కాకాణితో ప్రసన్న భేటీ
కోవూరు: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డిని ఆయన నివాసంలో మాజీ మంత్రి, పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి శనివారం భేటీ అయ్యారు. కూ టమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ పటిష్టతపై సుదీర్ఘంగా చర్చించారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, కోవూరు నియోజకవర్గ పరిశీలకుడు కొండూరు అనిల్బాబు, నాయకులు గొల్లపల్లి విజయకుమార్, కలువ బాలశంకర్రెడ్డి ఉన్నారు.


