breaking news
	
		
	
  SPSR Nellore District Latest News
- 
      
                   
                               
                   
            పోలీసులూ కూటమికి దాసోహం కావొద్దు
● నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆగ్రహం కోవూరు: ప్రజల రక్షణ కోసం ఉన్న పోలీసులు రాజకీయ నాయకుల బానిసలుగా మారడం విచారకరమని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది పోలీసులు తమ బాధ్యతలను మరిచి, రాజకీయ ఆజ్ఞలకే తల వంచుతూ పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు తెస్తున్నారన్నారు. సోమవారం కోవూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ప్రసన్న మీడియాతో మాట్లాడుతూ తన ఇంటి మీద టీడీపీ రౌడీ మూకలు, కార్యకర్తలే దాడి చేశారని స్పష్టంగా పోలీసులకు తెలిసినా.. గుర్తు తెలియని వ్యక్తులు చేశారంటూ కేసునే తారుమారు చేశారని మండిపడ్డారు. చివరకు తనపైనే తప్పుడు కేసు నమోదు చేశారని, ఇది ఎక్కడి న్యాయమని నిలదీశారు. ప్రజలు ప్రతి విషయం గమనిస్తున్నారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పటికై నా న్యాయమే గెలుస్తుందన్నారు. అధికార మదంతో పనిచేస్తున్న కొంత మంది అధికారులు భవిష్యత్లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. పోలీసులు ప్రభుత్వానికి కాదు, రాజ్యాంగానికి విధేయులుగా ఉండాలని గుర్తుంచుకోవాలన్నారు. - 
      
                   
                               
                   
            ఖండిస్తే.. ప్రశ్నిస్తే చంపేస్తారా?
నెల్లూరు (స్టోన్హౌస్పేట): అధికారంలో ఉన్న వ్యక్తు లు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఆధారాలతో ప్రశ్నిస్తే.. టీడీపీ నేతల దాష్టీకాలను ఖండిస్తే ఏకంగా కత్తులతో పొడిచి చంపేస్తారా అంటూ మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి నిలదీశారు. దీని వెనుక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసన్నారు. ఆదివారం రాత్రి టీడీపీ నాయకుల విచక్షణారహిత దాడిలో తీవ్రంగా గాయపడి నెల్లూరు అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ జాయింట్ సెక్రటరీ బదనాపురి గోపాల్ను సోమవారం కాకాణి పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాకాణి మాట్లాడుతూ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన గోపాల్ వైఎస్సార్సీపీ తరఫున తన గొంతును బలంగా వినిపించడాన్ని స్థానిక టీడీపీ నేతలు తట్టుకోలేక అర్ధరాత్రి అతనిపై దాడి చేసి హతమార్చే ప్రయత్నం చేశారన్నారు. టీడీపీ నేతల దాడిలో గోపాల్ గొంతు దగ్గర 12 సెంటీ మీటర్ల మేర గాయమైందన్నారు. గోపాల్ కళ్లేదుటే ఆయన భార్యను గొంతు పట్టుకుని దుండగులు హింసించారన్నారు. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ దాడిని ఖండించారన్నారు. అర్ధరాత్రి ఇళ్లల్లోకి చొరబడి ఇంత దారుణమా? అర్ధరాత్రి పూట ఇళ్లల్లోకి దూరి నిద్రపోతున్న వారిపై నిర్భయంగా దాడుకు పాల్పడుతున్నారంటేనే శాంతి భద్రతలు పరిస్థితి ఎలా ఉందో ఉహించుకోవచ్చన్నారు. సోమి రెడ్డి ముఠా థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి బూడిద తరలిస్తున్న బల్కర్ల నుంచి రూ.300 చొప్పున అక్రమంగా వసూలు చేస్తున్నారని, చంద్రబాబు విచారణకు ఆదేశిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. అక్రమ వసూళ్లపై మాట్లాడితే సోమిరెడ్డి తన వంధిమాగాధులతో విమర్శలు చేయిస్తున్నారన్నారు. స్థాయికి మించి విమర్శలు చేయొద్దని గోపాల్ టీడీపీ నేతలకు సూచించడం తప్పా అని ప్రశ్నించారు. దీంతో రమేష్ అనే వ్యక్తి గోపాల్ కుటుంబ సభ్యులను బెదిరించాడని, ఏదో ఆవేశంతో మాట్లాడుతున్నారని భావించారే తప్ప హత్య చేసేంత వరకు తెగిస్తారని గోపాల్ కుటుంబ సభ్యులు భావించ లేదన్నారు. చంద్రబాబు పరిపాలనలో ఏ వర్గానికి రక్షణ లేకుండా పోయిందని విచారం వ్యక్తం చేశారు. గోపాల్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్నారు. కేసు తారుమారుకు సోమిరెడ్డి ఒత్తిడి గోపాల్పై దాడి ఘటనకు సంబంధించి బెయిల్బుల్ సెక్షన్లతో అనామకులపై కేసులు నమోదు చేయాలని సోమిరెడ్డి పోలీసు అధికారులపై ఒత్తిడి చేస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. ఈ కేసును మరో రకంగా మార్చేందుకు కూడా కుట్రలు చేస్తున్నారన్నారు. ఎస్పీ ఈ ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఇంత బరితెగింపా సోమిరెడ్డి అక్రమ వసూళ్లను ప్రశ్నించడమే నేరమా మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి - 
      
                   
                               
                   
            సమస్యలు చెప్పి.. స్పందించాలని కోరి
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నమ్మించి ఆస్తి రాయించుకున్నాడు మనవడు మా బాగోగులు చూస్తానన్నాడు. ఇబ్బంది రాకుండా అండగా ఉంటానని నమ్మించి మా పేరుతో ఉన్న ఆస్తిని తన పేరుతో రాయించుకుని మోసం చేశాడని ఓ వృద్ధ దంపతులు వాపోయారు. వివరాలు.. కొడవలూరు మండలం యల్లాయపాళేనికి చెందిన దామర్ల రమణయ్య, శంకరమ్మకు ఊరిలో 98 సెంట్ల భూమి ఉంది. మనవడు ఉపేంద్ర బాగా చూసుకుంటానని వారిని నమ్మించాడు. తీరా చూస్తే బయటకు గెంటివేశాడు. కొడుకు దగ్గరికి వెళ్తే.. నీ ఆస్తి వాడికి రాసిచ్చావు కదా.. అక్కడికే వెళ్లి ఉండమన్నాడు. ఆసరా లేకుండా పోయింని, అధికారులు స్పందించి న్యాయం జరిగేలా చూడాలని కోరారు.నెల్లూరు రూరల్: ‘అయ్యా మా సమస్యల్ని పరిష్కరించండి’ అంటూ ప్రజలు అధికారులను కోరారు. నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కలెక్టర్ హిమాన్షు శుక్లా, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు అర్జీలు స్వీకరించారు. మరమ్మతులు చేయాలి బుజబుజనెల్లూరులోని వాటర్ ప్లాంట్ మరమ్మతులు చేయించాలని 25వ డివిజన్ ప్రజలు వినతిపత్రం సమర్పించారు. కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదన్నారు. కొండ ప్రసాద్, అల్లూరు తిరుపాలు, కృష్ణమూర్తి, మాలకొండయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పథకాలు అందడం లేదు దివ్యాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా ఎ.మహమ్మద్ అయుబ్ వచ్చినప్పట్నుంచి సంక్షేమ పథకాలు, ఇతర ప్రయోజనాలు దివ్యాంగులకు అందడం లేదని నవ్యాంధ్ర వికలాంగుల హక్కుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు షేక్ కాలేషా వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల ప్రయోజనాలను గాలికొదిలేసి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ట్రై సైకిళ్ల తయారీ కర్మాగారాన్ని మూసివేయడానికి కారణమయ్యారని చెప్పారు. బాలికల వసతి గృహాన్ని సందర్శించాలని, సమస్యల్ని పరిష్కరించాలని కలెక్టర్ను కోరారు. టీడీపీ వారు ఇబ్బంది పెడుతున్నారు సర్వే నంబర్ 460లో ఐదుగురికి ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిందని, తెలుగుదేశానికి చెందిన బుట్ట మనోజ్ అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని దగదర్తి మండలం వెలుపోడు గ్రామానికి చెందిన మహిళలు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ పొలంలో వేసిన రాళ్లను తీసేయడంతో తహసీల్దార్ మళ్లీ వేయించినట్లు చెప్పారు. మనోజ్ సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి తమను పొలంలోనికి రానివ్వడం లేదని, న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో దొరసానమ్మ, ఆస్మిన్, నజీమా, రమీజా తదితరులు పాల్గొన్నారు. బీసీ భవన్ను పూర్తి చేయాలి నెల్లూరు నగరంలో జ్యోతిరావు పూలే బీసీ భవన్ను నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని జాతీయ బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.శ్రీనివాస యాదవ్ కోరారు. వారు మాట్లాడుతూ పని జరగకపోగా అక్కడున్న గ్రావెల్, కమ్మి, ఇతర సామగ్రి మొత్తం అయిందన్నారు. పిచ్చిచెట్లతో అడవిలా దర్శనమిస్తోందన్నారు. జంగిల్ క్లియరెన్స్ కోసం బీసీ కార్పొరేషన్ దగ్గర నిధులు లేవని తెలిసిందని, అనుమతిస్తే సొంత నిధులతో పనులు చేస్తామన్నారు. కార్యక్రమంలో మురళి యాదవ్, సోమ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం లంచాలమయం నేషనల్ హైవే కోసం భూమి ఇస్తే ఇంకా పరిహారం ఇవ్వలేదని ఉలవపాడు మండలం కె.రాజుపాళెం గ్రామానికి చెందిన వెంకటేశ్వర స్వామి కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ ఏడాదిన్నరగా తహసీల్దార్ చుట్టూ తిరుగుతున్నట్లు చెప్పారు. లంచం అడుగుతున్నారని, ఈ విషయంపై కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగితే తహసీల్దార్ సంప్రదించమని చెప్పారన్నారు. అక్కడికి వెళ్తే లంచం లేనిదే కుదరని తెలిపారు. ఎస్సైని సంప్రదించగా లంచం అడిగారు. ఈ ప్రభుత్వం లంచాల మత్తులో జోగుతోందన్నారు. కారుణ్య నియామకాల కోసం.. ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తూ మరణించిన ఉద్యోగులకు సంబంధించి వారి కుమార్తెలకు కారుణ్య నియామకాలు కింద అవకాశం కల్పించాలని కలెక్టర్కు అభ్యర్థులు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ పెళ్లి అయిన తర్వాత కూతుర్లకు అవకాశం లేదని తెలపడం దారుణమన్నారు. తండ్రికి ఒకటే కూతురు ఉన్నప్పుడు కారుణ్య నియామకం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. గత సంవత్సరం ఒంగోలు, విజయవాడలో ఇచ్చారన్నారు. కార్యక్రమంలో సౌజన్య, చాందిని, శ్రీవాణి, షరీనా బేగం తదితరులు పాల్గొన్నారు. రూ.15 వేల పెన్షన్ ఇప్పించండి ఈ చిత్రంలో దివ్యాంగురాలి పేరు పసుపుల వెంకటరమణమ్మ. సైదాపురం మండలంలో ఉంటుంది. పని చేయలేని స్థితిలో ఉంది. కనీసం అన్నం తినడానికి చేతులు సహకరించవు. ఆమె బాధ్యతల్ని తల్లి చూసుకుంటున్నారు. రూ.15 వేల పెన్షన్ కోసం వినతిపత్రం సమర్పించారు. - 
      
                   
                               
                   
            మద్యం దుకాణానికి రీ నోటిఫికేషన్
నెల్లూరు (క్రైమ్): కావలి నియోజకవర్గంలోని బోగోలు పరిధిలో గెజిట్ సీరియల్ నంబర్ 59 మద్యం దుకాణానికి ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు సోమవారం రీ నోటిఫికేషన్ జారీ చేశారు. నేటి నుంచి ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్, ఆన్లైన్ విధానాల్లో దరఖాస్తులు స్వీకరిస్తామనీ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి (డీపీఈఓ) ఎ. శ్రీనివాసులునాయుడు తెలిపారు. దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలని తెలిపారు. ఈ నెల 12వ తేదీ ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని శంకరన్ హాల్లో లాటరీ తీసి షాపును కేటాయించడం జరుగుతుందని తెలిపారు. పూర్తి వివరాలకు కావలి ఎకై ్సజ్ కార్యాలయంలో సంప్రదించాలని శ్రీనివాసులునాయుడు సూచించారు. నీట్ విద్యార్థులకు ఉచిత శిక్షణ నెల్లూరు (స్టోన్హౌస్పేట): ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమశాఖలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకొన్న విద్యార్థులకు నీట్ కోచింగ్ పొందాలనుకునే వారికి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ శాఖ జిల్లా సమన్వయ అధికారిణి డాక్టర్ సి.ప్రభావతమ్మ సోమవారం ప్రకటనలో తెలిపారు. విజయవాడలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ అందించనున్నట్లు ఈ అవకాశాన్ని విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. డ్రగ్ కంట్రోల్ ఏడీ బాధ్యతల స్వీకరణ నెల్లూరు(అర్బన్): జిల్లా ఔషధ నియంత్రణ శాఖ (డ్రగ్ కంట్రోలర్) నూతన ఏడీగా హరిహరతేజ సోమవారం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన్ను జిల్లా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ తరఫున పలువురు నాయకులు కలిసి శాలువాలు కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. హరిహరతేజ మాట్లాడుతూ డాక్టర్ల ప్రిస్కిప్షన్ మేరకే మందులివ్వాలన్నారు. మందులు కొనుగోలు చేసిన వారికి బిల్లులు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు పేరూరి ప్రదీప్, కార్యదర్శి వెంకటేశ్వర్లు, కోశాధికారి నరేంద్ర, అశోక్, భాస్కర్, లీలామోహన్, పవన్, పాండు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. తీరంలో భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోవాలి ● డీఐజీ గోపీనాథ్జెట్టి నెల్లూరు (క్రైమ్): మైపా డు బీచ్లో ఆదివారం ఈతకెళ్లి ముగ్గురు బాలురు మృతి చెందారని, ఇలాంటి దురదృష్ట ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన అన్నీ చర్యలు తీసు కోవాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ, మైరెన్ ఇన్చార్జి అధికారి గోపీనాథ్జెట్టి సోమవారం టెలికాన్ఫరెన్స్లో మైరెన్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ నెల 5వ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 21 మైరెన్ పోలీసు స్టేషన్ల పరిధిలోని అన్నీ బీచ్ల వద్ద తగినంత పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామన్నారు. సముద్ర స్నానానికి వచ్చే సందర్శకులు పోలీసు అధికారుల సూచనలు పాటించాలన్నారు. మోంథా తుఫాన్ కారణంగా బీచ్ల్లో ఎక్కడకక్కడ గుంతలు ఏర్పడి ప్రమాదవశాత్తు మునిగిపోయే అవకాశం ఉందని, సముద్ర స్నానాలకు వచ్చే సందర్శకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 6 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు 84,442 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 24,692 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.51 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 8 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ చెబుతోంది. - 
      
                   
                               
                   
            జిల్లా కేంద్రంలో ఓ ఔషధ అధికారి దందా.. మెడికల్ షాపుల యజమానులను వణికిస్తోంది. కార్యాలయానికి డుమ్మా కొట్టి.. ఇంటినే అవినీతికి అడ్డాగా మార్చేశాడు. ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీలు, రికార్డుల పర
నెల్లూరు (అర్బన్): జిల్లాలో ఔషధ నియంత్రణ శాఖ అనుమతులు కలిగిన సుమారు 1850 హోల్సేల్, రీటైల్ మెడికల్ పాపులున్నాయి. రోజూ రూ.కోట్లలో వ్యాపారాలు జరుగుతాయి. ఈ మందుల దుకాణాలను కావలి, నెల్లూరు డివిజన్లుగా విభజించారు. ఒక్కో డివిజన్కు ఒక్కో డ్రగ్ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణాధికారి ఉంటారు. కావలి డివిజన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ పరిధిలో కావలి, కందుకూరు, ఆత్మకూరు, కోవూరు, ఉదయగిరి నియోజకవర్గాల పరిధిలోని మండలాలతోపాటు నెల్లూరు నగరంలోని 1 నుంచి 15 డివిజన్లు, 25 నుంచి 50 వరకు డివిజన్లు ఉన్నాయి. 14 నుంచి 24 డివిజన్లు, మిగతా మండలాలు మరో డ్రగ్ ఇన్స్పెక్టర్ పరిధిలో ఉన్నాయి. ఒక ప్రాంతంలోని దుకాణాలన్నింటిని ఒకే ఇన్స్పెక్టర్ కింద ఉంచాలి. అలా కాకుండా జిల్లాల పునర్విభజన జరిగినప్పుడు జిల్లా ఔషధ నియంత్రణాధికారి హడావుడిగా డివిజన్ల విభజన చేసి నివేదికను సిద్ధం చేయడంతో ఇలాంటి గందరగోళం నెలకొంది. ఫలితంగా కావలి డివిజన్ ఇన్స్పెక్టర్కు 5 నియోజకవర్గాల్లోని మెడికల్ షాపులతోపాటు నెల్లూరు నగరంలోని సగానికి పైగా మందుల దుకాణాలను కేటాయించారు. అసంబద్ధంగా విభజన జరగడంతో నెల్లూరు నగరంలోని 25వ డివిజన్ కావలి డ్రగ్ ఇన్స్పెక్టర్ పరిధి ఉంటే ఆ పక్కనే ఉండే 24వ డివిజన్ మరో డ్రగ్ ఇన్స్పెక్టర్ పరిధిలో ఉంది. ఇలా గందరగోళంగా విభజన జరిగింది. ఇంటి వద్దనే తనిఖీలు ప్రైవేట్ మెడికల్ షాపు యజమాని చెప్పినట్లు నోటీసులకు వివరణ ఇచ్చేందుకు రికార్డులు తీసుకుని ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఇంటి వద్దకు మెడికల్ షాపుల యజమానులు రికార్డులు తీసుకెళ్తున్నారు. అక్కడ ఆయన మొక్కుబడిగా రికార్డులు పరిశీలించి రూ.10 వేలు చొప్పున వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వేళ మెడికల్ షాపుల వద్దకే ఆ డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీలకు వెళ్తే మాత్రం రూ.20 వేలు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. ఇటీవల ఎన్టీఆర్ నగర్లోని మెడికల్ షాపులను కావలి డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేశారు. వారందరినీ తను ప్రైవేట్గా నియమించుకున్న మరో మెడికల్ షాపు యజమాని వద్దకు పంపారని తెలుస్తోంది. ఆ ప్రైవేట్ వ్యక్తి రూ.10 వేలు చొప్పున వసూలు చేసి సదరు అధికారికి అందజేస్తున్నారని సమాచారం. ఇవే కాక నెలవారీ సాధారణ మామూ ళ్లు ఉంటాయి. అయినా కక్కుర్తి పడి దుకాణాదారులను వేధిస్తూ అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారననే విమర్శలు వినిపిస్తున్నాయి. సదరు ఔషధశాఖాధికారి అవినీతి దందాకు మెడికల్ షాపుల యజమానులు వణికిపోతున్నారు. ఇప్పటికై నా కొత్తగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఔషధ నియంత్రణాధికారి పరిస్థితులను అవినీతికి చెక్ పెట్టాలని మెడికల్ దుకాణాల యజమానులు కోరుతున్నారు. నోటీసులు పంపించి.. కావలి డివిజన్ డ్రగ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించే అధికారి అక్కడి కార్యాలయానికి చుట్టపు చూపుగా వెళ్తున్నాడు. నెల్లూరు ఏడీ కార్యాలయంలోనే తిష్ట వేసి ఇక్కడే నివాసం ఉంటున్నాడు. కార్యాలయ సిబ్బందిని పక్కన బెట్టి విజయమహల్ గేటు సమీపంలో మెడికల్ షాపు నిర్వహిస్తున్న ఓ ప్రైవేట్ వ్యక్తిని తన అనుచరుడిగా నియమించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ ప్రైవేట్ వ్యక్తి తన వాట్సాప్ ద్వారా ఇతర మెడికల్ షాపుల యజమానులకు డ్రగ్ ఇన్స్పెక్టర్ పంపించిన నోటీసులు అందజేసి విచారణకు రికార్డులు తీసుకుని రావాలని చెబుతున్నారని సమాచారం. ప్రైవేట్ వ్యక్తులతో నోటీసులు ఇంటి వద్దకే పిలిపించుకుని రికార్డుల పరిశీలన పరిశీలనకు వస్తే రూ.10 వేలు మెడికల్ షాపుల తనిఖీకి వెళ్తే రూ.20 వేలు డిమాండ్ హడలిపోతున్న మెడికల్ వ్యాపారులు - 
      
                   
                               
                   
            కక్ష సాధింపు చర్యలు.. డైవర్షన్ పాలిటిక్స్
వెంకటాచలం: చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలు, డైవర్షన్ పాలిటిక్స్తో దుర్మార్గపు పాలన సాగిస్తున్నారని, ఇలాంటి ఎన్నడూ చూడలేదని ప్రజలు అసహ్యించుకుంటున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి అన్నారు. నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ అక్రమ అరెస్ట్ తర్వాత చెముడుగుంటలోని నెల్లూరు సెంట్రల్ జైలుకు తీసుకొస్తున్నారన్న సమాచారంతో సోమవారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధరెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి భారీగా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు జైలు వద్దకు తరలివచ్చారు. కాకాణి మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నరగా విచ్చలవిడిగా నకిలీ మద్యం తయారు చేసి, ఎందరో ప్రాణాలను బలితీసుకున్నారన్నారు. నకిలీ మద్యంతో రూ.వేల కోట్లు వెనకేస్తున్నారని ఎక్సైజ్ అధికారులే నిగ్గు తేల్చారన్నారు. నకిలీ మద్యంలో టీడీపీ నేతలు ఉంటే.. నిస్సిగ్గుగా వైఎస్సార్సీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్పై కేసు పెట్టడం, అక్రమ అరెస్ట్లు చేయించడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అసమర్థ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారన్నారు. ములకలచెరువులో టీడీపీ నేతలు నకిలీ మద్యంను తయారు చేసి రూ.100లకు అమ్మి సొమ్ము చేసుకుంటూ అమాయక ప్రజల ప్రాణాలను హరిస్తున్నారన్నారు. జోగి రమేష్పై తప్పుడు కేసు కక్ష సాధింపే వైఎస్సార్సీపీ నేత చెబితే టీడీపీ నేతలు నకిలీ మ ద్యం తయారు చేశారంటూ చెప్పించి జోగి రమేష్పై తప్పుడు కేసు పెట్టించడం కక్ష సాధింపే అన్నారు. వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉన్న నేతలను టారె్గ్ట్ చేసి అక్రమ కేసులు బనాయిస్తుండడం పరిపాటిగా మారిందన్నారు. ఒక అబద్ధపు వాంగ్మూలాన్ని నమోదు చేసి ఈ అక్రమ అరెస్ట్కు పాల్పడ్డారన్నారు. ఇలాంటి అక్రమ అరెస్ట్లకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నేతలు ఎవరూ బెదరన్నారు. కూటమి నేతలు అరాచకాలు చూస్తుంటే.. రాబోయే రోజుల్లో వారు చెల్లించుకునే భారీ మూల్యం ఏ విధంగా ఉంటుందో గుర్తించుకోవాలని హెచ్చరించారు. అక్రమ అరెస్ట్లతో పార్టీ కేడర్ను భయపెట్టాలని చూస్తే అది వారి భ్రమవుతుందన్నారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని కూటమి నేతలు తెలుసుకోవాలన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం, వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ఇలాంటి అక్రమ అరెస్ట్లను ప్రోత్సహించిన వారందరిని చట్ట పరంగా శిక్షిస్తామన్నారు. రూ.300 కోట్ల స్కిల్ కేసులో అక్రమాలకు పాల్పడిన చంద్రబాబును అరెస్ట్ చేస్తే లోకేశ్, పవన్కళ్యాణ్ రోడ్ల మీదకు వచ్చి వేసిన డ్రామాలు మరవలేదన్నారు. ఏ తప్పు చేయని వైఎస్సార్సీపీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నప్పుడు ఈ విషయం వారికి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నేతలవి కుటుంబాలు కావా, ఆ కుటుంబాలు రోడ్డు మీదకు రావా ఒకసారి ఆలోచించు కోవాలన్నారు. కూటమి ప్రభుత్వ దుర్మార్గపు పాలనను ప్రజలు బిహార్ వంటి రాష్ట్రంలో కూడా చూసి ఉండరన్నారు. అరాచక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం త్వరలోనే ప్రజాగ్రహానికి గురై కుప్ప కూలుతుందన్నారు. జోగి రమేష్ కుటుంబాని పార్టీ తప్పక అండగా ఉంటుందన్నారు. ఇది తప్పుడు కేసని కోర్టులో తేలుతుందని, నిర్దోషిగా బయటకు వస్తారని స్పష్టం చేశారు. జైలు వద్ద భారీగా పోలీస్ బలగాల మోహరింపు మాజీమంత్రి జోగి రమేష్పై అక్రమ కేసులు పెట్టి కోర్టుకు హాజరుపర్చగా ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ విధించడంలో ఆయన్ను నెల్లూరు సెంట్రల్ జైలు వద్దకు తరలించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు, బీసీ సామాజిక వర్గాల నేతలు రావడంతో భారీగా పోలీసులు మోహరించారు. జైలుకు ముందు బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరిని అక్కడికి రానివ్వకుండా అడ్డుకున్నారు. చంద్రబాబు బతుకంతా తప్పుడు విధానాలే నకిలీ మద్యం తయారీదారులు టీడీపీ నేతలైతే.. జోగి రమేష్కు ఏం సంబంధం అక్రమ అరెస్ట్లకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి - 
      
                   
                               
                   
            ఆర్ అండ్ బీ ఉద్యోగుల నిరసన
● ఆపాలని బెదిరించడం తగదు నెల్లూరు(అర్బన్): రోడ్లు, భవనాల శాఖలో ఉద్యోగులపై క్షక సాధింపు చర్యలు ఆపాలని, ఇష్టారాజ్యంగా జరుగుతున్న అవినీతిని అరికట్టాలని డిమాండ్ చేస్తూ ఆర్ అండ్బీ ఉద్యోగులు సోమవారం నగరంలోని ఆ శాఖ సర్కిల్ కార్యాలయం వద్ద భోజన విరామ సమయంలో నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. జేఏసీ అమరావతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా జేఏసీ అధ్యక్షుడు శరత్బాబు మాట్లాడుతూ తమ ఆందోళనల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఆర్ అండ్బీ అధికారుల అవినీతిపై విజిలెన్స్ దాడులు జరుగుతాయనే అనుమానంతో ఒకటికి మూడు పదవులు అనుభవిస్తున్న ఒక అధికారి తమ నిరసనలు ఆపాలని బెదిరిస్తున్నారన్నారు. ఆయన వల్లే ఈ శాఖ భ్రష్టు పట్టిందన్నారు. ముడుపులు ఇవ్వకపోతే ఫైళ్లు ముందుకు కదలడం లేదన్నారు. మంత్రిని అడ్డుపెట్టుకుని ఉద్యోగులను బెదిరించడం తగదన్నారు. ఇలాంటి బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్బాబు, సురేష్బాబు, రాము తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            ఎమ్మెల్సీ పరామర్శ
నెల్లూరు(స్టోన్హౌస్పేట): మైపాడ్ బీచ్లో మృతిచెందిన నగరంలోని 42వ డివిజన్కు చెందిన విద్యార్థులు సమీద్, హుమయూన్ మృతదేహాలకు వైఎస్సార్సీపీ నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి సోమవారం నివాళులర్పించారు. కార్పొరేటర్ కరీముల్లా, పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్, ఉపాధ్యక్షుడు హంజాహుస్సేనీతో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు. కార్యక్రమంలో పార్టీ స్టేట్ సెక్రటరీ పేర్నేటి కోటేశ్వరరెడ్డి, మైనార్టీ నాయకులు అలీం, విద్యార్థి విభాగానికి చెందిన పలువురు పాల్గొన్నారు. ఆత్మకూరు చెరువులో మృతదేహంఆత్మకూరురూరల్: ఈత కోసం ఆత్మకూరు చెరువులో ఆదివారం సాయంత్రం దిగి గల్లంతైన పట్టణానికి చెందిన నలిశెట్టి మహేష్ (30) అనే యువకుడు మృతిచెందాడు. మృతదేహాన్ని గజ ఈతగాళ్ల సాయంతో సోమవారం వెలికితీశారు. అందరితో కలివిడిగా ఉండే మహేష్ మృతితో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. సీఐ గంగాధర్, ఎస్సై జిలానీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ మాట్లాడుతూ ఆత్మకూరు చెరువు పూర్తిగా నిండి నీళ్లు లోతుగా ఉన్నందున ఎవరూ ఈతకు వెళ్లొద్దన్నారు. - 
      
                    
అప్పులపాలై.. దొంగగా మారి
● నిందితుడి అరెస్ట్ ● రూ.5.15 లక్షల సొత్తు స్వాధీనం నెల్లూరు(క్రైమ్): బెట్టింగ్ల్లో అప్పులపాలైన సివిల్ ఇంజినీర్ దొంగగా మారాడు. గొలుసు, బైక్ దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తిరగసాగాడు. నిఘా ఉంచిన పోలీసులు సోమవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. నెల్లూరు చిన్నబజారు పోలీస్స్టేషన్లో ఇన్స్పెక్టర్ చిట్టెం కోటేశ్వరరావు వివరాలను వెల్లడించారు. నెల్లూరు నగరంలోని చాకలివీధిలో ఎస్.లక్ష్మమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా నివాసం ఉంటోంది. ఆమె తన పైపోర్షన్ ఖాళీగా ఉండటంతో టూలెట్బోర్డు పెట్టింది. సెప్టెంబర్ 23వ తేదీన గుర్తుతెలియని వ్యక్తి బాడుగ విషయమై మాట్లాడుతున్నట్లు నటిస్తూ ఆమె మెడలోని బంగారు సరుడును తెంపుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి గుర్తింపు సాంకేతికత ఆధారంగా నిందితుడు పొదలకూరు మండలం సూరాయపాళెం గ్రామానికి చెందిన చతల శ్రీనాథ్గా గుర్తించి గాలించారు. సోమవారం ఎస్సై అయ్యప్ప నేతృత్వంలోని బృందం పొగతోట ఎస్2 థియేటర్ రోడ్డులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చిన్నబజారు, బాలాజీనగర్ పోలీసుస్టేషన్ల పరిధిలో రెండు గొలుసు దొంగతనాలు, చిన్నబజారు పరిధిలో మూడు బైక్లు, బుచ్చిరెడ్డిపాళెం స్టేషన్ పరిధిలో రెండు, నవాబుపేట, దర్గామిట్ట స్టేషన్ల పరిధిలో రెండు బైక్లను చోరీ చేసినట్లు బయటపడింది. అతన్ని అరెస్ట్ చేసి రూ.5.15 లక్షల విలువైన 48 గ్రాముల బంగారు గొలుసులు, ఏడు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. అప్పులపాలై.. శ్రీనాథ్ బీటెక్ సివిల్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటుపడి అప్పులపాలయ్యాడు. అప్పుల బాధ తాళలేక దొంగగా మారాడని ఇన్స్పెక్టర్ తెలిపారు. కేసును ఛేదించినందుకు సిబ్బంది గిరి, సురేష్, సుధాకర్, సతీష్, శ్యామ్, సుబ్బారావు తదితరులను ఎస్పీ అజిత అభినందించి రివార్డులు ప్రకటించారని చెప్పారు. - 
      
                   
                               
                   
            నవలా పోటీల విజేతలకు అభినందనలు
నెల్లూరు(బృందావనం): అంతర్జాతీయ స్థాయిలో అమెరికాకు చెందిన (డల్లాస్, టెక్సాస్) సిరికోన సాహితి అకాడమీ – జొన్నలగడ్డ రాంభొట్లు సరోజనమ్మ స్మారక నవలా రచనల పోటీల విజేతలను అభినందించారు. నిర్వాహకులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, శారద పర్యవేక్షణలో ఆన్లైన్ కాన్ఫరెన్స్ జరిగింది. మాండలిక భాషతో సమగ్ర గ్రామీణ జీవితాన్ని ఆవిష్కరిస్తూ డాక్టర్ బి.నాగశేషు రచించిన ‘కిలారి’ ఉత్తమ నవలగా, మూడుతరాల నారీ చేతనకు అద్దం పడుతూ రెంటాల కల్పన రచించిన ‘కావేరికి అటూ ఇటూ’ నవల, నల్లమల చెంచుల జీవితాన్ని పరిచయం చేస్తూ రంజిత్ గన్నోజు రచించిన ‘లింగాల కంఠం’లో నవలకు ప్రత్యేక బహుమతులు దక్కాయి. కార్యక్రమంలో కొలకలూరి ఇనాక్, డాక్టర్ పాలకోడేటి సత్యనారాయణ, ప్రముఖ సాహితి విశ్లేషకులు లెనిన్, దర్భముళ్ల చంద్రశేఖర్ తదితరులు ఆయా నవలను సమీక్షించారు. - 
      
                   
                               
                   
            సింగిల్ నంబర్లాటపై పోలీసుల దాడులు
● ఐదుగురి అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): సింగిల్ నంబర్లాటపై నెల్లూరు సంతపేట పోలీసులు సోమవారం దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. సంతపేట పోలీసుస్టేషన్లో ఇన్స్పెక్టర్ వైవీ సోమయ్య నిందితుల వివరాలను వెల్లడించారు. సిరి థియేటర్ సమీప కఠారిపాళెంలో సింగిల్ నంబర్లాట జరుగుతోందని సోమవారం ఇన్స్పెక్టర్కు సమాచారం అందింది. ఆయన తన సిబ్బందితో కలిసి దాడి చేశారు. లాటరీ రాస్తున్న కఠారిపాళేనికి చెందిన కె.చిన్న, సంతపేట బుజ్జమ్మరేవుకు చెందిన గంగాధర్తోపాటు జూదమాడుతున్న నిప్పో సెంటర్కు చెందిన షేక్ పెద్దనాగూర్, రంగనాయకులపేటకు చెందిన షేక్ జమీర్, జెండావీధికి చెందిన షేక్ అమీన్ను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.10,190 నగదును స్వాధీనం చేసుకున్నామని ఇన్స్పెక్టర్ తెలిపారు. స్టేషన్ పరిధిలో ఎక్కడైనా పేకాట, సింగిల్ నంబర్లాట, చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే డయల్ 112 లేదా పోలీసుస్టేషన్కు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. - 
      
                   
                               
                   
            వసతి గృహాల్లో అధ్వానంగా వసతులు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘ప్రభుత్వ వసతి గృహాల్లో వసతులు అధ్వానంగా ఉన్నాయి. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు’ అని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాసర్ తెలిపారు. విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్ర సోమవారం నెల్లూరుకు చేరుకుంది. నగరంలోని అనిత ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాసర్ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరమైనా రూ.6,400 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణతో పేద, మధ్య తరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో సరిపడా గదుల్లేవని, మెస్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. నారా లోకేశ్ తన మంత్రిత్వ శాఖను వదిలేసి విదేశాల్లో తిరుగుతూ ముఖ్యమంత్రిగా అన్నట్టుగా వ్యవహరిస్తునాన్నరని ఆరోపించారు. విద్యార్థులతో పెట్టుకుంటే ప్రభుత్వాలు కూలిపోయిన చరిత్రను కూటమి ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రదాన కార్యదర్శి మస్తాన్ షరీఫ్, నాయకులు స్వామి, అభి, సుమన్, చరణ్, శివమ్వర్మ, యస్ధానీ, జీవన్, సాయి, సుధీర్, సర్దార్, సోహైల్ పాల్గొన్నారు. టైల్స్ పని చేస్తుండగా..● బెంగాల్ వాసి మృతి నెల్లూరు(క్రైమ్): టైల్స్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు నాలుగో అ అంతస్తు నుంచి కిందపడి బెంగాల్ వాసి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. కొండాయపాళెం గంగోత్రి నగర్కు చెందిన కమలాకర్రెడ్డి లీలామహాల్ సమీపంలో డాక్టర్ హరిత నూతనంగా నిర్మిస్తున్న భవనానికి సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఆ భవనంలో బెంగాల్కు చెందిన ఎ.బాద్షా తన ప్రాంతానికి చెందిన పలువురితో టైల్స్ పనులు చేయిస్తున్నాడు. సోమవారం నాలుగో అంతస్తులో టైల్స్ పనులు చేస్తున్న సజల్ మెహతా ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన సూపర్వైజర్ క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. సూపర్వైజర్ చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది.● మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను విరమించాలి ● ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి నాసర్ - 
      
                   
                               
                   
            ఆస్తి తీసుకున్నారు.. గాలికొదిలేశారు
● ఫిర్యాదు చేసిన వృద్ధులు ● చట్టపరిధిలో విచారించి న్యాయం చేస్తా ● బాధితులకు ఎస్పీ అజిత భరోసానెల్లూరు(క్రైమ్): ‘నా చిన్న కుమారుడు అసబ్, అతని కుటుంబ సభ్యులు ఏటీఎం కార్డు, పాస్బుక్ను తీసుకుని బాగోగులు చూసుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారు’ ఇదీ నెల్లూరు చిన్నబజారు ప్రాంతానికి చెందిన ఓ వృద్ధుడి ఆవేదన. ‘నా భార్య అనారోగ్యంతో ఉంది. నా పేరుపైనున్న ఆస్తిని కుమారులు, కుమార్తెలు రాయించుకున్నారు. వారు మమ్మల్ని పట్టించుకోవడం లేదు’ నవాబుపేటకు చెందిన మరో వృద్ధుడి బాధ. సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 202 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజితకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె ఆయా ప్రాంత పోలీసు అఽధికారులతో మాట్లాడారు. సమస్యలను చట్టపరిధిలో విచారించి న్యాయం చేస్తానని భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, డీటీసీ, మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీలు గిరిధర్, చెంచురామారావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినతుల్లో కొన్ని.. ● సుధాకర్ డెన్మార్క్లో నివాసం ఉంటున్నాడు. అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.45లక్షలు తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నా ఉద్యోగం ఇప్పించకుండా, నగదు తిరిగివ్వకుండా ఇబ్బందులు పెడుతున్నాడని చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ● నా తండ్రి ఎక్స్ సర్వీస్మెన్. ఆయనకు దగదర్తి మండలంలో భూమి ఇచ్చారు. సాగు చేసుకోనివ్వకుండా సుబ్బరాయుడు, సుబ్బారావు ఇబ్బందులు పెడుతున్నారని ఓ మహిళ అర్జీ ఇచ్చారు. ● నా పొలంలోని వరిని సుమన్ మరికొందరు కోసుకువెళ్లారు. వారిపై పొదలకూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదైందని, అరెస్ట్ చేయాలని మనుబోలుకు చెందిన ఓ వ్యక్తి కోరాడు. ● నా భర్త చనిపోయాడు. ఆయనకు చెందిన ఆస్తిని ఇవ్వకుండా, ఇంట్లోకి రానివ్వకుండా అత్తింటివారు ఇబ్బంది పెడుతున్నారు. విచారించి న్యాయం చేయాలని వీవీపాళేనికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. తరలివచ్చి.. గతనెల 20వ తేదీన దీపావళి, 27న తుఫాను కారణంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరగలేదు. ఈ నేపథ్యంలో సోమవారం పెద్ద సంఖ్యలో ప్రజలు తమ సమస్యలను పోలీసు అధికారులకు విన్నవించేందుకు ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్హాలు వద్దకు వచ్చారు. వేదికను అక్కడి నుంచి జిల్లా పోలీసు కార్యాలయానికి మార్చారన్న విషయం తెలియని కొందరు ఈ వారమూ రద్దు చేశారేమోనని భావించి వెనుదిరిగారు. ఇంతలో అక్కడున్న పోలీసు సిబ్బంది వేదిక మార్పు గురించి చెప్పారు. - 
      
                    
కావ్యకు చెక్ పెట్టేలా..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల వేళ ఏకతాటిపై నిలిచిన టీడీపీ క్యాడర్ ప్రస్తుతం రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు కత్తులు దూసుకునే పరిస్థితి నెలకొంది. మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబానికి దన్నుగా నిలిచిన బీద రవిచంద్ర ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక కావలిలో టీడీపీలో వర్గ రాజకీయాలు చోటు చేసుకున్నాయి. తన శిష్యుడైన మాలేపాటిని టీడీపీ కావలి ఇన్చార్జిగా నియమించి, ఎమ్మెల్యే అభ్యర్థిగా బీద నిలబెట్టాడు. అయితే ఆఖరి క్షణంలో దగుమాటి వెంకటకృష్ణారెడ్డి (కావ్య కృష్ణారెడ్డి) కావలి టికెట్ తన్నుకుపోయారు. మాలేపాటికి టికెట్ దక్కకపోవడంపై ఆయన వర్గం అప్పట్లో భగ్గుమంది. అయితే పార్టీ ఆదేశాలంటూ తనకు అన్యాయం జరిగినా ఎన్నికల వేళ పార్టీకి విజయానికి కృషి చేశారు. అదృష్టం కొద్ది దగుమాటి గెలవడం, టీడీపీ అధికారంలోకి రావడంతో పార్టీని తన గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో తనకు అంతర్గత శత్రువులుగా ఉన్న పార్టీ క్యాడర్తోపాటు బీద, మాలేపాటిల ప్రాధాన్యతను తగ్గించేందుకు పావులు కదిపారు. వైరి వర్గాల మధ్య అగాధం టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే కావ్య, మాలేపాటి మధ్య వైరం పెరిగింది. ఒకరికొకరు తరచూ అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకొనే పరిస్థితికి రావడంతో మాలేపాటికి చెక్ పెట్టేందుకు ఆయనకు వ్యతిరేకంగా ఆయన సొంత మండలంలోనే చోటా నేతగా ఉన్న పమిడి రవికుమార్చౌదరిని ఎమ్మెల్యే కావ్య పెంచి పోషిస్తున్నాడు. దగదర్తి మండల పెత్తనమంతా పమిడి చేతిలో పెట్టారు. మాలేపాటి వర్గానికి ఏ చిన్న పనిచేయొద్దని అధికారులకు ఆదేశాలు పంపించారు. ఈ క్రమంలో మాలేపాటిపైనే ఆయన సొంత మండలంలోనే సొంత పార్టీ నేతలతోనే కేసులు పెట్టించారు. ఇలా వారి మధ్య విభేదాలు భారీ అగాధాన్ని సృష్టించింది. నియోజకవర్గంలో మట్టి, గ్రావెల్ అక్రమ రవాణాపై ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే స్థాయికి చేరాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బీదకు ఎమ్మెల్సీ దక్కడంతో పార్టీలో కావ్యను వ్యతిరేకించే వర్గమంతా బీద పక్షాన చేరారు. మాలేపాటి మరణానికి కావ్యనే కారణమంటూ.. మాలేపాటికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయనకు ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టింది. అయినా నియోజకవర్గంలో అధికారులెవరూ తన మాట వినకుండా కావ్య వేధింపులు ఎక్కువ కావడంతో ఇద్దరి మధ్య నిప్పు, ఉప్పులా మారింది. ఈ క్రమంలో దగదర్తి మండలంలో జరుగుతున్న డీఆర్ చానల్ పనుల్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయంటూ మాలేపాటి సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేయడం, విజిలెన్స్ విచారణకు ఆదేశించడం జరిగింది. దీంతో మాలేపాటిపైనే పమిడితో కలెక్టర్కు ఫిర్యాదు చేయించారు. ఇలా ఇద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. కావ్య వేధింపులపై మాలేపాటి అధిష్టానికి గోడు వెళ్లబోసుకున్నా పట్టించుకోలేదు. ఆత్మీయుడనుకున్న బీద కూడా మౌనం దాల్చడంతో తీవ్ర ఉద్వేగంతో మాలేపాటి బ్రెయిన్ స్టోక్కు గురయ్యారనే ఆయన వర్గీయులు కారాలు, మిరియాలు నూరుతున్నారు. ఇదే సమయంలో ఆయన సోదరుడు కుమారుడు భానుచందర్ గుండెపోటుతో మరణించాడు. మరుసటి రోజే మాలేపాటి మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషాదానికి ఎమ్మెల్యేనే కారణమని భావిస్తున్న ఆ కుటుంబంతోపాటు ఆయన సామాజిక వర్గం ఒక్కసారిగా భగ్గుమంది. అయితే మాలేపాటి మరణం తర్వాత కూడా ఎమ్మెల్యే అధికార దర్పం ఉపయోగించి ఆ కుటుంబాన్ని పరామర్శించకూడదని, ఉత్తరక్రియల్లో పాల్గొనకూడదంటూ హుకుం జారీ చేయడం, కావలిలో సుబ్బానాయుడు, భానుచందర్కు నివాళి అర్పిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించడం వంటి కారణాలు ఆ సామాజిక వర్గానికి మరింత కోపం తెప్పించింది. ఈ నేపథ్యంలో కావలిలో జరుగుతున్న పరిణామాలు అధిష్టానం వద్దకు చేరడంతో ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కావలిలో ఎమ్మెల్సీ బీద వర్సెస్ ఎమ్మెల్యే దగుమాటిగా మారిన వైరి వర్గాలు మాలేపాటి మరణంతో ఎమ్మెల్యే తీరుపై ఓ సామాజిక వర్గం ఆగ్రహావేశాలు కావ్య ఆధిపత్యానికి చెక్ పెట్టే దిశగా బీద కసరత్తు నియోజకవర్గాన్ని తన కంట్రోల్లోకి తీసుకునేందుకు అధిష్టానం వద్ద ప్రతిపాదన అంతా బీదనే చేస్తున్నాడంటూ ఎమ్మెల్యే సైతం అధిష్టాన పెద్దలకు ఫిర్యాదు ఇన్చార్జి మంత్రి ఫరూఖ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లానే సాక్ష్యమని చెప్పినట్లు సమాచారం మాలేపాటి మరణం తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి అధిష్టానం వద్ద చెక్ పెట్టేలా ఎమ్మెల్సీ బీద రవిచంద్ర వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం ఉన్న బీద మాలేపాటి మరణం అవకాశం దొరకడంతో తన వ్యూహాలకు పదును పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో మాలేపాటి పేరుతో ఉన్న తన ఆస్తుల వ్యవహారం వెలుగులోకి రావడంతో బీదకు కోపం నషాళానికి ఎక్కింది. ఇదంతా ఎమ్మెల్యేనే వెలుగులోకి తెచ్చారని భావించిన బీద పార్టీలో కావ్యను ఒంటిరి చేసిలా అడుగులు వేస్తున్నట్లు ఆ వర్గాల్లో హాట్టాపిక్ చర్చ నడుస్తోంది. జిల్లాలో ఒక్క మంత్రి ఆనం మినహాయించి పార్టీ కీలక లీడర్లు మొత్తం బీద వెనకే ఉన్నారు. ఇదే సమయంలో మాలేపాటి సామాజిక వర్గం ఏకమవ్వడంతో ఎమ్మెల్యే పవర్స్కు చెక్ పెట్టి నియోజక వర్గాన్ని బీద తన చేతుల్లోకి తీసుకునేలా లోకేశ్పై ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. రెండు రోజుల నుంచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుకూల అధికారుల జాబితాను సిద్ధం చేసి త్వరలోనే వారిని బదిలీపై పంపించి వారి స్థానంలో బీద సూచించిన వారికి పోస్టింగ్లు ఇప్పించేలా చేస్తున్నారన్న ప్రచారం ఉంది. దీంతో ఎమ్మెల్యే వర్గం సైతం బీద దూకుడుపై మండిపడుతుంది.అంతా బీదనే చేస్తున్నాడంటూ.. ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు మరణం కావలి టీడీపీలో ఆధిపత్య కుంపటిని రాజేసింది. ఇప్పటికే ఎమ్మెల్సీ బీద వర్సెస్ ఎమ్మెల్యే దగుమాటి వైరి వర్గాల మధ్య అంతర్గతంగా ఉన్న విభేదాలు తాజాగా బహిర్గతమయ్యాయి. ఇవి ఏ స్థాయికి చేరాయంటే మాలేపాటి ఉత్తరక్రియలకు హాజరైన సాక్షాత్తు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాతోపాటు జిల్లా ఇన్చార్జి మంత్రి ఫరూఖ్, ఎమ్మెల్యే కావ్యను కారు కూడా దిగయనీయకుండా వెళ్లగొట్టి తీవ్ర పరాభవానికి గురి చేసేంత వరకు వెళ్లింది. కావలి నియోజకవర్గంలో టీడీపీలో వర్గాలనే రెచ్చగొట్టడం, విభేదాలు సృష్టించడం అంతా ఎమ్మెల్సీ బీదనే చేస్తున్నాడంటూ ఎమ్మెల్యే కావ్య అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు పల్లా, మంత్రి ఫరూఖ్ సాక్ష్యమంటూ చెప్పినట్లు సమాచారం. మాలేపాటి ఉత్తరక్రియలకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జిల్లా ఇన్చార్జి మంత్రి ఫరూఖ్తో కలిసి ఎమ్మెల్యే కావ్య వచ్చారు. అయితే మాలేపాటి వర్గీయులు వీరి ముగ్గురిని కారు కూడా దిగనీయకుండా బీభత్సం చేశారు. కారుపై కుర్చీలు వేస్తూ, గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఉత్తర క్రియలకు హాజరై పల్లాతోపాటు ఫరూఖ్ కారు దిగకుండానే తిరుగు ముఖం పట్టారు. ఇది వారు తీవ్ర పరాభవంగా భావిస్తున్నారు. దీనంతటికి బీదనే కారణమంటూ ఆయన వల్లే మీకు పరాభవం జరిగిందని వారితో అధిష్టానికి చెప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. - 
      
                   
                               
                   
            కలల రెక్కలు మింగేసిన రాకాసి అలలు
● మరణంలోనూ వీడని స్నేహబంధం ● విషాదంగా మారిన విహారం ● ముగ్గురు బాలుర కుటుంబాల్లో కన్నీటి సుడులు ● మృతదేహాలు జీజీహెచ్ మార్చురీకి తరలింపు ● నేడు పోస్టుమార్టంనెల్లూరు (క్రైమ్): తల్లిదండ్రుల కలల రెక్కలు ఆ బిడ్డలే. కడలి తీరంలోని రాకాసి అలలు.. కడుపు కోత మిగిల్చాయి. ఆ ముగ్గురు చిన్ననాటి నుంచి స్నేహితులు. పాఠశాల నుంచి కలిసి చదువుకున్నారు. ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నారు. కళాశాలలు వేరైనప్పటికీ ముగ్గురూ రోజూ కలుసుకుంటుండే వారు. ఆదివారం ముగ్గురు స్నేహితులు ఇళ్లల్లో చెప్పకుండా సరదాగా మైపాడు బీచ్కెళ్లారు. ఈత కొడుతూ మృత్యువాత పడ్డారు. మరణంలోనూ వారి స్నేహబంధం కొనసాగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తీసుకు వస్తున్నారని సమాచారం అందుకున్న మృతుల బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో జీజీహెచ్కు చేరుకున్నారు. అంబులెన్స్లో వచ్చిన మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఒక్కొక్కరిదీ.. ఒక్కొ పరిస్థితి నెల్లూరు నగరంలోని కోటమిట్టకు చెందిన బాబు, జబీన్ దంపతులు. వారికి సమీద్ (18), హమీద్ కుమారులు. సమీద్ చిన్న వయస్సులోనే తండ్రి మృతి చెందాడు. తాత రసూల్ సాహెబ్, తల్లి జబీన్ కష్టపడి చదివిస్తున్నారు. సమీద్ ప్రస్తుతం నగరంలోని కృష్ణచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ● కోటమిట్ట ప్రాంతానికి చెందిన నాయబ్రసూల్, మున్నీ దంపతులు. వారికి హుమయూన్ (18), కుమార్తె ఉంది. నాయబ్రసూల్ బంగారు పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. హుమయూన్ అరవిందానగర్లోని నారాయణ జూనియర్ కళాశాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. హుమయూన్, సమీద్ దగ్గరి బందువులు. ● కోటమిట్టకు చెందిన రహమత్ ప్రస్తుతం నారాయణరెడ్డిపేటలో నివాసం ఉంటున్నారు. ఆయనకు తాజీమ్(18), మరో కుమారుడున్నారు. ఆయన బంగారు పనిచేసుకుంటూ పిల్లలిద్దరిని చదివిస్తున్నాడు. తాజీమ్ నెల్లూరు అరవిందానగర్లోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. విధికి కన్ను కుట్టి ఆదివారం కావడంతో ముగ్గురు స్నేిహితులు ఇళ్లలో ఇప్పుడే వస్తామని చెప్పి సరదాగా మైపాడు బీచ్కు వెళ్లారు. విధికి కన్నుకుట్టిందేమో ఈతకెళ్లిన ముగ్గురూ మృతి చెందారు. మధ్యాహ్నం అవుతున్నా పిల్లలు రాకపోవడంతో కుటుంబ సభ్యులు వారికి ఫోన్ చేయగా ఎవరూ లిఫ్ట్ చేయలేదు. అంతలోనే పోలీసులు ఫోన్ చేసి ముగ్గురు మైపాడు బీచ్లో మృతి చెందారని చెప్పడంతో కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. హుటాహుటిన కొందరు మైపాడు బీచ్కు వెళ్లగా కొందరు జీజీహెచ్కు చేరుకున్నారు. బీచ్ నుంచి మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి రావడంతో విగతజీవులుగా పడి ఉన్న బాలలను చూసి బాధిత కుటుంబ సభ్యులు, బందువులు, స్నేహితులు కన్నీటిమున్నీరయ్యారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న వారిని సముద్రం రూపంలో మృత్యువు బలితీసుకుందని, తమ కడుపు కోతను తీర్చేదెవరంటూ విలపించారు. మైనార్టీ నాయకులు పలువురు హాస్పిటల్ వద్దకు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. నేడు పోస్టుమార్టం మృతదేహాలను అంబులెన్స్లో జీజీహెచ్కు తరలించారు. అప్పటికే రాత్రి కావడంతో మృతదేహాలకు సోమవారం పోస్టుమార్టం జరగనుంది. అనంతరం కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించనున్నారు. ఒకే వీధిలో మొదలైన స్నేహం..ం ఒకే తరగతి గదిలో పూసిన నవ్వులు..ం ఒకే కలలు కలగన్న ముగ్గురు ప్రాణమిత్రులు. స్నేహ బంధం వారిని కలిపింది. మరణం వారిని విడదీయలేకపోయింది. కడలి తీరంలో ఆడుకుంటూ ఆ ముగ్గురు కళ్లముందే కెరటాల్లో ఒదిగిపోయారు. తల్లిదండ్రుల సంతోషాలు, కలలను రాకాసి అలలు మింగేసింది. బిడ్డల కోసం ఎదురుచూసిన తల్లిదండ్రుల కళ్లలో అంతకు ముందు క్షణపు ఆనంద జ్ఞాపకాలు.. అంతలోనే దుఃఖపు చీకట్లుగా మారాయి. జీజీహెచ్ మార్చురీ వద్దకు మృతదేహాలు చేరినప్పుడు ఆ తల్లుల ఆర్తనాదాలు ఆకాశాన్ని అంటాయి. - 
      
                   
                               
                   
            కాశీబుగ్గ మరణాలు.. ప్రభుత్వ హత్యలే
● కాకాణి గోవర్ధన్రెడ్డి ● వేంకటేశ్వరస్వామి ఆలయం ఎదుట కొవ్వొత్తులతో ఘన నివాళి నెల్లూరు (బృందావనం): కాశీబుగ్గలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట మరణాలు.. ప్రభుత్వ నిర్లక్ష్యంతో చేసిన హత్యలే అని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనలో మృతి చెందిన భక్తులకు వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి నగరంలోని మా గుంట లేఅవుట్లో ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయం ఎదుట ఆదివారం రాత్రి కొవ్వొత్తులతో ఘన నివాళి అర్పించారు. కాకాణి మాట్లాడుతూ కూటమి పాలన లో ప్రజలతోపాటు భక్తులకు భద్రత కరువైందన్నారు. 17 నెలల పాలనలో వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో ఆరుగురు, సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా ఏడుగురు, కాశీబుగ్గలో ఏకాదశి సందర్భంగా 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారన్నారు. తిరుమల పవిత్రమైన లడ్డూ ప్రసాదం మీద ఆరోపణలు చేసిన నాటి నుంచి ఇలాంటి దుర్ఘటనలుగా జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ కాశీబుగ్గ ఘటనలో సీఎం తీరు దారుణమన్నారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి, మేకపాటి విక్రమ్రెడ్డి, వెంకటగిరి, నెల్లూరు సమన్వయకర్తలు నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి, ఆనం విజయకుమార్రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితరెడ్డి, స్థానిక కార్పొరేటర్ మొయిళ్లగౌరి, అనుబంధ సంఘాల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            తప్పు చేయకపోయినా శిక్ష వేస్తారా
● మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి నెల్లూరు (స్టోన్హౌస్పేట): తప్పు చేసినట్లు సాక్ష్యాలు లేక పోయినా మాజీమంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేయడం గర్హనీయమని నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి ఖండించారు. జగన్మోహన్రెడ్డి పొరపాటు చేసి ఉంటే సరిదిద్దుకునే తత్వముందన్నారు. 2029లో అందరికీ సరైన పాఠం చెబుతారని తెలిపారు. ఆయన పక్కన ఉండే వాళ్లు ఆయన క్షేమం కోరే వాళ్లు అయి ఉండాలని, ఆయనకు భజన చేసే వాళ్లు కాదన్నారు. పొరపాటును సరిదిద్దుకోవాలంటే సంకల్పబలం ఉండాలన్నారు. తన తనయుడు మేకపాటి గౌతమ్రెడ్డి ఉంటే జగన్మోహన్రెడ్డికి ఎంతో ఉపయోగపడే వారని, మంచి చేయడానికి ఎంతో కృషి చేసేవాడని, ఆయన లేకపోవడం తీరని లోటు అన్నారు. ప్రభుత్వం ఆక్రమాలను దాచి పెడుతూ అక్రమ కేసులపై తీసుకుంటున్న శ్రద్ధ కూటమి ప్రభుత్వానికే నష్టమన్నారు. సీబీఐ విచారణ చేయమంటే అరెస్టా? ● మాజీ ఎమ్మెల్యే మేకపాటి నెల్లూరు(స్టోన్హౌస్పేట): తనపై వేసిన నిందలను నిరూపించేందుకు సీబీఐ విచారణ చేపట్టా లని అడిగిన మాజీ మంత్రి జోగి రమేష్ను తెల్లవారు జామున 100 మంది పోలీసులు వెళ్లి అరెస్ట్ చేయడం ఎంత వరకు సబబు అని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరు డైకస్రోడ్డులోని మేకపాటి నివాసంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కల్తీ మద్యం విషయాన్ని వైఎస్సార్సీపీ బయట పెడితే కూటమి ప్రభుత్వం డైవర్ట్ చేసేందుకు ఏదో ఒక అంశాన్ని ప్రజల ముందుకు తెస్తుందన్నా రు. రెండేళ్లుగా జరుగుతున్న నకిలీ మద్యం తయారీ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ఆఫ్రికా నుంచి జనార్దన్రావును రప్పించి మాజీ మంత్రి జోగి రమేష్పై నెట్టేయడం దారుణమన్నారు. ఎటువంటి ఆధారాలు లేకపోయినా అరెస్ట్ చేయడం, కూటమి ప్రభుత్వ మీడియా ఇదంతా ఆయన వల్లే జరిగిందని ప్రచారం చేస్తుందన్నారు. గతంలో తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు ఆధారాలు ఉంటే అరెస్ట్ ఎందుకు చేయలేదని ప్రశ్నించడాన్ని గుర్తు చేశారు. ఆత్మకూరులో కిరాణా షాపుల్లో సైతం మద్యం దొరుకుతుందంటే కూటమి ప్రభుత్వం ఏ మేరకు దిగజారిపోయిందో అర్థమవుతుందన్నారు. ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పి తీరుతారన్నారు. నేడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నెల్లూరురూరల్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు తమ అర్జీలను అధికారిక వెబ్సైట్ meekosam. ap. gov. in ద్వారా నమోదు చేసుకోవచ్చని, అర్జీ స్థితి, ఇతర వివరాలకు సంబంధించి సమాచారం కోసం నేరుగా 1100 కాల్ సెంటర్ను సంప్రదించాలని కోరారు. అర్జీదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. - 
      
                   
                               
                   
            గౌతమ్.. హుందాతనం రాజకీయ నేత
● మాజీఎంపీ మేకపాటిరాజమోహన్రెడ్డి ● ఘనంగా దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి వేడుకలు నెల్లూరు (స్టోన్హౌస్పేట): దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి హుందాతనం, విలువలు, విశ్వసనీయతతో కూడిన రాజకీయ నేత అని ఆయన తండ్రి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి కొనియాడారు. మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి వేడుకలను నెల్లూరులోని మేకపాటి నివాసంలో ఆదివారం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గౌతమ్ రెడ్డి చిత్రపటానికి తల్లిదండ్రులు రాజమోహన్ రెడ్డి, మణిమంజరి, ఉదయగిరి వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి, సోదరులు ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి, ఫృధ్వీరెడ్డి, మేకపాటి అభినవ్రెడ్డి కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ తమ కుమారుడు గౌతమ్ ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుని ప్రతి ఒక్కరి ప్రేమాభిమానులకు పాత్రుడై, అందరి మదిలో జ్ఞాపకంగా నిలిచిపోయారన్నారు. గౌతమ్ ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని, మరుపురాని నేతగా నిలిచిపోయారన్నారు. రాజకీయాల్లో హుందాగా నిలిచారని, రానున్న రోజుల్లో గౌతమ్ ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తామని, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు అవసరమైన అభివృద్ధికికి తమ పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. నివాళులర్పించిన ఆత్మీయులు దివంగత మంత్రి గౌతమ్రెడ్డి జయంతి సందర్భంగా పలువురు ఆత్మీయులు హాజరై ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్కుమార్యాదవ్, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, మేరిగ మురళీధర్, నెల్లూరు రూరల్, వెంకటగిరి సమన్వయకర్తలు ఆనం విజయ్కుమార్ రెడ్డి, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ పరిశీలకులు కొడవలూరు ధనుంజయరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, పార్లమెంటరీ పరిశీలకులు జంకె వెంకటరెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గ పరిశీలకులు పేర్నాటి కోటేశ్వరరెడ్డి, పాళెం సుధీర్ కుమార్ రెడ్డి, నాయకులు, ప్రజాప్రతినిధులు, మేకపాటి అభిమానులు పాల్గొని గౌతమ్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. - 
      
                   
                               
                   
            జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి.. నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న డిమాండ్ చేశారు. నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన డీవైఎఫ్ఐ జిల్లా మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పలు శాఖల్లో లక్షకుపైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వీటి భర్తీకి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతిని కల్పిస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వంచించిందని మండిపడ్డారు. డీఎస్సీ మినహా ఏ ఉద్యోగమివ్వలేదని, పరిశ్రమల పేరిట భూ మాఫియా జరుగుతోందని ఆరోపించారు. డ్రగ్స్, గంజాయి, మద్యం వినియోగం పెరిగిపోయిందని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ఆపాలని కోరారు. డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమణ, అధ్యక్షుడు నరసింహ, నేతలు ప్రసాద్, మాధవ్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            పవన్ కల్యాణ్ ఎక్కడ దాక్కున్నావయ్యా..?
కొడవలూరు: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుంటే.. అధికారంలో భాగస్వామిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడ దాక్కున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి నిలదీశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మండలంలోని దామేగుంటలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. కందుకూరులో కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని చంపితే నోరు మెదపలేదని, పరామర్శించలేదని దుయ్యబట్టారు. పేదలకు వైద్యం, విద్యార్థులకు ఉచిత విద్య లభించే మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తుంటే మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. నకిలీ మద్యం తయారీ సూత్రధారులు టీడీపీ నేతలేని తెలిసినా, కాశీబుగ్గలో భక్తులు మరణించినా.. నోరు మెదపకపోవడం, చంద్రబాబుకు కొమ్ముకాయడం దారుణమని చెప్పారు. చంద్రబాబుకు కష్టమొస్తే మాత్రం ప్రత్యక్షమవుతావానని ప్రశ్నించారు. పేదలు, కాపులకు అన్యాయం జరుగుతుంటే పదవి కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. ఆయనకు చిత్తశుద్ధి, నిజాయతీ ఉంటే పదవికి రాజీనామా చేసి ప్రజల పక్షాన పోరాడాలని సూచించారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ అన్యాయం నకిలీ మద్యం తయారీలో సూత్రధారులు టీడీపీకి చెందిన జయచంద్రారెడ్డి, జనార్దన్రావు అయితే వారిని పక్కనబెట్టి ఎలాంటి సంబంధం లేని మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. నకిలీ మద్యంలో తనకెలాంటి సంబంధం లేదని జోగి రమేష్.. కనకదుర్గమ్మ గుడిలో ప్రమాణం చేశారని తెలిపారు. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ తన తండ్రికి లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని కోరినా ఎందుకు నిర్వహించడంలేదని ప్రశ్నించారు. నకిలీ మద్యం సూత్రధారులైన టీడీపీ వారిని కాపాడేందుకు చంద్రబాబు అక్రమ అరెస్ట్లు చేస్తున్నారని ఆరోపించారు. సూత్రధారులను బయటపెట్టాలనే చిత్తశుద్ధి చంద్రబాబుకు ఉంటే సీబీఐ లేదా సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్ట్లతో ప్రతిపక్షాల గొంతు నులిమేసేందుకు కూటమి సర్కారు యత్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. డీసీఎమ్మెస్, ఆఫ్కాఫ్ మాజీ చైర్మన్లు వీరి చలపతిరావు, కొండూరు అనిల్బాబు, పార్టీ రాష్ట్ర ప్రచార విభాగ కార్యదర్శి కొట్టే మల్లికార్జున, మండలాధ్యక్షుడు చిమటా శేషగిరిరావు, ఎంపీపీ జ్యోతి, నేతలు బాలశంకర్రెడ్డి, మోహనకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ప్రసన్నకుమార్రెడ్డి - 
      
                   
                               
                   
            డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ నేడు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని ప్రతి సోమవారం నిర్వహించనున్నారని సీఎండీ శివశంకర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన వినియోగదారులు విద్యుత్ సమస్యలపై నేరుగా తనతో మాట్లాడొచ్చని చెప్పారు. 89777 16661 నంబర్కు ఉదయం పది నుంచి 12లోపు ఫోన్ చేయాలని సూచించారు. అదనపు కట్నం కోసం వేధింపులు నెల్లూరు(క్రైమ్): అదనపు కట్నం కోసం భార్యను వేధింపులకు గురిచేసిన భర్త మరికొందరిపై కేసును పోలీసులు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. మద్రాస్ బస్టాండ్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో సల్మా, రియాజ్ అహ్మద్ దంపతులు నివాసం ఉంటున్నారు. అదనపు కట్నం కోసం ఆమెను కొంతకాలంగా భర్త, అత్తింటివారు వేధించసాగారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు చిన్నబజార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. - 
      
                   
                               
                   
            ఎస్ఈఐఎల్ ఎనర్జీకి ఉత్తమ సేవా అవార్డు
ముత్తుకూరు(పొదలకూరు): మండలంలో విద్యుదుత్పత్తి సంస్థ ఎస్ఈఐఎల్ ఎనర్జీకి యూబీఎస్ ఫోరమ్ ఉత్తమ సామాజిక సేవా కార్యక్రమ అవార్డు లభించింది. 15వ వార్షిక కార్పొరేట్ సీఎస్ఈ సమ్మిట్ అండ్ అవార్డుల సందర్భంగా ఉత్తమ సేవా కార్యక్రమ పురస్కారాన్ని బెంగళూరులో సంస్థ సీనియర్ మేనేజర్ కామేశ్వరరావు అందుకున్నారు. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ జన్మేజయ మహాపాత్ర మాట్లాడారు. జిల్లాలో గ్రామీణ ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపర్చడంలో తాము కృషి చేస్తున్నామని వెల్లడించారు. చెరువులో యువకుడి గల్లంతు ఆత్మకూరు రూరల్: చెరువులో ఈతకెళ్లి యువకుడు గల్లంతైన ఘటన ఆత్మకూరులో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ గంగాధర్ వివరాల మేరకు.. పట్టణానికి చెందిన నలిశెట్టి మహేష్ (30) స్థానికంగా వాటర్ ప్లాంట్ను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తన స్నేహితులతో కలిసి ఈత నిమిత్తం చెరువు వద్దకెళ్లారు. తనకు ఈతొచ్చని చెప్తూ, చెరువులో వేగంగా దూకారు. కొద్దిసేపటికే కేకలేస్తూ మునిగి గల్లంతయ్యారు. కాపాడేందుకు స్థానికులు విఫలయత్నం చేశారు. గజఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది దాదాపు రెండు గంటల పాటు గాలించారు. చీకటిపడటంతో యత్నాన్ని ఆపేశారు. గాలింపు చర్యలను సోమవారం చేపట్టనున్నామని సీఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఘటన స్థలం వద్ద కుటుంబసభ్యులు రోదించారు. చేపల వేటకెళ్లి వ్యక్తి మృతి కావలి(అల్లూరు): చేపల వేటకెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన కావలి మండలంలోని తుమ్మలపెంట సమీపంలో గల తీరం వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. తుమ్మలపెంట పంచాయతీ పెదరాముడుపాళేనికి చెందిన కాటంగారి బ్రహ్మయ్య (34).. గ్రామస్తులతో కలిసి జువ్వలదిన్నె హార్బర్ నుంచి బోటులో చేపలు పట్టేందుకు శనివారం రాత్రి వెళ్లారు. ఈ క్రమంలో తుమ్మలపెంట సమీపంలో చేపలు పడుతూ బోటు నుంచి ప్రమాదశాత్తూ పడిపోయారు. అలల ధాటికి మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ఘటనపై పోలీసులకు మృతుడి భార్య ఫిర్యాదు చేశారు. కేసును ఎస్సై తిరుమలరెడ్డి నమోదు చేశారు. కాగా మృతుడికి ఇద్దరు కుమారులున్నారు. వ్యక్తి అనుమానాస్పద మృతి ఇందుకూరుపేట: వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన మండలంలోని లేబూరు మజరా నాగరాజుతోపులో ఆదివారం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఉప్పాల శ్రీనివాసులు.. ఓ రైతు పొలంలో సపోట చెట్టుకు కాయలు కోసేందుకు వెళ్లి మృతి చెందారు. చెట్టు పైనుంచి పడ్డారా.. లేదా మరే కారణమాననే అంశం తెలియరాలేదు. ఘటన స్థలానికి కోవూరు సీఐ సుధాకర్రెడ్డి, ఎస్సై నాగార్జునరెడ్డి చేరుకొని వివరాలను ఆరాతీశారు. మృతుడికి భార్య, పిల్లలున్నారు. బైక్లు ఢీకొని నలుగురికి తీవ్ర గాయాలు దుత్తలూరు : దుత్తలూరు సమీపంలోని భారత్ పెట్రోల్ బంకు వద్ద 565 జాతీయ రహదారిపై రెండు మోటార్ బైక్లు ఆదివారం ఢీకొన్న ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. దుత్తలూరుకు చెందిన ఉదయ్, పూజిత దంపతులు తమ కుమారుడికి అనారోగ్యంగా ఉండటంతో బైక్పై ప్రకాశం జిల్లా పామూరులోని వైద్యశాలకు తీసుకెళ్లి చూపించి తిరిగి బయల్దేరారు. అలాగే వరికుంటపాడు మండలం రామదేవులపాడు గ్రామానికి చెందిన మధు, రోశయ్య మోటార్సైకిల్పై దుత్తలూరు వైపు నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. భారత్ పెట్రోల్ బంక్ వద్ద రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో బైక్లపై ఉన్న నలుగురూ తీవ్రంగా గాయపడ్డారు. ఉదయ్ కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. క్షతగాత్రులను హైవే అంబులెన్స్లో చికిత్స నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం నెల్లూరు తరలించారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలను సేకరిస్తున్నారు. - 
      
                   
                               
                   
            ఆర్ అండ్ బీపై విజిలెన్స్
నెల్లూరు(అర్బన్): ఆర్ అండ్ బీ సర్కిల్ కార్యాలయంలో అవినీతి తారస్థాయికి చేరింది. ఈ అంశమై అవినీతి తిమింగలాలు అనే శీర్షికన సాక్షిలో కథనం శనివారం ప్రచురితమైంది. ఆ శాఖ ఉన్నతాధికారితో పాటు మరో ఇద్దరు అధికారుల అవినీతికి వ్యతిరేకంగా అక్కడి ఉద్యోగులే నిరసన చేపట్టారు. ఫలితంగా వ్యవహారం వీధినపడింది. దీంతో విచారణను విజిలెన్స్ శాఖ అధికారులు శనివారం నుంచే చేపట్టారు. ఉద్యోగ సంఘాల నేతలు, కొంతమంది ఉద్యోగులను కలిసి వివరాలను సేకరించారు. నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపనున్నారు. దీంతో సర్కిల్ కార్యాలయంలో ప్రతి పనికీ ఓ రేటును నిర్ణయించి వసూలు చేస్తున్న అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అవినీతిలో కొత్త పుంతలు ఆర్ అండ్ బీలో ఎస్ఈగా పనిచేసిన అధికారి మూడు రోజుల క్రితమే ఉద్యోగ విరమణ పొందారు. ఈ స్థానంలో కావలి ఈఈ రామకృష్ణప్రసాద్ ఎఫ్ఏసీగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు ఆ శాఖలో కోట్లాది రూపాయల పనులు నిరంతరం జరుగుతుంటాయి. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు, ఇతర ప్యాకేజీ పనులకు సంబంధించిన అగ్రిమెంట్లు జరగాల్సి ఉంది. ఓ అధికారి ఉద్యోగ విరమణ పొందినా, అగ్రిమెంట్లపై పాత తేదీలతో సంతకాలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు అధికారి తన ఇంటి వద్దకే ఫైళ్లు తెప్పించుకొని అగ్రిమెంట్లు చేస్తున్నారని ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. కార్యాలయంలో డిస్పాచ్ విభాగంలో టెక్నికల్ ఆఫీసర్తో పాటు మరో జేఈ సహకరిస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. అగ్రిమెంట్లను త్వరగా చేస్తున్నందుకు గానూ సదరు మాజీ అధికారికి కమీషన్లను ముట్టజెప్తున్నారని తెలుస్తోంది. డిస్పాచ్, డ్రాయింగ్ విభాగాల అధికారులకూ వాటాలందుతున్నాయని సమాచారం. నిబంధనలు బేఖాతర్ ఉదాహరణకు ఒక కాంట్రాక్టర్ టెండర్ దక్కించుకుంటే టెక్నికల్ ఆఫీస్లో మీటింగ్ జరగాలి. సెక్షన్ ద్వారా అగ్రిమెంట్ను సిద్ధం చేశాక సంతకాన్ని సూపరింటెండెంట్ చేయాలి. ఆపై పీఏ టు ఎస్ఈ.. చివరగా సర్కిల్ ఎస్ఈ చేయాల్సి ఉంటుంది. అయితే పలు పనుల్లో ఇలాంటి నిబంధనలను పాటించడంలేదు. వీరెవరి సంతకాల్లేకుండానే నేరుగా ఎస్ఈ చేశారు. పనులు జరగడంతో అధికారుల జేబులు నిండాయి. విజిలెన్స్ అధికారుల విచారణలో ఈ అంశాలు వెలుగుచూస్తున్నాయని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఆర్ అండ్ బీలో ప్రధానంగా జేఈ సెక్షన్లో ఎన్డీబీ.. పీఆర్ఎఫ్ బిల్డింగ్స్.. పీహెచ్సీ భవనాల పనులు జరుగుతుంటాయి. పీహెచ్సీ భవనాలకు సంబంధించిన చెక్పవర్ అధికారికే ఉంటుంది. ఇక్కడ ఒక్కో వర్కు జాబితా రూ.40 కోట్లకుపైగా ఉన్న సందర్భాలున్నాయి. ఈ పనులు చేసేందుకు సాధారణంగా ముగ్గురు జేఈలు ఉండేవారు. అయితే వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో ఇద్దర్ని తిరుపతి జిల్లాకు మార్చేశారు. దీంతో ఒకరే ఉన్నారు. ఈ క్రమంలో కార్యాలయానికి గంట ముందే వచ్చి చక్కబెడుతున్నారు. పనులు, పర్సంటేజీలు, ఉన్నతాధికారి దోపిడీకి సహకరించడం మొత్తం ఈ సెక్షన్ ద్వారానే ఎక్కువగా జరుగుతోందని కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. డ్రాయింగ్ విభాగంలో పీఎస్, అత్యవసర, రీప్లేస్మెంట్ తదితర నాన్ప్లానింగ్ వర్క్లు జరుగుతుంటాయి. ఇక్కడ టెక్నికల్ ఆఫీసర్ ద్వారా పనులు, పర్సంటేజీలు సాగుతున్నాయి. పాత తేదీలతో ఫైళ్లపై సంతకాలు పెట్టడం కుదరదు బాధ్యతలు స్వీకరించి రెండు రోజులే అయింది. ఉద్యోగ విరమణ పొందిన అధికారి పాత తేదీలతో ఫైళ్లపై సంతకాలు పెట్టడమనేది జరగదు. నా దృష్టికి రాలేదు. కార్యాలయంలో ఉద్యోగుల నిరసనలను పరిశీలించి వారి సమస్యలను పరిష్కరిస్తా. ఎలాంటి అవినీతికి తావులేకుండా చూస్తా. – రామకృష్ణప్రసాద్, నూతన ఎస్ఈ (ఎఫ్ఏసీ) అంతా అవినీతిమయం సర్కిల్ కార్యాలయం ఇద్దరు, ముగ్గురు అధికారులతో అవినీతిమయమైంది. ఉద్యోగ విరమణ పొందిన ఎస్ఈయే దీనికి బాధ్యుడు. ఇంక్రిమెంట్లివ్వకపోవడం, డబ్బులిచ్చిన వారికి ప్రాధాన్యమివ్వడం, నచ్చని వారిని దూరప్రాంతాలకు వేయడం, ఈఎన్సీ లాంటి ఉన్నతాధికారుల ఆదేశాలు అమలు చేయకపోవడం, ప్రతి పనికీ లంచాలను వసూలు చేశారు. విచారణ జరిపి లోపాలను సరిదిద్దాలి. – కిష్టయ్య, ఉద్యోగి ●అవినీతిలో కొన్ని ఉదాహరణలు.. కార్యాలయంలో పనిచేస్తూ ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న మైనార్టీ అధికారిపై కక్షగట్టి.. అవినీతిలో తనకు సహకరించలేదంటూ ఎస్ఈగా పనిచేసిన అధికారి ఇటీవల కావలికి బదిలీ చేశారు. రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్న ఆయన ఎంత ప్రాధేయపడినా కనికరించలేదు. డబ్బులు తీసుకొని తనకు అనుకూలమైన వారిని ఆయన స్థానంలో ఏర్పాటు చేశారు. అయితే బదిలీ అయిన వ్యక్తి భార్య ఈ విషయమై రచ్చ చేశారు. గుండెకు రెండు స్టంట్లు వేసుకున్న వ్యక్తిని అకస్మాత్తుగా ఎలా బదిలీ చేస్తారని.. ఆయన ఆరోగ్యానికి ఏమైనా ఇబ్బంది కలిగితే ఎస్ఈని బాధ్యుడ్ని చేస్తానని హెచ్చరించారు. విషయం గందరగోళంగా మారడంతో బదిలీని రెండు రోజులకే ఉపసంహరించుకున్నారు. అయినా కావలిలో పనిచేస్తున్న తనకు అనుకూలమైన వ్యక్తిని సర్కిల్ కార్యాలయంలోకి తీసుకొచ్చి విధులు కేటాయించారు. కావలిలో శాఖకు చెందిన సుమారు రూ.రెండు కోట్లకుపైగా విలువైన స్థలాన్ని ఓ అధికారి విక్రయించారనే ఆరోపణలున్నాయి. అయితే మంత్రి నారాయణ అండతో విచారణను పెండింగ్లో ఉంచారనే విమర్శలొస్తున్నాయి. విక్రయ వ్యవహారంలో రిటైరైన ఎస్ఈ పూర్తి సహాయ, సహకారాలను అందించారని సమాచారం. ఓ డిప్యూటీ ఈఈకి మూడు పదవులను అప్పగించారు. దీనికి గానూ భారీగానే ముడుపులు చెల్లించారని తెలుస్తోంది. పైగా సదరు డీఈఈ తనకు మంత్రి సత్యప్రసాద్ మిత్రుడని అందర్నీ భయపెడుతున్నారని తెలుస్తోంది. సెక్రటేరియట్లో తాను అన్ని పనులు చక్కబెడతానని బెదిరిస్తూ తన పరిధిలో ఆమ్యామ్యాలను బాగా స్వీకరిస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో లక్షలాది రూపాయలను దండుకొని ఇష్టారాజ్యంగా బదిలీలు చేయడం లాంటి ఆరోపణలొస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి సర్కిల్ కార్యాలయాన్ని చక్కదిద్దాలని ఉద్యోగులు కోరుతున్నారు. రెండు సెక్షన్ల ద్వారానే అంతా.. మూడు రోజుల క్రితమే అధికారి ఉద్యోగ విరమణ వర్కులపై పాత తేదీలతో అగ్రిమెంట్లు..? ఇంట్లో ఫైళ్లపై రాత్రి వేళ సంతకాలు సహకరిస్తున్న డిస్పాచ్ బ్రాంచ్ టెక్నికల్ సిబ్బంది కావలిలో గతంలో రూ.కోట్ల విలువైన స్థల విక్రయానికి సహకరించారనే ఆరోపణలు - 
      
                   
                               
                   
            స్వప్రయోజనాలకే ప్రైవేటీకరణ
పొదలకూరు: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణలో సీఎం చంద్రబాబుకు స్వప్రయోజనాలున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నా, పట్టించుకోకుండా ముందుకెళ్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. పొదలకూరు పంచాయతీ బస్టాండ్లో ఆదివారం నిర్వహించిన కోటి సంతకాల ఉద్యమానికి హాజరై సంతకాలను సేకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. పేదల కోసం రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను నాటి సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారని, ఇందులో ఏడు పూర్తికాగా, ఐదింట్లో తరగతులను ని ర్వహిస్తున్నారని చెప్పారు. వీటిని ప్రైవేట్కు కట్టబెట్టేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని మండిపడ్డారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 80 వేల సంతకాలను సేకరించనున్నామని వెల్లడించారు. ఏడాదిన్నర కాలంలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. యూరియా కోసం మళ్లీ జైలుకెళ్లేందుకై నా సిద్ధం రైతులకు అందజేయాల్సిన యూరియా కోసం మళ్లీ జైలుకెళ్లేందుకై నా సిద్ధంగా ఉన్నానని కాకాణి పేర్కొన్నారు. యూరియా కార్డులను రైతులకు అందజేయడం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. రైతులకు ఎక్కడా యూరియా అందకపోయినా తానొచ్చి ఆందోళన చేస్తానని చెప్పారు. తమ పార్టీ మద్దతు సర్పంచ్ల చెక్పవర్ను ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి రద్దు చేయిస్తున్నారని ఆరోపించారు. పొదలకూరు ఎస్టీ సర్పంచ్ చిట్టెమ్మ ఏ అవినీతికి పాల్పడితే చెక్పవర్ను రద్దు చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో మండలంలో ఒకే టీడీపీ సర్పంచ్ ఉంటే వారి జోలికెళ్లలేదని గుర్తుచేశారు. నియోజకవర్గంలో టీడీపీకి ఆరు పంచాయతీల్లోనే సర్పంచ్లు ఉండేవారని, వారిని ఏనాడూ ఇబ్బందులకు గురిచేయలేదన్నారు. సోమిరెడ్డి ఇక సర్వేపల్లికు వచ్చేది లేదని.. ఆఖరి అవకాశం కాబట్టి ఇష్టానుసారం దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. కండలేరు స్పిల్వే కాలువ, సర్వేపల్లి రిజర్వాయర్ వద్దకెళ్లి పరిశీలించి దొంగబిల్లులు చేసుకొని స్వాహా చేసేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ లెక్కరాసి పెట్టుకోవాలని.. తీవ్ర ఇబ్బందులకు గురిచేసి అక్రమ కేసులు పెట్టిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తొలుత కాకాణికి అపూర్వ స్వాగతం లభించింది. పార్టీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి గోగిరెడ్డి గోపాల్రెడ్డి, మాజీ ఎంపీపీ కోనం చినబ్రహ్మయ్య, సర్పంచ్ మల్లిక చిట్టెమ్మ, ఉప సర్పంచ్ వాకాటి శ్రీనివాసులురెడ్డి, ఎంపీటీసీలు షాకీరాబేగం, లక్ష్మీకల్యాణి, శ్రీనివాసులు, నేతలు బచ్చల సురేష్కుమార్రెడ్డి, మద్దిరెడ్డి రమణారెడ్డి, రావుల ఇంద్రసేన్గౌడ్, మారు వెంకట్రామిరెడ్డి, అంజద్, వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నా, పట్టించుకోని ప్రభుత్వం కాకాణి గోవర్ధన్రెడ్డి - 
      
                   
                               
                   
            స్వగ్రామానికి వెళ్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ● మరొకరికి తీవ్రగాయాలుఆత్మకూరు: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన ఘటన ఆత్మకూరు మండలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై ఎస్కే జిలానీ కథనం మేరకు.. వింజమూరు మండలానికి చెందిన సురేష్ నాయుడు (30) పని నిమిత్తం బైక్పై శంకర్నగరం వెళ్లాడు. తిరిగి వింజమూరుకు వెళ్తుండగా ఆత్మకూరు – వింజమూరు మార్గంలోని పొనుగోడు గ్రామానికి వెళ్లే అడ్డరోడ్డు మలుపు సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొన్నాడు. దీంతో సురేష్ రోడ్డుపై పడి తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఎదురు బైకుపై ఉన్న వ్యక్తికి గాయాలైనట్లు ఎస్సై వివరించారు. క్షతగ్రాతుడి వివరాలు తెలియలేదని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు. - 
      
                   
                               
                   
            ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు : ఏఎస్పీ
నెల్లూరు(క్రైమ్): ‘ఆరోగ్యం విషయంలో పోలీస్ సిబ్బంది అశ్రద్ధగా ఉండొద్దు. తగిన జాగ్రత్తలు పాటించాలి’ అని ఏఎస్పీ సీహెచ్ సౌజన్య సూచించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం నెల్లూరులోని పోలీసు కవాతు మైదానంలో పారా మెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (పీహెచ్పీ) సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసులు 24 గంటలూ విధులు నిర్వహిస్తుండటంతో ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. వారు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, సమాజం బాగుంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఆరోగ్యపరమైన సమస్యలుంటే తక్షణమే వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం జనరల్ ఫిజీషియన్, లివర్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ల్యాప్రోస్కోపిక్, గైనకాలజీ, పల్మనాలజీ, ఈఎన్టీ, కార్డియాలజీ, న్యూరో సర్జరీ, ఆర్థోపెడిక్, డెంటల్ తదితర విభాగాలకు చెందిన వైద్యులు పోలీసు సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీహెచ్పీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శాఖవరపు వేణుగోపాల్, కార్యదర్శి శేషయ్య, పోలీసు వైద్యులు అఖిలేష్, ప్రముఖ వైద్యనిపుణులు పి.మాధవ్రావు, బి.రాజేంద్రరెడ్డి, పి.సురేంద్రకుమార్, ఎం.వెంకటతరుణ్, పి.సుధీర్, కె.భాస్కర్, బి.రాజశేఖరరెడ్డి, ఎస్.శ్వేత, ప్రేమదీప్, పి.వసుమతి, డి.అజయ్కుమార్, తరుణ్, డి.సుస్మిత, లోకేశ్వరి, అనిల్కుమార్, డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాద్రావు తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గం
● కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో బుర్రా కందుకూరు: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలని కూటమి పాలకులు తీసుకున్న నిర్ణయం దుర్మార్గమని వైఎస్సార్సీపీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వలేటివారిపాళెం మండలంలోని అయ్యవారిపల్లె గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందన్నారు. ప్రైవేటీకరణ విషయంలో ప్రజల్లో వచ్చిన ఆగ్రహాన్ని కోటి సంతకాల రూపంలో సేకరించి గవర్నర్కు అందజేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమంలో పాల్గొని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం పూర్తిగా కుంటుపడిందని బుర్రా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పూర్తిగా అవినీతి కార్యకలాపాల్లో కూరుకుపోయారని విమర్శించారు. రేషన్ బియ్యం దందా, ఇసుక, మట్టి మాఫియా, నకిలీ మద్యం, పేకాట శిబిరాలు వంటివి యథేచ్ఛగా నిర్వహిస్తూ తన అనుచరుల ద్వారా కమీషన్ దండుకునేందుకు సరిపోతుందని, పాలనను పూర్తిగా గాలికొదిలేశారని విమర్శించారు. ఇటువంటి పాలకులకు భవిష్యత్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. భారీగా హాజరైన ప్రజల నుంచి ఆయన సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ డేగా వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యులు చింతలపూడి రవీంద్ర, చౌడబోయిన యానాది, రైతు విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు కట్టా హనుమంతరావు, మండల మహిళా అధ్యక్షురాలు వంకదారి కామేశ్వరి, గుత్తా గోపీ, పొట్టేళ్ల కృష్ణయ్య, ఇరపని అంజయ్య, ప్రగడ రవి, బచ్చు తిరుపాలు, రూపినేని వెంకటేశ్వర్లు, బచ్చు శ్రీనివాసరావు, ముతకని ఏడుకొండలు, గుర్రం పున్నయ్య, టెంకం ప్రసాద్, టెంకం కొండలరావు తదితులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            జిల్లా పరిషత్లో ఉద్యోగోన్నతులు
నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో పనిచేస్తున్న సీనియర్ సహాయకులకు పరిపాలన అధికారులుగా ఉద్యోగోన్నతులు కల్పిస్తూ చర్యలు చేపట్టారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో పదోన్నతులు, కారుణ్య నియామకాలకు సంబంధించిన ఉత్తర్వులను జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, సీఈఓ మోహన్రావు అందజేశారు. ఐదుగురు సీనియర్ సహాయకులకు పరిపాలన అధికారులుగా ఉద్యోగోన్నతులు, నలుగురికి కారుణ్య నియామకాల ద్వారా ఆఫీస్ సబార్డినేట్లుగా ఉద్యోగావకాశాలు కల్పించారు. ఈ సందర్భంగా అరుణమ్మ మాట్లాడుతూ 2021 నుంచి ఇప్పటి వరకు 98 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగం కల్పించామన్నారు. జెడ్పీ యాజమాన్య పరిధిలో పనిచేస్తున్న 160 మందికి పదోన్నతులు ఇచ్చామన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను త్వరితగతిన భర్తీ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ అధికారులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            మండల మీట్లో తమ్ముళ్ల తిష్ట
● సర్వసభ్య సమావేశం అభాసుపాలు ● ప్రజాప్రతినిధుల కుర్చీల్లో టీడీపీ నేతలు ● ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిబంధనలకు తూట్లు ఉలవపాడు: మండల సర్వసభ్య సమావేశాలను ప్రజా సమస్యలను చర్చించడం కోసం ఏర్పాటు చేస్తారు. కేవలం ప్రజాప్రతినిధులు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు మాత్రమే హాజరుకావాలి. కానీ శుక్రవారం ఉలవపాడులో జరిగింది చూసి టీడీపీ కార్యకర్తల సమావేశంలా మార్చేశారని ప్రజలు చర్చించుకున్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమైంది. దీనికి కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. ప్రజాప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన సీట్లలో టీడీపీ నాయకులు కూర్చొన్నారు. కోరం కోసం సంతకం పెట్టి ఎక్కువ శాతం ప్రజాప్రతినిధులు వెళ్లిపోయారు. కేవలం 30 శాతం మంది మాత్రమే హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు అడగాల్సిన సమస్యలను ఎవరు అడుగుతున్నారో, ఎందుకు అడుగుతున్నారో అర్థం కాక, ఏమీ చేయలేక అధికారులు తలలు పట్టుకున్నారు. సమీక్షలు జరపడం పక్కనపెట్టి కేవలం తమ శాఖలకు సంబంధించి కొంత సమాచారం చెప్పడం.. వెళ్లిపోవడం జరిగింది. టీడీపీ నాయకులు ఏకంగా మైక్ తీసుకుని సమావేశంలో మాట్లాడారు. ఇంత దారుణంగా సమావేశం జరగడం ఎప్పుడూ లేదని కొందరు సభ్యులు తెలిపారు. పట్టించుకోకుండా.. గతంలో కొందరు సర్పంచ్ల భర్తలు వచ్చినప్పుడు నాటి ఎమ్మెల్యేలు మీరు రాకూడదని సున్నితంగా తెలియజేసి బయటకు పంపించిన సందర్భాలున్నాయి. కానీ శుక్రవారం తమ పార్టీ నాయకులు నేరుగా వచ్చి కూర్చొన్నా ఎమ్మెల్యే ఇంటూరి కనీసం పట్టించుకోలేదు. అధికారులు చెప్పినా వినేవారు లేరు. టీడీపీ నాయకులు కావడంతో అధికారులు ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి. సమావేశం నిబంధనలు అసలు ఎమ్మెల్యేకు తెలుసా అని కొందరు చర్చించుకున్నారు. ఎంపీడీఓ సురేష్బాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించి సమీక్ష నిర్వహించారు. - 
      
                   
                               
                   
            పెన్నాకు పోటెత్తిన వరద
నెల్లూరు(అర్బన్): ౖెపతట్టు ప్రాంతాల నుంచి సోమశిల జలాశయానికి భారీ వరద వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ అధికారులు ఒకేదఫా దిగువ పెన్నానదిలోకి లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో పెన్నానదిలో వరద పరవళ్లు తొక్కుతోంది. ఈ విషయం తెలిసిన మంత్రి నారాయణ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. అలాగే టీడీపీ శ్రేణులతో కూడా ఫోన్ ద్వారా మాట్లాడుతూ అవసరమైతే లోతట్టు ప్రాంతాల వారిని పునరావాసాలకు తరలించి బాధితులకు అండగా ఉండాలని సూచించారు. శుక్రవారం సాయంత్రానికి నెల్లూరు నగరంలోని జాకీర్హుస్సేన్ నగర్, కిసాన్ నగర్ లోతట్టు ప్రాంతాల్లోకి పెన్నానది వరదనీరు చేరింది. దీంతో కొందరిని పునరావాస కేంద్రాలకు తరలించారు. సంగం బ్యారేజీకి..సంగం: మండలంలోని సంగం పెన్నా బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. శుక్రవారం సోమ శిల, బీరాపేరు, బొగ్గేరు వాగుల నుంచి వరద భారీగా చేరింది. దీంతో ఇరిగేషన్ అధికారులు బ్యారేజీ గేట్లు పూర్తిగా తెరిచి 1,39,700 క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. అధికారులు పెన్నా పరీవాహక ప్రాంతాలను అప్రమత్తం చేశారు.బ్యారేజ్ నుంచి విడుదలవుతున్న వరద జలాలు ఆనకట్ట వద్ద భారీగా ప్రవహిస్తున్న నీరు - 
      
                   
                               
                   
            వైఎస్ జగన్తో కాటంరెడ్డి భేటీ
అల్లూరు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్రెడ్డి తాడేపల్లి నివాసంలో గురువారం రాత్రి గురువారం రాత్రి మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో రాజకీయ పరిణామాలతోపాటు ఇతర విషయాలు చర్చించారు. కాటంరెడ్డి వెంట ఆయన అనుచరులు బాలకృష్ణంరాజు, గోపాల్రెడ్డి తదితరులు ఉన్నారు. కొనసాగుతున్న ఇన్ఫ్లో.. అవుట్ ఫ్లో సోమశిల: జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కొనసాగుతోందని ప్రాజెక్ట్ ఈఈ శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు. శుక్రవారం రాత్రికి 68,099 క్యూసెక్కుల వరద వస్తుండగా, జలాశయం 4,5,6,7,8 క్రస్ట్గేట్ల ద్వారా 77,650 క్యూసెక్కుల వరద జలాలను పెన్నానదికి విడుదల చేస్తున్నామన్నారు. ప్రస్తుతం జలాశయంలో 70.860 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు వెల్లడించారు. పైతట్టు ప్రాంతాల నుంచి వస్తున్న వరద తగ్గేంత వరకు దిగువకు నీటిని విడుదల కొనసాగుతుందని, పెన్నా పరీవాహక ప్రజలు భద్రంగా ఉండాలని కోరారు. కేజీబీవీల్లో పీజీటీ, సీఆర్టీ పోస్టులకు దరఖాస్తులు నెల్లూరు (టౌన్): జిల్లాలోని కేజీబీవీల్లో పీజీటీ, సీఆర్టీ పోస్టులకు గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేసేందుకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గంటకు రూ.250 వేతనం ఇవ్వనున్నట్లు చెప్పారు. కేజీబీవీ లింగసుమద్రంలో పీజీటీ ఫిజిక్స్, కలిగిరిలో పీజీటీ ఎంపీహెచ్డబ్ల్యూ, సీఆర్టీ మ్యాథ్స్, సీఆర్టీ ఫిజికల్ సైన్స్, సీతారామపురంలో సీఆర్టీ తెలుగు, సీఆర్టీ హిందీ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. కేజీబీవీల్లో పనిచేస్తున్న అధ్యాపకులు ప్రసూతి సెలవుల నేపథ్యంలో కేజీబీవీ లింగసముద్రంలో పీజీటీ బాటని, కందుకూరులో పీజీటీ కెమిస్ట్రీ, సీఆర్టీ ఫిజిక్స్లు తాత్కాలికంగా ఖాళీగా ఉన్నా యన్నారు. ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు ఈ నెల 4వ తేదీలోపు దరఖాస్తు పూర్తి చేసి అర్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు, జెరాక్స్ కాపీలను ఆయా మండల విద్యాశాఖ కార్యాలయాల్లో అందజేయాలన్నారు. ఆర్ అండ్ బీ ఎస్ఈగా రామకృష్ణప్రసాద్ నెల్లూరు (అర్బన్): రహదారులు, భవనాల శాఖ ఎఫ్ఏసీ సూపరింటెండెంట్ ఇంజినీర్గా (ఎస్ఈ) ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రామకృష్ణప్రసాద్ను ప్రభుత్వం నియమించింది. శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఎస్ఈగా పని చేసిన ఎం.గంగా ధరం ఉద్యోగ విరమణ చేయడంతో ఆ స్థానంలో రామకృష్ణప్రసాద్ను నియమించింది. కొండపై అపచార ఘటనపై చర్యలు నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్ మండలంలోని వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఓ జంట ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించేలా వీడియో తీయడంపై నరసింహస్వామి ఆలయ ఈఓ గోపి శుక్రవారం స్పందించారు. ఇటువంటి వీడియోలు ఆలయ పరిధిలో తీయడం చట్టరీత్యా నేరమన్నారు. భవిష్యత్లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వీడియో ఇప్పటిది కాదని, సోషల్ మీడియాలో వైరల్ చేసిన వ్యక్తులు, దుష్ప్ర చారం చేసిన వారిపై నెల్లూరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి దర్శనానికి 15 గంటలు తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లోని 21 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నా రు. గురువారం అర్ధరాత్రి వరకు 82,010 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 29,634 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 15 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శ నం లభిస్తోంది. - 
      
                   
                               
