అబద్ధాలు, మోసాలు
కూటమి ప్రభుత్వం మూడో బడ్జెట్లో అన్నీ అబద్ధాలు, మోసాలే. సంక్షేమ పథకాలను అటకెక్కించారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.1500 బడ్జెట్లో పెట్టలేదు. సూపర్ సిక్స్ పథకాలకు మొండి చేయి చూపించారు. మిగిలిన పథకాలకు సైతం కోతల విధించారు. అప్పులతో కూడిన బడ్జెట్గా కనిపిస్తోంది. ఆత్మస్తుతి పరనిందతో బడ్జెట్ను రూపొందించారు. గత ప్రభుత్వంపై నిందలు వేయడం, వీరు ఉద్దరిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. రైతులు, సాధారణ ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎక్కడా ప్రభుత్వం అండగా నిలవలేకపోయింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్రెడ్డి నిధులను సంపూర్ణంగా కేటాయించారు. నాడు–నేడు, ఆరోగ్యశ్రీకు నిధులు కేటాయింపులు సక్రమంగా జరగలేదు.
– కాకాణి గోవర్ధన్రెడ్డి, మాజీమంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు
●


