కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం

Jan 27 2026 9:25 AM | Updated on Jan 27 2026 9:25 AM

కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం

కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం

కావలి(దగదర్తి): కావలి సమీపంలోని గౌరవరం జాతీయ రహదారిపై సోమవారం మోటార్‌బైక్‌ను కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గౌరవరం గ్రామానికి చెందిన తిప్పారెడ్డి శ్రీనివాసరెడ్డి (59) తన బైక్‌పై పొలానికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో శ్రీనివాసరెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. కావలి రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement