breaking news
Kamareddy District News
-
మద్యం అమ్మితే చెప్పుదెబ్బలు
రాజంపేట: పచ్చని పల్లెల్లో చిచ్చుపెడుతున్న మద్యం రక్కసికి చెక్ పెట్టేందుకు గుండారం, నడిమితండా, ఎల్లాపూర్ తండాలవాసులు ఒక్కటయ్యారు. శుక్రవారం మూడు గ్రామాల ప్రజలు గుండారం ఎల్లమ్మ గుడి వద్ద సమావేశమై తమ గ్రామాలలో మద్యం విక్రయాలను నిషేధిస్తూ తీర్మానం చేశారు. తమ గ్రామాల పరిధిలో మద్యం అమ్మితే రూ. లక్ష జరిమానాతో పాటు ఏడు చెప్పు దెబ్బలు శిక్ష విధించాలని నిర్ణయించారు. మద్యం అమ్మిన వారిని పట్టించినవారికి రూ. 20 వేల బహుమతి అందిస్తామని తెలిపారు. లక్ష రూపాయల జరిమానా తీర్మానించిన మూడు గ్రామాల ప్రజలు -
యోగా ఫ్యామిలీ..
ఎల్లారెడ్డి: జంగమాయిపల్లి గ్రామానికి చెందిన సంగ్లుగారి నాగరాజుగౌడ్ కుటుంబానికి యోగాతో విడ దీయలేని అనుబంధం ఉంది. కుటుంబ సభ్యులు యోగా నేర్చుకుని ఇతరులకు నేర్పిస్తున్నారు. నాగ రాజు గౌడ్ హరిద్వార్ వెళ్లి బాబా రాందేవ్ ఆశ్రమంలో యోగా నేర్చుకున్నారు. కొన్నేళ్లుగా గ్రామంలో ఉ చితంగా యోగా నేర్పిస్తున్నారు. ఆయన భార్య సు జాతకు యోగా నేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆయు ష్ విభాగంలో యోగా ఇన్స్ట్రక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. కుమారు డు మధుగౌడ్ సైతం యోగా నేర్చుకున్నా డు. ప్రస్తుతం హైదరాబాద్లోని సెయింట్మేరి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్న మధు.. హైదరాబాద్లోని మానసిక రోగులకు ప్రతిరోజు యోగా నేర్పిస్తున్నాడు. నాగరాజు గౌడ్ కూతురు సంతోషిణి సైతం తండ్రి బాటలో పయణిస్తోంది. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు హరిద్వార్లోని ఆచార్యకులంలో చదివి యోగాలో అత్యున్నత ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయిలో గోల్డ్మెడల్ను సాధించింది. ఇలా కుటుంబం మొత్తం యోగా నేర్చుకుని ఆదర్శంగా నిలుస్తోంది. -
ఆరోగ్య యోగం
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవంశనివారం శ్రీ 21 శ్రీ జూన్ శ్రీ 2025– 8లో u● పెరుగుతున్న అవగాహన ● శారీరక, మానసిక దారుఢ్యానికి ఎంతో ఉపయుక్తం ● జీవితంలో భాగమైన యోగాసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఉరుకులు, పరుగుల జీవితంలో చాలామంది మూడు పదుల వయసులోనే అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. బీపీ, షుగర్ పేషెంట్ల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది. గుండెపోట్లకు వయసుతో సంబంధం లేకుండాపోయింది. ఈ నేపథ్యంలో చాలా మంది ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్తోపాటు వివిధ రకాల వ్యాయామాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరికొందరు యోగాపై ఆసక్తి చూపుతున్నారు. కనీసం అరగంట పాటు యోగాసనాలు వేస్తే ఏ సమస్య రాదనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది. మండలాల్లోనూ యోగా కేంద్రాలు.. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాలు, వివిధ మండలాల్లోనూ యోగా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. యోగాలో ప్రావీణ్యం పొందిన గురువులు చాలా మందికి ఉచితంగా శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. అంతేగాక స్కూళ్లలోనూ యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. పిల్లలతో యోగాసనాలు వేయిస్తూ వారిని వివిధ స్థాయిల్లో పోటీలకు పంపుతున్నారు. ప్రభుత్వం సైతం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యోగా ఇన్స్ట్రక్టర్లను నియమించి ప్రజలకు యోగా నేర్పిస్తోంది. అన్ని వర్గాల్లోనూ ఆసక్తి... గతంలో ఉద్యోగులు, వ్యాపారులు కొద్దిమంది మాత్రమే యోగా చేసేవారు. అయితే యోగాతో కలిగే ప్రయోజనాలను గుర్తించి చాలా మంది ఆసనాలవైపు మళ్లారు. చాలాచోట్ల యోగా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అందుబాటులో కేంద్రాలు ఏర్పాటు కావడంతో అక్కడికి వెళ్లి యోగా నేర్చుకుంటున్నారు.న్యూస్రీల్ఆధునిక ప్రపంచంలో జీవన విధానంలో వేగం పెరిగింది. పోటీ ప్రపంచంలో ఒత్తిడి సర్వసాధారణంగా మారింది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒత్తిడిని చిత్తు చేయడానికి యోగాను ఆశ్రయిస్తున్నారు. నిత్య జీవితంలో భాగంగా మార్చుకుంటున్నారు. పలువురు దశాబ్దాలుగా యోగా వ్యాప్తికి కృషి చేస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లాలో యోగా వ్యాప్తికి కృషి చేసిన పలువురిపై కథనం.. -
యోగా ప్రదర్శనతో ఆకర్షితులై..
కామారెడ్డి అర్బన్: పాఠశాలలో ఓ ఎన్ఆర్ఐ ఇచ్చిన యోగా ప్రదర్శనను ఆయనను ఆకర్షించింది. ఆ తర్వాత యోగా నేర్చుకుని ఇతరులకు నేర్పుతూ పాతికేళ్లుగా ముందుకు సాగుతున్నారు మూడ బాల్లింగం. ఆయన స్వగ్రామం అప్పట్లో నక్సల్స్ ప్రభావిత గ్రామమైన రామారెడ్డి మండలంలోని మద్దికుంట. ఆరో తరగతి చదువుతున్న రోజుల్లో ఎన్ఆర్ఐ బండి రాములు ఇచ్చిన యోగా ప్రదర్శన ఆయనపై ప్రభావం చూపింది. రాములు వద్ద యోగా నేర్చుకున్నాడు. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతూనే పట్టణంలోని పలు ప్రయివేట్ పాఠశాలల్లో యోగా శిక్షకులుగా పనిచేశారు. స్థానిక ఆయుష్ కేంద్రంలో యోగా శిక్షకులుగా పనిచేస్తున్నారు. సుమారు 25 ఏళ్లుగా ఆయన యోగా గురువుగా సేవలందిస్తున్నారు. యోగాతో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయని బాల్లింగం పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో యోగాను తప్పనిసరి చేస్తే గ్రామీణ విద్యార్థులకు మేలు చేకూరుతుందని, యోగా శిక్షకులకు ఉపాఽధి లభిస్తుందని పేర్కొంటున్నారు. -
యోగానే ఇంటి పేరయ్యింది
కామారెడ్డి అర్బన్: ఆయన పేరు రాంరెడ్డి.. ఇంటి పేరు గడ్డం. కానీ పాతికేళ్లుగా యోగాకు అందిస్తున్న సేవలతో ఆయన ఇంటి పేరు మారిపోయింది. అందరూ యోగా రాంరెడ్డి అనే పిలుస్తున్నారు. గడ్డం రాంరెడ్డి 2001లో కామారెడ్డి ఆర్యసమాజంలో గురువులు అంతిరెడ్డి, బ్రహ్మరాజ్, అంజయ్యగుప్తాల వద్ద ఏడాది పాటు యోగాలో శిక్షణ పొందారు. 2009లో కామారెడ్డి అశోక్నగర్లోని ఎస్ఎస్వై సెంటర్లో 14 మందితో ఉచిత యోగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం 32 ఉచిత యోగా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. దాతల సహకారంతో కామారెడ్డి పట్టణంలో అర ఎకరం స్థలంలో యోగా భవన్ను నిర్మింపజేశారు. రాంరెడ్డి జిల్లా యోగా అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్, భారత స్వాభిమాన్ ట్రస్టులకు అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. అనేక జిల్లా, రాష్ట్ర స్థాయి యోగా పోటీలు, మట్టి సాన్నాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 2021 తర్వాత యజ్ఞ సహిత యోగా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. జిల్లా యోగా భవన్లో రోజూ తెల్లవారుజామున యజ్ఞసహిత యోగా శుక్రవారం నాటికి 1,411 వ రోజుకు చేరిందని రాంరెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కృషితో ఐక్యరాజ్య సమితి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా డే గా ప్రకటించిన తర్వాత యోగాపై ప్రజలలో అవగామన పెరిగిందని పేర్కొంటున్నారు. యోగా అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుందన్నారు. నిత్యం యోగా సాధన చేయాలని సూచిస్తున్నారు. -
ఎనిమిది పదుల వయసులోనూ..
కామారెడ్డి అర్బన్ : జిల్లా కేంద్రానికి చెందిన గరిపల్లి అంజయ్య గుప్తా వయసు 84 ఏళ్లు. ఆయన ఈ వయసులోనూ నిత్యం యోగా సాధన చేస్తున్నారు. ఆర్యసమాజం స్ఫూర్తితో హైదరాబాద్లోని గాంధీ జ్ఞాన మందిరంలో 1980 ప్రాంతంలో యోగాసనాలు నేర్చుకున్నారు. అప్పటినుంచి యోగా సేవలో తరిస్తున్నారు. ఆధునిక కాలంలో కామారెడ్డి పట్టణంలో తొలి యోగా గురువుగా గుర్తింపు పొందారు. కుటుంబ సభ్యులు వ్యాపారం నిమిత్తం హైదరాబాద్లో ఉంటున్నా అంజయ్య మాత్రం యోగా కోసమే కామారెడ్డిలో నివాసం ఉంటున్నారు. ఆయన రోజు తెల్లవారుజామున గాయత్రి యజ్ఞం, యోగాసనాలు నిర్వహిస్తారు. పట్టణంలో ఉదయం, సాయంత్రం వేళల్లో మహిళల కోసం మూడు, పురుషుల కోసం ఆరు యోగా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలలో అనేక యోగా పురస్కారాలను అందుకున్నారు. స్వామి రాందేవ్ బాబా ప్రబోధం మేరకు తాను యోగా వ్యాప్తికి కృషి చేస్తున్నానని అంజయ్య గుప్తా పేర్కొన్నారు. తన వద్ద యోగా నేర్చుకున్న వేలాది మంది ఇతరులకు గురువులుగా మారారంటూ సంతోషం వ్యక్తం చేశారు. -
‘యోగా డే’కు ఆహ్వానం
కామారెడ్డి అర్బన్: జిల్లాలోని పలు ప్రాంతాలలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఆయుష్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించనున్నట్లు ఆయుష్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ ఆకుల శ్రీకాంత్ తెలిపారు. శుక్రవారం కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని కలిసి యోగా డేలో పాల్గొనాలంటూ ఆహ్వాన పత్రిక అందించారు. యోగా డే సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను ఎమ్మెల్యేకు వివరించారు. ఆయన వెంట ప్రకృతి వైద్యులు దేవయ్య, ఆయుర్వేద వైద్యులు వెంకటేశ్వర్లు ఉన్నారు. నిర్వహించే ప్రాంతాలు.. ● ఆయుష్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాలలో యోగా డే నిర్వహించనున్నట్లు ఆయుష్ డీపీఎం శ్రీకాంత్ తెలిపారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు శ్రీసరస్వతి విద్యామందిర్లో యోగా డే నిర్వహిస్తామని పేర్కొన్నారు. ● 8.30 గంటల 9.30 వరకు లింగంపేట నాగన్నబావి వద్ద నిర్వహించే కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాల్గొంటారని తెలిపారు. ● యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా యోగా భవన్లో ఉదయం 5.30 నుంచి 7.15 వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ● జిల్లాకేంద్రంలోని ఆర్యసమాజ్లో 8 గంటలకు బీజేపీ ఆధ్వర్యంలో, మెహర్ బాబా ఫంక్షన్ హాల్లో యోగా గురువు బండి రాములు ఆధ్వర్యంలో ఉదయం 10.30 గంటలకు యోగా కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
కామారెడ్డి క్రైం : అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎంపీ సురేశ్ షెట్కార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం ‘దిశ’ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎంపీ సురేశ్ షెట్కార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మెంబర్ సెక్రెటరీగా పాల్గొన్నారు. 22 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ తరఫున యువతకు డ్రోన్ల నిర్వహణపై శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. సేంద్రియ ఎరువులు, వాణిజ్య పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని వ్యవసాయ శాఖ సహాయక సంచాలక భవనం పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. సర్కారు బడుల్లో మరుగుదొడ్లు పూర్తి స్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు, భవనాల నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఉపాధి హామీ పథకంలో 22 లక్షలుగా ఉన్న పని దినాలను 50 లక్షలకు పెంచాలని తీర్మానించారు. ప్రధాన మంత్రి కృషి సంచార్ యోజన కింద జిల్లాను చేర్చాలని, వాటర్ షెడ్ పథకానికి జిల్లాను అనుసంధానం చేయాలని తీర్మానిస్తూ ప్రతిపాదనలు పంపాలన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో విద్యుత్ లైన్ల పెంపునకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మదన్మోహన్రావు అధికారులను ఆదేశించారు. పిట్లం మండలంలో కిలోమీటర్ మేర రోడ్డు మరమ్మతులకుగాను అటవీ శాఖ అనుమతులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఫారెస్ట్ డీఎఫ్వో నిఖితకు సూచించారు. పోచారం అభయారణ్యం వద్ద రహదారికి 1.5 కిలోమీటరు మేర అటవీ అనుమతులు తీసుకోవాలని తీర్మానించారు. నియోజకవర్గం మీదుగా జాతీయ రహదారి నిర్మాణంలో ఉన్నందున దారి వెంబడి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. నోటీసులు పంపి పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలన్నారు. ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. శివానగర్ సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఇళ్ల నిర్మాణానికి ఇసుక, మొరం లభ్యతకు ఇబ్బందు లేకుండా చూడాలని హౌసింగ్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో తీర్మానించిన అంశాలు, అమలు చేయాల్సిన కార్యక్రమాలు, అభివృద్ధి పనులపై తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఆయా శాఖల అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, డీఆర్డీవో సురేందర్, డీఏవో తిరుమల ప్రసాద్, జిల్లా సంక్షేమాధికారి ప్రమీల, దిశ కమిటీ సభ్యులు కవిత, నగేష్, జాదవ్ నౌషా, దేశముఖ్ రాజు తదితరులు పాల్గొన్నారు.మాట్లాడుతున్న ఎంపీ సురేశ్ షెట్కార్, వేదికపై ఎమ్మెల్యే మదన్మోహన్రావు, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్సమావేశంలో పాల్గొన్న సభ్యులు, అధికారులు వాణిజ్య పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి దిశ సమావేశంలో ఎంపీ సురేశ్ షెట్కార్ -
జీవితంలో యోగా తప్పనిసరి
బాన్సువాడ: ప్రతి ఒక్కరి జీవితంలో యోగా తప్పనిసరి కావాలని యోగా శిక్షకులు రఘువీర్ గురూజీ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని యోగా శిక్షకులు, పతంజలి ప్రతినిధి రఘువీర్ గురూజీని సాక్షి పలకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14 ఏళ్లుగా బాన్సువాడ, ఎల్లారెడ్డి డివిజన్లలో ఆయా మండలాల్లో యోగాపై విస్తృత ప్రచారం చేశామన్నారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతతో పాటు మానసిన దృఢత్వం ఏర్పడుతుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆహార అలవాట్లను మార్చుకోవడంతో పాటు ధ్యానం చేయడం కూడా చాలా ముఖ్యమన్నారు. చిన్నప్పటి నుంచే యోగా, సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన ఉండాలని అన్నారు. 600లకు పైగా వివిధ ప్రాంతాల్లో యోగాపై ఆయన శిక్షణ ఇచ్చారు. రఘువీర్ గురూజీతో పాటు ఆయన సతీమణి వేదశ్రీ కూడా మహిళలకు యోగాసనాలు వేయించారు. బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడలో పతాంజలి ఆయుర్వేద మూలికల దుకాణం ఏర్పాటు చేసి అతి తక్కువ ధరలో ఔషధాలను అమ్ముతారు. 14 ఏళ్లుగా శిక్షణ ఇస్తున్న రఘువీర్ -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
మద్నూర్(జుక్కల్): యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని యోగా గురువులు పేర్కొన్నారు. మండల కేంద్రంలో అంతర్జాతీయ యోగా డే సందర్భంగా శుక్రవారం యోగా వాక్, విద్యార్థులు, గ్రామస్తులతో ర్యాలీ నిర్వహించారు. యోగాతో కలిగే లాభాలను పతాంజలి యోగాపీట్ సభ్యులు వివరించారు.విద్యుత్ సరఫరాలో అంతరాయంబిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్లో మరమ్మతులు కారణంగా శనివారం బిచ్కుందలో విద్యుత్ సరఫరా నిలిపేస్తున్నట్లు ఏఈ పవన్ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని, ప్రజలు అధికారులకు సహకారం అందించాలని కోరారు. సామూహిక అక్షరాభ్యాసంసాక్షి నెట్వర్క్: లింగపేట మండలం అయిలాపూర్ ప్రాథమిక పాఠశాలలో, నాగిరెడ్డిపేట మండల వదల్పర్తి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో చిన్నారులకు శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం చిన్నారులకు పలకలు, నోటు బుక్కులు, పెన్నులు, పెన్సిళ్లు అందజేశారు. -
ఎన్పీఏ 7.81 శాతానికి తగ్గింది
● ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి ● నగరంలో డీసీసీబీ వార్షిక మహాజనసభసుభాష్నగర్: నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎన్పీఏ (నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్) 14 శాతం నుంచి 7.81 శాతానికి తగ్గిందని ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం 103వ వార్షిక మహాజనసభ నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించినందుకుగాను మహాజనసభ ధన్యవాదాలు తెలిపింది. బ్యాంకు సాధించిన ప్రగతి వివరాలను సీఈవో నాగభూషణం వివరించారు. అనంతరం రమేశ్రెడ్డి మాట్లాడుతూ.. ఎన్పీఏ తగ్గించేందుకు సొసైటీ చైర్మన్లు, సీఈవోలు, బ్యాంకు సిబ్బంది విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఉమ్మడి జిల్లాలో 50 శాతంకు పైగా సొసైటీలు 50 శాతానికిపైగా రుణాలు వసూలు చేసి బ్యాంకు అభివృద్ధికి పాటుపడ్డాయని పేర్కొన్నారు. ఇందుకుగాను ప్రతి సహకార సంఘానికి వారి షేర్ క్యాపిటల్లో 2 శాతం డివిడెండ్ను ప్రకటిస్తున్నామన్నారు. కాగా పెండింగ్లో ఉన్న ధాన్యం కమీషన్, ఉమ్మడి జిల్లాలో యూరియా కొరతపై సొసైటీ చైర్మన్లు ఆయన దృష్టికి తీసుకవచ్చారు. ఈ విషయమై మంత్రి, ప్రిన్సిపల్ సెక్రెటరీతో ఇదివరకే మాట్లాడినట్లుగా రమేష్రెడ్డి తెలిపారు. అనంతరం బ్యాంకు అభివృద్ధికి కృషి చేసిన సొసైటీ చైర్మన్లను ఘనంగా సన్మానించారు. వైస్ చైర్మన్ నల్ల చంద్రశేఖర్రెడ్డి, డైరెక్టర్లు, ఉమ్మడి సొసైటీ చైర్మన్లు, డీసీవో శ్రీనివాస రావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
అక్రమ రవాణాకు వారధి?
బాన్సువాడ: ప్రజల సౌకర్యార్థం, రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు నిర్మించిన బ్రిడ్జిలు అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు అనువుగా మారాయి. బాన్సువాడ డివిజన్లోని మూడు మండలాలైన బీర్కూర్, డోంగ్లీ, బిచ్కుందలకు అనుసంధానంగా మంజీర నదిపై నిర్మించిన బీర్కూర్ బ్రిడ్జి అక్రమ రవాణాకు రాచమార్గమైంది. ఈ బ్రిడ్జి వద్ద నిఘా లేకపోవడంతో అక్రమార్కులు తమ దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ బ్రిడ్జికి ఇవతల పక్కన బీర్కూర్ మండల కేంద్రం ఉంటే అవతల ఓ పక్కన బిచ్కుంద మండలం, మరొక పక్క డోంగ్లీ ఉంటుంది. ఈ బీర్కూర్, బిచ్కుంద, డోంగ్లీ మండలాల పరిధిలో మంజీర పరివాక ప్రాంతం ఉంటుంది. ప్రధానంగా ఆయా మండలాల పరిధిలో అక్రమ ఇసుక తరలింపు జోరుగా కొనసాగుతున్నట్లు విమర్శలున్నాయి. నిత్యం రాత్రి వేళల్లో టిప్పర్లు, బోలెరో, ట్రాక్టర్ల ద్వారా ఈ అక్రమ ఇసుక దందాకు అక్రమార్కులు తెరలేపారు. మంజీర నది నుంచి అక్రమంగా తరలించే ఇసుకను బ్రిడ్జి మీదుగా ఇటు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలోని ఆయా పట్టణాలు, మండల కేంద్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బ్రిడ్జి అవతల వైపు నుంచి బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్, పెద్దకొపడప్గల్, జుక్కల్ మండలాలకే కాకుండా కర్ణాటకలోని పలు ప్రాంతాలకు ఇక్కడి ఇసుకను తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్రిడ్జికి మరో పక్క ఉన్న కుర్లా మంజీర ప్రాంతం నుంచి అక్రమార్కులు డోంగ్లీ, మద్నూర్ మండలాలతో పాటు మహారాష్ట్రకు సైతం తలిస్తున్నట్లు తెలిసింది.మంజీర ప్రాంతంలో పేకాట స్థావరాలు..బీర్కూర్ సమీపంలోని మంజీర నదిపై నిర్మించిన బ్రిడ్జి సమీపంలో కొందరు పేకాట స్థావరాలను ఏర్పాటు చేశారు. బీర్కూర్కు చెందిన ఓ పేకాట ముఠా నిత్యం బైక్లపై బ్రిడ్జి కింద నది ప్రాంతంలో పేకాట ఆడుతున్నట్లు తెలిసింది. ఈ తతంగం కొన్నేళ్లుగా నడుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పలు మార్లు పోలీసులు దాడులు చేసి పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసిన ఘటనలున్నాయి. వారం రోజుల క్రితం పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేసి నగదు, బైక్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పేకాట రాయుళ్లు మాత్రం నెలకొక స్థావరాన్ని మారుస్తూ మూడు ముక్కలు ఆరు అడ్డాలుగా పేకాటను కొనసాగిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. పోలీసులు బీర్కూర్ పోలీస్ స్టేషన్ ముందు మాత్రమే నామమాత్రపు తనిఖీలు చేస్తూ పోలీసులు చేతులు దులుపుకుంటున్నారు. బైక్లపై వచ్చి వెళ్లే వారు హెల్మెట్ పెట్టుకున్నాడా..గతంలో బైక్లకు సంబందించిన చలాన్లు పెండింగ్లో ఉన్నాయా అనే విషయాలు చూస్తున్నారు కానీ బైక్లపై నిత్యం రాకపోకలు సాగిస్తున్న వారు ఎక్కడికి వెళ్తున్నారు..ఎందుకు వెళ్తున్నారనేది గమనించకపోవడం గమనర్హం. మూడు మండలాలకు అనుసంధానంగా ఉన్న బ్రిడ్జి వద్ద నిఘా కరువు ఇసుక అక్రమ రవాణా, పేకాట స్థావరాలకు రాచమార్గం పోలీసుల నామమాత్రపు దాడులతోనే సరి -
బోర్ మోటార్ల దొంగకు దేహశుద్ధి
ఆర్మూర్టౌన్: పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం రైతులు, స్థానికులు ఓ దొంగను పట్టుకొని దేహశుద్ధి చేశారు. పట్టణంతోపాటు మండలంలోని గ్రామాల్లో గల వ్యవసాయ బోర్ మోటార్లను నిందితుడు దొంగిలించి, ఓ స్క్రాప్ దుకాణం వద్ద విక్రయించడానికి యత్నించాడు. స్థానికులు అతడిని గమనించి పట్టుకొని దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందితుడు దొంగిలించిన మోటార్లను రైతులకు అప్పగించాలని పోలీసులను కోరారు. ట్రాక్టర్ బోల్తా: ముగ్గురికి గాయాలు రామారెడ్డి: మండలంలోని మద్దికుంట–రామారెడ్డి గ్రామాల మధ్య గురువారం ఓ ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో మద్దికుంట గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు గాయాలైనట్లు సమాచారం. స్థానికులు క్షతగాత్రులను కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు రాలేదని ఎస్సై రాజారాం తెలిపారు. ఇంటికి నిప్పు నందిపేట్ (ఆర్మూర్): మండల కేంద్రంలోని రాంనగర్ కాలనీలో ఓ ఇంట్లో మంటలు వ్యాపించి సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. సదరు ఇంట్లో నివాసం ఉంటున్న కోయల్కర్ లావణ్య మూడు రోజుల క్రితం ఆదిలాబాద్లోని వారి బంధువుల ఇంటికి వెళ్ళింది. కాగా గురువారం అర్ధరాత్రి ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించి, ఇంట్లోని వస్తువులకు నిప్పుపెట్టారు. ఈ మేరకు లావణ్య శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. భార్య ఆత్మహత్యకు కారణమైన భర్తకు పదేళ్ల జైలు శిక్షనిజామాబాద్ లీగల్: అదనపు కట్నం కోసం భార్యను వేధించి, ఆమె ఆత్మహత్యకు కారణమైన భర్తకు నిజామాబాద్ సెషన్స్ కోర్టు జడ్జి జివిఎన్ భరతలక్ష్మి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్రెడ్డి తెలిపిన వివరాలు ఇలా.. డిచ్పల్లి మండలం ఘన్పూర్కు చెందిన షేక్ ఇద్రీస్కు నడిపల్లికి చెందిన ఫౌజియా బేగంతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్ని నెలల తర్వాత భర్త, అత్త అదనపు కట్నం కోసం ఫౌజియాను వేధించడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. పుట్టింటి వారికి అదనపు కట్నం ఇచ్చే స్థోమత లేకపోవడం, అత్తింటి వారి వేధింపులు భరించలేక ఫౌజియా 2021లో తన ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి పుట్టింటి వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా భర్త, అత్త, బావలపై కేసు నమోదు చేసి కోర్టుకు పంపారు. విచారణ చేపట్టిన జడ్జి మృతురాలి భర్త షేక్ ఇద్రీస్కు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అత్త కేసు విచారణ దశలో ఉండగా మృతి చెందగా, బావ షేక్ అలీని నిర్దోషిగా ప్రకటించింది. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలుబీర్కూర్: మండలంలోని సంబపూర్ గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. బీర్కూర్ గ్రామానికి చెందిన ప్రదీప్ అనే యువకుడు బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. మండలంలోని సంబపూర్ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి అతడిని వెంటనే బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి, మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్కు రిఫర్ చేశారు. -
పాఠశాలకు లేటుగా వచ్చారని గేటుకు తాళం
తాడ్వాయి(ఎల్లారెడ్డి): పాఠశాలకు లేటుగా వచ్చారని విద్యార్థులతో పాఠశాల సిబ్బంది అమానుషంగా ప్రవర్తించారు. గేటుకు తాళం వేసి విద్యార్థులు, తల్లిదండ్రులను లోనికి రానివ్వలేదు. వివరాలు.. తాడ్వాయి బాలికల గురుకుల పాఠశాలకు ఈనెల 15న విద్యార్థులను తీసుకురావాలని తల్లిదండ్రులకు పాఠశాల సిబ్బంది తెలిపారు. కానీ తల్లిదండ్రులు 5 రోజులు లేటుగా తమ పిల్లలను గురుకుల పాఠశాలకు తీసుకొచ్చారు. దీంతో లేటుగా వచ్చారనే కోపంతో గురుకుల పాఠశాల సిబ్బంది కనీసం గేటు కూడా తీయలేదు. దీంతో మండుటెండలో విద్యార్థులు, తల్లిదండ్రులు గంటల తరబడి గేటు ముందు నిలబడాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి సిబ్బంది, తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాల గేటు తాళం తీయించి విద్యార్థులను లోపలికి పంపించారు. బయట ఎండలోనే ఉండిపోయిన విద్యార్థులు, తల్లిదండ్రులు పోలీసులు సముదాయించడంతో గేటు తాళం తీసిన పాఠశాల సిబ్బంది -
ఆర్టీసీ ప్రహరీ పనులు ఆపాలని నిరసన
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ చుట్టూ అధికారులు ప్రహరీ నిర్మాణ పనులు ప్రారంభించారు. బస్టాండ్ నుంచి గ్రామంలోకి వెళ్లడానికి ప్రధాన దారి ఒక్కటే ఉంది. దానికి అడ్డంగా ప్రహరీ నిర్మాణం చేపట్టవద్దని శుక్రవారం స్థానికులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కనీసం 25 ఫీట్లు దారి వదిలి గోడ నిర్మాణం చేపట్టాలని కోరారు. దారి మూసివేస్తే చిరువ్యాపారులు నష్టపోయి ఉపాధి కోల్పోతారని అన్నారు. ఆర్టీసీ అధికారులు దారి వదిలకుంటే అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. స్థానికులు నూకల రాజు, చిరు వ్యాపారులు, దుకాణదారులు ఉన్నారు.యువకుడిపై పోక్సో కేసు నమోదు నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్పేటకు చెందిన ఆల్ఫా అనే యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పోరెడ్డి మల్లారెడ్డి శుక్రవారం తెలిపారు. 10 రోజుల క్రితం మండలంలోని ఓ గ్రామానికి చెందిన 14ఏళ్ల బాలిక రోడ్డుపై ఆడుకుంటుండగా అల్ఫా అనే యువకుడు సదరు బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు సదరు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశామని, బాలికను సఖీ కేంద్రానికి తరలించినట్లు ఆయన తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు. -
బైక్ను ఢీకొన్న స్కూల్ బస్సు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గోపాల్పేటలోని నల్లపోచమ్మ ఆలయం వద్ద ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు శుక్రవారం ఓ బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న మండలంలోని తాటిచెట్టుగడ్డతండాకు చెందిన అంగోత్ దేవిసింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే దేవిసింగ్ను చికిత్స నిమిత్తం గోపాల్పేటలోని ఓ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యుల సూచనల మేరకు కామారెడ్డిలోని ఆస్పత్రికి తరలించారు. స్కూల్ బస్సుతోపాటు బైక్ను స్థానిక పోలీసులు నాగిరెడ్డిపేట పోలీస్స్టేషన్కు తరలించారు. ప్రమాదానికి సంబంధించి ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
మురికి నీరు నిల్వ ఉండకుండా చూడండి
లింగంపేట(ఎల్లారెడ్డి): పరిసరాల్లో మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఎంపీడీవో నరేష్ సూచించారు. శుక్రవారం పలు గ్రామాల్లో డ్రైడే కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. గ్రామ పంచాయితీ సిబ్బంది గ్రామాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గాంధారి(ఎల్లారెడ్డి): వర్షాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీడీవో రాజేశ్వర్ అన్నారు. శుక్రవారం పంచాయతీ కార్యదర్శి నాగరాజుతో కలిసి ఎంపీడీవో మండల కేంద్రంలో వీధుల్లో పర్యటించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిలువ లేకుండా చూసుకోవాలని సూచించారు. భిక్కనూరు: మండల వ్యాప్తంగా భిక్కనూరు ప్రభుత్వ ఆస్పత్రి ఆధ్వర్యంలో శుక్రవారం డ్రై డే నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు యెమిమా ఎంపీహెచ్ఈవో వెంకటరమణ ఆధ్వర్యంలో వైద్యారోగ్య సిబ్బంది ఇంటింటా తిరిగి నిల్వ ఉన్న నీటిని పారబోయించారు. బీబీపేట: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బీబీపేట కార్యదర్శి రమేష్ అన్నారు. శుక్రవారం ఫ్రైడే డ్రైడే సందర్భంగా గ్రామంలోని ఆయా కాలనీల్లో సందర్శించారు. కుండీల్లో నీటిని తొలగించాలని దానివల్ల దోమలు వ్యాప్తి చెందుతాయని అన్నారు. జ్వరాలతో బాధపడుతున్న వారిని గుర్తించాలి లింగంపేట(ఎల్లారెడ్డి): గ్రామంలోని ప్రతి ఇంటింటికి తిరిగి జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలు సేకరించాలని మండల పంచాయితీ అధికారి మలహరి సూచించారు. శుక్రవారం భవానిపేట సబ్ సెంటర్లో వైద్య సిబ్బందితో సమావేశం నిర్వహించి మాట్లాడారు. రోగులను గుర్తించి మందులు పంపిణీ చేయాలని సూచించారు. పలు సూచనలు, సలహాలిచ్చారు. -
లక్ష్మణుడు లేని రామాలయం
మీకు తెలుసా? సీతారాములతో పాటు లక్ష్మణుడి విగ్రహాలు ఉన్న రామాలయాలనే మనం దేశవ్యాప్తంగా చూస్తాం. కానీ దేశంలోనే ఎక్కడా లేనివిధంగా లక్ష్మణుడి విగ్రహం లేని రామాలయాన్ని నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి గ్రామంలో చూడవచ్చు. ● ఇక్కడ ఉన్న రాముడి విగ్రహం ప్రత్యేకమైంది. విగ్రహంలోని ప్రభపై దశావతారాల రూపాలు, సాలిగ్రామాలు ఉన్నాయి. ● రాముడి ఎడమ తొడపై సీతాదేవి కూర్చోని ఉండటం మరో ప్రత్యేకత. ● సిర్నాపల్లి సంస్థానాదీశురాలైన శీలం జానకీబాయి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసి పూజలు చేసేవారని ఆలయ పూజారి తెలిపారు. ● ఈ ఆలయాన్ని ఆరువందల సంవత్సరాల క్రితం నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ● ఔరంగజేబు ఆలయాలను ధ్వంసం చేస్తుండగా కొందరు ఇందూరు ప్రాంతం నుంచి విగ్రహాలను తెచ్చి ఇక్కడ ప్రతిష్టించినట్లు చెప్పుకుంటారు. ● ఈ ఆలయంలో పూజలు చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. – ఇందల్వాయి -
తనువు చాలించి.. నలుగురికి ప్రాణదాతగా నిలిచి
కామారెడ్డి టౌన్: ఓ యువతి చనిపోయిన తర్వాత మరో నలుగురి ప్రాణదాతగా నిలించింది. వివరాలు ఇలా.. జిల్లా కేంద్రంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో పిట్ల విజయ్–కళ్యాణి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కుమార్తె పిట్ల సోహిత(17) ఇటీవల ఇంటర్లో 991మార్కులు సాధించడంతో పాటు జేఈఈలో ఉత్తమ ర్యాంకు సాధించింది. జిల్లా కేంద్రంలో వారం రోజుల క్రితం ఎస్సెస్సీ విద్యార్థులు గెట్ టు గేదర్ నిర్వహించగా ఆమె పాల్గొనగా, మధ్యాహ్నం స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే ఆమెను జిల్లా కేంద్రంలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి హైదరాబాద్కు రిఫర్ చేశారు. బ్రెయిన్లో రక్త స్రావం జరగడంతో వారం రోజులు పాటు ఐసీయూలో చికిత్స పొందుతూ గురువారం తనవుచాలించింది. కుటుంబ సభ్యుల అనుమతితో యువతి అవయవాలను దానం చేశారు. తండ్రి కామారెడ్డి మున్సిపల్ వాటర్వర్క్స్ విభాగంలో విధులు నిర్వహిస్తుండగా తల్లి గృహిణి. యువతి అంతక్రియలు శుక్రవారం జిల్లా కేంద్రంలో జరుగగా మున్సిపల్ కార్మికులు, తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మృతిచెందిన యువతి అవయవాలు దానం చేసిన కుటుంబసభ్యులు -
ఫోన్ల రికవరీలో జిల్లా ముందంజ
కామారెడ్డి క్రైం: సెల్ఫోన్ల రికవరీలో రాష్ట్రంలోని కమిషనరేట్లను మినహాయించి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సెల్ఫోన్ పోగొట్టుకున్న వారు ఆందోళనకు గురి కావొద్దని, సీఈఐఆర్ విధానంలో రికవరీ చేసే అవకాశం ఉందని తెలిపారు. వారం రోజులుగా జిల్లాలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో పోగొట్టుకున్న, చోరీకి గురైన 110 సెల్ఫోన్లను రికవరీ చేశామని, వాటి విలువ రూ.16 లక్షల వరకు ఉంటుందని వివరించారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 4 వేల వరకు సెల్ఫోన్లను రికవరీ చేశామన్నారు. సెల్ఫోన్ పోగొట్టుకున్న వారు అశ్రద్ధ చేయకుండా తమకు సమాచారం ఇవ్వడంతోపాటు భద్రతా కారణాల దృష్ట్యా వెంటనే సిమ్ కార్డును బ్లాక్ చేయించాలని సూచించారు. ఆలస్యం చేస్తే వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలిగే అవకాశం ఉంటుందన్నారు. ఫోన్ల రికవరీలో ప్రతిభ కనబర్చిన ప్రత్యేక బృందం సభ్యులను అభినందించారు. ఫోన్లు పోగొట్టుకుని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన వారు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఆర్ఎస్సై బాల్రాజు (87126 86114)ను సంప్రదించి తీసుకువెళ్లాలని సూచించారు. ఏఎస్పీ నరసింహారెడ్డి, ఏఆర్ డీఎస్పీ యాకూబ్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. స్పెషల్ డ్రైవ్ ద్వారా 110 సెల్ఫోన్లు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్చంద్ర -
డ్రంకెన్డ్రైవ్ కేసులో ఒకరికి జైలు
బోధన్: ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో ఈనెల 13న పోలీసులు డ్రంకెన్డ్రైవ్ తనికీలు చేపట్టగా నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. పోలీసులు అతడిని గురువారం బోధన్ కోర్టులో హాజరుపర్చగా జడ్జి రెండు రోజుల జైలు శిక్ష విధించారని ఎడపల్లి ఎస్సై వంశీ కృష్ణారెడ్డి తెలిపారు. మహిళను తోసివేసిన వ్యక్తిపై ఫిర్యాదు ఖలీల్వాడి: నగరంలోని బురడిగల్లీలో ఎదురెదురుగా ఉన్న మహిళలు గొడవ పడినట్లు ఎస్సై సయ్యద్ ఇమ్రాన్ శుక్రవారం తెలిపారు. ఎదురెదురుగా ఉండే తల్లికూతుళ్లతో మరో మహిళ గొడవ పడినట్లు తెలిపారు. సదరు మహిళ భర్త వచ్చి తల్లీకూతుళ్లను నెట్టివేయడంతో వారికి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కరెంట్ షాక్తో ఎద్దు మృతి లింగంపేట: మండలంలోని అయిలాపూర్ గ్రామంలో బీరప్ప అనే రైతుకు చెందిన ఎద్దు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందింది. గ్రామ శివారులోని పొలంలో గురువారం మేత కోసం వెళ్లిన ఎద్దుకు ట్రాన్స్ఫార్మర్ వద్ద కరెంటు షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఎద్దు విలువ రూ. 70వేలు వరకు ఉంటుందని బాదితుడు తెలిపారు. ఘటన స్థలాన్ని ట్రాన్స్కో అధికారులు పరిశీలించారు. అధికారులు స్పందించి నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని బాధితుడు కోరాడు. -
చదువులో రాణించాలి
● బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ సభ్యురాలు ప్రేమలత అగర్వాల్ కామారెడ్డి క్రైం: చదువులో రాణించి ఉన్నత స్థానాల్లో నిలవాలని బాలల హక్కుల పరిరక్షణ రాష్ట్ర కమిషన్ సభ్యురాలు ప్రేమలత అగర్వాల్ విద్యార్థులకు సూచించారు. పట్టణంలోని రాజీవ్నగర్ కాలనీలో ఉన్న బాలసదనం, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లను గురువారం ఆమె సందర్శించారు. పక్కనే ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. గర్భిణులు, బాలింతలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాల్య వివాహాలు జరుగకుండా చూడాలన్నారు. అనంతరం ఆమె కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె వెంట జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ స్వర్ణలత, డీసీపీవో స్రవంతి, సిబ్బంది పాల్గొన్నారు. ఇచ్చిన మాట తప్పను● కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి భిక్కనూరు: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం తప్ప.. మాట తప్పే వ్యక్తిని కానని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని జంగంపల్లి, అంతంపల్లి, లక్ష్మీదేవినిపల్లి, కాచాపూర్ గ్రామాలలో పలు కుల సంఘాల వద్ద చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా కుల సంఘాల వద్ద తన సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేయించానన్నారు. అన్ని కుల సంఘాల సభ్యులు ఐక్యంగా ఉండి సంఘాలను అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి తిరుమలేశ్, నాయకులు, కార్యకర్తలు ఆయా కుల సంఘాల ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి● సబ్ కలెక్టర్ కిరణ్మయి బాన్సువాడ : ప్రతి ఒక్కరూ యోగా చేసి ఆరోగ్యంగా జీవించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా టీచర్ ఓట్లం శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాన్సువాడ మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ప్రభుత్వ ఉద్యోగులతో యోగా సాధన చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేటి కాలంలో ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని, శారీరక, మానసిన ఆరోగ్యానికి యోగా చాల ఉపయోగపడుతుందని అన్నారు. ఈ నెల 21న అంబేడ్కర్ భవన్లో నిర్వహించనున్న యోగా దినోత్సవానికి అందరూ హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ వరప్రసాద్, డీఎల్పీవో సత్యనారాయణ, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు. ఆర్ట్స్ కళాశాలలో ప్రవేశాలకు బారులుకామారెడ్డి అర్బన్: డిగ్రీ కోర్సుల ప్రవేశాల కోసం ‘దోస్త్’ ప్రక్రియ గురువారం చివరి రోజు కావడంతో రిజిస్ట్రేషన్ కోసం విద్యార్థులు బారుల తీరారు. కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో విన్నూత కోర్సులుండగా ప్రవేశాల కోసం విద్యార్థులు బారులు తీరారు. తొలి ప్రాధాన్యతగా తమ కళాశాలను ఎంపిక చేసుకోవడంపై ప్రిన్సిపల్ విజయ్కుమార్ హర్షం వ్యక్తంచేశారు. ‘దోస్త్’ గడువు పొడిగింపు.. డిగ్రీ ప్రవేశాల కోసం ‘దోస్త్’ గడువును ఈ నెల 25 వరకు పొడిగించినట్లు జిల్లా సమన్వయకర్త, కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ కే విజయ్కుమార్ తెలిపారు. దోస్త్లో ఎంపికలు ఇవ్వని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి క్రైం: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్– 2025పై జిల్లాస్థాయి అవగాహనా సమావేశాన్ని గురువారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా గ్రామాలు, పట్టణాలలో క్రమం తప్పకుండా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని, మురికి కాలువలు శుభ్రం చేయాలన్నారు. ప్రతి మంగళ, శుక్ర వారాల్లో డ్రైడే నిర్వహించాలన్నారు. తాగునీటి ట్యాంకులను శుభ్రపరిచి క్లోరినేషన్ చేయాలని, తాగునీటి పైప్లైన్లకు లీకేజీలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలన్నారు. గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకొని హైరిస్క్ ప్రాంతాలైన కామారెడ్డి అర్బన్, దేవునిపల్లి, రామారెడ్డి మండలం అన్నారంతోపాటు లింగంపేట్, మాచారెడ్డి, నిజాంసాగర్ ప్రాంతాల్లో ముందస్తుగా డెంగీ నియంత్రణ చర్యలు తీసుకోవాలన్నారు. డెంగీ నివారణపై జిల్లా, పీహెచ్సీ స్థాయిల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను నియమించడంతోపాటు ప్రభుత్వ ఆస్పత్రిలో అవసరమైన మందులను అందుబాటులో ఉంచామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధిహామీ.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగంగా చేయించాలని, క్రమం తప్పకుండా పనులను పర్యవేక్షించాలని అధికారులను కలెక్టర్ సంగ్వాన్ ఆదేశించారు. గరిష్టంగా కూలీ వచ్చేలా ఉపాధిహామీ పనులు కల్పించాలని అన్నారు. భూగర్భ జలాల పెంపునకు సంబంధించి బోరుబావుల వద్ద ఇంకుడు గుంతలు, వ్యక్తిగత ఇంకుడు గుంతల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. వనమహోత్సవం కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాలన్నారు. ప్రతి మండలంలో ఒక సామాజిక మరుగుదొడ్ల కాంప్లెక్స్ నిర్మించాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు సకాలంలో మంజూరు చేయాలన్నారు. పాఠశాలల విద్యార్థులకు రెండో విడత యూనిఫామ్ల తయారీని ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక మహిళా సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో 3 పెట్రోల్ బంకుల ఏర్పాటు చర్యలను వేగవంతం చేయాలన్నారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, స్థానిక సంస్ధల అదనపు కలెక్టర్ చందర్, డీఆర్డీవో సురేందర్, డీపీవో మురళి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు పాల్గొన్నారు. -
పరుగుతో ఆరోగ్యం మెరుగు
● ఉత్సాహంగా ఒలింపిక్ డే రన్ కామారెడ్డి అర్బన్: మానసిక ఉల్లాసం, శారీరక ఆరోగ్యానికి నడక, పరుగు ఎంతో ఉపయోగపడుతుందని కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన మద్ది చంద్రకాంత్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో 39వ ఒలింపిక్ డే రన్ను గురువారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఇందీరా గాంధీ స్టేడియం వరకు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి, ఆర్డీవో వీణ, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ కై లాస్ శ్రీనివాస్రావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ క్రీడల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను సన్మానించారు. కార్యక్రమంలో ఒలింపిక్ డే రన్ కన్వీనర్, కో–కన్వీనర్లు నల్లవెల్లి కరుణాకర్రెడ్డి, ఆర్ వెంకటేశ్వర్గౌడ్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్రెడ్డి, అనిల్కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, డీఈవో రాజు, యువజన, క్రీడల జిల్లా అధికారి జగన్నాథన్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
సన్నబియ్యం పంపిణీలో టాప్
కామారెడ్డి క్రైం: సన్నబియ్యం పంపిణీలో జిల్లా ప్రథమ స్ధానంలో నిలిచింది. వేగవంతంగా వందశాతం బియ్యం పంపిణీ పూర్తయ్యింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని పంపిణీ చేపట్టారు. దుకాణాలకు కార్డుదారులు ఒక్కసారిగా రావడం, కనీసం మూడు సార్లు వేలిముద్రలు తీసుకోవడం, సాంకేతిక సమస్యలు వంటివి మొదట్లో ఇబ్బందులకు గురిచేశాయి. అయినప్పటికీ రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాలో పంపిణీ ప్రక్రియ ముందుగా పూర్తయినట్లు అధికారులు తెలిపారు. 17,505 మెట్రిక్ టన్నులు.. జిల్లాలో 578 రేషన్ దుకాణాలు, వాటి పరిధిలో ప్రతి నెలా 5,835 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ ఉంటుంది. కానీ నెలలో మాత్రం మూడు నెలలకు సంబంధించి 17,505 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఒకే సారి కేటాయించారు. గత నెలాఖరు నుంచే ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి బియ్యం సకాలంలో రేషన్ దుకాణాలకు చేరేలా పివిల్ సప్లయ్ అధికారులు చర్యలు చేపట్టారు.19 రోజుల్లోనే..ఈ నెల ప్రారంభంలోనే రేషన్ పంపిణీ మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం.. సన్నబియ్యం కావడంతో లబ్ధిదారులు రేషన్ దుకాణాలకు తరలివచ్చారు. దీంతో దుకాణాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఎక్కువసార్లు వేలిముద్రలు తీసుకోవాల్సి ఉండటంతో ఒక్కో లబ్దిదారుడికి బియ్యం పంపిణీ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంది. కొందరు డీలర్లు మొదట్లో ఒక్కోరోజు రాత్రి 11 గంటల వరకు బియ్యం పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా 19 రోజుల్లోనే రేషన్ డీలర్లు, అధికారులు కలిసి సన్నబియ్యం పంపిణీ ప్రక్రియను పూర్తి చేశారు. వందశాతం పంపిణీ పూర్తయిన జిల్లాగా కామారెడ్డి వేగవంతంగా పూర్తయిన ప్రక్రియపంపిణీ పూర్తయ్యింది జిల్లాలో మూడు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ పూర్తయ్యింది. ఈ నెల 19 నాటికి లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అందించాం. దీంతో పంపిణీ ప్రక్రియ త్వరగా చేపట్టడంలో మన జిల్లానే ముందుంది. ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. – రాజేందర్, డీఎం, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్, కామారెడ్డి -
గత లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్ల వివరాలు
● ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా మహిళా ఓటర్లు ● ఇతర జిల్లాలతో పోలిస్తే ఇక్కడే అధికం ● ప్రతి సెగ్మెంట్లో వారి సంఖ్యే ఎక్కువ.. ● చట్టసభలోకి వెళ్లనున్న మహిళలు ● నియోజకవర్గాల పునర్విభజనతో మారనున్న ముఖచిత్రంసాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా నిజామాబాద్ జిల్లా నుంచి తదుపరి శాసనసభలోకి మహిళా ఎమ్మెల్యేలు ఎక్కువమంది అడుగు పెట్టే అవకాశం ఉంది. రాష్ట్ర పునర్విభజన చట్టం మేరకు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని కారణాలతో ఆలస్యమైంది. అయితే 2027లో దేశవ్యాప్తంగా జనాభా లెక్కల అనంతరం రాష్ట్ర శాసనసభ స్థానాల పునర్విభజన చేపట్టడం ఖాయమైంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ఉండనుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు వరకు అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం ఉన్న 119 నియోజకవర్గాల సంఖ్య 153కు పెరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలున్నాయి. రాష్ట్రంలో ఒక్కో లోక్సభ స్థానం పరిధిలో ప్రస్తుతం 7 చొప్పున ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లు 9కి పెరగనున్నాయి. అయితే ఉమ్మడి జిల్లాలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మహిళల జనాభా, ఓట్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. రానున్న జనాభా లెక్కింపుతోపాటు ఓట్ల సంఖ్యలోనూ మహిళల ఓట్ల సంఖ్య మరింతగా పెరగనుంది. ఇతర జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే మహిళల ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉంటూ వస్తోంది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడంతోపాటు రాష్ట్రపతి ముద్ర వేశారు. దీంతో తెలంగాణలో మహిళా ఎమ్మెల్యేల సంఖ్య 50గా ఉండనుంది. ఇతర ఉమ్మడి జిల్లాలతో పోలిస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచే మహిళా ఎమ్మెల్యేలు ఎక్కువగా శాసనసభలోకి అడుగు పెట్టనున్నారు. ఇదిలా ఉండగా లోక్సభ సీట్ల పెంపు అంశంపై ఇప్పటివరకు ఒక స్పష్టత రాలేదు. లోక్సభ సీట్ల విషయమై దక్షిణాదికి అన్యాయం చేయొద్దనే వాదన నడుస్తున్న నేపథ్యంలో పెంచుతారా లేదా అనేది నిర్ణయం కాలేదు. నియోజకవర్గం పురుషులు మహిళలు ఇతరులు మొత్తం ఆర్మూర్ 98,116 1,12,612 06 2,10,734 బోధన్ 1,05,609 1,15,701 04 2,21,314 నిజామాబాద్ అర్బన్ 1,44,645 1,54,961 41 2,99,647 నిజామాబాద్ రూరల్ 1,18,607 1,35,523 06 2,54,136 బాల్కొండ 1,03,995 1,21,263 02 2,25,260 జుక్కల్ 99,524 1,03,498 09 2,03,031 ఎల్లారెడ్డి 1,06,881 1,16,423 02 2,23,306 కామారెడ్డి 1,22,474 1,32,682 19 2,55,175 బాన్సువాడ 93,762 1,03,250 13 1,97,025 జగిత్యాల 1,12,554 1,22,198 25 2,34,777 కోరుట్ల 1,15,932 1,28,153 04 2,44,089రాచమార్గంగా ఉమ్మడి జిల్లా సెగ్మెంట్లు!ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ మహబూబ్నగర్ తదితర ఉమ్మడి జిల్లాల్లో ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయా గిరిజన రిజర్డ్డ్వ్ సీట్లు ఎక్కువగా కేటాయింపు అవుతుంది. మరికొన్ని జిల్లాల్లో ఎస్సీ రిజర్డ్వ్ సీట్లు కచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు నిజామాబాద్ లోక్సభ పరిధిలో ఉన్న మొత్తం 11 శాసనసభ సెగ్మెంట్లకుగాను జుక్కల్ అసెంబ్లీ సీటు మినహా 10 స్థానాలు జనరల్గానే ఉన్నాయి. అయితే ఈ 11 శాసనసభ సెగ్మెంట్లలో అన్ని స్థానాల్లోనూ మహిళా ఓటర్లే అత్యధికంగా ఉండడం ప్రత్యేకం. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి మహిళా ఎమ్మెల్యేల ప్రాతినిథ్యం గణనీయంగా ఉండనుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 అసెంబ్లీ సెగ్మెంట్లతోపాటు నిజామాబాద్ లోక్సభ పరిధిలోకి వచ్చే కోరుట్ల, జగిత్యాల సెగ్మెంట్లలో సైతం అత్యధికంగా మహిళా ఓటర్లే ఉండడం విశేషం. కాగా నియోజకవర్గాల పునర్విభజన నేపథ్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రాజకీయ వర్గాలతోపాటు ఇతర అన్ని వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా నిజామాబాద్ నగరంలో ఓటర్ల సంఖ్య భారీగా ఉన్న నేపథ్యంలో డీలిమిటేషన్లో నగరాన్ని ఏవిధంగా విభజిస్తారనే దానిపై ప్రతిఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఉత్తర దక్షిణంగా విభజిస్తారా, తూర్పు పడమరగా విభజిస్తారా అనే విషయమై చర్చ జరుగుతోంది. ఏఏ మండలాలు ఏఏ నియోజకవర్గాల్లోకి మారతాయోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. -
యూరియా కోసం పడిగాపులు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): యూరియా ఎరువుల కోసం రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మృగశిరకార్తెకు ముందే పెద్ద వర్షాలు కురవడంతో రైతులు మొక్కజొన్న, పత్తి, సోయా విత్తనాలు వేశారు. విత్తనాలు మొలకెత్తడంతో యూరియా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. తాడ్వాయి సింగిల్విండోకు యూరియా వచ్చిందని తెలియడంతో గురువారం ఉదయమే రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గోదాము వద్ద రాళ్లు, చెప్పులు, వాటర్ బాటిళ్లు తదితర వస్తువులను క్యూలో ఉంచారు. అలాగే రైతు వేదిక కార్యాలయం వద్ద క్యూలో నిల్చున్నారు. రైతులందరికీ సరిపడా బస్తాలు వచ్చిన తరువాతే ఇస్తామని అధికారులు చెప్పడంతో వెళ్లిపోయారు. మరో లారీ వచ్చినట్లు తెలియడంతో రాత్రి వేళ మళ్లీ తరలివచ్చారు. దుప్పట్లు వెంట తీసుకువచ్చి సింగిల్ విండో ఎదుటే పలువురు రైతులు పడుకున్నారు. సరిపడా ఎరువులు తెప్పించాలని రైతులు డిమాండ్ చేశారు. -
అక్కాపూర్లో కబ్జా భూమి స్వాధీనం
మాచారెడ్డి: మండలంలోని అక్కాపూర్లో స్థానికులు సాగు చేస్తున్న ఫారెస్ట్ భూమిని గురువారం అటవీ శాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి, మాచారెడ్డి రేంజ్ పరిధిలోని అధికారులతో పాటు మాచారెడ్డి ఎస్సై అనిల్, పోలీస్ సిబ్బందితో వెళ్లి జేసీబీలు, ట్రాక్టర్లతో పొలం మడులను చదును చేశారు. ఈ సందర్భంగా మాచారెడ్డి ఎఫ్ఆర్వో దివ్య మాట్లాడుతూ..రైతులు సాగు చేస్తున్న భూమి మొత్తం అటవీ భూమేనని అన్నారు. గతంలో కూడా నాటిన మొక్కలను ధ్వంసం చేశామని, అప్పుడు కూడా రైతులపై కేసులు పెట్టామన్నారు. అక్కడ సాగు చేస్తున్న రైతులకు నోటీసులు జారీ చేసిన తర్వాతనే అటవీ భూమిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. 40 ఏళ్లుగా ఆ భూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, అధికారులు తమపై అనవసరంగా దౌర్జన్యం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతులు కామారెడ్డి డీఎఫ్వో నిఖితకు తమ భూములను అప్పగించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఎఫ్డీవో రామకృష్ణ, కామారెడ్డి ఎఫ్ఆర్వో రమేశ్, సిబ్బంది ఉన్నారు. -
ఆర్మూర్ నుంచి తిరుమలకు వెళ్లే జెండా
మీకు తెలుసా? ఆర్మూర్: పట్టణంలోని వేంకటేశ్వర (జెండా బా లాజీ)ఆలయం నుంచి తిరుమల వరకు పాదయాత్రగా తీసుకువెళ్లే జెండా పండుగను శ్రావణ మాసంలో ఆనవాయితీగా నిర్వహిస్తారు. ● 200 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న జెండా పండుగను తిరుపతికి వెళ్లలేని భక్తుల కోసం నిజాం నవాబుల కాలంలో అంకాపూర్ దొర గడ్డం వెంకట భూమారెడ్డి హయాంలో ప్రారంభించినట్లు ప్రతీతి. ● నిజాంలు జెండా పండుగ నిర్వహణకు ఎన్నో అడ్డంకులు కల్పించే వారని పెద్దలు చెబుతుంటారు. వాటిని అధిగమిస్తూ నేటికీ ఈ పండుగను, జాతరను భక్తులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ● జెండా జాతర కోసం తొమ్మిది రోజుల ముందు జెండా కర్రకు 20 మీటర్ల పట్టు బట్టలను ఆర్మూర్లో నేసి జెండాపై ఉంచి దానిపై ఓం గుర్తును పెడతారు. ● శ్రావణ శుద్ద తదియ రోజున జెండాను ప్రతి ష్ఠించిన అనంతరం తొమ్మిది రోజుల పాటు జెండాకు పూజలు నిర్వహిస్తారు. ● అనంతరం ఆర్మూర్లోని జెండా మందిరం నుంచి ఊరేగింపుగా జెండాను తీసుకెళ్లి అంకాపూర్ గ్రామస్తులకు అప్పగిస్తారు. ● అంకాపూర్లో శ్రావణ శుద్ద ఏకాదశి నుంచి భాద్రపద శుద్ద చవితి వరకు 22 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ● వినాయక చవితి తెల్లారి అంకాపూర్ గ్రామస్తులు జెండాను జక్రాన్పల్లి మండలం అర్గు ల్ వరకు తీసుకెళ్తారు. ఈ జెండాను గతంలో ముడుపులు కట్టి గ్రామంలో ఊరేగిస్తూ కాలి నడకన తిరుమల తిరుపతిలోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేర్చేవారు. ప్రస్తుతం వాహనంలో తరలిస్తున్నారు. -
కారు బోల్తా: ముగ్గురికి గాయాలు
వర్ని: మండలంలో ని కొనిపూర్ క్యాంప్ శివారులో గురు వారం జరిగిన రో డ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీ సులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. వర్ని వ్యవసాయ మా ర్కెట్ కమిటీ చైర్మన్ సురేష్తోపాటు పట్నం కుమా ర్, సాలె వెంకటి ముగ్గురు కలిసి కారులో హైదరాబాద్కు బయలుదేరారు. మార్గమధ్యలో కొనిపూర్ క్యాంప్ శివారులో వారి కారు అదుపుతప్పి ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొట్టి, పొలాల్లో బోల్తా పడింది. ఈ ఘటనలో కుమార్, వెంకటికి కాళ్లు విరగగా సురేష్కు స్వల్ప గాయాలు అయ్యాయి. వర్ని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిపై వీధి కుక్కల దాడి రాజంపేట: మండల కేంద్రంలో ఓ బాలుడిపై వీధి కుక్కల దాడిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరా లు ఇలా.. రాజంపేటలోని గడ్డమీది మహేష్, సంతోషిల కుమారుడు నిధ్విత్ (నాని)(6) బుధవారం సా యంత్రం ట్యూషన్ వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు రాగా కొద్ది దూరం వెళ్లగానే వీధి కుక్కల గుంపు దాడికి పాల్పపడ్డాయి. దీన్ని గమనించిన తల్లి సంతోషి కుక్కలను తరిమికొట్టేందుకు ప్రయత్నించగా ఆమె పైకి కూడా దాడి చేయడానికి యత్నించా యి. అప్పటికే పలువురు కాలనీవాసులు అక్కడికి చేరుకుని కుక్కలను తరిమికొట్టారు. అనంతరం బాలుడిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గ్రామంలో వీధి కుక్కల నియంత్రణపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. గుర్తుతెలియని వృద్ధురాలి ఆత్మహత్య ఖలీల్వాడి: నిజామాబాద్ రైల్వే పోలీస్స్టేషన్ పరిధిలో రైలు కింద పడి గుర్తు తెలియని వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్, ఎస్సై తెలిపిన వివరాలు ఇలా.. నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని కిలోమీటర్ నెంబర్ 460/10 వద్ద ఒక గుర్తు తెలియని వృద్ధురాలు జీవితంపై విరక్తి చెంది రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి వయస్సు సుమారు 60ఏళ్లు ఉంటాయని తెలిపారు. కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి వద్ద ఎలాంటి వివరాలు లభించలేదన్నారు. ఎవరికై నా ఆమె వివరాలు తెలిస్తే రైల్వే ఎస్సై 87126 58591కి సమాచారం ఇవ్వాలని తెలిపారు. -
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి అదృశ్యం
రెంజల్(బోధన్): మండలంలోని సాటాపూర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అదృశ్యమైనట్లు ఎస్సై చంద్రమోహన్ గురువారం తెలిపారు. గ్రామానికి చెందిన మేఘావత్ మోహన్, భార్య లక్ష్మీ, కూతురు శిరీషలు ఈనెల 14న తిరుపతికి దైవ దర్శనం నిమిత్తం నిజామాబాద్ రైల్యేస్టేషన్ నుంచి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ఇంటికి చేరుకోలేదు. దీంతో వారి కుటుంబసభ్యుడు రవీందర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వారి సమాచారం తెలిస్తే 87126 59782, 87126 59874 నంబర్లకు అందించాలని సూచించారు. -
అప్రమత్తతే రక్ష..!
