శేష వాహనంపై మూలస్థానేశ్వర స్వామి
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నెల్లూరులోని మూలాపేటలోని ఉన్న శ్రీభువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామికి శుక్రవారం శేష వాహనసేవ జరిగింది.
– నెల్లూరు
(బృందావనం)
ప్రశ్నించినందుకు నోటీసులా?
నెల్లూరు రూరల్: బాధితుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు నోటీసులివ్వడం దారుణమని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితకు నోటీసులివ్వడం నిరంకుశ పాలనకు నిదర్శనమన్నారు. శాంతిభద్రతలను గాలికొదిలేసి రాజకీయ కక్ష సాధింపుల కోసం వ్యవస్థలను ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. దీంతో దేశంలో అట్టడుగు ర్యాంక్కు ఏపీ పోలీస్ వ్యవస్థ పడిపోయిందన్నారు.
శేష వాహనంపై మూలస్థానేశ్వర స్వామి


