ఒక్క రూపాయి కేటాయించలేదు
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో మహిళల సంక్షేమానికి నిధులు కేటాయించలేదు. పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాట నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు. ఆడబిడ్డ నిధి కింద ఏటా రూ.1,500 ఇస్తామని హామీ ఇచ్చి బడ్జెట్లో మాత్రం ఆ పథకానికి రూపాయి కేటాయించలేదు. మహిళలను చంద్రబాబు నిండా మోసం చేశారు. కూటమి ప్రభుత్వం ఒక్క నూతన పింఛన్ కూడా అందజేయలేదు. నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేసింది. నేడు కూటమి పాలనలో ఆ పరిస్థితి లేదు. అన్ని వర్గాలను బడ్జెట్ నిరాశపరిచింది.
– మొయిళ్ల గౌరి, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగ జోనల్ అధ్యక్షురాలు