బీబీపేట: వర్షాకాలం వచ్చిందంటే చాలు విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరుగతుంటాయి. వర్షాకాలంలో ప్రజలు, రైతులు విద్యుత్తో అప్రమత్తంగా ఉండకపోవడంతో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇళ్లు, పంట చేల వద్ద విద్యుత్ వినియోగంలో ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించినప్పటికీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రస్తుతం వ ర్షాకాలం సీజన్లో విద్యుత్తో బోరు బావులు, వా గుల వద్ద విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి పంటలు సాగు చేస్తారు. ఈ సమయంలో మోటార్ల వినియోగంలో రైతులు జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం బారి న పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. పొలాల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ● పంట పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద రైతులు చిన్న, చిన్న మరమ్మతులు చేస్తుంటారు. దీంతో ప్రమాదాలు జరుగుతుంటాయి. ● ట్రాన్స్ఫార్మర్ ఏబీ స్విచ్ పూర్తిగా నిలిచిపోకపోతే విద్యుత్ సరఫరా అయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేయాల్సి వస్తే విద్యుత్ సిబ్బందికి సమాచారం అందించాలి. ● ఇక విద్యుత్ మోటార్లు వాడే సమయంలో జాగ్రత్తలు అవసరం. ఒక ఫేజ్ కాలితే మోటార్ మొత్తానికి విద్యుత్ ప్రవహిస్తుంది. కాబట్టి ఆ సమయంలో మోటారుకు తగలకూడదు. మోటార్ పని చేయని సమయాల్లో చేతితో దానిని తాకకూడదు. ● టెస్టర్ ఉపయోగించి మాత్రమే మోటార్ను పరీక్షించాలి. ఎర్తింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. మోటార్పై రేకును అమర్చాలి. వర్షం పడితే తడవకుండా కాపాడుకోవాలి. ● అంతే కాకుండా పంట పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, స్లాటర్ బాక్స్ల చుట్టూ పిచ్చి మొక్కలు ఉండకుండా చూసుకోవాలి. వర్షాకాలం కాబట్టి వాటి చుట్టున్న మొక్కలులాంటివి ఉండడంతో విద్యుత్ సరఫరా అయి ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ● స్టార్టర్లకు రక్షణగా ఉండేందుకు కవర్లను ఉంచుకోవాలి. తెగిన విద్యుత్ తీగలతో జాగ్రత్తగా ఉండాలి. సర్వీసు తీగ తెగినప్పుడు గుడ్డ ముక్క తో అతికిస్తారు. ఇది చాలా ప్రమాదకరం. వీలైనంత వరకు తెగని తీగలను మాత్రమే వాడాలి. ● విద్యుత్ మోటార్ల వద్ద కింద పడి ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా ఉండకూడదు. తీగ ఎక్కడ చిన్నగా తెగినా నడిచేప్పుడు కాని స్విచ్ ఆన్ చేసే సమయంలో తగిలితే ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ● బోరుబావుల వద్ద పైపులు పైకి తీసే క్రమంలో పైన విద్యుత్ వైర్లు ఉన్నది గమనించకపోవడంతో ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అలా వైర్లు ఉన్నట్లయితే విద్యుత్ బంద్ చేసిన తర్వాతనే పైపులు తీయాలి. విద్యుత్ అధికారుల అవగాహన విద్యుత్ శాఖ అధ్వర్యంలో పొలం బాట కార్యక్రమం పేరిట ప్రతి గ్రామంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతుల పొలం వద్దకే వెళ్లి రైతులకు విద్యుత్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన కల్పిస్తూ పలు సలహాలు ఇస్తున్నారు. అంతే కాకుండా విద్యుత్ సమస్య తలెత్తినప్పుడు కచ్చితంగా విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలుపుతున్నారు. వర్షాకాలంలో అధికంగా విద్యుత్ ప్రమాదాలు చిన్న పొరపాటుతో ప్రాణాలు పోగొట్టుకుంటున్న రైతన్నలు అవగాహన లోపంతో గాల్లో కలుస్తున్న ప్రాణాలు జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి వర్షాకాలంలో ఇళ్లలో విద్యుత్తో జాగ్రత్తగా ఉండాలి. తడి చేతులతో విద్యుత్ పరికరాలను స్విచ్లను తాకకూడదు. ఇక పంట పొలాల వద్ద రైతులు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్టార్టర్ బాక్సులు, విద్యుత్ మోటార్ల వద్ద జాగ్రత్తలు పాటించాలి. విద్యుత్ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే స్వంతంగా మరమ్మతులు చేయకూడదు. సంబంధిత లైన్మన్ లేదా విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలి. – సుదర్శన్రెడ్డి, ఏడీఈ, దోమకొండ -
ఫిర్యాదుదారులతో బాధ్యతగా వ్యవహరించాలి
ఎస్పీ రాజేష్ చంద్ర నిజాంసాగర్(జుక్కల్): ఫిర్యాదుదారులతో బాధ్యతగా వ్యవహరించాలని, ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీస్ విధులు ఉండాలని ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర సూచించారు. గురువారం వార్షిక తనిఖీలో భాగంగా జుక్కల్ పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజాసమస్యలపైన వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా భరోసా కల్పించాలని, బాధితులకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్ని సంప్రదించవచ్చని అన్నారు. నేరాల నివారణే లక్ష్యంగా పని చేయాలని స్థానిక పోలీసులకు సూచించారు. విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి పెడుతూ, స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరుచూ సందర్శించాలన్నారు. పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నూతన టెక్నాలజీపై పోలీసులు అవగాహన పెంచుకోవాలన్నారు. సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. జుక్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని బ్యాంకులు, మందిరాలు, దేవాలయాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు, అలారంలు ఏర్పాటు చేయాలని ఎస్సైని ఆదేశించారు. పెండింగ్ కేసులపై రివ్యూ చేశారు. డీఎస్పీ విఠల్ రెడ్డి, బిచ్కుంద సీఐ నరేష్, జుక్కల్ ఎస్సై భువనేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
శతాధిక వృద్ధురాలు మృతి మాక్లూర్: మండలంలోని అమ్రాద్ తండాలో శతాధిక వృద్దురాలు దస్లీబాయి (105) గురువారం మృతి చెందారు. దీంతో తండాలోని పలువురు గిరిజనులు శోకసముద్రంలో మునిగిపోయారు. నాటితరం వృద్ధురాలైన దస్లీబాయి గిరిజన తెగ సంప్రదాయాలను విస్మరించకుండా కొనసాగించటంలో పట్టుదలతో ఉండేవారని తండావాసులు విషాదవదనంతో తెలిపారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులు గిరిజన సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు పూర్తిచేశారు. ఆమె కుమారులు, మనమలు, మునిమనుమళ్లు, మనుమరాళ్లు కడసారి వీడ్కోలు పలికారు. దస్లీబాయి భర్త బలరామ్నాయక్రెండు దశబ్ధాల క్రితమే మృతి చెందాడు. నగరంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి ఖలీల్వాడి: నగరంలోని రైల్వేస్టేషన్ మెయిన్గేట్ వద్ద మురికికాలువలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి గురువారం తెలిపారు. వివరాలు ఇలా.. ఈనెల 17న సాయంత్రం రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ పక్కన గల మురికి నాలాలో ఒక గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీస్ సిబ్బంది అక్కడకు చేరుకొని అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడిని పరిశీలించగా మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 50నుంచి55ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. మృతుడు తెలుపు రంగు, బ్లూకలర్ షర్ట్, గోధుమ కలర్ ప్యాంట్ ధరించినట్లు తెలిపారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. ఎవరికై నా అతడి సమాచారం తెలిస్తే ఎస్హెచ్వో ఫోన్ నెంబర్ 8712659714కు సమాచారం అందించాలన్నారు. ముప్కాల్ మండలంలో.. బాల్కొండ: ముప్కాల్ మండ లం నల్లూర్ గ్రామ ఊర చెరువులో గురువారం గుర్తు తెలి యని వ్యక్తి మృత దేహం లభ్యమైంది. ముప్కాల్ ఎస్సై రజనీకాంత్ తెలిపిన వివరాలు ఇ లా.. స్థానికులు చెరువులో మృతదేహం ఉన్నట్లు స మాచారమివ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతుడి వయస్సు సుమారు 30 నుంచి 35 ఏళ్ల మ ధ్య ఉంటాయన్నారు. అతడు బూడిద కలర్ ప్యాంట్, ఆకుపచ్చ రంగు షర్టు వేసుకున్నాడన్నారు. కేసు నమోదు చేసుకుని మృత దేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. -
కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలి
ఎల్లారెడ్డి: మండలంలోని మల్లయ్యపల్లిగేట్ వద్ద నిర్మిస్తున్న పోచారం కాలువ బ్రిడ్జి గుంతలో కారు పడిన ప్రమాదంలో మృతికి కారణమైన కాంట్రాక్టర్పై కఠిన చర్యలను తీసుకోవాలని మృతుల బంధువులు డిమాండ్ చేశారు. గురువారం బ్రిడ్జి నిర్మాణ ప్రదేశంలో రాస్తారోకో చేశారు. కారు ప్రమాదంలో లునావత్ పీర్యా, కెతావత్ పీర్యాలు మృతి చెందడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే కారు గుంతలో పడి ప్రమాదానికి గురైందని వారు ఆరోపించారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఎస్సై మహేష్, సీఐ రవీందర్నాయక్లు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని సముదాయించడంతో వారు రాస్తారోకో విరమించారు. -
గంజాయి రవాణా కేసులో ఇద్దరి అరెస్టు
మోర్తాడ్(బాల్కొండ): గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు భీమ్గల్ సీఐ సత్యనారాయణ గురువారం తెలిపారు. మోర్తాడ్ నుంచి దోన్పాల్ వెళ్లే మార్గంలో విశ్వసనీయ సమాచారంతో మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తనిఖీలు చేప ట్టారు. మోర్తాడ్కు చెందిన పిట్టల సంతోష్, వడ్యాట్లో నివాసం ఉంటున్న నెల్లూర్ జిల్లాకు చెందిన బకీర్ గిరిబాబులు గంజాయి రవాణా చేస్తున్నట్లు సందేహం వచ్చి పోలీసులు వారిని తనిఖీ చేశారు. వారి వద్ద 10 చిన్న ప్యాకెట్లలో రూ.5వేలు విలువ చేసే 100 గ్రాముల గంజాయి పట్టుకున్నారు. మరో కవర్లో రూ.7,500ల విలువ చేసే 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు, ట్రాలీ ఆటోను, రూ.8,600ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్సైలు విక్రమ్, అనిల్రెడ్డిలు పాల్గొన్నారు. -
వైద్యాధికారిపై దాడికి నిరసనగా ధర్నా
రామారెడ్డి: కామారెడ్డిలోని కల్కినగర్లో నివాసం ఉంటున్న రామారెడ్డి ప్రభుత్వ వైద్యాధికారి సురేష్ ఇంటికి ఈ నెల 17న రాత్రి వెళ్లి దాడి చేసిన దేవునిపల్లి పీహెచ్సీ డాటా ఎంట్రీ ఆపరేటర్(డీఈవో) రాజును సస్పెండ్ చేయాలని వైద్య సిబ్బంది గురువారం రామారెడ్డిలో ధర్నాకు దిగారు. వైద్య సిబ్బంది మాట్లాడుతూ.. దాడిలో రాజుతో పాటు జుక్కల్ ప్రభుత్వ ఆస్పత్రి జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహించే సుభాష్ ఇద్దరూ కలిసి పాల్గొన్నారని, అసభ్యకర పదజాలంతో తిడుతూ దాడి చేసినట్లు తెలిపారు. దాడి చేసిన సమయంలో 100కు డయల్ చేస్తే ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు స్పందించలేదని ఆరోపించారు. ఈ దాడిలో డాక్టర్ సురేష్కు స్వల్పంగా గాయాలయ్యాయని చెప్పారు. జిల్లా వైద్యాధికారులు, పోలీస్ అధికారులు, కలెక్టర్ స్పందించి దాడి చేసిన ఇద్దరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుండా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తామన్నారు. ఈ దాడిని రామారెడ్డి , ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల సిబ్బంది ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. -
‘మాదకద్రవ్యాల నియంత్రణకు కృషి చేయాలి’
కామారెడ్డి క్రైం: జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు కృషి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో బుధవారం నార్కొటిక్ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్ డీ అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈనెల 26 న అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన, చిత్ర లేఖన పోటీలను నిర్వహించాలన్నారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తయారు చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హన్మంతరావు, డీటీవో శ్రీనివాస్రెడ్డి, డీఈవో రాజు, డీఏవో తిరుమల ప్రసాద్, యాంటీ నార్కొటిక్ విభాగం డీఎస్పీ సోమనాథం, డీసీపీవో స్రవంతి తదితరులు పాల్గొన్నారు. -
రుణమాఫీ అంతేనా!?
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో పంట రుణాల మాఫీ కీలకమైనది. ఆ పార్టీనే అధికారంలోకి రావడంతో రుణ విముక్తులమవుతామని రైతులు ఆశించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత విధివిధానాల పేరుతో చాలా సమయం తీసుకుంది. కుటుంబం యూనిట్గా రూ. 2 లక్షల పంట రుణాలను మాఫీ చేస్తామంటూ కొర్రీలు పెట్టి అర్హుల జాబితాను కుదించింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపుదారులను అర్హుల జాబితా నుంచి తొలగించింది. చివరికి గతేడాది ఆగస్టులో మాఫీ ప్రక్రియ ప్రారంభించింది. ఆధార్, బ్యాంకు ఖాతా, పాస్బుక్లలో తప్పులు లాంటివి సరి చేసి నాలుగు విడతల్లో రూ. 2 లక్షలలోపు పంట రుణాలను మాఫీ చేసింది. వడ్డీతో కలిపి రూ. 2 లక్షల రుణం దాటినవారికి ఇప్పటికీ రుణమాఫీ వర్తించలేదు. అలాగే సాంకేతిక సమస్యలతో పలువురికి సంబంధించిన రూ.2 లక్షలలోపు రుణాలు కూడా మాఫీ కాలేదు. సగం మంది ఎదురుచూపులు.. రుణమాఫీ కటాఫ్ తేదీ నాటికి జిల్లాలో 1,98,374 మంది రైతులు వివిధ బ్యాంకుల్లో రుణాలు పొంది ఉన్నారు. ఇందులో మొదటి విడతలో 49,540 మందికి, రెండో విడతలో 24,816 మందికి, మూడో విడతలో 16,903 మందికి, నాలుగో విడతలో 8,942 మందికి రుణమాఫీ అయ్యింది. నాలుగు విడతల్లో కలిపి 1,00,201 మంది రైతులకుగాను రూ.717 కోట్లు రైతులకు అందాయి. మరో 98 వేల మంది రైతులకు నిరాశే మిగిలింది.సర్కారు స్పందించేనాకుటుంబం యూనిట్గా రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రూ. 2 లక్షలకుపైన ఉన్న మొత్తాన్ని రైతులు చెల్లిస్తే రుణమాఫీ చేస్తామని పేర్కొంది. దీంతో చాలామంది రైతులు రూ. 2 లక్షలకుపైన ఉన్న అప్పును తీర్చేశారు. అయినా సర్కారు వీరి విషయాన్ని పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షాలు సైతం ఈ సమస్యను పట్టించుకోకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. తమ పంట రుణాలను మాఫీ చేసి రుణ విముక్తులను చేయాలని కోరుతున్నారు.అధికారంలోకి వస్తే రూ. 2 లక్షలలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ.. పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. కుటుంబం యూనిట్గా తీసుకోవడం, ఇతర కారణాలతో జిల్లాలో సగం మందికి ప్రయోజనం దక్కలేదు. ఈ విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేదు. ప్రతిపక్షాలు సైతం ఈ సమస్యను పట్టించుకోవడం లేదు. దీంతో లబ్ధి చేకూరని రైతులు నిరాశ చెందుతున్నారు. – కామారెడ్డి క్రైం జిల్లాలో 98 వేల మందికి అందని లబ్ధి పట్టించుకోని సర్కారు.. పాలకులను నిలదీయని ప్రతిపక్షాలు నిరాశలో రుణమాఫీ కాని రైతులు -
‘సర్కారు బడిలోనే నాణ్యమైన విద్య’
బాన్సువాడ : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతోందని జిల్లా విద్యాధికారి రాజు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, నోటు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు ఉపయోగించుకోవాలన్నారు. బాగా చదివి ఉన్నత స్థానానికి చేరాలని సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి నాగేశ్వర్రావు, ప్రధానోపాధ్యాయురాలు సంతోషి, ఉపాధ్యాయులు సత్యనారాయణ, శంభ్యనాయక్, సురేందర్, హరిశ, సుజాత, జమున, సంగీత తదితరులు పాల్గొన్నారు. తాగు నీటి అవసరాలకు ‘సాగర్’ జలాలు నిజాంసాగర్: నిజామాబాద్, బోధన్, బాన్సువాడ పట్టణ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాల కోసం బుధవారం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఇరిగేషన్ గేట్ల ద్వారా ప్రధాన కాలువకు 1,200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రధాన కాలువకు విడుదల చేస్తున్న నీటిని డిస్ట్రిబ్యూటరి తూముల ద్వారా వృథా చేయకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. బెల్లాల్ చెరువుతో పాటు అలీసాగర్ రిజర్వాయర్ వరకు 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. మూడు రోజుల పాటు ప్రధాన కాలువ నీటి విడుదల కొనసాగనుంది. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు(17.8టీఎంసీలు) కాగా బుధవారం సాయంత్రం వరకు 1,393.78 అడుగుల(6.3 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. షబ్బీర్అలీని కలిసిన చంద్రశేఖర్రెడ్డి కామారెడ్డి టౌన్: టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన గడ్డం చంద్రశేఖర్రెడ్డి బుధవారం హైదరాబాద్లో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిశారు. ఆయనను సన్మానించారు. అలాగే ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు మదన్మోహన్రావు, లక్ష్మీకాంతారావులను కలిసి సన్మానించారు. ఆయన వెంట మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, మాజీ కౌన్సిలర్లు, నాయకులు రవి, శ్రీనివాస్, పాత శివకృష్ణమూర్తి, చాట్ల వంశి, మమత, సాయిబాబా, సలీం, రమే ష్, మహేష్, ప్రసాద్ తదితరులున్నారు. మంత్రిని కలిసిన డీసీసీ అధ్యక్షుడు కామారెడ్డి టౌన్: రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామిని బుధవారం డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్రావు హైదరాబాద్లో కలిశారు. ఆయనను సత్కరించారు. ఆయన వెంట జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ ఉన్నారు. దోస్త్ ప్రత్యేక కేటగిరి ధ్రువపత్రాల పరిశీలనతెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో దోస్త్ ఆన్లైన్ డిగ్రీ ప్రవేశాలకు 2025–26 విద్యాసంవత్సరానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రత్యేక కేటగిరి విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను బుధవారం పరిశీలించినట్లు కో ఆర్డినేటర్ చంద్రశేఖర్ తెలిపారు. వర్సిటీ అడ్మిషన్స్ కార్యాలయంలో ధ్రువపత్రాలను పరిశీలించారు. ప్రత్యేక కేటగిరీ పీహెచ్సీ, సీఏపీ, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్కు సంబంధించి ఎన్సీసీలో ఆరుగురు, స్పోర్ట్స్లో ముగ్గురు, సీఏపీలో ముగ్గురు విద్యార్థులు హాజరైనట్లు ఆయన తెలిపారు. -
గది ఒకటి.. తరగతులు రెండు
రామారెడ్డి : శిథిలావస్థకు చేరిన భవనాలను తొలగించిన అధికారులు.. అవసరమైన తరగతి గదుల నిర్మాణంపై దృష్టి సారించలేదు. దీంతో ఒకే గదిలో రెండు రెండు తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాలకుల నిర్లక్ష్యంతో రామారెడ్డి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. రామారెడ్డి జిల్లా పరిషత్ బాలుర పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో కొన్ని గదులను తొలగించారు. ప్రస్తుతం 5 గదులు మాత్రమే ఉన్నాయి. ఇందులో ఒక గదిని స్టాఫ్ రూంగా వినియోగిస్తుండగా.. మరో గదిని కంప్యూటర్ ల్యాబ్తోపాటు క్రీడా సామగ్రి నిల్వ చేయడానికి ఉపయోగిస్తున్నారు. దీంతో మిగిలిన మూడు గదుల్లో ఐదు తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం 6, 7 తరగతులు ఒక గదిలో, 9. 10 తరగతులు మరో గదిలో నిర్వహిస్తున్నారు. గతేడాది పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నారు. తొమ్మిదో తరగతిలో 13 మంది, పదో తరగతిలో 20 మంది విద్యార్థులు ఉండడంతో ఒకే తరగతిలో అల్మారాలు అడ్డుపెట్టి పాఠాలు బోధించారు. అయితే ఈసారి తొమ్మిదో తరగతిలో అడ్మిషన్లు పెరిగాయి. పదో తరగతిలో 12 మంది విద్యార్థులే ఉన్నా.. తొమ్మిదో తరగతిలో 40 మంది విద్యార్థులున్నారు. దీంతో ఒకే గదిలో రెండు తరగతులకు పాఠాలు బోధించడం ఇబ్బందికరంగా మారింది. రెండు తరగతి గదులు నిర్మిస్తే సమస్య పరిష్కారమవుతుంది. ప్రాథమిక పాఠశాలలోనూ తరగతి గదుల కొరత ఉంది. పాలకులు స్పందించి వెంటనే తరగతి గదులు మంజూరు చేయించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అదనపు గదులు నిర్మించాలి పాఠశాలలో తరగతి గదుల కొరత ఉంది. ఐదు తరగతులకు మూడే గదులున్నాయి. దీంతో 6, 7 తరగతులు ఒక గదిలో, 9, 10 తరగతులు మరో గదిలో నిర్వహిస్తున్నాం. అదనపు తరగతి గదులు నిర్మిస్తే సమస్య ఉండదు. – ఆనంద్, హెచ్ఎం, రామారెడ్డి హైస్కూల్ ఒకదాంట్లో 6, 7, మరొకదాంట్లో 9, 10 తరగతుల నిర్వహణ రామారెడ్డి హైస్కూల్లో ఇబ్బందిపడుతున్న విద్యార్థులు అదనపు గదులు నిర్మించాలని కోరుతున్న తల్లిదండ్రులు -
త్వరగా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలి
బాన్సువాడ : ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. బుధవారం పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి కలెక్టర్ భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. ఇంకా నిర్మాణాలు ప్రారంభించని వారు త్వరగా పనులు మొదలుపెట్టాలని సూచించారు. కలెక్టర్ దృష్టికి సమస్య.. బీడీ వర్కర్స్ కాలనీలో కలెక్టర్ భూమి పూజ చేసిన ఇందిరమ్మ లబ్ధిదారుడి ప్లాట్లో ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఈ విషయాన్ని లబ్ధిదారు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ట్రాన్స్కో అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం పాత బాన్సువాడ సహకార సంఘంలోని రేషన్ దుకాణంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. సన్న బియ్యం పంపిణీ ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమాలలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, ప్రత్యేకాధికారి రాజు, డీఎల్పీవో సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
‘బ్యాంకు రుణాలు ఇప్పించాలి’
కామారెడ్డి టౌన్: అధిక వడ్డీల భారంనుంచి రైతులను తప్పించడానికి బ్యాంకుల ద్వారా రుణాలు పొందేలా చూడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.నాగరాణి వ్యవసాయ అధికారులకు సూచించారు. బుధవారం చిన్నమల్లారెడ్డి రైతు వేదికలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, వ్యవసాయ శాఖలు కలిసి బ్యాంక్ అధికారులతో రైతులకు రుణాల మార్పిడి, మంజూరుపై న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ అవగాహన లోపంతో రైతులు అధిక వడ్డీలకు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేస్తున్నారన్నారు. దీనివల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొని ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. రైతులు బ్యాంకుల్లో రుణాలు పొందడానికి వ్యవసాయ అధికారులు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూపరింటెండెంట్ చంద్రసేన్రెడ్డి, ఏడీఏ అపర్ణ, ఏవోలు, ఏఈలు, బ్యాంక్ అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
అమ్మా.. ఆరోగ్యం బాగుందా?
నస్రుల్లాబాద్: ‘‘అమ్మా ఆరోగ్యం బాగుందా?’’ అంటూ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ నెమ్లి వెల్నెస్ సెంటర్లోని రోగులను పలకరించారు. వారి ఆరోగ్య సమస్యలు తెలుసుకున్నారు. బుధవారం ఆయన వెల్నెస్ సెంటర్ను తనిఖీ చేశారు. వైద్యులు అందిస్తున్న సేవలను గమనించారు. సిబ్బంది సమయ పాలన పాటించాలన్నారు. మందులకు సంబంధించిన స్టాక్ రిజిస్టర్ సరిగా లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలతో మాట్లాడి వెల్నెస్ సెంటర్లో అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. ఆయన వెంట సబ్కలెక్టర్ కిరణ్మయి, డీఎంహెచ్వో చంద్రశేఖర్, ఎంపీడీవో సూర్యకాంత్, ఆరోగ్య శాఖ సిబ్బంది రవీందర్, సుశీల, స్రవంతి ఉన్నారు. రెవెన్యూ సదస్సులో.. భూ సమస్యలను పరిష్కరించడానికే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. బుధవారం నెమ్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును ఆయన పరిశీలించారు. దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి భూ సర్వే చేపట్టి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఆయన వెంట సబ్కలెక్టర్ కిరణ్మయి, మండల ప్రత్యేకాధికారి దయానంద్, తహసీల్దార్ సువర్ణ, ఆర్ఐ వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్పీఏ తగ్గింపునకు మరింత కృషి చేయాలి
సుభాష్నగర్ : బ్యాంకు నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) తగ్గింపునకు మరింత కృషి చేయాలని ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. నగరంలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ రమేశ్ రెడ్డి శాఖ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్రాంచీల వారీగా పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం (2024–25) ఫలితాలు అందరి కృషికి నిదర్శనమన్నారు. రాష్ట్రస్థాయిలో ఎన్డీసీసీబీ అన్నిరంగాల్లో వెనకబడిపోయిందనే పేరు ఉందని, ప్రస్తుత ఫలితాలతో ఆ పేరు తొలగిపోయిందని హర్షం వ్యక్తంచేశారు. ఎన్పీఏను గణనీయంగా తగ్గించేందుకు శాఖ అధికారులు, సిబ్బంది అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతి ఉద్యోగి తనకు తానుగా లక్ష్యాన్ని ఏర్పర్చుకొని ఆ దిశగా ప్రయత్నం చేయాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా ఇవే ఫలితాలు పునరావృతం కావాలని ఆశాభావం వ్యక్తంచేశారు. తద్వారా బ్యాంకు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంటూ రాష్ట్రస్థాయిలో పూర్వవైభవాన్ని, శోభను కీర్తిస్తుందని తెలిపారు. ఇంతటి ఘనతను విశేషంగా కృషి చేసి, రోజూవారీ కార్యక్రమాల్లో మార్గనిర్దేశం చేసిన ఉన్నతాధికారులను అభినందించి, సీఈవో నాగభూషణం వందే, ఎస్సీడీఆర్ వసంతను శాలువాతో సన్మానించారు. వివిధ విభాగాలు (గృహతార, స్వర్ణరత్న, రికవరీ చాంపియన్)లో ఉత్తమ ప్రతిభ చూపిన శాఖాధికారులకు జ్ఞాపికతోపాటు నగదు బహుమతి అందజేశారు. సమావేశంలో సీనియర్ బ్యాంకు అధికారులు లింబాద్రి, గజానంద్, అనుపమ, సుమమాల, 63 శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి బ్యాంకు సిబ్బందికి అభినందనలు -
ప్రైవేట్ వద్దు.. సర్కారే ముద్దు
మాచారెడ్డి: ప్రైవేట్ వద్దు.. సర్కార్ బడి ముద్దు అంటూ పాల్వంచ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో చేరడానికి విద్యార్థులు క్యూ కడుతున్నారు. ఈ పాఠశాలలో ఐదు రోజుల్లోనే వంద మంది అడ్మిషన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోవర్ధన్రెడ్డి తెలిపారు. ఈ విద్యాసంవత్సరంలో వంద అడ్మిషన్లు అయిన సందర్భంగా బుధవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఎం మాట్లాడుతూ కొత్తగా అడ్మిషన్ తీసుకున్న వారితో కలిపి మొత్తం విద్యార్థుల సంఖ్య 591కి చేరిందన్నారు. ప్రస్తుతం పదో తరగతిలో 130 మంది విద్యార్థులున్నారన్నారు. 6 నుంచి 9 వ తరగతి వరకు అడ్మిషన్లు తీసుకుంటున్నామని, మరో వంద మంది వరకు చేరే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులతో గుణాత్మక విద్యను అందిస్తున్నందునే తమ బడిలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాల్రాజు, మల్లేష్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. పాల్వంచ హైస్కూల్కు అడ్మిషన్ల వెల్లువ ఐదు రోజుల్లో వంద మంది విద్యార్థుల చేరిక -
బ్రిడ్జి గుంతలో పడిన కారు
ఎల్లారెడ్డిరూరల్: మల్లయ్యపల్లి శివారులో పోచారం ప్రధాన కాలువపై నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి గుంతలో కారు ప్రమాదవశాత్తూ పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నర్సింగ్రావుపల్లి తండాకు చెందిన పీర్యా తన కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం రాత్రి నిజామాబాద్ జిల్లా పెద్దగుట్టకు కారులో వెళ్తుండగా మల్లయ్యపల్లి వద్ద పోచారం కాలువ బ్రిడ్జి నిర్మాణ గుంతలో పడింది. పెద్దగుట్టలో శుక్రవారం రోజున కందూరు చేసుకునేందుకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా పీర్యా తన తమ్ముడు వేణుతో పాటు ఇద్దరు కుమారులు సోను, ప్రవీణ్లతో పాటు డ్రైవర్ను వెంట తీసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో డ్రైవర్ పీర్యా(32) అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు 108కు సమాచారం అందించడంతో నలుగురిని ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. ఆస్పత్రిలో పీర్యా(35) మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వేణు, సోను, ప్రవీణ్ల పరిస్థితి సైతం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తాడ్వాయి బాలికల గురుకుల పాఠశాలలో యోగా చేస్తున్న విద్యార్థులు ప్రమాదంలో ఇద్దరు మృతి ముగ్గురి పరిస్థితి విషమం -
ప్రభుత్వ పాఠశాలల్లో మెరిసి..
దోమకొండ: ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పేదరికంలో పెరిగి ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించి నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు దోమకొండ మండల కేంద్రానికి చెందిన పలువురు యువతీ యువకులు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల, బాలుర పాఠశాలల్లో వీరు చదివారు. బీడీ కార్మిక కుటుంబాల నుంచి స్కాలర్షిప్ల సాయంతో చదువులు కొనసాగించారు. చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించారు. పదవ తరగతితో పాటు ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో వీరు విద్యనభ్యసించి మంచి ప్రతిభ చూపారు. వీరి ప్రతిభను గుర్తించిన హైద్రాబాద్కు చెందిన లైఫ్ ఎన్జీవో సంస్థ స్కాలర్షిఫ్ అందించి డిగ్రీ అనంతరం వీరికి సంస్థ ఆద్వర్యంలో ఉచిత శిక్షణ ఇచ్చారు. అనంతరం వీరు పలు ఇంటర్వ్యూలకు హాజరు కాగా, డిగ్రీ చదువుతో కార్పొరేట్ కంపెనీల్లో మండలానికి చెందిన పలువురు యువతీ యువకులు ఉద్యోగాలు సాఽధించారు. బీడీ కార్మిక, నిరుపేద కుటుంబాలకు చెందిన వీరు కార్పొరేట్ సంస్థలో ఉద్యోగాలు సాధించి పుట్టిన ఊరితో పాటు పలువురికి ఆదర్శంగా నిలిచారు. హైబ్రాబాద్లో లైఫ్ ఎన్జీవో సంస్థను దోమకొండకు చెందిన దేవరగట్టు బాలప్రసాద్ నిర్వహిస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన, ప్రతిభ ఉన్న యువతీ యవకులకు ఉచిత శిక్షణ ఇచ్చి కార్పొరేట్ కంపెనీలకు ఇంటర్వ్యూలకు పంపిస్తారు. బాల ప్రసాద్ తన మిత్రులతో కలిసి లైఫ్ ఎన్జీవో సంస్థను 2017 ఏర్పాటు చేశారు. ప్రతిభ ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి స్కాలర్షిప్ను సైతం అందిస్తూ ప్రోత్సహించి డిగ్రీ అనంతరం శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాల్లో అండగా నిలుస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధిస్తున్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న వైనం లైఫ్ ఎన్జీవో సంస్థ ద్వారా ఉచిత శిక్షణ -
కరెంట్ షాక్తో ఒకరి మృతి
ఇందల్వాయి: కోతులను తరిమే క్రమంలో విద్యుత్ తీగలు తగిలి ఒకరు మృతి చెందిన ఘటన మండలంలోని గంగారాం తండాలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్ నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన భగవాన్లాల్ గంగారం తండాలో అద్దె ఇంట్లో ఉంటూ ఐస్క్రీమ్ తయారు చేసి గ్రామాల్లో విక్రయించేవాడు. బుధవారం ఐస్క్రీమ్లు తయారు చేస్తుండగా కోతులు గుంపుగా రావడంతో ఐరన్ పైప్ తీసుకొని బిల్డింగ్ పైకి వాటిని తరిమే క్రమంలో పైపు 11 కేవీ విద్యుత్ తీగలకు తగలడంతో భగవాన్లాల్ అక్కడిక్కకడే మృతి చెందాడు. భార్య మంజులా దేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పిచ్చికుక్కల దాడి.. 13 మందికి గాయాలు ధర్పల్లి: ధర్పల్లి మండల కేంద్రంతోపాటు దమ్మన్నపేట గ్రామంలో బుధవారం పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. రెండు గ్రామాల్లో కనిపించిన వారిని కనిపించినట్లే కరుస్తూ వెళ్లాయి. పిచ్చికుక్కల దాడిలో 13 మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులకు ధర్పల్లి ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. దమ్మన్నపేటలో ఇద్దరు చిన్నారుల ముఖంపై తీవ్రగాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అధికారులు స్పందించి గ్రామాల్లో పిచ్చికుక్కల బెడదను అరికట్టాలని గ్రామస్తులు కోరారు. -
అదృశ్యమైన యువకుడు..
మాక్లూర్ : పొలానికి వెళ్లొస్తానని చెప్పి మంగళవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని అడవిమామిడిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం.. అడవిమామిడిపల్లికి చెందిన గంగోనె హరీశ్(34) మంగళవారం ఉదయం పొలానికి వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బైక్పై వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు అదే రోజు రాత్రి హరీశ్ కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం సాయంత్రం స్థానికంగా ఉన్న అటవీ ప్రాంతంలో హరీశ్ ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పశువుల కాపర్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతుడి కుటుంబసభ్యుడైన నారాయణ ఫిర్యాదు మేరకు పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. హరీశ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని వివరించారు. గుండెపోటుతో ఒకరి మృతి గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని నాగ్లూర్ గ్రామానికి చెందిన కంది సంజీవులు(32) గుండెపోటుతో బుధవారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సంజీవులు ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పడంతో బంధువులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో మూడు రోజుల జైలు మోపాల్: మద్యం సేవించి వాహనం నడిపిన ఒకరికి కోర్టు మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు. డిచ్పల్లి మండలంలోని ఘన్పూర్కు చెందిన మహ్మద్ నయీమ్ మద్యం సేవించి వాహనం నడుపుతూ మోపాల్ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో అతడిని బుధవారం కోర్టులో హాజరుపర్చగా ప్రత్యేక ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి నూర్జహాన్ బేగం మూడు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. -
క్రైం కార్నర్
వివాహిత ఆత్మహత్య రెంజల్(బోధన్): మండలంలోని వీరన్నగుట్ట గ్రా మానికి చెందిన వివాహిత ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. గ్రామానికి చెందిన భువనేశ్వరి(40) మానసిక పరిస్థితి బాగోలేక బాత్రూంలోని ఇనుప పైపులకు ఉరేసుకుని మంగళవా రం రాత్రి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబీకులు వెంటనే నిజామాబాద్లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో భువనేశ్వరి మృతి చెందింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. చెరువులో పడి మరొకరు.. రుద్రూర్: పోతంగల్ మండల కేంద్రానికి చెందిన సూదం గంగామణి (52) స్థానిక చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై సునీల్ తెలిపారు. భర్త మందలించాడని మనస్తాపంతో మంగళవారం ఇంట్లో నుంచి వెళ్లిపోయిన గంగామణి బుధవారం పోతంగల్ గ్రామ చెరువులో మృతదేహమై కనిపించింది. కొడుకు సతీశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
డివిజన్లోనే మొదటి ప్రభుత్వ కాలేజీ
మీకు తెలుసా? ఆర్మూర్ డివిజన్లో మొట్టమొదటి ప్రభుత్వ జూనియర్ కళాశాల పిప్రి రోడ్లో ఏర్పాటు చేశారన్న విషయం ఎంతమందికి తెలుసు? ● 1969లో పిప్రి రోడ్డులో నెలకొల్పిన ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనే జూనియర్ కళాశాలను సైతం నిర్వహించే వారు. ● 1996లో డిగ్రీ కళాశాల నుంచి వేరు చేస్తూ బాలుర జూనియర్ కళాశాలను పిప్రి రోడ్లో, బాలికల జూనియర్ కళాశాలను ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ● 2016 విద్యా సంవత్సరంలో పిప్రి రోడ్లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలను కో ఎడ్యుకేషన్ కళాశాలగా ప్రభుత్వం మార్చింది. ● ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను మాత్రం బాలికల కళాశాలగానే నిర్వహిస్తున్నారు. ● అదే సమయంలో ఆర్మూర్ పట్టణంలో ప్రైవేటు జూనియర్ కళాశాలలను పెద్ద ఎత్తున స్థాపించడంతోపాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లడానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో క్రమంగా బాలుర జూనియర్ కళాశాలలో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం మానేశారు. ● ప్రస్తుతం ఈ కళాశాలలో తెలుగు మీడియంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఇంగ్లిష్ మీడియంలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులతోపాటు కన్స్ట్రక్షన్ టెక్నాలజీ ఒకేషనల్ కోర్సును నిర్వహిస్తున్నారు. – అడ్మిషన్ల కోసం కళాశాల ప్రిన్సిపల్ విజయానంద్ రెడ్డిని 94408 27986 నంబర్లో సంప్రదించవచ్చు. – ఆర్మూర్ -
మోసపూరిత మాటలను నమ్మొద్దు
నిజాంసాగర్(జుక్కల్): అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని పిట్లం ఏఎంసీ చైర్మన్ చీకోటి మనోజ్కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ అన్నారు. బుధవారం మాగి గేటు వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మాజీ జెడ్పీటీసీ జయప్రదీప్ మాటలను ప్రజలు నమ్మవద్దన్నారు. స్తానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు జుక్కల్ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారన్నారు. నాయకులు ప్రజా పండరి, గుర్రపు శ్రీనివాస్, లక్ష్మయ్య, బాల్సాయిలు, తదితరులున్నారు. మోదీ పథకాలను ప్రజలకు వివరించాలి దోమకొండ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమలు చేసిన, చేస్తోన్న పథకాల గురించి ప్రజలకు వివరించాలని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్చార్జి కుంట లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం దోమకొండలో కార్యకర్తల సమావేశం నిర్వహించి మాట్లాడారు. అనంతరం గ్రామ బీజేపీ అధ్యక్షుడిగా ముత్తి బుచ్చి రాజును ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, కార్యదర్శి అంజిరెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు నరేందర్రెడ్డి, నేతలు మహేందర్గౌడ్, తిరుపతిరెడ్డి మహేందర్రెడ్డి, తదితరులున్నారు. -
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు
బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పెద్దకొడప్గల్/బిచ్కుంద(జుక్కల్): భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. బుధవారం బిచ్కుంద, పెద్దకొడప్గల్ మండలాలలో నిర్వహించిన సదస్సులలో సబ్ కలెక్టర్ పాల్గొని పరిశీలించి మాట్లాడారు. భూ భారతితో ఎన్నో భూముల సమస్యలు పరిష్కరించారని తెలిపారు. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా దరఖాస్తు పెట్టుకున్న వెంటనే అధికారులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టి సమస్యలు పరిష్కరిస్తారని తెలిపారు. బిచ్కుందలో 141, పుల్కల్లో 209 మంది రైతులు దరఖాస్తులు పెట్టుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జునప్ప షెట్కార్, డీసీసీబీ మాజీ డైరెక్టర్ వెంకట్రెడ్డి, తహసీల్దార్ వేణుగోపాల్, డీటీ భరత్.. పెద్దకొడప్గల్లో తహసీల్దార్ దశరథ్, నాయబ్ తహసీల్దార్ రవి కాంత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా యోగా దినోత్సవం
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో యోగాసనాలు వేయించారు. యోగా టీచర్లు చైతన్య, స్రవంతి, అజయ్, ప్రిన్స్ప ల్ సురేఖ, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మర్కల్ స్టేజీ వద్ద గల మహిళా డిగ్రీ గురుకుల కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా డే నిర్వహించారు. ఈ సందర్భంగా యోగ శిక్షకురాలు భార్గవి మాట్లాడుతూ...ప్రతి విద్యార్థి చదువుతో పాటు యోగా నేర్చుకోవాలన్నారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. సదాశివనగర్ ఆయుశ్ వైద్యాధికారి నాహిద, కళాశాల ప్రిన్సిపాల్ శోభారాణి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
‘కొత్త పెన్షన్ చట్టాన్ని వ్యతిరేకించాలి’
కామారెడ్డి అర్బన్: పార్లమెంట్ ఆమోదంతో ముందుకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ కొత్త పెన్షన్ చట్టం పెన్షనర్ల జీవితాలపై ఆశనిపాతం కానున్నందున.. దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర సలహాదారుడు జి.లచ్చయ్య పిలుపునిచ్చారు. బుధవారం అసోసియేషన్ జిల్లా సమావేశం స్థానిక కర్షక్ బీఎడ్ కళాశాలలో జరిగింది. లచ్చయ్య మాట్లాడుతూ..నూతన పెన్షన్ వచ్చే జనవరి 1 నుంచి రిటైర్డ్ అయ్యే వారికి వర్తిస్తుందన్నారు. కొత్త చట్టం అమలు నిలిపివేయాలని దేశ వ్యాప్తంగా సంతకాల ఉద్యమం చేపట్టి ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేయనున్నట్టు పేర్కొన్నారు. అనంతరం పెన్షన్ వివరాల కరపత్రాలను అందించారు. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి విజయరామరాజు, ఉపాధ్యక్షులు శంకరయ్య, ప్రతినిధులు రవీందర్, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు. -
రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
ఎల్లారెడ్డి: రైతులు భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ విక్ట ర్ అన్నారు. బుధవారం అన్నాసాగర్లో నిర్వహిస్తు న్న సదస్సును ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు ఎలాంటి భూసమస్యలున్నా భూభారతి రెవెన్యూ సదస్సులలో దరఖాస్తులను అందించాలని సూచించారు. అనంతరం రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. తహసీల్దార్ ప్రేమ్కుమార్ తదితరులున్నారు. గుజ్జుల్ తండాలో..గాంధారి(ఎల్లారెడ్డి): రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. బుధవారం ఆయన గుజ్జుల్ తండాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి ఎల్లారెడ్డిరూరల్: అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. బుధవారం అన్నాసాగర్ గ్రామ అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న పోషకాహారం వివరాలను చిన్నారులను అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ ప్రేమ్కుమార్, అంగన్వాడి టీచర్ దుర్గ తదితరులున్నారు. -
పేదరికం అడ్డుకాకూడదని..
2017లో లైఫ్ ఎన్జీవో సంస్థను ఏర్పాటు చేశాం. దోమకొండతో పాటు తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో చదువులో ప్రతిభ కనబర్చిన పేదలకు సహాయం అందించాం. గత రెండేళ్లలో 468 మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం లైఫ్ ఎన్జీవో తరపున ఉచితంగా శిక్షణ ఇచ్చాం. గ్రామీణ ప్రాంత పేద కుటుంబాల వారు చదువుతోనే తమ భవిష్యత్తును మార్చుకుని నేటి యువతకు ఆదర్శంగా ఉండాలనేది నా కోరిక. – బాలప్రసాద్, లైఫ్ ఎన్జీవో ప్రతినిధి, హైదరాబాద్ -
బైక్పై నుంచి పడి వ్యక్తికి తీవ్రగాయాలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన వేదపండితుడు దిగంబర శర్మ బుధవారం సాయంత్రం బైక్పై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. కాగా, దిగంబర శర్మ బైక్పై నుంచి పడడానికి జాతీయ రహదారి పనులు చేపడుతున్న కార్మికుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. గోపాల్పేట నుంచి మాల్తుమ్మెదకు దిగంబర శర్మ వెళ్తుండగా మాల్తుమ్మెద గేట్ సమీపంలో జాతీయ రహదారి పనులు చేపట్టిన కార్మికులు తారురోడ్డు ముక్కలను తొలగించి విసిరేసే క్రమంలో కొన్ని ముక్కలు ఆయన బైక్కు తగిలాయి. దీంతో బైక్పై నుంచి కిందపడిన ఆయన తలకు తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న స్థానికులు ఆయనను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో మెదక్ తరలించగా అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కుటుంబీకులు హైదరాబాద్ తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన కేసీపీ కార్మికుల తీరును నిరసిస్తూ స్థానిక నాయకులు ఆందోళనకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్సై మల్లారెడ్డి అక్కడికి చేరుకొని వారిని సముదాయించారు. కేసీపీ జనరల్ మేనేజర్ రాంరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొగా స్థానిక నాయకులు ప్రతాప్రెడ్డి, వెంకట్రెడ్డి, హన్మంత్రెడ్డి తదితర నాయకులు ఆయనను నిలదీశారు. సంస్థ ఉన్నతాధికారులతో మాట్లాడి బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని రాంరెడ్డి హామీ ఇచ్చారు. రోడ్డు పనుల్లో నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళనకు సిద్ధమైన గ్రామస్తులు -
‘మా పాఠశాలను దొంగల బారి నుంచి కాపాడండి’
రాజంపేట: తమ పాఠశాలను దొంగలబారి నుంచి కాపాడాలని కోరుతూ రాజంపేట బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం ఈశ్వరయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలలో ఉన్న ఓ బాత్ రూం డోరును రెండు రోజుల క్రితం గుర్తు తెలియని దుండగులు అపహరించగా మంగళవారం రాత్రి మరో బాత్రూం డోరు సైతం అపహరణకు గురైందని తెలిపారు. అలాగే పాఠశాల ఆవరణలో ఉన్న నల్లాల ట్యాబ్లు పలుమార్లు చోరీకి గురైనట్లు పేర్కొన్నారు. పాఠశాల ఆస్తులను కాపాడుకోవడంలో స్థానిక ప్రజాప్రతినిధులు, యువత, పిల్లల తల్లిదండ్రులు సహకారం అందించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. చోరీ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. -
డిగ్రీ దోస్త్లో ఆర్ట్స్ కళాశాలను ఎంపిక చేసుకోండి
కామారెడ్డి అర్బన్: డిగ్రీలో ప్రవేశాలకు దోస్త్ మూడవ దశలో ఎంపికవ్వడానికి 19న చివరి అవకాశం ఉన్నందున విద్యార్థులు కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (స్వయంప్రతిపత్తి)ను తొలి ప్రాధాన్యతగా ఎంపిక చేసుకుని నాణ్యమైన విద్య పొందాలని ప్రిన్సిపల్ కె.విజయ్కుమార్ సూచించారు. బుధవారం ఆయన ప్రకటన చేశారు. కళాశాలలో మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందే బీబీఏ, బీఎస్సీ హెల్త్కేర్ మెనేజ్మెంట్, బీఎస్సీ కంప్యూటర్స్ హానర్స్ లాంటి కోర్సులున్నాయని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. మొక్కలు సిద్ధం చేయాలి లింగంపేట(ఎల్లారెడ్డి): వనమహోత్సవం కార్యక్రమానికి స్థలాలు ఎంపిక చేసుకొని మొక్కలు నాటడానికి నర్సరీల్లోని మొక్కలు సిద్ధం చేసుకోవాలని ఎంపీడీవో నరేష్ సూచించారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయించాలని సూచించారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరై నిర్మాణాలు చేపట్టని వారి నుంచి, ఇల్లు నిర్మించుకోవాలని ఆసక్తి లేని వారి నుంచి లెటర్లు తీసుకోవాలన్నారు. వర్షాలు కురుస్తున్నందున గ్రామాల్లో పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగించాలని సూచించారు. ఎంపీవో మలహరి, ఏపీవో నరేందర్, తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటిన బీజేపీ నాయకులు బాన్సువాడ: బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన సంకల్ప సభలో భాగంగా బుధవారం బాన్సువాడలో బీజేపీ నాయకులు మొక్కలు నాటారు. పట్టణంలోని రామాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చినరాజులు మొక్కలు నాటి మాట్లాడారు. గత 11 ఏళ్ల కాలంలో మోదీ నాయకత్వంలో అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి చెందుతోందని అన్నారు. కేంద్ర పథకాలు ప్రతీ పౌరుడికి చేరడమే ధ్యేయంగా పని చేయాలని సూచించారు. బీజేపీ నాయకులు కోనాల గంగారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శ్రీనివాస్, శంకర్గౌడ్, లక్ష్మీనారాయణ, చిదరి సాయిలు, కొండని గంగారం, చీకట్ల రాజు, అనీల్, భాస్కర్రెడ్డి, వెంకట్ తదితరులున్నారు. రైతుల ఖాతాల్లో రూ.17.36 కోట్ల జమ బాన్సువాడ: బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాలకు చెందిన 27,536 మంది రైతులకు బుధవారం వరకు రూ.17.36 కోట్ల మేరకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయని బాన్సువాడ ఏడీఏ అరుణ తెలిపారు. రైతులు అప్పుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా ఉండేందుకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించిందని ఆమె సూచించారు. సదాశివనగర్ పరిధిలో రూ.9.66 కోట్లు సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 13,158 మంది రైతులకు రైతుభరోసా కింద డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ఏవో ప్రజాపతి తెలిపారు. రూ.9కోట్ల 66లక్షల 31వేల 618లను జమ చేసినట్లు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి లింగంపేట(ఎల్లారెడ్డి): టీడీపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మండల పార్టీ అధ్యక్షుడు ముదాం భీంరావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాయకులు దేమె కమ్మరి రాజు, మాజీ జడ్పీటీసీ జయరాజ్, అవుసుల లక్ష్మణ్, వెంకటరెడ్డి ఉన్నారు. -
ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలు వేగవంతం చేయాలని డీఆర్డీవో సురేందర్ సూచించారు. మంగళవారం ఆయన లింగంపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటి నిర్మాణం వేగవంతంగా పూర్తి చేస్తే దశలవారీగా బిల్లులు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామన్నారు. సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎంపీడీవో నరేష్, ఎంపీవో మలహరి, తదితరులున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పాఠశాలల్లో విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఎల్లారెడ్డి డీఎల్పీవో సురేందర్ సూచించారు. నాగిరెడ్డిపేట కస్తూర్భా పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల, విద్యార్థినుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. అలాగే తాండూర్ జీపీ కార్యాలయంలో పలు రికార్డులను, గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. పలు సూచనలిచ్చారు. -
ఫీజుల దోపిడీని అరికట్టాలి
కామారెడ్డి టౌన్: జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి జి. సురేష్ డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్లో విద్యాశాఖ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. డీఈవో ఎస్.రాజుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం సురేష్ మాట్లాడుతూ..నర్సరీ, ఎల్కేజీలకే రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారని తెలిపారు. నాయకులు సాయికుమార్, శేఖర్, ప్రశాంత్, రాకేష్ తదితరులున్నారు. గుర్తింపులేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి జిల్లాలో గుర్తింపు లేకుండా కొనసాగుతున్న ప్రైవేట్ స్కూళ్లపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర కార్యదర్శి జబ్బర్ నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నిబంధనలు పాటించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తూ, స్కూల్ ఆవరణలోనే బ్యాగులు, బుక్స్, ఇతర సామగ్రి విక్రయిస్తూ వ్యాపారం చేస్తున్నా జిల్లా విద్యా శాఖాధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. నాయకులు రాజు, మహేష్ ఉన్నారు. -
‘డబుల్’ ఇళ్లను పేదలకు కేటాయించాలి
భిక్కనూరు: మండల కేంద్రంలో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను.. ఇల్లు లేని నిరుపేదలకు వెంటనే కేటాయించాలని అదనపు కలెక్టర్ విక్టర్ ఆదేశించారు. మంగళవారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో కిటికీలు, విద్యుత్ వైర్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని .. వాటికి తక్షణమే మరమ్మతులు చేయాలని సూచించారు. ఇల్లు లేని మహిళలు ఆయనను కలిసి తమకు ఇళ్లు కేటాయించాలని కోరారు. పీఆర్ ఈఈ దుర్గాప్రసాద్, డీఈఈ స్వామి దాస్, కామారెడ్డి ఆర్డీవో వీణ, డీఎల్పీవో శ్రీనివాస్, ఎంపీడీవో రాజ్కిరణ్రెడ్డి, ఆర్ఐ బాలయ్య, తదితరులున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలి భిక్కనూరు: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అదనపు కలెక్టర్ విక్టర్ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని ఆదేశించారు. సమయపాలన పాటిస్తూ విధులకు హాజరుకావాలని సూచించారు. వైద్యాధికారి హెమీమా, ఆయుర్వేద వైద్యాధికారి వెంకటేశ్వర్లు, ఆరోగ్య విస్తర్ణ అధికారి వెంకటరమణ, సిబ్బంది ఉన్నారు. -
త్రినేత్ర శివలింగం.. ఉమామహేశ్వర ఆలయం
మీకు తెలుసా? నందిపేట మండలం ఉమ్మెడ శివారులో గల గోదావరి నది పరీవాహక ప్రాంతంలో ఉన్న ఉమామహేశ్వర ఆలయం ఎంతో విశిష్టత కలిగి ఉంది. ● త్రేతాయుగంలో శ్రీరాముడు నడిచిన బాటలో గోదావరి నది ఒడ్డున ఇసుతో సైకత లింగాన్ని చేసి శివరూపాన్ని భక్తితో పూజించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ● ఈ శివలింగం ప్రత్యేకతను తెలుసుకొని సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం 10, 11 వ శతాబ్దపు మధ్యకాలంలో కల్యాణ చాళుక్యుల మహారాజైన మహా మండళేశ్వరుడు కట్టించిన దేవాలయమని అని చరిత్ర ద్వారా తెలుస్తుంది. ● ఈ ఆలయంలో శివలింగం మీద త్రినేత్రం కనిపించడం విశేషం. ● దీపగండంగా పిలువబడే 108 దీపాల ధ్వజస్తంభం ప్రత్యేకత. ● పోదశ స్తంభాలతో మండపం. ప్రతి స్తంభం మీద నాగ శాసనాలు, దేవాలయం చుట్టూ దాన శాసనాలు(ప్రతేక లిపితో రాసినవి) కలిగి ఉంటాయి. ● ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గోదావరి బ్యాక్ వాటర్లో నీటమునిగే దేవాలయం, శివరాత్రి సమయంలో బయట పడుతుంది. మూ డురోజులపాటు ఉత్సవాలను నిర్వహిస్తారు. ● నందిపేట మండల కేంద్రానికి 8 కిలో మీటర్ల దూరంలో గోదావరి పరీవాహక ప్రాంతంలో నది ఒడ్డున ఉండడంతో ఈ ఆలయం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. – నందిపేట్ -
వాహనాల వేలం వాయిదా
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి ఎకై ్సజ్ కార్యాలయంలో మంగళవారం వాహనాల వేలంను వాయిదా వేసినట్లు టాస్క్ఫోర్స్ సీఐ సుందల్ సింగ్ తెలిపారు. ఎల్లారెడ్డి ఎకై ్సజ్ కార్యాలయంలో వ్యాగన్ఆర్ కారు, గ్లామర్ బైకుకు సంబంధించి వాహనాల వేలం నిర్వహించారు. వేలానికి ఇద్దరు వ్యక్తులు మాత్రమే హాజరు కాగా ప్రభుత్వం నిర్ధారించిన ధర రాకపోవడంతో వాయిదా వేశారు. ఎల్లారెడ్డి ఎకై ్సజ్ సీఐ షాకీర్ అహ్మద్, ఎస్సై శరత్కుమార్, తదితరులున్నారు. మంత్రి సీతక్కను కలిసిన జిల్లా కాంగ్రెస్ నేతలుకామారెడ్డి టౌన్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డితో పాటు కాంగ్రెస్ నేతలు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, నాయకులు పంపరి శ్రీనివాస్, పాత శివ కృష్ణమూర్తి, చాట్ల వంశీ, సాయిబాబా, సలీం, జూలూరి సుధాకర్ తదితరులున్నారు. రేపు ఒలింపిక్ డే రన్ కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలో గురువా రం ఒలింపిక్ డే రన్ నిర్వహించనున్నట్లు జి ల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రతినిధి కరు ణాకర్రెడ్డి తెలిపారు. ఉదయం 8.30 గంటలకు కామారెడ్డి జి ల్లా పరిషత్ బాలుర ఉన్న త పాఠశాల వద్ద రన్ ప్రారంభమవుతుందని, ఇందిరాగాంధీ స్టేడి యం వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. క్రీడాభిమానులు, విద్యార్థులు, యువకులు ఒలింపిక్ రన్లో పాల్గొనాలని కోరారు. -
నిబంధనలు తూచ్!
బాన్సువాడ: బీర్కూర్ మండలంలో ఇసుక తవ్వకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. మంజీర ప్రాంతం నుంచి ఇసుక తవ్వకాలు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వేల ట్రాక్టర్ల ఇసుక పక్కదారి పడుతోంది. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను అందించాలని భావించినప్పటికీ ఇసుకాసురులకు మాత్రం వరంలా మారింది. బాన్సువాడ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బీర్కూర్ మండలంలోని బీర్కూర్, చించొల్లీ, కిష్టాపూర్, బరంగెడ్గి, దామరంచ మంజీర ప్రాంతాల నుంచి ఉచిత ఇసుక కోసం అనుమతులు ఇస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ఇసుకాసురులు ఉచిత ఇసుకను పక్కదారి పట్టిస్తున్నారు. ఇసుక క్వారీల విషయంలో కఠిన నియమావళి అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ పనులకు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి తక్కువ ధరలో ఇసుక లభ్యత ఉండాలని కలెక్టర్లకు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రైవేటు ఇళ్లు, ఇతర నిర్మాణాలకు ట్రాక్టర్కు రూ.900 చలాను చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ 10 ట్రాక్టర్లకు చలాన్లు చెల్లించి వందల ట్రాక్టర్లు తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇందిరమ్మ ఇళ్లకు ఈ డీడీ చెల్లించాల్సిన అవసరం లేదు. ట్రాక్టర్ యజమానులతో మాట్లాడుకుని ఇసుకను తీసుకెళ్లాల్సి ఉంటుంది. అధికారులు ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితాలను దగ్గర పెట్టుకుని ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి ఎంత మోతాదులో ఇసుక అవసరముంటుందో అన్ని ట్రాక్టర్లు మాత్రమే పంపించాలి. అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలి. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. ట్రాక్టర్ల యజమానులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసమేనంటూ ఇసుక తరలిస్తూ ప్రైవేటు వ్యక్తులకు విక్రయిస్తున్నారు. బీర్కూర్, బరంగెడ్గి, చించొల్లీ, కిష్టాపూర్, దారమంచ గ్రామాల నుంచి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను బాన్సువాడ, వర్ని, నస్రుల్లాబాద్, గాంధారి మండలాలకు తలిస్తున్నారు. ఇందుకు బీర్కూర్ తహసీల్ కార్యాలయంలో విధులు నిర్వహించే ఓ అధికారి కనుసన్నల్లో జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఆ అధికారి చలాన్ల కోసం కట్టాల్సిన డబ్బులు ఫోన్పేల ద్వారా తీసుకుంటున్నట్లు విమర్శలు వస్తున్నాయి.అనుమతి కోసం.. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు ఇసుక తవ్వకాల్లో ఇష్టారాజ్యం అడ్డగోలుగా తరలింపు అధికారుల పర్యవేక్షణ కరువుఇసుక కావాల్సిన వారు ముందుగా పంచాయితీ కార్యదర్శి, ఆర్ఐ, నాయబ్ తహసీల్దార్, లేని పక్షంలో తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోవాలి. ప్రైవేటు వ్యక్తులు గ్రామాలు, పట్టణంలో ఇళ్లు నిర్మిస్తే పంచాయితీ, మున్సిపాలిటీ నుంచి అనుమతి పత్రంతో ఇసుక పొందే వీలుంది. ఇక ప్రభుత్వ అభివృద్ధి పనులకు పని పత్రాలు చూపి ఇసుకను పొందవచ్చు. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక పొందవచ్చు. అధికారులు దగ్గరుండి ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా సరఫరా చేయాలి. వారు దరఖాస్తు చేసుకున్న తర్వాత తహసీల్దార్ అనుమతి ఇవ్వాలి. ఆ తర్వాత నిర్దేశించిన మొత్తాన్ని బ్యాంకులో చలాన్ రూపంలో చెల్లించాలి. దాని ఆధారంగా సైట్లో ఇసుక నిర్ణీత సమయంలో తీసుకెళ్లాలి. పైకి ఈ నిబంధనల ప్రకారమే ఇసుక సరఫరా జరుగుతున్నట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. -
అవార్డు గ్రహీతకు సన్మానం
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన కొమ్ము వినోద్ రెడ్డిని హైదరాబాద్లో మంగళవారం టీపీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఘనంగా సన్మానించారు. కొమ్ము వినోద్ రెడ్డి ఇటీవల వండర్ బుక్ ఆఫ్ రికార్డు, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకున్నాడు. దీంతో మధుయాష్కీ గౌడ్ ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు. లబ్ధిదారులకు మెరుగైన సేవలందించాలికామారెడ్డి టౌన్: ఆస్పత్రులకు వచ్చే ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందేలా చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మేనేజర్ సత్యనారాయణ ఆరోగ్యశ్రీ మిత్ర, సిబ్బందికి సూచించారు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ ఆస్పత్రిలో మంగళవారం ఆరోగ్యశ్రీ సేవలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు నిరంతరం సేవలు అందించేలా చూడాలన్నారు. రిజిస్టర్లను పరిశీలించారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా టీం లీడర్లు అల్లావుద్దీన్, యశ్వంత్, ఆరోగ్య మిత్రలు పాల్గొన్నారు. క్రీడాకారులకు అభినందనసుభాష్నగర్: హన్మకొండలో ఈ నెల 12 నుంచి 14 వరకు జరిగిన ఇంటర్ సర్కిల్ విద్యుత్ కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ టోర్నీలో తృతీయ స్థానం సాధించిన జిల్లా జట్టు క్రీడాకారులను ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఆర్ రవీందర్ మంగళవారం నగరంలోని పవర్ హౌస్ మీటింగ్ హాల్లో అభినందించారు. భవిష్యత్లో మొదటిస్థానంలో నిలవాలని, అందుకు అవసరమైన సహకారం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఈ తోట రాజశేఖర్, ఏఏవో గంగారాం, జేఏవో పూదరి గంగాధర్, సెక్రటరీ ఏ గోపి, కోశాధికారి వీ ఉత్తమ్సింగ్, దినేశ్, కేఎస్ఆర్ మూర్తి, కబడ్డీ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. కళాశాల వార్షికోత్సవంకామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కళాశాల వార్షికోత్సవం మంగళవారం స్థానిక లక్ష్మీదేవి గార్డెన్న్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, ఆటపాటలతో వీక్షకులను అలరించారు. కళాశాల డైరెక్టర్లు హరిస్మరణ్రెడ్డి, జనార్దన్ రెడ్డి, అశోక్ రావు, బాలాజీ రావు, రాజేశ్వరరావు, ప్రిన్సిపల్ సాయిబాబు, అకాడమిక్ ఇన్చార్జి మనోజ్ కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు. తాళం వేసిన ఇంట్లో చోరీ●ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని గ్యాదరి అరవింద్ ఇంట్లో ఈ నెల 16న తెల్లవారుజామున దుండగులు చోరీకి పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆరోగ్యం బాగోలేక పోవడంతో అరవింద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా బీరువాలోని సామగ్రి చిందర వందరగా పడి ఉన్నాయి. దుండగులు 16 తులాల బంగారం, రూ. 30 వేల నగదు అపహరించినట్లు బాధితుడు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. -
లైంగిక కోరిక తీర్చాలన్నందుకే హత్య
● తండ్రిని చంపిన కూతురి రిమాండ్ బోధన్: తండ్రిని రోకలి దుడ్డుతో కొట్టి చంపిన కూతురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. నవీపేట పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఽనవీపేట మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన పల్లపు నర్సయ్య(54)కు ఇద్దరు కూతుళ్లు. ఇరువురికి వివాహం చేశారు. పెద్ద కూతురు గంగామణి భర్త మృతి చెందడంతో పదేళ్ల నుంచి ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిదండ్రుల వద్ద ధర్మారంలోనే ఉంటుంది. పెద్ద కూతురు గంగామణి పట్ల నర్సయ్య అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. దీంతో ఇంట్లో గొడవలు జరిగి పది రోజుల నుంచి నర్సయ్య భార్య నర్సమ్మ, పెద్ద కూతురు నిజామాబాద్లో వేరుగా జీవిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని తాళ్ల కొత్తపేట గ్రామంలో ఉంటున్న చిన్న కూతురు మక్కల వర్షిణి అలియాస్ మమత సోమవారం ధర్మారంలోని తండ్రి వద్దకు వచ్చింది. మద్యం మత్తులో ఉన్న నర్సయ్య లైంగిక కోరిక తీర్చాలని చిన్న కూతురుని వేధించాడు. ఆగ్రహించి పక్కనే ఉన్న రోకలి దుడ్డుతో తలపై రెండుసార్లు కొట్టడంతో నర్సయ్య అక్కడికక్కడే మరణించాడు. రక్తం, గాయాలు చూసి భయపడిన మమత ఇంటి తలుపులు దగ్గరగా మూసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో నవీపేట ఎస్సై వినయ్ పాల్గొన్నారు. -
శతాధిక వృద్ధురాలు మృతి
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలంలోని దావల్మల్కపల్లి గ్రామంలో మంగళవారం శతాధిక వృద్ధురాలు మరణించినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామంలోని పట్టెం వెంకవ్వ (102) అనారోగ్యంతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఆమె అంత్యక్రియలకు దాక్షాయని స్వచ్ఛంద సంస్థ రూ.5 వేలు ఆర్థిక సహాయం అందించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కారు, బైకు ఢీకొని ఒకరు..ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణ శివారులో మంగళవారం కారు, బైకు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఎల్లారెడ్డి నుంచి హసన్పల్లికి బైకుపై వెళ్తున్న అంజయ్యను బాన్సువాడ వైపు నుంచి కామారెడ్డి వైపునకు వెళ్తున్న కారు ఢీకొనడంతో తీవ్రగాయమైనట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంజయ్యను ఆటోలో ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా అంజయ్య మృతి చెందినట్లు తెలిపారు. -
నాటి ఢంకేశ్వర్.. నేటి డొంకేశ్వర్
మీకు తెలుసా? ఎస్సారెస్పీలో ముంపునకు గురైన డొంకేశ్వర్ గ్రామానికి పెద్ద చరిత్రే ఉంది. ఢంకలు మోగించడంతోనే ఈ ఊరికి మొదట ఢంకేశ్వర్ అనే పేరు వచ్చిందట. కాలక్రమేనా డొంకేశ్వర్గా మారింది. ● సుమారు 300 ఏళ్ల కిందట భుజంగరావు అనే వ్యక్తి నాలుగు ఎకరాల్లో ఊరిని, ఊర చెరువును స్థాపించాడు. ● ఊరికి నలు దిక్కులా బురుజులు కట్టి గడిని ఏర్పాటు చేసినట్లు చరిత్ర ఉంది. ● ఈ బురుజుల వద్ద సిపాయిలు కాపలా ఉండేవారు. ఢంకలు కొట్టి సంకేతాలు ఇచ్చేవారు. ● కొన్ని రోజలుకు పొద్దుటూరి రెడ్డిలు వచ్చి నాలుగెకరాల్లో ఉన్న గ్రామాన్ని 40 ఎకరాలకు విస్తరించారు. మాసం చెరువును కూడా స్థాపించాడు. ● 1975లో ఎస్సారెస్పీలో ముంపునకు గురికావడంతో ప్రస్తుతం ఉంటున్న ప్రాంతంలో నివాసాలు కట్టుకున్నారు. ● సత్య గంగవ్వ, ఆమె కొడుకు మధుసూదన్రెడ్డి సహకారంతో ఊరి పున: నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసి భూములను పంచుకున్నారు. ● ఇళ్ల విస్తీర్ణం 80 ఎకరాల్లో ఉండగా, వ్యవసాయ భూములు 2వేలకు పైగా ఎకరాల్లో ఉంది. డొంకేశ్వర్ గ్రామానికి 1952లో భూమారెడ్డి మొదటి సర్పంచ్గా పని చేశారు. – డొంకేశ్వర్(ఆర్మూర్) -
నదిలో పడి బీహర్ యువకుడి మృతి
అదుపుతప్పి బోల్తాపడిన టిప్పర్ నస్రుల్లాబాద్: మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులో గల ప్రధాన రహదారిపై ఓ టిప్పర్ అదుపు తప్పి సమీప పంట పొలాల్లో బోల్తాపడింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. నస్రుల్లాబాద్ వైపు నుంచి బైరాపూర్ వైపునకు సోమవారం మొరం తీసుకొని వెళుతున్న టిప్పర్ అదుపుతప్పి పంట పొలాల్లో పడిపోయింది. డ్రైవర్ అప్రమత్తం అవ్వడంతో ఎటువంటి గాయాలు కాలేదు. అధిక లోడ్తో మొరం తరలించడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తాగుడుకు బానిసై ఆత్మహత్య నిజాంసాగర్(జుక్కల్): జుక్కల్ మండలం పడంపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ భూమి వద్ద సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై భువనేశ్వర్ తెలిపారు. మహరాష్ట్రలోని ముద్ఖేడ్ తాలుకా, పుంజ్ ఏక్లార గ్రామానికి చెందిన బోయిల్వాడ్ హన్మంతు(34)కు మండలంలోని పెద్దఎడ్గి గ్రామానికి చెందిన గంగమణితో గతంలో వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. మద్యం తాగుడుకు బానిసైన హన్మంతు జీవితంపై విరక్తి చెంది, పంట చేను వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమేరకు మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.రుద్రూర్: మంజీరా నదిలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన బీహర్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు కాలుజారి నదిలో పడి మృతి చెందాడు. కోటగిరి ఎస్సై సునీల్ తెలిపిన వివరాలు ఇలా.. బీహార్ రాష్ట్రానికి చెందిన కూలీల బృందం ఇటీవల పోతంగల్ మండలం కల్లూర్ గ్రామానికి వరి నాట్లు వేయడానికి వచ్చింది. వీరిలో రాజేష్ కుమార్ సహాని(32) అనే యువకుడు ఆదివారం సాయంత్రం కాలకృత్యాలు తీర్చుకోడానికి కొడిచర్ల శివారులోని మంజీరా నది వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలుజారి నదిలో పడిపోయాడు. వెంటనే స్థానికులు గమనించి అతడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుడి సోదరుడు వీరేంద్ర కుమార్ సహాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బైక్ అదుపుతప్పి ఒకరు..మాక్లూర్: బైక్ అదుపుతప్పి కిందపడిన వ్యక్తి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని దుర్గానగర్కు చెందిన కే శంకర్ (62) తన బైక్పై సోమవారం నిజామాబాద్ బయలుదేరాడు. మాణిక్ బండారు శివారులో అతడి బైక్ అదుపు తప్పడంతో కిందపడి గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజశేఖర్ తెలిపారు. నగరంలో గుర్తుతెలియని వ్యక్తి.. ఖలీల్వాడి: నగరంలోని బస్డిపో–1 మెయిన్ గేట్ పక్కన ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. బస్టాండ్ సెక్యూరిటీ సిబ్బంది మృతుడిని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు జీజీహెచ్కు తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతుడు ఎరుపు రంగు టీ షర్ట్, గ్రీన్ కలర్ ప్యాంట్ ధరించినట్లు చెప్పారు. అతడి వయస్సు సుమారు 55 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. మృతుడి సమాచారం ఎవరికై నా తెలిసినచో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గాని ఫోన్ నంబర్ 87126 59714కు సమాచారం ఇవ్వాలన్నారు.చికిత్స పొందుతూ ఒకరు..మాక్లూర్: మండలంలోని కొత్తపల్లి శివారులో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. నవీపేట మండలం జన్నేపల్లికి చెందిన అభిషేక్(28) ఆదివారం తన బైక్పై పని నిమిత్తం నందిపేట వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మండలంలోని కొత్తపల్లి శివారులో అతడిని ట్రాక్టర్ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో అభిషేక్ తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అతడు చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందినట్లు తెలిపారు. మాక్లూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
డబుల్ బెడ్రూం ఇళ్లపై దాడులు
రెండేళ్ల క్రితం డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించినా వాటిలో నివాసం ఉండటానికి ఇప్పటికీ అధికారులు అనుమతించడం లేదని భిక్కనూర్కు చెందిన లబ్ధిదారులు తెలిపారు. వారు సోమవారం కలెక్టరేట్కు తరలివచ్చారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించినప్పటికీ వాటిలో నివాసం ఉండేలా ప్రక్రియను పూర్తి చేయలేదని అన్నారు. పత్రాలు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నారని తెలిపారు. కొద్ది రోజులుగా తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇళ్లపై కొందరు ఆకతాయిలు దాడులు చేస్తూ కిటికీలు, తలుపులు, అద్దాలు, వాటర్ పైపులను ధ్వంసం చేస్తున్నారని వాపోయారు. ధ్వంసమైన వాటికి మరమ్మతులు చేయించి.. కేటాయించాలని కోరుతూ ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. -
పాఠశాలను తరలించొద్దు
బీబీపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను మరో చోటకు తరలించవద్దని కోరుతూ విద్యార్ధుల తల్లిదండ్రులు, గ్రామస్తులు సోమవారం ప్రజావాణికి తరలివచ్చారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని ఇటీవల జూనియర్ కళాశాలకు కేటాయించారని తెలిపారు. ఎన్నో యేళ్లుగా తమ ఆడపిల్లలు చదువుకుంటున్న బాలికల పాఠశాలను మరోచోట ఉన్న బాలుర ఉన్నత పాఠశాలలోకి మారుస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారని వెల్లడించారు. ఈ మార్పుతో బాలికల విద్యపై, భద్రతపై ప్రభావం పడుతుందన్నారు. బాలికలకు ప్రత్యేకంగా పాఠశాల ఉండాల్సిన అవపసరం ఉందన్నారు. బాలికల ఉ్ననత పాఠశాలను అదే భవనంలో కొనసాగించాలని కలెక్టర్కు విన్నవించారు. -
సీపీని కలిసిన బెటాలియన్ కమాండెంట్
ఖలీల్వాడి: నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ సాయి చైతన్యను సోమవారం డిచ్పల్లి ఏడో బెటాలియన్ కమాండెంట్ సత్యనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆయనకు పూల మొక్కను అందజేశారు. తండ్రిని హతమార్చిన కూతురునవీపేట: ఫాదర్స్ డే మరునాడే కన్న కూతురు చేతిలో తండ్రి హతమైన ఘటన మండలంలోని ధర్మారం(ఎ) గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. ధర్మారం గ్రామానికి చెందిన పల్లపు నర్సయ్య(54) సోమవారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తాళ్ల కొత్తపేటలో ఉండే చిన్నకూతురు మక్కల వర్షిణి అలియాస్ మమత రోకలి దుడ్డుతో తలపై బాది చంపేసింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై వినయ్లు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి అన్న కొడుకు గంగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, విచారిస్తున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు. -
విద్యుత్ షాక్తో ఒకరికి గాయాలు
దోమకొండ: మండల కేంద్రంలో సోమ వా రం గ్రామపంచాయతీ కార్మికుడు విద్యుత్ షాక్తో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. దోమకొండలోని స్థానిక సాయిబాబా గుడి కాలనీలో విద్యుత్ స్తంభాలకు బల్బులను సరిచేయడానికి ట్రా న్స్ఫార్మర్ వద్ద విద్యుత్ నిలిపివేశారు. అనంతరం వెంకట్రెడ్డి పనులు చేస్తుండగా విద్యుత్ వైర్లు ఇనుప స్తంభానికి తగలడంతో అతడికి కరెంట్ షాక్ తగిలి కింద పడిపోయాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కాగా గ్రామపంచాయతీ కార్యదర్శి యాదగిరి, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ సిబ్బందితో అక్కడికి చేరుకొని, ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు వారు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల పంచాయతీ కార్మికుడికి గాయాలైనట్లు పేర్కొన్నారు. ఆలయంలో చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్టు ఎల్లారెడ్డి: మండలంలోని హాజీపూర్ తండాలోగల సేవాలాల్ మహరాజ్ ఆలయంలో ఈనెల 14న రాత్రి చోరీకి పాల్పడిన నిందితుడిని పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్ చేసినట్లు ఎస్సై మహేష్ సోమవారం తెలిపారు. వివరాలు ఇలా.. రాంపూర్ గ్రామానికి చెందిన గడ్డండ్ల పౌల్ అనే వ్యక్తి ఈనెల 14న తండాలోని ఆలయ హుండీని పగలగొట్టి అందులోని నగదును అపహరించాడు. తండాలోని సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. కోర్టు పేషీలకు హాజరుకాని మహిళ రిమాండ్.. ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు పరిధిలో దొంగతనం కేసులో రిమాండయిన ఓ మహిళ కోర్టు పేషిలకు హాజరు కాకుండా తిరుగుతోంది. దీంతో సదరు మహిళపై నాన్బెయిలబుల్ వారెంట్ జారీ కావడంతో అమెను పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. -
ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదుదారులు పోటెత్తారు. మొత్తం 135 వినతులు వచ్చాయి. ప్రధానంగా భూ సమస్యలు, డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరు, రైతు భరోసా, పింఛన్ల మంజూరుకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యలను పరిస్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. తీసుకున్న చర్యలపై ఫిర్యాదుదారునికి సమాచారం అందించాలని సూచించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, ఆర్డీవో వీణ, ఏవో మస్రూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అదికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజావాణికి పోటెత్తిన ఫిర్యాదుదారులు -
ఆర్ఎంపీ, పీఎంపీలపై దాడులు ఆపాలి
నిజామాబాద్నాగారం: జిల్లాలోని ఆర్ఎంపీ, పీఎంపీలపై మెడికల్ కౌన్సిల్ చేపడుతున్న దాడులు వెంటనే ఆపాలని వారు డిమాండ్ చేశారు. ఈమేరకు జిల్లాలోని గ్రామీణ ఆర్ఎంపీ, పీఎంపీలు సోమవా రం ర్యాలీ తీశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిల్లా సాయిబాబా, జిల్లా అధ్యక్షులు భాస్కర్రాజు మాట్లాడుతూ.. ఆర్ఎంపీ, పీఎంపీలపై స్టేట్ మెడిక ల్ కౌన్సిల్ పెట్టిన కేసులను ఎత్తివేయాలన్నారు. శిక్షణ పూర్తి చేసిన గ్రామీణ వైద్యులకు సర్టిఫికేట్లు ఇచ్చి గుర్తించాలన్నారు. రాష్ట్ర కార్యదర్శి కట్టా అశో క్, గరువ శ్రీనివాస్, రాజేశ్వర్, బోధన్, ఆర్మూర్ డివిజన్ల అధ్యక్షుల రాజగోపాల్చారీ, సాయిలు, చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఆర్ఎంపీపై మహిళల దాడి నిజామాబాద్నాగారం: ఆర్ఎంపీ, పీఎంపీలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. డిచ్పల్లి మండల కేంద్రానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ అశోక్పై మహిళలు చెప్పులతో దాడి చేశారు. ఆర్ఎంపీ వైద్యుడు అశోక్ మహిళలతో అసభ్యకరంగా మాట్లాడుతూ, మాయమాటాలతో మోసం చేస్తున్నారని ఇద్దరు మహిళలు పేర్కొంటూ చెప్పుతో దాడి చేశారు. వైద్యం కోసం వెళ్తే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. -
ధరణి వెంచర్ బాధితుల గోడును పట్టించుకోవాలి
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్లో రాజీవ్ స్వగృహ, ధరణి వెంచర్లో ప్లాట్లు తీసుకున్న యజమానుల గోడును ప్రభుత్వం పట్టించుకోవాలని ప్లాట్ల యజమానులు కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలో వారు మాట్లాడారు. 2022లో ప్రభుత్వం ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీతో ఈ వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేశామని, ఇప్పటికీ వెంచర్లో కనీస సౌకర్యాలు లేవన్నారు. రోడ్లు, మురికికాలువలు, వీధి దీపాలు, నీటి సౌకర్యాలను ఆరు నెలల్లో కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని వాపోయారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. -
తుప్పు పడుతున్న వాహనాలు
బిచ్కుంద(జుక్కల్): వివిధ కేసులలో పోలీసులు పట్టుకున్న వాహనాలను బిచ్కుంద ఎకై ్సజ్, పొలీస్ స్టేషన్లో ఉంచారు. ఏళ్లుగా కేసులు విచారణలో ఉండడంతో వాహనాలు అలాగే ఉండి పూర్తిగా చెడిపోతున్నాయి. నాటుసారా, గంజాయి, రోడ్డు ప్రమాదాలు, ఇతర సరుకుల అక్రమ రవాణా, సరైన ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలను, దొంగలు చోరీలకు పాల్పడి పట్టుబడ్డ వాహనాలను పొలీసులు సీజ్ చేస్తున్నారు. కేసుల విషయంలో కోర్డు వరకు పోవడం, తీర్పు వచ్చేవరకు సమయం పడుతుండటంతో వాహనాలు స్టేషన్ ఆవరణలో పాడవుతున్నాయి. వాహనాలపై అధికారుల నిఘా లేకపోవడంతో విడిభాగాలు మాయమవుతున్నాయి. దీంతో సంబంధిత వాహనదారులు వాటిని తీసుకెళ్లే సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాఉ. కొందరు తుప్పుపట్టిన వాహనాలను తీసుకెళ్లెందుకు ముందుకురావడం లేదు. ఈక్రమంలో అధికారులు పట్టుకున్న వాహనాలకు వేలం వేస్తే ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం వస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
అధిక వడ్డీలు.. వేధింపులు
రామారెడ్డిలోని రమేష్ అనే వ్యక్తి ఇటీవల అవసరానికి మైక్రో ఫైనాన్స్ వారం గ్రూప్లో రూ.10వేలు అప్పు తీసుకున్నాడు. వారం వారం చెల్లింపుల్లో తేడా రావడంతో సదరు ఏజెంట్లు రాత్రి 10గంటల వరకు వేచి ఉండి వారం తాలూకా కిస్తీ పైసలు వసూలు చేసుకువెళ్లారు. రూ.పదివేలు తీసుకుంటే వడ్డీతో కలిపి రూ.17,000 వరకు మైక్రో ఫైనాన్స్ వారు వసూలు చేయడంతో అతడు తీవ్ర ఆవేదన చెందుతున్నాడు.రామారెడ్డి: పల్లెల్లో మళ్లీ మైక్రో ఫైనాన్స్ సంస్థలు మహిళలు, చిరు వ్యాపారులకు రుణాలు ఇస్తూ వారిని నిండా ముంచుతున్నారు. ప్రజల అత్యవసరాన్ని ఆసరా చేసుకొని అధిక వడ్డీకి రుణాలు ఇచ్చి తీరా ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోతే వేధింపులకు గురిచేస్తున్నారు. గతంలో మైక్రో ఫైనాన్స్ వేధింపులు తాళలేక ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలు జిల్లాలో ఉన్నాయి. అప్పట్లో ప్రభుత్వం వీటిని నిషేధించింది. కానీ మళ్లీ గ్రామాల్లో మైక్రో ఫైనాన్స్ సంస్థలు తమ కార్యకలాపాలు వేగంగా విస్తరింపజేస్తున్నాయి. వాయిదా చెల్లింపులు.. మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులు ముందుగా తమ ఏజెంట్లను గ్రామాల్లోకి పంపి పేద మహిళలు, సంఘాల సభ్యులను కలుస్తున్నారు. వారం, 15 రోజుల వాయిదా చెల్లింపులతో రుణాల ఆశ చూపుతున్నారు. డ్వాక్రా గ్రూపుల్లో సకాలంలో చెల్లించని వారు మైక్రోసంస్థలను ఆశ్రయిస్తున్నారు. 10నుంచి 12మంది మహిళలను గ్రూపుగా ఏర్పాటు చేసి 15 రోజుల్లోనే రుణం అందిస్తున్నారు. ఒక్కో గ్రామంలో 20 నుంచి 30 గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు పొందినట్లుగా తెలుస్తుంది. కామారెడ్డి జిల్లాలో రామారెడ్డి, సదాశివనగర్ భిక్కనూరు, దోమకొండ, బీబీపేట మండలాల్లో ఈ తరహా రుణాలు ఎక్కువగా ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈజీగా రుణం వస్తుండడంతో మహిళలు వీటికి ఆకర్షితులు అవుతున్నారు. తీరా ఆర్థిక ఇబ్బందులతో ఈఎంఐ చెల్లించకపోతే వేధింపులకు గురిచేస్తున్నారు. గ్రామాలలో మైక్రో ఫైనాన్స్ తమ కార్యకలాపాలను విస్తరిస్తున్న సంబంధిత అధికారులు నిలువరించడంలో విఫలమవుతున్నారు. జిల్లావ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై దాడులు చేసి కేసులు నమోదు చేసిన పోలీసులు మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఎందుకు నిలువరించడం లేదని అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి, మైక్రో ఫైనాన్స్ సంస్థలు నిలువరించాలని ప్రజలు కోరుతున్నారు. పల్లెల్లో మితిమీరిపోతున్న మైక్రో ఫైనాన్స్ ఆగడాలు తీవ్ర ఆందోళన చెందుతున్న బాధితులుఅవగాహన కల్పిస్తున్నాం.. డ్వాక్రా సంఘాల మహిళలు ఎవరూ కూడా మైక్రో ఫైనాన్స్ రుణాలు తీసుకోవడం లేదు. మైక్రో ఫైనాన్స్ సంస్థలపై, వారి ఆగడాలపై ప్రజలకు అవగా హన కల్పిస్తున్నాం. గ్రామాలలో ప్రజలు రుణాల కోసం మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించవద్దు. – భూమాగౌడ్, సీసీ, డ్వాక్రా సంఘం, రామారెడ్డి -
బాన్సువాడలో సైబర్ మోసం
బాన్సువాడ: బాన్సువాడ సైబర్ మోసం చోటు చేసుకుంది. బాన్సువాడ సీఐ అశోక్ తెలిపిన వివరాలు ఇలా.. పట్టణంలోని అర్ఫత్ కాలనీకి చెందిన సయ్యద్ రఫీ బ్యాంకు ఖాతా నుంచి ఈనెల 5న రెండుసార్లు రూ.20 వేలు కట్ అయ్యాయి. మరుసటి రోజు రఫీ బంధువు తన ఖాతాకు రూ. లక్ష 30వేలు వేసాడు. 6న సాయంత్రం వరకు రూ. లక్ష 30వేలు రఫీ ఖాతాలోనే ఉండడంతో 7న మరొకరి రూ. లక్ష ఫోన్పే చేద్దామని చూడగా అప్పటికే రూ. లక్ష కట్ అయ్యాయి. దీంతో అనుమానం వచ్చి రఫీ బ్యాంకుకు వెళ్లగా పోలీసులను ఆశ్రయించాలని బ్యాంకు ఉద్యోగులు సూచించారు. దీంతో అతడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఉత్తమ విద్యార్థులకు సన్మానంగాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని స్థానిక షాదీఖానాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కామారెడ్డి జిల్లా నాయక్పోడ్ సామాజిక వర్గం విద్యార్థులను ఆదివారం నాయక్పోడ్ ఉద్యోగ సంఘం నాయకులు సన్మానించారు. ఎస్సెస్సీ, ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 27 మందిని శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు సాయిలు, నేతలు పెంటయ్య, వెంకట్, బాలు, సంజీవు, బాల్రాజు తదితరులు పాల్గొన్నారు. -
కొడుకును చంపిన కేసులో తండ్రి అరెస్ట్
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): భార్యపై కోపంతో కొడుకును హతమార్చిన కేసులో తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎల్లారెడ్డి సీఐ రవీందర్నాయక్ తెలిపారు. నాగిరెడ్డిపేట పోలీస్స్టేషన్లో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామానికి చెందిన అక్షితకు, లింగంపేట మండలం పొల్కంపేట గ్రామానికి చెందిన నర అనిల్కు కొన్నేళ్ల కిందట వివాహం జరుగగా, వారికి నాలుగేళ్ల శాశంక్ అనే కొడుకు, 7నెలల కూతురు మనుశ్రీ ఉన్నారు. కాగా ఈనెల 10న అనిల్ తన భార్య, పిల్లలతో కలిసి మెదక్ జిల్లా శాలీపేటలో జరిగిన బోనాల పండుగకు వెళ్లాడు. అక్కడ ఓ గొడవ జరగడంతో అనిల్ తన కుటుంబంతో కలిసి పొల్కంపేటకు చేరుకున్నాడు. ఇంటికి వచ్చాక మరోసారి గొడవ జరగగా అనిల్ తన భార్యను కొట్టాడు. ఈ నెల 12న అనిల్ తన భార్యను పోచారంలో దింపి కొడుకు శశాంక్ను బైక్పై ఎక్కించుకొని గ్రామశివారులోని పల్లెప్రకృతివనం వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ భార్యపై కోపంతో శశాంక్ నోరు, ముక్కు మూసి హత్య చేశాడు. అనంతరం కొడుకును పోచారంలోని తన అత్తగారింటికి తీసుకువచ్చి ఇంట్లో పడుకోబెట్టి వెళ్లిపోయాడు. అచేతనంగా ఉన్న కొడుకును చూసిన అక్షిత అనుమానంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే బాలుడు మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో తన కొడుకును హత్య చేశాడని తల్లి అక్షిత పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మెదక్ జిల్లా బూర్గుపల్లి గేట్ వద్ద అనిల్ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా తానే కొడుకును హత్య చేసినట్లు అంగీకరించాడు. అతడి బైక్ను స్వాధీనం చేసుకొని అనిల్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఎస్సై మల్లారెడ్డి, హెడ్కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్ శ్రీశైలం, హోంగార్డ్ కాశయ్యపాల్గొన్నారు. -
పలు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన
రాజంపేట: మండలంలోని తలమడ్ల, పొందుర్తి గ్రా మాల్లో ఆదివారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పర్యటించారు. గౌడ సంఘం, ముది రాజ్ సంఘం పెద్దల ఆహ్వానం మేరకు రేణుక ఎల్ల మ్మ ఆలయంలో పూజా కార్యక్రమం, ముదిరాజ్ సంఘ కల్యాణ మండపం ప్రారంభం, హనుమాన్ ఆలయంలో పూజా కార్యక్రమం, తలమడ్లలో రజక సంఘం శ్రీ మడివేలు మాచయ్య స్వామి సీతాదేవి కళ్యా ణ మహోత్సవం సందర్భంగా పూజలో పాల్గొన్నారు. కామారెడ్డి: కామారెడ్డి మండలం ఉగ్రవాయిలో కుర్మ సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు ఆదివారం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీరప్ప ఆలయంలో పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనను శాలువా, పూలమాలతో సత్కరించారు. -
ఆత్మీయ పలకరింపులు.. మధుర స్మృతులు
సాక్షి నెట్వర్క్: ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయావంటూ ఆనాటి స్నేహితులు ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో హర్షం వ్యక్తంచేశారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ గ్రామాల ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈసందర్భంగా చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు పలకరించుకుంటూ అనాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యార్థులు, గురువులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. అలాగే నగరంలోని ఓ హోటల్లో ఉమ్మడి జిల్లాలోని 2000 బ్యాచ్కు చెందిన పోలీస్ కానిస్టేబుళ్లు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కామారెడ్డిలోని సిద్ధార్థ జూనియర్ కళాశాల 1999–2001 బ్యాచ్ బైపీసీ విద్యార్థులు పట్టణంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. జిల్లాలో పలుచోట్ల సమ్మేళనాలు నిర్వహించిన పూర్వవిద్యార్థులు ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో భావోద్వేగానికి గురైన చిన్ననాటి మిత్రులు -
శ్రీరాముడు చేసిన లింగం
మీకు తెలుసా? సిరికొండ మండల పరిధిలోని దట్టమైన లొంక అడవుల్లో కొలువైన నీలకంఠ రామలింగేశ్వరస్వామి ఆలయానికి ఎంతో విశిష్ఠత ఉంది. ● త్రేతాయుగంలో రావణుడు సీతమ్మను అపహరించగా, శ్రీరాముడు వెతుకుతూ ఈ అడవుల్లోకి వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. ● రాత్రికి అడవిలోనే బస చేసిన శ్రీరాముడు ఉదయం పూజ చేసుకోవడానికి సెలయేరులో నుంచి ఇసుకను తీసుకువచ్చి లింగం చేసి పూజలు చేసినట్లు తెలుస్తోంది. ● శ్రీరాముడే స్వయంగా చేసిన లింగం కావడంతో రామలింగేశ్వరస్వామి ఆలయంగా పేరు పొందింది. ● మండల కేంద్రం నుంచి 8కిలోమీటర్ల దూరంలో గల అడవుల్లో ఈ ఆలయం ఉంది. ఆలయం చుట్టు ఎత్తై గుట్టలు, పక్కన సెలయేరుతో ఎంతో ఆహ్లదభరితంగా ఉంటుంది. ● మహా శివవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో మూడు రోజుల పాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. – సిరికొండఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఆర్టీసీ డిపో మేనేజర్ల నంబర్లుఆర్టీసీ డిపో ఫోన్ నంబర్ నిజామాబాద్ ఆర్ఎం 9959226011 ఆర్మూర్ డీఎం 9959226019 బోధన్ డీఎం 9959226001 నిజామాబాద్–1 డీఎం 9959226016 నిజామాబాద్–2 డీఎం 9959226017 కామారెడ్డి డీఎం 9959226018 బాన్సువాడ డీఎం 9959226020 -
ఆలయంలో చోరీ
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తండా జగదాంబ ఆలయంలో చోరీ జరిగినట్లు తండావాసులు ఆదివారం తెలిపారు. ఆలయంలో శనివారం పూజలు చేసి వెళ్లిన పూజారి దుష్యానాయక్ ఆదివారం ఉదయం గుడిని తెరిచేందుకు వెళ్లగా ఆలయంలోని హుండీ బయట ఉండటాన్ని గమనించి తండావాసులకు సమాచారం ఇచ్చారు. హుండీని పరిశీలించిన తండా వాసులు అందులో సుమారు రూ. 30వేల నగదు ఉన్నదని, గుర్తుతెలియని దుండుగులు చోరీ చేశారన్నారు. ఘటనపై వారు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. షాపు యజమానిపై కత్తితో దాడిబిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలో బట్టల షాపు నిర్వహిస్తున్న కాంగ్రెస్ కార్యకర్త షేక్ ఖలీల్పై ఆదివారం గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. బట్టలు కొనుక్కోడానికి వచ్చిన నిందితుడికి ఖలీల్ బట్టలు చూపిస్తుండగా హఠాత్తుగా కత్తితో దాడి చేసి పారిపోయాడు. షాపులో ఉన్న వర్కర్లు, స్థానికులు వెంటనే గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. స్పృహకోల్పోయిన ఖలీల్ను వెంటనే చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిని పట్టుకుంటామని ఎస్సై మోహన్రెడ్డి తెలిపారు. -
నిలిచిన చెక్డ్యాం పనులు
బాన్సువాడ : బీర్కూర్ వద్ద మంజీర నదిలో కొనసాగుతున్న చెక్ డ్యాం నిర్మాణ పనులకు బ్రేక్ పడింది. వర్షాల కారణంగా మంజీర నదిలో నీటి ప్రవాహం ప్రారంభమైంది. దీంతో చెక్ డ్యాం పనులకు ఆటంకం ఏర్పడడంతో నిర్మాణ పనులను నిలిపివేశారు. బీర్కూర్ మంజీరలో చెక్ డ్యాం పనులు ఒక్క అడుగు ముందుకు నాలుగడుగులు వెనక్కి అన్నట్లు కొనసాగుతున్నాయి. పనులు ప్రారంభించి నాలుగేళ్లు అవుతున్న చెక్ డ్యాం పనులు మందకొడిగా సాగుతూనే ఉన్నాయి. అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రత్యేక చొరవ చూపి మంజీర నదిపై చెక్ డ్యాం నిర్మించాలని నాబార్డు నిధులు రూ.28.29 కోట్లతో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చేతుల మీదుగా 28 జనవరి 2021లో శంకుస్థాపన చేశారు. నాలుగేళ్లుగా పనులు కొనసాగు..తూనే ఉన్నాయి. గత మే 22న ఇరిగేషన్ క్వాలిటీ కంట్రోల్ సీఈ వెంకటకృష్ణ చెక్ డ్యాం నిర్మాణ పనులను పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. పనులు పూర్తయితే బీర్కూర్తో పాటు కిష్టాపూర్, బరంగెడ్గి, డోంగ్లీ మండలం కుర్లా, శేట్లూర్, ఖడ్గాం గ్రామాలకు భూగర్భ జలాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. అధికారులు స్పందించి పనులు త్వరిగతిన పూర్తి చేయాలని ఆయా గ్రామాల రైతులు వేడుకుంటున్నారు. నాలుగేళ్లుగా కొనసాగుతున్న వైనం మంజీరలో నీటి ప్రవాహంతో పనులకు బ్రేక్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి త్వరగా పూర్తి చేయాలని కోరుతున్న స్థానికులు -
స్థానిక ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలి
కామారెడ్డి: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ఇటీవల ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆదివారం మండలంలోని జంగంపల్లి, భిక్కనూర్ గ్రామాలకు చెందిన పార్టీ శ్రేణులు ఆయనను శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుపొందాలని సూచించారు. ఇందుకోసం ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. జంగంపల్లి మాజీ ఎంపీటీసీ పుల్లూరి రామస్వామి, గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నరసింహులు, తదితరులున్నారు. మొక్కలు నాటిన వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులుకామారెడ్డి అర్బన్: కామారెడ్డి డిగ్రీ కళాశాల మైదానంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మొక్కలు నాటారు. ఫాదర్స్ డే సందర్భంగా గుర్తుగా మొక్కలు నాటినట్టు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ఎం.జైపాల్రెడ్డి, పి.రాజేశ్వరరావు, పాత హన్మాండ్లు, పంపరి శ్రీనివాస్, భాస్కర్, రాజనర్సింహారెడ్డి తదితరులున్నారు. ముంబోజిపేటతండాలో.. యువకులు లింగంపేట(ఎల్లారెడ్డి): ముంబోజిపేట తండాలో యువకులు మొక్కలు నాటారు. ఐదేళ్ల నుంచి తండా పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నట్లు వారు వెల్లడించారు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. తండాకు చెందిన ఉద్యోగులు, యువకులు స్వయంగా మొక్కలు కొనుగోలు చేసి నాటినట్లు పేర్కొన్నారు. -
విజయాలు
ఏడాదిలో ఎన్నోకలెక్టర్గా తన మార్క్ చూపిస్తున్న ఆశిష్ సంగ్వాన్ ప్రజావాణి కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు వినతులపై ఎప్పటికప్పుడు సమీక్ష, సమస్యల పరిష్కారానికి చొరవ విధుల్లో నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలు వివిధ రంగాల్లో ముందంజలో జిల్లాసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి కలెక్టర్గా ఆశిష్ సంగ్వాన్ బాధ్యతలు చేపట్టి సోమవారంతో ఏడాది పూర్తవుతోంది. ఏడాది కాలంలో ఆయన జిల్లాపై తనదైన ముద్ర వేశారు. బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచే జిల్లా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. విధులలో నిర్లక్ష్యం వహించేవారిపై చర్యలకూ వెనుకాడకుండా పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. రోజూ ఏదో ఒక ప్రాంతాన్ని చుట్టేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేయడం ద్వారా ఆయా వ్యవస్థలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వివిధ రంగాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపడంలో ఆయన కృషి ఎంతో ఉంది. ఆశిష్ సంగ్వాన్ గతేడాది జూన్ 16న కామారెడ్డి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన తొలి రోజే అధికారులతో వివిధ అంశాలపై సమీక్షలు చేసి అన్నింటా ముందుండేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ దూకుడును గమనించిన అధికారులు, ఉద్యోగులు చాలా మంది బాధ్యతగా పనిచేయడం అలవాటు చేసుకున్నారు. పెండింగ్లో ఉన్న వేలాది ధరణి ఫైల్స్ను పరిష్కరించేందుకు కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇటీవల ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతిని తీసుకువచ్చి పైలట్ ప్రాజెక్టుగా లింగంపేట మండలాన్ని ఎంపిక చేయగా.. అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించి రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్యలు మొదలుపెట్టారు. అప్పటికప్పుడు కొన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి. ఇంకా చాలా సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. అలాగే భూభారతిని అన్ని మండలాలకు విస్తరించే క్రమంలో ఆయా మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రజావాణికి ప్రాధాన్యత తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు తరలివస్తారు. ఈ నేపథ్యంలో ప్రజల సమస్యలను ఆలకించేందుకు కలెక్టర్ దాదాపు ప్రతి వారం అందుబాటులో ఉంటున్నారు. స్వయంగా దరఖాస్తుదారులతో మాట్లాడి వారి సమస్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మండల స్థాయిలో పరిష్కారం అయ్యే కొన్ని సమస్యలను అక్కడికక్కడే జూమ్ మీటింగ్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నారు. ప్రజావాణికి ఆయా శాఖల జిల్లా అధికారులు తప్పనిసరి హాజరవుతున్నారు. దీంతో అదే రోజు సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేస్తున్నారు. బయోమెట్రిక్తో సమయపాలన కలెక్టరేట్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయడంతో ఉద్యోగులు తప్పనిసరిగా సమయపాలన పాటిస్తున్నారు. వేలిముద్ర వేయడంలో ఆలస్యమైతే దానిపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకునేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో అధికారులు, ఉద్యోగులు ఎవరైనా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో పలువురు ఉద్యోగులపై చర్యలు తీసుకున్నారు. బడికో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ నియామకం పాఠశాలల్లో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు పెరిగిన నేపథ్యంలో కలెక్టర్ సంగ్వాన్ ప్రతి పాఠశాలలో ఒక టీచర్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా నియమించారు. విద్యార్థులు వేధింపులకు గురికాకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చారు. అన్ని పాఠశాలల్లో నియమించి పర్యవేక్షించారు. వేగంగా సామాజిక కులగణన రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ, ఆర్థిక, సామాజిక కులగణన చేపట్టిన సందర్భంలో కామారెడ్డి జిల్లాలో గణన వేగంగా జరిగింది. రాష్ట్ర స్థాయిలో కామారెడ్డి జిల్లాకు గుర్తింపు లభించింది. కలెక్టర్ సంగ్వాన్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహించి సర్వే పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో వేసవి సీజన్లో తాగునీటి సమస్య పరిష్కారానికి అనేక చర్యలు తీసుకున్నారు. ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి అధికారులను పంపించి వెంటనే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారు. విద్య, వైద్యంపై ఫోకస్ జిల్లాలో విద్య, వైద్యం మెరుగుపడేలా అనేక చర్యలు తీసుకున్నారు. క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లినపుడు ఆయా ప్రాంతాల్లో స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆస్పత్రులను తనిఖీ చేయడం ద్వారా తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇంటర్, టెన్త్ రిజల్ట్స్పై అధికారులతో రివ్యూ చేసి మెరుగైన ఫలితాలు సాధించాలని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఆస్పత్రులు, పీహెచ్సీలలో సమస్యలపై చర్యలు తీసుకున్నారు.రక్తదాన కార్యక్రమాల్లో అగ్రభాగంఆపదలో ఉన్న వ్యక్తులకు అవసరమైన రక్తం సేకరించేందుకు రెడ్క్రాస్ సొసైటీ ద్వారా పెద్ద సంఖ్యలో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఇటీవల గవర్నర్ చేతుల మీదుగా కలెక్టర్ సంగ్వాన్ బెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డును అందుకున్నారు. రక్తదాతలను ప్రోత్సహించడం, ఎక్కువ మొత్తంలో రక్తం సేకరించడం ద్వారా జిల్లా ముందు వరుసలో నిలిచింది. పలు అంశాల్లో ప్రగతిరైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రంలో జిల్లా రెండో స్థానంలో నిలిచింది. వరుసగా రెండు పంటలకు సంబంధించి కొనుగోళ్లలో ఈ ఘనత సాధించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల విషయంలోనూ కలెక్టర్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ, క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ పనుల్లో వేగం పెరిగేలా చూస్తున్నారు. పత్రికా కథనాలపై స్పందనఅవినీతి, అక్రమాలు, సమస్యలపై పత్రికల్లో వ చ్చే కథనాలపై కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిరోజూ పత్రికల్లో వచ్చే కథనాలపై కలెక్టర్ స్పందిస్తూ వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. పెండింగ్లో ఉన్న వాటిపైనా సమీక్షిస్తున్నారు. ఈ సమీక్షలో ఎందుకు సమస్యలు పరిష్కారం కాలేదో అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. రెగ్యులర్గా కొనసాగుతోంది. -
భూసమస్యలకేదీ పరిష్కారం!
లింగంపేట : ధరణిలో లోపాలతో వేలాది మంది రై తులు ఇబ్బందిపడ్డారు. రికార్డులలో తప్పుగా నమోదవడంతో సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. వాటిని సరి చేసేందుకు మాడ్యూల్స్ లేకపోవడంతో ఏళ్ల తరబడిగా తహసీల్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రస్తుత ప్రభుత్వం ధరణిని రద్దు చేసి, భూభారతి చట్టం తీసుకువచ్చింది. అయితే ఈ చట్టంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బాధిత రైతులకు నిరాశే మిగులుతోంది. నెలలు గడుస్తున్నా సమస్యలు అపరిష్కృతంగానే ఉండడంతో నిట్టూరుస్తున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. రాష్ట్రంలో నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి రైతులనుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఇందులో లింగంపేట మండలం ఒకటి. మండలంలో ఏప్రిల్లో భూభారతి సదస్సులు నిర్వహించి, రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. 4,225 దరఖాస్తులు వచ్చాయి. అనంతరం సర్వే బృందాలు క్షేత్రస్థాయిలో సమస్యను పరిశీలించాయి. దీర్ఘకాలంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఎక్కువగా అసైన్మెంట్ భూములు, రెవెన్యూ, అటవీ శాఖ మధ్య వివాదాలకు సంబంధించినవే ఉన్నాయి. వీటిని ఇరు శాఖల సమన్వయంతో సర్వే నిర్వహించి పరిష్కరిస్తామని అధికారులు చెప్పారు. కానీ రెండు నెలలు గడుస్తున్నా సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. మండలంలో 4,225 దరఖాస్తులు రాగా ఇప్పటివరకు 600 లోపే పరిష్కరించారు. ఇందులో పేర్లు సరిచేయడం, మిస్సింగ్ సర్వే నంబర్లు, భూమి ఆన్లైన్లో నమోదు కానివి, సాదాబైనామాలు, వారసత్వం భూములు తదితర సమస్యలు సరిచేశారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను రెవెన్యూ అధికారులు పక్కన పెడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాతలు, తండ్రులనుంచి వారసత్వంగా వచ్చిన భూముల సమస్యలూ పరిష్కారానికి నోచుకోవడం లేదు. అలాగే ఒకే సర్వే నంబర్లో పలువురు రైతుల భూములు ఉండగా.. ధరణి పోర్టల్ తీసుకువచ్చాక అందులో ఒకరి భూమి మరొకరిపై నమోదయ్యింది. వన్ ‘బి’, అడంగల్ పహణీలో ఒకరి పేరు ఉంటే ధరణిలో ఇచ్చిన పాసుబుక్కులో మరొకరి పేరుపై రావడంతో రైతులు రైతుబంధు, రైతు భరోసా, రైతు బీమాలకు దూరమయ్యారు. సమస్యలు పరిష్కారం కాని రైతులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ విషయమై తహసీల్దార్ను వివరణ కోరగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి విచారణ చేసి సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు.భూభారతితోనూ తీరని సమస్య పైలట్ ప్రాజెక్టు మండలంలో 4,225 దరఖాస్తులు అరకొరగానే పరిష్కారాలు.. తహసీల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న బాధిత రైతులుఅధికారులు న్యాయం చేయాలి మోతె శివారులోని 324 సర్వే నంబర్లో నాకు 2.33 ఎకరాల భూమి ఉంది. ధరణి పాసుబుక్కులో 33 గుంటల భూమే నమోదయ్యింది. వారసత్వంగా వచ్చిన రెండెకరాలు నమోదు కాలేదు. అదే సర్వే నంబరులోని ఆవుల రాజయ్య పేరుతో రెండు ఎకరాలు వచ్చింది. నా భూమి ఇతరుల పేరుపై నమోదు కావడంతో సంక్షేమ పథకాలకు దూరమయ్యాను. అధికారులు న్యాయం చేయాలి. – మచ్చ సతీశ్, మోతె ప్రభుత్వ పథకాలు అందడంలేదు సర్వే నంబర్ 326/అలో నాలుగు ఎకరాల భూమి ఉంది. నాకు వారసత్వంగా వచ్చిన భూమి ఇది. ధరణి వచ్చాక అదే సర్వే నంబరులో ఉన్న దేమాంగు సిద్దవ్వ పేరుపైకి రెండు ఎకరాలు మారింది. అదే సర్వే నంబర్లో బొల్ల సాయిలు పేరుతో ఎకరం భూమి వచ్చింది. 1బి, పహణీలో నా పేరు చూపిస్తున్నా ఆన్లైన్లో పట్టా మాత్రం ఇతరుల పేరుపై చూపిస్తోంది. నా సమస్య పరిష్కరించాలి. – పూరం మల్లయ్య, మోతె 33 ఏళ్లుగా సాగు చేస్తున్నా 1992లో ఎర్రాపహడ్కు చెందిన ఇద్దరు వ్యక్తుల నుంచి 2.20 ఎకరాల భూమి కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నా. అడంగల్ పహణీలో నా పేరుపైనే ఉండేది. 2016–17 సంవత్సరంలో నాకు భూమి అమ్మిన వ్యక్తుల పేరుపైకి మార్చారు. ఈసీలో మాత్రం సత్యంనాయుడు పేరే చూపిస్తుంది. ఈ సమస్యపై భూభారతిలో దరఖాస్తు చేసుకున్నా. అధికారులు నా భూమి నాకు వచ్చేలా చూడాలి. – సత్యంనాయుడు, బూరుగిద్ద -
రైతు నేస్తం మరింత చేరువ!
● మరో 47 రైతు వేదికల్లో వీసీ యూనిట్ల ఏర్పాటు ● ప్రతి మంగళవారం కార్యక్రమాల నిర్వహణకు అవకాశం ● నేడు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న సీఎం కామారెడ్డి క్రైం : రైతు నేస్తం కార్యక్రమాన్ని మరింత చేరువ చేయడానికి సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మరో 47 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టం యూనిట్లను ఏర్పాటు చేశారు. సోమవారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్య వసాయ విశ్వవిద్యాలయం నుంచి సీఎం రేవంత్రె డ్డి నిర్వహించే కార్యక్రమంలో వీటిని వర్చువల్గా ప్రారంభించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల మధ్య నిర్వహించే వీసీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని జిల్లా వ్యవసాయ అధి కారి తిరుమల ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా కోరారు. 72 రైతువేదికల్లో వీసీ యూనిట్లు.. జిల్లాలో గతంలో 25 రైతుల వేదికల్లో మాత్రమే వీడి యో కాన్ఫరెన్స్ యూనిట్లు ఉండేవి. రాష్ట్ర ప్రభు త్వం ఇటీవల జిల్లాకు మరో 47 యూనిట్లు మంజూరు చేసింది. దీంతో జిల్లాలో మొత్తం 72 రైతు వే దికలకు వీసీ యూనిట్లు అందుబాటులోకి వచ్చా యి. రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలను ప్రసారం చేసే ఉద్దేశంతో వీసీ యూనిట్లను ఏర్పా టు చేశారు. ప్రతి మంగళవారం రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పంటల సాగులో శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు, సాగులో మెలకువలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నూతన సాగు పద్ధతు లు, సాంకేతికతను ఎప్పటికప్పుడు రైతులకు చేరవే యడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల సందేహాలను వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు నివృత్తి చేస్తారు. పంటల సాగులో అ వసరమైన సలహాలు, సూచనలు అందిస్తారు. -
మానవత్వం చాటుకున్న గ్రంథాలయ సంస్థ చైర్మన్
భిక్కనూరు : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం ఆయన మెదక్ నుంచి కారులో భిక్కనూరుకు వస్తుండగా.. 44వ నంబర్ జాతీయ రహదారిపై కారు బోల్తా పడి ఉండడాన్ని గమనించారు. కలెక్టర్ సీసీ రాజశేఖర్ కుటుంబ సభ్యులు గాయపడ్డారు. దీనిని గమనించిన చంద్రకాంత్రెడ్డి గాయపడిన వారిని బయటకు తీయడంలో సహకరించి, అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ రావడంలో ఆలస్యం కావడంతో తన కారులో జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి ● ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కామారెడ్డి: ఆయకట్టు పంట పొలాలకు సాగు నీరు అందించే పంట కాలువలు, తూముల మరమ్మతు పనులను సకాలంలో పూర్తి చేయించాలని జుక్కల్ ఎమ్మెలే తోట లక్ష్మీకాంతారావు నీటిపారుదల శాఖాధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన జుక్కల్ మండలం పెద్ద ఏడ్గి శివారులోని పెద్ద చెరువు ప్రధాన కాలువ మరమ్మతు పనులను పరిశీలించారు. పంట కాలువ మరమ్మతులలో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. ఆయకట్టు పంట పొలాలకు సాగు నీటికి ఇబ్బందులు కలగకుండా చూడాలని పేర్కొన్నారు. రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి లింగంపేట(ఎల్లారెడ్డి): అర్హులైన రైతులు వ్యవసాయ పెట్టుబడి సహాయం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసా య అధికారి అనిల్కుమార్ సూచించారు. ఈనెల 5వ తేదీలోపు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం వచ్చిన రైతులు సంబంధిత గ్రామాలకు చెందిన వ్యవసాయ విస్తీర్ణాధికారుల వద్ద ఈనెల 20 వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి పోర్టల్లో పట్టాదారు డాటా డిజిటల్ సంతకం అయిన రైతులు కూడా రైతు భరోసా పథకానికి అర్హులే అని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, డిజిటల్ సంతకం అయిన పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు, బ్యాంకు సేవింగ్ అకౌంట్ జిరాక్స్తో పాటు దరఖాస్తు ఫారంను ఏఈవోలకు అందజేయాలని సూచించారు. -
లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగాలి
నిజామాబాద్నాగారం: లక్ష్య సాధన కోసం కష్టపడుతూ ముందుకు సాగితే ఫలితం దక్కుతుందని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు. ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్లలో ఉత్తమ ఫలితాలు సాధించిన తెలంగాణలోని 11 జిల్లాలకు చెందిన 200 మందికి ఎమ్మెస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.10వేల చొప్పున ప్రోత్సాహకాలు అందజేశారు. నగరంలోని బస్వాగార్డెన్లో నిర్వహించిన కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడా రు. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా కష్టపడి చదివిన విద్యార్థులకు ఎమ్మెస్సార్ ట్రస్ట్ నగదు ప్రోత్సాహకాలు అందజేసిందన్నారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం పైతరగతులకు వెళ్తున్న విద్యార్థులు కొత్త పరిచయాలను తమ ఉన్నతి కోసం వాడుకోవాలని సూచించారు. చెడు పరిచయాలకు దూరంంగా ఉండాలని, మత్తుపదార్థాలకు అలవాటు పడొద్దన్నారు. కార్యక్రమంలో ఎమ్మెస్సార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎం సాంబశివారెడ్డి, డైరెక్టర్లు ధనుష్రెడ్డి, జి.రాజిరెడ్డి, డాక్టర్ అబ్బాపూర్ రవి, వడ్డె శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొందరికే కిసాన్ సమ్మాన్ నిధి
ఎల్లారెడ్డి : రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన తక్కువ మంది రైతులకే వర్తిస్తోంది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభమైంది. 2019 జనవరి 31 కంటే ముందు భూముల పట్టాలు కలిగిన అర్హులైన రైతులు ఈ పథకం పొందేందుకు అర్హులని కేంద్రం ప్రకటించింది. ఈ పథకం కింద నమోదైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2 వేల చొప్పున అందిస్తున్నారు. ఇప్పటివరకు 19 విడతల్లో పెట్టుబడి సాయం అందింది. 2019 జనవరి 31 తర్వాత పట్టాలు పొందిన రైతులలో చాలా మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరడం లేదు. తగ్గుతున్న లబ్ధిదారులు కేంద్రం నిబంధనలను కఠినంగా అమలు చేస్తుండడంతో కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ పథకం ప్రారంభించిన కొత్తలో జిల్లాలో 1,67,970 మంది రైతులకు లబ్ధి చేకూరింది. ప్రస్తుతం వీరి సంఖ్య 96,725కు తగ్గింది. ఆదాయపు పన్ను చెల్లించేవారు, నకిలీ పత్రాలతో పట్టాలు పొందిన వారు, గిఫ్ట్ డీడ్ కింద పట్టాలు పొందిన వారసులను ఈ పథకానికి అనర్హులుగా ప్రకటించడంతో లబ్ధిదారుల సంఖ్య తగ్గింది. అందరికీ కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధి చేకూరేలా చూడాలని రైతులు కోరుతున్నారు.కొత్తవారికి మంజూరు లేదు.. 2019 జనవరి 31 తర్వాత భూములు కొనుగోలు చేసినవారికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అందడం లేదు. వారసత్వంగా భూమి వచ్చినవారికి మాత్రమే వస్తోంది. కొత్తవారికి అమలు కావడం లేదు. – అనిల్ కుమార్, ఇన్చార్జి ఏడీఏ, ఎల్లారెడ్డిపీఎం కిసాన్ వస్తలేదు.. 2019 ఫిబ్రవరిలో పట్టా చేసుకున్నా. నాకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు రావడం లేదు. అధికారులను ఎన్నిమార్లు అడిగినా వస్తాయని చెబుతున్నారు తప్ప డబ్బులు మాత్రం ఖాతాలో జమకావడం లేదు. – విఠల్, రైతు, ఎల్లారెడ్డి కొత్తవారికి అందని పథకం కఠిన నిబంధనలతో వేలాది మంది లబ్ధికి దూరం -
విరబూసిన బ్రహ్మ కమలం
బాన్సువాడ రూరల్: మండలంలోని బోర్లం గ్రామ బీజేపీ నాయకుడు రాజిరెడ్డి ఇంట్లో శుక్రవారం రాత్రి బ్రహ్మకమలం విరబూసింది. దీంతో అతని కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు బ్రహ్మకమలాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఏడాదికి ఒకసారి మాత్రమే పూలు వికసించి కొన్ని గంటల వ్యవధిలోనే ముడుచుకుంటాయని రాజిరెడ్డి అన్నారు. పూలను శివాలయంలో సమర్పించారు. గుంతల పూడ్చివేత మాచారెడ్డి: మండల కేంద్రంలోని కామారెడ్డి, సిరిసిల్ల రహదారిపై ఏర్పడిన గుంతలు ప్రమాదకరంగా మారాయి. గుంతలతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో గ్రామ యువకులు ముందుకువచ్చి శనివారం రోడ్డుపై ప్రమాదకరంగా మారిన గుంతలను పూడ్చివేశారు. -
క్రికెట్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభం
నిజామాబాద్నాగారం : నిజామాబాద్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్–19 క్రికెట్ లీగ్ టోర్నమెంట్ను శనివారం అర్సపల్లిలో శైలేజా మైదానంలో ప్రారంభమయ్యాయి. కోచ్ నయూమ్, ఫారస్లు టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు. మొదటి మ్యాచులో గ్రీన్ వర్సెస్ ఏల్లో మధ్య జరిగింది. టాస్ గెలిచి గ్రీన్జట్టు బ్యాటింగ్ చేయగా 10 వికెట్లకు గాను 255 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన ఏల్లో జట్టు 150 పరుగులకే అలౌట్కావడంతో గ్రీన్ జట్టు గెలిచింది. రెండో మ్యాచ్లో బ్లాక్ వర్సెస్ బ్లూ బ్లాక్ మధ్య పోటీ జరిగింది. ఇందులో టాస్ గెలిచిన బ్లూ బ్లాక్జట్టు నిర్ణీత ఓవర్లలో 130 పరుగులు చేసి అలౌటైంది. అనంతరం బ్యాటింగ్కు దిగిన బ్లాక్ జట్టు నిర్ణీత ఓవర్లలో 105 పరుగులు చేసి అలౌట్కావడంతో బ్లూ బ్లాక్జట్టు గెలిచింది. ఆలయాల పరిరక్షణ మన బాధ్యత నిజామాబాద్ రూరల్: ఆలయాలను పరిరక్షించుకోడం మన బాధ్యత అని జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. శనివారం నగరంలోని కబ్జాకు గురువుతున్న బోధన్ రోడ్లోని ఆటోనగర్ హనుమాన్ మందిరాన్ని రక్షించటానికి సహకరించాలని శ్రీ హనుమాన్ మందిర పరిరక్షణ కమిటీ ప్రతినిధులు ఎంపీని కోరారు. ఈ సందర్భంగా ఇందల్వాయి కిషన్ గంట్యాల వెంకటేశ్, అంబదాస్ రావు, మల్లేశ్ గౌడ్, దోర్నాల రవి, శాతాల లింబాద్రి, మధు తదితరులు అర్బన్ బీజేపీ క్యాంపు ఆఫీసులో అర్వింద్ కు వినతి పత్రం అందించారు. -
కష్టపడి.. కొడుకులను ప్రయోజకులను చేసి..
