాల్లో వరి పంట సాగు జరుగుతోంది. కాలువలో జమ్ము, నాచు, చిల్లచెట్లు పెరిగిపోవడంతో చివరి ఆయకట్టుకు సాగునీరందక సుమారు వెయ్యి ఎకరాల్లో పచ్చని వరి పైరు ఎండిపోతోంది. ఎన్నెన్నో ఆశలతో సాగు చేసిన వరి కళ్ల ముందే ఎండిపోతుంటే అటు పాలకులు కానీ.. ఇటు అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. పొదలకూరు : పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అవినీతి వెరసి వెయ్యి ఎకరాల్లోని వరి పంటకు శాపంగా మారింది. రైతుల పేరుతో కాలువల మరమ్మతులకు రూ.కోట్ల నిధులు మంజూరు చేయించుకున్నారు. కానీ ఎక్కడా తట్టెడు పూడిక తీయలేదంటూ ఆది నుంచి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి చేసిన ఆరోపణలకు సోమశిల దక్షిణ కాలువ పరిధిలోని 7ఆర్ ఉప కాలువ అద్దంపడుతోంది. ఇప్పటికే ఎకరాకు రూ.25 వేల వరకు పెట్టుబడులు పెట్టి సాగు చేస్తున్న వరి పంట ఎండుపోతున్నా.. పాలకులు, అధికారులు కన్నెత్తి చూడడం లేదని అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. రూ.కోట్ల నిధులు మంజూరు చేయించుకుని కాలువల నిర్వహణను గాలికి వదిలేయడం వల్లనే ఈ దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగునీటికి తప్పని యుద్ధం సోమశిల జలాశయం నిండుకుండలా ఉన్నా దిగువనున్న ఆయకట్టు రైతులు మాత్రం సాగునీటి కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. సోమశిల దక్షిణ కాలువ, దాని ఉప కాలువల కింద చివరి ఆయకట్టు రైతులు జలాశయంలో నీటి నిల్వలు, నీటి కేటాయింపులను దృష్టిలో ఉంచుకుని సుమారు వేలాది ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. ప్రధానంగా 7 ఆర్ ఉపకాలువ కింద సుమారు 3 వేల ఎకరాల్లో వరి సాగులో ఉంది. రెండు వారాల క్రితం వరకు నీటిని సరఫరా చేసిన అధికారులు ఆ తర్వాత క్రమంగా తగ్గించడంతో మండలంలోని చివరి ఆయకట్టుగా ఉన్న చెన్నారెడ్డిపల్లి, నావూరు, భోగసముద్రం, బత్తులపల్లి, చేజర్ల మండలం కొండలరాయుడకండ్రిక రైతులు ఆందోళన చెందుతున్నారు. చివరి ఆయకట్టులో సుమారు వెయ్యి ఎకరాలకు చుక్కనీరు పారుదల లేక నెర్రిలు బారాయి. నిలువునా ఎండుతున్న పంటలు కాలువలో జమ్ము, నాచు, కంపకర్ర చెట్లు పెరగడంతో పూడికతో నిండిపోయి నీరు సక్రమంగా అందడం లేదు. దీనికితోడు మధ్యలో చేజర్ల మండలం చీర్లవారికండ్రిక వద్ద కాలువ పరిస్థితి దయనీయంగా ఉంది. జమ్ము దట్టంగా పెరగడంతో విడుదల చేసిన సాగునీరు ముందుకు సాగడం లేదు. సాగు నీటి నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడం వల్ల చివరి ఆయకట్టుకు నీరు చేరడం లేదు. చాలా చోట్ల కాలువకు షట్టర్లు లేకపోవడం కూడా ఇబ్బందిగా మారిందని రైతులు అంటున్నారు. చివరి ఆయకట్టులో వెయ్యి ఎకరాలకు తీవ్రంగా ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పటికే సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నట్టు రైతులు గగ్గోలు పెడుతున్నారు. అధికారులు మాత్రం గతేడాది రెండో పంటకు నీరు అందజేయడం వల్ల కాలువల మరమ్మతులు చేపట్టలేకపోయినట్టు చెబుతున్నారు. భారీగా పెట్టుబడులు పెట్టి, ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంటలు ఎండిపోతున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని, పారుదల కాలువలు మరమ్మతులకు నోచుకోకపోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం.. వెయ్యి ఎకరాల్లో వరికి నష్టం సర్వేపల్లిలో కాలువల అభివృద్ధికి రూ.కోట్లల్లో ఖర్చు అయినా జమ్ము, నాచుతో పూడిన 7ఆర్ కాలువ చివరి ఆయకట్టుకు పారని సాగునీరు కాలువల నిర్వహణను గాలికొదిలేసిన అధికారులు పంటను కాపాడాలని వేడుకుంటున్న రైతులు -
సిబ్బంది సంక్షేమమే ధ్యేయం : ఏఎస్పీ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమమే ధ్యేయమని ఏఎస్పీ సౌజన్య తెలిపారు. శుక్రవారం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఫోన్ఇన్ కార్యక్రమంలో ఆమె పాల్గొని 13 మంది సిబ్బంది సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి పోలీస్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ఫోన్ ద్వారా సమస్యలను నేరుగా చెప్పొచ్చన్నారు. 13 మంది సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించామన్నారు. కార్యక్రమంలో పోలీసు కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
హామీలు నెరవేర్చాలని డిమాండ్
● కలెక్టరేట్ ఎదుట ధర్నా నెల్లూరు(దర్గామిట్ట): కూటమి నేతలు అధికారంలోకి వచ్చేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు హామీలిచ్చారని, వాటిని వెంటనే నెరవేర్చాలని నేతలు డిమాండ్ చేశారు. శుక్రవారం నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, గౌరవాధ్యక్షులు ఎం.సుదర్శనం, కె.నరసింహ, జి.రాజమనోహర్ మాట్లాడుతూ హామీలపై తక్షణం చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేయాలన్నారు. మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో నేతలు రమేష్బాబు, రాజు, రవి, రామారావు, మోజెస్, చిరంజీవి, హరిబాబు, సురేష్, సునీల్, వీరాస్వామి, కస్తూరయ్య, వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బమ్మ, వెంకటరత్నం, కల్పనాదేవి పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదంలో వ్యక్తికి గాయాలు
రాపూరు: మండలంలోని పంగిలి గ్రామం బీసీ కాలనీలో శుక్రవారం ఉదయం ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఓ వ్యక్తికి తీవ్రయాలయ్యాయి. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన మల్లి కోటేశ్వరరావు తన ఇంట్లో నిద్రిస్తుండగా టీవీ, ఫ్రిడ్జ్, లైట్ ద్వారా ఒక్కసారిగా శబ్దం వచ్చి మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన గ్రామస్తులు మంటలు ఆర్పివేసి కోటేశ్వరరావును బయటకు తీసుకొచ్చారు. చికిత్స నిమిత్తం నెల్లూరులోని వైద్యశాలకు తరలించినట్లు వివరించారు. ఇంట్లోని వస్తువులు కాలిపోయాయి. కండలేరులో 56.820 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 56.820 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,200, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 240, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
మా మద్యం.. మా ఇష్టం
● టీడీపీ ప్రభుత్వంలో వింత పోకడ ● నిబంధనలకు తిలోదకాలు ● కంటైనర్లో బార్ను ఏర్పాటు చేసిన వైనం నెల్లూరు సిటీ: మద్యం విక్రయాలే పరమావధిగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మందుబాబులను ఎంత మత్తులోకి దింపితే అంత ఆదాయమొస్తుందనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. శాంతిభద్రతలు మృగ్యమైనా.. మహిళలకు రక్షణ కొరవడినా, వాటిని అరికట్టే దిశగా అడుగులేయకుండా.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. తాజాగా నగరంలోని జాతీయ రహదారి వద్ద దెయ్యాలదిబ్బ కాలనీకి సమీపంలో కంటైనర్లో బార్ అండ్ రెస్టారెంట్ను ఏర్పాటు చేయడం విస్మయానికి గురిచేస్తోంది. కంటైనర్ పక్కనే షామియానాలను వేసి నయా దందాను సాగిస్తున్నారు. యాక్సిడెంట్ జోన్లో.. జాతీయ రహదారి వద్ద దెయ్యాల దిబ్బ కాలనీ సర్కిల్లో ఇటీవల పలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో పలువురు గాయపడగా, మరికొందరు మృత్యువాత పడ్డారు. అయినా వీటిని పట్టించుకోకుండా బార్ను ఏర్పాటు చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. టీడీపీ ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. తాజాగా నిబంధనలకు పాతరేస్తూ సింహపురిలో కంటైనర్లో బార్ను ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. అసలే జాతీయ రహదారి.. ఆపై తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతంలో పెట్టడం విస్మయానికి గురిచేస్తోంది. ఇప్పటికే వీధివీధినా వెలసిన వైన్ షాపులతో మహిళలకు రక్షణ కరువవుతోంటే.. ఇలా వ్యవహరిస్తుండటంపై ప్రజానీకం భగ్గుమంటోంది. -
పాటూరు చీరలకు గుర్తింపు దిశగా అడుగులు
● క్షేత్రస్థాయిలో నిపుణుల బృందం పరిశీలన కోవూరు: జిల్లాకే గర్వకారణమైన పాటూరు చీరలకు భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) సాధించేందుకు కసరత్తులు మొదలయ్యాయి. ఇందులో భాగంగా జిల్లా చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్కు చెందిన నిపుణుల బృందం కోవూరు, నెల్లూరు రూరల్ మండలాల్లో విస్తృతంగా పర్యటించింది. హైదరాబాద్లోని రిసల్యూట్ ఐపీ సర్వీసెస్ సీఈఓ సుభాజిత్ మార్గదర్శకత్వంలో, కన్సల్టెంట్ సాగర్రావు నేతృత్వంలోని బృందం పాటూరు, గుమ్మళ్లదిబ్బ, నారాయణరెడ్డిపేట గ్రామాలను గురువారం సందర్శించింది. ఆయా ప్రాంతాల్లోని చేనేత కార్మికులతో భేటీ అయి, చీరల తయారీలో వాడే సంప్రదాయ పద్ధతులు, ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చేనేత, జౌళి శాఖ జిల్లా అధికారి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు. పాటూరు చీరల విశిష్టతను కాపాడటమే ఈ అధ్యయన ప్రధాన లక్ష్యమని చెప్పారు. -
17న జిల్లా స్థాయి చెస్ పోటీలు
నెల్లూరు(స్టోన్హౌస్పేట): శాప్ లీగ్స్ – 2026లో భాగంగా నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈనెల 17న జిల్లా స్థాయి చెస్ పోటీలు, ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎం.పాండు రంగారావు తెలిపారు. నగరంలోని ఆ సంస్థ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నెల్లూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో అండర్ – 13, 15, 17, 19 విభాగాల్లో బాలబాలికలకు పోటీలు, ఎంపికలు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి గల చెస్ క్రీడాకారులు https://sports.ap.gov.in/#/home/ saapleague వెబ్సైట్లో లేదా క్రీడా యాప్లో పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. జిల్లాకు చెందిన వారే అర్హులని, ఆధార్కార్డు లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డును తీసుకురావాలన్నారు. ఇతర జిల్లాల విద్యార్థులు నెల్లూరు జిల్లాలో చదువుతుంటే ఆ విద్యాసంస్థ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురావాలని తెలిపారు. ప్రతిభ చూపిన వారిని 21, 22 తేదీల్లో తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. ఈనెలలో చెస్, సైక్లింగ్, అథ్లెటిక్స్ పోటీలు, మార్చి నెలలో బ్యాడ్మింటన్, టెన్నీస్ పోలీసులు జరుగుతాయన్నారు. ఆసక్తి గలవారు 88862 28444, 95813 72472 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు. -
ఇళ్ల మధ్య బార్ వద్దు
● కావలిలో ప్రజల నిరసన కావలి: వ్యాపార సముదాయాలు, గృహల మధ్యలో బార్ వద్దంటూ మహిళలు, స్థానికులు పెద్ద ఎత్తున నిరసనను గురువారం చేపట్టారు. కావలి పట్టణంలోని లత థియేటర్ సమీపంలో ఉన్న షాపింగ్ క్లాంపెక్స్లో బార్ను గురువారం ప్రారంభించారు. దీంతో స్థానిక వ్యాపారులు, మహిళలు పెద్దఎత్తున చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో అయ్యప్పస్వామి దేవస్థానం, కావలి గ్రామ దేవత కలుగోళమ్మ దేవస్థానం ఉందని, భక్తులు నిత్యం అధిక సంఖ్యలో వస్తుంటారన్నారు. బార్ వెనుకవైపు వైద్యశాలతోపాటు కూతవేటు దూరంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలున్నాయన్నారు. గతంలో ఇక్కడ మద్యం దుకాణం ఉండటంతో స్థానికులను మందుబాబులు తీవ్ర ఇబ్బందులను గురిచేశారని ఆరోపించారు. బార్ను తరలించాల్సిందేనని డిమాండ్ చేశారు. -
నిబంధనలను పాటించని డ్రైవింగ్ స్కూళ్లు
● జిల్లాలో డ్రైవింగ్ స్కూల్ను నిర్వహించాలంటే తొలుత రవాణా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. ● ఎల్ఎమ్వీ స్కూల్కు కనీసం ఎకరా స్థలం ఉండాలి. ● ఇన్స్ట్రక్టర్కు డిప్లొమాతో పాటు డ్రైవింగ్లో ఐదేళ్ల అనుభవం తప్పనిసరి. ● ట్రేడ్మార్కును నమోదు చేసుకోవడంతో పాటు ఎమ్మెస్సెమ్ఈ, బీమా పాలసీ, పాన్తో పాటు సంబంధిత రవాణా శాఖ కార్యాలయం నుంచి డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ లైసెన్స్ పొందాలి. ● డెమో కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలి. ● డ్రైవింగ్కు సంబంధించిన మెళకువలను వారం పాటు వివరించాల్సి ఉంటుంది. ● రోడ్డు నిబంధనలు, సూచిక బోర్డులపై అవగాహన కల్పించాల్సి ఉంది. ● అనంతరం కనీసం 21 రోజుల పాటు డ్రైవింగ్లో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. కారును కొనుగోలు చేసి దర్జాగా నడపాలని చాలా మంది కోరుకుంటారు. ఇందులో భాగంగా డ్రైవింగ్ నేర్చుకోవడం తొలి ఎత్తు. ఔత్సాహికుల్లో ఉన్న ఈ ఆసక్తిని డ్రైవింగ్ స్కూళ్ల నిర్వాహకులు చక్కగా క్యాష్ చేసుకుంటున్నారు. నిబంధనలను పాటించకుండా.. జిల్లాలో పుట్టగొడుగుల్లా ఇవి వెలుస్తున్నాయి. జిల్లాలో కేవలం 15 స్కూళ్లకే అనుమతి ఉండగా, ఇవి లేకుండా ఎన్నింటినో అనధికారికంగా నిర్వహిస్తున్నారు. పాత వాహనాల్లో అరకొరగా ట్రెయినింగ్ ఇస్తూ.. కనీసం డెమోను సైతం ఇవ్వకుండా నేరుగా డ్రైవింగ్లో కూర్చోబెడుతున్నారు. శిక్షణ.. లైసెన్స్ల పేరిట భారీగా వసూలు చేస్తున్నారు. ఈ రకంగా నేర్చుకొని టెస్ట్కు హాజరవుతున్న వారిలో కేవలం ఐదు శాతం మందే పాస్ అవుతుండటం.. శిక్షణ కేంద్రాల డొల్లతనాన్ని ఇట్టే బయటపెడుతోంది. ఇంత జరుగుతున్నా, చోద్యం చూడటం రవాణాధికారుల వంతవుతోంది. నెల్లూరు (టౌన్): జిల్లాలో లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ స్కూళ్ల నిర్వాహకులు నాణ్యమైన శిక్షణను అందించడంలో దారి తప్పుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా, కాలం చెల్లిన వాహనాల్లోనే శిక్షణ ఇస్తూ వేలాది రూపాయలను దోచుకుంటున్నారు. ఆధునిక పరికరాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా డెమో ఇచ్చాకే.. వాహనాన్ని నడపడంలో ట్రెయినింగ్ను ఇవ్వాల్సి ఉన్నా, అవేవీ తమకు పట్టదనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారి వద్ద రూ.ఐదారు వేలను వసూలు చేసి తూతూమంత్రంగా శిక్షణ ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. అన్నీ మేమే చూసుకుంటాం..! లైసెన్స్ కావాలంటే మరో రూ.మూడు వేలను చెల్లిస్తే, అన్నీ తామే చూసుకుంటామనీ భరోసా ఇస్తున్నారు. తీరా దీని కోసం రవాణా కార్యాలయానికెళ్తే బొక్కాబోర్లపడి ఫెయిలవుతున్న పరిస్థితీ నెలకొంది. జిల్లాలో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ అందుబాటులోకి వచ్చాక, లైట్ మోటార్ వెహికల్ టెస్ట్లో కేవలం ఐదు శాతం మందే ఉత్తీర్ణులవుతున్నారు. డ్రైవింగ్లో నిర్వాహకులు ఏ మేరకు శిక్షణ ఇస్తున్నారో దీని ద్వారా అర్థమవుతోంది. పాత వాహనాల్లోనే అంతా.. జిల్లాలో అధికారికంగా 15 డ్రైవింగ్ స్కూళ్లుండగా, అనధికారికంగా 60కుపైగా ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఇందులో ఎక్కడా అధునాతన వాహనాలు కానరావు. అంబాసిడర్, మారుతి 800 లాంటి వాహనాల్లోనే శిక్షణ ఇస్తున్నారు. జిల్లాలో ఒకట్రెండు చోట్లే డెమో తరగతుల కోసం పరికరాలున్నాయి. ఓ చిన్న గదిలో సైతం నిర్వహిస్తున్న పరిస్థితీ ఉంది. ఇన్స్ట్రక్టర్కు లైసెన్సే ఉండదు. ఆ సమయంలో ఎవరుంటే వారినే శిక్షణకు పంపుతున్నారు. తొలి రోజు నుంచే నేరుగా స్టీరింగ్ పట్టించి.. డ్రైవింగ్ను కేవలం పది రోజుల్లోనే ముగిస్తున్నారు. జిల్లాలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న వైనం అనుమతున్నవి 15.. పర్మిషన్ లేనివెన్నో..! పాత వాహనాలతోనే అరకొరగా ట్రెయినింగ్ డెమో ఇవ్వకుండా నేరుగా డ్రైవింగ్ తర్ఫీదు పేరుతో రూ.ఐదారు వేల చొప్పున వసూలు లైసెన్స్తో కలిపి రూ.ఎనిమిది వేలు పట్టించుకోని రవాణాధికారులు ఇవీ నిబంధనలు.. ఇదీ తీరు.. తనిఖీలు నిర్వహిస్తాం జిల్లాలోని డ్రైవింగ్ స్కూళ్లపై తనిఖీలు జరుపుతాం. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిపై చర్యలు చేపడతాం. డెమో నిర్వహించిన అనంతరమే డ్రైవింగ్ను నేర్పించాలి. అనధికారికంగా నిర్వహిస్తే చర్యలు తప్పవు. – మదానీ, ఆర్టీఓ, నెల్లూరు -
రుణం చెల్లించినా.. ఇంటి పత్రాలివ్వడం లేదు
