సాక్షి, నెల్లూరు జిల్లా: సంగం మండలం కోలగట్ల వద్ద జాతీయ రహదారిపై బస్సు ప్రమాదం జరిగింది. చెట్టును ఢీకొట్టి ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. అనంతపురం నుంచి నెల్లూరు వెళ్తుండగా లారీని తప్పింబోయి చెట్టును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులు 22 మంది ప్రయాణికులు ఉన్నారు. ఐదుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. వేప చెట్టును ఢీకొట్టి బోల్తాపడటంతో పెను ప్రమాదమే తప్పింది.


