అక్రమ సబ్ డివిజన్ రద్దు చేయాలి
వంశపారంపర్యంగా వస్తున్న పట్టా పొలంలో ఎటువంటి భాగ పరిష్కారాలు లేకుండానే ఓ వ్యక్తి కొనుగోలు చేసి ఏకంగా సబ్ డివిజన్ చేసుకున్నారని, దీనిని రద్దు చేయాలని కలువాయికి చెందిన పలువురు రైతులు వినతిపత్రం అందజేశారు. తమ పట్టా భూమికి సంబంధించి సోమశిల దక్షిణకాలువ నిర్మాణంలో భూసేకరణ పరిహారం కూడా అందిందన్నారు. రికార్డులు తారుమారు చేసి ఏకంగా సబ్ డివిజన్ ఇష్టం వచ్చినట్లు చేసుకోవడమే కాకుండా లేఅవుట్కు సిద్ధం చేశారని, తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్కు తెలిపారు.


