Kamareddy District News
-
కుటుంబకలహాలతో మహిళ ఆత్మహత్య
తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి మండలంలో ని బ్రహ్మాజివాడి గ్రామానికి చెందిన శెట్పల్లి మంజుల (25) కుటుంబకలహాలతో ఆత్మహ త్య చేసుకున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. ఈ నెల 13న పిల్లల విషయంలో మంజుల తన అత్తతో గొడవ పడింది. దీంతో మనస్తాపానికి గురైన మంజుల అదే రోజు ఇంటిముందు ఉన్న రేకుల షెడ్లో గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న మంజులను గమనించిన కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా హాస్పిటల్కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్లోని ఓ ఆస్పత్రికి పంపించారు. మంజుల పరిస్థితి మరింత విషమించడంతో తిరిగి కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగా, శుక్రవారం చికిత్స పొందుతూ మృతి చెందిందినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి భర్త నవీన్, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతురాలి తండ్రి దేవయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరి మృతి మోపాల్ : మండలంలోని తాడెం గ్రామానికి చెందిన అంజాద్ ఖాన్ (45) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై జాడె సుస్మిత శుక్రవారం తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. ఈ నెల 10న ఉదయం అంజాద్ ఖాన్ తన ద్విచక్ర వాహనంపై తాడెం నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్నాడు. బోర్గాం(పి) గ్రామశివారులోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో మూలమలుపు వద్ద అదుపుతప్పి పడిపోయాడు. ప్రమాదంలో అంజాద్ఖాన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం జీజీహెచ్కు తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించి అంజాద్ ఖాన్ మృతిచెందాడు. మృతుడి సోదరుడు జావిద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సుస్మిత తెలిపారు. -
వర్క్షాప్నకు విద్యార్థి ఎంపిక
డొంకేశ్వర్(ఆర్మూర్): హైదరాబాద్లో మూడు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి వర్క్షాప్కు డొంకేశ్వర్ పీఎంశ్రీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి సుశాన్ ఎంపికయ్యాడు. సమగ్ర శిక్షణ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ‘రాష్ట్ర స్థాయి తెలంగాణ మోడల్ యునైటెడ్ నేషన్స్’ అనే వర్క్షాప్ ఈ నెల 17 వరకు జరుగుతుందని హెచ్ఎం సురేశ్ కుమార్ తెలిపారు. నిజామాబాద్ రూరల్: రాష్ట్ర డీజీపీగా బాధ్యత లు చేపట్టిన సీవీ ఆనంద్ను జిల్లా కాంగ్రెస్ ము ఖ్య నాయకులు శుక్రవారం హైదరాబాద్లో మ ర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మొక్కను అందించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చై ర్మన్ అన్వేష్ రెడ్డి, డీసీసీ జనరల్ సెక్రెటరీ గంగారెడ్డి ఉన్నారు. ఖలీల్వాడి : నిరుద్యోగ యువత పోటీ పరీక్షల కు సిద్ధం కావాలని, ఉద్యోగ సాధనకు పుస్తకా లు ఎంతగానో దోహదపడతాయని డీఈవో పార్శి అశోక్ సూచించారు. ప్రజాపాలన–ప్రగ తి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా శు క్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ ప రీక్షల పుస్తకాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. కా ర్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఈవో హాజరై పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోటీ పరీక్షలకు అనుకూలంగా సన్నద్ధమైతే ఉద్యోగం సాధించవచ్చని తెలిపారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టిన నుంచి జిల్లా గ్రంథాలయ వ్యవస్థలో మార్పులు తేవడానికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం డీఈవో అశోక్ను సన్మానించారు. ఖలీల్వాడి: జిల్లాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష లు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మూడో రోజైన శుక్రవారం ఉదయం ఫస్టియర్, మధ్యా హ్నం సెకండియర్ మ్యాథ్స్, బోటనీ, పొలిటిక ల్ సైన్స్ పరీక్షలు జరిగినట్లు డీఐఈవో రవికుమార్ తెలిపారు. ఫస్టియర్ విద్యార్థులు 8,494 మందికిగాను 8,072మంది హాజరుకాగా, 422 మంది గైర్హాజరయ్యారన్నారు. అలాగే సెకండి యర్ విద్యార్థులు 3,127మందికిగాను 2,985 మంది హాజరుకాగా, 142మంది గైర్హాజరయ్యారన్నారు. -
వెంకటాపూర్అగ్రహారం సందర్శన
ఎల్లారెడ్డిరూరల్: వెంకటాపూర్ అగ్రహారాన్ని శుక్రవారం తహసీల్దార్ ప్రేంకుమార్ సందర్శించారు. భూమి ఉన్నా హక్కు లేదాయే శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్ర చురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడు తూ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ భూమి ఎండోమెంట్కు సంబంధించినదని నోటీసులు ఇవ్వడంతో కొత్త పట్టా పాస్ బు క్కులు జారీ కాలేదన్నారు. ఈ భూములపై ఉ మ్మడిగా విచారణ జరపాలని దేవాదాయ శా ఖ కమిషనర్కు ప్రతిపాదనలు పంపామన్నా రు. విచారణ అనంతరం ఉన్నతాధికారుల సూచన మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. -
పాతికేళ్లకు కుటుంబం చెంతకు..
● 24 ఏళ్ల క్రితం తప్పిపోయిన గద్వాల జిల్లా వాసి ● గుర్తించి కుమారులకు అప్పగించిన కామారెడ్డి పోలీసులుకామారెడ్డి క్రైం: మానసిక స్థితి సరిగా లేక సుమారు పాతికేళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తిని కామారెడ్డి జిల్లా పోలీసులు కుటుంబం చెంతకు చేర్చారు. వివరాలిలా ఉన్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా పుటాన్పల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ 24 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. ఆయన మానసిక స్థితి సక్రమంగా లేకపోవడంతో కుటుంబాన్ని చేరలేకపోయాడు. చిన్నచిన్న పనులు, భిక్షాటన చేసుకుంటూ ఎక్కడపడితే అక్కడ జీవించాడు. ఆరోగ్యం, మానసిక పరిస్థితి సక్రమంగా లేని స్థితిలో గురువారం రాత్రి కామారెడ్డి బస్టాండ్ ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడిపోయాడు. కానిస్టేబుల్ అశోక్, హోంగార్డు రవి ఆయనను ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. కాస్త కోలుకున్నాక అతడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆపై గద్వాల పోలీసులకు సమాచారం ఇచ్చి వాకబు చేయించారు. వివరాలు సరైనవే అని తేలడంతో సత్యనారాయణ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి కామారెడ్డికి పిలిపించారు. శుక్రవారం ఉదయం సత్యనారాయణ ఇద్దరు కుమారులు శివశంకర్, జ్ఞాన చారి పట్టణ పోలీస్ స్టేషన్కు వచ్చి తండ్రిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు. ఇంతకాలం ఎక్కడ ఉన్నావని, ఎలా ఉన్నావని తండ్రిని అడిగారు. సత్యనారాయణ వద్దనుంచి సరైన సమాధానం రాకపోగా, కొడుకులను చూసిన ఆనందంలో బోరున విలపించాడు. చాలాచోట్ల గాలించినా అప్పట్లో తమ తండ్రి ఆచూకీ దొరకలేదని సత్యనారాయణ కుమారులు తెలిపారు. ఇంత కాలానికి తండ్రి ఆచూకీ లభించినందుకు సంతోషంగా ఉందంటూ కామారెడ్డి సీఐ నరహరి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తండ్రిని వెంట తీసుకుని వెళ్లారు. -
అగ్ని ప్రమాదంలో ధాన్యం బస్తాలు దగ్ధం
మోపాల్ : మండలంలోని కంజర్ శివారులో సొసైటీ ఆధ్వర్యంలో తూకం వేసిన ధాన్యం బస్తాలు శుక్రవారం దగ్ధమయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. షేక్ దావూద్ అనే రైతు బస్తాలు మూడు రోజుల క్రితం తూకం వేశారు. గుర్తు తెలియని రైతు తన పొలంలో వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో మంటలు రోడ్డు వరకు వ్యాపించాయి. ఈ క్రమంలో ధాన్యం బస్తాలకు అంటుకున్నాయి. గ్రామస్తులు గమనించి వెంటనే బస్తాల్లో నుంచి ధాన్యం కింద పారబోసి మంటలను అదుపులోకి తెచ్చారు. గ్రామ పంచాయతీ ట్యాంకర్ ద్వారా మంటలను పూర్తిగా ఆర్పేశారు. అగ్ని ప్రమాదంలో సుమారు 5 బస్తాల ధాన్యం దగ్ధమైనట్లు గ్రామస్తులు తెలిపారు. -
ఇంధన భారం!
శనివారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2026– 9లో uసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. దేశవ్యాప్తంగా పెట్రోలియం కంపెనీలు పెట్రోల్, డీజిల్పై లీటర్కు రూ. 3 చొప్పున పెంచడంతో అన్ని రంగాలపైనా ప్రభావం పడనుంది. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఉదయం 6 గంటల వరకు పెట్రోల్ ధర లీటర్కు రూ. 108.62 ఉండగా.. 6 గంటల తర్వాత రూ. 111.88 కి చేరింది. అలాగే డీజిల్ లీటర్ ధర రూ. 96.65 నుంచి రూ. 99.91 కి చేరింది. రోజుకు 6 లక్షల లీటర్ల వినియోగం.. జిల్లాలో వివిధ కంపెనీలకు సంబంధించి 110 పెట్రోల్ బంక్లు ఉన్నాయి. రోజూ సగటున పెట్రోల్ రెండు లక్షల లీటర్లు, డీజిల్ నాలుగు లక్షల లీటర్ల మేర అమ్ముడవుతోంది. దీంతో పెరిగిన ధరలతో ప్రజలపై రోజుకు రూ. 18 లక్షలపైనే భారం పడుతుందని అంచనా. ద్విచక్ర వాహనదారులకు ఇబ్బందులు.. ద్విచక్ర వాహనం దాదాపు ప్రతి ఇంటికొకటి కనబడుతోంది. అలాగే మధ్యతరగతివారు చాలావరకు కార్లు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో అన్ని రకాల వాహనాలు కలిపి 2.50 లక్షలు ఉన్నట్లు రవాణా శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో ద్విచక్రవాహనాల సంఖ్య 1,86,378. కాగా వాహనాలలో అత్యధికం పెట్రోల్తో నడిచేవి. ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ స్కూటీలు, కార్ల వైపు జనం మొగ్గు చూపుతున్నా.. వాటి శాతం తక్కువే. నిత్యం పనుల మీద తిరిగేవారు, ఉద్యోగరీత్యా, ఉపాధి కోసం వెళ్లేవారు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుంటారు. పెట్రోల్ ధర పెంపు ప్రభావం ద్విచక్రవాహనాదారులపై ఎక్కువగా పడనుంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్పై రూ.3 పెంపు కామారెడ్డిలో లీటర్ పెట్రోల్ రూ. 111.88, డీజిల్ రూ. 99.91 పెరగనున్న రవాణా ఖర్చులు, వ్యవసాయంపైనా భారం -
మరమ్మతులు ఎప్పుడో?
నిజాంసాగర్: సింగితం రిజర్వాయర్ రిటెయినింగ్ వాల్ కొట్టుకుపోయి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ శాశ్వత మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మహమ్మద్నగర్ – నర్వ గ్రామాల మధ్య సింగితం రిజర్వాయర్ ఉంది. 1999 సంవత్సరంలో దీనిని నిర్మించారు. రిజర్వాయర్కు ఎగువన నిజాంసాగర్, బాన్సువాడ, నస్రుల్లాబాద్, వర్ని, చందూర్, నిజామాబాద్ రూరల్, గాంధారి మండలాల పరిధిలో కురిసిన వర్షాల వల్ల వాగుల ద్వారా రిజర్వాయర్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. రిజర్వాయర్కు వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నిజాంసాగర్ మొదటి ఆయకట్టుకు ప్రాంతానికి ప్రధాన కాలువ ద్వారా నీటిని మళ్లిస్తారు. జిల్లాలో రెండేళ్ల క్రితం కురిసిన భారీవర్షాలతో వచ్చిన వరదల కారణంగా రిజర్వాయర్ రిటెయినింగ్ వాల్ కొట్టుపోయింది. దీంతో నీళ్లన్నీ వృథా అయ్యాయి. తాత్కాలిక మరమ్మతులతోనే సరి.. రెండేళ్ల క్రితం కొట్టుకుపోయిన రిటెయినింగ్ వాల్కు తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెడుతున్నారు. అప్పట్లో రూ. 8 లక్షల నిధులతో ఇసుక బస్తాలు, మట్టి, మొరంతో అడ్డుకట్ట వేశారు. పూర్తి స్థాయి పనులకు నిధులు మంజూరు కాకపోవడంతో గతేడాది కురిసిన వర్షాలతో మళ్లీ నీరు వృథా అయ్యింది. రిటెయినింగ్ వాల్ కొట్టుకుపోతుండడంతో రెండో పంటకు నీరు అందడం లేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రిటెయినింగ్ వాల్కు పూర్తిస్థాయి మరమ్మతుల కోసం నీటి పారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నారు. రెండేళ్ల క్రితం రూ. 1.8 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. గతేడాది రూ. 1.5 కోట్లతో కాంక్రిట్ పనుల కోసం రెండోసారి ప్రతిపాదనలు పంపించారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన కరువయ్యింది. ఈసారి రూ. 90 లక్షలతో మూడోసారి ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు.సింగితం రిజర్వాయర్ రిటెయినింగ్ వాల్కు శాశ్వత మరమ్మతులకోసం మూడు దఫాలుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కావడం లేదు. నిధులు వస్తే పనులు చేపడతాం. – సోలోమన్, ఈఈ, నిజాంసాగర్ భారీ వర్షాలతో కొట్టుకుపోయిన సింగితం రిటెయినింగ్ వాల్ రెండేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం వృథా అవుతున్న సాగునీరు.. ఆందోళనలో రైతులు -
కంప్యూటర్పై పట్టు
వేసవిలో● శిక్షణ పొందుతున్న విద్యార్థులు ● నైపుణ్యం, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుదలకు దోహదంబోధన్లోని ఎస్ఆర్ కంప్యూటర్స్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులుబోధన్: సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పు నేపథ్యంలో కంప్యూటర్ విద్య పట్ల మారుమూల గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. వేసవి సెలవుల సమయాన్ని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కంప్యూటర్ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు. నేటి డిజిటల్ యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండటం అత్యంత అవసరమైన నైపుణ్యమని నిపుణులంటున్నారు. కంప్యూటర్ విద్యను అభ్యసించడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్యల పరిష్కారానికి నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతాయి. సాలూర మండల కేంద్రానికి చెందిన కంప్యూటర్ మాస్టర్ కృష్ణప్రసాద్ బోధన్ పట్టణ కేంద్రం, సాలూర మండల కేంద్రాల్లో ఎస్ఆర్ కంప్యూటర్స్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ రెండు కేంద్రాల్లో వేసవి ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. డీసీఏ, పీజీడీసీఏ, జేవోసీ, డీటీపీ, ఫొటోషాప్, ఇంటర్నెట్, ఇతర కోర్సుల్లో శిక్షణనిస్తున్నారు. 30 నుంచి 45 రోజుల వ్యవధితో కోర్సులను నామమాత్రపు ఫీజుతో అందిస్తున్నారు. -
సిట్ విచారణకు హాజరు
కామారెడ్డి టౌన్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణకు డీసీసీ ఉపాధ్యక్షుడు గంప ప్రసాద్ హాజరయ్యారు. శుక్రవారం హైదరాబాద్ కమాండ్, కంట్రోల్ టవర్స్లోని సిట్ కార్యాలయంలో జిల్లా నాయకులతో కలిసి విచారణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంప ప్రసాద్ మాట్లాడుతూ గతంలో తన ఫోన్ ట్యాప్ అయిందనే విషయం సిట్ అధికారులు చెప్పేంత వరకు తనకు తెలియదన్నారు. దీనివల్ల తన వ్యక్తిగత స్వేచ్ఛకు తీవ్ర భంగం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన అనుమానాలు, డేటా లీకేజీ అంశాలపై అధికారులు అడిగిన ప్రశ్నలకు తన వాంగ్మూలాన్ని ఇచ్చానన్నారు. ఆయన వెంట పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్ తదితరులున్నారు. కామారెడ్డి క్రైం: విపత్తుల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల బృందం శుక్రవారం అన్ని జిల్లాల అధికారులతో రాష్ట్రస్థాయి టేబుల్టాప్ ఎక్సర్సైజ్ నిర్వహించింది. ఆన్లైన్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో కామారెడ్డి కలెక్టరేట్ నుంచి రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గిరి, జిల్లా ఫైర్ అధికారి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో జిల్లా యంత్రాంగం సన్నద్ధత, శాఖల మధ్య సమన్వయం తదితర అంశాలపై ఇందులో చర్చించారు. ఇలాంటి టేబుల్టాప్ ఎక్సర్సైజ్లు శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంతో పాటు, అత్యవసర పరిస్థితులు, విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. తాడ్వాయి: టీబీ రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని క్షయ నియంత్రణ విభాగం జిల్లా కోఆర్డినేటర్ విజయ్ సూచించారు. శుక్రవారం కన్కల్ గ్రామంలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ నిర్వహించారు. దగ్గు, జ్వరం, బరువుతగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులను అందిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రవీందర్రెడ్డి, ఉప సర్పంచ్ మహేష్, సూపర్వైజర్ శ్యాం, టెక్నిషియన్ దత్తాద్రి, సిబ్బంది రాకేష్, లక్ష్మి, ఆశావర్కర్లు జ్యోతి, లత తదితరులు పాల్గొన్నారు. -
‘తూకాలలో వేగం పెంచండి’
బాన్సువాడ రూరల్: మొక్కజొన్న కొనగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కోనాపూర్లోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కొనుగోలు చేసిన మక్కలను ఆలస్యం లేకుండా గోదాములకు తరలించాలని మార్క్ఫెడ్ అధికారులకు సూచించారు. 11,683 క్వింటాళ్ల మక్కలను గోదాములకు తరలించామని, మరో 3,700 క్వింటాళ్లు తరలించాల్సి ఉందని సొసైటీ కార్యదర్శి సురేందర్రావు కలెక్టర్కు వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ నరేందర్గౌడ్, ఏడీఏ అరుణ, సహకార సంఘం చైర్మన్ సంగ్రాం నాయక్, నాయకులు రాజేశ్వర్గౌడ్, బంజ భూషణం, అక్తర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకమైన సేవలందించాలి
● ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి ● బాన్సువాడలో ఆర్డీవో క్యాంపు కార్యాలయం ప్రారంభంబాన్సువాడ : ప్రజలకు పారదర్శకంగా, వేగవంతమైన సేవలందించాలనే లక్ష్యంతో ఆర్డీవో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేశామని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. బాన్సువాడలో ఎస్డీఎఫ్ నిధులు రూ.50 లక్షలతో ఆర్డీవో/సబ్ కలెక్టర్ నివాసం, క్యాంపు కార్యాలయం నిర్మించారు. దీనిని శుక్రవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావుతో కలిసి పోచారం ప్రారంభించారు. అంతకుముందు బాన్సువాడ ఆర్డీవో రవీందర్రెడ్డి దంపతులు క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్, జగిత్యాల అదనపు కలెక్టర్ రాజాగౌడ్, బాన్సువాడ ఆర్డీవో రవీందర్రెడ్డి, డీఎస్పీ విఠల్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆస్పత్రి సందర్శన.. బాన్సువాడ మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిని శుక్రవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించారు. వార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వారి వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయభాస్కర్ తదితరులున్నారు. -
కొనుగోలు కేంద్రాల పరిశీలన
ఎల్లారెడ్డి: జిల్లా సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులు శుక్రవారం హాజీపూర్, లింగారెడ్డిపేట కొనుగోలు కేంద్రాలను పరిశీలించా రు. ‘కొనుగోళ్లలో అడుగడుగునా దోపిడీ’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరిపారు. విచారణ విషయమై డీసీఎస్వో వెంకటేశ్వర్లును ‘సాక్షి’ సంప్రదించగా.. విచారణ నివేదికను కలెక్టర్కు అందిస్తామన్నారు. ఆయన వెంట కామారెడ్డి సివిల్ సప్లైస్ డీఎం శ్రీకాంత్, ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్, తహసీల్దార్ ప్రేంకుమార్ తదితరులు పాల్గొన్నారు. తూతూమంత్రంగా విచారణ! ధాన్యం కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న దోపిడీపై అధికారులు చేపట్టిన విచారణ నామమాత్రంగా సాగిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు, సొసైటీ సిబ్బంది ఉదయమే రైతులతో మాట్లాడి అధికారులతో తమకు అనుకూలంగా చెప్పాలని బతిమాలినట్లు తెలుస్తోంది. కాగా 40 కిలోల బస్తాకు కిలోన్నర తరుగు తీసుకున్నారని ఎల్లారెడ్డికి చెందిన విఠల్ అనే రైతు ‘సాక్షి’తో తెలిపారు. తనతో ఏ అధికారీ మాట్లాడలేదని, తనకు సంబంధించిన ట్రక్షీట్ను తెప్పించుకుని రైస్మిల్లర్లు తన వడ్లు ఉన్న లారీలో ఎలాంటి తరుగు తీసుకోలేదని విచారణలో రాసుకున్నారని తెలిసిందని పేర్కొన్నారు. తన వడ్లను కాంటా పెట్టినందుకు క్వింటాలుకు రూ. 48 హమాలీ, లారీ డ్రైవర్లకు బస్తాకు రూపాయి చొప్పున చెల్లించానని ఎల్లారెడ్డి సొసైటీ మాజీ చైర్మన్ బోండ్ల సాయిలు చెబుతుండడం గమనార్హం. ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీలో లారీ డ్రైవర్లు బస్తాకు రూపాయి తీసుకున్నా ఇతర గ్రామాలలో బస్తాకు రెండు నుంచి మూడు రూపాయలు తీసుకుంటున్నారన్నది బహిరంగ రహస్యమేనన్నారు. ఉన్నతాధికారులు స్పందించి సరైన విచారణ జరిపించాలని రైతులు కోరుతున్నారు. అవకతవకలు జరగడం లేదు ఎల్లారెడ్డి: మండలంలోని ఏ ధాన్యం కొనుగోలు కేంద్రంలోనూ అవకతవకలు జరగడం లేదని అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం డీసీఎస్వో, డీఎం, ఎల్లారెడ్డి ఆర్డీవో, తహసీల్దార్లు హాజీపూర్, లింగారెడ్డిపేట్, ఎల్లారెడ్డిలలో పర్యటించి, విచారణ జరిపారని తెలిపారు. ఎక్కడా అవకతవకలు జరగలేదని గుర్తించామని పేర్కొన్నారు. ధాన్యం తరలింపులో జరుగుతున్న జాప్యంపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించామని తెలిపారు. -
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు
బాన్సువాడ రూరల్: గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, గ్రంథాలయాలను విద్యార్థులు, నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.గంగాధర్ అన్నారు. ప్రజాపాలన– ప్రగతి పాలనలో భాగంగా కళాశాలలో విద్యావారోత్సాలు నిర్వహించారు. అందులో భాగంగా కళాశాలలో మన గ్రంథాలయం, జ్ఞానోత్సవం కార్యక్రమం నిర్వహించారు. కళాశాలలో 9 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే డిజిటల్ లైబ్రరీ సౌకర్యం ఉందని, విద్యార్థులు వివిధ దినపత్రికలతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే పుస్తకాలు అందుబాటులో ఉంచామన్నారు. అనంతరం ఐక్యూఏసీ బున్ని వినయ్కుమార్తో పాటు విద్యార్థి విష్ణును ప్రిన్సిపల్ గంగాధర్, లైబ్రేరియన్ గోపాల్లు అభినందించారు. ‘పుస్తకాలే వ్యక్తి నిర్మాణానికి దోహదపడతాయి’ కామారెడ్డి అర్బన్: పుస్తకాలే వ్యక్తి నిర్మాణానికి దో హద పడుతాయని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళా శాల ప్రిన్సిపల్ విజయ్కుమార్ అన్నారు. విద్యావారోత్సవాల్లో భాగంగా శుక్రవారం కళాశాల గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన, డిజిటల్, ఈ–లైబ్రరీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమన్వయకర్త జయప్రకాష్ ‘అమ్మ’ పుస్తక సమీక్ష చేశారు. సాధారణ మహిళ సమాజంలో తీసుకువచ్చిన కథా అంశంతో అమ్మ పుస్తకం ఉంటుందన్నారు. రష్యన్ రచయిత మాక్సిమ్ గోర్కి రాసిన మదర్ నవలను క్రోవాడి లింగరాజు తెలుగులోకి అమ్మ పేరిట అనువాదం చేశారన్నారు. అధ్యాపకుడు తిరుమల మల్సూర్ ‘ఇన్లాండ్ ఫిషరీస్ అండ్ అక్వాకల్చర్ డెవలప్మెంట్’ పుస్తకాన్ని ప్రిన్సిపల్ ఆవిష్కరించారు. వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, సమన్వయకర్తలు విశ్వప్రసాద్, సుధాకర్, శ్రీనివాస్రావు, శ్రీవల్లి, మానస, రాజ్ గంభీర్రావు, గ్రంథాలయ సహాయకురాలు జ్యోతి, సిబ్బంది పాల్గొన్నారు. ఎల్లారెడ్డి గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలోని గ్రంథాలయంలో శుక్రవా రం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ‘ప్రజాపాలన’ కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. లైబ్రేరియన్ జాకీర్, పాఠకులు, సిబ్బంది తదితరులున్నారు. నిజాంసాగర్(జుక్కల్): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని గ్రంథాలయంలో పుస్తక పఠనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠకులకు పుస్తకాలను అందజేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజాపండరి, గ్రంథాలయం ఇన్చార్జి రేఖ తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలి తాడ్వాయి(ఎల్లారెడ్డి): గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని ఎంఈవో రామస్వామి అన్నారు. తాడ్వాయి మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయంలో శుక్రవారం పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఈవో రామస్వామి, హెచ్ఎం కళ్యాణి, మాజీ వైస్ఎంపీపీ నర్సింలు, మాజీ సర్పంచ్ సంజీవులు, గ్రంథపాలకుడు రాజలింగం, వీడీసీ చైర్మన్ రాజు, జీపీ కార్యదర్శి బాలు, తదితరులు పాల్గొన్నారు. -
‘పోలీస్ డిపార్ట్మెంట్ మాఫియాలా తయారయ్యింది’
పోలీస్ డిపార్ట్మెంట్ మాఫియాలా తయారయ్యిందని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు విమర్శించారు. శుక్రవారం బాన్సువాడలో ఆర్డీవో క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయన్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఇసుక ప్రధాన సమస్యగా ఉందన్నారు. వారం రోజుల క్రితం బిచ్కుంద మండలం దేవాడ గ్రామానికి చెందిన నలుగురు ఇందిరమ్మ పథకం లబ్ధిదారులు ఇసుక కోసం ట్రాక్టర్లు తీసుకొని మంజీర నదిలోకి వెళ్లారని, పోలీసులు వచ్చి వాటిని పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారని పేర్కొన్నారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో పోలీసులకు ఫోన్ చేస్తే ఎస్పీ ఆదేశాలతోనే ట్రాక్టర్లు పట్టుకొచ్చామని చెప్పారన్నారు. ఎస్పీకి ఫోన్ చేస్తే ట్రాక్టర్లపై కేసులు చేయాల్సిందేనంటున్నారన్నారు. వారం రోజులుగా ట్రాక్టర్లు పోలీస్ స్టేషన్లోనే ఉన్నాయని, గరీబోళ్లు కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చి ఇసుక తీసుకెళ్తున్నా అడ్డుకోవడం లేదన్నారు. ‘‘వాళ్లు మీకు కనబడరు.. గరీబోళ్లు మాత్రం కనబడతారు’’ అని పేర్కొన్నారు. ఎస్పీకి మానవత్వం లేదని, ఆయనకు జిల్లాలో ఉండే అర్హత లేదని వ్యాఖ్యానించారు. -
కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేయాలి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్ఠ పర్చాలని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీధర్గౌడ్ సూచించారు. ధర్మారెడ్డిలో శుక్రవారం వివిధ గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామాల్లో అర్హులైన వారందరికీ అందేలా చూడాలన్నారు. దీంతోపాటు ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించాలని చెప్పారు. గ్రామాల్లో కార్యకర్తలందరినీ కలుపుకొని సమన్వయంతో పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయాలన్నారు. అనంతరం రెండోసారి కాంగ్రెస్ మండలాధ్యక్షుడిగా నియమితులైన శ్రీధర్గౌడ్ను వివిధ గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షులు ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కిష్టయ్య, యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీరాంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం
కామారెడ్డి అర్బన్: ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని, ధాన్యం తరలింపునకు వాహనాలను ఏర్పాటు చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి పట్టణ పరిధిలోని లింగాపూర్ స్టేజీ సమీపంలోని కొమిరెడ్డి చిన్నఅంజన్న వ్యవసాయ క్షేత్రం వద్ద భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. వరి, మక్క ధాన్యం కొనుగోళ్ల తూకాలు వేయడం, వేసిన వాటిని వెంటనే తరలించాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని ఆయన అన్నారు. రైతులు చైతన్యమై అధికారులను నిల దీయాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబీర్ ఆనందరావు, రాష్ట్ర కార్యదర్శి కొమిరెడ్డి అంజన్న, జిల్లా నాయకులు సాయిరెడ్డి, రాంరెడ్డి, రామచంద్రం, చిన్న అంజన్న తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
● కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఉమారాణి ● ‘సాక్షి’ ఫోన్ఇన్ ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలనకామారెడ్డి టౌన్ : అన్ని వార్డులలో ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ ఇ ప్ప ఉమారాణి పేర్కొన్నారు. ఇటీవల ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ఇన్ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై ఆమె స్పందించారు. గురువారం మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, ఏఈ వేణుప్రసాద్తో కలి సి పలు వార్డుల్లో పర్యటించారు. ఫిర్యాదుదారులు, స్థానిక కాలనీవాసులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఉదయం పాత రాజంపేట్లో తాగునీటి పైప్లైన్ లీకేజీలను పరిశీలించి, వాటిని తక్షణమే అరికట్టాలని ఏఈని ఆదేశించారు. అనంతరం షబ్బీర్ కా లనీలో సమస్యలను తెలుసుకున్నారు. 19వ వార్డు ముదిరాజ్ సంఘ భవనం ముందు గోదావరి జలాల పైప్లైన్ లీకేజీలను పరిశీలించారు. నీటి వృథా, పను ల్లో నిర్లక్ష్యంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందిపై అసహనం.. 43వ వార్డులో వాటర్ స్టార్మ్ డ్రైయిన్ను పరిశీలించారు. మురికి కాలువ ప్రమాదకరంగా ఉందని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇటీవల మున్సిపల్ కార్మికులే కాలువలో పడిపోయారని కాలనీవాసులు పేర్కొన్నారు. దీనిపై స్పందించిన చైర్పర్సన్.. ఎమర్జెన్సీ నిధుల కింద పనులు చేపడతామని హామీ ఇచ్చారు. శుభ్రత లోపించడం, పగటి పూట కూడా వీధిదీపాలు వెలుగుతుండడంపై అసహనం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బంది వేతనాలు నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. వార్డు సమస్యలను కౌన్సిలర్ వంశీకృష్ణ చైర్పర్సన్కు వివరించారు. సమస్యలను నేరుగా చైర్పర్సన్, అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పించిన ‘సాక్షి’కి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. -
కొనుగోళ్లలో అడుగడుగునా దోపిడీ
● నష్టపోతున్న అన్నదాత ● పట్టించుకోని అధికారులుఎల్లారెడ్డి: ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతులకు కొనుగోలు కేంద్రాలలో అరిగోస తప్పడం లేదు. ధాన్యం సేకరణలో కొర్రీలతో అన్నదాతలు నష్టపోవాల్సి వస్తోంది. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించిన నాటి నుంచే కష్టాలు మొదలవుతున్నాయి. తేమ శాతం పేరుతో, చెత్తాచెదారం పే రుతో నిర్వాహకులు ఇబ్బందిపెడుతున్నారు. రోజుల తరబడి వడ్లను ఆరబెట్టి, తేమ శాతం 18 శాతానికి తగ్గిన తర్వాత తీసుకువచ్చినా తరుగు పేరుతో ఇబ్బందులు తప్పడం లేదు. నిర్వాహకులు 40 కిలోల బస్తాకు 2 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తీరా తూకం అయ్యాక లారీలు రాకపోవడంతో మరో వారం పాటు ఎదురుచూడాల్సి వస్తోందని, ధాన్యం బస్తాలను కాపాడుకోవడానికి కాపాలా ఉండాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం తరలించడానికి ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీలోని కొనుగోలు కేంద్రానికే రెండు రోజులకో లారీ వస్తోంది. మిగతా కొనుగోలు కేంద్రాలకు మూడు నాలుగు రోజులకో లారీ కూడా రావడం లేదని తెలుస్తోంది. వడ్లను మిల్లులకు తరలించాక లారీకి 10 నుంచి 20 బస్తాల వరకు మిల్లర్లు తరుగు తీస్తున్నారని, లేకపోతే అన్లోడ్ చేసుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కాంటా చేసినప్పటి కంటే మిల్లుకు వచ్చేటప్పటికి ధాన్యం బరువు తగ్గిపోయిందని, అందుకే బస్తాలు తక్కువ తీసుకుంటున్నామని మిల్లర్లు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇటు హమాలీలు.. అటు లారీ డ్రైవర్లు.. ధాన్యం తూకం వేసినందుకు క్వింటాలుకు రూ. 48 రూపాయల హమాలీ వసూలు చేస్తున్నారు. ఇంతేగాక చాయ్, కల్లు పేరుతో మరో రూ. 500 తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బస్తాకు రెండు రూపాయలచొప్పున లారీ డ్రైవర్లు వసూలు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో దోపిడీ గురించి అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేస్తే ధాన్యాన్ని కొంటారో లేదోనని చాలామంది ముందుకు రావడం లేదని తెలుస్తోంది.హమాలీలు బస్తాకు రూ. 48 తీసుకుంటున్నరు. ధాన్యా న్ని తరలించినందుకు లారీ డ్రైవర్లు బస్తాకు రెండు రూపాయలు అడుగుతున్నరు. బహిరంగంగానే తరుగు తీస్తున్నరు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. – నీరుడి పౌరాజు, రైతు, హాజీపూర్రైస్ మిల్లర్లు వారు లారీకి 10 నుంచి 20 సంచులు తరుగు తీస్తున్నరు. ప్రశ్నిస్తే అన్లోడ్ చేసుకోవడం లేదు. బాగా ఆరబెట్టి, పొల్లు లేకుండా ధాన్యం తెచ్చినా మళ్లీ ఎందుకు తరుగుతీస్తున్నరో అర్థం కావడం లేదు. – కడావత్ ధూప్యా, రైతు, కట్టకింది తండారెవెన్యూ, పోలీస్ సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలు కొనుగోలు కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఎక్కడైనా అక్రమాలు జరిగితే ఽనిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు. దానిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – విక్టర్, అదనపు కలెక్టర్40 కిలోల ధాన్యానికి కేంద్రాల నిర్వాహ కులు కిలోన్నర తరుగు తీసుకుంటున్నారు. ఇదేమని అడిగితే తేమ ఎక్కువగా, పొల్లు ఉందని సాకులు చెబుతున్నారు. ఎవరికి చెప్పినా లాభంలేదు. – విఠల్, రైతు, ఎల్లారెడ్డి -
పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
బాన్సువాడ రూరల్: పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ప్రభుత్వం అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి, షాదీమూబారక్ పథకాలు వరంలా మారాయని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడలోని తన నివాసంలో బాన్సువాడ పట్టణం, బాన్సువాడ రూరల్, నస్రుల్లాబాద్ మండలాలకు చెందిన 173 మందికి మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. తహసీల్దార్ నరేందర్గౌడ్, నాయకులు గురువినయ్, కాసుల రోహిత్, అలీమోద్దీన్బాబా, హకీం, నారాయణరెడ్డి, ఉద్దర రాజు, వీరేశం, మన్నె రమేష్, కమటాల శ్రీనివాస్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు
● బక్రీద్కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు ● ఎస్పీ రాజేష్ చంద్ర కామారెడ్డి క్రైం: బక్రీద్ పండుగ నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ఉండేందుకు జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం తెలిపారు. జిల్లాలో 6 ప్రత్యేక చెక్పోస్టులు ఏర్పాటు చేశామని వెల్లడించారు. వాహనాలు ఆపడం, తనిఖీలు చేయడం లాంటి అధికారాలు కేవలం ప్రభుత్వ విభాగాలకు మాత్రమే ఉంటాయన్నారు. వ్యక్తులు గానీ, సంస్థలు గానీ తనిఖీలకు దిగడం నిషేధమని స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా ద్వేషపూరిత, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, మత సామరస్యానికి భంగం కలిగించే పోస్టులు పెట్టినా చర్యలు తప్పవన్నారు. అలాంటి వాటిపై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందన్నారు. ప్రజలందరూ సోదరభావంతో మెలగాలని కోరారు. ఎక్కడైనా శాంతికి విఘాతం కలిగించే అంశం ఏదైనా ఉంటే వెంటనే పోలీసుల(హెల్ప్లైన నంబర్– 87126 86133 )కు సమాచారం ఇవ్వాలన్నారు. అంతేగానీ చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. అత్యవసర సహాయం కోసం డయల్ 100కు ఫోన్ చేయాలన్నారు. -
సైబర్ నేరాలపై అవగాహన
భిక్కనూరు: రాజంపేట మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్రాంచ్లో సైబర్ నేరాలపై పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. అపరిచుతులకు ఓటీపీలు చెప్పవద్దని, ఫోన్ పాస్వర్డ్స్ ఎవరికీ చెప్పవద్దని సూచించారు. మాదకద్రవ్యాలు సేవించడం వల్ల కలిగే నష్టాలు కుటుంబాల పరిస్థితి గురించి పాటల రూపంలో వినిపించారు. అలాగే షీ టీంల గురించి సైబర్ నేరాల టోల్ ఫ్రీ నంబర్ 1930, అత్యవసర సమయాల్లో 100కి డయల్ చేయాలని వివరించారు. పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టెబుల్స్ రామంచ తిరుపతి, శేషారావు, కానిస్టేబుళ్లు ప్రభాకర్, సాయిలు, బ్యాంకు మేనేజర్ రాజశేఖర్గౌడ్, లింగంపేట హెడ్కానిస్టెబుల్ రమేష్, షీటీం సభ్యులు భానురెడ్డి పాల్గొన్నారు. -
‘హక్కు’లేదాయె!
