మర్యాదపూర్వకంగా..
కోవూరు: వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులైన బట్టేపాటి విజయలక్ష్మి శుక్రవారం మాజీ మంత్రి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితారెడ్డిని నెల్లూరులో మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మాజీ మంత్రి వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డిని ఆయన నివాసంలో విజయలక్ష్మి కలిశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి బట్టేపాటి నరేంద్రరెడ్డి పాల్గొన్నారు.
మర్యాదపూర్వకంగా..