                   
            పాత పరిశ్రమలే పారిపోయే పరిస్థితి
వెంకటాచలం: సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి ఆయన కొడుకు దాష్టీకాలు, సర్వం దోపిడీలతో పాత పరిశ్రమలు పారిపోతున్నాయని, కొత్త పరిశ్రమలు రావడానికి జంకుతున్నాయంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఎప్పడు ఎన్నికలు జరిగినా వైఎస్సార్సీపీ తిరుగులేని విజయం సాధించడం ఖాయమన్నారు. వెంకటాచలంలో శుక్రవారం వైఎస్సార్సీపీ నూతన కార్యాలయాన్ని ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ ఎక్కడికెళ్లినా ప్రజల స్పందన చూస్తుంటే సాంకేతికంగా ఓటమి పాలయ్యామే తప్ప, ప్రజల మనస్సుల్లో స్థానం కోల్పోలేదనే విషయం అర్థమవుతుందన్నారు. చంద్రబాబు, లోకేశ్ రాష్ట్రానికి పరిశ్రమలు తెస్తున్నామని గప్పాలు కొట్టుకుంటున్నారని, సోమిరెడ్డి వంటి వాళ్ల వల్ల పరిశ్రమలు వెళ్లిపోయే ప్రమాదం ఏర్పడుతుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన జెన్కో బూడిద తరలింపు, ఇతర కాంట్రాక్ట్పై తన ఆధిపత్యం కోసం సోమిరెడ్డి తన మనుషులతో దాడి చేయించాడని ఆరోపించారు. బాధితులు జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకుని వెళ్లడంతో, అక్కడి నుంచి పోలీసు బలగాలు చేరుకోవడంతో దాడులకు పాల్పడిన వ్యక్తులు పరారయ్యారన్నారు. అన్నీ శాఖలను అడ్డం పెట్టుకుని దోచుకోవడం తప్ప, ప్రజల గురించి పట్టించుకునే పరిస్థితి కనిపించడంలేదని ధ్వజమెత్తారు. కొత్త పరిశ్రమలు రావడానికి జంకుతున్నాయి సర్వేపల్లిలో సర్వం దోపిడీ చేస్తున్న సోమిరెడ్డి ఎన్నికలొస్తే.. వైఎస్సార్సీపీ విజయం ఖాయం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి దమ్ముంటే సవాల్ స్వీకరించు సోమిరెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే వెంకటాచలం సర్పంచ్ చెక్ పవర్ రద్దు విషయంలో తన సవాల్ను స్వీకరించాలని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయడం కాదని, ఎన్నికై న సర్పంచ్ను రీకాల్ చేయడానికి ఓటింగ్కు సిద్ధమా అని సవాల్ విసిరారు. తాము అధికారంలో ఉన్నప్పుడూ టీడీపీ తరఫున గెలిచిన సర్పంచ్ల జోలికి వెళ్లలేదని గుర్తు చేశారు. నేరుగా గెలవలేక, వైఎస్సార్సీపీలో గెలిచిన వారి చెక్ పవర్లు రద్దు చేసి, ప్రభుత్వ భూములను కాజేయాలనే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. సర్వేపల్లిలో సోమిరెడ్డి చేస్తున్న పాపాలే రాబోయే రోజుల్లో శాపాలుగా మారతాయని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై జరిగే దాడులు, కక్ష సాధింపులు సర్వేపల్లిలో ఎక్కువగా ఉన్నాయని, అంతకు రెట్టింపు అనుభవించాల్సి వస్తుందని విషయం గుర్తించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, మండల వైస్ ఎంపీపీ కనుపూరు కోదండరామిరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ కొణిదెన మోహన్నాయుడు, వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు ఆరుగుంట ప్రభాకర్రెడ్డి, కొణిదెన విజయభాస్కర్నాయుడు, పొదలకూరు మండల బూత్ కమిటీ కన్వీనర్ బచ్చుల సురేష్కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            ఆర్ అండ్ బీలో అవినీతి తిమింగలాలు
జిల్లాలోని రోడ్లు, భవనాల శాఖ అవినీతికి అడ్డా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల అవినీతి, వేధింపులు, అక్రమాలపై ఆ శాఖ ఉద్యోగులే నల్లబ్యాడ్జిలు కట్టుకుని ధర్నాకు దిగారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ శాఖను ఇద్దరు..ముగ్గురు అధికారులు తమ గుప్పెట్లో పెట్టుకుని ప్రతిపనికి రేటు నిర్ణయించి దోచుకుంటున్నారు. రోడ్లు, భవనాల నిర్మాణాల్లో పర్సంటేజీలే కాకుండా.. సొంత శాఖ ఉద్యోగుల పదోన్నతులు, బదిలీల్లోనూ పక్షపాతం చూపిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. నెల్లూరు(అర్బన్): రోడ్లు, రహదారుల భవనాల (ఆర్అండ్బీ) శాఖలో అవినీతి తిమింగాలు చెలరేగిపోతున్నాయి. ఇద్దరు, ముగ్గురు అధికారులు కలిసి ప్రతి పనికి ఓ రేటును నిర్ణయించారు. బదిలీలు, డిప్యుటేషన్లు, పదోన్నతులు, ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నా.. చివరికి కోర్టు తీర్పులు అమలు చేయాలన్నా అడిగినంత ఇచ్చుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆ పనికి మోక్షం లభించదు. ఇంజినీరింగ్ పితామహు డు మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహావిష్కరణ పేరుతో కాంట్రాక్టర్లు, ఉద్యోగుల నుంచి భారీగా వసూలు చేసినా.. అందులో నాలుగో వంతు కూడా ఖర్చు చేయలేదంటూ ఉద్యోగులే ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఉద్యోగులు శుక్రవారం దర్గామిట్టలోని ఆర్అండ్బీ శాఖ సర్కిల్ కార్యాల యం వద్ద అధికారులు అవినీతిపై విచారణ జరపాలని నిరసనకు దిగారు. దీంతో ఆ శాఖలో జరుగుతున్న అవినీతి బాగోతం ఒక్కసారిగా గుప్పుమంది. ● నెల్లూరు సర్కిల్ కార్యాలయంలో ఓ దివ్యాంగ మహిళా ఉద్యోగురాలు ఉన్నారు. ఆమె ఇంజినీరింగ్లో డిప్లొమా చేసింది. దివ్యాంగురాలు, మహిళా కోటా కింద ఆమెకు ట్రేసర్ పోస్టు ఇవ్వాల్సి ఉంది. అలా ఇవ్వమని ఈఎన్సీ (రాష్ట్ర ఇంజినీరింగ్ ఇన్ చీఫ్) ఉత్తర్వులు కూడా పంపారు. అయితే ట్రేసర్గా ఇవ్వాలంటే ఓ సూపరింటెండెంట్, మరో అధికారి కలిసి లంచమడిగారని ఉద్యోగులు నేరుగానే చెబుతున్నారు. ట్రేసర్ పోస్టు ఇవ్వకుండా సంవత్సరం కాలంగా తిప్పుకుంటున్నారు. ఆమెను పక్కన పెట్టి జూనియర్కు ప్రమోషన్ ఇచ్చారు. న్యాయబద్ధంగా తనకు రావాల్సిన ప్రమోషన్ అడిగినందుకు కక్ష కట్టి దివ్యాంగురాలని కూడా చూడకుండా నిబంధనలకు విరుద్ధంగా దూరప్రాంతమైన తిరుపతి జిల్లాకు బదిలీ చేశారు. ఆమె నడవలేని స్థితిలో రాకపోకలు సాగించడం కష్టమని తెలిసినా బదిలీ చేసి కక్ష తీర్చుకున్నారని, ఇలాగే నచ్చని పలువురిని దూరప్రాంతాలకు బదిలీ చేశారంటూ ఉద్యోగులు ఆరోపించారు. ● తనకు టెన్త్ పే స్కేల్ అమలు చేయాలని షబ్బీర్ అహ్మద్ అనే ఉద్యోగి హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నాడు. ప్రభుత్వం జీఏడీ నుంచి అప్రూవల్ కూడా ఇచ్చింది. ఆ ఉత్తర్వులు అమలు చేయాలంటే తాము అడిగినంత ఇవ్వాలని ఆ శాఖ బాస్ కోరారని ఉద్యోగులు పేర్కొంటున్నారు. డబ్బులు ఇవ్వకపోవడంతో బెదిరించడంతో భయపడి ప్రస్తుతానికి ఉద్యోగానికి రాకుండా ఇంట్లో ఉంటున్నారు. అంచనాలు పెంచడం.. దోచేయడం.. ఆర్అండ్బీ శాఖ పరిధిలో జిల్లాలో నెల్లూరు, కావలి లో డివిజన్ కార్యాలయాలు ఉన్నాయి. దర్గామిట్టలో సర్కిల్ కార్యాలయానికి ఎస్ఈ బాస్గా ఉన్నారు. దీనికి తోడు నూతనంగా ఏర్పడిన తిరుపతి జిల్లాలో కూడా ఆయన ఆధ్వర్యంలోనే బదిలీలు, ప్రమోషన్లు జరగాల్సి ఉంటుంది. జిల్లాలో 2 వేల కి.మీ. పైగా ప్రధాన రహదారులున్నాయి. వీటి పరిధిలో నూతన రోడ్లు, గ్రామీణ ప్రాంతాలకు ఆర్అండ్బీ నుంచి లింకు రోడ్ల నిర్మాణాలు, మెయింటెన్స్కు కోట్లాది రూపాయలు మంజూరవు తుంటాయి. 6 నెలల క్రితం రూ.19 కోట్ల వరకు రోడ్ల మెయింటెన్స్కు నిధులు మంజూరయ్యాయి. రోడ్లు నిర్మాణాల్లో అంచనాలు పెంచి భారీగా దోచే యడం, కాంట్రాక్టర్ల వద్ద లక్షలాది రూపాయలు వసూలు చేయడంలోనూ అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒక అధికారికి మూడు పోస్టులా.. ● ఒక డిప్యూటీ ఇంజినీర్కు ఇన్చార్జిగా కోవూరు, నెల్లూరు, కావలి పోస్టులు ఇచ్చారని, ఇందులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారడంతోనే ఆ అధికారికి మూడు పోస్టుల బాధ్యతలు అప్పగించారు. గతంలో నాలుగు పోస్టులు కూడా ఆయనకే ఇచ్చారు. ● 18, 24 ఏళ్లు దాటిన వారికి ఆటోమేటిగ్గా అడ్వాన్స్డ్ స్కీమ్ కింద ఒక ఇంక్రిమెంట్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ దానిని కూడా ఇవ్వకుండా ఆపేశారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఎస్ఈ, అధికారుల అవినీతిపై విచారణ చేయాలంటూ నిరసన ఉద్యోగుల నుంచి ప్రతి ఫైల్కు లంచాలు వసూలు చేయడం, ఎస్ఈ పాత్రపై విచారణ చేయాలంటూ శుక్రవారం పలువురు ఉద్యోగులు ఎస్ఈ కార్యాలయంలోనే నిరసన చేపట్టారు. ఎస్ఈ అవినీతిపై నినాదాలు చేశారు. దీంతో ఆ శాఖలోని అవినీతిపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఽనిరసనలో జేఏసీ నాయకులు శరత్బాబు, శ్రీనివాసమూర్తి, రాము తదితర పలువురు ఉద్యోగులు పేర్కొన్నారు. పైసలిస్తేనే పనులు, పదోన్నతులు ఇవ్వకపోతే వేధింపులు, దూర ప్రాంతాలకు బదిలీలు దివ్యాంగ ఉద్యోగినిపై దయలేని అధికారులు మోక్షగుండం విగ్రహం పేరుతో కాంట్రాక్టర్ల వద్ద నుంచి భారీగా వసూళ్లు ఓ డీఈఈకి మూడు పోస్టులు నిరసనకు దిగిన ఉద్యోగులు భారీ స్థాయిలో అవినీతి నెల్లూరు ఆర్అండ్బీ శాఖలో భారీస్థాయిలో అవినీతి జరుగుతోంది. ప్రతి ఫైల్కు ఓ రేటు నిర్ణయించారు. ఏ–5 సీట్లో కీలకమైన ఫైళ్లు గల్లంతయ్యాయని ఎస్ఈ మా అసోసియేషన్కు చెప్పారు. జిల్లా అధికారులు లక్షలాది రూపాయలు వెనకేసుకుంటూ ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం తగదు. వర్క్ అరేంజ్మెంట్స్ పేరుతో నచ్చని వారిని అక్కడికి పంపడం దారుణం. 60 ఏళ్లు పైడిన వారికి మాత్రమే వర్క్ అరేంజ్మెంట్స్ కింద సడలింపు ఇవ్వాలి. – శరత్బాబు, జేఏసీ అమరావతి రాష్ట్ర నాయకుడు మొదట ఎస్ఈపై విచారణ చేయాలి అవినీతికి కారకుడిగా ఉన్న ఎస్ఈపై విచారణ చేయాలి. ఆయన ఉద్యోగ విరమణ చేస్తున్నారు. విచారణ చేసి వాస్తవాలు వెలుగు చూసే వరకు ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్, ఇతర సౌకర్యాలన్ని ఆపాలి. ఆర్అండ్బీ శాఖను ప్రక్షాళన చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలి. – రాము, వర్క్ ఇన్స్పెక్టర్ - 
      
                   
                               
                   
            అసమ్మతిపై నెగ్గిన అవిశ్వాసం
● వేమిరెడ్డి వర్సెస్ కాకర్ల వర్గీయుల మధ్య రాజకీయ చిచ్చు ● ఎంపీ వర్గానికి తీవ్ర పరాభవం వింజమూరు (ఉదయగిరి): వింజమూరు ఎంపీపీ పదవి కోసం టీడీపీలో రేగిన చిచ్చు అవిశ్వాసం నెగ్గే వరకు వెళ్లింది. తాజా పరిణామాలతో ఒకే పార్టీలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వర్గాలుగా రాజకీయ కుంపటి రాజుకుంది. పార్టీలో వర్గ విభేదాలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేయడంతో వర్గపోరుకు దారితీసింది. ఎంపీ వేమిరెడ్డి వర్గానికి చెందిన ప్రస్తుత ఎంపీపీ మోహన్రెడ్డిని పదవి నుంచి దించేందుకు ఎమ్మెల్యే వర్గీయులు శుక్రవారం పెట్టిన అవిశ్వాసంలో నెగ్గి విజయం సాధించారు. దీంతో ఒకే పార్టీలో రెండు వర్గాల మధ్య రాజుకున్న రాజకీయ చిచ్చు భవిష్యత్లో ఎలాంటి పరిణామాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. నెగ్గిన ఎమ్మెల్యే వర్గీయులు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మారిన రాజకీయ పరిణామాల్లో వింజమూరు ఎంపీపీ మోహన్రెడ్డి, మరో కీలక నేత వనిపెంట సుబ్బారెడ్డి, మరో ఆరుగురు ఎంపీటీసీలు టీడీపీలో చేరారు. వైఎస్సార్సీపీలో ఉండగా మోహన్రెడ్డి, సుబ్బారెడ్డి మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల తర్వాత మోహన్రెడ్డి ఎంపీపీ పదవి నుంచి తొలిగి సుబ్బారెడ్డి భార్య హైమావతికి అప్పుగించాలి. అయితే వీరు ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే కాకర్ల వర్గాలుగా చీలిపోయారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఇరువర్గాల మధ్య ఎంపీపీ పదవి కోసం పోరు మొదలైంది. ఎమ్మెల్యే కాకర్ల అండతో సుబ్బారెడ్డి మెజార్టీ ఎంపీటీసీలను తమ వైపు తిప్పుకొని ఎంపీపీ కుర్చీ కోసం పావులు కదిపారు. ఎంపీపీ మోహన్రెడ్డి తనకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అండగా ఉన్నారనే ధైర్యంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వర్గీయులు రెండు నెలల క్రితం ఎంపీపీపై అవిశ్వాసం కోరుతూ మెజార్టీ ఎంపీటీసీలతో కావలి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ క్రమంలో శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఆర్డీఓ వంశీకృష్ణ సమక్షంలో అవిశ్వాసం సమావేశం నిర్వహించారు. ఎంపీపీ మోహన్రెడ్డిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఎంపీ వేమిరెడ్డి వర్గీయులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎమ్మెల్యే వర్గీయులు బాణసంచా పేల్చుతూ సంబరాలు జరుపుకున్నారు. నిండా మునిగిన ఎంపీ వర్గీయులు ఎంపీపీ పదవి కోసం ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయులు మధ్య నెలకొన్న వివాదం పరిష్కరించడంలో ఎమ్మెల్యే చొరవ చూపకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఎంపీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇరు వర్గీయుల మధ్య రాజీ చేసి ఉంటే పార్టీలో చీలకలు వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఎంపీని నమ్ముకొని ఆయన సమక్షంలో పార్టీలో చేరడంతో ఎమ్మెల్యే తమపై గుర్రుగా ఉన్నారని భావిస్తున్నారు. ఎంపీ వేమిరెడ్డి అండ చూసుకుని నిండా మునిగిపోయామని ఆవేదన చెందుతున్నారు. ఉద్రిక్తత నడుమ అవిశ్వాసం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం జరిగిన అవిశ్వాసం ఉద్రిక్తత నడుమ సాగింది. సమావేశం ప్రారంభానికి ముందు ఎంపీపీ మోహన్రెడ్డి డబ్బు తీసుకొని మోసం చేశారంటూ కాటేపల్లి ఎంపీటీపీ గొడవకు దిగాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. తాను ఎంపీపీ పదవిని వదిలే ప్రసక్తే లేదని, తాను కూడా టీడీపీకి చెందిన వాడని, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అందరం కూర్చొ ని మాట్లాడుకుందామని చెప్పినా.. అందుకు ఎంపీటీసీ నిరాకరించారు. దీంతో ఎంపీపీ తీవ్ర ఉద్రేకానికి లోనయ్యారు. ఆర్డీఓ సమావేశం నిర్వహించి ఎంపీపీపై విశ్వాసం నెగ్గినట్లు ప్రకటించారు. ఈ క్రమంలో టీడీపీలో రెండు వర్గాలకు చెందిన వారు భారీగా బంగ్లా సెంటర్లో మోహరించారు. దీంతో ఏమీ జరుగుతుందోనని భయందోళన నెలకొంది. అయితే 70 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విప్ జారీ చేసిన వైఎస్సార్సీపీ గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరపున పోటీ చేసి 8 మంది ఎంపీటీసీలు గెలిచారు. వారిలో ఐదుగురు టీడీపీలో చేరారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీ కొండారెడ్డి వైఎస్సార్సీపీ తరపున గెలిచిన వారికి విప్ నోటీసులు జారీ చేశారు. వీరిలో కొంతమంది టీడీపీకి అనుకూలంగా ఓటు వేయడంతో లీగల్ చర్యలు తీసుకుంటే ఎంపీటీసీ పదవి పోయే అవకాశం ఉండటంతో వారిలో కూడా గుబులు పట్టుకుంది. - 
      
                   
                               
                   
            ప్రజా సమస్యలు పట్టవా..?
నెల్లూరు(పొగతోట): మోంథా తుఫాన్ ప్రభావంతో జిల్లా ప్రజానీకం తీవ్రంగా నష్టపోయింది. చేతికందే దశలో పంట నీళ్లపాలవడంతో అన్నదాతల కన్నీరు అంతా ఇంతా కాదు. దీని ప్రభావం నుంచి ఇంకా తేరుకోలేదు. ఈ తరుణంలో గళమెత్తి ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు పత్తాలేకుండాపోయారు. నెల్లూరులో గురువారం నిర్వహించాల్సిన జెడ్పీ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖం చాటేశారు. ప్రజాసమస్యలపై వీరికుండే చిత్తశుద్ధి ఇదేనానే ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రైవేట్ కార్యక్రమానికే పెద్దపీట వాస్తవానికి జెడ్పీ సర్వసభ్య సమావేశాన్ని గురువారం నిర్వహించాల్సి ఉంది. ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల అనుమతితో నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. వర్షాలతో జిల్లాలో సంభవించిన నష్టంపై చర్చ జరిగి రైతులకు న్యాయం చేస్తారని అంతా భావించారు. అయితే దీని కంటే ప్రైవేట్ కార్యక్రమమే తమకు ముఖ్యమనే రీతిలో ప్రజాప్రతినిధులు వ్యవహరించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ఫరూఖ్ నెల్లూరొచ్చినా సమావేశానికి మాత్రం హాజరుకాలేదు. మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యేలూ ఇదే తీరును అవలంబించారు. కోరం లేక వాయిదా సమావేశంలో వ్యవసాయ, నీటిపారుదల, వైద్య ఆరోగ్య, సాంఘిక సంక్షేమ, ఆర్ అండ్ బీ తదితర శాఖలతో సమీక్షించాల్సి ఉంది. జిల్లా శాఖల అధికారులు హాజరయ్యారు. ఉదయం 10.30కు సమావేశం ప్రారంభం కావాల్సి ఉన్నా, మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు హాజరుకాకపోవడంతో 11.45 గంటల వరకు నిరీక్షించారు. ఆరుగురు జెడ్పీటీసీలు, నలుగురు ఎంపీపీలే హాజరయ్యారు. కోరం లేకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ప్రకటించారు. కాగా కోరం లేక సమావేశాన్ని వాయిదా వేయడం ఇది రెండోసారి నిండా ముంచిన మోంథా తుఫాన్ చేతికందే పంట నీళ్లపాలవడంతో అన్నదాత కన్నీరు నష్టంపై గళమెత్తాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు జెడ్పీ సమావేశానికి దూరం జిల్లాకు వచ్చినా హాజరుకాని ఇన్చార్జి మంత్రి గత్యంతరం లేక వాయిదా వేసిన చైర్పర్సన్ ఆనం అరుణమ్మ - 
      
                   
                               
                   
            పంట నష్టాన్ని తక్కువగా చూపాలనే దుర్మార్గపు ఆలోచన
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ● వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, అమరావతి: మోంథా తుఫాన్ సహాయక చర్యల్లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. ప్రచారార్భాటంలో మాత్రం హంగామా చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ను పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి మాట్లాడారు. తుఫాన్తో సంభవించిన పంటల నష్టాన్ని తక్కువగా చూపాలనే దుర్మార్గపు ఆలోచనను కూటమి ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. అన్నదాతలను అన్ని విధాలా వంచించిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. సంక్షోభంలోనూ అవకాశాలు వెతుక్కోవాలని చంద్రబాబు చెప్తుంటారని, ఇందులోనూ తన ప్రచారాన్ని ఎలా పెంచుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజలను ఎలా ఆదుకోవాలనే ఆలోచన గానీ.. ఇంగిత జ్ఞానం లేదన్నారు. గతంలో రైతులకు ఏ సమస్యొచ్చినా ఆర్బీకేలను సంప్రదించేవారని, అయితే ఇప్పుడు వీటిని నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. పునరావాస కేంద్రాలను పరిశీలించేందుకెళ్తే, ఈ పనికిమాలిన ప్రభుత్వం అక్కడి బాధితులకు అన్నం పెట్టడంలేదని చెప్పారు. అదే తమ హయాంలో మిడ్ డే మీల్స్ వారితో మంచి భోజనాలు పెట్టామని గుర్తుచేశారు. గతంలో సర్వేపల్లిలో మాత్రమే రిహ్యాబిలిటేషన్ సెంటర్లు ఉండేవని, అయితే నాడు – నేడు ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడంతో ప్రతి గ్రామంలో సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారన్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి అన్ని అంచనాలిచ్చారని, రూ.96.27 కోట్ల నష్టాన్ని చూపారని, ఇందులో ఈ ఎమ్మెల్యేలు ఇరిగేషన్ పనులకు రూ.67,34 కోట్లు పెట్టుకున్నారన్నారు. ఇవన్నీ దొంగ బిల్లులనీ.. రైతులు పంటలు నష్టపోయి.. రోడ్లకు గుంతలు పడి రకరకాల ఇబ్బందులు పడుతుంటే.. ఇలా ఎమర్జెన్సీ వర్కుల కింద బిల్లులు పెట్టుకొని కూటమి ఎమ్మెల్యేలు తలా కొంచెం పంచుకుంటున్నారని ఆరోపించారు. - 
      
                   
                               
                   
            బాధితులకు ఆందోళన అక్కర్లేదు
నెల్లూరు రూరల్: తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు పునరావాసం, సహాయక చర్యలను విస్తృ త స్థాయిలో చేపట్టామని, బాధితులకు ఆందోళన అక్కర్లేదని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, జిల్లా అధికారులతో గురువారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిత్యావసర సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని కోరారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి 25 కిలోల బియ్యంతో పాటు ప్రతి కుటుంబానికి అదనంగా బంగాళదుంపలు, కందిపప్పు, ఉల్లిపాయలు, చక్కెరను కిలో చొప్పున, లీటర్ పామాయిల్ను అందజేయనున్నామని వెల్లడించారు. మత్స్యకారులు, చేనేత కుటుంబాలకు 50 కిలోల బియ్యాన్నివ్వాలని చెప్పారు. జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఖజానా శాఖ అధికారిగా శ్రీనివాసులు నెల్లూరు రూరల్: ఖజానా శాఖ జిల్లా డీడీ (ఎఫ్ఏసీ)గా బాధ్యతలను శ్రీనివాసులు మంగళవారం స్వీకరించారు. గతంలో ఈ స్థానంలో పనిచేసిన గంగాద్రి మరణించడంతో ఉప ఖజానాధికారిగా పనిచేస్తున్న ఈయన్ను నియమించారు. ఖజానా సిబ్బంది సమన్వయంతో ముందుకెళ్తామని చెప్పారు. కాగా శ్రీనివాసులును పలువురు అభినందించారు. ఆర్టీఏ అధికారుల దాడులు వింజమూరు(ఉదయగిరి): కర్నూలులో బస్సులో ఇటీవల అగ్నిప్రమాదం సంభవించిన నేపథ్యంలో వింజమూరులో ప్రైవేట్ బస్సులను రవాణా శాఖ అధికారులు గురువారం తనిఖీ చేశారు. అగ్ని నిరోధక పరికరాల్లేకపోవడంతో ఓ బస్సును సీజ్ చేశారు. అన్ని ప్రైవేట్ బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని చెప్పారు. జిల్లా ఉప రవాణాధికారి మురళీధర్, ఎమ్వీఐలు సుందర్రావు, కరుణాకర్, లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. ఎట్టకేలకు స్పందించిన రవాణా అధికారులు అనుమసముద్రంపేట: ఏఎస్పేట మండల కేంద్రంలోని ప్రైవేట్ వాహనాలను రవాణా శాఖ అధికారులు ఎట్టకేలకు గురువారం తనిఖీ చేశారు. కర్నూలులో జరిగిన బస్సు ప్రమాద నేపథ్యంలో ‘స్టాండ్లోనే ట్రావెల్స్ బస్సులు’ అనే శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమవడంతో రవాణా అధికారులు స్పందించారు. ఈ క్రమంలో ఆగి ఉన్న బస్సులను తనిఖీ చేసి వాటి పత్రాలను ఎమ్వీఐ రాములు తనిఖీ చేశారు. బస్సులు ఫిట్గా ఉన్నాయా.. పన్నులు చెల్లిస్తున్నారాననే అంశాన్ని ఆరాతీశారు. బస్సులు పూర్తిస్థాయిలో ఫిట్గా ఉంటేనే రోడ్లపైకెళ్లాలని చెప్పారు. లేని పక్షంలో సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. - 
      
                   
                               
                   
            చెరువులు కాదు.. రియల్ వెంచర్లు
● లోతట్టు ప్రాంతాలు, చెరువులు, వాగు ప్రవాహ మార్గాల్లో వేసిన వైనం ● భారీ వర్షాలకు పొంగిన చెరువులు ● ఆనవాళ్లు లేకుండా పోయాయి ● లబోదిబోమంటున్న ప్లాట్ల కొనుగోలుదారులుకందుకూరు: రియల్ ఎస్టేట్ వ్యాపారుల బండారాన్ని మోంథా తుపాను బట్టబయలు చేసింది. కందుకూరు పట్టణంలో గోల్డెన్ సిటీ, ఫార్చూన్ సిటీ, స్కంధపురి వెంచర్, జాతీయ రహదారి పక్కన అంటూ వేసిన వెంచర్లు భారీ వర్షాల దెబ్బకు అడ్రస్ లేకుండా పోయాయి. పట్టణ చుట్టుపక్కల వేసిన వెంచర్లన్నీ దాదాపు చెరువులనే తలపించాయి. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్పిన తియ్యని మాటలు విని ప్లాట్లు కొనుగోలు చేసిన పేద, మధ్యతరగతి లబోదిబోమంటున్నారు. మాయ చేసి.. ఇటీవల కాలంలో కందుకూరు పట్టణానికి సమీపంలోనే 167బీ జాతీయ రహదారి రావడంతో దానికి ఇరువైపులా భూములకు రెక్కలొచ్చాయి. విక్కిరాలపేట రోడ్డు, కనిగిరి రోడ్డు, పామూరు రోడ్డు వంటి ప్రాంతాల్లో భారీగా వెంచర్లు వేశారు. బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు సైతం వచ్చి ప్లాట్లు పెట్టారు. వాటికి ౖపైపె మెరుగులు దిద్ది ఇక్కడ కొంటే అనతి కాలంలోనే రెండు, మూడు రెట్లు పెరుగుతుందంటూ ఊదరగొట్టారు. గజం భూమి రేటును రూ.లక్షల్లో పెట్టి పేద, మధ్య తరగతి ప్రజలకు అంటగట్టారు. దీంతో తమ పనైపోయిదంటూ వ్యాపారులు చేతులు దులుపుకొని వెళ్లిపోయారు. ప్లాట్లు కొన్నవారు ప్రస్తుతం వాటి పరిస్థితిని చూసి ఆవేదన చెందుతున్నారు. నిబంధనలు పట్టవు ప్రస్తుతం కందుకూరు పట్టణ శివారు ప్రాంతాల్లో వెంచర్లు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీ నేతల అండదండలు చూసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ స్వలాభం కోసం ఇష్టారీతిన ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారని, నిబంధనలు పాటించ లేదనే విమర్శలున్నాయి. అలాగే పర్యవేక్షించాల్సిన మున్సిపల్ అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వ స్థలాలను, కాలువలను ఆక్రమించి వెంచర్లు వేయడం సరికాదనే అభిప్రాయం ప్రస్తుతం వ్యక్తమవుతోంది. ఇటువంటి వెంచర్లలో ప్లాట్లు కొంటే భవిష్యత్లో కూడా ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. - 
      
                   
                               
                   
            హమ్మయ్య.. బయటకు బోటు
బోటును తీసుకొస్తూ.. ● ముమ్మర చర్యలతో తప్పిన ప్రమాదం సంగం: మోంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు సంగం బ్యారేజీ వద్దకు కొట్టుకొచ్చిన మూడు బోట్లను అధికారులు బయటకు తీయించగలిగారు. 35 టన్నుల బరువున్న బార్ట్ బోటు సంగం బ్యారేజీకి కొద్ది దూరంలో చిక్కుకుందనే సమాచారం అందుకున్న కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజితా వెజెండ్లతో కలిసి రక్షణ చర్యలు చేపట్టి ప్రమాదాన్ని నివారించగలిగారు. రంగంలోకి రెస్క్యూ టీమ్ మూడు పడవల్లో రెండింటిని వెలికితీశారు. మూడో బోటు సంగం బ్యారేజీకి కొద్ది దూరంలోని పాత బ్యారేజీ రోడ్డు వద్ద చిక్కుకుపోయింది. సుమారు 35 టన్నుల బరువున్న భారీ బోటు రిజర్వాయర్ గేట్లకు తగిలితే నష్టం సంభవించొచ్చనే అంచనాతో వెంటనే రెస్క్యూ ఆపరేషన్ కోసం రంగంలోకి దిగారు. బార్ట్ బోటును వెలికితీసేందుకు గానూ ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్మంది వద్ద ఉన్న ఫైబర్ రెస్క్యూ బోట్ల సామర్థ్యం సరిపోదని అంచనా వేశారు. ఈ తరుణంలో మత్స్యశాఖ అధికారుల ద్వారా మరో రెండు బోట్లను కృష్ణపట్నం నుంచి రంగంలోకి దించారు. రెండు బోట్ల ద్వారా బలమైన రోపులను ఉపయోగించి చిక్కుకుపోయిన భారీ బోటును ప్రధాన బ్యారేజీ గేట్లను ఢీకొనకుండా ఒడ్డుకు లాగి ప్రమాదాన్ని నిరోధించారు. సమష్టిగా కృషి చేసిన వారు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సంగం సీఐ వేమారెడ్డి, డీఎస్పీ వేణుగోపాల్, ఆర్డీఓ పావని, తహసీల్దార్ సోమ్లానాయక్, ఆత్మకూరు సీఐ గంగాధర్, ఎస్సైలు రాజేష్, తిరుమలరావు, సైదులు, జిలానీబాషా తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            బాధితులకు అండగా వైఎస్సార్సీపీ
నెల్లూరు(స్టోన్హౌస్పేట): తుపాను బాధితులకు వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. నెల్లూరు 53వ డివిజన్ వెంకటేశ్వరపురం గాంధీ గిరిజన కాలనీలో నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి డివిజన్ ఇన్చార్జి వెంగళ్రెడ్డి ఆధ్వర్యంలో, కో ఆర్డినేటర్ పరంధామయ్య, వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలతో గిరిజన కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, ముంపు ప్రాంత నిర్వాసితులైన 200 మందికి భోజనాలను గురువారం అందజేశారు. అనంతరం స్థానిక మహిళలు పర్వతరెడ్డిని కలిసి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తుపాను కారణంగా నగర నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. గాంధీ గిరిజన కాలనీలో గిరిజనుల ఇళ్లలోకి నీరు చేరిందన్నారు. వారికి తాగునీరు కూడా కరువైందన్నారు. ఈ పరిస్థితుల్లో ఆహారం అందజేయడం జరిగిందన్నారు. వెంగళ్రెడ్డి ఆధ్వర్యంలో బియ్యంతోపాటు 5 రకాల నిత్యావసర వస్తువులు అందించామన్నారు. రాజకీయాలకు అతీతంగా వైఎస్సార్సీపీ ప్రజలకు అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెర్నేటి కోటేశ్వరరెడ్డి, డివిజన్ నేతలు ప్రసన్నకుమార్, శరత్, 5, 4 డివిజన్ నేతలు మస్తాన్, అస్లాం, సలాం, కార్యకర్తలు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            మడుగును తలపిస్తూ..
మోంథా తుపాను ప్రభావంతో రెండు రోజుల క్రితం కందుకూరు ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో చుట్టుపక్కల సాగునీటి చెరువులన్నీ పూర్తి సామర్థ్యం మేరకు నిండి అలుగులు పారాయి. అలాగే వాగులు, వంకలు కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహంతో ముంచెత్తాయి. వరద మొత్తం కందుకూరు పట్టణ శివారు ప్రాంతాలను పూర్తిగా ముంచేత్తింది. ప్రధానంగా పట్టణ నడిబొడ్డున ఉన్న ఉప్పుచెరువు అలుగు పెద్ద ఎత్తున పారింది. ఈ నేపథ్యంలో దిగువన విక్కిరాలపేట రోడ్డును ఆనుకుని వేసిన వెంచర్లు చెరువులుగా మారిపోయాయి. ఇటీవల అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఆ ప్రాంతంలో భారీ వెంచర్ వేశాడు. చుట్టూ ప్రహరీని సైతం నిర్మించి ప్లాట్లు పెట్టి విక్రయించాడు. అయితే వర్షాలకు ఆ ప్రాంతం పెద్ద చెరువులా మారిపోయింది. కచ్చితంగా ఉప్పుచెరువు అలుగు కింద ప్రాంతంలోనే ఉండటంతో భారీగా వరదనీరు ముంచెత్తింది. అయితే చెరువు ప్రవాహ నీటికి అడ్డుగా వెంచర్ వేశారని, అక్కడ కాల్వలను సైతం ఆక్రమించి వేశారని ప్రస్తుతం విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుడు కావడంతో అధికారులు కూడా చూసీచూడనట్లు వదిలేశారు. అలాగే జాతీయ రహదారి పక్కన కొండముడుసుపాళెం సమీపంలో ఇటీవల ఓ బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంచర్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. దీనికి కొండముడుసుపాళెం సాగునీటి చెరువు నుంచి మట్టి తరలిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ పనులు జరుగుతుండగానే వర్షాలకు వెంచర్ అడ్రస్ లేకుండా పోయింది. జాతీయ రహదారి పక్కన ఉన్న వెంచర్లన్నీ పూర్తిగా నీటమునిగిపోయాయి. - 
      
                   
                               
                   
            ఖాళీ స్థలంలో పేకాట
● పోలీసుల దాడులు ● 15 మంది జూదరుల అరెస్ట్ నెల్లూరు(క్రైమ్): నెల్లూరు నగరంలోని రాయపుపాళెం సమీప ఖాళీ స్థలాల్లో కొందరు పేకాటాడుతున్నారని గురువారం బాలాజీనగర్ పోలీసులకు సమాచారం అందింది. ఇన్స్పెక్టర్ సాంబశివరావు తన సిబ్బందితో కలిసి దాడులు చేశారు. పేకాటాడుతున్న ఎన్టీఆర్ నగర్కు చెందిన డి.రవికృష్ణ, డి.చంద్రమోహన్, కె.రవి, షేక్ మస్తాన్, రామచంద్రాపురానికి చెందిన ఆర్.సుబ్బారావు, బాలాజీ నగర్కు చెందిన విజయ, ఉస్మాన్సాహెబ్పేటకు చెందిన జి.కృష్ణకాంత్, ఎస్.ఏలియా, పి.రత్నం, ఎం.రమేష్, నవాబుపేటకు చెందిన వి.సురేంద్ర, కొండాయపాళేనికి చెందిన వి.సందీప్రెడ్డి, విడవలూరు మండలం ఊటుకూరుకు చెందిన వేణు, పార్లపల్లికి చెందిన జి.వెంకటేశ్వర్లు, ఇందుకూరుపేటకు చెందిన కె.రవిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.91,910ల నగదు, ఆరు మోటార్బైక్లు, కారు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై పుల్లారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.30 సన్నవి : రూ.20 పండ్లు : రూ.10 - 
      
                   
                               
                   
            సమస్యలపై కలెక్టర్ దృష్టి సారించాలి
వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని ఎంఎస్డబ్ల్యూ విద్యార్థి శ్యామ్సుందర్ కోరారు. మండలంలోని కాకుటూరు వద్దనున్న వర్సిటీలో గురువారం పలువురు విద్యార్థులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లా డారు. యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా ఈసీ అనుమతి లేకుండా ఉద్యోగాల నియామకాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించడం చట్ట విరుద్ధమని ఆరోపించారు. వీఎస్యూలో స్వయంగా ఎలాంటి ఇంటర్వ్యూలు నిర్వహించరాదని 2016లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను తుంగలో తొక్కారన్నారు. ఏ యూనివర్సిటీలోనూ అసిస్టెంట్ రిజిస్ట్రార్ పర్యవేక్షణలో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరగదన్నారు. కానీ వీఎస్యూలో జరగడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. యూనివర్సిటీలో తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా నిర్లక్ష్యం చూపుతున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్పై అనేక ఆరోపణలు వస్తున్నాయని, కలెక్టర్ ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని కోరారు. - 
      
                   
                               
                   
            సిఫోర్స్కే సీట్లు
●నెల్లూరు(టౌన్): నెల్లూరులోని వీఆర్ న్యాయ కళాశాలలో నిబంధనలకు విరుద్ధంగా సీట్లు కేటాయిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో న్యాయ విద్యకు డిమాండ్ పెరిగింది. దీంతోపాటు ఇతర ప్రాంతాల్లో లా సీటుకు అడ్మిషన్ ఫీజు ఎక్కువగా ఉండటంతో ఎక్కువ మంది వీఆర్లో అడ్మిషన్లు పొందేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. లా సెట్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. మేనేజ్మెంట్ కోటాలో కొన్నింటిని కేటాయిస్తారు. దీని విషయంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లున్నట్లు తెలిసింది. మొత్తం 420 సీట్లు వీఆర్ న్యాయ కళాశాలలో కన్వీనర్ కోటా కింద 3 ఏళ్ల లా కోర్సులో 240, ఐదేళ్ల కోర్సులో 96 సీట్లున్నాయి. మేనేజ్మెంట్ కోటా కింద 3 ఏళ్ల కోర్సులో 60, ఐదేళ్ల కోర్సులో 24 సీట్లున్నాయి. ఈ ఏడాది జూన్లో లాసెట్ జరిగింది. మూడేళ్లకు రూ.13,500, ఐదేళ్లకు రూ.13 వేలు అడ్మిషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి లైబ్రరీ, పరీక్ష ఫీజు అదనం. కన్వీనర్ కోటాలో లాసెట్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. మేనేజ్మెంట్ కోటా కింద సీట్లు పొందే వారు సొంతంగా ఫీజు చెల్లించాలి. మేనేజ్మెంట్ కోటాలో చేరాలంటే.. కళాశాలలో బుధవారంతో తొలివిడత సీట్ల అలాట్మెంట్ ముగిసింది. వచ్చేనెల మొదటి వారంలో మేనేజ్మెంట్ కోటా కేటాయింపునకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. దీని కింద అడ్మిషన్ పొందాలంటే స్థానికులై ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో చదివినట్లు ఏడేళ్ల స్టడీ సర్టిఫికెట్ సమర్పించాలి. దీంతోపాటు డిగ్రీలో వచ్చిన పర్సంటేజీని పరిగణలోకి తీసుకుంటారు. ఏపీలో ఉంటున్నట్లు సర్టిఫికెట్ను పొందుపరచాలి. బార్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ఇవన్నీ ఇస్తేనే సీట్ల కేటాయింపు జరుగుతుంది. నిబంధనలకు విరుద్ధం నిబంధనలకు విరుద్ధంగా మేనేజ్మెంట్ కోటా సీట్లు కేటాయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల లేఖలతో సీట్లు ఇస్తున్నట్లు కొందరు విద్యార్థులు చెబుతున్నారు. నేతలు కూడా తమ అనుయాయులకు సీట్లు ఇప్పించుకునేందుకు ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. అలాగే విద్యాసంస్థలకు సెక్రటరీగా జేసీపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఒత్తిడి పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు డబ్బులు ఎక్కువ మొత్తంలో తీసుకుని తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారికి అడ్మిషన్లు ఇప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆ రాష్ట్రానికి చెందిన 40 నుంచి 50 మంది వరకు చదువుతున్నట్లు సమాచారం. నాన్ లోకల్ కింద ఉన్న వీరికి కళాశాలలో ఏ విధంగా అడ్మిషన్ ఇచ్చారో సమాధానం చెప్పాల్సి ఉంది. సంఘంగా ఏర్పడి.. మేనేజ్మెంట్ కోటా సీట్లు ఇప్పించేందుకు పూర్వ విద్యార్థులు కొందరు సంఘంగా ఏర్పడి ప్రలోభాలు పెడుతున్నార్న ప్రచారం జరుగుతోంది. కొందరి నుంచి డబ్బులు తీసుకుని అడ్మిషను ఇప్పిస్తున్నారని ఇక్కడ చదువుతున్న విద్యార్థులు చెబుతున్న మాట. దీంతోపాటు లాసెట్లో ర్యాంకుల ఆధారంగా సీటు వచ్చిన వారి నుంచి సైతం అన్ని తామే చూసుకుంటామని అదనంగా నగదు తీసుకుంటున్నార్న ఆరోపణలున్నాయి. మొత్తం వ్యవహారాలు జేసీకి తెలిసి జరుగుతున్నాయా?, ఆయన్ను పక్కదోవ పట్టిస్తున్నారా? అనే విషయాలపై చర్చలు నడుస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి అర్హులకు సీట్లు కేటాయించాలనే డిమాండ్ ఉంది.నిబంధనల ప్రకారమే సీట్ల కేటాయింపు వీఆర్ లా కళాశాలలో నిబంధనల ప్రకారమే సీట్లు కేటాయిస్తున్నాం. మేనేజ్మెంట్ కోటాలో డిగ్రీలో అత్యధిక పర్సంటేజీ ఉన్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నాం. లోకల్ కాకుండా నాన్లోకల్ విద్యార్థులకు ఈ కళాశాలలో చేరే అవకాశం లేదు. – శ్రీధర్, ఇన్చార్జి ప్రిన్సిపల్ వీఆర్ లా కళాశాలలో ముగిసిన తొలివిడత అలాట్మెంట్ మేనేజ్మెంట్ కోటాలో ఇతర ప్రాంతాల్లో అడ్మిషన్ ఫీజు ఎక్కువ ఇక్కడికి విద్యార్థుల పరుగులు ఇష్టారాజ్యంగా కేటాయింపు మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సులు అడ్మిషన్లు ఇప్పిస్తామంటూ పూర్వ విద్యార్థుల ప్రలోభాలు - 
      
                    
ఆకట్టుకున్న పోలీస్ ఓపెన్ హౌస్
నెల్లూరు(క్రైమ్): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో గురువారం నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమం ఆకట్టుకుంది. తొలుత దీన్ని ఏఎస్పీ సౌజన్య ప్రారంభించారు. అనంతరం విధి నిర్వహణలో పోలీస్ శాఖ వినియోగించే వివిధ రకాల ఆయుధాలు, భద్రత పరికరాలపై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగాలు చేసిన పోలీస్ అమరవీరుల సేవలను వివరించారు. ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో ఉన్నత శిఖరాలను అధిరోహించి ప్రజలకు సేవచేయాలనే స్ఫూర్తిని నింపారు. మెటల్ డిటెక్టర్, ఫింగర్ ప్రింట్ పరికరాలు, కమ్యూనికేషన్ మ్యాన్ ప్యాక్ సెట్స్, సెల్జామర్, వీహెచ్ఎఫ్ సెట్, ట్రాఫిక్ నియంత్రణ పరికరాలు, రోడ్డు సేఫ్టీ వాహనాలు, డాగ్, బాంబ్స్క్వాడ్, డ్రోన్స్ తదితరాల పనితీరును వివరించారు. డీఎస్పీలు శ్రీనివాసరావు, చెంచురామారావు, చంద్రమోహన్, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. కొవ్వొత్తుల ర్యాలీ కొవ్వొత్తుల ర్యాలీని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జోహార్ అమరవీరులారా అంటూ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి కేవీఆర్ పెట్రోల్ బంక్ కూడలి వరకు ర్యాలీని చేపట్టారు. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. ఎస్పీ అజిత వేజెండ్ల, ఏఎస్పీ సౌజన్య తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            తుఫాన్ నష్ట నివేదిక
ప్రకృతి విపత్తుల గాయాలు.. ప్రభుత్వ నిర్దయ పేదలకు శాపంగా మారాయి. చంద్రబాబు పాలనలో హడావుడి, డప్పు తప్ప.. నిరాశ్రయులను ఆదుకునే మనసు శూన్యమనే చెప్పాలి. మోంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముంపు ప్రాంతాల బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడం మొదలుకొని వసతులు కల్పించడం, సాయం అందించడం వరకు సర్కారు చిన్న చూపు చూసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంగళవారం ఒక్క రోజు పునరావాసం కల్పించినా.. కనీసం వారికి సకాలంలో భోజనాలు, చిన్నారులకు పాలను అందించడంలో నిర్లక్ష్యం కనిపించింది. వర్ష తీవ్రత తగ్గిపోవడంతో తిరిగెళ్తున్న బాధితులకు రూ.వెయ్యి సాయం అందిస్తామని చెప్పడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనూ ఇలాంటి విపత్తులు ఏటా తలెత్తాయి. ఆ సమయంలో పునరావాస కేంద్రాల్లో సకల సౌకర్యాలను కల్పించడంతో పాటు తిరిగెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరికీ రూ.రెండు వేల చొప్పున సాయమందించారు. ఇదంతా అప్పట్లో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల వ్యవస్థతో అధికారులు సమన్వయంతో పనిచేయడంతోనే సాధ్యమైందని గుర్తు తెచ్చుకుంటున్నారు. సాక్షిప్రతినిధి, నెల్లూరు: మోంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున వరదనీరు చేరింది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు దాదాపు నాలుగు వేల మందిని 77 పునరావాస కేంద్రాలకు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో అధికారులు తరలించారు. అధికారులు కష్టపడినా, ప్రజలను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబుకు మనసు రాలేదు. కేవలం సమీక్షలతో సరిపెట్టారు. ప్రజలకు సాయం చేసేందుకు సరిపడా నగదును ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో పలుచోట్ల బాధితుల ఆకలిని అధికారులు, కొంత మంది ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీల నేతలు తీర్చారు. పునరావాస కేంద్రాల్లో పసిబిడ్డలకు పాలు, దుప్పట్లను అందించడంలోనూ విఫలమయ్యారు. బాబు జమానాలో రూ.వెయ్యేనంట జగన్మోహన్రెడ్డి పాలనలో బాధితులను యుద్ధప్రాతిపదికన ఆదుకున్నారు. శిబిరాల్లో తలదాచుకునేందుకు వచ్చిన వారిలో ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి రూ.రెండు వేల చొప్పున సాయాన్ని అందజేశారు. దీంతో పాటు ఒక్కో కుటుంబానికి బియ్యం బస్తా, బంగాళదుంపలు, ఉల్లిగడ్డలు, నూనె, పంచదార, పప్పులతో కూడిన కిట్ను అందించి సంతోషంగా ఇంటి వద్దకు పంపారు. అయితే చంద్రబాబు పాలనలో బాధితులను ఆదుకునే విషయంలో మానవత్వం కరువైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పునరావాస శిబిరాల్లో తలదాచుకున్న వారికి రూ.వెయ్యిని ఇస్తామని ప్రకటించారు. ఒక కుటుంబంలో ముగ్గురికి మించి ఉంటే గరిష్టంగా రూ.మూడు వేలనే అందిస్తామని చెప్పారు. బియ్యం, నూనె, పప్పు, పంచదార ఇస్తామని చెప్పినా, ఇంకా ఆచరణకు నోచుకోలేదు. వలంటీర్లు లేకపోవడం, సచివాలయ ఉద్యోగులే భారం మోయాల్సి రావడంతో బాధితులు ఒట్టి చేతులతో ఊసురుమంటూ ఇళ్లకెళ్లారు. నాటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని, నేటి చంద్రబాబు ప్రభుత్వాన్ని బేరీజు వేసుకుంటున్నారు. బాధితుల జాబితాపై బోగస్ లెక్కలు జిల్లా వ్యాప్తంగా 77 పునరావాస కేంద్రాల్లో 3,977 మంది తలదాచుకున్నారని కలెక్టర్ హిమాన్షు శుక్లా మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అయితే బుధవారం ఉదయానికి 7200 మందికిపైగా ఉన్నట్లు కలెక్టరేట్కు జాబితాలొచ్చాయి. తెల్లారే సరికి రెట్టింపెలా అయ్యారని కలెక్టరేట్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పునరావాస బాధితుల లెక్కలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొంత మంది అధికార పార్టీ నేతలు పునరావాస శిబిరాల్లో లేని వారి పేర్లను సైతం నమోదు చేయించారనే ప్రచారం జరుగుతోంది. అక్కడి అధికారులపై ఒత్తిడి తెచ్చి బోగస్ పేర్లిచ్చి లెక్కలు పెంచి పరిహారాన్ని కాజేసేందుకు యత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు చిత్తశుద్ధిగా వ్యవహరించి అసలైన బాధితులకు మాత్రమే పరిహారం అందజేసి ప్రజాధనాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాబు జమానాలో.. ఒక్కరికి రూ.1,000.. కుటుంబానికి గరిష్టంగా రూ.3,000 + నిత్యావసర సరుకులు మోంథా తుఫాన్ ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాలు జలమయం 77 పునరావాస కేంద్రాలకు 3977 మందికిపైగా తరలింపు చాలా చోట్ల భోజనం, పాలు, దుప్పట్లు అందించడంలో విఫలం కొన్ని చోట్ల ఆకలి కష్టాలను తీర్చిన పర్యవేక్షణాధికారులు, నేతలు బాధితులకు రూ.వెయ్యి చొప్పున ఇస్తామని హామీ వానలు తగ్గాక ఒట్టి చేతులతో బాధితుల తిరుగుముఖం నారా వారి పాలనలో డప్పు తప్ప.. సాయం శూన్యం - 
      
                   
                               