భూమి ఉన్నా..గతంలో ఇచ్చిన పట్టాదారు పాస్పుస్తకాలను చూపుతున్న రైతులుఎల్లారెడ్డి మండలంలోని వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో వివిధ సర్వే నంబర్ల కింద 170 ఎకరాల భూమి ఉంది. దానిని 77 కుటుంబాలు మూడునాలుగు తరాలుగా సాగు చేసుకుంటున్నాయి. ఆ భూములకు హక్కులు కల్పించాలంటూ దశాబ్దాల తరబడిగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. 1998 లో అప్పటి కామారెడ్డి ఆర్డీవో శ్రీదేవి ఈ సమస్యకు పరిష్కారం చూపారు. ఆ రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు, యాజమాన్య హక్కు పుస్తకాలు (టైటిల్ డీడ్)లు అందించారు. అయితే ఆ భూమి దేవాలయానికి సంబంధించినదంటూ పలువురు కోర్టుకు వెళ్లారు. దశాబ్దాలు గడుస్తున్నా ఈ కేసు ఎటూ తేలడం లేదు.మాకు అప్పట్లో ఇచ్చిన పాసుపుస్తకాలతోనే ఇరవై ఏళ్లు అన్ని పనులు చేసుకున్నం. ఏ ఇబ్బందీ లేకుండే. ధరణిలో మాకు కొత్త పాస్పుస్తకాలు రాకపోవడంతో కష్టాలు మొదలయ్యాయి. మా సమస్య పరిష్కరించి పాసుపుస్తకాలు ఇచ్చి ఆదుకోవాలి. – వేముల బాలమణి, రైతు తాతల కాలం నుంచి పంటలు పండించుకుని బతుకుతున్నం. అప్పట్ల మాకు పాసుపుస్తకాలు ఇచ్చిండ్రు. వాటితోని లోన్లు వచ్చినై. కొందరికి రుణమాఫీ కూడా అయ్యింది. ఇప్పుడు కొత్త పుస్తకాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నం. మమ్మల్ని ఆదుకోవాలి. – వేముల బాలయ్య, రైతుఅగ్రహారం రైతులకు 1998 సంవత్సరంలో జారీ అయిన పాస్బుక్కులతో సుమారు రెండు దశాబ్దాల పాటు సంక్షేమ పథకాలు పొందారు. పంట రుణాలు తీసుకున్నారు. దీర్ఘకాలిక రుణాలు, సబ్సిడీలు పొందారు. రుణమాఫీ కూడా అయ్యింది. అయితే భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో అధికారులు వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలోని భూములకు సంబంధించిన సర్వే నంబర్లను పార్ట్ బీలో చేర్చారు. రికార్డుల్లో దేవాదాయ భూములుగా పేర్కొన్నారు. దీంతో వెంకటాపూర్ అగ్రహారం రైతుల భూముల సమస్య మళ్లీ మొదటికొచ్చింది. డిజిటల్ పాసుపుస్తకాలు రాకపోవడంతో రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలకు దూరమవ్వాల్సి వచ్చింది. పాస్బుక్కులు లేకపోవడంతో పంట రుణాలు అందక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడెనిమిదేళ్లలో పది మంది చనిపోయారని, డిజిటల్ పాసుపుస్తకాలు వచ్చి ఉంటే వారికి రైతు బీమా వర్తించేదని పేర్కొంటున్నారు. విత్తనాల కొనుగోలు, పంట ఉత్పత్తుల అమ్మకాలకూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. మూడు తరాలుగా సాగు చేసుకుంటున్న భూములకు హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.ఆ భూములతో వారికి మూడు తరాల అనుబంధం ఉంది. తాతలు, తండ్రులు సాగు చేసుకుని బతికారు. ఇప్పుడు మూడో తరం అయిన మనవళ్లు అదే భూమిని నమ్ముకుని జీవిస్తున్నారు. అయితే ‘ధరణి’ వారి హక్కులను దూరం చేసింది. కొత్త పాస్బుక్కులు జారీ కాకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరమై ఇబ్బందిపడుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి దశాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటున్న అగ్రహారం రైతులు 1998లో పాస్బుక్కులు జారీ ‘ధరణి’ రాకతో మారిన పరిస్థితి.. పార్ట్–బీలో చేర్చిన అధికారులు సంక్షేమ పథకాలకు దూరమైన అన్నదాతలు కొత్త పాస్బుక్కులు ఇవ్వాలని వినతి -
బండి సంజయ్ను మంత్రి పదవి నుంచి తప్పించాలి
కామారెడ్ది అర్బన్: కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కుమారుడు భగీరథ్ను పోక్సో కేసు నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్నాడని, వెంటనే సంజయ్ను మంత్రి పదవి నుంచి తప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ విజయరామరాజు డిమాండ్ చేశారు. బండి భగీరథ్పై తీవ్రమైన ఆరోపణలతో పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేయకుండా కాలయాపన చేయడం అనుమానాలకు తావిస్తోందని, చట్టం తన పని ఎందుకు చేసుకుపోవడం లేదని విజయరామరాజు ప్రశ్నించారు. పోలీసు శాఖ పనితీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, సామాన్యుల విషయంలో ఇలాగే వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. బాన్సువాడ రూరల్: ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని కోనాపూర్ క్లస్టర్ వ్యవసాయ విస్తర్ణాధికారి జ్ఞానేశ్వర్ అన్నారు. రైతులు తమ ఆధార్కార్డు, పట్టాపాసుపుస్తకం, ఫోన్ నెంబర్ తదితర అంశాలను ఏఈవోలకు తెలిపితే వారు రిజిస్ట్రీ చేస్తారన్నారు. భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరిచే ప్రతి పథకం, కార్యక్రమానికి ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి అన్నారు. క్టస్టర్లో మిగిలిపోయిన రైతులు రైతువేదికలో సంప్రదించాలన్నారు. గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో అక్రమంగా చేపడుడుతన్న ఇంటి పనులను గురువారం నిలిపివేసినట్లు పంచాయతీ కార్యదర్శి నాగరాజు తెలిపారు. కార్యదర్శి మాట్లాడుతూ..‘ గ్రామానికి చెందిన కొక్కొండ భాస్కర్ తన పాత ఇంటిని కూల్చి అదే స్థలంలో కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టారు. అయితే గ్రామ పంచాయతీ నుంచి పాత ఇంటి స్థలం వరకే అనుమతి ఇచ్చామన్నారు. కాని ఆయన అనుమతి పొందిన స్థలంకాకుండా మరో మూడు అడుగులు ముందుకు జరిగి దారిని ఆక్రమించే ప్రయత్నం చేశాడు. దీంతో 15 రోజుల క్రితం గ్రామాభివృద్ధి కమిటీతో పాటు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. నిర్మాణ పనులను పరిశీలించి అనుమతి ఉన్నంత వరకే ఇంటి నిర్మాణం చేపట్టాలని సూచించాం. గ్రామ పంచాయతీ సూచనలను పట్టించుకోకుండా నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభించాడు. గురువారం మళ్లీ గ్రామాభివృద్ది కమిటీ సభ్యులతో పాటు గ్రామస్తులు ఇంటి నిర్మాణ పనులను నిలిపి వేయాలని ఫిర్యాదు చేశారు. ఇంటి స్థలాన్ని పరిశీలించి పిల్లర్ల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన సెంట్రింగ్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నాం’ అని తెలిపారు. గాంధారి(ఎల్లారెడ్డి): ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో శ్రీహరి అన్నారు. గురువారం ఆయన పలు పాఠశాలలను, వేసవి శిక్షణ శిబిరాను పరిశీలించారు. శిబిరాల్లో ఎంత మంది విద్యార్థులు శిక్షణకు హాజరువుతున్నారు, వారికి సరియైన మౌ లిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా లేదా అనే విషయాలను ఉపాధ్యాయులను అ డిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు. దోమకొండ: అంబారీపేట గ్రామంలో ఉన్న వేంకటేశ్వర ఆలయం, శివాలయాన్ని పునరుద్ధరించడానికి గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ గునిగంటి ప్రభాకర్రావ్ ముందుకు వచ్చారు. ఈ మేరకు గురువారం తన సొంత నిధులు రూ.25లక్షలతో పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేశారు. ఆయన అమెరికాలో కార్డియాలజిస్ట్ కాగా, ఆయన తరపున వారి మేనకోడలు సురభి నిర్మల సత్యంరావులు పనులకు శంకుస్థాపన చేశారు. పుట్టిన ఊరిలో రెండు పురాతన దేవాలయాలు శిథిలావస్థలకు చేరాయని ఆయనకు గ్రామస్థులు ద్వారా సమాచారం అందించగా వెంటనే స్పందించి తన బంధువులతో పనులకు శ్రీకారం చుట్టారని సర్పంచ్ అరుట్ల కవిత అనిల్ తెలిపారు. ఉప సర్పంచ్ సత్తాగౌడ్, ఆలయ అర్చకులు కృష్ణమాచార్యులు, దేవదాయ కమిటీ అధ్యక్షులు నీల గంగాధర్, తదితరులున్నారు. -
ఆధ్యాత్మిక చింతనలో బాలలు
మోర్తాడ్ మండలం సుంకెట్లోని శ్రీకృష్ణ మందిరంలో భగవద్గీత పారాయణం చేస్తున్న భక్తులు, పాల్గొన్న చిన్నారులు మోర్తాడ్(బాల్కొండ): ప్రపంచంలోనే అత్యంత ప్రామాణిక, ధార్మిక గ్రంథంగా కీర్తింపబడుతున్న భగవద్గీతను పారాయణం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారీ చిన్నారులు. వేసవి సెలవులను కాలక్షేపం కోసం కాకుండా ధార్మిక సేవపై దృష్టి సారించిన మోర్తాడ్ మండలం సుంకెట్ చిన్నారులు భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేయడంతోపాటు అవగాహన పెంపొందించుకుంటున్నారు. శ్రీకృష్ణ మందిరంలో రోజూ సాయంత్రం గీతా పారాయణ కార్యక్రమాన్ని భక్తులు రాజేందర్, కత్తి గంగాధర్, గోవర్దన్ నిర్వహిస్తుండగా గ్రామంలోని చిన్నారులు భాగస్వాములు అవుతున్నారు. భగవద్గీత ప్రాముఖ్యత గురించి ఎందరో మహానుభావులు గొప్ప గా వర్ణించారు. అందుకే తాము చదవలేకపో యినా మా చిన్నారులైనా శ్లోకాలను పఠించి అందులోని పరమార్థాన్ని గ్రహిస్తే తాము ఎంతో భా గ్యవంతులమైనట్లే అని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు.చిన్న వయస్సులోనే గీతా శ్లోకా లను కంఠస్థం చేయడం, అవగాహన పెంపొందించుకోవడంపై దృష్టి సారించిన చిన్నారుల ను అభినందించాల్సిందే. రోజుకు కొన్ని శ్లోకాలను చదువుతూ అర్థం తెలుసుకుంటున్నాం. మాకు అర్థం అయ్యేలా శ్లోకాల పూర్తి వి వరాలను చెబుతున్నారు. గీ తా పారాయణం ఎంతో బా గుంది. పోటీ పడి శ్లోకాలను కంఠస్థం చేస్తున్నాం. – శ్రీవాణి రోజూ సాయంత్రం ఎప్పుడెప్పుడవుతుందీ.. గీతా పారాయణానికి వెళ్లాలనే కాంక్ష మాలో బలంగా ఉంది. మాకు గీతా శ్లోకాలను చెప్పేవారు ఆలయం వద్దకు వెళ్లకముందే మేమే వెళుతున్నాం. గీతా గ్రంథాలను చదువుతున్నాం. – మాన్విత వేసవి సెలవులను వృథా కానివ్వకుండా గీతా శ్లోకాలను చదువుకుంటున్నాం. ఇంటివద్ద ఉన్నప్పుడు కూడా శ్లోకాలను చదువుకుంటూ అ ర్థం తెలుసుకుంటున్నాం. మా గ్రామంలో గీతా శ్లో కాలు చదివే కార్యక్రమం ఎంతో బాగుంది. – వర్షిత గీతా శ్లోకాలపై పోటీలను నిర్వహిస్తే మేము తప్పకుండా పాల్గొంటాం. రోజు కొన్ని శ్లోకాలను నేర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మా తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. – శ్రీనిత గీతా పారాయణంతో చదువుపై ఆసక్తి పెరిగింది. గీతలో శ్రీకృష్ణుడు ఎన్నో గొప్ప విషయాలను చెప్పడం అదంతా మన జీవితంతో ముడిపడి ఉందనే విషయాన్ని తెలుసుకున్నాం. చేసే పనిపై పట్టు సంపాదించడానికి గీతా పారాయణం తోడ్పడుతుంది. – హరిగ్న ప్రతి ఒక్కరూ గీతా శ్లోకాలను చదువుకోవాలి. మనిషి జీవితం మొత్తం ఈ గ్రంథంపైనే ఆధారపడింది. మేము ఆటలాడుకోవడం కన్నా గీతా శ్లోకాలను నేర్చుకోవడంపైనే ఆసక్తిని పెంపొందించుకున్నాం. – వరునిత భగవద్గీత శ్లోకాలను పాఠశాలల్లోనూ నేర్పించాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ గ్రంథం ఎంతో కీలకమైంది. గీతా పారాయణంతో మాకు ఎంతో అవగాహన వచ్చింది. మొదట్లో కొంత ఇబ్బంది అనిపించినా ఇప్పుడు సంతోషంగా ఉంది. – ప్రణవి సెలవుల్లో గీతా పారాయణం భగవద్గీత శ్లోకాలను కంఠస్థం చేస్తున్న చిన్నారులు ఆదర్శంగా నిలుస్తున్న సుంకెట్ విద్యార్థులు -
మక్కల కొనుగోళ్లను వేగవంతం చేయాలి
● హమాలీల సంఖ్య పెంచండి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: జిల్లాలో మక్కల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. మండలాలవారీగా మొక్కజొన్న కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలని సహకార శాఖ అధికారులకు సూచించారు. సొసైటీ స్థాయిలో హమాలీల సంఖ్యను పెంచాలన్నారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని ఆదేశించారు. ఇప్పటికే గుర్తించిన గోదాములను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. లారీ రవాణా కాంట్రాక్టర్ అవసరమైనన్ని లారీలను సమకూర్చాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, జిల్లా సహకార, మార్కెటింగ్, సివిల్ సప్లయ్ శాఖలు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధికారులు పాల్గొన్నారు. ఎన్యుమరేటర్లకు సహకరించాలి కామారెడ్డి క్రైం: గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పాలన అధికారులు, పట్టణ ప్రాంతాల్లో వార్డ్ అధికారులు, బిల్ కలెక్టర్లు జనగణన ఎన్యుమరేటర్లకు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. జనగణన–2027 లో భాగంగా చేపడుతున్న గృహ గణన, జాబితా తయారీపై గురువారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు పలు సూచనలు ఇచ్చారు. ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన బ్లాక్ పరిధిలో గృహాల వివరాలను ఆన్లైన్ యాప్ ద్వారా నమోదు చేయాలన్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఉదయం, సాయంత్రం వేళల్లో వివరాలు సేకరించాలని సూచించారు. -
జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించాలి
భిక్కనూరు: జనగణన ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. గురువారం ఆయన రాజంపేటలో జనగణన సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళికలు, సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు జనాభా వివరాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. గడుపులోపు సర్వే పూర్తి చేయాలని ఎన్యుమరేటర్లకు సూచించారు. కొనుగోలు కేంద్రాల పరిశీలన రాజంపేట, ఆరుగొండ, ఎల్లారెడ్డిపల్లి గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. హమాలీల కొరత, లారీల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యావారోత్సవాల్లో భాగంగా రాజంపేట బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొన్నారు. విద్యార్థులకు సూచనలిచ్చారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించినవారిని సత్కరించారు. బాలికల పాఠశాలలో గదుల పరిస్థితిని ప్రజలు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా.. మరమ్మతులకు అంచనాలను తయారుచేయాలని పంచాయతీరాజు అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీ నిధులలోంచి 50 శాతం నిధులను గదుల మరమ్మతులకు వినియోగించుకోవాలని, మిగతా నిధులను ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీకాంత్, డీఈవో రాజు ఎంపీడీవో బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
నిజాంసాగర్(జుక్కల్): మంజీరా నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 8 ట్రాక్టర్లను గురువారం ఉదయం పట్టుకొని సీజ్ చేసినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. మండలంలోని మాగి, అచ్చంపేట గ్రామ శివారుల్లోని మంజీరా నది నుంచి నిజాంసాగర్కు ఇసుకను తరలిస్తుండగా ట్రాక్టర్లను పట్టుకున్నామని చెప్పారు. ట్రాక్టర్లను స్వాధీనం చేసుకోవడంతోపాటు వారిపైన కేసు నమోదు చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల అనుమతుల పేరిట అక్రమంగా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ● ఇద్దరికి గాయాలు రుద్రూర్: కోటగిరి మండలం ఎత్తొండ గ్రామ శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలైనట్లు స్థానికులు తెలిపారు. కోటగిరికి చెందిన సాత్విక్, సాయిలు కారులో ప్రయాణిస్తుండగా ఎత్తొండ క్యాంపు సమీపంలో అదుపు తప్పిన కారు డివైడర్ను ఢీకొట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. -
పూర్వ విద్యార్థుల సహకారం అవసరం
బాన్సువాడ రూరల్: కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారం ఎంతో అవసరమని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా. గంగాధర్ అన్నారు. గురువారం కళాశాలలో ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యావారోత్సాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన తల్లిదండ్రులు, పూర్వవిద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. అందరి సహకారంతో కళాశాల దినదినాభివృద్ధి సాధిస్తోందన్నారు. ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులను కళాశాలలో చేర్పించే బాధ్యత పూర్వవిద్యార్థులపై ఉందన్నారు. అనంతరం పేరెంట్స్ బాలయ్య, గంగారాం, సాయిలుతో పాటు పూర్వ విద్యార్థులు సుధాకర్రెడ్డి, శేఖర్, శ్రీనివాస్లను సన్మానించారు. వైస్ ప్రిన్సిపల్ గులాం ముస్తాఫా, సిబ్బంది పాల్గొన్నారు. -
కామారెడ్డి ఆర్టీసీ బస్స్టేషన్ విచారణ నంబర్ మార్పు
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి ఆర్టీసీ బస్స్టేషన్ విచారణ నంబర్ను మార్చినట్లు డీపో మేనేజర్ దినేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికులు బస్సు వేళలు, ఇతర వివరాల కోసం ఇకపై 73828 44080 నంబర్కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు.భిక్కనూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే బడి బాట కార్యక్రమం షెడ్యూల్ను పునఃపరిశీలించాలని తపస్ రాష్ట్ర కార్యదర్శి పుల్గం రాఘవరెడ్డి కోరారు. గురువారం ఆయన భిక్కనూరులో విలేకరులతో మాట్లాడారు. జనగణనలో మెజారిటీ ఉపాధ్యాయులు పాల్గొంటున్నారని, అదే సమయంలో ప్రభుత్వం బడిబాటను ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రెండు రకాలైన ప్రభుత్వ కార్యక్రమాలను నిర్వహించడం వల్ల ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందన్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. కామారెడ్డి అర్బన్: తల్లిదండ్రులు తమ పిల్ల ల క్రమశిక్షణ, అభివృద్ధిపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్కుమార్ సూచించారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా గురువారం కళాశాలలో తల్లిదండ్రులు –అధ్యాపకుల సమావేశం నిర్వహించారు. విద్యార్థుల ప్రగతి, తరగతులకు హాజరయ్యే తీరు, వ్యక్తిత్వ వికాసం, పరీక్షల విధానం, సౌకర్యాలు, అధ్యాపకుల బోధన శైలి తదితర అంశాలను తల్లిదండ్రులకు వివరించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, సమన్వయకర్తలు జయప్రకాష్, విశ్వప్రసాద్, సుధాకర్, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: ఆలయాల భూములను పరిరక్షించే బాధ్యత సంబంధిత అధికారులపై ఉంటుందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామారావు అన్నారు. నగరంలోని సర్వే నంబర్ 341,342లో నీలకంఠేశ్వర ఆలయ భూముల సర్వేను గురువారం చేపట్టారు. 3 ఎకరాల 9 గుంటల భూమిలో ఆక్రమణలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. మాయమైన నీడ ఖలీల్వాడి(నిజామాబాద్ అర్బన్): సూర్యుని కిరణాలు నిటారుగా పడడంతో గురువారం మధ్యాహ్నం 12.14 గంటల ప్రాంతంలో నీడ మాయమైంది. ఈ అరుదైన ‘నో షాడో డే’ను వీక్షించేందుకు జిల్లా కేంద్రంలోని పీఎంశ్రీ జెడ్పీ హైస్కూల్ (శంకర్భవన్) కోటగల్లీలో గురువారం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాటర్ బాటిళ్లు, నిలువు కర్రలు ఆరుబయట ఉంచి నీడమాయమైన (నోషాడో) దృశ్యాన్ని వీక్షించారు. ఇలాంటి ఘటనలు అరుదుగా చోటు చేసుకుంటాయని జిల్లా సైన్స్ అధికారి గంగాకిషన్ తెలిపారు. -
సెలవుల్లో సరదాగా..
మాలోత్ ఇందు 5వ తరగతి గ్రామం: తిమ్మారెడ్డి తండా మండలం: ఎల్లారెడ్డి జిల్లా: కామారెడ్డి బి.కళ్యాణ్ప్రసాద్ నిజామాబాద్. ఎల్లారెడ్డిరూరల్: వేసవి సెలవులను చిన్నారులు ఆనందంగా గడుపుతున్నారు. మండలంలోని వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో చిన్నారులు చెట్ల కింద గోళీలాడుతూ, టైర్లతో గ్రామంలో తిరుగుతూ కనిపించారు. చెట్టు కింద గోళీలు, ఉదయం, సాయంత్రం టైర్లతో ఆడుతూ సంతోషంగా గడుపుతామని చిన్నారులు చెప్తున్నారు. -
రైతుల పాలిట శాపంగా కాంగ్రెస్ ప్రభుత్వం
● మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే ● మద్నూర్లో రైతు మహాధర్నామద్నూర్(జుక్కల్): రైతుల పాలిట కాంగ్రెస్ పార్టీ శాపంగా మారిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్సింధే విమర్శించారు. వరి ధాన్యం, మొక్కజొన్న, జొన్న పంట కొనుగోళ్లలో జరుగుతున్న ఆలస్యంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారన్నారు. మండల కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంగణంలో గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సింధే పాల్గొని మాట్లాడారు. ఖరీఫ్ కాలం సమీపిస్తున్నా రైతులు ఇంకా పంటలను అమ్ముకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు, ప్రజలకు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్.. ఇచ్చిన హామీలను పక్కనపెట్టి మోసం చేసిందని దుయ్యబట్టారు. హంగూ ఆర్భాటాలకే స్థానిక ఎమ్మెల్యే పరిమితమయ్యారని విమర్శించారు. తన హయాంలోనే ఆరు మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేసినా ఇప్పటికీ ఏ మండలంలో కూడా సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయలేదని విమర్శించారు. అనంతరం తహసీల్ కార్యాలయానికి తరలివెళ్లి వినతి పత్రం అందించారు. ఆందోళనలో పార్టీ మండల అధ్యక్షుడు బన్సీ పటేల్, నాయకులు కృష్ణపటేల్, విజయ్, హన్మాండ్లు, రాజేశ్వర్గౌడ్, రవి తదితరులు పాల్గొన్నారు. -
‘ఏబీసీకి తరలించాలి’
కామారెడ్డి క్రైం: గ్రామపంచాయతీలు, ము న్సిపాలిటీల పరిధిలో ఉన్న వీధి కుక్కలను గుర్తించి, వాటిని ఏబీసీ (యానిమల్ బర్త్ కంట్రోల్) సెంటర్కు తరలించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లాలో వీధి కుక్క ల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీధి కుక్కలతో ఎలా వ్యవహరించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై వి ద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ప్రస్తుతం కామారెడ్డిలో ఉ న్న ఏబీసీ సెంటర్కు అదనంగా మరో రెండు ఏబీసీ సెంటర్ల ఏర్పాటు కోసం తగిన స్థలం, భవనాల గుర్తించాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్ట ర్ గిరి, జెడ్పీ సీఈవో చందర్, వెటర్నరీ, పశు సంవర్ధక, మున్సిపల్, జిల్లా పంచాయతీ శా ఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కామారెడ్డి టౌన్ : జిల్లాలో బుధవారం ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షలకు 513 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 34 మంది గైర్హాజరయ్యారు. మద్యాహ్నాం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు 1,830 మందికిగానూ 1734 మంది హాజరయ్యారు. పరీక్షలను జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం పర్యవేక్షించారు. ప్రశాంతంగా పాలిసెట్ కామారెడ్డి అర్బన్: పాలిసెట్ బుధవారం ప్రశాంతంగా ముగిసిందని సెట్ జిల్లా కన్వీనర్, కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్కుమార్, పరిశీలకుడు మోహన్కుమార్ తెలిపారు. 2,643 మంది విద్యార్థుల కోసం కామారెడ్డి పట్టణంలో 6 కేంద్రాలు ఏర్పాటు చేశామని, పరీక్షకు 2,502 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఇందులో బాలికలు 1,464 మంది, బాలురు 1,117 మంది ఉన్నారని తెలిపారు. 62 మంది బాలురు, 79 మంది బాలికలు పరీక్షకు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. హెచ్పీఎస్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం కామారెడ్డి అర్బన్: బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒకటో తరగతిలో ప్రవేశం కోసం ఎస్సీలనుంచి దరఖాస్తుల కోరుతున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు రెండు సీట్లు కేటాయించారని, ఆసక్తిగలవారు ఈనెల 29 వరకు దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. విద్యుత్ డీఈ (అపరేషన్)గా నందకుమార్ కామారెడ్డి అర్బన్: ఎన్పీడీసీఎల్ కామారెడ్డి అపరేషన్ విభాగం డివిజనల్ ఇంజినీర్గా నందకుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన కల్యాణ చక్రవర్తి ప్రమోషన్పై ఎంఆర్టీ విభాగానికి బదిలీ అయ్యారు. బాధ్యతలు తీసుకున్న నందకుమార్, బదిలీ అయిన కల్యాణ చక్రవర్తిలను వివిధ విద్యుత్ యూనియన్ల నాయకులు, ఇంజినీర్లు, సిబ్బంది సన్మానించారు. నేడు భారతీయ కిసాన్ సంఘ్ సమావేశం కామారెడ్డి అర్బన్: భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా సమావేశాన్ని గురువారం నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విఠల్రెడ్డి, శంకర్రావు తెలిపారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని లింగాపూర్ గేట్ వద్ద కొమిరెడ్డి చిన్న అంజన్న వ్యవసాయ క్షేత్రంలో ఉదయం 11.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రతినిధులు సకాలంలో హాజరు కావాలని కోరారు. నిబంధనలు పాటించాలి గాంధారి: కొనుగోలు కేంద్రాల నిర్వాహకు లు, రైతులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ సూచించారు. ఆయన బుధవారం మానిటరింగ్ అధికారి సురేష్తో కలిసి గుర్జాల్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొనుగోలు కేంద్రంవద్ద ఆరబెట్టిన, కాంటా చేసిన మొ క్కజొన్నలను పరిశీలించారు. నిర్వాహకుల కు పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మన్ ఉద్దల్సింగ్, ఏఈవో విఘ్నేష్, రైతులు ఉన్నారు. -
ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం
● చెక్పోస్ట్ల వద్ద 24 గంటల తనిఖీలు ● ఎస్పీ రాజేశ్ చంద్రకామారెడ్డి క్రైం: గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. బక్రీద్ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించేందుకు డీజీపీ సీవీ ఆనంద్ బుధవారం అన్ని జిల్లాల ఎస్పీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సూచనలు, సలహా లు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేశ్ చంద్ర మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన ముందస్తు జాగ్రత్త చర్యలను వివరించారు. అంతర్జిల్లా సరిహద్దుల్లో 6 చెక్పోస్టులు ఏర్పాటు చేసి 24 గంటల తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా చూసేందుకు జిల్లా అంతటా మత పెద్దలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రెవెన్యూ, వెటర్నరీ, పోలీసు అధికారుల తో కలిసి ఎస్పీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. ప్రార్థన స్థలాలు, ప్రధాన కూడళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, వెటర్నరీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్ర సమీపంలోని పెద్దవాగులో ప్రమాదవశాత్తు వాగులో పడి ఒకరు మృతి చెందినట్లు ఎస్సై దీపక్కుమార్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన మంద అనిల్కుమార్(28) ఫిట్స్తో బాధపడుతున్నాడు. ఈ నెల 11న ఉదయం ఇంటి నుంచి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాలేదు. బుధవారం ఉదయం పెద్దవాగులోని గుర్రం మడుగులో అనిల్కుమార్ మృతదేహం నీటిపై తేలడాన్ని స్థానికులు గమనించి సమాచారం అందించారు. భార్య భవానీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. గల్ఫ్లో రాజంపేట యువకుడు.. భిక్కనూరు: రాజంపేట మండల కేంద్రానికి చెందిన యువకుడు గల్ఫ్లో మృతి చెందినట్లు గ్రామస్తులు బుధవారం తెలిపారు. గ్రామానికి చెందిన జొన్నల బాలకృష్ణ (24) కొన్నేళ్లుగా గల్ఫ్ దేశానికి వలస వెళ్తున్నాడు. ఆరు నెలల క్రితం రాజంపేటకు వచ్చి తిరిగి బహ్రెయిన్ దేశానికి వెళ్లి పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం తోటి మిత్రులు బాలకృష్ణ్ణను నిద్రలేపడానికి ప్రయత్నించగా లేవలేదు. నిద్రలోనే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని కుటుంబీకులకు సమాచారం అందించారు. -
ఈ ఏడాది 499 సెల్ఫోన్ల రికవరీ
● ఎస్పీ రాజేష్ చంద్ర కామారెడ్డి క్రైం: ప్రతి నెలా వందకు పైగా సెల్ఫోన్ల రికవరీ చేస్తున్నామని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ ఏడాది ఇప్పటివరకు 499 సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. ఎవరైనా సెల్ఫోన్ పోగొట్టుకుంటే ఆందోళనకు గురి కావద్దన్నారు. సీఈఐఆర్ విధానంలో సెల్ఫోన్ రికవరీ చేయడానికి అవకాశం ఉందన్నారు. జిల్లాలో గత నెల రోజులుగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో భాగంగా బాధితులు పోగొట్టుకున్న, చోరీకి గురైన 115 సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు తెలిపారు. వాటి విలువ దాదాపు రూ.19 లక్షలు ఉంటుందన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా మ్తొతం రూ.7.64 కోట్ల విలువైన 4,780 సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు. ఎవరైనా సెల్ఫోన్ పోగొట్టుకుంటే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు భద్రతా కారణాల దృష్ట్యా వెంటనే పాత సిమ్ కార్డును బ్లాక్ చేయించాలని సూచించారు. రికవరీ చేసిన ఫోన్ల వివరాలను బాధితులకు తెలియపరుస్తామన్నారు. వారు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఆర్ఎస్సై బాల్రాజు (87126 86114) ను సంప్రదించి ఫోన్లు తీసుకువెళ్లాలని సూచించారు. ఏఎస్పీ నరసింహా రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
పదిలో ముందస్తు రైడ్స్
రుద్రూర్: పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు ముందు పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు ని ర్వహిస్తుంటారు. కానీ, ఈ స్వచ్ఛంద సంస్థ మా త్రం తొమ్మిదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల ను పదో తరగతి కోసం సన్నద్ధం చేస్తోంది. వేసవి సెలవులను పిల్లలు వృథా చేయకుండా ప్రతి రోజు ఉదయం మూడు గంటలపాటు నిష్ణాతులైన ఉపాధ్యాయులతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోందీ రుద్రూర్లోని రైడ్స్ స్వచ్ఛంద సంస్థ. మండల కేంద్రానికి చెందిన పూర్వ విద్యార్థులు రుద్రూర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ సొసైటీ (రైడ్స్) ఆధ్వర్యంలో రెండేళ్లుగా నిష్ణాతులైన ఉపాధ్యాయుల సహకారంతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. గత నెల 27న ప్రారంభమైన తరగతులు ఈ నెల 27 వరకు కొనసాగనున్నాయి. ప్రతి ఉదయం 8 నుంచి 11 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 108 మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకోగా, ప్రతిరోజూ సుమారు 80 మంది హాజరవుతున్నారు. గత ఏడాది శిక్షణ పొందిన విద్యార్థులు మంచి మార్కులు సాధించడంతో వారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ ఏడాది సమీప గ్రామాల నుంచి విద్యార్థులు హాజరవుతున్నారు. వీరికి వివిధ సబ్జెక్టుల్లో నిష్ణాతులైన 17 మంది ప్రభుత్వ, ప్రయివేటు ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బోధిస్తున్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ పరీక్షలపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యాబోధనతోపాటు యోగా, ఆరోగ్యంపై కూడా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ దాతల సహకారంతో విద్యార్థులకు అల్పాహారం అందజేస్తున్నారు. 1995–96 ఎస్సెస్సీ బ్యాచ్కు చెందిన రైడ్స్ సభ్యులు విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. -
నాలుగు రోజుల్లో కొనుగోళ్లు పూర్తవ్వాలి
రామారెడ్డి: వడ్ల కొనుగోలు ప్రక్రియను నాలుగు రో జుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన గిద్ద గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీరు, ఓఆర్ ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వ సేవలు అందేలా చర్య లు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట సివి ల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు, డీఆర్డీవో సురేంద ర్, సివిల్ సప్లై డీఎం శ్రీకాంత్, తహసీల్దార్ ఉమాల త, ఏవో భానుశ్రీ తదితరులున్నారు. సదాశివనగర్: మక్కల కొనుగోళ్లను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. బుధవారం ఆయన ఉత్తునూర్లోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే తూకాలు చేయాలన్నారు. కేంద్రాల వద్ద తాగునీరు, నీడ వసతి, ఏఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. ఇప్పటికే 5 వేల క్వింటాళ్ల మొక్కజొన్నలను గోదాంలకు తరలించామన్నారు. మిగిలిన స్టాక్ను పది రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గిరి, డీఎస్వో రామ్మోహన్, మండల ప్రత్యేకాధికారి సతీష్ యాదవ్, విండో చైర్మన్ ప్రభాకర్, విండో సీఈవో నహీం, తహసీల్దార్ సత్యనారాయణ, సర్పంచ్ శ్రీనివాస్గౌడ్, ఉప సర్పంచ్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ బడిలోనే చదివిస్తాం
మాచారెడ్డి: తమ పిల్లలను ప్రభుత్వ బడిలోనే చదివిస్తామని బుధవారం లచ్చాపేట గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అడ్మిషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఎంఈవో దేవేందర్ రావు ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ పిల్లల్ని ప్రైవేట్ బడికి పంపకుండా ప్రభుత్వ బడికి పంపుతామని ప్రతినబూనారు. గ్రామస్తుల నిర్ణయంతో ఎంఈవో, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఉన్నత పాఠశాల హెచ్ఎం రాజేశ్వర్ రెడ్డి, పీఎస్ హెచ్ఎం శైలజ, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ ఆంజనేయులు, తదితరులు ఉన్నారు. నిజామాబాద్ అర్బన్: నగరంలోని వినాయక్నగర్ నాగా టవర్స్లో బుధవారం దుండగులు చోరీకి పాల్పడ్డారు. 204 ప్లాట్ నంబర్లో నందిపేటలో ఏఎన్ఎంగా విధులు నిర్వర్తించే కొత్తూరు వనజ నివసిస్తున్నారు. ఉదయం 8 గంటలకు డ్యూటీకి వెళ్లి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చేసరికి మెయిన్ డోర్ తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. 5 తులాల బంగారం, 15 తులాల వెండి, రెండు ఉంగరాలు అపహరణకు గురైనట్లు 4వ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్హెచ్వో సతీశ్ ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు. అపార్ట్మెంట్లో సీసీ ఫుటేజీని పరిశీలించగా ఇద్దరు వ్యక్తులు ప్లంబర్ పని ఉందని అపార్ట్మెంట్లోకి వచ్చినట్లు గుర్తించారు. -
సొంత భవనాలేవీ?
రైతు వేదికలో కొనసాగుతున్న పాల్వంచ తహసీల్దార్ కార్యాలయంసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా ఆవిర్భావ సమయంలోనే రాజంపేట, బీబీపేట, రామారెడ్డి, నస్రుల్లాబాద్, పెద్దకొడప్గల్ మండలాలు ఏర్పాటయ్యాయి. తర్వాత పాల్వంచ, డోంగ్లీ, మహ్మద్నగర్ మండలాలను ఏర్పాటు చేశారు. అయితే ఆయా మండలాల్లో మండల పరిషత్, తహసీల్ కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించకపోవడంతో అధికారులు, సిబ్బందితో పాటు పనుల కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ● రామారెడ్డి మండలం ఏర్పాటై పదేళ్లవుతోంది. ఇక్కడ మండల పరిషత్ కార్యాలయాన్ని మండల విద్యావనరుల కేంద్రం భవనంలో నిర్వహిస్తున్నారు. అదే భవనంలో ఎంఈవో కార్యాలయం కూడా ఉంది. తహసీల్ కార్యాలయం సొసైటీ భవనంలో కొనసాగుతోంది. పోలీస్ స్టేషన్కు గ్రామ పంచాయతీ భవనాన్ని కేటాయించి, పంచాయతీని ఆయూష్ భవనంలో నిర్వహిస్తుండడం గమనార్హం. ఈ మండలంలో అన్ని కార్యాలయాలు అవస్థల మధ్యే కొనసాగుతున్నాయి. ● రాజంపేట మండలంలో మండల పరిషత్ కార్యాలయం మండల విద్యావనరుల కేంద్రంలో, తహసీల్ కార్యాలయం పీహెచ్సీ భవనంలో, పోలీస్ స్టేషన్ సొసైటీ భవనంలో నిర్వహిస్తున్నారు. ఎంఈవో కార్యాలయాన్ని పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ● బీబీపేట మండలం పరిస్థితీ అంతే.. మండల పరిషత్ కార్యాలయాన్ని మండల విద్యావనరుల కేంద్రంలో, తహసీల్ కార్యాలయాన్ని సొసైటీ భవనంలో, ఎంఈవో కార్యాలయాన్ని స్కూల్ భవనంలో నిర్వహిస్తున్నారు. ఐకేపీ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది. ● డోంగ్లీ మండలంలో మండల పరిషత్ కార్యాలయం సొసైటీ భవనంలో, తహసీల్ కార్యాలయం రైతువేదికలో ఉన్నాయి. ● మహ్మద్నగర్ మండలంలో మండల పరిషత్, తహసీల్ కార్యాలయాలను పాత, కొత్త పంచాయతీ భవనాల్లో ఏర్పాటు చేశారు. ● పాల్వంచ మండలంలో మండల పరిషత్ను గ్రామ పంచాయతీ భవనంలో, రెవెన్యూ కార్యాలయాన్ని రైతు వేదికలో నిర్వహిస్తున్నారు. ● నస్రుల్లాబాద్ మండలంలో మాత్రం స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి ఇంటిగ్రేటెడ్ భవనం కోసం నిధులు తీసుకువచ్చారు. అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ పూర్తవడంతో అందులో మండల పరిషత్, రెవెన్యూ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన సబ్ సెంటర్ భవనంలో కొనసాగుతోంది. జిల్లా ఏర్పాటైన ఏడాదికే కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాల భవనాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. దీంతో కలెక్టరేట్ సముదాయం, పోలీసు కార్యాలయాల నిర్మాణాలు పూర్తయి అందులోనే ఆఫీసులు కొనసాగుతున్నాయి. అయితే డివిజన్ కేంద్రాలు, మండల కేంద్రాల్లో కార్యాలయాలకు మాత్రం నిధులు ఇవ్వడం లేదు. దీంతో ఇతర శాఖల భవనాల్లో, అరకొర సౌకర్యాల మధ్య నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. మండలాల్లో ఏ చిన్న పని అయినా ప్రజలు మండల కార్యాలయాలకు వెళ్లాల్సిందే. ఆఫీసులకు వెళ్లిన వారంతా అక్కడి పరిస్థితులను చూసి అవాక్కవుతున్నారు. సొంత భవనాలు నిర్మించకపోవడంతో అధికారులు, సిబ్బందితో పాటు ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. మండలాల్లో ఇంటిగ్రేటెడ్ భవనాలు నిర్మించాలని కోరుతున్నారు. పాలనా సౌలభ్యం కోసం కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలను ఏర్పాటు చేసిన సర్కారు.. ఏళ్లు గడుస్తున్నా ఆయా కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించడంపై దృష్టి సారించడం లేదు. దీంతో ఇతర శాఖల భవనాల్లోనే ప్రధాన కార్యాలయాలను నెట్టుకొస్తున్నారు. స్థలం సరిపోక, సరైన వసతులు లేక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.కొత్త మండలాల ఏర్పాటుతోనే సరి.. కార్యాలయాలకు భవనాల నిర్మాణంపై దృష్టి సారించని సర్కారు ఇతర కార్యాలయాలలోనే సేవలు ఇబ్బందులు పడుతున్న అధికారులు -
వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభం
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఉచిత వేసవి క్రికెట్ కోచింగ్ క్యాంప్ బుధవారం ప్రారంభమైంది. కౌన్సిలర్ అర్కల ప్రభాకర్ యాదవ్, జిల్లా క్రీడా అధికారి రంగ వెంకటేశ్వర్ గౌడ్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రికెట్ ఎంతో ఖర్చుతో కూడుకున్న క్రీడ అని, గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడానికే హెచ్సీఏ ఉచిత శిక్షణను అందిస్తోందని తెలిపారు. అండర్–15, అండర్–19, ఓపెన్ కేటగిరీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు జిల్లా, రాష్ట్రస్థాయి సెలక్షన్లలో ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు. క్రీడలు యువతను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచి, మానసిక ధైర్యా న్ని, ఉజ్వల భవిష్యత్తును అందిస్తాయని తెలిపారు. కామారెడ్డి క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోజాం అలీ ఖాన్, కోచ్లు రామకృష్ణ, రియాజ్, క్రీడాకారులు పాల్గొన్నారు. నేను గీసిన చిత్రం● చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే ఆ వంకర టింకరవి ఏమి కాయలని అడిగిందట! (కొద్దిగా సంపద రాగానే తన గతాన్ని, మూలాలను మరిచిపోయి, అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్లు నటించే వారి అహంకారాన్ని ఈ సామెత ఎత్తి చూపుతుంది.) ● ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు! (ఇల్లు కట్టడం, పెళ్లి చేయడం ఎంత కష్టమో అనుభవిస్తే తెలుస్తుంది.) మాలోత్ పల్లవి, 6వ తరగతి గ్రామం : తిమ్మారెడ్డి తండా, మం : ఎల్లారెడ్డి, జిల్లా : కామారెడ్డి. -
గోశాలకు విరాళం
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ గోశాలకు మండలంలోని సుల్తాన్పేట్కు చెందిన సంతోష్ పాటిల్ బుధవారం రూ.11 వేల విరాళాన్ని గోశాల నిర్వాహకులకు అందించారు. గోశాలలో ఆవులు కోసం మేత, వాటి నిర్వహణకు తనవంతు సహాయంగా ఈ నగదును అందించినట్లు ఆయన తెలిపారు. తన కుమారుడు వేదాంత్ పుట్టిన రోజు సందర్బంగా బర్త్డే వేడుకకు అయ్యే ఖర్చును గోశాలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఐదేళ్లుగా తన కుమారుడు ప్రతి పుట్టిన రోజున గోశాలకు విరాళం అందిస్తున్నానని తెలిపారు. కామారెడ్డి అర్బన్: విద్యా వారోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వివిధ కోర్సుల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు విష్ణు, రూప, నేహ, లక్ష్మి, ప్రసన్న, మమత, మౌనిక, వంశీకృష్ణ, మీనా, అక్షయ, రత్న, ఫాతిమా, వర్షిణిలను సన్మానించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయ్కుమార్, వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, వార్డు కౌన్సిలర్ సురోజు వనిత, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: మేరు కుల కార్పొరేషనన్కు నూతనంగా నియమితులైన రాష్ట్ర చైర్మన్ సంఘ వెంకట్ రాజాం, వైస్ చైర్మన్ మాడిశెట్టి లక్ష్మీనారాయణలను జిల్లా, పట్టణ మేరు సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ప్రతి మేరు కుల సభ్యునికి అండగా ఉంటూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం జిల్లా, పట్టణ సంఘాల నాయకులు తమ సమస్యలపై చైర్మన్కు వినతిపత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షులు ఎస్. నారాయణ, గౌరవ అధ్యక్షులు కొత్తకొండ భాస్కర్, ప్రధాన కార్యదర్శి కొట్టూరు రఘునాథ్, కోశాధికారి ఆర్.సంతోష్, పట్టణ అధ్యక్షులు గట్ల బాలరాజు, గట్ల బాల్ చందర్, తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ: కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని బీఆర్ఎస్వీ మాజీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రవాటి సాయిబాబా అన్నారు. బుధవారం ఆయన బాన్సువాడలో మాట్లాడుతూ నీట్ ప్రశ్నాత్రం లీక్ కావడంతో పరీక్షనే రద్దు చేయాల్సిన దుస్థితి రావడం సిగ్గు చేటన్నారు. పకడ్బందీగా నిర్వహించాల్సిన పరీక్షలు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే లీక్ అయ్యాయని అన్నారు. నీట్ పరీక్ష లీకేజీకి పూర్తి బాధ్యత వహించి కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
ఢిల్లీలో జిల్లా యువకుడి ఆత్మహత్య
ఇందల్వాయి: మండలంలోని రూప్లనాయక్ తండాకి చెందిన విశాల్ నాయక్ (23) ఢిల్లీలో బుధవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన విశాల్ ఓ ప్రైవేట్ సంస్థలో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నాడు. ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. గురువారం రూప్లానాయక్ తండాలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు స్థానికులు తెలిపారు. మహిళ ..బోధన్ రూరల్: మండలంలోని కల్దుర్కి గ్రామానికి చెందిన లక్ష్మి(58) అనారోగ్యం, మతిస్థిమితం సరిగాలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. బుధవారం కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలికి కొడుకు, కూతురు ఉన్నారు. -
డివైడర్ను ఢీకొన్న బైక్
● భార్య మృతి, భర్తకు తీవ్రగాయాలు పిట్లం(జుక్కల్): మండలంలోని గద్దగుండు తండా శివారు జాతీయ రహదారిపై బుధవారం మధ్యా హ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దకొడప్గల్ మండల కేంద్రానికి చెందిన మారేపల్లి హన్మాండ్లు తన భార్య లక్ష్మి(48)తో ఎల్లారెడ్డి మండలం కళ్యాణిలో నిర్వహిస్తున్న బంధువుల వివాహానికి బైక్పై వస్తున్నారు. గద్దగుండు తండా సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో వెనుక కూర్చున్న లక్ష్మి కిందపడటంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. హన్మాండ్లుకి తీవ్రగాయాలయ్యాయి. మృతురాలి తల్లి మేత్రి సాయవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
‘అంతిమ’ కష్టాలు!
● వైకుంఠధామంలో వెలగని దీపాలు ● హెడ్లైట్ల వెలుతురులో దహన సంస్కారాల నిర్వహణ కామారెడ్డి టౌన్ : గౌరవప్రదంగా సాగాల్సిన అంతి మ సంస్కారాలు.. అష్టకష్టాల మధ్య నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా జిల్లాకేంద్రంలోని శ్మశాన వాటికలలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో అంత్యక్రియల నిర్వహణకూ ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లా కేంద్రానికి చెందిన ఓ మహిళ బుధవారం మరణించగా కుటుంబ సభ్యులు అంత్యక్రియలకో సం రాత్రి రాజీవ్నగర్ శ్మశానవాటికకు తీసుకువెళ్లా రు. అయితే అక్కడ కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేదు. ఒక్క బల్బ్ కూడా వెలగకపోవడంతో సెల్ఫో న్ లైట్ల వెలుతురులో దింపుడు కల్లం నిర్వహించా రు. అనంతరం వాహనాల హెడ్లైట్ల కాంతిలో దహ న సంస్కారాలు జరిపించారు. స్మశానంలో కనీసం విద్యుత్ సౌకర్యం కూడా కల్పించలేని స్థితిలో పాలకులు ఉండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్పందన కరువు జిల్లాకేంద్రంలోని వైకుంఠధామాల్లో నెలకొన్న సమ స్యలను ‘సాక్షి’ పలుమార్లు వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించి అన్ని వసతులు కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చినా పాలకులు అ నుమతులు ఇవ్వడం లేదు. కనీస సౌకర్యాలు కల్పించేందుకూ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శ్మశాన వాటికల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. -
విద్యా వసతులను సద్వినియోగం చేసుకోవాలి
● ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి బాన్సువాడ రూరల్: విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీకళాశాలలో విద్యావారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజుతో కలిసి పాల్గొని మాట్లాడారు. విద్యార్థులకు చక్కటి కౌన్సిలింగ్ చేస్తూ వారితో స్టడీ గ్రూపులు ఏర్పాటు చేయాలని ప్రిన్సిపల్ గంగాధర్ను సూచించారు. సాంకేతిక సహాయాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలన్నారు. గత విద్యాసంవత్సరం వివిధ కోర్సుల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించి అభినందించారు. కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్, బాన్సువాడ సహకార సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎంఈవో నాగేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ సురేష్బాబా, తదితరులున్నారు. జనగణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి బాన్సువాడ : ప్రతి పౌరుడు జనగణనలో తప్పనిసరిగా పాల్గొని తమ వివరాలను నమోదు చేసుకోవాలని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి కుటుంబ సభ్యుల వివరాలను అధికారులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగణనకు వచ్చే సర్వే అధికారులకు ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు. సర్వే అధికారులు రాంజెట్టి, శ్రీనివాస్, బాల్రాజ్ తదితరులున్నారు. -
కౌలాస్ వరద గేట్లకు మరమ్మతులు
● రూ. 24 లక్షలు మంజూరు ● నేడు నీటి విడుదల కౌలాస్ నాలా ప్రాజెక్టునిజాంసాగర్: జుక్కల్ మండలంలోని కౌలాస్నాలా ప్రాజెక్టు వరద గేట్లకు మరమ్మతులు, గ్రీజింగ్, ఆయిలింగ్, రూప్ వైర్ల ఏర్పాటుకోసం ప్రభుత్వం రూ. 24 లక్షల నిధులు మంజూరు చేసింది. నిధులు రావడంతో మరమ్మతు పనులపై నీటిపారుదలశాఖ అధికారులు దృష్టి సారించారు. ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటిని వరద గేట్ల ద్వారా దిగువనకు విడుదల చేయాలని నిర్ణయించారు. గురువారం నీటి విడుదలను ప్రారంభించనున్నారు. వరద గేట్ల ద్వారా 100 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో మంజీర నది తీరం వైపు రైతులు, పశువుల కాపరులు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. కౌలాస్ నాలా ప్రాజెక్టుకు 9 వరద గేట్లు ఉన్నాయి. గతేడాది వర్షాలు విస్తారంగా కురవడంలో భారీ వరదలు వచ్చాయి. వరద గేట్ల ద్వారా లక్షకుపైగా క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి వదిలారు. ఈ క్రమంలో ప్రాజెక్టు రెండు గేట్లకు సంబంధించిన రూప్ వైర్లు దెబ్బతిన్నాయి. ప్రాజెక్టు వరద గేట్ల నిర్వహణ, రూప్వైర్ల ఏర్పాటు, గ్రీజింగ్, ఆయిలింగ్ కోసం నీటి పారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. రూ. 24 లక్షలు మంజూరయ్యాయి. కౌలాస్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు (1.237 టీఎంసీలు) కాగా.. బుధవారం సాయంత్రానికి 454.55 మీటర్లు (0.557 టీఎంసీ) నీరు నిల్వ ఉంది. మరమ్మతులకు ఆటంకం కలగకుండా నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. కౌలాస్ ప్రాజెక్టు గేట్లకు గ్రీజింగ్, ఆయిలింగ్, రూప్ వైరింగ్ ఏర్పాటు కు నిధులు వచ్చాయి. ప్రాజెక్టు నీటిని ఖాళీ చే సి వరద గేట్లకు మరమ్మతులు చేపడతాం. నీటిని విడుదల చేయను న్న నేపథ్యంలో మంజీర నదీ తీరం వైపు ఎవ రూ వెళ్లవద్దు. వర్షకాలం ఆరంభం నాటికి మరమ్మతులు పూర్తిచేసి, వరద గేట్లను సిద్ధం చేస్తాం. – సోలోమాన్, ఈఈ, నిజాంసాగర్ నీటిపారుదలశాఖ -
ప్రైవేట్ ఆస్పత్రిలో బాలుడి మృతి
నిజామాబాద్ రూరల్: నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం ఉదయం బాలుడు మృతి చెందాడు. జక్రాన్పల్లి మండలం పడకల్ తండాకు చెందిన బదావత్ లత, నరేశ్ దంపతులు తమ కుమారుడు నిక్షిత్(16 నెలలు) ఆరోగ్యం బాగా లేకపోవడంతో సోమవారం ఉదయం ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరీక్షించిన వైద్యుడు మందులు రాసిచ్చి ఇంటికి పంపించారు. పరిస్థితి మెరుగుకాకపోవడంతో రాత్రి వేళ మళ్లీ బాబును ఆస్పత్రికి తీసుకురాగా, ఆస్పత్రి సిబ్బంది అడ్మిట్ చేసుకున్నారు. చికిత్స ప్రారంభించి సైలెన్లు పెట్టారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మంగళవారం ఉదయం స్కానింగ్కు రిఫర్ చేశారు. స్కానింగ్ చేయించి బాబును ఆస్పత్రికి తీసుకు వచ్చిన కొద్దిసేపటికి మృతి చెందాడు. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగానే తమ బాబు మృతి చెందాడని తల్లిదండ్రులతోపాటు వారి బంధువులు ఆందోళనకు దిగారు. ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి సిబ్బందితో కలిసి ఆస్పత్రికి చేరుకుని వారిని సముదాయించారు. ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ ● ఆస్పత్రి ఎదుట ఆందోళన -
ఎరువుల విక్రయ కేంద్రానికి తాళం
రుద్రూర్: తమకు అవసరం లేకున్నా నానో యూరియాను ఎరువులతోపాటు బలవంతంగా అంటగడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పొతంగల్ విశాల సహకార సంఘం పరిధిలోని హెగ్డొలిలో ఎరువుల విక్రయ కేంద్రానికి రైతులు మంగళవారం తాళం వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గతంలో తీసుకున్న నానో యూరియా లిక్విడ్ ఇంకా మిగిలి ఉండగానే మళ్లీ కొనాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. మూడు సంచుల ఎరువులు తీసుకుంటే ఒక లిక్విడ్ బాటిల్ తప్పనిసరిగా తీసుకోవాలని నిబంధన విధించడంతో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎరువులు, పురుగుమందుల ధరలు పెరిగిపోయాయని, ఇలాంటి పరిస్థితుల్లో అదనపు భారం మోపడం తగదన్నారు. వ్యవసాయాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మంత్రి పదవికి రాజీనామా చేయాలి
సాక్షి నెట్వర్క్:కుమారుడు పోక్సో కేసు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లాలో పలుచోట్ల ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. బండి సంజయ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. మంత్రిగా ఉండి కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ అధికారులకు కాంగ్రెస్ నేతలు వినతిపత్రాలు అందించి మాట్లాడారు. బాలికపై అత్యాచారం కేసు విషయంలో బీజేపీ మౌనంగా ఉండటం సరికాదన్నారు. -
వైభవంగా పెద్దమ్మకు బోనాలు
లింగంపేట(ఎల్లారెడ్డి): పర్మళ్లలో మంగళవారం పెద్దమ్మకు గ్రామస్తులు బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ కులస్తులు, గ్రామస్తులు ఇంటింటికి బోనాలు తీసుకొని గ్రామంలోని ప్రధాన వీధుల్లో డప్పువాయిద్యాలు, శివసత్తుల పూనకాలతో ఊరేగించారు. అనంతరం పెద్దమ్మ ఆలయం చుట్టూ ఐదుసార్లు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు తీర్చుకున్నారు. ఎల్లారెడ్డిరూరల్: గ్రామాలలో ఉపాధి కూలీల సంఖ్య పెంచాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు ఎంపీడీవో తాహేరాబేగం సూచించారు. బ్రాహ్మణపల్లిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను మంగళవారం ఆమె పరిశీలించారు. కూలీలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఏపీవో వినోద్, సిబ్బంది తదితరులున్నారు. కామారెడ్డి అర్బన్: విద్యా వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో యోగ, ధ్యానం నిర్వహించారు. యోగా గురువు నగేష్ను ప్రిన్సిపల్ కె.విజయ్కుమార్, అధ్యాపకులు, సిబ్బంది సన్మానించారు. భిక్కనూరు: దక్షిణ కాశీగా పేరొందిన భిక్కనూరు సిద్దరామేశ్వరాలయానికి మల్లుపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్రెడ్డి, రాంరెడ్డిలు మంగళవారం రెండు ట్రాక్టర్ల గడ్డిని సోమవారం విరాళంగా అందజేశారు. ఆలయ పునర్నిర్మాణకమిటీ చైర్మన్ లింబాద్రి, డైరెక్టర్ నీల అంజయ్య వారికి కృతజ్ఞతలు తెలిపారు. బాన్సువాడ: అంతర్జాతీయ నర్సు దినోత్సవాన్ని మంగళవారం బీర్కూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి వైద్య సిబ్బందికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా నర్సుల సేవల గురించి వివరించారు. వైద్యులు సౌజన్య, సూపర్వైజర్ సుశీల, నర్సమ్మ, సిబ్బంది ప్రీతి, శ్రీలత తదితరులున్నారు. నందిపేట్(ఆర్మూర్): మండలంలోని చౌడమ్మ కొండూరు గ్రామంలోకి హిజ్రాల రాకను నిషేధిస్తూ గ్రామాభివృద్ధి కమిటీ మంగళవారం నిర్ణయం తీసుకుంది. గ్రామంలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాల సమయంలో హిజ్రాలు వచ్చి వేలాది రూపాయలు డిమాండ్ చేస్తున్నారని, బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, వారి అంగీకారం మేరకు హిజ్రాల ఆగడాలను శాశ్వతంగా అరికట్టేందుకు గ్రామాభివృద్ధి కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై హిజ్రాలను గ్రామంలోకి రానివ్వొద్దని తీర్మానించారు. కార్యక్రమంలో వీడీసీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. -
సంస్కృతికి పెద్దపీట
తెలంగాణ సామెతలు మోర్తాడ్(బాల్కొండ): వేసవి సెలవులంటే కాలక్షేపం కోసం కాదు.. ఏదో ఒక కళలో ప్రావీణ్యం పొందేందుకు సద్వినియోగం చేసుకోవాలని నిరూపిస్తున్నారు ఈ చిన్నారులు. ఆ చిన్నారులను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారు మోర్తాడ్కు చెందిన సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ శ్రీహర్షిణి. చిన్నారులకు మన సంస్కృతి గొప్పతనాన్ని తెలియజెప్పేందుకు కూచిపూడి నృత్యంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అందివచ్చిన అవకాశాన్ని స్థానిక చిన్నారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎంసీఏ చదివిన శ్రీహర్షిణి నాంది ఫౌండేషన్, మహేంద్ర ప్రైడ్ సంస్థల ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్లో ట్రైనర్గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. మరోవైపు నృత్యశిక్షకురాలిగా రాణిస్తున్నారు. తాను నేర్చుకున్న విద్యను పదిమందికి నేర్పాలనే ఉద్దేశంతో మోర్తాడ్లో వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. వివిధ గ్రామాలకు చెందిన 12 మంది విద్యార్థులు ఈనెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్నారు. ఈనెలాఖరు వరకూ శిక్షణ తరగతులను కొనసాగిస్తానని శ్రీహర్షిణి తెలిపారు. ఒక అబ్బాయికి క్లాసికల్ డ్యాన్స్లో ఒక గంట పాటు ప్రత్యేక శిక్షణ కొనసాగిస్తుండటం గమనార్హం. సెలవులను కాలక్షేపం కోసం కాకుండా నృత్య శిక్షణతో సద్వినియోగం చేసుకుంటున్న ఈ చిన్నారులు ఎంతో మందికి స్పూర్తి అని చెప్పొచ్చు. ● మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అయినట్లు (ఎక్కువ మంది జోక్యం చేసుకుంటే పని సరైన దారిలో సాగకుండా గందరగోళంగా మారుతుంది.) ● సిగ్గులేదా జీడి గింజా అంటే.. నల్లగున్నా నాకేమి సిగ్గు అనిందట. (తన తప్పును లేదా లోపాన్ని సమర్థించుకుంటూ, ఏమాత్రం సిగ్గు పడకుండా ఎదురు సమాధానం చెప్పడం) వేసవి సెలవులను వృథా కానివ్వడం లేదు. నృత్యంలో శిక్షణ పొందడానికి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మా తల్లితండ్రులు, మా శిక్షకురాలు ఇచ్చే ప్రోత్సాహంతో ముందుకు సాగుతాం. – హన్విక, దొన్కల్ మోర్తాడ్లో మేము పొందుతున్న నృత్య శిక్షణ ఎంతో బాగుంది. వేసవి సెలవులను ఎలా గడపా లని ఆలోచించాం. మోర్తాడ్లో శిక్షణ ఇస్తున్నట్లు తెలియగానే మా తల్లిదండ్రులు శిక్షణ తరగతులకు పంపిస్తున్నారు. – విహాన్షి, రామన్నపేట్ కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందుతున్న చిన్నారులు కళలో ప్రావీణ్యానికి సెలవులు సద్వినియోగం సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్గా రాణిస్తూనే నృత్య శిక్షణ ఇస్తున్న శ్రీహర్షిణి మోర్తాడ్లో ప్రతిరోజూ వేసవి శిక్షణ తరగతులు -
క్రైం కార్నర్
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి జక్రాన్పల్లి/నిజామాబాద్ రూరల్: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. జక్రాన్పల్లి మండలం అర్గుల్కు గ్రామానికి చెందిన జైడి పెద్దోళ్ల నర్సయ్య (70) మంగళవారం 44వ నంబర్ జాతీయ రహదారి దాటుతుండగా.. కామారెడ్డి వైపు నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. గాయాలపాలైన నర్సయ్యను చికిత్స నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. బైక్ను లారీ ఢీట్టిన ఘటనలో తాపిమేస్త్రి.. నిజామబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గూపన్పల్లి క్రాసింగ్ వద్ద బైక్ను లారీ ఢీట్టిన ఘటనలో తాపిమేస్త్రి మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. నగరంలోని హస్మీ కాలనీకి చెందిన షేక్ షాకీర్(28) మాక్లూర్ మండల బోర్గాం(కే)లో మేస్త్రి పని చేస్తుంటాడు. మంగళవారం మధ్యాహ్నం పని పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఎప్పటిలాగే మంగళవారం ఉదయం బోర్గాం(కే) గ్రామంలో మేస్త్రి పని పూర్తయిన అనంతరం మధ్యాహ్నం తిరిగి వస్తుండగా గూపన్పల్లి క్రాసింగ్ బైక్ను లారీ ఢీకొట్టగా షాకీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి షబ్బీర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ తెలిపారు. కామారెడ్డి క్రైం: భార్యతో గొడవల కారణంగా మనస్థాపానికి గురైన భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. మహ్మద్ హుస్సేన్ (35) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో ప్రతి రోజూ భార్యతో గొ డవలు జరిగేవి.కొద్ది రోజుల క్రితం అతడి భార్య గౌసియా బేగం పిల్లలతో కలిసి హైదారాబాద్లోని తన తల్లిగారింటికి వెళ్లిపోయింది. కామారెడ్డికి రావాలని హుస్సేన్ పలుమార్లు అడిగినా ఆమె రాకపోవడంతో మనస్థాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్హెచ్వో నరహరి తెలిపారు. ఆర్మూర్టౌన్: అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీలను ఆర్మూర్, మోర్తాడ్లో చీత ఫోర్స్ మెరుపుదాడులు నిర్వహించి మంగళవారం పట్టుకుంది. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు భారీ లారీలను సీజ్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. -
ట్యాబ్ ఎంట్రీలు వేగవంతం చేయండి
● కనీస మద్దతు ధర అందేలా చూడండి ● అధికారులతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి టౌన్: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రి యకు సంబంధించి పెండింగ్లో ఉన్న ట్యాబ్ ఎంట్రీలను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ధాన్యం సేకరణపై సూచనలు ఇచ్చారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడారు. డీసీవో, డీఆర్డీఏ అధికారులు అన్ని కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ధాన్యం విక్రయించిన రైతులకు త్వరగా డబ్బులు అందేలా చూడాలని సూచించారు. కేంద్రాల వద్ద సరిపడా రవాణా వా హనాలను అందుబాటులో ఉంచాలని డిస్ట్రిక్ట్ మేనేజర్లకు సూచించారు. మిల్లుల వద్ద వాహనాలు నిలిచిపోకుండా డీసీఎస్వోలు నిరంతరం పర్యవేక్షిస్తూ మిల్లర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా అన్ని కేంద్రాలు, మిల్లుల వద్ద తగినన్ని టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని డీఎంవోను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, సివిల్ సప్లై అధికారి వెంకటేష్, డీసీవో రామ్మోహన్, జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య, డీఆర్డీఏ సురేందర్, ఆర్టీవో శ్రీనివాస్, డీఎం శ్రీకాంత్ పాల్గొన్నారు. -
‘జాతీయ రహదారిపై బస్టాండ్ ఏర్పాటు చేయాలి’
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలో జాతీయ ర హదారి పక్కన బస్టాండ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయమై ఆయన మంగళవారం హైదరాబాద్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ని జామాబాద్, ఆర్మూర్ తదితర డిపోలనుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు చాలా వరకు బైపాస్ మీ దుగా ప్రయాణిస్తున్నాయని, పట్టణంలోకి రావడం లేదని పేర్కొన్నారు. దీంతో బస్సులకోసం పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పట్టణానికి సమీపంలో జాతీయ రహదారికి ఆనుకుని ప్ర భుత్వ భూములు ఉన్నందున హైవే బస్టాండ్ ఏర్పా టు చేయాలని కోరారు. తమ వినతిపై మంత్రి సా నుకూలంగా స్పందించి బస్టాండ్ ఏర్పాటు అంశా న్ని పరిశీలించాలని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ను ఆదేశించారని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ కౌ న్సిలర్ గడ్డ మీది మహేశ్, డీసీసీ ఉపాధ్యక్షుడు ని మ్మ విజయ్కుమార్రెడ్డి, క్రెడా అధ్యక్షుడు లక్ష్మీనర్సా గౌడ్, కాంగ్రెస్ నేత శ్రీధర్రావు తదితరులున్నారు. -
నీట్ పరీక్ష రద్దుతో నిరాశ!
● మళ్లీ రాయాల్సిన పరిస్థితి ● ఇబ్బంది పడుతున్న విద్యార్థులు సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : డాక్టర్ కావాలన్న లక్ష్యంతో కష్టపడి జాతీయ అర్హత పరీక్ష (నీట్) రాసిన విద్యార్థులు.. ప్రశ్నపత్రం లీకయ్యిందని తెలియడంతో ఆందోళన చెందుతున్నారు. పరీక్ష రద్దుతో నిరాశకు గురవుతున్నారు. జిల్లాకు చెందిన వేలాది మంది విద్యార్థులు మెడిసిన్ చదవాలన్న లక్ష్యంతో ఇంటర్మీడియట్ బైపీసీ పూర్తి చేసి నీట్కు సన్నద్ధమయ్యారు. సుమారు ఐదు వేల మంది వరకు ఈనెల 3న నిర్వహించిన పరీక్షకు హాజరయ్యారు. ఇందుకోసం రెండేళ్ల పాటు అంటు ఇంటర్తోపాటు నీట్ కోసం ప్రిపేర్ అయ్యారు. మరికొందరు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నారు. పరీక్ష పూర్తవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కొంత ఊపిరి పీల్చుకున్నారు. కీ చూసుకుని ఎన్ని మార్కులు వస్తాయన్న దానిపై లెక్కలు వేసుకుని తమకు ఎక్కడ మెడిసిన్ సీటు వస్తుందన్న దానిపై ఓ అంచనాకు వచ్చారు. ఎంబీబీఎస్తో పాటు బీడీఎస్, బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్ తదితర కోర్సులన్నింటికీ నీట్ ద్వారానే సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులు మొదట ఎంబీబీఎస్కు ప్రాధాన్యతనిస్తారు. ఎంబీబీఎస్లో సీటు రాకుంటే బీడీఎస్తో పాటు ఇతర కోర్సుల్లో చేరాలనుకుంటారు. కొందరు విద్యార్థులు తమకు సీటు రాని పక్షంలో మరో ఏడాది లాంగ్ టర్మ్ కోచింగ్కూ వెళతారు. మెడిసిన్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని రాత్రింబవళ్లు చదివిన వారంతా నీట్ పరీక్ష రద్దయిందని తెలియడంతో మనోవేదనకు గురవుతున్నారు. ఇంతకాలం హాస్టళ్లలో ఉండి ఎంతో కష్టపడి చదివి పరీక్ష రాసిన వారు.. మళ్లీ పరీక్ష రాయాలంటే ఇబ్బందిగా ఫీలవుతున్నారు. ఈసారి కీ చూసుకున్న తర్వాత తమకు సీటు గ్యారంటీగా దక్కుతుందని ఆశలు పెట్టుకున్న వారు.. మళ్లీ పరీక్ష రాస్తే తమకు అన్ని మార్కులు వస్తాయో లేదోననే ఆందోళన చెందుతున్నారు. నీట్ పరీక్ష రద్దుతో తల్లిదండ్రులు కూడా ఆందోళనలో ఉన్నారు. మళ్లీ పరీక్ష ఎప్పుడు నిర్వహించే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు. విద్యార్థులు మాత్రం అప్పుడే పుస్తకాలతో కుస్తీ ప్రారంభించారు. -
హిందుత్వం అంటే సంస్కృతి
● భగవద్గీతలో ప్రతి సమస్యకు పరిష్కారం ● బీకేఎస్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు అంజిరెడ్డి భిక్కనూరు: హిందుత్వం అంటే మతం ఒక్కటే కాద ని, సంస్కృతి సంప్రదాయాలని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు అంజిరెడ్డి పేర్కొన్నా రు. మంగళవారం జంగంపల్లిలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మా ట్లాడుతూ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. భగవద్గీత ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతుందన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా భ గవద్గీతను చదవాలని, గో సంరక్షణ, దేవాలయ ప రిరక్షణకు కృషి చేయాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే ఆచార వ్య వహరాలు, సంస్కృతీ సంప్రదాయాలను నేర్పించాలన్నారు. హిందువులు ఐక్యంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని ఇస్కాన్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి వెంకటదాసు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో రోజూ గంట పాటు దైవనామస్మరణకు సమయాన్ని కేటాయించుకోవాలని సూచించారు. మహిళలు తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని రామాయంపేట సేవికా సమితి ప్రతినిధి కవిత పేర్కొన్నారు. అహిల్యాబాయి, జిజియా మాతల్లా ఆదర్శంగా జీవించాలన్నారు. కార్యక్రమంలో కుషాల్ మనోహర్, కార్తీక్ మనోహర్ భగవద్గీత శ్లోకాలు, సామూహిక హనుమాన్ చాలీసా, వందే మాతర గీతం ఆలపించారు. కార్యక్రమంలో సమ్మేళనం అధ్యక్షుడు ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణాగౌడ్, కోశాధికారి మోహన్రెడ్డి, సర్పంచ్ శ్రీవాణి వాసు యాదవ్, నాయకులు సిద్దరాములు, నర్సింలు యాదవ్, నాగరాజు, శ్రీనివాస్, శేఖర్గౌడ్, నవీన్, సంజీవ్, దేవేందర్, సూర్యప్రకాశ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
బండి సంజయ్ రాజీనామా చేయాలి
కామారెడ్డి టౌన్ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయా లని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఆయన తన పదవిని అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేయగా.. పోలీసులు వారిని అ డ్డుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సందీప్ మాట్లాడుతూ బండి సంజయ్ తన కుమారుడు భగీరథపై నమోదైన పోక్సో కేసును నీ రుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆ యన పదవిలో ఉంటే నిష్పక్షపాత దర్యాప్తు జరగదన్నారు. వెంటనే భగీరథను అరెస్ట్ చేయాలని డి మాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి, నాయకులు గోనె శ్రీనివాస్, రాజాగౌడ్, రామాగౌడ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
● జిల్లాలో 8,618 మంది విద్యార్థులు.. ● 31 పరీక్ష కేంద్రాల ఏర్పాటు కామారెడ్డి టౌన్ : జిల్లాలో బుధవారం నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా మొత్తం 8,618 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో ప్రథమ సంవత్సరం నుంచి 5,561 మంది (జనరల్ 4,774, వొకేషనల్ 787), ద్వితీయ సంవత్సరం నుంచి 3,057 మంది (జనరల్ 2,538, వొకేషనల్ 519) పరీక్షలు రాయనున్నారు. మొత్తం విద్యార్థుల్లో బాలికలు 5,170 మంది కాగా, బాలురు 3,448 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 31 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్ను నియమించారు. పరీక్షల పర్యవేక్షణ కోసం 200 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో పాల్గొంటారు. మాస్ కాపీయింగ్కు తావులేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్లతోపాటు సిట్టింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం సూచించారు. మే 22 నుంచి 25 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. -
పేలిన ట్రాక్టర్ టైర్
● ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు ఆర్మూర్టౌన్: ట్రాక్టర్ టైర్ పేలి డ్రైవర్ మృతి చెందిన ఘటన ఆర్మూర్ పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై రజినికాంత్ తెలిపిన వివరాల ప్రకారం..కత్తి బాలకృష్ణ(40) అనే వ్యక్తి ఆర్మూర్ మండలం మగ్గిడిలోని ఇటుక బట్టిలో పనిచేస్తు జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఉదయం అంకాపూర్ గ్రామంలో ట్రాక్టర్ ఇటుకలోడ్ను దించి తిరిగి మగ్గిడికి వెళ్తుండగా ఆర్మూర్ బృందావన్ టాకీస్ వద్ద టైర్ పేలిపోవడంతో ముందున్న డివైడర్ను ఢీకొట్టింది. దీంతో డ్రైవర్ బాలకృష్ణ టైర్ కిందపడగా, మరో ఇద్దరు రోడ్డుపై పడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో ఆర్మూర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలకృష్ణ ఆస్పత్రిలో మృతిచెందగా, మరో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య పెంచులమ్మ ఫిర్యాదు మేర కు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. డిచ్పల్లి : డిచ్పల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని సుద్దపల్లి రోడ్డు పక్కన ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం సాయంత్రం నిప్పు పెట్టారు. దీంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఎండిపోయిన గడ్డి, పిచ్చి మొక్క లు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించా యి. సమీపంలో ఇళ్లు ఉండటం, మంటలు అదుపులోకి రాకపోవడంతో స్థానికులు ఫైర్ స్టే షన్కు సమాచారం అందించారు. ఘటనా స్థ లానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అరగంటపా టు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చా రు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. -
బడిలో సామగ్రి భద్రమేనా?
ఎల్లారెడ్డి: ప్రహరీలు లేని భవనాలు.. వాచ్మెన్లు అసలే ఉండరు.. రాత్రి కాగానే ఆకతాయిలకు మందు బాబులకు అడ్డాలు.. ఇదీ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి. వేసవి సెలవుల కారణంగా ఏప్రిల్ నెలాఖరులో మూతబడ్డ పాఠశాలలు జూన్లో తెరుచుకుంటాయి. అప్పటివరకు ఎలాంటి రక్షణ లేని ఇలాంటి భవనాలలో లక్షల రూపాయలు ఖరీదు చేసే కంప్యూటర్లు, ప్రొజెక్టర్లు, డిజిటల్ స్క్రీన్లు తదితర వస్తువులు పడి ఉంటున్నాయి. అలాగే వేసవి సెలవులకు ముందు పలు ప్రభుత్వ పాఠశాలల్లో మిగిలిపోయిన బియ్యం భద్రంగానే ఉన్నాయా అన్న ప్రశ్న పలువురిలో నెలకొంది. ప్రతి పాఠశాలలో కంప్యూటర్లు.. ఎల్లారెడ్డి మండలంలో 44 ప్రాథమిక, 4 యూపీఎస్, 10 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇవేకాకుండా కేజీబీవీ, మోడల్ స్కూల్, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, మైనారిటీ గురుకుల పాఠశాలలు, మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ప్రతీ పాఠశాలలో కనీసం ఒక కంప్యూటర్, డిజిటల్ ప్రొజెక్టర్, స్క్రీన్ తదితర వస్తువులు ఖచ్చితంగా ఉంటున్నాయి. కళ్యాణి గ్రామంలోని పాఠశాలలో పిల్లలకు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) విద్య నేర్పేందుకు మండల పైలట్ ప్రాజెక్టుగా ఎంపికై ంది. దీంతో బడిలో దాదాపు 10 వరకు అత్యాధునిక కంప్యూటర్లు, డిజిటల్ స్క్రీన్లు ఉన్నాయి. అలాగే ప్రతీ విద్యాలయంలోనూ బియ్యం నిల్వలు సైతం బాగానే ఉన్నాయి. ప్రతీ గురుకుల పాఠశాల, మోడల్ స్కూళ్లలో వాచ్మెన్లు ఉంటారు కాబట్టి రక్షణ ఉండే అవకాశం ఉంది. కానీ మిగితా ఏ పాఠశాలలోనూ వాచ్మెన్లు ఉండకపోవడంతో వాటికి రక్షణ కరువైంది. ఆకతాయిలకు అడ్డాలు.. గ్రామీణ ప్రాంతాలలోని బడులు రాత్రి వేళల్లో మందుబాబులకు, ఆకతాయిలకు అడ్డాలుగా మారుతున్నాయి. వారు పాఠశాలలో మద్యం తాగడమే కాకుండా మందు సీసాలను పగలగొట్టి నానా హంగామా చేస్తున్నారు. గేట్లకు తాళాలు వేసినా వాటిని పగలగొట్టి పాఠశాలలోకి వెళుతున్నారు. అంతేగాక పాఠశాలల్లో విలువైన వస్తువులు, బియ్యం ఉన్నాయని తెలిస్తే దొంగలు పాఠశాలల తలుపులు పగలగొట్టి ఎత్తుకెళ్లే అవకాశం ఉంది. అందరి భాగస్వామ్యం ఉంటేనే.. విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రతీ పాఠశాల హెడ్మాస్టర్ ప్రతీ రెండు రోజులకోసారి స్కూల్ను విజిట్ చేసి పరిస్థితిని పరిశీలించాల్సి వస్తుంది. కొందరు హెచ్ఎంలు స్థానిక పెద్దలతో మాట్లాడి స్కూల్ సంగతి చూడమని కోరుతున్నారు. మరికొందరు పట్టణ ప్రాంతాల్లో పోలీసులను పెట్రోలింగ్ చేయమని కోరుతున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలల రక్షణ పెద్ద సమస్యగా మారుతున్నది. ఈక్రమంలో పాఠశాలల్లోని విలువైన వస్తువులను రక్షించుకోవడానికి ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని పలువురు అభిప్రాయ పడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతీ ఉదయం, సాయంత్రం వేళల్లో ఎవరో ఒకరు పాఠశాల పరిసరాలను పరిశీలిస్తుండాలి. ఎవరైనా ఆకతాయిలు, మందు బాబులు పాఠశాల పరిసరాలలో కనిపిస్తే నివారించాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే పాఠశాలను రక్షించుకోవచ్చు .విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రధానోపాధ్యాయులు ప్రతీ రెండు రోజులకోసారి బడుల ను సందర్శించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. పాఠశాల ఆస్తులను రక్షించుకోవాలని ఎస్ఎంసీ బాధ్యులకు, స్థానిక సర్పంచులకు కోరాం. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాఠశాలలో ఉన్న విలువైన వస్తువులను కాపాడుకోవడంలో భాగస్వామ్యం కావాలి –రాజులు, ఎంఈవో, ఎల్లారెడ్డి వేసవి సెలవుల కారణంగా పాఠశాలలకు తాళాలు గదుల్లో రూ.లక్షల విలువచేసే కంప్యూటర్లు, ఇతర పరికరాలు రాత్రివేళల్లో పర్యవేక్షణ కరువు -
చిత్రకళతో సృజనాత్మకత
● బోధన్లో మూడేళ్లుగా వేసవి ప్రత్యేక శిక్షణ శిబిరం బోధన్: చిత్రలేఖనమంటే బొమ్మలు గీయడ మే మాత్రమే కాదు.. మనస్సుతో మాట్లాడే భా ష అని చిత్రకారులంటున్నారు. తమ ఊహాశక్తితో పౌరాణిక, జానపద, ప్రకృతి దృశ్యాలను అద్భుతంగా చిత్రీకరిస్తారు. చిత్రలేఖనం పిల్ల ల్లో ఏకాగ్రతను పెంపొందించడంతోపాటు సృజనాత్మకతకు పదును పెడుతుంది. సాలూర మండల కేంద్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు లింబూరు లక్ష్మణ్ తేజ క్రియేటివ్ కిడ్స్ డ్రాయింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మూడేళ్లుగా బోధన్ పట్టణంలో వేసవి చిత్రలేఖన ప్ర త్యేక శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. చిన్నారుల్లో సృజనాత్మకతను వెలికితీసే ఉద్దేశంతో ఈ ఏడాదీ శిబిరం ప్రారంభమైంది. ప్రస్తుతం శిబిరంలో 15 మందికి పైగా విద్యార్థులు చిత్రలేఖనంలో మెలకువలు నేర్చుకుంటూ అద్భుత ప్రతిభ చాటుతున్నారు. పట్టణ కేంద్రానికి చెందిన ప్రముఖ చిత్రకారిణి ఎర్రొల్ల అవంతి విద్యార్థులకు బోధిస్తున్నారు. పెన్సిల్ డ్రాయింగ్, షేడింగ్స్, కలర్ పెయింటింగ్, హ్యాండ్ రైటింగ్ అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. కామారెడ్డి అర్బన్: హరేరామ హరేకృష్ణ ఇస్కాన్ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 24 వరకు సంస్కృతి వేసవి శిబిరం నిర్వహిస్తున్నట్టు ఇస్కాన్ కామారెడ్డి కేంద్రం ప్రతినిధి వెంకటదాసు ప్రభు ఒక ప్రకటనలో తెలిపారు. భగవద్గీత శ్లోకాలు, తబలా, చిత్రలేఖనం, నైతిక, పౌరాణిక, నీతి కథలు, ధ్యానం, కీర్తనలు, నృత్యం, రుచికర సహజ వంటల తయారీ అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తిగల 5 నుంచి 15 ఏళ్లలోపు విద్యార్థులు రామారెడ్డి రోడ్డు లోని మెడికల్ అసోసియేషన్ భవనంలోని ఇస్కాన్ కేంద్రంలో లేదా 99129 16108, 99596 02551 నంబర్లకు సంప్రదించవచ్చన్నారు. మేము గీసిన చిత్రాలు ఇంటి కోడికి ఒకటే కాలు.. పొరుగు కోడికి మూడు కాళ్లు ( మన దగ్గర ఉన్నదాని కన్నా పక్కవాడికి ఉన్నదే గొప్పగా భ్రమపడటం) గాడిద సోపతి తన్నులకే.. ( చెడ్డవాళ్లతో, మూర్ఖులతో స్నేహం చేస్తే మంచి కాకుండా నష్టం, అవమానం, ఇబ్బందులు వస్తాయి.) నాకు బొమ్మలు గీయడమంటే ఎంతో ఇష్టం. మూ డో తరగతి నుంచి బొమ్మ లు గీయడంపై ఆసక్తి పెంచుకున్నాను. ఇంటి వద్దనే బొమ్మలు గీసేదానిని. బోధన్లో వేసవి ప్రత్యేక శిక్షణ శిబిరం ఏర్పాటైనట్లు తెలుసుకొని నేను, తమ్ముడు చేరాం. ప్రతి రోజు వచ్చి డ్రాయింగ్ నేర్చుకుంటున్నాం. – భవ్య, 7వ తరగతి విద్యార్థిని, బోధన్ డ్రాయింగ్ నేర్చుకునేందుకు పిల్లలు ఉత్సాహం చూపుతున్నారు. బొమ్మలు గీయడం ఎంతో సులభమో విద్యార్థులకు మెలకువలు నేర్పుతున్నాం. రంగులపై అవగాహన కల్పిస్తూ, విద్యార్థులు సొంతంగా బొమ్మలు గీసేలా ప్రొత్సహిస్తున్నాం. – ఎర్రొల్ల అవంతి, ప్రముఖ చిత్రకారిణి -
క్రైం కార్నర్
పాముకాటుతో మహిళ మృతి నవీపేట : మండలంలోని ధర్మారం(ఎ) గ్రామానికి చెందిన పల్లపు నర్సమ్మ(57) పాముకాటుతో మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్ ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి కుటుంబసభ్యులతో భోజనం చేశాక ఆరుబయట పడుకుందని పేర్కొన్నారు. రాత్రి సమయంలో కట్లపాము కాటువేయగా 108 అంబులెన్స్లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారని తెలిపారు. మృతురాలి సోదరి సావిత్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బాన్సువాడ రూరల్: మండలంలోని కొల్లూర్ గ్రామానికి చెందిన బండారి సాయిలు(48) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట మొరందుబ్బ ప్రాంతంలో సాయిలు ఉరేసుకొని మృతి చెందాడనే సమాచారం మేరకు పోలీసులు పరిశీలించారు. రెండు రోజుల క్రితమే చనిపోయినట్లు గుర్తించారు. మృతుడి భార్య సుశీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా హత్య చేసి చెట్టుకు వేలాడదీశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెట్టును ఢీకొన్న బైక్ ● ఒకరి మృతి ఆర్మూర్టౌన్: చెట్టును ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన ఆర్మూర్ మండలం గోవింద్పేట్ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్సై యాసిర్ ఆర్ఫాత్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట్ గ్రామానికి చెందిన సీతానగర్ దాకయ్య(50) గోవింద్పేట్ గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో పనుల నిమిత్తం గోవింద్పేట్ గ్రామం నుంచి ఆర్మూర్కు వస్తుండగా గ్రామ శివారులో ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో దాకయ్య అక్కడిక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
అంకితభావంతో విద్యా బోధన
● ఉత్తమ టీచర్గా పలు అవార్డులు ● ఆదర్శంగా నిలుస్తున్న ఉపాధ్యాయురాలుగాంధారి(ఎల్లారెడ్డి): అంకితభావంతో చిన్నారులకు విద్యాబోధన చేస్తూ ఉత్తమ టీచర్గా పలు అవార్డులు అందుకుంటున్నారు మండల పరిషత్ బాలికల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు భవాని. మండల కేంద్రంలో బాలికల ప్రాథమిక పాఠశాలకు భవాని 2018లో బదిలీపై వచ్చారు. అప్పుడు కేవలం 40 మంది విద్యార్థినులు మాత్రమే ఉండేవారు. భవాని గ్రామంలో పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడుతూ.. చిన్నారులకు అర్థమయ్యేలా విద్యా బోధన చేస్తూ క్రమంగా విద్యార్థుల సంఖ్యను పెంచారు. ప్రస్తుతం పాఠశాలలో 140 మంది విద్యార్థులున్నారు. విద్యార్థులకు విద్యాబోధనతో పాటు ఆటలు, పాటలు, కంప్యూటర్ పాఠాలు కూడా బోధిస్తున్నారు. సొంత డబ్బులతో పాఠశాలకు ఒక కంప్యూటర్లను సమకూర్చి కంప్యూటర్ పరిజ్ఙానం కల్పిస్తున్నారు. ఆమె సేవ, కృషిని గుర్తించిన సంబంధిత అధికారులు పలుమార్లు మండల ఉత్తమ టీచర్గా ఎంపిక చేసి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఇటీవలే రాష్ట్రస్థాయి ఉత్తమ టీచర్ ఎంపికై సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ టీచర్ అవార్డు అందుకున్నారు. ఇతర దేశాల్లో విద్యాబోధన పరిశీలన కోసం వెళ్లిన ఉపాధ్యాయుల బృందంలో చోటు దక్కించుకుని విదేశాల్లో కూడా ఆమె పర్యటించారు. -
శ్రీనగర్లో దొంగల బీభత్సం
మూడు ఇళ్లలో చోరీ వర్ని: మండలంలోని శ్రీనగర్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. మూడు ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన వజ్రమ్మ, రమణ, శ్రీనివాసరావు ఇళ్లలో చొరబడిన దుండగులు నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. మూడు ఇళ్లలో కలిపి నాలుగు తులాల బంగారు ఆభరణాలు, రూ. 20 వేల నగదు అపహరణకు గురైనట్లు ఎస్సై తెలిపారు. మరో నాలుగు ఇళ్లలో చోరీకి పాల్పడేందుకు ప్రయత్నాలు చేశారన్నారు. తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా తీసుకొని దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని బోధన్ ఏసీపీ శ్రీనివాసరావు, సీసీఎస్ ఏసీపీ మస్తాన్ అలీ పరిశీలించారు. వేసవికాలంలో డాబాల మీద పడుకున్న, ఇతర ప్రాంతాలకు వెళ్తే జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. -
ముందడుగేది..?
మహాప్రస్థానంకుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : లక్షకు పైగా జనాభా ఉన్న కామారెడ్డి పట్టణంలో శ్మశాన వాటికలు అధ్వానంగా ఉన్నాయి. కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో అంతిమ సంస్కారాల సందర్భంగా ఇబ్బందిపడుతున్నారు. జిల్లా కేంద్రంలో హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో ఉన్న శ్మశాన వాటికలో నెలకొన్న సమస్యలపై ‘సాక్షి’ గతనెల 20న ‘అంతిమ కష్టాలు’ శీర్షికన కథనం ప్రచురించింది. ఇది కథనం వైరల్ అయ్యింది. అదేరోజు జరిగిన మున్సిపల్ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు ‘సాక్షి’ కథనాన్ని చూపుతూ సమస్యను లేవనెత్తారు. పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అధికారులను ఆదేశించారు. ‘సాక్షి’ కథనాన్ని చదివి చలించిన బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన ఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి సొంత డబ్బులతో శ్మశానాన్ని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చారు. పనులు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గతనెల 27న ఎస్ఆర్ ట్రస్ట్ ప్రతినిధులు జిల్లా అధికారులను కలిసి లేఖ అందించారు. ఈ వినతిని పరిశీలించాలంటూ జిల్లా రెవెన్యూ అధికారి బల్దియా కమిషనర్ను ఆదేశించారు. ఎటూ తేల్చలేకపోతున్న అధికారులు శ్మశాన వాటికను సొంత డబ్బులతో అభివృద్ధి చేయడానికి స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చినా.. అనుమతులు ఇచ్చే విషయంలో బల్దియా అధికారులు ఎటూ తేల్చలేకపోతున్నారు. బీజేపీతోపాటు కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం కూడా సదరు స్వచ్ఛంద సంస్థ నిర్ణయాన్ని స్వాగతించాయి. పలు కుల సంఘాలూ మద్దతు ప్రకటించాయి. అయినా అనుమతులు ఇచ్చే విషయంలో అధికారులు ఏ నిర్ణయం తీసుకోకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సొంత డబ్బులతో అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిన వారిని అభినందించి సహకరించాల్సిన అధికారులు.. ఈ వ్యవహారంలో నాన్చుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు చొరవ చూపి వైకుంఠధామంలో సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.కష్టాల కాష్టం... కామారెడ్డి పట్టణంలో ఉన్న రెండు శ్మశాన వాటికల్లోనూ అనేక సమస్యలున్నాయి. శ్మశానానికి సంబంధించిన భూములు చాలావరకు అన్యాక్రాంతమయ్యాయి. మిగిలిన కొద్ది స్థలంలో అన్ని వసతులను కల్పించేందుకు గత ప్రభుత్వంలో నిధులు మంజూరయ్యాయి. అయితే పనులు మధ్యలో ఆగిపోవడంతో సమస్యలు అలాగే ఉండిపోయాయి. ప్రధానంగా హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలోని శ్మశాన వాటికలో నెలకొన్న సమస్యలపై ‘సాక్షి’ ఫోకస్ చేసింది. గతేడాది ఆగస్టు నెలాఖరులో కురిసిన భారీ వర్షాలతో చెరువు అలుగు ఉప్పొంగి వాగు వేగంగా ప్రవహించడంతో శ్మశాన వాటికి ప్రధాన గేటు వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. ఇది జరిగి ఎనిమిది నెలలు గడచినా తట్టెడు మట్టిపోయకుండా వదిలేశారు. శ్మశాన వాటికలో నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యాలు లేవు. ఒకేసారి రెండు మృతదేహాలను మాత్రమే దహనం చేయడానికి అవకాశం ఉంది. మూడో వ్యక్తి చనిపోతే కాడు ఎక్కడ పేర్చాలో తెలియని పరిస్థితి.. అంత్యక్రియల సందర్భంగా స్నానాలు చేయడానికి ట్యాంకర్ను తెచ్చుకోవాల్సిదే. ఇలాంటి దయనీయ పరిస్థితుల మధ్య అంత్యక్రియలు జరుగుతున్నాయి. జిల్లాకేంద్రంలో అధ్వానంగా ‘వైకుంఠధామం’ సమస్యలను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చిన స్వచ్ఛంద సంస్థ స్వాగతించిన బీజేపీ, అధికార పార్టీలోని ఒక వర్గం అనుమతుల విషయాన్ని నానబెడుతున్న బల్దియా పక్షం రోజులవుతున్నా ఏ విషయం తేల్చని అధికారులు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్న ప్రజలు జిల్లాకేంద్రంలో అధ్వానంగా ఉన్న వైకుంఠధామాన్ని అభివృద్ధి చేసేందుకు స్వచ్ఛంద సంస్థ ముందుకు వచ్చినా.. అనుమతులు ఇవ్వడంలో బల్దియా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఏ నిర్ణయం చెప్పకుండా కాలయాపన చేస్తుండడంపై ప్రజలనుంచి విమర్శలు వస్తున్నాయి. శ్మశాన వాటికలో సమస్యల పరిష్కారం, వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
నేటి నుంచి 17 వరకు విద్యా వారోత్సవాలు
కామారెడ్డి అర్బన్: ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈనెల 11 నుంచి 17 వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ విజయ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా మౌలిక సదుపాయాల కల్పన, వసతులు, శిక్షణ కార్యక్రమాలు, తల్లిదండ్రుల సమావేశం, విద్యా ప్రమాణాలపై చర్చ, గ్రంథాలయ దినోత్సవం, డిజిటల్ విద్యపై అవగాహన, విద్యార్థులకు బహుమతుల ప్రదానం కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని విద్యార్థులను కోరారు. 13 నుంచి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం కామారెడ్డి అర్బన్:/కామారెడ్డి టౌన్ : కామారెడ్డి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 13న ఉచిత వేసవి క్రికెట్ శిబిరాన్ని ప్రారంభించ నున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు మోజా మ్ అలీఖాన్, కార్యదర్శి ముప్పారపు ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో హైదరాబాద్, నిజామాబాద్ క్రికేట్ అసోసియేషన్ సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించనున్నామని పేర్కొన్నారు. రోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శిక్షణ ఉంటుందని తెలిపారు. 12 ఏళ్ల నుంచి 25 ఏళ్లలోపు బాల, బాలికలు, యువతీయువకులు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, 13న నేరుగా స్టేడియానికి వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్లో పతకాల పంట కామారెడ్డి అర్బన్: హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి అథ్లె టిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. మహిళల విభాగంలో కే.మేఘన జా వెలిన్ త్రోలో బంగారు పతకం, షాట్పుట్ లో కాంస్య పతకం సాధించగా, వై.శిరీష జా వెలిన్ త్రోలో కాంస్య పతకం పొందారు. అండర్–20 బాలుర విభాగంలో లాంగ్ జంప్ లో నందు, రాకేష్ వెండి పతకాలు, పవన్ క ళ్యాణ్ కాంస్య పతకం సాధించారు. అండర్–18 బాలికల విభాగం 400 మీటర్ల ప రుగులో కె.నందిని వెండి పతకం పొందారు. విజేతలను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్రెడ్డి, అనిల్కుమార్ అభినందించారు. ‘బెల్ట్ షాపులు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తాం’ కామారెడ్డి అర్బన్: జిల్లాలో మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎకై ్సజ్ అధికారి హన్మంతురావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇటీవలి కాలంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై 91 కేసులు నమోదు చేసి బాధ్యులైన 90 మందిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. అక్రమంగా మద్యం విక్రయించే పనిని మానుకోవాలని సూచించారు. నేడు ‘కోఆప్షన్’ ఎన్నిక బిచ్కుంద: బిచ్కుంద మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక సోమవారం జరుగనుంది. నలుగురు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. 12 వార్డులు ఉండగా 10 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లు, ఇద్దరు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 8 మంది కోఆప్షన్ కోసం నామినేషన్లు వేశారు. ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించనున్నారు. మైనార్టీ విభాగం నుంచి అసద్అలీ, పర్వీన్ అబ్దుల్, జనరల్లో చింతల హన్మండ్లు, బొగడమీది తానుబాయిలకు కోఆప్షన్ సభ్యులుగా ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అవకాశం కల్పిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. -
నేడు కామారెడ్డి బల్దియా చైర్పర్సన్తో ‘సాక్షి’ ఫోన్ఇన్
76509 87777వేసవిలో నీటి ఎద్దడి, పైప్లైన్ల లీకేజీలు, మున్సిపల్ బోర్ల మరమ్మతులు తదితర సమస్యలపై కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణితో సాక్షి ఫోన్ఇన్ నిర్వహిస్తోంది. నీటి సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకురావడానికి కింది నంబర్కు ఫోన్ చేయండి.తేది : 11–05–2026 (సోమవారం) సమయం: ఉదయం 10:00 నుంచి 11:00 గంటల వరకు..ఫోన్ చేయాల్సిన నంబర్: -
జొన్న పంటకు మద్దతు కరువు
● పత్తాలేని కొనుగోలు కేంద్రాలు ● పట్టించుకోని అధికారులు ● ఆందోళనలో రైతులుతెల్గాపూర్లో జొన్న కుప్పలు నిజాంసాగర్ : జొన్న రైతులకు మద్దతు కరువవుతోంది. పంట పూర్తిగా చేతికివచ్చినా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సర్కారు చర్యలు తీసుకోకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కొనుగోళ్లు చేపట్టాలని కోరుతున్నారు. యాసంగి సీజన్లో జిల్లావ్యాప్తంగా 86 వేల ఎకరాల్లో జొన్న పంట సాగయ్యింది. ఈసారి వరికి బదులుగా చాలా మంది జొన్న సాగు చేశారు. బాన్సువాడ, బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, డోంగ్లి, పిట్లం, పెద్దకొడప్గల్, నిజాంసాగర్, మహమ్మద్నగర్, ఎల్లారెడ్డి, లింగంపేట, గాంధారి మండలాల్లో ఈ పంట ఎక్కువగా సాగయ్యింది. ఆయా మండలాల్లో సాగు చేసిన జొన్న పంట నూర్పిడీలు పూర్తై నెల రోజులు కావస్తోంది. కానీ ఇంతవరకు జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్దకు తెచ్చి కుప్పలుగా పోసిన రైతులు.. కొనుగోళ్ల కోసం నిరీక్షిస్తున్నారు. -
నేటి నుంచి జనగణన!
● తొలి దశలో కుటుంబాల గుర్తింపు ● జిల్లాలో 1,954 మంది ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు ● పూర్తయిన స్వీయగణన ప్రక్రియ సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : దేశవ్యాప్తంగా జరిగే జనగణన ప్రక్రియ సోమవారం నుంచి మొదలుకానుంది. ఈ ప్రక్రియ నిర్వహించేందుకు ఇప్పటికే ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లను నియమించి వారికి వివిధ దశల్లో శిక్షణ ఇచ్చారు. జనగణనలో తొలి దశలో కుటుంబాల గుర్తింపు చేపట్టనున్నారు. సోమవారం ప్రారంభమయ్యే జనగణన తొలి దశ ప్రక్రియ జూన్ 9 వరకు కొనసాగనుంది. మొదట జిల్లాలో కుటుంబాల లెక్క తేలుస్తారు. జిల్లా యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. జనగనణ కోసం 1,954 మంది ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లను నియమించారు. గణనకు అవసరమైన మెటీరియల్ అందించారు. సోమవారం నుంచి వారికి కేటాయించిన ప్రాంతాల్లో తిరిగి కుటుంబాల గుర్తింపు ప్రక్రియ చేపడతారు. కాగా స్వీయగణన ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. దాదాపు 10 వేల మంది స్వీయగణన చేసుకున్నట్లు సమాచారం. -
కాంగ్రెస్కు ‘కొత్త’ రక్తం!
● మండలాలు, పట్టణాల అధ్యక్షుల నియామకం ● కార్యవర్గాల ఏర్పాటే ఆలస్యం సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కాంగ్రెస్ను క్షేత్ర స్థాయి లో బలోపేతం చేసే దిశగా ఆ పార్టీ నాయకత్వం చ ర్యలు తీసుకుంటోంది. మొదట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని, తర్వాత జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల మండల, పట్టణ అధ్యక్షుల నియమక ప్రక్రియ చేపట్టారు. జిల్లాలో బాన్సువాడ ని యోజకవర్గం మినహా మిగతా అన్ని మండలాలు, పట్టణ అధ్యక్షుల నియామక ప్రక్రియ పూర్తయ్యింది. ఆయా నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జీల సూచనల కు అనుగుణంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలె మ ల్లికార్జున్ మండలాలు, పట్టణాల పార్టీ అధ్యక్షుల నియామక ప్రక్రియ నిర్వహించారు. చాలా వరకు యువతకు అవకాశాలు కల్పించారు. మూడేళ్లకుపైగా అధ్యక్షులుగా కొనసాగుతున్న వారిని దాదాపు తప్పించి వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇ చ్చారు. కామారెడ్డి పట్టణ అధ్యక్షుడిగా చాలా కాలంగా పనిచేస్తున్న పండ్ల రాజును తప్పించారు. ఆయ న స్థానంలో ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్ను నియమించారు. కామారెడ్డి మండలానికి దశాబ్దకాలానికిపైగా అధ్యక్షుడిగా కొనసాగిన గూ డెం శ్రీనివాస్రెడ్డి స్థానంలో ధర్మగౌని రాజాగౌడ్ను అధ్యక్షుడిని చేశారు. మాచారెడ్డి, పాల్వంచ మండలాల అధ్యక్షులుగా నౌసీలాల్, రమేశ్గౌడ్లను రెండో పర్యాయం కొనసాగించారు. బీబీపేట మండల అధ్యక్షుడిగా పనిచేసిన సుతారి రమేశ్ను తప్పించి, ఆయన స్థానంలో భిక్కనూరు ఏఎంసీ చైర్మన్ పాత రాజుకు అవకాశం ఇచ్చారు. భిక్కనూరుకు నరేందర్రెడ్డి, రాజంపేటకు అంకం కృష్ణారావ్ను నియ మించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎల్లారెడ్డి మండల అ ధ్యక్షుడిగా కుర్మ సాయిబాబా, నాగిరెడ్డిపేటకు శ్రీధర్గౌడ్, లింగంపేటకు గొల్ల సాయిరాం యాదవ్, సదాశివనగర్కు మహీపాల్రెడ్డి, తాడ్వాయికి సంజీవులు, రామారెడ్డికి ప్రవీణ్గౌడ్, గాంధారికి శ్రీని వాస్ నియమితులయ్యారు. జుక్కల్ మండల అధ్యక్షుడిగా రమేశ్ దేశాయ్, నిజాంసాగర్కు ప్రజాపండరి, మహ్మద్నగర్కు రవీందర్రెడ్డి, పిట్లంకు రవీందర్, పెద్దకొడప్గల్కు శ్యామప్ప, మద్నూర్కు సాయిలు, డోంగ్లీకి గజానన్, బిచ్కుందకు నాగనాథ్, బిచ్కుంద పట్టణానికి విజయభాస్కర్రెడ్డి అధ్యక్షులయ్యారు. బాన్సువాడ పట్టణంతో పాటు బాన్సువాడ, నస్రుల్లాబాద్, బీర్కూర్ మండలాలకు పార్టీ అధ్యక్షులను నియమించలేదు. ఆయా మండలాలకు సైతం త్వరలోనే నియామక ప్రక్రియ పూర్తి చేసే అవకాశాలున్నాయి. త్వరలోనే పూర్తి స్థాయి పట్టణ, మండల కార్యవర్గాలనూ ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఆయా మండలాలు, పట్టణాల్లో అ ధ్యక్షుల నియామకంలో యువతకు ప్రాధాన్య తనిచ్చారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి చాలాచోట్ల యువకులను అవకా శం ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీ సుకువెళ్లి క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చే యడానికి యువ రక్తానికి ప్రాధాన్యతనిచ్చిన ట్టు తెలుస్తోంది. జిల్లా అధ్యక్షుడు మొదలు, మండల, పట్టణ అధ్యక్షులు చాలావరకు యువకులే ఉన్నారు. జిల్లాలో కాంగ్రెస్ను మరింత బ లోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ మండల, పట్టణ అధ్యక్షులను నియమించినట్లు డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. బాన్సువాడకు సంబంధించిన నియామకాలు కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. -
ధాన్యం తడవకుండా చర్యలు చేపట్టాలి
నాగిరెడ్డిపేట: వర్షాలు కురిసినా కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన ధాన్యం బస్తాలు తడవకుండా తగిన చర్యలు చేపట్టాలని డీఎస్వో రామ్మోహన్ సూచించారు. శనివారం ఆయన నాగిరెడ్డిపేట, తాండూర్ గ్రామాల్లో ని కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. సీ ఈవోలు సందీప్, చంద్రమురళిలతో మాట్లా డి కొనుగోళ్ల వివరాలు తెలుసుకున్నారు. రైస్మిల్లులకు తరలించిన వడ్లకు సంబంధించి ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియ వెంటవెంటనే పూర్తి చేయాలని సూచించారు. అనంతరం ఆయ న విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో సహకార సంఘాల ఆధ్వర్యంలో 230 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటి ద్వారా ఇప్పటివరకు 1.38 లక్షల మెట్రిక్ ట న్నుల ధాన్యం సేకరించామన్నారు. ఇప్పటికే 18వేల మంది రైతుల ఖాతాల్లో ధాన్యం డ బ్బులు రూ. 303 కోట్లు జమ చేశామని పే ర్కొన్నారు. ఆయన వెంట మానిటరింగ్ అధి కారి రాధిక తదితరులున్నారు. పీహెచ్సీని సందర్శించిన కేంద్ర బృందం రామారెడ్డి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం నేషనల్ క్వాలి టీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్ (ఎన్క్యూఏఎస్) బృందం సందర్శించింది. లేబర్ రూమ్, జ నరల్ అడ్మినిస్ట్రేషన్, ఓపీ విభాగం, జాతీ య ఆరోగ్య కార్యక్రమాల విభాగాలను పరిశీలించారు. పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యాధికారి సురేశ్ మాట్లాడుతూ తనిఖీ బృందం సూచనలను పాటిస్తామన్నారు. కార్యక్రమంలో బృందం సభ్యులు జాశ్వ అభిషేక్ బండాలా, రాజేష్ మిశ్రా, డీఎంహెచ్వో రవీందర్ గౌడ్, జిల్లా ప్రోగ్రాం అధికారులు విద్య, రోహిత్, రాజు గౌడ్, వైద్యాధికారులు యెమీమా, విజయ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల వారితో అప్రమత్తంగా ఉండాలి నిజామాబాద్అర్బన్: ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే కార్మికులు, అద్దెదారులు, ఉద్యోగుల విషయంలో ఇంటి యజమానులు, వ్యాపార సంస్థలు, కాంట్రాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటనలో సూచించారు. ఉపాధి కోసం వచ్చే వ్యక్తుల పేరు, శాశ్వత చిరునామా, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్లు కుటుంబ వివరాలు, పనిచేసే స్థలం వచ్చిన తేదీ వంటి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. అవసరం అయితే స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా వారి వివరాలు నమోదు చేయించాలన్నారు. -
నేను చేసిన మంచిపని
పక్షుల దాహార్తి తీరుస్తూ.. బాన్సువాడ: మండే ఎండలో పక్షుల దాహా ర్తిని తీర్చేలానే సంకల్పంతో ఓ చిన్నారి తనకు తోచిన ఆలోచనకు పదును పెట్టింది. పట్టణానికి చెందిన తేలి శ్రియాదిత ఖాళీ వాటర్ బాటిళ్లను మధ్య వరకు కట్ చేసి బాటిళ్లలో నీటిని నింపి ఇంటి పైన స్లాబ్కు కట్టింది. మరికొన్ని బాటిళ్లలో ధాన్యం గింజలు వేసి ఉంచడంతో ప్రతిరోజు పదుల సంఖ్యలో పక్షులు వచ్చిన ధాన్యం గింజలు తిని నీటిని తాగి వెళ్తున్నట్లు చిన్నారి తెలిపింది. విద్యార్థి పేరు: తేలి శ్రియాదిత, పదో తరగతి, పాత బాన్సువాడ -
కస్టమర్ దేవోభవ..!
ఆందోళనకు సిద్ధం మోర్తాడ్: రైతుల సమస్యలను 24 గంటల్లో పరిష్కరించకపోతే తాను ఆందోళ నకు సిద్ధమవుతానని, రోడ్డెక్కుతానని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వే ముల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. తరుగు పేరుతో రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని ఆ రోపించారు. బాల్కొండ మండలం కిసాన్నగర్, మోర్తాడ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన శనివారం పరిశీలించి రైతులతో మా ట్లాడారు. అక్కడి నుంచి జిల్లా అడిషనల్ కలెక్టర్, పౌర సరఫరాల శాఖ అధికా రితో ఫోన్లో మాట్లాడారు. అరగంట నుంచి ప్రయత్నిస్తున్నా కలెక్టర్ తన కా ల్స్కు స్పందించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ధా న్యం సేకరణలో లోపాలు చోటు చేసుకుంటున్నా యని ఆరోపించారు. తరుగు పేరుతో సతాయించే మిల్లుల జాబితాను సిద్ధం చేసి వాటిని సీజ్ చేస్తే రైస్మిల్లర్లు ఎందుకు ధాన్యాన్ని అన్లోడింగ్ చేసుకోరని ఆయన ప్రశ్నించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ధాన్యం సేకరణలో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా చూశామన్నారు. క్వింటాల్కు 10 కిలోల తరుగు తీస్తామంటున్న మిల్లర్ల భరతం పట్టాలని అధికారులకు సూచించారు. -
కరెంట్ షాక్తో మహిళ మృతి
భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డిలో పిండి గిర్ని శుభ్రం చేస్తూ ఓ మహిళ విద్యుత్ షాక్తో శనివారం మృతి చెందింది. గ్రామానికి చెందని బండి రేణుక (35) తన ఇంట్లోనే పిండిగిర్ని ఏర్పాటు చేసుకుంది. శనివారం ఉదయం యంత్రాన్ని నీటితో శుభ్రం చేస్తుండగా విద్యుత్షాక్ కొట్టింది. వెనక్కిపడిపోయిన రేణుక తలకు తీవ్రగాయం కాగా, కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే రేణుక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి భర్త యోగి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. భిక్కనూరు: తల్లి మందలించిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. రామేశ్వర్పల్లి గ్రామానికి చెందిన జిల్లెల బాలమణి రెండో కుమారుడు బాపురెడ్డి (25) తల్లితో కలిసి వ్యవసాయం చేసేవాడు. ధాన్యాన్ని ఆరబోసే విషయంలో గురువారం సాయంత్రం బాలమణితో బాపురెడ్డి గొడవపడ్డాడు. ఆ తరువాత బయటికి వెళ్లిన బాపురెడ్డి తిరిగి ఇంటికి రాలేదు. శనివారం భిక్కనూరు బొబ్బిలి చెరువలో యువకుడి మృతదేహం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు ఒడ్డుకు తీసుకువచ్చి మృతుడిని రామేశ్వర్పల్లికి చెందిన జిల్లెల బాపురెడ్డిగా గుర్తించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కామారెడ్డి క్రైం: ప్రయాణికురాలి పర్సులో నుంచి బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గురైన ఘటన కామారెడ్డిలోని కొత్త బస్టాండ్లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. హైదరాబాద్లోని చితంల్లో నివాసం ఉండే మహిళ తమ బంధువుల ఇంట్లో ఫంక్షన్కు హాజరయ్యేందుకు కామారెడ్డికి వచ్చి తిరుగు ప్రయాణమైంది. బస్సు ఎక్కిన తరువాత పర్సును చూసుకోగా నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.10వేల నగదు కనిపించలేదు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు మహిళ బస్సు ఎక్కే క్రమంలో చోరీ జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఆధ్యాత్మికం..
రేపటి నుంచి హరినామ సప్తాహం బాన్సువాడ రూరల్: మండలంలోని తాడ్కోల్ గ్రామ విఠలేశ్వర మందిరంలో ఈనెల 11 నుంచి అఖండ హరినామ సప్తాహం కార్యక్రమం నిర్వహించనున్నట్లు సర్పంచ్ అందె రమేష్ తెలిపారు. ఈసందర్భంగా శనివారం గ్రామంలో ఆయన గ్రామస్తులు, వార్కారి భక్తులతో కలిసి కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వార్కారి మహారాజ్ గొల్ల గంగాధర్యాదవ్, సొసైటీ చైర్మన్ గంగుల గంగారాం, శ్రీనివాస్రెడ్డి, వెంకట్రెడ్డి, దర్జి హన్మాండ్లు, లక్ష్మణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అన్నప్రసాదం వితరణ కామారెడ్డి అర్బన్: కామారెడ్డి కోడూరు హనుమాన్, పశుపతినాథ్ ఆలయ ప్రాణప్రతిష్ఠాపన ఉత్సవాలు శనివారం మూడోరోజు కొనసాగాయి. ఈసందర్భంగా జలావాసంలో ఉన్న దేవతామూర్తుల విగ్రహాలను ధాన్యవాసంలోకి మర్చారు. సామూహిక హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు వేదపండితులు ఆంజనేయశర్మ అన్నప్రసాదం అందజేశారు. పట్టణానికి చెందిన పలువురు భక్తులు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. వైభవంగా పెద్దమ్మ కల్యాణోత్సవం నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామంలోగల పెద్దమ్మతల్లి ఆలయంలో శనివారం అమ్మవారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులు అమ్మవారికి ఓడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కొనసాగుతున్న ఆలయ వార్షికోత్సవాలు మాచారెడ్డి: మండలంలోని చుక్కాపూర్ గ్రామంలోగల లక్ష్మీనరసింహస్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ శనిగరం కమలాకర్ రెడ్డి, ఈవో ప్రభు రాంచంద్రం, డైరెక్టర్లు లక్ష్మీరాజం, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నెరవేరిన పేదల సొంతింటి కల
ఎల్లారెడ్డిరూరల్/ఎల్లారెడ్డి/నిజాంసాగర్(జుక్కల్): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో పేదల సొంతింటి కల నెరవేరిందని ప్రజాప్రతినిధులు అన్నారు. ఎల్లారెడ్డిలోని 12వ వార్డులో నూతనంగా నిర్మించిన జూకంటి రుక్కవ్వ ఇందిరమ్మ ఇంటిని మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుతుందన్నారు. అలాగే మహమ్మద్ నగర్ మండలం బూర్గుల్ గ్రామంలో చాకలి సాయిలు నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని సర్పంచ్ గజ్జల జీవన్ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని సర్పంచ్ అనసూయ శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
హిందూ సమ్మేళనానికి తరలిరావాలి
భిక్కనూరు: మండల కేంద్రంలోని అంగడి బజారులో ఈనెల 11న జరిగే హిందూ సమ్మేళనానికి ప్రజలు తరలిరావాలని సమ్మేళన నిర్వాహకులు కోరారు. భిక్కనూరులో శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. హిందూ సమ్మేళనం ప్రధాన వక్తగా సామాజిక సమరసత వేదిక, తెలంగాణ ప్రాంత కన్వీనర్ అప్పాల ప్రసాద్, ఆశీ ప్రసంగిక్గా మెట్పల్లి గీతా కేంద్రం విశోక తీర్థ స్వామిజీ హాజరవుతారన్నారు. అధ్యక్షుడు చల్ల లక్ష్మన్, ప్రధాన కార్యదర్శి లింగా రాజబాబుగౌడ్, కోశాధికారి పెద్దబచ్చుగారి చంధ్రశేఖర్, ప్రతినిదులు గొల్ల రమేష్, సందుగారి రవీందర్రెడ్డి, విలాస్రెడ్డి, బల్యాల వెంకటనర్సింలు,జేపి సిద్దాగౌడ్ తదితరులు ఉన్నారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని నందివాడ గ్రామంలో శనివారం సింగిల్విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని తాడ్వాయి సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి కపిల్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్లు జంగం మంగారెడ్డి, సంకు పోచయ్య, డైరెక్టర్లు సంజీవరెడ్డి, రాజిరెడ్డి, గ్రామపెద్దలు, రైతులు పాల్గొన్నారు. భిక్కనూరు : అనారోగ్యంతో మృతి చెందిన తాతకు మనుమరాలు తలకొరివి పెట్టిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన మంగలి కొనింటి చిన్న బాలయ్య అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. మృతుడికి ఒక కూతురు ఉండగా ఆమె ఒక ఆడ కూతురుకు జన్మనిచ్చి గతంలో మృతి చెందింది. దీంతో బాలయ్యకు మనుమరాలు గీత మాత్రమే ఉన్నారు. ఆయన మృతి చెందడంతో చివరకు గీత తలకొరివి పెట్టింది. మోపాల్: మండలంలో ని కంజర్ గ్రామంలో ధాన్యం తరలించేందు కు వచ్చిన లారీ అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. ఎస్సై జాడె సుస్మిత తెలిపిన వివరాల ప్రకారం.. సొసైటీ ధాన్యం వద్దకు వెళ్లే క్రమంలో లారీ క్యాబిన్కు 11 కేవీ విద్యుత్ తీగలు తగిలాయి. క్షణాల్లోనే మంటలు లారీ టైర్లకు వ్యాపించి దగ్ధమయ్యాయి. స్థానికులు ఫైరింజన్కు సమాచారమివ్వగా ఇందల్వాయి నుంచి అగ్నిమాపక శకటం వచ్చి మంటలను ఆర్పేసింది. డ్రైవర్ సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామన్నారు. సుమారు రూ.4 లక్షల వరకు నష్టం జరిగినట్లు ఫైరింజన్ పైలెట్ ప్రకాశ్ పేర్కొన్నారు. -
‘ప్రైవేట్’కు దీటైన ఫలితాలు
● పదిలో ఏటా శతశాతం ఉత్తీర్ణత ● ట్రిపుల్ ఐటీకి పలువురు ఎంపిక ● ఆదర్శంగా నిలుస్తున్న దోమకొండ ప్రభుత్వ బాలికల పాఠశాలదోమకొండలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు చదువుల్లో రాణిస్తున్నారు. గత నాలుగేళ్లలో ఈ పాఠశాలలో మూడుసార్లు శతశాతం ఉత్తీర్ణత నమోదు కావడం గమనార్హం. దోమకొండ : మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోంది. ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చేలా చూస్తున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పాఠ్యాంశాలలో అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. దీంతో విద్యార్థులు పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతున్నారు. 2022–23 విద్యా సంవత్సరంలో 49 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కాగా.. అందరూ పాసయ్యారు. ఆ ఏడాది బాసర ట్రిపుల్ ఐటీకి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. 2023–24 విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య 82 కు చేరింది. ఇందులో ఒక్కరు మినహా మిగిలిన అందరూ ఉత్తీర్ణులయ్యారు. నలుగురికి ట్రిపుల్ ఐటీలో సీటు వచ్చింది. 2024–25 విద్యా సంవత్సరంలో 70 మంది పదో తరగతి పరీక్షలు రాయగా.. అందరూ ఉత్తీర్ణత సాధించారు. ఇద్దరు ట్రిపుల్ ఐటీలో సీటు సంపాదించారు. గత విద్యా సంవత్సరంలో 80 మంది విద్యార్థులకు 80 మంది మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. ఇందులో పావని 582 మార్కులతో జిల్లాస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల టాపర్గా నిలిచింది. భవాని 578 మార్కులు, అమూల్య 576 మార్కులు, భవిష్య 575 మార్కులు, షఫియా 573 మార్కులు, రసజ్ఞ 570 మార్కులతో సత్తా చాటారు. గత విద్యాసంవత్సరంలో పాఠశాలలో 334 మంది విద్యార్థులు, 18 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. గతంలో పాఠశాలకు గదుల కొరత ఉండగా, రెండేళ్ల క్రితం ప్రభుత్వ నిధులతో అదనపు గదులు నిర్మించారు. దీంతో గదుల సమస్య పరిష్కారమైంది. ఈ పాఠశాలలో విద్యార్థులకు కంప్యూటర్ విద్య సైతం అందుతోంది. విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లోనూ ప్రతిభ చాటుతున్నారు. పలు క్రీడాంశాల్లో జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించారు. ఉపాధ్యాయులు సైన్స్ఫేర్తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థినుల్లో నృజనాత్మకతను పెంపొందిస్తున్నారు. పాఠశాలలో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. సబ్జెక్ట్ వారీగా ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు క్రమం తప్పకుండా వచ్చేలా చూస్తున్నారు. చదువుతో పాటు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ, వారిలో సృజనాత్మకత పెంపొందేలా చూస్తున్నాం. దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. – శరత్కుమార్, ప్రధానోపాధ్యాయులు, దోమకొండ -
బెస్ట్ అవైలబుల్ స్కీంలో సీట్లు తొలగించొద్దు
బాన్సువాడ: బెస్ట్ అవైలబుల్ స్కీంలో సీట్లు తొలగించవద్దని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ఈమేరకు వారు శనివారం బాన్సువాడలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నస్రుల్లాబాద్ మండలంలోగల ఓ ప్రయివేట్ పాఠశాలలో వివిధ తరగతుల్లో బెస్ట్ అవైలబుల్ స్కీంలో భాగంగా 144 మంది ఎస్సీ విద్యార్థులు చదువుతుండగా, ప్రభుత్వం నిధులు చెల్లించకపోవడంతో వారిని తొలగిస్తామని పాఠశాల యాజమాన్యం చెబుతున్నారన్నారు. ఈ పథకం కింద ప్రభుత్వం చెల్లింపులు చేసి, పునరుద్ధరణ చేయాలని మాల ఎడ్యూకేషనల్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా కార్యదర్శిఽ పాండురంగం డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు మెక్క సురేష్, పండరి, పోశెట్టి, అశోక్, విఠల్ తదితరులు ఉన్నారు. నిజాంసాగర్(జుక్కల్): హైదరాబాద్–బోధన్ రహదారి విస్తరణ పనులతో ప్రయాణికులకు బస్ షెల్టర్లు కరువయ్యాయి. దీంతో ప్రయాణికులు ఎండలోనే బస్సుల కోసం వేచిచూస్తున్నారు. ఈక్రమంలో మహమ్మద్ నగర్ బస్టాండ్ ప్రాంతంలో ప్రయాణికుల సౌకర్యార్థం శనివారం సర్పంచ్ దఫేదార్ బాలమణి పచ్చని పందిరి వేయించారు. పందిరి వేయించి ఎండ కష్టాలను దూరం చేసిన సర్పంచ్కు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. బాన్సువాడ రూరల్: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కల్గించరాదని బాన్సువాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నెర్రె నర్సింహులు అన్నారు. శనివారం ఆయన బోర్లం క్యాంపులో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. సహకార సంఘం అధికారులు, సిబ్బంది కొనుగోలు కేంద్రాల్లో రైతులకు నీడ, నీటి సౌకర్యం కల్పించాలన్నారు. నాయకులు గాండ్ల సాయిలు, మన్నె చిన్న సాయిలు, మంగలి ధత్తు, గంగాధర్ తదతరులు ఉన్నారు. నస్రుల్లాబాద్ : మండలంలోని మైలారం గ్రామంలో శనివారం ప్రమాదవశాత్తు గడ్డివాము దగ్ధమైంది. గ్రామానికి చెందిన దార గంగాధర్కు చెందిన గడ్డివాముకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైరింజన్ చేరుకుని మంటలను ఆర్పివేసినప్పటికీ లాభం లేకుండాపోయింది. రూ.25వేల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. -
కాల్వలకు మరమ్మతులు చేపట్టాలి
● ఇరిగేషన్ అధికారులకు ప్రజాప్రతినిధుల సూచన ● పలు మండలాల్లో నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ‘రైతు వారం’ నిర్వహణలింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని శెట్పల్లి, అయ్యపల్లి, అయ్యపల్లి తండాల శివారులో గత వర్షాకాలంలో భారీ వర్షాలకు ధ్వంసమైన చెరువు కట్టలు, కట్టు కాల్వల మరమ్మతులు త్వరితగతిన చేపట్టాలని ఆయా గ్రామాల సర్పంచులు ఇరిగేషన్ అధికారులకు సూచించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘రైతు వారం’ నిర్వహించారు. ఈసందర్భంగా ఆ యా గ్రామాల సర్పంచులు తమ గ్రామాల సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. ఇప్పటికే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఆయా గ్రామాల్లో దెబ్బతిన్న చెరువులు, ఫీడర్ చానల్లకు నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. సర్పంచులు అట్టెం శ్రీనివాస్, గోనె లింగం, ఆత్మ కమిటీ చైర్మన్ ధశరత్నాయక్, ఏవో అనిల్కుమార్, ఇరిగేషన్ ఏఈ సతీష్కుమార్, రైతులు తదితరులు పాల్గొన్నారు. మాచారెడ్డి మండలంలో.. మాచారెడ్డి: చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టాలని ఇరిగేషన్ ఏఈ వంశీ కృష్ణ అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం గజ్యానాయక్ తండా రైతు వేదికలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. చెరువులలో పూడిక తియ్యడం, ముళ్ల పొదలు తొలగించడం, నీటిని సమృద్ధిగా వాడడం వంటి పనులు చేపట్టాలన్నారు. ఆయా గ్రామాల స ర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులున్నారు. ఎల్లారెడ్డి మండలంలో.. ఎల్లారెడ్డిరూరల్: పోచారం ప్రాజెక్టు నీరు చివరి ఆయకట్టు వరకు అందించడంలో అధికారుల పనితీరు అభినందనీయమని ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత అన్నారు. మండలంలోని మీసాన్పల్లి రైతు వేదికలో నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో ‘రైతు వారోత్సవాలు’ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పుష్కలంగా వర్షాలు కురవడంతో రెండు పంటలు సాగు కావడంతో రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింలు, నీటి పారుదల శాఖ ఏఈ రాజేష్, రైతులు తదితరులున్నారు. భూసార పరీక్షలు చేయించుకోవాలి పెద్దకొడప్గల్(జుక్కల్): ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకోవాలని ఏవో కిషన్ తెలిపారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం ప్ర జా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘రైతు వా రోత్సవాలు’ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకొని, దానికి అనుగుణంగానే ఎరువులు ఉపయోగించాలని సూచించారు. నాయకులు బస్వరాజ్ దేశాయ్,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సంక్షిప్తం..
నూతన సీఐకి సన్మానం భిక్కనూరు: భిక్కనూరుకు బదిలీపై వచ్చిన నూతన సీఐ జగడం నరేష్ను మండల కేంద్రంలోని మున్నురుకాపు యువజన సంఘం ప్రతినిదులు శనివారం సన్మానించారు. సంఘ ప్రతినిదులు వడ్లూరి అశోక్, ముధాం క్రిష్ణ, సురేష్, దొబ్బి సిద్దరాములు, రంజిత్, అశోక్, రాము,శేఖర్, భాస్కర్లు పాల్గొన్నారు. నిత్యావసర సరుకుల పంపిణీ తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని సామదుబ్బ తండాలో ఇటీవల షార్ట్సర్క్యూట్తో పలువురి గుడిసెలు దగ్ధమయ్యాయి. దీంతో బాధిత కుటుంబాలకు శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పార్టీ మండల అద్యక్షుడు సంజీవులు, నాయకులు వెంకట్రెడ్డి, షౌకత్అలీ, రాజీవ్కుమార్, మేకల రాజు, సుధాకర్రావు, గంగారెడ్డి, సర్పంచ్లు జాదవ్ రేణుక, పోచయ్య తదితరులు పాల్గొన్నారు. నియామకం భిక్కనూరు: మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరాం వెంకటేశ్ నియమితులయ్యారు. ఈమేరకు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరన్రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. తనకు పదవి రావడానికి సహకరించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీకి వెంకటేశ్ కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నిక లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని కొట్టాల్గడ్డ తండాలో శనివారం టీఆర్ఎస్ గ్రామ కమిటీని జిల్లా అధ్యక్షుడు సంపత్గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రమావత్ మోహన్, ఉపాధ్యక్షుడిగా ఇస్లావత్ శివరామ్, యూత్ అధ్యక్షుడిగా రమావత్ నరేష్, యూత్ ఉపాధ్యక్షుడిగా మెగావత్ దేవిదాస్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అలాగే ఆయా పార్టీల నుంచి పలువురు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. లింగంపేట మండల అధ్యక్షుడు పోకల సాయిరాం, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్రెడ్డి, జిల్లా ఎస్టీసెల్ అధ్యక్షుడు జైల్సింగ్, శ్రీకాంత్, సాయిలు, శంకర్, మహేందర్, భరత్ తదితరులు పాల్గొన్నారు. త్రీఫేజ్ విద్యుత్ వేళలు పెంచాలి తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలో త్రీఫేజ్ విద్యుత్ వేళలు పెంచాలని మండల సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు కోరారు. ఈమేరకు వారు శనివారం తాడ్వాయి సబ్స్టేషన్లో ట్రాన్స్కో సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. మండలంలో త్రీఫేజ్ వి ద్యుత్ను 12గంటలు మాత్రమే ఇవ్వడంతో గ్రామా ల్లో బోరు మోటార్లు సరిగా నడవక తాగునీటికి ఇబ్బందులు అవుతున్నాయన్నారు. సింగిల్విండో చైర్మన్ కపిల్రెడ్డి, సర్పంచ్లు మంగారెడ్డి, చంద్రారెడ్డి, తాజోద్దీన్, నర్సిములు, బీఆర్ఎస్ నాయకులు రాములు, రాజిరెడ్డి, సంజీవ్, ధర్మారెడ్డి ఉన్నారు. -
పుట్టెడు దుఃఖం.. పిల్లలే లోకంగా జీవనం
ముప్పై ఏళ్లుగా..కడుపున పుట్టిన బిడ్డల మానసిక, శారీరక లోపాలను వారు శాపంగా చూడలేదు. వారిని భారంగా భావించలేదు. ఏళ్లు మీదపడుతున్నా ఆరోగ్యం మెరుగుపడదని తెలిసినా సరే వదిలించుకోవాలనుకోలేదు. ఎన్ని కష్టాలు చుట్టుముట్టినా చెక్కు చెదరని ఆత్మస్థైర్యంతో, పిల్లల కోసమే బతుకుతున్నారు. తమంత ఎత్తు పెరిగినా చంటి పిల్లల్లా భావిస్తూ సపర్యలు చేస్తూ అమ్మతనానికి మరింత వన్నె తెస్తున్నారు. జిల్లాలో పలువురు తల్లుల త్యాగనిరతిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... – సాక్షి ప్రతినిధి, కామారెడ్డిదుఃఖాన్ని దిగమింగుకుని.. ఎల్లారెడ్డిరూరల్: ‘‘అప్పుల బాధతో నా భర్త నర్వ నారాయణ ఆత్మహత్య చేసుకున్నడు. ఆయన చనిపోయిన సమయంలో పెద్దకొడుకు సిద్దిరాములుకు ఎనిమిదేళ్లు, చిన్నకొడుకు నాగరాజుకు ఆరేళ్లు. ఓవైపు అప్పులు.. మరోవైపు పుట్టెడు దుఃఖం.. అయినా పిల్లల కోసం బతకాలనుకున్నా. పొలం పనులు చూసుకుంటూ పిల్లలను పెంచి పెద్దచేసిన. పెద్ద కొడుకు ఉప సర్పంచ్ అయ్యిండు. చిన్న కుమారుడు నాగరాజు బాసర త్రిపుల్ ఐటీలో చదివిండు. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు ఎన్ఐటీలో సీనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం చేస్తుండు’’ అని జంగమాయిపల్లికి చెందిన సిద్ధవ్వ పేర్కొంది. ఇప్పటికీ పసి పాపే.. కామారెడ్డి పట్టణంలోని అశోక్నగర్లో నివసించే బూక్య రజిత, రాజునాయక్లకు కూతురు, కొడుకు ఉ న్నారు. బిడ్డ బూక్య లక్కీకి పుట్టుకతోనే ఆరోగ్య సమ స్య ఉంది. ఆస్పత్రుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. కదిలే స్థితిలోలేని బిడ్డ ను కంటిపాపలా చూసుకుంటున్నారు. రజితకు భర్త రాజునాయక్ ఆసరా అవుతారు. 16 ఏళ్లుగా సేవలు చేస్తున్నా ఏ నాడూ భారంగా అనిపించలేదని చెబుతోంది రజిత. లక్కీని అందరూ ఎంతో ప్రేమగా చూస్తారని తెలిపింది. బిడ్డను చూసుకుంటూనే రజిత లా చదువుతోంది. కూతురికి అన్నీ తానై.. ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ గ్రామానికి చెంది న బోరంచ లక్ష్మి, దుర్గయ్య దంపతులకు కూతురు రేణుక ఉంది. ఆమెకు పుట్టుకతోనే మతిస్థిమితం లేదు. రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబమైనా.. కన్న కూతురును 19 ఏళ్లుగా కంటికి రెప్పలా చూసుకుంటోంది ఆ అమ్మ. కూలినాలి చేసుకుంటూ బిడ్డకు అన్ని సపర్యలు చేస్తూ కాపాడుకుంటోంది.తల్లి సిద్దవ్వతో నాగరాజుకామారెడ్డి పట్టణంలోని పంచముఖి హనుమాన్ కాలనీకి చెందిన సూరం సంతోష, వెంకటేశ్లది రెక్కాడితేకానీ డొక్కాడని కుటుంబం. వారికి 33 ఏళ్ల కూతురు అశ్విని, 31 ఏళ్ల కుమారుడు శ్రీనివాస్ ఉన్నారు. ఇద్దరూ మాట్లాడలేరు.. నడవలేరు. కనీసం నిలబడలేరు. 2010లో భర్త వెంకటేశ్ చనిపోవడంతో పిల్లల పూర్తి బాధ్యత సంతోషపైనే పడింది. పిల్లలే లోకంగా బతుకుతున్న సంతోష.. వారికి సేవలు చేస్తూ, ఇంట్లోనే బట్టలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. రోజూ పొద్దున్నే పిల్లలు బ్రష్, స్నానం చేయించి, ఏదైనా తినిపించి కూర్చోబెట్టాల్సిందే. కాలకృత్యాలకు తీసుకెళ్లి శుభ్రం చేయాలి. పిల్లలను వదిలి ఎటూ వెళ్లలేని పరిస్థితి. పిల్లలను కూర్చోబెట్టి బయట డోర్ లాక్ చేసి మార్కెట్కు వెళ్లొస్తుంటానని చెబుతోంది. పిల్లలకు సేవ చేస్తూ, వారిని చూసుకుంటూ బతుకుతున్నానని తెలిపింది.ఇద్దరు కుమారులతో తల్లి రామకిష్టవ్వఆనందంగా సాగిపోతున్న వారి జీవితాల్లో విధి కల్లోలం రేపింది. జంగమాయిపల్లికి చెందిన నర్వ సిద్దవ్వ భర్త అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోగా.. మల్కాపూర్కు చెందిన కొండ రామకిష్టవ్వ భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో వారి జీవితంలో అంధకారం అలుముకుంది. అయినా వారు తమ పిల్లల కోసం దుఃఖాన్ని దిగమించుకుని ముందుకు సాగారు. కష్టపడి పిల్లలను పెంచి ప్రయోజకులను చేశారు. – ఎల్లారెడ్డి రూరల్ప్రయోజకులను చేసిన.. ఎల్లారెడ్డిరూరల్: ‘‘నా భర్త కొండ లచ్చయ్య రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆయన లేకుండా బతుకుడెట్లా అనుకున్న. మాకు ఇద్దరు పిల్లలు. వారిని ప్రయోజకులుగా చేయాలనుకున్న. వ్యవసాయం చేస్తూ చదివించిన. పెద్ద కొడుకు వంశి అగ్నివీర్లో ఎంపిక జమ్మూకశ్మీర్లో ఉద్యోగం చేస్తున్నడు. చిన్న కొడుకు ఇంటర్ వరకు చదివిండు. వ్యవసాయంలో తోడుంటున్నడు’’ అని మల్కాపూర్కు చెందిన కొండ రామకిష్టవ్వ తెలిపింది. -
గోమాతల అక్రమ రవాణా అరికట్టాలి
పిట్లం(జుక్కల్): గోమాతల అక్రమ రవాణాను అరికట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్పీ, బజరంగ్దళ్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు శనివారం పిట్లం పోలీస్ స్టేషన్లో ఎస్సై ఆంజనేయులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బక్రీద్ పండుగ సందర్భంగా గోమాతలను అక్రమంగా తరలించి హింసాత్మక చర్యలకు పాల్పడటం హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశమని ఆవేదన వ్యక్తం చేశారు. గో సంరక్షణ కోసం పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గోమాతల అక్రమ రవాణా చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొరారు. విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ సభ్యులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి: గోహత్య నిషేధ చట్టాన్ని అమలు చే యాలని కోరుతూ వీహెచ్పీ నాయకులు శనివారం ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డికి వినతిపత్రం అందించారు. గోహత్య జరగకుండా తగిన చర్యలను తీసుకోవాలని వారు విన్నవించారు. వీహెచ్పీ, గోసంరక్షక్ నాయకులు వినోద్, తులసి, రాజు ఉన్నారు. -
గ్యాస్ నింపుతుండగా అగ్ని ప్రమాదం
● రెండు వ్యాన్లు, కారు, ఓ బైక్ దగ్ధం ● కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లిలో ఘటనకామారెడ్డి క్రైం: గృహ వినియోగ సిలిండర్లో నుంచి కారులోకి గ్యాస్ నింపుతుండగా అగ్ని ప్రమాదం సంభవించి రెండు వ్యాన్లతోపాటు ఓ కారు, బైక్ దగ్ధమయ్యాయి. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలి టీ పరిధిలోని దేవునిపల్లిలో శనివారం ఉదయం చోటు చేసుకుంది. సురేశ్, శ్రీశైలం అనే ఇద్దరు వ్యక్తు లు వారి ఇంటికి సమీపంలోని ఓ ఖాళీ స్థలంలో వేసి ఉన్న రేకుల షెడ్డులో కొంత కాలంగా తమ కార్లను పార్కింగ్ చేసుకుంటున్నారు. నిబంధనలకు విరు ద్ధంగా గృహ వినియోగ సిలిండర్ నుంచి ఓ వ్యాన్లోకి గ్యాస్ నింపుతుండగా ప్రమాదవశాత్తు మంట లు చెలరేగి షెడ్డులో ఉన్న అన్ని వాహనాలకు వ్యా పించాయి. స్ధానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పివేశారు. అప్పటికే రెండు ఈకో వ్యాన్లు, ఓ బెలెనో కారు, ఓ ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమయ్యా యి. ప్రమాదానికి కారణమైన గృహ వినియోగ గ్యాస్ సిలిండర్, రీఫిల్లింగ్ మిషన్లను దేవునిపల్లి పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నారు. అధికారులు నష్టాన్ని అంచనా వేస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చేవరకు కాలనీవాసులు ఆందోళనకు గురయ్యారు. -
76509 87777
రేపు కామారెడ్డి బల్దియా చైర్పర్సన్తో ‘సాక్షి’ ఫోన్ఇన్వేసవిలో నీటి ఎద్దడి, పైప్లైన్ల లీకేజీలు తదితర సమస్యలపై కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణితో సాక్షి ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహించనుంది. నీటి సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకురావడానికి కింది నంబర్కు ఫోన్ చేయండి.తేది : 11–5–2026 (సోమవారం) సమయం: ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు..ఫోన్ చేయాల్సిన నంబర్: -
నీటి కష్టం తీరేదెప్పుడో?
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో 200 కాలనీలలో 25 వేల గృహాలున్నాయి. సుమారు లక్షకుపైగా జనాభా నివసిస్తున్నారు. పట్టణ నీటి అవసరాలు తీర్చడం కోసం రోజూ 12 ఎంఎల్డీ (మెగాలీటర్స్ పర్ డే) అవసరం. కానీ క్షేత్రస్థాయిలో అందుతున్నది 6 ఎంఎల్డీ మాత్రమే. అంటే అవసరంలో సగం నీరు మాత్రమే సరఫరా అవుతోంది. దీంతో నల్లాల ద్వారా రెండు రోజులకోసారి నీరు సరఫరా అవుతోంది. అవి కూడా తక్కువ ప్రెషర్తో వస్తుండడంతో ఎత్తైన ప్రాంతాల్లో ఉన్న శివారు కాలనీలకు నీరు అందడం లేదు. పైప్లైన్ల నిర్వహణ సరిగా లేక.. పట్టణంలో 300లకు పైగా మున్సిపల్ బోర్లు, 70కి పైగా కమ్యూనిటీ బోర్లు ఉన్నాయి. వీటితో పాటు పట్టణానికి శ్రీరాంసాగర్నుంచి గోదావరి జలాలు సరఫరా అవుతున్నాయి. కామారెడ్డి పెద్ద చెరువు, బుర్రమత్తడి ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. అయితే పైప్లైన్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో నీటి సమస్య తలెత్తుతోంది. నత్తనడకన ‘అమృత్’.. కేంద్ర ప్రభుత్వం రూ. 90 కోట్లతో చేపట్టిన అమృత్ పథకం పనులు పట్టణంలో నత్తనడకన సాగుతున్నాయి. ఈ నిధులతో పట్టణంలో ఏడుచోట్ల భారీ వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టారు. అయితే ఏళ్లు గడుస్తున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. పైప్లైన్ల అనుసంధానం పూర్తి కాకపోవడంతో మిషన్ భగీరథ నీరు ప్రజలకు అందడం లేదు. ఎక్కడ చూసినా తవ్వి వదిలేసిన గుంతలే తప్ప కుళాయిల్లో నీటి గలగలలు వినిపించడం లేదని ప్రజలు పేర్కొంటున్నారు. అల్లాడుతున్న కాలనీలు.. పట్టణంలో ప్రధానంగా గోసంగి కాలనీ, రాజీవ్నగర్, డ్రైవర్స్ కాలనీ, బతుకమ్మకుంట, అశోక్నగర్, శ్రీరామ్నగర్, విద్యానగర్, రుక్మిణికుంట, స్నేహపూరి కాలనీ, లింగాపూర్, టేక్రియాల్, పాత రాజంపేట్, ఇల్చీపూర్ తదితర కాలనీల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ట్యాంకర్ ఎప్పుడు వస్తుందా అని ప్రజలు నిరీక్షిస్తుంటారు.ఎండలతోపాటే కామారెడ్డి బల్దియాలో తాగునీటి కష్టాలు పెరుగుతున్నాయి. సరిపడా నీరు సరఫరా కాకపోవడంతో పట్టణ ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. పాలకులు సరైన చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. తాగునీటి ఎద్దడికి సాక్ష్యంగా పలు కాలనీలలో ఏ ఇంటి ముందు చూసినా డ్రమ్ములు దర్శనమిస్తున్నాయి. – కామారెడ్డి టౌన్ కామారెడ్డిలో అసంపూర్తిగా ‘అమృత్’ పనులు సరిపడా సరఫరా కాని నీరు ప్రతి ఇంటిముందు డ్రమ్ములు.. ఏటా ఇదే పరిస్థితి పట్టించుకోని పాలకులు -
ఇక టీజీఎస్ఈబీ?
ఖలీల్వాడి(నిజామాబాద్ అర్బన్): పదో తరగతి తరువాత చాలా మంది బాలికలతోపాటు బాలురు ఇంటర్ విద్యకు వెళ్లడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో బాలికలు బీడీలు చుట్టడం, టైలరింగ్ వంటి పనుల వైపు, వ్యవసాయ నేపథ్యం ఉన్న బాలురు అటువైపు వెళ్తుండగా.. ఆర్థిక పరిస్థితులు సరిగా లేనివారు ఇదో ఒక పనికి వెళ్తూ పైచదువులకు దూరవుతున్నారు. అలాగే ఇంటర్ కళాశాలలు దూర ప్రాంతాల్లో ఉండడంతో వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల విద్య తర్వాత విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు పాఠశాల విద్య(8 నుంచి 10వ తరగతి), ఇంటర్మీడియెట్ను విలీనం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీంతో వచ్చే ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలు ఉండవనే చర్చ విద్యాశాఖలో జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసే ప్రక్రియ వేగవంతం చేసింది. ఈ రెండు ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని నిర్ణయించింది. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ) ప్రకారం 10+2 విద్యను బలోపేతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో ఒకటి నుంచి పదవ తరగతి వరకు పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి వచ్చేవి. ఇంటర్మీడియట్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల కోర్సులు ఇంటర్మీడియెట్ బోర్డు పరిధిలో ఉండేవి. పరీక్షల విధానంలో మార్పులు 8 నుంచి 10వ తరగతి, ఇంటర్ విలీనమైతే వచ్చే విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షలు ఉండే అవకాశాలు లేవు. ఒకటి నుంచి 7వ తరగతి వరకు స్కూల్ బోర్డు పరిధిలో విద్యార్థులు అభ్యసించనున్నారు. అలాగే 8 నుంచి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులు నూతన బోర్డు పరిధిలో వార్షిక పరీక్షలు రాసే అవకాశం ఉంది. ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ తదితర అంశాలపై పూర్తిస్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.జిల్లాలో పాఠశాలలు, కళాశాలలు పాఠశాల విద్యాశాఖలో ఇంటర్బోర్డు విలీనానికి రంగం సిద్ధం రెండు శాఖల నుంచి ప్రతిపాదనలు 8 నుంచి 12వ తరగతి వరకు ఒక బోర్డు.. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు మరొక బోర్డు రానున్న విద్యా సంవత్సరం నుంచే అమలులోకి! -
క్రైం కార్నర్
భర్తను చంపిన భార్య ● హత్యకు సహకరించిన కొడుకు నందిపేట్(ఆర్మూర్): కట్టుకున్న భర్తను కొడుకు సహాయంతో హత్య చేసిన ఘటన నందిపేట మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆర్మూర్ రూరల్ సీఐ జానారెడ్డి, నందిపేట ఎస్సై శ్యామ్రాజ్ శుక్రవారం తెలిపారు. నందిపేట మండలం మాయాపూర్ గ్రామానికి చెందిన పుంటికూర ముత్యం(44) ఈ నెల 6న మృతి చెందాడు. మద్యం మత్తులో మంచంపై నుంచి కిందపడి చనిపోయాడని మృతుడి భార్య లలిత చెప్పడంతో కుటుంబసభ్యులకు అనుమానం కలిగింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుని భార్య, కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా తామే హత్య చేసినట్లు ఒప్పకున్నారు. ఆర్థిక ఇబ్బందులతోపాటు ముత్యంకు ఉన్న వివాహేతర సంబంధం కారణంగా ఇంట్లో తరుచూ గొడవలు జగుతుండేవని మృతుడి భార్య లలిత తెలిపింది. ఎంత చెప్పినా అతనిలో మార్పు రాకపోవడంతో ఈ నెల 5న రాత్రి మద్యం తాగి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ముత్యం మెడకు చీర అంచుతో బిగించగా కొడుకు కాళ్లు కదలకుండా పట్టుకొని సహకరించాడని, దీంతో తన భర్త మృతి చెందాడని పోలీసుల విచారణలో నేరం ఒప్పుకుంది. శుక్రవారం నిందితులు లలిత, ఆమె కుమారుడిని కోర్టులో హాజరుపరచినట్లు సీఐ జానారెడ్డి వెల్లడించారు. -
ధర్మారెడ్డిలో సమ్మర్క్యాంప్
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి):ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ధర్మారెడ్డి గ్రామంలో శుక్రవారం వైద్యసిబ్బంది స్నేహ సమ్మర్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్హెచ్పీ లావణ్య గ్రామంలోని కిశోర బాలికలకు, మహిళలకు రక్తహీనత గురించి వివరించడంతోపాటు దానివల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి తెలియజేశారు. తలసేమియా వ్యాధి గురించి..బాల్యవివాహాలు చేయడం వల్ల కలిగే అనర్థాల గురించి ఆమె తెలియజేశారు. అనంతరం కిషోర బాలికలకు, మహిళలకు రక్త, బీపీ, షుగర్ పరీక్షలకు చేశా రు. ఏఎన్ఎం సంధ్యారాణి, ఆశావర్కర్లు అంజమ్మ, సావిత్రి, నాయకులు నారాయణ పాల్గొన్నారు. వర్ని: మోస్రా గ్రామ శివారులో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మూడు నెలల శిశువు మృతి చెందినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం రాత్రి మల్లారం గ్రామానికి చెందిన జర్పుల దశరథ్ భార్య నిరోషా, మూడు నెలల శిశువుతో నిజామాబాద్ నుంచి స్వగ్రామమైన మల్లారానికి కారులో వస్తోంది. మోస్రా శివారులో అడవి పందులు అడ్డం రావడంతో వాటిని తప్పించే ప్రయత్నంలో కారు ప్రమాదానికి గురై పొలాల్లో బోల్తా కొట్టింది. ప్రమాదంలో మూడు నెలల శిశువు చికిత్స పొందుతూ మృతి చెందగా, నిరోషకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చిరుత దాడిలో దూడ..లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని లింగంపల్లి(ఖుర్దు) గ్రామ శివారులో శుక్రవారం తెల్లవారుజామున పొలం వద్ద కట్టేసిన పాడి దూడపై చిరుతపులి దాడి చేసి హతమార్చినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన చౌడ లింగం అనే రైతు తన పొలం వద్ద పాడి గేదెలు, ఆవులను గురువారం రాత్రి కట్టేసి ఇంటికి వచ్చారు. శుక్రవారం ఉదయం వెళ్లేసరికి చిరుత దాడిలో పాడి దూడ మృతి చెందినట్లు తెలిపారు. ఎర్రాపహాడ్ సెక్షన్ అధికారి వినోద్, బీట్ అధికారి లింగయ్య ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. చిరుత దాడిలోనే దూడ మృతి చెందినట్లు నిర్ధారించారు. లింగంపేట పశువైద్యాధికారి హన్నా జోనస్ పోస్టుమార్టం నిర్వహించారు. దూడ విలువ రూ. 50 వేలు ఉంటుందన్నారు. -
యుద్ధ కళల్లో చిన్నారులకు శిక్షణ
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని బేతాళస్వామి ఆలయం ప్రాంగణంలో చిన్నారులు కరాటేలో శిక్షణ పొందుతున్నారు. మండలంలోని సంగోజీపేట్కు చెందిన మాగి నవీన్ అనే యువకుడు హైందవ వీరుల యుద్ధ కళల గురుకులం(అకాడమీ ది రైట్ వే కరాటే క్యాంపస్ ) అనే శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు తమ చిన్నారులను బేతాళస్వామి వద్ద ఏర్పాటు చేసిన కరాటే శిక్షణ తరగతులకు పంపిస్తున్నారు. ప్రతీ రోజు ఉదయం 8 గంటల నుంచి 10 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి చిన్నారులకు కరాటేపై శిక్షణ ఇస్తున్నారు. -
గుంతలోకి దూసుకెళ్లిన కారు
● ఇద్దరికి తీవ్ర గాయాలు రామారెడ్డి: మండల కేంద్రంలో పైప్లైన్ నిర్మాణం కోసం తీసిన 12 అడుగుల భారీ గుంతలోకి కారు దూసుకెళ్లి నిట్ట నిలువునా ఇరుక్కుపోయింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం కామారెడ్డి నుంచి రంగంపేట వైపు వస్తున్న కారు శివారులోకి చేరుకోగానే ఒక్కసారిగా రోడ్డు పక్కన పైప్లైన్ కోసం తీసిన గుంతలోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న భార్యాభర్తలు రమేశ్ గౌడ్ వనిత ఇరుక్కుపోగా రంగంపేట గ్రామస్తులు బయటికి తీశారు. తీవ్ర గాయాలైన దంపతులను 108 అంబులెన్స్లో కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
ప్రతిభకు పదును.. భవితకు దన్ను
మోపాల్(నిజామాబాద్రూరల్): చిన్నారులను సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలనే ఉద్ధేశంతోపా టు వారు ఆయా అంశాల్లో నైపుణ్యం సాధించేలా మహాత్మాజ్యోతీ బాపూలే బీసీ బాలుర గురుకుల సొసైటీ వేసవిలో ప్రత్యేక చర్యలు చేపట్టింది. సొసైటీ కార్యదర్శి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని సౌకర్యాలు కలిగిన పాఠశాలల్లో వేసవి శిబిరాలు నిర్వహించింది. నిజామాబాద్ జిల్లాలో ని మోపాల్ మండలం కంజర శివారులో ఉన్న మహాత్మాజ్యోతీ బాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో ఉమ్మడి నిజామాబాద్లోని 11, ఉమ్మడి ఆదిలాబాద్లోని 13 పాఠశాలల నుంచి సుమారు 400 మంది విద్యార్థులకు 15 రోజులపాటు వేసవికాల శిబిరాన్ని ఏర్పాటుచేసింది. శిక్షణా శిబిరం శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ముగింపు కార్యక్రమాన్ని పాఠశాలలో ని ర్వహించగా, నిజామాబాద్ ఆర్సీవో సత్యనాథ్రె డ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వేసవి సెల వుల్లో గ్రామాల్లో, ఇళ్లల్లో విద్యార్థులు చేయాల్సిన, చేయకూడని పనులను క్షుణ్ణంగా వివరించడంతోపాటు కీలక సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మురళీ, వైస్ ప్రిన్సిపాల్ సుదం, సిబ్బంది కత్తుల శంకర్, రాజేందర్, పీఈటీలు, పీడీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శిక్షణనిచ్చిన అంశాలు విద్యార్థులకు 15 రోజులపాటు వేదిక్ మ్యాథ్స్, స్పోకెన్ ఇంగ్లిష్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్, కంప్యూటర్, కరాటే, డ్యాన్స్, హ్యాండ్ రైటింగ్, పేపర్ కటింగ్స్తోపాటు టేబుల్ టెన్నిస్, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్, వివిధ క్రీడల్లో తర్ఫీదు ఇచ్చారు. ఇందుకోసం సుమారు 25 మంది వరకు నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించారు. ముగింపు సందర్భంగా ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు. వేదిక్ మ్యాథ్స్ ద్వారా చాలా విషయాలు తె లిశాయి. గణితమంటే భయపడకుండా సులభపద్ధతిలో వేదిక్ మ్యా థ్స్లో మెలకువలు నేర్చుకున్నాను. దీంతోపాటు డ్యాన్స్, సంప్రదాయ నృత్యాలు నేర్చుకున్నాం. వివిధ జిల్లాల విద్యార్థులందరం ఒక దగ్గర శిక్షణ పొంది స్నేహితులుగా మా రడమే కాకుండా ఎన్నో అంశాలు నేర్చుకున్నాం. – సాయి భానుతేజ, ఏడోతరగతి, తాండూరు, ఆదిలాబాద్ వేసవి శిక్షణాశిబిరంలో అనేక విషయాలు నేర్చుకున్నాను. స్పోకెన్ ఇంగ్లి ష్, వేదిక్ మ్యాథ్స్, కంప్యూటర్ వంటి వాటిపై చాలా అవగాహన వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని అంశాలపై శిక్షణనిచ్చారు. క్రీడల్లోనూ పాల్గొనడంతో శారీరకంగా ఉల్లాసంగా అనిపించింది. – దత్తాద్రి, ఏడోతరగతి, బీర్కూర్, కామారెడ్డి విద్యార్థులకు చదువుతోపా టు క్రీడలు, ఇతర అన్నిరంగా ల్లో రాణించాలి. సెల్ఫోన్లు, టీవీలకు ఆకర్షితులై చదువు ను మర్చిపోతున్నారు. బీసీ గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో యేటా వేసవిలో శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తోంది. శిబిరం విజయవంతంగా ముగిసేందుకు సహకరించిన ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, పీఈటీలు, పీడీలకు ప్రత్యేక కృతజ్ఞతలు. – సత్యనాథ్రెడ్డి, ఆర్సీవో, ఉమ్మడి నిజామాబాద్ విద్యార్థులకు వివిధ అంశాలపై శిక్షణ మోపాల్ బీసీ బాలుర గురుకులంలో ముగిసిన వేసవి శిబిరం పాల్గొన్న ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల విద్యార్థులు -
‘ఉపాధి’లో ఫీల్డ్ అసిస్టెంట్ల ఇష్టారాజ్యం
● కొందరికి పనులు చేయకున్నా హాజరు వేస్తున్నారన్న ఆరోపణలు ● చర్యలు తీసుకోవాలని కోరుతున్న కూలీలుపెద్దకొడప్గల్: గ్రామాలనుంచి వలసలను తగ్గించి స్థానికంగానే పనులు కల్పించాలనే లక్ష్యంతో ప్రవేశపట్టిన ఉపాధి హామీ పథకం కొందరి వల్ల నీరుగారిపోతోంది. పలువురు ఫీల్డ్ అసిస్టెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పనులు చేయకున్నా కొందరికి హాజరు వేస్తున్నారని పలువురు కూలీలు పేర్కొంటున్నారు. మండలంలోని పలు గ్రామాలలో కొందరు కూలీలు కేవలం హాజరు సమయానికి వచ్చి ఫొటోలు దిగి వెళ్తున్నారని తెలుస్తోంది. ఫీల్డ్ అసిస్టెంట్లు తమవారు పనులు చేయకున్నా పట్టించుకోవడం లేదని కూలీలు ఆరోపిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్ల ఇస్టారాజ్యం కొనసాగుతోందని పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పనులు చేసేవారికే కూలి డబ్బులు అందేలా చూడాలని కోరుతున్నారు.కొంతమంది కూలీలు ఎలాంటి పనులు చేయకుండానే ఫొటోలు దిగి వెళ్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. పనులు చేయని వారికి హాజరు వేయవద్దని ఫీల్డ్ అసిస్టెంట్లకు చెప్పాం. పనిచేసేవారికే వేతనాలు అందేలా చూస్తాం. – సుదర్శన్, ఏపీవో, పెద్దకొడప్గల్ -
హమాలీల సంఖ్య పెంచండి
● గడువులోగా ధాన్యం సేకరణ పూర్తి చేయాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయడానికి అదనపు హమాలీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. లింగాపూర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. ధాన్యం సేకరణ వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కేంద్రం నిర్వాహకులు చూడాలని సూచించారు. తూకాలు వేగంగా పూర్తి చేసి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. మెప్మా సంఘానికి వచ్చే కమీషన్ మొత్తాన్ని సభ్యులందరికీ ప్రయోజనం చేకూరేలా వినియోగించాలని, తద్వారా సంఘం ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. వర్షాకాలం దృష్ట్యా ధాన్యం కొనుగోలు ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలన్నారు. అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు. అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సురేందర్, డీఎస్వో వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. నాణ్యతతో పనులు చేపట్టాలి కామారెడ్డి క్రైం: భవన నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. జిల్లాకేంద్రంలో రూ. 5 కోట్లతో నిర్మాణంలో ఉన్న జిల్లా ఇందిర మహిళా శక్తి భవన నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 25 లోగా పనులు పూర్తి చేసి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు శిక్షణ, ఉత్పత్తుల మార్కెటింగ్కు ఈ భవనం ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, డీఆర్డీవో సురేందర్, పీఆర్ డీఈఈ స్వామి దాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆధ్యాత్మికం..
సామూహిక కుంకుమార్చనలు కామారెడ్డి అర్బన్: కామారెడ్డి కోడూరు హన్మాన్ ఆలయ ప్రాణప్రతిష్ఠాపన ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సామూహిక కుంకుమార్చనలు చేశారు. కుంకుమార్చనల అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు అన్నప్రసాదం అందజేశారు. ధ్వజ స్తంభం ప్రతిష్ఠాపన బీబీపేట: మల్కాపూర్లో రెండు రోజులుగా జరుగుతున్న ఆంజనేయ స్వామి ఆలయ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయం ముందు దాత మాసానిపల్లి పెరమాండ్లు అందించన ధ్వజ స్తంభాన్ని ప్రతిష్టించారు. ఉదయం నుంచి ఆలయం వద్ద ప్రత్యేక పూజల అనంతరం ప్రాణ ప్రతిష్ట జరిపించారు. అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్నదానం నిర్వహించారు. బోనమెత్తిన గంగపుత్రులు నిజాంసాగర్ (జుక్కల్): శివసత్తుల పూనకాలు..... డప్పు సప్పులతో గంగమ్మ తల్లికి గంగపుత్రులు ఘనంగా బోనాలు సమర్పించారు. శుక్రవారం మహమ్మద్ నగర్ మండలం నర్వ గ్రామంలో గంగమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాలను గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. బోనాలతో ఊరేగింపు ర్యాలీ నిర్వహించారు. పెద్దమ్మతల్లి ఆలయ వార్షికోత్సవాలు ప్రారంభం నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట గ్రామశివారులోని పెద్దమ్మతల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా శుక్ర, శనిరాల్లో పలు పూజా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆదివారం గ్రామదేవతలకు బోనాలు, సోమవారం పెద్దమ్మతల్లికి బోనాలను సమర్పించనున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు వివరించారు. -
బీజేపీ కౌన్సిలర్ల ఆరోపణలు అర్థరహితం
కామారెడ్డి టౌన్: మున్సిపల్ కో–ఆప్షన్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కౌన్సిలర్లు చేస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికేనని మున్సిపల్ వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో కౌన్సిలర్లతో కలిసి ఆమె మాట్లాడారు. స్థానిక పరిస్థితులను బట్టి, పట్టణ అభివృద్ధిని కాంక్షించి మున్సిపాలిటీల్లో పరస్పర సహకారం ఉంటుందని, అందుకనే చైర్పర్సన్, కో–ఆప్షన్ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చామన్నారు. దీనిని రాజకీయ కోణంలో చూడటం తగదన్నారు. భైంసా, అమంగల్, ఖానాపూర్ వంటి మున్సిపాలిటీల్లో బీజేపీ స్వయంగా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను పొందిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. అక్కడ లేని అపవిత్ర పొత్తు కామారెడ్డిలో ఎలా కనిపిస్తుందని నిలదీశారు. కౌన్సిలర్లు హాఫీజ్బేగ్, ప్రభాకర్ యాదవ్, మామిండ్ల లక్ష్మణ్, ఎజాజ్, లోలపు శ్రీనివాస్, కో–ఆప్షన్ సభ్యుడు కుంబాల రవియాదవ్, పార్టీ అధికార ప్రతినిధి బల్వంత్రావు, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ
● ఇద్దరికి తీవ్రగాయాలు నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని జప్తిజాన్కంపల్లి గేట్ వద్ద ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..మహ్మద్నగర్కు చెందిన మల్లేశం, మరో మహిళ మండలంలోని జప్తిజాన్కంపల్లిలో జరిగిన వివాహ వేడుకకు హాజరై బైక్పై తిరుగు ప్రయాణమయ్యారు. నర్సాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎల్లారెడ్డి నుంచి జేబీఎస్కు వెళ్తుండగా జప్తిజాన్కంపల్లి గేట్ వద్ద మల్లేశం నడుపుతున్న బైక్ ఢీకొన్నాయి. మల్లేశంతోపాటు బైక్పై ఉన్న మరో మహిళకు తీవ్రగాయాలు కాగా, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 అంబులెన్స్లో ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. -
భవితనిచ్చిన బడికి బాసట!
● ప్రైవేట్కు దీటుగా సౌకర్యాలు కల్పిస్తున్న పూర్వ విద్యార్థులు ● ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న నెమ్లి హైస్కూల్నస్రుల్లాబాద్ : బతుకు బాటలు వేసిన బడికి అండగా నిలుస్తున్నారు పలువురు పూర్వ విద్యార్థులు. తాము చదివిన పాఠశాలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. దీంతో ఆ పాఠశాల పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తోంది. నెమ్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నెమ్లితోపాటు హాజీపూర్, సంగం, అంకోల్, అంకోల్ క్యాంపు, అంకోల్ తండా, నాచుపల్లి, కామిశెట్టిపల్లి, బైరాపూర్, లింగంపల్లి, దుర్కి, మీర్జాపూర్, దేశాయిపేట్ గ్రామాల నుంచి విద్యార్థులు చదువుతున్నారు. గత విద్యాసంవత్సరంలో 381 మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. ఈ పాఠశాల అభివృద్ధి కోసం నాలుగేళ్ల క్రితం పూర్వ విద్యార్థులు ఒక్కటయ్యారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటైన వసతులు కల్పించేందుకు ముందుకు వచ్చారు. విరాళాలు సేకరించి పాఠశాల అవసరాలకు వినియోగిస్తున్నారు. ఇప్పటికే విద్యార్థులకు అవసరమైన డెస్క్ బెంచీలను అందించారు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించారు. ఏడాదిగా ఇద్దరు స్కావెంజర్లకు జీతాలు అందిస్తున్నారు. ప్రస్తుతం పూర్వ విద్యార్థుల అసోసియేషన్ వద్ద రూ. 7లక్షలు ఉన్నాయి. భవిష్యత్ అవసరాలకోసం ఈ నిధిని సమీకరించి ఉంచారు. ఎస్సెస్సీలో మంచి ఫలితాలు.. సౌకర్యాలు మెరుగవడంతో విద్యార్థులు చదువుపై దృష్టి సారించగలుగుతున్నారు. ఉపాధ్యాయులు నాణ్య మైన విద్య అందిస్తుండడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ఏటా పదో తరగతిలో విద్యార్థుల సంఖ్యతోపాటు ఫలితాలూ మెరుగవుతూ వస్తున్నాయి. 2024లో పదో తరగతిలో 87 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులవగా.. 2025లో 97 శాతం పాస్ అయ్యారు. ఈసారి 99 శాతం ఉత్తీర్ణత సాధించారు. కంప్యూటర్ ల్యాబ్ ద్వారా విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రేడ్, అప్పేరల్ కోర్సుల్లో విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. ఈ పాఠశాలనుంచి ఏటా ఎన్ఎంఎం స్కాలర్షిప్నకు ముగ్గురు చొప్పున ఎంపికవుతున్నారు. రెండేళ్లుగా ట్రిపుల్ఐటీకి ఒక్కొక్కరు ఎంపికవుతూ వస్తున్నారు.విద్యాసంవత్సరం విద్యార్థులు ఉత్తీర్ణులైనవారు ఉత్తీర్ణత శాతం 2023–24 94 82 87.23 2024–25 94 92 97.87 2025–26 117 116 99.14 -
సేవలను సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి క్రైం: ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పశు వైద్య సేవలను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం లింగాపూర్లో పశువులకు ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ చికిత్స శిబిరాన్ని నిర్వహించారు. కలెక్టర్ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతుల ఆర్థికాభివృద్ధిలో పశు సంపద కీలక పాత్ర పోషిస్తుందన్నారు. దూడల సంరక్షణ, పశుగ్రాసాల సాగులో శాసీ్త్రయ పద్ధతులు పాటించడం ద్వారా రైతులు అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. కాఫ్ ర్యాలీ నిర్వహించి రైతులకు పశు సంరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా పశు వైద్యాధికారి భరత్, మండల పశువైద్యాధికారి రవికిరణ్, కౌన్సిలర్ కాసర్ల రాణి, విజయ డెయిరీ అధ్యక్షుడు నరేందర్రెడ్డి, కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలి
కామారెడ్డి టౌన్: రాష్ట్ర బడ్జెట్లో వృత్తిదారుల కార్పొరేషన్లకు నామమాత్రపు నిధులు కేటాయించడంతో తీవ్ర అన్యాయం జరుగుతుందని చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ ఎస్. వెంకట్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బడ్జెట్ నిధులు విడుదల కాకపోవడంతో కార్పొరేషన్లు నిర్వీర్యమవుతున్నాయని, నిధులు లేని చోట చైర్మన్ల నియామకం వల్ల అదనపు భారమే తప్ప ఒరిగేదేమీ లేదని విమర్శించారు. నూతనంగా నియమితులైన చైర్మన్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు రాబట్టాలని, వృత్తుల ఆధునీకరణకు కృషి చేయాలని కోరారు. కామారెడ్డి టౌన్: మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుడిగా నూతనంగా ఎన్నికై న కుంబాల రవి యాదవ్ శుక్రవారం హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన ఎన్నికకు సహకరించినందుకు గంప గోవర్ధన్తో పాటు బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్కు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కాసర్ల గోదావరి, కౌన్సిలర్లు హఫీజ్ బేగ్, ప్రభాకర్ యాదవ్, పిట్ల వేణు, స్వప్న లక్ష్మీనారాయణ, మామిండ్ల లక్ష్మణ్, లోలపు శ్రీనివాస్, అజాజ్, మన్సూర్, గోపు బాలమణి తదితరులు పాల్గొన్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): ధర్మారావ్పేట్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు ఇటీవల రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికై న గీతం, రసజ్ఞ, రిత్విక్, అఖిల, నవ్యలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఎంఈవో యోసెఫ్, పీడీ శ్రీనివాస్లు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీలు ఈ నెల 17న హైదరాబాద్లో జరుగనున్నట్లు వారు పేర్కొన్నారు. సర్పంచ్ ఉమర్, ఉప సర్పంచ్ అశోక్ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షులు ప్రమీలమ్మ, వార్డు సభ్యులు పాల్గొన్నారు. దోమకొండ: రాష్ట్రంలోని ఆరు లక్షల మంది బీడీ కార్మికులకు కనీస వేతనాలు పెంచుతూ ఒప్పందం కుదిరిందని, హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర బీడీ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్, బీడీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు నెలసరి ఉద్యోగులకు బీడీ ప్యాకింగ్ వర్కర్స్కు వేతనాల పెంపుదల గురించి సుదీర్ఘ చర్చలు జరిపినట్లు తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుతారి రాములు తెలిపారు. చర్చలలో తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు గోవర్ధన్, రాష్ట్ర నేతలు అనుమల్ల గంగాధర్, అయ్యవార్ల లక్ష్మణ్, ఆది రంగారెడ్డి, తదితరుల తదితరులు పాల్గొన్నారు. ఈ చర్చలు సఫలం కావడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని బీసీ వసతి గృహం సమీపంలో ధాన్యం లోడ్తో వెళ్తున్న డీసీఎం శుక్రవారం సాయంత్రం బోల్తా పడింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. డీసీఎంలో ఓవర్ లోడ్ చేసుకొని సురాయిపల్లి నుంచి లింగంపేటకు వస్తుండగా మండల కేంద్రంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఘటన సమయంలో చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
వేర్వేరు చోట్ల చోరీలు
మద్యం దుకాణంలో రూ.లక్ష కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని సిరిసిల్లా రోడ్లో ఉన్న ఓ లిక్కర్ మార్ట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. నిర్వాహకులు గురువారం రాత్రి దుకాణం మూసేసి ఇళ్లకు వెళ్లగా, అర్ధరాత్రి తర్వాత అద్దాలు, కిటికీలు పగులగొట్టి దుకాణంలోకి చొరబడిన ఇద్దరు దుండగులు చోరీ చేశారు. కౌంటర్లో దాచి ఉంచిన నగదు ఎత్తుకెళ్లినుట్ల సీసీ ఫుటేజీల్లో స్పష్టంగా కనిపిస్తుంది. రూ.లక్ష చోరీకి గురైనట్లు బాధితులు చెబుతున్నారు. క్లూస్ టీం బృందం ఆధారాలు సేకరించారు. పట్ణణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాళం వేసిన ఇంట్లో.. దోమకొండ: దోమకొండ గ్రామానికి చెందిన సామల నరేశ్ ఇంటికి తాళం వేసి కామారెడ్డిలో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళం పగులగొట్టి దొంగతనానికి పాల్పడినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. వృత్తి రీత్యా నరేశ్ రెండు నెలలుగా కామారెడ్డిలో ఉంటున్నారు. శుక్రవారం పని నిమిత్తం దోమకొండకు రాగా ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించారు. బీరువాలోని రూ. 7,000 అపహరణకు గురైనట్లు బాధితుడు పేర్కొన్నారు. ఎల్లారెడ్డిలో చోరీకి విఫలయత్నం ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలో జ్యువెల్లరి దుకాణంలో దొంగలు చోరీకి యత్నించినట్లు స్థానికులు తెలిపారు. పట్టణంలోని అవుసుల మాణిక్యం జ్యువెల్లరి దుకాణానికి సంబంధించిన మూడు తాళాలను దుండగులు గురువారం అర్ధరాత్రి పగులగొట్టారు. నాలుగో తాళం పగలగొట్టే సమయంలో జనం అలికిడికి దొంగలు పరారై ఉంటారని బాధితుడు మాణిక్యం తెలిపారు. తలుపులు తెరవకపోవడంతో ఎలాంటి చోరీ జరగలేదని పేర్కొన్నారు. సుభాష్నగర్ అపార్ట్మెంట్లో.. నిజామాబాద్అర్బన్: నగరంలోని సుభాష్నగర్ అపార్ట్మెంట్లో చోరీ జరిగినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు.రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజినీర్ వేణుగోపాలరావు సుభా ష్నగర్లోని అక్షయ రెసిడెన్సీలో నివాసముంటున్నారు. ఆయన ఊరికి వెళ్లగా గురువారం రాత్రి దొంగలు చొరబడి కిలో వెండి ఆభరణాలు దొంగిలించినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, ఘటనా స్థలాన్ని ఏసీపీ ప్రకాశ్ పరిశీలించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు చేతివాటం ప్రదర్శించారు. కామారెడ్డి, దోమకొండ, నిజామాబాద్లోని సుభాష్నగర్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. -
వారంనుంచి నీళ్లొస్తలేవు
మా కాలనీకి వారం రోజులుగా నీళ్లు రావడం లేదు. మున్సిపల్ బోరు కూడా అరగంట కంటే ఎక్కువ రాదు. పైప్లైన్ సరిగ్గా లేకపోవడంతో కుళాయిల ద్వారా నీరు అందడం లేదు. ఇళ్ల ముందు డ్రమ్ములు పెట్టుకుని ట్యాంకర్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ప్రతిరోజూ నీళ్ల కోసమే మా సమయమంతా సరిపోతోంది. – సాయవ్వ, గోసంగి కాలనీ, కామారెడ్డి పట్టణంలో నీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికతో చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే మున్సిపల్ బోర్ల మరమ్మతులకు నిధులు కేటాయించాం. నీటి సమస్య ఎక్కువగా ఉన్న కాలనీలకు మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. అమృత్ పనులను కూడా వేగవంతం చేయాలని ఆదేశించాం. – టి.పర్వతాలు, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి -
స్నేహితుడి వివాహానికి వెళ్తూ..
● రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతిఎల్లారెడ్డిరూరల్: స్నేహితుడి వివాహానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి మండలం తిమ్మారెడ్డి శివారులో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నస్రుల్లాబాద్ గ్రామానికి చెందిన దండు నాగరాజు (25) హైదరాబాద్లో క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. నస్రుల్లాబాద్లో స్నేహితుడి వివాహం ఉండడంతో గురువారం హైదరాబాద్ నుంచి కారులో బయల్దేరాడు. తిమ్మారెడ్డి గ్రామశివారులో ఎల్లారెడ్డి–బాన్సువాడ ప్రధాన రహదారిపై ఉన్న చెట్టును కారు బలంగా ఢీకొనడంతో ఘటన స్థలంలోనే నాగరాజు మృతి చెందాడు. మృతుడికి ఆరు నెలల క్రితం వివాహమైంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేశ్ తెలిపారు. -
42 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
రుద్రూర్: మండల కేంద్రంలోని జవహర్నగర్ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని సి విల్ సప్లయ్ అధికారులు గురువారం స్వాధీనం చే సుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో అధికారులు శర్ఫుద్దీన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు.42 క్వింటాళ్ల రేషన్బి య్యాన్ని స్వాధీనం చేసుకొని,కేసు నమోదు చేశారు. లింగంపేట(ఎల్లారెడ్డి):మండలంలోని సజ్జన్పల్లి చౌ రస్తా వద్ద గురువారం ధాన్యం బస్తాల లోడ్తో వెళ్తున్న లారీ బోల్తా పడినట్లు రైతులు తెలిపారు. శెట్పల్లిసంగారెడ్డి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధా న్యం బస్తాలు లోడ్ చేసుకొని కామారెడ్డికి వెళ్తుండగా మార్గమధ్యంలో సజ్జన్పల్లి చౌరస్తా వద్ద లారీ బో ల్తాపడింది. ఘటనలో డ్రైవర్తోపాటు ఎవరికి గా యాలు కాలేదని తెలిపారు. ధాన్యం బస్తాలను మ రో లారీలో లోడ్ చేసి పంపినట్లు రైతులు తెలిపారు. ● ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు దోమకొండ: ఆస్తి వివాదాల నేపథ్యంలో అత్తను ఇద్దరు కోడళ్లు హత్య చేసేందుకు యత్నించిన ఘటన దోమకొండ మండల కేంద్రంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కట్ట లక్ష్మిపై ఆమె కోడళ్లు కట్ట లహరిక, కట్ట పవిత్ర బుధవారం రాత్రి దాడి చేశారు. చీర పల్లుతో మెడబిగించి హత్యకు యత్నించగా, లక్ష్మి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కాపాడారు. బాధితురాలు గురువారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు ఎస్సై తెలిపారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, వారు నేరాన్ని ఒప్పుకున్నారని పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై వివరించారు. -
దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్ రూరల్: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని వివిధ రంగాల్లో ప్రతిభచాటిన, సేవలందించిన వారిని సత్కరించనున్నట్లు హైదరాబాద్కు చెందిన ‘ఆల్ దిబెస్ట్ ఆర్ట్స్ అకాడమీ’ అధ్యక్షుడు ఈఎస్ఎస్ నారాయణ మాస్టారు ఒక ప్రకటనలో తెలిపారు. కవులు, రచయిత లు, సంగీత, నృత్య, కళాకారుల, ఉపాధ్యాయు ల, విద్యావంతులు, వైద్యుల, సమాజ సేవకులు తదితర రంగాల్లోని ప్రతిభావంతులు ఫొటోలు, పత్రికల క్లిప్పింగ్స్ జిరాక్స్ కాపీలతో ఈనెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. వివరాలకు 9652347207 నెంబర్లో సంప్రదించాలని కోరారు. నియామకపత్రాల అందజేతనిజామాబాద్ రూరల్: రాష్ట్ర గీత పారిశ్రామిక సహకార సంఘం చైర్మన్గా బాడ్సి శేఖర్గౌడ్, గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ సభ్యుడిగా వేణుగోపాల్ యాదవ్ నియామకపత్రాలు అందుకున్నారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఇద్దరికీ గురువారం నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా శేఖర్గౌడ్, వేణుగోపాల్ యాదవ్ కృతజ్ఞతలు తెలుపుతూ మహేశ్కుమార్ గౌడ్ను సన్మానించారు. -
క్రైం కార్నర్
కరెంట్ షాక్తో ఒకరి మృతి వర్ని: మండలంలోని చలకతండాలో గురువారం విద్యుత్ షాక్తో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. కేతావత్ కిశోర్ (29) సౌండ్ బాక్స్ మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడన్నారు. మృతుడి అన్న గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. డివైడర్ను ఢీకొన్న బైక్ ● ముగ్గురికి గాయాలుమద్నూర్(జుక్కల్): బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ముగ్గురికి గాయాలైన ఘటన మండల కేంద్రానికి సమీపంలోని 161 జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. స్థానికుల, అంబులెన్స్ టెక్నిషియన్ సంజయ్ కథనం ప్రకారం.. డోంగ్లీకి చెందిన తుకారాం, అతడి అక్క పూజ, ఇద్దరు పిల్లలు ఆరాధ్య, సువాన్షు గురువారం మధ్యాహ్నం మద్నూర్ నుంచి మేనూర్ వైపు బైక్పై వెళ్తుండగా డివైడర్ను ఢీకొన్నారు. ప్రమాదంలో తుకారాం, పూజలకు స్వల్పగాయాలు కాగా ఆరాధ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి, ఆరాధ్యను దేగ్లూర్ ఆస్పత్రికి తరలించారు. ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా పలువురు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. గురువారం ఆరుగురిని ఆర్మూర్ కోర్టులో పోలీసులు హాజరుపర్చగా, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. -
ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రభుత్వం కృషి
నిజామాబాద్ అర్బన్: యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. టాస్క్ సౌజన్యంతో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని శ్రీరామ గార్డెన్స్లో జాబ్మేళా నిర్వహించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి జాబ్మేళాను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతోందన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, నైపుణ్యాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని అన్నారు. అందులో భాగంగా స్కిల్ యూనివర్సిటీని సైతం ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. నిజామాబాద్లో మెగా జాబ్మేళా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉద్యోగాలు సాధించిన యువత భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కాగా, జాబ్మేళాకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 71 కంపెనీల ద్వారా సుమారు 2000 మందికి ఉద్యోగాలు వచ్చినట్లు నిర్వాహకులు ప్రకటించారు. అంతకు ముందు ఉద్యోగాలకు ఎంపికై న వారికి కలెక్టర్, ఎమ్మెల్యే నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్బిన్ హందాన్, అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీవైఎస్వో పవన్ కుమార్, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సురేశ్ కుమార్, ఎన్ఐసీ అధికారి మధు, ఈ–డీఎం కార్తిక్, వంశీధర్ రెడ్డి, టాస్క్ అధికారులు, ఆయా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. యువతికి జాబ్ ఆఫర్ లెటర్ అందజేస్తున్న కలెక్టర్ ఇలా త్రిపాఠి జాబ్మేళాను ప్రారంభిస్తున్న రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి,తాహెర్ తదితరులు అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి పిలుపు మెగా జాబ్మేళాకు విశేష స్పందన -
మోడల్ కళాశాలల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం
బాన్సువాడ రూరల్: కొత్తాబాదిలో ఉన్న తెలంగాణ మోడల్ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కమల్ కిశోర్ తెలిపారు. పదో తరగతి పాసైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీతో పాటు కొత్తగా ఏసీఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): మండల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవ చేయాలని నూ తనంగా ఎన్నికై న లింగంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొళ్ల సాయిరాంయాదవ్కు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు సూచించారు. బుధవారం మండల పార్టీ అధ్యక్షునిగా సాయిరాంను నియమిస్తూ నియామాక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరంతరం ప్రజలతో మమేకమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. తనను నియమించినందుకు ఎమ్మెల్యేకు సాయిరాం యాద వ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. బాన్సువాడ రూరల్: ఈ నెల 9న సాయంత్రం నుంచి 10న రాత్రి 9 గంటల వరకు పిట్లం మండల కేంద్రంలోని మజీద్–ఏ–వహీద్లో నిర్వహించే ఇస్లామిక్ వర్క్షాప్ను విజయవంతం చేయాలని జామా మజీద్ ఇమామ్ మౌలానా మహమూద్ అలీ, ఆయేషా మస్జీద్ మౌలానా సయ్యద ఈసా తెలిపారు. ఖత్మే నబూవత్ ఆధ్వర్యంలో నిర్వహించే వర్క్షాప్నకు హైదరాబాద్, నిజామాబాద్ నుంచి ప్రముఖ ఉలేమాలు హాజరై ప్రసంగిస్తారన్నారు. యువకు లు హాజరై వివిధ అంశాలపై అవగాహన పొందాలన్నారు. గాంధారి(ఎల్లారెడ్డి): ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సింగిల్ విండో చైర్మన్ సాయికుమార్ అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం ఏవో రాజలింగంతో కలిసి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. విండో డైరెక్టర్లు, మాజీ సర్పంచ్ సంజీవు, రైతులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: విద్యార్థులకు ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలు.. ఎమ్మెల్సీ ప్రోసర్ కోదండరామ్కు విజ్ఞప్తి చేశారు. గురువారం కామారెడ్డి రోటరీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జన సమితి కార్యక్రమానికి కోదండరామ్ హాజరుకాగా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఆయనను కలిసి వినతి పత్రం అందజేసి సన్మానించారు. బీసీ సంఘం నాయకులు సాప శివరాములు, నాగరాజు తదితరులున్నారు. -
ఆధ్యాత్మికం..
ప్రారంభమైన కోడూరు హన్మాన్ ప్రాణప్రతిష్ఠాపనోత్సవాలు కామారెడ్డి అర్బన్: కామారెడ్డి దళితవాడ కిష్టమ్మగుడి సమీపంలోని ప్రాచీన కోడూరు హన్మాన్ ఆలయంలో గురువారం భక్తి శ్రద్ధలతో ప్రాణప్రతిష్ఠాపనోత్సవాలు ప్రారంభమయ్యాయి. వేదపండితులు గంగవరం నారాయణశర్మ, అంజనేయశర్మల ఆధ్వర్యంలో గురువారం విగ్రహాల జలవాసం, హోమం, అన్నదానం నిర్వహించారు. ఐదురోజులు హోమ కార్యక్రమాలుంటాయని అంజనేయశర్మ పే ర్కొన్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు నర్సింలు, రమేష్, నరేష్రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు అంబీర్ మనోహర్రావు తదితరులు పాల్గొన్నారు. వైభవంగా బోనాల ఊరేగింపు రామారెడ్డి: గంగపుత్రుల కులదైవం గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా గంగపుత్ర మహిళలు గురువారం పోచమ్మలకు బోనాల ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. అనంతరం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. శుక్రవారం గంగమ్మ తల్లి విగ్రహ ప్రాణప్రతిష్ఠాపనతో పాటు అన్నదానం, సాయంత్రం గంగమ్మ తల్లికి బోనాల ఊరేగింపు ఉంటుందని గంగపుత్ర సంఘం అధ్యక్షుడు నామాల లింబాద్రి తెలిపారు. యాడారంలో పెద్దమ్మకు బోనాలు.. బీబీపేట: యాడారంలో ముదిరాజ్ సదర్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న వనదుర్గ పెద్దమ్మ ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున్న బోనాలు ఊరేగించారు. బైండ్లోళ్ల ఆట పాటలతో, డప్పు చప్పుళ్లతో ఘనంగా బోనాలను తీశారు. మల్కాపూర్లో ఆంజనేయ స్వామి ఉత్సవాలు బీబీపేట: మల్కాపూర్లో ఆంజనేయ స్వామి ఉత్సవాలు రెండు రోజులుగా ఘనంగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం గ్రామంలోని ప్రతి వీధి గుండా ఆలయం ముందు ప్రతిష్ఠించే ధ్వజ స్తంభాన్ని డప్పు చప్పుళ్ల మధ్య తీసుకువచ్చారు. ప్రతి ఇంటి నుంచి కలశాలతో మహిళలు ర్యాలీగా ఆలయం వద్దకు వచ్చి ప్రత్యేక పూజలు చేశారు. వైభవంగా అమ్మవారి ప్రతిష్ఠాపన మహోత్సవం బాన్సువాడ రూరల్: హన్మాజీపేట్ జీపీ పరధిలోని సంగ్రాం తండాలో నూతనంగా నిర్మించిన మందిరంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఆలయంలో జంగదాంబ దేవి, శ్రీసంత్ సేవాలాల్, రామ్రావ్ మహరాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన చేపడుతున్నారు. గురువారం వేదపండితులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం పౌరాదేవి పీఠాధిపతి శ్రీ బాబుసింగ్ మహరాజ్, రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పోరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, ఆల్ ఇండియా బంజారా శక్తీపీఠం పౌరాదేవి జాతీయ ప్రధానకార్యదర్శి బద్యానాయక్ల సంయుక్త ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
తలసేమియా బాధితులకు అండగా కామారెడ్డి రక్తదాతలు
● నేడు ప్రపంచ తలసేమియా దినోత్సవం ● 35 శిబిరాల ద్వారా 6 వేల యూనిట్ల రక్తం సేకరణ కామారెడ్డి అర్బన్: తలసేమియా వ్యాధి... చిన్నారుల్లో అరుదుగా వచ్చే ఈ వ్యాధికి ప్రతి 20 రోజులకు ఒక సారి రక్తం అందించడమే వైద్యం. రక్తం అందించకుంటే వారు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. జిల్లాలో తలసేమియా వ్యాధితో బాధపడే 250 మంది చిన్నారులకు అండగా కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్), ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీలు అండగా నిలిచి గత మూడేళ్లలో మెగా రక్తదాన శిబిరాల ద్వారా ఇప్పటికి 6 వేల యూనిట్ల రక్తం సేకరించడం సాధారణ విషయం కాదు. రక్తదాతల సహకారంలో తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారుల కోసం తాము 6 వేల యూనిట్ల రక్తం సేకరించడం ఎంతో తృప్తిని ఇస్తుందని కామారెడ్డి రక్తదాతల సమూహం వ్యవస్థాపకులు, రెడ్క్రాస్ సొసైటీ జిల్లా సమన్వయకర్త, ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ బాలు అన్నారు. తమ సేవలు గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లో నమోదు చేసి అవార్డు ప్రదానం చేశారని, దేశ వ్యాప్తంగా ఎన్నో సంస్థలు సేవా పురస్కారాలు అందించినట్టు బాలు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం దేశంలో 500 మంది చిన్నారులు తలసేమియా వ్యాధి బారిన పడుతున్నారు. తల్లిదండ్రుల హిమోగ్లోబిన్ స్థాయి, హిమోగ్లోబిన్ ఎలెక్ట్రోఫోరేసిస్, జన్యు పరీక్షలను పెళ్లికి ముందే చేయడం ద్వారా తలసేమియా వ్యాధి పిల్లలు జన్మించకుండా చూసే అవకాశం ఉంటుంది. తలసేమియా వ్యాధితో జన్మించిన పిల్లలకు 20 రోజులకు ఒక సారి రక్తమార్పిడి తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. బోన్మారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా పూర్తి చికిత్సకు రూ.30 లక్షల నుంచి రూ.50లక్షల వరకు వ్యయం అవుతుంది. పేదరికంలో ఉండే తల్లిదండ్రులకు ఇది పెద్ద భారం అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించి చిన్నారుల ప్రాణాలు కాపాడాలి. – బాలు, ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ -
ఆలూర్లో లారీ బీభత్సం
● విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను ఢీకొన్న లారీ ఆర్మూర్టౌన్: ఆలూర్ మండల కేంద్ర సమీపంలో లారీ విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను ఢీకొని బీభత్సం సృష్టించింది. నల్లమట్టిని తీసుకువచ్చేందుకు ఆలూర్ నుంచి వెల్మల్ మీదుగా నందిపేట్ వైపు వెళ్తున్న లారీ అతివేగంతో నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. అడ్డం వచ్చిన చెట్లు, ఆరు విద్యుత్ స్తంభాలు, రెండు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఢీకొట్టింది. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. లారీ డ్రైవర్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. ఘటన సమయంలో పొలాల్లో రైతులెవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. కాగా, ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు పూర్తిగా ధ్వంసం కావడంతో సమీపంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఏడీఈ కృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించి మరమ్మతులు చేస్తామని తెలిపారు. -
స్వీయ గణనపై అవగాహన
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిదిలోని పిష్కిల్ గుట్ట గ్రామ పంచాయితీని గురువారం సందర్శించి తండావాసులకు స్వీయ గణనపై అవగాహన కల్పించినట్లు తహసీల్దార్ రేణుక చౌహాన్, ఎంపీడీవో రాజేశ్వర్ తెలిపారు. అవగాహన కల్పించిన అనంతరం తండాలో వందశాతం స్వీయ గణన నమోదు చేసినట్లు తెలిపారు. సర్పంచ్ రేణాబాయి, పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు. స్వీయ గణన చేసుకున్న ప్రజాప్రతినిధులు ఎల్లారెడ్డిరూరల్/కామారెడ్డిటౌన్: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకగా చేపడుతున్న జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా కామారెడ్డి 46, 47 వార్డుల కౌన్సిలర్ దంపతులు గెరిగంటి స్వప్న, లక్ష్మీనారాయణలు, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్లు గురువారం స్వీయ గణన పూర్తి చేసుకున్నారు. ప్రతి ఒక్కరు సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకోవాలని వారు కోరారు. -
30 ఫీట్ల స్థలం వదిలి ఇళ్లు నిర్మించుకోవాలి
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి–రాజంపేట–గుండారం ప్రధాన రహదారికి ఇరువైపులా నిర్మాణాలు చేసే వారు తప్పనిసరిగా రోడ్డు మధ్య నుంచి 30 ఫీట్ల స్థలం వదిలిపెట్టాలని చిన్నమల్లారెడ్డి గ్రామ సర్పంచ్ బి.లక్ష్మి సూచించారు. గురువారం ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక సమావేశం నిర్వహించగా ఏఈ, దేవునిపల్లి ఎస్సైలు హాజరయ్యారు. సమావేశంలో ఆర్ అండ్ బీ రోడ్డు నిబంధనలను గ్రామస్తులకు వివరించారు. 500పైగా మార్కులు సాధించిన పదవ తరగతి విద్యార్థులను సన్మానించారు. సమావేశంలో మాజీ సర్పంచులు ఆనందరావు, రామాగౌడ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. మాచారెడ్డి: మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుళ్లు శ్రీకాంత్, రాజేశ్వరి, ప్రకాష్, సౌజన్యలు బదిలీపై ఇతర పోలీస్ స్టేషన్లకు వెళ్లారు. ఈ సందర్భంగా గురువారం ఎస్సై అనిల్, సిబ్బంది వారిని శాలువా కప్పి సన్మానించారు. -
పెళ్లి సంబంధాలు కుదరడం లేదని..
● ఉరేసుకొని యువతి ఆత్మహత్య మాక్లూర్: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపంతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలూర్ మండలం కల్లెడి గ్రామంలో చోటు చేసుకుంది. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్, గ్రామస్తుల కథనం ప్రకారం.. కల్లెడికి చెందిన కునాల హన్మాండ్లుకు ఇద్దరు కుమార్తె, ఒక కుమారుడు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, రెండో కుమార్తె శివాని(31) టీటీసీ పూర్తి చేసింది. గతంలో శివానీకి పెళ్లి సంబంధం కుదిరి ఏర్పాట్లు జరుగుతుండగానే వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. అప్పటి నుంచి శివానికి పెళ్లి సంబంధాలు రావటం లేదు. వచ్చినా విషయం తెలిసి పెళ్లి చేసుకునేందుకు ఎవ్వరూ ముందుకు రాకపోవడంతో శివాని తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి భోజన అనంతరం గదిలోకి వెళ్లిన శివాని గురువారం ఉదయం 10 గంటలు దాటినా బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన తండ్రి తలుపుతట్టాడు. ఉలుకుపలుకు లేకపోవటంతో గోడ దూకి చూడగా శివాని ఉరేసుకొని మృతి చెందింది. తండ్రి హన్మాండ్లు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. -
రాష్ట్రస్థాయి సబ్జూనియర్ అథ్లెటిక్స్కు ఎంపిక
కామారెడ్డి అర్బన్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో 12వ జిల్లా స్థాయి సబ్జూనియర్ అండర్–8, 10, 12, 14 బాలబాలికల అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించారు. దాదాపు 110 మంది క్రీడాకారులు హాజరు కాగా ఉత్తమ ప్రతిభ చూపిన 25 మంది క్రీడాకారులను ఎంపిక చేయడంతోపాటు వారికి బంగారు, వెండి, కాంస్య పతకాలు, ప్రశంసాపత్రాలను అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్రెడ్డి, కేపీ అనిల్కుమార్, జిల్లా యువజన క్రీడల అధికారి రంగా వెంకటేశ్వరగౌడ్ అందజేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 17న హైదరాబాద్ కొల్లూర్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి సబ్జూనియర్ అథ్లెటిక్స్లో జిల్లా తరఫున పాల్గొననున్నారు. అసోసియేషన్ ప్రతినిధులు, పీఈటీలు శ్రీనివాస్, మధుసూదన్రెడ్డి, నరేశ్రెడ్డి, రేణుక, శివాగౌడ్, లక్ష్మణ్, ప్రసాద్, మహేశ్, నరేశ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘నిధులు మంజూరు చేయండి’
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గత వర్షాకాలంలో దెబ్బతిన్న రోడ్లు, ధ్వంసమైన హై లెవల్ వంతెల మరమ్మతుల కోసం అవసరమైన నిధు లు మంజూరు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు పంచాయతీరాజ్శాఖ మంత్రి సీతక్కను కోరారు. నియోజవకర్గంలోని పలుగ్రామాల్లో దెబ్బతిన్న రోడ్లు, వంతెనల మరమ్మతులకు రూ.19.60 కోట్ల నిధులు అవసరమవుతాయని వివరిస్తూ మంత్రికి గురువారం వినతిపత్రం అందజేశారు. అలాగే లింగంపల్లిఖుర్దు, అడ్విలింగాల, కన్నాపూర్, గిద్ద హైలెవల్ బ్రిడ్జిలకు మరమ్మతులు చేపట్టాలని, గాంధారి, రామారెడ్డి, లింగంపేట, రాజంపేట, తాడ్వాయి మండలాల్లోని పలుగ్రామాలకు రోడ్లు ఏర్పాటు చేసేందుకు నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. నియోజకవర్గంలోని గ్రామీణప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతోనే ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కామారెడ్డి క్రైం: అటవీశాఖ జిల్లా అధికారి (డీఎఫ్ఓ)గా గురువారం బాధ్యతలు చేపట్టిన నీరజ్ కుమార్ టిబ్రీవల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇది వరకు డీఎఫ్వోగా పనిచేసిన నిఖిత బదిలీపై వెళ్లగా, ఆసిఫాబాద్ నుంచి నీరజ్కుమార్ బదిలీపై జిల్లాకు వచ్చారు. కలెక్టర్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలసి అనంతరం జిల్లాలో అటవీ సంరక్షణ, వనమహోత్సవ కార్యక్రమాల నిర్వహణ, వన్యప్రాణుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కామారెడ్డి క్రైం: పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వేసవిలో పశువుల సంరక్షణ, యాజమాన్యంపై అవగాహన కల్పించేందుకు ప్రభు త్వం రూపొందించిన పోస్టర్లు, కరపత్రాలను కలెక్టరేట్లో గురువారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆవిష్కరించారు. వేసవిలో పశువులకు తగిన ఆహారం, తాగునీరు, నీడ, ఆరోగ్య సంరక్షణ చర్యలపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా ఈ నెల 8న జిల్లాలో పశువుల ఆరోగ్య శిబిరాలు, మేలుజాతి పశువుల అభివృద్ధి, కృత్రిమ గర్భాధారణ, పశు ఆరోగ్య పరిరక్షణపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
18న ఫ్లడ్ మాక్ ఎక్సర్సైజ్
● పాల్గొననున్న అత్యవసర సేవల విభాగాలు ● ప్రజలు ఆందోళన చెందొద్దు ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: వర్షాకాల సన్నద్ధతలో భాగంగా జిల్లా కేంద్రంలో ఈనెల 18వ తేదీన జిల్లా స్థాయి ఫ్లడ్ మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. వరదలు, విపత్తుల నిర్వహణ చర్యలపై అగ్నిమాపక శాఖ డీజీ విక్రయ్సింగ్ మాన్ గురువారం జిల్లా అధికారులతో రాష్ట్ర స్థాయి సమన్వయ స మావేశాన్ని వీడియోకాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించి ప లు సూచనలు ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్లో ఏ ర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ సంగ్వాన్ మాట్లా డుతూ.. 18న నిర్వహించే ఫ్లడ్ మాక్ ఎక్సర్సైజ్లో రె వెన్యూ, పోలీస్, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, పంచా యతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరాశాఖలతోపాటు ఇతర అత్యవసర సేవల విభాగాలు పాల్గొంటాయని తెలిపారు. మాక్ ఎక్సర్సైజ్ ద్వారా శాఖల మధ్య సమన్వయం, అత్యవసర పరిస్థితుల్లో స్పందన విధానాలు, సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు ప్రక్రియ, రక్షణ చర్యలు, సహాయక కార్యక్రమాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, వరదల సమయంలో చేపట్టాల్సిన అన్ని రకాల సన్నద్ధతను పరీక్షించనున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఆందోళన చెందొద్దని సూచించారు. ఇది కేవలం ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించే సన్నద్ధత కార్యక్రమం మాత్రమేనని స్పష్టం చేశారు. సమావేశంలో ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సమన్వయంతో పనిచేయాలి.. కామారెడ్డి క్రైం: జనాభా గణన–2027 లో భాగంగా అన్ని కార్యకలాపాల్లో అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. గృహగణన కార్యకలాపాలపై గురు వారం సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ భారతి హోలీకేరి వర్చువల్గా గురువారం సాయంత్రం సమీక్షాసమావేశాన్ని నిర్వహించారు. గృహ జాబితా రూపకల్పన కార్యకలాపాలు, ఇప్పటివరకు సాధించిన పురోగతి, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ సంగ్వాన్ మాట్లాడుతూ.. జనాభా గణన–2027 కార్యక్రమాన్ని నిర్దేశిత గడువుల్లో పూర్తి చేయడానికి సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో డేటా సేకరణను ఖచ్చితత్వంతో నిర్వహించాలన్నారు. మొబైల్ వ్యాన్ల ద్వారా అన్ని మండలాల్లో ప్రజలకు జనగణన కార్యక్రమంపై అవగాహన కల్పించాలన్నారు. అదనపు కలెక్టర్ విక్టర్, అధికారులు పాల్గొన్నారు. -
విద్యుత్ సరఫరాలో లోపాలపై ఫిర్యాదు చేయాలి
బాన్సువాడ : విద్యుత్ సరఫరాల ఎలాంటి లోపాలున్నా వినియోగదారులు ఫిర్యాదు చేయొచ్చని విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక (సీజీఆర్ఎఫ్–2) చైర్మన్ ఎరుకల నారాయణ అన్నారు. బాన్సువాడలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఆవరణలో గురువారం విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కర వేదికను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ వినియోగదారులకు ఏ సమస్య ఉన్నా నిర్భయంగా ఫోరమ్కు ఫిర్యాదు చేయాలన్నారు. అసరమైతే ఫోరమ్ సభ్యులే వినియోగదారుల ఇంటికి వచ్చి సమస్యలను పరిష్కరిస్తారన్నారు. విద్యుత్ కోతలు, లో ఓల్టేజీ, ట్రాన్స్ఫార్మర్ లోపాలు, మీటర్ స్టిక్ కావడం వంటి సాంకేతిక సమస్యలను 48 గంటల్లో పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఫిర్యాదు చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ 1912, ఫోన్ నంబర్ 83380–22841ను సంప్రదించాలని అన్నారు. సీజీఆర్ఎఫ్–2 సభ్యులు రామకృష్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కో ఆప్షన్ సభ్యులకు సన్మానం
కామారెడ్డి టౌన్ : కాంగ్రెస్ తరఫున మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికై న సభ్యులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ఘనంగా సన్మానించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కా ర్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు గోనె సునీత, అలీ బిన్ అబ్దుల్లా, ఆస్మా అదిబా ఖనాంను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కౌన్సిల్ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ పట్టణ అభివృద్ధికి కో ఆప్షన్ సభ్యులు కృషి చేయాలని సూచించారు. వార్డుల వారీగా ఉన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి, కాంగ్రెస్ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు సంఖ్యలో పాల్గొన్నారు. -
కారు చేయి దోస్తీ
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు మరోసారి రసవత్తరంగా మారాయి. కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చేతులు కలిపాయి. చైర్పర్సన్ ఎన్నిక సమయంలో జత కట్టిన రెండు పార్టీలు.. ఇప్పుడూ అదే దోస్తీని కొనసాగించి బీజేపీకి షాక్ ఇచ్చాయి. మున్సిపల్ కార్యాలయ కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ ఎన్వీ గిరి, కమిషనర్ టి పర్వతాలు సమక్షంలో ఎన్నిక ప్రక్రియను గురువారం నిర్వహించారు. మొత్తం 49 మంది కౌన్సిలర్లు ఉండగా.. కాంగ్రెస్కు 22, బీజేపీకి 16, బీఆర్ఎస్కు 11 మంది సభ్యుల బలం ఉంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో కో ఆప్షన్ పదవులను చేజిక్కించుకోవడానికి సంఖ్యాబలం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్లు మరోసారి మిత్రపక్షాలుగా మారాయి. ఎన్నిక ప్రక్రియకు 40వ వార్డు కౌన్సిలర్ సాహెబ్ నాగమణి (కాంగ్రెస్) గైర్హాజరు కాగా.. బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులందరూ హాజరయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్కు చెందిన 32 మంది సభ్యులు చేతులెత్తి మద్దతు తెలపడంతో నలుగురు సభ్యులు ఎన్నికయ్యారు. ముందస్తు ఒప్పందం ప్రకారం మూడు పదవులు కాంగ్రెస్కు, ఒక పదవి బీఆర్ఎస్కు దక్కాయి. బీజేపీకి మళ్లీ నిరాశ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునే విషయంలో గతంలోనే భంగపడ్డ బీజేపీకి, ఈ ఎన్నికల్లోనూ నిరాశే ఎదురైంది. కో ఆప్షన్ ఎన్నికలో తమ పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులను బరిలో దించింది. కౌన్సిల్లో రెండో అతిపెద్ద పార్టీగా ఉన్నప్పటికీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలయికతో బీజేపీ అభ్యర్థులకు అవకాశం లేకుండా పోయింది. ముందే చెప్పిన ‘సాక్షి’ కో ఆప్షన్ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ జతకడతాయని, కాంగ్రెస్కు మూడు, బీఆర్ఎస్కు ఒక పదవి ఇచ్చుకునేలా ఒప్పందం కుదిరిందని ‘సాక్షి’ ముందే అభ్యర్థుల పేర్లతో సహా ప్రచురించింది. తీవ్ర పోటీ ఉన్నప్పటికీ ‘సాక్షి’ ముందే ఊహించి చెప్పినట్లుగానే అభ్యర్థుల ఎన్నిక జరగడం గమనార్హం. వైస్ చైర్పర్సన్ కాసర్ల గోదావరి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.ప్రమాణస్వీకారం చేస్తున్న కుంబాల రవియాదవ్, గోనె సునీత, అలీ బిన్ అబ్దుల్లా, ఆస్మా అదిబా ఖానంకో ఆప్షన్ పదవుల కోసం మొత్తం 33 మంది పోటీలో ఉండగా, ఎన్నికల సమయంలో 9 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో కాంగ్రెస్ నుంచి జనరల్ విభాగంలో గోనె సునీత, మైనారిటీ విభాగంలో అస్మా అదిబా ఖనాం, అలీ బిన్ అబ్దుల్లా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ నుంచి జనరల్ విభాగంలో కుంబాల రవి పదవిని దక్కించుకున్నారు. ఎన్నికై న సభ్యులకు అదనపు కలెక్టర్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అనంతరం అధికారులు, సభ్యుల సమక్షంలో వారు ప్రమాణ స్వీకారం చేశారు. గెలుపొందిన వారిని చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కౌన్సిల్ సభ్యులు సన్మానించారు. కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పర మద్దతు మూడు పదవులు కాంగ్రెస్కు.. ఒకటి బీఆర్ఎస్కు కమలం పార్టీకి మరోసారి భంగపాటు -
మరోసారి ఆగం చేసిన వాన
లింగంపేట/గాంధారి(ఎల్లారెడ్డి)/మద్నూర్(జుక్కల్): అన్నదాతను మరోసారి అకాల వర్షం ఆగం చేసింది. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని గురువారం సాయంత్రం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదరుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ధాన్యం, మొక్కజొన్నను కాపాడుకునేందుకు ఉరుకులు పరుగులు తీశారు. లింగంపేట మండలం ముంబోజిపేట, ముంబోజిపేట తండా, కంచుమల్, భవానీపేట, జల్దిపల్లి, శెట్పల్లిసంగారెడ్డి, పర్మళ్ల తదితర గ్రామాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. పలు చోట్ల వరద నీటిలో కొట్టుకుపోయింది. ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు వర్షంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆయా గ్రామాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలు వేల సంఖ్యలో కొనుగోలు కేంద్రాల్లోనే మూలుగుతున్నాయని రైతులు వాపోతున్నారు. తడిసిన దాన్యం వెంటనే కొనుగోలు చేసి ఆదుకోవాలంటున్నారు. మద్నూర్ మండల కేంద్రంలో ఆరబోసిన మొక్కజొన్న తడిసిపోయింది. అలాగే మార్కెట్కమిటీ యార్డులో రైతుల నుంచి సేకరించిన మొక్కజొన్న సంచులు తడిసిపోయాయి. గాంధారి మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో ధాన్యం కుప్పలు, మొక్కజొన్న, జొన్న తడిసిపోయాయి. డీఆర్డీవో సురేందర్ మేడిపల్లి గ్రామాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రం వద్ద రైతులతో మాట్లాడారు. ఆయన వెంట ఏపీఎం ప్రసన్నకుమార్ తదితరులున్నారు. జిల్లాలోని పలు చోట్ల కురిసిన అకాల వర్షం తడిసిన మొక్కజొన్న, కొట్టుకుపోయిన ధాన్యం కాపాడుకునేందుకు తిప్పలుపడ్డ రైతులు -
సమస్యలపై ప్రజలను చైతన్యం చేయాలి
కామారెడ్డి అర్బన్ : బీసీ రిజర్వేషన్లు, నిరుద్యోగ, రైతాంగ, సాగునీరు, కార్మిక సమస్యలపై ప్రజల్లో చైతన్యవంతులను చేయాలని తెలంగాణ జన సమతి పార్టీ (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. గురువారం సాయంత్రం కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ రోటరీ ఆడిటోరియంలో జిల్లా నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. ఈనెల 12వ తేదీన హైదరాబాద్లోని జలవిహార్లో నిర్వహించే రాష్ట్ర ప్లీనరీని విజయవంతం చేయాలన్నారు. కామారెడ్డి జిల్లాలో సాగునీటి కోసం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి త్వరలోనే పర్యటిస్తానని అన్నారు. సమావేశం అనంతరం జిల్లా కార్యవర్గాన్ని కోదండరామ్ ప్రకటించారు. టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నిజ్జన రమేశ్ముదిరాజ్, జిల్లా అధ్యక్షుడిగా కుంబాల లక్ష్మణ్యాదవ్, ప్రధాన కార్యదర్శిగా రజనీకాంత్, ఉపాధ్యక్షులుగా పూల్సింగ్, లాల్సింగ్, కార్యదర్శులు సంగరాజు, వర్షిత్, సంజీవ్, విజయ్కుమార్, మహిళా అధ్యక్షురాలిగా నాగరాణి పేర్లను ప్రకటించారు. -
మరోసారి మొండిచేయి
● కాసుల తరువాత మరొకరికి దక్కని నామినేటెడ్ పదవి ● నిరాశ, నిస్పృహల్లో కాంగ్రెస్ నేతలుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : నామినేటెడ్ పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న జిల్లాకు కాంగ్రెస్ నేతలకు మళ్లీ నిరాశే ఎదురైంది. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల ముచ్చట వచ్చినప్పుడల్లా తప్పకుండా తమను పదవులు వరిస్తాయన్న నమ్మకంతో జిల్లాకు చెందిన పలువురు నేతలు ఉన్నారు. అయితే జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో చివరికి నారాజ్ అవుతుండడం మామూలు విషయంగా మారింది. ఈ క్రమంలో బుధవారం విడుదలైన నామినేటెడ్ జాబితాలో ఒక్కరి పేరు కూడా లేకపోవడంతో జిల్లాకు చెందిన నాయకులు నిరాశకు గురయ్యారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు నేతలకు మొదటి విడతలోనే కీలకమైన పదవులు దక్కాయి. తాజాగా మరో ఇద్దరికీ అవకాశం దక్కింది. కామారెడ్డి జిల్లాలో ఒక్క కాసుల బాల్రాజును మాత్రమే నామినేటెడ్ వరించింది. ఆయనతోపాటు ఎంతో మంది నామినెటెడ్ పదవులపై ఆశలుపెట్టుకుని పనిచేస్తూ వచ్చారు. ఆయనను మినహాయించి మరెవరికీ అవకాశాలు దక్కలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తనకు మొదటి విడతలోనే నామినేటెడ్ పదవి దక్కుతుందని జిల్లా కేంద్రానికి చెందిన డీసీసీ మాజీ అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ కై లాస్ శ్రీనివాస్ ఆశించారు. ఏరోజైనా తనకు మంచి జరుగుతుందన్న నమ్మకంతో ఉన్న ఆయనకు ఈ సారి కూడా అవకాశం దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురైనట్టు సమాచారం. కాంగ్రెస్ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు టి దేవరాజ్గౌడ్ సైతం నామినేటెడ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్రెడ్డి సోదరుడు కొండల్రెడ్డి వెంట ఉండి పార్టీ ప్రచారంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీతోపాటు జిల్లాకు చెందిన ముఖ్యనేతలందరితోనూ సన్నిహిత సంబంధాలున్న దేవరాజ్గౌడ్ తనకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి దక్కుతుందని ఎదురుచూడగా నిరాశే ఎదురైంది. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మొన్నటి వరకు పనిచేసిన పండ్ల రాజు ఫిషర్మెన్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవిని ఆశించినప్పటికీ అవకాశం దక్కలేదు. ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజక వర్గాలకు చెందిన మరికొందరు నాయకులు కూడా ఏదో ఒక నామినేటెడ్ పదవి దక్కుతుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే జిల్లాకు చెందిన ఏ ఒక్కరినీ పదవులు వరించడం లేదు.నామినేటెడ్ పదవుల పందేరంలో జిల్లాకు మొదటి నుంచీ అన్యాయమే జరుగుతోందని కాంగ్రెస్ నేతలు, శ్రేణులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తరువాత అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. బాన్సువాడకు చెందిన సీనియర్ నాయకుడు కాసుల బాల్రాజుకు మాత్రమే నామినేటెడ్ దక్కింది. నాలుగు నియోజక వర్గాల నుంచి ఎంతో మంది ఆశలు పెట్టుకుని అన్ని ప్రయత్నాలు చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కనూరుకు చెందిన బద్దం ఇంద్రకరణ్రెడ్డి నామినేటెడ్ పదవి కోసం ప్రయత్నించగా, ఆఖరుకు పీసీసీ పదవితో సరిపెట్టుకున్నారు. అదే మండలానికి చెందిన చంద్రకాంత్రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి దక్కించుకున్నారు. ఆయన పదవీకాలం త్వరలో ముగియనుంది. కామారెడ్డి నియోజకవర్గంలో మండల, జిల్లా స్థాయి నేతలు పలువురు ఏదైనా అవకాశం దక్కుతుందేమోనని ఇప్పటికీ ఆశతో ఉన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీకి సన్నిహితుడైన గీరెడ్డి మహేందర్రెడ్డి నామినేటెడ్ పదవిపై పెట్టుకున్న ఆశలు ఇప్పటికీ నెరవేరలేదు. ఇలా ఎంతో మంది నేతలు అవకాశాలు దక్కకపోవడంతో నిరాశచెందుతున్నారు. -
తెయూతో స్కిల్ డిజైన్ టెక్నాలజీస్ ఎంవోయూ
తెయూ(డిచ్పల్లి): స్కిల్ డిజైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (హైదరాబాద్) సంస్ధ, తెలంగాణ యూ నివర్సిటీతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నది. ఈ మేరకు బుధవారం వర్సిటీ వైస్ చాన్స్లర్ టి యాదగిరిరావు సమక్షంలో స్కిల్ డిజైన్ టెక్నాలజీస్ డైరెక్టర్ శ్రీకాంత్ ముప్పల్ల, వర్సిటీ రిజిస్ట్రార్ ఎం యాదగిరి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. ఈ సంస్థ స్కిల్ డెవలప్మెంట్, ఇంటర్న్షిప్, మూక్స్లలో ఆసక్తికర విద్యార్థులకు శిక్షణ ఇస్తుందని రిజిస్ట్రార్ తెలిపారు. తమ కార్యకలాపాలు యూనివర్సిటీ విద్యార్థులతోపాటు అనుబంధ కళాశాలల విద్యార్థులకు కూడా అందుబాటులో ఉంటాయని సంస్థ డైరెక్టర్ శ్రీకాంత్ ముప్పల్ల తెలిపారు. -
ధాన్యం తరలించాలంటూ రైతుల రాస్తారోకో
భిక్కనూరు: ధాన్యం తూకం వేసి వారం రోజులు గడుస్తున్నా రైస్మిల్లులకు తరలించేందుకు లారీలు రావడం లేదని రైతు లు ఆరోపించారు. బుధవారం కాచాపూర్ రైతులు కామారెడ్డి –పెద్దమల్లారెడ్డి రోడ్డుపై ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తూకం వేసిన 6 వేల బస్తాల ధాన్యం గ్రామంలోని కొనుగోలు కేంద్రంలోనే మూలుగుతోందన్నా రు. వెంటనే లారీలను పంపించి ధాన్యం తరలించాలని డి మాండ్ చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా పౌరసరఫరాల మేనేజర్ శ్రీకాంత్, భిక్కనూరు తహసీల్దార్ సునీత, గ్రామపరిపాలన అధికారి రాజులు వచ్చి రైతులతో మాట్లాడారు. వెంటనే ధాన్యం బస్తాలను తరలింపజేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి నిరసనను విరమించారు. -
చోరీ కేసులో నిందితుల అరెస్ట్
ఇందల్వాయి : మండలంలోని గంగారాం తండా గ్రామానికి చెందిన నసీం సుల్తానా ఇంట్లో గత నెల 22వ తేదీన చోరీకి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ ప్రకాశ్ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాన్ని కేసు దర్యాప్తు కోసం రంగంలోకి దించామన్నారు. బుధవారం గన్నారం శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన బొమ్మెర్ల సోమేశ్, శైలేశ్ను అదుపులోకి తీసుకుని విచారించగా.. చోరీకి పాల్పడింది తామేనని ఒప్పుకున్నారన్నారు. నిజామాబాద్ నగరంలోని మూడో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూలీ పనులు చేసుకునే ఇద్దరు దొంగిలించిన బంగారు నగలను కన్నాపురం నరేందర్ అనే వ్యక్తికి విక్రయించినట్లు తెలిపారన్నారు. వారి నుంచి బంగారు, వెండి నగలతోపాటు రూ.8,500 నగదు, రెండు సెల్ఫోన్లు, ఒక టీవీ, మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ వినోద్, ఎస్సై సందీప్, సిబ్బందిని ఏసీపీ అభినందించారు. -
సమ్మర్ అంటే సంబరమే..
వేసవిలో ఓ వైపు ఎండల తీవ్రత ఉక్కిరిబిక్కరి చేస్తున్నా.. మరోవైపు ఎన్నో సరదాలు, సంతోషాలను కూడా వెంట తీసుకొస్తుంది. ఇప్పటి ఉరుకుల పరుగుల జీవితంలో వేసవిని పూర్తి స్థాయిలో ఆస్వాదించలేకపోతున్నారు. అదే రెండు, మూడు తరాల వెనక్కు వెళ్తే.. వేసవి మళ్లీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని వయోవృద్ధులను పలకరిస్తే తమ చిన్నతనంలో వేసవి ఎంత ఉత్సాహంగా గడిపారో గుర్తు చేసుకున్నారు. – సాక్షి నెట్వర్క్ -
పారదర్శకంగా బదిలీ ప్రక్రియ
● 146 మందికి బదిలీ: ఎస్పీ రాజేశ్ చంద్రకామారెడ్డి టౌన్ : జిల్లాలో 146 మంది పోలీస్ సిబ్బంది బదిలీ అయ్యారని, ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న సివిల్ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్సైల బదిలీ ప్రక్రియను బుధవారం పూర్తి చేశారు. ఎనిమిది మంది ఏఎస్సైలు, 18 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 111 మంది కానిస్టేబుళ్లు, 9 మంది ఎంటీ సెక్షన్ సిబ్బంది బదిలీ అయ్యారు. ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన కానిస్టేబుళ్లు, నాలుగేళ్లు పూర్తి చేసిన హెడ్ కానిస్టేబుళ్లు, మూడేళ్ల సర్వీస్ ఉన్న ఏఎస్సైలతో ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి విల్లింగ్ స్టేషన్ల ఆధారంగా బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ మధుసూదన్, ఆర్ఐలు సంతోష్ కుమార్, నవీన్ కుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవం
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం తుంకిపల్లిలో రేణుకా ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం రాత్రి బోనాల ఊరేగింపు నిర్వహించారు. గౌడ సంఘం ఆధ్వర్యంలో వార్షికోత్సవాలు జరిపారు. శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవారి ఆలయం వరకు మహిళలు, యువకులు ర్యాలీగా తరలి వెళ్లారు. సర్పంచ్ కుమ్మరి రాములు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్రెడ్డి, గౌడ సంఘం నాయకులు ఉన్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): తుక్కోజీవాడిలో శ్రీ కృష్ణ మందిరం వార్షికోత్సవాలు బుధవారం ముగిశాయి. కార్యక్రమంలో భాగంగా ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన, అన్నపూర్ణ కల్యాణోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు భారీ ఎత్తున అన్నదానం చేశారు. సర్పంచ్ సంగారావు, ఆలయ కమిటీ ప్రతినిధులు రమేశ్ రావు, నవీన్రావు, తదితరులు పాల్గొన్నారు. -
పండుగలా ఉండేది
కామారెడ్డిఅర్బన్: మా చిన్నతనంలో వేసవి సెలవులంటే ఓ పండుగగా ఉండేది. నేను పుట్టి పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్. అక్కడే పదవ తరగతి వరకు చదివాను. ఖానాపూర్కు అర కిలోమీటరు దూరంలో గోదావరి నది ఉండేది. అప్పటికింకా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మించలేదు. వేసవి సెలవుల్లో ఉదయం లేచింది మొదలు దోస్తులతో కలిసి గోదావరిలో ఈతకు వెళ్లేవాళ్లం. అక్కడే మామిడి తోటల్లోకి వెళ్లి మామిడి పళ్లు తినేవారం. ఈత కల్లు తాగేవాళ్లం. మధ్యాహ్నం వరకు ఇంటికి చేరే లోపు చేసే అల్లరి పనులకు ఇంట్లో లొల్లి జరిగేది. నాలుగైదు సార్లు మా నాన్నతో దెబ్బలు సైతం తిన్నాను. నా స్నేహితులు మారన్న, మురళీధర్రావు సైతం అల్లరిగా ఉండేవారు. ఇద్దరు పోలీసు శాఖలో ఎస్పీ స్థాయిలో రిటైర్డ్ అయ్యారు. 1973లో నేను ఎలక్ట్రికల్ డిప్లొమా చేసి ఇంజనీర్ను అయ్యాను. కామారెడ్డిలో ప్రాంతంలో ఉద్యోగం చేస్తూ ఇక్కడే స్థిర నివాసిని అయ్యాను. పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చినందకు సాక్షికి ధన్యవాదాలు. – మారవేని రాజన్న, విశ్రాంత విద్యుత్ ఇంజనీర్, కామారెడ్డి -
ఏసీబీకి చిక్కిన బోధన్ టౌన్ ఎస్సై
బోధన్టౌన్(బోధన్): బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సై భాస్కరా చారి పాత కేసు విచారణలో రూ. 7 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో మార్చిలో ఓ సివిల్ వివాదంలో కేసునమోదు అయ్యింది. ఈ కేసులో ముగ్గురికి నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేశారు. అయితే ఇదే కేసులో మరికొంత మంది ఉన్నారని, వారిని కూడా కేసులో ఇన్వాల్వ్ చేస్తామని ఎస్సై అందులోని ఓ వ్యక్తికి ఫోన్ చేసి చెప్పారు. ఈ సందర్భంగా రూ. 10 వేల లంచం డిమాండ్ చేశారు. ఈ కేసులో పట్టణానికి చెందిన ఓ రాజకీయ నాయకుడి అన్న కొడుకు ఉన్నారు. లంచం ఇవ్వడానికి నిరాకరించి అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. పథకం ప్రకారం బుధవారం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దారుడు ఎస్సైకి రూ. 7 వేలు ఇస్తుండగా ఏసీబీ అఽధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసుకు సబంధించిన ఫిర్యాదు దారుడి వివరాలను గొప్యంగా ఉంచుతున్నామని ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. ప్రజలు తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ను ఆశ్రయిస్తే లంచం డిమాండ్ చేసిన అధికారులపై అవినీతి నిరోధక శాఖకు చెందిన 1064 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రుద్రూర్: పొతంగల్ మండలం కారేగాం గ్రామ పరిధిలో కొనసాగుతున్న ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం క్వారీలో లారీలను అడ్డుకుని నిరసన తెలిపారు. విచ్చలవిడిగా ఇసుక తవ్వకాల కారణంగా భూగర్భ జలాలు అండుగంటి ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచ్ నరహరి సునీల్ మాట్లాడుతూ.. ఇసుక తవ్వకాల వల్ల మంజీర పరీవాహక ప్రాంతాల్లో ఉన్న లిఫ్ట్, డీ ఫ్లోరైడ్ పథకాలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. తాగునీటి సరాఫరా వ్యవస్థ దెబ్బతినే అవకాశముందని, సాగునీటి కోసం బోర్లు, లిప్ట్లపై ఆధార పడుతున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. భారీ స్థాయిలో ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని, వెంటనే ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మాజీ ప్రజాప్రతినిధులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. వర్ని: మండలంలోని మల్లారం శివారులో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలైనట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన అంజి.. పాత వర్నికి చెందిన గంగాధర్ ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాలు బుధవారం ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయన్నారు. గాయాలపాలైన ఇద్దరిని చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. -
కల్వర్టును ఢీకొట్టిన కారు.. పెళ్లింట విషాదం
● ఎనిమిది మందికి గాయాలు ● ఆందోళనకరంగా ఒకరి పరిస్థితి కామారెడ్డి అర్బన్: రోడ్డు ప్రమాదంలో పెళ్లి బృందంలోని ఎనిమిది మంది గాయాలపాలయ్యారు. ఈ ఘటనతో పెళ్లింట విషాదం నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి.. రాజంపేట మండలం ఆర్గొండకు చెందిన చౌదరి సిద్ధిరాములు కొడుకు భరత్ పెళ్లి కామారెడ్డి పట్టణంలోని దేవునిపల్లి లక్ష్మిదేవి గార్డెన్లో బుధవారం ఉదయం జరిగింది. అయితే కారులో బంధువులను తీసుకువస్తుండగా చిన్నమల్లారెడ్డి వద్ద కారు అదుపు తప్పి కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకు తండ్రి సిద్ధిరాములు, తల్లి వినోద, మేనేత్త సుజాతతోపాటు మరో ఐదుగురు బంధువులు తీవ్రగాయాలపాలయ్యారు. వీరిలో పెళ్లి కొడుకు మేనేత్త సుజాత పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. -
ఇందిరమ్మ ఇళ్ల ప్రవేశం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): లింగంపల్లికలాన్, వెంకంపల్లి గ్రామాల్లో బుధవారం ప్రజాప్రతినిధులు, అధికారులు ఇందిరమ్మ ఇళ్ల ప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు. లింగంపల్లికలాన్లో నాయికోటి రుక్కవ్వ, వెంకంపల్లిలో పోల రమేష్కు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఈ మేరకు వారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసుకున్నారు. దీంతో బుధవారం నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రవీణ్కుమార్, ఎంపీవో ప్రభాకరచారి ఆయా గ్రామాల సర్పంచ్ అనిత, జ్యోతితో కలిసి ఇందిరమ్మ ఇళ్ల గృహాప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. పేదలకు వరం లాంటిది ఇందిరమ్మ ఇళ్లు బీబీపేట: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు వరం లాంటివని మాందాపూర్ సర్పంచ్ ఆకుల హరీష్ యాదవ్ అన్నారు. బుదవారం గ్రామంలో ఇందిరమ్మ గృహ ప్రవేశానికి హాజరయ్యారు. నూతన వస్త్రాలను అందజేశారు. కార్యదర్శి గంగుబాయి, వార్డు సభ్యులు సతీష్, కనకయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. దోమకొండలో.. దోమకొండ: మండల కేంద్రంలోని పెద్దిరెడ్డి నాగమణి–భాస్కర్రెడ్డిలు బుధవారం గృహప్రవేశం చేశారు. ఈ సందర్బంగా మాజీ జడ్పీటీసీ తిర్మల్గౌడ్ లబ్ధిదారులకు నూతన వస్త్రాలను బహూకరించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశపోయిన శ్రీనివాస్, నేతలు అనంత్రెడ్డి, సీతారాం, మధు, సిద్దారెడ్డి, నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిరూరల్: ఇందిరమ్మ ఇంటి నిర్మాణంతో సొంతింటి కల నెరవేరుతున్నదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. బుధవారం తిమ్మారెడ్డి, కొక్కొండ గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం చేశారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వెంకట్రాంరెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాస్రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లు పరిశీలన లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో బుధవారం ఇందిరమ్మ ఇల్లును ఎంపీడీవో నరేశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మాట్లాడారు. ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకున్న వారికి బిల్లులు సకాలంలో జమచేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యదర్శి శ్రవణ్కుమార్ ఉన్నారు. -
అప్పుల్లేని వ్యవసాయం చేయాలి
● పంటల మార్పిడితో మేలు ● రైతువారోత్సవంలో వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి బాన్సువాడ రూరల్: ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ పద్ధతులను పాటిస్తూ రైతులు అప్పులేని వ్యవసాయం దిశగా సాగాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. బుధవారం దేశాయిపేట్ సహకార సంఘం ఆవరణలో ఏర్పాటు చేసిన రైతు వారోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు. రైతులు సాగు ఖర్చులు తగ్గించుకుని ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ లాభసాటి వ్యవసాయం చేయాలని సూచించారు. పంటమార్పిడి చేయడం వల్ల అధిక దిగుబడులు సాధించడానికి వీలవుతుందన్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటూ వారికి క్షేత్రస్థాయిలో సాంకేతిక సలహాలు, సూచనలు అందించాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే గంగాధర్, బాన్సువాడ ఏఎంసీ చైర్పర్సన్ అంజవ్వ, సొసైటీ చైర్మన్ ఎర్వాల క్రిష్ణారెడ్డి, ఏడీఏ అరుణ, సర్పంచ్లు వీరేశం, రమేష్నాయక్, మల్లుగొండ, నాయకులు నారాయణరెడ్డి, ఉద్దర రాజ్కుమార్, ప్రశాంత్, విజయ్గౌడ్, శ్రావణ్, మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సరదాగా గడిచిపోయేది..
