తీవ్ర నేరారోపణలు.. సైబర్‌ క్రైమ్‌ యూనిట్‌ సోదాలు | French prosecutors raided Elon Musk X in Paris check details | Sakshi
Sakshi News home page

తీవ్ర నేరారోపణలు.. సైబర్‌ క్రైమ్‌ యూనిట్‌ సోదాలు

Feb 4 2026 11:57 AM | Updated on Feb 4 2026 12:07 PM

French prosecutors raided Elon Musk X in Paris check details

ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లోని ఎక్స్ కార్యాలయాలపై ఆ దేశ సైబర్ క్రైమ్ యూనిట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. చట్టవిరుద్ధమైన డేటా వెలికితీత, చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి తీవ్రమైన నేరారోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు ఎక్స్ యాజమాన్యం ధ్రువీకరించింది.

దర్యాప్తు నేపథ్యం..

ఈ వివాదం 2025 జనవరిలో ప్రారంభమైంది. ఎక్స్ ప్లాట్‌ఫామ్ తన యూజర్లకు సిఫార్సు చేసే అల్గారిథమ్‌ ఆధారిత కంటెంట్‌పై పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టింది. ఈ దర్యాప్తు క్రమంగా ఎక్స్ వివాదాస్పద ఏఐ చాట్‌బాట్ ‘గ్రోక్’ వరకు విస్తరించింది. అయితే, ఈ చర్యలను ఎక్స్ తీవ్రంగా ఖండించింది. జులై 2025లో స్పందిస్తూ.. ఈ విచారణ అంతా రాజకీయ ప్రేరేపితమని, తమ అల్గారిథమ్‌ను తారుమారు చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది.

ఎక్స్ ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోపణలు

  • పిల్లల అశ్లీల చిత్రాలను కలిగి ఉండటం. వాటిని ఇతరులతో పంచుకోవడంలో ప్లాట్‌ఫామ్ ప్రమేయం ఉండటం.

  • అనుమతి లేకుండా మహిళల లైంగికపరమైన డీప్‌ఫేక్‌(రియల్‌ ఇమేజ్‌లను తలపించేలా ఏఐ ద్వారా సృష్టించే చిత్రాలు) చిత్రాలను సృష్టించడం ద్వారా వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించడం.

  • వ్యవస్థీకృత సమూహాల ద్వారా మోసపూరిత పద్ధతుల్లో డేటాను సేకరించడం.

  • ముఖ్యంగా గ్రోక్ చాట్‌బాట్ మహిళల అసభ్య చిత్రాలను రూపొందిస్తోందన్న వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి. దీనిపై యూరోపియన్ కమిషన్, యూకే రెగ్యులేటర్లు ఇప్పటికే విచారణ ప్రారంభించాయి.

ఎక్స్‌ను ఉపయోగించబోం..

విచారణ తీవ్రతరం కావడంతో పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. తాము ఇకపై ఎక్స్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించబోమని, అధికారిక సమాచారం కోసం లింక్డ్‌ఇన్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ఇతర సామాజిక మాధ్యమాలను ఆశ్రయిస్తామని ప్రకటించింది.

గతంలో టెలిగ్రామ్‌పై చర్యలు

టెక్ దిగ్గజాలపై ఫ్రాన్స్ కఠినంగా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. 2024 ఆగస్టులో కంటెంట్ మోడరేషన్ లోపాలపై టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్‌ను ఫ్రాన్స్ అధికారులు అరెస్టు చేశారు. ప్లాట్‌ఫామ్ కార్యకలాపాల్లో మార్పులు చేసిన తర్వాతే గత మార్చిలో ఆయనను దేశం విడిచి వెళ్లడానికి అనుమతించారు. ప్రస్తుతం ఎక్స్ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం సోషల్ మీడియా నియంత్రణల విషయంలో ఐరోపా దేశాల కఠిన వైఖరిని స్పష్టం చేస్తోంది.

ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement