breaking news
prosecutors raid
-
తీవ్ర నేరారోపణలు.. సైబర్ క్రైమ్ యూనిట్ సోదాలు
ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్లోని ఎక్స్ కార్యాలయాలపై ఆ దేశ సైబర్ క్రైమ్ యూనిట్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. చట్టవిరుద్ధమైన డేటా వెలికితీత, చైల్డ్ పోర్నోగ్రఫీ వంటి తీవ్రమైన నేరారోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరిగినట్లు ఎక్స్ యాజమాన్యం ధ్రువీకరించింది.దర్యాప్తు నేపథ్యం..ఈ వివాదం 2025 జనవరిలో ప్రారంభమైంది. ఎక్స్ ప్లాట్ఫామ్ తన యూజర్లకు సిఫార్సు చేసే అల్గారిథమ్ ఆధారిత కంటెంట్పై పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టింది. ఈ దర్యాప్తు క్రమంగా ఎక్స్ వివాదాస్పద ఏఐ చాట్బాట్ ‘గ్రోక్’ వరకు విస్తరించింది. అయితే, ఈ చర్యలను ఎక్స్ తీవ్రంగా ఖండించింది. జులై 2025లో స్పందిస్తూ.. ఈ విచారణ అంతా రాజకీయ ప్రేరేపితమని, తమ అల్గారిథమ్ను తారుమారు చేశారనే ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది.ఎక్స్ ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోపణలుపిల్లల అశ్లీల చిత్రాలను కలిగి ఉండటం. వాటిని ఇతరులతో పంచుకోవడంలో ప్లాట్ఫామ్ ప్రమేయం ఉండటం.అనుమతి లేకుండా మహిళల లైంగికపరమైన డీప్ఫేక్(రియల్ ఇమేజ్లను తలపించేలా ఏఐ ద్వారా సృష్టించే చిత్రాలు) చిత్రాలను సృష్టించడం ద్వారా వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించడం.వ్యవస్థీకృత సమూహాల ద్వారా మోసపూరిత పద్ధతుల్లో డేటాను సేకరించడం.ముఖ్యంగా గ్రోక్ చాట్బాట్ మహిళల అసభ్య చిత్రాలను రూపొందిస్తోందన్న వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపాయి. దీనిపై యూరోపియన్ కమిషన్, యూకే రెగ్యులేటర్లు ఇప్పటికే విచారణ ప్రారంభించాయి.ఎక్స్ను ఉపయోగించబోం..విచారణ తీవ్రతరం కావడంతో పారిస్ ప్రాసిక్యూటర్ కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. తాము ఇకపై ఎక్స్ ప్లాట్ఫామ్ను ఉపయోగించబోమని, అధికారిక సమాచారం కోసం లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్ వంటి ఇతర సామాజిక మాధ్యమాలను ఆశ్రయిస్తామని ప్రకటించింది.గతంలో టెలిగ్రామ్పై చర్యలుటెక్ దిగ్గజాలపై ఫ్రాన్స్ కఠినంగా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. 2024 ఆగస్టులో కంటెంట్ మోడరేషన్ లోపాలపై టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ను ఫ్రాన్స్ అధికారులు అరెస్టు చేశారు. ప్లాట్ఫామ్ కార్యకలాపాల్లో మార్పులు చేసిన తర్వాతే గత మార్చిలో ఆయనను దేశం విడిచి వెళ్లడానికి అనుమతించారు. ప్రస్తుతం ఎక్స్ ఎదుర్కొంటున్న ఈ సంక్షోభం సోషల్ మీడియా నియంత్రణల విషయంలో ఐరోపా దేశాల కఠిన వైఖరిని స్పష్టం చేస్తోంది.ఇదీ చదవండి: ధర తగ్గిందనుకునేలోపే మళ్లీ.. తులం ఎంతంటే.. -
శాంసంగ్ ప్రధాన కార్యాలయంపై దాడి
సియోల్ : దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ కంపెనీ ప్రధాన కార్యాలయంపై ఆ దేశ న్యాయవాదులు దాడి చేశారు. శాంసంగ్ కంపెనీ అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతుందనే ఆరోపణలతో వారు ఈ రైడ్ నిర్వహించారు. సియోల్ కేంద్ర జిల్లా న్యాయవాదుల ఆఫీసు ప్రత్యేక విచారణ బృందం,శాంసంగ్ ప్రధాన కార్యాలయంపై రైడ్ నిర్వహించినట్టు బుధవారం ఉదయం జిన్హువా న్యూస్ రిపోర్టు చేసింది. దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గుయాన్ హై, చిరకాల మిత్రురాలు చోయి సూన్ సిల్ నిర్వహించే రెండు లాభాపేక్ష లేని ఫౌండేషన్లకు మిలయన్ల కొద్దీ అమెరికా డాలర్లను తరలించినట్టు శాంసంగ్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ ఆరోపణల్లో శాంసంగ్ వైర్ 2.8 మిలియన్ల యూరోలను చోయి ఆధ్వర్యంలోని జర్మన్ కంపెనీకి తరలించినట్టు తెలిసింది. అదేవిధంగా తన రెండు సబ్సిడరీల విలీనానికి కంపెనీ మద్దతుగా నిలిచినట్టు తెలుస్తోంది. ప్రధాన కార్యాలయ నేషనల్ పెన్షన్ ఫండ్ ఆపరేటర్పై కూడా న్యాయవాదులు దాడిచేశారని జిన్హువా పేర్కొంది. అధ్యక్షురాలితో తనకు గత దీర్ఘకాలిక స్నేహబంధాన్ని ఉపయోగించుకుని చోయి వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలనుకున్నట్టు ప్రాసిక్యూటర్లు ఇంతకముందు నుంచే ఆరోపిస్తున్నారు.


