సిబ్బంది సంక్షేమమే ధ్యేయం : ఏఎస్పీ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమమే ధ్యేయమని ఏఎస్పీ సౌజన్య తెలిపారు. శుక్రవారం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఫోన్ఇన్ కార్యక్రమంలో ఆమె పాల్గొని 13 మంది సిబ్బంది సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బంది సుదూర ప్రాంతాల నుంచి వచ్చి పోలీస్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ఫోన్ ద్వారా సమస్యలను నేరుగా చెప్పొచ్చన్నారు. 13 మంది సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించామన్నారు. కార్యక్రమంలో పోలీసు కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