                   
            మోంథా.. నష్టాలు నిండా
నెల్లూరు(అర్బన్): మోంథా తుఫాన్.. జిల్లాకు నష్టాన్ని మిగిల్చింది. కాకినాడ – మచిలీపట్నం మధ్య నరసాపురం వద్ద తీరాన్ని మంగళవారం దాటింది. ఏకథాటిగా 30 గంటలు వర్షం కురవడంతో జిల్లాలోని చెరువులు నిండాయి, వాగులు, వంకలు పొంగాయి. రోడ్లు, రహదారులపై వరదనీరు చేరి రాకపోకలు స్తంభించాయి. 21 మండలాల్లో సుమారు 4500 మంది తుఫాన్ ప్రభావానికి గురయ్యారు. జిల్లాలో రూ.44.44 కోట్ల నష్టం సంభవించిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. పూర్తి స్థాయి సర్వే చేస్తున్నారు. పొలాల్లో వరద నీరు పూర్తిగా తొలగిపోయాక ఈ నష్టం మరింత పెరగొచ్చని తెలుస్తోంది. నష్టం ఇలా.. ● భారీ వర్షాలకు 1282.63 హెక్టార్లలో వరిపైరు దెబ్బతింది. హెక్టార్కు రూ.25 వేల చొప్పున రూ.3,20,65,000.. సజ్జ నాలుగు హెక్టార్లలో దెబ్బతినగా, హెక్టార్కు రూ.15 వేల చొప్పున రూ.60 వేలు.. వేరుశనగ 11.4 హెక్టార్లలో హెక్టార్కు రూ.25 వేల చొప్పున రూ 2.85 లక్షలు.. మొక్క జొన్న 1.7 హెక్టార్లలో హెక్టార్కు రూ.15 వేల చొప్పున రూ.25 వేలు.. ఇలా మొత్తం నష్టం రూ.3.24 కోట్లకుపైగా ఉంటుంది. ● మూడు కచ్చా గృహాలకు రూ.20 వేల చొప్పున నష్టం వాటిల్లింది. ● ఆరు పెద్ద పశువులు, నాలుగు గొర్రెలు మృతి చెందగా, వీటి విలువ రూ.1.8 లక్షలుంటుంది. ● పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని 22 గ్రామీణ రోడ్లు 96.2 కిలోమీటర్ల పరిధిలో గుంతలు ఏర్పడి దెబ్బతిన్నాయి. దీనికి గానూ రూ.57.71 లక్షల నష్టం వాటిల్లింది. ● 31 ఆర్ అండ్ బీ రోడ్లకు గుంతలు పడ్డాయి. బ్రీచెస్, సీడీ వర్క్స్, వరదనీరు ఓవర్ ఫ్లో కావడంతో జరిగిన నష్టం, కూలిన చెట్ల తొలగింపు.. ఇలా రూ.22.87 కోట్ల నష్టం సంభవించింది. ● నాలుగు పట్టణాల్లో 4.7 కిలోమీటర్ల పరిధిలో రోడ్లు మరమ్మతులకు గురయ్యాయి. తాగునీటి పైప్లైన్, ఓపెన్ డ్రెయిన్ డ్యామేజీ.. ఇలా మున్సిపల్ శాఖకు రూ.75.6 లక్షల నష్టం వాటిల్లింది. ఇద్దరి మృతి మనుబోలు మండలం గొట్లపాళేనికి చెందిన జయమ్మ.. గేదెల కోసం పొలాల్లోకి వెళ్లి మృతి చెందారు. మర్రిపాడు మండలం రామానాయుడుపల్లెలో కోనంకి రామ్చరణ్ (13) బొగ్గేరులో దిగి మూడు రోజుల క్రితం మృత్యువాత పడ్డారు. వీరి కుటుంబాలకు నష్టపరిహారాన్ని ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటించలేదు. విద్యుత్ శాఖకు.. నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలో కురిసిన వర్షా లు, ఈదురుగాలులకు విద్యుత్ సంస్థకు రూ.53 లక్షల మేర నష్టం సంభవించిందని ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్ఈ రాఘవేంద్రం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పది 33 కేవీ సబ్స్టేషన్లు ప్రభావితమయ్యాయని చెప్పారు. వీటి పరిధిలో 33 కేవీ లైన్లు 18.. 11 కేవీ లైన్లు 53.. 76 విద్యుత్ స్తంభాలు.. 19 కిలోమీటర్ల మేర ఎల్టీ లైన్లు.. 248 ట్రాన్స్ఫార్మర్లు తుఫాన్ ప్రభావానికి గురయ్యాయని పేర్కొన్నారు. 90 శాతం మేర మరమ్మతులు చేపట్టి సరఫరాను పునరుద్ధరించామన్నారు. పంటలు, ఆస్తి నష్టం రూ.44.44 కోట్లుగా ప్రాథమిక అంచనా పూర్తి స్థాయి సర్వే చేస్తున్న అధికారులు పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు చేరుకున్న ప్రజలు - 
      
                   
                               
                   
            తప్పిన ఘోర ప్రమాదం
సంగం: ఇసుక తరలించేందుకు పెన్నానదిలో ఏర్పాటు చేసిన ట్రెడ్జింగ్ పడవల వల్ల ఘోర ప్రమాదం త్రుటిలో తప్పింది. వివరాలిలా ఉన్నాయి. సంగం సమీపంలోని పెన్నానదిలో ఇసుక డ్రెడ్జింగ్ కోసం నాలుగు పడవలను ఏర్పాటు చేశారు. మూడింటిని బీరాపేరు బ్రిడ్జి వద్ద తూములకు కట్టి వాటి వదిలేశారు. బీరాపేరు, బొగ్గేరుకు వరద తాకిడి అధికమవడంతో తాళ్లు తెగిపోయి పడవలు పెన్నానదిలోకి ప్రవేశించాయి. 35 టన్నుల బరువున్న పడవ సంగం పాత ఆనకట్ట ఫాలింగ్ షట్టర్ల కు తగులుకుని ఆగిపోయింది. మిగతావి సమీపంలో నిలిచిపోయాయి. పెద్ద పడవ కొత్త బ్యారేజీ షట్టర్లను ఢీకొని ఉంటే ప్రవాహం ఒక్కసారిగా పెన్నానదిలో ప్రవహించి పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యేవి. కలెక్టర్, ఎస్పీ పరిశీలన సమాచారం అందుకున్న కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత బుధవారం సంగంకు వచ్చి పరిశీలించారు. కృష్ణపట్నం పోర్టులోని సంబంధిత అధికారులకు కలెక్టర్ వీడియో కాల్ చేసి పరిస్థితిని చూపారు. అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లి 35 టన్నుల బరువున్న పడవను తొలగించాలని ఆదేశించారు. అంతకుముందు ఇరిగేషన్ అధికారులు, రైతులతో మాట్లాడారు. ప్రస్తుతానికి రెస్క్యూ టీమ్ షట్టర్ల లోపల ఉన్న రెండు పడవలను తొలగించారు. అతి ప్రమాదకర స్థితిలో ఉన్న భారీ పడవను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి వెంట తెలుగుగంగ ఎస్ఈ సుబ్రహ్మణ్యేశ్వరరెడ్డి, సోమశిల ఎస్ఈ రమణారెడ్డి, బ్యారేజ్ ఈఈ మేకల అనిల్కుమార్రెడ్డి, ఆర్డీఓ భూమిరెడ్డి పావని, డీఎస్పీ కె.వేణుగోపాల్, ఇరిగేషన్ ఈఈ అనిల్రెడ్డి, జిల్లా ఫైర్ ఆఫీసర్ వాకా శ్రీనివాసులురెడ్డి, ఇన్చార్జి ఏడీఎఫ్ఓ శ్రీనాథ్రెడ్డి ఎంపీడీఓ షాలె ట్, సీఐలు వేమారెడ్డి, గంగాధర్, తహసీల్దార్ సోమ్లానాయక్, అధికారులున్నారు. పోర్టు నుంచి బోట్ల తరలింపు ముత్తుకూరు(పొదలకూరు): మత్స్యశాఖ అధికారులు బుధవారం సంగం మండలానికి కృష్ణపట్నం పోర్టు నుంచి బోట్లను తరలించారు. అక్కడ పడవను తీసేందుకు మత్స్యశాఖ ఏడీ చాన్బాషా, ఎఫ్డీఓ పూజిత, పోర్టు ఎస్సై శ్రీనివాసులురెడ్డి బోట్లను పంపారు. గురువారం పడవలను బయటకు లాగేందుకు ప్రయత్నిస్తామని వారు వెల్లడించారు. వరదకు పెన్నానదిలోకి ప్రవేశించిన పడవలు కొత్త బ్యారేజీ షట్టర్లను ఢీకొని ఉంటే ప్రమాదం తీసేందుకు అధికారుల ప్రయత్నాలు - 
      
                   
                               
                   
            నాటికి.. నేటికీ ఎంతో వ్యత్యాసం
2019 నుంచి 2024 వరకు సీఎంగా జగన్మోహన్రెడ్డి పాలన సాగించిన సమయంలో వర్షాలు, వరదలు తరచూ వచ్చేవి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు నెలకోసారి విపత్తులు రావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాల్సిన పరిస్థితి ఏర్పడేది. అయితే అప్పట్లో పరిపాలనను ఆయన వికేంద్రీకరణ చేశారు. సచివాలయ, వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఎలాంటి సాయాన్నైనా గంటల వ్యవధిలో వలంటీర్లతో ఇళ్ల వద్దకే అందేలా చేశారు. అప్పట్లో వరదలొచ్చిన సమయంలో వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరిపి నిమిషాల్లో పునరావాస కేంద్రాలకు చేర్చేవారు. అక్కడ ఎవరికీ ఏ లోటూ రాకుండా అన్ని ఏర్పాట్లూ చేసేవారు. ప్రజాసంక్షేమమే పరమావధిగా వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పక్కాగా ఏర్పాట్లు సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో సమన్వయం చేసుకుంటూ చర్యలు బాధితులకు రూ.రెండు వేల చొప్పున సాయం, నిత్యావసర వస్తువుల కిట్ల అందజేత నాడు - 
      
                   
                               
                   
            నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.30 సన్నవి : రూ.20 పండ్లు : రూ.10 గల్లంతైన మహిళ మృతదేహం లభ్యంమనుబోలు: మండల పరిధిలోని గొట్లపాళెం గ్రామానికి చెందిన కృష్ణమనేని జయమ్మ (65) మంగళవారం పాట్టేళ్ల కాలువలో గల్లంతైన విషయం తెలిసిందే. పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలింపు చేపట్టారు. చీకటి పడటంతో నిలిపేశారు. బుధవారం జయమ్మ మృతదేహాన్ని చెక్డ్యామ్ వద్ద గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఎస్సై శివరాకేష్, డీటీ ప్రదీప్, వీఆర్వో గుణశేఖర్ గొట్లపాళెం చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. గూడూరు ప్రభుత్వాస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యలకు అప్పగించారు. వేగూరు కాలువలో.. కోవూరు: మండలంలోని లక్ష్మీనారాయణపురం గ్రామం పక్కనున్న వేగూరు కాలువలో బుధవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. తీవ్ర దుర్వాసన రావడంతో చూసి కోవూరు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పైతట్టు ప్రాంతాల నుంచి మృతదేహం కొట్టుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మృతుడి వయసు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండొచ్చని చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.చుక్కేసి.. రోడ్డుపై పడి..నెల్లూరు (క్రైమ్): మోంథా తుపా ను నేపథ్యంలో మంగళవారం ఇళ్లు విడిచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడ్డారు. అయితే ఓ వ్యక్తి ఫూటుగా మద్యం తాగి వాన కురుస్తున్నా లెక్కచేయకుండా నడుచుకుంటూ బయలుదేరాడు. కొద్దిసేపటికి అడుగులు తడబడటంతో నెల్లూరు నగర డీఎస్పీ కార్యాలయానికి సమీపంలో రోడ్డుపక్కన బోర్లా పడ్డాడు. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి మందుబాబును లేపి సమీపంలోని బస్ షెల్టర్ వద్ద కూర్చొబెట్టి వెళ్లిపోయాడు. సకాలంలో ఆయన స్పందించకుంటే పరిస్థితి మరోలా ఉండేదని స్థానికులు తెలిపారు. - 
      
                   
                               
                   
            ప్రాచీన చరిత్రకు దేవస్థానాలు దర్పణాలు
● త్రిదండి రామానుజ చినజీయర్ నెల్లూరు(బృందావనం): ‘ప్రాచీన చరిత్రకు ఆలయాలు దర్పణాలు. వాటిని సంరక్షించి భావితరాలకు అందించాల్సిన గురుతర బాధ్యత ఈనాటి, రేపటి తరంపై ఉంది’ అని త్రిదండి రామానుజ చినజీయర్ అనుగ్రహభాషణ చేశారు. మూలాపేటలోని రుక్మిణి సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయ శంకుస్థాపన మహోత్సవాన్ని బుధ వారం చినజీయర్ స్వహస్తాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. బాలాలయంలో తాత్కాలికంగా ప్రతిష్టించిన మూర్తులను ఆయన దర్శించుకున్నారు. అనంతరం తొలుత హోమశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి ఉప ఆలయాల పునఃనిరాణాలకు శిలాన్యాసం, పూజా కార్యక్రమాలను చేశారు. భక్తుల గోవింద నామస్మరణలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ ఆలయ పునఃనిర్మాణ శంకుస్థాపన మహోత్సవం కనులపండువగా జరిగింది. అనంతరం చినజీయర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్లాల్, కమిషనర్ రామచంద్రమోహన్, కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా అధికారి కోవూరు జనార్దనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            నిండిన చెరువులు
● అధ్వానంగా కాలువలు ● రైతుల్లో ఆందోళననెల్లూరు(స్టోన్హౌస్పేట): మోంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలతో సగానికిపైగా చెరువులు జలకళ సంతరించుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా మైనర్, మీడియం, మేజర్ కలిపి మొత్తం 1,007 చెరువులున్నాయి. వీటిలో దగదర్తి మండలంలో ఉన్న 43, గుడ్లూరు మండలంలో ఉన్న 36 చెరువులన్నీ నిండిపోయాయి. పొదలకూరు మండలంలో 60 ఉండగా 41 నిండుకుండలా ఉన్నాయి. మొత్తంగా 110 చెరువులు 50 నుంచి 75 శాతం, 216 చెరువులు 75 నుంచి 100 శాతం, 587 చెరువులు పూర్తిగా నిండాయి. 27,030.74 క్యూసెక్యులకు గానూ ప్రస్తుతం అన్నింట్లో కలిపి 23,155.53 క్యూసెక్కుల నీరు చేరింది. పూడికతీత లేక.. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కాలువల్లో మరమ్మతులు, పూడికతీత పనులు చేపట్టలేదు. దీంతో చెరువుల నుంచి కాలువల ద్వారా సాగునీరు పారే పరిస్థితి లేదని రైతులు చెబుతున్న మాట. రబీ పంట కోసం ఏప్రిల్ నెలలో జరిగిన ఐఏబీ సమావేశంలో నీటిని విడుదలకు ముందే ఒక్కొక్క నియోజకవర్గానికి రూ.2 కోట్లతో కాలువల్లో ప్రాథమిక మరమ్మతులు చేయిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. కానీ ఇది కార్యరూపం దాల్చలేదు. జిల్లాలోని నీటి ప్రాజెక్ట్ల విషయంలో మొదటి నుంచి కూటమి పాలకులు నిర్లక్ష్యంగా ఉన్నారని విమర్శలున్నాయి. - 
      
                   
                               
                   
            ఉధృతంగా బీరాపేరు
ఆత్మకూరు: మోంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఏఎస్పేట మండలంలోని కొండమీదకొండూరుకు వెళ్లే దారిలో చప్టాపై బీరాపేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. చేజర్ల మండలం దాచూరు నుంచి పెంచలకోనకు వెళ్లే మార్గంలో కొల్లపునాయుడుపల్లి వద్ద రోడ్డు గుంతలమయంగా మారడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. అనంతసాగరం మండలంలో 1500 ఎకరాల వరి పైరు పూర్తిగా నీటమునిగి.. వెన్నులు తేలుతున్నాయి. అగ్రహారం, గౌరవరం గ్రామాల పరిధిలో మిరప తోటల్లో నీరు నిలిచిందని రైతులు తెలిపారు. పడమటికంభంపాడులో సుమారు 40 ఎకరాల్లో వేరువనగ పైరు దెబ్బతినింది. కాగా పంట నష్ట పరిశీలన నిమిత్తం గ్రామాల్లో వ్యవసాయాధికారులు పర్యటిస్తున్నారు. - 
      
                   
                               
                   
            కుమారుడికి పెళ్లి చేసేందుకు వెళ్తూ..
● ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు ● ఘటనా స్థలంలో తండ్రి, బంధువు మృతి ● ఇద్దరి పరిస్థితి విషమం ● వీరంతా ఉత్తరప్రదేశ్ వాసులు సోమశిల: వారంతా పొట్టకూటి కోసం వలసొచ్చారు. ఓ వ్యక్తి కుమారుడికి ఇక్కడి యువతితో పెళ్లి కుదిరింది. వివాహ నిమిత్తం అందరూ పెంచలకోనకు కారు లో బయలుదేరారు. ఈ క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, బంధువు మృతిచెందిన ఘటన బుధవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బాషా సయ్యద్ పాల్ (50) 20 సంవత్సరాల క్రితం కుటుంబంతో ఉత్తరప్రదేశ్ నుంచి ప్రొద్దుటూరుకు వచ్చి వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడ్డాడు. కుమారుడి వివాహం పెంచలకోనలో జరిపాలని నిర్ణయించుకుని కుటుంబ సభ్యులు, బంధువులు రెండు కార్లలో బయలుదేరారు. వరుడు, కొందరు కుటుంబ సభ్యులు ఒక కారులో ముందు వెళ్లారు. వెనుక మరో కారులో తండ్రి, మరికొందరున్నారు. ఈ వాహనం వేగంగా వస్తూ అనంతసాగరం మండలం ఉప్పలపాడు సమీపంలోని జాతీయ రహదారిపై నిలిపి ఉన్న మినీ లారీని ఎదురు నుంచి ఢీకొట్టి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బాషా సయ్యద్ పాల్, బంధువు సయ్యద్ ఆసిఫ్ (19) ఘటనా స్థలంలోనే మృతిచెందారు. జబీఉల్లా, ఆదిల్ పాల్ తీవ్రంగా గాయపడగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. వీరికి చికిత్స నిమిత్తం అనంతసాగరం, కలువాయి 108 అంబులెన్స్ల్లో వైద్యశాలకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ముందు వెళ్లిపోయిన కుటు ంబ సభ్యులు పెంచలకోన నుంచి ఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించారు. సోమశిల, అనంతసాగరం ఎస్సైలు శ్రీనివాసులు, సూర్యప్రకాశ్రెడ్డిలు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు. - 
      
                    
ప్రభుత్వ కుట్రలను సాగనీయం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ● వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ మనుబోలు: పేదలకు ఉచిత వైద్యాన్ని దూరం చేసే ప్రభుత్వ యత్నాలను సాగనీయబోమని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి స్పష్టం చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మనుబోలు బస్టాండ్ సెంటర్లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నాటి సీఎం జగన్మోహన్రెడ్డి తెచ్చిన 17 మెడికల్ కళాశాలల్లో ఏడు పూర్తవ్వగా, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. వీటిని పూర్తి చేసి పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించడంతో పాటు వాటికి అనుసంధానంగా ఏర్పాటయ్యే సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించొచ్చని తెలిపారు. అయితే దీనికి భిన్నంగా కమీషన్లకు ఆశపడి మెడికల్ కశాళాలలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు యత్నించడం దుర్మార్గమని చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే కోటి సంతకాల సేకరణను ప్రారంభించామని వివరించారు. వీటిని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి ప్రైవేటీకరణను అడ్డుకుంటామని తెలిపారు. ప్రజా ప్రతినిధులతో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున సంతకాలు చేశారు. ఎంపీపీ గుండాల వజ్రమ్మ, సర్పంచ్ కంచి పద్మమ్మ, ఎంపీటీసీ సభ్యులు దువ్వూరు రాజేశ్వరమ్మ, గుమ్మడి వెంకటసుబ్బయ్య, పార్టీ నేతలు బొమ్మిరెడ్డి హరగోపాల్రెడ్డి, కడివేటి చంద్రశేఖర్రెడ్డి, కసిరెడ్డి ధనుంజయరెడ్డి, భాస్కర్గౌడ్, ముంగర రవీందర్రెడ్డి, గుంజి రమేష్ తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            మద్యం మత్తులో వ్యక్తి వీరంగం
● నలుగురికి గాయాలుఉదయగిరి: పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మద్యం తాగి మోటార్బైక్పై వెళ్తూ వీరంగం సృష్టించడంతో నలుగురు వ్యక్తులు గాయపడిన ఘటన బుధవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన ఎస్.బుజ్జి మద్యం మత్తులో బైక్పై బయలుదేరాడు. మొదటగా బస్టాండ్ సెంటర్లో నడుచుకుంటూ వెళ్తున్న సీతారామపురం మండలం బసినేనిపల్లికి చెందిన భాగ్యమ్మను ఢీకొట్టగా ఆమె కిందపడి తల వెనుక భాగంలో గాయమైంది. అనంతరం గండిపాళెం వెళ్లే మార్గంలో బైక్పై వెళ్తున్న తిరుమలాపురం గిరిజన కాలనీకి చెందిన టి.సర్వర్ష, వాసు, వెంకాయమ్మను ఢీకొట్టాడు. దీంతో సర్వర్షకు తీవ్ర, వాసు, వెంకాయమ్మకు స్వల్పగాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బుజ్జిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నెల్లూరు, కావలిలో కార్యక్రమాలునెల్లూరు(అర్బన్): సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా నెల్లూరు, కావలిలో కార్యక్రమాలు నిర్వహిస్తామని విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసులు తెలిపారు. బుధవారం నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో మేరా యువభారత్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వల్లభ్భాయ్ పటేల్ గొప్పతనం వివరించేలా ఈనెల 31వ తేదీ నెల్లూరు, నవంబర్ 7వ తేదీ కావలిలో పాదయాత్రలు చేస్తామన్నారు. ఇంకా జిల్లా యువజన అధికారి ఆకుల మహేంద్రరెడ్డి, వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సునీత తదితరులు మాట్లాడారు. సమావేశంలో జాతీయ సేవా పథకం కో – ఆర్డినేటర్ డా.ఉదయశంకర్, ప్రొఫెసర్ డా.వెంకటసుబ్బారెడ్డి, కమ్యూనికేషన్ అధికారి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            తాత్కాలికంగా వాహనాల నిలిపివేత
నెల్లూరు(క్రైమ్): తుపాను నేపథ్యంలో మంగళవారం రాత్రి ఏడు గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము 4 గంటల వరకు దగదర్తి నుంచి కావలి టోల్ప్లాజా వరకు, వెంకటాచలం, బుచ్చి, డీసీపల్లి టోల్ప్లాజాల వద్ద వాహనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన అనంతరం వాటిని గమ్యస్థానాలకు పంపారు. మర్రిపాడు పరిధిలోని బ్రాహ్మణపల్లి దగ్గర హైవేపై నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆత్మకూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను దారి మళ్లించారు. ఉలవపాడు పరిధిలోని వీరేపల్లి ఎస్టీ కాలనీ రహదారి కోతకు గురైంది. రోడ్డుపై నాలుగడుగుల ఎత్తు వరకు నీరు చేరడంతో తగిన చర్యలు తీసుకున్నారు. కొడవలూరు పరిధిలోని రాచర్లపాడు గ్రామం వద్ద హైవేకి నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏఎస్పీ సీహెచ్ సౌజన్య సిబ్బందితో వెళ్లి వన్వేలో వాహనాలు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు. ప్రతికూల పరిస్థితుల్లో విధులు నిర్వహించిన జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అజిత అభినందించారు. - 
      
                   
                               
                   
            అంచనాలను రూపొందించండి
నెల్లూరు రూరల్: భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రాథమిక అంచనాలను రూపొందించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. తుఫాన్ అనంతర పరిస్థితిపై కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాలకు నానిన పాఠశాలల ప్రహరీ, తదితరాలను పరిశీలించాలని పేర్కొన్నారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో కూరగాయల విక్రయాలను మరో రెండు రోజుల పాటు కొనసాగించాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచించారు. డీఆర్వో విజయ్కుమార్, డీపీఓ శ్రీధర్రెడ్డి, డీటీసీ చందర్, డీఈఓ బాలాజీరావు, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, హార్టికల్చర్ అధికారి సుబ్బారెడ్డి, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈలు దేశ్నాయక్, గంగాధర్, విజయ్భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            మేకపాటితో ప్రసన్న మర్యాద పూర్వక భేటీ
నెల్లూరు (స్టోన్హౌస్పేట): నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డితో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి నెల్లూరు డైకస్రోడ్డులోని మేకపాటి నివాసంలో మంగళవారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ప్రస్తుతం జిల్లా, రాష్ట్రంలో నడుస్తున్న రాజకీయాలపై చర్చించారు. ఈ భేటీలో ఉదయగిరి వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు, ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయ్కుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, నాయకులు కలువ బాల శంకర్రెడ్డి, కోవూరు వైఎస్సార్టీయూసీ అధ్యక్షుడు బిరదవోలు రూప్కుమార్రెడ్డి ఉన్నారు. పునరావాస కేంద్రంలో చంటి బిడ్డల ఆకలి కేకలు నెల్లూరు (వీఆర్సీసెంటర్): మోంథా తుఫాన్ నేపథ్యంలో నగరంలోని 15, 53, 54 డివిజన్లకు చెందిన లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను బాలాజీనగర్, గాంధీ గిరిజనకాలనీ, వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పునరావాసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గాంధీగిరిజన కాలనీ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో నెలల వయస్సు ఉన్న చంటి బిడ్డల నుంచి చిన్నారులు ఉన్నారు. వీరికి పాలు అందించకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో సరైన వసతులతోపాటు ఆహారం, మంచినీరు వంటి సదుపాయాలు కల్పించకపోవడంతో పరిస్థితి క్లిష్టంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయా పునరావాస కేంద్రాలను సీపీఎం నగర అధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు, పలువురు నాయకులు వెళ్లి పరిశీలించడంతో తాము పడుతున్న ఇబ్బందులను బాధితులు వారికి చెప్పారు. దీంతో అప్పటికప్పుడు స్పందించిన నాయకులు చంటి బిడ్డలకు పాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. 78 ఆర్టీసీ బస్సులు రద్దు నెల్లూరు సిటీ: తుఫాన్ భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం జిల్లా నుంచి చైన్నె, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, కర్నూలు ప్రాంతాలకు వెళ్లే 25, జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు నడిచే 53 బస్సులు మొత్తం 78 బస్సులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. నెల్లూరు–పర్లకొండ మధ్య ఒకటి, నెల్లూరు–కోటితీర్థం మధ్య రెండు, నెల్లూరు–పామూరు మార్గంలో 20 బస్సులు, దగదర్తి–కామినేనిపాళెం మార్గంలో నెల్లూరు నుంచి మబ్బుగుంటపాళెం మధ్య రెండు బస్సులు, నెల్లూరు–సోమశిల మార్గంలో ఆరు బస్సులు రద్దుచేశారు. కందుకూరు– కావలి మార్గంలో 11 బస్సులు, ఇదే మార్గంలో చిమిడితిపాడు వద్ద కల్వర్టు వద్ద ప్రవాహం దృష్ట్యా మరో 11 బస్సులు నిలిపివేశారు. 32,650 క్యూసెక్కుల విడుదల సోమశిల: జలాశయంలో మంగళవారానికి 39,432 క్యూసెక్కుల వరద వస్తుండగా పెన్నానదికి 32,650 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 67.293 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నెల్లూరు (అర్బన్): మోంథా తుఫాను ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 9 గంటల వరకు జిల్లాలో సగటున 105.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కందుకూరులో 177.8 మి.మీ., అత్యల్పంగా రాపూరులో 33.6 మి.మీ. వర్షం కురిసింది. కావలి 174.6, అల్లూరు 156.6, దగదర్తి 149.2, జలదంకి 145.8, విడవలూరు 140.8, కొడవలూరు 139.4, బోగోలు 134.6, ఉలవపాడు 123.6, వలేటివారి పాళెం 120.4, గుడ్లూరు 120.0, తోటపల్లిగూడూరు 116.2, కలిగిరి 113.4, కోవూరు 108.6, బుచ్చిరెడ్డిపాళెం 107.0, లింగసముద్రం 105.4, పొదలకూరు 104.2, నెల్లూరు అర్బన్ 101.2, వింజమూరు 100.6, ఉదయగిరి 100.4, కొండాపురం 99.8, సంగం 99.6, అనుమసముద్రంపేట 98.2, ఇందుకూరుపేట 98.2, చేజర్ల 93.4, మర్రిపాడు 93.4, నెల్లూరు రూరల్ 91.6, వరికుంటపాడు 84.8, వెంకటాచలం 83.2, ఆత్మకూరు 79.2, కలువాయి 76.2, ముత్తుకూరు 75.8, అనంతసాగరం 72.4, దుత్తలూరు 71.0, సీతారామపురం 69.8, సైదాపురం 69.4, మనుబోలు 65.6 మి.మీ. వర్షం కురిసింది. - 
      
                   
                               
                   
            ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో పని చేయాలి
వెంకటాచలం: తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు సహాయ, సహకారాలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చిత్తశుద్ధితో పని చేయాలని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి కోరారు. వెంకటాచలంలోని కనుపూరు చెరువును మంగళవారం సాయంత్రం కాకాణి పరిశీలించారు. వర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆయా గ్రామాల వైఎస్సార్సీపీ నాయకులను అడిగి తెలుసుకున్నారు. కాకాణి మాట్లాడుతూ తుఫాన్ తీరం దాటాక మరో 24 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప నివాసాల్లో నుంచి ప్రజలు బయటకు రావద్దని, చెట్ల కింద, కరెంట్ స్తంభాల కింద ఉండొద్దని తెలియజేశారు. అవసరమైన మందులు, నిత్యవసర వస్తువులు, కూరగాయలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలను తరలివెళ్లాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలకు ఏ అవసరం వచ్చినా అండగా నిలిచేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ప్రజల అవసరాల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశామని ఎవరికి ఏ అవసరం వచ్చినా, సహాయక చర్యలు చేపట్టేందుకు అందుబాటులో ఉంటామని, ఎవరికై నా ఇబ్బందులు వస్తే 8712603258 నంబర్కు కాల్ చేస్తే, తమ పార్టీ శ్రేణులు స్పందించి, సమస్య పరిష్కారానికి, సహాయక చర్యలకు కృషి చేస్తారని కాకాణి వివరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో నిర్మించిన భవనాలు తుఫాన్ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండే వసతులు ఏర్పాటు చేస్తున్నారు. నాడు–నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో అన్నీ వసతులు కల్పించడంతో , ప్రస్తుతం ఆ స్కూళ్లు పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేసుకునే వెసులుబాటు కలిగిందని చెప్పారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో ప్రజలకు సచివాలయ ఉద్యోగుల ద్వారా సమగ్రంగా సేవలు అందించే అవకాశం ఏర్పడిందని తెలియజేశారు. ఉద్యోగులంతా పూర్తిస్థాయిలో సహాయ, సహకారాలు అందించి ప్రజలకు అండగా నిలవాలని కోరారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, కనుపూరు సర్పంచ్ నాటకం శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ నాయకులు మందల పెంచలయ్య, మందల మస్తానయ్య, ఏడుకొండలు, ఉప్పు అశోక్, తురకా హరిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఏ అవసరమొచ్చినా 87126 03258 నంబర్కు కాల్ చేయొచ్చు వైఎస్సార్సీపీ శ్రేణులు స్పందించి సహాయక చర్యలు చేపడుతారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి - 
      
                   
                               
                   
            చేనేత కార్మికులకు తిప్పలు
నెల్లూరు సిటీ: వర్షం కారణంగా చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు రూరల్ మండలం సౌత్మోపూరు గ్రామంలోని బీసీకాలనీ, ములుమూడి, నారాయణరెడ్డిపేటలో దాదాపు 600 చేనేత కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మంగళవారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో చాలామంది కార్మి కుల మగ్గం గుంతల్లోకి నీరు చేరింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నష్టపోయిన కార్మికులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పముజుల హరి డిమాండ్ చేశారు.సౌత్మోపూరు బీసీకాలనీలో మగ్గం గుంతలో నీళ్లు తొలగిస్తూ.. - 
      
                   
                               
                   
            సురక్షిత ప్రాంతాలకు వావింటపర్తి వాసులు
● వర్షంలోనూ స్పిల్వే కాలువ పనులు ● అంకుపల్లి చెరువు మీదుగా నీరు ● నేడు నీరు విడుదల చేసే అవకాశం పొదలకూరు: భారీ వర్షంలోనూ కండలేరు స్పిల్వే కాలువ పనులు జరుగుతున్నాయి. స్పిల్వేకు కాలువ సక్రమంగా లేకపోవడంతో కండలేరులో పొర్లిన నీటిని బయటకు పంపడం తెలుగుగంగ అధికారులకు సమస్యగా మారింది. దీంతో కాలువను తవ్వుతూనే మరోవైపు జంగిల్ను క్లియర్ చేయిస్తున్నారు. నీటిని విడుదల చేస్తే తమ గ్రామాలకు ఇబ్బందిగా మారుతుందని పర్వతాపురం, అంకుపల్లి, వావింటపర్తి వాసులు భయపడుతున్నారు. వావింటపర్తికి పెద్ద నష్టమే జరుగుతుందంటున్నారు. ముందుగా ఈ గ్రామస్తులను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా మంది మహిళలు, వృద్ధులు తమ బంధువుల ఇళ్లకు వెళ్లిపోయారు. యువకులు మాత్రమే ఉన్నారు. పోలీసులు ధైర్యం చెపుతున్నా గ్రామంలోకి నీరు చేరుతుందని భీతిల్లుతున్నారు. చెరువు నిండి.. స్పిల్వేకు సమీపంలో ఉన్న అంకుపల్లి చెరువు మీదుగా కండలేరు నీటిని విడుదల చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అంకుపల్లి చెరువు నిండి కలుజు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ చెరువు మీదుగా వావింటపర్తి వాగుకు నీటిని విడుదల చేస్తే అక్కడి నుంచి కండలేరు ఏటి కాలువకు చేరుతుంది. తర్వాత మనుబోలు మండలం గ్రామాల మీదుగా గూడూరు రూరల్ మండలం మిట్టాత్మకూరు బ్రిడ్జి కింద మనుబోలు హైవే నుంచి సముద్రం పాలయ్యేలా అధికారులు నీటిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విడుదలకు అవకాశం పరిస్థితిని బట్టి స్పిల్వే నుంచి కండలేరు జలాలను కాలువకు బుధవారం సాయంత్రం విడుదల చేసే అవకాశం ఉందని రెవెన్యూ అధికారు వెల్లడించారు. కాలువ తవ్వకంతోపాటు జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తవ్వొచ్చని, దాదాపుగా నీటిని విడుదల చేయడం జరుగుతుందంటున్నారు. వావింటపర్తి గ్రామస్తులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతానికి బుధవారం తరలిస్తామని తహసీల్దార్ బి.శివకృష్ణయ్య వెల్లడించారు. - 
      
                   
                               
                   
            ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చర్యలు
నెల్లూరు సిటీ: రూరల్ నియోజకవర్గంలోని బుజబుజనెల్లూరు హైవే జంక్షన్ వద్ద వరదనీటిని తొలగించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. రూరల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత, కార్పొరేషన్ కమిషనర్ వై.నందన్, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పర్యటించారు. 25వ డివిజన్లో జరుగుతున్న కాలువ పూడికతీత పనులను గిరిధర్రెడ్డి మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ తుపాను నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్చార్జి దాట్ల చక్రవర్ధన్రెడ్డి, 25వ డివిజన్ కార్పొరేటర్ బద్దెపూడి నరసింహగిరి తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            ఇరుక్కుపోయిన లారీ
నెల్లూరు(క్రైమ్): ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల వద్ద లారీ ఇరుక్కుపోవడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. వివరాలు.. బుజబజనెల్లూరు హైవేపై నూతనంగా ఫ్లై ఓవర్ నిర్మిస్తున్నారు. మంగళవారం వర్షాల కారణంగా అక్కడంతా బురదమయంగా మారింది. గూడూరు వైపు నుంచి కావలి వైపు వెళ్తున్న పదహారు టైర్ల లారీ అందులో ఇరుక్కుపోయింది. దీంతో వాహనాలు వెళ్లే దారిలేక ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న సౌత్ ట్రాఫిక్ ఆర్ఎస్ఐ చంద్రమౌళి తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జేసీబీ, పొక్లెయిన్ సాయంతో లారీని పక్కకు తొలగించారు. అనంతరం ట్రాఫిక్ను పునరుద్ధరించారు. - 
      
                   
                               
                   
            ఐఈఆర్పీల సర్టిఫికెట్ల వెరిఫికేషన్
నెల్లూరు(టౌన్): ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని భవిత కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న ఐఈఆర్పీ లు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని నెల్లూరులోని సమగ్ర శిక్ష కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో విజువల్ ఇంపైర్/హియరింగ్ ఇంపైర్ విభాగంలో పనిచేస్తున్న 43 మంది సర్టిఫికెట్లను పరిశీలించారు. మంగళవారం ఎంఆర్ విభాగంలో పనిచేస్తున్న వారు వెరిఫికేషన్ చేయింకోవాల్సి ఉంటుంది. కార్యక్రమంలో కమిటీ అధికారులు డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వరనాయక్, ఎంఈఓ జయరామనాయుడు, హెచ్ఎం రియాజ్ అహ్మద్, సమగ్రశిక్ష సహిత విద్య కో–ఆర్డినేటర్లు పొట్లూరు ప్రసాద్, చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో 8 కంపార్ట్మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 80,021 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,894 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.90 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవాడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలైన్లోకి వెళ్లాలని, ముందుగా వెళ్తే అనుమతించరని స్పష్టం టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. - 
      
                   
                               
                   
            జలాశయానికి వరద తగ్గుముఖం
● 8, 9 క్రస్ట్గేట్ల నుంచి నీటి విడుదల నిలిపివేత సోమశిల: సోమశిల జలాశయానికి నాలుగు రోజులుగా పోటెత్తిన వరద సోమవారానికి తగ్గుముఖం పట్టడంతో 8, 9 క్రస్ట్గేట్ల ద్వారా విడుదల చేస్తున్న నీటిని నిలివేసామన్నారు. ప్రస్తుతం 29,571 క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ క్రమంలో పెన్నానదికి 6,7 క్రస్ట్గేట్ల ద్వారా 32,650 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సోమవారం సాయంత్రానికి జలాశయంలో 67.101 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి ● టెలికాన్ఫరెన్స్లో కలెక్టర్ నెల్లూరు (అర్బన్): తుఫాను ప్రభావం నేపథ్యంలో ముందస్తుగా లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని, వారికి అక్కడ కనీస సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి కలెక్టర్ తన బంగ్లా నుంచి ఆర్డీఓలు, రెవెన్యూ అధికారులు, మండల ప్రత్యేకాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఏ మాత్రం నీరు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను యుద్ధ ప్రాతిపదికన పునరావాస ప్రాంతాలకు తరలించాలని సూచించారు. అక్కడ భోజనం, తాగునీరు, బెడ్స్ ఇవ్వాలన్నారు. జిల్లాలో ఏ చిన్న సమస్య వచ్చినా తక్షణమే నేరుగా తనకే ఫోన్ చేసి సమాచార మివ్వాలన్నారు. మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉంటూ చెరువులు, ప్రాజెక్ట్ల వద్ద నిరంతర గస్తీ ఉండేలా చూడాలన్నారు. వర్షాల వల్ల కూరగాయలు, పాలు, తాగునీరు, సరుకులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుఫాన్ను ఎదుర్కొనేందుకు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, కందుకూరు సబ్ కలెక్టర్, ఆర్డీఓలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. క్రీడా పోటీలు, ఎంపికలు వాయిదా నెల్లూరు (స్టోన్హౌస్పేట): ఈ నెల 29 నుంచి జరగాల్సిన సివిల్ సర్వీసెస్ క్రీడా పోటీలు, ఎంపికలను మోంథా తుఫాను కారణంగా ఎంపికలను వాయిదా వేసినటు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఆర్కే యతిరాజ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి తేదీలను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ద్వారా సమాచారం అందిన తర్వాత తెలియజేస్తామన్నారు. అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా.. ● కల్వర్టును ఢీకొన్న కారు.. ఐదుగురికి గాయాలు ● మహిళ పరిస్థితి విషమం జలదంకి (కలిగిరి): కర్నూలు వద్ద జరిగిన ప్రమాదంలో మృతి చెందిన నలుగురి అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వెళ్తుండగా కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా, ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసుల సమాచారం మేరకు.. వింజమూరు మండలం గోళ్లవారిపాళెంలో గోళ్ల రమేష్, అనూష, శశాంక్, మన్విత అంత్యక్రియలు సోమవారం జరి గాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడకు చెందిన బంధువులు ఆదివారం వచ్చారు. తిరిగి వారు కారులో వెళ్తుండగా జలదంకి మండలం చిన్నక్రాక సమీపంలో కారు టైరు పంక్చర్ కావడంతో కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనలో కృష్ణ, కృష్ణచైతన్య, మోనిక, మరో మహిళ స్వల్పంగా గాయపడగా, సుమలత అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపా రు. బాధితులను కావలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. జలదంకి పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. - 
      
                   
                               
                   
            నేడూ విద్యాసంస్థలకు సెలవు
నెల్లూరు (అర్బన్): జిల్లాపై మోంథా తుఫాన్ ప్రభావం చూపుతోంది. సోమవారం తెల్లవారుజాము నుంచి చిరు జల్లులుగా పడుతున్న వర్షం రాత్రి నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. మంగళవారం నాటికి తుఫాను తీరం దాటే అవకాశం ఉందని, ఇప్పటికే వాతావరణశాఖ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించింది. వాగులు, వంకలతోపాటు పలు చెరువులు కలుజులు పారుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండడంతో రాళ్లపాడు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సంగం వద్ద పెన్నానదిలో సుమారు 70 వేల క్యూసెక్కుల వరద నెల్లూరు వైపు ప్రవహిస్తోంది. బొగ్గేరు, బీరాపేరు, పిల్లాపేరు, గండిపాళెం ప్రాజెక్ట్, నక్కల వాగు, కండలేరు కాలువ, కై వల్యానది, పంబలేరు, చిప్పలేరు, పైడేరు, మలిదేవి డ్రెయిన్, బకింగ్ హామ్ కెనాల్స్లో వరద నీరు ప్రవహిస్తోంది. అత్యవసర ఖర్చులకు రూ.2 కోట్లు జిల్లాలో తుఫాను రక్షణ చర్యల్లో అత్యవసర ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం రూ.2 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను ప్రజల అవసరాల కోసం ఖర్చు చేయనున్నారు. తుఫాన్ను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం జిల్లాలో తుఫాన్ నష్టాన్ని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని జిల్లా ప్రత్యేక అధికారి, సీనియర్ ఐఏఎస్ యువరాజ్ అధికారులకు సూచించారు. సోమవారం తుఫాను నష్టనివారణ ముందస్తు చర్యలపై కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి యువరాజ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, మెడికల్, హెల్త్, ఐసీడీఎస్, పోలీసు శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రజలు ఫోన్ చేసిన తక్షణమే స్పందించాలని ఆదేశించారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ తుఫాన్ నుంచి ప్రజలను రక్షించేందుకు సర్వం సిద్ధంగా ఏర్పాట్లు చేశామని వివరించారు. 9 తీర మండలాల్లోని 42 సెన్సిటివ్ గ్రామాలు, 166 హ్యాబిటేషన్లలో ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు 144 తాత్కాలిక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పెన్నానది పరీవాహక మండలాలైన అనంతసాగరం, కలువాయి, చేజర్ల, ఆత్మకూరు, సంగం పరిధిలోని గ్రామాల్లో వరద నీరు కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజలు అత్యవసర సమయాల్లో డివిజన్ల వారీగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లు కలెక్టరేట్ 0861–2331261, 79955 76699, కందుకూరు సబ్కలెక్టర్ 76010 02776, నెల్లూరు ఆర్డీఓ 98499 04061, ఆత్మకూరు ఆర్డీఓ 91009 48215, కావలి ఆర్డీఓ 77022 67559లకు ప్రజలు ఫోన్ చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను, సెల్ ఫోన్ సిగ్నల్స్కు అంతరాయం లేకుండా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సెల్టవర్ను ప్రత్యేకాధికారి యువరాజ్ కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి తనిఖీ చేశారు. జిల్లా వ్యాప్తంగా మోస్తరు వర్షాలు మెంథా తుపాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమైంది. సోమవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అధికంగా పొదలకూరు మండలంలో 18.8 మిల్లీ మీటర్లు వర్షం కురిసింది. ముత్తుకూరు 14.6, తోటపల్లిగూడూరు 13.6, ఇందుకూరుపేట 11.2, మనుబోలు 10.2 వర్షం కురిసింది. నెల్లూరు నగరంతో పాటు మిగతా అన్ని మండలాల్లో 10 మి.మీ.లోపు వర్షం నమోదైంది. మైపాడు తీరంలో భద్రపరిచిన పడవలు, వలలుఐదో నంబర్ ప్రమాద హెచ్చరిక నెల్లూరు(అర్బన్): మెంథా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో భారీ వర్షాలు కురుస్తాయనే ఉద్దేశంతో మంగళవారం కూడా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీ పాఠశాలలు, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించామని తెలిపారు. ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు విధిగా తమ ఉత్తర్వులను అమలు చేయాలని సూచించారు. ముత్తుకూరు (పొదలకూరు): కృష్ణపట్నం పోర్టులో అధికారులు సోమవారం ఐదో నంబర్ ప్రమాదకర హెచ్చరికను ఎగుర వేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని చెప్పారు. తీరప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. - 
      
                   
                               
                   
            భక్త వల్లభా.. నీ దర్శనం దుర్లభం
కార్తీక మాసం తొలి సోమవారం ఎంతో భక్తి ప్రపత్తులతో మూలస్థానేశ్వరాలయానికి వెళ్లిన భక్తులకు దేవదాయశాఖ అధికారులు గంటల కొద్దీ క్యూలైన్లలో నిలబెట్టి చుక్కలు చూపించారు. ఎమ్మెల్యే, ఎంపీ, కలెక్టర్, న్యాయమూర్తులు వంటి వీఐపీలు వస్తే వారికి ప్రత్యేక దర్శనం కల్పించడం గౌరవనీయం. కానీ ఎమ్మెల్యే, ఎంపీ వేలు విడిచిన చుట్టాలకు సైతం వీఐపీలకు మించి ప్రాధాన్యమిచ్చి అంతరాలయంలో గంటల పాటు పూజలు చేయించడంలో ఈఓ నుంచి సిబ్బంది వరకు తరించారు. ఈ క్రమంలో సహనం నశించిన భక్తులు అసహనంతో పవిత్రమైన ఆలయంలోనే దేవదాయశాఖ అధికారుల తీరుపై కర్ణకఠోర తిట్లు లంకించుకోవడంతో అక్కడే విధుల్లో ఉన్న చిన్నబజారు సీఐ తన సిబ్బందిని అంతరాలయం వద్ద పెట్టి సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించారంటే ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నెల్లూరు (బృందావనం): సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సకాలంలో దర్శనం చేసుకొనే వీలు కల్పించాలని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, మరొక వైపు నెల్లూరు ఆర్డీఓ సమీక్ష సమావేశాలు నిర్వహించి దేవదాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ ఆదేశాలను పట్టించుకోని దేవదాయశాఖాధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని భక్తులు మండి పడుతున్నారు. నగరంలోని మూలాపేటలో కొలువైన భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయానికి చారిత్రక ప్రాశస్త్యంతోపాటు భక్త వల్లభుడిగా పేరొంది. నిత్యం భక్తుల తాకిడితో ఉండే ఆలయానికి సోమవారంతోపాటు ప్రత్యేక రోజులు, పవిత్ర కార్తీక, మహాశివ రాత్రి మాసాలు, బ్రహ్మోత్సవాల సందర్భంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో దేవదాయ శాఖాధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి ఉచిత దర్శనంతోపాటు ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కార్తీక తొలి సోమవారం భారీగా తరలివచ్చిన భక్తులు టికెట్లు కొనుగోలు చేసి ప్రత్యేక దర్శనానికి క్యూలైన్లలోకి వచ్చారు. వీరితోపాటు ఉచిత దర్శనానికి వచ్చిన భక్తులను క్యూలైన్లలో గంటల కొద్దీ నిలిపేసి, భక్త వల్లభుడైన పరమేశ్వర దర్శనం దుర్లభం అయింది. కూటమి ప్రజాప్రతినిధులు స్వామి దర్శనానికి రావడంతో సదరు దేవదాయశాఖాధికారులు వారిని ప్రత్యేక మార్గంలో నేరుగా స్వామి అంతరాలయంలోకి తీసుకెళ్లి గంటల కొద్దీ విశేష పూజలు చేయించి తీర్థప్రసాదాలిప్పించి పంపించేంత వరకు వారి సేవలో తరించారు. ఉద్యోగులు, వ్యాపారుల ఇబ్బందులు కార్తీక సోమవారం స్వామిని దర్శించుకుని విధులకు హాజరు కావాలనుకున్న ఉద్యోగులు, దుకాణాలు తెరుచుకోవాల్సిన వ్యాపారులు ఇంటి పనులు చక్కబెట్టుకునే గృహిణులు, చిన్న పిల్లలతో కలిసి వచ్చిన మహిళలు, త్వరగా వెళ్లాలనే ఆతృతతో వచ్చారు. వీరితో కొందరు ప్రత్యేక దర్శనాలకు టికెట్లు కొనుగోలు చేశారు. అయితే ప్రజాప్రతినిధులెవరూ రాకున్నప్పటికీ వీఐపీల పేర్లు చెప్పి వచ్చే చెంచాగాళ్లు, వీరి చెంచాగాళ్లకు అడుగులకు మడుగులొత్తుతూ దేవస్థానం అధికారి తానే దగ్గరుండి స్వామి వారి దర్శనం చేయించడపై భక్తులు మండిపడ్డారు. సకాలంలో దర్శనం కాక నానా పాట్లు పడ్డారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి బంధువు, కాంట్రాక్టర్ ఒకరు ఉదయం స్వామి వారిని దర్శించుకొనేందుకు వచ్చారు. ఆ సమయంలో ఆ కాంట్రాక్టర్కు ఎటువంటి ప్రోటోకాల్ లేకపోయినప్పటికీ ఈఓ అర్వభూమి వెంకటశ్రీనివాసులురెడ్డి ఓ ప్రజాప్రతినిధికి, ఓ ఉన్నతాధికారికి ఇచ్చే రీతిలో ఆహ్వానం పలుకుతూ అంతరాలయ దర్శనం చేయించడంతో దాదాపు రెండు గంటల పాటు మూలస్థానేశ్వరుడి దర్శనం కాక భక్తులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ సిబ్బందిని, కార్యనిర్వహణాధికారి నిలదీశారని సమాచారం. గంటల తరబడి క్యూలైన్లలో నిలిచిపోయిన భక్తులు దేవదాయశాఖాధికారులపై కర్ణ కఠోరంగా తిట్ల దండకం చేస్తుండడంతో అక్కడే విధులు నిర్వర్తిస్తున్న చిన్నబజారు సీఐ చిట్టెం కోటేశ్వరరావు బాధతో తట్టుకోలేక సిబ్బందిని లోపలికి పంపించి వీఐపీ దర్శనాలను ఆపేసి సామాన్య భక్తుల క్యూను ముందుకు సాగేలా చేశారు. పనీబాట లేని గాలోళ్ల కోసం తమ విలువైన సమయాన్ని వృథా చేశారంటూ భక్తులు మండిపడుతున్నారు. మేము భక్తులం కాదా? మాకు పనులు లేవా? అవసరాలు లేవా? అంటూ అసహనంతో రగిలిపోయారు. ఒక దశలో పూజారులు అందరిని సమానంగా చూడాలని క్యూలైన్లో వచ్చే వారికి దర్శనం కలిగించాలని చెబుతున్నప్పటికీ వారి మాటలను సైతం ఈఓ ఖాతరు చేయడం లేదన్న విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికై నా దేవదాయశాఖాధికారులు సామాన్య భక్తులకు సేవలందించేలా వారికి మంచి బుద్ధిని ప్రసాదించాలని భక్తులు మూలస్థానేశ్వరస్వామిని వేడుకుంటున్నారు. పరమేశ్వర దర్శనానికి పడరాని పాట్లు వీఐపీల వేలు విడిచిన చుట్టాల సేవలో తరిస్తున్న అధికారులు, ఉద్యోగులు సామాన్య భక్తులను గంటల తరబడి క్యూలైన్లలో నిలబెట్టేస్తున్న వైనం కార్తీక మాసం తొలి సోమవారం భక్తుల అసహనం మూలస్థానేశ్వరాలయంలో ఈఓ ఇష్టారాజ్యం - 
      
                   
                               
                   
            ఏటీఎస్ను రద్దు చేయాలని డిమాండ్
● కలెక్టరేట్ ఎదుట ఆటో కార్మిక సంఘం నిరసన నెల్లూరు రూరల్: ఏటీఎస్ (ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్)ను ఎత్తివేయాలంటూ ఆటో కార్మిక సంఘం నెల్లూరు సిటీ, రూరల్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. జోరు వర్షంలోనూ వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు టీవీవీ ప్రసాద్, అధ్యక్షుడు కోలగట్ల సురేష్, సీఐటీయూ నగర కార్యదర్శి జి.నాగేశ్వరరావు, రూరల్ అధ్యక్షుడు ఎం.సుధాకర్ మాట్లాడుతూ ఆటో, రవాణా రంగ కార్మికులకు ఆర్థికంగా ఇబ్బందులు కలిగించే ముత్తుకూరు మండలం కప్పలదొరువు వద్ద ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఏటీఎస్ను రద్దు చేయాలన్నారు. ఆర్టీఓ కార్యాలయంలోనే ఎఫ్సీ విధానాన్ని కొనసాగించాలన్నారు. వచ్చే నెల 7వ తేదీ ఏటీఎస్ జరిగే 24 గంటల ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో నేతలు బాబురావు, పెంచలయ్య, లవణ్ కుమార్, రవీంద్ర, పెద్ద సంఖ్యలో ఆటో కార్మికులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            పిల్లివాగులో పడి వృద్ధుడి మృతి
బిట్రగుంట: బోగోలు మండలం ముంగమూరుకు చెందిన కేతిరెడ్డి వెంకారెడ్డి (78) ప్రమాదవశాత్తు పిల్లివాగులో పడి మృతిచెందాడు. సోమవారం మృతదేహాన్ని గుర్తించారు. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. ముంగమూరుకు చెందిన కేతిరెడ్డి వెంకారెడ్డి బహిర్బూమికి శనివారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లాడు. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా గాలించారు. పిల్లివాగులో పడినట్లు గుర్తించి వెతికారు. సోమవారం ఉదయం వెంకారెడ్డి మృతదేహం లభించింది. బహిర్బూమికి వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు వాగులో పడి మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. పేర్లు నమోదు చేసుకోవాలినెల్లూరు(టౌన్): పాఠశాల విద్యాశాఖ అనుమతితో ఎడ్యుకేషనల్ ఏపీ ఫణి అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఈఈఎంటీ – 2026 మెరిట్ పరీక్షకు వచ్చేనెల 14వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వర నాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ పాఠశాలల్లో 7, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. పరీక్షను ప్రిలిమ్స్, మెయిన్స్ దశల్లో నిర్వహిస్తారన్నారు. ప్రిలిమ్స్ను విద్యార్థి ఇంటి దగ్గర లేదా పాఠశాల నుంచి ఆన్లైన్లో, మెయిన్స్ను ఎంపిక చేసిన కేంద్రాల్లో రాయాలన్నారు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో నగదు బహుమతులు అందజేస్తామన్నారు. వివరాలకు 94919 16927 ఫోన్ నంబర్ను సంప్రదించాలని తెలియజేశారు. - 
      
                   
                               
                   
            కలెక్టరేట్కు వచ్చిన అర్జీదారులు
నెల్లూరు రూరల్: సమస్యలపై అర్జీలిచ్చేందుకు పలువురు సోమవారం నెల్లూరులోని కలెక్టరేట్కు వచ్చారు. తుపాను నేపథ్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టర్ హిమాన్షు శుక్లా రద్దు చేశారు. ఈ విషయం తెలియని కొందరు కార్యాలయానికి వచ్చారు. దీంతో కలెక్టరేట్ ఏఓ విజయ్కుమార్ వినతులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ట్రాలీ ఇరుక్కుని అవస్థలుదగదర్తి: కావలి వైపు నుంచి నెల్లూరు వైపునకు భారీ లోడుతో వెళ్తున్న ట్రాలీ అల్లూరు రోడ్డు రైల్వే ఓవర్ బ్రిడ్జిపై ఆదివారం అర్ధరాత్రి ఇరుక్కుపోయింది. దాదాపు రెండు గంటలపాటు ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైవే సిబ్బంది, దగదర్తి పోలీసులు చేరుకుని జేసీబీతో అడ్డుగా ఉన్న రాళ్లను పక్కకు తొలగించి భారీ వాహనాన్ని పంపించారు. ఇటీవల ఇదే తరహాలో ట్రాలీ ఇరుక్కుపోవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. రోగులు అత్యవసర వైద్యం కోసం వెళ్లాల్సి వస్తే పరిస్థితి ఏంటని జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారీ లోడు వాహనాలు బ్రిడ్జిపై వెళ్లలేవని తెలిసినా టోల్ గేట్ యాజమాన్యం ఎలా అనుమతిస్తందని ప్రశ్నించారు. హైవే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.30 సన్నవి : రూ.20 పండ్లు : రూ.10 - 
      
                   
                               
                   
            బొగ్గేరులో పడి..
● బాలుడి మృతి ● శోకసంద్రంలో కుటుంబం మర్రిపాడు: బొగ్గేరులో పడి ఓ బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని రామానాయుడుపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. రామానాయుడుపల్లి గ్రామానికి చెందిన కోనంకి జయరామయ్య, భాగ్యమ్మల కుమారుడు కోనంకి రామ్చరణ్ (13) ఆత్మకూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు సెలవు నేపథ్యంలో ఇంటి వద్దనే ఉన్నాడు. ఈ క్రమంలో సమీపంలోని బొగ్గేరు వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు గుంతలో ఇరుక్కుని ఊపిరాడక మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లి కన్నీరుమున్నీరుగా రోదించింది. సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ గంగాధర్, ఎస్సై శ్రీనివాసరావు బొగ్గేరు ప్రాంతాన్ని పరిశీలించారు. ఇసుకను తరలించేందుకు వాగులో జేసీబీలతో తీసిన గుంతలు తీశారని, వాటిల్లో ఇరుక్కుని బాలుడు మృతిచెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నాయి. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే మరిన్ని ప్రమాదాలు జరుగుతాయని చెబుతున్నారు. - 
      
                   
                               
                   
            కూటమి పాలన అవినీతిమయం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి తోటపల్లిగూడూరు: ‘కూటమి పాలన అవినీతిమయమైంది. ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదు’ అని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. మండలంలోని పేడూరు గ్రామంలో సోమవారం కాకాణి పర్యటించారు. ఇటీవల కసిరెడ్డి గోపాల్రెడ్డి మృతిచెందగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ తుపాను నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటే కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనేనన్నారు. తరచూ వర్షాలు కురుస్తూ రైతులు ఇబ్బందులు పడుతున్నా, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ధాన్యం తెగనమ్ముకొన్నాక కొనుగోలు కేంద్రాలను తెరుస్తామని ప్రకటించడం రైతులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద పెట్టుబడి సహాయం అందిస్తామన్న చంద్రబాబు నిలువునా ముంచాడన్నారు. కనీసం పంటకు అత్యవసరమైన యూరియా అందక రైతులు ఇక్కట్ల పాలవుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. కూటమి ఏడాదిన్నర పాలనలోనే తాము పూర్తిగా మోసపోయామని తెలుసుకున్న రాష్ట్ర ప్రజలు తిరిగి జగనన్న ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. తోటపల్లిగూడూరు మండలం పేడూరు గ్రామంలోని ప్రధాన రహదారి 30 ఏళ్లుగా అధ్వానంగా మారి మోకాళ్లు లోతున నీళ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సీసీ రోడ్డు నిర్మాణంతో శాశ్వత పరిష్కారం చూపించడం జరిగిందన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు ఉప్పల శంకరయ్యగౌడ్, తిక్కవరపు సనత్రెడ్డి, మందల వెంకటశేషయ్య, తూపిలి ఉధయ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            భయం భయంగా..
పొదలకూరు: ముందుచూపు లేకపోవడంతో కండలేరు జలాశయం కింద గ్రామస్తులతోపాటు తెలుగుగంగ అధికారులు టెన్షన్ పడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా కండలేరులో నవంబర్ నెలకు ముందే భారీగా నీటిని నిల్వ చేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నట్టు స్పిల్వే దిగువ ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిని విడుదల చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో అధికారులు సైతం రైతులకు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. సమీప నిమ్మతోటలు నీట మునిగే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. స్పిల్వే నుంచి నీటిని విడుదల చేసేందుకు తెలుగుగంగ, రెవెన్యూ అధికారులు యుద్ధప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు. 560 మీటర్ల అటవీ భూములు కాలువ అలైన్మెంట్లో ఉండటంతోనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడినట్టు వారు చెబుతుండగా.. దిగువ ప్రాంత గ్రామస్తులు మాత్రం మా కొంప మునిగేలా ఉందంటున్నారు. ప్రస్తుతం జలాశయంలో 58.5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాలువ తవ్వి జంగిల్ క్లియరెన్స్ అటవీ భూముల్లో కాలువను 4 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతు తవ్వి అంకుపల్లి వంతెన వరకు అధికారులు జంగిల్ క్లియరెన్స్ను చేపడుతున్నారు. కాలువకు నీటిని విడుదల చేస్తే ఎలాంటి అడ్డంకులు ఉండకుండా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. కాగా మోంథా తుపాను ప్రభావంతో పైతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి జలాశయంలోకి నీరు చేరితే వెంటనే స్పిల్వే నుంచి విడుదల చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాలువ సామర్థ్యాన్ని బట్టి ముందుగా ఒక షట్టర్ ద్వారానే నీటిని విడుదల చేయనున్నారు. అయితే జలాశయంలో స్పిల్వే షట్టర్ల వద్ద నీరు మూడు అడుగుల కింద వరకు చేరినట్టు సమాచారం. నీటిమట్టం పెరిగితే షట్టర్ల పైనుంచి నీరు పొర్లే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. గ్రామస్తుల అప్రమత్తం స్పిల్వే దిగువ ప్రాంత గ్రామాలైన పర్వతాపురం, అంకుపల్లి, వావింటపర్తి ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. సోమవారం కూడా పొదలకూరు, రాపూరు తహసీల్దార్లు బి.శివకృష్ణయ్య, లక్ష్మీనరసింహం పర్యటించారు. వావింటపర్తి వంతెనకు సమీపంలో ఉన్న కుటుంబాలు, పర్వతాపురం ఎస్సీకాలనీ వాసులను సురక్షిత ప్రాంతానికి తరలించే యోచనలో ఉన్నారు. చెరువులు కట్టలు తెగే అవకాశం స్పిల్వే ద్వారా నీటిని విడుదల చేస్తే పులికల్లు, అంకుపల్లి చెరువులు కట్టలు తెగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ముందస్తుగా రెండు చెరువుల కలుజులను తొలగిస్తే వచ్చే నీరు వేగంగా బయటకు వెళ్తుందని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాక చెరువుల్లో చేరిన నీటిని ముందుగా బయటకు పంపే యోచన కూడా ఉందని తెలిసింది. ఎలాంటి చర్యలు చేపట్టినా దిగువ గ్రామాల నిమ్మతోటలు నీట మునిగే పరిస్థితులున్నట్టు ఆయా గ్రామస్తులు వెల్లడించారు. అయితే ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. నిండుకుండలా కండలేరు జలాశయం స్పిల్వే దిగువ ప్రాంత గ్రామస్తుల ఆందోళన కాలువను తవ్విస్తున్న అధికారులు నిమ్మతోటలు మునిగే అవకాశం - 
      
                   
                               
                   
            దర్జాగా కబ్జా
ఆత్మకూరు: దళితులకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములపై టీడీపీ నాయకుడి కన్ను పడింది. బెదిరించి కొంత డబ్బు ఇచ్చి సుమారు 50 ఎకరాలు స్వాధీనం చేసుకున్నాడు. దీనికితోడు గత వారంరోజులుగా గ్రామంలోని మరికొంత ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేస్తున్నాడు. ఒక్కో ఎకరా విలువ రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలుంటుందని చెబుతున్నారు. ఆత్మకూరు మండలంలోని ఆరవీడు జంగాలపల్లి గ్రామంలో పలు దళిత కుటుంబాలకు గతంలో ప్రభుత్వాలు భూములు పంపిణీ చేశాయి. వాటిపై కన్నేసిన మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు దళితులకు చెందిన సుమారు 50 ఎకరాలకుపైగా స్వాధీనం చేసుకున్నాడు. ఆ భూముల్లో జామాయిల్ సవక పంటలు సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో గ్రామంలోని సర్వే నంబర్ 695లో సుమారు 8 ఎకరాలకుపైగా భూమిని గత వారం రోజులుగా యంత్రాలతో చదును చేయించి ట్రాక్టర్లతో దున్నిస్తున్నాడు. స్థానిక వీఆర్వోకు విషయం తెలిసినా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రెవెన్యూ ఉన్నతాధికారులు ఎవరూ పట్టించుకోలేదు. ఈ నాయకుడికి సొంతంగా గ్రామంలో 10 ఎకరాల పట్టా పొలం ఉంది. ఈ నేపథ్యంలో తన పొలాల సమీపంగా ఉన్న ప్రభుత్వ భూమిపై కన్నేసి సాగుకు అనుకూలంగా తయారు చేస్తున్నాడు. కౌలు భూమి సైతం ఆక్రమణ ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన ఆదిశేషయ్య అనే వ్యక్తికి 697 సర్వే నంబర్లో 1996లో ప్రభుత్వం అతని భార్య తలచీరు బుజ్జమ్మ పేరుతో నాలుగు ఎకరాలను పంపిణీ చేసింది. ఆ కుటుంబం సాగు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆదిశేషయ్య అనారోగ్యానికి గురికావడంతో ఆరేళ్ల క్రితం గ్రామ మాజీ సర్పంచ్కి కౌలుకు భూమిని ఇచ్చాడు. రెండేళ్లు కౌలు చెల్లించిన సదరు నాయకుడు ఆ భూమిని స్వాధీనం చేసుకుని ఇది నా సొంతమేనంటూ అడ్డం తిరిగాడు. దీంతో దిక్కుతోచని ఆదిశేషయ్య కుటుంబీకులు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం ఆత్మకూరు డీఎస్పీ కె.వేణుగోపాల్ ఆదిశేషయ్య, సదరు నాయకుడిని తన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. ఇంకా బాధితుడికి న్యాయం జరగలేదు. ● ఈ విషయమై తహసీల్దార్ పద్మజాకుమారిని సంప్రదించగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని తమ దృష్టికి ఇప్పుడే వచ్చిందని తెలిపారు. 50 ఎకరాలకుపైగా దళితుల భూమి స్వాధీనం మరికొంత ప్రభుత్వ భూమి ఆక్రమణ టీడీపీ నాయకుడి నిర్వాకం - 
      
                   
                               
                   
            గోళ్లవారిపల్లికి మృతదేహాలు
వింజమూరు (ఉదయగిరి): ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటనలో సజీవ దహనం అయిన గోళ్ల రమేష్, అనూష, మన్విత, శశాంక్ మృతదేహాలను డీఎన్ఏ పరీక్ష అనంతరం ఆదివారం కర్నూలులో బంధువులకు అప్పగించారు. రాత్రి 7 గంటలకు మృతదేహాలు రెండు ప్రత్యేక అంబులెన్స్ల్లో స్వగ్రామం గోళ్లవారిపల్లికి చేరుకున్నాయి. దీంతో ఒక్కసారి బంధువులు ,గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాలి ముద్దయిన మృతదేహాలను చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో చేరుకుని నివాళి అర్పిస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు రెవెన్యూ, పోలీసు అధికారులు ఏర్పాట్లు చేశారు. - 
      
                   
                               
                   
            గూడ్స్ రవాణాతో అదుపు తప్పే ప్రమాదం
ట్రావెల్స్ బస్సులు గంటకు 130 నుంచి 140 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తుంటాయి. ఈ నేపథ్యంలో బస్సు కింద, పైభాగంలో టన్నుల్లో గూడ్స్ ఉండడం వల్ల మితిమీరిన వేగంలో బస్సు అదుపు తప్పుతున్నాయి. బస్సుకు ఆకస్మికంగా గేదె, లేదా ఏదైనా వాహనం అడ్డొస్తే బస్సు కంట్రోల్ చేయలేకపోవడంతో డివైడర్లను ఢీకొనడమో, ముందు వెళ్లే వాహనాన్ని ఢీకొనడం జరుగుతున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో పేలుడు లేదా ఏదైనా మంటలు వ్యాపించే పదార్థాలు ఉన్నట్లయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బస్సులో ఉన్న ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో మృత్యువాత పడడం లేదా క్షతగాత్రులు కావడం జరుగుతుంది. ప్రతి రోజు ఏదొక ప్రాంతంలో ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురువుతున్న పరిస్థితులను చూస్తునే ఉంటాం. ఈ విషయాలు తెలిసినా వారి ఆదాయంపైనే దృష్టి పెట్టిన ట్రావెల్స్ యాజమాన్యాలు వారి పద్ధతిని మార్చుకోవడం లేదు. - 
      
                   
                               
                   
            రాళ్లపాడు నుంచి నీరు విడుదల
● పనిచేయని 5వ నంబర్ గేటు ● ఆందోళనలో రైతులు లింగసముద్రం: రాళ్లపాడు ప్రాజెక్ట్కు పూర్తిస్థాయిలో నీరు చేరింది. కొత్త స్పిల్వే నుంచి నాలుగు గేట్లను ఎత్తి దిగువకు ఆదివారం తెల్లవారుజామున నీటిని విడుదల చేశారు. పూర్తి స్థాయి నీటి నిల్వ 21 అడుగులు కాగా శనివారం రాత్రికి 19.8 అడుగులకు చేరుకుంది. ఎగువ ప్రాంతంలో శనివారం రాత్రి వర్షం కురవడంతో మన్నేరు, పిల్లాపేరు, ఉప్పుటేరుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నీటిని విడుదల చేసినట్లు డీఈ వెంకటేశ్వర్లు చెప్పారు. ఇన్ఫ్లో 450 క్యూసెక్కులు ఉండగా 2,000 క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వారా పంపిస్తున్నట్లు తెలిపారు. తుపాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుండటంతో ప్రాజెక్ట్లో 18.5 అడుగుల మేర నీటిని నిల్వ చేయనున్నట్లు వెల్లడించారు. ఆందోళన కొత్త స్పిల్వేకు అధికారులు ఐదు గేట్లను నిర్మించారు. అందులో ప్రస్తుతం నాలుగు మాత్రమే పనిచేస్తుండటంపై ఆయకట్టు రైతులు, దిగువ గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5వ నంబర్ గేటుకున్న రోప్ సక్రమంగా లేకపోవడంతో ఆపరేట్ చేసేందుకు వీల్లేదని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలు కురిసి నీటి ప్రవాహం చేరితే పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు. పాత స్పిల్వే గేట్లు కూడా ఆపరేటింగ్ చేసే పరిస్థితి లేదు. అవి ఎప్పటి నుంచో ఉపయోగించడం లేదని, కొత్త స్పిల్వేలో ఒక గేటు పనిచేయకపోవడం, అధికారులు పట్టించుకోకపోవడంపై అన్నదాతలు విమర్శలు చేస్తున్నారు. డీఈ మాట్లాడుతూ 5వ నంబర్ గేటుకు ఉన్న రోప్ సక్రమంగా లేదని, ప్రాజెక్ట్లో నీరు ఉండటంతో కొత్తది వేసేందుకు అవకాశం లేకుండా పోయిందన్నారు. గేట్ల వద్ద నీరు లేకుండా ఉంటేనే రోప్ను ఏర్పాటు చేయొచ్చని చెప్పారు.పరిశీలించిన ఎస్పీ రాళ్లపాడు ప్రాజెక్ట్ కొత్త స్పిల్వే గేట్ల నుంచి నీటిని విడుదల చేయడంతో ఎస్పీ అజిత పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే కందుకూరు డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పరిశీలించారు. డీఈతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్సై నారాయణకు సూచించారు. - 
      
                   
                               
                   
            వృద్ధ దంపతుల ఆత్మహత్య
కందుకూరు రూరల్: పురుగు మందు తాగి వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన కందుకూరు పట్టణంలోని కోవూరు రోడ్డులో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కోవూరు రోడ్డు దుర్గమ్మ గుడి సమీపంలోని పువ్వాడి పున్నయ్య (82), రోశమ్మ (70) దంపతులు నివాసముంటున్నారు. వీరికి ముగ్గురు కుమారులున్నారు. ఒకరు చనిపోయారు. కొంత కాలం నుంచి పున్నయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో వృద్ధ దంపతులు మనస్తాపంతో పురుగు మందు తాగారు. గమనించిన కుటుంబ సభ్యులు వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించినట్లు ఎస్సై శివనాగరాజు తెలిపారు. - 
      
                   
                               
                   
            కొండచిలువ కలకలం
మర్రిపాడు: మండలంలోని కృష్ణాపురం అటవీ ప్రాంతంలో కొండచిలువ సంచారం కలకలం రేపింది. కొందరు గ్రామస్తులు పుట్టగొడుగల కోసం అడవికి వెళ్లడంతో అకస్మాత్తుగా కనిపించడంతో పరుగులు తీశారు. ఎర్రచందనం తోట తూర్పు వైపు జామాయిల్ తోట మాలికుంట సమీపంలో కొండచిలువ కనిపించింది. జింకను మింగుతున్న సమయంలో కాపరులు చూసి కేకలు వేశారు. కృష్ణాపురం, బెడుసుపల్లి గ్రా మాల్లో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు ఆదివారం కోరారు. నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.30 సన్నవి : రూ.20 పండ్లు : రూ.10 పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు బ్రాయిలర్: రూ.130 లేయర్ రూ.115 బ్రాయిలర్ చికెన్: రూ.236 స్కిన్లెస్ చికెన్: రూ.260 లేయర్ చికెన్: రూ.195 - 
      
                   
                               
                   
            ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో విస్తృత తనిఖీలు
కోవూరు: కర్నూలు సమీపంలో జరిగిన బస్సు దగ్ధం ఘటన తర్వాత జిల్లా రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ఆదివారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. డీటీసీ రామచంద్రయ్య ఆదేశాల మేరకు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కోవూరు, కావలి వద్ద జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల ఫిట్నెస్, ఇన్సురెన్స్ లేకపోవడంతోపాటు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు గుర్తించి కావలిలో 7, కోవూరు వద్ద 6 బస్సులు సీజ్ చేశారు. వీటిని కావలి, నెల్లూరు ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లకు తరలించారు. కావలిలో ఎంవీఐలు కరుణాకర్, ఆయన సిబ్బంది, కోవూరు వద్ద ఎంవీఐ బాలమురళి, ఏఎంవీఐలు స్వప్నిల్ రెడ్డి, రఫి, రఘువర్ధన్రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            జిల్లాలో..
రైలు పట్టాలపై మృత్యుఘోష నెల్లూరు(క్రైమ్): ప్రయాణంలో నిర్లక్ష్యంతో కొందరు.. ప్రమాదవశాత్తు మరికొందరు.. జీవితంపై విరక్తి చెంది ఇంకొందరు.. రైలు పట్టాలపై తనువు చాలిస్తుండగా ఎందరో దివ్యాంగులవుతున్నారు. వరుస ఘటనలతో రైలు పట్టాలపై మరణ మృదంగం మోగుతోంది. జిల్లాలో నెలకు సగటున 21 మంది మృత్యువాత పడుతున్నారు. మృతుల వివరాలు తెలిస్తే వెంటనే మృతదేహాలను రైల్వే పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు అప్పగిస్తుంటే.. వివరాలు తెలియని వాటిని ఖననం చేస్తున్నారు. ఈ సంవత్సరంలో.. తెట్టు నుంచి సూళ్లూరుపేట వరకు 160 కి.మీ మేర రైలు మార్గం ఉంది. నెల్లూరు రైల్వే సర్కిల్ పరిధి ఉమ్మడి నెల్లూరు జిల్లా వరకు విస్తరించి ఉంది. కావలి, నెల్లూరు నగరం, గూడూరు రైల్వేస్టేషన్లు, బిట్రగుంట, సూళ్లూరుపేట రైల్వే అవుట్ పోస్టులున్నాయి. వీటి పరిధిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. గడిచిన మూడేళ్లలో 758 మృతిచెందగా కుటుంబ కలహాలో, ఆర్థిక ఇబ్బందులో, ప్రేమ వికటించో ఇలా వివిధ కారణాలతో 284 మంది బలవన్మరణానికి పాల్పడ్డారు. రైలు ప్రమాదాల్లో జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 215 మంది చనిపోగా, 80 మంది ఆత్మహత్య చేసుకున్నారు. గుర్తింపు కష్టతరం రైలు ప్రమాదం జరిగిన సమయంలో మృతదేహాన్ని చూసేందుకు అనేకమందికి ధైర్యం సరిపోదు. శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి గుర్తుపట్టలేని విధంగా ఉంటాయి. బంధువులతో కలిసి వెళ్తూ ఏమరపాటుగా ఉండి రైల్లోంచి జారిపడిపోయిన వారిని సైతం గుర్తుపట్టలేని పరిస్థితి ఉంటుంది. గుర్తుతెలియని మృతదేహాలను ఘటనా స్థలం నుంచి సమీప ప్రభుత్వాస్పత్రికి తరలించి 72 గంటలపాటు ఉంచుతారు. అప్పటికీ కుటుంబ సభ్యులు రాకుంటే ఖననం చేస్తారు. 2023 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 221 మృతదేహాల వివరాలు తెలియరాకపోవడంతో రైల్వే పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఏడాది 78 మృతదేహాలకు అంత్యక్రియలు చేశారు. కుటుంబ సభ్యుల చేతుల మీదుగా జరగాల్సిన ప్రక్రియ కనీసం కడచూపునకు నోచుకోక ఎంతోమంది అనాథలుగా కాలగర్భంలో కలిసిపోతున్నారు. ప్రమాదాలకు కారణాలివే.. కదిలే రైల్లోంచి దిగడం, ఎక్కడం, ఫుట్పాత్ ప్రయాణం ప్రమాదకరం. ఫుట్పాత్ల నుంచి కాకుండా పట్టాల మీదుగా ప్లాట్ఫారంలకు వెళ్లడం, సెల్ఫోన్లో మాట్లాడుతూ, హెడ్ఫోన్స్లో పాటలు వింటూ పట్టాలను దాటడం, ఫుట్పాత్ లేని వంతెనల మీదుగా రాకపోకలు సాగించడం, మలుపుల వద్ద అప్రమత్తంగా ఉండకుండా పట్టాలపై తిరగడం, గేటు వేసిన సమయంలో కింద నుంచి దూరి వెళ్లడం ప్రమాదాలకు కారణాలుగా నిలుస్తున్నాయి.ఇలాచేస్తే మేలు.. కదిలే రైలు ఎక్కడం, దిగడం చేయరాదు. రైలు మెట్లపై కూర్చోరాదు. ఒకవేళ స్టేషన్ దాటిపోతే మరో స్టేషన్లో దిగి గమ్యస్థానాలకు బస్సులో, రైళ్లలో వెళ్లొచ్చు. రైలు వచ్చే సమయానికి 10 నిమిషాల ముందే స్టేషన్కు చేరుకోవాలి. ప్లాట్ఫారంపైకి రైలు వచ్చే సమయంలో కాస్త దూరంగా ఉండాలి. ఫుట్బోర్డులపై నిలబడి, డోర్ వద్ద కూర్చొని ప్రయాణించరాదు. పట్టాలు దాటాల్సి వస్తే ముందు వెనుక, చూసుకోవాలి. ఒక ప్లాట్ఫారం నుంచి మరోదానికి వెళ్లేవారు విధిగా ఫుట్ఓవర్ బ్రిడ్జి లేదా ఎక్స్లేటర్ను వినియోగించాలి. ఈ ఏడాది 215 మంది మృత్యువాత 82 మంది ఆత్మహత్య చాలా సందర్భాల్లో గుర్తించడం కష్టం అనేకమంది కడచూపునకు నోచుకోవడం లేదు గతనెల 17వ తేదీన రైల్లోంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈనెల ఏడో తేదీన పెన్నానది ఎల్సీ గేటు వద్ద గుర్తుతెలియని యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల పడుగుపాడు రైల్వే స్టేషన్ పరిధిలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈనెల 14వ తేదీన నెల్లూరు నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్ – వేదాయపాళెం మధ్యలోని కొండాయపాళెం గేటు సమీపంలో మెమూ రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన కావలి సమీపంలోని మద్దూరుపాడు రైల్వే లైన్ వద్ద గతవారం జరిగింది. పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొని మహిళ మృతిచెందిన ఘటన కావలి – శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వేస్టేషన్ల మధ్యలో గతవారం చోటుచేసుకుంది. అప్రమత్తం చేస్తున్నాం అజాగ్రత్త, నిర్లక్ష్యం కారణంగానే అనేక మంది మృతిచెందుతున్నారు. రైలు ప్రమాదాలపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తున్నాం. రైలు పట్టాలపై నడక చట్టరీత్యా నేరం. నిర్లక్ష్యంగా ప్రయాణించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. – ఎ.సుధాకర్, రైల్వే సీఐ, నెల్లూరు - 
      
                   
                               
                   
            మద్యం తాగి వాహనాలు నడుపుతూ..
● డ్రంక్ అండ్ డ్రైవ్పై 29 కేసులు, 19 వాహనాల సీజ్ ● స్పెషల్ డ్రైవ్ను పరిశీలించిన ఎస్పీనెల్లూరు(క్రైమ్): మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. శనివారం అర్ధరాత్రి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్, నిబంధనల పాటించని వాహనదారులపై కొరడా ఝళిపించారు. నెల్లూరు నగరంలోని వీఆర్సీ, గాంధీబొమ్మ, ఆత్మకూరు బస్టాండ్, మినీబైపాస్లోని పూలేబొమ్మ, బుజబుజనెల్లూరు, అయ్యప్పగుడి, కరెంటాఫీస్ సెంటర్ తదితర ప్రాంతాల్లో వాహన తనిఖీలను ఎస్పీ అజిత స్వయంగా పరిశీలించి పోలీసు అధికారులకు పలు సూచనలిచ్చారు. పలువురు మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడగా వారికి ఆమె కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం అజిత మాట్లాడుతూ యువత స్టంట్స్ పేరుతో బైక్పై తిరుగుతూ రీల్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులు బాధ్యత వహించాలన్నారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 2,372 వాహనాలను తనిఖీ చేశామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్పై 29 కేసులు నమోదు చేసి 19 వాహనాలు సీజ్ చేసినట్లు చెప్పారు. నిబంధనల ఉల్లంఘనులపై 262 కేసులు నమోదు చేసి రూ.1,34,990 అపరాధరుసుము విధించామన్నారు. ఓపెన్ డ్రింకింగ్పై 31 కేసులు నమోదు చేసి 31 మందిని అరెస్ట్ చేశామన్నారు. తనిఖీల్లో నగర పోలీసు అధికారులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            నెల్లూరు నాకు చాలా ప్రత్యేకం
● విశ్రాంత డీజీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి నెల్లూరు(క్రైమ్): ‘నెల్లూరు నాకు చాలా ప్రత్యేకం. జిల్లా ఎస్పీగా ఇక్కడే తొలి పోస్టింగ్. ఎస్పీగా ఏది చేయాలో అదే చేశాను. అంతకంటే గొప్పగా ఏమిచేయలేదు. జిల్లా ప్రజలు నన్ను అభిమానించారు. ఇక్కడ పనిచేయడం నా అదృష్టం’ అని విశ్రాంత డీజీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నెల్లూరులో హోటల్ అతిథిలో జర్నలిస్టులతో చిట్చాట్ చేశారు. నిబద్ధతతో విధులు నిర్వహించినట్లు చెప్పారు. ఒత్తిళ్లకు తలొగ్గలేదని, పోలీసు సేవలను ప్రజలకు చేరువచేసి మేమున్నది మీకోసమేనన్న భావన వారిలో కల్పించానన్నారు. మెరుగైన శాంతిభద్రతలు అందించానన్నారు. మంచి చేసిన అధికారులకు ఇక్కడున్న పత్రికలు కూడా చేదోడు వాదోడుగా ఉంటాయని చెప్పారు. జర్నలిస్టులు ఇచ్చిన సహకారంతో ముందుకు వెళ్లానన్నారు. ఇక్కడి నుంచి 23 ఏళ్ల క్రితం వెళ్లినా నేటికీ అదే అభిమానం చూపిస్తున్నారన్నారు. సాహిత్యంతో సమాజాన్ని జాగృత్తం చేస్తాన్నారు. తాను రచించిన పుంజుతోక కవితా సంపుటిలో పోలీసులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని, వారు అందిస్తున్న సేవలను వివరిస్తూ కవిత రాశానన్నారు. ఈసారి రచనలో నెల్లూరు అనుభవాలు, ఆనాటి పరిస్థితులకు సంబంధించి ప్రత్యేక చాప్టర్ ఉంటుందన్నారు. ఆ పుస్తకం పోలీసు సిబ్బందికి, తర్వాత తరానికి ఉపయుక్తమని చెప్పారు. ప్రస్తుతం అధికారులు రాజకీయ నేతలకు భయపడే పరిస్థితి నెలకొందని విలేకరులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గట్టిగా పనిచేసినప్పుడు, ప్రజలకు మేలు జరిగినప్పుడు ఏ రాజకీయ నాయకులు అడ్డం పడరన్నారు. వారికి నచ్చకపోతే బదిలీ చేస్తారు. బదిలీ పనిష్మెంట్ కాదన్నారు. మా ఎస్సైలు, కానిస్టేబుళ్లు బదిలీలకు భయపడ్డారంటే అర్థం ఉంది. అధికారులకు ఎందుకు భయం. ఐఏఎస్, ఐపీఎస్లు బదిలీలకు భయపడి రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గే రోజులు పోవాలన్నారు. - 
      
                   
                               
                   
            సోమిరెడ్డీ... నోరు అదుపులో పెట్టుకో
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నెల్లూరు (స్టోన్హౌస్పేట): రాష్ట్రానికి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి నువ్వు, నీ పార్టీ అధినేతలు కాలి గోటికి కూడా సరిపోరని, సోమిరెడ్డీ.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు.. లేకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి హెచ్చరించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్మోహన్రెడ్డి ఆరోగ్య స్థితి గురించి మాట్లాడే ముందు సోమిరెడ్డి తన శారీరక స్థితిని చూసుకోవాలన్నారు. డేటా సెంటర్, డెవలప్మెంట్ సెంటర్ గురించి సోమిరెడ్డి మాట్లాడడం హాస్యాస్పదమని, పదో తరగతి కూడా పాస్ కాని సోమిరెడ్డికి డేటా సెంటర్కు, డెవలప్మెంట్ సెంటర్కు తేడా తెలుసా అని ప్రశ్నించారు. సోమిరెడ్డి సర్వేపల్లిలో మట్టి, ఇసుక, గ్రావెల్, బూడిద అక్రమ రవాణాతో పాటు, ఇరిగేషన్లో దొంగ బిల్లులు చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు. సోమిరెడ్డి అక్రమ సంపాదన గురించి తెలిసి, చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనలో ఆయన ముఖం చూడడానికి కూడా ఇష్టపడ లేదన్నారు. చంద్రబాబు, లోకేశ్ దగ్గర మార్కుల కోసం పాకులాడుతూ జగన్మోహన్రెడ్డి గురించి స్థాయికి మించి మాట్లాడుతున్నాడన్నారు. సిటీ సెంటర్లు, లిక్కర్ షాపులు, లిక్కర్ బ్రాండ్ల గురించి మాట్లాడే స్థాయి సోమిరెడ్డిదని, లెక్కా, పక్కాలో సోమిరెడ్డి మొనగాడన్నారు. సోమిరెడ్డి దేవదాయ భూములు, రైతుల భూములు దోచుకోకుండా ఉంటే మంచిదని హితవు పలికారు. సోమిరెడ్డి శక్తికి మించి మాట్లాడితే ప్రజలే ఛీకొట్టే పరిస్థితులు ఏర్పడతాయని గుర్తుంచుకోవాలన్నారు. - 
      
                   
                               
                   
            43 బృందాలు సిద్ధం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు విద్యుత్ సంస్థ సిద్ధంగా ఉందని ఏపీ ఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్, జిల్లా ప్రత్యేక నోడల్ అధికారి ఆదిశేషయ్య తెలిపారు. నెల్లూరులోని విద్యుత్ భవన్లో ఆదివారం ఆయన జిల్లా విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్ లైన్లు, స్తంభాలు పడిపోతే యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు శిక్షణ పొందిన 355 మంది సిబ్బందితో 43 ప్రత్యేక బృందాలను సిద్ధం చేశామన్నారు. స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలిచ్చామన్నారు. విద్యుత్ భవన్లో, జిల్లాలోని అన్ని డివిజన్లలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామన్నారు. సిబ్బందికి సెలవులు రద్దు చేశామన్నారు. సమావేశంలో డివిజన్ నోడల్ అఽధికారి బి.జగదీష్, ఎస్ఈ రాఘవేంద్రం, ఈఈలు శేషాద్రి బాలచంద్ర, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్ రద్దునెల్లూరు(క్రైమ్): తుఫాన్ కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సోమవారం ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్హాల్లో జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా పోలీసుకార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలందరూ గమనించాలని విజ్ఞప్తి చేసింది. బకాయిల విడుదలపై సందిగ్ధం నెల్లూరు(బృందావనం): రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలైన డీఆర్, 11వ పీఆర్సీ బకాయిల విడుదలకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం సందిగ్ధంలో ఉందని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షుడు ఎస్ఎం గౌస్ తెలిపారు. నెల్లూరు భక్తవత్సలనగర్లోని పెన్షనర్ల సంక్షేమ భవనంలో ఆదివారం అసోసియేషన్ జిల్లా శాఖ కార్యవర్గ, సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గౌస్ మాట్లాడుతూ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ సవరణకు రాష్ట్ర పెన్షనర్ల సంఘం ప్రభుత్వానికి ప్రాతినిద్యం చేసిందన్నారు. అందుకు సంబంధించి సానుకూల ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఉపాధ్యాయ ఉద్యమ నేత పి.బాబురెడ్డి మాట్లాడుతూ పెన్షనర్లు తమ బకాయిలు, పెండింగ్ డీఆర్ విడుదలకు న్యాయపరమైన పోరాటం చేస్తే ఫలితం కలుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం మరణించిన జిల్లా ట్రెజరీ, అకౌంట్స్ అఽధికారి డి.గంగాద్రిని స్మరిస్తూ అసోసియేషన్ సంతాపం ప్రకటించింది. షుగర్ వ్యాధి వల్ల వచ్చే సమస్యలను వివరిస్తూ డాక్టర్ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి ప్రజావైద్యశాల సీనియర్ వైద్యుడు ఎంవీ రమణయ్య ఆధ్వర్యంలో ‘తియ్యని ముప్పు’ నాటికను ప్రదర్శించారు. డాక్టర్ల బృందం ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అసోసియేషన్కు చెందిన ఎస్పీవీఎన్ మూర్తి, జె.హజరత్తయ్య, ఆదిశేషయ్య, ఎన్.శ్రీనాథ్, ఖాజారసూల్, డి.గోపాల్, ఎం.మస్తానయ్య, సీహెచ్ రఘునాథ్, పి.వేణు తదితరులు పాల్గొన్నారు.మా ఇష్టం.. ఆక్రమిస్తాంమర్రిపాడు: మండలంలోని కదిరినేనిపల్లిలో ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. కబ్జాదారులకు రెవెన్యూ శాఖలోని కొందరు సిబ్బంది సహకరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కదిరినేనిపల్లి, నేర్దనంపాడు గ్రామాలకు చెందిన కొందరు సిబ్బంది ఆక్రమణదారులకు సలహాలిస్తున్నారనే ప్రచారముంది. సర్వే నంబర్లు 221, 213, 211, 61, 291, 292, 38, 39, 40, 451, 452, 453, 52, 59, 684ఏ, 701,61 పరిధిలో ఆక్రమణలు జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భూములు ప్రభుత్వానికి చెందినవే అయినా కొందరు వ్యక్తులు సాగు ప్రారంభించారని చెబుతున్నారు. దగ్గరుండి చూపిస్తూ.. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన రెవెన్యూ వారే స్వయంగా ఆక్రమణదారులకు వాటిని చూపిస్తూ, ఎలా కబ్జా చేయాలో మార్గాలు చెబుతున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో ఓ వీఆర్వో సంతకాలను ఫోర్జరీ చేసిన చరిత్ర ఉందని గ్రామస్తులు చెబుతున్న మాట. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. - 
      
                   
                               
                   
            వణికిస్తున్న మోంథా తుపాను
నెల్లూరు (అర్బన్): గత వారంలో అల్పపీడనం, ఈశాన్య రుతుపవనాలు ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో వాగులు, వంకలు పొంగాయి. ఎక్కువ భాగం చెరువులు నిండి కలుజులు పారాయి. ఇంకా లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు తొలగిపోలేదు. తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మోంథా తుపాన్గా బలపడుతోందని వాతావరణశాఖ హెచ్చరించింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లా వాసులు వణికిపోతున్నారు. జిల్లాలో సోమవారం నుంచే ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు నమోదవుతాయని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. తీరం వెంబడి గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది. 144 రిలీఫ్ కేంద్రాల ఏర్పాటు తుపాన్ను ఎదుర్కొనేందుకు అధికారులతోపాటు రెవెన్యూ యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. తుపాన్ నేపథ్యంలో ఆర్డీఓలు, స్పెషలాఫీసర్లతో కలెక్టర్ ఆదివారం ఫోన్ ద్వారా మాట్లాడారు. రెవెన్యూ అధికారులు, సిబ్బందికి, మండల ప్రత్యేకాధికారులకు సెలవులు రద్దు చేశారు. పోలీసులు సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం జిల్లాలో చేపట్టిన ముందస్తు చర్యల గురించి వివరించారు. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు 144 రిలీఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పెన్నానది పరీవాహక ప్రాంతాలైన అనంతసాగరం, చేజర్ల, ఆత్మకూరు, కలువాయి, సంగం తదితర మండలాల్లోని నది పరీవాహక ప్రాంతాల్లో కరకట్టకు తాత్కాలిక మరమ్మతులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. జాతీయ, రాష్ట్ర రహదారుల్లో 27 ప్రదేశాలు, రైల్వే మార్గాల్లో 16 ప్రదేశాలు వరదలకు లోనయ్యే అవకాశం ఉందని గుర్తించి ఆయా ప్రాంతాలను 377 చౌకదుకాణాలతో అనుసంధానించి పీడీఎస్ బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను సిద్ధం చేశారు. ● వారంలోపు ప్రసవించే 312 మంది గర్భిణులను గుర్తించి వారికి రవాణా సౌకర్యంతోపాటు ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ● వరద ప్రభావం అధికంగా ఉండే ప్రాంతాల్లో కూరగాయలు అందుబాటులో ఉంచేలా 82 డీసెంట్రలైజ్డ్ రైతు బజార్లు సిద్ధం చేశారు. విజయ డెయిరీ ద్వారా పాలు సరఫరా కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు అందించే 35 సీపీఎస్డబ్ల్యూఎస్లకు విద్యుత్ సరఫర ఇబ్బంది లేకుండా బ్యాకప్ పవర్ ఏర్పాటు చేశారు. ● వరద ప్రభావిత ప్రాంతాల్లో 40 వేల నీటి క్యాన్లు సేకరించి అందుబాటులో ఉంచారు. ● బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ సంస్థలతో సమావేశం నిర్వహించి 2100 చోట్ల మొబైల్ టవర్స్కు పవర్ బ్యాకప్ ఏర్పాటు చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు సిద్ధం వరద ప్రభావం ఎక్కువైతే ప్రజలను ఆదుకుని ఒడ్డుకు చేర్చుకునేందుకు నెల్లూరులో ఒక ఎన్డీఆర్ఆఫ్ , కావలిలో ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని సిద్ధంగా ఉంచారు. తీరంలో ఎగసి పడుతున్న అలలు జిల్లాలోని మైపాడు, కొత్తకోడూ రు, రామతీర్థం, రామాయపట్నం, కృష్ణపట్నం తదితర సముద్ర తీర ప్రాంతాల్లో సముద్రం కస రుగా ఉంది. అలలు ఎగసి పడుతున్నాయి. సముద్రం 5 మీటర్ల వరకు ముందుకు చొచ్చుకొచ్చింది. బకింగ్హామ్ కెనాల్కు ప్ర వాహం పెరిగింది. ఇప్పటికే ఈ దురుగాలులు మొదలయ్యాయి. దీంతో పర్యాటకులు బీచ్ల వద్దకు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. పోలీసులు గస్తీ కాస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా అప్రమత్తం చేశారు. పెన్నాకు పెరిగిన ప్రవాహం ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం వస్తుండడంతో సోమశిల ప్రాజెక్ట్ అధికారులు వరద నీటిని పెన్నాకు వదిలారు. నీటితో పాటు బొగ్గేరు, బీరాపేరు ఉపనదుల నుంచి వచ్చిన వర్షపు నీరు కలిసి నదిలో సుమారు లక్ష క్యూసెక్కుల వరకు నీరు ప్రవహిస్తోంది. ప్రాజెక్ట్ అధికారులు ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో పరిశీలిస్తూ నీటిని నియంత్రిస్తున్నారు. వర్షాలు పెరిగితే ఏ క్షణమైనా వరద నీటిని సోమశిల నుంచి భారీ స్థాయిలో నదిలోకి వదిలే అవకాశం ఉంది. పీజీఆర్ఎస్ రద్దు తుపాన్ నేపథ్యంలో కలెక్టరేట్లో సోమవారం జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను కలెక్టర్ రద్దు చేశారు. ప్రజలు అర్జీలు ఇచ్చేందుకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్కు రావద్దని సూచించారు. తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో కలెక్టరేట్తోపాటు ముందస్తుగా డివిజన్ కేంద్రాల్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కంట్రోల్ రూం: 0861–2331261, 7995576699 కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం: 7601002776 నెల్లూరు ఆర్డీఓ కార్యాలయం: 9849904061 ఆత్మకూరు ఆరీడ్ఓ కార్యాలయం: 9100948215 కావలి ఆర్డీఓ కార్యాలయం: 7702267559 జిల్లాకు భారీ వర్ష సూచన ఇప్పటికే పొంగుతున్న వాగులు, వంకలు భయం గుప్పెట్లో పెన్నా పరీవాహక గ్రామాలు అధికారులకు సెలవుల రద్దు తీరంలో ఎగసి పడుతున్న అలలు బీచ్ల వైపు వెళ్లకుండా పోలీసుల గస్తీ 144 రిలీఫ్ కేంద్రాల ఏర్పాటు తుపాన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్ కంట్రోల్ రూమ్ల ఏర్పాటు - 
      
                   
                               
                   
            ఎక్కడి బస్సులు అక్కడే
బస్సు టాప్పై గూడ్స్ను రవాణా చేస్తున్న దృశ్యంనెల్లూరు (టౌన్): ఓల్వో, బెంజ్, స్కానియా వంటి కంపెనీలు స్లీపర్ బస్సులు కేవలం 36 నుంచి 55 మంది ప్రయాణికులు భద్రంగా ప్రయాణించేందుకు అనుగుణంగా అత్యాధునికంగా తయారు చేస్తున్నారు. అయితే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు దురాశతో కంపెనీల నుంచి వచ్చిన బస్సులను నిబంధనలకు విరుద్ధంగా సీట్లు, బెర్తు లు, బాడీ బిల్డింగ్ను ఇష్టారీతిన గూడ్స్ రవాణాకు అనుగుణంగా డిజైన్ను మార్చేస్తున్నారు. రవాణా శాఖ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు లేక పోవడంతో జిల్లాలో ఉండే రవాణా అధికారులు సైతం నిబంధనల అతిక్రమణపై చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గూడ్స్ రవాణాను ఆదాయవనరుగా.. ప్రయాణికుల నుంచి వచ్చే టికెట్ చార్జీల కంటే గూడ్స్ రవాణాను ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు. భద్రతా ప్రమాణాలతో సంబంధం లేకుండా ఇష్టారాజ్యంగా సరుకులను రవాణా చేస్తున్నారు. సాధారణ రోజుల్లో టికెట్లు తక్కువగా ఉన్నా.. గూడ్స్ రవాణా ద్వారానే రెట్టింపు స్థాయిలో అనధికారికంగా రాబడిని పొందుతున్నారని సమాచారం. నెల్లూరు నుంచే కాకుండా.. ఇతర ప్రాంతాల నుంచి నెల్లూరు మీదుగా దాదాపు 120 ట్రావెల్స్ బస్సులు ప్రతి రోజు తిరుగుతున్నాయి. ఈ ట్రావెల్స్ బస్సుల్లో భారీగా గూడ్స్ రవాణా చేస్తున్నారు. ప్రయాణికుల బరువుకు అనుగుణంగా రూపొందించిన బస్సుల్లో అందుకు పది రెట్లు బరువు ఉండే సరుకులు రవాణా చేస్తున్నారు. ట్యాక్స్లు ఎగ్గొట్టే సరుకుల రవాణా ప్రధానంగా బెంగళూరు, చైన్నె, హైదరాబాద్, విశాఖపట్నం నగరాలకు ప్రమాదకరమైన వస్తువులు, నిషేధిత మెటీరియల్స్తోపాటు ట్యాక్స్లు ఎగ్గొట్టే సరుకులను కూడా రవాణా చేస్తున్నారు. గార్మెంట్స్, పూలు, బొకేలు, ఫ్లైవుడ్, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, బంగారం, వెండి, మత్తు, పేలుడు పదార్థాలు తదితరాలు భారీగా రవాణా అవుతున్నాయి. వీటితోపాటు బైక్లు, గ్యాస్ సిలిండర్లు సైతం రవాణా చేస్తున్నారు. బస్సు కింద భాగం, పైభాగాన్ని మొత్తం గూడ్స్తో నింపేస్తారు. వీటిల్లో చాలా వరకు వస్తువులకు సంబంధించి ఎలాంటి బిల్లులు లేకుండా రవాణా అవుతున్నట్లు తెలిసింది. సరుకు రవాణాకు ప్రత్యేకించి ట్రాన్స్పోర్ట్ వాహనాలు ఉన్నా వ్యాపారులు ట్యాక్స్ లు చెల్లించకుండా ఉండేందుకు అక్రమ మార్గంలో సరుకులు, వస్తువులు రవాణాకు ట్రావెల్స్ బస్సులనే ఆశ్రయిస్తున్నారు. ఈ బస్సుల్లో అయితే ఎలాంటి తనిఖీలు లేకుండా నేరుగా గమ్యస్థానాలకు చేరుతుండడంతో ఈ అక్రమ మార్గాన్ని వ్యాపారులు ఎంచుకుంటే.. దురాశతో బస్సుల యాజమాన్యాలు వ్యాపారులతో ఒప్పందాలు కదుర్చుకుని భారీ స్థాయిలో గూడ్స్ను రవాణా చేస్తున్నారనే ఆరోపణలు వినిస్తున్నాయి. బస్సులో ఎక్కిన ప్రయాణికుడు రెండు.. మూడు బ్యాగ్లు తీసుకువస్తే ఒక బ్యాగుకు అదనంగా చెల్లించా లని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రాణాలతో చెలగాటం ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ధనాశతో బరితెగిస్తే.. నియంత్రించాల్సిన రవాణాశాఖ అధికారులు అవినీతి మత్తులో పేరాశతో దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. యాజమాన్యాలతోపాటు అధికారులు కలిసి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ట్రావెల్స్ బస్సులను నిబంధనలకు విరుద్ధంగా స్టేజ్ క్యారియర్లుగా, సరుకుల రవాణా వాహనాలుగా తిప్పుతున్నా.. అధికారులు చూసీచూడకుండా వ్యవహరించడం వల్లే ప్రజల ప్రాణాల్లో గాల్లో కలిసిపోతున్నాయి. రాష్ట్రంలోని కర్నూలు, జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ వద్ద జరిగిన ట్రావెల్స్ బస్సుల దగ్ధం ఘటనలకు కారణాలు ఒకటేగా ఉన్నాయి. ప్రమాదకరమైన వస్తువులు, రసాయనాల తరలింపు వల్లే ఈ ఘటనల తీవ్రతకు కారణంగా చెప్పొచ్చు. జిల్లా నుంచి హైదరాబాద్, బెంగళూరు, చైన్నె, విశాఖపట్నం ప్రాంతాలకు రాకపోకలు సాగించే ట్రావెల్స్ బస్సుల్లో భారీ స్థాయిలో గూడ్స్ రవాణా చేస్తున్నారు. ఇందు కోసం ప్రయాణికుల లగేజీలపై నియంత్రణ విధిస్తున్నారు. వీటికి కూడా అదనంగా వసూలు చేస్తున్నారు. ట్రావెల్స్ బస్సుల్లో డిజైన్ మార్పు ప్రయాణికుల బరువుకు మించి గూడ్స్ రవాణా దీనికి తోడు మితిమీరిన వేగం అధిక బరువు, వేగంతో కంట్రోల్ తప్పుతున్న వైనం బిల్లుల్లేని బేళ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్రమాదకరమైన రసాయనాల రవాణా గుట్టు చప్పుడు కాకుండా పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలు కూడా.. ప్రయాణికుల లగేజీ బ్యాగ్లకు అదనపు వసూళ్లు తనిఖీలు చేపట్టని రవాణా, వాణిజ్య పన్నుల శాఖలు, పోలీసు అధికారులు మొక్కుబడి తనిఖీలకే పరిమితం ట్రావెల్స్ బస్సులను ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే రవాణా శాఖాధికారులు తనిఖీలతో హడావుడి చేస్తున్నారు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు పరిస్థితి సర్దుమణిగాక తిరిగి యథావిథిగా వ్యవహరిస్తున్నారు. ట్రావెల్స్ బస్సుల్లో భారీగా గూడ్స్ రవాణా చేస్తున్నా.. రవాణాశాఖ, వాణిజ్య పన్నుల శాఖ, పోలీసు అధికారులు ఎవరూ పట్టిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. బస్సుల్లో రవాణా చేస్తున్న ఆయా వస్తువులకు ఎలాంటి బిల్లులు ఉండవు. కాని ఎప్పుడూ వాణిజ్య పన్నుల శాఖాధికారులు అటు వైపు కన్నెత్తి చూసిన సందర్భాలు లేవు. బస్సుల్లో గూడ్స్ని తనిఖీ చేస్తే ప్రభుత్వానికి పన్నుల రూపంలో రూ.లక్షల్లో ఆదాయం వస్తుందని అని తెలిసినా నెల మామూళ్లతో అన్ని శాఖల అధికారులు ఎప్పుడూ ట్రావెల్స్ బస్సులు తనిఖీల జోలికి వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్రావెల్స్ బస్సులను రవాణా అధికారులు తనిఖీ చేసినా ఏదో టార్గెట్ల కోసం మొక్కుబడిగా కేసుల నమోదు చేసి వదిలివేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలు అతిక్రమించినా, పెద్ద మొత్తంలో లగేజీని రవాణా చేసినా రాష్ట్ర రవాణాశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు లేనిదే తామేమి చేయలేమని చెబుతున్నారు. నిబంధనలు అతిక్రమించిన ట్రావెల్స్ బస్సులను కట్టడి చేసేందుకు ఉన్నతాధికారులే స్పష్టమైన ఆదేశాలు చేయాలంటున్నారు. ఒక వేళ బస్సును సీజ్ చేసినా ఉన్నతాధికారులు కల్పించుకునే వెంటనే పంపించేయాలని చెబుతున్న పరిస్థితి ఉందంటున్నారు. జిల్లాలో ట్రావెల్స్ బస్సులపై రవాణా అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండడంతో రెండు రోజులుగా బస్సులను నిలిపివేశారు. తిరుగుతున్న ఎక్కువ బస్సులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆ బస్సులను నగర, పట్టణ శివారు ప్రాంతాల్లో నిలిపివేశారు. రెండు రోజుల నుంచి ట్రావెల్స్ బస్సులు రావడం కూడా తగ్గిందని రవాణా అధికారులు చెబుతున్నారు. బస్సుల్లో గూడ్స్ రవాణా చేస్తే కఠిన చర్యలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో ప్రయాణికులకు సంబంధించిన లగేజీ తప్ప ఎలాంటి వస్తువులు, ప్రమాదకర, నిషేధిత వస్తువులే కాదు.. ఎలాంటి గూడ్స్ తీసుకెళ్లకూడదు. బస్సుల్లో తీసుకెళుతున్న గూడ్స్ రవాణాపై గతేడాది 187 కేసులు నమోదు చేశాం. ఈ ఏడాది ట్రావెల్స్ బస్సులపై ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు చేశాం. ప్రభుత్వ నిబంధనలు పాటించని ట్రావెల్స్ బస్సులపై తనిఖీలు చేసి వాటిపై భారీగా కేసులు నమోదు చేస్తాం. రానున్న రోజుల్లో ట్రావెల్స్ బస్సులపై బృందాలు ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహిస్తాం. – బి.చందర్, డీటీసీ - 
      
                   
                               
                   
            ఏకపక్షంగా వ్యవహరించడం దుర్మార్గం
● మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను తిప్పికొడుతాం ● ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి నెల్లూరు (స్టోన్హౌన్పేట): ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ప్రజలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఏ మాత్రం లెక్క చేయకుండా ఏకపక్షంగా ముందుకు పోవడం దుర్మార్గమని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి అన్నారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్లో ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శనివారం వైఎస్సార్సీపీ యువజన విభాగం నిర్వహిస్తున్న కోటి సంతకాల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నగర నియోజకవర్గ పరిశీలకులు చిల్లకూరు సుధీర్రెడ్డితో కలిసి ప్రారంభించారు. చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు మెడికల్ కళాశాలలను తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎకరా రూ.100లకు చొప్పున అప్పనంగా కట్టబెడుతూ ప్రభుత్వ సొమ్మును దోచిపెడుతున్నారని మండిపడ్డారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలుగా పోరాడుతుందన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకునే దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా ఉద్యమం చేపట్టేందుకు నిర్ణయించారని తెలిపారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టి ఆ పత్రులను గవర్నర్కు అందించి ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా పోరాటం చేస్తామన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలోని ప్రతి డివిజన్తోపాటు వీఆర్సీ, గాంధీబొమ్మ, ఆత్మకూరు బస్టాండ్ ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరిని ఏకం చేసి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వల్ల జరిగే నష్టాలను వివరించి మద్దతుగా సంతకాలు చేయిస్తామన్నారు. రాబోయే 20 రోజులపాటు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి కోటేశ్వరరెడ్డి, కార్పొరేటర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి వేలూరు ఉమామహేష్, జిల్లా ఉపాధ్యక్షుడు మజ్జిగ జయకృష్ణారెడ్డి, కరీముల్లా, నీలి రాఘవరావు, మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు హంజాహుస్సేని, జిల్లా యాక్టివిటీ కార్యదర్శి జహీద్, 11వ డివిజన్ ఇన్చార్జి మహేష్ యాదవ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            ఇదే మొదటి.. చివరి విహారయాత్ర
అయితే తన మిత్రుడు, సమీస బంధువు, తనతో కలిసి పనిచేసే నేలకుర్తి రమేష్ ఆహ్వానం మేరకు మూడు రోజుల పాటు సరదాగా విహరించేందుకు హైదరాబాద్కు భార్య, బిడ్డలతో కలిసి గోళ్ల రమేష్ వెళ్లాడు. ఈ విషయం స్వగ్రామంలోని కుటుంబ సభ్యులకు చెప్పలేదు. చైన్నెలో ఉన్నంటున్న చిన్న అక్క కొడుకు (మరో మేనల్లుడు) కూడా నేరుగా హైదరాబాద్కు చేరుకుని వారితో సరదాగా గడిపారు. తిరుగు ప్రయాణంలో వారిని బెంగళూరు బస్సు ఎక్కించి తాను చైన్నె బయలు దేరాడు. ఇంటికి చేరక ముందే ఈ విషాదం తెలియడంతో షాక్కు గురయ్యాడు. తన కుటుంబంతో కలిసి విహారయత్రకు వెళ్లడం ఇదే మొదటి .. చివరి విహార యాత్ర.. విషాదయాత్రగా మారింది. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన నేలకుర్తి రమేష్ కుటుంబం స్వగ్రామం దుత్తలూరు మండలం కొత్తపేటకు చేరుకుంది. వారిని చూసిన క్షణం.. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు భావోద్వేగానికి గురయ్యారు. - 
      
                   
                               
                   
            ట్రావెల్స్ బస్సుల్లో విస్తృత తనిఖీలు
● 33 కేసుల నమోదు, 8 బస్సుల సీజ్ నెల్లూరు (టౌన్): కర్నూలు ఘటన, ట్రావెల్స్ బస్సులపై ‘సాక్షి’లో మృత్యుశకటాలు శీర్షికన ప్రచురితమైన కథనం నేపథ్యంలో జిల్లా రవాణాశాఖాధికారులు శనివారం ఉదయం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రవాణాశాఖ డీటీసీ బి.చందర్ ఆదేశాలతో నగరంలోని మినీబైపాస్, అయ్యప్పగుడి సమీపంలోని జాతీయ రహదారిపై రవాణాశాఖాధికారులు బృందాలుగా ఏర్పడి ట్రావెల్స్ బస్సుల్లో పూర్తిస్థాయిలో తనిఖీ చేసి నిబంధనలు పాటించని 33 బస్సులపై కేసులు నమోదు చేశా రు. దాదాపు రూ.6 లక్షల మేర అపరాధ రుసుం విధించారు. వీటిల్లో 8 బస్సులను సీజ్ చేశారు. బస్సుల్లో రెండు ఎమర్జెన్సీ డోర్కు ముందు సీటు లేదా బెర్త్ ఏర్పాటుపై 11 కేసులు, బస్సు మెయిన్ క్యాబిన్లో బెర్త్ ఏర్పాటుపై 22 కేసులు నమోదు చేశారు. నిబంధనలు పాటించని ట్రావెల్స్ బస్సులపై వరుస తనిఖీలు ఉంటాయ ని డీటీసీ చందర్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఆర్టీఓ మదాని, ఎంవీఐలు బాలమురళీకృష్ణ, గోపినాయక్, రఫీ, అనిల్, ఏఎంవీఐలు పూర్ణచంద్రరా వు, స్వప్నిల్రెడ్డి, రఘువర్ధన్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. వీరి చలపతికి వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శ కొడవలూరు (బుచ్చిరెడ్డిపాళెం రూరల్): టీడీపీ నేతలు పెట్టిన అక్రమ కేసులో జైలుకెళ్లి బెయిల్పై విడుదలైన మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావును మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ఫోన్లో పరామర్శించారు. నెలరోజులకు పైగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న చలపతిరావు రెండు రోజుల క్రితం బెయిల్పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్రెడ్డి ఫోన్ చేిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అక్రమ కేసులకు భయపడొద్దని ధైర్యం చెప్పారు. చలపతిరావు మాట్లాడుతూ మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి తమకు అండగా ఉన్నారని, ఆయన ఆధ్వర్యంలో పార్టీ పటిష్టతకు అహర్నిశలు కృషి చేస్తామని చెప్పారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 71,110 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 25,695 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలైన్లోకి వెళ్లాలని టీటీడీ స్పష్టం చేసింది. సకాలంలో అనుమతులు నెల్లూరురూరల్: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులను సకాలంలో మంజూరు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి కలెక్టరేట్లో తిక్కన ప్రాంగణంలో పరిశ్రమలు, ఎగుమతులు ప్రోత్సాహక కమిటీ సమావేశంలో కలెక్టర్ మా ట్లాడారు. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మౌ లిక వసతులను కల్పించాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వెంటనే భూ సేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నీటి వసతి, విద్యుత్, కనీస సౌకర్యాలను కల్పించాలన్నారు. పరిశ్రమలశాఖ జీఎం మారుతీప్రసాద్ మాట్లాడుతూ పరిశ్రమలకు సంబంధించి సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 4,912 దరఖాస్తులు రాగా, 4,778 దరఖాస్తులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించి అనుమతులు మంజూరు చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో ఏపీఐఐసీ జెడ్ఎం శివకుమార్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ అశోక్కుమార్, ఇరిగేషన్ ఎస్ఈ దేశ్నాయక్, డీటీసీ చందర్, పలు పరిశ్రమల నిర్వాహకులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            ‘ఉన్నతి’తో వడ్డీలేని రుణాలు
నెల్లూరు(పొగతోట): స్వయం సహాయక గ్రూపు మహిళలకు ఉన్నతి పథకం ద్వారా వడ్డీ లేని రుణాలను మంజూరు చేయనున్నామని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి పేర్కొన్నారు. నగరంలోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన సీ్త్ర నిధి ఈసీ సమావేశం, వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. స్వయం సహాయక గ్రూపు మహిళలు మైక్రోఫైనాన్స్ సంస్థల నుంచి అధిక వడ్డీలకు రుణాలు తీసుకొని వాటిని చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. వీటివైపు చూడకుండా రుణాలను సకాలంలో మంజూరు చేసేలా చూడాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు సీ్త్ర నిధి ద్వారా విద్య, కల్యాణ రుణాలను వచ్చే నెల నుంచి నాలుగు శాతం వడ్డీకే మంజూరు చేయనున్నారని వెల్లడించారు. సీ్త్ర నిధి ద్వారా గతంలో గ్రూపునకు రూ.ఐదు లక్షల రుణాన్ని ఇస్తుండగా, ప్రస్తుతం దీన్ని రూ.ఎనిమిది లక్షలకు పెంచారని పేర్కొన్నారు. రికవరీలకు సంబంధించి కలువాయి, పొదలకూరు తదితర ఐదు మండలాలు ఎన్పీఎంలో ఉన్నాయన్నారు. పీఎంఏఎఫ్ఈ, పీఎంఈజీపీల ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పశువుల కొనుగోళ్లకు రుణాలను తక్కువ వడ్డీకే అందజేయనున్నారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పొదుపులో లేని మహిళలను గుర్తించి కొత్త గ్రూపులను ఏర్పాటు చేయాలని సూచించారు. కిచెన్ గార్డెన్స్, పెరటి కోళ్లు తదితరాలపై అవగాహన కల్పించాలని కోరారు. సీ్త్ర నిధి ఏజీఎం కామాక్షయ్య, డీపీఎం మురళి తదితరులు పాల్గొన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన డీఆర్డీఏలో పనిచేస్తున్న ఉద్యోగుల విద్య, కులం, పిల్లలు తదితర వివరాలను అప్డేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఉద్యోగుల సర్టిపికెట్లను డీఆర్డీఏ కార్యాలయంలో అధికారులు పరిశీలించారు. ఉద్యోగోన్నతులను త్వరలో కల్పించనున్న తరుణంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. - 
      
                   
                               
                   
            ఆరు కిలోల గంజాయి స్వాధీనం
నెల్లూరు(క్రైమ్): గంజాయిని విక్రయించేందుకు తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని సంతపేట పోలీస్స్టేషన్లో నిందితుల వివరాలను ఇన్స్పెక్టర్ సోమయ్య శనివారం వెల్లడించారు. నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ పడమర వైపున సిబ్బందితో కలిసి వాహన తనిఖీలను శుక్రవారం సాయంత్రం చేపట్టారు. ఈ క్రమంలో నెల్లూరు రూరల్ మండలం చంద్రబాబునగర్కు చెందిన మాబాషా, చాణిక్యపురినగర్కు చెందిన శ్రీను అనుమానాస్పదంగా వెళ్తుండగా, వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి బ్యాగుల్లోని ఆరు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీస్స్టేషన్కు తరలించి తమదైన శైలిలో విచారించారు. వ్యసనాలకు బానిసై.. వ్యసనాలకు బానిసైన నిందితులు సులభంగా నగదును సంపాదించేందుకు గంజాయి విక్రయాలకు తెరలేపారు. ఒడిశాలో కిలో గంజాయిని రూ.ఐదు వేల చొప్పున కొనుగోలు చేసి నెల్లూరు నగరం, పరిసర ప్రాంతాల్లో రూ.20 వేలకు విక్రయించేందుకు తీసుకెళ్తున్నామనే అంశాన్ని విచారణలో వారు వెల్లడించారు. దీంతో మాబాషా, శ్రీనును అరెస్ట్ చేశామని ఇన్స్పెక్టర్ చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసిన ఇన్స్పెక్టర్, ఎస్సై బాలకృష్ణ, ఏఎస్సై శ్రీహరి, హెడ్ కానిస్టేబుళ్లు సుబ్బారావు, ప్రసాద్, కానిస్టేబుళ్లు అల్లాబక్షు, సురేంద్రబాబు, గోపీ, సుదర్శన్గౌడ్ను పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. - 
      
                   
                               
                   
            రైల్లోంచి పడి వ్యక్తి మృతి
మనుబోలు: రైల్లోంచి పడటంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మనుబోలు రైల్వేస్టేషన్ వద్ద శనివారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల మేరకు.. మనుబోలు రైల్వేస్టేషన్ సౌత్ ఎండ్ వద్ద 145 / 12 – 14 కిలోమీటర్ డౌన్ లైన్ వద్ద గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాన్ని సిబ్బంది గుర్తించి అధికారులకు సమాచారమిచ్చారు. మృతుడి వయస్సు 35 నుంచి 40 ఏళ్లలోపు ఉండొచ్చని భావిస్తున్నారు. గ్రే కలర్ ఫుల్ హ్యాండ్స్ చొక్కా, షార్టును ధరించి ఉన్నారు. విద్యార్థుల అదృశ్యం నెల్లూరు సిటీ: ధనలక్ష్మీపురంలోని శ్రీచైతన్య స్కూల్లో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమయ్యారంటూ నెల్లూరు రూరల్ పోలీసులకు ప్రిన్సిపల్ శనివారం ఫిర్యాదు చేశారు. సదరు స్కూల్ హాస్టల్లో చిల్లకూరు మండలంలోని చింతవరానికి చెందిన లోకేష్, అనంతసాగరం మండల దేవరాయపల్లికి చెందిన రాకేష్ పదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ గురువారం సాయంత్రం అదృశ్యమయ్యారు. విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. సీఐ వేణు దర్యాప్తు చేస్తున్నారు. డిగ్రీ పరీక్షలకు 976 మంది గైర్హాజరు వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో శనివారం నిర్వహించిన డిగ్రీ పరీక్షలకు 976 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పరీక్షల నిర్వహణాధికారి మధుమతి తెలిపారు. 14,808 మందికి గానూ 13,832 మంది హాజరయ్యారని చెప్పారు. నాయుడుపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక విద్యార్థి డీబారయ్యారని పేర్కొన్నారు. పౌల్ట్రీ అసోసియేషన్ ధరలు బ్రాయిలర్ : రూ.130 లేయర్ : రూ.115 బ్రాయిలర్ చికెన్ : రూ.236 స్కిన్లెస్ చికెన్ : రూ.260 లేయర్ చికెన్ : రూ.195నిమ్మ ధరలు పెద్దవి : రూ.30 సన్నవి : రూ.20 పండ్లు : రూ.10 - 
      
                   
                               
                   
            కోర్టు కానిస్టేబుళ్ల విధులు కీలకం
ఘనంగా నాగులచవితి నాగులచవితి పర్వదినాన్ని జిల్లాలో శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. పుట్టలో పాలుపోసి మొక్కులను చెల్లించుకున్నారు. నగరంలోని పొర్లుకట్టలో గల నాగళ్ల పరమేశ్వరి దేవస్థానంలో విశేష పూజలు చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు పెన్నమ్మ పరవళ్లుసంగం: సంగం బ్యారేజీ వద్ద పెన్నమ్మ పరవళ్లు తొక్కుతోంది. సోమశిల నుంచి వచ్చే వరద, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు బీరాపేరు, బొగ్గేరు వాగులతో కలిపి 1.03 లక్షల క్యూసెక్కులు దిగువకు ప్రవహిస్తోంది. పెన్నా పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. బీరాపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పెరమనకు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. చెన్నవరప్పాడు గ్రామానికి రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ● ఎస్పీ అజిత నెల్లూరు(క్రైమ్): నిందితులకు శిక్షలు పడేలా చేయడంలో కోర్టు కానిస్టేబుళ్ల విధులే కీలకమని ఎస్పీ అజిత వేజెండ్ల పేర్కొన్నారు. జిల్లాలోని కోర్టు కానిస్టేబుళ్లు, డీఎస్పీలు, పోలీస్ అధికారులతో సమావేశాన్ని స్థానిక ఉమేష్చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో శనివారం నిర్వహించారు. కోర్టు కేసుల విచారణ.. అభియోగ పత్రాల దాఖలు.. సమన్లు.. వారెంట్ల అమలు.. వివిధ దశల్లో ఎదురవుతున్న సమస్యలు తదితరాలపై సమీక్షించిన అనంతరం ఆమె మాట్లాడారు. సమయపాలన, నిబద్ధతతో కోర్టు కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించాలని సూచించారు. కేసులకు సంబంధించిన అభియోగ పత్రాలు, సాక్ష్యాలను కోర్టులో సకాలంలో సమర్పించి శిక్షల శాతాన్ని పెరిగేలా చూడాలని సూచించారు. కేసు పూర్తి వివరాలను సీసీటీఎన్నెస్లో అప్లోడ్ చేయాలని పేర్కొన్నారు. ఏఎస్పీ సౌజన్య తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            మొరాయిస్తున్న గేట్లు
● ప్రవహిస్తున్న వరద జలాలు ● కండలేరు కాలువ షట్టర్లు దించేందుకు అధికారుల యత్నం ● కానరాని ప్రయోజనం సోమశిల: సోమశిల నుంచి కండలేరుకు జలాలను సరఫరా చేసే వరద కాలువ పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రాజెక్ట్ దక్షిణ భాగంలో ఉన్న వరద కాలువ గేట్ల లీకేజీని అరికట్టేందుకు ఎన్ని యత్నాలు చేస్తున్నా, ఫలితం కానరావడంలేదని తెలుస్తోంది. కాలువకు మూడు గేట్లుండగా, రెండోది మరమ్మతులకు గురై మొరాయించింది. మిగిలిన 1, 3 ద్వారా కండలేరు జలాశయానికి నీటిని సరఫరా చేస్తున్నారు. ఇది పూర్తి సామర్థ్యానికి చేరుకోనున్న తరుణంలో ఇక నీటి సరఫరాను నిలిపేయాలనే అధికారుల ఆదేశాలతో 1, 3 గేట్లను దించే యత్నాలు చేపట్టారు. ఒకటో నంబర్ గేట్కు జాకీలు పెట్టి దించేందుకు యత్నించగా, ఒక అడుగులో ఇరుక్కుపోయింది. మూడో నంబర్ గేట్ను దించే పనులను గురువారం ప్రారంభించారు. ఇది పూర్తిగా దిగకపోతే భారీ స్థాయిలో వరద జలాలు లీకేజీ రూపంలో ప్రవహిస్తూనే ఉంటాయని పలువురు పేర్కొంటున్నారు. 20,960 క్యూసెక్కుల ఇన్ఫ్లో సోమశిల ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల దృష్ట్యా జలాశయానికి 20,960 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. 69.442 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 7, 8, 9వ క్రస్ట్ గేట్ల నుంచి పెన్నాకు 42,460.. కండలేరు కాలువకు 560.. ఉత్తర కాలువకు 50 క్యూసెక్కుల మేర విడుదల చేస్తున్నారు. 99.408 మీటర్ల నీటిమట్టం నమోదైంది.దించేందుకు యత్నిస్తున్నాం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గేట్లను దించేందుకు కొన్ని రోజులుగా పనులు చేస్తున్నాం. ఒకటో నంబర్ గేట్ను సాధ్యమైనంత వరకు దించారు. మూడో నంబర్ గేట్ పనులను ప్రారంభించాం. త్వరలో పూర్తి చేసి నీటి లీకేజీని అరికట్టేందుకు యత్నిస్తాం. కాలువ ద్వారా 560 క్యూసెక్కులు ప్రస్తుతం విడుదలవుతున్నాయి. – శరత్, జేఈఈ, కండలేరు కాలువ - 
      
                   
                               
                   
            1,580 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపు
కోవూరు: జిల్లాకు 2,600 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినట్లు జిల్లా వ్యవసాయాధికారిణి సత్యవాణి తెలిపారు. గురువారం పడుగుపాడు రైల్వే స్టేషన్కు యూరియా బస్తాలు చేరుకోగా ఆమె వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు 1,580 మెట్రిక్ టన్నులు, తిరుపతి జిల్లాకు 1,020 మెట్రిక్ టన్నులు కేటాయించారన్నారు. కార్యక్రమంలో కోవూరు సహాయ వ్యవసాయ సంచాలకురాలు అనిత, మండల వ్యవసాయాధికారిణి టి.రజని, సహాయ వ్యవసాయాధికారి నర్సారావు, సిబ్బంది పాల్గొన్నారు. కత్తితో బెదిరించి నగదు దోపిడీ నెల్లూరు(క్రైమ్): ఓ వ్యక్తిని కత్తితో బెదిరించి నగదు దోచుకెళ్లిన ఘటన నెల్లూరు మెక్లిన్స్రోడ్డులో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. కోటమిట్ట మెక్లిన్స్రోడ్డులో హయత్బాషా అనే దివ్యాంగుడు నివాసముంటున్నాడు. గురువారం అతను సైకిల్పై తన అన్న గౌస్బాషా ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలో మినీఫంక్షన్ హాల్ వద్ద రౌడీషీటర్ సుల్తాన్ అతడిని అడ్డుకుని రూ.వెయ్యి నగదు ఇవ్వాలని లేకుంటే చంపుతామని కత్తితో బెదిరించాడు. భయపడిన హయత్బాషా తన వద్దనున్న రూ.500లు సుల్తాన్కు ఇచ్చాడు. దీంతో నిందితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాధితుడు చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.విద్యుత్ తీగలు తెగిపడి గేదె మృతి మనుబోలు: విద్యుదాఘాతానికి గురై గేదె మృతిచెందిన ఘటన మండలంలోని కొండూరుసత్రం పొలాల్లో గురువారం జరిగింది. వర్షాలు, ఈదురుగాలులకు పొలాల్లో విద్యుత్ స్తంభం ఒరిగిపోయింది. తీగలు తెగి అడ్డదిడ్డంగా పొలంలో పడిపోయాయి. యళ్లంబాక నందకుమార్ అనే రైతుకు చెందిన గేదె అటుగా వెళ్లగా విద్యుత్ తీగలు తగిలి షాక్కు గురై చనిపోయింది. దీంతో సుమారు రూ.80 వేల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు చెప్పారు. బాధిత రైతును ఆదుకోవాలని ఉప సర్పంచ్ ఆవుల తులసీరామ్ కోరారు. రాళ్లపాడు ప్రాజెక్ట్కు వరద ప్రవాహం లింగసముద్రం: వర్షాలకు రాళ్లపాడు ప్రాజెక్ట్లో నీటిమట్టం గురువారం సాయంత్రానికి 16.5 అడుగులకు చేరింది. ఉప్పుటేరు, పిల్లాపేరుల నుంచి 1,000 క్యూసెక్కుల వరద ప్రవాహం ప్రాజెక్ట్కు చేరుతున్నట్లు డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయకట్టుకు కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తామని డీఈ చెప్పారు.ప్రైవేట్ ఫైనాన్స్ సిబ్బంది వేధింపులు ● పురుగు మందు తాగిన వ్యక్తి ● చికిత్స పొందుతూ మృతి మనుబోలు: ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సిబ్బంది వేధింపులతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. గురువారం పోలీసులు వివరాలు వెల్లడించారు. మండలంలోని పిడూరుమిట్టకు చెందిన ఈగా సాయి (32) ప్రైవేట్ ఫైనాన్స్లో ఇల్లు తాకట్టు పెట్టి రుణం తీసుకున్నాడు. ఇటీవల ఆ సిబ్బంది నగదు చెల్లించాలంటూ ఒత్తిడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈనెల 14వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు గుర్తించి నెల్లూరులోని ప్రభుత్వత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందినట్లు పోలీసులు వెల్లడించారు. - 
      
                   
                               
                   
            కాంట్రాక్ట్ రద్దు చేయాలని ఆదేశం
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలోని జొన్నవాడ కామాక్షితాయి ఆలయం వద్దకెళ్లే వాహ నాల నుంచి అక్రమ వసూళ్లపై బుచ్చిరెడ్డిపాళెం ఇన్చార్జి ఎంపీడీఓ మంజులమ్మ తనిఖీలు చేప ట్టారు. గురువారం సాక్షిలో ‘జొన్నవాడలో అనధికార వసూళ్లు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో ఆలయం వద్ద తనిఖీ చేపట్టామని ఆమె తెలిపారు. తన వాహనానికి కూడా పంచాయతీ ముద్ర, ఎలాంటి సంతకం లేకుండా రసీదు ఇచ్చినట్లు చెప్పారు. కనీసం వాహన నంబర్ కూడా నమోదు చేయడం లేదన్నారు. నగదు వసూలు చేస్తున్న సదరు వ్యక్తుల కాంట్రాక్ట్ రద్దు చేయాలని జొన్నవాడ పంచాయతీ సెక్రటరీ కావేరిని ఆదేశించారు. వారి దగ్గర ఉన్న రసీదులను స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా వసూళ్లకు పాల్పడితే సహించబోమన్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. - 
      
                   
                               
                   
            వైఎస్సార్సీపీ నేతలపై కూటమి కక్ష సాధింపు
వెంకటాచలం: కూటమి ప్రభు త్వం వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో డీసీఎంఎస్ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు గురువారం వెంకటాచలం మండలంలోని చెముడుగుంట వద్దనున్న జిల్లా సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ప్రసన్న ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చలపతిరావుపై అక్రమంగా కేసులు మోపిందన్నారు. కోర్టు బెయిల్ ఇవ్వడంతో 33 రోజుల తర్వాత చలపతిరావు విడుదలైనట్లు చెప్పారు. చలపతికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. - 
      
                   
                               
                   
            పోలీసుల తీరుపై అనుమానాలు
సాక్షి నెట్వర్క్: గుడ్లూరు మండలం దారకానిపాడుకు చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు అనే కాపు యువకుడ్ని ఈ నెల రెండున హతమార్చారు. అదే గ్రామానికి చెందిన కాకర్ల హరిచంద్రప్రసాద్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. తన సోదరులైన పవన్, భార్గవనాయుడితో కలిసి దసరా రోజున బైక్పై వస్తుండగా, హరిచంద్రప్రసాద్ తన కారుతో ఢీకొన్నారు. ఘటనలో లక్ష్మీనాయుడు అక్కడికక్కడే మరణించగా.. పవన్, భార్గవనాయుడు తీవ్రంగా గాయపడి గుంటూరులోని హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని హత్య కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. ఇందులో భాగంగా హరిచంద్రప్రసాద్తో పాటు సహకరించిన తండ్రి మాధవరావును అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. రెచ్చగొట్టిన వారిపై చర్యలేవీ..? హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఇద్దరు మహిళలను నిందితులుగా నేటికీ చేర్చలేదు. హరిచంద్రప్రసాద్ తీసుకెళ్లిన కారులోనే అతని భార్య, నానమ్మ కూడా ఉన్నారనేది ప్రత్యక్ష సాక్షుల కథనం. కారుతో ఢీకొన్నాక కిందపడిన వారిపై ఇనుపరాడ్తో దాడి చేస్తుంటే వీరిద్దరూ రెచ్చగొట్టి ప్రోత్సహించారని క్షతగాత్రులు పవన్, భార్గవనాయుడు సైతం చెప్తున్నారు. అయితే వీరిద్దర్ని మాత్రం నిందితులుగా చేర్చలేదు. లక్ష్మీనాయుడు బైక్పై వస్తున్న సమాచారాన్ని హరిచంద్రప్రసాద్కు గ్రామానికి చెందిన యువకులే ఫోన్లో తెలియజేశారని, ఈ విషయంలో ముగ్గురు కీలకపాత్ర పోషించారని మృతుడి భార్య సుజాత అనేక సందర్భాల్లో ఆరోపించారు. దాడి అనంతరం హరిచంద్రప్రసాద్తో పాటు ఆయనతో ఉన్న ఇద్దరు మహిళలు బైక్లపై దారకానిపాడులోకి వెళ్లారు. అసలు వీరిని బైక్లపై గ్రామంలోకి ఎవరు తీసుకెళ్లారనేదీ ప్రశ్నే. ఇలాంటి ఎన్నో కీలక అంశాలను ఈ కేసులో వదిలేశారు. కేవలం ఇద్దర్ని మాత్రమే అరెస్ట్ చూపించి కేసును క్లోజ్ చేసేందుకు పోలీసులు యత్నించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమాధానం కరువు లక్ష్మీనాయుడు హత్యను రాష్ట్ర వ్యాప్తంగా కాపు సంఘాలు, కాపు నేతలు తీవ్రంగా పరిగణించాయి. కేసులోని లోపాలపై అటు పోలీసులు, ఇటు ప్రభుత్వాన్ని వారు నిలదీస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కావడంతో పక్కా పథకం ప్రకారం కేసును నీరుగార్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసులో కాపు నేతలు లేవనెత్తుతున్న ఏ ఒక్క ప్రశ్నకూ పోలీసుల నుంచి సమాధానం రావడం లేదు. ఒత్తిడి తెచ్చిన ఆ నేత ఎవరు..? గుడ్లూరు పోలీసులపై అధికార పార్టీకి చెందిన కీలక నేత ఒత్తిడి చేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. గుడ్లూరు మండల బాధ్యతలు చూస్తున్న సదరు నేత సూచనలకు అనుగుణంగా ఖాకీలు నడుచుకున్నారని, ఇందులో భాగంగానే కేసును నీరుగార్చేందుకు యత్నించారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. చిన్న దొంగతనం కేసులో సైతం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించే వారు.. ఈ దారుణహత్యకు సంబంధించిన కేసులో ఇలా వ్యవహరించకుండా.. కేసు వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. అయితే కాపు సంఘాల ఎంట్రీతో సీన్ రివర్స్ అయింది. ఈ కేసు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా మారడంతో ఖాకీలు పది రోజులుగా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదని, మిగిలిన నిందితులను గుర్తిస్తామంటూ తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. ఏదేమైనా అధికార పార్టీ నేతల మెప్పు కోసం యత్నించి చివరికి ఇరుక్కుపోయామనే భావన పోలీస్ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. ఘటన స్థలంలోనే మృతి చెందిన లక్ష్మీనాయుడు హత్యకు ఉపయోగించిన కారు కాపు యువకుడి హత్య కేసు దర్యాప్తులో గుడ్లూరు ఖాకీల తీరిదీ.. ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న మహిళలు, సహకరించిన వారిని కావాలనే వదిలేశారా..? నిందితుడు హరిచంద్రప్రసాద్, అతని తండ్రిని మాత్రమే అరెస్ట్ చూపించిన వైనం ఇప్పటికీ బహిర్గతం కాని వాస్తవాలు అధికార పార్టీ నేతల ఒత్తిడే కారణమా..? గుడ్లూరు మండలం దారకానిపాడులో జరిగిన కాపు యువకుడు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్యోదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో పోలీసులు వ్యవహరించిన తీరే ఇందుకు కారణమనే వాదన బలంగా వినిపిస్తోంది. అధికార పార్టీ నేతల సూచనలకు అనుగుణంగా పక్కా ప్రణాళిక ప్రకారం కేసును నీరుగార్చే యత్నం జరిగిందనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్న మహిళలను అరెస్ట్ చేయకపోవడం.. నిందితుడికి అన్ని విధాలా సహకరించిన మరికొందర్ని వదిలేయడం ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. అయితే ఖాకీలు మాత్రం ఘటన జరిగిన వెంటనే స్పందించామని, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామని చెప్తూనే, కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలపడం గమనార్హం. - 
      
                   
                               
                   
            హోటల్లో పేకాటపై పోలీసుల సీరియస్
● హెడ్కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు ● కృష్ణసింగ్పై కఠిన చర్యలకు రంగం సిద్ధం?నెల్లూరు(క్రైమ్): నెల్లూరు శోధన్ నగర్లోని యష్పార్క్ హోటల్ గదిలో బుధవారం గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 18 మందిని పోలీసుల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జూదమాడిన వారిలో ఉన్న విడవలూరు హెడ్కానిస్టేబుల్ జీకేఎస్ పుల్లారెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఎస్పీ అజిత గురువారం ఉత్తర్వులు జారీచేశారు. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. కృష్ణసింగ్పై పీడీ యాక్ట్? ఇదిలా ఉండగా పట్టుబడిన వారిలో బెట్టింగ్ డాన్ కృష్ణసింగ్ ఉన్నాడు. అతనిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే కృష్ణసింగ్పై జిల్లాలో పలు కేసులు ఉండగా దర్గామిట్ట పోలీసుస్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉంది. పలుమార్లు పోలీసులు అతడిని అరెస్ట్ చేసినా తీరులో మార్పురాలేదు. చిన్నబజారు పోలీస్స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పేకాటాడుతూ నెలరోజుల వ్యవధిలో రెండుసార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు ఆరాతీశారు. సస్పెక్ట్ షీట్ ఈ స్టేషన్కు ట్రాన్స్ఫర్ కానుంది. త్వరలో అతడిపై పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మేనేజర్పై కేసు జూద నిర్వాహకుడికి సహకరించిన హోటల్ మేనేజర్పై చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. నెల్లూరు నగరానికి చెందిన దేమునాయుడు వ్యసనాలకు బానిసయ్యాడు. వాటిని తీర్చుకునేందుకు సరిపడా నగదు కోసం అతను స్నేహితులతో కలిసి పేకాటాడుతూ ఆర్థికంగా నష్టపోయాడు. ఎలాగైనా నగదు సంపాదించాలని నిర్ణయించుకుని యష్ పార్క్ హోటల్ మేనేజర్ రత్నంతో పరిచయం చేసుకున్నాడు. హోటల్లో పేకాటకు అనుమతిస్తే కమీషన్ కింద రూ.2 వేలు ఇచ్చేలా మేనేజర్తో ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం దేమునాయుడు తన స్నేహితులు, పరిచయస్తులతో హోటల్లో పేకాటాడిస్తున్నాడు. బుధవారం పోలీసులు నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా మేనేజర్ పాత్ర వెలుగులోకి వచ్చింది. దీంతో అతడిని అరెస్ట్ చేశారు. - 
      
                   
                               
                   
            సివిల్ సప్లయ్స్లో బదిలీలు
● నెల్లూరు ఏఎస్ఓగా వాణి నెల్లూరు(పొగతోట): పేదల బియ్యం అక్రమ రవాణాలో కూటమి నేతల మధ్య గొడవలకు అధికారులు బలయ్యారు. పౌరసరఫరాల శాఖకు సంబంధించిన నెల్లూరు ఏఎస్ఓ అంకయ్యను అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు.. కావలి ఏఎస్ఓ రవికుమార్ను అన్నమయ్య జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులను ఆ శాఖ కమిషనర్ గురువారం జారీ చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న వాణిని నెల్లూరు ఏఎస్ఓగా నియమించారు. డీఎస్ఓ విజయ్కుమార్ను మాతృశాఖ రెవెన్యూ కు బదిలీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. సివిల్ సప్లయ్స్ డీఎం అర్జున్రావును ఇన్చార్జి డీఎస్ఓగా నియమించే అవకాశం ఉందని సమాచారం. 10.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు నెల్లూరు(అర్బన్): జిల్లాలోని కొన్ని మండలాల్లో భారీ వర్షాలు గురువారం నమోదయ్యాయి. ఉదయం 8.30 నుంచి సాయంత్రం ఐదులోపు సరాసరి వర్షపాతం 10.2 మిల్లీమీటర్లుగా నమోదైంది. పొదలకూరు మండలంలో అత్యధికంగా 66.8.. అనుమసముద్రంపేటలో అత్యల్పంగా ఒక మిల్లీమీటర్ వర్షం కురిసింది. బోగోలులో 58.4, బుచ్చిరెడ్డిపాళెంలో 40.2, చేజర్లలో 37.4, కావలిలో 29.2, కలువాయిలో 25, ఆత్మకూరులో 22.2, అల్లూరులో 15.6, వింజమూరులో 15.2, సైదాపురంలో 14.2, దగదర్తిలో 13.6, కందుకూరులో 8, కొడవలూరులో 7.4, వరికుంటపాడులో 6.2, దుత్తలూరులో 4.8, జలదంకి, సంగంలో 4.4, మర్రిపాడులో 4, ఉలవపాడులో 3.6, అనంతసాగరంలో 2.2, ఉదయగిరిలో 1.8, నెల్లూరు రూరల్, విడవలూరులో 1.2 మిల్లీమీటర్ల వర్షం పడింది. నేటి నుంచి యథావిధిగా విద్యాసంస్థలు నెల్లూరు రూరల్: జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, అంగన్వాడీ పాఠశాలలు శుక్రవారం నుంచి యథావిధిగా పనిచేయనున్నాయని కలెక్టర్ హిమాన్షు శుక్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విషయాన్ని గమనించాలని కోరారు. పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం నెల్లూరు (టౌన్): పల్లిపాడులోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థలో ఉపన్యాసకుల పోస్టులకు డిప్యుటేషన్పై పనిచేసేందుకు ఐదేళ్ల అనుభవం కలిగిన స్కూల్ అసిస్టెంట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని డీఈఓ బాలాజీరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సీనియర్ లెక్చరర్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ – 1.. లెక్చరర్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్.. 1, లెక్చరర్ ఇన్ తెలుగు.. 1, లెక్చరర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్.. 1.. లెక్చరర్ ఇన్ ఫైన్ ఆర్ట్స్ – 1.. లెక్చరర్ ఇన్ ఇంగ్లిష్ – 1, సీనియర్ లెక్చరర్ ఇన్ ఈవీఎస్ – 1, లెక్చరర్ ఇన్ సోషల్ స్టడీస్ – 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. నోటిఫికేషన్లో పొందుపర్చిన గూగుల్ ఫారం ద్వారా ఆన్లైన్లో ఈ నెల 29లోపు సమర్పించాలని కోరారు. ఆఫ్లైన్ అప్లికేషన్లను పల్లిపాడు డైట్ కళాశాల ప్రిన్సిపల్కు అందజేయాలని కోరారు. లిఖిత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఉపన్యాసకులను ఎంపిక చేయనున్నామని, వివరాలకు 94404 58428 నంబర్ను సంప్రదించాలని సూచించారు. - 
      
                   
                               
                   
            డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ధర్నా
నెల్లూరు(అర్బన్): ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న డాక్టర్ల సమస్యల ను పరిష్కరించేంత వర కు పోరాటం ఆగదని ఏపీ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్ల సంఘ జిల్లా అధ్యక్షుడు అమరేంద్రనాథ్రెడ్డి స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లాలోని పీహెచ్సీల్లో వైద్యసేవలను ఆపేసి వైద్యులు చేపట్టిన సమ్మె గురువారంతో 19వ రోజుకు చేరుకుంది. నగరంలోని డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. 20 నుంచి 25 ఏళ్లుగా ఎలాంటి ఉద్యోగోన్నతుల్లేకుండా ఒకే హోదాలో పనిచేస్తున్న డాక్టర్లకు టైమ్బౌండ్ ప్రమోషన్లను ఇవ్వాలని కోరారు. ఇన్ సర్వీస్ పీజీ కోటా పునరుద్ధరణ.. నోషనల్ ఇంక్రిమెంట్ల మంజూరు.. గిరిజన ప్రాంతాల్లో సేవలందిస్తున్న వైద్యులకు 50 శాతం మూలవేతనాన్ని గిరిజన భత్యంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు రవీంద్రరెడ్డి, టాగూర్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            కార్తీక మాసంలో ప్రత్యేక బస్సుల ఏర్పాటు
నెల్లూరు సిటీ: కార్తీక మాసం సందర్భంగా దైవక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. నెల్లూరులోని ప్రధాన బస్టాండ్లో గురువారం అధికారులు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్–1 జి.వెంకటేశ్వర్లు మాట్లాడారు. ఈ ప్యాకేజీలో సూపర్ లగ్జరీ బస్సులను వినియోగిస్తున్నట్లు తెలిపారు. యాగంటి, మహానంది, శ్రీశైలంకు ప్రధాన బస్టాండ్ నుంచి ఈనెల 25, 26, నవంబర్ 1, 2, 4, 7, 8, 9, 15, 16 తేదీల్లో రాత్రి 8 గంటలకు బస్సు బయలుదేరుతుందన్నారు. టికెట్ ధర రూ.1,800 అని చెప్పారు. అరుణాచలానికి ఆయా తేదీల్లో రాత్రి 9:30 గంటలు బస్సు ప్రారంభవుతుందన్నారు. టికెట్ ధర రూ.1,200గా నిర్ణయించారన్నారు. అమరావతిలోని అమరారామం, భీమవరంలోని సోమేశ్వరరామం, పాలకొల్లులోని క్షీరారామం, ద్రాక్షారామంలోని భీమేశ్వరారామం, సామర్లకోటలోని కొమరారామం ప్రాంతాలకు ఆయా తేదీల్లో రాత్రి 9 గంటలకు బస్సు బయలుదేరుతుందున్నారు. ధర రూ.2,500 అని చెప్పారు. శ్రీశైలం దర్శనానికి ఈనెల 22వ తేదీ నుంచి నవంబర్ 18వ తేదీ వరకు రోజు రాత్రి 8:30 నిమిషాలకు లగ్జరీ బస్సు నడుతున్నట్లు తెలిపారు. టికెట్ ధర రూ.670 అన్నారు. వివరాలకు 99592 25653, 0861 – 2323333, 94921 92238, 99592 25641 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు. - 
      
                   
                               
                   
            వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ల ఆవిష్కరణ
నెల్లూరు(స్టోన్హౌస్పేట): మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 28న చేపట్టనున్న ప్రజా ఉద్యమం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను పార్టీ నేతలు గురువారం ఆవిష్కరించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు సీఎం చంద్రబాబు అప్పనంగా కట్టబెట్టడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రైవేట్కు అప్పగిస్తున్నామంటూ వాటిని మంత్రులు, ఎమ్మెల్యేలకు కారు చౌకగా విక్రయిస్తున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేశానని చెప్పుకొనే చంద్రబాబు.. రాష్ట్రానికి ఇప్పటివరకు ఒక్క మెడికల్ కళాశాలనూ తీసుకురాలేకపోయారని విమర్శించారు. పది మెడికల్ కళాశాలలను పూర్తి చేయాలంటే రూ.4800 కోట్ల ఖర్చవుతుందని.. రూ.మూడు లక్షల కోట్ల బడ్జెట్ గల రాష్ట్రంలో ప్రజారోగ్యానికి ఈ మొత్తాన్ని ఖర్చు చేయలేరానని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గానికి 60 వేల సంతకాలను సేకరించాలని ఆయన ఆదేశిస్తే.. లక్ష సంతకాలను చేపట్టే దిశగా కార్యక్రమాన్ని చేపడుతున్నామని వివరించారు. ప్రతి నియోజకవర్గంలో తమ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలను ఈ నెల 28న చేపట్టి తహసీల్దార్, ఆర్డీఓ, డీఆర్వో కార్యాలయాల్లో అధికారులకు వినతిపత్రాలను అందజేయనున్నామని ప్రకటించారు. నిరసనలను ఉధృతం చేయాలి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలను మరింత ఉధృతం చేయనున్నామని పార్టీ రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత పేర్కొన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నా, పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం ముందుకెళ్లడం దారుణమన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు వైద్య విద్యనందించాలనే లక్ష్యంతో 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు జగనన్న సంకల్పించారని వివరించారు. అయితే కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, తమ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ధ్వజమెత్తారు. తాము చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ఊహించని మద్దతు లభిస్తోందని వివరించారు. ప్రజా ఉద్యమం ర్యాలీకి భారీగా తరలిరావాలని కోరారు. చంద్రబాబు నిర్ణయాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఎమ్మెల్సీ, పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్ పేర్కొన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. అనంతరం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్రెడ్డి మాట్లాడారు. ప్రజల అభిప్రాయాలు గవర్నర్కు తెలియజేసేలా, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ పేరుతో జరుగుతున్న దోపిడీని అడ్డుకునేలా ఒక ఉద్యమంతో సంతకాల సేకరణను చేపట్టామని వివరించారు. - 
      
                   
                               
                   
            పొంగుతున్న వాగులు
● వర్షాలు తగ్గుముఖం నెల్లూరు(అర్బన్): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వాయువ్య దిశగా పయనిస్తుండటంతో జిల్లాపై ఉన్న తీవ్ర ప్రభావం తగ్గింది. జిల్లాలో బుధవారం సాయంత్రం నుంచి వర్షాలు దాదాపుగా ఆగిపోయాయి. అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. అయితే గురువారం సాయంత్రం నుంచి పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు ప్రారంభమయ్యాయి. బొగ్గేరు, సంగం వద్ద ఉన్న బీరాపేరు పొంగి ప్రవహిస్తున్నాయి. సోమశిల నుంచి విడుదల చేసిన నీటితో పాటు స్థానికంగా కురిసిన వర్షాలతో పెన్నాలో ప్రవాహం పెరిగింది. పలుచోట్ల చెరువులు నిండి కలుజులు ప్రవహిస్తున్నాయి. అనంతసాగరం, చేజర్ల, కందుకూరు తదితర ప్రాంతాల్లో కోతకొచ్చిన వరి పంట నీటిలో నానుతోంది. చిప్పలేరు, పిల్లాపేరు, మిడత వాగు, పైడేరు, పంబలేరు, కొమ్మలేరు, చేజర్ల నల్లవాగు తదితర ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తోంది. లింగసముద్రం మండలంలోని రాళ్లపాడు ప్రాజెక్ట్కు వరదనీరు పెద్ద ఎత్తున చేరుతోంది. పలు ప్రాంతాల్లోని లోతట్టు కాలనీలు నీటిలో నానుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వర్షాలు తగ్గుముఖం పట్టినా ముప్పు ఇంకా తొలగలేదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా కోరారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపిందన్నారు. అత్యవసరమైతే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 0861 – 2331261, 79955 76699 నంబర్లను 24 గంటల పాటు ఎప్పుడైనా సంప్రదించి సాయం పొందవచ్చని తెలిపారు. - 
      
                   
                               
                   
            అమ్మకు కన్నీటి వీడ్కోలు
● గుండెపోటుతో మృతిచెందిన తల్లి ● అంత్యక్రియలు చేసిన కుమార్తె సంగం: రాత్రి తల్లీకూతురు భోజనం చేసి నిద్రపోయారు. ఉదయానికి తల్లి మృతిచెందింది. తనను అల్లారుముద్దుగా చూసుకుంటున్న అమ్మ చనిపోవడంతో కుమార్తె కన్నీరుమున్నీరుగా రోదిస్తూ అంత్యక్రియలు చేసింది. స్థానికుల కథనం మేరకు.. మండల కేంద్రమైన సంగం నిమ్మతోపు సెంటర్కు చెందిన పెరుమాళ్ల గోపీ, ఆదిలక్ష్మి (45) దంపతులకు వెన్నెల, భార్గవి అనే ఇద్దరు కుమార్తెలున్నారు. కొన్నేళ్ల క్రితం కరోనాతో గోపీ మృతిచెందాడు. ఆదిలక్ష్మి కూలీ పనులకు వెళ్తూ పిల్లలను చూసుకుంంది. రెండు సంవత్సరాల క్రితం పెద్ద కుమార్తె వెన్నెలకు వివాహం చేసింది. కొంతకాలం క్రితం గేదెలు కొనుగోలు చేసి పాలు పోస్తోంది. భార్గవి తల్లి వద్ద ఉంటూ 9వ తరగతి చదువుతోంది. మంగళవారం రాత్రి తల్లీకుమార్తె ఇంట్లో నిద్రపోయారు. బుధవారం ఉదయం భార్గవి ఆదిలక్ష్మిని నిద్ర లేపేందుకు ప్రయత్నించింది. అయితే ఆమె చనిపోయింది. ఈ విషయాన్ని అక్క, బావ వినోద్కు చెప్పింది. బాలిక తల్లికి అంత్యక్రియలు నిర్వహించింది. ఆదిలక్ష్మి గుండెపోటుతో చనిపోయి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు. - 
      
                   
                               
                   
            మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేయొద్దు
● ఉదయగిరి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి ఉదయగిరి: ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేయొద్దు. అలా జరిగితే పేద రోగులకు వైద్యం అందదు’ అని వైఎస్సార్సీపీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్రెడ్డి అన్నారు. మర్రిపాడు మండలం బ్రహ్మణపల్లిలోని తన నివాసంలో బుధవారం కోటి సంతకాల సేకరణ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టించలేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో కరోనా వంటి విపత్తు ఎదుర్కొని 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేయించి పనులు ప్రారంభించారు. నేటి ప్రభుత్వ పెద్దలు కాలేజీలను ప్రైవేటీకరించి ఆస్తులను తమ అనుచరులకు అప్పనంగా దోచి పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని విరమించుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలతోపాటు ఉద్యోగులను కూడా మోసం చేసిందన్నారు. ఒక డీఏ ఇస్తున్నట్లు ప్రకటించి, దానికి కూడా సవాలక్ష షరతులు పెట్టారన్నారు. పాత బకాయిలు, పీఆర్సీ విషయం మాట్లాడొద్దని చెప్పడం చూస్తే ఉద్యోగులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తేటతెల్లమవుతుందన్నారు. కార్యక్రమంలో పలు మండలాల కన్వీనర్లు రేవునూరి శ్రీనివాసరెడ్డి, కాటం రవీంద్రరెడ్డి, ఎం.తిరుపతినాయుడు, ఇస్కా మదన్, కొండా రాజగోపాల్రెడ్డి, చిమ్మిలి రవీంద్ర, మాజీ ఏఎంసీ చైర్మన్ షేక్ అలీ అహ్మద్, మాగంటి సిద్ధయ్య, మల్లికార్జునరెడ్డి, ముడియాల మరళీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            వెంగమాంబ ఆలయాభివృద్ధికి చర్యలు
● మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దుత్తలూరు: నర్రవాడలోని వెంగమాంబ ఆలయాన్ని మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. బుధవారం ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్తో కలిసి ఆయన వెంగమాంబ పేరంటాలు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం దేవదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయ ప్రాంగణం, శాశ్వత కట్టడాలు తదితర నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లను పరిశీలించారు. ఇంజినీర్లు, స్థపతులు వీటిని నిర్మాణాలకు రూ.10 కోట్ల అంచనా వేసినట్లు ఆయన వివరించారు. రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారులు ఆలయ పరిసరాల్లోని స్థలాలను సర్వే చేసి నివేదిక అందించాలన్నారు. కార్యక్రమంలో నేతలు కంభం విజయరామిరెడ్డి, చెంచలబాబు యాదవ్, దేవదాయ శాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ అజాద్, అసిస్టెంట్ కమిషనర్ జనార్దనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            హౌసింగ్ సామగ్రి అప్పగింత
ఉదయగిరి: పట్టణంలోని హౌసింగ్ గోదాము షట్టర్ తాళాలను అధికారుల సమక్షంలో పగలగొట్టి సిమెంట్, స్టీలు తదితర సామగ్రిని బుధవారం ఇన్చార్జి ఏఈ షరీఫ్కు అప్పగించినట్లు ఇన్చార్జి డీఈఈ పీరాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏఈ రామకృష్ణను ఇటీవల సస్పెండ్ చేశారన్నారు. ఆయన చార్జ్ అప్పగించలేదన్నారు. దీంతో రెవెన్యూ, పోలీసు, పంచాయతీ శాఖల అధికారులు, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో తాళాలు పగలగొట్టడం జరిగిందన్నారు. 10 బస్తాల సిమెంట్, 14 బాక్సుల ఫ్యాన్లు, 2,566 గడ్డ కట్టిన సిమెంట్ బస్తాలు, 10 ఎంఎం 597, 8 ఎంఎం 883 ఇనుప చువ్వలను ఇన్చార్జి ఏఈకి అప్పగించామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ కరిముల్లా, వీఆర్వో మాలకొండయ్య, వర్క్ ఇన్స్పెక్టర్ హర్షవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            జొన్నవాడలో అనధికార వసూళ్లు
● పట్టించుకోని అధికారులు బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలోని జొన్నవాడ కామాక్షితాయి ఆలయం వద్దకు వాహనాలు వెళ్లాలంటే గ్రామ పంచాయతీకి రుసుము చెల్లించాలి. కారుకు రూ.50, ఆటోకు రూ.20, లారీకి రూ.100 ఇలా వసూలు చేస్తున్నారు. అయితే రసీదుపై పంచాయతీ సిబ్బంది సంతకం, కార్యాలయ అధికార ముద్ర ఉండదు. వాహనాల నంబర్ కూడా నమోదు చేయడం లేదు. పార్కింగ్ ఎక్కడో చూపించరు. సమాధానం చెప్పేవారు కరువయ్యారు. రసీదుపై మీ వాహనాలకు, వస్తువులకు మేము జవాబుదారీతనం కాదు, మాకు ఎలాంటి సంబంధం ఉండదు, కాంట్రాక్టర్ అని ఉంటుంది. ఆ కాంట్రాక్టర్ ఎవరు?, ఫోన్ నంబర్ వివరాలేవీ ఉండవు. భక్తుల నుంచి కేవలం నగదు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. - 
      
                   
                               
                   
            స్వగ్రామానికి వెళ్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి, కుమారుడికి గాయాలు మనుబోలు: తల్లీకుమారుడు బైక్పై స్వగ్రామానికి వెళ్తున్నారు. రోడ్డు ప్రమాదంలో తల్లి మరణించగా కొడుకు గాయపడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని కాగితాలపూరు క్రాస్రోడ్డు వద్ద బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కాగితాలపూరు గ్రామంలో కొండూరు వెంకటేశ్వర్లు, సుప్రజ (40) దంపతులు నివాసముంటున్నారు. వీరికి రాకేష్ అనే కుమారుడున్నాడు. సుప్రజ తన అమ్మ ఊరైన గొట్లపాళేనికి రాకేష్తో బైక్పై వెళ్లింది. తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. క్రాస్రోడ్డు వద్ద హైవే దాటుతుండగా గుర్తుతెలియని వాహనం బైక్ను ఢీకొనడంతో సుప్రజ అక్కడికక్కడే మృతిచెందింది. రాకేష్కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో నెల్లూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. - 
      
                   
                               
                   
            ముంచెత్తిన వాన
పెన్నానదిలో వరద నీరు జిల్లాను వాన వీడలేదు. బుధవారం కూడా ముంచెత్తింది. దీంతో జనజీవనం స్తంభించింది. మండలాల్లోని పలు గ్రామాల్లో చెరువులు నిండాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. అసలే అధ్వానంగా ఉన్న రోడ్లపై వర్షపునీరు నిలిచి దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. అనేక ప్రాంతాల్లో రహదారులు ఛిద్రమయ్యాయి. పంట పొలాలు ముంపునకు గురై చెరువులను తలపిస్తున్నాయి. ఎడతెరపిలేని వర్షంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. – సాక్షి నెట్వర్క్ - 
      
                   
                               
                   
            జలాశయాన్ని పరిశీలించిన ఎస్ఈ, తహసీల్దార్
సోమశిల: సోమశిల జలాశయాన్ని ఎస్ఈ వెంకటరమణారెడ్డి, తహసీల్దార్ జయవర్ధన్ బుధవారం పరిశీలించారు. కండలేరు పూర్తి సామర్థ్యానికి చేరుకోనున్న నేపథ్యంలో కండలేరు వరద కాలువకు నీటి విడుదల నిలుపుదల చేసేందుకు ఎస్ఈ జలాశయానికి వచ్చారు. అనంతరం ప్రాజెక్ట్ క్రస్ట్గేట్లను పరిశీలించారు. ఎగువ నుంచి వస్తున్న వరదపై ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. తహసీల్దారు మాట్లాడుతూ పైతట్టు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల దృష్ట్యా జలాశయానికి వరద వచ్చే అవకాశం ఉన్నందున పెన్నా పరీవాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. - 
      
                   
                               
                   
            క్షణక్షణం టెన్షన్
పొదలకూరు : కండలేరు జలాశయం పూర్తి సామర్థ్యానికి చేరువుగా నీటి నిల్వలు ఉండడంతో అటు అధికారులు, ఇటు దిగువ ప్రాంత గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. జలాశయం రాపూరు మండలంలో ఉన్నా.. స్పిల్వే చేజర్ల మండలంలో ఉంది. జలాశయం ప్రమాదకర స్థాయికి చేరుకుంటే స్పిల్వే నుంచి నీటిని విడుదల చేస్తే పొదలకూరు మండలంలోని పర్వతాపురం, అంకుపల్లి, ఊసపల్లి, వావింటపర్తి గ్రామాల మీదుగా నీటి ఉధృతి కండలేరు ఏటికాలువలో కలిసి సముద్రానికి వెళతాయి. తాజాగా పరిణామాల్లో తెలుగుగంగ అధికారులు స్పిల్వే ద్వారా నీటిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సోమశిల నుంచి వరద ద్వారా కండలేరుకు నీరు విడుదల ఆగకుండా వస్తూనే ఉన్నందున కండలేరులో నీటి నిల్వలు ప్రమాదక స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. అటవీ అనుమతులు లేక ఆగిన కాలువ పనులు స్పిల్వే కాలువ 1.5 కి.మీ. నుంచి పనులు నిలిచిపోయాయి. ఇక్కడ అటవీ భూములు ఉండడంతో కాలువ పనులను చేయనీయకుండా సంబంధిత అధికారులు నిలిపివేశారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైతే ముందుగా అటవీ భూముల్లో అధికారులు కాలువను తవ్వించారు. తర్వాత అటవీశాఖ అధికారులు అనుమతులు లేవని కాలువను పూడ్పించారు. ఈ క్రమంలో స్పిల్వే నుంచి వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తే కాలువ లేకుండా నీరు ఎలా వెళుతుందనే ఆందోళన గ్రామస్తుల్లో నెలకొంది. అయితే అటవీభూముల్లో తాత్కాలికంగా కాలువను తవ్వించి అవసరమైతే నీటిని విడుదల చేసేందుకు ఇంజినీరింగ్ అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సాధ్యాసాధ్యాలను బుధవారం పరిశీలించినట్లు సమాచారం. గ్రామాల్లో దండోరా నీటిని విడుదల చేస్తే మండలంలోని పర్వతాపురం, అంకుపల్లి, ఊసపల్లి, వావింటపర్తి గ్రామాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో బుధవారం రెవెన్యూ అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని దండోరా వేయించారు. స్పిల్వే మీదుగా కండలేరు వరద నీటిని విడుదల చేస్తే దిగువ గ్రామాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పశువులను వాగుల వెంట వదిలి వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. అవసరమైతే గ్రామస్తులను తరలించాల్సి వస్తుందని కూడా రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. గతంలో 50 టీఎంసీల పైబడి నీటి నిల్వలు ఉంటేనే కండలేరు మట్టికట్ట 5.50 కి.మీ వద్ద కట్ట మట్టి ఊడి కింద పడింది. దీంతో కట్టకు ప్రమాదం వాటిల్లిందని ప్రచారం జరిగి పొదలకూరు మండలం ఇనుకుర్తి, ముదిగేడు, డేగపూడి గ్రామస్తులు పొదలకూరు జెడ్పీ హైస్కూల్కు వచ్చి తలదాచుకున్నారు. తర్వాత అధికారులు ధైర్యం చెప్పడంతో ఊర్లకు వెళ్లారు. మట్టికట్ట ఊడిపడిన ప్రాంతంలో అధికారులు రివిట్మెంట్ చేపట్టి పటిష్టం చేశారు. స్పిల్ వే వెనుక వైపు ఉన్న కండలేరు నీరు జిల్లాలోని మరో జలనిధి కండలేరు నిండుకుండగా ఉంది. కొన్ని రోజులుగా సోమశిల నుంచి వరద కాలువ ద్వారా కండలేరుకు నీటి విడుదల చేస్తున్నారు. 68 టీఎంసీల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం కలిగిన జలాశయం బుధవారానికి దాదాపు 60 టీఎంసీలకు చేరింది. అయితే సోమశిల నుంచి కండలేరుకు వరద జలాలు ఆపకపోవడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. సాంకేతిక సమస్య కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జలాశయం క్యాచ్మెంట్ ఏరియాతోపాటు ఎగువ ప్రాంతాల్లో కురిసే వర్షాలకు వరద పెరిగే అవకాశం ఉండడంతో ప్రాజెక్ట్ భద్రత నేపథ్యంలో నీటిని దిగువకు విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో దిగువ గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కండలేరులో 60 టీఎంసీలు దాటిన నీటి నిల్వ సోమశిల నుంచి కొనసాగుతున్న ఇన్ఫ్లో స్పిల్వే ద్వారా నీటి విడుదలకు సన్నాహాలు భయాందోళనలో దిగువ గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని గ్రామాల్లో దండోరా అటవీ అనుమతులు లేక పూర్తికాని స్పిల్వే కాలువ పనులు దండోరా వేయించాం తెలుగుగంగ అధికారుల సూచన మేరకు వారితో చర్చించి స్పిల్వే దిగువ గ్రామాల్లో దండోరా వేయించాం. స్పిల్వే గుండా నీటిని విడుదల చేసే పరిస్థితి తలెత్తదని ఇంజినీరింగ్ అధికారులు వెల్లడించారు. అవసరమైతే ముందస్తుగా గ్రామస్తులను తరలించాల్సి ఉంటుంది. ఈ మేరకు గ్రామస్తులను అప్రమత్తం చేయడం జరిగింది. – బి.శివకృష్ణయ్య, తహసీల్దార్, పొదలకూరు - 
      
                   
                               
                   
            అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
వర్షాలపై కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం ఆర్డీఓలు, రెవెన్యూ, స్పెషల్ ఆఫీసర్లతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాయుగుండం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులెవరూ సెలవులు పెట్టేందుకు వీలులేదని ఆదేశించారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తమ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు, వాగులు వంకలు పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 0861–2331261, 79955 76699 నంబర్లకు ప్రజలు అత్యవసరం పరిస్థితుల్లో సమాచారాన్ని అందించాలని కోరారు. - 
      
                   
                               
                   
            జిల్లా అంతటా భారీ వర్షాలు
ఈశాన్య రుతుపవనాలకు తోడు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా జడివాన కురుస్తోంది. వారం రోజులుగా ముసురు వీడలేదు. బుధవారం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదైంది. పలు లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొర్లుతుండటంతో కొన్ని గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అల్పపీడన ప్రభావంతో సముద్రం కసురుమీద ఉంది. ఎగసిపడుతున్న అలలతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. నెల్లూరు (అర్బన్): వాయుగుండం ప్రభావంగా జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు నగరంతోపాటు గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పటికే చెరువులు దాదాపుగా నిండాయి. మర్రిపాడు, ఆత్మకూరు మండలాల్లో ప్రవహించే బొగ్గేరులో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది. వరికుంటపాడు, దుత్తలూరు మండలాల పరిధిలో ఉండే పిల్లాపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పొదలకూరు మండలంలోని నావూరు వద్ద పెద్దవాగు పొంగడంతో రాకపోకలకు అంతరాయమేర్పడింది. కొండాపురంలో మిడతవాగు, ఉలవపాడు మండలంలో ఉప్పుటేరు , అనంతరసాగరం మండలంలోని కొమ్మలేరు, మనుబోలు–గూడూరు మధ్య ఉండే పంబలేరు, చేజర్ల మండలంలోని నల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మనుబోలు కండలేరు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. సంగం వద్ద ఉండే బీరాపేరుకు వరద పెరిగింది. సైదాపురం మండలంలోని వాగులు పొంగుతున్నాయి. అక్కడి కై వల్యానది వర్షపు నీటితో పోటెత్తుతోంది. బుచ్చిరెడ్డిపాళెం నుంచి వెళ్లే మలిదేవి డ్రెయిన్, పైడేరుకు ప్రవాహం పెరిగింది. పలుచోట్ల చెరువులు కలుజులు పారుతున్నాయి. లింగసముద్రం మండలంలోని రాళ్లపాడు ప్రాజెక్ట్కు భారీగా వరదనీరు చేరుతోంది. సోమశిల–ఆత్మకూరు మధ్య రాకపోకలు బంద్ అనంతసాగరం మండలంలోని కొమ్మలేరు, కేతామన్నేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ముత్తుకూరు వద్ద కొమ్మలేరు వాగుపై ఉన్న వంతెన స్వల్పంగా కుంగింది. రేవూరు వద్ద వంక, కమ్మవారిపల్లి వద్ద అలుగు పొంగి పొర్లుతున్న కారణంగా ఆత్మకూరు– సోమశిల– అనంతసాగరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెన్నానదికి పెరిగిన ప్రవాహం పెన్నానదిలో సోమశిల నుంచి విడుదల చేసే వరద జలాలతోపాటు, పెన్నా పరీవాహక ప్రాంతాల్లోని వాగుల నుంచి వచ్చే వరదతో కలిసి సుమారు 80 వేల క్యూసెక్కులకు పైగా నీరు ప్రవహిస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద పెరగడంతో ఏక్షణంలోనైనా పెన్నానదిలోకి లక్షల క్యూసెక్కుల నీటిని అదనంగా విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సుమారు 30 గ్రామాల ప్రజలు ఏక్షణంలోనైనా వరద తమ గ్రామాలపైకి వస్తుందోనని వణికి పోతున్నారు. సంగం బ్యారేజీ వద్ద బుధవారం సాయంత్రానికి సోమశిల ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీటితోపాటు వర్షాల వల్ల తోడైన వరదనీరు కలిసి 70 వేల క్యూసెక్కులకు చేరింది. దీంతో సంగం బ్యారేజీ వద్ద ఉన్న 79 గేట్లను ఒక్కసారిగా అధికారులు ఎత్తేసి నీటిని నదిలోకి విడుదల చేశారు. ఫలితంగా పెన్నానది పరవళ్లు తొక్కుగా నెల్లూరు వైపు ప్రవాహం పరుగెడుతోంది. లోతట్టు ప్రాంతాలైన తూర్పు కంభంపాడు, అప్పారావుపాళెం, వీర్లగుడిపాడు, కోలగట్ల, నెల్లూరు నగరంలోని ఆర్టీసీ కాలని, శివగిరికాలనీ, జనార్దన్రెడ్డినగర్, రాజీవ్ గృహకల్ప, కొత్తూరులోని శ్రీలంకకాలని, మనుమసిద్దినగర్, జయలలిత నగర్ తదితర అనేక ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 2,500 ఎకరాల్లో నీటమునిగిన పంటలు అనంతసాగరంలో 1500 ఎకరాలు, చేజర్ల మండలం కాకివాయిలో 100 ఎకరాల్లో వరి, కందుకూరు, కలువాయిలో కోతకొచ్చిన వరి పంట నీటమునిగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో మిర్చి, కూరగాయలు తదితర వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లింది. ప్రాథమికంగా 2,500 ఎకరాల్లో పంట నష్టపోయినట్టు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అయితే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నష్టం మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ముందుకు చొచ్చుకొచ్చిన సముద్రం వాయుగుండం ప్రభావంతో కొత్తకోడూరు, మైపాడు బీచ్తోపాటు రామతీర్థం, రామాయపట్నం తదితర ప్రాంతాల్లో సముద్రం సుమారు 6 మీటర్ల వరకు ముందుకు వచ్చింది. తీరం వెంబడి అలలు ఎగసి పడుతుండడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. దీంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. రామాయపట్నంలో తీరం కోత కొట్టుకుపోయిన డైవర్షన్ రోడ్డు పొంగుతున్న వాగులు, వంకలు రాకపోకలకు అంతరాయం చెరువులను తలపిస్తున్న లోతట్టు ప్రాంతాలు ముందుకొచ్చిన సముద్రం నేడూ విద్యా సంస్థలకు సెలవు కృష్ణపట్నంలో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక ముత్తుకూరు (పొదలకూరు) : అల్పపీడనం ద్రోణి నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టులో బుధవారం సాయంత్రం 3వ నంబరు ప్రమాద హెచ్చరికను అధికారులు ఎగుర వేశారు. జాలర్లు వేటకు వెళ్లరాదని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు, ఆక్వా రైతులు జాగ్రత్తగా ఉండాలి నెల్లూరు (పొగతోట): బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం నేపథ్యంలో భారీ వర్షాల కారణంగా మత్స్యకారులు, ఆక్వా రైతులు జాగ్రత్తగా ఉండాలని మత్స్యశాఖ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సముద్రంలో అలల తీవ్రత అధికంగా ఉందని, మత్స్యకారులు తమ వలలు, తెప్పలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పెద్దబోట్లను కృష్ణపట్నం, జువ్వలదిన్నె హార్బర్లల్లో నిలుపుదల చేయాలన్నారు. ఎప్పటికప్పుడు సాగర మిత్రలు, గ్రామ మత్స్యకారుల సహాయకులు, రెవెన్యూ, మైరెన్ పోలీసుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. ఆక్వా రైతులు భారీ వర్షాలకు గుంతలో నీటి మట్టం పెరిగి కట్టలు తెగకుండా నీరు పొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కువ సాంద్రత ఉంటే చేపలు, రొయ్యల సంఖ్య తగ్గించాలన్నారు. వాతావరణం ప్రభావంగా ఆకలి మందగిస్తుందని అనుగుణంగా దాణా తగ్గించాలన్నారు. రొయ్యల చెరువులో డీఓ సమస్య రాకుండా ఏయిరేటర్లు వాడాలన్నారు. రాపూరు: మండలంలోని పంగిలి గ్రామానికి వెళ్లే మార్గంలో కొండేరువాగుపై బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మట్టితో డైవర్షన్ రోడ్డు నిర్మించారు. బుధవారం కొండేరు ఉధృతంగా ప్రవహించడంతో ఈ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని సిద్ధేశ్వరకోన, పెంచలకోనలోని జలపాతం వద్దకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. అక్కడ సిబ్బందిని ఉంచినట్లు రేంజర్ మాల్యాద్రి తెలిపారు.నేడూ పాఠశాలలు, కళాశాలలకు సెలవు నెల్లూరు (టౌన్): జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశాలతో గురువారం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు ఆర్ఐఓ వరప్రసాద్రావు, డీఈఓ ఆర్.బాలాజీరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఆయా మండలాల్లోని డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు పాఠశాలల హెడ్మాస్టర్లకు సమాచారం పంపాలన్నారు. అత్యధికంగా లింగసముద్రంలో 179.2 మి.మీ. అత్యల్పంగా కావలిలో 50.8 మి.మీ. జిల్లాలో మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు భారీ వర్షపాతం నమోదైంది. లింగసముద్రం మండలంలో అత్యధికంగా 179.2 మి.మీ. వర్షం కురిసింది. ఆత్మకూరు 169.8, అనంతసాగరం 149.8, రాపూరు 147.6, దుత్తలూరు 134.8, గుడ్లూరు 133.6, మర్రిపాడు 133.6, కందుకూరు 132.4, సైదాపురం 130.4, ఉలవపాడులో 126.4, కొండాపురం 116.2, అనుమసముద్రంపేట 111, సంగం 105.4, కలువాయి 105, వింజమూరు 104.4, మనుబోలు 99.6, చేజర్ల 99, వరికుంటపాడు 98.6, ఉదయగిరి 97.4, వెంకటాచలం 94.2, పొదలకూరు 92.8, నెల్లూరు అర్బన్ 92.6, జలదంకి 90.4, నెల్లూరు రూరల్ 80.6, ముత్తుకూరు 79, కోవూరు 78.8, దగదర్తి 76.4, వలేటివారిపాళెం 75.8, కొడవలూరు 74.4, బుచ్చిరెడ్డిపాళెం 73.8, కలిగిరి 61.8, సీతారామపురం 59.8, విడవలూరు 59.6, ఇందుకూరుపేట 57.4, బోగోలు 57.4, అల్లూరు 54.6, తోటపల్లిగూడూరు 51, కావలి 50.8 మి.మీ. మేర వర్షపాతం నమోదైంది. - 
      
                   
                               
                   
            ఆర్టీసీ బస్సు బోల్తా
జలదంకి(కలిగిరి): మండలంలోని 9వ మైలు సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కావలి ఆర్టీసీ బస్టాండ్ నుంచి చామదలకు బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. 9వ మైలు సమీపంలో ఒక్కసారిగా ఎదురుగా లారీ రావడంతో బస్సును డ్రైవర్ పక్కకి తిప్పాడు. దీంతో అదుపుతప్పి పొలాల్లో బోల్తా పడింది. ఈ సమయంలో బస్సులో తక్కువ మంది ప్రయాణికులున్నారు. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న జలదంకి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. - 
      
                   
                               
                   
            అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(క్రైమ్): ‘ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజా భద్రతా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి. అమరుల కుటుంబాలకు యావత్ భారతదేశం తోడుగా ఉంది’ అని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. నెల్లూరు పోలీసు కవాతు మైదానంలో మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది దేశవ్యాప్తంగా 191 మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పి ంచారని, వారి త్యాగాలు మరువలేనివన్నారు. ఎస్పీ అజిత మాట్లాడుతూ దేశ రక్షణ విధుల్లో అమరులైన పోలీసులకు ఘన నివాళులర్పిస్తున్నామన్నారు. జిల్లాలో ఈ ఏడాది పదిమంది మృతిచెందారని వారి కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. తొలుత కలెక్టర్, ఎస్పీ, ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, పోలీసు అధికారులు, పోలీసు అధికారుల సంఘ నాయకులు తదితరులు అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్ఛాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు. పోలీసు సిబ్బంది స్మృతి పరేడ్ను నిర్వహించారు. అమరవీరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్, హ్యుమానిటీ కార్పస్ ఫండ్ చెక్కులు, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం పోలీసు కవాతు మైదానం నుంచి కేవీఆర్ పెట్రోల్ బంకు వరకు అమరవీరుల సంస్మరణ ర్యాలీ జరిగింది. కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            కార్మికులతో సహపంక్తి భోజనం
నెల్లూరు(బృందావనం): చిన్నబజార్లోని సవరాల వీధిలో పారిశుధ్య కార్మికులతో కలిసి సహపంక్తి భోజనాన్ని ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచార ప్రముఖ్ బయ్యా వాసు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ పిలు పు మేరకు నగరపాలక సంస్థ కార్మికులు, వాహనాల డ్రైవర్లు, సిబ్బందితో కలిసి దీపావళి వేడుకను నిర్వహించామని చెప్పారు. అనంతరం వస్త్రాలు, బాణసంచాను అందజేసి సత్కరించారు. విభాగ్ ప్రచారక్ నవీన్, జిల్లా సంఘ్చాలక్ బయ్యా రవికుమార్, జిల్లా మహిళా సమన్వయ ప్రముఖ్ బయ్యా శైలజ, సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ప్రధాన కార్యదర్శి బయ్యా మల్లిక, పారిశుధ్య కార్మికురాలు ధనమ్మ తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            వృద్ధురాలిని అనాథలా వదిలేసి..
● అనారోగ్యంతో మృతి ● మంట కలిసిన మానవత్వంమనుబోలు: ఆ వృద్ధురాలికి కుటుంబం ఉంది. ఆమె బాగోగులు పట్టించుకోకుండా మనుమడు మరో ఊరిలో వదిలేశాడు. అనారోగ్యంతో చనిపోయిన వృద్ధురాలికి రెవెన్యూ సిబ్బంది అంత్యక్రియలు చేశారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. మండలంలోని మనుబోలు సచివాలయం – 2 వద్ద సర్వీస్ రోడ్డు ఆనుకుని నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్లో గుర్తుతెలియని వృద్ధురాలి మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై శివరాకేష్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి విచారణ చేశారు. మృతురాలిని కలువాయికి చెందిన సుబ్బమ్మగా గుర్తించారు. ఆమె వయసు 70 సంవత్సరాలు ఉండొచ్చని, ఇద్దరు కుమార్తెలున్నారని చెబుతున్నారు. పదిరోజుల క్రితం ఆమె మనుమడు బలవంతంగా ఇక్కడ వదిలివెళ్లగా యాచన చేస్తూ బతికింది. కాగా అనారోగ్యంతో మృతిచెందినట్లు చెబుతున్నారు. పోలీసులిచ్చిన సమాచారంతో బంధువు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో మనుబోలులో మృతదేహాన్ని ఖననం చేశారు. - 
      
                   
                               
                   
            విద్యుత్ సిబ్బందికి సెలవులు రద్దు
● డివిజన్లలో కంట్రోల్ రూమ్ల ఏర్పాటు ● ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా ఎస్ఈ రాఘవేంద్రం నెల్లూరు (వీఆర్సీసెంటర్): వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో విద్యుత్ సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా ఎస్ఈ రాఘవేంద్రం అన్నారు. నగరంలోని విద్యుత్భవన్లోని స్కోడా కార్యాలయంలో మంగళవారం ఆయన జిల్లా విద్యుత్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని ప్రతి విద్యుత్ సిబ్బంది వారికి నిర్దేిశించిన హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. నూతన విద్యుత్ స్తంభాలు అందుబాటులో ఉంచాలని, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని ఐదు విద్యుత్ డివిజన్లలో 24 గంటలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వర్షాలు తగ్గే వరకు విద్యుత్ సబ్స్టేషన్లలో ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉంచి మిగిలిన వారిని అత్యవసర సేవలకు ఉపయెగించుకోవాలని సంబంధిత అధికారులకు అదేశాలు జారీ చేశారు. విద్యుత్ స్తంభాలు పడిపోయినా, లైన్లు తెగిపడినా వాటిని పునరుద్ధరించేందుకు సిబ్బంది సంసిద్ధంగా ఉండాలని అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. సెల్ఫోన్లకు ఫుల్ చార్జింగ్ పెట్టుకోవాలని, రోప్స్, డ్రిల్లింగ్ మెషిన్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. - 
      
                   
                               
                   
            జర్నలిస్టులపై కేసుల నమోదు దారుణం
● ఏపీయూడబ్ల్యూజే జేఏసీ నిరసన ఆత్మకూరు: రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ, విక్రయాల నేపథ్యంలో షాపుతోపాటు బెల్టుషాపుల సమీపంలోనే మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడాన్ని వార్తగా రాసిన ‘సాక్షి’ బ్యూరోఇన్చార్జి, ఎడిటర్పై పోలీసు కేసులు నమోదు చేయడం దారుణమని ఏపీయూడబ్ల్యూజే జేఏసీ ఖండించింది. విచారణ పేరుతో వేధించడం గర్హనీయమని పేర్కొంది. సోమవారం ఆత్మకూరు డివిజన్ పరిధి లోని అన్ని పత్రికలు, చానళ్ల విలేకరులు ఇటీవల జరిగిన పరిణామాలపై సమావేశం నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సోమా వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ విలేకరుల ఎప్పుడూ ప్రజాపక్షానే ఉంటారని, ప్ర జల నుంచి తెలుసుకున్న సమాచారాన్నే వార్తలుగా ఇస్తున్నారన్నారు. వార్తల్లో తప్పిదాలు ఉంటే ఖండన ఇవ్వాలి తప్ప వెంటనే కేసులు పెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘సాక్షి’ విషయంలో పోలీసులు తదుపరి చర్యలకు దిగితే తాము మౌనంగా ఉండబోమని జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. - 
      
                   
                               
                   
            కూటమి పాలనంతా అవినీతిమయం
వెంకటాచలం: రాష్ట్రంలో కూటమి పాలనంతా అవినీతిమయం అయిపోయిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి విమర్శించారు. మండలంలోని చెముడుగుంట పంచాయతీ బురాన్పూర్లో సోమవారం కాకాణి పర్యటించారు. ఆయన మాట్లాడుతూ కూటమి పాలనలో చంద్రబాబు, టీడీపీ నాయకులు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ఎక్కడా అభివృద్ధిపై దృష్టి సారించిన పాపాన పోలేదన్నారు. జిల్లా అడ్డాగా పేదల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తూ నెల నెలా రూ.కోట్ల కొల్లగొట్టుతున్నా.. పట్టించుకునే పరిస్థితి లేకపోవడం దారుణమన్నారు. పేదల రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతుందని నిత్యం పత్రికల్లో, టీవీ చానళ్లలో కథనాలు వస్తున్నా, ప్రభుత్వం సీరియస్గా తీసుకోకపోవడం ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను పట్టించుకోకుండా పరిపాలన సాగించడంపై ప్రజలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారని తెలియజేశారు. ఉద్యోగులకు దీపావళి కానుకగా ఆశించిన డీఏలు, పెండింగ్ బకాయిల విషయంలో ఊసురుమనిపించారని మండిపడ్డారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమంగా గ్రావెల్, మట్టి, ఇసుక తరలిస్తూ, కోట్లాది రూపాయల దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ఈ దోపిడీ గురించి ఆధారాలతో సహా బయటపడుతున్నా అధికారులు పట్టించుకోకపోడం సరికాదన్నారు. సోమిరెడ్డి, అతని కుమారుడుకు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజలకు మేలు చేసే ఆలోచనే లేదని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ అధికారంలో లేకపోయినా తాము నిత్యం ప్రజల మధ్య తిరుగుతూ ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఇటీవల తండ్రిని కోల్పోయిన పాములూరు రామచంద్రారెడ్డి కుటుంబాన్ని, గాయపడిన మాజీ ఎంపీటీసీ సుందరరామిరెడ్డిని పరామర్శించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పేదల రేషన్ బియ్యం అక్రమ రవాణాపై చర్యలు శూన్యం గ్రావెల్, మట్టి, ఇసుక తరలిస్తూ కోట్లాది రూపాయల దోపిడీ దీపావళి కానుకగా ఉద్యోగులకు దగా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి - 
      
                   
                               
                   
            జిల్లా అంతటా భారీ వర్షాలు
నెల్లూరు (అర్బన్): జిల్లాలో ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని మండలాల్లో భారీ వర్షాలు, మరికొన్ని మండలాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుండడంతో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు అర్బన్ 48.2ముత్తుకూరు 47.4తోటపల్లి గూడూరు 43.8వెంకటాచలం 55.4 కోవూరు 33.4నెల్లూరు రూరల్ 32.6విడవలూరు 53.6బుచ్చిరెడ్డిపాళెంలో 57.6అల్లూరు 32.4మి.మీ.చేజర్ల 32.4, కలువాయి 30.6, బోగోలు 30.4, ఇందుకూరుపేట 28.4, దుత్తలూరు 28.4, మనుబోలు 27.6, పొదలకూరు 26.4, రాపూరు 25.8, సైదాపురం 24.6, వింజమూరు 21.2, ఉదయగిరి 19.8, ఆత్మకూరు 19.8, సంగం 19.6, అనుమసముద్రంపేట 16.2, కలిగిరి 13.8, దగదర్తి 13.8, అనంతసాగరం 13.8, కొండాపురం 13.4, మర్రిపాడు 11.6, కందుకూరు 11.4, జలదంకి 8.6, సీతారామపురం 8.2, కావలి 6.8, వలేటివారిపాళెం 6.4, ఉలవపాడు 4.6, లింగసముద్రం 4.2 మి.మీ. వర్షం కురిసింది. అత్యల్పంగా కొడవలూరులో 74.2 మి.మీ. మంగళవారం అత్యధికంగా - 
      
                   
                               
                   
            కాపుల హత్యలకు పవన్కళ్యాణ్దే బాధ్యత
● ఆయన మాట వినే కాపులంతా టీడీపీకి ఓట్లు వేశారు ● అదే కాపులను నడిరోడ్డుపై దారుణంగా చంపుతున్నా స్పందన లేదు ● లక్ష్మీనాయుడు కుటుంబాన్ని కనీసం పరామర్శించకపోవడం దారుణం ● దారకానిపాడు ఎవరూ వెళ్లకుండా పోలీస్ ఆంక్షలు విధించి అడ్డుకోవడమేంటి ● వైఎస్సార్సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళి కందుకూరు: డీసీఎం పవన్కళ్యాణ్ మాటవిని టీడీపీకి ఓట్లు వేసి అధికారంలోకి రావడానికి కారణమైన కాపులను కుల వివక్షతో నడిరోడ్డుపై చంపుతుంటే పవన్కళ్యాణ్ కనీసం స్పందించకపోవడం దారుణమని వైఎస్సార్సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళి ఆవేదన వ్యక్తం చేశారు. గుడ్లూరు మండలం దారకానిపాడులో దారుణ హత్యకు గురైన కాపు యువకుడు తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు మంగళవారం ఆయన వచ్చారు. అయితే దారకానిపాడు వెళ్లడానికి వీల్లేదంటూ కందుకూరు పట్టణ బైపాస్పైనే ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన భార్యను లైంగికంగా వేధిస్తుండడంతో అడిగినందుకు ముగ్గురు అన్నదమ్ములను కారుతో ఢీకొట్టి చంపడానికి ప్రయత్నించడంతో అందులో లక్ష్మీనాయుడు చనిపోయాడని, ఇది అత్యంత అరాచకమైన చర్య అన్నారు. లక్ష్మీనాయుడుకి పొన్నూరుతో బంధుత్వం ఉందన్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పొన్నూరులోని కాపు సామాజికవర్గ నాయకులంతా లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారన్నారు. అయితే ఇక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, దారకానిపాడు గ్రామానికి వెళ్లకుండా కందుకూరు పట్టణ సమీపంలోనే పోలీసులు ఆపేస్తున్నారన్నారు. భారీగా పోలీసులను మోహరించి గ్రామంలో అడుగు పెట్టే పరిస్థితి లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. దారకానిపాడు ఏమైనా పాకిస్తానా లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు పొన్నూరు నుంచి అంబటి మురళితోపాటు, పలువురు కాపు నేతలు పెద్ద ఎత్తున మంగళవారం తరలివచ్చారు. అయితే దారకానిపాడు వెళ్లడానికి వీల్లేదంటూ వీరిని కందుకూరు బైపాస్ వద్దనే డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సీఐలు అన్వర్బాషా, మంగారావు, పలువురు ఎస్సైలు, పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి అడ్డుకున్నారు. దీంతో పోలీస్ అధికారులకు, అంబటి మురళికి మధ్య వాగ్వాదం జరిగింది. దారుణ హత్యకు గురైన బాధితులను పరామర్శిస్తే తప్పేంటని, దారకానిపాడు ఏమైనా పాకిస్తాన్లో ఉందా అంటూ మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడే నిలబడిన కాపు నేతలు నిరసన వ్యక్తం చేశారు. మురళితో పాటు, ఇతర నేతలను దారకానిపాడు తీసుకెళ్తామంటూ పోలీస్ వాహనం ఎక్కించి అక్కడి నుంచి పామూరు పోలీస్స్టేషన్కు తరలించే ప్రయత్నం చేశారు. దీన్ని పసిగట్టిన నేతలు వాహనం దిగి పోలీసులతో వాదనకు దిగారు. తమ ప్రాథమిక హక్కును ఎందుకు అడ్డుకుంటున్నారని ఇది సరైన విధానం కాదంటూ నిలదీశారు. దాదాపు రెండు గంటల ఉద్రిక్తత వాతావరణం తరువాత పోలీస్ ఆంక్షలను నిరసిస్తూ కాపు నేతలు అక్కడి నుంచి వెళ్లాల్సి వచ్చింది. టీడీపీ హయాంలోనే కాపుల హత్యలు రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంటే కాపుల హత్యలు జరుగుతుంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలో ఉండగానే వంగవీటి రంగాను అతిదారుణంగా చంపారన్నారు. రంగా స్ఫూర్తితో ముద్రగడ పద్మనాభం ఎదుగుతున్న సమయంలో 2014–19 మధ్యలో ఆయన్ను ఏ విధంగా ఇబ్బందులు గురి చేశారో అందరికీ తెలిసిన విషయమేనని వివరించారు. ప్రస్తుతం లక్ష్మీనాయుడు వంటి కాపు యువత పవన్కల్యాణ్ స్ఫూర్తితో టీడీపీకి ఓటు వేశారన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో కాపుల ఆశలు నెరవేరలేదు గానీ పవన్కళ్యాణ్ ఆశలు మాత్రం నెరవేరాయని చెప్పారు. డీసీఎంగా ఉన్న ఆయన కనీసం లక్ష్మీనాయుడు హత్యపై కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. - 
      
                   
                               
                   
            పత్రికా స్వేచ్ఛను హరించడమే
ప్రజాస్వామ్యానికి విఘాతం అక్రమ కేసులతో అణచివేయలేరుకక్ష సాధింపు చర్యలు తగవు తప్పులు సరిదిద్దుకోలేకనే వేధింపులు ‘సాక్షి’పై కక్ష కట్టి పోలీసు కేసులను నమోదు చేసి పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు. ‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి, నెల్లూరు బ్యూరో ఇన్చార్జి మస్తాన్రెడ్డిపై అక్రమ కేసులు పెట్టడం జర్నలిస్టుల గొంతు నొక్కడమే. నచ్చని వార్తలు పత్రికల్లో ప్రచురితమైతే న్యాయపరంగా ఎదుర్కోవాలే కాని ఇలా కేసులు నమోదు చేసి వేధించడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. – పెదమల్లు రమణారెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, సీనియర్ నాయకుడు, పొదలకూరు పత్రికలపై దాడులకు పాల్పడడం, కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడమే అవుతుంది. ‘సాక్షి’ పత్రిక ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక పాలనను బహిర్గతం చేస్తుందన్న అక్కసుతోనే ఎడిటర్ ధనంజయరెడ్డిపై వరుస కేసులు నమోదు చేయిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదు. – గోగిరెడ్డి గోపాల్రెడ్డి, సీనియర్ నాయకుడు, వైఎస్సార్సీపీ, మహ్మదాపురం, పొదలకూరు మండలం ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా వ్యవహరించే పత్రికా రంగం ప్రజాస్వామ్యంలోని నాలుగు స్తంభాల్లో ఒకటి. అలాంటి పత్రికా రంగాన్ని అణచివేసే ధోరణిలో వార్తలు రాసే విలేకరులు, ఎడిటర్లపై పోలీసులు బెదిరింపు ధోరణిలో వ్యవహరించడం సరికాదు. రాష్ట్రంలో ‘సాక్షి’ పత్రికపై ప్రభుత్వం అక్రమ కేసులతో కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తోంది. – డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, జిల్లా వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షుడు జర్నలిస్టులు రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా సమస్యలను వెలుగులోకి తెస్తారు. ‘సాక్షి’ పత్రికలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాశారనే కోణంతో ఆ పత్రికను ప్రభుత్వం టార్గెట్ చేసింది. అందులో పనిచేసే జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం మంచి పద్ధతి కాదు. ఈ విధానాన్ని ప్రభుత్వం మార్చుకోవాలి. – వి.నరసింహులు, జేఏసీ అధికార పార్టీ నేతలు చేస్తున్న తప్పులను సరిదిద్దుకోలేని ప్రభుత్వం ‘సాక్షి’ జర్నలిస్టులపై దాడులు చేస్తోంది. అర్ధరాత్రి పూట మహిళలని చూడకుండా ‘సాక్షి’ బ్యూరో ఇంటికి పోలీసులను పంపి నోటీసులు ఇవ్వడం దారుణం. సమస్యలను పక్కదారి పట్టించేందుకు ప్రభు త్వం ఇలాంటి సంస్కృతికి తెరతీయడం దుర్మార్గం. నోటీసులు, విచారణ, కేసుల పేరుతో వేధిస్తే ప్రజలే ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పుతారు. – సాగర్రెడ్డి, జేఏసీ - 
      
                   
                               
                   
            జల్లాకు భారీ వర్ష సూచన
నెల్లూరురూరల్: ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, మంగళవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంగా జిల్లాకు భారీ వర్ష సూచన ఉందని జిల్లాలోని ప్రజలు, మత్స్య కా రులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం తెలిపారు. ఈ అల్పపీడనం 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య బంగాళాఖాతం, పశ్చి మ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. బుధవారం నుంచి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉంటుందని, ఈ ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొదు అక్టోబర్ 21వ తేదీ మధ్యాహ్నం నుంచి దక్షిణ మధ్య బంగాళాఖాతంలోకి సముద్రయాత్రలు చేయొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. మత్స్యకారులు సము ద్రంలోకి వెళ్లకూడదని, సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు తప్పనిసరిగా అక్టోబర్ 21వ తేదీ లోపు తీరానికి చేరుకోవాలన్నారు. ముందుస్తు జాగ్రత్తలు పాటించాలి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేప్పుడు ప్రజలు చెట్ల కింద నిలబడరాదని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీర ప్రాంతాల్లో గాలి వేగం గంటకు 4,565 కి.మీ. వరకు ఉండొచ్చన్నారు. తీర ప్రాంత గ్రామాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని కలెక్టర్ చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, జిల్లా అధికారుల సూచనలను పాటించాలని కలెక్టర్ సూచించారు. 49.1 మి.మీ. సగటు వర్షపాతం నెల్లూరు(అర్బన్): ఈశాన్య రుతుపవనాల ప్రారంభంలోనే జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం ఉదయానికి జిల్లాలో సగటున 49.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సంగంలో 140.6 మి.మీ., అత్యల్పంగా సైదాపురంలో 1.4 మి.మీ. వర్షం కురిసింది. కోవూరులో 96.2, నెల్లూరు అర్బన్ 93.4, బోగోలు 93.2, నెల్లూరు రూరల్ 90.4, ఆత్మకూరు 82.2, కలువాయి 80.4, బుచ్చిరెడ్డిపాళెం 80.2, చేజర్ల 68.2, ఏఎస్పేట 65.2, ఇందుకూరుపేట 64.8, గుడ్లూరు 62.4, తోటపల్లిగూడూరు 61.8, మర్రిపాడు 58.4, కావలి 55.6, కలిగిరి 47.0, అల్లూరు 45.8, కొండాపురం 45.6, పొదలకూరు 45.4, జలదంకి 43.6, దగదర్తి 43.2, కొడవలూరు 42.4, లింగసముద్రం 42.2, ఉలవపాడు 41.4, వింజమూరు 40.6, దుత్తలూరు 37.4, ముత్తుకూరు 36.4, అనంతసాగరం 33.8, విడవలూరు 32.6, వెంకటాచలం 21.2, ఉదయగిరి 20.4, వలేటివారిపాళెం 16.8, సీతారామపురం 11.8, కందుకూరు 11.2, రాపూరు 5.8, మనుబోలు 3.6, వరికుంటపాడులో 3.4 మి.మీ. వర్షం కురిసింది. రెండు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లొద్దు కలెక్టర్ హిమాన్షు శుక్లా - 
      
                   
                               
                   
            దివ్య దీపావళి శుభాకాంక్షలు
నెల్లూరు(స్టోన్హౌస్పేట): చీకటిపై వెలుగు సాధించిన విజయంగా దీపావళి పర్వదినాన్ని లక్ష్మీదేవి దివ్య ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి ఆకాంక్షించారు. ప్రజలందరికి దీపావళి శుభా కాంక్షలు తెలిపారు. అజ్ఞాన చీకట్లను పారద్రోలి మన జీవితంలో వెలుగులు నింపే దీపావళిని ఆనందంగా, జాగ్రత్తగా జరుపుకోవాలని కోరారు. వెలుగుల పండగ కావాలి అందరి జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని, వెలుగు పండగ దీపావళి అందరిలో సంతోషాలు వెల్లివిరియాలని ఎమ్మెల్సీ సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ కుటుంబసభ్యులతో కలిసి సురక్షితంగా పండగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. పర్యావరణహితంగా దీపావళి జరుపుకోవాలి నెల్లూరురూరల్: జిల్లా ప్రజలందరూ పర్యావరణ హితంగా జరుపుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఒక ప్రకటనలో కోరారు. పెద్దపెద్ద శబ్దాలు, కాలుష్యం వెదజల్లే టపాసులు కాకుండా వెలుగుదివ్వెలు విరజిమ్మే టపాసులు కాల్చాలన్నారు. తల్లిదండ్రులు, పెద్దల సమక్షంలోనే పిల్లలు టపాసులు కాల్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జేసీ శుభాకాంక్షలు జిల్లా ప్రజలు ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలు, వెలుగుదివ్వెల కాంతులతో పండగను ఆనందంగా జరుపుకోవాలని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అంధకారంపై వెలుగు సాధించిన పండగ దీపావళి స్ఫూర్తితో నిర్వహించాలని కోరారు. నేడు పీజీఆర్ఎస్ రద్దు నెల్లూరు (క్రైమ్): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) దీపావళి పండగ సందర్భంగా రద్దు చేసినట్లు ఎస్పీ అజిత వేజెండ్ల ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. - 
      
                   
                               
                   
            కొండలు కరిగించి.. గ్రావెల్ దోచేసి
టీడీపీ నేతలు ధనదాహంతో ప్రకృతిని విధ్వంసం చేస్తున్నారు. గ్రామానికి సహజ సౌందర్యంగా ఉండే కొండలను గ్రావెల్ కోసం అనుమతుల్లేకుండా అక్రమంగా తవ్వేస్తున్నారు. పశువులకు మేతపోరంబోకు భూముల్లో గ్రావెల్ కొల్లగొట్టి రూ.కోట్లు మింగుతున్నారు. టీడీపీ నేతలు దాష్టీకంతో పశువులకు మేతలేకుండా పోతుందని పాడిరైతులు ఆందోళన చెందుతుంటే.. భారీ గోతుల్లో తమ పిల్లలకు ఎక్కడా ప్రాణాపాయం తలెత్తుతుందోనని ఆ గ్రామ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నా.. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖలు కన్నెత్తి చూడకపోవడంపై, ముడుపులు తీసుకుని మౌనంగా ఉంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. యర్రబల్లి తిప్ప కింద ఏర్పడిన గ్రావెల్ గోతులు సాక్షి టాస్క్ఫోర్స్ : అధికార మదంతో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. ప్రజల కడుపులే కాదు.. చివరకు పశువుల కడుపులు కొడుతున్నారు. పశువుల మేతపోరంబోకు భూమిగా ఉండే యర్రబల్లి కొండను కొల్లగొడుతున్నారు. పొదలకూరు మండలం యర్రబల్లికే మణిహారంగా, ప్రకృతి సౌందర్యంగా ఉండే సహజ కొండ కింద భూముల్లో గ్రావెల్ను తవ్వి జేబులు నింపుకొంటున్నారు. నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేత అండతో ఆకాశమే హద్దుగా అవినీతికి పాల్పడుతున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రశ్నించే స్థానికులను పోలీసులతో బెదిరించి అడ్డూ అదుపు లేకుండా గ్రావెల్ దోపిడీకి పాల్పడుతున్నారు. సంబంధిత అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా రాత్రి, పగలు తేడా లేకుండా కొండ కింద గ్రావెల్ను తరలించి గోతులను మిగుల్చుతున్నారు. పశువులు మేత మేసేందుకు సైతం ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఆయా గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం లేకుండా పోయింది. అధికారమే అండగా చెలరేగిపోతున్నా గ్రావెల్ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇక్కడి గ్రావెల్ తవ్వకాలపై ఇటీవల గ్రామానికి చెందిన అధికార పార్టీకు చెందిన నేతలే అక్రమ గ్రావెల్ తరలించేందుకు వీల్లేదని టిప్పర్లను అడ్డుకున్నారు. వర్షం వల్ల ప్రస్తుతం అక్రమ గ్రావెల్ను తరలించడం నిలిపివేసిన అక్రమార్కులు తిరిగి తరలించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అనుమతులు లేకుండా తరలింపు యర్రబల్లి తిప్ప కింద నుంచి జేసీబీలు ఏర్పాటు చేసి టిప్పర్లలో రాత్రి వేళ తరలిస్తున్నట్లు గ్రామస్తులు వెల్లడించారు. ఉదయం 6 గంటల వరకు గ్రావెల్ తరలింపు జరుగుతూనే ఉంది. నాలుగు రోజుల క్రితం అధికార పార్టీకి చెందిన నాయకులు గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లను నిలిపివేశారు. అక్రమంగా గ్రావెల్ తరలించి సొమ్ము చేసుకోవడంతో ఏర్పడిన గోతుల్లో వర్షాకాలంలో నీరు చేరి పిల్లలు అటుగా వెళితే ప్రమాదాలు ఏర్పడతాయని నిలదీశారు. అయితే మధ్యాహ్నం వరకు టిప్పర్లను నిలిపిన వారిని పోలీసు కేసులు పెడతామని బెదిరించడంతో వారు మిన్నకుండిపోయినట్లు తెలిసింది. ఎటువంటి అనుమతులు లేకుండా తమ గ్రామం నుంచి అక్రమంగా గ్రావెల్ తరలించడమే కాక గ్రామస్తులపైనే కేసులు పెట్టిస్తామని బెదిరించడం ఎంతవరకు సబబని గ్రామంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు మైనింగ్ అధికారులు స్పందించి కొండ విధ్వంసాన్ని అడ్డుకోవాలని స్థానికులులు కోరుతున్నారు. అనుమతుల్లేకుండా తవ్వకాలు ప్రమాదకర స్థాయిలో భారీ గోతులు రూ.కోట్లు మింగుతున్న టీడీపీ నేతలు పశువులకు మేత లేకుండా పోతుందని రైతుల ఆందోళన - 
      
                   
                               
                   
            రోడ్డుపై విరిగిపడిన కొండచరియలు
సంగం: సంగంలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొండ వద్ద ఉన్న నెల్లూరు– ముంబై జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న ఎస్సై రాజేష్ అర్ధరాత్రి వెంటనే స్పందించిన తన సిబ్బందితో కలిసి రహదారిపై పడిన కొండ చరియలను తొలగించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. ఎస్సై రాజేష్ మాట్లాడుతూ వాహనదారులు కొండ వద్ద జాతీయ రహదారిపై ప్రయాణం చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో కొండపై ఉన్న రాళ్లు విరిగిపడే ప్రమాదం ఉన్నందున రాత్రి సమయాల్లో వాహనదారులు మరెంతో జాగ్రత్తలు పాటించాలని, కొండ వద్ద వాహన వేగం తగ్గించి వెళ్లాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులు ఉన్న సమయంలో వాహనదారులు వెంటనే 112 నంబర్కు కానీ తమకు కానీ ఫోన్ చేస్తే స్పందించి అక్కడికి చేరుకుని సహాయం చేస్తామని తెలియజేశారు. - 
      
                   
                               
                   
            కాపులంతా కళ్లు తెరవాలి
కందుకూరు: ‘కాపు యువకుడు లక్ష్మీనాయుడు హత్యను పక్కదారి పట్టించేందుకు ఎల్లో మీడియా కట్టు కథలు అల్లుతోంది. కూటమి ప్రభుత్వంలో కాపులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఇప్పటికై నా కళ్లు తెరవాలి’ అని రాధా, రంగా మిత్ర మండలి రాష్ట్రాధ్యక్షుడు వంగవీటి నరేంద్ర అన్నారు. గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామంలో హత్యకు గురైన లక్ష్మీనాయుడి కుటుంబాన్ని ఆదివారం ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ లక్ష్మీనాయుడు, హంతకుడు కాకర్ల హరిచ్చంద్రప్రసాద్లు ప్రాణ స్నేహితులనే విధంగా చిత్రీకరిస్తున్నారన్నారు. ప్రాణ స్నేహితులైతే ప్రాణాలు తీస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీనాయుడి భార్యను లైంగికంగా వేధించి లొంగకపోయే సరికి అతడిని అడ్డు తొలగించేందుకు హత్య చేశారని వివరించారు. ఎన్నికల్లో వాడుకుని అన్యాయం కాపు కులాన్ని ఎన్నికల్లో వాడుకుని ఇంత అన్యాయం జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీనాయుడు హత్య కేసులో కేవలం ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేశారన్నారు. మరో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారని, సహకరించిన వారిని కూడా అరెస్ట్ చేయాలన్నారు. ఈ ఘటనలో కులం ప్రస్తావన వచ్చినప్పుడు, ఇప్పుడు తమ కులం గురించి మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. మీరు ఒక్కరే మీ కులం ఓట్లతో గెలిచారా? అని ప్రశ్నించారు. అధికారంలోకి రావడానికి కాపులను వాడుకోలేదా అని నిలదీశారు. హరిచంద్రప్రసాద్ స్వతహాగానే నేర ప్రవృత్తిని కలిగి ఉన్నాడని, తన తల్లి చనిపోకముందే చనిపోయినట్లు బీమా క్లెయిమ్ చేశాడన్నారు. హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న మహిళలను కేసులో చేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామన్నారు. లక్ష్మీనాయుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ పోరాడ తామన్నారు. వారికి కాపులంతా అండగా ఉంటారన్నారు. కూటమి ప్రభుత్వంలో న్యాయం జరిగే పరిస్థితి లేదు లక్ష్మీనాయుడి హత్యను పక్కదారి పట్టించే కుట్ర రాధా, రంగా మిత్రమండలి రాష్ట్రాధ్యక్షుడు వంగవీటి నరేంద్ర - 
      
                   
                               
                   
            అమరులకు వందనం
● రేపు పోలీసు అమరవీరుల సంస్మరణ దినంనెల్లూరు(క్రైమ్): దేశభద్రతకు సరిహద్దుల్లో సైన్యం.. సమాజంలో అంతర్గత భద్రత.. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు అనుక్షణం పోరాటం చేస్తున్నారు. వారులేని సమాజాన్ని ఊహించుకోలేం. సంపన్నులు మొదలు సామాన్యుడి వరకు అందరూ సాయం కోసం చూసేది పోలీస్ వైపే. ప్రజల మాన, ప్రాణాలను కాపాడే క్రమంలో చివరకు ప్రాణత్యాగానికి సైతం వెనుకాడరు. విధి నిర్వహణలో అసువులు బాసిన అమరుల త్యాగాలు చిరస్మరణీయం. 1959 అక్టోబర్ 21వ తేదీన దేశభద్రత కోసం భారత్, చైనా సరిహద్దుల్లో ఉన్న లడఖ్ అక్సాయ్ చిన్ వద్ద విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లపై చైనా సైనికులు భారీ సంఖ్యలో విరుచుకుపడ్డారు. భారత జవాన్లు ఆత్మస్థైర్యంతో విరోచితంగా పోరాడి చొరబాటుదారుల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఈ భీకరపోరులో అసువులు బాసిన అమరుల త్యాగాలకు గుర్తుగా ఏటా అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినం నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా మావోయిస్టులు, ఉగ్రవాదులు, ఇతర అసాంఘిక శక్తులతోపాటు అల్లర్లు, అలజడులను అణిచివేసే క్రమంలో అమరులైన పోలీసు సిబ్బందిని స్మరిస్తూ సోమవారం నెల్లూరులోని పోలీసు కవాతు మైదానంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సమాజంలో పోలీసుల పాత్ర, విధులు, త్యాగాలపై ప్రజలను చైతన్యపరిచేలా వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఏడాది పదిమంది ఈ ఏడాది జిల్లాలో అనారోగ్యం, రోడ్డు ప్రమాదం తదితర కారణాలతో పదిమంది మృతిచెందారు. ఏఎస్సై కె.లక్ష్మీనరసయ్య, హెడ్కానిస్టేబుల్స్ ఎం.నాగయ్య, ఎం.చలపతిరావు, డి.రాజశేఖర్, ఏఆర్, సివిల్ కానిస్టేబుళ్లు యు.శివకుమార్, ఎస్.నాగరమేష్, ఎస్.అంకయ్య, జి.శివకుమార్, కె.రమేష్బాబు, వై.రమేష్లు చనిపోయారు. - 
      
                   
                               
                   
            ఆగిన విద్యుత్ సరఫరా.. ఆస్పత్రిలో ఇక్కట్లు
చీకట్లో వార్డు ● పనిచేయని జనరేటర్లు ఆత్మకూరు: మున్సిపల్ పరిధిలో శనివారం రాత్రి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ సమయంలో జిల్లా ఆస్పత్రిలో చీకట్లు అలుముకున్నాయి. జనరేటర్ కూడా పనిచేయలేదు. దీంతో పలు వార్డుల్లో రోగులు ఇబ్బంది పడ్డారు. సుమారు గంటన్నరపాటు సరఫరా లేదు. నర్సులు సెల్ఫోన్ టార్చ్ వెలుగులోనే రోగులకు సైలెన్ పెట్టారు. జనరేటర్ కోసం సెక్యూరిటీ వారిని రోగుల బంధువులు సంప్రదించగా డీజిల్ లేక ఎయిర్ లాగడంతో పనిచేయడం లేదని చెప్పారు. జిల్లా ఆస్పత్రిలో ఇలాంటి దుస్థితి నెలకొనడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. - 
      
                   
                               
                   
            ఇష్టారాజ్యంగా..
● పెన్నానదిలో ఇసుక తవ్వకాలు ఆత్మకూరు రూరల్: మండలంలోని బండారుపల్లి వద్ద పెన్నానదిలో ఆదివారం అక్రమంగా ఇసుక తవ్వకాలు ప్రారంభించారు. మహిమలూరు, దేపూరు గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో నదిలో తాగునీటి బావుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పనులు జరిగే ప్రదేశానికి వెళ్లేలా తాత్కాలికంగా రోడ్డు నిర్మాణం చేశారు. అయితే దేపూరుకు చెందిన కొందరు ఈ రోడ్డుపై జేసీబీలను నిలిపి నదిలో అక్రమంగా ఇసుకను ట్రాక్టర్లకు లోడ్ చేస్తున్నారు. ఈ సమాచారం అందడంతో సంబంధిత అధికారులు అడ్డుకున్నారు. అయినా అక్రమార్కులు లెక్క చేయకపోవడంతో పలువురు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఆత్మకూరు ఎస్సై జిలానీ వెళ్లడంతో అక్రమార్కులు వెళ్లిపోయారు. - 
      
                   
                               
                   
            నేను ఆత్మహత్య చేసుకుంటున్నా
దుత్తలూరు: ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నా’ అంటూ వెలుగు వీఓఏ వాట్సాప్ గ్రూపులో సెల్ఫీ వీడియో పెట్టింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆమెతో మాట్లాడారు. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని నందిపాడులో వెలుగు వీఓఏగా రజియా పనిచేస్తోంది. ఆమె ఆదివారం ఆత్మహత్య చేసుకుంటున్నాంటూ వాట్సాప్ గ్రూపుల్లో సెల్ఫీ వీడియో పెట్టింది. సీసీ తనను విధుల నుంచి తప్పించి మరొకరిని పెట్టుకోవాలని చూస్తున్నారని అందులో ఆరోపించింది. కొందరు పొదుపు మహిళలు, మరో వ్యక్తి వేధిస్తున్నారని చెప్పుకొచ్చింది. విషయం తెలుసుకున్న ఎస్సై ఆదిలక్ష్మి సకాలంలో స్పందించి రజియాతో మాట్లాడి పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఎస్సై మాట్లాడుతూ వెలుగు అధికారులు వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో విచారించి తగిన చర్యలు తీసుకుని కేసు నమోదు చేస్తామన్నారు.నేడు కోనలో రథోత్సవంరాపూరు: దీపావళి వేడుకలకు పెంచలకోన ముస్తాబవుతోంది. సోమవారం మూలమూర్తికి పూజలు నిర్వహిస్తామని ఆలయ అధికారులు ఆదివారం తెలిపారు. పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మిదేవి, చెంచులక్ష్మి ఉత్సవ విగ్రహాలను శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవి, సత్యభామగా అలంకరించి రథంపై కొలువుదీర్చి కోన మాడవీధుల్లో క్షేత్రోత్సవం నిర్వహిస్తారు. నరకాసునివధ తదితర కార్యక్రమాలు జరుగుతాయి.● వాట్సాప్ గ్రూపులో పెట్టిన వీఓఏ ● వెంటనే స్పందించిన పోలీసులు - 
      
                   
                               
                   
            దీపావళి కాంతులు
● అప్రమత్తతతోనే ఆనందం ● సంబరాల్లో జాగ్రత్తలు తప్పనిసరి నెల్లూరు(క్రైమ్): దీపావళి.. ఈ పండగంటే ప్రతి ఒక్కరికీ ఆనందం. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా, కులమతాలకు అతీతంగా అందరూ ఆనందోత్సాహాలతో పండగ చేసుకుంటారు. దీపావళి అంటే ముందుగా గుర్తుకొచ్చేది టపాసులే. పల్లె నుంచి పట్నం వరకూ మతాబుల మోతతో దద్దరిల్లాల్సిందే. ఇంటిల్లిపాది మతాబులు కాలుస్తూ సంతోషంగా గడుపుతారు. రంగురంగుల వెలుగుల్లో దీపావళి కాంతుల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉంటే చాలా ప్రమాదమే. వెలుగుల ఆనందం కాస్తా అంధకారంగా మారుతుంది. చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే పండగను సంతోషంగా జరుపుకోవచ్చు. ఇవి పాటించాలి లైసెన్స్ షాపుల్లోనే బాణసంచా కొనుగోలు చేయాలి. వాటిని వంటగది, పొయ్యి ఉన్న ప్రాంతాల్లో ఉంచరాదు. సురక్షిత ప్రదేశంలో పెట్టాలి. ఇంటి బయట, మైదానాల్లో మాత్రమే కాల్చాలి. ఈ సమయంలో దగ్గరగా నీరు, ఇసుక అందుబాటులో ఉంచుకోవాలి. తల్లిదండ్రుల సమక్షంలోనే పిల్లలు టపాసులు కాల్చాలి. కాటన్ దుస్తులు, పొడుగు చేతుల వస్త్రాలను మాత్రమే ధరించాలి. కాళ్లకు బూట్లు, కళ్లజోడు ధరించడం మంచిది. తారాజువ్వలను బాటిళ్లలో పెట్టి నిటారుగా ఉండేలా సరిచూసుకోవాలి. ఈ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్త వహించినా అవి ఇళ్లలోకి దూసుకుపోయే ప్రమాదముంది. గ్రామీణ ప్రాంతాల్లో పంట పొలాలు, గడ్డివాములు, పూరిగుడిసెలు ఉండే ప్రదేశాల్లో చిచ్చుబుడ్లు, రాకెట్లు, తారాజువ్వలు వంటివి కాల్చ రాదు. సగం కాలిన వాటిని చేతులతో పట్టుకోవడం తగదు. బాణసంచా పూర్తిగా కాలలేదనుకుంటే పొరపాటే. అకస్మాత్తుగా పేలి గాయాలకు గురయ్యే పరిస్థితి. బాణసంచా కాల్చే సమయంలో వెలువడే వాయువును పీల్చడం హానికరం. గంధం, జింకు, మెగ్నీషియం, నైట్రేట్ వంటి పదార్థాలతో తయారైన టపాకాయలతో వచ్చే వాయువు పీల్చడంతో ఊపిరితిత్తుతులు దెబ్బతినడం, శ్వాసకోశ, ఆస్తమా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. వృద్ధులు, వ్యాధిగ్రస్తులు, దివ్యాంగులు, గర్భిణులు, రెండేళ్లలోపు చిన్నారులకు దూరంగా టపాకాయలను కాల్చడం మంచిది. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో బాణసంచా వల్ల గాయపడితే సొంత వైద్యం కాకుండా వైద్యులను సంప్రదించాలి. అనుకోని ప్రమాదం జరిగినప్పుడు 101కు సమాచారం అందించాలి. - 
      
                   
                               
                   
            పత్రికా స్వేచ్ఛను హరించడమే
ఉదయగిరి: ప్రజాస్వామ్య వ్యవస్థకు పత్రికా రంగం మూల స్తంభం. వార్తల విషయంలో ప్రతికలకు ఎంతో స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛపై కూటమి ప్రభుత్వం దాడి చేస్తోందంటూ ఉదయగిరి నియోజకవర్గంలోని పలువురు విలేకరులు ధ్వజమెత్తారు. ‘సాక్షి’ మీడియాపై ప్రభుత్వం కేసులు బనాయించడం, పోలీసులతో కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తూ భయభ్రాంతులకు గురి చేయడాన్ని నిరసిస్తూ శనివారం ఉదయగిరి తహసీల్దార్ కార్యాలయం వద్ద జర్నలిస్టుల ఐక్య సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డి, నెల్లూరు బ్యూరో మస్తాన్రెడ్డిలకు అర్ధరాత్రి నోటీసులు జారీ చేయడం, విచారణ పేరుతో వేధించడం తగదన్నారు. పత్రికలు ప్రజల తరపున పోరాడే వ్యవస్థ అని, ప్రచురించే వార్తలో సందేహాలుంటే న్యాయబద్ధ రీతిలో వ్యవహరించాలి తప్ప అక్రమంగా కేసులు పెట్టడం తగదన్నారు. ఈ ధోరణితో ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పు ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. - 
      
                   
                               
                   
            జర్నలిస్టు సంఘాల నిరసన
మనుబోలు: ‘సాక్షి’ మీడియాపై పోలీసుల వేధింపులు అప్రజాస్వామికమని జర్నలిస్టు సంఘం నేత బాబూ మోహన్దాస్ అన్నారు. ఎడిటర్ ధనుంజయరెడ్డి, బ్యూరో ఇన్చార్జిలను కేసుల పేరుతో వేధించడాన్ని నిరసిస్తూ శనివారం మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో ఆర్ఐ అరుణ్తేజ్కు మీడియా ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ తమకు గిట్టని వార్తలు రాసే జర్నలిస్టులను పోలీసులు కేసుల పేరుతో వేధించడం దుర్మార్గమన్నారు. జర్నలిస్టులు స్వేచ్ఛగా తమ విధులను నిర్వర్తించుకునే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు రవీంద్ర బాషా, శ్రీనివాసులు, జగదీష్, జయకర్, సుధాకర్, శంకర్, సునీల్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్రే లక్ష్యం కావాలి
నెల్లూరు(బారకాసు): స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రే లక్ష్యంగా ముందుకు సాగాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా నగరంలోని బట్వాడిపాళెం నుంచి సారాయంగడి సెంటర్, అక్కడి నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు సైకిల్ ర్యాలీని శనివారం నిర్వహించారు. దీన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. స్వచ్ఛతలో జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలపాలని కోరారు. నూరు శాతం చెత్త సేకరణ జరగాలని చెప్పారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ప్రజలకు దీపావళి శుభాకాంక్షలను తెలియజేశారు. కమిషనర్ నందన్ తదితరులు పాల్గొన్నారు . కండలేరులో 60 టీఎంసీలు రాపూరు: కండలేరు జలాశయంలో శనివారం నాటికి 60 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి 3,060 క్యూసెక్కుల నీరు చేరుతోందని చెప్పారు. సత్యసాయి గంగకు 1900, పిన్నేరుకు 850, లోలెవల్కు 40, హైలెవల్కు 200, మొదటి బ్రాంచ్ కాలువలకు ఐదు క్యూసెక్కు లను విడుదల చేస్తున్నామని వివరించారు. - 
      
                   
                               
                   
            లక్కీడిప్.. గందరగోళం
నెల్లూరు సిటీ: బాణసంచా దుకాణాల కేటాయింపునకు సంబంధించిన లక్కీడిప్ ఈ ఏడాది గందరగోళంగా మారింది. ప్రక్రియను నెల్లూరు ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం రాత్రి నిర్వహించారు. అయితే ఇందులో తమకు అన్యాయం జరిగిందంటూ అధికారులపై కొందరు లైసెన్స్దారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి లైసెన్స్దారులకు నచ్చజెప్పి ప్రక్రియను పూర్తి చేశారు. వీఆర్సీ గ్రౌండ్స్లో 41.. వైఎమ్సీఏ గ్రౌండ్స్లో 36.. చిల్డ్రన్స్పార్క్ సమీపంలో 25.. గోషాస్పత్రి ప్రాంతంలో 11.. ఆరెస్సార్లో 27, బీవీఎస్ గర్ల్స్ హైస్కూల్ వద్ద ఒక దుకాణానికి అనుమతిచ్చారు. ఈసారి కుదింపు వాస్తవానికి వీఆర్సీ గ్రౌండ్స్లో ఏటా 60 నుంచి 65 దుకాణాలకు అనుమతులిచ్చేవారు. అయితే ఈ ఏడాది ఓ ప్రైవేట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో స్టేజ్ ఏర్పాటును ప్రారంభించారు. దీంతో అక్కడ 41 దుకాణాలకే అనుమతులను మంజూరు చేశారు. దీనిపై లైసెన్స్దారులు మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఏర్పాటు చేసుకుంటున్నామని, ఇప్పుడు మరోచోట పెట్టుకోవాలని అధికారులు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 42వ నంబర్ నుంచి వచ్చే దుకాణాలను ఇతర చోట్ల ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మ్యాప్లో పొరపాటు వీఆర్సీ గ్రౌండ్స్లో 41వ దుకాణాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలం లేకపోవడంతో లైసెన్స్దారుడు మండిపడ్డారు. తానెక్కడ పెట్టాలని ప్రశ్నించారు. ఫైరింజిన్ ప్రవేశానికి వీఆర్సీ కళాశాల నుంచి దారిని ఏర్పాటు చేయడంతో ఈ మార్పు జరిగింది. చివరికి ఓ దుకాణాన్ని కుదించి దీని ఏర్పాటుకు వీలు కల్పించారు. మరోవైపు భారీ వర్షాలతో ఇక్కడి మైదానం చిత్తడిగా మారడం ఇబ్బందిగా పరిణమించింది. బాణసంచా దుకాణాల కేటాయింపునకు ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహణ ఏటా 60కు అనుమతి.. ఈసారి మాత్రం 41 అధికారులను ప్రశ్నించిన లైసెన్స్దారులు - 
      
                   
                               
                   
            అమరావతికి రేషన్ పంచాయితీ
నెల్లూరు సిటీ: జిల్లాలో టీడీపీ నేతలు విచ్చలవిడిగా సాగిస్తున్న రేషన్ బియ్యం అక్రమ వ్యాపారం ఆ పార్టీని ఇరకాటంలో పెట్టింది. నెలకు రూ.కోట్లల్లో ఈ దందా జరుగుతోంది. అయితే తమకు అందాల్సిన వాటాలు అందకపోవడమో.. మరేదో తెలియదు కానీ.. ఆ పార్టీ నేత, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఇటీవల మంత్రి నారాయణ కీలక అనుచరుడు, సివిల్సప్లయ్స్ శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని ప్రత్యక్షంగా, జనసేన పార్టీని పరోక్షంగా డీసీఎం పవన్కల్యాణ్, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను టార్గెట్ చేసి రేషన్ మాఫియా దందాపై బహిరంగంగా ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ పరిణామాలు రెండు పార్టీల్లోనూ కాక పుట్టించింది. టీడీపీ నేత బహిరంగ విమర్శలు ఆ పార్టీకి తలనొప్పిగా పరిణమించాయి. మంత్రి నారాయణ నియోజకవర్గ పరిధిలోని నేతలు పార్టీ పరువును బజారుకీడ్చడంతో సీఎం చంద్రబాబు సీరియస్ అయినట్లు సమాచారం. మరో వైపు నాదెండ్ల మనోహర్ సైతం మంత్రి నారాయణపై తీవ్రస్థాయిలో అసహానం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈక్రమంలో నారాయణ సదరు నేతలపై టెలికాన్ఫరెన్స్లో తీవ్ర స్థాయిలో మండిపడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వరుస పరిణామాలు కూటమి పార్టీలను ఇరకాటంలో పెట్టడంతో అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిలను శనివారం అమరావతికి పిలిపించిన పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చీవాట్లు పెట్టారని సమాచారం. బహిరంగ విమర్శలు ఎందుకు చేసుకున్నారు? రేషన్ బియ్యంలో పాత్ర ఎవరిది ఉంది? మీడియా ముందు ఎందుకు విమర్శలు చేశారు? అంటూ పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ఈ విషయంపై ఆగ్రహంగా ఉన్నారని చెప్పినట్లు సమాచారం. మరోసారి ఇటువంటి చర్యలకు పాల్పడితే వారిపై పార్టీ పరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు తెలిసింది. వీరిద్దరితోపాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు, వక్ఫ్బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కూడా పాల్గొన్నారు. టీడీపీ నేతల మధ్య రేషన్ బియ్యం విభేదాలు నుడా చైర్మన్ కోటంరెడ్డి బహిరంగ విమర్శలపై అధిష్టానం సీరియస్ మంత్రి నారాయణ టెలి కాన్ఫరెన్స్ పెట్టి ఆగ్రహం జిల్లా నేతలకు చీవాట్లు పెట్టిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా - 
      
                   
                               
                   
            సమ్మె విరమణ శోచనీయం
● డిమాండ్లు నెరవేర్చేంత వరకు దశలవారీ పోరాటాలు నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల ప్రధాన డిమాండ్లను నెరవేర్చకుండానే సమ్మెను విరమించడం శోచనీయమని పలువురు పేర్కొన్నారు. నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో విలేకరులతో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దుగ్గిరాల సూరిబాబు, జిల్లా కార్యదర్శులు హజరత్తయ్య, జాకీర్హుస్సేన్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూని యన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొజ్జా సుమన్ విలేకరులతో శనివారం మాట్లాడారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ కార్మికుల క్రమబద్ధీకరణ, గ్రేడ్ – 2 జేఎల్ఎంల సమస్యల పరిష్కారం తదితరాలపై సమ్మెకు విద్యుత్ జేఏసీ పిలుపునిచ్చిందని చెప్పారు. ఈ క్రమంలో యాజమాన్యం, ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో డిమాండ్లను నెరవేర్చకుండానే మధ్యలో సమ్మెను విరమించడం శోచనీయమని చెప్పారు. కార్మికుల డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తోందని ఆరోపించారు. దశలవారీ పోరాటాలు, ఆందోళనలు చేసేందుకు విద్యుత్ స్ట్రగుల్ కమిటీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. యూనియన్ ఆఫీస్ బేరర్స్ పెంచలప్రసాద్, జిల్లా నేతలు సురేంద్ర, కొండయ్య, జనార్దన్, దయాకర్, నారాయణ, రామయ్య, మస్తాన్, ప్రసన్నకుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. - 
      
                    
‘తుంగభద్రకు పట్టిన గతి తప్పదు’
సోమశిల: నెల్లూరు జిల్లా రైతాంగానికి తాగు, చైన్నె, తిరుపతి నగరాలకు తాగునీరందించే సోమశిల జలాశయం భద్రతపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ప్రాజెక్ట్ నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం గండం పొంచి ఉందని తెలుస్తోంది. ప్రాజెక్ట్ నిర్వహణకు గతంలో సుమారు 30 మంది వరకు సిబ్బంది విధుల్లో ఉండేవారు. అయితే ప్రస్తుతం కేవలం నలుగురికే పరిమితం కావడంతో జలాశయం నిర్వహణ లోపం కనిపిస్తోంది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 74 టీఎంసీలు ఉన్నాయి. ఎందుకీ భయం.. ఏమానుమానాలు? సోమశిల జలాశయానికి 12 క్రస్ట్ గేట్లు ఉన్నాయి. అన్ని క్రస్ట్ గేట్ల ద్వారా ఒకేసారి నీటిని విడుదల చేస్తే 24 గంటల వ్యవధిలో గరిష్టంగా 6 లక్షల నుంచి 6.50 లక్షల నీటి విడుదల చేసే అవకాశం ఉందని ప్రాజెక్ట్ ఇంజినీర్లు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం జలాశయంలో 11, 12వ క్రస్ట్ గేట్లు పూర్తిగా బ్లాక్ అయ్యాయి. గేట్లు లిఫ్ట్ చేసే రోప్లు పూర్తిగా దెబ్బతినడంతో అవి లిఫ్ట్ అయ్యే సమయంలో తెగిపోయే అవకాశం ఉండడంతో రోప్లు మార్చే ప్రక్రియ విషయంలో సంబంధిత అధికార యంత్రాంగం ఆది నుంచి అలవికాని నిర్లక్ష్యం ప్రదర్శించింది. జలాశయంలో నీటి సామర్థ్యం తక్కువగా ఉన్న సమయంలోనే చేయాల్సి ఉన్నా.. వేసవి కాలం అంతా పట్టించుకోలేదు. తాజాగా ఎగువ నుంచి ఇటీవల వరద రావడంతో ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. ఈ క్రమంలో ప్రాజెక్ట్ నుంచి కేవలం 5, 6, 7 క్రస్ట్ గేట్ల నుంచి మాత్రమే నీటిని దిగువకు విడుదల చేయడంతో మిగతా గేట్ల లిఫ్ట్పై అనేక అనుమానాలు ఉన్నాయి. 1, 2, 3, 4, 8, 9, 10 గేట్ల రోప్లు సైతం తుప్పు పట్టి ఉన్నాయి. దాదాపుగా నాలుగేళ్లుగా ఈ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన సందర్భం లేదు. ప్రధానంగా సిబ్బంది కొరత కారణంగా ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్ల నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. భారీ స్థాయిలో వరదలు వస్తే పరిస్థితి ఏమిటనే భయం జిల్లా వాసులను వెంటాడుతోంది. వణికించిన 2021 నవంబర్ వరదలు సోమశిలకు నాలుగున్నర దశాబ్దాల కాలంలో ఎన్నడూ భారీ స్థాయిలో వరదలు వచ్చిన సందర్భం లేదు. 2021 నవంబర్లో ఎగువన అన్నమయ్య డ్యామ్ తెగి ప్రాజెక్ట్కు ఊహించని స్థాయిలో వరద వచ్చింది. రాత్రికి రాత్రే ఒక్కసారిగా ప్రాజెక్ట్ 12 క్రస్ట్ గేట్లు ఎత్తి సుమారుగా 6 లక్షల క్యూసెక్కులు విడుదల చేయడంతో దిగువన పెన్నానది తీరం వెంబడి అనేక ప్రాంతాల ముంపునకు గురయ్యాయి. ఎగువ నుంచి వచ్చిన వరదను ఆ స్థాయిలో దిగువకు విడుదల చేయకపోతే ప్రాజెక్ట్ ప్రమాదంలో పడేదని జలవనరుల నిపుణులు అప్పట్లో ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో గండం గడిచిపోయింది. ఆ తర్వాత ఆ స్థాయిలో గత మూడేళ్లుగా వరదలు రాలేదు. నూతన రోప్లు వచ్చి నాలుగు నెలలు రాష్ట్ర జలవనరుల సాంకేతిక సలహాదారు కన్నయ్యనాయుడు పరిశీలించిన రెండు నెలలకు కాంట్రాక్ట్ అప్పగించి నూతన రోప్లను ప్రాజెక్ట్ వద్దకు చేర్చారు. అప్పట్నుంచి సుమారు నాలుగు నెలలు అవుతున్న రోప్ల మరమ్మతులు చేయలేదు, ఇటీవల ఒకటో నంబర్ క్రస్ట్ గేటుకు స్టాప్ లాక్ అమర్చి మరమ్మతు చేయాలని ముందుకు వచ్చారు. ఈ తరుణంలో వరదలు వచ్చి జలాశయం పూర్తిగా నిండిపోయింది. ప్రస్తుతం నీటిలో రోప్లో మార్చేందుకు సంబంధిత వర్కర్లు రావడం లేదని జలాశయ అధికారులే చెబున్నారని సమాచారం. పొంచి ఉన్న ప్రమాదం గ్రేటర్ రాయలసీమపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంటుంది. నైరుతి రుతుపవనాలు విస్తరించిన సమయంలో అడపాదడపా వర్షాలు కురిసినా రాయలసీమ జిల్లాలతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై పెద్దగా వర్ష ప్రభావం ఉండదు. తాజాగా ఈశాన్య రుతుపవనాలు రాకతో వాతావరణ మార్పులు సంభవించాయి. ప్రస్తుతం ఎక్కడ పడితే అక్కడ ఆకస్మిక వర్షాలు, వరదలు వస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏ స్థాయిలో వర్షాలు పడుతాయో ఎవరూ ఊహించలేని పరిస్థితి. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఈశాన్య రుతుపవనాల ప్రభావంగా ఎగువ ప్రాంతాల్లో, జలాశయ ప్రాంతంలో కురిసే ప్రతి వర్షపు చుక్క నేరుగా సోమశిల జలాశయానికి చేరుతోంది. ఇప్పటికే నిండుకుండగా ఉన్న జలాశయానికి వచ్చే వరద జలాలను నిల్వ ఉంచేందుకు వీలులేనందున దిగువకు విడుదల చేయాల్సి పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో గతంలో వచ్చిన స్థాయిలో వరద వస్తే.. క్రస్ట్ గేట్లను లిఫ్ట్ చేసి వరద దిగువకు విడుదల చేయాలంటే.. 11, 12 క్రస్ట్ గేట్లు పూర్తిగా బ్లాక్ అయిపోవడంతో మిగిలిన పది గేట్లలో ప్రస్తుతం 5, 6, 7 క్రస్ట్ గేట్లు సేఫ్గానే ఉన్నాయని ఇటీవల స్పష్టమైంది. మిగతా గేట్ల విషయంలో జలాశయం అధికారులకే స్పష్టత లేదని సంబంధిత అధికార వర్గాల ద్వారా స్పష్టమవుతోంది. ఎనిమిది నెలల క్రితం రాష్ట్ర జలవనరుల సాంకేతిక సలహాదారు కన్నయ్యనాయుడు జలాశయ స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రాజెక్ట్ పరిశీలనకు వచ్చారు. జలాశయ ఎస్ఈ, ఈఈ, డీఈ, సిబ్బందితో కలిసి జలాశయ ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ఆయన క్రస్ట్ గేట్ల దుస్థితి చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్ల విషయంపై కనీస నిర్వహణ చేయకపోవడంతో ఆయన మండి పడ్డారు. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్ గేట్లకున్న రోప్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.. ఇలానే మార్చకుండా మరమ్మతులు చేయకుండా వదిలేస్తే గతంలో తుంగభద్రకు పట్టిన గతి ఈ ప్రాజెక్ట్కు పడుతుందన్నారు. - 
      
                   
                               
                   
            జర్నలిస్టులను వేధించడం తగదు
సమాజంలో జరుగుతున్న విషయాలను ప్రజలకు చేరవేడం జర్నలిస్టుల విధి. మూడో మైలు దగ్గర మద్యం షాపు వద్ద ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయంపై స్థానికుల సమాచారం మేరకు ‘సాక్షి’ బ్యూరో మస్తాన్రెడ్డి వార్తను రాశారు. దీనిపై కక్ష కట్టిన ప్రభుత్వం అక్రమ కేసులతో అర్ధరాత్రి నోటీసులతో భయపెడుతూ వేధించడం తగదు. – జయరాజు, జర్నలిస్టు సంఘాల జేఏసీ పత్రికల గొంతు నొక్కకండి జర్నలిస్టులకు పార్టీలను ఆపాదించడం సరికాదు. ఏ పార్టీ అయినా రాజకీయంగానే పోరాడాలే తప్ప జర్నలిస్టులపై కక్ష సాధించడం, పత్రికల గొంతు నొక్కడం ప్రజాస్వామ్య హితం కాదు. ఏదైనా అభ్యంతరకరమైన వార్త ప్రచురితమైతే వివరణ కోరాలే కానీ, ‘సాక్షి’ ఎడిటర్, బ్యూరో చీఫ్, రిపోర్టర్లపై కేసులు పెట్టి పోలీసుల ద్వారా నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో బెదిరించడం దుర్మార్గం – పర్రి బాలకృష్ణ, జర్నలిస్టు సంఘాల జేఏసీ - 
      
                   
                               
                   
            పత్రికా స్వేచ్ఛపై దాడి
నెల్లూరురూరల్ : ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధంగా ‘సాక్షి’ జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం, పత్రికా స్వేచ్ఛపై కక్ష పూరిత దాడులు చేయడం దారుణమని, జర్నలిస్టు సంఘాల ఐక్యవేదిక (జేఏసీ) నాయకులు దయాశంకర్, ‘సాక్షి’ టీవీ బ్యూరో ఇన్చార్జి లోకేశ్ అన్నారు. ‘సాక్షి’ పత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డి, నెల్లూరు జిల్లా బ్యూరో ఇన్చార్జి సీహెచ్ మస్తాన్రెడ్డి, అర్ధరాత్రి పూట నోటీసులు, కలిరిగి రిపోర్టర్ ఇంట్లో సోదాలు చేయడం, వేధించడాన్ని నిరసిస్తూ శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు నిరసన నినాదాలు చేశారు. కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసి జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు వినతి పత్రం ఇచ్చారు. కలెక్టర్తో నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులకు పార్టీలతో సంబంధం ఉండదన్నారు. ప్రజా సమస్యలపై కథనాలు, వార్తలు మాత్రమే రాస్తారన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే జర్నలిస్టుల విధి అన్నారు. ఈనెల 8న నకిలీ మద్యానికి సంబంధించి స్థానికులు అనుకుంటున్న సమాచారాన్ని వార్త రూపంలో ‘సాక్షి’ ప్రచురించిందన్నారు. ఈ వార్తలో ఏమైనా అభ్యంతరాలున్నాయని భావిస్తే ఖండన పంపొచ్చని లేదా చట్టపరంగా చర్యలు చేపట్టవచ్చన్నారు. అయితే అందుకు విరుద్ధంగా ప్రజా సమస్యలను పరిష్కరించడం చేతకాని ప్రభుత్వం ‘సాక్షి’ పత్రిక బ్యూరో ఇన్చారి్జ్ ఇంటికి అర్ధరాత్రి పూట పోలీసులను పంపి నోటీసులు ఇవ్వడం ఎంత వరకు సమంజనమన్నారు. చుట్టుపక్కల వారిని భయభ్రాంతులకు గురి చేయడం. ఇళ్లలోని మహిళలలను భయపడేలా చేయడం వంటి ఘటనలు చట్టానికి విరుద్ధంగా చేశారన్నారు. ‘సాక్షి’ పత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డికి కూడా అర్ధరాత్రి హైదరాబాద్లో నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. మాటి మాటికి విచారణ పేరుతో పోలీసుస్టేషన్కు పిలిపించడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభం జర్నలిజం అనేది మరిచారా అంటూ నిగ్గదీశారు. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే కాకుండా వార్తలు రాయకుండా అక్రమ కేసులతో జర్నలిస్టులను భయపెట్టే ప్రయత్నం చేయడమేనని ఆరోపించారు. దీనిని తాము ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం తమ చర్యలు మానుకోకుంటే ఐక్య ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ‘సాక్షి’ బ్యూరో మస్తాన్రెడ్డి, ‘సాక్షి’ యోగానందరెడ్డి, సాంబశివరావు, ధనలక్ష్మి, హజరత్తయ్య, కృష్ణారెడ్డి, శ్రీధర్, రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు. పోలీసుల విచారణకు ‘సాక్షి’ బ్యూరో హాజరు సంఘీభావం తెలిపిన జర్నలిస్టులు నెల్లూరు(క్రైమ్): ‘సాక్షి’ పత్రికలో వచ్చిన వార్త కథనాలపై నెల్లూరు రూరల్, కలిగిరి పోలీసుస్టేషన్లలో నమోదైన కేసుల్లో ‘సాక్షి’ బ్యూరో ఇన్చార్జి సీహెచ్ మస్తాన్రెడ్డి శుక్రవారం పోలీసు విచారణకు హాజరయ్యారు. అత్యవసర పనుల దృష్ట్యా ఈ నెల 24న విచారణకు హాజరవుతానని ఆయన లిఖిత పూర్వకంగా నెల్లూరు రూరల్ ఎస్ఐ లక్ష్మణ్, కలిగిరి ఎస్ఐ ఉమాశంకర్లను కోరారు. అందుకు వారు సమ్మతించారు. జర్నలిస్టులు పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ పోలీసుస్టేషన్ వద్దకు చేరుకుని మస్తాన్రెడ్డికి సంఘీభావం ప్రకటించారు. ‘సాక్షి’ మీడియాపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలనీ, వేధింపులు ఆపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘సాక్షి’ జర్నలిస్టులపై అక్రమ కేసులు దారుణం వాస్తవాలు రాస్తే వేధిస్తారా? అర్ధరాత్రి పోలీసుల ద్వారా నోటీసులిచ్చి భయభ్రాంతులకు గురి చేస్తారా? ప్రజాస్వామ్యానికి నాల్గో స్తంభం జర్నలిజం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు జర్నలిస్టుల ఐక్యసంఘాల వేదిక వినతిపత్రం అందజేత - 
      
                   
                               
                   
            టీచర్లను రిలీవ్ చేయాలి
నెల్లూరు(టౌన్): ఈ ఏడాది జూన్లో ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయా లని పలువురు డిమాండ్ చేశారు. నెల్లూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద టీచర్లు చేస్తున్న ధర్నాకు మద్దతుగా ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ హజరత్ 48 గంటల ఆమరణ నిరాహార దీక్షను శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో సుమారు 450 మంది ఉపాధ్యాయులు రిలీవర్లు లేని కారణంగా బదిలీ కాలేదన్నారు. ఎంటీఎస్ టీచర్లతో, ఆ తర్వాత డీఎస్సీ నూతన ఉపాధ్యాయులతో రిలీవ్ చేస్తామని చెప్పినా ఇంత వరకు చర్యలు తీసుకోలేదన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు తిరుమలేష్, వెంకటరావు, మాధవి, సుమ, కుసుమ, భార్గవి, వహీదా, సర్వసతి, బ్యూలా పాల్గొన్నారు. - 
      
                   
                               
                   
            శ్లాబ్ కూలి.. కన్నీళ్లు మిగిలి..
● నెల్లూరులో వ్యక్తి దుర్మరణం నెల్లూరు(క్రైమ్): అతను కుటుంబ సోషణ నిమిత్తం పనికెళ్లేందుకు తెల్లవారుజామునే నిద్ర లేచాడు. సిద్ధమై ఇంటి నుంచి బయటకు రాగా శ్లాబ్ రూపంలో మృత్యువు కబళించింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శ్లాబ్ కూలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరులోని రంగనాయకులపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. సోమిశెట్టి కల్యాణ మండపం సమీపంలో ఎన్.వెంకటేశ్వర్లుకు చెందిన గృహ సముదాయంలో బొమ్మా దయాకర్ (47), లక్ష్మి దంపతులు అద్దెకుంటున్నారు. దయాకర్ స్థానికంగా టీ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రోడ్డు మార్జిన్లో దుకాణం తొలగించడంతో కొంత కాలంగా తోపుడు బండిపై టీ విక్రయిస్తున్నాడు. రోజూ తెల్లవారుజామునే టీ తయారు చేసుకుని బండిపై పెట్టుకుని అమ్ముకునేవాడు. శుక్రవారం తెల్లవారుజామున సిద్ధమై బయటికొచ్చాడు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రెండో అంతస్తు సైడ్ శ్లాబ్ నానిపోయి ఉండగా అది విరిగి దయాకర్పై పడింది. పెద్ద శబ్దం రావడంతో భార్య, పక్క ఇళ్లలో ఉన్నవారు బయటికొచ్చిచూడగా అప్పటికే దయాకర్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. దీంతో వారు 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని దయాకర్ను పరీక్షించి అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. కాసేటి క్రితం వరకు ఇంట్లో తిరిగిన భర్త విగతజీవిగా పడి ఉండటాన్ని చూసిన లక్ష్మి కన్నీరుమున్నీరుగా రోదించింది. బాధితురాలు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ వైవీ సోమయ్య, ఎస్సై సుల్తాన్బాషాలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. - 
      
                   
                               
                   
            శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్లో 30 కంపార్టుమెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 61,521 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 25,101 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.66 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమ యం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికే క్యూలోకి వెళ్లాలని, ముందుగా వెళ్తే అనుమతించరని టీటీడీ స్పష్టం చేసింది. బీఎస్ఎన్ఎల్ దీపావళి ఆఫర్లు నెల్లూరురూరల్: బీఎస్ఎన్ఎల్ కొత్త వినియోగదారులకు దీపావళి పండగ సందర్భంగా కానుక ప్రకటించిందని ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ అమరేందర్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్యాకేజీలో రూ.1కే సిమ్, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2.5 జేబీ హైస్పీడ్ డేటా, 100 ఎస్ఎంఎస్లు ఉపయోగించుకోవచ్చు అని తెలిపారు. ఈ సిమ్ కోసం ఆధార్ ధ్రువీకరణతో దగ్గరలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్, రిటైలర్ వద్దకు గాని లేదా డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్లను సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశం నవంబరు 15 వరకు కొనసాగుతుందన్నారు. రెవెన్యూ జోన్–3 క్రీడలు వాయిదా నెల్లూరు (అర్బన్): ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 18, 19 తేదీల్లో ఒంగోలులో జరగాల్సిన జోన్–3 (నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు) క్రీడలను వర్షాల నేపథ్యంలో ఈ నెల 23, 24 తేదీలకు వాయిదా వేశామని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, అమరావతి జేఏసీ చైర్మన్ అల్లంపాటి పెంచలరెడ్డి శుక్రవారం నెల్లూరులో ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి మూడేళ్లకు ఒక దఫా రెవెన్యూ క్రీడలను అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుతున్నామన్నారు. జోన్ల స్థాయిలో పోటీలు పూర్తి చేసుకుని వచ్చే నెల 7 నుంచి 3 రోజులపాటు అనంతపురంలో రాష్ట్ర స్థాయి పోటీలను అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహిస్తామన్నారు. రెవెన్యూ ఉద్యోగులు క్రీడా పోటీలను విజయవంతం చేయాలని కోరారు. సంగం తహసీల్దార్కు డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగోన్నతి సంగం: రాష్ట్ర వ్యాప్తంగా 37 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ఉద్యోగోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ జాబితాలో ఉన్న సంగం తహసీల్దార్ సోమ్లానాయక్ డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొందారు. దీంతో శుక్రవారం కార్యాలయంలో సిబ్బంది పూలమాలలు, శాలువాలతో సోమ్లానాయక్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ జ్యోతి, ఆర్ఐ సల్మా, వీఆర్వోలు సిబ్బంది పాల్గొన్నారు. సమష్టి కృషితో వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన● జేసీ ఎం. వెంకటేశ్వర్లు నెల్లూరురూరల్: సమష్టి కృషితోనే వెట్టిచాకిరీ వ్యవస్థ నిర్మూలన సాధ్యమని జేసీ మొగిలి వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ స మావేశం జరిగింది. ఇప్పటి వరకు వెట్టిచాకిరీ నిర్మూలన, ప్రయత్నాయ ఉపాధి, పునరావాస కల్పనకు తీసుకున్న చర్యలను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సీహెచ్ విజయ్కుమారరెడ్డి కమిటీ సభ్యులకు వివరించారు. జేసీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో ఇటుక బట్టీలు, పరిశ్రమలు, వ్యాపార దుకాణాలు, రొయ్యలు, చేపల గుంతలు, రైసు మిల్లులు, హోటళ్ల మొదలైన ప్రదేశాల్లో కమిటీ సభ్యులు ఆకస్మిక తనిఖీలు చేసి వెట్టిచాకిరి బాధితులను గుర్తించాలన్నారు. విముక్తి పొందిన బాలురకు ఒక సర్టిఫికెట్ అందించి పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలతో తోడ్పాటు అందిస్తున్నాయని వివరించారు. సోషల్ వెల్ఫేర్ డీడీ శోభారాణి, డీఎంహెచ్ఓ సుజాత, డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి, ఐటీడీఏ పీఓ మల్లికార్జునరెడ్డి, ఏఎస్ఐ వై శ్రీహరి, సభ్యులు బషీర్, సుదర్శన్, దాసరి పోలయ్య, సత్యవతమ్మ, పాపయ్య పాల్గొన్నారు. 