కామారెడ్డి అర్బన్: చిన్ననాటి జ్ఞాపకాలు తలుచుకుంటే ఆ రోజులు ఎంత బాగుండేది అనిపిస్తుంది. నేను అమ్మమ్మ ఊరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా లింగన్నపేటలో చదువుకున్నా. వేసవి సెలవుల్లో దోస్తులతో కలిసి ప్రతిరోజూ లింగన్నపేట పెద్ద చెరువులో సాన్నాలు చేసేవారం. అలాగే దొరవారి కోనేరులో పై నుంచి దూకి ఈత కొట్టేవారం. ఆకలైతే దగ్గర చెట్ల నుంచి తెంపుకుని మామిడి పండ్లు, జామ పండ్లు తినేవారం. అలాగే దగ్గరిలోని కొత్తపల్లికి వెళ్లేవారం. లింగన్నపేటలో తాళ్లతో కట్టి ఉండే రథాన్ని లాగేవారం. ఎంతో అల్లరిగా సంతోషంగా చిన్నతనం గడిచింది. అలాంటి రోజులు ఈరోజు పిల్లలకు లేవు అనిపిస్తుంది. – యెల్లంకి సుదర్శన్, వ్యాపారి, కామారెడ్డి -
అమ్మమ్మ ఇంటికి వెళ్లి పుంజీతం ఆడేవాళ్లం
భిక్కనూరు: నా చిన్నతనంలో ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో మా అమ్మమ్మ ఇంటికి వెళ్లి అక్కడ పుంజీతం ఆట(పులి మేక) ప్రతిరోజు ఆడేవాడిని. అలాగే క్యారంబోర్డు, అష్టాచెమ్మా ఆడేవాడిని. ఎండ తగ్గాక సాయంత్రం పూట పంట చేనుల వద్దకు వెళ్లి మామిడి కాయలు తెంపుకుని అక్కడే తినేవాళ్లం. ఎప్పుడు ఎండా కాలం వస్తుందా అని రోజులు లెక్కించుకునేవాడిని. అలాగే ప్రతిరోజు తాటి ముంజలు మొర్రిపండ్లను కూడా తినేవాళ్లం. అప్పట్లో పది పైసలకు 20 బిస్కట్లు వచ్చేటివి. – తాటిపాముల నాగభూషణంగౌడ్, రిటైర్డ్ ఎంఈవో, భిక్కనూరు -
ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్గా ఎన్వై గిరి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు)గా కామారెడ్డి ఆర్డీవో ఎన్వై గిరి నియమితులయ్యారు. అదనపు కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించిన మధుమోహన్ బదిలీ అయిన విషయం తెలిసిందే. ఎన్వై గిరి బుధవారం ఇన్చార్జి అదనపు కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కలెక్టర్ కార్యాలయ అధికారులు, సిబ్బంది స్వాగతం పలికారు. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని 38 వార్డుతో పాటు 36, 40 వార్డుల బ్యాలెట్ బాక్స్లు, వోటర్ లిస్టులు, వోట్ కౌంటర్ ఫైల్స్ ఇతర సామగ్రిని మున్సిపల్ అధికారులు కోర్టుకు చేర్చారు. మున్సిపల్ ఎన్నికలలో అవకతవకలు జరిగాయంటూ 38వ వార్డులో ఓటమి పాలైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గ్రామీణ ఓటర్లు, ఇతర వార్డుల ఓటర్లు 38వ వార్డులో ఓటేయడంతో తాను ఓడిపోవాల్సి వచ్చిందని ఆ అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో కోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది బ్యాలెట్ బాక్స్లు, వోటర్ లిస్టులు, వోట్ కౌంటర్ ఫైల్స్ ఇతర సామగ్రిని కోర్టుకు అందించారు.కామారెడ్డి టౌన్ : వేసవి కాలంలో పట్టణ ప్రజలకు నీటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపడుతోందని మున్సిపల్ కమిషనర్ పర్వతాలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పట్టణంలోని ఏ వార్డులోనైనా నీటి ఎద్దడి ఏర్పడితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. పట్టణంలో నీటి సమస్య ఉన్నట్లయితే కింది అధికారులను సంప్రదించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ : 98499 07825 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ : 98499 07822 మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ : 95151 84201 కామరెడ్డి క్రైం: రాఘవపూర్ శివారులో బొమ్మా బొరుసు నిర్వహిస్తున్న ఓ స్థావరంపై దేవునిపల్లి, సీసీఎస్ పోలీసులు బుధవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. బొమ్మాబొరుసు ఆడుతున్న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి రూ. 73 వేల నగదు, రెండు బైకులు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు. నేడు, రేపు దోస్త్ ప్రత్యేక కేటగిరి సర్టిఫికెట్ వెరిఫికేషన్ తెయూ(డిచ్పల్లి): దోస్త్ – యూజీ కోర్సులలో స్పెషల్ కేటగిరి కింద అడ్మిషన్ పొందిన విద్యార్థులు పీహెచ్సీ/ సీఏపీ ఈ నెల 7న, ఎన్సీసీ/స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులమ్ యాక్టివిటీస్ విద్యార్థులు ఈ నెల 8న సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయించుకోవాలని తెయూ అడ్మిషన్స్ డైరక్టర్ వాసం చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. తెయూ పరిపాలనా భవనంలోని అకడమిక్ ఆడిట్ సెల్ కార్యాలయంలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సర్టిఫికెషన్ వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. -
ఉత్సవాలకు ‘కోడూరు’ ముస్తాబు
● నేటినుంచి విగ్రహ పునఃప్రతిష్ఠాపనోత్సవాలుకామారెడ్డి టౌన్ : కోడూరు హనుమాన్ ఆలయం ఉత్సవాలకు ముస్తాబయ్యింది. గురువారంనుంచి 12వ తేదీ వరకు విగ్రహ పునఃప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. పూర్వ కాలంలో కామారెడ్డి పట్టణం పేరు ‘కోడూరు’గా ఉండేది. అప్పట్లో ఈ గ్రామం కిష్టమ్మ గుడి ప్రాంతంలో ఉండేదని చరిత్ర చెబుతోంది. ఇక్కడ పురాతన హనుమాన్ ఆలయం ఉంది. ఏటా హనుమాన్ జయంతి, శ్రీరామనవమి పండుగల సందర్భంగా పట్టణంలో నిర్వహించే శోభాయాత్రలు ఇక్కడినుంచే ప్రారంభమవుతాయి. వేద పండితులు గంగవరం ఆంజనేయశర్మ సూచనల మేరకు భక్తులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ ఆలయంలో గురువారం నుంచి 12వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయి. -
చెరుకుకు మద్దతు
చెరుకు రైతుకు కాస్త తీపి వార్త అందింది. మద్దతు ధర టన్నుకు వంద రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రైతులు మాత్రం వరి పంటకు ఇచ్చినట్లుగా బోనస్ ఇవ్వాలని కోరుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి● టన్నుకు రూ. వంద పెరుగుదల ● రూ.3,885 కు చేరిన ధర ● వరి లాగే బోనస్ ఇవ్వాలంటున్న రైతులుజిల్లాలో ఒకప్పుడు 30 వేల ఎకరాల్లో చెరుకు పంట సాగయ్యేది. సాగు ఖర్చులు, చెరుకు నరకడానికి కూలీలకు చెల్లించాల్సిన కూలీ రేట్లు పెరగడంతో పెట్టుబడులుపోనూ మిగిలేది అంతంత మాత్రంగానే ఉంటుండడంతో చాలామంది రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లారు. ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేస్తుండడంతో ఎక్కువగా వరి సాగు చేస్తున్నారు. దీంతో చెరుకు సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. ఆంక్షలతో సాగుకు దూరం జిల్లాలోని కామారెడ్డి, మాచారెడ్డి, భిక్కనూరు, పాల్వంచ, రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి, రాజంపేట, లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి తదితర మండలాల్లో దశాబ్దాలుగా చెరుకు సాగుపై రైతులకు అవగాహన ఉంది. అప్పట్లో అన్ని ప్రాంతాల్లో ఖండసారి చక్కెర కర్మాగారాలుండేవి. అలాగే పుట్ల కొద్ది బెల్లం వండేవారు. అయితే సారా తయారీలో నల్లబెల్లం వినియోగిస్తున్నారన్న సాకుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెల్లం వండడంపై ఆంక్షలు విధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పరిస్థితి పెనం మీదినుంచి పొయ్యిలో పడినట్లుగా మారింది. బెల్లం వండితే కేసులు నమోదు చేస్తామని బెదిరించడంతో చాలా మంది చెరుకుసాగుకు దూరమయ్యారు. సాగు కష్టాలు పెరగడం, కూలీల సమస్య, ధర సరిపోకపోవడంతో మరికొంతమంది చెరుకు సాగు నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం ఆరేడు వేల ఎకరాలలో కూడా పంట సాగవడం లేదు.చెరుకు పంటకు మద్దతు ధర మాత్రమే పెంచడంతో కొంతే ఊరట లభించిందని రైతులు పేర్కొంటున్నారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ధర పెరగడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల పంట అయిన వరికి క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తున్న ప్రభుత్వం.. ఏడాది పంట అయిన చెరుకుకు సైతం ప్రోత్సాహకం అందించాలని రైతులు కోరుతున్నారు.గతేడాది చెరుకు టన్ను ధర రూ. 3,774.90 ఉండేది. కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో టన్నుకు రూ.వంద పెరుగుతుంది. 10.25 శాతం ప్రాథమిక రికవరీ రేటుకు ఈ ధర వర్తిసుంది. రికవరీ రేటు ఎక్కువగా ఉంటే మద్దతు ధర మరింత పెరుగుతుంది. జిల్లాలో గాయత్రి షుగర్స్లో రికవరీ శాతం 10.95 ఉండడంతో టన్నుకు రూ. 110 వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ లెక్కన చెరుకు టన్ను ధర రూ. 3,885 కు చేరుకోవచ్చని భావిస్తున్నారు. -
ఉపాధి పనుల పరిశీలన
దోమకొండ: మండల కేంద్రంలోని గండ్ల చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సర్పంచ్ ఐరేని నర్సయ్య బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కూలీలతో మాట్లాడుతూ.. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉదయం 6 గంటల లోపు పనులకు చేరుకుని తిరిగి 10 గంటల వరకు పనులు ముగించుకోవాలని సూచించారు. ఉపాధి కూలీలందరికి ఎండ వేడిమి నుంచి కాపాడుకునేందుకు టోపీలను అందజేస్తానన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ వర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు కొనసాగుతున్నాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం ఉదయం నిర్వహించిన నాల్గో సెమిస్టర్ రెగ్యులర్, ఐదో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షకు 1,607 మంది విద్యార్థులకుగాను 1,522 మంది హాజరు కాగా 85 మంది గైర్హాజరైనట్లు వివరించారు. అలాగే మధ్యాహ్నం నిర్వహించిన రెండో సెమిస్టర్ రెగ్యులర్, మూడో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షకు 298 మంది విద్యార్థులకుగాను 283 మంది హాజరు కాగా 15 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. -
చదువులమ్మ ఒడి.. ఈ సర్కారు బడి!
● బీబీపేట టీఎస్ఎన్ఆర్ హైస్కూల్లో కార్పొరేట్ స్థాయిలో వసతులు ● ప్రైవేట్కు దీటుగా బోధన ● ఏటేటా పెరుగుతున్న ఉత్తీర్ణతబీబీపేట: మౌలిక వసతులు కల్పించి, ప్రోత్సహిస్తే అద్భుతాలు చేయగలమని సర్కారు పాఠశాలల విద్యార్థులు నిరూపిస్తున్నారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు బీబీపేట విద్యార్థులు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 2021 కి ముందు సరైన వసతులు లేవు. భవనం శిథిలావస్థకు చేరడంతో బిక్కుబిక్కుమంటూ చదువుకోవాల్సిన పరిస్థితులుండేవి. ఈ పాఠశాలను జనగామ గ్రామానికి చెందినప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి తన తల్లిదండ్రులు తిమ్మయ్యగారి సుశీల, నారాయణరెడ్డి జ్ఞాపకార్థం రూ. 6 కోట్లతో అభివృద్ధి చేశారు. నూతన భవనం నిర్మించడంతోపాటు అన్ని వసతులు కల్పించారు. అన్ని హంగులతో పాఠశాల అందుబాటులోకి రావడం, సరిపడా ఉపాధ్యాయులు ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ప్రైవేట్కు కాకుండా సర్కారు బడికే పంపించాలని నిర్ణయించుకున్నారు. పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు సైతం తమ వంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారు. కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి పాఠశాల నిర్వహణకు ఉపయోగిస్తున్నారు. నాణ్యమైన విద్య.. బీబీపేటలోని టీఎస్ఎన్ఆర్ హైస్కూల్లో డిజిటల్ విద్య, కంప్యూటర్ ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేక కోర్సులుగా హోటల్ మేనేజ్మెంట్, అగ్రకల్చర్ కోర్సులున్నాయి. కార్పొరేట్ స్థాయి వసతులు అందుబాటులో ఉండడంతోపాటు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందిస్తున్నారు. దీంతో విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఏటా పలువురు విద్యార్థులు ట్రిపుల్ ఐటీ సీట్లు పొందుతున్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులు 11 మంది ఎన్ఎంఎంఎస్కు ఎంపికయ్యారు. క్రీడల్లోనూ విద్యార్థులు రాణిస్తున్నారు. పదో తరగతిలో ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతుండడంతోపాటు ఫలితాలూ మెరుగవుతున్నాయి. సరైన సౌకర్యాలు కల్పిస్తే అన్ని పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు వస్తాయన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య ఉత్తీర్ణులు ఉత్తీర్ణత శాతం 2023–24 131 118 90 2024–25 143 142 99 2025–26 152 152 100 -
ఆయిల్పాంతో అధిక ఆదాయం
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్తాడ్వాయి: ఆయిల్పాం సాగుతో రైతులు అధిక ఆదాయం పొందవచ్చని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. ఆయన బుధవారం ఎండ్రియాల్ గ్రామశివారులో రైతు బొక్క హన్మండ్లు సాగు చేస్తున్న ఆయిల్పాం తోటను సందర్శించారు. 2022 లో మూడున్నర ఎకరాలలో పంటను సాగు చేస్తున్నానని రైతు తెలిపాడు. అంతర పంటలుగా కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నానని, ఎకరానికి రూ. 1.20 లక్షల వరకు ఆదాయం వస్తోందని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్పాం సాగుకు రైతులు ముందుకు రావాలన్నారు. ఆయిల్పాం పంట ధర టన్నుకు రూ. 23 వేలు ఉందని, ఎకరానికి 10 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. సబ్సిడీపై వచ్చిన ఆయిల్పామ్కు సంబంధించిన డ్రిప్ పరికరాలను ఏడుగురు రైతులకు అందించారు. ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారు పడమటి కౌసల్య ఇంటిని సందర్శించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఎవరైనా ప్లాస్టిక్ కవర్లను పోగు చేసినట్లయితే కిలోకు టిఫిన్ బాక్స్ ఇస్తామని గ్రామ పంచాయతీ పాలక వర్గం ప్రకటించింది. దీంతో గ్రామానికి చెందిన ఓ మహిళ రెండు కిలోల ప్లాిస్టిక్ కవర్లను తీసుకురావడంతో ఆమెకు కలెక్టర్ చేతులమీదుగా రెండు టిఫిన్ బాక్సులను అందించారు. అనంతరం కలెక్టర్ వాటర్ట్యాంక్ను పరిశీలించారు. గ్రామపంచాయతీలో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో సర్పంచ్ నర్సింలు, ఉద్యానశాఖ జిల్లా అధికారి జ్యోతి, మండల ప్రత్యేకాధికారి రఘునందన్, డీఎల్పీవో శ్రీనివాస్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీవో సవితారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా పరిధిలోని నారాయణఖేడ్లో హైదరాబాద్ – నాందేడ్ – అకోలా నేషనల్ హైవే 161పై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కామారెడ్డి జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. జుక్కల్కు చెందిన పొడిచెర నిఖిల్ (23) బైక్పై సంగారెడ్డి నుంచి స్వస్థలానికి వెళ్తుండగా.. నిజాంపేట్ సమీపంలో వంతెన సైడ్వాల్ బైక్ ఢీకొన్నది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన నిఖిల్ను ఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తండ్రి హన్మంతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్రెడ్డి తెలిపారు. -
ఆదాయవనరుల పెంపుపై దృష్టి సారించాలి
నిజామాబాద్ అర్బన్: అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ ఆదాయ వనరులను పెంపొందించుకునే దిశగా స్థానిక సంస్థలు చిత్తశుద్ధితో కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్హాల్లో మంగళవారం ఉత్తర తెలంగాణ స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులతో రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శి కాత్యాయని, సభ్యుడు సుధీర్రెడ్డితో కలిసి చైర్మన్ రాజయ్య సమీక్ష నిర్వహించారు. కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన అదనపు కలెక్టర్లు తమ జిల్లాల్లో స్థానిక సంస్థల పనితీరును వివరించారు. ప్రజాప్రతినిధులు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, స్థానిక సంస్థల బలోపేతంపై దృష్టి సారించాలని రాజయ్య సూచించారు. నిజామాబాద్ మేయర్ ఉమారాణి, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పీహెచ్సీని తనిఖీ చేసిన డీఎంహెచ్వో
తాడ్వాయి: ఎర్రాపహాడ్లోని ప్రాథమిక ఆ రోగ్య కేంద్రాన్ని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి(డీఎంహెచ్వో) రవీందర్గౌడ్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అనంతరం ఫార్మసీ, ల్యాబ్ గదులను తనిఖీ చేశారు. రోజూ సక్రమంగా విధులకు హాజరు కావాలని, ప్రజలకు అందుబాటులో ఉండి వైద్య సేవలను అందించాలని వైద్యులకు సూచించారు. ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. ఆయన వెంట మండల వైద్యాధికారి ఖాసీం, హెచ్ఈవో నారాయణ, పీహెచ్ఎన్లు నక్షత్రం, స్వాతి, శ్రీనివాస్, సుమలత తదితరులు ఉన్నారు. రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్కు ఎంపిక కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించారు. సీనియర్స్, అండర్–16, 18, 20 మహిళలు, పురుషుల విభాగాలలో పోటీలు నిర్వహించగా.. 76 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ చూపిన 21 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్రెడ్డి, అనిల్కుమార్ తెలిపారు. ఎంపికై నవారు ఈనెల 10న హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో నిర్వహించే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు శ్రీనివాస్, ప్రభులింగం, రేణుక, శివాగౌడ్, నరేష్, మహేష్, నవీన్, సంతోష్, ప్రసాద్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ‘పంటల మార్పిడి చేయాలి’ భిక్కనూరు: రైతులు మారుతున్న కాలానికి అనుగుణంగా తమ పంటల మార్పిడి చేసుకోవాలని జిల్లా ఉద్యాన అధికారి జ్యోతి సూచించారు. మంగళవారం భిక్కనూరులోని ఎస్వీ గార్డెన్లో నిర్వహించిన ఉద్యాన పంటలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యాన పంటలు, ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు పామాయిల్ పంటతో పాటు పండ్ల తోటల పెంపకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఉద్యాన అధికారి సూచించారు. ఉద్యాన పంటలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. కార్యక్రమంలో భిక్కనూరు సర్పంచ్ బల్యాల రేఖ, ఏడీఏ అపర్ణ, పశువైద్యాధికారి దేవేందర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డి, నేతలు భీంరెడ్డి, శ్రీరాం వెంకటేశ్, నరేందర్రెడ్డి, అధికారులు, హెచ్యూఎల్ ప్రతినిధులు పాల్గొన్నారు. కాంటాలను వేగవంతం చేయాలి భిక్కనూరు: కొనుగోలు కేంద్రాల్లో కాంటాలను వేగవంతంగా నిర్వహించాలని జిల్లా వ్యవసాయాధికారి మోహన్రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన భిక్కనూరులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అవసరమైన మేర టార్పాలిన్లు కొనుగోలు కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయన వెంట ఏడీఏ అపర్ణ, ఏఈవోలు వినోద్, లిఖిత్రెడ్డి పాల్గొన్నారు. -
పలుచబడి..
బుధవారం శ్రీ 6 శ్రీ మే శ్రీ 2026– 9లో uవిద్యారంగ అభివృద్ధికి రూ. కోట్లు ఖర్చు చేస్తున్నా మని ప్రభుత్వాలు గొప్పులు చెప్పుకుంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంటోంది. కనీస సౌకర్యాలు కరువవడం, సరిపడా టీచర్లు లేకపోవడంతో జిల్లాలోని సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య ఏడాదికేడాది తగ్గిపోతూనే ఉంది. సౌకర్యాలు మెరుగుపరచకపోతే చాలా పాఠశాలలు మూతపడే ప్రమాదం ఉంది. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో గతంలో 1,257 స్కూళ్లు ఉండేవి. విద్యార్థులు లేకపోవడంతో పలు పాఠశాలలు మూతపడి గతేడాది 1,017 కు తగ్గిపోయాయి. అందులోనూ 52 స్కూళ్లలో జీరో విద్యార్థులున్నట్లుగా గుర్తించారు. దీంతో గత విద్యాసంవత్సరంలో 965 పాఠశాలలే కొనసాగాయి. మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, తరగతులకు సరిపడా ఉపాధ్యాయులను నియమించకపోవడంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మూడేళ్ల క్రితం 81,864 మంది విద్యార్థులు ఉంటే గత విద్యాసంవత్సరానికి సంఖ్య 76,082 కి తగ్గిపోయింది. మూడేళ్లలో ఆరువేల మంది విద్యార్థులు తగ్గిపోవడం గమనార్హం. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం, కొన్ని బడులు మూతబడడానికి పలు కారణాలున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు ఉచితంగా ఇవ్వడం, మధ్యాహ్న భోజనం సమకూర్చడం వంటి పథకాలు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటుకు ఎందుకు పంపుతున్నారో పాలకులు గుర్తించడం లేదు. కొన్ని బడుల్లోనే సౌకర్యాలు ఉండగా, చాలాచోట్ల సమస్యలున్నాయి. మూత్రశాలలు, మరుగుదొడ్లు సరిగా లేకపోవడం, కనీసం తాగునీటి సౌకర్యం లేకపోవడం గమనార్హం. పిల్లలు ఇంటి నుంచే తాగునీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులు సక్రమంగా రాకపోవడంతో ఏజెన్సీ నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. భోజనం లోనూ నాణ్యత ప్రశ్నార్థకంగానే ఉంది. చాలా చోట్ల శిథిలావస్థకు చేరిన గదుల్లో ఎప్పుడు పెచ్చులూడి పడిపోతాయోనన్న భయం మధ్య చదువులు సాగుతున్నాయి. కొన్నిచోట్ల వివిధ పథకాల కింద చేపట్టిన అదనపు గదుల నిర్మాణాలు నిధుల సమస్యతో అర్ధాంతరంగా నిలిచిపోయి చెట్లకింద చదువుకునే దుస్థితి ఉంది. వీటికి తోడు సబ్జెక్టు టీచర్లు లేక చాలాచోట్ల విద్యార్థులకు సరైన విద్య అందడం లేదు. ఏటా నిర్వహించే బడిబాట కార్యక్రమం కూడా మొక్కుబడిగానే సాగుతోంది. సర్కారు బడులకు పిల్లలను రప్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ‘ప్రైవేటు’లో పెరుగుదల.. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుండగా.. ప్రైవే ట్ స్కూళ్లలో మాత్రం ఏటా పె రుగుతోంది. జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు 184 ఉన్నాయి. మూడేళ్ల క్రితం అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో కలిపి 65,271 మంది విద్యార్థులు ఉండగా.. గతేడాది వీరి సంఖ్య 71,165కు పెరిగింది. అంటే మూడేళ్లలో దాదా పు ఆరువేల మంది విద్యార్థులు పెరిగారు. 965 ప్రభుత్వ పాఠశాలల్లో కలిపి 76,082 మంది విద్యార్థులుండగా.. కేవలం 184 ప్రైవేటు పాఠశాలల్లోనే 71,165 మంది విద్యార్థులు ఉండడం గమనార్హం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న త విద్యాభ్యాసం చేసిన ఉపాధ్యాయులు దాదా పు ఐదు వేలపైచిలుకు పనిచేస్తున్నారు. ప్రైవే టు బడుల్లో చాలావరకు గ్రాడ్యుయేషన్ చదివి న వారితోనే నెట్టుకొస్తున్నారు. కొద్దిమంది మా త్రమే ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారున్నారు. అయినా ప్రైవేట్ బడులవైపే విద్యార్థుల తల్లిదండ్రులు మొగ్గుచూపుతుండడం ఆలోచించాల్సిన విషయం. పర్యవేక్షణ కరువు.. స్కూళ్లను పర్యవేక్షించే అధికారులు కరువయ్యా రు. చాలామంది ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేస్తున్నా.. కొందరు మాత్రం సక్రమంగా విధులు నిర్వహించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఎఫ్ఆర్ఎస్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత కూడా కొందరు డుమ్మాలు కొ డుతున్నట్లు తెలుస్తోంది. మండల విద్యాశాఖ అ ధికారులుగా సీనియర్ పీజీ హెచ్ఎంలను నియమించారు. వారు తాము పనిచేసే బడిని, మండ ల విద్యాశాఖను చూసుకోవాల్సి ఉంటుంది. జి ల్లా స్థాయిలోనూ అదే పరిస్థితి ఉంది. దీంతో బడుల్లో బోధన ఎలా సాగుతుందన్న దానిపై ఎ వరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో సర్కారు బడుల్లో నాణ్యమైన విద్య అందడం లేదన్న భావన తల్లిదండ్రుల్లో పెరిగిపోతోంది. దీంతో పిల్లల భవిష్యత్ కోసం చాలామంది తల్లిదండ్రులు అప్పు చేసైనా ప్రైవేట్ బడికి పంపిస్తు న్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గి, ప్రైవేటులో పెరుగుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సర్కారు స్కూళ్లలో ఏటేటా తగ్గుతున్న విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్న తల్లిదండ్రులు సౌకర్యాలు మెరుగుపరచాలంటున్న విద్యాభిమానులు -
స్వీయ గణనలో ఆదర్శం
● సోమ్లానాయక్ తండాలో వంద శాతం పూర్తి ● రాష్ట్రంలో రెండో గ్రామంగా గుర్తింపుబాన్సువాడ రూరల్: బాన్సువాడ మండలంలోని సోమ్లానాయక్ తండా గ్రామం స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్)లో ఆదర్శంగా నిలిచింది. ఇక్కడ వంద శాతం సీయ గణనలో పాల్గొన్నారు. ఇలా రాష్ట్రంలో వందశాతం పూర్తిచేసిన రెండో గ్రామంగా సోమ్లానాయక్ తండా రికార్డు సృష్టించింది. ఈ తండా జిల్లాలో తొలిగ్రామంగా గుర్తింపు పొందింది. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశం మేరకు మండల స్థాయి అధికారులు, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది సమన్వయంతో పనిచేసి గ్రామంలో వి స్తృతంగా అవగాహన కల్పించారు. ఇంటింటికి వె ళ్లి స్వీయ గణన ప్రాముఖ్యతను వివరించి, ఆన్లై న్లో వివరాలు నమోదు చేసుకునేలా చూశారు. సర్పంచ్ మీరిబాయి చందర్, పాలకవర్గ సభ్యు లు కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ప్రతి కు టుంబం స్వీయ గణన పూర్తిచేసేలా ప్రోత్సహించారు. ఉపాధ్యాయులు, వలంటీర్లు ప్రజలకు స హాయం చేయడంతో నమోదు ప్రక్రియను సులభతరమైంది. మంగళవారం నాటికి గ్రామంలోని అన్ని కుటుంబాలు స్వీయ గణన పూర్తిచేయడంతో లక్ష్యం నెరవేరింది. నిరక్షరాస్యులు, వృద్ధులు, డిజిటల్ పరిజ్ఞానం లేనివారికి ప్రత్యేకంగా సహ కారం అందించిన వారిని తహసీల్దార్ నరేందర్ గౌడ్ అభినందించారు. ఇతర గ్రామాలు సోమ్లా నాయక్ తండాను ఆదర్శంగా తీసుకుని స్వీయగణనను వేగవంతంగా పూర్తిచేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ మీరిబాయి చందర్, పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు, జీపీవో విఠల్, ఉపాధ్యాయులు కుషాల్, మంద ప్రవీణ్, వసంత్ తదితరులు పాల్గొన్నారు. -
‘కోఆప్షన్’కు ముహూర్తం ఖరారు
● రేపు ఉదయం 11 గంటలకు కౌన్సిల్ హాల్లో ఎన్నిక ● బరిలో 33 మంది.. అభ్యర్థుల్లో ఉత్కంఠకామారెడ్డి టౌన్ : కామారెడ్డి మున్సిపాలిటీలో కోఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియకు రంగం సిద్ధమైంది. గురువారం ఉదయం 11 గంటలకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించనున్నారు. బల్దియాలోని కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన, అదనపు కలెక్టర్ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ జరగనుంది. ఈ ఎన్నికకు కౌన్సిల్ సభ్యులు, ఎక్స్అఫీషియో సభ్యులు హాజరుకావాలని చైర్పర్సన్ మంగళవారం ఒక ప్రకటన ద్వారా కోరారు. మున్సిపాలిటీలో నాలుగు కోఆప్షన్ పదవులు ఉండగా.. మొత్తం 35 దరఖాస్తులు వచ్చాయి. ఇద్దరు త మ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ప్రస్తు తం 33 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి 25 మంది, బీజేపీ నుంచి ఐదుగురు, బీ ఆర్ఎస్ నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నా రు. 7వ తేదీ ఉదయం 11 గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. జనరల్ విభాగంలో ఇద్దరు (ఒక పురుషుడు, ఒక మహిళ), మైనారిటీ విభాగంలో ఇద్దరు (ఒక పురుషుడు, ఒక మహిళ) సభ్యులను ఎన్నుకోనున్నారు. మున్సిపల్ కౌన్సిల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. గతంలో చైర్పర్సన్ ఎన్నిక సమయంలో కాంగ్రెస్తో జతకట్టిన బీఆర్ఎస్.. ఈసారి కూడా పొత్తు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తమకు రెండు కోఆప్షన్ పదవులు కావాలని బీఆర్ఎస్ పట్టుబడుతుండగా, ఒక పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అటు కాంగ్రెస్లోనూ రెండు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ మద్దతుతో చెరో రెండు పదువులను పంచుకుని కాంగ్రెస్కు చెక్ పెట్టుందుకు బీజేపీ కూడా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.వ్యూహాలకు పదును.. కోఆప్షన్ సభ్యుల ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై బుధవారం ఆయా పార్టీలు సమావేశం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు తమ కౌన్సిలర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. అటు బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు కూడా విడివిడిగా భేటీ కానున్నారు. కుంబాల రవి(బీఆర్ఎస్), గోనె సునీత(కాంగ్రెస్), తయ్యబ్ సుల్తానా(కాంగ్రెస్), జమీరొద్దీన్(కాంగ్రెస్)కు అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. పిడుగు మమత, ముస్కాన్, భాస్కర్గౌడ్లతో పాటు మరికొందరు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్ బదిలీ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఇన్చార్జి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), డీఆర్వో సీహెచ్ మధుమోహన్ బదిలీ అయ్యారు. గతేడాది అక్టోబర్లో కామారెడ్డి డీఆర్వోగా వచ్చిన ఆయనకు నెలరోజులకే అదన పు కలెక్టర్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆ యన నేతృత్వంలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. అధికారులు, ఉద్యోగులను కలుపుకుపోయే అధికారిగా పేరుతెచ్చుకున్నారు. ఆయనను గద్వాల జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ)గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. కీలక పోస్టుల్లో ఇన్చార్జీలే.. మధుమోహన్ బదిలీతో జిల్లాలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), జిల్లా రెవెన్యూ అధికారి పోస్టులు ఖాళీ అయ్యాయి. ఇప్పటికే పలు శాఖలకు జిల్లా అధికారులుగా ఇన్చార్జీలే కొనసాగుతున్నారు. డీఎంహెచ్వో, డీఈవో, జిల్లా ఎకై ్సజ్ అధికారి, జిల్లా మత్స్యశాఖ అధికారి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి, జిల్లా యువజన సంక్షేమ అధికారి తదితర పోస్టుల్లో ఇన్చార్జీ అధికారులే ఉన్నారు. కలెక్టరేట్లో కీలకమైన సూపరింటెండెంట్ పోస్టులు సైతం ఖాళీగా ఉన్నాయి. ఇద్దరు సూపరిండెంట్లు హజ్ యాత్రకు వెళ్లగా మరో ఇద్దరు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఇద్దరు సూపరింటెండెంట్లే పనిచేస్తున్నారు. -
రైతు వేదికలలో సౌర వెలుగులు!
● సోలార్ ప్యానల్స్ ఏర్పాటు దిశగా సర్కారు చర్యలు ● నిర్వహణ భారం తగ్గించేందుకు..ఎల్లారెడ్డిరూరల్ : రైతు వేదికలకు సౌర విద్యుత్ అందించేందుకు సర్కారు చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే సోలార్ ప్యానళ్లు అమర్చే అవకాశాలున్నాయి. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించేందుకు గత ప్రభుత్వం క్లస్టర్కు ఒక రైతు వేదికను నిర్మించింది. పంటల సాగుకు ప్రణాళికలను సిద్ధం చేయడం, రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు రైతులందరు ఒకచోట సమావేశమయ్యేందుకు వీటిని నిర్మించారు. జిల్లాలో 104 రైతు వేదికలు ఉన్నాయి. వీటిలో రైతులతో నేరుగా మాట్లాడేందుకుగాను వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం గలవి 72 ఉన్నాయి. ఆయా ప్రాంతాలలో ప్రతి మంగళవారం పంటల సాగుకు సంబంధించి వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారు. అయితే వీటి నిర్వహణకు ప్రత్యేక నిధులు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. విద్యుత్ బిల్లులతో పాటు వర్కర్ల వేతనాలు కూడా భారంగా మారింది. సౌర పలకల ఏర్పాటుతో.. రైతు వేదికలలో సోలార్ ప్యానల్స్ను ఏర్పాటు చే యాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే అన్ని వేదికలలో ఒకేసారి కాకుండా దశలవారీగా సౌర వి ద్యుత్ అందించే అవకాశాలున్నాయి. విద్యుత్ బిల్లు ల భారం తగ్గించేందుకు వీటిని బిగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జిల్లాలోని 104 రైతు వేదికలలో సోలార్ ప్యాన ల్స్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వానికి ప్ర తిపాదనలు పంపించాం. ప్రభుత్వం నుంచి ని ధులు మంజూరు కాగానే రైతు వేదికలలో ఏ ర్పాటు చేస్తాం. – మోహన్రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి


