breaking news
Kamareddy District News
-
● చెప్పినా.. చెత్త పని మానరు!
‘‘ఇచ్చట చెత్త వేయరాదు. మీరు సీసీ టీవీ కెమెరాల నిఘాలో ఉన్నారు. వేసినచో రూ.500 జరిమానా విధించబడును.’’ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేసినా ‘చెత్త’ పని మాత్రం మానడం లేదు. జిల్లా కేంద్రంలోని భవానీరోడ్డులో ఉన్న అటవీశాఖ కార్యాలయం గోడకు ఆనుకుని స్థానికులు నిత్యం చెత్త వేస్తుండడంతో ఫారెస్ట్ అధికారులు కంచెను ఏర్పాటు చేశారు. చెత్త వేస్తే జరిమానా విధిస్తామని ఫ్లెక్సీ ఏర్పాటు చేయించారు. అయినప్పటికీ అక్కడ చెత్త పారవేసే వారి తీరు మారలేదు. కంచెను ఆనుకుని చెత్త పారవేస్తుండడంతో ఫారెస్ట్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. – కామారెడ్డి అర్బన్రూర్బన్ పథకం కింద జుక్కల్ నియోజకవర్గ కేంద్రంలో రూ.కోటీ 20 లక్షల వ్యయంతో నిర్మించిన ఆడిటోరియం వినియోగంలోకి తీసుకురాకపోవడంతో తుమ్మ చెట్లు మొలుస్తున్నాయి. ప్రజోపయోగ కార్యక్రమాల కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేసి నిర్మించి వృథాగా వదిలేశారు. ఎందుకు నిర్మించారో, ఎందుకు వదిలేశారో అధికారులు, ప్రజాప్రతినిధులకే తెలియాలి. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
రాయితీ సరే.. స్పందనేదీ?
కామారెడ్డి టౌన్ : అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)కు కామారెడ్డి మున్సిపాలిటీలో స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. 25శాతం రాయితీ ఇస్తూ జూలై 31వ తేదీని గడువుగా ప్రకటించినప్పటికీ దరఖాస్తుదారుల నుంచి స్పందన కరువైంది. 17వేలకు పైగా దరఖాస్తులు.. పరిష్కారమైంది 3,408 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు మొత్తం 17,613 అందగా, వాటిలో ఇప్పటివరకు కేవలం 3,408 దరఖాస్తులను పరిష్కరించి ప్రొసిడింగ్ కాపీలు అందించారు. మరో 7,575 దరఖాస్తులు మున్సిపల్ అధికారుల లాగిన్లో ఉండిపోయాయి. ఆ దరఖాస్తుదారుల నుంచి స్పందన కనిపించడం లేదు. అయితే అధికారులు సైతం పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 4600 మంది దరఖాస్తుదారులకు ఫీజు సమాచారం ఇవ్వగా వారు స్పందించినా మొత్తం ఫీజును చెల్లించకపొవడంతో పెండింగ్లో ఉన్నాయి. షార్ట్ఫాల్స్ 648, తిరస్కరణకు గురైనవి 593, నిషేధిత జాబితాలో ఉన్నవి 789 దరఖాస్తులున్నాయి. ఫీజులు చెల్లించినా ఇంకా ప్రొసిడింగ్ కాపీల కోసం మరి కొందరు ఎదురుచూస్తున్నారు.ప్రభుత్వం, మున్సిపల్ శాఖ మరోమారు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించుకునేందుకు జూలై 31వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఇప్పటికై న దరఖాస్తుదారులు స్పందించాలి. లేనిపక్షంలో అనధికార లే అవుట్లు, ప్లాట్లకు ఇంటి అనుమతులు రావు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – వినిత్, టీపీవో, మున్సిపల్, కామారెడ్డిఅనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలని ప్రభుత్వం నిబంధన పెట్టడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు అప్పులు చేసి మరీ లక్షలాది రూపాయల ఫీజులను ప్రభుత్వ ఖజానాకు చెల్లించారు. దీని ద్వారా మున్సిపాలిటీకి ఇప్పటి వరకు రూ. 12 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. మిగిలిన దరఖాస్తులను పరిష్కారం చూపితే ఇంకా భారీగా ఆదాయం సమకూరనుంది. దరఖాస్తులను పరిష్కరించడంలో టౌన్ ప్లానింగ్ విభాగం ఘోరంగా విఫలమవుతోందని విమర్శలున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన జూలై 31 గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికై నా టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, పెండింగ్లో ఉన్న 7,575 ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాల్సి ఉంటుంది. ఎల్ఆర్ఎస్కు అంతంతే స్పందన జూలై 31 వరకు 25శాతం రాయితీతో అవకాశం జిల్లాలో ఇంకా 7,575 దరఖాస్తులు పెండింగ్ -
కాలువ కలవరం
బాన్సువాడ : నిజాంసాగర్ ప్రాజెక్టు ఉప కాలువలు అధ్వానంగా మారాయి. కాలువల్లో పిచ్చి మొక్కలు పెరగడంతోపాటు చెత్తచెదారం, పూడిక పేరుకుపోయింది. సుమారు దశాబ్దకాలంగా మరమ్మతులు లేకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందడం కష్టంగా మారింది. దీంతో ఉపకాలువలపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద అత్యధికంగా బాన్సువాడ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల రైతులకు ప్రయోజనం చేకూరుతోంది. బాన్సువాడ నియోజకవర్గంలో డి–8 నుంచి డి–39 వరకు డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. పట్టించుకునే వారు లేకపోవడంతో కాలువల్లో పిచ్చి మొక్కలు పెరిగాయి. గుర్రపుడెక్క వ్యాపించింది. వేసవిలోనే కాలువల్లోని పిచ్చి మొక్కలను తొలగించాల్సి ఉన్నా సిబ్బంది కొరతతో పనులు చేయడం లేదు. కాలువ కట్టలు సైతం బలహీనంగా మారాయి. పలుచోట్ల కోతకు గురై ఎక్కడ గండి పడుతోందోనని రైతులు భయపడుతున్నారు. కాలువలకు మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు.కాలువలు అధ్వానంగా మారడంతో చివరి ఆయకట్టకు నీరందడం లేదు. సీజన్ ప్రారంభానికి ముందే కాలువలను బాగు చేయాలి. రైతుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. – నారాయణ, రైతు, బాన్సువాడనిజాంసాగర్ ప్రాజెక్టు ఉప కాలువల్లో పిచ్చి మొక్క లు పెరిగాయి. గుర్రపు డెక్క కూడా అల్లుకుపోయింది. పూడిక పెరగడంతో చివరి ఆయకట్టకు నీరు రావడం లేదు. అధికారులు స్పందించి పూడిక తీయాలి. – గంగాధర్, రైతు, బాన్సువాడమండలం ఆయకట్టు బాన్సువాడ 10,968 బీర్కూర్ 9,431 నస్రుల్లాబాద్ 7,748 వర్ని 5,064 రుద్రూర్ 3,272 మోస్రా 566 చందూర్ 2,513 కోటగిరి 21,370 పదేళ్లుగా మరమ్మతులకు నోచుకోని ‘సాగర్’ కాలువలు ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు చివరి ఆయకట్టుకు అందని సాగునీరు మరమ్మతులు చేయాలని కోరుతున్న రైతులు -
సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం రద్దు చేయాలి
ఎల్లారెడ్డిరూరల్: సెంట్రలైజ్డ్ కిచెన్ విధానం రద్దు చేయాలని ఎండీఎం నిర్వాహకులు మంగళవారం ఆర్డీవో ప్రభాకర్ను కోరారు. ఈమేరకు వినతిపత్రం అందించారు. 2023–24 సంబంధించిన అల్పాహారం పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, త్వరలోనే ప్రారంభించనున్న అల్పాహార పథకాన్ని వంట కార్మికులతోనే నిర్వహించాలని, అల్పాహారానికి సంబంధించి విధివిధానాలు ప్రకటించాలని, గ్యాస్ సహా వంట పథకానికి సరుకులు మొత్తం ప్రభుత్వమే సరఫరా చేయాలని విన్నవించారు. సుజాత, హేమలత, అంబవ్వ, లావణ్య, తదితరులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడాలి
● రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ ● రహవీర్, పీఎం రహత్ పథకాలపై సమీక్షకామారెడ్డి క్రైం: రహదారి ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో వైద్యం అందించి ప్రాణాలను కాపాడాలనే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రహవీర్, పీఎం రహత్ పథకాలపై విస్తృత స్ధాయిలో అవగాహన కల్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో ఆయా పథకాల అమలు తీరునుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహదారిపై ప్రమాదం జరిగిన వెంటనే ప్రజలు స్పందించి బాధితులను సమీప ఆస్పత్రికి తరలించాలని సూచించారు. ప్రమాదం జరిగిన తొలి గంట (గోల్డెన్ అవర్)లోపు బాధితుడిని ఆస్పత్రికి చేర్చి ప్రాణాలను కాపాడిన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.25 వేల నగదు బహుమతి అందజేస్తుందని తెలిపారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి పీఎం రహత్ పథకం కింద ప్రమాదం జరిగిన తేదీ నుంచి 7 రోజుల వరకు ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం లభిస్తుందన్నారు. ఇందులో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు వైద్య ఖర్చుల భారం ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. జాతీయ రహదారులపై మాత్రమే కాకుండా ఇతర రహదారులపై ప్రమాదాలు జరిగినా ఈ పథకం వర్తింస్తుందన్నారు. ప్రమాద బాధితులను కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. -
విద్యుత్రంగ కార్మికులను వేధిస్తే ఊరుకోబోం..
కామారెడ్డి టౌన్ : విద్యుత్ రంగ కార్మికులను వేధింపులకు గురిచేస్తే సహించేది లేదని తెలంగాణ యునైటేడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్(టీఎస్ఈఈ యూ) రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరరావు అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన యూనియన్ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హా జరై మాట్లాడారు. ఈ సందర్భంగా వివిధ ట్రేడ్ యూ నియన్లకు చెందిన పలువురు విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు యూనియన్లో చేరగా వారందరికీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ.. విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారంలో సీఐటీయూ, టీఎస్ఈఈయూ ఎల్లప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు. కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా సంఘం అండగా నిలిచి పోరాడుతుందని స్పష్టం చేశారు. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్, అధ్యక్షుడు గంగాధర్, కార్యద ర్శి మోహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ సునీల్ గౌడ్, ఉపాధ్యక్షులు నర్సాగౌడ్, బాలరాజు, లైన్మెన్ బాలేశం, నర్సింలు, రాఘవచారి, దేవదాస్, అశోక్ రెడ్డి, రవికుమార్, ప్రశాంత్, ప్రతాప్, నరేశ్ పాల్గొన్నారు. -
దివ్యాంగులు, వృద్ధుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత
కామారెడ్డి టౌన్ : జిల్లాలో దివ్యాంగులు, వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. జిల్లా వికలాంగుల, సీనియర్ సిటిజన్స్ కమిటీ సమావేశాలను మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సకాలంలో అందేలా చూడాలన్నారు. జిల్లా వికలాంగుల కమిటీ సమావేశంలో సభ్యులు దివ్యాంగుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ.. పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా సంక్షేమ అధికారిని, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారిని ఆదేశించారు. అనంతరం నిర్వహించిన సీనియర్ సిటిజన్స్ కమిటీ సమావేశంలో వృద్ధుల సంక్షేమ అంశాలపై సమీక్షించారు. ఆర్డీవో పరిధిలో పెండింగ్లో ఉన్న మెయింటెనెన్స్ కేసులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. వృద్ధుల హక్కులను పరిరక్షిస్తూ, వారి సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రసన్న, కమిటీ సభ్యులు పున్న రాజేశ్వర్, రాజన్న, సాయిగౌడ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
‘నాణ్యతలేమితోనే బుంగ పడింది’
బాన్సువాడ: గత ప్రభుత్వం హయాంలో సుమారు రూ.6 కోట్లు వ్యయంతో కల్కి చెరువు కట్ట ఆధునీకరణ పనులు చేపట్టారని, పనులు నాణ్యతతో చేపట్టకపోవడంతో కట్ట దెబ్బతిని తూము వద్ద బుంగ పడిందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. కల్కి చెరువు తూము పనులను మంగళవారం బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం తూము బుంగకు మరమ్మతులు చేపట్టేందుకు రూ.27 లక్షల నిధులు మంజూరు చేశారని అన్నారు. పనులను అధికారులు పర్యవేక్షించి నాణ్యతతో చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోనాల గంగారెడ్డి, నాయకులు ఉమేష్, శ్రీనివాస్, చీకట్ల రాజు, సాయిబాబా, కొండని గంగారం, శంకర్, మహేందర్, ప్రదీప్రెడ్డి, ప్రసాద్ ఉన్నారు. ఆర్టీసీ కార్గో సేవలు పునరుద్ధరించాలని వినతి.. ఆర్టీసీలో కార్గో సేవలు పునరుద్ధరించాలని బీజేపీ నాయకులు మంగళవారం ఆర్టీసీ డీఎం రవికుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోనాల గంగారెడ్డి మాట్లాడుతూ.. గతంలో బాన్సువాడ ఆర్టీసీ డిపో పరిధిలో ఏర్పాటు చేసిన కార్గో సేవలు ప్రజలకు చాలా ఉపయోగపడ్డాయని అన్నారు. ప్రస్తుతం కార్గో సేవలు నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. -
ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే ధ్యేయం
ఎల్లారెడ్డిలో మాట్లాడుతున్న మదన్మోహన్రావు ఎమ్మెల్యేను సన్మానిస్తున్న ఉపసర్పంచులు– ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ఎల్లారెడ్డి: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిలో ఎస్ఐఆర్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి ఒక్క ఓటరు వివరాలను ఓటరు జాబితాలో నమోదయ్యేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయడంతో పాటు, ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని కోరారు. డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎస్ఐఆర్ ఇన్చార్జి నందిమల్ల యాదయ్య, మాస్టర్ ట్రైనర్ నరేష్ రాథోడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాయిబాబా, ఏఎంసీ చైర్పర్సన్ రజిత, తదితరులు పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ పనులు వేగవంతం చేయాలి ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డిలో జరుగుతున్న ట్యాంక్ బండ్ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. మంగళవారం ఎల్లారెడి పెద్ద చెరువు కట్టపై జరుగుతున్న ట్యాంక్ బండ్ పనులను ఆయన పరిశీలించారు. పనులను నాణ్యతగా చేయాలని, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్, సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్గౌడ్, కౌన్సిలర్లు తిరుపతి, గఫార్, మండల పార్టీ అధ్యక్షుడు సాయిబాబా, కాంగ్రెస్ నాయకులు వెంకట్రాంరెడ్డి, తమ్మల శ్యాం తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి లింగంపేట(ఎల్లారెడ్డి): ఉపసర్పంచుల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావును మంగళవారం ఉప సర్పంచులు కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు ప్రసాద్గౌడ్ మాట్లాడారు. గ్రామాల అభివృద్ధిలో ఉపసర్పంచులు కీలక పాత్ర పోషిస్తున్నారని, తమకు తగిన గుర్తింపు ఇవ్వాలని కోరారు. నిధుల వినియోగం, బిల్లుల చెల్లింపులో సర్పంచ్తో సమానంగా చెక్ పవర్ ఉండాలన్నారు. గౌరవ వేతనం రూ.5 వేలు ఇవ్వాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. జిల్లా ఉపసర్పంచుల ఫోరం ఇన్చార్జి శ్రవణ్గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
ఏక్ పేడ్ మా కే నామ్
ఎల్లారెడ్డి: ప్రతి పౌరుడు తమ తల్లికి గౌరవ సూచకంగా లేదా జ్ఞాపకార్థంగా కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని కేంద్ర ప్రభుత్వం ఈ ఉద్యమానికి పిలుపునిచ్చింది. 2024 జూన్ 4న ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభించినా ఈ సంవత్సరం ఈ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం కట్టాయి. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అంశంగా పలు రకాల క్విజ్ పోటీలు, ప్రశంసా పత్రాలు, విద్యా సంస్థలకు నగదు బహుమతులు ఇవ్వనున్నారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ, తెలంగాణ గ్రీన్ కాప్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ పోటీలను నిర్వహించబోతుంది. సెల్ఫీ పోటీలు ఏక్ పేడ్ మా కే నామ్(అమ్మ పేరిట మొక్క) కార్యక్రమంలో భాగంగా సెల్ఫీ పోటీలను నిర్వహిస్తున్నారు. పాఠశాల, కళాశాలల విద్యార్థులు అమ్మ పేరిట ఒక మొక్క నాటి దానితో సెల్ఫీ తీసుకుని ఎన్జీసీ(నేషనల్ గవర్నమెంట్ క్లౌడ్) పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఫొటో అప్లోడ్ చేయగానే సెల్ఫీతో కూడిన ఈ–సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది. ఇందులో విద్యార్థులే కాకుండా సాధారణ పౌరులు కూడా పోటీలో పాల్గొనవచ్చు. ఏ పాఠశాల, కళాశాల నుంచి అయితే ఎక్కువ సర్టిఫికెట్లు జనరేట్ అవుతాయో ఆ విద్యా సంస్థకు ప్రత్యేక నగదు ప్రోత్సాహకాలు, అభినందన ధ్రువపత్రాలను జిల్లా కలెక్టర్ అందజేస్తారు. ఈ ప్రోత్సాహకాల మొత్తాన్ని ఆయా విద్యా సంస్థలు విద్యార్థులు నాటిన మొక్కల సంరక్షణకు ఉపయోగించాలి. ఇంతేగాక సీడ్బాల్స్ (విత్తన బంతులు) తయారు చేసేలా విద్యార్థులను విద్యాసంస్థలు ప్రోత్సహించాలి. సెల్ఫీ పోటీల గడువు.. సెప్టెంబర్ 15 ఏక్ పేడ్ మా కే నామ్ సెల్ఫీ పోటీలు జూన్ 19 నుంచి సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతాయి. సెప్టెంబర్ 20న ఫలితాలు వెల్లడవుతాయి. జిల్లాల వారీగా ఎక్కువ మొక్కలు నాటి అత్యధిక స్కోరు సాధించిన ఐదుగురు విద్యార్థులకు ప్రశంసాపత్రాలు జిల్లా కలెక్టర్ అందజేస్తారు. అలాగే ఎక్కువ మంది విద్యార్థులు పాల్గొనేలా చేసిన విద్యా సంస్థల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు కూడా ప్రత్యేక ప్రశంసా పత్రాలు అందజేస్తారు. రాష్ట్ర స్థాయిలో అత్యధిక స్కోరు సాధించిన విద్యార్థులకు, ఎక్కువ విద్యార్థులు పాల్గొన్న జిల్లాకు సీఎం చేతుల మీదుగా అభినందన పత్రాలు ఇస్తారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు జాతీయ విద్యార్థుల పర్యావరణ పోటీ(ఎన్ఎస్పిసి) పేరిట కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఆన్లైన్ క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నారు. జులై 1 నుండి ఆగస్ట్ 21 వరకు తమకు వీలైన ఏ రోజునైనా వెబ్సైట్ ద్వారా నేరుగా పరీక్ష రాయవచ్చు. క్విజ్ పరీక్షను ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఇతర ప్రాంతీయ భాషల్లో రాయవచ్చు. అడవుల రక్షణ, జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ, నీటి పొదుపు, వర్షపు నీటి నిల్వ పద్ధతులు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, గ్లోబల్ వార్మింగ్, కాలుష్య నివారణ తదితర అంశాలపై క్విజ్ పోటీ జరుగుతుంది.ఈ పోటీలో 1వ తరగతి నుంచి పోస్ట్–గ్రాడ్యుయేషన్, రీసెర్చ్ స్కాలర్స్ వరకు ఎవరైనా ఉచితంగా పాల్గొనవచ్చు. విద్యార్థులు తమ వయస్సు, తరగతి గ్రూప్నకు తగినట్లుగా రూపొందించిన ఆన్లైన్ క్విజ్ పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఈ పోటీలో పాల్గొనే ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటాలి. ఆ మొక్కతో దిగిన సెల్ఫీని రిజిస్ట్రేషన్ సమయంలో వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎకోమిత్రమ్ ఎన్ఎస్పీసీ వెబ్సైట్లోకి వెళ్లాలి వెబ్సైట్లో విద్యార్థి పేరు, తరగతి, పాఠశాల, కళాశాల పేరు, మొబైల్ నెంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి. మొక్కను నాటుతూ దిగిన సెల్ఫీని అప్లోడ్ చేయాలి. అమ్మ పేరిట మొక్క కార్యక్రమానికి విశేష స్పందన విద్యార్థులకు పలు రకాల పోటీలు, ప్రశంసా పత్రాలు విద్యా సంస్థలకు నగదు ప్రోత్సాహకాలు -
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
బాన్సువాడ రూరల్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధు లు ప్రబలకుండా పంచాయతీ కార్యదర్శులు ముందస్తుగా పారిశుద్ధ్య పనులు చేయించాలని జిల్లా పంచాయతీ అధికారి మురళి అన్నారు. బాన్సువాడ మండల కార్యాలయంలో గ్రామాల పంచాయతీల కార్యదర్శులతో మంగళవారం ఆయన సమీక్షా స మావేశం నిర్వహించారు. గ్రామాల్లో డ్రైనేజీలు శు భ్రం చేయించాలన్నారు. ఓవర్హెడ్ ట్యాంకులను క్లీన్ చేయించడంతోపాటు బ్లీచింగ్ చేయించాలన్నా రు. గుంతల్లో మురికి నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయిలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సమన్వయం చే సుకుని వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా పైప్లైన్ లీకేజీలకు మరమ్మతులు చేయించాలన్నారు. అంటువ్యాధులు ప్రబలితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలన్నారు. పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలోని పీర్ల మసీదు(పీర్లను ఉంచే స్థలం) శిథిలావస్థకు చేరడంతో, పీర్లను ఉంచడానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వర్షాకాలంలో వర్షం నీరు పడి పీర్లు తడిసిపోతుండటంతో గ్రామంలోని వారు ముందుకు వచ్చి మసీదుకు మరమ్మతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మసీదు పైభాగంలో రేకులను అమర్చి చుట్టుపక్కల గోడలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు దాదాపు రూ.1.50 లక్షలు ఖర్చయ్యాయని, ఇంకొక రూ.లక్ష అవసరమని.. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేస్తే మసీదు మరమ్మతులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. గాజుల వంశస్తులు, తదితరులు పాల్గొన్నారు. -
గుంతల తవ్వకం పూర్తి చేయాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి) : వనమహోత్సవంలో భా గంగా మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతల తవ్వకం పనులను వారంరోజుల్లో పూర్తిచేయాలని అదనపు డీఆర్డీవో కుటుంబరావు ఉపాధిహామీ సి బ్బందిని ఆదేశించారు. నాగిరెడ్డిపేట మండలంలో ని అక్కంపల్లిలో ఉన్న నర్సరీని మంగళవారం ఆయ న పరిశీలించారు. దీంతోపాటు వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు గ్రామశివారు లో కూలీలు తవ్వుతున్న గుంతలను ఆయన పరిశీలించారు. వర్షాలు కురిసేలోగా మొక్కలు నాటేందుకు గుంతలను సిద్ధంగా ఉంచాలని సిబ్బందికి ఆయన సూచించారు. మండలానికి ముందుగా నిర్ణయించిన లక్ష్యం ప్రకారం మొక్కలను సిద్ధంగా ఉంచాలన్నారు. వర్షాలు కురవగానే మొక్కలను నాటించాలని ఆదేశించారు. ఆయనవెంట ఈజీఎస్ ఈసీ సాయిలు, పంచాయతీ కార్యదర్శి కిష్టయ్య, టీఏ సత్యప్రసాద్, ఏఫ్ఏ శ్రీనివాస్ తదితరులున్నారు. -
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
గాంధారి(ఎల్లారెడ్డి): స్థానిక రేతు వేదిక భవనంలో మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలకు చెంది న 39 లబ్ధిదారులకు ఏఎంసీ వైస్ చైర్మన్, తహసీల్దార్ రేణుక చౌహాన్ చేతుల మీదుగా మంగళవారం కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, డీటీ బావ న్న, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎండ్రియాల్లో విద్యార్థులకు బహుమతులు.. తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఎండ్రియాల్ ఉన్నత పాఠశాలలో మంగళవారం హెల్పింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. భవిష్యత్లో విద్యార్థులకు కావల్సిన కేరియర్ గైడెన్స్ హెల్ఫింగ్ బ్రిడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ సంస్థ అందిస్తుందని తెలిపారు. విద్యార్థులకు ఆర్థిక సహాయంతో పాటు నోట్బుక్లను అందజేశారు. సంస్థ ప్రతినిధులు సుభాష్ గౌడ్, శ్రీనివాస్, మనోహర్, మహిపాల్, సృజన, రాజేశ్వర్రెడ్డి, హెచ్ఎం సరిత పాల్గొన్నారు. -
భూ సేకరణను వేగవంతం చేయాలి
బాన్సువాడ : సిద్ధాపూర్ రిజర్వాయర్ పనుల్లో భాగంగా భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతి దశను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తూ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. ఇరిగేషన్ ఉన్నతాధికారులతో రిజర్వాయర్ పనులపై హైదరాబాద్లోని తన నివాసంలో పోచారం మంగళవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. పనులు వేగవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో మే 23వ తేదీన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో రిజర్వాయర్ ముంపు ప్రభావిత భూములకు నష్టపరిహారం చెల్లించేందుకు అవసరమైన అనుమతుల కోసం రూ.55.30 కోట్లు మంజురు చేస్తూ జీవో నం.37ను ద్వారా జూన్ 8న ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు సాగాలని అన్నారు. సమావేశంలో ఈఎన్సీ జనరల్ రమేశ్, ఈఎన్సీ అడ్మిన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్ : ఉమ్మడి రాష్ట్రంలోనే తొలి మహిళా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్గా నియమితులైన జిల్లాకు చెందిన జ్యోతి మంగళవారం ఉద్యోగవిరమణ పొందారు. మూడు దశాబ్దాలపాటు రెవెన్యూశాఖలో వీఆర్వోగా ప్రజలకు సేవలందించారు. ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేయడంతో నాలుగేళ్లుగా ఇరిగేషన్లో పని చేశారు. 34 ఏళ్లపాటు సర్వీసులో కొనసాగి ఇరిగేషన్ శాఖ నుంచి రిటైర్ అయిన జ్యోతికి అధికారులు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఆమె ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు.కామారెడ్డి అర్బన్: సివిల్ సర్వీసెస్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్–2027 ఉచిత కోచింగ్ కోసం ఆసక్తిగల వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి పి వెంకటేశ్ మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ స్టడీ సర్కిల్లో పది నెలల ఉచిత రెసిడెన్షియల్ ఫౌండేషన్ కోర్సు కోచింగ్ కోసం ఈనెల 12వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తుదారులకు 19వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని, మరిన్ని వివరాలకు టీఎస్ స్టడీ సర్కిల్ వెబ్సైట్లో లేదా తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: కాంగ్రెస్ పార్టీ జెండాకు సెల్యూట్ చేసిన గాంధారి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గాంధారి మండల కేంద్రంలో ఎమ్మెల్యే మదన్మోహన్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించిన కార్యక్రమంలో ఎస్సై కాంగ్రెస్ జెండాకు సెల్యూట్ చేసిన ఘటనపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన పోలీసు అధికారులు కాంగ్రెస్ తాబేదార్లుగా పనిచేయడం శోచనీయమని పేర్కొన్నారు. -
హిందీ ఉపాధ్యాయుల జిల్లా ఫోరం ఏర్పాటు
కామారెడ్డి అర్బన్: హిందీ భాషాభివృద్ధి, హిందీ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం హిందీ ఉపాధ్యాయుల ఫోరం ఏర్పాటైంది. ఫోరం ఎన్నికలను మంగళవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా కె.ఇంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా ఎస్.సహీంద్రనాథ్, ఉపాధ్యక్షులుగా పోశెట్టి, చంద్రశేఖర్, జాడే నర్సింలు, కార్యదర్శులుగా రవికిరణ్, సుదర్శన్, వంశీధర్, శ్యాంకుమార్, ప్రసన్న కుమార్, ఆదినారాయణలు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు చింతల లింగం, పండిత పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గఫూర్ శిక్షక్లు అభినందించారు. అనంతరం ఫోరం ఆధ్వర్యంలో డీఈవో మల్లికార్జున్ను కలిసి మాట్లాడారు. -
సమర్థవంతంగా రైతుభరోసా
● రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● పెట్టుబడి సాయం విడుదలరామారెడ్డి: వ్యవసాయరంగాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు రైతులపై పెట్టుబడి భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. రామారెడ్డిలోని రైతు వేదికలో మంగళవారం రాత్రి నిర్వహించిన రైతుభరోసా పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతు భరోసా పథకం ద్వారా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ఆర్థిక సాయం జమ చేయడం వల్ల పారదర్శకతతోపాటు సకాలంలో పెట్టుబడి అందే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో 2025–26 వానాకాలం సీజన్లో 10,851 మంది రైతులకు రూ.9,35,33,533 కోట్లు, అలాగే 2025–26 యాసంగి సీజన్లో 10,950 మంది రైతులకు రూ.7,34,81,576 ఆర్థిక సహాయం అందించామని వెల్లడించారు. రెండు ఎకరాలు ఉన్న వారికి రైతుల ఖాతాలో ఇప్పుడు జమ అవుతాయని, మిగతా రైతులకు 9 రోజుల్లో జమవుతాయని అన్నారు. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు రైతు భరోసా సాయం అందేలా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గిరి, డిప్యూటీ ట్రెయినీ కలెక్టర్ రవితేజ, ఏవో భానుశ్రీ, తహసీల్దార్ ఉమాలత, సర్పంచ్ బండి ప్రవీణ్, ఉపసర్పంచ్ నవీన్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ప్రవీణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు అధికారులకు వీడ్కోలు
కామారెడ్డి అర్బన్: మూడు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో సేవలు అందించిన నలుగురు అధికారులు ఎండీ ఉస్మాన్, దత్తాత్రిగౌడ్, కె.శంకర్, ఎస్కే అహ్మద్, వారి కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ రాజేష్చంద్ర మంగవారం ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఉద్యోగ నిర్వహణలో కుటుంబ సభ్యుల సహకారం ఉంటేనే పోలీసు సరిగ్గా పనిచేయగలరన్నారు. వి శ్రాంత జీవితం కుటుంబసభ్యులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. బాన్సువాడ రూరల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. తాడ్కోల్ రైతువేదికలో జరిగిన రైతుబంధు విడుదల కార్యక్రమాన్ని ఆయన వీక్షించి మాట్లాడారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాఽభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఏవో ఫయాజుల్లా, ఏఈవోలు రాణి, కావ్యశ్రీ, సర్పంచ్లు అందె రమేష్, పూజారి, మన్నె రమేష్, సొసైటీ చైర్మన్లు గంగుల గంగారాం, క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: ఈ నెల 2న తలపెట్టిన కళాశాలల బంద్ను విజయవంతం చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు మంగళవారం కోరారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేయాలని చూస్తోందని, దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల బంద్కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం దిగిరాకపోతే ఈనెల 15న హైదరాబాద్లో వేలాది మందితో ‘విద్యార్థి మార్చ్’ చేపడతామని హెచ్చరించారు. కామారెడ్డి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ, ఉద్యోగులు, పెన్షన్దారులకు ఇచ్చిన హామీ ప్రకారం బకాయిలు విడుదల చేయడంతో పాటు ఆరోగ్య బీమా, ప్రమాద బీమా పథకాలను అమలు చేయడం హర్షణీయమని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) జిల్లా అధ్యక్షుడు ఆర్.దేవేందర్ అన్నారు. ఈమేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పీఆర్సీ అమలు చేయాలని, బీమా పథకంలో హైదరాబాద్లోని అన్ని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆధునిక చికిత్సలకు అవకాశం కల్పించాలని కోరారు. గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రం సమీపంలో మొఖరంపేట్ హనుమాన్ మందిరం వద్ద గ్రామస్తుల సహకారంతో యువకులు క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయడం అభినందనీయమని కామారెడ్డి జిల్లా డీఆర్డీవో దామోదర్ రెడ్డి అన్నారు. డీఎల్పీవో సురేందర్, ఎంపీడీవో రాజేశ్వర్తో కలిసి మంగళవారం క్రీడా మైదానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా క్రీడా మైదానం చుట్టూ మొక్కలు నాటేందుకు తీస్తున్న గుంతలను పరిశీలించారు. క్రీడా మైదానం అభివృద్దికి ప్రభుత్వం తరపున తగిన సహాకారం అందిస్తామన్నారు. జీపీ కార్యదర్శి నాగరాజు, మాజీ సర్పంచ్ సంజీవులున్నారు. భిక్కనూరు: హైదరాబాద్లోని బైరమల్గూడలో గల కేకే గార్డెన్స్లో జూలై 6న నిర్వహిస్తున్న చాకలి ఎస్సీ సాధన సమితి తొమ్మిదవ మహాసభలకు సంబంధించిన కరప్రతాలు, వాల్పోస్టర్లను జంగంపల్లి గ్రామంలో మంగళవారం ఆవిష్కరించారు. అన్ని గ్రామాల్లోని రజకులు అందరూ ఈ మహాసభలకు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమితి జిల్లా అధ్యక్షుడు రాజయ్య, గౌరవ అధ్యక్షులు ఉగ్రవాయ భూమయ్య, జంగంపల్లి రజక సంఘం అధ్యక్షుడు చెన్ని రామయ్య, కార్యదర్శి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి
ఎల్లారెడ్డి: కేసుల వివరాలను క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ నెట్ వర్క్ అండ్ సిస్టమ్ (సీసీటీఎన్ఎస్)లో నమోదు చేయాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని మల్టీజోన్ ఐజీపీ చంద్రశేఖర్రెడ్డి సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. స్థానిక సిబ్బంది నుంచి ఐజీపీ గౌరవవందనం స్వీకరించిన అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. స్టేషన్ ఆవరణలో పరిశుభ్రత, సిబ్బంది బ్యారక్స్, మాల్ ఖానా, ఆయుధాల భద్రత, స్టేషన్ రికార్డులు, రిసెప్షన్, సీసీటీఎనన్ఎస్ నిర్వహణ తీరును పరిశీలించి అభినందించారు. అనంతరం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదగా, మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు న్యాయం అందించడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మిస్సింగ్ కేసులు, పోక్సో, అట్రాసిటీ, అండర్ ఇన్వెస్టిగేషన్, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను ప్రత్యేక దృష్టితో త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా సీసీటీఎనన్ఎస్ – 2.0, పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, టీఎస్–కాప్, హెచ్ఆర్ఎంఎస్ వంటి డిజిటల్ సేవలపై పూర్తి అవగాహన పెంపొందించుకొని, నేరాల నియంత్రణ, దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. అనుమానిత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని, బీట్ పోలీసింగ్ను మరింత పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ప్రతిరోజూ వాహనాల తనిఖీలు నిర్వహించాలని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్పీ రాజేశ్చంద్ర, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి, ఎస్సై రాజు, సిబ్బంది పాల్గొన్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి మల్టీ జోన్ ఐజీపీ చంద్రశేఖర్రెడ్డి ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ తనిఖీ -
క్రైం కార్నర్
గంజాయి కేసులో ఇద్దరి రిమాండ్ కామారెడ్డి క్రైం: రైలులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని కామారెడ్డి ఎకై ్సజ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వివరాలు ఇలా.. సంభాల్పూర్ నుంచి పూణే వెళ్తున్న నాగావళి ఎక్స్ప్రెస్ రైలు మంగళవారం కామారెడ్డికి రాగానే పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్దనున్న బ్యాగులను తనిఖీ చేయగా ప్యాకెట్ల రూపంలో సిద్ధం చేసిన 10.9 కిలోల ఎండు గంజాయి బయటపడింది. నిందితులను ఆర్మూర్ మండలం మామిడిపల్లికి చెందిన అశోక్ కుమార్ మిశ్రా, మహారాష్ట్రలోని పర్బనీకి చెందిన గణేష్ పండిత్లుగా గుర్తించారు. వారిద్దరూ కలిసి ఒడిశా రాష్ట్రంలోని రాయగఢ్ నుంచి మహారాష్ట్రలోని నాందేడ్కు గంజాయి రవాణా చేస్తున్నట్లు తేలింది. నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు ఎకై ్సజ్ సీఐ సంపత్కృష్ణ తెలిపారు. దాడుల్లో ట్రెయినీ అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అరుణ్ చంద్ర, ఎస్సై శ్రీనివాస్ రావు, సిబ్బంది పాల్గొన్నారు. -
నాగిరెడ్డిపేట ఎంపీడీవోగా గంగాధర్
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట ఎంపీడీవోగా గంగాధర్ నియమితులయ్యారు. ఇప్పటివరకు నాగిరెడ్డిపేట ఇన్చార్జి ఎంపీడీవోగా కొనసాగిన ప్రవీణ్కుమార్ నుంచి సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. కాగా మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ఎంపీవోగా విధులు నిర్వహించిన గంగాధర్ పదోన్నతిపై కామారెడ్డి జిల్లాకు వచ్చారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఆయనను నాగిరెడ్డిపేట ఎంపీడీవోగా నియమించారు. కామారెడ్డిటౌన్ : లడఖ్లో నిర్వహించిన ‘మౌంట్ కాంగ్ యాస్తే–2’అడ్వెంచర్ యాత్రలో అరుదైన ఘనత సాధించిన కామారెడ్డి గిరిజన గు రుకుల డిగ్రీ కళాశాల విద్యార్థి విస్లావత్ బన్నీని ఘనంగా సన్మానించారు. సోమవారం మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్ నిట్టు గంగాధర్ రావు, పలువురు బన్నీనీ శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. నాయకులు మామిండ్ల మారుతి, చిన్నరాజు తదితరులున్నారు. కామారెడ్డి క్రైం: పదవీ విరమణ పొందుతున్న జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ లాలు నాయక్ను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లో ఘనంగా స న్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ.. లాలు నాయక్ అంకితభావంతో విధు లు నిర్వహించి పరిశ్రమల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఉద్యోగ జీవితంలో నిజాయితీ, క్రమశిక్షణతో పనిచేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆయ నను శాలువాతో సన్మానించి, జ్ఞాపికను అందజేసి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. రిటైర్మెంట్ అనంతరం ఆయురారోగ్యాలతో సంతోషంగా కుటుంబంతో కలిసి గడపాలని ఆకాంక్షించారు. అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, వివిధ శాఖల జిల్లా అధికారులు, పరిశ్రమల శాఖ సిబ్బంది పాల్గొన్నారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అలాగే సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వైద్యులు హరీష్గౌడ్, గౌతమి, ఏఎన్ఎం నీరజ, ఫార్మాసిస్టు స్వప్న, హెచ్ఎం కల్యాణి పాల్గొన్నారు. -
కబ్జాలకు అడ్డేది..?
● కల్కి చెరువు కాల్వల ఆక్రమణ ● పరాధీనంలోకి రూ.కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు ● పట్టించుకోని ఇరిగేషన్ అధికారులు బాన్సువాడ: కబ్జాలకు కాదేది అనర్హం అంటున్నారు అక్రమార్కులు. అధికారుల పట్టింపులేనితనం అక్రమార్కులకు కలిసొస్తుంది. బాన్సువాడలో మత్తడి కాల్వలు కబ్జాకు గురయ్యాయి. పట్టణ నడిఒడ్డున పారే చెరువుల మత్తడి(వ్యవసాయ) కాలువలు పరాధీనమయ్యాయి. అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో చెరువు కాలువలు జీవం కోల్పోయే పరిస్థితి తలెత్తింది. బాన్సువాడలో ఏళ్ల తరబడి చెరువుల కాల్వలు(నాలాలు) దురాక్రమణకు గురువుతున్నాయి. పూర్వీకులు వ్యవసాయం కోసం బాన్సువాడకు ఉత్తరం దిశకు కల్కి చెరువును నిర్మించారు. ఈ చెరువు కింద సుమారు 487 ఎకరాల ఆయకట్టు ఉంది. వర్షాలతో ఈ చెరువు నిండాక ఎల్లయ్య చెరువు, నాగిరెడ్డి చెరువులతో పాటు ఊరు కింద వ్యవసాయ భూములకు సాగునీరందించేందుకు కాల్వలు తవ్వారు. ఈ కాల్వలు నీటిపారుదల, మున్సిపల్ శాఖల ఆధీనంలో ఉన్నాయి. గ్రామ పంచాయితీగా ఉన్న బాన్సువాడ నేడు మున్సిపల్ స్థాయికి ఎదిగింది. అయితే ఈ కాల్వలు పట్టణం నడి ఒడ్డు నుంచి తవ్వడంతో కొందరు నివాస గృహాల కోసం, మరి కొందరు రియల్ ఎస్టేట్ కోసం కాల్వలను కబ్జా చేశారు. కల్కి చెరువు కింద పట్టణంలో ఎన్జీవోఎస్ కాలనీ, సాయికృపానగర్, చైతన్య కాలనీ, శ్రీరామకాలనీ, టీచర్స్కాలనీలు వెలిశాయి. వ్యవసాయ భూముల్లో భవనాలు, దుకాణాలు నిర్మించారు. దీంతో కల్కి చెరువు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. కాల్వల కబ్జాల వల్ల వర్షాకాలంలో చెరువు నుంచి వచ్చే నీరు కాల్వల్లోకి కాకుండా రోడ్లపైకి, కాలనీల్లోకి వస్తున్నాయి. ఎండాకాలంలో మాత్రం చివరి ఆయకట్టకు సాగునీరందని పరిస్థితి నెలకొంది. నిబంధలకు విరుద్ధంగా నిర్మాణాలు.. ఒక్కప్పుడు ఊరు చివరిలో ఉండే కల్కి చెరువు, ఎల్లయ్య చెరువు స్థలాల్లో పట్టణం విస్తరించింది. అవి లోతట్టు ప్రాంతాలు కావడంతో సాధారణ వర్షాలకే వరద పోటెత్తుతోంది. పై నుంచి వచ్చే వరద నీటితో ఆయా ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. కాల్వకు ఎడవ వైపు బైక్కు వెళ్లేందుకు 2 మీటర్లు, కుడివైపున ఇరిగేషన్ అధికారుల జీపు వెళ్లేందుకు వీలుగా 4 మీటర్లు బఫ్పర్ జోన్లోని వస్తాయి. ఆయా చోట్ల ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అందుకు విరుద్ధంగా మూడు ఫీట్లలోపే నిర్మాణాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కాల్వల గట్లపై నిర్మాణాలు చేపట్టారు. వాటికి అనుమతులు ఎలా ఇస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కల్కి చెరువు, ఎల్లయ్య చెరువు మత్తడి కాల్వలు అన్యాక్రాంతం అవుతున్నాయి. వీటి విలువ రూ.కోట్లలో ఉంటుందని రియల్ ఎస్టేట్ వర్గాల అంచనా. ఒక్కో కాలువ 9 ఫీట్ల వెడల్పుతో ఉండాలి. ప్రస్తుతం కాల్వలకు ఇరుపక్కల కనీసం కాలినడకన వెళ్లలేని పరిస్థితి ఉంది. గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు విధులు నిర్వహించిన అధికారులు కాల్వల పక్కన చేపట్టే నిర్మాణాలకు ఎలా అనుమతులు ఇచ్చారో తెలియదు. అప్పట్లో చేసిన పొరపాటు వల్లే నేడు సమస్య ఉత్పన్నమైంది. తమ వద్ద జాబితాలో కొన్ని కాలువలు లేవు. కబ్జాకు గురైన కాలువలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. –నితిన్, ఇరిగేషన్ ఏఈ, బాన్సువాడ -
గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపిస్తా
● ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు తాడ్వాయి(ఎల్లారెడ్డి): నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందేలా తన వంతు కృషి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అన్నారు. ఆయన సోమవారం దేమికలాన్లో రెండు వరుసల రోడ్డు పనులను ప్రారంభించి మాట్లాడారు. రూ.20 కోట్లతో దేమికలాన్ నుంచి కన్కల్, కరడ్పల్లి, జనగాం మీదుగా బాన్స్వాడ ఎక్స్రోడ్డు వరకు రెండు వరుసల రోడ్డు కానుందన్నారు. ఈ రోడ్డు పూర్తి అయినట్లయితే ఐదు మండలాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దేమికలాన్లోనే 38 మంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించుకున్నారని, అలాగే రూ.20 లక్షలతో జీపీ భవన నిర్మాణం, రూ.10 లక్షలతో మహిళా సంఘం భవనం, రూ.15 లక్షలతో సీసీ రోడ్డు పనులు జరిగాయన్నారు. అలాగే రూ.40 లక్షలు సీఎంఆర్ఎఫ్ నిధులు ఇచ్చినట్లు తెలిపారు. గాంధారిలో మినీ స్టేడియానికి నిధులు మంజూరు అయ్యాయని, త్వరలోనే తాడ్వాయిలో కూడా మినీ స్టేడియానికి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. అనంతరం కన్కల్లో గల ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యార్థుతో మాట్లాడారు. ఎంపీడీవో భరత్కుమార్, తహసీల్దార్ శ్వేత, ఎంపీవో సవితారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సంజీవులు, నాయకులు వెంకట్రెడ్డి, షౌకత్అలీ, శివాజీ, శ్యాంరావు, రాజేశ్వర్రెడ్డి, అఖిల్రావు, కిష్టారెడ్డి, సర్పంచ్లు రవీందర్రెడ్డి, భైరవి, తదితరులు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి సహకరించాలి గాంధారి(ఎల్లారెడ్డి): నాయకులు, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి సహకరించాలని, అంకితభావంతో పనిచేయాలని డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంతో పాటు పలు గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభోత్సవాలు, మహిళా సంఘాల భవనాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. పార్టీ కార్యాలయం ప్రారంభించారు. నేడు ఎల్లారెడ్డికి ఎమ్మెల్యే మదన్మోహన్రావు రాక ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డికి నేడు ఎమ్మెల్యే మదన్మోహన్రావు రానున్నట్లు కాంగ్రెస్ నాయకులు సోమవారం తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 8 మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులతో ఎస్ఐఆర్పై సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. -
జూలై నెలాఖరులోగా యూనిఫామ్లు అందిస్తాం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ జూలై నెలాఖరులోగా యూనిఫామ్లు అందజేస్తామని జిల్లా అదనపు డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. నాగిరెడ్డిపేట మండలకేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో వీవోఏలతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీ్త్రనిధి రుణాల రికవరీలో నాగిరెడ్డిపేట మండలం చాలా వెనకబడిందన్నారు. ప్రత్యేక కార్యాచరణతో 15 రోజుల్లో రుణాల రికవరీ శాతాన్ని పెంచాలన్నారు. అనంతరం కస్తూర్భా పాఠశాల విద్యార్థినులకు యూనిఫామ్లు అందజేశారు. రూ. 813 కోట్ల 42 లక్షల రుణాలు.. బ్యాంకులింకేజీ ద్వారా జిల్లాలోని మహిళాసంఘాల సభ్యులకు ఈ ఏడాది రూ.813 కోట్ల 42 లక్షల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని అడిషనల్ డీఆర్డీవో విజయలక్ష్మి తెలిపారు. నాగిరెడ్డిపేటలో సోమవారం మీడియాతో మాట్లాడారు. బ్యాంకు లింకేజీ ద్వారా ఇప్పటివరకు రూ.114 కోట్ల 30లక్షల రుణాలు అందజేసినట్లు తెలిపారు. సీ్త్రనిధి ద్వారా ఈ ఏడాది రూ.89 కోట్ల 93లక్షల రుణాలు ఇవఆలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటివరకు రూ.13 కోట్ల 34లక్షలు అందజేశామని తెలిపారు. గ్రామాల్లో నూతనంగా వృద్ధుల, దివ్యాంగుల, కిశోర బాలికల సంఘాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. డీపీఎంలు శ్రీనివాస్, రాజయ్య, మండల సమాఖ్య అధ్యక్షురాలు శాంత, ఇన్చార్జి ఏపీఎం దత్తు, సీసీలు నారాయణ, రమేశ్, నజీర్, సాయిలు, సుజాత, సావిత్రి, అకౌంటెంట్ రాజు తదితరులున్నారు. -
ప్రజావాణిలో నాలుగు ఫిర్యాదులు
ఎల్లారెడ్డి:ఎల్లారెడ్డి ఆర్డీవో కార్యాలయంలో సోమవా రం నిర్వహించిన ప్రజావాణిలో నాలుగు ఫిర్యాదు లు వచ్చినట్లు ఆర్డీవో రొడ్డ ప్రభాకర్ తెలిపారు. రెవెన్యూకు సంబంధించి 3, పంచాయత్రాజ్కు సంబంధించి ఒక ఫిర్యాదు వచ్చినట్లు చెప్పారు. కామారెడ్డి టౌన్: భిక్కనూర్ మండల కేంద్రంలో పన్ను చెల్లించకుండా కొనసాగుతున్న ఓ కార్పొరేట్ స్కూల్పై ఉన్నతాధికారులు తక్షణమే చర్య లు తీసుకోవాలని మండల కేంద్రానికి చెందిన బత్తుల లక్ష్మీపతి డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి, ఏళ్లుగా పంచాయతీ పన్నులు ఎగ్గొడుతున్నారని ఆరోపించారు. పాఠశాలలో కనీస వసతు లు, సౌకర్యాలు లేవన్నారు. అర్హత లేని టీచర్లతో పా ఠాలు చెప్పిస్తూ విద్యాసంస్థలోనే పుస్తకాల దందా సాగిస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. కామారెడ్డి క్రైం: జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్గా ముకుందరెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. పూర్తి అదనపు బాధ్యతలతో ఇదివరకు ఈఎస్గా పనిచేసిన హనుమంతరావు పదోన్నతిపై మల్కాజ్గిరి ఈఎస్గా వెళ్లారు. ముకుందరెరడ్డి హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చారు. సదాశివనగర్ (ఎల్లారెడ్డి): మండలంలోని ధర్మారావుపేట్ గ్రామానికి చెందిన గైని రమేశ్పై హత్యకు యత్నించిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్సై పుష్పరాజ్ సోమవారం తెలిపారు. ధర్మారావుపేట గ్రామానికి చెందిన గండ్ల లావణ్య,గండ్ల సతీశ్ పా తకక్షలతో ముందస్తు ప్రణాళిక ప్రకారం ద్విచక్ర వా హనంపై వెళ్తున్న గైని రమేశ్ను కారుతో ఢీ కొట్టి, క ర్రతో దాడి చేశారు. దీంతో రమేశ్కు గాయాలయ్యా యి. ఘటనపై విచారణ చేపట్టి హత్యాయత్నానికి పాల్పడ్డ ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 73 మందికి జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టులు సోమవారం శిక్షలు విధించాయి. ఒకరికి రెండు రోజులు, 14 మందికి ఒక రోజు జైలు శిక్షతోపాటు మొత్తం 73 మందికి రూ.88,700 జరిమానా విధించినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమన్నారు. జిల్లాలోని అన్ని పీఎస్ల పరిధిలో క్రమం తప్పకుండా వాహనాల తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. నందిపేటలో మరొకరికి..నందిపేట్ (ఆర్మూర్): నందిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న ఒకరికి వారం రోజులు జైలు శిక్ష విధిస్తూ సెకండ్క్లాస్ మేజిస్ట్రేట్ గట్టు గంగాధర్ సోమవారం తీర్పునిచ్చారు. మరో ముగ్గురికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్సై వినయ్ తెలిపారు. -
ఎమ్మెల్యే రాకేశ్రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
● ఆర్మూర్కు వెళ్లకుండా కట్టడి ● కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు తరలింపు భిక్కనూరు: ఆర్మూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలల మతప్రార్థనల వివాదం నెలకొనడంతో మూడు రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ నుంచి ఆర్మూర్కు వెళ్తున్న ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డిని భిక్కనూరు సీఐ నరేశ్ ఆద్వర్యంలో పోలీసులు టోల్ప్లాజా వద్ద అడ్డుకున్నారు. తనను ఎందుకు అడ్డుకుంటున్నారని రాకేశ్రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అరెస్టు చేసేందుకు ఉత్తర్వులు ఉంటే చూపాలంటూ ఆయన మండి పడ్డారు. సుమారు గంటపాటు వాగ్వాదం కొనసాగింది. తన సొంత నియోజకవర్గానికి వెళ్లకుండా అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నిస్తూ తన కారులోనే కూర్చుని నిరసన తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుస్తు అరెస్టు చేస్తున్నట్లు సీఐ నరేశ్ ఎమ్మెల్యేను సముదాయించి కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి తరలించారు. -
సాగు లేకున్నా.. సరఫరా అవుతోంది
కామారెడ్డి క్రైం : గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు, ఎకై ్సజ్ అధికారుల కళ్లుగప్పి గంజాయిని జిల్లా మీదుగా దాటించేందుకు కొత్తదారులు వెతుకుతున్నారు. రోడ్డు మార్గంతోపాటు రైలు మార్గంలోనూ స్మగ్లింగ్ చేస్తున్నారు. స్మగ్లర్లు తమ కార్యకలాపాలను గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారనడానికి ఇటీవల వెలుగుచూసిన ఘటనలే నిదర్శనం. దీంతో పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా గంజాయి గుప్పుమంటోంది. ఎంతో మంది యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. జిల్లా మీదుగా భారీ స్థాయిలో గంజాయి రవాణా అవుతుండగా, జిల్లాలోనూ దిగుమతి అవుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణాలు, పల్లెల్లో గంజాయి ప్యాకెట్లు, లిక్విడ్ల రూపంలో సిద్ధం చేసి యువతకు విక్రయింస్తుంటారు. మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై పోలీసుశాఖ స్కూళ్లు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది. అందుకే గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై నిఘా పెంచి కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు.‘రైలు.. ట్రక్కు.. గంజాయికి తరలింపునకు కాదేదీ అనర్హం’ అన్నట్లు దందా సాగిస్తున్నారు గంజాయి స్మగ్లర్లు. ఒడిశా నుంచి జిల్లా మీదుగా మహారాష్ట్రకు భారీగా గంజాయి తరలిస్తున్నారు. గత నెల రోజుల వ్యవధిలో పట్టుబడిన గంజాయి పరిస్థితికి అద్దం పడుతోంది. పనసపండ్లు తరలిస్తున్న ట్రక్కులో, నాగవళి ఎక్స్ప్రెస్లో ఇటీవల పోలీసులు గంజాయిని పట్టుకున్నారు.మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం వంటి చర్యలు యువత బంగారు భవిష్యత్ను నాశనం చేస్తాయి. జిల్లాలో డ్రగ్స్ మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, నిల్వ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. గంజాయికి సంబంధించిన వివరాల తెలిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్ 100కు సమాచారం అందించాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. – రాజేశ్చంద్ర, ఎస్పీ, కామారెడ్డి ఒడిశా నుంచి జిల్లా మీదుగా రవాణా ఇటీవల రైళ్లు, ట్రక్కుల్లో పట్టుబడిన గంజాయి మత్తుకు బానిసవుతున్న యువత నిఘా పెంచితేనే అడ్డుకట్ట పడే అవకాశంజిల్లాలోని చాలాప్రాంతాల్లో గతంలో గంజాయి సాగయ్యేది. గాంధారి, లింగంపేట, రాజంపేట, మాచారెడ్డి, మద్నూర్, నస్రుల్లాబాద్ మండలాల పరిధిలో గంజాయి మూలాలు ఎక్కువగా కనిపించేవి. మొక్కజొన్న, పత్తి పంటల్లో అంతర పంటగా సాగు చేసేవారు. అటవీ ప్రాంతాల్లోని భూముల్లోనూ గంజాయి సాగయ్యేది. పోలీస్, ఎకై ్సజ్ దాడులు పెరగడంతో కొన్నేళ్లుగా సాగు నియంత్రణలోకి వచ్చింది. దీంతో స్మగ్లర్లు కొంతకాలంపాటు విశాఖ, వరంగల్ ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకువచ్చి జిల్లా మీదుగా మహారాష్ట్రలోని ముంబై, పూణె తదితర ప్రాంతాలకు రవాణా చేసేవారు. గంజాయి రవాణా కేసుల్లో జిల్లాకు చెందిన చాలా మందిని పోలీసులు గుర్తించారు. మత్తుపదార్థాలను పూర్తిస్థాయిలో నియంత్రించడమే లక్ష్యంగా పోలీసు, ఎకై ్సజ్శాఖలు ప్రత్యేక తనిఖీలు, అవగాహనా కార్యక్రమాలను పెంచడంతో అడ్డుకట్ట పడింది. ప్రస్తుతం ధర అధికంగా వస్తుండటంతో మళ్లీ స్మగ్లర్ల కార్యకలాపాలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. చిన్న మొత్తంలో గంజాయి పట్టుబడుతున్న ఘటనలు ఉమ్మడి జిల్లాలో అనేకం. -
పల్స్ పోలియో విజయవంతం
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం రెండవ రోజు పల్స్ పోలియో విజయవంతంగా నిర్వహించినట్లు మండల వైద్యాధికారి హిమబిందు తెలిపారు. 8,002 కుటుంబాలు సందర్శించి 326 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు ఆమె పేర్కొన్నారు. తాడ్వాయిలో 100 శాతం పూర్తి తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం 100 శాతం పూర్తయినట్లు మండల వైధ్యాఽధికారి ఖాసీం అలీ అన్నారు. తాడ్వాయి మండల కేంద్రంలో గల పల్స్ పోలియో బూత్ను సోమవారం ఆయన పరిశీలించారు. 8,865 ఇండ్లను సందర్శించి 694 మంది పిల్లలకు చుక్కలు వేసినట్లు వివరించారు. -
కాంగ్రెస్తోనే పేదలకు ఇందిరమ్మ ఇళ్లు
మద్నూర్(జుక్కల్): కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు వస్తున్నాయని సర్పంచ్ విశాలాక్షి అన్నారు. మండలంలోని పెద్ద శక్కర్గాలో సోమవారం ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకోని గృహ ప్రవేశాలు చేసుకున్న లబ్ధిదారులకు ఆమె గోడ గడియారాలను పంపిణీ చేశారు. నాయకులు రాంపటేల్, కార్యదర్శి లక్ష్మణ్, గ్రామస్తులు పాల్గొన్నారు. ర్యాగట్లపల్లిలో.. భిక్కనూరు: ర్యాగట్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ గృహ ప్రవేశాలు చేసిన లబ్ధిదారులకు ప్రభుత్వం బ హూకరించిన గోడ గడియారాలను సోమవారం పంపిణీ చేశారు.గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేసిన 21 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పంపించిన గోడ గడియారాలను అందజేశారు. సర్పంచ్ భాగ్యమ్మ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నరేందర్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సౌజన్య, నేతలు ఆకిటి మల్లారెడ్డి, గడిసె సంజీవు లు,దుమాలబీరయ్య,ఏనుగు కుమారి పాల్గొన్నారు. సొంతింటితో పేదల ముఖాల్లో చిరునవ్వు భిక్కనూరు: సొంతింటి కల నెరవేరడంతో నిరుపేదల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తోందని భిక్కనూరు సర్పంచ్ బల్యాల రేఖ అన్నారు. సోమవారం భిక్కనూరు మండల కేంద్రంలో పలు ఇందిరమ్మ ఇళ్లను ఆమె ప్రారంభించి మాట్లాడారు. నిరుపేదలకు సొంతింటి ఇల్లు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. విండో చైర్మన్ గంగళ్ల భూమయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్, నేతలు మైపాల్రెడ్డి, నర్మల రాంచంద్రం, మద్దూరి రవి, ఆకుల రవి, రాంరెడ్డి, సాయిలు పాల్గొన్నారు. -
సమయపాలన పాటించాలి
ఎల్లారెడ్డి: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలను జిల్లా ప్రత్యేకాధికారిణి, విద్యాశాఖ జేడీ ఉషారాణి సోమవారం తనిఖీ చేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలను టీపీఎస్ స్కూల్గా ఎంపిక చేసిన నేపథ్యంలో అవరసమైన తరగతి గదులు తదితర వివరాలను ఉపాధ్యాయులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు సక్రమంగా బోధించాలని, సమయ పాలన పాటించాలని సూచించారు. ఎంఈవో రాజు లు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులు ఉన్నారు.కామారెడ్డి అర్బన్: సహకార ఉద్యమం అంటే కేవలం రుణాలు ఇవ్వడం కాదని, అది ఆర్థిక ప్రజాస్వామ్యమని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ అన్నారు. సహకార వారోత్సవాలను సోమవారం ఆయన ప్రా రంభించారు. సంఘాల కార్యదర్శులతో సహకార ప్రతిజ్ఞ చేయించారు. దేశం 63 వేల సహకార సంఘాల కంప్యూటీరకణ, మోడల్ బైలాస్, జాతీయ సహకార డేటాబేస్, రైతు, మహిళా, కార్మిక సహకార సంఘాలు, భారత్ టాక్సీ వంటి కొత్త సహకార మోడళ్లలను భారత ప్రభుత్వం ఆవిష్కరిస్తున్నట్టు వివరించారు. జిల్లా సహకార శాఖ, డెయిరీ, మత్స్యశాఖ అధికారులు భూమయ్య, షేక్చాంద్, మురళీధర్గౌడ్, లక్ష్మణ్, శ్రీనివాస్, శ్వేత తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్ : యువత మత్తు పదార్థాల కు బానిసలుగా మారి తమ అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దని మై భార త్ సంస్థ రాష్ట్ర డైరెక్టర్ అన్వేష్ పిలుపునిచ్చా రు. జిల్లా కేంద్రంలోని ఆర్కే కళాశాలలో మేర యువ భారత్ ఆధ్వర్యంలో ‘మై భారత్ పోర్టల్ అవగాహన – డ్రగ్స్ వ్యతిరేక సద స్సు’ సోమవారం నిర్వహించారు. యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడానికి అధికారిక పోర్టల్లో పే ర్లు నమోదు చేసుకోవాలని అన్వేష్ సూచించారు. విశిష్ట అతిథులుగా హాజరైన ఉమ్మడి జిల్లా యువజన అధికారి రమేశ్, జిల్లా అడిషనల్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అరుణ్.. మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఎకై ్సజ్ సీఐ సంపత్, ఎ స్సై రచన, ఆర్కే విద్యాసంస్థల సీఈవో జై పాల్రెడ్డి, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు సునీల్రాథోడ్ పాల్గొన్నారు. -
నిజాంసాగర్ నీటిని విడుదల చేయాలి
బాన్సువాడ : నిజాంసాగర్ నీటిని వెంటనే విడుదల చేయాలని బాన్సువాడ ఆర్డీవో రవీందర్రెడ్డికి బీజేపీ నాయకులు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా నాయకుడు పైడిమల్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రస్తుతం నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో రైతుల వరి నారుమడులు ఎండిపోతున్నాయని అన్నారు. నారు మడులను బతికించేందుకు నిజాంసాగర్ నీటిని విడుదల చేయాలని కోరారు. నీటిని విడుదల చేసి రైతులకు భరోసా కల్పించాలని అన్నారు. లేని పక్షంలో బీజేపీ తరుఫున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో నాయకులు పాశం భాస్కర్రెడ్డి, గజ్జల మహేశ్, శ్రీకాంత్, ఉమేశ్, సాయిరెడ్డి, ప్రసాద్ తదితరులు ఉన్నారు. -
‘సర్’ ను సమర్థవంతంగా చేపట్టాలి
● సూపర్వైజర్ల పాత్ర కీలకం ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ(సర్)ను సమర్ధవంతంగా చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా కలెక్టర్, ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ సంగ్వాన్ జిల్లా అధికారులతో సమావేశమై మాట్లాడారు. సర్లో సూపర్వైజర్ల పాత్ర కీలకమన్నారు. విధి నిర్వహణలో ప్రతి బీఎల్వో తప్పనిసరిగా గుర్తింపు కార్డు ధరించాలన్నారు. కొత్తగా నియమితులైన బీఎల్వోలకు వెంటనే గుర్తింపు కార్డులు జారీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు అవసరమైన సహకారం అందించేందుకు హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్వీ గిరి, ఎన్నికల విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బీఎల్వోలకు అవసరమైన ఎస్ఐఆర్ కిట్లను కలెక్టర్ సంగ్వాన్ తన చాంబర్లో అందజేశారు. ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేయాలన్నారు. ఓటర్లు పూర్తి చేసిన ఫారాలను సకాలంలో సేకరించాలన్నారు. ప్రజలకు ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు. తహసీల్దార్ హిమబిందు, ఎన్నికల విభాగం అధికారులు, బీఎల్వోలు పాల్గొన్నారు. -
నీటి కోసం నిరీక్షణ
● కళ తప్పిన జలాశయాలు ● వర్షాల కోసం అన్నదాతల ఎదురుచూపులునిజాంసాగర్(జుక్కల్): వర్షాల జాడలేకపోవడంతో జిల్లాలోని ప్రధాన జలాశయమైన నిజాంసాగర్ ప్రాజెక్టు తప్ప మిగిలిన జలాశయాలు, చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. సీజన్ ప్రారంభమై నెలరోజులవుతున్నా వానల జాడలేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బోసిపోతున్న మళ్లింపు పథకాలు నిజాంసాగర్ ఆయకట్టుకు వరద నీటి మళ్లింపు పథకాలైన కళ్యాణి ప్రాజెక్టుతోపాటు సింగితం రిజర్వాయర్ చుక్క నీరు లేక బోసిపోతున్నాయి. ఎగువ ప్రాంతాల్లోనూ వర్షాలు లేకపోవడంతో నీటి ప్రవాహం కనిపించడం లేదు. కళ్యాణి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409.5 మీటర్లు, సింగితం రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 416.5 మీటర్లు కాగా ప్రస్తుతం జూన్ ముగుస్తున్నా చుక్క నీరు కంటికి కనిపించడం లేదు. చెరువులు, కుంటలు.. జిల్లాలో మొత్తం 2,069 చెరువులు ఉండగా ఆయకట్టు కింద 97,123 ఎకరాల భూముల్లో రైతులు పంటలు సాగు చేస్తారు. చెరువుల్లోకి నీరు చేరకపోవడంతో రైతులు నిరీక్షిస్తున్నారు.ఉమ్మడి జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం నిరాశాజనకంగా ఉండడంతో ఆయకట్టు కింద పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఆయకట్టు కింద నారుమడులకు సాగర్ నీరు అందని ద్రాక్షగా మారింది. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు)కాగా ప్రస్తుతం 1394.74 అడుగుల (6.662 టీఎంసీల) నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటి విడుదల చేపట్టడం లేదు. ఆయకట్టుకు నీటి విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రధాన కాలువ పరిధిలో నారుమడులు సిద్ధం చేసుకున్న రైతులు సాగర్ నీటి కోసం ఎదురుచూస్తున్నారు. -
‘అంకితభావం, నిబద్ధతతో సేవలు అందించాలి’
కామారెడ్డి అర్బన్: అంకితభావం, నిబద్ధతతో ప్రజలకు సేవలు అందిస్తే అంతగా ఉద్యోగులు గుర్తుండిపోతారని, విశ్రాంత జీవితం సంతృప్తిగా ఉంటుందని జెడ్పీ సీఈవో చందర్ అన్నారు. మద్నూర్, రాజంపేట మండలాల పరిషత్ అధివృద్ధి అధికారులు రాణి, బాలకృష్ణలు, నిజాంసాగర్ పర్యవేక్షకులు గంగాధర్ల ఉద్యోగ విరమణ, వీడ్కోలు కార్యక్రమం సోమవారం జెడ్పీ కార్యాలయంలో నిర్వహించారు. సీఈవోతో పాటు డిప్యూటీ సీఈవో సురేందర్, ఎంపీడీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు సంతోష్కుమార్, కార్యదర్శి గోపిబాబు తదితరులు పాల్గొని మాట్లాడారు. పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ అసోసియేషన్, జిల్లా పరిషత్ ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు. -
క్రైం కార్నర్
ధర్పల్లి: పిడుగుపాటుతో ఒకరు మృతి చెందిన ఘటన ధర్పల్లి మండలం కర్నల్ తండాలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ప్రకారం.. కర్నల్ తండాకు చెందిన ధరావత్ దేవీసింగ్ (50) ఆదివారం సాయంత్రం పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పొలంలో పనిచేస్తున్న ధరావత్ దేవీసింగ్పై పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. రాత్రయినా దేవీసింగ్ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా అప్పటికే విగత జీవిగా పడి ఉన్నాడు. మృతుడి భార్య రూక్కి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పోసాన్పల్లి గ్రామ శివారు ముర్సు కుంటలో ఆదివారం చేపలు పట్టేందుకు వెళ్లిన బేస్త సాయిలు(58) ప్రమాదవశాత్తు గల్లంతైన విషయం తెలిసిందే. సాయిలు కోసం అగ్నిమాపక శాఖ సిబ్బంది వెతకగా సోమవారం మృతదేహం లభ్యమైంది. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
● వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి ● ప్రజావాణిలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 101 ఫిర్యాదులు వచ్చాయి. భూ సమస్యలు, రేషన్కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, బిల్లుల మంజూరు తదితర ఫిర్యాదులు, వినతులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, జెడ్పీ సీఈవో చందర్ నాయక్, కలెక్టరేట్ ఏవో వరప్రసాద్, ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థికి అభినందన లడాఖ్లోని కై గర్ రీ పర్వతాన్ని అధిరోహించిన కామారెడ్డి గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్ధి విస్లావత్ బన్నీని కలెక్టర్ సంగ్వాన్ అభినందించారు. 6,100 మీటర్ల ఎత్తైన పర్వత శిఖరానికి ఈ నెల 19న చేరుకుని జాతీయ పతాకంతోపాటు తెలంగాణ గిరిజన సంక్షేమ విద్యాసంస్థల సొసైటీ ప్లెక్సీలను శిఖరంపై ఆవిష్కరించాడు. రాజంపేట మండలం ఎల్లాపూర్ తండాకు చెందిన బన్నీ గతంలో కూడా కిలిమంజారో, కాంగ్ యత్సే పర్వతాలను అధిరోహించాడు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఈ ఘనతను సాధించిన బన్నీని కలెక్టర్, అధికారులు అభినందించి సన్మానించారు. -
దోమల వ్యాప్తిని అరికట్టాలి
కామారెడ్డి క్రైం: అధికారులు అప్రమత్తంగా ఉంటూ జిల్లాలో వ్యాధుల నివారణకు కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లో వ్యాధుల నివారణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో దోమల కారణంగా మలేరియా, డెంగీ, చికునన్గున్యా, ఫైలేరియా లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని సూచించారు. ఎవరికై నా జ్వరం వచ్చిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాలన్నారు. వైద్యుల సూచన లేకుండా ప్రైవేటులో మందులు కొనుక్కుని వాడొద్దని హెచ్చరించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలన్నారు. వాహక వ్యాధుల నివారణపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించి, ముందస్తు రక్త పరీక్షలు, ఆరోగ్య శిబిరాలు, లార్వా నిర్మూలన, ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రేయింగ్ వంటి చర్యలను వేగవంతం చేయాలని సూచించారు. అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
ఆధ్యాత్మికం..
వట వృక్షానికి ప్రత్యేక పూజలు మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని వట వృక్షాలకు సోమవారం మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వట పౌర్ణమి సందర్భంగా మహిళలు మర్రిచెట్టుకు పూజలు చేసి సకల సౌభాగ్యాలు కలగాలని వారు వేడుకున్నారు. అనంతరం మహిళలు నైవేద్యాలను వట వృక్షానికి సమర్పించారు. భిక్కనూరు: జంగంపల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహిళలు వట సావిత్రి వ్రతం సోమవారం ఆచరించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అతి పురాతనమైన మర్రిచెట్టుకు మహిళలు ప్రత్యేక పూజలు చేసి ఒడి బియ్యం సమర్పించుకున్నారు. సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. మహిళలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నారు. లక్ష్మీమాతకు ప్రత్యేక పూజలు పెద్దకొడప్గల్(జుక్కల్): ఏరువాక పౌర్ణమి సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని గ్రామస్తులు లక్ష్మీమాతకు ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం కాటేపల్లిలో కౌలాస్ శ్రీ మహంతేశ్వర మఠం పీఠాధిపతి మల్లికార్జున శివాచార్యులు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేసి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. భక్తిశ్రద్ధలతో సామూహిక నవదుర్గ వ్రతం కామారెడ్డి అర్బన్: జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా సోమవారం ఉదయం స్థానిక శారదామాత ఆలయంలో సామూహిక నవదుర్గ వ్రతం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వ్రతం అనంతరం దాతలను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. అలాగే దేవునిపల్లి శ్రీరమ సత్యనారాయణ స్వామి ఆలయంలో సోమవారం ఉదయం సామూహిక సత్యనారాయణ వ్రతం నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ఎన్యుమరేషన్ ఫామ్ నింపి ఇవ్వాల్సిందే!
● వివరాల్లో తప్పులు లేకుండా చూడాలి ● బీఎల్వోల వద్ద రసీదు తీసుకోవడం మరువద్దుడిచ్పల్లి(నిజామాబాద్రూరల్): ప్రతి పౌరుడికి ఓటుహక్కు కల్పించడం, ఓటరు జాబితాను తప్పులు లేకుండా రూపొందించడం ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత. ఈ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) ప్రక్రియ ఈ నెల 25న ప్రారంభమైంది. బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వో) మీ ఇంటికి వచ్చి తెలుగు, ఇంగ్లి్ష్లో ఉండే ‘ఎన్యూమరేషన్ ఫారం’ అందిస్తారు. ఫారంను సరైన వివరాలతో నింపి, మళ్లీ బీఎల్వోలకు ఇస్తేనే మీ పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదవుతుంది. చాలామంది ఫారాన్ని నింపడానికి ఇబ్బంది పడుతుంటారు. అధికారుల సూచన ప్రకారం.. ఈ ఫారం ఎలా నింపాలో తెలుసుకుందాం.. ఎన్యుమరేషన్ ఫారం అంటే?.. ఓటరు జాబితాను ధ్రువీకరించడానికి, కొత్త ఓటరు వివరాలను సేకరించడానికి ఎన్నికల సంఘం ఉపయోగించే ప్రాథమిక పత్రం ఎన్యూమరేషన్ ఫారం. మీ ఇంట్లో ఉన్న ఓటర్ల వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో సరిచూసుకోవడానికి ఒక వేదిక. ఫారంలో వివరాలు రాసేటప్పుడు తప్పులు లేకుండా, స్పష్టమైన అక్షరాలతో రాయాలి. ఫారంలో మూడు విభాగాలు.. పైభాగం: మీ పేరు, మీ ఓటరు ఫొటో గుర్తింపు కార్డు నంబర్, చిరునామా, అసెంబ్లీ పేరు, తదితర వివరాలు, పాత ఫొటోతో ముందుగా ముద్రించి ఉంటాయి, అక్కడ పక్కన మీ లేటెస్ట్ ఫొటో అతికించాలి. రెండవ భాగం: రెండోభాగంలో రెండు భాగాలుగా విభజించి ఉంటుంది. 2002లో ఓటు ఉన్నవారి కోసం ఒక బాక్స్, 2002లో ఓటు లేనివారి కోసం మరో బాక్స్ ఉంటుంది. ఈ రెండు అంశాల్లో ఒకదానిని మీ పరిస్థితి ఆధారంగా నిర్ణయించుకుని వివరాలు నమోదు చేయాలి. మూడో భాగం: మూడోభాగంలో ఓటరు ప్రస్తుత వివరాలు నింపాలి. పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, సంరక్షకుడి పేరు, సంరక్షకుడి ఓటరు గుర్తింపు కార్డు నంబర్, తల్లిపేరు, తల్లి ఓటరు గుర్తింపు కార్డు నంబర్, పెళ్లి అయితే మీ భాగస్వామి పేరు, ఆమె ఓటరు గుర్తింపు కార్డు నంబర్, పెళ్లి అవ్వకపోతే ఖాళీగా వదిలేయాలి. జాగ్రత్తలు మరువకండి.. వ్యక్తిగత వివరాలు: కుటుంబ సభ్యులందరి పేర్లు, వయసు, లింగం వంటి వివరాలను ఆధార్ కార్డులో ఉన్న విధంగానే నమోదు చేయాలి. చిరునామా ధ్రువీకరణ: మీరు ఉంటున్న ఇంటి నంబర్, వీధి పేరు, పోస్ట్ ఆఫీస్ వివరాలను స్పష్టంగా పేర్కొనాలి. ఆధార్ అనుసంధానం: ఓటర్ ఐడీ కార్డును ఆధార్ అనుసంధానించడానికి అవసరమైన వివరాలను అందించాలి. ఫొటో, సంతకం: ఫారం చివరలో అవసరమైన చోట సంతకం చేయడం లేదా వేలిముద్ర వేయడం మర్చిపోవద్దు.ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం, పాస్పోర్టు, పదో తరగతి సర్టిఫికెట్, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, అటవీహక్కుల ధ్రువీకరణపత్రం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కుల ధ్రువీకరణ పత్రం, ఇంటి అద్దె రసీదు లేదా కరెంటు బిల్లు వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి. సరైన వివరాలు అందించడం వల్ల భవిష్యత్లో ఓటరు జాబితాలో పేరు గల్లంతు కాకుండా ఉంటుంది. అలాగే ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడటం ద్వారా ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మనం ఓటు వేయవచ్చు.2002లో మీకు ఓటు హక్కు లేకపోతే.. మీ తండ్రి, తల్లి, తాతయ్య, నాయనమ్మలలో ఎవరో ఒకరి వివరాలు 2002 ఓటర్ల జాబితా వివరాల ప్రకారంగా ఈ భాగం పూరించాలి. పేరు అనేచోట తండ్రి, తల్లి తాతయ్య, నాయనమ్మలో ఎవరిదైనా పేరు రాసి, వారి ఓటరు గుర్తింపు కార్డు నంబర్ వేయాలి. బంధువు అనేచోట తండ్రి లేదా భర్త పేరు రాయాలి. 2002 ఓటర్ల జాబితాలో గల శాసనసభ నియోజకవర్గం సంఖ్య పోలింగ్ స్టేషన్ నంబర్ (భాగం సంఖ్య), క్రమసంఖ్య అంటే ఓటర్ జాబితాలో మీ సీరియల్ నంబర్ ఎంత అనేది వేయాలి. మొత్తంగా 2002లో మీకు ఓటు లేదు కావున, మీ బంధువుల్లో ఉన్న వారివివరాలను ఈ బాక్స్ నింపాలి. చేయాల్సినవి: ప్రతీ కాలమ్ను జాగ్రత్తగా చదివి నింపాలి. పేరు స్పెల్లింగ్ అన్ని పత్రాల్లో ఒకేలా ఉందో చూసుకోండి. పుట్టిన తేదీ అన్ని పత్రాల్లో సరిపోతుందో నిర్ధారించుకోండి. ఫారం సమర్పించిన తర్వాత రసీదు లేదా అంగీకార పత్రం తీసుకోవాలి. సందేహాలు ఉంటే బూత్ లెవల్ ఆఫీసర్ను సంప్రదించాలి. అవసరమైన పత్రాల స్పష్టమైన కాపీలు జతచేయాలి. మొబైల్ నంబర్, చిరునామా వంటి వివరాలు లేటెస్ట్వి ఇవ్వాలి. తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. ఖాళీ కాలమ్లు వదిలేయకూడదు ఇతరుల పత్రాలు ఉపయోగించకూడదు. పత్రాలపై మార్పులు చేసి సమర్పించకూడదు. తొందరపాటుతో చదవకుండా సంతకం చేయకూడదు. ఒకే వ్యక్తికి సంబంధించిన విభిన్న వివరాలు ఇవ్వకూడదు.2002 ఓటరు జాబితా వివరాల ఆధారంగా ఈ భాగం పూరించాలి. ఓటరు పేరు, ఓటరు గుర్తింపు కార్డు నంబర్, సంరక్షకుడి పేరు, అతడితో మీకు ఉన్న బంధుత్వం వివరాలు నింపాలి. 2002 ఓటరు జాబితాలో గల శాసనసభ నియోజకవర్గం సంఖ్య. పోలింగ్ స్టేషన్ నంబరు (భాగం సంఖ్య), శ్రమసంఖ్య.. అంటే ఓటరు జాబితాలో మీ సీరియల్ నంబర్ ఎంత అనేది వేయాలి. -
ప్రధాని, కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి
నిజామాబాద్ రూరల్ : నీట్ పేపర్ లీక్పై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లు రాజీనామా చేయాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్చార్జి రోషిని జైస్వాల్ అన్నారు. ఆదివారం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ భవన్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఇన్చార్జి రోషిని జైస్వాల్ మాట్లాడారు. నీట్ పేపర్ లీక్తో ఎంతో మంది యువకులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రోడ్లపైకి వచ్చే నిరసనలు చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదన్నారు.20 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధకరమన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యువకుల పక్షాన ఛాత్రో కి గుంజ్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీకి మద్దతు ఉందామన్నారు.కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్చార్జి వినోద్ ఎర్రంశెట్టి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, ఉపాధ్యక్షులు అద్నాన్, ప్రధాన కార్యదర్శి ఆదిత్య పాటిల్, ఇర్ఫాన్, రాజు గౌడ్, అసెంబ్లీ అధ్యక్షులు మహేందర్, మోయిన్ యూనిస్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ శ్రీకాంత్, వివిధ మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
ఉన్నత విద్యకు ‘వలస’ కష్టాలు
కామారెడ్డి టౌన్ : జిల్లాగా అవతరించిన తర్వాత విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధిస్తామని ఆశించిన కామారెడ్డి ప్రజలకు.. ఉన్నత విద్య విషయంలో మాత్రం నిరాశే ఎదురవుతోంది. ప్రధానంగా ఐటీ, కార్పొరేట్ రంగాల్లో స్థిరపడాలనే జిల్లా విద్యార్థుల ఆశలు అసంపూర్తిగానే మిగులుతున్నాయి. స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ వంటి ప్రొఫెషనల్ కోర్సులు అందుబాటులో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అవకాశాలు అపారం.. ఎంబీఏ, ఎంసీఏ పూర్తిచేసిన వారికి దేశ, విదేశాల్లో విస్తృత ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. ఐటీ, బ్యాంకింగ్, మేనేజ్మెంట్ రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నప్పటికీ, సరైన విద్యా వసతులు లేక కామారెడ్డి యువత ఈ సువర్ణ అవకాశాలను చేజార్చుకుంటోంది. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈ విషయంపై ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులను ప్రవేశపెట్టాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.ప్రతి సంవత్సరం జిల్లాకు చెందిన వందలాది మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం హైదరాబాద్, ఇతర జిల్లాలకు వెళ్తున్నారు. అక్కడ హాస్టల్లో ఉంటూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డిలోనే ఎంబీఏ, ఎంసీఏ కోర్సులను ప్రవేశపెట్టాలి. – వినయ్కుమార్, విద్యార్థి సేనా, జిల్లా అధ్యక్షుడు, కామారెడ్డి కామారెడ్డి ప్రభుత్వ కాలేజీలో లేని ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు హైదరాబాద్, నిజామాబాద్ బాటపడుతున్న విద్యార్థులు పేద, మధ్యతరగతి కుటుంబాలపై తప్పని ఆర్థిక భారం ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని విద్యార్థులు, తల్లిదండ్రుల వినతి -
చేపలవేటకు వెళ్లి జాలరి గల్లంతు
ఎల్లారెడ్డిరూరల్: చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ జాలరి గల్లంతైన సంఘటన ఎల్లారెడ్డి మున్సిపాలిటి పరిధిలోని పోసాన్పల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా.. పోసాన్పల్లి గ్రామానికి చెందిన బేస్త సాయిలు(58) ఆదివారం చేపలు పట్టేందుకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంతసేపటికీ అతడు తిరిగి రాకపోవడంతో సాయి లు కుటుంబ సభ్యులు గ్రామ శివారులోని ముర్సుకుంట వద్ద గాలించారు. కుంట ఒడ్డున సాయిలుకు చెందిన బట్టలు, చెప్పులు కనిపించాయి. వెంటనే అగ్నిమాపకశాఖ సిబ్బందితోపాటు పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బంది ఎంత వెతికినప్పటికి సాయిలు ఆచూకీ తెలియరాలేదు. చీకటి పడడంతో గాలింపు చర్యలను నిలిపి వేశారు. సాయిలు గల్లంతు కావడంతో సాయిలు కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
తొలి రోజు 95.72 శాతం నమోదు
జిల్లా వ్యాప్తంగా ఆదివారం చేపట్టిన జాతీయ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం విజయవంతమైంది. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు మొత్తం 1,03,678 మంది ఉండగా మొదటి రోజు 99,221 మంది (95.72 శాతం) చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు డీఎంహెచ్వో డాక్టర్ వెంకట్ వెల్లడించారు. జిల్లాలోని 24 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 733 పోలియో బూత్లను ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. 74 మంది రూట్ సూపర్వైజర్లు కార్యక్రమాన్ని పర్యవేక్షించారని, మారుమూల ప్రాంతాలు, ఇటుక బట్టీలు, సంచార జాతులు, నిర్మాణ రంగ ప్రాంతాల్లోని చిన్నారుల కోసం 22 మొబైల్ బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేసినట్లు తెలిపారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో 36 ట్రాన్సిట్ పాయింట్లను ఏర్పాటు చేసి చుక్కల మందు వేశారు. పలు బూత్లను డిప్యూటీ డీఎంహెచ్వోలు డాక్టర్ నర్సింగ్ చౌహాన్, డాక్టర్ రాజు గౌడ్, ప్రోగ్రాం ఆఫీసర్లు రోహిత్ కుమార్, ప్రదీప్, వెంకటస్వామి తనిఖీ చేశారు. ఆదివారం బూత్లకు రాలేకపోయిన చిన్నారులను గుర్తించేందుకు సోమ, మంగళవారాల్లో ఆరోగ్య శాఖ సిబ్బంది నేరుగా ఇంటింటికీ వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. -
రూ. 40 వేల ఆర్థిక సహాయం
కమ్మర్పల్లి: కమ్మర్పల్లి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ 1995–96 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యా ర్థులు తమ తోటి విద్యార్థి ఎం.డీ యూసుఫ్ఖాన్ అనారోగ్యంతో బాధపడుతుండడంతో వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. ఆదివారం యూసుఫ్ఖాన్ ఇంటికి వెళ్లి రూ. 40 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. భిక్కనూరు: మండలంలోని రామేశ్వర్పల్లిలో ఆది వారం ఉరుములతో కూడిన వర్షం కురవడంతో ప లువురి ఇళ్లలోని విద్యుత్ పరికరాలు కాలిపోయా యి. పలువురి ఇళ్లలోని టీవీలు, ఫ్రిజ్లు, మిక్సీలు, ట్యూబ్లైట్లు, విద్యుత్ బల్బులు చెడిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. -
నేడు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
కామారెడ్డి అర్బన్ : డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ, డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 29న సోమవారం నిజామాబాద్ ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ (డైట్)లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు ప్రిన్సిపల్ టీ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఉందన్నారు. గతంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయి, సీటు పొందని వారు, ఇతర కళాశాలలో స్లైడింగ్ కోరే వారు ఈ నెల 30న వెబ్ ఆప్షన్ ఇవ్వాలని సూచించారు. సీట్ల కేటాయింపు జూలై 4న ఉంటుందని తెలిపారు. కామారెడ్డి అర్బన్: జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారిణి ఎంపికయ్యారు. హైదరాబాద్లోని మణికొండ ఆదిరా బ్యాడ్మింటన్ అకాడమీలో నిర్వహించిన 12వ తెలంగాణ రాష్ట్ర జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్–2026 పోటీల్లో కామారెడ్డికి చెందిన ఆరాధ్యరెడ్డి విజేతగా నిలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఆరాధ్యరెడ్డి అండర్–19 బాలికల డబుల్స్ విభాగంలో బంగారు, మిక్స్డ్ డబుల్స్లో రన్నరప్గా నిలిచి వెండి పతకం సాధించినట్లు కామారెడ్డి ఖేలో ఇండియా బ్యాడ్మింటన్ అకాడమీ కోచ్, అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే సందీప్ గౌడ్ తెలిపారు. 48వ జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ (సౌత్ జోన్) పోటీల్లోనూ ఆరాధ్యరెడ్డి విజేతగా నిలిచి జిల్లా క్రీడాకారులకు స్ఫూర్తిగా ఉండాలని క్రీడాకారులు, అభిమానులు అభినందించారు. ● వర్చువల్గా ప్రారంభించిన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కామారెడ్డి టౌన్ : భారతీయ జనతా పార్టీ జిల్లా నూతన కార్యాలయాన్ని ఆదివారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్క్రీన్పై జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వర్చువల్ వేదికగా ఇచ్చిన సందేశాన్ని పార్టీ శ్రేణులు, నాయకులు ఆసక్తిగా వీక్షించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్, రాష్ట్ర నాయకులు మురళీధర్గౌడ్, బాణాల లక్ష్మారెడ్డి, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ● ‘మౌంట్ కియాగర్ రి’పై సుభాష్రెడ్డి చిత్రపటం ● 6,100 మీటర్ల ఎత్తు శిఖరాన్ని అధిరోహించిన బన్ని కామారెడ్డి అర్బన్ : పర్వతారోహణకు వెన్నుతట్టి ప్రోత్సహించిన వ్యక్తిపై అభిమానాన్ని చాటుకున్నాడు జిల్లాకు చెందిన యువకుడు. లడఖ్లో ప్రాంతంలోని ప్రసిద్ధ కియాగర్ రి శిఖరంపై ప్రముఖ వ్యాపారవేత్త, ఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి చిత్రపటాన్ని ఆదివారం ప్రదర్శించారు. రాజంపేట మండలం ఎల్లాపూర్ తండా గుండారానికి చెందిన విస్లావత్ బన్ని 6100 మీటర్ల ఎత్తున్న కియాగర్ రి శిఖరాన్ని అధిరోహించారు. మైనస్ డిగ్రీల చలిని, అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకుంటూ శిఖరాన్ని ఎక్కారు. అయితే, బన్నీకి వెన్నుదన్నుగా నిలిచిన సుభాష్రెడ్డి చిత్రపటాన్ని అంత ఎత్తుపై ప్రదర్శించి ఆయనపై ప్రేమను చూపించారు. పేద విద్యార్థులకు ఆయన సహకారం అందిస్తుండటంతో మరెంతో మంది విజయాలు సాధిస్తారని బన్ని పేర్కొన్నారు. బన్ని ఇది వరకు కిలిమంజారో, మౌంట్ కాంగ్ యాట్సే అధిరోహించారు. -
ఒకే రోజు రెండు పరీక్షలు
బీఈడీ విద్యార్థుల ఆందోళనఒకటి రాస్తే.. మరోటి..తెయూ(డిచ్పల్లి) : జాతీయ స్థాయిలో అత్యంత ప్ర తిష్ఠాత్మకంగా నిర్వహించే యూజీసీ నెట్ (UGC& NET) పరీక్షలు ఈనెల 29 నుంచి ప్రారంభమవుతుండగా, అదే రోజు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ నాలుగో సెమిస్టర్ థియరీ పరీక్షలను ప్రారంభించనుండడం, రెండు పరీక్షలు ఒకే రోజు, ఒ కే సమయానికి ఉండటంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. నెట్ పరీక్షకు నెలల తరబడి సిద్ధమవుతున్న విద్యార్థుల్లో చాలామంది బీఈడీ కూడా చదువుతున్నారు. ఇప్పుడు ఒకే రోజు రెండు పరీక్షలు రావడంతో ఏది రాయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. నెట్ రాస్తే బీఈడీ పరీక్ష కోల్పోవాల్సి వస్తుంది. బీఈడీ రాస్తే జాతీయ స్థాయి అర్హత పరీక్షను వదులుకోవాల్సి ఉంటుంది. రెండు కీలకమే.. బీఈడీ పరీక్ష రాయకపోతే.. కోర్సు పూర్తి, ఫలితాలు ఆలస్యమయ్యే ప్రమాదం నెలకొంది. మరో ఏడాది నిరీక్షించాల్సి వస్తోందని విద్యార్థులు వాపోతున్నా రు. నెట్ పరీక్ష రాయకపోతే.. అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోల్పోయే అవకాశం ఉంది. జేఆర్ఎఫ్ అవకా శం కోల్పోవడం.. మరో నోటిఫికేషన్ వరకు నిరీక్షణ తప్పదు. నెలల తరబడి చేసిన శ్రమ వృథా అవు తుంది. రెండు పరీక్షలు విద్యార్థుల భవిష్యత్తుకు కీల కమైనవి కావడంతో అయోమయం నెలకొంది. బీఈడీ నాలుగో సెమిస్టర్ థియరీ పరీక్షలను కనీసం కొన్ని రోజులు వాయిదా వేయాలని, నెట్ పరీక్ష రాసే విద్యార్థులకు ప్రత్యామ్నాయ తేదీ ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు.నెట్ పరీక్ష దేశవ్యాప్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు, జూనియర్ రీసెర్చ్ఫెలోషిప్ (JRF) సాధించేందుకు నిర్వహించే కీలక పరీక్ష. అలాగే పీహెచ్డీ చేసేందుకు నెట్ అవసరం. మరోవైపు బీఈడీ కోర్సు పూర్తి చేయాలంటే నాలుగో సెమిస్టర్ పరీక్షలు తప్పనిసరిగా రాయాలి. ఒక పరీక్ష మిస్ అయితే వెంటనే సప్లిమెంటరీ అవకాశం లేకపోవడంతో మరో ఏడాది వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో విద్యార్థులు రెండు వైపులా నష్టపోయే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్ విడుదలైన తర్వాత విద్యార్థులు తెలంగాణ యూనివర్సిటీ అధికారులను కలిసి తేదీలను మార్చాలని కోరారు. -
శిథిల ఠాణాలు!
శిథిలావస్థకు చేరిన నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ భవనంజిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ భవనాలు కాలం చెల్లినా అందులోనే కొనసాగిస్తున్నారు. పోలీసు సిబ్బందికి నిర్మించిన క్వార్టర్లయితే ఎక్కడా ఉపయోగంలో లేవు. దీంతో సిబ్బంది బయటే ఉంటున్నారు. శాంతి, భద్రతల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన పోలీసు స్టేషన్ భవనాలు శిథిలావస్థకు చేరినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. పెచ్చులూడటం, వర్షంతో ఊరుస్తుండటం, కొన్నిచోట్ల కరెంటు షాక్ కొడుతున్నాయి. దీంతో ఆ భవనాల్లో విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది భయం గుప్పిట్లో గడపాల్సి వస్తోంది. కాలం చెల్లిన పోలీస్ స్టేషన్ భవనాలకు అప్పుడప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. అయితే గతేడాదిలాగే భారీ వర్షాలు కురిస్తే ఇబ్బందులు తలెత్తే పరిస్థితి నెలకొంది. సిబ్బంది క్వార్టర్లు సైతం.. జిల్లాలో పోలీస్ సిబ్బందికి క్వార్టర్లు లేకుండాపోయాయి. జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది క్వార్టర్లు శిథిలావస్థకు చేరడంతో కూల్చివేశారు. మాచారెడ్డి, నాగిరెడ్డిపేట పోలీస్ క్వార్టర్లు కూలిపోయే దశలో ఉన్నాయి. ఎల్లారెడ్డిలో పోలీస్ క్వార్టర్లు కూల్చివేశారు. ఇతర మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. తాడ్వాయి పోలీస్ క్వార్టర్లు శిథిలావస్థకు చేరడంతో వాడటం లేదు.దశాబ్దాల క్రితం నిర్మించిన ఠాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్నిచోట్ల పెచ్చులూడుతుండగా, మరికొన్ని చోట్ల వర్షమొస్తే జల్లులు పడుతూ ఎప్పుడు కూలుతాయో తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక కొత్తగా ఏర్పాటైన పోలీస్ స్టేషన్లకు సొంత భవనాలు కరువయ్యాయి. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి కాలం చెల్లి పెచ్చులూడుతున్నాయ్.. తాత్కాలిక మరమ్మతులతో సరి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్ల పరిస్థితి దయనీయం మూలనపడ్డ సిబ్బంది క్వార్టర్లు కొత్త పీఎస్లకు సొంత భవనాల్లేవ్..! -
గడుగు గంగాధర్కు టీపీసీసీ చీఫ్ పరామర్శ
నిజామాబాద్ రూరల్ : రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ను టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ ఆదివారం పరామర్శించారు. నగరంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో గడు గు గంగాధర్ ఇల్లు దగ్ధమైన విషయం తెలిసిందే. నగరంలోని గంగాధర్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ పరామర్శించారు.ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించా రు. దగ్ధమైన ఇంటిని పరిశీలించారు. డీసీసీ అధ్య క్షులు నగేశ్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు, రామకృష్ణ, రాంభూపాల్, సీనియర్ నాయకులు, దయాకర్ గౌడ్, అడ్వకేట్ రామకృష్ణ , కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: బాపూజీ వచనాలయానికి నిధులు మంజూరైనట్లు ఆదివారం వచనాలయ కమిటీ సభ్యులు తెలిపారు. హైదారాబాద్లో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్, రాజ్య సభ సభ్యుడు అనిల్కుమార్ యాదవ్లను మర్యాదపూర్వకంగా కలిసినట్లు వారు పేర్కొన్నా రు. దాదాపు రూ. 3 కోట్లతో నిర్మిస్తున్న బాపూజీ వచనాలయం రెండు అంతస్తులు పూర్తయిందన్నారు. మహేశ్ కుమార్ గౌడ్ రూ. 15లక్షలు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ రూ. 25 లక్షలు మంజూరు చేశారని పేర్కొన్నారు. ఈసందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాపూజీ వచనాలయ కమిటీ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. -
పోలియో రహిత సమాజం కోసం కృషి చేయాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● జిల్లా వ్యాప్తంగా 99,221 మంది చిన్నారులకు పోలియో చుక్కలు ● నేడు, రేపు ఇంటింటి సర్వేకామారెడ్డి టౌన్ : పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆదివారం చిన్నారులకు పోలియో చుక్కలు వేసి జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఐదేళ్లలోపు ఉన్న ప్రతి చిన్నారికి తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. జిల్లాలో ఒక్క చిన్నారి కూడా చుక్కల మందు కార్యక్రమానికి దూరం కాకుండా వందశాతం విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ముందస్తు ప్రణాళికతో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాలు, మొబైల్ బృందాల సేవలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేలా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బందికి కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, డీఎంహెచ్వో వెంకట్, ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో సంతోష్, మున్సిపల్ కౌన్సిలర్లు గెరికంటి లక్ష్మీనారాయణ, స్వప్న, వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు ఇందూరు తిరుమలలో ఏరువాక పౌర్ణమి
మోపాల్: మండలంలోని నర్సింగ్పల్లిలోగల ఇందూరు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి క్షేత్రంలో సోమవారం ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మా పల్లె చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి నర్సింహారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం స్వామి వారికి జ్యేష్ఠాభిషేకం, అభిషేకం, అలంకరణ పూర్తి కాగానే జ్యేష్ఠ మాసంలో నిర్వహించే వరుణ యాగం ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. ఎద్దులు, నాగళ్లు, అన్ని వ్యవసాయ ఉపకరణాలను గౌరవించుకుని ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రతినెల పౌర్ణమి రోజు గర్భిణులకు అందించే దివ్యౌషధాన్ని సాయంత్రం 6 నుంచి 8.30 గంటలలోపు అందిస్తామన్నారు. కార్యక్రమంలో రైతులు, గర్భిణులు, భక్తులు పెద్దసంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నర్సింహారెడ్డి కోరారు. కమ్మర్పల్లి: మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్పల్లికి బెస్ట్ యాక్టివిటీస్ అవా ర్డు దక్కింది. క్లబ్ స్థాపించిన ఏడాదిలోనే పలు సేవా కార్యక్రమాలను నిర్వహించినందుకు బె స్ట్ యాక్టివిటీస్ అవార్డుతో పాటు బెస్ట్ సెక్రెటరీ అవార్డును సొంతం చేసుకున్నట్లు క్లబ్ అధ్యక్షుడు లుక్క గంగాధర్ తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన లయన్స్ క్లబ్ దిల్ సే కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ గవర్నర్ అమర్నాథ్ చేతుల మీదుగా బెస్ట్ యాక్టివిటీస్ అవార్డుతో పాటు, బెస్ట్ సెక్రటరీ అవార్డును అందుకున్నారు. ఈకార్యక్రమంలో లుక గంగాధర్, తెడ్డు రమేష్, చింత ప్రదీప్, రేవతి గంగాధర్, లక్మ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. బోధన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) సర్వే సందర్భంగా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ సూచించారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే షకీల్ నివాసంలో జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, నియోజక వర్గ నాయకులతో కలిసి ఆయన పార్టీ నాయకులతో మాట్లాడారు. పార్టీ శ్రేణులు, సానుభూతిపరుల ఓట్లు గల్లంతు కాకుండా ప్రత్యేకశ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. త్వరలో ప్రారంభం కానున్న పార్టీ సభ్యత్వ నమోదులో కీలక పాత్ర వహించాలన్నారు. పార్టీ సభ్యత్వ నమో దు ప్రక్రియ పై అవగాహన కల్పించేందుకు జిల్లా కేంద్రంలో నియోజక వర్గాల వారీగా శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. డీసీసీబీ మాజీ డైరెక్టర్ గిర్ధావర్ గంగాఽరెడ్డి, నాయకులు రవీంద్రయాదవ్, సంజీవ్, గోగినేని నర్సయ్య, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో దేశంలో విద్యార్థులు, యువత భవిష్యత్ ఆందోళనకర స్థితిలో ఉందని కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. నగరంలోని కాకతీయ కళాశాలలో ‘ఛాత్రోన్ కి గూంజ్’ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. దేశంలోని విద్యార్థులు, నిరుద్యోగులతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని అన్నారు. పేపర్ లీకేజీలతో విద్యార్థులను మోసం చేయడం, నిరుద్యోగులను మోసం చేయడాన్ని తీ వ్రంగా వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ దేశవ్యాప్త పోరాటానికి శ్రీకారం చుట్టారన్నారు. ‘ఛాత్రోన్ కి గూంజ్’ రాజకీయ కార్యక్రమం కాదని, దేశ యువత భవిష్యత్ కోసం ప్రారంభమైన జాతీ య ఉద్యమని స్పష్టం చేశారు. విద్యార్థి, యువ త కలలను సాకారం చేస్తేనే భారత్ ప్రపంచ శక్తిగా ఎదుగుతుందని విశ్వసిస్తున్న కాంగ్రెస్.. దేశ యువతకు విద్య, ఉపాధి, సమాన అవకాశాలు అందించేందుకు నిత్యం పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నుడా చైర్మన్ కేశ వేణు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్గౌడ్, సీనియర్ నాయకులు జావెద్ అక్రమ్, ప్రీతం, ముస్తఫా, గోవర్ధన్, వహీద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ పట్టణంలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసే బా ధ్యత తమదేనని త్వరలోనే అన్ని పనులు పూర్తి చేస్తామని కాంగ్రెస్ బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్కుమార్ పేర్కొన్నా రు. ఆదివారం ఆయన పట్టణంలో నిర్మాణంలో ఉన్న భవనాలను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, భీమ్గల్కు కోర్టును తీసుకొచ్చి న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు. వంద పడకల ఆస్పత్రిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. జనవాసాలకు దూరంగా ఉన్న రెవెన్యూ కార్యాలయాన్ని పంచాయతీరాజ్ వసతి గృహానికి మారుస్తామన్నారు. నాయకులు లక్ష్మణ్, పర్స అనంతరావు తదితరులు ఉన్నారు. -
దంచికొట్టిన వాన
● నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం ● ఎడపల్లిలో 72.8 మి.మీ. వర్షపాతం నమోదునిజామాబాద్అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుంచి విస్తారంగా వర్షం కురిసింది. సీజన్ ప్రారంభమైన తరువాత ఇదే భారీ వర్షం. రైతులు ఆందోళన చెందుతున్న వేళ కురిసిన భారీ వర్షం ఊరటనిచ్చింది. సాయంత్రం వేళ ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని బోధన్, నిజామాబాద్ డివిజన్లలో సుమారు రెండుగంటలపాటు భారీ వర్షం కురిసింది. ఎడపల్లిలో అత్యధికంగా 72.8 మిల్లీమీటర్ల వర్షం కురవగా.. మోస్రాలో 70, నవీపేటలో 54.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆర్మూర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో మాత్రం తక్కువ వర్షపాతం నమోదైంది. ఏదిఏమైనా వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో కురిసిన భారీ వాన రైతుల్లో ఆనందాన్ని నింపింది. -
కాంగ్రెస్తోనే ప్రజా సంక్షేమం సాధ్యం
● నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి మోపాల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం సాధ్యమని నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మోపాల్లోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన విలేకర్ల సమావేశం ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా నియోజకవర్గంలోని మోపాల్, నిజామాబాద్ రూరల్, ఇందల్వాయి మండలాలకు రూ.2.25 కోట్లచొప్పున తహసీల్దార్ కార్యాలయాలను మంజూరు చేసినందుకు మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ మహేష్కుమార్ గౌడ్కు ఆయా మండలాల ప్రజలు, కాంగ్రెస్ నాయకుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మోపాల్ మండలంలోనే రూ.250 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని గుర్తుచేశారు. మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు. సమావేశంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కూచన్పల్లి జలంధర్రెడ్డి, కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు ఎల్లోళ్ల సాయిరెడ్డి, ఉపసర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రామాగౌడ్, సర్పంచులు, నాయకులు రాకేష్ యాదవ్, గుడి ప్రవీణ్రెడ్డి, సాయినాథ్రెడ్డి, భూమయ్య, మల్లయ్య, నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు రూ.30 వేల కోట్లు ఇవ్వాల్సిందే..
బాన్సువాడ : రైతులకు రూ.30 వేల కోట్ల రైతుభరోసా నిధులు ఇచ్చిన తర్వాతే సీఎం రేవంత్రెడ్డి మాట్లాడాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని భారత్ గార్డెన్స్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్పై కార్యకర్తలు, బీఎల్ఏలకు ఆదివారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు పంటలకు కలిపి రూ.55 వేల కోట్ల రైతుభరోసా నిధులు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.25 వేల కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేశారని, ఇంకా రూ.30 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని అన్నారు. 18 ఏళ్లు నిండిన మహిళకు ప్రతి నెల రూ.2500 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు అవుతున్నా ఒక్క పైసా ఇవ్వలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ నిధులు ఇంకా రూ.20 వేల కోట్లు ఇవ్వాలని, బోనస్ ప్రస్తావనే తీయడం లేదని అన్నారు. ‘పోచారం’ను రానిచ్చే ప్రసక్తే లేదు.. ప్రస్తుతం సర్వేలన్నీ మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదట బాన్సువాడలో బీఆర్ఎస్ గెలుస్తుందని సర్వేలు తేల్చినట్లు పేర్కొన్నారు. రూ. వేల కోట్లు ఇచ్చి బాన్సువాడను అభివృద్ధి చేసిన మాజీ సీఎం కేసీఆర్ గుండెలపై తన్ని కాంగ్రెస్ గూటికి చేరిన పోచారం శ్రీనివాస్రెడ్డి మళ్లీ బీఆర్ఎస్లోకి వస్తానంటే రానిచ్చే ప్రసక్తే లేదని కేటీఆర్ చెప్పారని ఆయన కార్యకర్తలకు వివరించారు. ప్రస్తుతం పోచారం వెంట ఉన్న నాయకులు సైతం కేటీఆర్కు ఫోన్ చేసి పార్టీలోకి వస్తామని చెబుతున్నారని, కానీ, కష్టకాలంలో పార్టీని నమ్ముకొని ఉన్న ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని అన్నారు. ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలని అన్నారు. సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి ఆగయ్య, మాజీ ఎమ్మెల్యేలు జాజాల సురేందర్, హన్మంత్సింధే, గణేశ్ గుప్తా, జడ్పీ మాజీ చైర్మన్లు దఫేదార్ రాజు, దాదన్నగారి విఠల్రావు, నాయకులు రత్నకుమార్, అంజిరెడ్డి, జుబేర్, యలమంచలి శ్రీనివాస్రావు, చందూర్ సర్పంచ్ మాధవరెడ్డి, అక్బర్, శ్రీనివాస్, మక్బుల్, ఖలీల్, ఇషాక్, రమేశ్ యాదవ్, శివసూరి తదితరులు పాల్గొన్నారు.మాజీ సీఎం కేసీఆర్ అధికారంలో ఉంటేనే తెలంగాణకు భద్రత ఉంటుందని రాజ్యసభ మాజీ స భ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభు త్వం ప్రాంతీయ పార్టీలను ముక్కలు చేయాలనే ఉద్దేశంతో ఎస్ఐఆర్ను తీసుకొచ్చిందని, ప్రతీ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని అన్నారు. వచ్చే ఏడాదిలోపు బాన్సువాడలో పోచారం సింగిల్గానే మిగులుతారని అన్నారు. నియోజకవర్గంలో 80 వేల సభ్యత్వ నమోదు చేయాలని వీజీ గౌడ్ అన్నారు. ఓటు గల్లంతు కాకుండా ప్రతీ కార్యకర్త చూడాలని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. పోచారం లక్ష్మీపుత్రుడు కాడని, లంకపుత్రుడని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి విమర్శించారు. ఆ తర్వాతే సీఎం రేవంత్ మాట్లాడాలి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెప్తున్నాయి బాన్సువాడలో బీఆర్ఎస్ సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
మద్నూర్(జుక్కల్): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నూతనంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తి చేసుకొని గృహప్రవేశాలు చేసిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే గోడ గడియారాలను పంపిణీ చేశారు. మండలంలో ఇప్పటి వరకు 130 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని ఎంపీడీవో రాణి అన్నారు. మండలానికి 627 ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయిలు, నాయకులు రాంపటేల్, గోపి, హన్మాండ్లు స్వామి, తదితరులున్నారు. -
కబడ్డీ టోర్నీ ప్రారంభం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్పేటలో శనివారం కబడ్డీ టోర్నీ ప్రారంభమయింది. ప్రస్తుతం హైద్రాబాద్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న తాడ్వాయి వాస్తవ్యులు సీహెచ్ రాజు నాగిరెడ్డిపేట మండలకేంద్రంలో కబడ్డీ టౌర్నమెంట్ను ప్రారంభించారు. కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సిద్ధిపేట, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు చెందిన 17 జట్లు పాల్గొన్నాయి. కాగా గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాలను వెలికితీయడంతోపాటు యువత మత్తుకు దూరమై క్రీడానైపుణ్యాలను పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో తాను కబడ్డీ టౌర్నమెంట్ను నిరహిస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్గౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీధర్గౌడ్, ఉపాధ్యక్షులు దత్తు, కిష్టయ్య, సర్పంచ్లఫోరం మండలాధ్యక్షుడు మురళీమోహాన్గౌడ్, నాగిరెడ్డిపేట సర్పంచ్ మన్నె వెంకట్, తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి: అన్న– అక్క మెంటార్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఏఐపై శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులలో 105 మందిని అన్న–అక్క మెంటార్లుగా ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. వీరికి పీఐ–జామ్ సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా ఏఐతో పాటు డేటాసైన్స్ నేర్పించనున్నట్లు వెల్లడించారు. వీరిలో 77 మందిని ప్రభుత్వ పాఠశాలలకు కేటాయించి వీరు నేర్చుకున్న డిజిటల్ నైపుణ్యాలను ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఉచితంగా నేర్పిస్తారన్నారు. తద్వారా పాఠశాల స్థాయిలోనే పిల్లలకు అధునాతన ఏఐ సాంకేతికతపై అవగాహన వస్తుందని చెప్పారు. అసోసియేట్ ప్రొఫెసర్లు చంద్రకాంత్, శంకరయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఇళ్ల స్థలాలు ఇప్పించాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఎర్రాపహాడ్ గ్రామానికి చెందిన మాల కులస్తులకు ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతూ అంబేడ్కర్ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి రాజలింగం ఆధ్వర్యంలో మాలసంఘం ప్రతినిధులు శనివారం సర్పంచ్ మల్లవ్వ, ఉప సర్పంచ్ ప్రభా కర్రెడ్డిలకు వినతిపత్రాలను అందజేశారు. నా యకులు గైని రాజలింగం, శ్రీహరి, రవీందర్, నర్సయ్య, కృష్ణ, శ్రీకాంత్, నాగేష్, లక్ష్మయ్య, రవి, రవితేజ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: పదో తరగతిలో ఉత్తమ మా ర్కులు సాధించి బాసర ట్రిపుల్ ఐటీలో సీటు పొందిన విద్యార్థిని డి.నిఖితకు ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ తరఫున కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం ఆర్థికసాయం అందజేశారు. లింగంపేట మండలం షెట్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన నిఖిత కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రెడ్క్రాస్ రూ.10వేల సాయం అందించినట్లు కలెక్టర్ తెలిపారు. ఎస్పీ రాజేశ్ చంద్ర, రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఎం రాజన్న, ప్రతినిధి పీవీ నర్సింహం తదితరులు పాల్గొన్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): ఉత్తునూర్ గ్రామానికి చెందిన విద్యార్థిని బాకోళ్ల రక్షిత బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించడంతో స్థానిక బీఆర్ఎస్ నాయకులు అభినందించి సన్మానించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, పాల కేంద్రం అధ్యక్షుడు దొడ్లె రవి, వీడీసీ చైర్మన్ శ్రీకాంత్ రావు, మాజీ ఉప సర్పంచ్ శివపాటిల్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డిని శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఆయన నివాసంలో యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. డీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ దేవరాజ్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీరామ్ ఆనంద్, మాజీ జెడ్పీటీసీ నంద రమేష్, నాయకులు అల్లాడి సుదర్శన్ తదితరులున్నారు. శ్రీనాథ్రెడ్డి కుటుంబానికి.. భిక్కనూరు: లండన్లో మృతి చెందిన తలమడ్ల గ్రామానికి చెందిన యువకుడు శ్రీనాథ్రెడ్డి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ శనివారం ఫోన్లో పరామర్శించారు. ఆయన శ్రీనాథ్రెడ్డి తండ్రి మల్లికార్జున్ రెడ్డితో పాటు బంధువు గౌరిగారి రాజిరెడ్డితో ఫోన్లో మాట్లాడి ఓదార్చారు. మృతదేహాన్ని స్వగ్రామానికి రప్పించేందుకు సహకారం అందిస్తానని గోవర్ధన్ వారికి హామీ ఇచ్చారు. కామారెడ్డి అర్బన్ : అంధులు, బధిరులు, దివ్యాంగుల ఉద్యమాల సారధిగా ప్రసిద్ధి చెందిన హెలెన్ కెల్లర్ జయంతిని కలెక్టరేట్లో శనివారం ఘనంగా నిర్వహించారు. దివ్యాంగుల సమ్మిళిత అభివృద్ధి కార్యక్రమం (సెర్ప్) ఆధ్వర్యంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, డీఆర్డీవో దామోదర్రెడ్డి కేక్ కట్ చేసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. దివ్యాంగుల కోసం హెలెన్ కెల్లర్ అందించిన సేవలను వక్తలు కొనియాడారు. ట్రైనీ అడిషనల్ కలెక్టర్ రవితేజ, అడిషనల్ డీఆర్డీవో విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్/కామారెడ్డి అర్బన్: లింగాపూర్ శివారులో విద్యుత్ షాక్ తగలడంతో ఓ పాడి గేదె మృతి చెందింది. వివరాలు .. లింగాపూర్ గ్రామ రైతు రాజయ్యకు చెందిన పాడి గేదె శనివారం మేత కోసం పొలానికి వెళ్లింది. గ్రామంలోని ఎస్ఎస్–2 ట్రాన్స్ఫార్మర్ సమీపంలో ఉన్న చేనులోగల ఇనుప విద్యుత్ స్తంభానికి గేదె తాకడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సుమారు రూ.70 వేలు విలువైన గేదె మృతిచెందడంతో నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
నీవెంటే నేనంటూ..
క్రైం కార్నర్మాచారెడ్డి: మండల పరిధిలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ము గ్గురు స్నేహితుల్లో ఒకరు ఘటన జరిగిన రోజే మృతిచెందగా, మరొకరు శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. రాజ న్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండ ల కేంద్రానికి చెందిన కోట అనిల్ (24), అన్వేష్ గౌడ్, వికాస్ ముగ్గురు ప్రాణస్నేహితులు, క్లాస్మేట్స్. అనిల్ జీవనోపా ధి నిమిత్తం దుబాయ్ వెళ్లగా, ఇటీవలనే స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. సుదీర్ఘ కాలం తర్వాత మిత్రుడు రావడంతో ముగ్గురు కలిసి శుక్రవారం కారులో కా మారెడ్డికి వచ్చారు. రాత్రివేళ తిరిగి వా రు స్వగ్రామానికి వెళ్తుండగా, మాచారెడ్డి మండలం కాకులగుట్ట తండా సమీపంలో వీరి వాహనం అదుపుతప్పి రోడ్డు ప క్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన అన్వేష్ గౌడ్ను మెరుగైన చికిత్స నిమి త్తం హైదరాబాద్ తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో శనివారం వే కువజామున ప్రాణాలు విడిచాడు. ‘నీ వెంటే నేనంటూ’ ఒకే రోజు వ్యవధిలో ఇద్దరు స్నేహితులు మృత్యువాత పడటంతో గంభీరావుపేట గ్రామంలో విషా ద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో స్నేహితుడు వికాస్ ప్రస్తుతం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.అన్వేష్ గౌడ్, అనిల్ (ఫైల్) ‘చెట్టును ఢీకొన్న కారు’ ఘటనలో మరో స్నేహితుడి మృతి గంభీరావుపేటలో విషాధచాయలు -
స్కూళ్లలో పుస్తకాలు, యూనిఫామ్లు విక్రయిస్తే చర్యలు
కామారెడ్డి టౌన్ : ప్రైవేట్ పాఠశాలల్లో నిబంధనలకు విరుద్ధంగా పాఠ్య, నోట్ పుస్తకాలు, యూనిఫామ్ తదితర సామగ్రి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో మల్లికార్జున్ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశపు హాల్లో విద్యాశాఖ అధికారులు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో శనివారం ఆయన అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల నిర్వహణ, ప్రభుత్వ నిబంధనల అమలుపై చర్చించారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా జీవో నంబర్ 1 నియమ నిబంధనలను పాటించాలని సూచించారు. పాఠశాలలకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. యూడైస్ (యూడీఐఎస్ఈ) పోర్టల్లో స్కూల్ ప్రొఫైల్, టీచర్, స్టూడెంట్ మాడ్యూల్స్ వివరాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని యాజమాన్యాలను కోరారు. నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
యూరియా కొరత లేదు : కలెక్టర్ సంగ్వాన్
● ఎరువుల రేక్ పాయింట్ పరిశీలనకామారెడ్డి క్రైం: యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందొద్దని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్లో రేక్ పాయింట్ను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎరువుల విక్రయదారులు తప్పనిసరిగా యాప్లో నిల్వలను నిర్ధారించాలన్నారు. విక్రయాలు పూర్తిగా ఈ – పాస్ యంత్రాల ద్వారా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యూరియా పంపిణీ పకడ్బందీగా జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక మొబైల్ యాప్ తీసుకొచ్చిందన్నారు. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం సాగు విస్తీర్ణం గణనీయంగా తక్కువగా ఉందన్నారు. గతేడాది ఈ సమయానికి 3.30 లక్షల బస్తాలను మాత్రమే కొనుగోలు చేసిన రైతులు ఈ సారి మాత్రం ఇప్పటివరకు 4.08 లక్షల యూరియా బస్తాలను కొనుగోలు చేశారని తెలిపారు. సాగు విస్తీర్ణం తగ్గినప్పటికీ యూరియా కొనుగోళ్లు పెరగడం గమనర్హమన్నారు. ప్రస్తుతం జిల్లాలో సుమారు 1.58 లక్షల యూరియా బస్తాల నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, మార్క్ఫెడ్ డీఎం క్రాంతి, అధికారులు పాల్గొన్నారు. సింగూర్ సెగ్మెంట్లో తాగునీటి వనరులపై సర్వే కామారెడ్డి క్రైం: సింగూర్ రిజర్వాయర్ నీటి లభ్యతను సమర్థవంతంగా వినియోగించడంతోపాటు భూగర్భ జలాలను పరిరక్షించే దిశగా సెగ్మెంట్ పరిధిలోని జుక్కల్, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పరిధిలో ఉన్న 14 మండలాల గ్రామాల్లో తాగునీటి వనరులపై సమగ్ర సర్వే నిర్వహించాలని నిర్ణయించినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి అదనపు కలెక్టర్ గిరి, జెడ్పీ సీఈవో చందర్, డీపీవో మురళి, డీఆర్డీవో దామోదర్ రెడ్డి, జిల్లా భూగర్భ జలాల శాఖ, మిషన్ భగీరథ అధికారులతో కలిసి ప్రత్యేక కమిటీని నియమించారు. ఈ కమిటీ గ్రామాల్లో అందుబాటులో ఉన్న చేతి పంపులు, బోర్వెల్స్, సింగిల్ ఫేజ్ మోటార్లు, గ్రామీణ తాగునీటి పథకాలను సర్వే చేసి, నీటి వనరుల పరిస్థితిని అంచనా వేస్తుందన్నారు. సర్వే నివేదిక ఆధారంగా అవసరమైన ప్రాంతాల్లో రీఛార్జ్ పిట్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించి, భూగర్భ జలాల పునరుద్ధరణతో పాటు తాగునీటి వనరుల స్థిరీకరణకు చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. -
సైబర్నేరాలపై అవగాహన కల్పించాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): సైబర్ నేరాల నియంత్రణ కు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహి స్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని ఎల్లారెడ్డి డీఎ స్పీ శ్రీనివాసరావు సూచించారు. నాగిరెడ్డిపేట పోలీస్స్టేషన్ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చే శారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్లో పలు రికార్డులను ఆయన పరిశీలించారు. దీంతోపాటు స్టేషన్ పరిధిలో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను నా గిరెడ్డిపేట ఎస్సై భార్గవ్గౌడ్ను అడిగి తెలుసుకున్నా రు. అనంతరం స్టేషన్లోని సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. రాత్రివేళ పెట్రోలింగ్ను ముమ్మ రం చేయాలని ఎస్సైని ఆదేశించారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా చూడాలని చెప్పారు. ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి ఉన్నారు. -
అంగన్వాడీ కేంద్రాల వద్ద కూరగాయల సాగు
నిజాంసాగర్(జుక్కల్): అంగన్వాడీ కేంద్రాల వద్ద కూరగాయలు సాగు చేస్తూ చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజేశ్వరి అన్నారు. శనివారం మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్ల సెక్టార్ సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల వద్ద ఆకుకూరలతో పాటు కూరగాయలు పండించాలన్నారు. కిచెన్ షెడ్ల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. వర్షాకాలం ఆరంభం కావడంతో సీజన్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నెలనెలా చిన్నారుల బరువులు, ఎత్తులు తప్పనిసరిగా సేకరిస్తూ రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. సెక్టార్ అధ్యక్షులు రోజా, టీచర్లు ప్రమీల, విజయలక్ష్మి, సావిత్రి, సాయవ్వ, మైశకల, విజయ, అనిత, వెన్నెల తదితరులున్నారు. -
రోడ్డుకు మోక్షమెప్పుడో..?
పోతాయిపల్లి– నందివాడలింగంపేట(ఎల్లారెడ్డి): దశాబ్దాలు గడుస్తున్నా పలు గ్రామాల కల నేటికి కలగానే మిగిలిపోయింది. పాలకుల హామీలు, అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. అటవీ భూములు వేల ఎకరాల్లో కబ్జాకు గురవుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నా అటవీ శాఖ అధికారులు ప్రజలకు ఉపయోగపడే రోడ్డు పనులను అడ్డుకొని నిలిపివేయడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దీనికి నిదర్శనమే లింగంపేట మండలం పోతాయిపల్లి–నందివాడ రోడ్డు. గతంలో నిధులు మంజూరైనా పూర్తి స్థాయిలో నిర్మాణానికి నోచుకోకపోవడం గమనర్హం. పాలకులు, అధికారులు మారుతున్నారు కానీ రోడ్డుకు మోక్షం ఎప్పుడోస్తుందోనని ఎదురు చూస్తున్నారు. రోడ్డు నిర్మాణానికి అనుమతులు తేవడంలో పాలకులు, అధికారులు విఫలమవుతున్నారు. లింగంపేట మండలం పోతాయిపల్లి నుంచి నందివాడ మీదుగా కామారెడ్డికి వెళ్లే రోడ్డును పూర్తి చేస్తే పలు గ్రామాల ప్రజలు, వ్యాపారులు, రైతులు, విద్యార్థులకు సౌకర్యంగా ఉంటుంది. ఎన్నికలు రాగానే మేము అనుమతులు తెస్తామని హామీలు గుప్పిస్తున్నారే తప్ప ఆచరణలో పెట్టడం లేదు. ఇప్పటికై నా పోతాయిపల్లి–నందివాడ రోడ్డుకు అనుమతులు తేవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 15 కిలోమీటర్లు.. రూ.1.80 కోట్లు.. 2009లో 15 కిలో మీటర్ల రోడ్డుకు రూ.1.80 కోట్లు మంజూరయ్యాయి. బీటీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. అయిలాపూర్ నుంచి పోతాయిపల్లి వరకు బీటీ రోడ్డు వేశారు. పోతాయిపల్లి నుంచి నందివాడకు అటవీ ప్రాంతం మీదుగా రోడ్డు వేయాలి. ఇందుకోసం గతంలో పోతాయిపల్లి, కోమట్పల్లి, అన్నారెడ్డిపల్లి, కేశాయిపేట, సురాయిపల్లి తదితర గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా వందల మంది శ్రమదానం చేసి కొమ్మలు కొట్టి, మొరం వేశారు. రోడ్డు కోసం గుంతలు పూడ్చారు. బండ్లబాటను రోడ్డుగా మార్చారు. అయితే అటవీశాఖ అధికారులు తమ పరిధిలోని అటవీ భూమి మీదుగా రోడ్డు వేయడానికి వీలులేదని పనులు నిలిపివేశారు. సుమారు నాలుగు కిలోమీటర్లు బీటీ రోడ్డు ఆగిపోయింది.రోడ్డు నిర్మాణం పూర్తయితే విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు కామారెడ్డి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే లింగంపేట మీదుగా వెళ్లాల్సి వస్తోంది. పోతాయిపల్లి–నందివాడ రోడ్డు పూర్తయితే పొల్కంపేట మీదుగా నేరుగా జిల్లా కేంద్రానికి వెళ్లవచ్చు. దూరం, సమయం ఆదా అవుతుంది. – లెగ్గల రాజు, పర్మళ్లరైతులు పండించిన ధాన్యం, కూరగాయలు, కిరాణ దుకాణం సరుకులు కొనుగోలు చేయడం, విక్రయించడానికి నేరుగా కామారెడ్డికి తరలించవచ్చు. రవాణా ఖర్చులు తగ్గుతాయి. పలు గ్రామాలకు, తండాలకు దూరం తగ్గి, సమయం ఆదా అవుతుంది. ప్రజలకు ఉపయోగపడే పనులను అటవీ శాఖ అధికారుల అడ్డుకోవడం సరికాదు. – పెద్దబోయిన సాయిలు, పోతాయిపల్లిపోతాయిపల్లి–నందివాడ రోడ్డు నిర్మాణంతో పొల్కంపేట, కన్నాపూర్, అయిలాపూర్, పోతాయిపల్లి, కోమట్పల్లి, అన్నారెడ్డిపల్లి, కేశాయిపేట, సురాయిపల్లి, శెట్పల్లిసంగారెడ్డి, పర్మళ్ల, ఎక్కపల్లి, సజ్జన్పల్లి, మాలపాటి, లొంకల్పల్లితో పాటు పలు తండాల ప్రజలు కామారెడ్డి జిల్లా కేంద్రానికి వెళ్లడానికి సౌకర్యంగా ఉంటుంది. ఆయా గ్రామాల ప్రజలు ప్రస్తుతం లింగంపేట మీదుగా వెళ్లాలంటే 38 కిలోమీటర్లు దూరం ఉంటుంది. పోతాయిపల్లి–నందివాడ, ఎర్రాపహడ్ మీదుగా 25 కిలోమీటర్లు దూరం ఉంటుంది. 11 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దశాబ్దాలు గడిచినా నెరవేరని కల అనుమతులు తీసుకురాని ప్రజాప్రతినిధులు, అధికారులు అటవీ శాఖ అభ్యంతరంతో నిలిచిపోయిన రోడ్డు పనులు -
సాగు ఆగమాగం!
ప్రతి ఏడాది వరి సాగు చేసేవాళ్లం. ఈ సారి వర్షాల్లేకపోవడంతో వరి నుంచి తప్పుకుని ఆరుతడి పంటలు వేయాలని ప్రయత్నం చేస్తున్నా. అయినా ఆరుతడి పంటలకు కూడా నీరు అందే పరిస్థితి లేదు. మూడెకరాల్లో ఆయిల్పామ్ సాగు చేశా. అంతర పంటగా మక్క వేసిన. ఏమవుతుందో ఏమో చూడాలి. – యాదిరెడ్డి, రైతు, ఒంటరిపల్లి, లింగంపేట వర్షాలు రాకపోవడంతో బోర్లలో ఊటలు తగ్గి ఇబ్బంది అవుతోంది. వర్షాల కోసం ఎదురుచూస్తున్నం. ఈ సారి కాలం ఇబ్బంది పెడుతోంది. నాకున్న నాలుగెకరాల భూమిలో పంట వేయాలంటే వెనకాముందు ఆలోచించాల్సి వస్తోంది. ఈ సారి కాలం ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు. కాలం అయితేనే ముందుకు వెళతాం. – రాజారాం నారాయణ, రైతు, లింగంపేటసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : వానాకాలం మొదలై నెల రోజులు కావొస్తున్నా జిల్లాలో గట్టి వాన ఒక్కటీ కురవలేదు. వాగులు కాదు కనీసం చిన్న చిన్న ఒర్రెలూ పారలేదు. సరైన వర్షాలు లేకపోవడంతో ఇప్పటికీ నేల కూడా సరిగా తడవలేదు. అక్కడక్కడా విత్తనాలు వేసిన రైతులు ఆకాశానికేసి చూస్తున్నారు. బోర్ల మీద ఆధారపడి నారుమడులు పోసిన రైతులు వానల కోసం ఎదురుచూస్తున్నారు. నిజాంసాగర్ ఆయకట్టు కింద కొన్ని ప్రాంతాల్లో నాట్లు వేస్తున్నారు. జిల్లాలో 5.59 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేయగా.. ఇప్పటి వరకు కేవలం 7,984 ఎకరాల్లో మాత్రమే పంటలు వేశారు. మెట్ట ప్రాంతాల్లో మక్క, సోయా, పత్తి విత్తనాలు కొద్దిమేర వేయగా, బోర్లు, బావుల వద్ద వరి నారుమడులు పోస్తున్నారు. అయితే భూగర్భజలమట్టం పెరగకపోగా, రోజురోజుకూ పడిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సీజన్ ఆరంభమైన నాటి నుంచి శనివారం వరకు 118.7 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 83.7 మి.మీ. నమోదైనట్టు అధికారులు పేర్కొంటున్నారు. అయితే నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, మహమ్మద్నగర్ మండలాల్లో తేడా ఎక్కువగా ఉంది. బీబీపేట, డోంగ్లీ, మాచారెడ్డి, రాజంపేట, గాంధారి, నిజాంసాగర్, పిట్లం, బాన్సువాడ, బీర్కూర్, పెద్దకొడప్గల్, మద్నూర్ మండలాల్లో కూడా అరకొర వర్షాలు కురిశాయి. జిల్లాలో వర్షాభావ పరిస్థితులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్. దుక్కులు దున్ని దిక్కులు చూస్తూ వర్షాలు కురుస్తాయన్న ఆశతో రైతాంగం దుక్కులు దున్ని పంటల సాగుకు భూమిని సిద్ధం చేశారు. వర్షాలపైనే ఆధారపడి సేద్యం చేసే జుక్కల్ నియోజక వర్గంలోని జుక్కల్, పెద్దకొడప్గల్, బిచ్కుంద, మద్నూర్, పిట్లం తదితర మండలాల్లో ఇటీవల కురిసిన జల్లులతో పత్తి, సోయా, మక్క తదితర పంటలకు సంబందించి విత్తనాలు వేస్తున్నారు. గాంధారి, లింగంపేట, తాడ్వాయి, రాజంపేట, సదాశివనగర్, మాచారెడ్డి, కామారెడ్డి, పాల్వంచ, బీబీపేట, దోమకొండ, భిక్కనూరు, బాన్సువాడ, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట తదితర మండలాల్లో రైతులు కొన్ని చోట్ల మక్క, సోయా, పత్తి విత్తనాలు వేశారు. చాలా చోట్ల విత్తనం వేయలేదు. భారీ వర్షాలు కురిసిన తరువాతే విత్తనం వేయాలని భావిస్తున్నారు. చెరువులు, బోర్ల కింద వరి సాగు చేయడానికి రైతులు కొద్దిమంది నారుమడులు పోశారు. అయితే వర్షాలు లేకపోవడం, భూగర్భజలాలు అడుగంటుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నారుమడులను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు రైతులు ట్యాంకర్లతో నీరు పట్టిస్తుంటే, మరికొన్ని చోట్ల బిందెలతో చల్లుతున్నారు. ఇంకొందరు రైతులు ఇరుగు పొరుగు రైతుల నుంచి నీరు పైపుల ద్వారా తీసుకుని నారుమడులకు పట్టిస్తున్నారు. మక్క, సోయా, పత్తి విత్తనాలు వేసిన రైతులు కొన్ని చోట్ల స్ప్రింక్లర్లతో నీటిని చిమ్మిస్తున్నారు.వర్షాకాలం సీజన్ ఆరంభమైన తరువాత భూగర్భజలమట్టం పెరగాల్సి ఉండగా, ఈ సారి అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. మెట్ట ప్రాంతమైన సదాశివనగర్, రామారెడ్డి, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, గాంధారి, లింగంపేట, తాడ్వాయి, రాజంపేట, భిక్కనూరు, ఎల్లారెడ్డి తదితర మండలాల్లో భూగర్భజలమట్టం పడిపోతోందని భూగర్భజలశాఖ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వానాకాలం సాగు కోసం కొందరు రైతులు బోర్లు తవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఉన్న బోర్లలో లోతు తవ్వించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బోర్లు పడడం లేదని రైతులు అంటున్నారు. మళ్లీ బోర్ల తవ్వకంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. వానాకాలం మొదలై నెల రోజులు! గట్టి వాన ఒక్కటీ కురవలేదు ఒర్రెలు పారలేదు.. చెరువుల్లోకి చుక్క నీరు చేరలేదు భూగర్భజలాల పరిస్థితి ఆందోళనకరం ఖరీఫ్ సాగుపై రైతుల్లో అయోమయం -
సర్పంచ్ పిల్లలు సర్కారు బడికి..
● తమతోనే మార్పు మొదలవ్వాలని.. ● ఆదర్శంగా నిలుస్తున్న ప్రథమపౌరులు ● పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ప్రచారంసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పల్లె ప్రథమ పౌరులు కొందరు సర్కారు చదువు విషయంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించడం ద్వారా గ్రామంలో మిగతా వారి పిల్లలను కూడా చేర్పించేలా ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల సర్పంచ్లుగా బాధ్యతలు చేపట్టిన పలువురు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు. పెద్దకొడప్గల్ మండలం బాబుల్గావ్ గ్రామ సర్పంచ్ రవి గ్రామం నుంచి ప్రైవేటు బడులకు వెళ్లే పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే రూ.5 వేలు నజరానా ఇస్తానని ప్రకటించారు. సదాశివనగర్ మండలం మర్కల్ సర్పంచ్ ప్రియాంక తన సొంత డబ్బులతో పాఠశాలకు రంగులు వేయించారు. ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేట సర్పంచ్ వినోద ప్రభుత్వ పాఠశాలలో చేరే విద్యార్థుల కుటుంబాలకు ఇంటి పన్ను మినహాయిస్తున్నట్టు ప్రకటించారు. గ్రామ ఉపసర్పంచ్ రాజుయాదవ్తోపాటు వార్డు సభ్యులు, గ్రామస్తులు సహకరిస్తున్నారు. ఇలా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి పలువురు సర్పంచ్లు చొరవ చూపుతున్నారు. అలాంటి చోట్ల విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. -
విద్యార్థినులకు ఆరోగ్య పరీక్షలు చేయించాలి
దోమకొండ: సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల విద్యార్థినులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించాలని, వర్షాకాలంలో దోమల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రత్యేకాధికారిణి విజయేంద్ర, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను శనివారం సందర్శించి విద్యార్థినులతో కలిసి మధ్యా హ్న భోజనం చేశారు. విద్యార్థినులతో ఆ ప్యాయంగా ముచ్చటిస్తూ వారి సమస్యలు, విద్యాభ్యాసం, వసతి, ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వసతి, మెరుగైన విద్యా వాతావరణం, అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. వారి వెంట ఎంపీడీవో మధురిమ ఉన్నారు.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలోని ఐదు మండలాల్లో తహసీల్ కార్యాలయాల భవనాలు నిర్మించేందుకు నిధులు మంజూర య్యాయి. దోమకొండ, ఎల్లారెడ్డి, నాగిరెడ్డి పేట, మద్నూర్, పిట్లం మండలాల్లో పాత భవనాలు శిథిలావస్థకు చేరడంతో కొత్త భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ.2.25 కోట్లు కేటాయించారు. కాగా కొత్త మండలాలైన పాల్వంచ, మహ్మద్నగర్, రాజంపేట, రామారెడ్డి, డోంగ్లీ మండలాల్లో సొంత భవనాలులేవు. అలాగే మరికొన్ని మండలాల్లో తహసీల్ కార్యాలయాలు శిథిలావస్థకు చేరగా, ప్రభుత్వం వాటికి నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది.కామారెడ్డి టౌన్ : మున్సిపాల్టీ పరిధిలోని ప్ర తి ఒక్కరూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగస్వాములు కావాలని మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి కోరారు. కామారెడ్డి పట్టణంలోని 38వ వార్డులో శనివారం నిర్వహించిన ఎస్ఐఆర్ను క్షేత్రస్థాయిలో ఆమె పరిశీలించారు. ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటరు జాబి తా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బీఎల్వో సూపర్వైజర్ బాలరాజు, బీఎల్వోలు భార్గవి, మనోజ్కుమార్, భారతి, వార్డు ఆఫీ సర్ స్నేహలత, అవినాష్, జీపీవో ప్రవీణ్, నాయకులు చాట్ల రాజేశ్వర్, అమీర్, వేణు, నాగరాజు, అఖిల్, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
చుక్కల మందుకు సర్వం సిద్ధం
కామారెడ్డి టౌన్ : జిల్లా వ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ఆదివారం నుంచి మూడు రోజులపాటు ‘పల్స్ పోలియో‘ ఇమ్యునైజేషన్ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీకి వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో 1.03 లక్షల మందికిపైగా చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయనున్నారు. మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పోలియో బూత్ల ద్వారా చిన్నారు లకు చుక్కల మందు వేస్తారు. పోలియో డ్రాప్స్ వేయని చిన్నారులను గుర్తించేందుకు రెండు, మూడో రోజు సిబ్బంది నేరుగా ఇళ్ల వద్దకే వెళ్తారు. వివరాలు సేకరించిన అనంతరం చుక్కల మందు వేస్తారు. జిల్లాలోని ప్రధాన బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద 36 ట్రాన్సిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. అలాగే గిరిజన తండాలు, ఇటుక బట్టీలు, వలస కూలీలు ఉండే 174 హై రిస్క్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ప్రాంతాల కోసం 22 మొబైల్ టీమ్లను రంగంలోకి దించారు. ఆదివారం ఉదయమే సమీపంలోని పోలియో బూత్కు వెళ్లి పిల్లలకు చుక్కల మందు వేయించి, పోలియో రహిత కామారెడ్డి నిర్మాణానికి సహకరించాలని డీఎంహెచ్వో డాక్టర్ వెంకట్ విజ్ఞప్తి చేశారు. నేడు ‘పల్స్ పోలియో’ ఏర్పాట్లు పూర్తి చేసిన వైద్యారోగ్య శాఖ జిల్లాలో 1.03 లక్షల మంది చిన్నారులు నేడు బూత్లలో.. రేపు, ఎల్లుండి ఇళ్ల వద్ద పోలియో డ్రాప్స్ పంపిణీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రత్యేక ట్రాన్సిట్ పాయింట్లు -
బాబుల్గావ్, బేగంపూర్ సర్పంచ్ల పిల్లలు..
జిల్లాలోని మారుమూల గ్రామమైన పెద్దకొడప్గల్ మండలం బాబుల్గావ్ గ్రామ సర్పంచ్ రవి తన ఇద్దరు పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. ఆయన కొడుకులు సుమిత్ రెండో తరగతి, సూర్యకిరణ్ ఒకటో తరగతి చదువుతున్నారు. ప్రైవేటు బడులకు వెళ్లే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే రూ.5 వేల ప్రోత్సాహకం ఇస్తానని రవి ప్రకటించారు. అలాగే బేగంపూర్ సర్పంచ్ సునీత తన కూతురు అభిజ్ఙ ను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నారు. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతోంది. పాఠశాలకు వెళ్లి ఎప్పటికప్పుడు పిల్లల చదువు గురించి తెలుసుకుంటారు. -
జిల్లాను ఆదర్శంగా నిలపాలి
● హాస్టళ్లలో పరిశుభ్రత పాటించాలి ● ప్రత్యేక అధికారిణి విజయేంద్రకామారెడ్డి క్రైం: అధికారులు సమష్టిగా కృషి చేసి జిల్లాలో అభివృద్ధిలో రాష్ట్రంలోనే ముందంజలో నిలపాలని టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కమిషనర్, ప్రత్యేక అధికారిణి విజయేంద్ర సూచించారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలులో జిల్లా పనితీరు అభినందనీయమన్నారు. శనివారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆమెకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్చంద్ర తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా వివిధ శాఖలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై 10 శాఖలకు సంబంధించిన పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా అధికారులు వివరించారు. ఈ సందర్భంగా విజయేంద్ర మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు ప్రతి లబ్ధిదారునికి అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. 99 రోజుల కార్యాచరణలో నిర్దేశించిన లక్ష్యాలను వందశాతం పూర్తిచేయాలని సూచించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసు శాఖ చేపట్టిన చర్యలు ప్రశంసనీయమన్నారు. అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, డీఎఫ్వో నీరజ్, డీఆర్వో పాండు, ఆర్డీవోలు, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ రహిత సమాజం కోసం ’2కే రన్’
పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ‘డ్రగ్స్కు నో’ అనే నినాదంతో శనివారం ఉదయం 2కే రన్ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ రన్లో స్థానిక యువత, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ తిరుపయ్య, ఎస్సై ఆంజనేయులు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల మహమ్మారి యువత భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్ లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మత్తు పదార్థాల బారిన పడి జీవితాలను పాడుచేసుకోవద్దని పిలుపునిచ్చారు. పిట్లం సర్పంచ్ చంద్రశేఖర్, తిమ్మనగర్ సర్పంచ్ ప్రవీణ్, పోతిరెడ్డి పల్లి సర్పంచ్ హేంసింగ్, తదితరులు పాల్గొన్నారు. భిక్కనూరు: మండల కేంద్రంలోని బీసీ హాస్టల్లో నీటి ఎద్దడి నివారణకు శుక్రవారం బోర్బావిని తవ్వించినట్టు వార్డెన్ పవన్కుమార్ తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది గంగ రాములు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
● నలుగురికి గాయాలు జక్రాన్పల్లి: మండలంలోని అర్గుల్ గ్రామ శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారిపై అంబులెన్స్ను ట్రాక్టర్ ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎస్సై మహేష్ తెలిపిన వివరాలు ఇలా.. తమిళనాడు నుంచి ఉత్తరప్రదేశ్కు నూతన అంబులెన్స్ బయలుదేరింది. అర్గుల్ గ్రామ శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం అంబులెన్సు వెళుతుండగా ఓ ట్రాక్టర్ రాంగ్ రూట్లో ఎదురుగా వచ్చింది. ట్రాక్టర్ డ్రైవర్ ర్యాపాని అంజన్న ట్రాక్టర్ను అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతూ అంబులెన్స్ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో అంబులెన్సు నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ సత్యమూర్తి తంగరాజ్, క్లీనర్ సురేష్, ప్రయాణికులు ఫజల్ ఖాన్, తారీక ఖాన్కు గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయాలైన వారిని స్థానికులు వెంటనే 108 అంబులెన్సులో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అంబులెన్స్ డ్రైవర్ తంగరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ అంజన్నపై కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఉద్యోగ నియామకాల్లో మాలలకు అన్యాయం
బాన్సువాడ రూరల్: ఎస్సీ వర్గీకరణ మూలంగా ఉద్యోగ నియామకాల్లో అమలు చేస్తున్న రోస్టర్ విధానంతో మాలలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలంగాణ మాల సంఘం రాష్ట్ర నాయకులు అయ్యాల సంతోష్ అన్నారు. శుక్రవారం హన్మాజీపేట్లో మాల సంఘం ప్రతినిధులతో కలిసి మాట్లాడారు. ఈనెల 28న మాల హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో మెదక్లో చేపట్టనున్న భారీ నిరసనను విజయవంతం చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ మూలంగా మాలలు విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు బహిరంగ సభకు సంబంధించిన వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. బాన్సువాడ మాల సంఘం గౌరవ అధ్యక్షుడు పోతురాజు లింగం, నేతలు కుంట సుధాకర్, కాంబ్లే మధు, జింక సురేష్, పోతరాజు గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. -
12వ వార్డు అభివృద్ధికి కృషి
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని కౌన్సిలర్ దశరథం అన్నారు. శుక్రవారం ఆయన కాలనీవాసులతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మదన్మోహన్ సహకారంతో కాలనీని అభివృద్ధి చేస్తానని అన్నారు. వర్షాకాలంలో రోడ్డుపై, గుంతలలో నీరు నిలవకుండా తగిన చర్యలు తీసుకుంటానన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎల్లమ్మ గుడి ప్రాంగణంలో మొరం మట్టి వేసి ఆలయం చుట్టూ నీరు లేకుండా చర్యలు తీసుకున్నారు. బీబీపేటలో.. కాటేపల్లి గ్రామంలో.. -
పంట పండింది
యాసంగి సీజన్లో పంట పండింది. కాలం కలిసిరావడంతో మంచి దిగుబడులు వచ్చాయి. కొనుగోలు కేంద్రాల ద్వారానే రూ. 1,500 కోట్లకుపైగా విలువైన పంట ఉత్పత్తులను సేకరించడం గమనార్హం. రైతులు బహిరంగ మార్కెట్లో మరో రూ. 500 కోట్లకుపైగా విలువైన ధాన్యాన్ని విక్రయించి ఉంటారని అంచనా. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డియాసంగిలో భిక్కనూరు, తాడ్వాయి, రాజంపేట, లింగంపేట, గాంధారి, బాన్సువాడ, బిచ్కుంద, పిట్లం, పెద్దకొడప్గల్, సదాశివనగర్, రామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, బీబీపేట, దోమకొండ తదితర మండలాల్లో మక్క పంట సాగైంది. కొందరు రైతులకు ఎకరాకు 45 క్వింటాళ్ల నుంచి 50 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. సరాసరిన 40 క్వింటాళ్లు వచ్చినట్లు అంచనా. మార్క్ఫెడ్ ద్వారా 41,822 మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేశారు. వీటి విలువ రూ.101 కోట్లు. అలాగే రైతులు దళారులు, వ్యాపారులకు కూడా పెద్ద మొత్తంలో మక్కలు విక్రయించారు. కలిసొచ్చిన యాసంగి రైతన్నకు అనుకూలించిన సాగు కొనుగోలు కేంద్రాలలో రూ. 1,500 కోట్ల పంట ఉత్పత్తుల విక్రయం బహిరంగ మార్కెట్లో మరో రూ.500 కోట్లు.. -
బోనమెత్తిన పల్లె
మాచారెడ్డి: పాల్వంచ మండలం బండ రామేశ్వరపల్లిలో శుక్రవారం గ్రామస్తులు పోచమ్మ పండుగ చేసుకున్నారు. అలంకరించిన బోనాలతో మహిళలు ఊరేగింపుగా వచ్చి పోచమ్మకు సమర్పించారు. ఈసారి వర్షాలు సమృద్ధిగా పడాలని, పంటలు బాగా పండాలని మొక్కులు తీర్చుకున్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): ధర్మారావ్పేట్లో శుక్రవారం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో వర్షాలు సమద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని వేడుకుంటూ గంగమ్మ తల్లికి బోనాలను ఊరేగించారు. ఈ సందర్భంగా ముందుగా గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేసి బోనాలను ఊరేగించారు. -
‘ఉద్యోగుల వేతనాల కోత సరికాదు’
కామారెడ్డి టౌన్ : ఎలాంటి విధివిధానాలను ప్రకటించకుండానే ఆరోగ్య బీమా పేరిట ఉద్యోగుల వేతనాల నుంచి 1.5 శాతం కట్ చేయడం సరికాదని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) జిల్లా అధ్యక్షులు భునేకర్ సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన తపస్ అభ్యాస వర్గాలో ఆయన మాట్లాడా రు. ప్రభుత్వం ఆరోగ్య బీమాకు సంబంధించిన పూర్తి విధివిధానాలను వెంటనే వెల్లడించాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాఘవరెడ్డి, ప్రతినిధులు రమేష్ కుమార్, సత్యనారాయణ, లక్ష్మీపతి, రాజశేఖర్, శశిధర్, సంతోష్, పవన్ కుమార్, శ్యామ్, దత్తాచారి, స్వామి పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్ : ప్రజాస్వామ్య పరిరక్షణలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియ అత్యంత కీలకమైనదని, ఇందులో ప్రతి ఓటరూ తప్పనిసరిగా పాల్గొనాలని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జుమ్మా నమాజ్ అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి పౌరుడూ తమ ఓటు హక్కును కాపాడుకోవాలంటే ఎస్ఐఆర్ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటరు జాబితాలో తమ వివరాలను నమోదు చేసుకోవడం లేదా ధ్రువీకరించుకోవడం అత్యవసరమన్నారు. ఓటరు జాబితా పూర్తిగా పారదర్శకంగా, ఎలాంటి తప్పులు లేకుండా రూపొందేందుకు ఎన్నికల సంఘం ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. కార్యక్రమానికి ప్రజలంతా పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. కామారెడ్డి అర్బన్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించవద్దని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సత్యానంద్ ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం కామారెడ్డిలోని జెడ్పీ బాలుర హైస్కూల్లో సమాఖ్య జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెలాఖరులో గా పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్ చేశా రు. సీపీఎస్ రద్దు చేయాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో సమాఖ్య జిల్లా అధ్యక్షుడు బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు, ఉపాధ్యక్షుడు నారాయణ, ప్రతినిధులు రూప్సింగ్, వెంకట్రెడ్డి, సురేష్, గోపాల్, బాలయ్య, సాయిగౌతమ్, నర్సింలు పాల్గొన్నారు. దోమకొండ: కోడిగుడ్డు ధర అమాంతం పెరి గింది. ఈనెల మొదటి వారంలో 30 గుడ్ల ట్రే హోల్సెల్ ధర రూ.170 ఉండగా.. ప్రస్తు తం రూ. 210కు చేరింది. రిటైల్గా రూ. 220లకు విక్రయిస్తున్నారు. కిరాణ దుకాణాల్లో మరింత పెరిగి ఒక్కో కోడిగుడ్డును రూ.8 కి అమ్ముతున్నారు. ఎండ తీవ్రత, వాతావరణ మార్పుల వల్ల ఉత్పత్తి తగ్గిందని, దీంతో ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ధర గణనీయంగా పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కామారెడ్డి అర్బన్: కొత్తగా భూమి పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు ‘రైతు భరోసా’ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఇస్రోజీవాడి ఏఈవో దేవేంద్ర తెలిపారు. ఆసక్తిగల రైతులు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డ్, బ్యాంకుఖాతా జిరాక్స్లతో శనివారం ఉదయం ఇస్రోజీవాడి రైతు వేదిక వద్దకు రావాలని సూచించారు. -
కల్కి చెరువు తూము మరమ్మతుల పరిశీలన
బాన్సువాడ: బాన్సువాడ కల్కి చెరువు తూము మరమ్మతులను శుక్రవారం ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ పరిశీలించారు. కల్కి చెరువు తూము మరమ్మతులకు రూ.27.6 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఆ నిధులతో పనులు చేపడుతున్నారు. పెద్ద తూము వద్ద బుంగ పడి చెరువులో ఉన్న నీరు వృథా అవుతుండటంతో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి నిధులు మంజూరు చేయించారు. పనులు నాణ్యతతో చేపట్టాలని సూచించారు. కల్కి చెరువు ఆయకట్టు కింద 487 ఎకరాలు ఉంది. చివరి ఆయకట్టుకు సాగునీరందించాలనే సంకల్పంతో తూము మరమ్మతులు చేపడుతున్నామని కాసుల బాల్రాజ్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి, గంగాధర్, రవీందర్రెడ్డి, రమేష్, ఖలేక్, నర్సగొండ తదితరులున్నారు. -
గోదాముల నిర్మాణానికి తక్కువ వడ్డీతో రుణాలు
● నాబార్డు డీడీఎం ప్రవీణ్కుమార్సుభాష్నగర్ : సహకార సంఘాలు నాబార్డు ద్వారా అతి తక్కువ వడ్డీకి రుణాలు పొంది 2 వేల మెట్రిక్ టన్నుల గోదాముల నిర్మాణం చేపట్టవచ్చని డీడీఎం ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. నగరంలోని నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం, నాబార్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం, తృణధాన్యాల నిల్వలకు సంబంధించి గోదాముల నిర్మాణం అనే అంశంపై సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీఎం మాట్లాడుతూ సొసైటీల ఆధ్వర్యంలో గోదాముల నిర్మాణానికి అతి తక్కువ వడ్డీతో రుణాలు అందజేస్తామన్నారు. రైతులు పండించిన పంటలకు సరైన ధర లభించేలా, అకాల వర్షాలు, ఇతర కారణాలతో పంటలు పాడై పోకుండా నివారించేందుకు, గ్రామస్థాయిలో గోదాముల నిర్మాణం చేపడుతున్నామని పేర్కొన్నారు. దీంతో రైతులు తమ పంటను అత్యవసరంగా కాకుండా మార్కెట్లో డిమాండ్ మేరకు విక్రయించుకునే వెసులుబాటు లభిస్తుందన్నారు. సొసైటీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో బ్యాంకు సీఈవో నాగభూషణం వందే, నిజామాబాద్, కామారెడ్డి డీసీవోలు శ్రీనివాస్రావు, రామ్మోహన్రావు, ఎఫ్సీఐ ప్రతినిధులు, బ్యాంకు ఉన్నతాధికారులు లింబాద్రి, అనుపమ, సుమమాల, సొసైటీ చైర్మన్లు, సీఈవోలు పాల్గొన్నారు. -
సాగు.. సందిగ్ధం
నాగిరెడ్డిపేట: నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వరప్రదాయినిగా పేరొందిన పోచారం ప్రాజెక్టులో ప్రస్తుతం నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరింది. దీంతో ఆయకట్టు పరిధిలో వానాకాలం పంటల సాగుపై రైతుల్లో ఆందోళన నెలకొంది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి పెద్ద వర్షం కురియకపోవడం వల్ల ప్రాజెక్టులోకి చుక్కనీరు కూడ వచ్చిచేరలేదు. దీంతో సాగు పనులు ప్రారంభం కాలేదు. గతేడాది పుష్కలంగా వర్షాలు.. గతేడాది వర్షాలు పుష్కలంగా కురిశాయి. దీంతో పోచారం ప్రాజెక్టు పలుమార్లు అలుగు పారింది. ప్రాజెక్టులోకి 30.543 టీఎంసీల నీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరింది. కాగా 28.239 టీఎంసీల నీరు ప్రాజెక్టు అలుగు పైనుంచి పొంగిపొర్లి దిగువకు ప్రవహించింది. వానాకాలంలో రెండు మండలాల పరిధిలోని ఆయకట్టుకు నీరందించగా.. యాసంగిలో నిబంధనల ప్రకారం ‘బీ’ జోన్కు నీటిని కేటాయించారు. యాసంగి పంటల సాగు కోసం ప్రాజెక్టు నుంచి 1.364 టీఎంసీల నీటిని ప్రధాన కాలువలోకి విడుదల చేశారు. దీంతో పంటలు కళకళలాడాయి. దిగుబడులు పుష్కలంగా వచ్చాయి. డెడ్స్టోరేజీకి చేరిన పోచారం ప్రాజెక్టు నీటిమట్టం ఆయకట్టు పరిధిలో ప్రారంభం కాని సాగుపనులు ఆందోళనలో రైతన్నలు -
బీఆర్ఎస్ నేతకు పరామర్శ
నిజాంసాగర్(జుక్కల్): హైదరాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిజాంసాగర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గైని విఠల్ను శుక్రవారం జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే, జెడ్పీ మాజీ చైర్మన్ దఫేదార్ రాజు పరామర్శించారు. ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు రమేష్ గౌడ్ తదితరులు ఉన్నారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షౌకత్అలీ హైద్రాబాద్లో ఉన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ను శుక్రవారం కలిశారు. మర్యాద పూర్వకంగా కలసి తాడ్వాయి మండలాన్ని అభివృద్ధిపై చర్చించారు. అలాగే మనుముందు మరిన్ని అభివృద్ధి పనులను చేపట్టాలని కోరారు. భిక్కనూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మండలంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు యెమిమా ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో ఇంటింటికి తిరిగి కుండీల్లో చాలా కాలంగా నిల్వ ఉన్న నీరును పారబోయించారు. పరిసరాల పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. మాచారెడ్డి: కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతా యని మాచారెడ్డి మాజీ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు లోయపల్లి నర్సింగరావు అన్నారు. శుక్రవారం అక్కాపూర్లో ఆయన ఇందిరమ్మ ఇళ్ల ప్రవేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కానుకలు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు బుచ్చిరెడ్డి, రాజలింగం, లింగారెడ్డి అరవింద్, నవీన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, చంద్రం, రాజేందర్, బాలయ్య, దేవరాజు, నర్సింలు, తిరుపతిరెడ్డి, నారాయణ ఉన్నారు. పేకాడుతున్న ఆరుగురి అరెస్టు నిజామాబాద్ అర్బన్: నగరంలోని రైతుబజార్ వద్ద పేకాట స్థావరంపై 3వ టౌన్ పోలీసులు దాడిచేశారు. విశ్వసనీయమైన సమాచారం రావడంతో ఎస్సై హరిబాబు పేకాట స్థావరంపై దాడి చేసి, పేకాడుతున్న ఆరుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.4,800 నగదు, ఆరు సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
పేదలకు వరం సీఎం సహాయనిధి
బాన్సువాడ: ప్రభుత్వం అమలు చేస్తున్న సీఎంఆర్ఎఫ్ పేదలకు వరంలా మారిందని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్తో కలిసి నియోజకవర్గంలోని 51 మంది లబ్ధిదారులకు రూ.14. 43 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు అనారో గ్యం బారిన పడి వైద్యం కోసం రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోందని, పేదలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం సీఎం సహాయ నిధి పథకం ద్వారా ఆర్థిక సాయం అందజేస్తుందని అన్నారు. శెట్పల్లి గ్రామంలో.. లింగంపేట(ఎల్లారెడ్డి): శెట్పల్లి గ్రామంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు ఆదేశాల మేరకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను సర్పంచ్ అట్టెం శ్రీనివాస్ లబ్ధిదారులకు అందజేశారు. గ్రామానికి చెందిన గోనె లింగంకు రూ. 60 వేల చెక్కును పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు అట్టెం మల్లయ్య, ఉపసర్పంచ్ మన్నె బాలయ్య, నేతలు సాయాగౌడ్, లింగాగౌడ్, అశోక్, అంజనేయులు, బాలరాజు, అరవింద్, ప్రభురాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎకై ్సజ్ శాఖ వసూళ్ల డైరీ!
ఆబ్కారీ శాఖలో అక్రమార్కులు కొత్తపుంతలు తొక్కుతున్నారు. ఏకంగా డైరీ నిర్వహిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎకై ్సజ్ అధికారులు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో దీనిపై ఏసీబీ కూపీ లాగుతున్నట్లు తెలిసింది. మద్యం వ్యాపారం, కల్లు బట్టీలు, పర్మిట్ రూమ్ల కోసం పలువురు మామూళ్లు వసూలు చేసి కోట్లకు పడగలెత్తినట్లు గుర్తించినట్లు సమాచారం. – నిజామాబాద్అర్బన్ఎకై ్సజ్ శాఖలో ప్రతినెలా వసూళ్లకు సిబ్బంది కొందరు డైరీని ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల జిల్లా నుంచి బదిలీపై వెళ్లిన ఓ కానిస్టేబుల్ ఈ డైరీని సోషల్ మీడియాలో పోస్టు చేయడం కలకలం రేపుతోంది. కల్లుబట్టీలు, వైన్షాప్లు, పర్మిట్ రూముల వద్ద ప్రతినెలా మామూళ్లు వసూలు చేయడం, ప్రతి ఆరు నెలలకు ఒకసారి మామూళ్లను పెంచడం, ఏ అధికారికి ఎంత వాటా పంపిస్తున్నారు అన్న వివరాలను క్షుణ్ణంగా ఆ డైరీలో రాసినట్లు తెలిసింది. అయితే ఈ డైరీని ఎవరు నిర్వహిస్తున్నారనే దానిపై ఏసీబీ నిఘా పెట్టినట్లు సమాచారం. కోట్లకు పడగలెత్తిన ఘనులు ఎకై ్సజ్ శాఖలో కొందరు సిబ్బంది అవినీతికి అలవాటు పడిపోయారు. పైస్థాయి అధికారులకు నెలవారీగా మామూళ్లు అందిస్తూ కిందిస్థాయిలో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. మరోవైపు విధులకు గైర్హాజరవుతూ హాజరైనట్లుగా వేతనాలు పొందుతున్నట్లు తెలిసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవల ఎకై ్సజ్ శాఖ జిల్లా సూపరింటెండెంట్ అరెస్టు కావడంతో ఇదే శాఖలోని మరికొంత మంది అక్రమార్కులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిఘా ఉంచినట్లు తెలుస్తోంది. మామూళ్లకు అలవాటు పడిన మరికొందరు అధిక మొత్తంలో అక్రమార్జన చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ● ఓ కానిస్టేబుల్ నాలుగు నెలల క్రితం విదేశీ పర్యటనకు వెళ్లి 28 రోజులపాటు సెలవు తీసుకున్నాడు. తిరిగి వచ్చిన తర్వాత ఆ 28 రోజులు విధు ల్లో ఉన్నట్లు రిజస్టర్లలో సంతకం చేసినట్లు తెలిసింది. ఇతడికి వినాయకనగర్ ప్రాంతంలో రెండు బహుళ అంతస్తులు, రెండు ప్లాట్లు, హైదరాబాద్లో నాలుగు ఫ్లాట్లు, రెండు లగ్జరీ కార్లు ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ● యూనియన్ నాయకుడైన మరో ఉద్యోగి అక్రమాలపై ఏకంగా అవినీతి నిరోధక శాఖ అధికారులకు సైతం ఫిర్యాదు వెళ్లినట్లు తెలిసింది. సదరు ఉద్యోగి జిల్లాలోని వైన్షాప్ల యజమానులు తన వద్దే నిర్వహణ రిజిస్టర్లు కొనాలనే నిబంధన విధించినట్లు తెలిసింది. నవీపేట మండలంలో ఈ ఉద్యోగికి 80 ఎకరాల వ్యవసాయ భూమి, జిల్లా కేంద్రంలో రెండు బహుళ అంతస్తుల భవనాలు ఉన్నట్లు సమాచారం. ● అక్రమార్జనతో కోట్లకు పడగలెత్తిన మరో కానిస్టేబుల్కు ఎల్లమ్మగుట్టలోని ఓ అపార్ట్మెంట్లో రెండు ప్లాట్లు, దానికి సమీపంలో మరో బహుళ అంతస్తుల భవనం, నవీపేట మండలంలో 50 ఎకరాల వ్యవసాయ భూమి, బాన్సువాడలో 10 ప్లాట్లు, మోపాల్ మండలంలో విశాలమైన ఫామ్ హౌస్ ఉన్నట్లు తెలిసింది. గాడిలో పడేనా? జిల్లా ఎకై ్సజ్ శాఖ డీసీగా శ్రీధర్, అసిస్టెంట్ కమిషనర్గా అరుణ్కుమార్, సూపరింటెండెంట్గా నందగోపాల్ ఇటీవల బాధ్యతలు తీసుకున్నారు. వీరికి ప్రధానంగా ఆబ్కారీ శాఖలోని అక్రమార్కులను నియంత్రించి, శాఖపై ఉన్న అపవాదును తొలగించాల్సిన బాధ్యత ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కిందిస్థాయి సిబ్బందిని ఎలా గాడిలో పెడతారోననే చర్చ జరుగుతోంది. ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అరెస్టుకు ముందే ఆబ్కారీ శాఖపై ఏసీబీ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. అధికారులు, సిబ్బంది మామూళ్ల వ్యవహారంపై పక్కా ఆధారాలను సంపాదించినట్లు సమాచారం. ఇప్పటికే ఆరుగురు ఉద్యోగులకు ఆదాయానికి మించి ఆస్తులున్నాయని గుర్తించినట్లు తెలిసింది. ఇదంతా మామూళ్లు ఇచ్చే వారు తమ డైరీలో ఎవరికి ఎంతెంత ముట్టజెప్తున్నామనే విషయాలను రాసుకోవడంతోనే బయటపడినట్లు తెలిసింది. నందిపేటకు చెందిన ఓ వ్యక్తి 14 గ్రామాలకు కల్లు తయారు చేసి సరఫరా చేస్తున్నాడని, అతని వద్ద నుంచే అధికారుల మామూళ్ల వ్యవహారం బయటపడినట్లు తెలిసింది. ఆబ్కారీలో మరిన్ని తిమింగలాలు విధులకు డుమ్మా.. వసూళ్లకే ప్రాధాన్యత నెలనెలా మామూళ్ల వసూలు ఆరు నెలలకోసారి రేటు పెంపు ఏ అధికారి వాటా ఎంత? సోషల్ మీడియాలో వైరల్గా మారిన దైనందిని చిట్టా లాగుతున్న అవినీతి నిరోధక శాఖ -
భక్తిశ్రద్ధలతో మొహర్రం ఉత్సవాలు
సాక్షినెట్వర్క్:మతసామరస్యానికి ప్రతీకగా జరుపుకునే మొహర్రం పండుగను జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. నెలవంక కనిపించగానే ఆశీర్ఖానాల్లో కొలువుదీరిన పీర్లను భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామాల్లో పీర్లను బాజాభజంత్రీల నడుమ ఊరేగించారు. యువకులు మజ్నూ, అసయ్దూలా ఆటలాడారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడిపంటలు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ ముల్లాలు, ఫకీర్లు, దూదేకుల కులస్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సాయంత్రం పీర్లను చెరువుల్లో నిమజ్జనం చేశారు. -
విత్తన మేళాలు ఎక్కడ?
బిచ్కుంద(జుక్కల్): ప్రభుత్వం ఎంపిక చేసిన సన్నరకం వరి విత్తనాలనే సాగు చేయాలని, వాటిని రైతు వేదికలో పెట్టి మేళా నిర్వహించాలని వ్యవసాయ శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ అధికారులు ఆదేశాలు పాటించడం లేదు. వరి విత్తనాల మేళా బిచ్కుంద మండలంలో కొనసాగడం లేదు. ప్రభుత్వం ఎంపిక చేసిన 7 రకాల సన్నరకం వరి విత్తనాలతో సాగు చేస్తేనే క్వింటాల్కు రూ.500 బోనస్ అందజేస్తామని ప్రకటించింది. దీనిపై రైతులకు అవగాహన కల్పించేందుకు రైతు వేదికల్లో ఈ నెల 30 వరకు విత్తన మేళాలు నిర్వహించాలని వ్యవసాయ అధికారులకు ఆదేశాలు అందాయి. బిచ్కుంద మండలంలో ఈ ఆదేశాలు అమలు కావడం లేదు. ఈ నెల 23న ఒక గంట పాటు మేళా నిర్వహించి చేతులు దులుపుకున్నారు. అనంతరం రైతు వేదికకు తాళం వేసి వెళ్లిపోయారు. సన్నరకంపై అవగాహన కల్పించకపోవడంతో ఇతర రకాల వరి సాగు చేస్తున్నామని రైతులు అంటున్నారు. అందుబాటులో లేని ఏడు రకాల విత్తనాలు.. ప్రభుత్వం సూచించిన ఏడు రకాల విత్తనాలు సాగు చేస్తేనే బోనస్ లభిస్తుందని ప్రకటించడంతో రైతులు ఆ విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో పాటు ఏఈవోలు కూడా అందుబాటులో ఉండడం లేదు. మంజీరా నది పరివాహక ప్రాంతం హజ్గుల్, శెట్లూర్, మెక్కా, ఖద్గాం, బండారెంజల్ గ్రామాలలో రైతులు ప్రభుత్వం ప్రకటించిన వరి విత్తనాల గురించి తెలియక సుమారు 600 ఎకరాలలో ఇతర సన్నరకం వరి పంట సాగు చేస్తున్నారు. కొన్ని గ్రామాలలో వరి నాట్లు కూడా వేస్తున్నారు. విధులకు ఏఈవోల డుమ్మా.. ప్రతి రోజు గ్రామాలకు వెళ్లి రైతులకు అందుబాటులో ఉండి వ్యవసాయ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించాల్సిన ఏఈవోలు విధులకు రాకుండా డుమ్మాలు కొడుతున్నారు. ఏఈవోలు నెలలో మూడు నాలుగు రోజులు మాత్రమే వస్తున్నారు. పెద్దదేవాడ ఏఈవో చిన్నదడ్గిలో పంట నమోదులో తప్పులు చేశారు. ఓ రైతు జొన్న సాగు చేయకపోయినా చేసినట్లు నమోదు చేయడంతో పై అధికారులకు ఫిర్యాదు చేశారు. పది రోజుల క్రితం విచారణ చేపట్టి ఏఈవోపై సస్పెన్షన్ వేటు వేశారు. హజ్గుల్ ఏఈవో భానుప్రసాద్ నెలలో మూడు నాలుగు రోజులు మాత్రమే విధులకు వస్తారు. మండలంలో ఒకరిద్దరు ఏఈవోలు తప్ప అందరు డుమ్మాలు కొడుతున్నారని రైతులు ఎన్నో సార్లు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేశారు. బిచ్కుందలో ఏడీఏ కార్యాలయం ఉంది. మూడేళ్ల నుంచి పోస్టు ఖాళీ ఉంది. మూడేళ్ల క్రితం ఫర్టిలైజర్ షాపు లైసెన్సు విషయంలో ఏవో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడంతో సస్పెండ్ అయ్యారు. ఏవో, ఏడీఏ పోస్టు మూడేళ్ల నుంచి ఖాళీగా ఉంది. కార్యాలయానికి వెళ్తే ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. నిజాంసాగర్ ఏవో అమర్ ప్రసాద్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. నిజాంసాగర్ మండలంలో 90 శాతం మంది రైతులు వరి సాగు చేస్తారు. అక్కడే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. అప్పుడప్పుడు బిచ్కుంద వచ్చి వెళ్తున్నారు. జిల్లా వ్యవసాయ అధికారి మండలంలో పర్యటించి విచారణ చేపట్టి విధులకు డుమ్మాలు కొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే ఏడీఏ, ఏవో పోస్టు భర్తీ చేయాలని మండల రైతులు, ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.బిచ్కుందలో మూసి ఉన్న రైతు వేదికఏఈవోలు విధులకు రాకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రైతుల నుంచి ఫిర్యాదు రావడంతో హజ్గుల్, దడ్గిలో వేరే ఏఈవోలను నియమించాము. ఈ నెల 30 వరకు విత్తన మేళా నిర్వహించాలి. పంటల సాగు పై అవగాహన కల్పించాలని ఏఈవోలకు తెలియజేశాం. విధులకు రానివారిపై జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం. – అమర్ ప్రసాద్, ఇన్చార్జి ఏవో, బిచ్కుందసన్నరకం వరి విత్తనాల గురించి ఖద్గాంలో వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించలేదు. మేము నాట్లు వేస్తున్నాము. 250 ఎకరాలలో ఇతర వరి పంట సాగు చేస్తున్నాం. అధికారుల నిర్లక్ష్యంతో రైతులు నష్టపోతున్నారు. సన్నరకం విత్తనాలు ఎక్కడ ఉన్నాయి. అడ్రస్ కూడా ఏఈవో చెప్పడం లేదు. మా గ్రామానికి హజ్గుల్ ఏఈవో రెండు నెలలకు ఒకసారి కూడా రారు. ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. – ప్రభాకర్, రైతు ఖద్గాం ఈ నెల 30 వరకు రైతువేదికల్లో విత్తనాలు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వ ఆదేశాలు బిచ్కుందలో రైతు వేదికలకు తాళాలు వేసిన అధికారులు నెలలో నాలుగు రోజులే విధులకు వస్తున్న ఏఈవోలు మూడేళ్ల నుంచి ఏడీఏ, ఏవో పోస్టులు కూడా ఖాళీగా ఉన్న వైనం -
గౌడ సమాజ అభ్యున్నతికి ‘గోపా’ కృషి
కామారెడ్డి టౌన్/కామారెడ్డి అర్బన్: గౌడ సమాజ అభ్యున్నతికి అధికారులు, ప్రొఫెషనల్స్ అందరూ ‘గోపా’ వేదికగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్(గోపా) రాష్ట్ర అధ్యక్షుడు బండి సాయన్న గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో ఆయన అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న జిల్లా కార్యవర్గ సభ్యులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. సమాజంలో విద్య, ఉపాధి, ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా గ్రామ స్థాయి నుంచి యువత, ఉద్యోగులను సంఘటితం చేయాలన్నారు. జిల్లాలో 5 వేల సభ్యత్వాలను నమోదు చేయడమే తమ లక్ష్యమని నూతన కమిటీ ప్రకటించింది. నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక గోపా జిల్లా అధ్యక్షుడిగా రంగా వెంకటేశ్వర్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా లింగాల రాజబాబు గౌడ్, కోశాధికారిగా నడిల్లా యాదగౌడ్, ప్రధాన సలహాదారులుగా ఉప్పునూతల రమేష్ గౌడ్, ఉపాధ్యక్షులుగా అంకన్నగారి నాగరాజ్ గౌడ్, అనుగూనూరి కృష్ణ గౌడ్, అర్గనైజింగ్ కార్యదర్శిగా బాబాగౌడ్, సహాయ కార్యదర్శులుగా హరీష్గౌడ్, కృష్ణగౌడ్, శివగౌడ్, కార్యదర్శులుగా స్వామిగౌడ్, నరేందర్, రేణుక, అరుణ్లను ఎన్నుకున్నారు. గోపా నాయకులు యల్మకంటి మీరయ్య గౌడ్, డాక్టర్ శ్రీనివాస్ గౌడ్, ఆర్టీవో ప్రదీప్ గౌడ్, తదితరులున్నారు. -
కలలు కల్లలై.. కన్నీరు వరదై..
భిక్కనూరు: బాగా చదివి కుటుంబానికి పేరు తెస్తాడ నుకున్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రుల కలలు కల్లలయ్యాయి. దూర దేశంలో విగత జీవిగా మారాడని తెలిసి ఏకధారగా రోదిస్తున్నారు. తలమడ్ల గ్రామానికి చెందిన సావుసాని మంజుల మధుసూదన్రెడ్డిలకు ఇద్దరు సంతానం. కూతు రు శ్రావణికి వివాహమైంది. కుమారుడు శ్రీనాథ్రెడ్డిని ఉన్నత విద్య కోసం 14 నెలల క్రితం లండన్ పంపించారు. దీనికోసం రూ. 30 లక్షల వరకు వెచ్చించారు. ప్రస్తుతం లీసెస్టర్ యూనివర్సిటీలో ఎంఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రీనాథ్రెడ్డి.. అక్కడ తన గదిలో రెండు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుమారుడి మరణవార్త తెలిసిన క్షణం నుంచి తల్లిదండ్రులు రోదిస్తున్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే శ్రీనాథ్రెడ్డి మృతిని బంధుమిత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. పండగలు, పుట్టిన రోజులకు తమకు ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలిపేవాడని గుర్తు చేసుకుంటున్నారు. కాగా శుక్రవారం సమీప బంధువు మనీష్ రెడ్డి సమక్షంలో లండన్ పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం జరిపించారు.తలమడ్ల గ్రామస్తులు, మృతుడి బంధువులు శుక్రవారం కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీని కలిసి శ్రీనాథ్రెడ్డి మృతి విషయాన్ని తెలిపారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి రప్పించాలని కోరారు. ఆయన వెంటనే స్పందించి భారతీయ రాయబార కార్యాలయంలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న తన బంధువుతో ఫోన్ ద్వారా మాట్లాడారు. మృతదేహాన్ని త్వరగా పంపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. లండన్లో కొడుకు మృతి కంటికిమింటికి ఏకధారగా రోదిస్తున్న తల్లిదండ్రులు త్వరగా మృతదేహాన్ని రప్పించాలని షబ్బీర్ అలీని కోరిన బంధువులు -
ఆలయాల నిర్మాణంతో ధర్మాభివృద్ధి
● ఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత సుభాష్రెడ్డి భిక్కనూరు: గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణంతో ధర్మాభివృద్ధి జరుగుతుందని ఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత, విద్యాదాత తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి అన్నారు. కాచాపూర్లో నూతనంగా నిర్మించిన గంగమ్మ ఆలయం ప్రారంభోత్సవం, గంగా భవానీ విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆలయాల నిర్మాణం వల్ల రాబోయే తరాలకు మన సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయన్నారు. సమాజంలో ఐక్యత, నైతిక విలువల పెంపుదలకు దోహదపడుతుందన్నారు. సర్పంచ్ జ్యోతి.. విధ్యాదాత ఎస్ఆర్ పౌండేషన్ అధినేత సుభాష్రెడ్డిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు. పలు మండలాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవార్లకు ఒడి బియ్యం పోసి కట్నకానుకలను సమర్పించుకున్నారు. అనంతరం గ్రామంలో పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. -
‘సర్’ను పారదర్శకంగా చేపట్టాలి
● ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ బాన్సువాడ: ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టాలని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ అన్నారు. శుక్రవారం ఆయనకు బాన్సువాడ ఆర్డీవో రవీందర్రెడ్డి ఎన్యుమరేషన్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాల్రాజ్ మాట్లాడుతూ.. ఇది రాజ్యాంగ బద్దంగా ఎన్నికల కమిషన్ చేపడుతున్న ప్రక్రియని, నియోజకవర్గంలోని ప్రతీ ఓటరు ఇందులో పాల్గొనాలని సూచించారు. ఈ ప్రక్రియ నెల రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు. అన ర్హుల ఓట్లు జాబితాలో లేకుండా చూడాలని కోరా రు. బీఎల్వోలు వనజ, మహేశ్వరి, నాయకులు నా ర్ల రవీందర్, కృష్ణారెడ్డి, ఖలేక్, శ్రీనివాస్రెడ్డి, శంక ర్, జమాల్, భాస్కర్, గంగాధర్ తదితరులున్నారు. బీబీపేట పరిధిలో.. బీబీపేట: మండలంలోని జనగామ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి శుక్రవారం ఎన్యుమరేషన్ పత్రం నింపి ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. ఆయనతో పాటు ఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పా ల్గొని ఓటు హక్కు నమోదు పత్రాన్ని నమోదు చేసుకున్నారు. గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ రవీందర్రెడ్డి, ఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు వెంకట్గౌడ్, జీవన్రెడ్డి, సాయికుమార్, వెంకట్ రాంరెడ్డి, సాయికుమార్ పాల్గొన్నారు. బాన్సువాడ పరిధిలో.. బాన్సువాడ రూరల్: ఎన్నికల కమిషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం బాన్సువాడ మండలంలోని అన్ని గ్రామాల్లో కొనసాగుతోంది. ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి పత్రాలు అందించడమే కాకుండా, పలువురి నుంచి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. తాడ్కోల్, బోర్లం, ఇబ్రాహీంపేట్, దేశాయిపేట్, కొత్తాబాది గ్రామాల్లో ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఎల్లారెడ్డి పట్టణంలో.. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలోని 2వ వార్డులో ఓటర్లకు బీఎల్వోలు ఎన్యూమరేషన్ ఫారాలను శుక్రవారం పంపిణీ చేశారు. 2002 కంటే ముందు ఓటు హక్కు ఉన్న వారు 1, 2 కాలం పూర్తి చేయాలని, 2002 కంటే ముందు ఓటు హక్కులేని వారు 1, 3 కాలంను పూర్తి చేయాలని బీఎల్వోలు ఓటర్లకు సూచించారు. కాంగ్రెస్ నాయకులు విద్యాసాగర్, తదితరులున్నారు. నస్రుల్లాబాద్ పరిధిలో.. నస్రుల్లాబాద్: మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాలను అందించారు. దీనిలో భా గంగా సంగం గ్రామంలో సర్పంచ్ ఉమారాణి గ్రా మ ప్రజలకు ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ కార్య క్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఓటరకు పత్రాలు ఎలా పూరించాలో వివరించారు. నాయకులు వినోద్, బీఎల్వోలు పాల్గొన్నారు. -
లారీ, బైక్ ఢీ
● నల్గొండవాసి మృతి భిక్కనూరు : మండల కేంద్ర సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. నల్గొండ జిల్లా నలకల్ గ్రామానికి చెందిన అఖిల్ (20) తన స్నేహితుడైన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హనుమాన్నగర్కు చెందిన ఓంకార్తో కలిసి ఆదిలాబాద్కు బైక్పై వెళ్తున్నారు. భిక్కనూరు పట్టణ శివారులో లారీ వెనుక నుంచి బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా, అఖిల్ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. ఓంకార్ పరిస్థితి విషమంగా ఉందని, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
అప్పుడు అన్న.. ఇప్పుడు తమ్ముడు
● ఇద్దరూ ఆటో ప్రమాదాల్లోనే మృతి ● బస్వాపూర్లో ఘటన భిక్కనూరు : మండలంలోని బస్వాపూర్ గ్రామంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడు మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. గ్రామానికి చెందిన కాసాల రమేశ్ గౌడ్ (50) గ్రామంలో ఉదయం వ్యక్తిగత పనుల నిమిత్తం మెదక్ జిల్లా రామాయంపేటకు వెళ్లి అక్కడ పనులు ముగించుకొని తిరిగి బస్వాపూర్ వచ్చేందుకు ఆటో ఎక్కాడు. బస్వాపూర్ శివారులోని జాతీయ రహదారిపై వస్తుండగా ముందు వెళ్తున్న లారీని డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపటంతో వెనుక వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న రమేశ్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో డ్రైవర్ శ్రీనివాస్గౌడ్తోపాటు ప్రయాణికులు లక్ష్మి, శ్వేతలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య స్వప్న, కుమారుడు ధనుష్, కుమార్తె విదూష ఉన్నారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై వివరించారు. ప్రమాదం జరిగిన వెంటే లారీ డ్రైవర్ పరారయ్యాడని ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. 15 ఏళ్ల క్రితం అన్న.. గురువారం మృతి చెందిన రమేశ్ గౌడ్ అన్న కూడా గతంలో ఆటో ప్రమాదంలోనే మృతి చెందారు. దాదాపు 15 ఏళ్ల క్రితం బస్వాపూర్ గ్రామానికి చెందిన కాసాల శ్రీనివాస్ గౌడ్, పొందుర్తి శివారులోని జాతీయ రహదారిపై జరిగిన ఆటో ప్రమాదంలో మృతి చెందాడు. ప్రస్తుతం ఆయన సోదరుడు రమేశ్ గౌడ్ కూడా ఆటో ప్రమాదంలో మృతి చెందడం గ్రామస్తులు, బంధువులను తీవ్రంగా కలిచివేసింది. -
ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించొద్దు
కామారెడ్డి టౌన్: జిల్లాలో అమలవుతున్న వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల్లో వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించొద్దని, తప్పనిసరిగా నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని డీఎంహెచ్వో వెంకట్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం జిల్లా పరిధిలోని పీహెచ్సీలు, సీహెచ్సీల వై ద్యాధికారులు, జిల్లా ప్రోగ్రాం అధికారులతో ఆయ న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జాతీయ క్షయ, కుష్ఠు వ్యాధి నిర్మూలన, వెక్టర్ బోన్ వ్యాధుల నియంత్రణ, సార్వత్రిక టీకాల కా ర్యక్రమం, మాతా, శిశు ఆరోగ్య సేవలు, అసంక్రమిత వ్యాధుల నియంత్రణ, కుటుంబ నియంత్రణ, జాతీయ మానసిక, అనీమియా ముక్త్ భారత్, పొ గాకు నియంత్రణ, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రాల సేవల పురోగతిని తదితర అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు. అనంతరం డీఎంహె చ్వో మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సే వలు మెరుగుపరిచి జిల్లాను రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపాలని కోరారు. జిల్లా పోగ్రాం అధికారులు రోహిత్ కుమార్, ప్రదీప్ కుమార్, వెంకట్ స్వామి, వైద్యాధికారులు మహేందర్ రెడ్డి, గాలమ్మ, వేణుగోపాల్, చలపతి, పద్మజ, జానాబాయ్ ఉన్నారు. -
పోలీసులు అక్కడ.. వాహనదారులు ఇక్కడ
ఎల్లారెడ్డి: జిల్లాలో వాహనాల తనిఖీలు నామ మాత్రంగా కొనసాగుతున్నాయి. రోడ్లపై పోలీసులు వాహనాల తనిఖీలు ప్రారంభించగానే కొందరు వాహనదారులు ఈ విషయాన్ని ప సిగట్టి వారికి కూతవేటు దూరంలోనే ఆగిపోతున్నారు. వాహనాల సరైన పత్రాలు లేని, హెల్మె ట్లు ధరించని, చలాన్ల బకాయిలు ఉన్న వాహనదారులు ఇలా పోలీసుల చెకింగ్లకు దూరంగా నిలుచుంటున్నారు. సరైన ధృవపత్రాలు ఉన్నవారు మాత్రమే చెకింగ్ జరిగే చోటు నుంచి వెళుతున్నారు. మండలంలోని రోడ్డుపై గురువారం పోలీసులు తనిఖీలు చేపట్టగా, వాహనదారులు ఇలా వేచిచూస్తుండగా ఈ దృశ్యాలను ‘సాక్షి’ క్లిక్మనిపించింది. పోలీసుల తనిఖీలు చేసినంత సేపు వారు అలాగే ఉండి, పోలీసులు వెళ్లిన తర్వాత వారంతా వెళ్లిపోయారు. -
శివాజీ విగ్రహం పెట్టి తీరుతాం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఉన్నతాధికారుల అనుమతితోనే నాగిరెడ్డిపేట గ్రామంలో జగ్గనిచెరువుకట్టపై ఛత్రపతిశివాజీ విగ్రహాన్ని పెట్టి తీరుతామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పైడి ఎల్లారెడ్డి అన్నారు. చెరువుకట్ట చివరన శివాజీ విగ్రహం ఏర్పాటు కోసం భూమిపూజ చేసేందుకు గురువారం ఆయన గ్రామానికి చేరుకున్నారు. కాగా విగ్రహం ఏర్పాటుకు ఇరిగేషన్ అధికారుల నుంచి అభ్యంతరం వచ్చిన నేపథ్యంలో ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి, నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు పైడి ఎల్లారెడ్డిని అడ్డుకున్నారు. పోలీసుల అనుమతితో విగ్రహ ఏర్పాటుకు ఎంపిక చేసిన స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిబంధనల ప్రకారం అనుమతులు పొంది ప్రస్తుతం నిర్ణయించిన స్థలంలోనే శివాజీ విగ్రహాన్ని ఏర్పాటుచేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, బెజుగంచెరువుతండా సర్పంచ్ భాస్కర్, నాయకులు గణేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జగ్గనిచెరువు కట్టపై శివాజీ విగ్రహ ఏర్పాటుకు అనుమతులివ్వాలని కోరుతూ గ్రామ యువకులు ఇరిగేషన్ ఏఈ అక్షయ్కుమార్కు వినతిపత్రాన్ని అందజేశారు. -
పసికందుకు ప్రాణం పోశారు
● ప్రాణాపాయస్థితిలో ఉన్న శిశువును ఆస్పత్రికి తరలింపు కామారెడ్డి టౌన్ : నెలలు నిండకుండానే పుట్టి, శ్వాసకోశ సమస్యతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ పసికందుకు ప్రభుత్వ చిన్నపిల్లల అంబులెన్స్ సిబ్బంది పునర్జన్మను ప్రసాదించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పాల్వంచ మండలం మంతన్ దేవునిపల్లి గ్రామానికి చెందిన వడ్డే రమ్యకు రెండో కాన్పు కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్యులు ఆమెకు అత్యవసర శస్త్రచికిత్స నిర్వహించగా మగ శిశువు జన్మించాడు. నెలలు నిండకుండానే పుట్టడం, ఉమ్మ నీరు సమస్య ఎక్కువగా ఉండటంతో పుట్టిన వెంటనే బాబు ఏడవకుండా, తీవ్ర శ్వాస ఇబ్బందితో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పిల్లల వైద్యులు ప్రాథమిక అత్యవసర చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ప్రభుత్వ చిన్నపిల్లల ప్రత్యేక అంబులెన్స్ ఈఎంటీ కృష్ణస్వామి, పైలట్ రాజేందర్ తక్షణమే శిశువును తీసుకెళ్లారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న శిశువును ప్రత్యేక ఇంక్యుబేటర్లో ఉంచి, నిరంతరం ఆక్సిజన్ అందించారు. అత్యంత వేగంగా, సురక్షితంగా శిశువును నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించి తమ బాబు ప్రాణాలు కాపాడిన అంబులెన్స్ సిబ్బందికి శిశువు కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
డిగ్రీ కళాశాలలో సోలార్ లైట్లు ఏర్పాటు చేయిస్తాం
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం, రాశి వనంలో సోలార్ లైట్లు ఏర్పాటు చేయిస్తానని ప్రముఖ సైంటిస్ట్ డాక్టర్ పైడి ఎల్లారెడ్డి హామీ ఇచ్చారు. కళాశాల మైదానం, రాశి వనాన్ని గురువారం ఆయన సందర్శించారు. అనంతరం మైదానం ఆవరణలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. అసోసియేషన్ అధ్యక్షుడు సుధాకర్ రావ్, రాశివనం అధ్యక్షుడు శ్యామ్ గోపాల్, ఆర్.కె. విద్యాసంస్థల గ్రూప్ చైర్మన్ జైపాల్ రెడ్డి, ప్రతినిధులు రాజేశ్వర్ రావ్, రాంశెట్టి భూపతి, గెరిగంటి లక్ష్మినారాయణ, నర్సింలు, ఆంజనేయులు, రాజిరెడ్డి, సంతోష్, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాచారెడ్డి: బైకు చోరీ కేసులో ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై అనిల్ తెలిపారు. మండలంలోని వెనుక తండాకు చెందిన మాలోత్ రాజు ఈనెల 23న తన బైకును వారాంతపు సంతలోని కల్లు దుకాణం సమీపంలో పార్క్ చేసి కూరగాయలు అమ్మడానికి వెళ్లాడు. సాయంత్రం వచ్చి చూసేసరికి బైక్ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురువారం వాహనాల తనిఖీ చేస్తుండగా రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కిష్టంపల్లికి చెందిన మొగుళ్ల శ్రీనివాస్ అనుమానాస్పదంగా వ్యవహరించడంతో పట్టుకొని విచారించగా బైకును చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడని ఎస్సై తెలిపారు. నిందితుడి నుంచి రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. మద్నూర్(జుక్కల్): మండల కేంద్రానికి చెందిన నాలుగేళ్ల బాలుడు అయాంక్ గురువారం మధ్యా హ్నం ఆడుకుంటూ ఇంటి నుంచి పాత బస్టాండ్కు చేరుకున్నాడు. పాత బస్టాండ్ వద్ద ఉన్న బాలుడు కొద్దిసేపటికే ఏడుస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై మోహన్రెడ్డి పాత బస్టాండ్కు చేరుకొని తప్పిపోయిన బాలుడిని స్టేషన్కు తీసుకెళ్లారు. బాలుడి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సాయంత్రం బాలుడి తల్లి జయశ్రీ స్టేషన్కు వచ్చి తీసుకెళ్లింది. కామారెడ్డి అర్బన్: విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐ క్య సంఘం జిల్లా అధ్యక్షుడిగా దేమే కమ్మరి రా జు ఎన్నికయ్యారు. కామారెడ్డి బృందావన్ గార్డెన్లో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎరోజు భిక్షపతి, ఉపాధ్యక్షుడు వడ్ల భీమయ్య ఆధ్వర్యంలో గు రువారం అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించగా తిరుమల స్వామి, దేమి కమ్మరి రాజు పోటీ ప డ్డారు. రాజు ఎన్నికై నట్టు రాష్ట్ర నాయకులు ప్రక టించారు. అనంతరం జిల్లాలోని ఆయా మండలాల అధ్యక్షులను ప్రకటించారు. జిల్లా స్థాయి పూర్తి కమిటీని త్వరలోనే నియమిస్తామని నూతన అధ్యక్షుడు రాజు ప్రకటించారు. నాయకులు వెంకన్న, రామచంద్రం, కమ్మరి సాయిలు, బ్రహ్మం, చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
అనారోగ్యంతోనే కేరళ టీచర్ ఆత్మహత్య
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని నర్సన్నపల్లి సమీపంలో ఉన్న ఓ ప్రయివేటు పాఠశాలలో పని చేసేందుకు 10 రోజుల క్రితం కామారెడ్డికి వచ్చిన కేరళ టీచర్ దేవిక ఉల్లాస్ (25) బుధవారం ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్యపై అనేక అనుమానాలు తలెత్తాయి. మృతురాలి తల్లి డాలీ కేరళ నుంచి గురువారం కామారెడ్డికి చేరుకున్నారు. దేవిక ఉల్లాస్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపానికి గురయ్యేదని, అందుకే ఆత్మహత్య చేసుకొని ఉంటుందని ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె ఆత్మహత్యకు అనారోగ్యమే కారణమని దేవునిపల్లి పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మానసిక స్థితి బాగోలేక వివాహిత.. ఇందల్వాయి: మానసిక స్థితి బాగోలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం అన్సాన్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై సుమలత తెలిపిన వివరాల ప్రకారం.. సిరికొండ మండలం హుస్సేన్నగర్ గ్రామానికి చెందిన తాళ్ల శ్రావణికి ఇందల్వాయి మండలం అన్సాన్పల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్తో ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ప్రవీణ్ జీవనోపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లగా శ్రావణి ఇంటి వద్ద ఉంటుంది. తరచూ మానసిక ఆందోళనతో బాధపడే శ్రావణి సరైన చికిత్సలేక మానసిక వ్యాధి ముదిరి మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. కుటుంబసభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా గురువారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారని, తండ్రి పెద్దగంటి నరసయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఎంఎస్ చదివేందుకు వెళ్లి..
● లండన్లో తలమడ్ల యువకుడు మృతి భిక్కనూరు: రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన యువకుడు లండన్లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు గురువారం తెలిసింది. గ్రామానికి చెందిన సావుసాని మధుసూదన్రెడ్డి–మంజుల దంపతుల కొడుకు సావుసాని శ్రీనాథ్రెడ్డి (25) పద్నాలుగు నెలల క్రితం ఎంఎస్ చదివేందుకు లండన్ వెళ్లాడు. అక్కడ లేయిసిస్టర్ పట్టణంలోని యూనివర్సీటీలో ఎంఎస్ మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించి రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 22న రాత్రి స్నేహితుడి పుట్టినరోజు విందుకు హాజరై తన గదికి వచ్చి నిద్రపోయాడు. గురువారం ఉదయం గదిలో ఉండే స్నేహితుడు వచ్చి చూడగా శ్రీనాథ్రెడ్డి మృతి చెంది ఉన్నాడు. ఈ విషయాన్ని లండన్లోనే ఉంటున్న శ్రీనాథ్రెడ్డి బంధువులకు సమాచారం అందించగా వారు తలమడ్లలో ఉన్న తల్లిదండ్రులకు తెలిపారు. శ్రీనాథ్రెడ్డి కామారెడ్డిలో ఇంటర్, హైదరాబాద్లో డిగ్రీ పూర్తి చేసి ఎంఎస్ చదివేందుకు లండన్ వెళ్లాడు. ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగం పొందుతాడని ఆశించిన ఆ తల్లిదండ్రులకు చివరకు దు:ఖమే మిగిలింది. -
జిల్లాలో యూరియా కొరత లేదు
● రైతులు ఆందోళన చెందొద్దు ● ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డి టౌన్: జిల్లాలో ఎరువుల కొరత లేదని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. పట్టణంలో గురువారం ఆయన జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో ఎరువుల నిల్వలు, పంపిణీ విధానం, రైతుల అవసరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా షబ్బీర్అలీ మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. గత ఏడాది నియోజకవర్గానికి 1.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయగా, ఈ ఏడాది జూన్ 20 నాటికే రికార్డు స్థాయిలో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేశామని వెల్లడించారు. అదనంగా రేపు మేడ్చల్ నుంచి మరో 3,500 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు అందుబాటులోకి రానుందన్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. -
డ్రగ్స్పై ఫుల్ ఫోకస్
నిజామాబాద్ జిల్లా మహారాష్ట్ర సరిహద్దులో ఉండటంతో డ్రగ్స్ ముఠాల కన్ను పడుతోంది. డ్ర గ్స్, గంజాయి, సింథటిక్ పిల్స్, కల్తీ కల్లును కాలేజీ లు,హాస్టళ్ల దగ్గర విద్యార్థులకు అలవాటు చేసే ప్ర యత్నం జరుగుతోంది. ‘ఒక్క పఫ్ చాలు, ఒక్క మా త్ర చాలు’ అంటూ యువతను ఉచ్చులోకి లాగుతున్నారు. రాత్రి గస్తీ, పగలు కౌన్సెలింగ్ జిల్లాలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న డ్రగ్స్ కల్చ ర్ ముప్పును ఎదుర్కొనేందుకు ప్రత్యేక పోలీసు బ లగాలు ద్విముఖ వ్యూహాన్ని సిద్ధం చేశాయి. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీఎస్–ఎన్ఏబీ) ఆధ్వర్యంలో జిల్లాలో పలు యూనిట్లు నిరంతరం పనిచేస్తున్నాయి. అర్ధరాత్రి 2 గంటలకు సైతం చెక్పోస్టుల వద్ద వాహనాల తనిఖీ చేపడుతున్నారు. అదే సమయంలో పగలు ఖాకీ డ్రెస్ పక్కన పెట్టి కాలేజీల్లో యువతకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. జిల్లా కేంద్రంతోపాటు పట్టణాల్లో విద్యార్థులతో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రిలో డీ అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేసి డ్రగ్స్ బారినపడ్డ యువతను సన్మార్గం వైపు నడిపించే ప్రయత్నాలు ప్రారంభించారు. ఉచిత కౌన్సెలింగ్కు టోల్ ఫ్రీ మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని డిప్రెషన్, ఆందోళన, ఆత్మహత్య లాంటి ఆలోచన నుంచి విరమించుకునేలా కేంద్రం జాతీయ మానసిక హెల్ప్లైన్ ప్రవేశపెట్టింది. టోల్ ఫ్రీ నంబర్ 14416కి 24 గంటల్లో ఎప్పుడైనా సరే కాల్ చేసి ఉచితంగా కౌన్సెలింగ్ పొందవచ్చును. ఈ కౌన్సెలింగ్ సేవలు దేశంలోని 20 భాషల్లో అందుబాటులో ఉంటుంది. ‘భయ్యా, ఒక్కసారి ట్రై చెయ్యి, టెన్షన్ పోతుంది’ అని స్నేహితుడు ఇచ్చిన ఆ ఒక్క మాత్ర.. 19 ఏళ్ల కిరణ్ (పేరు మార్చాం) జీవితాన్ని మూడు నెలల్లోనే చీకట్లోకి నెట్టేసింది. నేడు అదే కిరణ్ తన కళాశాల వేదికపై నిలబడి ‘నేను చేసిన తప్పు మీరు చేయకండి’ అని వందలాది మంది విద్యార్థులకు చెప్తున్నాడు. జిల్లా యువత మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా సీపీ సాయి చైతన్య ఫుల్ ఫోకస్ చేశారు. నేడు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. – ఆర్మూర్ లాఠీతో కొడితే భయపడి డ్రగ్స్ మానేస్తారు.కానీ,మళ్లీ మొదలుపెడతారు.ప్రేమతో చెబితే గుండెల్లో గుచ్చుకుంటుంది. అందుకే విద్యార్థులు, యువతకు అవగాహన కల్పిస్తూ ప్రేమగా చెప్తున్నాం. జిల్లా వ్యాప్తంగా కళాశాలలు, పాఠశాలల్లో వందల సంఖ్యలో అవగాహన సదస్సులు నిర్వహించాం.– సాయి చైతన్య, సీపీ, నిజామాబాద్ మీ వీధిలో ఎవరైనా డ్రగ్స్ అమ్ముతున్నా, వాడుతున్నా భయపడకుండా ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లు 112 లేదా 1908 కు కాల్ చేయండి. సమాచారం ఇచ్చిన వారి గుర్తింపును బయటకు రానివ్వం. పౌరులు ఇచ్చిన సమాచారంతోనే చాలా కేసులు పరిష్కరించాం. – వెంకటేశ్వర్రెడ్డి, ఏసీపీ, ఆర్మూర్ నియంత్రణ కోసం కదం తొక్కిన పోలీస్ యంత్రాంగం ద్విముఖ వ్యూహం అమలు విద్యార్థులకు అవగాహన సదస్సులు నేడు అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం -
సంక్షిప్తం..
నారుమళ్లను రక్షించుకోవాలి నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): రాత్రి, పగలు ఉష్ణోగ్రతలలో వ్యత్యాసం ఉండడం వల్ల నారుమళ్లు ఎర్రబడుతాయని, వెంటనే నారుమళ్ల సంరక్షణ చర్యలు చేపట్టాలని మాల్తుమ్మెద రైతువిజ్ఞానకేంద్రం శాస్త్రవేత్త రేవంత్ నాథన్ రైతులకు సూచించారు. మండలంలోని తాండూర్ శివారులో గురువారం నారుమళ్లను ఆయన పరిశీలించారు. ఎర్రబడ్డ నారుమళ్ల సంరక్షణ కోసం లీటర్ నీటిలో ఎన్.పీ.కే మందును 5గ్రాముల చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలని రైతులకు సూచించారు. దీంతోపాటే ఫార్ములా 4ను లీటర్ నీటిలో 5గ్రాముల చొప్పున కలిపి వారంలో రెండు పర్యాయాలు పిచికారి చేసుకోవాలన్నారు. నాగిరెడ్డిపేట ఏవో సాయికిరణ్ ఉన్నారు. కాంగ్రెస్లో పలువురి చేరిక కామారెడ్డి టౌన్: పట్టణ బీఆర్ఎస్ నాయకులు నవీన్యాదవ్తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేశారు. వారికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్రెడ్డి మా ట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, ప్రజలు కాంగ్రెస్ వైపు వస్తున్నారని తెలిపారు. నాయకులు అనిల్ యాద వ్, అవినాష్ యాదవ్, అజయ్, ఆనంద్, ప్రశాంత్, విజయ్, ఉమామహేశ్వరి, అఖిల, అనిత, మంజుల, రాజమణి, లావణ్య, తదితరులు ఉన్నారు. నాగిరెడ్డిపేట మండలంలో.. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మాల్తుమ్మెద గ్రామపంచాయతీ పరిధిలోని పలువురు వార్డుసభ్యులు గురువారం కాంగ్రెస్లో చేరారు. వారికి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు హైదరాబాద్లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వార్డుసభ్యులు తలారి శోభ, బైండ్ల శ్రీనివాస్, కుడికాల రాజు, జోగు లక్ష్మీ, పుప్పాల శివరాములు, బోయిన పవిత్ర, సిద్ధిరాములు, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు మురళీమోహన్గౌడ్, తదితరులు ఉన్నారు. -
హత్యాయత్నం కేసులో రౌడీ షీటర్ అరెస్టు
● దాడికి ఉపయోగించిన తల్వార్ స్వాధీనం కామారెడ్డి క్రైం: హత్యాయత్నం కేసులో ఓ రౌడీ షీటర్ను కామారెడ్డి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సబ్ డివిజనల్ పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మధుసూదన్ వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట కాలనీకి చెందిన సల్మాన్ఖాన్ అనే రౌడీ షీటర్ పాత కక్షల నేపథ్యంలో ఈ నెల 22న రాత్రి సమయంలో అదే కాలనీకి చెందిన అర్షద్ ఇంటికి వెళ్లి ఆటో రిక్షా, విద్యుత్ మీటర్లను ధ్వంసం చేయడమే కాకుండా అర్షద్ భార్యపై రాయితో దాడి చేసి గాయపరిచాడు. తల్వార్తో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. సల్మాన్ ఖాన్ కామారెడ్డి పీఎస్కు చెందిన రౌడీషీటర్గా ఉన్నాడని తెలిపారు. గతంలో అతనిపై హత్యాయత్నంతోపాటు 5 క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. గురువారం బతుకమ్మకుంట వద్ద సల్మాన్ఖాన్ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలిస్తున్నట్లు వివరించారు. నేరానికి ఉపయోగించిన 57 సెంటీమీటర్ల తల్వార్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టణ ఎస్హెచ్వో నరహరి, ఎస్సై సాయిక్రిష్ణ, సిబ్బందిని అభినందించారు. -
క్రైం కార్నర్
గాంధారి(ఎల్లారెడ్డి): తండ్రి మందలించాడని మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన వివరాలు.. పత్తి రాము(22) అనే యువకుడు వింతగా ప్రవర్తిస్తూ అమ్మాయిల మాదిరిగా డ్రెస్సులు వేసుకునే వాడు. ఏ పని చేయకుండా తిరుగుతుండడంతో ఏదైనా పని చేసుకోవాలని తండ్రి కాశీరాం మందలించాడు. దీంతో మనస్థాపానికి గురైన రాము మంగళవారం రాత్రి తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. జిల్లా కేంద్రంలో కేరళ టీచర్ ..కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రం శివారులో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో పని చేయడానికి పది రోజుల క్రితం కేరళ నుంచి వచ్చిన టీచర్ తాను నివాసం ఉంటున్న క్వార్టర్స్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. నరసన్నపల్లి సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేయడానికి కేరళకు చెందిన దేవిక విల్లా(30) పది రోజుల క్రితం వచ్చింది. బుధవారం సాయంత్రం తన గదిలో దేవిక ఉరేసుకొన్నట్లు గమనించిన చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దేవునిపల్లి పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. -
స్కూల్ బస్సును అడ్డుకున్న గ్రామస్తులు
మాచారెడ్డి: లచ్చాపేటలో సర్పంచ్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు బుధవారం గ్రామానికి వచ్చిన ప్రైవేట్ పాఠశాల బస్సును అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన టీచర్లు ఉన్నారన్నారు. అన్ని సౌకర్యాలున్న సర్కారు బడిలోనే తమ పిల్లలను చేర్పిస్తామన్నారు. గ్రామంలోకి ప్రైవేట్ స్కూల్ బస్సులు రావడానికి వీలు లేదని పేర్కొన్నారు. గ్రామానికి వచ్చిన బస్సులను అడ్డుకుని వెనక్కి పంపించారు.నిజాంసాగర్: సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదవారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ పేర్కొన్నారు. బుధవారం మల్లూర్లో ఇందిరమ్మ లబ్ధిదారు గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల కోసం గ్రామ పంచాయతీల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. గుడిసెలు, రేకుల షెడ్లలో ఉంటున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజా పండరి, నాయకులు అంజయ్య, శ్రీనివాస్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. మాచారెడ్డి: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఆస్కారం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్వో వెంకట్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. మండలంలోని పలు ప్రథమ చికిత్స కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం ఎల్లంపేటలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం నూతన భవన నిర్మాణాన్ని పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారికి సూచించారు. -
ప్రమాదవశాత్తు చెరువులో పడి మహిళ మృతి
నందిపేట్(ఆర్మూర్): పూజ చేసిన పూలను నిమజ్జనం చేసేందుకు వెళ్లిన మహిళ ప్రమాదవశాత్తు చెరువులో జారి పడి మృతి చెందింది. ఎస్సై వినయ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండల కేంద్రంలోని రామ్నగర్ కాలనీకి చెందిన పిస్క గంగాచరణ్ భార్య సుజాత బుధవారం ఉదయం 11 గంటలకు పూజ అనంతరం తీసేసిన పూలను నీటిలో వేసేందుకు రఘునాథ చెరువుకు వెళ్లింది. వైన్షాపులో పని చేసే గంగాచరణ్ మధ్యాహ్నం వేళ భోజనానికి ఇంటికి రాగా భార్య కనిపించలేదు. చుట్టు పక్కల వెతకగా చెరువులో మృతదేహం కనిపించింది. పూలను నీటిలో వేస్తుండగా కాలుజారి పడిపోయి ఉంటుందని గంగాచరణ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఈత రాక మరొకరు.. ఆర్మూర్టౌన్: చెరువులో స్నానానికి వెళ్లిన ఆలూర్ మండలం మచ్చర్ల గ్రామానికి చెందిన గణేశ్ (39) నీట మునిగి మృతిచెందినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ బుధవారం తెలిపారు. మచ్చర్ల గ్రామంలో గణేశ్ గొర్రెలను మేపుతూ చెరువు వద్దకు వెళ్లాడు. స్నానానికి దిగిన గణేశ్ ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తన భర్త మృతిపై ఎటువంటి అనుమానాలు లేవని గణేశ్ భార్య చంద్రకళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ట్రాక్టర్ ఢీకొని ఒకరు..బాన్సువాడ : బీర్కూర్ మండల కేంద్రంలోని పోచారం కాలనీకి చెందిన షేక్ సల్మాన్(30) అనే వ్యక్తి ట్రాక్టర్ ఢీకొట్టిన ఘటనలో మృతి చెందాడు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. సల్మాన్ కాలనీలోని వాటర్ ట్యాంక్ వద్ద నిలబడి ఉండగా అటు వైపు అతివేగంగా వచ్చిన ట్రాక్టర్ గుంతలో పడి పక్కనే ఉన్న సల్మాన్ను ఢీకొట్టింది. తీవ్రగాయాలపాలైన అతడిని స్థానికి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాములు తెలిపారు. -
ఘనంగా చండీ హోమం
భిక్కనూరు: మండలంలోని కాచాపూర్ గంగమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు మూడు రోజులుగా కొనసాగుతున్నాయి. బుధవారం ప్రతిష్ఠాపన ఉత్సవాల్లో భాగంగా ఆలయం ప్రాంగణంలో పెద్ద ఎత్తున చండీ హోమం నిర్వహించారు. తదుపరి పూర్ణాహుతి నిర్వహించి పెద్ద ఎత్తున తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. 26 వరకు ఉత్సవాలను నిర్వహిస్తామని, భక్తులు ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావల్సిందిగా నిర్వాహకులు కోరారు. నేడు వరుణ జప అనుష్ఠానం కామారెడ్డి అర్బన్: బ్రాహ్మణ వికాస పరిషత్ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 6 గంటలకు కామారెడ్డి సిరిసిల్ల రోడ్డులోని శ్రీత్రిశక్తి ఆలయంలో వరుణ జప అనుష్ఠానం నిర్వహించనున్నట్లు వికాస పరిషత్ అధ్యక్షుడు సీహెచ్ అర్జున్రావు తెలిపారు. భక్తులు వరుణ జప అనుష్టానం కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని అర్జున్రావు కోరారు. -
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం
● పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బోధన్టౌన్(బోధన్): మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య పిలుపునిచ్చారు. ‘మనబడి– మన భద్రత’ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఇందూర్ మోడల్ హైస్కూల్లో బుధవారం మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీపీ మాట్లాడుతూ.. ఈ నెల 26వ తేదీన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. డ్రగ్స్, అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. లేని పక్షంలో డయల్ ఈగల్ ఫోర్స్ టోల్ ఫ్రీ నంబర్ 1908కు ఫోన్ చేయాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారు చేసిన తప్పుకు ఎదుటి వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంతోపాటు వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ యాంటి డ్రగ్స్ సోల్జర్గా మారి సమాజంలో అవగాహన కల్పించాలన్నారు. అనంతరం యాంటి డ్రగ్స్ సోల్జర్ సెల్ఫీపాయింట్ను ప్రారంభించారు. డ్రాయింగ్, వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. -
ఎమ్మెల్యే కేవీఆర్పై మూడు కేసుల కొట్టివేత
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిపై గతంలో నమోదైన మూ డు క్రిమినల్ కేసులను హైదరాబాద్ నాంపల్లి లోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం బుధవారం కొట్టివేసింది. వెంకటరమణారెడ్డి న్యాయవాదులు ఎల్.ప్రభాకర్రెడ్డి, వై.రాము లు, టి.ఉదయ్ రాజ్ తెలిపిన వివరాలిలా ఉ న్నాయి. మున్సిపల్ పట్టణ ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్కు వ్యతిరేకంగా 2023లో స్థానిక రైతులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రజల ఆస్తులు, రైతుల భూములు, హక్కుల పరిరక్షణ కోసం చేపట్టిన ఆందోళనల్లో కేవీఆర్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఆయనపై మూడు కేసులు నమోదయ్యాయి. వాటిని సమగ్రంగా పరిశీలించిన న్యాయస్థానం అభియోగాలను కొనసాగించేందుకు తగిన ఆధారాలు లేవంటూ వాటిని కొట్టివేసిందని న్యాయవాదులు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించలేమని పేర్కొందన్నారు. కామారెడ్డి అర్బన్: కరీంనగర్లోని ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాల(తెలుగు, ఇంగ్లిష్ మీడియం)లో ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపల్ భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నామని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్ జిల్లాల అంధ బాలబాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 97011 90124 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
గాంధారి మండల ఉప సర్పంచ్ ఫోరం కార్యవర్గం ఎన్నిక
గాంధారి(ఎల్లారెడ్డి): మండల ఉప సర్పంచ్ల ఫోరం కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికై న గాంధారి ఉప సర్పంచ్ కె. భాస్కర్ గౌడ్ తెలిపారు. ఉపాధ్యక్షుడిగా బామన్ అనంతరావు, ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్ నాయక్, సంయుక్త కార్యదర్శిగా మంజ గోపాల్, మహ్మద్ అబ్దుల్, కోశాధికారిగా చిన్న సాయిలును ఎన్నుకున్నట్లు తెలిపారు. లింగంపేట కార్యవర్గం.. లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండల ఉపసర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని బుధవారం స్థానిక రామాలయంలో ఎన్నుకున్నారు. ఎల్లారెడ్డి నియోజక వర్గ అధ్యక్షుడు ప్రసాద్గౌడ్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అధ్యక్షుడిగా మన్నె బాలయ్య(శెట్పల్లి), ఉపాధ్యక్షులుగా మామిడి సంజీవులు(అయిలాపూర్), మాసన్నగారి కిష్టయ్య(సజ్జన్పల్లి), ప్రధాన కార్యదర్శిగా సంద బాలయ్య(పోతాయిపల్లి), వర్కింగ్ ప్రెసిడెంట్గా రమావత్ పీర్యా(కొట్టాల్గడ్డ తండా), కోశాధికారిగా కలాలు బాలాగౌడ్(మెంగారం), కార్యదర్శులుగా బిట్ల రాజు(ముస్తాపూర్), కల్లు రాజు(జల్దిపల్లి)లను ఎన్నుకున్నట్లు తెలిపారు. -
విదేశీ విద్య.. అందే ద్రాక్షే..!
● పేద విద్యార్థుల కోసం విదేశీ విద్యా నిధి పథకం ● విదేశాలలో చదువుకోవాలనుకునే పేద విద్యార్థులకు ఈ పథకం వరం ఎల్లారెడ్డి: విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలనుకునే పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విదేశీ విద్యా నిధి పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. విదేశీ విద్యానిధి పథకం కింద ఎంపికై న నిరుపేద విద్యార్థులకు రూ.20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. అమెరికా, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణ కొరియా, సింగపూర్, జపాన్, న్యూజీలాండ్, ఫ్రాన్స్, లండన్ వంటి దేశాల్లో చదువుకోవాలనుకునే పేద విద్యార్థులకు ఈ పథకం వరం. తెలంగాణాలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పేరిట, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు మహాత్మా జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట ఈ పథకాన్ని అమలు చేస్తోంది ఈ పథకం పొందేందుకు అర్హతలు.. ● అభ్యర్థి కుటుంబ వార్షికాదాయం రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల లోపు ఉండాలి. ● కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. ● పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ, ఎంబీబీఎస్ వంటి ఉన్నత విద్యను చదువుకోవాలకునే విద్యార్థులు అర్హులు ● జీఆర్ఈ, జీమాట్, ఐఈఎల్టీఎస్, టోఫెల్లో అర్హత మార్కులు సాధించి ఉండాలి. కావాల్సిన ముఖ్యమైన పత్రాలు... ● ఆధార్ కార్డు, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ● డిగ్రీ వరకు విద్యార్హత సర్టిఫికెట్లు ● పాస్పోర్ట్ కాపీ ● విదేశీ యూనివర్సిటీలలో అడ్మిషన్ లెటర్ ● జీఆర్ఈ, జీమాట్, ఐఈఎల్టీఎస్, టోఫెల్ స్కోర్ కార్డులు ● బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజి జిరాక్స్ కాపీ విద్యానిధి పథకానికి గడువు తేది.. తెలంగాణ ప్రభుత్వం విద్యానిధి పథకం కోసం సంవత్సరానికి రెండు సార్లు(స్ప్రింగ్ అండ్ ఫాల్ సీజన్లకు) దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎస్సీ ఎస్టీ విద్యార్థుల కోసం అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పేరిట మార్చి 31 వరకు గడువు తేదీగా నిర్ణయించింది. ఇక జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ల పేరిట బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్ట్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు గడువుగా నిర్ణయించింది. విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం సంక్షేమశాఖ ద్వా రా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. అర్హత గల వి ద్యార్థులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి. – పల్లె నర్సయ్య, జిల్లా బీసీ సంక్షేమ అధికారి, కామారెడ్డి -
వర్షాభావం.. ఖరీఫ్పై ప్రభావం
నాగిరెడ్డిపేట: వానాకాలం సీజన్ ప్రారంభమై మూడు వారాలు గడిచినా జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురియలేదు. చాలా మండలాల్లో లోటు వర్షపాతం నమోదయ్యింది. జిల్లాలో బుధవారంనాటికి సాధారణ వర్షపాతం 104.6 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా.. 75.9 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయ్యింది. భిక్కనూరు, కామారెడ్డి రూరల్ మండలాల్లో మాత్రమే అధిక వర్షపాతం రికార్డయ్యింది. జుక్కల్, బిచ్కుంద, బీర్కూర్, నస్రుల్లాబాద్, సదాశివనగర్, కామారెడ్డి అర్బన్, దోమకొండ, పాల్వంచ మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదయింది. నిజాంసాగర్, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, మహ్మద్నగర్ మండలాల్లో తీవ్ర లోటు ఉంది. మద్నూర్, పెద్దకొడప్గల్, బాన్సువాడ, పిట్లం, గాంధారి, తాడ్వాయి, రాజంపేట, మాచారెడ్డి, బీబీపేట, డోంగ్లీ మండలాల్లో లోటు వర్షపాత పరిస్థితులున్నాయి. కొనసాగుతున్న ఎండల తీవ్రత జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. సగటు ఉష్ణోగ్రతలు 37 నుంచి 40 డిగ్రీల మధ్యలో రికార్డవుతున్నాయి. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత మద్నూర్ మండలం సమూర్లో 37.7 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది. ముందుకు సాగని పనులు.. జిల్లాలో నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో చురుకుగా మారకపోవడంతో రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడక్కడ నమోదైన స్వల్ప వర్షపాతం వల్ల పొలాల్లో తేమ పెద్దగా పెరగలేదు. రైతులు నారుమడులు పోసుకున్నా.. నాట్లకు సమాయత్తం కాలేకపోతున్నారు. పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, కంది తదితర పంటల సాగు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు.ప్రస్తుతం నెలకొన్న వర్షభావ పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటలను సాగు చే యడం మేలు. వరికి బదులు గా కంది, పెసర, మినుములు వంటివి సాగు చేయాలి. వాతావరణం అనుకూలిస్తేనే విత్తనాలు నాటాలి. – రేవంత్ నాథన్, శాస్త్రవేత్త, తెలంగాణ రైతువిజ్ఞాన కేంద్రం, మాల్తుమ్మెదభారీ వర్షాలు కురిసిన తర్వాతే విత్తనాలు వేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ముందస్తుగా విత్తనాలు వేస్తే మొలక శాతం తగ్గే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే విత్తిన పంటలకు అవసరమైన తేమను కాపాడేందుకు పొలాల్లో తేలికపాటి దుక్కి పనులు చేపట్టాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తక్కువ కాలంలో దిగుబడి ఇచ్చే పంట రకాలను ఎంపిక చేసుకోవాలని, పశువులకు తగినంత తాగునీరు, పచ్చిమేత అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. జోరందుకోని పంటల సాగు అత్యధిక మండలాల్లో లోటు వర్షపాతం నమోదు ఐదు మండలాల్లో తీవ్ర లోటు.. ఆరుతడి పంటలు వేయాలంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు -
సర్వ్ం సన్నద్ధం
‘‘ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) అంటే ఓటర్ల జాబితాను శుద్ధి చేయడం.. అనర్హుల ఓట్లు తొలగించి, అర్హులకే ఓటు హక్కు ఉండేలా చూడడం.. ఇందులో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటికి వెళ్లి, ఓటర్లకు ఎన్యుమరేషన్ పత్రాలు అందిస్తారు. వాటిని పూరించి తిరిగి బీఎల్వోలకు ఇవ్వాల్సి ఉంటుంది’’ అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియపై ఆందోళన అవసరం లేదన్నారు. అర్హులందరి ఓట్లు ఉండేలా చూస్తామని పేర్కొన్నారు. గురువారంనుంచి ‘సర్’ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ‘సాక్షి’ ఆయనను ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలు.. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డిఓటరుగా అన్ని అర్హతులు ఉన్న పౌరుల పేర్లు జాబితాలో ఉండాల్సిందే. ఇదే సమయంలో అనర్హుల పేర్లు జాబితాలో చేర్చబడకూడదన్న ముఖ్య లక్ష్యంతో ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) చేపట్టింది. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశాం. ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమంలో బీఎల్వోలే కీలకం. ఒక్కో పోలింగ్ బూత్నకు ఒక్కో బీఎల్వో చొప్పున జిల్లాలో 796 బీఎల్వోలున్నారు. వీరికి ఈనెల 15 నుంచి 24 వరకు శిక్షణ ఇచ్చాం. అవసరమైన సామగ్రిని అందించాం. 97 మంది సూపర్వైజర్లను నియమించాం. వీరితోపాటు ఆయా మండలాల తహసీల్దార్లు సర్ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజక వర్గాలకు ఆర్డీవో, జుక్కల్కు రెవెన్యూ అదనపు కలెక్టర్ ఇన్చార్జీగా వ్యవహరిస్తారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల పరిధిలో 796 పోలింగ్ బూత్లున్నాయి. సర్కు సంబంధించి ఆయా బూత్ల పరిధిలో మ్యాపింగ్ ప్రక్రియ 84.32 శాతం పూర్తయ్యింది. జుక్కల్లో 86.86 శాతం, ఎల్లారెడ్డిలో 84.45 శాతం, కామారెడ్డిలో 81.29 శాతం జరిగింది. బాన్సువాడకు సంబంధించి నిజామాబాద్ నుంచి పర్యవేక్షణ జరుగుతుంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ప్రస్తుతం 6,96,006 మంది ఓటర్లు ఉన్నారు. సమగ్ర సవరణ తర్వాత అర్హులైన ఓటర్లు ఎంత మంది ఉన్నారన్న లెక్క తేలుతుంది. బూత్లెవల్ అధికారి ఇంటికి వచ్చినపుడు 2026 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే వారి వివరాలు చెబితే ఫారం–6 ఇస్తారు. డిక్లరేషన్ ఫారంతో పాటు ఫారం–6 తీసుకుని వాటిని పూరించి ఇవ్వాలి. సమగ్ర సవరణకు సంబంధించి ఎన్యూమరేషన్ ఫారం అందకపోతే బీఎల్వోను సంప్రదించవచ్చు. ముసాయిదా జాబితాలో ఏవైనా పొరపాట్లు ఉంటే సరిచేయడానికి నెలరోజులపాటు అవకాశం ఉంటుంది. ఇది జూలై 31నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు కొనసాగుతుంది. ఓటర్ జాబితాలో ఏవైనా తప్పులు ఉంటే సరిచేయడం, ఇతర అభ్యంతరాలు నమోదు చేసుకోవడం, కొత్త ఓటర్ల నమోదు వంటి వాటికి అవకాశం ఉంటుంది. జూలై 31నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఎన్నికల అధికారులు ప్రతి అభ్యంతరాన్ని పరిశీలిస్తారు. అవసరమైతే ఆయా వివరాలపై విచారణ కూడా చేస్తారు. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 1న ప్రచురించడం జరుగుతుందని వివరించారు. నేటి నుంచి ఇంటింటికి బీఎల్వోలు నెల రోజులు కొనసాగనున్న ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ అర్హుల ఓట్లు జాబితాలో ఉండాల్సిందే.. సర్వే తర్వాతే తేలనున్న లెక్క ‘సాక్షి’తో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్సర్ ప్రక్రియలో కీలక దశ గురువారం ప్రారంభ కానుంది. ఇందులో భాగంగా బీఎల్వోలు ఇంటింటికి వెళ్లి ఎన్యుమరేషన్ పత్రాలను అందిస్తారు. వాటిని ఎలా పూరించాలన్న విషయమై అవగాహన కల్పిస్తారు. ఓటర్లు వాటిని నింపి తిరిగి అందించాల్సి ఉంటుంది. లేకపోతే వారి వివరాలు ముసాయిదా జాబితాలో ఉండవు. ఈ ప్రక్రియ వచ్చేనెల 24 వరకు కొనసాగుతుంది. ఈ నెల రోజుల్లో బీఎల్వోలు ఒక్కో ఇంటిని కనీసం మూడుసార్లు సందర్శిస్తారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తాం.ఓటరు ఉపాధి కోసమో, ఉద్యోగం కోసమో ఇతర ప్రాంతాలకు వలస వెళ్తే.. వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సంబంధిత కుటుంబ సభ్యులు ఎన్యుమరేషన్ ఫాం తీసుకుని పూరించి, సంతకం చేసి బీఎల్వోకు అందిస్తే సరిపోతుంది. ఇంటిగణన సమయంలో కుటుంబం మొత్తం అందుబాటులో లేనిపక్షంలో ఆన్లైన్ ఎన్యూమరేషన్ ఫాం సమర్పించే ఆప్షన్ను ఉపయోగించుకోవచ్చు. -
నిబంధనలు పాటించాలి
బాన్సువాడ రూరల్: హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని జిల్లా ఆహార భద్రత అధికారి విక్రమ్ సూచించారు. బుధవారం ఆయన బాన్సువాడ పట్టణంలోని పలు హోటళ్ళు, రెస్టారెంట్లు, రిటైల్ ఆహార దుకాణాలను తనిఖీ చేశారు. వండిన ఆహార పదార్థాలను రిఫ్రిజిరేటర్లలో అప్రరిశుభ్రంగా నిల్వచేయడం, ఆహార పదార్థాలకు కృత్రిమ రంగులు వినియోగిస్తుండం గమనించి నిర్వాహకులను హెచ్చరించారు. హోటల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అనుమానిత ఆహార పదార్థాల నమూనాలు సేకరించారు. ప్రయోగశాల నివేదిక వచ్చిన తర్వాత ఆహార భద్రత చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని పేట్సంగెం సంఘమేశ్వరాలయంలో బుధవారం వర్షాలు కురవాలని గ్రామస్తులు వరుణ యాగం నిర్వహించారు. వర్షాకాలం ప్రారంభమై సుమారు 20 రోజులు గడుస్తున్నా వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. కార్యక్రమంలో పేట్సంగెం గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించొద్దు
దోమకొండ: గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించకుండా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో మధురిమ కోరారు. బుధవారం లింగుపల్లి, చింతమాన్పల్లి గ్రామాలను ఆమె సందర్శించారు. ఆయా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు పరిశీలించి సూచనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్లు పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు. చింతమాన్పల్లి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య పనులతో పాటు నర్సరీని, అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ముత్యంపేట గ్రామ పంచాయతీని సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఆమె వెంట ఎంపీవో రవికుమార్, పంచాయితీ కార్యదర్శులు స్నేహ, పద్మ, సంజీవ్రెడ్డి, సర్పంచ్లు లక్ష్మి, సిద్దరాములు, ఆశబోయిన కవిత తదితరులున్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నిరుపేదలకు వరం
దోమకొండ: నిరుపేదల సొంతింటి కల సాకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలతో సాధ్యమైందని మాజీ జెడ్పీటీసీ తీగల తిర్మల్గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో పలువురు లబ్ధిదారులు ఇందిరమ్మ గృహప్రవేశాలు చేయగా వారికి నూతన వస్త్రాలను అందించారు. కార్యక్రమంలో పార్టీ మండల మాజీ అధ్యక్షుడు అనంతరెడ్డి, పట్టణ అధ్యక్షుడు సీతారాం మధు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింలు, నేతుల సుధాకర్, అబ్రబోయిన రాజేందర్, మెడికల్ రాజు, కలీం, అబ్రబోయిన స్వామి,తదితరులు ఉన్నారు. -
విద్యార్థుల అడ్మిషన్లు పెంచాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలని అధ్యాపకులకు ఇంటర్ జిల్లా నోడల్ అధికారి షేక్ సలామ్ సూచించారు. బుధవారం ఆయన లింగంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో తరగతి విద్యా బోధన, డిజిటల్ తరగతులను పరిశీలించారు. అలాగే మొదటి సంవత్సరంలో జరుగుతున్న అడ్మిషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కళాశాలలో జరుగుతున్న మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రిన్సిపాల్ నరేందర్, అధ్యాపకులు శివ, దుర్గయ్య, ధర్సింగ్, రాజయ్య, స్వామిగౌడ్, హైమద్, శ్రీలత, సంధ్య, ఆనంద్రెడ్డి తదితరులున్నారు. -
‘ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనివ్వాలి’
కామారెడ్డి క్రైం: ఉద్యోగులు తమ ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతను ఇవ్వాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో ఐకేపీ, డీఆర్డీఏ, ఈజీఎస్ సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరంలో బీపీ, షుగర్, ఈసీజీ, 2డీ ఎకో, కంటి పరీక్షలు నిర్వహించారు. 263 మంది ఉద్యోగులు పాల్గొని వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఉద్యోగులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్వీ గిరి, డీఆర్డీవో దామోదర్రెడ్డి, అదనపు డీఆర్డీవో విజయలక్ష్మి, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వినియోగానికి రైతాంగం నానో!
● ఒక బాటిల్ 45 కిలోల బస్తాకు సమానమంటున్న అధికారులు ● ఆసక్తి చూపని అన్నదాతలు ● సాధారణ ఎరువుల కోసమే ఆరాటంరైతులు పంటల సాగులో గుళికల రూపంలో ఉండే యూరియానే వినియోగిస్తున్నారు. దీని కొరత కారణంగా ప్రతి సీజన్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో దీనికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం ద్రవ రూపంలో ఉండే నానో యూరియాను అందుబాటులోకి తెచ్చింది. దీనిని వినియోగిస్తే భూసారం దెబ్బతినదని, పంటల దిగుబడులు, నాణ్యత పెరుగుతాయని, నేల కాలుష్యం తగ్గుతుందని, రవాణా చేయడానికీ ఇబ్బంది ఉండదని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఒక సీసా నానో యూరియాకు.. 45 కిలోల బస్తాకు సమానమంటున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఎరువుల కోసం పడిగాపులు.. యాప్తో అవస్థల బాధ తప్పుతాయంటున్నారు. అయినా రైతులు మాత్రం నానో ఎరువులకు నో చెబుతున్నారు. రైతుల అభ్యంతరాలవి.. ● సాధారణ ఎరువులు వాడితే వచ్చే తక్షణ ఫలితాలు నానో ఎరువులతో రావడం లేదు. ● నానో ఎరువులు వేస్తే పైరు పచ్చగా, ఏపుగా పెరగడం లేదు. ● నానో ఎరువులను పిచికారీ చేయాల్సి ఉంటుంది. ఇది అదనపు ఖర్చు. అంతేకాకుండా నానో ఎరువులను పిచికారి చేసినప్పుడు ఆకులు మాడిపోతున్నాయి. అవగాహన కరువు.. నానో ఎరువులపై రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన లేదు. దీంతో వారు వీటిని వాడేందుకు ముందుకు రావడం లేదు. దీనికితోడు నానో ఎరువులపై అపోహలున్నాయి. వాటిని నివృత్తి చేసేందుకు ప్రభుత్వం విరివిగా సదస్సులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. అలాగే ఎరువుల పిచికారీ కోసం డ్రోన్లను అందుబాటులో ఉంచాలని పలువురు రైతులు కోరుతున్నారు.పంటల సాగుకు ఇబ్బడి ముబ్బడిగా రసాయన ఎరువులను వాడుతుండడంతో భూసారం దెబ్బతింటోంది. అధిక యూరియా వినియోగంతో పైరు పచ్చగా ఏపుగా పెరిగినా.. తెగుళ్లు, పురుగుల దాడిని తట్టుకునే శక్తి ఉండడం లేదు. నానో యూరియా, నానో డీఏపీ వాడడం వల్ల భూసారం దెబ్బతినకుండా చూసుకోవచ్చు. సాధారణ యూరియా వేస్తే మొక్కలు తక్కువ శాతం నత్రజని ఉపయోగించగలుగుతాయి. నానో యూరియా వేస్తే నత్రజని నేరుగా ఆకుల ద్వారా మొక్కలకు అందుతుంది. నానో ఎరువుల ద్వారా రవాణా ఖర్చులు, నిల్వ ఉంచే సమస్యలు తగ్గుతాయి.గుళికల రూపంలో ఉండే యూరియానే దశాబ్దాలుగా వినియోగిస్తున్న రైతులు.. ద్రవ రూపంలో ఉండే నానో యూరియా వాడడానికి ఆసక్తి చూపడం లేదు. ఒక నానో యూరియా బాటిల్ 45 కిలోల యూరియాకు సమానమని, దీని వినియోగంతో భూసారం దెబ్బతినదని అధికారులు చెబుతున్నా.. బస్తాల కోసమే ఆరాటపడుతున్నారు. – ఎల్లారెడ్డి -
సన్న బియ్యం.. మరింత ప్రియం
● భారీగా పెరిగిన ధర ● ఆందోళన చెందుతున్న మధ్యతరగతి ప్రజలుఎల్లారెడ్డిరూరల్: సన్న బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. పది రోజుల్లోనే క్వింటాలుకు గరిష్టంగా వెయ్యి రూపాయల వరకు ధర పెరిగింది. దీంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సన్నరకం వరిధాన్యాన్ని ఎక్కువగా బీర్కూర్, నస్రుల్లాబాద్, చందూర్, వర్ని, మోస్రా, కోటగిరి, పోతంగల్, రుద్రూర్ మండలాలలో పండిస్తారు. ఇక్కడ సాగు చేసిన సన్నరకం వడ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ, సూర్యాపేట, ఆంధ్రపదేశ్లోని విజయవాడ, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు ప్రాంతాల వ్యాపారులు పంట కోసిన వెంటనే కొనుగోలు చేసి తీసుకువెళ్లారు. ఇక్కడ సాగైన సన్న వడ్లు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లిపోవడంతోపాటు బోనస్పై ఆశతో చాలా మంది రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. దీంతో స్థానికంగా సన్న వడ్లకు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇతర జిల్లాల నుంచి బియ్యాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి రావడంతో రవాణా భారం పెరిగి ధరలకు రెక్కలొస్తున్నాయి. ఆయా రకాల బియ్యం ధరలు పది రోజుల వ్యవధిలోనే క్వింటాలుకు రూ. 8 వందల నుంచి వెయ్యి రూపాయల వరకు పెరగడం గమనార్హం. సన్నబియ్యం రకం పాత ధర ప్రస్తుత ధర బీపీటీ 3,800 4,800 హెచ్ఎంటీ 5,200 6,000 ఆర్ఎన్ఆర్ 4,600 5,500 జేఎస్ఆర్ 6,800 7,600గతంలో జైశ్రీరాం రకం బియ్యం క్వింటాలు ధర రూ. 6,800 ఉండేది. ఇప్పుడు అడిగితే రూ. 7,600లు చెబుతున్నారు. క్వింటాలుకు రూ. 800 ధర పెరిగింది. ధర పెరిగినా స్టాక్ లేదంటున్నారు. బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సంతోష్, ఎల్లారెడ్డివాసి -
4 నుంచి డిగ్రీ వన్టైం బ్యాక్లాగ్ పరీక్షలు
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ కళాశాలల్లో బ్యాక్లాగ్పరీక్షలు జులై 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ కే సంపత్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2016, 2017, 2018, 2019, 2020 బ్యాచ్ల డిగ్రీ విద్యార్థులకు చివరి అవకాశంగా ఇస్తున్న బ్యాక్లాగ్ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ www. telanganauniversity. ac. in లో పొందుపర్చినట్లు తెలిపారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ, బీపెడ్ నాల్గో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ఈనెల 29వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ www. telanganauniversity. ac. in ను సంప్రదించాలని ఆయన సూచించారు. మినీ స్టేడియం ఏర్పాటు చేయండినాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలో మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావుకు కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు దత్తు, గోపాల్పేట ఉపసర్పంచ్ గులాం వినతిపత్రాన్ని అందజేశారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే నివాసంలో బుధవారం వారు ఆయనను కలిశారు. మండలంలో మినీస్టేడియం లేకపోవడం వల్ల క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వారు వివరించారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు. నాయకులు కుమార్, మధు ఉన్నారు.నిజామాబాద్ అర్బన్: నగరంలోని మహ్మదీయకాలనీకి చెందిన బాలుడు షోయబ్(16) అదృశ్యమైనట్లు రెండో టౌన్ పోలీస్స్టేషన్ ఎస్సై యాదగిరిగౌడ్ బుధవారం తెలిపారు. ఇంటి నుంచి బయటికి వెళ్లిన షోయబ్ తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో చివరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. లింగంపేట(ఎల్లారెడ్డి): భారతీయ జన తా పార్టీ సీనియర్ నాయకుడు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహారాజుల మురళి(59) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మండల కేంద్రానికి చెందిన మురళి క్రియాశీల రాజకీయాల్లో గత 30 ఏళ్లుగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, కరసేవకుడిగా పనిచేశారు. మురళి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా, రాష్ట్ర నాయకులు, అలాగే ఆయా పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అతడి స్నేహితులు, బంధువులు గ్రామానికి చేరుకొని ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. వేల్పూర్: మండలంలోని మోతె గ్రామ శివారులో ఉన్న వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ను దుండగులు మంగళవారం అర్ధరాత్రి ధ్వంసం చేసి కాపర్ కాయిల్స్ ఎత్తుకెళ్లినట్లు రైతులు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేయడంతో పొలాలకు నీటి సరఫరా నిలిచిపోయిందని, వరి నారుమడులు తడి ఆరిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు త్వరగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి సరఫరాను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. నిజామాబాద్ అర్బన్: నగరంలోని ఖిల్లా చౌరస్తాలో ఉన్న బాల్యరక్ష భవనంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి పలు ఫైళ్లను తగలబెట్టినట్లు ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సై సునీల్ తెలిపారు. బుధవారం రాత్రి బాల్యరక్ష భవనంలోకి చొరబడిన దుండగులు బీరువాలోని ఫైళ్లను తగులబెట్టారని చైల్డ్ హెల్త్లైన్ సూపర్వైజర్ కేతావత్ భీక్సింగ్ ఫిర్యాదు చేశారన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
కన్కల్ ప్రభుత్వ పాఠశాలకు గొప్ప చరిత్ర
తాడ్వాయి(ఎల్లారెడ్డి): కన్కల్ ప్రభుత్వ పాఠశాల గొప్ప చరిత్ర సృష్టించిందని డీఈవో మల్లికార్జున్ అన్నారు. ఆయన బుధవారం పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్రెడ్డితో కలసి కన్కల్ గ్రామంలో గల ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఏకంగా రెండు పాఠశాలలో 145 మంది విద్యార్థులు ఒకేసారి చేరడం కొత్తచరిత్ర సృష్టించినట్లయిందన్నారు. సర్పంచ్ మైలారం రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులందరూ కలసి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి పిల్లలను ప్రవేటు పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం చాలా సంతోషకరమన్నారు. అనంతరం పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు, కన్కల్ గ్రామవాసి పులుగం దామోదర్రెడ్డి..పాఠశాలలో ఎలాంటి వసతులు ఉన్నాయని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేస్తే తనవంతు సహాయ, సహకారాలను అందిస్తానన్నారు. ఎంఈవో రామస్వామి, సర్పంచ్ రవీందర్రెడ్డి, ఉప సర్పంచ్ మహేష్, హెచ్ఎంలు సంగారెడ్డి, ఆశాజ్యోతి, ఉపాధ్యాయులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు. -
నోటీస్ అందితేనే..
గణన దశలో ఓటరు ఎటువంటి గుర్తింపు పత్రాలను అందించాల్సిన అవసరం లేదు. ముసాయిదా ఓటర్ల జాబితాల ప్రచురణ తరువాత లింక్ చేయబడని లేదా గత సవరణ ఓటర్ల జాబితాతో లింక్ చేయడంలో వ్యత్యాసం ఉన్న వ్యక్తులకు ఈఆర్వో నోటీసు జారీ చేస్తారు. ఆ నోటీసు అందుకున్నవారు మాత్రమే తమ అర్హతలను నిరూపించుకునేందుకు పత్రాలు అందించాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో పనిచేస్తున్న రెగ్యుల ర్ ఉద్యోగి/పెన్షనర్కు జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు కార్డు, 1987 జూలై 1 కి ముందు ప్రభుత్వం/స్థానిక అధికారులు/బ్యాంకులు,/పోస్ట్ ఆఫీస్ల ద్వారా జారీ అయి న ఏదైనా గుర్తింపు కార్డు, సమర్థ అధికారిక సంస్థ జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం, పాస్పోర్టు, గుర్తింపు పొందిన బోర్డులు, విశ్వవిద్యాలయాలు జారీ చేసిన పదో తరగతి మెమో, రాష్ట్ర అధికారిక సంస్థ జారీ చేసిన శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా భూమి, ఇంటి కేటాయింపు ధ్రువీకరణ పత్రం సమర్పించవచ్చు. -
మాదకద్రవ్యాల నిర్మూలన అందరి బాధ్యత
సదాశివనగర్(ఎల్లారెడ్డి) : మాదకద్రవ్యాల నిర్మూల న అందరి బాధ్యత అని జిల్లా జడ్జి వరప్రసాద్ వ్యా ఖ్యానించారు. మంగళవారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో మాదకద్రవ్యాల వినియోగం, ని ర్మూలన, అక్రమ రవాణా నియంత్రణ, వ్యక్తిత్వ వి కాసంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియో గం వ్యక్తుల జీవితాలనే కాకుండా కుటుంబాలు, స మాజాన్ని కూడా దెబ్బతీసే ప్రమాదకరమైన సామాజిక సమస్య అని పేర్కొన్నారు. అక్రమార్కులు ము ఖ్యంగా యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మాదకద్రవ్యాల వలలోకి లాగేందుకు ప్రయత్నిస్తు న్నారన్నారు. అందువల్ల ప్రతీ పౌరుడు అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రి న్సిపాల్ రాజారెడ్డి, డీఎల్ఎస్ఏ సూపరింటెండెంట్ చంద్రసేన్రెడ్డి, ఐఎస్ఆర్డీ స్వచ్ఛంద సంస్థ కార్యద ర్శి రాజేందర్ రావు, వినాయక్ పాల్గొన్నారు. -
ప్రమాదంలో హెడ్కానిస్టేబుల్ మృతి
● హోంగార్డుకు తీవ్రగాయాలు పెద్దకొడప్గల్(జుక్కల్): మండల కేంద్రం సమీపంలోని 161 హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతిచెందగా, హోంగార్డుకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు .. మద్నూర్కు చెందిన రాజ్ కుమార్(52) హెడ్కానిస్టేబుల్గా , బిచ్కుందకు చెందిన మధు హోంగార్డుగా పనిచేస్తున్నారు. రాజ్కుమార్ మంగళవారం విధుల నిమిత్తం బైక్పై పిట్లం పోలీస్ స్టేషన్కు బయలుదేరగా, మార్గమధ్యలో మధును ఎక్కించుకున్నారు. ఇరువురు కలిసి బైక్పై వెళుతుండగా పెద్దకొడప్గల్ సమీపంలోని హైవేపై ఆగిన లారీని ఢీకొన్నారు. ఈఘటనలో బైక్ నడిపిన రాజ్కుమార్ అక్కడికక్కడే మృతిచెందగా, వెనకాల కూర్చున్న మధుకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. గత ప్రమాదంలో గాయాలతో గట్టెక్కిన రాజ్కుమార్ హెడ్ కానిస్టేబుల్ రాజ్కుమార్కు గతంలో రోడ్డు ప్రమాదం జరుగగా, గాయాలతో గట్టెక్కాడు. మద్నూర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా రాజ్కుమార్ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఓ రోజు అర్ధరాత్రి పెట్రోలింగ్ వాహనంలో వెళ్తుండగా, గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కాగా, అప్పటి నుంచి రాజ్కుమార్ కుడిచేయి సరిగా పనిచేయకుండ పోయింది. -
ప్రతి రైతుకు యూరియాను అందజేస్తాం
● ఎరువుల కోసం ఎలాంటి ఆందోళన వద్దు ● ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ప్రతి రైతుకు యూరియాను అందజేస్తామని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు పేర్కొన్నారు. పోచారంలో బుధవారం మండలంలోని ఆత్మకూర్కు చెందిన పాటిమీది శ్రీనివాస్రెడ్డికి రూ.లక్షా54వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. యూరియా సరఫరాపై ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతోపాటు వ్యవసాయ శాఖ డైరెక్టర్తో మాట్లాడానన్నారు. ప్రతి పీఏసీఎస్ చైర్మన్లు, సీఈవోలు యూరియా కోసం సకాలంలో డీడీలు చెల్లించి రైతులకు యూరియాను అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంలో, యాసంగి సీజన్లో ధాన్యం సేకరణలో నాగిరెడ్డిపేట మండలం జిల్లాలో మొదటిస్థానంలో నిలిచిందని తెలిపారు. గతేడాది వచ్చిన భారీ వరదలను తట్టుకొని సురక్షితంగా నిలిచిన పోచారం ప్రాజెక్టును పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూ.3 కోట్ల 75 లక్షల నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీధర్గౌడ్, తహశీల్దార్ బిక్షపతి, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు మురళీమోహాన్గౌడ్, నాయకులు విక్రాంత్రెడ్డి, వాసురెడ్డి, ఇమామ్, శ్రీరాంగౌడ్, తదితరులున్నారు. రైతుల కోసం గోదాముల నిర్మాణం లింగంపేట(ఎల్లారెడ్డి): రైతులు కష్టపడి పండించిన ధాన్యం కాపాడుకోవడానికి గోదాముల నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మదన్మోహన్రావు వెల్లడించారు. మంగళవారం ఆయన లింగంపేట మండల కేంద్రంతో పాటు శెట్పల్లిసంగారెడ్డిలో గోదాములు, అయ్యపల్లిలో గ్రామ పంచాయతీ భవనం, శెట్పల్లిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలకు రైతులు నష్టపోకుండా ఉండడానికి ధాన్యం గోదాముల్లో నిల్వ ఉంచవచ్చన్నారు. అలాగే రైతుల కోసం మొక్కజొన్న, జొన్న కొనుగోలు ఏర్పాటు చేయడానికి కృషి చేసినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సాయిరాంయాదవ్, సర్పంచ్ కౌడ రవీందర్, ఉపసర్పంచ్ ప్రసాద్గౌడ్, నారాగౌడ్, జొన్నల రాజు, అశోక్, బైరయ్య, సర్పంచులు సక్రూనాయక్, ఏగొండ, సింగిల్ విండో చైర్మన్ దేవెందర్రెడ్డి పాల్గొన్నారు. -
పరిశుభ్రత పాటించకపోతే కఠిన చర్యలు
కామారెడ్డి క్రైం: వర్షాకాలంలో పరిశుభ్రత పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఆహార భద్రత జిల్లా అధికారి విక్రమ్ హెచ్చరించారు. వర్షాకాలంలో వాహక జనిత అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కామారెడ్డిలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న పలు హోటళ్లు, రెస్టారెంట్లను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీల సందర్భంగా కొన్ని ఆహార వ్యాపార సంస్థల్లో మూతలు లేకుండా ఆహార పదార్థాలను నిల్వ చేయడం, అపరిశుభ్రమైన వాతావరణంలో వంటశాలలు నిర్వహించడం, ఆహార తయారీ సిబ్బందికి ఆరోగ్య ధ్రువపత్రాలు లేకపోవడం, గ్లౌజులు, హెడ్ క్యాప్లు ధరించకపోవడం లాంటి అనేక లోపాలు గుర్తించారు. వెంటనే లోపాలను సరిదిద్దాలని సంబంధిత యాజమాన్యాలకు సూచించారు. -
జిల్లాలో ఎరువుల కొరత లేదు
● ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొడతాం ● ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు మదన్మోహన్రావు, లక్ష్మీకాంతారావు కామారెడ్డి టౌన్ : జిల్లాలో ఎరువుల కొరత లేదని ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు మదన్మోహన్రావు, లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఎరువుల సరఫరా, యూరియా అందుబాటు విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టిందన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి కామారెడ్డి జిల్లా కేంద్రంలో సొంత కార్యాలయం లేకపోవడం లోటుగా ఉండేదని, ఆ లోటును భర్తీ చేసేందుకు డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ తీసుకున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. సమావేశంలో పీపీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
● ఎంప్లాయీస్ యూనియన్ రీజినల్ మహాసభ డిమాండ్కామారెడ్డి అర్బన్ : ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాబు, ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న డిమాండ్ చేశారు. ఎంప్లాయీస్ యూనియన్ రీజినల్ మహాసభ మంగళవారం కామారెడ్డి రోటరీ ఆడిటోరియంలో నిర్వహించగా ఉమ్మడి జిల్లాలోని ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, కామారెడ్డి డిపోలకు చెందిన 200 మంది కార్మికులు పాల్గొన్నారు.కామారెడ్డి కొత్త బ స్టాండ్ నుంచి రోటరీ ఆడిటోరియం వరకు ర్యాలీ ని ర్వహించారు. యూనియన్ నాయకులు కామ్రేడ్ అ హ్మద్, వీఎల్ నర్సింహారెడ్డిల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అమరులైన కార్మికులకు మౌనంపాటించి సంతాపం తెలిపారు. విశిష్ట అతిథిగా హాజరైన యూనియన్ మాజీ ప్ర ధాన కార్యదర్శి పద్మాకర్ మాట్లాడుతూ.. కార్మి కులు ఐక్యంగా ఉంటనే ప్రభుత్వం దిగి వస్తుందన్నారు. చనిపోయిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత అంశాలపై వక్తలు మాట్లాడారు. నాయకులు వెంకటిగౌడ్, ప్రసాద్రెడ్డి, వీడీ దాస్, సంజీవ్, రమేష్, రాజు, లింగం, చందర్, మల్లయ్య, నాగరాజు, లింబాద్రి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
మొహర్రాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి
కామారెడ్డి క్రైం: మొహర్రం మాసంను ప్రశాంతంగా జరుపుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. మైనార్టీ మతపెద్దలతో కలిసి కలెక్టరేట్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మొహర్రం మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. వీధి దీపాల మరమ్మతులు, తాగునీటి వసతులు, పారిశుధ్య నిర్వహణ, నిరంతర విద్యుత్ సరఫరా, మెడికల్ క్యాంప్లను ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ప్రజలు కలెక్టరేట్లోని కంట్రోల్ రూం (85558 05866)నకు ఫోన్ చేయాలని సూచించారు. కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, ముస్లిం సంఘాల ప్రతినిధులు, తదతరులున్నారు. -
తాడ్వాయిలో తీవ్ర ఉద్రిక్తత
● యూరియా యాప్ ఎత్తేయాలంటూ ఆందోళనకు బీఆర్ఎస్ పిలుపు ● ధర్నాను అడ్డుకున్న పోలీసులు ● ఎక్కడికక్కడ నేతల అరెస్ట్తాడ్వాయి: యూరియా యాప్ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు మండలకేంద్రంలో చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు ఎల్లారెడ్డి–కామారెడ్డి రోడ్డుపై పెద్దసంఖ్యలో బలగాలను మొహరించారు. ప్రతివాహనాన్ని క్షుణంగా తనిఖీ చేస్తూ పంపించారు. ముందస్తుగానే ముఖ్య నేతలను అరెస్ట్ చేశారు. ఎల్లారెడ్డి–కామారెడ్డి ప్రధాన రహదారిలో ఉన్న కృష్ణాజీవాడి, దేవాయిపల్లి, తాడ్వాయి, ఎర్రాపహాడ్లతో పాటు రోడ్డుకిరువైపులా ఉన్న దేమికలాన్, చందాపూర్, చిట్యాల, సంగోజీవాడి, సంతాయిపేట్, ఎండ్రియాల్, నందివాడ గ్రామాలలోనూ పోలీసులు పహారా కాశారు. అరెస్ట్ చేసినవారిని దోమకొండ, గాంధారి, కామారెడ్డి, బాన్సువాడ, బీర్కూర్, సదాశివనగర్, నాగిరెడ్డిపేట్ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే.. పోలీసులు ధర్నాను అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఒక్కసారిగా ప్రధాన రహదారిపైకి వచ్చి నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు సురేందర్ను అరెస్టు చేశారు. తాడ్వాయి సింగిల్ విండో చైర్మన్ కపిల్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముదాం నర్సింలు పెట్రోల్ డబ్బాలతో పాత బస్టాండ్ వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. వారి వద్దనున్న పెట్రోల్ డబ్బాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, వారిని అరెస్ట్ చేశారు. -
బాలల హక్కులపై అవగాహన అవసరం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి) : ప్రతి విద్యార్థి బాలలహ క్కులపై అవగాహన కలిగి ఉండాలని మండలంలో ని వదల్పర్తి సర్పంచ్ లక్ష్మి సూచించారు. వదల్పర్తి ప్రాథమికోన్నత పాఠశాలలో మంగళవారం బాలలగ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాఠశాలలలో అదనపు తరగతి గ దులు, బాలురకు మూత్రశాలలు, ప్రహరీ నిర్మా ణాలు చేపట్టాలన్నారు. దీంతోపాటు విద్యార్థుల సౌ కర్యార్థం పాఠశాలలో వాటర్ ఫ్యూరిఫైర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. పాఠశాలలో ఏమైనా ఇబ్బందులు కలిగితే విద్యార్థులు వెంటనే ఉపాధ్యాయులకు తెలియజేయాలన్నారు. సమావేశంలో పాఠశాల హెచ్ఎం రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు. నస్రుల్లాబాద్: హలో ఉప సర్పంచ్..చలో హైదరాబాద్ పేరుతో పోస్టర్ను మంగళవారం ఉప సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కర్నం భాస్కర్ నస్రుల్లాబాద్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప సర్పంచ్లకు వేతనం రూ.5 వేలు, వార్డు మెంబర్లకు రూ.3 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉప సర్పంచ్ల చెక్ పవర్ రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. సర్పంచ్లతో పాటు కల్పించాలన్నారు. ఈ నెల 25న హైదరా బాద్లో జరిగే ధర్నాకు మండల ఉప సర్పంచ్లు హాజరై విజయవంతం చేయాలన్నారు. బాన్సువాడ ఉప సర్పంచ్ల ఇన్చార్జి సంజీవ్, ఉప సర్పంచ్లు చౌదరి, రామ్మోహన్ నాయకులు శివదయాల్, కాశీరాం పాల్గొన్నారు. మద్నూర్(జుక్కల్): ప్రతి అంగన్వాడీ కేంద్రంలో విద్యుత్ సదుపాయం ఉండాలని, లైన్మన్లను సంప్రదించి మీటర్లు తీసుకోవాలని అధికారులు అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో మంగళవారం మద్నూర్ ఐసీడీఎస్ పరిధిలోని మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, పెద్ద కొడప్గల్ మండలాల అంగన్వాడీ కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏ ర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోషణ్ అభియాన్ బ్యాంక్ కో– ఆర్డినేటర్ బాలక్రిష్ణ, సూపర్వైజర్లు దేవకరణ, నసీమాలు పలు సూచనలు అందించారు. అమ్మమాట అంగన్వాడి బాట కార్యక్రమాల ద్వారా పిల్లల నమోదు పెంచాలని సూచించారు. గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని చద్మల్ తండా అటవీప్రాంతంలో ఓ వ్యక్తి మృతిచెందినట్లు తండావాసులు తెలిపారు. తండాకు చెందిన బస్సీ గిరి (45) ఇటీవల ఇంటి నుంచి బయటకు వెళ్లి, తిరిగి రాలేదు. సమీపంలోని అటవీ ప్రాంతంలో సోమవారం గిరి మృతదేహాన్ని తండావాసులు గుర్తించి, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అతడి మృతదేహానికి కొద్ది దూరంలో కొన్నిరోజుల క్రితం చనిపోయిన కొండచిలువ కళేబరం ఉండడంతో కొండచిలువ కాటేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. గిరి మృతదేహాన్ని సోమవారమే తండాకు తీసుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అంత్యక్రియలు చేసినట్లు తెలిసింది. ఈ విషయమై ఎస్సై మహేష్ను సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు. మాచారెడ్డి: మండలంలోని గజ్యానాయక్ తండా గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారులకు మంగళవారం గ్రామ సర్పంచ్ రావుల వినోద గడియారాలను పంపిణీ చేశారు. పంచాయతీ కార్యదర్శి దర్శన్, ఉపసర్పంచ్ భిక్షపతి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు. -
తప్పిపోయిన వ్యక్తి.. శవమై కనిపించాడు
ఎల్లారెడ్డిరూరల్: ఇటీవల తప్పిపోయిన ఓ వ్యక్తి కుళ్లిన స్థితిలో శవమై కనిపించాడు. ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా.. బాన్సువాడకు చెందిన బంగారు శంకర్(48) మూడు రోజుల క్రితం అన్నాసాగర్ గ్రామంలో పని నిమిత్తం వచ్చాడు. తిరిగి అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మారెడ్డి శివారులో మంగళవారం ఉదయం కుళ్లిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, మృతుడు బంగారు శంకర్గా గుర్తించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించగా వారు వచ్చి మృతుడిని శంకర్గా గుర్తించారు. మృతుడు మద్యం మత్తులో పడిపోయి మృతిచెందినట్లు సమాచారం. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సిలిండర్ పేలి గుడిసెలు దగ్ధం ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని సాతెల్లిలో మంగళవారం ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి పలువురి గుడిసెలు దగ్ధమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారి వినోద్ తెలిపారు. సాతెల్లికి చెందిన కల్లేటి మైసయ్య ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలడంతో మైసయ్య గుడిసెతోపాటు, పక్కన ఉన్న కుంట్ల అంజయ్యకు చెందిన గుడిసె, గడ్డివాము దగ్ధమైనట్లు వారు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనస్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో సుమారు రూ.లక్ష వరకు ఆస్తినష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. -
నృత్యప్రదర్శనకు వెళ్తూ.. అనంతలోకాలకు..
● రోడ్డు ప్రమాదంలో డ్యాన్స్మాస్టర్ మృతి ● నిజామాబాద్ రూరల్ మండలం గాంధీనగర్లో ఘటన బాన్సువాడ: నృత్య ప్రదర్శన ఇవ్వడానికి వెళ్లిన ఓ డ్యాన్సర్ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. బాన్సువాడలోని శాంతినగర్ కాలనీకి చెందిన అన్నం అనిల్(34) డ్యాన్స్ మాస్టార్గా జీవనం సాగిస్తున్నాడు. నిజామాబాద్లో తన డ్యాన్స్ ప్రదర్శన ఇవ్వడానికి మంగళవారం ఉదయం బాన్సువాడ నుంచి బైక్పై బయలుదేరాడు. నిజామాబాద్ రూరల్ మండలం గాంధీనగర్ వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో అనిల్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాన్సువాడలో విషాదఛాయలు.. అనిల్ స్వగ్రామం బోర్లం కాగా, సుమారు 20 ఏళ్ల క్రితం బాన్సువాడకి వచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. ఆరేళ్ల క్రితం బోధన్ మండలం ఎరాజ్పల్లికి చెందిన సిరిని పెళ్లి చేసుకున్నాడు. అనిల్కు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పట్టణంలోనే నటరాజ్ నాట్య మండలిని ఏర్పాటు చేసి చిన్నారులతోపాటు, యువతీయువకులకు డ్యాన్స్లో శిక్షణ ఇచ్చారు. బాన్సువాడ, నిజామాబాద్తోపాటు రాష్ట్రస్థాయిలో ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు. తన డ్యాన్స్తో అందరి మన్ననలు పొందిన అనిల్ మృతి కళారంగాన్ని తీవ్ర విషాదంలో ముంచింది. బాన్సువాడలోని కుటుంబసభ్యులతోపాటు అభిమానులు, స్నేహితులు అతడి మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు. అంత్యక్రియలకు వందలాది మంది బంధువులు, అభిమానులు, యువకులు, కళాకారులు హాజరయ్యారు. -
మామూళ్ల మల్లారెడ్డి
నిజామాబాద్ అర్బన్: ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం తెల్ల వారుజాము నుంచే నగరంలోని ప్రగతినగర్లో ఉన్న ఆయన ఇంట్లో, ఎకై ్సజ్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్లోని ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు. ప్రగతినగర్లోని ఇంట్లో రూ.3.31 లక్షలు, బ్యాంకులో రూ.50 లక్షలు జప్తు చేశారు. వివిధ ప్రాంతాల్లో నాలుగు ఇళ్లు, ఒక కమర్షియ ల్ భవనం, ఎనిమిది ఖాళీ స్థలాలు, 10.23 ఎకరాల వ్యవసాయ భూమి ని గుర్తించారు. మూడు లాకర్లను తెరిస్తే మరిన్ని ఆస్తులు, నగదు బయట పడే అవకాశం ఉంది. ఏసీబీ అధికారులు మల్లారెడ్డిని అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. మూడున్నరేళ్లుగా జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పని చేస్తున్న మల్లారెడ్డి నెలనెలా మా మూళ్లు వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నట్లు ఏసీబీ గుర్తించింది. వైన్షాపులు, బార్లు, కల్లు డిపోలకు ఇవ్వాల్సిన మామూళ్లను ఫిక్స్ చేశారనే ఆరోపణలున్నాయి. వారికే కాదు.. ఈయనకూ ‘గుడ్విల్’ నూతన వైన్షాపులు కేటాయించిన సమయంలో లక్కీడ్రాలో షాపులు దక్కించుకున్న వారు ‘గుడ్విల్’ తీసుకుని ఇతరులకు అప్పగించారు. ఈ వ్యవహారంలో ఒక్కో షాపు నుంచి ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రూ.2 లక్షల వరకు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్ట్షాపుల నుంచీ కిందిస్థాయి సిబ్బంది ద్వారా నెలవారి మామూ ళ్లు అందేవి. కోటాకు మించి విక్రయాలు సాగిస్తున్న వైన్షాపుల నుంచి నెలవారి మామూళ్లతో సంబంధం లేకుండా రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు అదనంగా వసూలు చేసేవారనే ఆరోపణలున్నాయి. కల్లు డిపోల నిర్వహణకు సంబంఽధించి ప్రతి సొసైటీ నుంచి రూ.25 వేల చొప్పున ఎస్ఈ నెలనెలా వసూలు చేశారని, ఇటీవల ఓ డిపో వ్యవహారంలో వివాదాలు తారాస్థాయికి చేరగా, విచారణ పేరుతో ఓ వర్గానికి లబ్ధి చేకూర్చి రూ.3 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. నిందితులను వదిలేస్తూ.. జిల్లాలో భీమ్గల్, మోర్తాడ్, ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ ఎకై ్సజ్ శాఖ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో ఎస్హెచ్వోలు కొనసాగుతున్నా రు. జిల్లా టాస్క్ఫోర్స్ బృందం ఏర్పాటు చేశారు. అయితే జిల్లా అధికారులకు నెలవారి మామూళ్లు అందించడం, తప్పుచేసిన వారిని తప్పించేందుకు జిల్లా అధికారులకు భారీగా డబ్బులు సమర్పించడంలో కిందిస్థాయి సిబ్బంది ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. కల్లు డిపోల్లో నిషేధిత మత్తుపదార్థాలు లభించినప్పడల్లా కేసు లు నమోదు చేయకుండా వదిలేసిన ఘటనలు ఉన్నాయి. ఈ వ్యవహారాల్లో భారీ ఎత్తున డబ్బులు తీసుకొని నిందితులను వదిలేశారు. రెంజల్ మండలంలోని మూడు నెలల క్రితం చోటు చేసుకున్న ఘటన పరిస్థితికి అద్దం పడుతోంది.ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు మంగళవారం తెల్లవారు జామునే చేరుకున్న అధికారులు వైన్షాపులు, బార్లు, కల్లు డిపోల నుంచి నెలవారీ మామూళ్లు -
యూరియాపై ఆందోళన వద్దు
మాచారెడ్డి : యూరియా కోసం రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మాచారెడ్డి మండలంలోని ఎల్లంపేట రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని విత్తన మేళాను ప్రారంభించారు. పాల్వంచ మండలం ఎల్పుగొండలో యూరియా నిల్వ కేంద్రాన్ని పరిశీలించారు. ఆయా కార్యక్రమాలలో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలన్నారు. జిల్లాలో సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని పేర్కొన్నారు. యాప్లో బుక్ చేసిన అనంతరం రెండు రోజుల వరకు ఎరువుల బస్తాలను పొందే అవకాశం ఉంటుందన్నారు. రైతులు ఆదాయాన్ని పెంపొందించుకునేందుకు ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మట్టిలో తగిన తేమ ఏర్పడిన తర్వాతే విత్తనాలు వేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. తొందరపడి విత్తనాలు చల్లకుండా, పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలు, స్వల్పకాలిక పంట రకాలను ఎంపిక చేసుకోవాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి మోహన్, ఏడీఏ అపర్ణ, తహసీల్దార్ సరళాబాయి, ఎంపీడీవో గోపీబాబు, మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్, ఏఈవో రవి, వివిధ గ్రామ సర్పంచులు తదితరులు ఉన్నారు. -
బీర్కూర్లో రాస్తారోకో..
మాజీ ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్ బిచ్కుంద: తాడ్వాయిలో మంగళవారం బీఆర్ఎస్ చేస్తున్న ధర్నాకు వెళ్లకుండా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధేను బిచ్కుందలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. బయటకు వెళ్లకుండా ఇంటిలోపలే ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా హన్మంత్ సింధే మాట్లాడుతూ కాంగ్రెస్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. రైతుల పక్షాన పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ప్రభుత్వం అరెస్టు చేయించడం బాధాకరమన్నారు. ఎన్ని నిర్బంధాలు విధించినా పోరాటం ఆపబోమన్నారు. బీర్కూర్ పోలీస్ స్టేషన్కు తరలింపు బాన్సువాడ : తాడ్వాయిలో అరైస్టెన మాజీ ఎమ్మెల్యే సురేందర్ను మంగళవారం పోలీసులు బీర్కూర్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. బాన్సువాడలోనూ బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారు. అరైస్టెన వారిలో జుబేర్, సాయిబాబా, అంజిరెడ్డి, అక్బర్, బలరాంనాయక్, ఫారూఖ్ ఉన్నారు. హైదరాబాద్లో మాజీ మంత్రి.. తాడ్వాయికి రాకుండా మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డిని హైదరాబాద్లోని ఆయన నివాసంలో బంజారాహిల్స్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.బాన్సువాడ : ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం బీర్కూర్ పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ కార్యకర్తలు రాస్తారోకో చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
క్రీడల ఆవశ్యకతపై అవగాహన ర్యాలీ
కామారెడ్డి టౌన్ : అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ఆర్కే విద్యా సంస్థల ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్రీడల ప్రాముఖ్యత, శారీరక దృఢత్వంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా ఆర్కే విద్యా సంస్థల సీఈవో, ఒలింపిక్ రన్ చైర్మన్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నేటి యువత చెడు అలవాట్ల బారిన పడకుండా ఉండటానికి ఆటలు, వ్యాయామం ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. చదువుతో పాటు క్రీడల వల్ల మానసిక ఉల్లాసం, నిరంతర ఉత్సాహం లభిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ నిత్యజీవితంలో శారీరక శ్రమకు కొంత సమయం కేటాయించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఒలింపిక్ కమిటీ సభ్యుడు సందీప్ గౌడ్, ప్రతినిధులు దత్తాత్రి, నవీన్, నరేశ్, శివ, తదితరులు పాల్గొన్నారు. -
బదిలీ అయిన న్యాయమూర్తికి వీడ్కోలు
కామారెడ్డి టౌన్ : బదిలీ అయిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీహెచ్ వీఆర్ఆర్ వరప్రసాద్కు మంగళవారం కామారెడ్డి జుడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన హైదరాబాద్ వక్ఫ్ బోర్డు చైర్మన్గా వెళ్తున్న విషయం తెలిసిందే. జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ఆయన అందించిన సేవలను సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ సుమలత, జూనియర్ సివిల్ జడ్జి సుధాకర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి దీక్ష, ఎల్లారెడ్డి జూనియర్ సివిల్ జడ్జి సుష్మ, బిచ్కుంద జూనియర్ సివిల్ జడ్జి వినీల్ కుమార్ తదితరులు ప్రశంసించారు. కార్యక్రమంలో జిల్లా కోర్టు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రామ్చంద్రరావు, జిల్లా జుడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు భుజంగరావు, సీనియర్ సూపరింటెండెంట్ వెంకట్రెడ్డి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూపరింటెండెంట్ వి.చంద్రసేన్రెడ్డి, కోర్టు సిబ్బంది సయ్యద్ రషీద్ అలీ, కరుణ, మమత, సంధ్య, శిల్ప, రజిత, సాయికృష్ణ, న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. -
అపోహల బ్రేకులు
ఆరోగ్య కవచానికిఅర్హత వయసున్న ప్రతి బాలిక హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇది సర్వైకల్ క్యాన్సర్ రాకుండా చూస్తుంది. టీకా పూర్తి సురక్షితమైనది. తల్లిదండ్రులు వదంతులు నమ్మవద్దు. పిల్లలకు దగ్గరుండి టీకాలను ఇప్పించాలి. వ్యాక్సిన్పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. లక్ష్యం చేరుకోవడానికి కృషి చేస్తాం. – వెంకటి, డీఎంహెచ్వో, కామారెడ్డిప్రాణాంతక క్యాన్సర్లనుంచి రక్షణ కల్పించే టీకా విషయంలో ప్రచారం కరువయ్యింది. ఈ వ్యాక్సిన్పై ప్రజలకు సరైన అవగాహన లేదు. దీంతో వారు టీకా వేయిస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్న అపోహల్లో ఉన్నారు. ఈ విషయంలో ప్రజల సందేహాలను తీర్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ సరైన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. -
వైకుంఠధామం అభివృద్ధికి మరో అడుగు
● హౌసింగ్ బోర్డు శ్మశానవాటికలో సర్వే ● ‘మహాప్రస్థానం’లా తీర్చిదిద్దుతామంటున్న ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులుకామారెడ్డి టౌన్ : పట్టణంలోని హౌసింగ్ బోర్డులోగల హిందూ శ్మశాన వాటికను ’మహాప్రస్థానం’ తరహాలో అభివృద్ధి చేసేందుకు మరో అడుగు పడింది. ‘ఎస్ఆర్ ఫౌండేషన్’ ప్రతినిధులు సోమవారం క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టారు. వైకుంఠధామంలో సరైన సౌకర్యాలు లేక అంతిమ సంస్కారాలు చేసేందుకు పడుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ దినపత్రిక ఏప్రిల్ 20న ‘అంతిమ కష్టం’ శీర్షికన కథనాన్ని ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై బీబీపేట మండలం జనగామకు చెందిన ఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి స్పందించి శ్మశానవాటికను అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చారు. ఆయనకు ఇటీవల మున్సిపాలిటీ పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం ఫౌండేషన్ ప్రతినిధులు శ్మశాన వాటికలో అందుబాటులో ఉన్న స్థలం, ప్రభుత్వ భూమి వివరాలను సర్వే చేయించారు. రూ. 4 కోట్లతో జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలా తీర్చిదిద్దుతామని, ఇక్కడ చేపట్టే పూర్తి స్థాయి ఆధునికీకరణ పనుల కోసం ప్రత్యేక డిజైన్ రూపొందిస్తున్నామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సర్వేలో ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు వెంకట్గౌడ్, మట్ల శ్రీనివాస్, రవీందర్రెడ్డి, రాజాగౌడ్, అశోక్గౌడ్, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నియామకం
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండల కేంద్రానికి చెందిన పోతగోని ప్రసాద్గౌడ్ ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయి ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా సోమవారం ఎన్నికయ్యా రు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని అమృత ఫంక్షన్ హాల్లో జిల్లా ఉపసర్పంచుల సమావేశం నిర్వహించారు. ప్రసాద్గౌడ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. నియోజకవర్గ స్థాయిలో ఉపసర్పంచుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడు కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు కమలాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. భిక్కనూరు: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు సోమవారం పరామర్శించారు. ఇటీవల ఆయ న మోకాళ్ల శస్త్రచికిత్సలు చేయించుకుని తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న నాయకులు ఆయన ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయనను పరామర్శించిన వారిలో మాజీ ఎంపీపీ సుదర్శన్, కాచాపూర్ ఉప సర్పంచ్ దశరథం, జంగంపల్లి సొసైటీ అధ్యక్షుడు సిద్ధిరాములు, నాయకులు యాదయ్య, అమృత, సత్యం, సంతోష్ గౌడ్ తదితరులున్నారు. భిక్కనూరు: ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి అన్నారు. మండలంలోని రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన గొల్లపల్లి వినోద్ కుమార్ గౌడ్ ఇటీవల మండల ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా నియమితులయ్యారు. ఆయనను చంద్రకాంత్ రెడ్డి శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎంతో నమ్మకంతో ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి సేవలు చేయాలని చెప్పారు. నాయకులు రాజు, శశి కుమార్ పంచాయతీ కార్యదర్శి శ్యామ్ ఉన్నారు. మాచారెడ్డి: ఘన్పూర్లో సోమవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి స్పందన లభించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని ఆస్పత్రి వైద్యుడు అభినయ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 226 మందికి పరీక్షలు నిర్వహించి 26 మందిని మోతి బిందు ఆపరేషన్ కోసం సిఫారసు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అభినయ్ మాట్లాడుతూ.. మోతి బిందు ఆపరేషన్ అయిన వారికి మందులతో పాటు కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. సర్పంచ్ ప్రశాంత్ గౌడ్, ఉపసర్పంచ్ స్వామి యాదవ్, పంచాయతీ కార్యదర్శి చైతన్య, వార్డు సభ్యులు మహేష్, ప్రవీణ్, నరేష్, సతీష్ సురేష్ పాల్గొన్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): పేదలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని ఆ పార్టీ మండలాధ్యక్షుడు నల్ల మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం కుప్రియాల్లో కాంగ్రెస్ గ్రామ కమిటీ నూతన అధ్యక్షుడు గడ్డం భూపతి రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ వైస్ ఎంపీపీ గాదారి శ్రీనివాస్ రెడ్డి, సేవాదళ్ మాజీ అధ్యక్షుడు లింగాగౌడ్, ఉప సర్పంచ్ అన్వేష్ గౌడ్, చైర్మన్ గంగాధర్ పాల్గొన్నారు. -
కో–ఆప్షన్కు మోక్షం ఎప్పుడో?
● గ్రామ పంచాయతీల్లో ముగ్గురికి అవకాశం ● ఎదురుచూస్తున్న ఆశావహులుకమ్మర్పల్లి : గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరి గి ఆరు నెలలు గడుస్తున్నా కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఊసే లేకుండా పోయింది. ఫలితంగా గ్రా మ పంచాయతీల్లో సలహాలు, సూచనలు ఇచ్చే వా రు లేక పాలకవర్గాలు నిధుల వినియోగం విషయంలో ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019లో జరిగిన గ్రా మ పంచాయతీ ఎన్నికల అనంతరం పాలకవర్గాల కు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అప్పటి ప్ర భుత్వం గ్రామ పంచాయతీల్లో కోఆప్షన్ సభ్యుల ఎ న్నిక విధానం ప్రవేశపెట్టింది. కానీ, ప్రస్తుత ప్రభు త్వ హయాంలో పంచాయతీల్లో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక జాడే లేకుండా పోయింది. పంచాయతీరాజ్–2018 చట్టం ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీ లో ముగ్గురు చొప్పున కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాలి. వారికి వార్డు సభ్యులతో సమాన హోదా ఉంటుంది. పాలకవర్గం కొలువుదీరిన 60 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటి వ రకు కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరగలేదు. జిల్లాలో 31 మండలాల పరిధిలో 545 గ్రామ పంచాయతీ లు ఉన్నాయి. హోదా, అధికారం, బాధ్యతలు.. కో–ఆప్షన్ సభ్యులుగా ఎన్నికై న వారు పంచాయతీ పాలకవర్గ సమావేశాల్లో పాల్గొని వివిధ అంశాలపై సలహాలు, సూచనలు ఇచ్చే హక్కు ఉంటుంది. వీరికి వార్డు సభ్యులతో సమానమైన ప్రొటోకాల్, హోదా, గౌరవం దక్కుతుంది. సమావేశాల్లో చర్చించే అవకాశం ఉన్నప్పటికీ, తీర్మానాల ఆమోదంలో మాత్రం ఓటు హక్కు ఉండదు. కేవలం పంచాయతీకి సలహాదారులుగా మాత్రమే వ్యవ హరించాల్సి ఉంటుంది. పంచాయతీ నిధుల వినియోగం, అభివృద్ధికి సంబంధించిన ప్రణాళిక రూపకల్పనలో కోఆప్షన్ సభ్యుల పాత్ర కీలకం అవుతుంది. సర్పంచ్, వార్డు సభ్యులు సమావేశమై గ్రామానికి చెందిన ముగ్గురిని కో–ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకుంటారు. ఇందులో ఒకరు పదవీ విరమణ చేసిన ఉద్యోగి లేదా అనుభవం ఉన్న సీనియర్ సిటిజన్, మరొకరు గ్రామ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి లేదా గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు, ఇంకొకరు పంచాయతీలకు స్థలాలు ఇచ్చిన దాతలు లేదా భారీగా విరాళాలు ఇచ్చిన దాతలు, గ్రామాభివృద్ధికి దోహదపడే ప్రవాస భారతీయులను నియమించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీల్లో కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. స్పష్టమైన ఆదేశాలు రాగానే అందుకనుగుణంగా గ్రామ పంచాయతీల్లో కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక చేపడతాం. – శ్రీనివాసరావు, డీపీవో, నిజామాబాద్ -
స్వచ్ఛంద సంస్థల సహకారంతో శ్మశానవాటికల అభివృద్ధి
● టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి టౌన్: మున్సిపల్ పరిధిలోని రెండు హిందూ శ్మశానవాటికలను స్వచ్ఛంద సంస్థల సహకారంతో అభివృద్ధి చేయనున్నట్లు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. సోమ వారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. హౌసింగ్ బోర్డు ప్రాంతంలోని హిందూ శ్మశానవాటిక అభివృద్ధి కోసం ఎస్ఆర్ ఫౌండేషన్ ముందుకు వచ్చిందని, ఇందుకు మున్సిపాలిటీ నుంచి పూర్తి అనుమతులు లభించాయన్నారు. సోమవారం నుంచి ఫౌండేషన్ ప్రతినిధులు స్థల పరిశీలన ప్రారంభించారని, గదుల నిర్మాణంతో పాటు పూర్తి స్థాయి అభివృద్ధికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఇందిరానగర్ శ్మశానవాటిక అభివృద్ధికి మరో రెండు స్వచ్ఛంద సంస్థలు అంగీకరించాయని తెలిపారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటాం.. కామారెడ్డి కాంగ్రెస్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సూచించిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటామని చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయాల మేరకే ఉమ్మడిగా ముందుకెళ్తామన్నారు. పార్టీ ఉపాధ్యక్షులు నిమ్మ విజయకుమార్ రెడ్డి, సబ్బని హరికృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్లు గడ్డమీది మహేష్, కాంగ్రెస్ నాయకులు ప్రసాద్, సలీం, రంగ రమేష్ గౌడ్, పిడుగు సాయిబాబా, శంకర్రావు, జమీల్, రవీందర్, రమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
చిన్న నిర్లక్ష్యం.. ప్రాణాలు తీసింది
బోధన్ రూరల్ : చిన్నపాటి విద్యుత్ నిర్లక్ష్యం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. బ ట్టలు ఆరేసుకునేందుకు కట్టిన ఇనుప తీగకు విద్యుత్ సరఫరా కావడంతో దంపతులు ప్రాణా లు కోల్పోయిన ఘటన ఊట్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రత్నావత్ సంజీవ్ (46) తన కుటుంబంతో కలిసి వ్యవసాయం, పాడి ఆధారంగా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్ద రు భార్యలు. పెద్ద భార్య జ్యోతి (44), చిన్న భార్య తిరుమల (35) ఉన్నారు. జ్యోతికి ముగ్గురు కూతు ళ్లు గోదావరి, శ్వేత, సంధ్యారాణి ఉన్నారు. రెండో భార్యకు కూతురు, కొడుకు సంతానం ఉన్నారు. కుటుంబ అవసరా ల కోసం ఇంటి ముందు ఖాళీ స్థలంలో గేదెల కోసం రేకుల షెడ్ నిర్మించి అందులో ఫ్యాన్లు ఏ ర్పాటు చేశారు. అదే షెడ్డుకు బట్టలు ఆరేసుకోవడానికి జీఏ వైరు కట్టి దానిపై ప్రతిరోజూ బట్టలు ఆరేసుకునేవారు. ఎప్పటిలాగే ఆదివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో చిన్న భార్య తిరుమల వైరు మీద ఉన్న బట్టలు తీస్తుండగా స్వల్పంగా కరెంట్ షాక్ తగిలింది. వెంటనే ఈ విషయాన్ని భర్త సంజీవ్కు చెప్పింది. దీంతో సంజీవ్ వైరు దగ్గరకు వెళ్లి చూడగా, ప్రమాదవశాత్తు అతడికి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. సమీపంలో ఉన్న పెద్ద భార్య జ్యోతి భర్తను కాపాడాలనే హడావుడిలో ఆ వైర్ను పట్టుకోవడంతో ఆమెకు కూడా విద్యుత్ షాక్ తగిలింది. క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో భార్యాభర్తలిద్దరూ అక్కడిక్కడే ప్రాణాలొదిలారు. కుటుంబానికి అండగా నిలిచిన తల్లిదండ్రులు ఒక్కసారిగా దూరం కావడంతో పిల్లల రోదనలు అందరినీ కలచివేశాయి. కుమార్తె గోదావరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ విజయ్, ఎస్సై రాజశేఖర్ ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను బోధన్ జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. విద్యుత్ ప్రమాదంపై బోధన్ ట్రాన్స్కో డీఈ ముక్తార్ను ‘సాక్షి’ సంప్రదించగా పోలీస్ కేసు నమోదైన నేపథ్యంలో బాధిత కుటుంబానికి పరిహారం కోసం ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ఆయన తెలిపారు. బట్టలు ఆరేసిన తీగే బలితీసుకుంది విద్యుత్ షాక్తో భార్యాభర్తల మృతి క్షణంలో కుటుంబం చిన్నాభిన్నం.. బోధన్ మండలం ఊట్పల్లిలో ఘటన గ్రామంలో విషాదఛాయలు -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని మల్లుపేట్ గ్రామ స్టేజీ వద్ద 44వ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కి నిజామాబాద్ వైపు వస్తున్న మరో కారును డీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక కారులోని భార్యాభర్తలు, మరో కారులోని ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. ఎల్లమ్మ ఆలయంలో చోరీ సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఎల్లమ్మ ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. గర్భగుడి తాళాలు పగులగొట్టి అమ్మవారి మెడలో ఉన్న బంగారు వస్తువులను అపహరించుకుపోయారు. హుండీని గడ్డపారతో పెకిలించి అందులోని డబ్బులను దోచుకెళ్లారు. హుండీని, పగుల గొట్టిన తాళాలను ఆమడ దూరంలో పడేశారు. ఈ విషయమై గౌడ సంఘం ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. -
యూరియా కోసం ఆత్మహత్యాయత్నం
భిక్కనూరు : రాజంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద సోమవారం రైతులు యూరియా కోసం ఆందోళన చేపట్టారు. యాప్ ద్వారా బుక్ చేసుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు. యాప్తో సంబంధం లేకుండా ఎకరానికి రెండు బస్తాల యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అయితే, రాజంపేట గ్రామానికి చెందిన ఓ రైతు యూరియా కోసం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. సొసైటీ సిబ్బంది, పోలీసులు ఆ రైతు వద్దనున్న పెట్రోల్ బాటిల్ స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ జానకీ, ఏడీఏ అపర్ణ, ఏవో జ్యోత్స్న సొసైటీ వద్దకు చేరుకొని రైతులను సముదాయించారు. ఏవో జ్యోత్స్న మాట్లాడుతూ సొసైటీ పరిధిలో 60 టన్నుల యూరియా అందుబాటులో ఉందని, మంగళవారం రైతులకు పంపిణీ చేస్తామని తెలిపారు. మక్కల డబ్బుల కోసం మరో రైతు.. గాంధారి(ఎల్లారెడ్డి): మక్కల డబ్బులు ఖాతాల్లో జమ కాలేదని మండల కేంద్రానికి చెందిన రైతు చిల్లాల గోపాల్ అనే రైతు సోమవారం స్థానిక సింగిల్ విండో కార్యాలయ సిబ్బందితో గొడవకు దిగా డు. అందరితోపాటు జమ అవుతాయని నచ్చజెప్పి నా వినకుండా హంగామా చేశాడని, బాటిల్లో వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని కార్యాయలంలో కూడా పెట్రోల్ చల్లినట్లు సిబ్బంది తెలిపారు.సమాచారం అందుకున్న ఏఎస్సై ప్రకాశ్ ఘ టనా స్థలానికి చేరుకొని రైతును స్టేషన్కు తీసుకొ చ్చి నచ్చజెప్పారు. కాగా, ఈ విషయమై విండో కార్యదర్శి సాయిలును వివరణ కోరగా కాంటా చేసి మక్కలు మార్క్ గోదాములకు పంపించామని, మార్క్ఫెడ్ అధికారులు జమచేస్తారని తెలిపారు. మార్క్ఫెడ్ డీఎం క్రాంతిని సంప్రదించగా మూడు రోజుల్లో రైతులందరికీ డబ్బులు జమ చేస్తామని చెప్పినట్లు కార్యదర్శి వివరించారు. -
పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
కామారెడ్డి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. సోమవారం అడిషనల్ కలెక్టర్ ఎన్వీ గిరికి అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్రెడ్డి, విజయరామరాజులు వినతి పత్రాలు అందజేశారు. 2024 నుంచి ఉద్యోగ విరమణ చేసిన వారికి అందాల్సిన బెనిఫిట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. హెల్త్కార్డులు అమల్లోకి రాకముందే 1.5 శాతం కోత విధించడం ఎంత వరకు సమంజసమన్నారు. పెన్షనర్ల డబ్బులను ఇతర రంగాలకు మళ్లించడాన్ని నిలిపివేయాలని, సమన్వయకర్త కమిటీ నియమించి పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు జి.లచ్చయ్య, రవీందర్, సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం, రాజలింగయ్య, సత్తయ్య తదితరులు మాట్లాడారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో ఈ నెల 23న యూరియా యాప్ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ముదాం నర్సిములు తెలిపారు. ఆయన సోమవారం తాడ్వాయిలో మాట్లాడారు. కామారెడ్డి –ఎల్లారెడ్డి ప్రధాన రహదారిలో ధర్నా నిర్వహించడమే కాకుండా వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ధర్నాకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్లు ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. సింగిల్ విండో చైర్మన్ కపిల్రెడ్డి, సర్పంచ్ మంగారెడ్డి, ధర్మారెడ్డి, మంగారెడ్డి, ప్రభాకర్రెడ్డి, రాజిరెడ్డి, గోపాల్రావు, రాములు, రాజుగౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్యం అధ్వానం
పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని పెద్ద దేవిసింగ్ తండాలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా తయారైంది. అంతర్గత డ్రైనేజీలు లేకపోవడంతో నెలల తరబడి రోడ్లపైనే మురికి నీరు పారుతు న్నాయి. దీంతో దోమల సంఖ్య గణనీయంగా పె రిగిపోయింది. పారిద్ధ్యానికి సంబంధించిన ఎటువంటి పనులు, దోమల నివారణ చర్యలు చేపట్టడం లేదు. దీంతో నీరు నిలువ ఉండి తండాలో రోడ్లు బురద కంపు కొడుతోంది..దోమల బెడద పెరిగింది. ఇప్పటికై న అధికార యంత్రాంగం దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇందిరమ్మ కాలనీలో.. నస్రుల్లాబాద్: దుర్కి గ్రామంలో గల ఇందిరమ్మ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీంతో మురికి నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. రాబోయేది వర్షాకాలం కావడంతో వ్యాధులు ప్ర బలే అవకాశం ఉంది. వీధులు శుభ్రంగా ఉంచా ల్సిన సిబ్బంది కనీసం కాలనీ వైపు కన్నెత్తి చూడటం లేదు. వీధులన్నీ దుర్వాసన వెదజల్లుతూ కంపు కొడుతున్నాయి. అధికార యంత్రాంగం స్పందించి కాలనీలోని మురికి కాలువలను శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు. -
జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ల ఎన్నిక
కామారెడ్డి టౌన్ : జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా దుంపటి రాజు, కై రా శ్రవణ్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి లక్కిరెడ్డి కమలాకర్రెడ్డి సోమవారం ప్రకటించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల అధ్యక్షులుగా బాలా గౌడ్, పోతగోనె ప్రసాద్ గౌడ్, నాగరాజు, సంజీవ్ కుమార్ ఎన్నికయ్యారన్నారు. 25న చలో హైదరాబాద్.. ఉపసర్పంచ్ల డిమాండ్ల సాధన కోసం ఈనెల 25న ‘హలో ఉప సర్పంచ్ – చలో హైదరాబాద్’ నిర్వహించనున్నట్లు కమలాకర్రెడ్డి తెలిపారు. కార్యక్రమ వాల్ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. మహా ధర్నాను విజయవంతం చేయాలని, పార్టీలకు అతీతంగా ఉప సర్పంచ్లంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం నాయకులు, జిల్లాలోని ఆయా మండలాల ఉప సర్పంచ్లు పాల్గొన్నారు.కామారెడ్డి క్రైం: జిల్లాకేంద్రంలో ఈనెల 25 న నషా ముక్త్ భారత్ ర్యాలీ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 25 ఉదయం 10 గంటలకు కామారెడ్డిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. కళాభారతి ఆడిటోరియం వరకు ర్యాలీ ఉంటుందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.కామారెడ్డి అర్బన్: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ, బీఎస్సీ, బీకాం మొదటి సంవత్సరం ప్రవేశానికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని యూనివర్శిటీ కామారెడ్డి స్టడీ సెంటర్ ప్రిన్సిపల్ విజయ్కుమార్, సమన్వయకర్త సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్తో సమానమైన కోర్సు పాసైన వారందరు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అన్లైన్లో దరఖాస్తు చేసుకుని, సర్టిఫికెట్ల పరిశీలన కోసం కామారెడ్డి స్టడీ సెంటర్లో సంప్రదించాలని సూచించారు. కామారెడ్డి టౌన్ : నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో ఈనెల 27, 28 తేదీలలో ఆరు జిల్లాల ప్రొ కబడ్డీ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ పోటీలను మ్యాట్లపై, డే అండ్ నైట్ పద్ధతిలో నిర్వహించనున్నట్లు జిల్లా సీనియర్ కబడ్డీ క్రీడాకారులు తెలిపారు. టోర్నీలో కామారెడ్డితో పాటు సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, నిర్మల్, మెదక్ జిల్లాల జట్లు పాల్గొంటాయని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లోని నైపుణ్యాలను వెలికితీసేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. కామారెడ్డి టౌన్ : విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పాఠశాలల బంద్కు పిలుపునిచ్చిన ట్లు ఏబీవీపీ నాయకులు తెలిపారు. సోమ వారం జిల్లాకేంద్రంలో బంద్కు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పేరుతో వేలాది సర్కారు బడులను ఎత్తివేసేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. సర్కారు బడులను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో దోపిడీని అరికట్టేందుకు తక్షణమే ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఈపీ –2020ని రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ పట్టణ నాయకులు కౌశిక్, అక్షయ్, స్వస్తిక్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. -
గడ్కోల్లో ఒకరి ఆత్మహత్య
సిరికొండ: మండలంలోని గడ్కోల్ గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. గ్రామానికి చెందిన దొమ్మాటి నితిన్ గౌడ్ (27) అనే యువకుడు కొన్ని రోజులుగా తమకు గ్రామంలో సొంత ఇల్లు లేదని, ఎంబీఏ చదువుకున్నప్పటికీ ఉద్యోగం లభించడం లేదని మానసికంగా బాధపడుతున్నాడు. ఈక్రమంలో సోమవారం ఉదయం లొంక ఆలయానికి వెళ్లి వస్తానని ఇంటి నుంచి బయలుదేరాడు. మార్గ మధ్యలో లొంకతండా దాటిన తర్వాత అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పేదల అభ్యున్నతే కాంగ్రెస్ లక్ష్యం
● ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు ● పలు అభివృద్ధికి పనులు ప్రారంభం సదాశివనగర్(ఎల్లారెడ్డి): పేదల అభ్యున్నతే కాంగ్రెస్ లక్ష్యమని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. సోమవారం ధర్మారావ్పేట్లో ఆరోగ్య ఉప కేంద్ర భవనాన్ని, లింగంపల్లిలో గ్రామ పంచాయతీ భవనం, తిమ్మోజీవాడిలో ఇందిరమ్మ గృహాలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. తుక్కోజీవాడిలో మహిళ సమాఖ్య భవనానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. అర్హులైన వారికే ఇందిరమ్మ గృహాలను మంజూరు చేస్తున్నామన్నారు. మహిళలను కోటీశ్వరులను చేయడానికి ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో మహిళా సమాఖ్య భవన నిర్మాణాన్ని చేపడుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నల్ల మహిపాల్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గాదారి శ్రీనివాస్ రెడ్డి, సేవాదళ్ అధ్యక్షుడు లింగాగౌడ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మద్దెల బాగయ్య, తిమ్మోజివాడి సర్పంచ్ నందిపేట భవాని, ఉప సర్పంచ్ రవీందర్ రావు, సదాశివనగర్ ఉప సర్పంచ్ ప్రవీణ్కుమార్, తుక్కోజివాడి సర్పంచ్ సంగారావు, తదితరులు పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుంచే కాంగ్రెస్ను బలోపేతం చేయాలి రామారెడ్డి(ఎల్లారెడ్డి): గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఎమ్మెల్యే మదన్మోహన్రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం రామారెడ్డిలో మండల నూతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని డీసీసీ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ పటేల్తో కలిసి ఆయన ప్రారంభించారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీని మరింతగా బలోపేతం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే సేవా వేదికగా మండల పార్టీ కార్యాలయం నిలవాలని ఆకాంక్షించారు. అంతకు ముందు గంగమ్మవాగు బిడ్జ్రిని పరిశీలించి పెండింగ్ పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సర్పంచ్లు బండి ప్రవీణ్, నవీన్, ఉప సర్పంచులు దోకి లచ్చయ్య, రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్గౌడ్ పాల్గొన్నారు. -
ప్రయివేటుకు దీటుగా కస్తూర్బాలు
● బాలికలకు వసతితో కూడిన విద్యాబోధన ● జేఈఈ, నీట్, క్లాట్ కోసం శిక్షణ.. ● ప్రవేశాల కోసం పెరిగిన పోటీ ● సీట్ల భర్తీ కోసం ఎంట్రెన్స్ టెస్ట్నిజాంసాగర్: బాలికల్లో అక్షరాస్యత శాతం పెంపుతో పాటు తల్లిదండ్రులు లేనివారు, బడిబయటి బాలికలకు ఆశ్రయం కల్పించి విద్యనందించేందుకు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు ఏర్పాటు చేశారు. వసతితోకూడిన విద్య అందిస్తున్నారు. దీంతోపాటు ఈ ఏడాదినుంచి జేఈఈ, నీట్, క్లాట్ కోసం శిక్షణ ఇవ్వనున్నారు. ప్రయివేటుకు దీటుగా నాణ్యమైన విద్య అందుతుండడంతో ఈ విద్యాలయాలలో చేరేందుకు పోటీ పెరుగుతోంది. 19 కేజీబీవీలు.. జిల్లాలో 19 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో ఆరో తరగతి నుంచి పదోతరగతి వరకు బాలికలకు వసతితో కూడిన విద్యను అందిస్తున్నారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తుండడం, చక్కటి విద్య అందుతుండడంతో ఈ పాఠశాలల్లో అడ్మిషన్లకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఇందులో అనాథ బాలికలు, డ్రాపౌట్స్తోపాటు పేద తల్లిదండ్రులు తమ కూతుళ్లను చేర్పిస్తున్నారు. ఒక్కో తరగతిలో 40 సీట్లుంటాయి. ఆరోతరగతిలో ప్రవేశాలకోసం దరఖాస్తులు ఆహ్వానించగా.. మొత్తం 760 సీట్లకు గాను 1,098 దరఖాస్తులు వచ్చాయి. పోటీ ఎక్కువగా ఉండడంతో ప్రవేశ పరీక్ష నిర్వహించి, విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నారు. 13 కళాశాలలు.. జిల్లాలోని భిక్కనూరు, బీబీపేట, దోమకొండ, రాజంపేట, గాంధారి, లింగంపేట, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, పిట్లం, జుక్కల్, బిచ్కుంద, బాన్సువాడ, బీర్కూర్ మండలాల్లోని కేజీబీవీలను ఇంటర్ కళాశాలలుగా అప్గ్రేడ్ చేశారు. ఆయా కస్తూర్బాల్లో సీఈసీ, బైపీసీ, ఎంపీసీ, ఎంపీహెచ్ డబ్ల్యూ వంటి గ్రూపులున్నాయి. పలు గ్రూపుల్లో అడ్మిషన్లకోసం భారీగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయా కస్తూర్బాల్లో ఇంటర్మీడియట్లో ప్రవేశానికి విద్యార్థినులు పోటీపడుతున్నారు. అయితే ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ ప్రవేశానికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థినులకు ఎస్సెస్సీ మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించనున్నారు. పోటీ పరీక్షలకు.. కేజీబీవీ విద్యార్థినులకు ఈ ఏడాదినుంచి జేఈఈ, నీట్, క్లాట్ల కోసం కోచింగ్ ఇవ్వనున్నారు. నిజాంసాగర్ కస్తూర్బాలో క్లాట్ శిక్షణ, భిక్కనూరు కస్తూర్బాలో జేఈఈ, లింగంపేట కస్తూర్బాలో నీట్కు శిక్షణ ఇస్తారు. దీంతో ఆయా కళాశాలల్లో ప్రవేశాలకు పోటీ ఎక్కువగా ఉంది.నిజాంసాగర్ కేజీబీవీలో ప్రవేశాలకు ఏటేటా డిమాండ్ పెరుగుతోంది. ఈసారి ఆరో తరగతిలో ప్రవేశానికి 98 మంది దరఖాస్తు చేసుకున్నారు. అనాథ పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఇస్తాం. మిగతా సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహించాం. త్వరలో భర్తీ చేస్తాం. – సరోజన, ప్రిన్సిపల్, నిజాంసాగర్ కస్తూర్బాజిల్లాలోని అన్ని కేజీబీవీల్లో కలిపి 6,318 మంది బాలికలు చదువుకుంటున్నారు. వారికి నాణ్యమైన విద్య అందిస్తున్నాం. విద్యార్థులు ఎస్సెస్సీతో పాటు ఇంటర్లోనూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. దీంతో ప్రవేశాలకు పోటీ పెరిగింది. – సుకన్య, జీఈసీవో, కామారెడ్డి -
నేటినుంచి విత్తన మేళాలు
బాన్సువాడ రూరల్: అన్నదాతలకు వ్యవసాయ రంగంలో సలహాలు సూచనలు ఇవ్వాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన రైతు వేదికలు.. విత్తన విక్రయ కేంద్రాలుగా మారనున్నాయి. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి వారం పాటు విత్తన మేళాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లాలోని 104 క్టస్టర్ రైతువేదికల్లో ఏర్పాట్లు చేశారు. కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సహకార సంఘాలు, వివిధ విత్తన కంపెనీలతో పాటు స్థానిక విత్తన డీలర్ల ఆధ్వర్యంలో స్టాల్స్ నిర్వహించనున్నారు. ఇందులో బోనస్ అందించే ఏడు రకాల వరి వంగడాలతోపాటు యూరియాను అందుబాటులో ఉంచనున్నారు. స్టాల్స్లో అందుబాటులో ఉండేవి.. రైతువేదికలో ఏర్పాటు చేసే స్టాల్స్లో రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ఇస్తామని ప్రకటించి ఏడు వరి వంగడాలతో పాటు, పేరున్న సంస్థలకు చెందిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచనున్నారు. ప్రభుత్వం బోనస్ అందించే బీపీటీ –5204, ఆర్ఎన్ఆర్ –15048, జైశ్రీరాం, హెచ్ఎంటీ, కేఎన్ఎం – 1638, డబ్ల్యూజీఎల్–44(సిద్ది), డబ్ల్యూజీఎల్–962 వరి వంగడాలతోపాటు పెసర, కంది, మినుము, వేరుశనగ, నువ్వులు, నూనెగింజలు, కూరగాయల విత్తనాలను విక్రయిస్తారు. నానోయూరియా, నానో డీఏపీ సైతం అందుబాటులో ఉంచడానికి వ్యవసాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.దేశాయిపేట్లోని రైతువేదికప్రభుత్వమే చొరవ తీసుకుని విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచుతోంది. దీంతో నకిలీల బాధ తప్పుతుంది. సరసమైన ధరలకే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంటాయి. రైతులు రైతు వేదికలను సందర్శించి, విత్తన మేళాలను సద్వినియోగం చేసుకోవాలి. – మోహన్రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారిచాలాగ్రామాల్లో రైతులు ఇప్పటికే నారుమడులు సిద్ధం చేసుకున్నారు. నిజాంసాగర్ ఆయకట్టు కింద బోరుబావులు ఉన్న రైతులు ఇప్పటికే వరినాట్లు ప్రారంభించారు. వ్యవసాయశాఖ తీసుకున్న నిర్ణయం సరైనదే అయినా నెలరోజుల ముందు స్టాల్స్ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది. ఇకపై పంట కొనుగోళ్లు పూర్తికాగానే స్టాల్స్ ఏర్పాటు చేయాలి. – కస్ప హన్మండ్లు, రైతు, బోర్లం రైతువేదికల్లో స్టాళ్ల ఏర్పాటు అందుబాటులో బోనస్ వర్తించే వరివంగడాలు, యూరియా ముందే ఏర్పాటు చేస్తే బాగుండేదంటున్న రైతులు