● మహిళ ఆవేదన ఆత్మకూరు: ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంక్కు రుణం చెల్లించినా ఇంటి పత్రాలివ్వకుండా తిప్పుకొంటున్నారని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. గురువారం ఆమె వివరాలు వెల్లడించారు. దుత్తలూరు మండలం తురకపల్లికి చెందిన మెట్ల సుభాషిణి 2023 సంవత్సరంలో ఆత్మకూరులోని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో రూ.30 లక్షలు విలువైన తన ఇంటి పత్రాలను మార్ట్గేజ్ చేసి రూ.10 లక్షల రుణం తీసుకుంది. కుమారుడి అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా అప్పు చేసింది. చికిత్స పొందుతూ కుమారుడు మృతిచెందాడు. రూ.10 లక్షలు అసలుకు గానూ రూ.6 లక్షల వడ్డీతో కలిపి మొత్తాన్ని 2025 నవంబర్ 19వ తేదీ నాటికి పూర్తిగా చెల్లించింది. లోన్ పూర్తయినట్లు బ్యాంక్ అధికారులు రశీదులిచ్చారు. మార్ట్గేజ్ చేసిన ఇంటి పత్రాలు వారం రోజుల్లో ఇస్తామని చెప్పి మూడు నెలలైనా ఇవ్వకుండా తిప్పుకొంటున్నారని బాధిత మహిళ వాపోయింది. హెడ్ ఆఫీస్ నుంచి పత్రాలు రావాలని చెబుతూ వచ్చారు. గురువారం వారిని నిలదీస్తే పత్రాలు పోయాయని, డూప్లికేట్ పత్రాలు ఇస్తామని చెప్పినట్లుగా సుభాషిణి వాపోయింది. రుణం చెల్లించే క్రమంలో ఒక్కరోజు ఆలస్యమైనా రూ.800 నుంచి రూ.3 వేలు పెనాల్టీగా సిబ్బంది వసూలు చేశారని చెప్పింది. పత్రాలు ఇవ్వకపోతే బ్యాంక్ ఎదుట పురుగు మందు తాగి ఆత్మహత్యకు చేసుకుంటానని పేర్కొంది. ఈ విషయమై ఆ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ వినోద్ను సంప్రదించగా ఆమె మార్ట్గేజ్ చేసిన పత్రాలు పోయిన విషయం వాస్తవమేనన్నారు. నెల్లూరులోని కార్యాలయ అధికారులకు తెలిపామని, రీ రిజిస్ట్రేషన్ చేసి పత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. -
విద్యుత్ భవన్ ఎదుట ధర్నా
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ సంస్థను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ నేషనల్ కో ఆర్డినేట్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ ఇంజినీర్స్ యూనియన్ ఇచ్చిన పిలుపుమేరకు గురువారం నెల్లూరులోని విద్యుత్ భవన్ ఎదుట ధర్నా జరిగింది. ధర్నాను యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దుగ్గిరాల సూరిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి జాకీర్ హుస్సేన్ ప్రారంభిచారు. వారు మాట్లాడుతూ సంస్థను ప్రైవేటీకరిస్తే కార్మికుల కంటే రైతులు, ప్రజలు ఎక్కువగా నష్టపోతారన్నారు. విద్యుత్ ఉద్యోగుల కు రావాల్సిన డీఏలను వెంటనే చెల్లించాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలన్నారు. జేఎల్ఎం గ్రేడ్ – 2 సమస్యలను పరిష్క రించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు. ఈనెల 18వ తేదీన జరిగే యూనియన్ రాష్ట్ర కమిటీ సమావేశంలో కార్మికుల సమస్యలపై తీర్మానం చేసి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో నేతలు బొజ్జా సుమన్, నాగయ్య, హరినారాయణ, గిరిబాబు, దయాకర్, జనార్దన్, లక్ష్మీపతి, జ్యోతిబసు, నాగముని, రామయ్య, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
లడ్డూ ప్రసాదంపై అదే దుష్ప్రచారం
● చంద్రబాబు తీరుపై అసహనంగా ప్రజలు ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పొదలకూరు: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు అదే దుష్ప్రచారాన్ని కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని బ్రాహ్మణపల్లిలో గురువారం పర్యటించిన ఆయన మాట్లాడారు. లడ్డూ ప్రసాదంపై చేస్తున్న వ్యాఖ్యలు దుర్మార్గంగా ఉన్నాయని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించి ఇలాంటి దుష్ప్రచారాలు సాగించడం తగదని హితవు పలికారు. గ్రామాల్లో ఎక్కడికెళ్లినా చంద్రబాబు వ్యాఖ్యలను ప్రజలు ఖండిస్తున్నారని తెలిపారు. రాజకీయ ప్రయోజనాలను ఆశించే ప్రసాదాలపై విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. భక్తుల మనోవేదనను అర్థం చేసుకోకుండా ఇలా వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. ప్రసాదంలో జంతువుల కొవ్వు లేదని తేలడంతో.. అసహనంతో పేట్రేగిపోయి బాత్రూమ్లు కడిగే రసాయనాలను వాడారంటూ ఆయన మాట్లాడుతుండటాన్ని ఆ పార్టీ నేతలే చీదరిస్తున్నారని చెప్పారు. పాపాలు శాపాలుగా మారడంతో చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, మంత్రులు నానా తంటాలు పడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు కుట్రలను వెంకటేశ్వరస్వామి బద్ధలు కొట్టారన్నారు. శివదీక్షధారులపై దాడులు హేయం శ్రీశైల మల్లన్నను దర్శించుకునేందుకు నిష్టతో వెళ్లిన శివదీక్షధారులను పోలీసులు కొట్టడం హేయమైన చర్యగా కాకాణి అభివర్ణించారు. వెంకటాచలం మండలంలోని కాకుటూరు శివాలయ భూములను సోమిరెడ్డి విక్రయించి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. గ్రామాల్లో రైతుల గోడును పట్టించుకునే నాథుడే కరువయ్యారని మండిపడ్డారు. అనేక రకాల హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. దేన్నీ అమలు చేయడంలేదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో దేవాలయాల నిర్వహణ పవిత్రంగా ఉండేదని గుర్తుచేశారు. బ్రాహ్మణపల్లికి చెందిన పార్టీ సీనియర్ నేత రావుల చినఅంకయ్య దశదిన కర్మకు హాజరై నివాళులర్పించారు. వెన్నపూస దయాకర్రెడ్డి, బడుగు శ్రీనివాసులు, శ్రీహరి, గోపాల్నాయుడు, బత్తల పెంచలరెడ్డి, సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పీపీపీ మాటున చంద్రబాబు దోపిడీ
నెల్లూరు రూరల్: ‘గవర్నర్ ప్రసంగంలో కూటమి ప్రభుత్వం అసత్యాలు చెప్పించింది. పీపీపీ మోడల్ పేరుతో చంద్రబాబు దోచుకుంటున్నారు’ అని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శించారు. నెల్లూరులోని ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. పీపీపీ అంటే పైసలు, పత్రికలు, పోలీసులను అడ్డం పెట్టుకుని దోచుకోవడమేనన్నారు. అమరావతిలో తానెక్కడికెళ్లి విచారించినా దోపిడీయే కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలను పట్టించుకోవడం మానేశారన్నారు. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ చార్జీలు అందక లక్షల మంది విద్యార్థులు దారుణ పరిస్థితుల్లో సతమతమవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు రోజురోజుకూ బలహీనపడుతున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కండలేరులో 57 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో గురువారం నాటికి 57 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 1,200, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 240, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
తూపిలిపాళేనికి చేరుకున్న సైక్లథాన్
వాకాడు: వందేమాతరాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఐఎస్ఎఫ్ చేపట్టిన సైక్లథాన్ మండలంలోని తూపిలిపాళేనికి గురువారం చేరుకుంది. ఈ సందర్భంగా మత్స్యకారుల భద్రతపై స్థానిక మత్స్యకారులకు అవగాహన కల్పించారు. కోల్కతా నుంచి కేరళలోని కొచ్చి వరకు సైకిల్ యాత్ర సాగనుందని అధికారులు తెలిపారు. మత్స్యకార గ్రామాల్లో విద్యా సదుపాయాలు ఎలా ఉన్నాయనే అంశాన్ని ఆరాతీశారు. వాలమేడు హైస్కూల్ను సందర్శించి విద్యార్థులకు క్రికెట్, వాలీబాల్ కిట్లను అందజేశారు. ఫిష్కాన్ డైరెక్టర్ అప్పంగారి జయపాల్, కాపులు పామంజి గోవిందయ్య, వావిల సుబ్రహ్మణ్యం, మత్స్యకారులు కొండూరు వెంకటేశ్వర్లు, గోవిందయ్య, మస్తానయ్య, గోవిందు, బ్రహ్మయ్య, రఘు, యేసు తదితరులు పాల్గొన్నారు. -
నమ్మండి.. నాణ్యత ఇలా ఉంటుంది..!
● నిర్మించిన మూడు రోజులకే ధ్వంసమైన రోడ్డు చిట్టమూరు: రోడ్ల నిర్మాణాల్లో నాణ్యతను విస్మరించి తమ జేబులు నింపుకొనేందుకే టీడీపీ ప్రభుత్వం పరిమితమవుతోంది. పది కాలాల పాటు పదిలంగా ఉండాల్సిన రోడ్లు రోజుల వ్యవధిలోనే ధ్వంసమవుతున్నాయి. సూళ్లూరుపేట – కోట.. మల్లాం రహదారిలో చిట్టమూరు మండలం తాడిమేడు నుంచి సింగనాల్తూరు వరకు వేస్తున్న తారు రోడ్డు పనులు మూణ్ణాళ్ల ముచ్చటగా మిగిలాయి. మూడు రోజుల క్రితమే ఈ పనులను పూర్తి చేయగా, గురువారానికి ఇవి ధ్వంసమై దర్శనమిచ్చాయి. గుంతల్లో నాసిరక మెటల్ను పరిచి తారు వేస్తుంటే, మరుసటి రోజుకే అది లేచిపోతోంది. సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అంతా ఇష్టారాజ్యంగా జరుగుతోంది. ఇప్పటికై నా వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలు వీడాలి
● ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్రావు నెల్లూరు(అర్బన్): ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలు మానుకోవాలని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ జేఎసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్రావు డిమాండ్ చేశారు. సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం భోజన విరామ సమయంలో కలెక్టరేట్ వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. వందలాది మంది ఉద్యోగులు తరలివచ్చారు. ఈ సందర్భంగా విద్యాసాగర్రావు మాట్లాడుతూ ఉద్యోగుల రక్షణ, పెన్షన్, ఇంక్రిమెంట్లు తదితర బాధ్యతల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుకొంటున్నాయని విమర్శించారు. కేంద్రం కరోనా లాంటి కష్టకాలంలో ఎవరికీ తెలియకుండా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులతోపాటు ఉద్యోగుల హక్కులు కూడా కాలరాయబడ్డాయన్నారు. సీపీఎస్ను రద్దు చేయాలని, ఓపీఎస్ను పునరుద్ధరించాలని, కాంట్రాక్ట్ విధానంలో పని చేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణకు పెద్దపీట వేస్తున్నారన్నారు. ఈ విధానాలు ప్రమాదకరమన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపధ్యక్షుడు అజయ్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను కారుచౌకగా ప్రైవేట్ శక్తులకు కట్టబెడుతున్నారన్నారు. భవిష్యత్లో రైల్వేస్టేషన్లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోతాయన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బలిజేపల్లి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ, లక్కాకుల పెంచలయ్య, ఆంజనేయవర్మ, లక్ష్మి, స్వర్ణలత, సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్, ఏపీ ఎడ్యుకేషన్ అసోసియేషన్, సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. -
గళమెత్తిన కార్మిక లోకం
● నెల్లూరులో సార్వత్రిక సమ్మె ● భారీ ర్యాలీ నిర్వహించిన ప్రజా సంఘాలు, యూనియన్లు ● సంఘీభావంగా బైక్ ర్యాలీ చేపట్టినవైఎస్సార్ ట్రేడ్ యూనియన్నెల్లూరు(వీఆర్సీసెంటర్): అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య, అఖిల భారత సంయుక్త కిసాన్మోర్చా పిలుపుమేరకు గురువారం నెల్లూరులో కార్మిక లోకం సమ్మె నిర్వహించింది. ఉదయం ఏబీఎం కాంపౌండ్ వద్దకు చేరుకున్న సీపీఎం, సీపీఐ, నెల్లూరు నగర, రూరల్ కమిటీలు, సీఐటీయూ, ఏఐటీయూసీ, ఏఐఎఫ్టీయూ (న్యూ), ఏఐఎఫ్టీయూ, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, వైఎస్సార్ టీయూ, రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు, కా ర్మికులు మద్రాస్ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎర్ర జెండాల చేతపట్టి నాలుగు లేబర్కోడ్స్కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. నేతలు ఏమన్నారంటే.. ర్యాలీ అనంతరం మద్రాస్ బస్టాండ్ వద్ద మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లా డుతూ పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఐక్యత లేకపోవడంతోనే కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలుగా పార్లమెంట్ను ఇంటిలా వాడుకుంటూ ఇష్టారాజ్యంగా చట్టాలు చేస్తోందని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ కార్మిక చట్టాలను మార్చడం, ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయడం దారుణమన్నారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మోదీ, చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్నారు. పాత కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి మాట్లాడుతూ కార్మికుల కోసం తెచ్చిన 29 చట్టాలను తిరిగి పునరుద్ధరించాలన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.అజయ్కుమార్ మాట్లాడుతూ నెల్లూరులోని ఆర్టీసీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యిందన్నారు. మార్చి ఒకటో తేదీ నుంచి ప్రైవేట్ వ్యక్తుల చేతిల్లోకి ఆర్టీసీ వెళ్తుందన్నారు. సమ్మెలో వివిధ సంఘాలకు చెందిన రాజేష్, జయకుమార్రెడ్డి, రాజేష్, పరంధామయ్య, మాదాల వెంకటేశ్వర్లు, కత్తి శ్రీనివాసులు, రెహానా బేగం, అన్నపూర్ణమ్మ, మూలం ప్రసాద్, రషీద్, నరిసింహ, వినోదిని, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కార్మికులకు అండగా వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్: వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జయకుమార్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం సమ్మెకు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద ర్యాలీని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి సమక్షంలో జెండా ఊపి సీనియర్ నాయకుడు ఎల్లసిరి గోపాల్రెడ్డి ప్రారంభించారు. వైఎస్సార్సీపీ కార్మికులకు అండగా ఉంటుందని జయకుమార్రెడ్డి తెలిపారు. రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి ఆనం విజయకుమార్రెడ్డి, నేతలు పాల్గొన్నారు. -
20న రజకుల మహాధర్నా
నెల్లూరు(వీఆర్సీసెంటర్): రజకులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఈనెల 20వ తేదీన తాడేపల్లిలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగే ‘రజకుల మహాధర్నా’ను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య పిలుపునిచ్చారు. నగరంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యాలయంలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి నాయకులు రజక వృత్తిదారుల సంక్షేమానికి కృషి చేస్తామని చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చాక ఎలాంటి పథకాలు అందజేయలేదని ఆరోపించారు. రజకుల సంక్షేమం, అభివృద్ధి కోసం బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రజక వృత్తిదారులపై అక్రమ కేసులు, మహిళలపై దాడులు, బాలికలపై లైంగికదాడులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో శ్రమకు తగిన వేతనం అందడం లేదన్నారు. కార్మిక శాఖ ద్వారా సర్వే నిర్వహించి గుర్తింపుకార్డులు ఇవ్వాలన్నారు. సమావేశంలో నాయకులు గుంజి దయాకర్, కసుమూరు రమేష్, కటికాల వెంకటేశ్వర్లు, సుబ్బారావు, అంకయ్య, రమణయ్య, వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు. -
రేపు రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు
● పోలింగ్కు సర్వం సిద్ధం నెల్లూరు(లీగల్): రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నిర్వహిస్తున్న ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించి నెల్లూరు బార్ అసోసియేషన్ హాల్లో పోలింగ్ కేంద్రం ఏర్పాటుచేశారు. పోలింగ్కు సర్వం సిద్ధం చేసినట్టు నెల్లూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పులిమి అయ్యపరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 40,000 మంది ఓటర్లు ఉన్నారన్నారు. 143 మంది న్యాయవాదులు పోటీ పడుతున్నారన్నారు. బ్యాలెట్ పేపర్ పద్ధతిలో ఎన్నిక జరుగుతుందన్నారు. ప్రతి న్యాయవాది 23 మంది అభ్యర్థులను ఎన్నుకోవచ్చన్నారు. ఓటరు కచ్చితంగా ఐదు ఓట్లు వేయాలన్నారు. క్యాపిటల్ లెటర్స్ (ONE, TWO, THREE, FOUR, FIVE) మాత్రమే రాయాలన్నారు. ఐదు కంటే తక్కువ ఓట్లు వేస్తే చెల్లదన్నారు. నెల్లూరు నుంచి ప్రస్తుత బార్ కౌన్సిల్ సభ్యుడు వేనాటి చంద్రశేఖర్రెడ్డి, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు డి.ఫణిరత్నం, ఆలిండియా లాయర్స్ యూనియన్ బలపరిచిన సత్తు అంకయ్య, ఒ.ఈశ్వర మనోజ్కుమార్, ఒ.వెంకటరాజు బరిలో ఉన్నారు. గుర్తింపుకార్డుతో న్యాయవాదులు ఓటు వేయాలని, పోలింగ్ ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని రిటర్నింగ్ అధికారి తెలిపారు. రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్యనెల్లూరు(క్రైమ్): రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వేదాయపాళెం – వెంకటాచలం రైల్వేస్టేషన్ మధ్యలో నెల్లూరు వైపు వచ్చే పట్టాలపై బుధవారం చోటుచేసుకుంది. మృతుడి వయసు 50 నుంచి 55 సంవత్సరాల్లోపు ఉండొచ్చని భావిస్తున్నారు. తెలుపు రంగు కట్ బనియన్, పచ్చరంగు గళ్ల టవల్ నడుముకు చుట్టుకుని ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు నమోదు చేశారు.పెన్నానది నుంచి ఇసుక తరలిస్తుండగా.. ● ట్రాక్టర్ కింద పడి వృద్ధుడి మృతిబుచ్చిరెడ్డిపాళెం: పెన్నా నదిలో ఇసుక తరలిస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం మండలంలోని జొన్నవాడ వద్ద ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పెనుబల్లి గ్రామానికి చెందిన షేక్ రసూల్ (64) జొన్నవాడ సమీపంలోని పెన్నా నది నుంచి ట్రాక్టర్లో ఇసుకలోడ్ చేసుకుని తరలిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పడంతో టైరు కింద నలిగి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సంతోష్కుమార్రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమి త్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో పెనుబల్లి గ్రామంలో విషాదం నెలకొంది. -
పోలీసుల బెదిరింపులకు భయపడం
● గిరిజన నేత జయవర్ధన్ ● 12వ రోజుకు చేరుకున్న రిలే దీక్షలు నెల్లూరు(దర్గామిట్ట): పోలీసుల బెదిరింపులకు భయపడేది లేదని గిరిజన సంఘాల ఐక్యవేదిక నేత పొట్లూరి జయవర్ధన్ అన్నారు. కలెక్టరేట్ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు బుధవారంతో 12వ రోజుకు చేరుకున్నాయి. దీనికి వివిధ ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. కాగా దీక్షలను ఆపేయాలంటూ పోలీసుల నుంచి సైతం బెదిరింపులు వస్తున్న సందర్భంగా జయవర్ధన్ మాట్లాడుతూ ఎన్ని అవరోధాలు ఎదురైనా న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. బలహీనవర్గాలపై నిరంకుశంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయడం దారుణమన్నారు. ఎన్నికల కమిషన్ను కలవకూడదనే హక్కు ఎవరిచ్చారని పోలీసులను ప్రశ్నించారు. అవసరమైతే దేశ రాజధాని ఢిల్లీలో ధర్నాకు దిగుతామని తెలిపారు. మేయర్ పీఠంపై గిరిజలను కూర్చోబెట్టాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీక్షకు ఎంప్లాయీస్ అసోసియేషన్ నేత చెంచయ్య రూ.5 వేలు విరాళాన్ని ప్రకటించారు. నగదును ఐక్యవేదిక నాయకుడు బాపట్ల వెంకటపతి యానాదికి అందజేశారు. కార్యక్రమంలో యాకశిరి మురళి సుధీర్బాబు చేవూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జయవర్ధన్కు నోటీసులు నెల్లూరు(స్టోన్హౌస్పేట): గిరిజనులు చేపట్టిన ఉద్యమంపై కూటమి ప్రభుత్వం అణచివేత ధోరణి ప్రదర్శిస్తోంది. నేతలు ఇటీవల ఎన్నికల కమిషన్ను కలిసిన విషయాన్ని నెల్లూరు కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాగైనా ఉద్యమాన్ని కట్టడి చేయాలన్న కుట్రలు పన్నుతున్నారు. అసెంబ్లీ, ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తారని పోలీసులకు సమాచారం అందడంతో బుధవారం జయవర్ధన్కు నోటీసులిచ్చారు. ఆందోళన విరమించాలన్నారు. ఎన్నికల కమిషన్ను కలిసేందుకు పర్మిషన్ లేదంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. దీంతో గిరిజన సంఘాలు రగిలిపోతున్నాయి. -
తమ్ముళ్ల కన్ను
ఎర్ర సంపదపై ● ఎర్రచందనం అక్రమ రవాణా ● పోలీసుల అదుపులో ఆరుగురు ● అందులో సోమశిల ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అనుచరుడుఆత్మకూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక, గ్రావెల్ను మండలాల టీడీపీ నాయకులు యథేచ్ఛగా దోచుకుని అక్రమంగా సంపాదించుకుంటున్నారు. ఎర్రచందనంపై ఆ పార్టీ శ్రేణుల కళ్లు పడ్డాయి. గత అక్టోబర్ నెలలో సోమశిల పెన్నానది పరీవాహక ప్రాంతంలో కొందరు స్మగ్లర్లు టీడీపీ నాయకుల అండదండలతో ఎర్రచందనం, అటవీ సంపదను రాత్రికి రాత్రే దూర ప్రాంతాలకు తరలించారు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా కొందరు అధికారుల అండదండలతో తొక్కి పెట్టేశారు. తొలుత ఎర్రచందనం నరికి అనుకూలమైన ప్రాంతాల్లో డంప్ చేసుకుంటున్నారు. అవకాశం చూసి చైన్నె, బెంగళూరులకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వారిలో టీడీపీ నేత ఇటీవల ఉదయగిరి ప్రాంతంలో పట్టుబడిన ఎర్రచందనం డంప్ విషయంలో అధికారులు ఆరా తీశారు. దీంతో వీటి వెనుకున్న వారు వెలుగులోకి రావడం, అరెస్ట్ చేయడం తెలిసిందే. మంత్రి ఆనం ప్రధాన అనుచరుడు, సోమశిల ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ వేలూరు కేశవ చౌదరికి కుడిభుజంగా వ్యవహరించే ఆయన గ్రామానికే చెందిన తాళ్లూరు తిరుపతి నాయుడు పట్టుబడిన ఆరుగురిలో ఒకడు. ఎర్రచందనంను దూర ప్రాంతాలకు తరలించి రూ.లక్షలు వెనుకేసుకుంటున్నాడు. వీరికి మంత్రి అండదండలు ఉన్నాయని, వారికేమవుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. గత నెలలో సంక్రాంతి పండగ సమయంలో నాగులవెలటూరు శివారు పొలాల్లో అధికారుల సమక్షంలోనే పెద్దఎత్తున కోడి పందేలు నిర్వహించడం, భారీగా నగదు చేతులు మారిన విషయం మరువక ముందే ఎర్రచందనం అక్రమ రవాణా బయటపడింది. వెలుగులోకి ఇలా.. ఉదయగిరి నియోజకవర్గం ఆర్లపడియ, భైరవానికొండ తదితర ప్రాంతాల్లో గొర్రెలకాపరులు ఎక్కువగా ఉంటారు. కొద్దిరోజులుగా గొర్రెలు చోరీకి గురవుతుండడంతో కొందరు యజమానులు ఆర్లపడియ గ్రామ సమీపంలో రాత్రి వేళల్లో కాపలా ఉన్నారు. అదే సమయంలో రెండు వ్యాన్లలో కొందరు ఆ మార్గంలో అడవిలోకి ప్రవేశించిన విషయాన్ని గమనించిన యజమానులు వారు గొర్రెలు దొంగతనం చేసేందుకు వచ్చారనే అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే రాత్రి పోలీసులు భైరవానికొండ సమీపంలోని కాశీనాయన ఆశ్రమం వద్ద దాడులు నిర్వహించి 30 ఎర్రచందనం దుంగలు వ్యాన్లలోకి లోడ్ చేస్తున్న విషయాన్ని గమనించారు. పోలీసులను చూసిన స్మగ్లర్లు, టీడీపీ నాయకులు పరారయ్యారు. వారిలోని ఓ వ్యక్తి ఫోన్ అక్కడ దొరికింది. దాని ఆధారంగా ఈ అక్రమ రవాణాకు పాల్పడే వారి వివరాలను పోలీసులు తెలుసుకున్నారు. ఫోన్ యజమాని ద్వారానే మిగిలిన వారికి కాల్ చేయించి నెల్లూరు సమీపంలోని నరసింహకొండ వద్దకు వారందరూ వచ్చేలా చేసి అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఉదయగిరి, బుచ్చి, నెల్లూరు, చేజర్ల మండలాలకు చెందిన ఆరుగురు పట్టుబడ్డారు. ముఖ్యమైన వ్యక్తి తాళ్లూరు తిరుపతి. దీంతో ఎర్రచందనం అక్రమ రవాణా వెలుగులోకి వచ్చి టీడీపీ నాయకుల పాత్ర తెలిసింది. తిరుపతి గతంలో గుంటూరులో క్వారీలు నిర్వహించి పూర్తిగా నష్టపోయాడు. కుటుంబం బెంగళూరులో ఉంటోంది. అతను గ్రామంలో టీడీపీ నాయకుడికి అనుచరునిగా కొనసాగుతున్నాడు. ఆరు నెలలుగా ఎర్రచందనం అక్రమ రవాణాలో ప్రముఖపాత్ర పోషిస్తున్నట్లు గ్రామంలో ప్రచారం జరుగుతోంది. ఎంత దాటించారో.. పట్టుబడిన 30 దుంగల ఎర్రచందనం విలువ బహిరంగ మార్కెట్లో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు ఉంటుందని అటవీ శాఖ అధికారులే చెప్పడం గమనార్హం. ఇలా పట్టుబడకుండా మరెంత ఎర్రచందనం రాష్ట్రాలు దాటించి ఉంటారనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. -
బిషప్లుగా పట్టాభిషేకం
నెల్లూరు(బృందావనం): నెల్లూ రు మూలాపేట బట్వాడిపాళెం సెంటర్లో ఉన్న ది సెకండ్ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో సెంటర్ ఫర్ ఎపిస్కోపల్ ఫెలో షిప్ ఇన్ ఇండియా (సెఫీ) – డయోసిస్ ఆధ్వర్యంలో బుధవారం ‘బిషప్ల పట్టాభిషేకం’ ఘనంగా జరిగింది. సెఫీ – డయాసిస్ అధ్యక్షుడు బిషప్ పాల్సుందర్ శేఖరన్ ఆధ్వర్యంలో రెవరెండ్ ఎస్.ప్రేమ్కుమార్ (కొవ్వూరు), వి.ఆశామీనన్ (అల్లూరు), ఎస్.ప్రకాష్ (చైన్నె)ను బిషప్లుగా పట్టాభిషేకం నిర్వహించారు. సర్టిఫికెట్లను అందజేసి వారి బాధ్యతలను పాల్సుందర్ శేఖరన్ వివరించారు. రెవరెండ్ రాజశేఖర్ దాసరి ప్రార్థనతో కార్యక్రమం మొదలైంది. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 17 మంది దైవజనులకు రెవరెండ్గా అభిషేకం చేసి వివాహ లైసెన్స్లు మంజూరు చేశారు. సంప్రదాయంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ‘సెఫీ – డయోసిస్’ బిషప్లు స్టీఫెన్, శ్యాంసన్, ప్రేమ్కుమార్, శ్రీనివాసరావు, జయశీలన్, నెల్లూరు ఇన్చార్జి జె ర్మియా తదితరులు పాల్గొన్నారు. తొలుత బిషప్లుగా బాధ్యతలు స్వీకరించిన ప్రేమ్కుమార్, ఆశామీనన్, ప్రకాష్ల వ్యక్తిత్వ సాక్ష్యాలు, సంఘీయులుగా వారందించిన సేవలను దైవజ్ఞనులు వివరించారు. కార్యక్రమంలో ది సెకండ్ తెలుగు బాప్టిస్ట్ చర్చి చైర్మన్ ఉరందూరు సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
రైతుల బాధలు వర్ణనాతీతం
● ధాన్యం ధరలపై ఇప్పట్నుంచే ఆందోళన ● యూరియా లభ్యం కాక ఇబ్బందులు ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పొదలకూరు: టీడీపీ ప్రభుత్వంలో రైతుల బాధలు వర్ణనాతీతంగా మారాయని, ధాన్యానికి మద్దతు ధరలు లభిస్తాయో లేదోననే ఆందోళనలో అన్నదాతలున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మొగళ్లూరు, మనుబోలు మండలంలోని కట్టువపల్లి, మడమనూరు, గొట్లపాళెం గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. యూరియా లభ్యం కావడం లేదని, పంటలకు కనీస మద్దతు ధర కల్పించేందుకు అండగా నిలవాలని రైతులు కోరారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. టీడీపీ నేతలు తమ ఇళ్లకు యూరియాను తరలించడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ఇరిగేషన్ పనులను నిర్వహించకుండానే.. దొంగ బిల్లులను సోమిరెడ్డి చేయించుకుంటే ఆయన అనుచరులు యూరియాను బ్లాక్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. పంటలకు మద్దతు ధరలను అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను మొక్కుబడిగా తెరిచి రైతుల నుంచి పంటలను కొనుగోలు చేయకపోతే ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. కనీస మద్దతు ధర కోసం రైతుల పక్షాన తమ పార్టీ పోరాటం చేయనుందని ప్రకటించారు. కొత్త పింఛన్లు మంజూరు కాక అవస్థలు కొత్త పింఛన్లు మంజూరు కాక వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. అధికారులపై సోమిరెడ్డి మండిపడుతూ.. ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, సైడ్ డ్రెయిన్లను సంపూర్ణంగా నిర్మించామని, అయితే ప్రస్తుత సర్కార్ అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని విస్మరించిందని మండిపడ్డారు. జగన్మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని రైతులు కాంక్షిస్తున్నారని చెప్పారు. మొగళ్లూరులో యనమల రమణారెడ్డి భౌతికకాయానికి నివాళుర్పించారు. మనుబోలు మండలంలో సన్నారెడ్డి జానకిరామిరెడ్డి, పసల శంకరయ్య, పద్మావతి, వెంకటేశ్వర్లును పరామర్శించారు. పార్టీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, కోనం చినబ్రహ్మయ్య, రెడ్డిచర్ల అంకిరెడ్డి, యనమల శ్రీనివాసులురెడ్డి, ఆకుల గంగిరెడ్డి, కసిరెడ్డి ధనుంజయరెడ్డి, గుండాల ఆదినారాయణ, సురేష్, రామచంద్రారెడ్డి, జనార్దన్రెడ్డి, బొమ్మిరెడ్డి హరిగోపాల్రెడ్డి, ముంగర రవీంద్రరెడ్డి, దాసరి భాస్కర్గౌడ్, ఈగా సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎనర్జీ అసిస్టెంట్లకు షాక్
ఉద్యోగోన్నతులు వెనక్కి.. వేతనాన్ని కోసి నెల్లూరు (వీఆర్సీసెంటర్): కటింగ్ ప్లయర్.. టెస్టర్ను పట్టుకొని విద్యుత్ పునరుద్ధరణ పనులు చేయాల్సిన జేఎల్ఎం గ్రేడ్ – 2 ఎనర్జీ అసిస్టెంట్లపై ప్రభుత్వం పెనుభారాన్ని మోపుతోంది. వార్డు వలంటీర్లు చేయాల్సిన ఇంటింటి సర్వేకు వీరిని వినియోగిస్తోంది. ఫలితంగా వందలాది మంది ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. నాడు సజావుగా.. జిల్లాలో 570 మంది జేఎల్ఎం గ్రేడ్ – 2 ఎనర్జీ అసిస్టెంట్లను గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నియమించారు. వీరు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ.. పగలు, రాత్రనే తేడా లేకుండా విద్యుత్ సంబంధిత పనులు చేసేవారు. అధికారికంగా ఎలాంటి సెలవుల్లేకుండా విద్యుత్ సంస్థలో వీరు పనిచేస్తున్నారు. విద్యుత్ స్తంభాలెక్కడం.. లైన్ల పునరుద్ధరణ పనుల్లో ప్రమాదాలకు కొందరు గురికాగా, మరికొందరు ప్రాణాలను సైతం కోల్పోయారు. ఈ తరుణంలో 2022లో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి వీరందర్నీ క్రమబద్ధీకరించి జీవితాల్లో వెలుగులు నింపారు. సకాలంలో కాని పునరుద్ధరణ పనులు సర్వేలకు వీరిని పురమాయించడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడిన సమయాల్లో పునరుద్ధరణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫలితంగా వినియోగదారులకు ఇబ్బంది తప్పడంలేదు. వీరికి ఇతర పనులను అప్పజెప్పకుండా విద్యుత్ అవసరాల నిమిత్తం వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీతంలో కోత.. పని రెట్టింపు విద్యుత్ సైనికులను సర్వే కూలీలుగా మార్చిన వైనం టెస్టర్, కటింగ్ ప్లయర్లను వదిలి ఇల్లిల్లూ తిరుగుతూ.. జేఎల్ఎం గ్రేడ్ – 2లకు ప్రభుత్వమిచ్చిన గిఫ్ట్ గతేడాది డిసెంబర్లో వీరికి ఉద్యోగోన్నతులను కల్పించి.. వేతనాలను పెంచుతున్నామంటూ టీడీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. అయితే నెల గడవకముందే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని.. వేతనాల్లో కోత విధించింది. మరోవైపు జేఎల్ఎం గ్రేడ్ – 2 ఎనర్జీ అసిస్టెంట్లకు సంబంధం లేని ఇంటింటి సర్వే పనులను ఈ నెల నుంచి అప్పగించారు. వారు విధులు నిర్వర్తించే ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబసభ్యుల వివరాలను నమోదు చేసే పనులను అప్పజెప్పారు. ఓవైపు సర్వే.. మరోవైపు విద్యుత్ పునరుద్ధరణ పనులు చేయలేక వీరు సతమతమవుతున్నారు. -
గంజాయికి అడ్డాగా ఏపీ
● ప్రభుత్వంపై ధ్వజమెత్తిన ప్రసన్నకుమార్రెడ్డి ● గుమ్మళ్లదిబ్బలో బాలిక కుటుంబానికి పరామర్శ కోవూరు: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, గంజాయికి అడ్డాగా మారిపోయిందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని గుమ్మళ్లదిబ్బ కొత్త కాలనీలో గంజాయి ముఠా చేతుల్లో అఘాయిత్యానికి గురై, చైన్నెలో చికిత్స పొందుతూ బాలిక మరణించడంతో వారి కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించారు. ఓదార్చి, పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కోవూరు నియోజకవర్గంలో గంజాయి ముఠాల ఆగడాలు మితిమీరిపోయాయని ఆరోపించారు. బాలికపై ఇంతటి అఘాయిత్యం జరిగినా, ప్రభుత్వ స్పందన దారుణమని, మెరుగైన వైద్యాన్ని అందించడంలో పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. సరైన వైద్యం అందకపోవడంతోనే బాలిక మృతి చెందిందంటూ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విచారణను పక్కదారి పట్టించొద్దు పోలీస్ యంత్రాంగం తీరుపై ప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు విచారణను నీరుగార్చేందుకు యత్నించొద్దని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విచారణను పక్కదారి పట్టించేందుకు యత్నిస్తే తమ పార్టీ ఊరుకోబోదని స్పష్టం చేశారు. సీబీఐ విచారణను నిర్వహించాలని, లేని పక్షంలో తమ పార్టీ అధికారంలోకి వచ్చాక తాము జరిపిస్తామని వెల్లడించారు. ఘటనకు బాధ్యులైన ప్రతి ఒక్కర్నీ కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, రైతు విభాగ జిల్లా అధ్యక్షుడు శివుని నరసింహులురెడ్డి, జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి మల్లికార్జునరెడ్డి, కన్వీనర్ అత్తిపల్లి అనూప్రెడ్డి, దినేష్రెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, గొల్లపల్లి విజయకుమార్, గంగవరం సర్పంచ్ లక్ష్మీకుమారి, మందా రవి, చిరంజీవి, జనార్దన్, కోవూరు మాజీ సర్పంచ్ కూట్ల ఉమా, కిశోర్, గయాజ్, ప్రసాద్, అనీష్ తదితరులు పాల్గొన్నారు. -
అప్పుడు అక్రమం.. ఇప్పుడు సక్రమం
ప్రభుత్వ భూములపై నిగ్గు తేల్చాలంటున్న వైఎస్సార్సీపీగతంలో ప్రభుత్వ భూములు దురాక్రమణ చేశారంటూ తెగ ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రస్తుతం మౌనం దాల్చడం వెనుక ఏం జరిగిందని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. అధికారులతో సర్వే చేయించారు కదా? వెంటనే ఆయా భూములను స్వాధీనం చేసుకుని మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అలా జరగలేదంటే మీ మధ్య జరిగిన డీల్ను బయట పెట్టాలంటూ సవాల్ విసురుతున్నారు. కావలిలో ‘రియల్’ ‘రాజీ’కీయం ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మార్చుకుంది. అధికారంలోకి రాగానే వెంచర్లన్నీ ఆక్రమణలంటూ సర్వే నంబర్లతో సహా లీకులిచ్చి.. దూకుడు పెంచారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో సర్వేలు చేయించి 128 ఎకరాల ప్రభుత్వ భూములు దురాక్రమణ అయ్యాయంటూ గగ్గోలు పెట్టిన పచ్చ ప్రజాప్రతినిధులు యంత్రాలు దింపి రాళ్లు పీకించారు. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటామంటూ రచ్చ చేసి, ఆక్రమణలపై ఒప్పందాలతో ‘సర్దుబాటు’ చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యజమానులు పచ్చ కండువాలు కప్పుకునే ‘డీల్’ కుదరడంతో ‘రాజీ రాజకీయం’తో తెరపడింది.నా వాటా ఇస్తే సరే..మీతో డీల్ ఓకే సార్ఎంతసాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ దురాక్రమణలకు క్యాష్, కండువా డీల్స్ కుదిరియా?. గత ప్రభుత్వ హయాంలో సర్కారు భూములు దురాక్రమణ చేసి లేఅవుట్లు వేసి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలతో తెగ హడావుడి చేసిన అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రస్తుతం మౌనం ఇందుకు అద్దం పడుతోంది. గత ప్రభుత్వ హయాంలో కావలి తూర్పు తీరంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, మరో వైపు రామాయపట్నం పోర్టు, వీటికి అనుబంధంగా పారిశ్రామిక వాడలకు భూసేకరణ జరగడంతో ఒక్కసారిగా రియల్ బూమ్.. ఊపందుకుంది. మొదట హడావుడి.. డీల్ కుదరడంతో గప్చుప్ ఆ సమయంలో రియల్ వెంచర్ల వ్యాపారం ఊపందుకోవడంతో కొందరు నేతలతోపాటు ఆ రంగంలో ఎంతో కాలంగా ఉన్న వెంచర్ల యజమానులు కూడా కావలి చుట్టూ రియల్ వెంచర్లు ఏర్పాటు చేశారు. కొందరు పట్టా భూములతోపాటు ఖాళీగా కాలువ, ప్రభుత్వ పొరంబోకు భూములను కలిపేసుకుని ప్లాట్లు వేసి విక్రయాలు చేశారంటూ అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. ఇందులో ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ప్రప్రథమంగా ఉన్నారు. ఈ క్రమంలో కావలి నుంచి ఎమ్మెల్యేగా దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఎన్నిక కావడంతో ఆక్రమణలు అక్రమాలంటూ తెగ హ డావుడి చేశారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సర్వేలు చేయించారు. దాదాపు 128 ఎకరాల ప్రభుత్వ భూములన్నాయని నిగ్గు తేలాయని మీడియా ముందు తేల్చేశారు. కానీ ఇంత వరకు ఏ వెంచర్లో ఎంతనేది.. ఆ నివేదిక మాత్రం బయట పెట్టలేదు. ఎమ్మెల్యే మరో అడుగు ముందుకేసి రెవెన్యూ అధికారులతో వెంచర్లలో బోర్డులు పెట్టించారు. మున్సిపల్ అధికారులతో పత్రికల్లో హెచ్చరిక నోటీసులు జారీ చేయించారు. వెంచర్లలో యంత్రాలు పెట్టి హద్దు రాళ్లను పీకించేశారు. దీంతో ఆయా వెంచర్లల్లో పాట్లు కొనుగోలు చేసిన ప్రజలు ఆందోళన చెందారు. అక్కడ సీన్ కట్ చేస్తే.. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర దాటినా కూడా సర్వే చేసిన నివేదిక బయటకు రాలేదు. ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోలేదు. రిజిస్ట్రేషన్లు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు మార్పు చేసి ఎంచక్కా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ప్లాట్లు మాత్రం చేతులు మారుతున్నాయి. కావలి నియోజకర్గంలో దాదాపు 130కు పైగా ఉన్న వెంచర్లలో కేవలం 5 వెంచర్లకు మాత్రమే నుడా అనుమతులున్నాయి. మిగిలినవి మాత్రం అప్రూవల్ లే అవుట్ ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. విభేదించిన బీద.. మౌనమేలా.. గతంలో కావలిలో స్థానిక ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి వన్ మ్యాన్ షోగా నడిచింది. అధికార మార్పుతోనే ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. వెంచర్లపై పడి తెగ ఆవేశ పడ్డాడు. అప్పట్లో ఆయన దూకుడు చూసి ప్రస్తుత ఎమ్మెల్సీ సైతం లోలోన రగిలిపోయారు. వెంచర్ల వ్యవహారంలో భారీగా చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే పవర్ తగ్గడంతో బీద పెత్తనంలోనూ రియల్ డీల్స్పై మౌనం దాల్చడం వెనుక అంత్యర్యం ఏమిటాని సర్వత్రా ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో భారీగా లేఅవుట్ల ఏర్పాటు కూటమి అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ మద్దతుదారులపై కన్నెర్ర ప్రభుత్వ భూముల్లో వేశారంటూ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల హడావుడి 128 ఎకరాలను ఆక్రమించారంటూ ఆరోపణలు రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో పత్రికల్లో ప్రకటనలు ఆ వెంటనే యంత్రాలు పెట్టి పలు వెంచర్ల ధ్వంసం ఆక్రమణలపై ఆగ్రహం.. పచ్చ కండువాతో శాంతం యజమానులతో డీల్ కుదరడంతో మౌనం కావలి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రియల్ వెంచర్లలో ప్రభుత్వ భూములు కలిపేసుకున్నారంటూ సర్వే నంబర్లతో సహా లీకులు ఇచ్చారు. కావలి బిట్–1లో సర్వే నంబరు 1834లో 5 ఎకరాలు, 487లో 2.67 ఎకరాలు, 551లో 2 ఎకరాలు, 832లో 2.61 ఎకరాలు, 546లో 4.02, 354లో 10.70 ఎకరాల చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని, బిట్–2లో 1855లో 15 ఎకరాలు, 1834లో 0.29, 1310లో 5.50, 1562లో 1.88, 1846లో 7.97, 1593లో 0.87 ఎకరాలు, 302లో 8.64 ఎకరాలు, కంచి రామగుంట, పులారుగుంటలో శ్మశాన స్థలం, కొనదిన్నె కాలనీలో 1.10 ఎకరాలు, అక్కిలగుంట పొరంబోకు భూములు ఆక్రమణలకు గురైనట్లు లీకులిచ్చేశారు. మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓలతో భూములు ఆక్రమణలు జరిగిందని ప్రకటనలు చేయించారు. -
పరిహార చెల్లింపులో దాగుడుమూతలు
● క్రిస్ సిటీ నిర్వాసితుల ఆవేదన చిల్లకూరు: తీర ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న క్రిస్ సిటీ కోసం భూములను సేకరించి రెండేళ్లవుతున్నా, పరిహారం చెల్లించకుండానే అక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నారని భూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఎదుట నిరసనను బుధవారం చేపట్టిన అనంతరం ఏఓ శిరీషకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పరిహారమై ప్రశ్నిస్తే, ప్రభుత్వం ద్వారా అందజేస్తామంటున్నారని చెప్పారు. చిల్లకూరు, కోట మండలాల తీర ప్రాంతంలోని తమ్మినపట్నం, కొత్తపట్నం రెవెన్యూ పరిధిలో సుమారు 986 ఎకరాలను సేకరించారని, ఆ సమయంలో తిరుపతి కలెక్టర్ ద్వారా ఎకరాకు రూ.ఎనిమిది లక్షల చొప్పున పరిహారాన్ని అందించేలా చూస్తామన్నారన్నారు. ఏపీఐఐసీ ద్వారా క్రిస్ సిటీ భూముల్లో అభివృద్ధి పనులను దక్కించుకున్న ప్రైవేట్ సంస్థ యాజమాన్యం.. భూములను చదును చేసి రోడ్ల నిర్మాణాన్ని చేపట్టిందని చెప్పారు. పలుమార్లు నిరసన చేపట్టగా, 40 శాతం మంది రైతులకు పరిహారాన్ని అందించి మిగిలిన వారికి ఇవ్వకుండా కాలం గడుపుతున్నారని ఆరోపించారు. తిరుపతి జిల్లా నుంచి రెండు మండలాలు నెల్లూరు జిల్లాలో విలీనం కావడంతో పరిహార విషయమై పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్ సిటీ పనులను పరిశీలించిన కలెక్టర్కు సైతం ఈ విషయాన్ని తెలియజేశామని వివరించారు. కలెక్టర్ చొరవ చూపాలని కోరారు. సతీష్యాదవ్, ఏడుకొండలు, శంకరయ్య, సుబ్రహ్మణ్యం, రంగయ్య, కోటయ్య పాల్గొన్నారు. -
డీఈఐఈడీ ఫీజును 17లోపు చెల్లించాలి
నెల్లూరు (టౌన్): డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కు సంబంధించి 2025 – 27 విద్యా సంవత్సరానికి చెందిన రెగ్యులర్ విద్యార్థులు.. 2023 – 25, 2024 – 26లో ఒకసారి ఫెయిలైన వారు పరీక్ష ఫీజును ఈ నెల 17లోపు చెల్లించాలని డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో కోరారు. రూ.50 అపరాధ రుసుముతో 24 వరకు అవకాశం ఉందన్నారు. రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.150, మూడు సబ్జెక్టులకు రూ.140, రెండింటికి రూ.120, ఒక దానికి రూ.వంద చెల్లించాలని తెలిపారు. డీఈఐఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలను త్వరలో నిర్వహించనున్నామని వెల్లడించారు. కావలిలో జాబ్ మేళా రేపు నెల్లూరు(పొగతోట): కావలిలోని ఎమ్మెస్సార్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళాను ఏపీఎస్సెస్డీసీ, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, సీడాప్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు నిర్వహించనున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి అబ్దుల్ ఖయ్యూం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 14 ప్రముఖ కంపెనీలు హాజరుకానున్నాయని చెప్పారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా చదివిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు 72868 22789, 99888 53335 నంబర్లను సంప్రదించాలని సూచించారు. 18 నుంచి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు నెల్లూరు (టౌన్): డ్రాయింగ్, హ్యాండ్లూమ్ వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ విభాగాల్లో లోయర్, హయ్యర్ గ్రేడ్లకు సంబంధించిన టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలను ఈ నెల 18 నుంచి 21 వరకు నిర్వహించనున్నామని డీఈఓ బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హాల్ టికెట్లను www. bse.ap.gov.inలో అందుబాటులో ఉంచామని చెప్పారు. హాల్ టికెట్తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఫొటో గుర్తింపు కార్డును తప్పక తీసుకురావాలని కోరారు. నెల్లూరు చేరిన సైక్లథాన్ నెల్లూరు(క్రైమ్): తీర ప్రాంత భద్రత.. యువత మత్తు బారిన పడకుండా.. వారిలో చైతన్యం కల్పించేందుకు సీఐఎస్ఎఫ్ చేపట్టిన వందేమాతరం కోస్టల్ సైక్లథాన్ నెల్లూరుకు బుధవారం చేరుకుంది. వీరికి పోలీస్ అధికారులు, సిబ్బంది, ఎన్సీసీ క్యాడెట్లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఐఎస్ఎఫ్ సీనియర్ కమాండెంట్ సంజీత్కుమార్ మాట్లాడారు. వందేమాతరాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మాతృభూమి రక్షణ, దేశం కోసం త్యాగాలు చేయాల్సిన అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కోస్టల్ సైక్లథాన్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. కోల్కతాలో జనవరి 28న ప్రారంభమైన యాత్ర కేరళలోని కొచ్చిలో ఈ నెల 23న ముగియనుందని వెల్లడించారు. నగర ఏఎస్పీ దీక్ష, ఏఆర్ డీఎస్పీ చంద్రమోహన్, ఇండియన్ కోస్టల్ గార్డ్ కృష్ణపట్నం పోర్టు కమాండెంట్ కార్తీక్, మారుతి నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ షామిలీ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 15 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 73,983 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 21,900 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.23 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్స్
నెల్లూరు (టౌన్): ఇంటర్ ప్రాక్టికల్స్ మంగళవారంతో ముగిశాయి. ఉదయం నిర్వహించిన ప్రాక్టికల్స్లో 493 మందికి గానూ 485 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలో 463 మందికి గానూ 21 మంది గైర్హాజరయ్యారు. ఆర్ఐఓ వరప్రసాదరావు, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు, స్క్వాడ్ అధికారులు తనిఖీలను నిర్వహించారు. గోవులకు తక్షణమే టీఎమ్మార్ను అందించాలి దుత్తలూరు: మండలంలోని నర్రవాడ వెంగమాంబ దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో గోవులు బక్క చిక్కి ఉన్నాయని, వీటికి వెంటనే టీఎమ్మార్ దాణామృతాన్ని అందజేయాలని నర్రవాడ ఇన్చార్జి పశు వైద్యాధికారి మధు పేర్కొన్నారు. ఆవుల దుస్థితిపై ‘అయ్యో గోమాత’ అనే శీర్షికన సాక్షిలో సోమవారం కథనం ప్రచురితమైన తరుణంలో ఆలయ ఇన్చార్జి ఈఓ శ్రీనివాసరెడ్డితో కలిసి గోశాలను మంగళవారం పరిశీలించారు. గోవుల ఆరో గ్యం మెరుగుపడే అంశమై పలు సూచనలు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఒక్కో గోవుకు రోజూ ఐదు కిలోల చొప్పున దాణామృతాన్ని అందజేయాలని కోరారు. ఎలాంటి అనారోగ్యమొచ్చినా వెంటనే చికిత్స చేయనున్నామని వివరించారు. ఆల్బెండాజోల్ మాత్రలను తప్పక ఇవ్వాలి నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో 19 ఏళ్లలోపు వారికి నులిపురుగుల నివారణ మాత్రలను తప్పక అందించాలని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు ఆదేశించారు. జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని ఈ నెల 17న పురస్కరించుకొని ఆల్బెండాజోల్ మాత్రల పంపిణీపై కలెక్టరేట్లోని తన చాంబర్లో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో వీటిని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వ ర్యంలో అందజేసేలా ఏర్పాట్లు చేశామని చెప్పా రు. ఈ నెల 17న వేసుకోలేకపోయిన వారికి 24న అందజేయనున్నామని పేర్కొన్నారు. డీఎంహెచ్ఓ సుజాత, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి ఉమామహేశ్వరి, ప్రోగ్రామ్ ఆఫీసర్ యశ్వంత్, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, ఆర్ఐఓ వరప్రసాదరావు, ప్రోగ్రామ్ మేనేజర్ జమీల్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం మోస్తరుగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 21 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 74,130 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 24,631 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.03 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
రాష్ట్రంలో మహిళలకు రక్షణేదీ..?
నెల్లూరు రూరల్: టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంగళవారం ఆమె మాట్లాడారు. గంజాయి బ్యాచ్ దాష్టీకానికి బాలిక మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆడపిల్లలను ఒంటరిగా బయటకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. జగనన్న హయాంలో దిశ చట్టం ద్వారా మహిళలకు రక్షణ కల్పించిన అంశాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం ఎక్కువై.. యువత పెడదారి పడుతోందని తెలిపారు. రాష్ట్రంలో మహిళలపై నిత్యం ఏదో ఒక చోట అఘాయిత్యాలు, దాడులు జరుగుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. పోలీసులు, ప్రభుత్వ వైఫల్యంతోనే బాలిక మరణించిందని మండిపడ్డారు. నెల్లూరులోని ఏదైనా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి, మంచి వైద్యాన్ని అందించి ఉంటే బాలిక బతికేదన్నారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కాకాణి గోవర్ధన్రెడ్డిపై కేసు పెట్టడాన్ని చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామాననే అనుమానం తలెత్తుతోందని చెప్పారు. గంజాయి బ్యాచ్లను కూటమి నేతలే పెంచి పోషిస్తూ తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. బాధ్యులను శిక్షించి, కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలా కాని పక్షంలో తమ పార్టీ తరఫున పోరాటం చేయనున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర మహిళా జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి, జిల్లా మహిళాధ్యక్షురాలు లక్ష్మీసునంద తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న కాకాణి పూజిత -
కల్తీ పాపం చంద్రబాబుదే..
ప్రభుత్వ వైఫల్యమే.. ● కోట్లాది మంది వెంకటేశ్వరస్వామి భక్తులకు క్షమాపణలు చెప్పాలి ● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు రూరల్: కల్తీ పాపం చంద్రబాబుదేనని, తిరుమల లడ్డూ విషయమై కూటమి నేతలు చేసిన ఆరోపణలన్నీ అబద్ధమని సిట్, సీబీఐతో కూడిన దర్యాప్తులో తేటతెల్లమైందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. లడ్డూ ప్రసాద అంశంలో కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అందులో జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు దుర్మార్గంగా మాట్లాడారని ఆరోపించారు. 2019, మార్చి 6న బోలే బాబా డెయిరీకి అనుమతిచ్చింది టీడీపీ నేతలేనని, అప్పట్లో ప్రభుత్వం సైతం వారిదని గుర్తుచేశారు. టెక్నికల్గా క్వాలిఫై అయిందనే తీర్మానాన్ని ఆమోదించింది చంద్రబాబు కాదానని నిలదీశారు. అదే రోజు సదరు డెయిరీకి 82 వేల కిలోల నెయ్యి ఆర్డర్ ఇచ్చిందీ వారేనన్నారు. అదే ఏడాది ఏప్రిల్ 19న టిన్నుల రూపంలో 12,300 కిలోలను సరఫరా చేయాలని చెప్పింది మీరు కాదానని చంద్రబాబును ప్రశ్నించారు. ఈ అంశమై సమాధానం చెప్పాల్సిన ఆయన అలా చేయకుండా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందంటూ దుర్మార్గమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. తమ హయాంలో నిబంధనలతో కఠినంగా వ్యవహరించామే తప్ప ఎక్కడా పొరపాట్లు జరగనివ్వలేదని తెలిపారు. అసత్యాలు, ఆరోపణలు వారికే చుట్టుకున్నాయని తెలిపారు. కూటమి నేతలు బేషరతుగా క్షమాపణలు చెప్పి, లెంపలేసుకోవాలని డిమాండ్ చేశారు. వీటిని కప్పిపుచ్చుకునేందుకు దాడులు చేస్తూ.. అక్రమ కేసులను బనాయిస్తూ జైళ్లకు పంపుతున్నారని ఆరోపించారు. గుమ్మళ్లదిబ్బలో బాలిక మృతి విషయంలో ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని కాకాణి ధ్వజమెత్తారు. నెల్లూరులో ప్రైవేట్ హాస్పిటళ్లుండగా, చైన్నెకి ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఇక్కడ వైద్యమందించి ఉంటే బాలిక బతికుండేదని వారి తల్లిదండ్రులే ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి వినియోగం ఎక్కువైందని, పల్లెల్లోకీ పాకి యువత పెడదారి పట్టి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన నెల్లోపే గంజాయిని నిర్మూలిస్తానంటూ చంద్రబాబు ప్రగల్భాలు పలికారని, ఇప్పుడు వాటిపై ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు తాను వెళ్తే అక్రమ కేసు పెట్టారన్నారు. పాలకులకో న్యాయం.. తమకో న్యాయమానని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, పాలకుల అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలపై ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. -
దారుణంగా రహదారులు
మర్లపూడి వద్ద ఇలా.. దెబ్బతిన్న రహదారి సైదాపురం: మండలంలో పలు రహదారులు దారుణంగా మారాయి. ఆర్అండ్బీ అధికారులున్నారా.. లేదా అనేది ప్రశ్నగానే మిగిలింది. గుంతల్లో తట్ట మట్టి పోసేసి అధికారులు మొహం చాటేస్తుండటంతో ఆ రహదారులపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. మండలంలోని మర్లపూడి – కోమటిగుంట రాజుపాళెం వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. సుమారు 5 కిలోమీటర్లు ఉన్న రహదారిపై ప్రయాణం గంటకు పైగా పడుతుంది. మర్లపూడి వద్ద రోడ్డు అధ్వానంగా ఉండటంతో వాహనదారులు కష్టాలు పడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. -
రోడ్డు బాగోలేదు.. మా బాధలు చూడండి
● విద్యార్థుల వినతి చిల్లకూరు: గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. మండలంలోని అన్నంబాక గ్రామానికి సరైన రోడ్డు బాగోలేదు. గత ప్రభుత్వంలో రోడ్డు వసతి కల్పించేలా ఏర్పాట్లు చేసినా అటవీ ఆంక్షలు ఉండటంతో నిర్మాణం పూర్తి కాలేదు. అత్యవసర వేళల్లో అంబులెన్స్ వచ్చేందుకు కూడా ఇబ్బందిగా మారింది. ఇక్కడి విద్యార్థులు ఐదు కిలోమీటర్ల దూరంలోని తిక్కవరం, కోట మండలంలోని చిట్టేడులో ఉన్న పాఠశాలల్లో చదువుకుంటున్నారు. రోజూ కుటుంబ సభ్యులు బైక్లపై తీసుకెళ్తుంటారు. వారికి ఏదైనా ఉంటే ఆరోజు విద్యార్థులు కష్టపడాల్సిందే. ఊర్లోకి ఆటోలు అంతంతమాత్రంగానే వస్తుంటాయి. దీంతో దారుణంగా ఉన్న రోడ్డుపై నడిచి వెళ్లి చదువుకుంటున్నారు. రహదారి బాగుంటే తమకు ఇంత కష్టం ఉండేది కాదని అధికారులు, పాలకులు దృష్టి సారించాలని కోరుతున్నారు. -
గిరిజనులపై కూటమి చిన్నచూపు
● కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు నెల్లూరు(దర్గామిట్ట): రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులపై చిన్నచూపు చూస్తోందని పలువురు నాయకులు మండిపడ్డారు. నెల్లూరు కలెక్టరేట్ వద్ద గిరిజన సంఘాల ఐక్యవేదిక చేపట్టిన రిలే నిరాహారదీక్షలకు రాష్ట్ర స్థాయి నేతలు మంగళవారం హాజరై మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ గత ఎన్నికల్లో గిరిజనులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. ప్రత్యేక కార్పొరేషన్ ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. మాజీ మేయర్ పొట్లూరి స్రవంతికి జరిగిన అన్యాయాన్ని సహించేది లేదన్నారు. దీనిపై త్వరలో రాష్ట్ర స్థాయి ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. అవసరమైతే ఢిల్లీలో పెద్దలను కలిసి అన్యాయాన్ని వివరిస్తామన్నారు. బడుగు, బలహీనవర్గాలపై నిరంకుశంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. కార్యక్రమంలో యానాదుల యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యందేటి వెంకటసుబ్బయ్య, కోశాధికారి రాపూరి ప్రభావతి, గౌరవాధ్యక్షుడు కేవీ ప్రసాద్, ఇంకా చౌటూరి రమేష్, కొమరగిరి సూరిబాబు, పట్రా సుబ్రహ్మణ్యం, యందేటి సురేంద్ర, కొమరగిరి మరియమ్మ, గంధళ్ల నరేష్, రాపూరి గోపీ, పొట్లూరి అశోక్, అల్లురమ్మ, తిరుపతిరావు, బత్తుల లక్ష్మణశేఖర్, తలపల జై వర్ధన్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి ప్రసాదంపై రాజకీయం దుర్మార్గం
● వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ సమన్వయకర్త విజయకుమార్రెడ్డి నెల్లూరు సిటీ: కూటమి ప్రభుత్వం భగవంతుని ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ నెల్లూరు రూరల్ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి మండిపడ్డారు. రూరల్లోని చింతారెడ్డిపాళెంలో పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అసత్యాన్ని పదేపదే చెప్పి ప్రజలను నమ్మించడంలో చంద్రబాబు దిట్ట అన్నారు. టీటీడీ లడ్డూ తయారీలో అవినీతి, కల్తీ జరిగిందని ప్రజల విశ్వాసాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ఆయనకు తోడుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా మాట్లాడారన్నారు. భూమన కరుణాకర్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిపై నిందలు వేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కోట్లమంది ఆరాధించే వేంకటేశ్వరస్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందని చంద్రబాబు విషప్రచారం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. ఇప్పుడు కెమికల్స్ కలిశాయని మరో తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారన్నారు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకు వత్తాసుగా మాట్లాడటం దుర్మార్గమన్నారు. కాషాయం ధరించి వాస్తవాలు తెలుసుకోకుండా ఇటువంటి మాటలు చెప్పడం దారుణమన్నారు. లడ్డూలో కల్తీ జరగలేదని నిగ్గుతేలిన తర్వాత కూడా హిందూ ధార్మిక సంస్థల అధిపతులు, పీఠాధిపతులు, చంద్రబాబు, పవన్ కళ్యాన్ను క్షమాపణ చెప్పాలని అడగలేరా అని ప్రశ్నించారు. నిజాన్ని ప్రశ్నించిన రోజే గౌరవం లభిస్తుందన్నారు. ప్రవచనకర్తలు కూడా హెచ్చరించాల్సిన అవసరం లేదా అన్నారు. కూటమి ప్రభుత్వాని ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం, ఇళ్లు తగులబెట్టడం చేస్తున్నారన్నారన్నారు. భవిష్యత్లో కూటమి ప్రభుత్వానికి హిందువులు సరైన సమాధానం ఇస్తారన్నారు. భగవంతుని ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, వైఎస్సార్సీపీ రూరల్ మండల అధ్యక్షుడు పుచ్చలపల్లి రామ్ప్రసాద్, కలివెలపాళెం సర్పంచ్ మధుసూదన్రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు చెన్నారెడ్డి ప్రభాకర్రెడ్డి, ఏఐసీఎస్ మాజీ చైర్మన్ పార్లపల్లి వీరరాఘవరెడ్డి, రూరల్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు తోగూరు జాషువా, 12వ డివిజన్ ఇన్చార్జ్ ప్రసాద్, నాయకులు శ్రీనివాసులురెడ్డి, బాలాజీ, అక్కన్న, మదన్మోహన్, రాజా తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల దృష్టి మళ్లించేందుకు విషప్రచారం
● భక్తుల మనోభావాలతో కూటమి చెలగాటం ● ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్చిల్లకూరు: ‘కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు తిరుమల లడ్డూ ప్రసాదంపై విషం చిమ్ముతోంది. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా అసత్య ప్రచారాలు చేస్తోంది’ అని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ అన్నారు. గూడూరు పట్టణంలోని సనత్నగర్లో ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ పెద్దలు పాలనను గాలికొదిలేశారన్నారు. లడ్డూలో కల్తీ జరిగిందని విషప్రచారం చేస్తూ పబ్బం గడుపుకొంటున్నారని విమర్శించారు. ఒక్క భక్తుడైనా ఫిర్యాదు చేశాడా అని ప్రశ్నించారు. సీబీఐ విచారణ చేసి ప్రసాదంలో ఎలాంటి కల్తీ జరగలేదని, అందులో ఎలాంటి కొవ్వు పదార్థాల్లేవని స్పష్టం చేసినా అధికార పార్టీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటాన్ని చూసి ప్రజలు ఈసడించుకుంటున్నారన్నారు. చంద్రబాబు సర్కార్ అభివృద్ధిని పక్కన పెట్టి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం పరిపాటిగా మారిందని మేరిగ దుయ్యబట్టారు. ఇటీవల జరిగిన దాడుల్లో ఇబ్బంది పడిన నాయకుల కుటుంబాల పరామర్శకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రోడ్డు మార్గంలో బయలుదేరితే ప్రజల నుంచి వచ్చిన స్పందనను ప్రభుత్వం ఓర్చుకోలేకపోయిందన్నారు. జగన్ పర్యటించే మార్గాలను మార్చి వేసి భద్రతా సిబ్బందికి కూడా కనీస సమాచారం ఇవ్వకపోవడం చూస్తుంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో తేట తెల్లమవుతోందన్నారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ భక్తుల మనోభావాలతో కూటమి నేతలు చెలగాటం ఆడుతున్నారన్నారు. సమావేశంలో గూడూరు రూరల్, కోట, చిట్టమూరు మండలాల వైఎస్సార్సీపీ కన్వీనర్లు మల్లు విజయకుమార్రెడ్డి, పలగాటి సంపత్కుమార్రెడ్డి, సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఊటుకూరు మహేంద్రరెడ్డి, గూడూరు పట్టణ, కోట మండల మహిళా విభాగం అధ్యక్షులు సుజనారెడ్డి, రేష్మ, నాయకులు రాజీవ్రామిరెడ్డి, సుధాకర్రెడ్డి, రమేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రూ.5.30 లక్షల విలువైన గుట్కాల స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): బిల్లుల్లేకుండా పొగాకు ఉత్పత్తుల విక్రయాలు, నిల్వలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కొద్దిరోజులుగా దాడులు చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి నెల్లూరులోని పలు ట్రాన్స్పోర్టు కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. పప్పులవీధి, స్టోన్హౌస్పేటలోని రెండు ట్రాన్స్పోర్టు కార్యాలయాల్లో రూ.5.30 లక్షలు విలువైన గుట్కాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ కె.నరసింహారావు, డీసీటీఓ కె.విష్ణురావు, ఆఫీస్ సూపరింటెండెంట్ శాంతిభూషణ్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. జింకను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనంకావలి రూరల్: కావలి బుడంగుంట సమీపంలో ప్రధాన రహదారిపై రోడ్డు దాటుతున్న జింకను గుర్తుతెలియని వాహనం మంగళవారం ఢీకొట్టింది. స్థానిక యువకులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. బీట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు ఘటనా స్థలానికి చేరుకుని జింకకు వైద్యం కోసం పశు వైద్యాధికారిని పిలిపించారు. ప్రథమ చికిత్స అనంతరం ఫారెస్ట్ ఆఫీసుకు తరలించారు. పశు వైద్యుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జింక పక్కటెముకలు విరిగినట్లు తెలిపారు. చికిత్స చేశామన్నారు. కండలేరులో 57.360 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 57.360 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగకాలువకు 1,200, లోలెవల్ కాలువకు 200, హైలెవల్ కాలువకు 200, పిన్నేరు కాలువకు 50, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
బాలాజీ మొబైల్స్, ఎలక్ట్రానిక్స్లో లక్కీ డ్రా
నెల్లూరు(బారకాసు): నెల్లూరులోని నర్తకీ సెంటర్లో ఉన్న బాలాజీ మొబైల్స్లో మంగళవారం సంక్రాంతి పండగ లక్కీ డ్రా తీశారు. మొదటి బహుమతిగా స్కూటర్ను నెల్లూరుకు చెందిన సత్యనారాయణ, మరో స్కూటర్ను ముత్తుకూరు మండలం నేలటూరుకు చెందిన నాగేశ్వరరావు గెలుచుకున్నారు. రెండో బహుమతిగా ఎయిర్ కండీషనర్, మూడో బహుమతిగా 43 అంగుళాల రెండు టీవీ, నాలుగో బహుమతిగా వాషింగ్ మెషీన్, ఐదో బహుమతిగా 32 అంగుళాల రెండు టీవీలు, ఆరో బహుమతిగా మూడు రైస్కుక్కర్లను విజేతలు గెలుచుకున్నారు. విజేతలకు సంస్థ డైరెక్టర్ రవి నాయుడు ఫోన్ చేసి సమాచారాన్ని తెలిపారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వినూత్న ఆఫర్లతో మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ పరికరాలను బాలాజీ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ అందిస్తోందని సంస్థ చైర్మన్ వైడీ బాలాజీ చౌదరి, సీఈఓలు సాయినిఖిలేష్, సాయినితీష్ తెలిపారు. రవి నాయుడు మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా తమ సంస్థ జిల్లా ప్రజలకు సేవలందిస్తోందని తెలిపారు. -
ఆస్పత్రులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
● డీఎంహెచ్ఓ సుజాత నెల్లూరు(అర్బన్): జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్లు, ల్యాబ్లు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని డీఎంహెచ్ఓ సుజాత సూచించారు. మంగళవారం నెల్లూరులోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఆస్పత్రులు, ల్యాబ్లు నిర్వహిస్తున్న వారిపై అల్లోపతి మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ 2002 చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ చేయించుకుని ఐదు సంవత్సరాల గడువుతీరే వారు మూడు నెలలు ముందుగానే దరఖాస్తు చేసుకుని రెన్యువల్ చేసుకోవాలన్నారు. ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్ ద్వారానే నిర్వహించాలన్నారు. ఆస్పత్రుల్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్తోపాటు అందిస్తున్న వైద్యసేవలకు సంబంధించిన ధరల పట్టికను బోర్డులో ప్రదర్శించాలన్నారు. అలాగే ప్రతి డాక్టర్, స్టాఫ్ నర్సులకు హెల్త్ ప్రొఫెషన్ ఐడీ (హెచ్పీఆర్), హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రేషన్ (హెచ్ఎఫ్ఆర్) చేయించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డెమో అధికారి కనకరత్నం, డీపీఓ రమేష్బాబు, ఏఎస్ఓ రమేష్, షైనీ, కల్యాణ్ పాల్గొన్నారు. -
త్వరితగతిన ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు
● ఏపీఎస్పీడీసీఎల్ సీజేఎం కృష్ణారెడ్డి నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘వేసవి కాలంలో విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రిపేర్లకు వచ్చే ట్రాన్స్ఫార్మర్లకు త్వరితగతిన మరమ్మతులు చేయాలి’ అని ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ (ఓఅండ్ఎం) ఎం.కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం నెల్లూరులోని కొత్తూరులో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ మరమ్మతుల కేంద్రంలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో నెల్లూరు, కావలి, ఆత్మకూరు, పొదలకూరు ప్రాంతాల్లో ఈ కేంద్రాలున్నాయన్నారు. మరో నాలుగు ప్రైవేట్ కేంద్రాలున్నట్లు చెప్పారు. ట్రాన్స్ఫార్మర్లు అధిక విద్యుత్ లోడ్కు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ఇంజినీర్లదే అన్నారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తాగునీటికి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండ కార్యాచరణ రూపొందిచుకోవాలని ఆదేశించారు. నిరంతర పర్యవేక్షణతో ట్రాన్స్ఫార్మర్ల ఫెయిల్యూర్లను తగ్గించుకోవచ్చని చెప్పారు. రికార్డుల నిర్వహణపై అసహనం కేంద్రంలోని రికార్డులను, స్టాక్ను కృష్ణారెడ్డి పరిశీలించారు. మరమ్మతుల సమయంలో ఉపయోగించే రాగితీగలు, ఆయిల్ వినియోగం, ఎన్ని రిపేర్లకు వచ్చాయి, వాటి స్థానంలో ఎన్ని పంపించారో వివరాల రిజిస్టర్లను చూశారు. కాగా రికార్డుల నిర్వహణపై ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్ఈ రాఘవేంద్రం, ఈఈలు శేషాద్రిబాలచంద్ర, శ్రీధర్, లక్ష్మీనారాయణ, డీఈఈ రాజాబాబు, ఏఈ సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
క్రెడిట్ చోరీకి తమ్ముళ్ల ఆరాటం
● వైఎస్సార్సీపీ హయాంలో బుచ్చిరెడ్డిపాళెంలో హెల్త్ సెంటర్ నిర్మాణం ● మేమే చేశామని చెప్పుకొనేందుకు టీడీపీ యత్నం ● రిబ్బన్ కట్ చేసేందుకు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి రెడీ బుచ్చిరెడ్డిపాళెం: క్రెడిట్ చోరీ చేయడం తెలుగుదేశం పార్టీ అధినేత నుంచి స్థానిక నేతల వరకు పరిపాటిగా మారింది. కోవూరు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గత ప్రభుత్వం వైఎస్సార్సీపీ హయాంలో నిర్మించిన సచివాలయాలు, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్లు, డిజిటల్ గ్రంథాలయం.. ఇలా అనేక ప్రభుత్వ భవనాలే కనిపిస్తాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసి, పునాది వేసి, నిర్మాణాలను పూర్తి చేసిన భవనాలకు ఇప్పుడు వాటికి రంగులేసి తమ ఖాతాలో వేసుకోవాలని కూటమి ప్రభుత్వం ఆరాట పడుతోంది. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో సాగుతున్న ఈ క్రెడిట్ చోరీపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏం జరిగిందంటే.. అప్పటి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ పరిధిలోని కట్టుబడిపాళెంలో సుమారు రూ.80 లక్షలతో పట్టణ ఆరోగ్య కేంద్రం (ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్) నిర్మాణానికి చొరవ తీసుకున్నారు. నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. పనుల్లో నాణ్యత తగ్గకుండా నిరంతరం పర్యవేక్షించి, గత ప్రభుత్వ హయాంలోనే భవన నిర్మాణాన్ని దాదాపు 99 శాతం పూర్తి చేయించారు. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఎన్నికల కోడ్ రావడం, ప్రభుత్వం మారడం చకచకా జరిగిపోయాయి. ప్రచార ఆర్భాటం సొంతంగా నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేపట్టడం చేతగాక, గత ప్రభుత్వం పూర్తి చేసిన భవనాలకు ‘కూటమి’ ముద్ర వేసే ప్రక్రియకు తెలుగు తమ్ముళ్లు తెరలేపారు. కొన్ని రోజులుగా ఈ ఆరోగ్య కేంద్రానికి హడావుడిగా రంగులు వేయించి, చిన్న చిన్న పనులను చేసి, తమ ఘనతగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో మంగళవారం ఈ కేంద్రాన్ని ప్రారంభించి, అదంతా తామే చేశామని చెప్పుకోవాలని చూస్తున్నారు. ఈ తంతు చూస్తున్న కట్టుబడిపాళెం ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రసన్నకుమార్రెడ్డి నిధులు తెచ్చి బిల్డింగ్ కట్టించారు. ఇప్పుడు రంగులేసి మేమే కట్టామని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించడం లేదా?’ స్థానిక వైఎస్సార్సీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గమంతా ఇదే తీరు కేవలం ఈ ఆరోగ్య కేంద్రమే కాదు. కోవూరు నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో పూర్తయిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. కొత్తగా ఒక్క ఇటుక కూడా వేయని కూటమి నేతలు, పూర్తయిన భవనాలకు రిబ్బన్ కటింగ్ చేయడానికి మాత్రం పోటీ పడుతున్నారు. -
రౌడీషీటర్పై పీడీ యాక్ట్
నెల్లూరు(క్రైమ్): తీరుమారని రౌడీషీటర్పై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. నెల్లూరు చిన్నబజారు ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు వివరాల మేరకు.. కోటమిట్టకు చెందిన షేక్ మసూద్ అలియాస్ మక్సూద్ అలియాస్ పెద్ద మసూద్పై చిన్నబజారు పోలీస్స్టేషన్లో రౌడీషీ ట్ ఉంది. అతనిపై హత్య కేసుతోపాటు పలు కేసులున్నాయి. కలెక్టర్ అనుమతితో పోలీసులు సోమవారం మసూద్పై పీడీ యాక్ట్ నమోదు చేశారు.పిల్లల్ని చూసేందుకు వెళ్తూ.. ● రోడ్డు ప్రమాదంలో మహిళ మృతికోట: మండలంలోని రాఘవాపురం వద్ద కోట – గూడూరు ప్రధాన రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కె.సుబ్బమ్మ (42) అనే మహిళ మృతిచెందింది. ఎస్సై పవన్కుమార్ కథనం మేరకు.. వాకాడు మండలం శ్రీపురానికి చెందిన సుబ్బమ్మ తన మరిది రవి మోటార్బైక్పై నెల్లూరుకు వెళ్తోంది. రామాపురానికి చెందిన రాజశేఖర్ బైక్పై ముందు వెళ్తూ ఒక్కసారిగా రాఘవాపురం వైపు తిప్పాడు. వెనుక వస్తున్న బైక్ అదుపుతప్పి ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై పడిన సుబ్బమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. రవికి గాయాలయ్యాయి. మృతురాలికి భర్త, పిల్లలున్నారు. నెల్లూరులో చదువుతున్న పిల్లల వద్దకు వెళ్తూ ప్రమాదానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్సై పరిశీలించారు. కోట ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేశారు. ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు● ఏఎస్పీ దీక్ష నెల్లూరు(క్రైమ్): ‘ప్రజలతో మమేకమై శాంతియుతంగా జీవించాలి. వారిని ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తప్పవు’ అని నగర ఏఎస్పీ దీక్ష ట్రాన్స్జెండర్లను హెచ్చరించారు. నగరంలోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ట్రాన్స్జెండర్స్తో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎవరితోనూ దౌర్జన్యంగా, దురుసుగా ప్రవర్తించరాదన్నారు. నేరాలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు శాఖకు పూర్తిగా సహకరిస్తూ చట్టపరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. సమావేశంలో నగర ఇన్స్పెక్టర్లు చిట్టెం కోటేశ్వరరావు, జి.వేణుగోపాల్రెడ్డి, వైవీ సోమయ్య, కె.సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రయోగంనెల్లూరు(క్రైమ్): గంజాయి అక్రమ రవాణా కేసులో నెల్లూరు వేదాయపాళేనికి చెందిన రౌడీషీటర్ జగదీష్పై పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్కు ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అందులోని వివరాల మేరకు.. గతేడాది ఆగస్ట్ 24వ తేదీన జగదీష్ మరో ఇద్దరు గంజాయి అక్రమంగా తరలిస్తుండగా నెల్లూరు రూరల్ మండలం దొంతాలి వద్ద వేదాయపాళెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 19.470 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అదే ఏడాది సెప్టెంబర్ ఐదో తేదీన కారులో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న పలువురిని దొంతాలి అడ్డరోడ్డు జంక్షన్ వద్ద వేదాయపాళెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 23.470 కేజీల గంజాయిని స్వాధీనం చేశారు. విచారణలో జగదీష్ పేరు వెల్లడవడంతో అతడిపై కేసు నమోదు చేశారు. జిల్లా పోలీసు అఽధికారుల నివేదిక ఆధారంగా పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. -
కుమారుడే హంతకుడు
● రైల్వే ఉద్యోగి హత్య కేసును ఛేదించిన పోలీసులు ● కుటుంబ, ఆస్తి వివాదాలే కారణంకావలి రూరల్: కావలి మండలం రుద్రకోటలో ఇటీవల జరిగిన రైల్వే ఉద్యోగి ఆరే నాగరాజు (47) హత్య కేసును పోలీసులు ఛేదించారు. కుటుంబ తగాదాలు, ఆస్తి వివాదాల నేపథ్యంలోనే కుమారుడే హత్యకు పాల్పడినట్లు కావలి డీఎస్పీ శ్రీధర్ వెల్లడించారు. ఆయన సోమవారం పట్టణంలోని కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాగరాజు, భార్య మాధవికి మధ్య పదేళ్లుగా విభేదాలున్నాయి. ఆమె తన ముగ్గురు కుమారులతో కలిసి చిన్నగంజాంలోని పుట్టింట్లో ఉంటోంది. నాగరాజు రుద్రకోటలోని ఎస్సీ కాలనీలో భార్య పేరుపై ఉన్న ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్నాడు. పిల్లల చదువులు, పెద్ద కుమారుడి వివాహం కోసం మాధవి అప్పులు చేసింది. నాగరాజు కుటుంబానికి ఆర్థిక సహాయం చేయకుండా డబ్బును విలాసాలకే ఖర్చు చేసేవాడు. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో రుద్రకోట ఇంటిని అమ్మాలని భార్య, రెండో కుమారుడు నవీన్బాబు పలుమార్లు నాగరాజును కోరారు. అయితే అతను అందుకు అంగీకరించలేదు. ఆ ఇంటిని తన పేరుపై మార్చుకునే ప్రయత్నం చేశాడు. దీంతో విసిగిపోయిన మాధవి, నవీన్బాబులు నాగరాజును అడ్డుతొలగించుకోవాలని 15 రోజుల క్రితం నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా నవీన్బాబు రుద్రకోటలోనే ఉంటూ తండ్రితో సఖ్యతగా ఉన్నట్లు నటించాడు. ఈనెల 5వ తేదీ రాత్రి నాగరాజు మద్యం మత్తులో ఉండగా రోకలిబండతో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. పోలీసుల్ని తప్పుదోవ పట్టించేందుకు మృతదేహంపై మరికొన్ని గాయాలు చేసి పరారయ్యాడు. పోలీసుల విచారణలో దొరికిపోతామనే భయంతో మాధవి, నవీన్బాబు వీఆర్వో జనార్దన్ ఎదుట లొంగిపోయారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. సమావేశంలో రూరల్ సీఐ రాజేశ్వరరావు, ఎస్సైలు తిరుమలరెడ్డి, బాజీరావు పాల్గొన్నారు. -
అత్తను చంపిన కేసులో అల్లుడి అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): ఇటీవల హత్యకు గురైన జయలక్ష్మి అనే మహిళ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరులోని ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో నగర ఏఎస్పీ దీక్ష సోమవారం నవాబుపేట ఇన్స్పెక్టర్ జి.వేణుగోపాల్రెడ్డితో కలిసి వివరాలను వెల్లడించారు. అల్లీపురానికి చెందిన జయలక్ష్మి (39), జగన్ దంపతులకు కుమార్తె ఉంది. జయలక్ష్మి మేనల్లుడు టి.కుమార్ నెల్లూరు రూరల్ మండలం కల్లూరుపల్లి హౌసింగ్బోర్డులో నివాసముంటున్నాడు. అతని తల్లిదండ్రులు విభేదాలతో విడిపోవడంతో జయలక్ష్మి చేరదీసింది. తన ఇంట్లోనే పెట్టుకుని కుమార్తెనిచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకుంది. ఈక్రమంలోనే అత్త, అల్లుడి నడుమ వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసి భర్త జయలక్ష్మిని వదిలివెళ్లిపోయాడు. సుమారు నెలరోజుల క్రితం ఆమె తన కుమార్తె, అల్లుడితో ఆరెస్సార్ స్కూల్ ఎదురువీధిలోని ఇంటిని అద్దెకు తీసుకుంది. కుమార్ను అతడి కుటుంబ సభ్యులను కలవనివ్వకపోగా, తల్లి మృతిచెందినా వెళ్లకుండా జయలక్ష్మి అడ్డుపడింది. ఈనెల ఆరో తేదీ కుమార్ తన పెద్దనాన్న ఇంటికి వెళ్లి వచ్చాడని జయలక్ష్మి గొడవపడింది. మద్యం మత్తులో ఉన్న అతను ఆమెను కత్తితో పొడిచి హత్యచేసి పరారయ్యాడు. మృతురాలి కుమార్తె ఫిర్యాదు మేరకు నవాబుపేట పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ప్రశాంతినగర్ జంక్షన్ వద్ద అరెస్ట్ చేసి హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. -
కలెక్టరేట్ను ముట్టడించిన గిరిజనులు
నెల్లూరు(దర్గామిట్ట): మేయర్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ను విడుదల చేయాలంటూ కలెక్టరేట్ ఎదుట గిరిజన సంఘాల ఐక్యవేదిక చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి 10వ రోజుకు చేరుకున్నాయి. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని ముట్టడించారు. జిల్లా నలుమూలల నుంచి గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజన నేత బాపట్ల వెంకటపతి యానాది మాట్లాడుతూ గిరిజనుల హక్కులను కాలరాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో గిరిజనులను పథకం ప్రకారం ప్రభుత్వం అణచివేస్తోందని మండిపడ్డారు. దీనికి నగరపాలక సంస్థ మేయర్పై కుట్ర నిదర్శనమన్నారు. గిరిజన మహిళకు అన్యాయం జరిగితే జిల్లా పెద్దలు నోరు మెదపకపోవడం బాధాకరమన్నారు. అవసరమైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారాయణ, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది అంబేడ్కర్, వివిధ సంఘాలకు చెందిన మాకాణి వెంకటేశ్వర్లు, బత్తెన లక్ష్మణశేఖర్, చెంచయ్య, గంధర్ల రమేష్, యాకసిరి మురళి, ఈగ శ్రీనివాసులు, తాళ్ల ఏడుకొండలు, బాపట్ల రామయ్య, చలంచర్ల శ్రీనివాసులు, చౌటూరు శ్రీనివాసులు, ఎందేటి సురేంద్ర, తలపల జైవర్ధన్, చేవూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
సినిమా అవకాశం పేరిట మోసం
● ఎస్పీకి ఫిర్యాదు ● పోలీస్ ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు 146 వినతులు నెల్లూరు(క్రైమ్): సినిమాలో అవకాశం, ఉద్యోగాల పేరిట మోసగించిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు బాధితులు పోలీసు ఉన్నతాధికారులను కోరారు. సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 146 మంది విచ్చేసి తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్ల, పోలీసు అధికారులకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఎస్పీ చట్టపరిధిలో సత్వరమే సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, మహిళా పోలీసుస్టేషన్, పీసీఆర్, ఎస్బీ ఇన్స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, భక్తవత్సలరెడ్డి, బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన చక్రధర్రెడ్డి తాను తీయబోయే సినిమాలో హీరో తమ్ముడు క్యారెక్టర్ ఇస్తానని నా కుమారుడిని నమ్మించి రూ.1.06 లక్షలు నగదు తీసుకుని మోసగించాడు. విచారించి న్యాయం చేయాలని నెల్లూరు రూరల్ పరిధికి చెందిన ఓ వివాహిత కోరారు. ● విజయ్ శాంసన్, ప్రతాప్, మధు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నాతోపాటు మరికొందరి వద్ద రూ.15 లక్షలు నగదు తీసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పించకుండా నగదు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని బాలాజీ నగర్కు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ● దుబాయిలో ఉద్యోగం ఇప్పిస్తానని హైదరాబాద్కు చెందిన రామకృష్ణ రూ.4.50 లక్షలు నగదు తీసుకున్నాడు. విజిటింగ్ విసా కింద అక్కడికి పంపి మోసగించాడు. విచారించి చర్యలు తీసుకోవాలని కోటకు చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు. ● కోడలు, మనుమడు బాగా చూసుకుంటానని నమ్మించి నా ఇళ్లు, పొలం వారి పేరుపై రాయించుకున్నారు. అనంతరం ఇంట్లో నుంచి తరిమేశారు. నాకు జీవనాధారం కష్టంగా ఉంది. న్యాయం చేయాలని కలిగిరికి చెందిన ఓ వృద్ధురాలు వినతిపత్రమిచ్చారు. ● నా కుమారుడు గతేడాది అక్టోబర్ నుంచి కనిపించడం లేదు. విడవలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ వేగవంతం చేసి కుమారుని ఆచూకీ తెలుసుకుని అప్పగించాలని విడవలూరుకు చెందిన ఓ మహిళ కోరారు. ● నన్ను, నా పిల్లలను ఇంట్లోకి రానివ్వకుండా భర్త, అత్తింటివారు ఇబ్బందులు పెడుతున్నారు. కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబాన్ని చక్కదిద్దాలని బాలాజీనగర్కు చెందిన ఓ వివాహిత అర్జీ అందించారు. -
అర్జీలిచ్చి.. ఆలకించాలని కోరి..
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● పింఛన్ కోసం పలువురి వినతినెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్ కుమార్, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కృష్ణకుమార్, డ్వామా పీడీ గంగా భవాని తదితరులు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి తగిన సదుపాయాలు కల్పించాలని అఖిలపక్ష రైతు సంఘ నాయకులు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ జిల్లాలో సుమారు 20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం త్వరలో మార్కెట్లోకి రాబోతోందన్నారు. వరికి మద్దతు ధర కల్పించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.ఎవరూ వినిపించుకోవడం లేదు నాకున్న 4 ఎకరాల వారసత్వ భూమిలో 50 సెంట్లను పక్కన లేఅవుట్ వేసేవారు ఆక్రమించుకుని చదును చేసుకున్నారు. గతంలో మా మండలం తిరుపతి జిల్లాలో ఉన్నప్పుడు కలెక్టర్కు మూడుసార్లు అర్జీలిచ్చాను. పట్టించుకోలేదు. ఇక్కడ రెండుసార్లు ఇచ్చాను. ఎవరూ నా గోడు వినిపించుకోవడం లేదు. – చెన్నూరు రాజగోపాల్రెడ్డి, చిల్లకూరు మండలం -
రిలయన్స్కు భూములను ధారాదత్తం చేయొద్దు
● తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతుల అందోళన ● ప్రభుత్వ తీరుపై మండిపాటు ఉదయగిరి: కూటమి ప్రభుత్వం విలువైన ప్రభుత్వ భూములను అభివృద్ధి ముసుగులో బడా కంపెనీలకు ధారాదత్తం చేస్తుండడంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. భూమిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు కాకుండా కార్పొరేట్ కంపెనీలకు భూములను కట్టబెడుతుండడంపై స్థానికులు ఆందోళనలకు దిగుతున్నారు. ఉదయగిరి మండలం పుల్లాయపల్లి రెవెన్యూ పరిధిలో సర్వేనంబర్లు 100,106లలో ఉన్న 312 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని ఇటీవల ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు రిలయన్స్ కంపెనీకి స్వాధీనం చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు సోమవారం పెద్ద సంఖ్యలో ఉదయగిరి తహసీల్ధార్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. తమ గ్రామానికి చెందిన భూములను రిలయన్స్ కంపెనీకి ఇచ్చి తమ కడుపు కొట్టొద్దని రెవెన్యూ అధికారుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఏమి జరిగిందంటే.. పుల్లాయపల్లిలోని సర్వే నంబర్లు 100,106లో ఉన్న 312 ఎకరాలు భూమిని సీలింగ్ ద్వారా ప్రభుత్వం తీసుకుంది. సదరు ప్రభుత్వ భూమిని 1992లో అప్పటి రెవెన్యూ అధికారులు గ్రామంలోని 242 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర సామాజిక వర్గాలకు చెందిన నిరుపేద రైతులకు సీజేఎఫ్ఎస్ ద్వారా లీజు పట్టాలుగా పంపిణీ చేశారు. ఈ వివరాలను అధికారులు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయలేదు. భూములను పొందిన కొందరు రైతులు కొంత కాలం సాగు చేశారు. ఆ తర్వాత వాతావరణ పరిస్థితులు అనుకూలించక సాగును నిలిపివేశారు. దీంతో భూముల్లో కంపచెట్లు పెరిగి చిట్టడవిలా మారింది. ఈ నేపథ్యంలో 2024లో అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వం రిలయన్స్ కంపెనీకి 312 ఎకరాల సదరు ప్రభుత్వ భూమిని కేటాయించి స్వాధీనం చేసింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తుల కడుపుమండింది. ఏళ్ల తరబడి తాము చేసుకుంటున్న భూమిని తమకు కాకుండా రిలయన్స్ కంపెనీకి ఎలా కేటాయిస్తారంటూ రెవెన్యూ అధికారులను నిలదీశారు. దాదాపు 250 మందికి పైగా రైతులు ఉదయగిరి చేరుకుని రంగనాయకులస్వామి ఆలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ షాజియాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ విజయమ్మ, అఖిలపక్ష నేతలు కాకు వెంకటయ్య, కే నరసింహారెడ్డి, కల్లూరి కృష్ణారెడ్డి, కొండా రాజగోపాల్రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ తీరు దుర్మార్గం టీడీపీ ప్రభుత్వం ఖాళీగా ఉన్న ప్రభుత్వ, పేదలకు పంపిణీ చేసిన భూములను బడా కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. దీంతో కాలుష్యం పెరిగి ప్రజలు గ్రామాలను వదిలి వెళ్లే పరిస్థితి వస్తుంది. పుల్లాయపల్లిలో పేదలకు పంపిణీ చేసిన భూములను కాజేసే కుట్రలో భాగంగా రిలయన్స్కు చెందిన ఏబీసీ సంస్థ్ధకు కేటాయిస్తూ జీఓ ఇవ్వడం దుర్మార్గం. ప్రభుత్వం వెంటనే జీఓను వెనక్కితీసుకోపోతే పోరాటం చేస్తాం. – కాకు వెంకటయ్య, జిల్లా రైతు సంఘ నేత -
ఉచిత ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు (టౌన్): విద్యాహక్కు చట్టంలో భాగంగా 2026–27 విద్యా సంవత్సరంలో జిల్లాలో ని ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో పేద, బలహీన వర్గాల పిల్లలకు 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటో తరగతి పిల్లల తల్లిదండ్రులు ఈ నెల 20 నుంచి మార్చి 10వ తేదీలోగా గ్రామ సచివాలయం లేదా మండల విద్యా వనరుల కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అలాగే http://cse.ap.gov.in వెబ్సైట్ లో విద్యార్థుల ఆధార్, ప్రాథమిక వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపా రు. ఉచిత ప్రవేశాలకు సంబంధించిన వివరాల కోసం టోల్ఫ్రీ నంబర్ 180042 58599ను సంప్రదించాలని సూచించారు. పెన్నా డెల్టాకు 1600 క్యూసెక్కుల విడుదల సోమశిల: సోమశిల జలాశయం నుంచి పెన్నా డెల్టాకు సోమవారం సాయంత్రం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈఈ శ్రీనివాసులు మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాలతో పెన్నా డెల్టా ఆయకట్టు రైతుల అవసరాల మేరకు 12వ క్రస్ట్ గేట్ ద్వారా 1600 క్యూసెక్కులను విడుదల చేశామని తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 69.834 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ఎగువ ప్రాంతం నుంచి 3,514 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోందని చెప్పారు. పవర్ టెర్మినల్ ద్వారా పెన్నా నదికి 2,350, ఉత్తర కాలువకు 300, దక్షిణ కాలువకు 200, కండలేరు కాలువకు 400 క్యూసెక్కుల వంతున విడుదల చేస్తున్నామని వివరించారు. ప్రస్తుతం జలాశయంలో 99.462 మీటర్ల నీటి మట్టం ఉందని తెలిపారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్లో 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 81,894 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. 24,754 మంది తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.91 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో దర్శించుకోగలుగుతున్నారు. కాగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ముందుగా వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది. -
ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ మీటర్లు
తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ఇప్పటికే ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లకు ప్రీపెయిడ్ సదుపాయాన్ని కల్పిస్తున్నామని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లతో సోమవారం ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులకు ఆధునిక సాంకేతికతతో మెరుగైన సేవలతో నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు స్మార్ట్మీటర్లను అమరుస్తున్నామని తెలిపారు. ప్రభు త్వ కార్యాలయాలు, కార్పొరేషన్, మున్సిపాలిటీల్లోని వీధి దీపాలు, మంచినీటి పథకాలకు సంబంధించి ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో 16,802 స్మార్ట్ మీటర్లను అమర్చినట్లుగా తెలిపారు. వీటిని ప్రస్తుతం ప్రీపెయిడ్ మీటర్లుగా మారుస్తున్నామని, వాటిని రీచార్జి చేసేందుకు వీలుగా ఈ–వాలెట్లను ఏర్పాటు చేశామని వివరించారు. దశలవారీగా మిగిలిన కేటగిరీల వినియోగదారులకు కూడా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను అమర్చేందుకు చర్యలు చేపడుతామని తెలిపారు. ఈ మీటర్లతో విద్యుత్ వినియోగంపై వినియోగదారుల్లో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. -
అక్రమ కేసులు తప్ప సక్రమ పాలనేదీ?
నెల్లూరురూరల్: చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతిపక్షంపై అక్రమ కేసులు తప్ప.. సక్రమ పాలనేదని మాజీ మంత్రి విడదల రజిని దుయ్యబట్టారు. జిల్లా సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న పిన్నెల్లి సోదరులను విడదల రజిని, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత సోమవారం ములాకత్ అయ్యారు. ఈ సందర్భంగా విడదల రజని మాట్లాడుతూ పల్నాడు ఎస్పీ స్వయంగా టీడీపీ వాళ్ల ఆధిపత్య పోరులోనే హత్య జరిగిందని అని స్వయంగా ప్రకటించినా కూడా.. పిన్నెల్లి సోదరులపై అక్రమంగా హత్య కేసు బనాయించి జైలుకు పంపడం దారుణమన్నారు. పిన్నెల్లి సోదరులు ఎటువంటి తప్పు చేయలేదన్నారు. టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలని ఈ ప్రభుత్వం చూస్తుందన్నారు. మాజీ మంత్రుల మీద వరుస దాడులను ప్రోత్సహిస్తూ, మాపైనే అక్రమ కేసులు పెడుతుందన్నారు. గుడికి వెళ్లి పూజలు చేసుకుని బయటకు వస్తే నా మీద కూడా కేసులు నమోదు చేసిందన్నారు. ఇటువంటి దాడులకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎవరూ భయపడరని తెలిపారు. టీడీపీ అరాచకాలను కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రశ్నిస్తుంటే ఆయన మీద పదే పదే కేసులు పెడుతున్నారన్నారు. టీడీపీ హయాంలో తిప్పి పంపిన ట్యాంకర్లను మళ్లీ తెప్పించి లడ్డూలో వాడేసి తమపైనే ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎక్కడా జంతువు కలవలేదని సిట్ రిపోర్ట్ ఇస్తే అడ్డగోలుగా వాదిస్తున్నారన్నారు. చేసిన తప్పుడు పనులను కప్పిపుచ్చేందుకే అవాస్తవ ప్రచారాలతో అడ్డదిడ్డంగా వాదిస్తున్నారన్నారు. ● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ జైలు అధికారులు పిన్నెల్లి సోదరులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని తెలిపారు. చంద్రబాబు కక్ష సాధింపులతో వ్యవహరిస్తున్నాడన్నారు. మామూలు ఖైదీ కన్నా దారుణంగా చూస్తున్నారని తెలిపారు. ఈ ప్రభుత్వం కత్తులు, కర్రలు, పెట్రోల్ బాంబులతో పాలన సాగిస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రశ్నిస్తే కేసులు పెట్టడం దాడులు చేయడం సంస్కృతిగా మారిపోయిందన్నారు. ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని టీడీపీ వాళ్లే చెబుతున్నారన్నారు. కక్ష సాధింపులో భాగమవుతున్న అధికారులపై ప్రభుత్వం మారాక చట్టరీత్యా చర్యలు తీసుకొని జైల్లోకి పంపుతామన్నారు. కేసులకు ఏ వైఎస్సార్సీపీ కార్యకర్త భయపడరని తెలిపారు. ● రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత మాట్లాడుతూ తప్పుడు కేసులతో జైల్లో పెట్టడం మంచి పద్ధతి కాదని తెలిపారు. సంబంధంలేని కేసుల్లో ఇరికించడం ఈ ప్రభుత్వం స్పెషాలిటీ అన్నారు. అక్రమ కేసుల్లో మా నాన్నను జైల్లో పెట్టినప్పుడు నేను ఎంతో బాధపడ్డానని తెలిపారు. తిరుమల లడ్డూను స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారన్నారు. స్కామ్లు చేయడం ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం ద్వారా ప్రజలు పాలనను అసహ్యించుకుంటున్నారన్నారు. గుడికి వెళ్లి బయటకు వచ్చిన నాపైనా కేసు నమోదు టీడీపీ అరాచకాలను ప్రశ్నిస్తున్నాడని కాకాణి అన్నపై పదేపదే కేసులు ఆ పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరుతో హత్య జరిగిందని ఎస్పీనే చెప్పారు అయినా పిన్నెల్లి సోదరులపై అక్రమంగా హత్య కేసు నమోదు మాజీ మంత్రి విడదల రజిని జైల్లో పిన్నెల్లి సోదరులను పరామర్శించిన వైఎస్సార్సీపీ నేతలు -
గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలో గంజాయి ముఠాలపై ఉక్కుపాదం మోపి కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కోవూరు మండలంలోని గుమ్మళ్లదిబ్బకు చెందిన మైనర్ బాలికపై గంజాయి మత్తులో ఇద్దరు బాలురు అఘాయిత్యానికి పాల్పడడంతో, ఆ బాలిక మృతికి సంతాపంగా నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవాజ్ జిల్లా కార్యదర్శి రషీద్ మాట్లాడుతూ మైనర్ బాలికపై అఘాయిత్యం, హత్య ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో గంజాయి విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని, మూడు నెలల క్రితం పెంచలయ్యను గంజాయి బ్యాచ్ హత్య చేశారని, ఇప్పుడు గంజాయి అరాచకాలకు బలైపోయిన బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గంజాయి వాడకం, రవాణాపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టి గంజాయి రహిత జిల్లాగా నెల్లూరును మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, ఆవాజ్, ఐద్వా, ప్రజానాట్యమండలి నాయకులు విక్రమ్, నరేంద్ర, రమణ, నరసింహ, శివకుమారి, గండవరపు శేషయ్య తదితరులు, పాల్గొన్నారు. -
నిందితులను కఠినంగా శిక్షించాలి
ఆత్మకూరు: గుమ్మళ్లదిబ్బలో గంజాయి మత్తులో మైనర్ బాలికపై దారుణానికి పాల్పడి, మృతికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆత్మకూరు ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. సత్రం సెంటర్ నుంచి మున్సిపల్ బస్టాండ్లోని అంబేడ్కర్ విగ్రహం వరకు సాగిన ఈ కొవ్వొత్తుల ర్యాలీలో ప్రజాసంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయుకులు మాట్లాడుతూ గుమ్మళ్లదిబ్బలో మైనార్టీ వర్గానికి చెందిన మైనర్ బాలికను గంజాయి సేవించిన ఇద్దరు యువకులు (మైనర్లు) హింసించి ఆమె చావుకు కారణమవడం రాష్ట్రంలో గంజాయి ఏరులై పారుతుందనడానికి నిదర్శనమన్నారు. గంజాయి అరాచకాలకు పోయే ప్రాణాలు తెచ్చివ్వలేమని, ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టి గంజాయి విక్రయాలను సంపూర్ణంగా అడ్డుకోవాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. -
సముద్రంలో మునిగిన బోటు
కోట: చైన్నె సమీపంలో చేపల వేటకెళ్లిన బోటు సముద్రంలో బోల్తాపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గోవిందపల్లిపాళేనికి చెందిన ఐదుగురు, విడవలూరు మండలం ఊటుకూరుపాళేనికి చెందిన ముగ్గురు, పొన్నపూడికి చెందిన నలుగురు ఇలా 12 మంది చైన్నెకు చెందిన బోటులో చేపల వేట నిమిత్తం మూడు రోజుల క్రితం వెళ్లారు. ఈ తరుణంలో చైన్నెకు ఐదు కిలోమీటర్ల దూరంలో బోటు సముద్రంలో శనివారం ఉదయం బోల్తాపడింది. మరో బోటు ద్వారా వీరిని వెంటనే సురక్షితంగా తరలించారు. కనులపండువగా సముద్రస్నానం కావలి: దుత్తలూరు మండలంలోని నర్రవాడలో కొలువైన వెంగమాంబ తల్లి సముద్రస్నాన మహోత్సవాన్ని వేడుకగా ఆదివారం నిర్వహించారు. అమ్మవారిని పుష్పాలతో సుందరంగా అలంకరించి.. మేళతాళాలు, బాణసంచా నడుమ నడుమ గ్రామోత్సవాన్ని జరిపారు. వింజమూరు, కలిగిరి, జలదంకి మీదుగా కావలికి శనివారం చేరుకుంది. అనంతరం కావలి మండలంలోని సత్రం వద్ద సముద్రస్నానాన్ని చేయించి పూజలు నిర్వహించారు. దారి పొడవునా ఆయా గ్రామాల ప్రజలు పూలు, పండ్లు, టెంకాయలను సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. -
పన్నులను నూరు శాతం వసూలు చేయాలి
కోవూరు: జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ నెల 15 నాటికి పన్నులను నూరు శాతం వసూలు చేయాలని డీపీఓ వసుమతి ఆదేశించారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. లక్ష్యాన్ని సాధించలేకపోతే సహించేదిలేదని స్పష్టం చేశారు. పంచాయతీలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు ఇవి ఎంతో కీలకమని వివరించారు. కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించి వసూళ్లను వేగవంతం చేయాలని సూచించారు. ఇన్చార్జి ఎంపీడీఓ శ్రీనివాసులు, డిప్యూటీ ఎంపీడీఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 18 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 81,777 మంది శనివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 30,209 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.7 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
వెతలు తీరక.. కాళ్లరిగేలా తిరుగుతూ..!
నెల్లూరు(దర్గామిట్ట): కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక‘ నామమాత్రంగా సాగుతోందనే భావన అర్జీదారుల్లో వ్యక్తమవుతోంది. ఇందులో వినతులను సమర్పించినా, అవి పరిష్కారానికి నోచుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల వ్యక్తిగత, సామాజిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దీన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి వారం దాదాపు 300 నుంచి 600 వరకు అర్జీలు అందుతున్నా, క్షేత్రస్థాయిలో పరిష్కారం తూతూమంత్రంగా ఉంటోంది. లాగిన్ సైతం చేయని వైనం.. వాస్తవానికి నిబంధనల మేరకు అర్జీ అందిన 24 గంటల్లోపు సంబంధిత శాఖ అధికారి తన లాగిన్ను ఓపెన్ చేసి వీటిని పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే చాలా మంది ఆఫీసర్లు దీన్ని అమలు చేయడంలేదని తెలుస్తోంది. ఓ అధికారి తన లాగిన్ను ఓపెన్ చేసి ఎన్ని రోజులైందో సైతం తెలియని పరిస్థితి. పశుసంవర్థక శాఖ, ఉదయగిరి, అనంతసాగరం తదితర మండల స్థాయి అధికారులు సైతం ఇదే బాటలో పయనిస్తున్నారు. వామ్మో.. ఇన్నా..! తాగునీరు, పారిశుధ్యం తదితర సమస్యలను మూడు రోజుల్లో.. రెవెన్యూ సంబంధితమైన వాటిని 90 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుంది. అయితే జిల్లాలో 778కుపైగా అర్జీలు పెండింగ్లో ఉన్నాయి. ఈ తరుణంలో సమస్యలు పరిష్కారం కాక అర్జీదారులు కలెక్టరేట్ చుట్టూ ప్రతి వారం తిరగాల్సి వస్తోంది. మరోవైపు 200 అర్జీల్లో 50 మాత్రమే పరిష్కారమవుతున్నాయని, మిగిలిన 150 మేర తరచూ వస్తున్నాయని సమాచారం. అర్జీదారుల సౌకర్యార్థం కలెక్టరేట్లో అన్ని సదుపాయాలను కల్పిస్తున్నా, సమస్యల పరిష్కార విషయంలో మాత్రం చిత్తశుద్ధి కరువైందనే ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అధికారులు ఇప్పటికై నా వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిష్కారానికి నోచుకోని వైనం అధికారుల్లో అంతులేని అలసత్వం పెండింగ్లో భారీగా అర్జీలు ప్రజా సమస్యల పరిష్కార వేదిక తీరిదీ.. -
అయ్యో.. గోమాత
● ఆకలితో అలమటిస్తూ.. బక్కచిక్కి ● వెంగమాంబ పేరంటాలమ్మ ఆలయ గోశాలలో ఇదీ దుస్థితి దుత్తలూరు: జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మండలంలోని నర్రవాడ వెంగమాంబ పేరంటాలమ్మ ఆలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలలో గోవులను దేవస్థానాధికారులు, సిబ్బంది పట్టించుకోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఇక్కడ గోవులు, కోడె దూడలు కలిపి సుమారు 40 ఉన్నాయి. గోశాలలో కొన్ని నెలలుగా గడ్డి నిల్వ లేకపోవడంతో ఇవి ఆకలితో అలమటిస్తున్నాయి. పచ్చిక బయళ్లు సైతం కరువై అనారోగ్యానికి గురవుతున్నాయి. ఫలితంగా చెత్తాచెదారాన్ని తినాల్సి వస్తోంది. కాగా ఈ విషయమై ఆలయ ఇన్చార్జి ఈఓ శ్రీనివాసరెడ్డిని సంప్రదించగా, గడ్డి కొరత తీవ్రంగా ఉందని, ఎక్కడ తిరిగినా దొరకడంలేదని చెప్పారు. గడ్డిని రెండు, మూడు రోజుల్లో ఏర్పాటు చేసేలా చూస్తామని బదులిచ్చారు. -
ఆత్మకూరు నియోజకవర్గంలోని మారుమూల గ్రామ ప్రజలు ప్రస్తుతం కిడ్నీ సమస్యలతో విలవిల్లాడుతున్నారు. తాగునీటితో ఈ రోగమొచ్చినా, అధికారులు తూతూమంత్రపు చర్యలకే పరిమితమవుతున్నారు. గ్రామంలోని దాదాపు 40 శాతం మంది నానా అవస్థలు పడుతూ.. వైద్యం కోసం పడరాని పాట్లు పడుతున్నా
కంపసముద్రం దళితకాలనీలోని ఓ వీధి ఆత్మకూరు: మర్రిపాడు మండలంలోని కంపసముద్రం దళిత కాలనీ వాసులు భయం..భయం నడుమ జీవనం సాగిస్తున్నారు. ఫ్లోరిన్ కారణంగా కిడ్నీ సంబంధిత వ్యాధులతో రెండు నెలల వ్యవధిలో ఐదుగురు మృతి చెందడం వీరిని కలవరపాటుకు గురిచేస్తోంది. కిడ్నీ సంబంధిత సమస్యలు రెండేళ్ల నుంచి ఎక్కువవడంతో వైద్యం నిమిత్తం బద్వేలు, ఆత్మకూరు, నెల్లూరు ప్రాంతాలకు వీరు పరుగులు తీయాల్సి వస్తోంది. జల్జీవన్ ద్వారా సురక్షిత తాగునీటి సరఫరాకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నా, స్థానిక యంత్రాంగం మాత్రం విఫలమవుతోంది. 40 శాతం మందికి.. ఈ కాలనీలో సుమారు 130 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఆరేళ్ల మొదలుకొని 60 ఏళ్ల వయస్సు వారు కిడ్నీ వ్యాధిన బారిన పడ్డారంటే ఇక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ దాదాపు 40 శాతం మందికి ఇది సోకడం గగుర్పాటుకు గురిచేస్తోంది. తాగునీటి సమస్య కారణంగానే ఈ పరిస్థితి తలెత్తుతోందనే విషయాన్ని మండలాధికారులు ఏడాది క్రితం గుర్తించారు. అయినా ఎలాంటి రక్షణ చర్యలను చేపట్టలేదు. మంత్రి ఇలాకాలో ఇలా..! రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఈ దుస్థితి నెలకొన్నా, ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాల్లేవు. ఈ విషయమై కలెక్టర్కు వినతిపత్రాన్ని పలువురు కాలనీ వాసులు గతేడాది అందజేశారు. ఎట్టకేలకు గత నెలాఖరులో ఆత్మకూరు ఆర్డీఓ పావని, డీఎంహెచ్ఓ సుజాత, స్థానిక మండల వైద్యుల బృందం పర్యటించారు. పలువురి వద్ద రక్త నమూనాలను సేకరించారు. 13 ఏళ్ల బాలుడు ఈ వ్యాధి బారిన పడ్డారనే అంశాన్ని గుర్తించారు. అనంతరం కాలనీలోని బోర్లను పరిశీలించి నీటి శాంపిళ్లను సేకరించారు. ఎట్టకేలకు బోర్లలోని నీటితోనే కిడ్నీ వ్యాధులు సంక్రమిస్తున్నాయని గుర్తించి.. తాగేందుకు ఉపయోగించరాదంటూ హెచ్చరికలు రాయించారు. వైద్యానికే భారీగా.. వైద్యం చేయించుకునేందుకు భారీగా వెచ్చించి పలువురు అప్పులపాలయ్యారు. మర్రిపాడు మండలంలోని ఈ గ్రామం మారుమూల కావడంతో ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. గతంలో అప్పటి ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి తన సొంత నిధులతో గ్రామంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ మాత్రమే ఉంది. ఇది గ్రామస్తులు, కాలనీ వాసులకు తాగునీటికి ఉపయోగపడుతోంది. కాలనీకి చెందిన సుమారు 40 మంది ప్రత్యేక వాహనంలో నెల్లూరులోని ఆస్పత్రికి వైద్య పరీక్షల నిమిత్తం శనివారం వెళ్లి మందులను తెచ్చుకున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కిడ్నీ వ్యాధి బాధితుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాగునీటితో కిడ్నీ సమస్యలు చిన్న వయస్సు వారికీ సంక్రమిస్తున్న వైనం రెండు నెలల వ్యవధిలో ఐదుగురి మృతి వైద్యం కోసం పరుగులు మర్రిపాడు మండలంలో భయం.. భయం -
పెన్నానదిలో యువకుడి గల్లంతు
నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ మండలంలోని జొన్నవాడకు సమీపంలోని పెన్నానదిలో ఓ యువకుడు గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు సర్వేపల్లి కాలువకట్ట వద్ద సుబ్రహ్మణ్యం కుటుంబం నివాసం ఉంటోంది. అతడి కుమారుడు సంతోష్ కుమార్ బీకాం కంప్యూటర్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు జొన్నవాడ సమీపంలోని పెన్నానది వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు సంతోష్ నదిలో గల్లంతయ్యాడు. స్థానికులు గమనించి గాలించినా ఫలితం లేకుండా పోయింది. రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి ఆచూకీ కోసం గాలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నేడు ‘డయల్ యువర్ ఎస్ఈ’ నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల కోసం ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమం జరుగుతుందని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ రాఘవేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఎండీ శివశంకర్ ఆదేశాలతో నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల మధ్య 0861 – 2320427 నంబర్కు ఫోన్ చేసి సమస్యలను చెప్పొచ్చన్నారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
నష్టాల ఊబిలో విద్యుత్ సంస్థ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ సంస్థకు బిల్లుల బకాయిలు పేరుకుపోయాయి. నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించేందుకు చార్జీలు పెంచి సామాన్య వినియోగదారులపై అదనపు భారం మోపేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది. ప్రధానంగా ప్రభుత్వరంగ సంస్థల నుంచి రూ.వందల కోట్లు రాబట్టుకోలేక అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పటి వరకు ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కి ల్ పరిధిలో రూ. 313 కోట్లు ప్రభుత్వశాఖల నుంచే రావాల్సి ఉంది. బకాయిలు గుదిబండగా మారి విద్యుత్ సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా తయారైంది. సామాన్య వినియోగదారులు చిన్నమొత్తాలను ఒక నెల కట్టడం ఆలస్యమైతే అదనంగా పెనాల్టీ విధించి వసూలు చేస్తారు. బిల్లును చెల్లించడం రెండునెలలు ఆలస్యమైతే సిబ్బంది విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తారు. అయితే నెలలు తరబడి రూ.కోట్లలో బిల్లుల బకాయిలున్న ప్రభుత్వ శాఖల విద్యుత్ సంస్థ ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేకపోతున్నట్లు విమర్శలున్నాయి. శాఖల వారీగా.. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు విద్యుత్ బిల్లుల రూపంలో రూ.313 కోట్లు బకాయి పడ్డాయి. వీటిలో అధికంగా మేజర్ పంచాయతీలు, వాటర్ వర్క్ పథకాల నుంచి రూ.175 కోట్లు రావాల్సి ఉంది. అదేవిధంగా రెవెన్యూ శాఖ నుంచి రూ.54 కోట్లు, లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి రూ.16 కోట్లు, మున్సిపాలిటీల నుంచి రూ.16 కోట్లు బకాయిలున్నాయి. ఈ నాలుగు శాఖలు అధిక సంఖ్యలో చెల్లించాలి. మిగిలిన శాఖలు బిల్లులు కట్టాల్సి ఉంది. ఏపీఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు, ప్రభుత్వం చొరవ చూపి ప్రభుత్వ శాఖలకు ఆదేశాలివ్వాల్సి ఉంది. పేరుకుపోతున్న బకాయిలు పంచాయతీలు, వాటర్ వర్క్ పథకాల నుంచే రూ.175 కోట్లు రెవెన్యూ శాఖ నుంచి రూ.54 కోట్లు లిఫ్ట్ ఇరిగేషన్, మున్సిపాలిటీల బకాయిలు రూ.32 కోట్లుబకాయిలిలా.. మేజర్ పంచాయతీలు, వాటర్ వర్క్ పథకాల నుంచి రూ.175,00,00,000, రెవెన్యూ శాఖ నుంచి రూ.54,00,00,000, లిఫ్ట్ ఇరిగేషన్ రూ.16,34,78,000, మున్సిపాలిటీలు రూ.16,00,00,000, వైద్యశాఖ రూ.7,45,09,000, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ రూ.6,95,17,000, ఎడ్యుకేషన్ రూ.4,61,04,000, కలెక్టరేట్ రూ.4,48,55,000, ఇరిగేషన్ రూ.2,90,83,000, ట్రాన్స్పోర్టు, ఆర్అండ్బీ రూ.2,43,45,000, హోం శాఖ రూ.1,80,58,000, ఇండస్ట్రీస్, కామర్స్ రూ.1,45,51,000, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ రూ.1,28,84,000, టూరిజం రూ.68,78,000, అగ్రికల్చర్ రూ.58,67,000, బీసీ వెల్ఫేర్ రూ.52,37,000, ఉమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ రూ.48,55,000, పశుసంవర్థక శాఖ రూ.41,98,000, న్యాయశాఖ రూ.22,72,000, ఫైనాన్స్ శాఖ రూ.14,19,000, జనరల్ అడ్మినిస్ట్రేషన్ రూ.11,42,000, ఫారెస్ట్, సైన్స్ రూ.9,28,000, సివిల్ సప్లయ్స్ రూ.5,66,000, హౌసింగ్ రూ.4,59,000, మైనార్టీ వెల్ఫేర్ నుంచి రూ.1,00,000 బకాయిలు రావాల్సి ఉంది. -
జిల్లాలో పేట్రేగుతున్న గంజాయి బ్యాచ్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘జిల్లాలో గంజాయి బ్యాచ్ చేతుల్లో వరుస హత్యలు జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికితోడు రాజకీయ నాయకులు ఒత్తిళ్లతో చర్యలు తీసుకునేందుకు పోలీసులు, అధికారులు వెనకడుగు వేస్తున్నారు. ఆడపిల్లల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది’ అని ఐద్వా జిల్లా కార్యదర్శి మస్తాన్బీ, ఆవాజ్ జిల్లా కార్యదర్శి రషీద్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేంద్ర, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రమణ, నరసింహ అన్నారు. నెల్లూరు బాలాజీ నగర్లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. ఆడపిల్లలను గంజాయి బ్యాచ్ల నుంచి ఎలా కాపాడుకోవాలో తల్లిదండ్రులకు అర్థం కావడం లేదన్నారు. గుమ్మళ్లదిబ్బ ప్రాంతంలోని పాఠశాల వద్ద గంజాయి మత్తులో యువకులు నిత్యం తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బాలిక మృతిచెందిందని ఆరోపించారు. గతేడాది నవంబర్లో గంజాయి బ్యాచ్ చేతిలో పెంచలయ్య హత్యకు గురయ్యాడన్నారు. నేడు కోవూరు నియోజకవర్గంలో బాలిక అఘాయిత్యానికి గురై మృతిచెందడం బాధాకరమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం గంజాయి వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతోందన్నారు. నెల్లూరు జిల్లాలో గంజాయి బ్యాచ్ల చేతుల్లో రెండు హత్యలు జరిగితే సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయకపోవడం విచారకరమన్నారు. బాలిక మృతిలో పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాలికకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సోమవారం మండల కేంద్రాల్లో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో వివిధ సంఘాలకు చెందిన వరలక్ష్మి, కత్తి పద్మ, సుబ్బమ్మ, రియాజ్, యణ్నేష్, అమర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. చోద్యం చూస్తున్న పోలీసులు హత్యలపై స్పందించని సీఎం, హోంమంత్రి వివిధ సంఘాల నేతలు -
స్వగ్రామానికి వెళ్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ఉదయగిరి రూరల్: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడిన ఘటన ఆదివారం సాయంత్రం మండలంలోని సున్నంవారిచింతల వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని తిరుమలాపురం గ్రామానికి చెందిన మద్దిశెట్టి సుందర్ (55) భజన నేర్పిస్తుంటాడు. పని నిమిత్తం ఉదయగిరికి బైక్పై వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. అలాగే వరికుంటపాడు మండలం యర్రంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మనోహర్, గురుబ్రహ్మం బైక్పై ఉదయగిరి వైపు వెళ్తున్నారు. సున్నంవారిచింతలకు వచ్చేసరికి ప్రమాదవశాత్తు రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో సుందర్కు తీవ్రంగా, ఆ ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. గ్రామస్తులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సుందర్ పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఘటనా స్థలానికి ఎస్సై ఇంద్రసేనారెడ్డి చేరుకుని వివరాలు సేకరించారు. ‘యువత గంజాయికి బానిసవుతున్నారు’● వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్కోవూరు: యువత గంజాయికి బానిసలుగా మారి ఒళ్లు తెలియకుండా ప్రవర్తిస్తున్నారని వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. ఆదివారం ఆయన గుమ్మళ్లదిబ్బలో బాలిక మృతదేహానికి నివాళులర్పించి మాట్లాడారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. పునరావృతం కాకుండా పెట్రోలింగ్ పెంచాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసుల్ని ఆదేశించారు. ఈ ఘటనతో మాకు కూడా రక్తం మరుగుతోందన్నారు. పొదలకూరు నిమ్మధరలు (కిలో)పెద్దవి : రూ.50 సన్నవి : రూ.30 పండ్లు : రూ.20 -
కొండదిబ్బలో కార్డన్ సెర్చ్
● 35 ద్విచక్ర వాహనాల స్వాధీనం నెల్లూరు(క్రైమ్): నగరంలోని మూలాపేట కొండదిబ్బ ప్రాంతంలో ఆదివారం కార్డన్ సెర్చ్ జరిగింది. నగర ఏఎస్పీ దీక్ష పర్యవేక్షణలో చిన్నజారు, సంతపేట ఇన్స్పెక్టర్లు చిట్టెం కోటేశ్వరరావు, వైవీ సోమయ్య సిబ్బందితో కలిసి ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 500 మంది వరకు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వారి పూర్తి వివరాలను సేకరించారు. పత్రాలు సక్రమంగా లేని 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోటేశ్వరరావు స్థానిక ప్రజలతో మాట్లాడారు. నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నామని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నా, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్లు విడిచి ఊర్లకు వెళ్లేవారు ఎల్హెచ్ఎంఎస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్డన్ సెర్చ్లో ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మరికొన్ని బ్యాంక్ల విలీనానికి అవకాశం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా ప్రభుత్వరంగ బ్యాంక్లను విలీనం చేసింది. రానున్న కాలంలో మరిన్నింటిని విలీనం చేయడం, ప్రైవేటీకరించేందుకు అవకాశం ఉంది’ అని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం సంయుక్త కార్యదర్శి ఉదయ్కుమార్ అన్నారు. నెల్లూరులోని రోటరీ క్లబ్ ఆడిటోరియంలో ఆదివారం ఏపీ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెల్లూరు రీజియన్ 2వ వార్షికోత్సవ మహాసభ నిర్వహించారు. దీనికి నెల్లూరు రీజీయన్ పరిధిలో పనిచేస్తున్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు విచ్చేశారు. ఉదయ్కుమార్ మాట్లాడుతూ 2020లో మూడు బ్యాంక్లను విలీనం చేశారన్నారు. 2024 మార్చి 8వ తేదీన బ్యాంక్స్ అసోసియేషన్, యునైటెడ్ బ్యాంక్స్ ఫోరం బ్యాంక్ యూనియన్ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు బ్యాంకు ఉద్యోగులకు 5 రోజుల పనిదినాలు అమలు చేయాలని నిర్ణయించినా కేంద్ర ప్రభుత్వం ఆమోదించకపోవడం దారుణమన్నారు. గత నెల 27వ తేదీన ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మె నిర్వహించారన్నారు. ఈనెల 12వ తేదీన జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాక్ ఆఫ్ ఇండియా నెల్లూరు రీజియన్ డిప్యూటీ హెడ్స్ వేణుగోపాల్, శివశంకర్, యూనియన్ నాయకులు శ్రీనివాసరావు, విజయ్భాస్కర్, లక్ష్మీపతి, శ్రీనివాస్, సుమన్, స్వాతి, మృదుల తదితరులు పాల్గొన్నారు. -
పక్కాగా ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణ
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో సోమవారం నుంచి బుధవారం వరకు నిర్వహించనున్న ఏపీపీఎస్సీ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేశామని డీఆర్వో విజయకుమార్ తెలిపారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సమన్వయాధికారులతో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీ శాఖ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, దేవదాయ శాఖ ఈఈ గ్రేడ్ – 3 నియామకాలకు సంబంధించిన పరీక్షలను నెల్లూరు రూరల్, అర్బన్, కావలి, బుచ్చిరెడ్డిపాళెంలోని ఐదు కేంద్రాల్లో నిర్వహించనున్నామని వివరించారు. హాల్ టికెట్తో పాటు ఫొటో గుర్తింపు కార్డును అభ్యర్థులు తీసుకురావాలని కోరారు. కేంద్రాల్లో మొబైల్ ఫోన్లను నిషేధించామని వెల్లడించారు. గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం అల్లూరు: స్థానిక ఆర్డీఆర్ కాలనీలోని మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ గురుకుల పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరంలో ఐదో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ సరిత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గురుకులంలో బాలికలకు 40 సీట్లు కేటాయించారని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినులు అర్హులని తెలిపారు. ఆసక్తి గల వారు మార్చి నాలుగులోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 23 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 67,085 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 24,832 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.78 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. అలరించిన ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎక్స్పో సంగం: విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో మండలంలోని మర్రిపాడు జెడ్పీ హైస్కూల్లో ఆర్ట్స్ – క్రాఫ్ట్స్ ఎక్స్పోను ప్రధానోపాధ్యాయుడు నరసింహమూర్తి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ సుధీర్ హాజరయ్యారు. వివిధ నమూనాలను పరిశీలించిన అనంతరం విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని వారు పేర్కొన్నారు. క్రమబద్ధీకరణలో వేగం పెంచండి ఆత్మకూరు: అనధికార లేఅవుట్లు, భవనాల క్రమబద్ధీకరణ ప్రక్రియలో వేగం పెంచాలని రాష్ట్ర మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ అధికారి మధుకుమార్ కోరారు. పట్టణంలోని పలు లే అవుట్లు, నిర్మాణంలో ఉన్న భవనాలను మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్తో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. పట్టణంలో 272 లేఅవుట్ల రెగ్యులరైజేషన్ కోసం అర్జీలు రాగా, వీటిలో 104 పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచించారు.


