తల్లికి వందనం.. మోసం
తల్లికి వందనం కింద కుటుంబంలో 12వ తరగతి లోపు ఎంత మంది చదువుకుంటుంటే అంత మందికి రూ.15 వేలు చొప్పున తల్లికి వందనం వేస్తామని చెప్పిన ప్రభుత్వం తల్లులను మోసం చేసింది. గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కింద రూ 13 వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా రూ 9,407 కోట్లు విడుదల చేసింది. అనేక మందికి రూ.7 వేలు, రూ.9 వేలు వేసి మిగతా మొత్తాన్ని ఎగనామం పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా బడ్జెట్లో ఆ మేరకు నిధులు పెంచుతారా అంటే.. తూతూ మంత్రంగా కేవలం రూ.261 కోట్లను మాత్రమే బడ్జెట్లో పెంచింది. సరిపడా ఈ సంవత్సరం కూడా నిధులు ఇవ్వలేదు. అంటే ఈ సంవత్సరం కూడా తల్లులను ప్రభుత్వం మోసం చేయబోతోందని అర్థమవుతోంది.