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన కోటాయి చిన్న సిద్దయ్యకు ముగ్గురు కుమారులు. వారిని ఉన్నతంగా చదివించి ఉజ్వల భవిష్యత్కు అండగా నిలిచి తండ్రిగా విజయం సాధించాడు. గ్రామంలో తనకున్న ఎకరంన్నర భూమిని నమ్ముకుని వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చాడు. పిల్లల ఉన్నత చదువు కోసం భార్య లక్ష్మితో కలిసి 20 ఏళ్ల క్రితం కామారెడ్డి పట్టణానికి వచ్చాడు. సిద్దయ్యకు వ్యవసాయం మీద వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో పట్టణంలోని ఓ ఆయిల్ మిల్లో పనిలో చేరాడు. అలా రెండు పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ కుమారులను ఉన్నతంగా చదివించాడు. ప్రస్తుతం పెద్ద కుమారుడు ఆంజనేయులు జిల్లాలోని ఎకై ్సజ్ శాఖలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. రెండో కుమారుడు రాజు కేంద్ర ప్రభుత్వ మహిళా, శిశు సంక్షేమ శాఖ చైన్నెలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక మూడో కుమారుడు డాక్టర్ రమేష్ చిన్న పిల్లల వైద్య నిపుణుడిగా కామారెడ్డిలో కొనసాగుతున్నాడు. కుమారులు మంచిగా స్థిరపడంతో కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని సంతోషంగా ఉన్నానని సాక్షితో సిద్దయ్య చెప్పాడు. -
వ్యవసాయం చేస్తూనే..
నస్రుల్లాబాద్: మండలంలోని సంగం గ్రామానికి చెందిన సంగ్యా నాయక్ వ్యవసాయం చేస్తూనే, తన ముగ్గురు పిల్లలను ఉన్నతంగా చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు కల్యాణ్ ఐఐటీ మూడో సంవత్సరం చదువుతుండగా, రెండో కొడుకు చంద్రశేఖర్ ఐఐటీలో సీటు సాధించారు. కూతరు పద్మావతి బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. ఓ సాధారణ రైతు తమ పిల్లలను ఉన్నతంగా చదివిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అమ్మాయి అమెరికాలో ఎంఎస్.... సాధారణంగా అమ్మాయికి వయస్సు రాగానే పెళ్లి చేయాలన్న ఆలోచనలో తల్లిదండ్రులు ఉంటారు. కానీ సంగం గ్రామానికి చెందిన విఠల్ తన కూతురు మాత్రం విదేశాల్లో చదవాలని కోరుకున్నాడు. అందుకు అనుగుణంగానే ఆయన కూతురు పాల్త్య పద్మావతి హైదరాబాద్లో బీడీఎస్ చేసింది. తండ్రి ఆశయ సాధనకు అమెరికాలో ఎంఎస్ చేస్తుంది. ఓ తండాలో వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉన్న విఠల్ తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
వేయి స్తంభాల ఆలయాన్ని పోలిన ఆలయం
మీకు తెలుసా? దోమకొండ గడికోటలోని మహదేవుని ఆలయ నిర్మాణానికి అప్పట్లో వరంగల్ సంస్థానంను పరిపాలించిన రాణి రుద్రమదేవి వచ్చినట్లు శిలాఫలకం ఉంది. ప్రస్తుతం ఏదైనా కార్యక్రమాన్ని మంత్రులు, ఇతర ప్రముఖులు ప్రారంభించినప్పుడు ఏ విధంగానైతే శిలా ఫలకాలు ఏర్పాటు చేస్తున్నారో ఆ రోజుల్లో సైతం ఆమె ఆలయ నిర్మాణానికి వచ్చినప్పుడు శిలాఫలకం ఏర్పాటు చేసినట్లు పురావస్తుశాఖ ప్రతినిధులు గుర్తించారు. వరంగల్లోని వేయి స్థంభాల ఆలయాన్ని పోలిన విధంగా అదే శిల్పాకళా నైపుణ్యంతో ఇక్కడి మహదేవుని ఆలయ నిర్మాణం ఉంటుంది. –దోమకొండ -
తండ్రి కల నెరవేరింది
బిచ్కుంద(జుక్కల్): బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన బుక్కావార్ రాంచందర్ రేషన్ డీలర్గా పనిచేస్తూ కొడుకును ఉన్నత చదువులు చదివించి డాక్టర్ను చేశాడు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురొచ్చిన వెనకడుగు వేయకుండా కష్టపడి చదివించాడు. ప్రస్తుతం బాన్సువాడ ఏరియా ఆస్పత్రితో కాంట్రాక్ట్ బేసిక్పై డాక్టర్గా సేవలు అందిస్తున్నారు. కూతురు బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ, బీజెడ్సీ చేస్తుంది. మా వంశంలో ఒక్కరైన డాక్టర్ అవ్వాలని ఎన్నో కలలు కన్నాము, కొడుకు సిద్ధార్థ్ డాక్టర్ పట్టా పొందిన రోజు మా కల నిజమైంది అని రాంచందర్ పేర్కొన్నాడు. తన కొడుకు బిచ్కుందలో వైద్యుడిగా సేవలు అందించే విధంగా తండ్రిగా నా వంతు కృషి చేస్తానన్నారు. -
నాన్న కష్టం వల్లే ఉన్నత స్థాయికి..
మాచారెడ్డి: నాన్న ఒక పూట తింటూ మరో పూట పస్తులుంటూ చదివించారని, ఆయన కష్టం వల్లే తాను బ్యాంక్ మేనేజర్ అయ్యానని చుక్కాపూర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల సురేష్ అన్నారు. ఫాదర్స్ డే సందర్భంగా సాక్షితో తన తండ్రి కష్టాన్ని వివరించాడు. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితిలో ఉన్నప్పటికీ తనను బాగా చదివించడం కోసం తన తండ్రి మరింత కష్టపడ్డారన్నారు. వారి కష్టాలను తీర్చేందుకు బాగా చదివానని, 2017లో బ్యాంకు పీవోగా ఉద్యోగం సంపాదించానన్నారు. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్రాంచ్లో మేనేజర్గా పనిచేస్తున్నానన్నారు. తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన తల్లిదండ్రులు లక్ష్మి, నర్సయ్యల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదన్నారు. -
సామరస్య పరిష్కారం కోసమే లోక్ అదాలత్
బిచ్కుంద(జుక్కల్): ఇరువర్గాల కక్షిదారులు సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవడానికే జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు బిచ్కుంద జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి వినిల్ కుమార్ అన్నారు. బిచ్కుంద కోర్డులో శనివారం జడ్జి అధ్యక్షతన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈసందర్భంగా జడ్జి మాట్లాడుతూ.. చాలామంది క్షణికావేశానికి లోనై ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకొని ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగి ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. ఈసందర్భంగా రెండు వర్గాలు రాజీ కుదుర్చుకోవడంతో భూ తగాదాలు, క్రిమినల్ కేసులు, డ్రంకెన్డ్రైవ్, బ్యాంక్ తదితర 273 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. డ్రంకెన్డ్రైవ్లో రూ.509,800 జరిమానా విధించారు. బ్యాంకు కేసులలో రూ.8లక్షల 7వేలు రికవరీ చేసి కేసులు పరిష్కరించారు. న్యాయవాదులు లక్ష్మణ్రావు, మల్లేశ్వర్, విఠల్, ప్రకాష్, శివాజీ, మహ్మద్, శ్రీనివాస్ కోర్డు సిబ్బంది పాల్గొన్నారు. బాన్సువాడ: బాన్సువాడ కోర్టులో శనివారం జడ్జి భార్గవి ఆధ్వర్యంలో జాతీయ లోక్అదాలత్ నిర్వహించారు. ఈసందర్బంగా ఆమె మాట్లాడుతూ.. లోక్ ఆదాలత్లను కక్షిదారులు అందరూ ఉపయోగించుకోవాలని అన్నారు. న్యాయవాదులు లక్ష్మినారాయణమూర్తి, రమాకాంత్, దత్తాత్రిరావు, ఆనంద్, మోహాన్రెడ్డి తదితరులు ఉన్నారు. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. లోక్ అదాలత్లో 322 కేసులను పరిష్కరించినట్లు కోర్టు సిబ్బంది తెలిపారు. డీఎస్పీ శ్రీనివాస్రావు, సీఐ రవీందర్నాయక్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట ఎస్సైలు మహేష్, వెంకట్రావ్, మల్లారెడ్డి, ఎకై ్సజ్ సీఐ షాకీర్ అహ్మద్, న్యాయవాదులు పండరి, సతీష్, సాయిప్రకాష్ దేశ్పాండే, సాయిబాబా, శ్రీకాంత్, నవీద్ తదితరులున్నారు. -
వాహనాల తనిఖీ
నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని అచ్చంపేట శివారులోగల నాందేడ్–సంగారెడ్డి జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలను శనివారం ఎస్సై శివకుమార్, సిబ్బంది తనిఖీ చేశారు. వాహనదారులకు డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు సంబంధించి సరైన పత్రాలు లేనివారికి జరిమానాలు విధించినట్లు ఎస్సై తెలిపారు. బురద మట్టిలో ఇరుక్కున్న లారీ దోమకొండ: మండలంలోని ముత్యంపేట గ్రామ శివారులో శనివారం మధ్యాహ్నం ఓ లారీ బురదలో ఇరుక్కుపోగా నాలుగు గంటల పాటు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కామారెడ్డి మండలం క్యాసంపల్లి నుంచి దోమకొండ వరకు బీటీ రోడ్డు పనులకు నిధులు మంజూరు కాగా, సదరు కాంట్రాక్టర్ ముత్యంపేట వరకు పను లు పూర్తి చేసి వదిలేశాడు. ముత్యంపేట నుంచి దోమకొండ వరకు రోడ్డుకు ఇరువైపులా మట్టిని పోశారు. కాగా కొందరు రోడ్డు మధ్య లో వర్షం నీరు నిలుస్తుందని మట్టిని పోయించినట్లు తెలిసింది. వర్షానికి మట్టి పూర్తిగా బురదగా మారడంతో వాహనాలు బురదలో ఇరుక్కుంటున్నాయని గ్రామస్తులు తెలిపారు. దోమకొండ నుంచి కామారెడ్డికి లోడ్తో వెళుతున్న లారీ బురదలో ఇరుక్కొగా ఆర్టీసీ బస్సు లు కూడా ముత్యంపేట నుంచి తిరిగి కామారెడ్డికి వైపుకు వెళ్లిపొయినట్లు వారు తెలిపారు. లారీని చివరకు జేసీబీ సాయంతో తీశారు. రోడ్డుపై కూలిన మర్రిచెట్టు ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి–కామారెడ్డి ప్రధాన రహదారిపై పెద్ద మర్రి వృక్షం నేల కూలడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. శుక్రవారం రాత్రి వీచిన ఈదురు గాలులకు ఎల్లారెడ్డి డిగ్రీ కళాశాల సమీపంలో గల ప్రధాన రహదారిపై పెద్ద మర్రిచెట్టు కూలిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగాయి. సమాచారం అందుకున్న ఎస్సై మహేష్ జేసీబీతో చెట్టును తొలగించి ట్రాఫిక్ను పునరుద్దరించారు. పనులను వెంటనే ప్రారంభించాలి బాన్సువాడ రూరల్: ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి లభించిన లబ్ధిదారులందరూ వెంటనే ఇంటి పనులు ప్రారంభించాలని జక్కల్దాని తండా కాంగ్రెస్ నాయకులు బన్సీనాయక్, రవి అన్నారు. ఈసందర్భంగా గ్రామంలో వారు శనివారం లబ్ధిదారులతో కలిసి ఇంటి నిర్మాణానికి ముగ్గుపోసి భూమిపూజ చేశారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల ప్రకారం ఇళ్లు నిర్మించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శిని కలిసిన నాయకులు తాడ్వాయి(ఎల్లారెడ్డి): టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డిని శనివారం తాడ్వాయి మండలంలోని ఎర్రాపహాడ్కు చెందిన కాంగ్రెస్ నాయకులు కామారెడ్డిలో కలిశారు. పదవి రావడంపై అభినందనలు తెలిపారు. వీడీసీ చైర్మన్ ఏనుగు మోహన్రెడ్డి, లక్ష్మణచారీ, రాజలింగం, శ్రీనివాస్గౌడ్, మల్లేష్రెడ్డి, మధుసుధన్రెడ్డి, రాజిరెడ్డి, ముఖేష్గౌడ్ ఉన్నారు. -
చెరువులో పడి మత్స ్యకారుడి మృతి
బీబీపేట: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మత్స్యకారుడు మృతి చెందిన ఘటన శనివారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రభాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుర్రం లక్ష్మణ్ (35) శుక్రవారం స్థానిక పెద్ద చెరువులో చేపలవేటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం ఉదయం చెరువు వద్దకు వెళ్లి చూడగా లక్ష్మణ్ మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. కేజ్వీల్ ట్రాక్టర్ ఢీకొని ఒకరు..బోధన్రూరల్: మండలంలోని సంగం గ్రామంలో నాయకం ఎర్ర సాయిలు (48) కేజ్వీల్ ట్రాక్టర్ ఢీకొని అక్కడిక్కడే మృతి చెందినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం నాయకం ఎర్ర సాయిలు గ్రామంలోని చౌరస్తా వద్ద గల హోటల్లో టీ తాగి నడుచుకుంటూ వెళుతున్నాడు. అదే సమయంలో గ్రామానికి చెందిన సూర శ్రీనివాస్ కేజ్వీల్ ట్రాక్టర్ను అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ సాయిలును ఢీకొట్టాడు. దీంతో దమ్ము చక్రాల కింద పడిపోవడంతో సాయిలు తలకు బలమైన గాయాలై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మచ్చేందర్ రెడ్డి పేర్కొన్నారు. -
చోరీ కేసులో ఒకరి అరెస్టు
ఎల్లారెడ్డి: పట్టణంలోని సత్యం కిరాణా దుకాణంలో చోరీకి పాల్పడిన వ్యక్తిని పట్టుకొని అరెస్టు చేసినట్లు ఎస్సై మహేశ్ శనివారం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం.. మండలంలోని భిక్కనూర్ గ్రామానికి చెందిన కోడేనోళ్ల రాజు ఈ నెల 11న రాత్రి సత్యంకు చెందిన కిరాణా దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు. శనివారం ఎల్లారెడ్డిలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న రాజును పట్టుకొని విచారించగా కిరాణా దుకాణంలో చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై తెలిపారు. కంటైనర్, టీవీఎస్ ఎక్సెల్ ఢీ ● ఇద్దరికి గాయాలు నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్పేటలో జాతీయ రహదారిపై కంటైనర్, టీవీఎస్ ఎక్సెల్ ఢీకొని ఇద్దరు గాయపడిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డికి చెందిన ఒడ్డె గాలయ్య, సిద్ధవ్వ టీవీఎస్ ఎక్సెల్పై గోపాల్పేటలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా మెదక్ నుంచి ఎల్లారెడ్డి వైపు వెళ్తున్న కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాలయ్య, సిద్ధవ్వ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
దేశీదారు పట్టివేత
నిజాంసాగర్(జుక్కల్): మద్నూర్ మండలం రుశేగావ్ చౌరస్తా వద్ద శనివారం 10 దేశీదారు మద్యం బాటిళ్లను పట్టుకున్నట్లు బిచ్కుంద ఎక్సైజ్ ఎస్సై సత్యనారాయణ తెలిపారు. రుశేగావ్ నుంచి ద్విచక్ర వాహనంపై దేశీదారు మద్యం తరలిస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ఈ మేరకు చౌరస్తా వద్ద ద్విచక్ర వా హనదారుడుని పట్టుకొని మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దేశీదారు తరలిస్తున్న బండి సురేశ్తోపాటు దిగంబర్పై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత ఇందల్వాయి: మండలంలోని లోలం వాగు నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తు న్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ శనివారం తెలిపారు. వాగు నుంచి కొందరు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మే రకు వెళ్లి చూడగా ట్రాక్టర్ డ్రైవర్ల వద్ద అ నుమతి పత్రాలు లేవన్నారు. దీంతో కేసు న మోదు చేశామన్నారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే కేసులు నమోదు చేసి చ ర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. -
కడుపునొప్పి భరించలేక ఒకరి ఆత్మహత్య
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని బాద్గుణ గ్రామానికి చెందిన అల్లూరి లింగారెడ్డి (57) కడుపునొప్పి భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. అల్లూరి లింగారెడ్డి కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. కాగా, శుక్రవారం నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పంచగుడి గ్రామంలో ఉన్న తన చెల్లి వద్దకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి బయల్దేరాడు. కానీ, చెల్లెలి ఇంటికి వెళ్లకుండా మార్గమధ్యలో ఉమ్మెడ శివారులోని బ్రిడ్జి పైనుంచి గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి అల్లుడు తాటిపల్లి సాయిరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. మనస్తాపంతో ఒకరు..నిజామాబాద్ రూరల్: మోపాల్ మండలంలోని మంచిప్ప తండాకు చెందిన గోవర్ధన్(38) మంచిప్ప పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గోవర్ధన్కు అతని భార్యకు తరచూ గొడవలు జరుగుతాయి. మద్యానికి బానిసయ్యాడని శనివారం ఇంట్లో గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన గోవర్ధన్ మంచిప్ప పెద్ద చెరువులో దూకడాన్ని మృతుడి కుమారుడు శ్రీనివాస్ చూసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
పిల్లల కోసం కష్టపడ్డారు..
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిదిలోని దుబ్బ తండాకు చెందిన కాట్రోత్ మంగ త్యా నాయక్ తండా కు పెద్ద నాయకుడే అయినా తండాలోనే అతి పేద రైతు. తనకున్న రెండెకరాల భూమిలో వ్యవసా యం చేస్తూ ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు న్నా తన ముగ్గురు పిల్లలు సుజాత, రమేష్, సురే ష్ను ఉన్నత చదువులు చదివించాడు. సుజాత బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసింది. నర్సింగ్ ఆఫీసర్గా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తుంది. పెద్ద కుమారుడు రమేష్ జూనియర్ లెక్చరర్గా ప్రభుత్వ ఉద్యోగం సాధించి పెద్దపల్లి జిల్లాలో విధులు నిర్వహిస్తున్నాడు. చిన్న కుమారుడు సురేష్ ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగం సాధించాడు. అదే తండాకు చెందిన దేవుసోత్ చంద్య్రా దంపతులు వ్యవసాయం చేస్తూ తన కుమారుడు ప్రేమ్సింగ్ను చదివించారు. దీంతో ప్రేమ్సింగ్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించి విధులు నిర్వహిస్తున్నాడు. మండల కేంద్రానికి చెందిన హరాళే రావుసాహెబ్ రావు వ్యవసాయం చేస్తూ తన ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివించాడు. పెద్ద కుమారుడు ధీరజ్ బీటెక్ పూర్తి చేసి ప్రైవేటు కంపనీలో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు సౌరభ్ లక్నోలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఓ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికై , ఏడాదికి రూ. 40లక్షల ప్యాకేజీ అందుకున్నాడు. తన ఇద్దరు కుమారులు ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగాలు పొందడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థాయిలో ఉంచాలని తల్లిదండ్రులు తాపత్రయపడుతుంటారు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా తమ పిల్లలను కష్టపడి ఉన్నత స్థాయిలో నిలిపిన తండ్రుల వివరాలతో ‘సాక్షి ప్రత్యేక కథనం.. ఉజ్వల భవిష్యత్ కోసం తల్లిదండ్రుల తాపత్రయం నేడు ఫాదర్స్ డే -
మహమ్మద్నగర్లో రోడ్డెక్కిన ప్రజలు
నిజాంసాగర్: ‘‘నల్లా నీళ్లు రాక వారం రోజులాయె.. గొంతు తడపుకునేందుకు గుక్కెడు నీళ్లు దిక్కు లేవు’’ అంటూ మహమ్మద్నగర్వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మహమ్మద్నగర్ పంచాయతీ పరిధిలోని జంగాల కాలనీవాసులు బస్టాండ్ వద్ద ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడం, గ్రామ పంచాయతీ బోరు మోటార్లు చెడిపోవడంతో తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటున్నామన్నారు. పంచాయతీ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సముదాయించారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. -
నీట్లో మెరిసిన బంజపల్లివాసి
మాచారెడ్డి: బంజపల్లికి చెందిన అజ్మీర అశుతోష్ శనివారం వెలువడిన నీట్ ఫలితాల్లో 570 మార్కులు సాధించి ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 5 వేలు, ఎస్టీ కేటగిరీలో 32వ ర్యాంక్ సాధించాడు. అశుతోష్ తల్లిదండ్రులు శాంత, లింగం ఉపాధ్యాయులు. ఉత్తమ ర్యాంక్ సాధించిన అతడిని గ్రామస్తులు అభినందించారు. బిచ్కుంద వాసి.. బిచ్కుంద: మండల కేంద్రానికి చెందిన రచ్చ శ్రీవేద శృతిక నీట్ పరీక్షలో 586 మార్కులతో ఆల్ ఇండియా ఓబీసీ కేటగిరిలో 927 ర్యాంక్ సాధించింది. ఆమె తండ్రి రచ్చ శివకాంత్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ‘అన్ని వర్గాలకు అండగా మోదీ సర్కార్’ కామారెడ్డి టౌన్: అన్ని వర్గాలకు అండగా కేంద్రంలోని మోదీ సర్కార్ నిలుస్తోందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 11 ఏళ్లవుతున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ అభివృద్ధి కోసం ప్రధానిగా మోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నారన్నారు. ఆయన హయాంలో దేశం సాధించిన ప్రగతిని వివరించారు. అనంతరం మోదీ విజయాలపై ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. వికసిత భారత్ 2047 లక్ష్యంపై బీజేపీ కార్యకర్తలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చిన్నరాజులు, ప్రధాన కార్యదర్శులు నరేందర్రెడ్డి, రవీందర్రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు విపుల్, పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్, నాయకులు నరేందర్, శ్రీనివాస్, సురేష్, వేణు, సంతోష్రెడ్డి, రవీందర్, రాజు పాల్గొన్నారు. ‘పారదర్శకంగా బదిలీలు నిర్వహించాం’ కామారెడ్డి క్రైం: జిల్లా పోలీస్ శాఖలో బదిలీ ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని ఎస్పీ రాజేశ్ చంద్ర శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. 79 మంది హోంగార్డులు, 63 మంది సివిల్, ఏడుగురు ఎంప్టీ సెక్షన్ ఏఆర్ కానిస్టేబుళ్లు, 20 మంది సివిల్ హెడ్కానిస్టేబుళ్లు, 23 మంది ఏఎస్సైలకు కౌన్సెలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియను నిర్వహించామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను శనివారం జారీ చేశారు. ప్రతి పోలీస్ సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. నిబంధనలు పాటించకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రూ.40 లక్షలతో పరారీ ఖలీల్వాడి: నిజామాబాద్ ఎల్లమ్మగుట్ట ప్రాంతంలోని ఓ ప్రయివేటు సెక్యూరిటీ ఏజెన్సీలో పనిచేసే ఉద్యోగి ఏటీఎంలో డిపాజిట్ చేసే నగదు తీసుకొని పారిపోయినట్లు నాలుగోటౌన్ ఎస్సై శ్రీకాంత్ శనివారం తెలి పారు. వివరాలిలా ఉన్నాయి. ఎల్లమ్మగుట్ట వద్ద ఉన్న ప్రయివేటు ఏజెన్సీ ద్వారా ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో డబ్బులను డిపాజిట్ చేస్తారు. శనివారం ఉదయం విధులకు వచ్చిన న్యాల్కల్ రోడ్కు చెందిన రమాకాంత్ రూ.40 లక్షల 50 వేలు ఏజెన్సీ వద్ద ఉన్న వాహనంలో పెడుతుండగా ఎత్తుకొని పరారైనట్లు చెప్పారు. రమాకాంత్ ఎత్తుకెళ్లిన డబ్బులను బోధన్లోని ఓ బ్యాంక్ ఏటీఎంలో డిపాజిట్ చేయాల్సి ఉన్నట్లు సమాచారం. బ్యాంక్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు అవార్డు రావడంపై హర్షం కామారెడ్డి అర్బన్: రక్తదానంలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేసిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రెడ్క్రాస్ సోసైటీ రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డును అందుకోవడంపై టీఎన్జీవోస్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. రక్తదానంలో ఉద్యోగులు సైతం భాగస్వాములు అయ్యారని పేర్కొన్నారు. జిల్లాకు అవార్డు రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి టీఎన్జీవోస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రెడ్డి, నాగరాజు ధన్యవాదాలు తెలిపారు. -
పండ్ల తోటల పెంపకంపై అనాసక్తి
బాన్సువాడ రూరల్: పండ్ల తోటల సాగును పెంచేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తున్నా రైతులు మాత్రం ఆసక్తి చూపడం లేదు. సంప్రదాయ పంటల సాగుకే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది సుమారు 400 ఎకరాల్లో పండ్ల తోటలు పెంచాలని సీఆర్డీ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి అనుగుణంగా జిల్లా అధికారులు ఉపాధి హామీలో భాగంగా 22 మండలాలకు లక్ష్యాన్ని కేటాయించి ఆసక్తిగల రైతులతో పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టాలని ఆదేశించారు. దీంతో క్షేత్రస్థాయిలో పర్యటించిన ఉపాధి హామీ సిబ్బంది, మండల అధికారులు ఆసక్తి ఉన్న సన్న, చిన్న కారు రైతులు ఉద్యాన, పండ్లతోటలు సాగు చేసేందుకు ముందుకు వస్తే అన్ని రకాలుగా ప్రోత్సాహం అందిస్తామని సూచించారు. ఉద్యానవన పంటల సాగులో మామిడి, బత్తాయి, నారింజ, జామ, సీతాఫలం, డ్రాగన్ప్రూట్, సపోట, కొబ్బరి, దానిమ్మ, మునగ, ఆయిల్పామ్ వంటి వాటిని రైతులు తమ భూముల పరిస్థితికి అనుగుణంగా ఎంపిక చేసుకునే అవకాశం ఉందని అవగాహన కల్పించారు. ముందస్తుగా బిందు సేద్యానికి దరఖాస్తు చేసుకుంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా 90 శాతం రాయితీపై పరికరాలు అందిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో 215 మంది రైతులనుంచి 296 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకానికి దరఖాస్తులు స్వీకరించారు. అయితే 13 మంది రైతులకు చెందిన 13 ఎకరాలకు మాత్రమే ఎస్టిమేషన్ జనరేట్ అయ్యింది. ఇందులోనూ ఇద్దరు రైతులు మాత్రమే మొక్కలు నాటడానికి గుంతలు తీయడం గమనార్హం. పండ్ల తోటల పెంపకంపై ఆసక్తి లేకపోవడంతో రైతులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ముందుకు రాని రైతులు సంప్రదాయ పంటల సాగుకే మొగ్గురైతులు ముందుకు రావాలి పండ్లతోటల పెంపకానికి రైతులు ముందుకు రావాలి. ఉద్యానవన పంటల సాగుతో రైతులు మెరుగైన లాభాలు సాధించవచ్చు. ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకుంటే సంబంధిత శాఖ అధికారులు అన్ని విధాలుగా సహకరిస్తారు. టార్గెట్ను పూర్తిచేయడానికి కృషి చేస్తున్నాం. – ముజాహిద్, ఎంపీడీవో, బాన్సువాడ -
తాగునీటి కోసం ధర్నా
గాంధారి: బ్రాహ్మణపల్లి గ్రామంలో 15 రోజులుగా తాగునీటి సమస్య ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు శనివారం ఖాళీ బిందెలతో పంచాయతీ వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15 రోజులుగా మిషన్ భగీరథ నీరు రావడం లేదని, గ్రామంలో ఉన్న రెండు బోర్లు పనిచేయడం లేదని పేర్కొన్నారు. ఈ విషయమై కార్యదర్శికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రజల ధర్నాతో అధికారులు స్పందించారు. మధ్యాహ్నం వరకు మరమ్మతులు చేసి తాగు నీటి సరఫరాను పునరుద్ధరించారు. మోటార్లు పాడైపోవడం, వైర్లు తెగిపోవడంతో బోరుబావులు నడవడం లేదని పంచాయతీ కార్యదర్శి సరస్వతి పేర్కొన్నారు. సాంకేతిక కారణాలతో మిషన్ భగీరథ నీరు రావడం లేదన్నారు. బోర్లకు శనివారం మరమ్మతులు చేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించామన్నారు. బ్రాహ్మణ్పల్లిలో ధర్నా చేస్తున్న గ్రామస్తులు -
నాన్నే.. నా హీరో
మా నాన్న ఎం.రాములు సహకార శాఖలో ఉద్యోగం చేసేవారు. గతేడాది చనిపోయారు. ఆయన లేకపోవడం నాకు ఎంతో లోటు. మా నాన్న గొప్ప మానవతావాది. ఆయనే నాకు రోల్ మోడల్. నా హీరో. ఏ పని అయినా బాధ్యతగా చేయాలని చెప్పేవారు. మా నాన్నను చూసే చాలా విషయాలు నేర్చుకున్నాను. నా పనితీరు విధానం నాన్నలాగే ఉంటుంది. సివిల్ సర్వీసెస్లో మూడుసార్లు సక్సెస్ కాలేకపోయాను. ఆ సమయంలో నా వెన్నంటే ఉండి ధైర్యం చెప్పారు. మరో ప్రయత్నం చేయమంటూ ప్రోత్సహించారు. ఆయన అందించిన ప్రోత్సాహం, ఇచ్చిన ధైర్యం వల్లే సక్సెస్ అయ్యాను. మొదటి నుంచి ఆయన మా చదువుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూశారు. ఆయన మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఈ సమయంలో ఆయన లేకపోవడం నాకు ఎంతో లోటు. ఆయన చిన్ననాటి నుంచి చెప్పిన మాటలన్నీ నా మదిలో మెదలుతూనే ఉంటాయి. – ఎం.రాజేశ్ చంద్ర, ఎస్పీ, కామారెడ్డితండ్రితో ఎస్పీ రాజేశ్ చంద్ర● నాన్నంటే వెన్నంటి నిలిచే ధైర్యం ● స్ఫూర్తి ప్రదాత, నిజమైన స్నేహితుడు ● నేడు ఫాదర్స్ డేఅమ్మ నవమాసాలు మోసి జన్మనిస్తుంది. ఆ తర్వాత బిడ్డల భారం మోసేది నాన్న.. చిటికెన వేలు పట్టి నడిపిస్తూ... భుజాలపై మోస్తూ ప్రపంచాన్ని చూపిస్తాడు. ఎన్ని కష్టాలనైనా బిడ్డల కోసం భరిస్తాడు. వారి కోసం ఎన్నో త్యాగాలు చేస్తాడు. తన ఆనందాలనూ వదులుకుంటాడు. పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తాడు. వారు సాధించిన విజయాలను చూసి పొంగిపోతాడు. తమ భవిష్యత్ కోసం తాను కొవ్వొత్తిలా కరిగిపోయిన నాన్నే తమ హీరో అని, స్ఫూర్తి ప్రదాత అని చాలా మంది పిల్లలు చెప్పుకుంటున్నారు. ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డిమా నాన్న సంజీవరెడ్డి జిల్లా సహకార శాఖ అధికారిగా పనిచేస్తున్నారు. ఇష్టంగా చదవాలని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు నడవాలని చిన్నప్పటినుంచి మోటివేట్ చేసే వారు. చదువుపై ఎక్కువ శ్రద్ధ చూపాల నేవారు. ఆల్ ఇండియా సర్వీస్ సాధించి ప్రజలకు సేవ చేయాలనేవారు. ఇంజినీరింగ్ పూర్తయ్యాక సాఫ్ట్వేర్ ఉద్యోగం, తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలన్న ఉద్దేశంతో ఇరిగేషన్ డిపార్ట్మెంటులో ఉద్యోగం సాధించాను. సివిల్స్ సాధించాలన్న లక్ష్యంతో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాను. ఫెయిల్యూర్స్ వచ్చినపుడు ప్రయత్నించమని నాన్న ఎంతో సపోర్ట్ చేశారు. నాన్న సపోర్ట్ చేయడం వల్లే సాధించాను. ప్రతి ఒక్కరూ తమ ఆలోచనలను తల్లిదండ్రులతో ఓపెన్గా షేర్ చేసుకోవాలి. మనం పడిపోతే పట్టుకునేది, అండగా ఉండేది పేరెంట్సే. వాళ్లకు రెస్పెక్ట్ ఇవ్వాలి. మన సమస్యలను ఓపెన్గా చెప్పుకోగలగాలి. పేరెంట్స్ కూడా ఆ ఫ్రీడం ఇవ్వాలి. ఫాదర్స్ డే సందర్భంగా నాన్నకు శుభాకాంక్షలు. – బి.చైతన్యరెడ్డి, ఏఎస్పీ, కామారెడ్డిమా నాన్న క్రిషన్పాల్ సంగ్వాన్ హర్యానాలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. తన సర్వీసులో వేలాది మందిని తీర్చిదిద్దారు. నా జీవితానికి ఆయనే మార్గదర్శి. ఆయనే ప్రేరణ. ఆయన అందించిన ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి ఎదిగాను. దయ, దాతృత్వం, ఔదార్యం వంటి విలువలన్నీ ఆయన నుంచే నేర్చుకున్నాను. నిస్వార్థంగా సేవ చేయాలని, అవసరం ఉన్న వారికి సాయం అందించాలని ఆయన చెప్పిన మాటలు నా మదిలో నిరంతరం మెదులుతూనే ఉంటాయి. నాన్న నాటిన విలువలు పాటిస్తూ ఆయన చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడానికి నేను చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయని ఆశిస్తున్నాను. నాన్న ఏడాదిలో సగం రోజులైనా నా వద్దకు వచ్చి ఉండి వెళతారు. నేను ఎదిగిన తీరును చూసి ఆయన సంతోషపడతారు. ఫాదర్స్ డే సందర్భంగా నాన్నకు శుభాకాంక్షలు. – ఆశిష్ సంగ్వాన్, కలెక్టర్, కామారెడ్డినాన్నే రోల్ మోడల్.. -
రాజీయే రాజమార్గం
● కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశం ● జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్కామారెడ్డి టౌన్: రాజీయే రాజమార్గమని, కేసులను పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశం కల్పిస్తోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ సీహెచ్. వీఆర్ఆర్ వరప్రసాద్ పేర్కొన్నారు. శనివారం జిల్లావ్యాప్తంగా జాతీయ లోక్అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. కామారెడ్డిలోని జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్ అదాలత్ కేసు పరిష్కారమై అవార్డు పాస్ చేస్తే అది అంతిమ తీర్పు అవుతుందన్నారు. చీటింగ్ కేసులు, సైబర్ కేసులు, బ్యాంకు ప్రీ లిటిగేషన్ కేసులు, చెక్ బౌన్స్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు. ముఖ్యంగా భార్యాభర్తల కేసులు కూడా పరిష్కరిస్తామన్నారు. వీలైనన్ని ఎక్కువ కేసులను పరిష్కరించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి టి.నాగరాణి పోలీసులు, న్యాయవాదులకు సూచించారు. పోలీస్ శాఖ తరఫున పూర్తిగా సహాయ సహకారాలు ఉంటాయని జిల్లా అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో 1,840 కేసుల పరిష్కారం జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 1,840 కేసులను పరిష్కరించారు. ఇందులో 1,751 క్రిమినల్ కేసులు, రెండు సివిల్, 15 మోటర్ యాక్సిడెంట్స్ క్లయిమ్స్ ట్రిబ్యునల్(ఎంఏసీటీ) కేసులు, 37 సైబర్ క్రైం కేసులు, 35 ప్రీ లిటిగేషన్ బ్యాంక్ కేసులున్నాయి. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఈట సుమలత, జూనియర్ సివిల్ జడ్జి సుధాకర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి దీక్ష, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేశ్, పీపీలు రాజగోపాల్ గౌడ్ , దామోదర్రెడ్డి, సూర్య ప్రకాశ్, సీఐలు చంద్రశేఖర్రెడ్డి, సంపత్, న్యాయవాదులు శంకర్రెడ్డి, దేవరాజ్గౌడ్, శ్రీధర్, శ్యామ్గోపాల్రావు, న్యాయ శాఖ సిబ్బంది భుజంగ్రావు, శ్రీధర్, చంద్రసేన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మృతుడి కుటుంబానికి రూ. 1.40 కోట్ల పరిహారంతాడ్వాయి సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగి తల్లపల్లి శ్రీనివాస్గౌడ్ కుటుంబానికి రూ. 1.40 కోట్ల చెక్కును అందజేశారు. మృతుడి కుటుంబసభ్యులు పరిహారం కోసం ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్లగా.. వారు క్లయిమ్ ఇవ్వకపోవడంతో వివాదం నడిచింది. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీ సహా ప్రతివాదులపై కోర్టులో క్లయిమ్ దాఖలు చేశారు. శనివారం జరిగిన లోక్ అదాలత్లో ఈ కేసును రాజీ కుదిర్చి, మృతుడి కుటుంబ సభ్యులకు ఇన్సురెన్స్ కంపెనీ నుంచి మంజూరైన చెక్కును అందించారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
ఖలీల్వాడి: ప్రమాదవశాత్తు మురికికాలువలో పడి నగరంలోని సీతారాంనగర్ కాలనీకి చెందిన సిద్దులోల్ల మల్లేశ్(76) అనే వ్యక్తి మృతి చెందినట్లు నాల్గోటౌన్ పోలీస్స్టేషన్ ఎస్సై శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని ఆర్ఆర్ చౌరస్తాలో కూరగాయల షాపు నడిపే మల్లేశ్ గురువారం రాత్రి 7.30 గంటలకు సీతారాంనగర్ కాలనీలోని ఇంటి వచ్చాడు. ఆ తరువాత వైన్స్షాపునకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. శుక్రవారం ఉదయం గాయత్రినగర్లోని పద్మశాలి సంఘం వద్ద మురికికాలువలో ప్రమాదవశాత్తు పడి చనిపోయాడు. మృతుడి కుమారుడు ఆనిల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రోడ్డు ప్రమాదంలో.. బాన్సువాడ రూరల్: నిజాంసాగర్ మండలం కొనతండాకు చెందిన దేవసోత్ మోతీలాల్ (48) అనే వ్యక్తి గురువారం రాత్రి తిర్మలాపూర్ శివారులో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బాన్సువాడ మండలంలోని బుడిమి గ్రామంలో తాను పనిచేసే రైస్మిల్లుకు వస్తుండగా ద్విచక్రవాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. మోతీలాల్ ఘటనాస్థలంలోనే మృతిచెందాడు. మృతుడి భార్య దేవసోత్ లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మోహన్ తెలిపారు. మృతుడికి కూతురు, కొడుకు ఉన్నారు. -
నిధులున్నా.. పనుల జాడేది?
అమ్మకు అక్షరాభ్యాసంఫోన్నంబర్లు..కామారెడ్డి టౌన్ : జిల్లాలో వంద శాతం మహిళ లను అక్షరాస్యులుగా చేయాలన్న లక్ష్యంతో వి ద్యాశాఖ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ‘అ మ్మకు అక్షరాభ్యాసం’ పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా జిల్లాలో ని స్వయం సహాయక సంఘాలలో నిరక్షరాస్యు లైన మహిళలను అక్షరాస్యులుగా చేయనున్నారు. జిల్లాలోని 25 మండలాల్లో 17,194 స్వ యం సహాయక సంఘాలున్నాయి. వాటిలో 42,749 మంది సభ్యులు నిరక్షరాస్యులని గు ర్తించారు. వీరందరిని అక్షరాస్యులుగా చేసే దిశ గా కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ ఆదే శాల మేరకు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని శుక్రవారం గాంధా రి మండలం పొతంగల్ ఖుర్దులో డీఈవో రాజు ప్రారంభించారు. గ్రామంలో వేదపండితుడితో అక్షరాభ్యాసం పూజ చేయించి పలకా బలపం పట్టించి అక్షరాలు దిద్దించారు. తోటి సభ్యులతో చదువు చెప్పించే ప్రణాళిక.. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్కు అనుసంధానంగా రాష్ట్ర ప్రభుత్వం వయోజన విద్యలో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. స్వయం సహాయక సంఘాల్లోని నిరక్షరాస్యులైన మహిళలకు అదే గ్రూపులోని అక్షరాస్యులైన మహిళలతో చదువు చెప్పించనున్నారు. వయోజన విద్యా విభాగం ప్రత్యేక కార్యక్రమాలతో వారు అక్షరాలు చదివేలా, చిన్నపాటి లెక్కలు చేసేలా, ఇంగ్లిష్ చదివేలా చేయాలన్నది ఈ కార్యక్రమ ఉద్దేశం. జిల్లాలోని అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి బడిబాటలో భాగంగా నిర్వహిస్తున్న సామూహిక అక్షరాభ్యాసాలతో పాటు వయోజన విద్య విభాగానికి సంబంధించిన ’అమ్మకు అక్షరాభ్యాసం’ కార్యక్రమాలను సైతం ఘనంగా నిర్వహిస్తున్నామని అధికారులు పెర్కొన్నారు. ఆర్మూర్ 73828 43133 బోధన్ 98495 00725 నిజామాబాద్ 99592 26022 బాన్సువాడ 94911 05706 కామారెడ్డి 73828 43747వందశాతం అక్షరాస్యత జిల్లాగా మార్చాలన్న లక్ష్యంతో.. జిల్లాలో 42,749 మందిని అక్షరాస్యులుగా మార్చే కార్యక్రమం రాష్ట్రంలోనే మొదటిసారిగా జిల్లాలో వినూత్న ప్రయోగం పొతంగల్ ఖుర్దులో ప్రారంభించిన డీఈవోవంద శాతం అక్షరాస్యత కలిగిన జిల్లాగా మార్చేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు ‘అ మ్మకు అక్షరాభ్యాసం’ కార్యక్రమం ప్రారంభించాం. జిల్లావ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలలో వయసుతో సంబంధం లేకుండా నిరక్షరాస్యులైన వారిని గుర్తించాం. వారందరికీ ఈ కార్యక్రమంలో చదు వు నేర్పుతాం. తెలుగు పదాలు, ఇంగ్లిష్ అ క్షరాలు చదివేలా, చిన్నపాటి లెక్కలు చేసే లా చూడాలన్నది కార్యక్రమ ఉద్దేశం. ఇ లాంటి కార్యక్రమం చేపట్టడం రాష్ట్రంలోనే తొలిసారి. – రాజు, డీఈవో, కామారెడ్డి -
గుర్తింపు లేని పాఠశాల సీజ్
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి వేంకటేశ్వర కాలనీలో ప్రభుత్వ గుర్తింపు లేకుండా కొనసాగుతున్న హ్యాపీ కిడ్స్ పాఠశాలను ఎంఈవో రాజగంగారాం శుక్రవారం సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతులు లేని పాఠశాలల్లో తమ పిల్లల్ని చేర్పించొద్దని తల్లిదండ్రులకు సూచించారు. ప్రకటనలను చేసి మోసపోవద్దని, నాణ్యమైన విద్యనందించే పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలన్నారు. రెండు గూడ్స్ వాహనాలు..ఆర్మూర్టౌన్: ఫిట్నెస్, పర్మిట్ లేని రెండు గూడ్స్ వాహనాలను సీజ్ చేసినట్లు ఎంవీఐ వివేకానందరెడ్డి తెలిపారు. ఆర్మూర్తోపాటు మోర్తాడ్, కమ్మర్పల్లి, భీమ్గల్ ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలల బస్సులను, గూడ్స్ వాహనాలను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివేకానందరెడ్డి మాట్లాడుతూ.. వాహనదారులు సరైన సమయంలో ఫిట్నెస్, ఇన్సురెన్స్, టాక్స్ చెల్లించాలని, లేనిపక్షంలో సీజ్ చేయడం జరుగుతుందన్నారు. సీజ్ చేసిన రెండు గూడ్స్ వాహనాలను పోలీస్స్టేషన్కు తరలించారు. తనిఖీలో ఆర్టీఏ సిబ్బంది మనోజ్, దశరథ్ పాల్గొన్నారు. శ్రీ చైతన్యకు అనుమతి లేదునిజామాబాద్ అర్బన్: నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన భవనంలో శ్రీ చైతన్య పాఠశాల అడ్మిషన్ల ప్రక్రియ చేపడుతోందని, ఆ పాఠశాలకు ఎలాంటి అనుమతి లేదని నిజామాబాద్ రూరల్ మండల విద్యాశాఖ అధికారి సేవల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తింపు లేని పాఠశాలలో తమ పిల్లలకు అడ్మిషన్లు తీసుకోవద్దని తల్లిదండ్రులకు ఆయన సూచించారు. హత్యాయత్నం కేసులో ఏడేళ్ల జైలుశిక్షనిజామాబాద్ లీగల్: హత్యాయత్నం కేసులో ఒకరికి ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.500 జరిమానా విధిస్తూ సీనియర్ సివిల్ జడ్జి పి సాయిసుధ తీర్పునిచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ నగరంలోని గౌతంనగర్కు చెందిన రేణుకకు పోచమ్మగల్లీకి చెందిన మద్దికుంట వెంకటితో వివాహమైంది. గొడవ కారణంగా రేణుక తన ఇద్దరు పిల్లలతో కలిసి తల్లిగారి ఇంటి వద్దే ఉంటోంది. అదే ఇంట్లో రేణుక అక్కయ్య అనుపమ సైతం ఉంటోంది. మరో వైపు రెండో పెళ్ళిచేసుకున్న వెంకటి తన పిల్లలను చూసేందుకు 2017 జనవరి 17న అత్తవారింటికి వచ్చాడు. వెంకటితో మాట్లాడేందుకు పిల్లలు నిరాకరించడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అతడు అత్త లక్ష్మి, వదిన అనుపమపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితులు మూడో టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసును విచారించిన సీనియర్ సివిల్ జడ్జి ఐపీసీ 307 సెక్షన్ ప్రకారం నిందితుడికి ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో ప్రాసిక్యూటర్గా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ పి లక్ష్మీనర్సయ్య వ్యవహరించారు. స్వగ్రామానికి చేరిన గల్ఫ్ మృతదేహండిచ్పల్లి: మండలంలోని మిట్టపల్లికి చెందిన సిర్నాపల్లి గంగాధర్(40) కువైట్లో సోమవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన మృతదేహం శుక్రవారం గ్రామానికి చేరగా, తల్లిదండ్రులు లక్ష్మి, చిన్న గంగారాంతోపాటు భార్య సుజాత, కూతుళ్లు, కొడుకు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. కుటుంబీకులు, బంధుమిత్రులు, గ్రామస్తులు గంగాధర్ అంత్యక్రియలను పూర్తి చేశారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
బాధ్యతలు స్వీకరించిన కొత్త కలెక్టర్
నిజామాబాద్అర్బన్: జిల్లా కలెక్టర్ గా టి వినయ్ కృష్ణారెడ్డి శుక్రవా రం బాధ్యతలు స్వీకరించారు. సా యంత్రం 4.45 గంటల సమయంలో సమీకృత జిల్లా కార్యాలయాల స ముదాయం వద్దకు చేరుకున్న ఆయనకు అదనపు కలెక్టర్లు స్వాగతం పలికారు. నే రుగా తన చాంబర్కు చేరుకున్న కృష్ణారెడ్డి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో తదితరులతో భేటీ అయ్యి జిల్లా స్థి తిగతులు, స్థానిక పరిస్థితుల గురించి చర్చించారు. కొత్త కలెక్టర్ను ఆయన చాంబర్లో వివిధ శాఖల అ ధికారులు కలిసి పరిచయం చేసుకున్నారు. అదనపు కలెక్టర్లతో పాటు ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, కలెక్ట రేట్ ఏవో ప్రశాంత్, అన్ని శాఖలకు చెందిన జిల్లా అ ధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు కలెక్టర్కు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. స్వాగతం పలికిన అదనపు కలెక్టర్లు, అధికారులు -
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్
ఖలీల్వాడి: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ స్వప్న శుక్రవారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ నగరంలోని జకీర్ఫామ్ హౌజ్లో తనిఖీ చేయగా షేక్ షకీల్ అనే వ్యక్తి వద్ద 134 గ్రాముల ఎండు గంజాయి పట్టుబడింది. అతడిని విచారించగా మధుకర్ వద్ద తాను గంజాయి కొనుగోలు చేశానని చెప్పాడు. వెంటనే మధుకర్ ఇంటి వద్ద తనిఖీలు చేసి 50 గ్రాముల గంజాయి సీజ్ చేశారు. షకీల్, దాతే మధుకర్తోపాటు దాగే దాతూరాం ముగ్గురు గంజాయి విక్రయిస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది గుర్తించారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి పట్టుబడిన ఇద్దరిని రిమాండ్కు తరలించారు. గంజాయితోపాటు ఇతర మత్తుపదార్థాలు విక్రయించే వారికి సంబంధించిన సమాచారాన్ని 87126 58970 నంబర్కు అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీఐ అన్నారు. ఎక్సైజ్ ఎస్సై రాము, హెడ్కానిస్టేబుల్ చిట్టి నారాయణరెడ్డి, హమీద్, శివ, ప్రీతమ్, అవినాష్, భోజన్న, విష్ణు, రాజన్న పాల్గొన్నారు. దాడి కేసులో ఆరుగురు..మోర్తాడ్(బాల్కొండ): మండల కేంద్రంలో రొయ్యల సురేశ్ అనే వ్యక్తిపై రెండు రోజుల క్రితం దాడికి పాల్పడిన ఆరుగురిని ఆరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై విక్రమ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రొయ్యల సురేశ్ కారులో వెళ్తుండగా రొడ్డుకు అడ్డంగా బైక్ నిలిపిన మహ్మద్ షాహబాజ్, అబ్దుల్ మజార్ను బైక్ తీయాలని అనడంతో వారు దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. సురేశ్పై బైక్ను పడేసి తలపై రాడ్తో కొట్టారని, వారికి మహ్మద్ అస్లాం, అబ్దుల్ మాలిక్, అబ్దుల్ అర్భాజ్, మహ్మద్ ఫయాజ్లు మద్దతు తెలుపుతూ దాడికి ఉసిగొలుపుతూ బూతులు తిట్టారని తెలిపారు. తన భర్తపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సురేశ్ భార్య సౌమ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను రిమాండ్కు తరలించామని ఎస్సై తెలిపారు. -
భవిత కేంద్రాల్లో సమస్యల తిష్ట
బాన్సువాడ రూరల్ : విద్యాహక్కు చట్టం 2009 అమలులో భాగంగా 6నుంచి 14 ఏళ్లలోపు బాలబాలికలందరూ ఉచిత నిర్బంధ విద్య పొందాలి. ప్రత్యేక అవసరాలు కల్గిన దివ్యాంగ విద్యార్థులు కూడా ఇందుకు మినహాయింపు కాదు. అప్పటి ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థుల కోసం 2012–13లో భవిత కేంద్రాలను నెలకొల్పింది. కామారెడ్డి జిల్లాలో 22మండలాల్లో భవితకేంద్రాలు కొనసాగుతుండగా ఐదింటికి మాత్రమే శాశ్వత భవనాలు ఉన్నాయి. మిగిలిన 17 కేంద్రాలు ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్నాయి. సుమారు 2వేల మంది దివ్యాంగులు.. కామారెడ్డి జిల్లాలోని 22 భవిత కేంద్రాల్లో సుమారు 2వేల మంది దివ్యాంగులు నమోదై ఉన్నారు. ఫిజియో థెరపీ, ప్రత్యేక విద్య కోసం వచ్చే విద్యార్థులు సుమారు 300 మంది ఉన్నారు. వీరంతా జన్యులోపాలతో పాటు పోలియో, పక్షవాతం, వినికిడిలోపం, ఎముకల బలహీనత, బుద్ధిమాంద్యం, బహుళవైకల్యం వంటి 21రకాల రుగ్మతలతో బాధపడ్తున్నారు. వీరితో ఎస్కార్టు సహాయంతో వివిధ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు 400మంది వరకు ఉన్నారు. మౌలిక వసతులు కరువు.. భవిత కేంద్రాల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. మల,మూత్ర శాలలు పాడై ఏళ్లు గడుస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ర్యాంపులు, రెయిలింగ్ చెడిపోయాయి. గోడలపై బొమ్మలు లేక, ఏళ్ల తరబడి వాల్ పెయింటింగ్ చేయించక పోవడంతో భవనాలు బోసిబోతున్నాయి. బాన్సువాడలోని భవితకేంద్రంలో కాంట్రాక్టర్ నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో కట్టిన ఏడాదికే మలమూత్ర శాలలు ఽపాడైపోయాయి. నీటిసౌకర్యం నిలిచిపోయింది. పలుచోట్ల టైల్స్ పగిలిపోయాయి. దీంతో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోనే భవితకేంద్రం ఉన్నా అధికారులు పట్టింపులేదు. భవిత కేంద్రానికి ఫిజియోథెరపీ, ప్రత్యేక విద్య కోసం వచ్చే విద్యార్థులు, వారి వెంట వచ్చే ఎస్కార్ట్లకు మూత్రవిసర్జనకు పోవాలన్నా ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతులకు నోచుకోని మూత్రశాలలు సమస్యలు పరిష్కరించాలంటున్న ప్రజలునెలాఖరుకల్లా మరమ్మతులు బాన్సువాడ భవిత కేంద్రంలో మల మూత్రశాలలు పాడైపోయిన మాట వాస్తవమే. భవిత కేంద్రానికి వచ్చే దివ్యాంగ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇబ్బంది కలుగకుండా ఈనెలాఖరు కల్లా నిధులు సమీకరించి మరమ్మతులు చేయిస్తాం. – నాగేశ్వరరావు, మండల విద్యాధికారి, బాన్సువాడ -
జిల్లాలోని కేజీబీవీలకు మంజూరైన నిధుల వివరాలు..
నాగిరెడ్డిపేట: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలలో అవసరమైన మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇందులో దా దాపు సగం నిధులను మంజూరు చేసింది. ఈ పనులను విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే పూ ర్తి చేయాల్సింది. కానీ పాఠశాలలు పునఃప్రారంభమైనా పనుల జాడ మాత్రం కనిపించడం లేదు. జిల్లాలో 19 కేజీబీవీలు ఉన్నాయి. ఆయా వి ద్యాలయాల భవనాల మరమ్మతులు, అదనపు గదుల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 3.41 కోట్లు కేటాయించింది. మొదటి విడతగా పాఠశాలలవారీగా నిధులను కేటాయిస్తూ మొత్తం రూ. 1.64 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ నిధులతో కేజీబీవీల్లో అదనపు వసతి గృహాలు, అదనపు టాయ్లెట్లు, స్నానపు గదులు, అదనపు కిచెన్ షెడ్లు, క్రీడా కోర్టులు, సెప్టిక్ట్యాంకులు, డ్రెయినేజీ అవుట్లెట్లు, డ్రెయినేజీ పైపులైన్ల నిర్మాణం, విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు ఇదివరకు ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ల మరమ్మతులు, సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు, విద్యుత్ వైరింగ్ మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. వీటితోపాటు గతంలో అసంపూర్తిగా ఉన్న భవనాల పనులను సైతం పూర్తి చేయాలి. ఆయా పనులకు అనుమతులు లభించకపోవడంతో పనులు ప్రారంభానికి నోచుకోవడం లేదు. నాలుగు పాఠశాలలకు అధిక నిధులు జిల్లాలో 19 కేజీబీవీలు ఉండగా.. నాలుగింటికి మా త్రం అధిక నిధులు కేటాయించారు. నాగిరెడ్డిపేట, రామారెడ్డి, తాడ్వాయి, మాచారెడ్డిలలోని భవనా లను చాలా ఏళ్ల క్రితం నిర్మించారు. దీంతో వాటి మరమ్మతులతోపాటు అదనపు గదుల నిర్మాణం కోసం ఎక్కువ నిధులు ఇచ్చినట్లు తెలుస్తోంది. నిధుల కేటాయింపులో ఆలస్యంతోనే.. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో మరమ్మతులకు నిధుల కేటాయింపులో ఆలస్యం జరిగింది. ఏప్రిల్ 24న వేసవి సెలవులు ఇచ్చారు. అప్పటికే నిధులు మంజూరు చేసి, పనులు చేపట్టి ఉంటే పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి పూర్తి చేయడానికి అవకాశం ఉండేది. కానీ ప్రభుత్వం గతనెల 15న నిధులు కేటాయించింది. ఇప్పటికీ పనుల అంచనాలకు అనుమతులు రాలేదు. దీంతో పనులు మొదలు కావడం లేదు. అధికారులు త్వరగా పనులు ప్రారంభమయ్యేలా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. అంచనాలు రూపొందించాం జిల్లాలోని కేజీబీవీల్లో చేపట్టాల్సిన మరమ్మతుల కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఆయా పనులకు సంబంధించి ఇప్పటికే అంచనాలు రూ పొందించి ఉన్నతాధికారులకు నివేదించాం. అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం. – సుబ్బారాయుడు, ఏఈ, టీజీఈడబ్ల్యూఐడీసీ, కామారెడ్డిపాఠశాల కేటాయించిన మంజూరైన నిధులు నిధులు (రూ.లక్షల్లో) (రూ.లక్షల్లో) గాంధారి 5 2.410 బాన్సువాడ 5 2.410 జుక్కల్ 8 3.856 ఎల్లారెడ్డి 8 3.856 పిట్లం 8 3.856 బీబీపేట 8 3.856 బిచ్కుంద 8 3.856 దోమకొండ 8 3.856 కామారెడ్డి 8 3.856 రాజంపేట 11 5.302 మద్నూర్ 11 5.302 భిక్కనూరు 11 5.302 లింగంపేట 16 7.712 బీర్కూర్ 16 7.712 నిజాంసాగర్ 21 10.122 మాచారెడ్డి 45 21.690 రామారెడ్డి 48 23.136 తాడ్వాయి 48 23.136 నాగిరెడ్డిపేట 48 23.136 మొత్తం 341 164.632 కేజీబీవీల్లో మరమ్మతులకు నిధుల కేటాయింపు 19 విద్యాలయాలకు రూ. 3.41 కోట్లు మొదటి విడతలో రూ. 1.64 కోట్లు మంజూరు పాఠశాలలు పునఃప్రారంభమైనా మొదలుకాని పనులు -
ఆర్టీసీ హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్గా న్యాయవాది సుశ్మన్ రెడ్డి
నిజామాబాద్ లీగల్: తెలంగాణ ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్గా నిజామాబాద్కు చెందిన న్యాయవాది సుశ్మన్ రెడ్డి నియమితులయ్యారు. సుశ్మన్ రెడ్డి నియామకం పట్ల నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మామిళ్ల సాయిరెడ్డి, మాణిక్రాజ్, బార్ కౌన్సిల్ సభ్యుడు రాజేందర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుశ్మన్ రెడ్డిని నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. సీనియర్ న్యాయవాదులు అజార్ కిషన్ రావు, నారాయణదాస్, జగన్ గౌడ్, న్యాయవాదులు శ్యామ్ బాబు, శ్రీనివాస్ గౌడ్, సురేష్, ఇంతియాజ్, ప్రకాష్ గౌడ్, వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఎత్తిపోతల ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం● ఆయిల్, కాపర్ వైరు చోరీ ● రూ.10 లక్షల ఆస్తినష్టం రెంజల్(బోధన్): మండలంలోని తాడ్బిలోలి ఎత్తిపోతల పథకం మొదటి స్టేజీ గోదావరి నది ఒడ్డున ఉన్న ట్రాన్స్ఫార్మర్ను దుండగులు గురువారం రాత్రి ధ్వంసం చేసి ఆయిల్, కాయిల్స్ను ఎత్తుకెళ్లారు. 2016లో ఇదే తరహా చోరీ జరిగింది. ట్రాన్స్ఫార్మర్ను దుండగులు ధ్వంసం చేసి చోరీ చేసినట్లు శుక్రవారం గుర్తించిన స్థానిక రైతులు ఎత్తిపోతల కమిటీ చైర్మన్ మౌలానాకు సమాచారం అందించారు. ఆయన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై చంద్రమోహన్ ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. సుమారు రూ.10 లక్షల విలువైన ఆయిల్, కాయిల్స్ను దుండగులు ఎత్తుకెళ్లారని గుర్తించారు. విషయం తెలిసినా విద్యుత్ అధికారులు అక్కడికి రాకపోవడంపై ఆయకట్టు రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్రంలోనే ఏకైక పట్టు చేనేత సహకారం సంఘం
మీకు తెలుసా? తెలంగాణ ఉన్న ఏకైక పట్టు చేనేత సహకార సంఘం ఆర్మూర్ పట్టణంలో కొనసాగుతోంది. గోల్బంగ్లా వద్ద ఉన్న పట్టు చేనేత సహకార సంఘాన్ని 1951 ఏప్రిల్ 3వ తేదీన ఆప్కో రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు పండిత్ శివలింగు స్థాపించారు. ఈ ప్రాంతంలో ఉన్న పట్కారి (ఖత్రి) పట్టు కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు చేనేత కార్మికులను భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో సహకార సంఘాన్ని ఏర్పాటు చేశారు. పట్టుచీరలు, పట్టు ధోవతులు, కండువాలు, తలపాగాలు, షర్టింగ్ పట్టు వస్త్రాలను మగ్గాలపై నేసి విక్రయించేందుకు దీన్ని నెలకొల్పారు. ఆర్మూర్ పట్టు చేనేత సహకార సంఘం స్థాపించనప్పుడు 98 మంది చేనేత కార్మికులు ఉండేవారు. 1990లో కార్మికుల సంఖ్య 576 మందికి పెరిగింది. ప్రస్తుతం సుమారు 468 మంది సభ్యులున్నారు. పట్టును బెంగళూరు నుంచి తీసుకొస్తారు. గతంలో కోల్కతా, కశ్మీర్ నుంచి తీసుకొచ్చేవారు. పట్టు వస్త్రాలు నేసే ముడి సరుకు (అడ్డదారం, నిలువు దారం) ధరలు ప్రస్తుతం పెరగడంతో ఉత్పత్తి చేసిన పట్టువస్త్రాల అమ్మకాల్లో లాభాలు రాకపోవడంతో ఆర్థిక భారంతో నేత పనికి క్రమంగా స్వస్తి పలుకుతున్నారు. ఇక్కడ నేసిన పట్టు వస్త్రాలకు మన రాష్ట్రంతోపాటు జిల్లాలోనూ పెద్దగా ఆదరణ లేదు. పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలోని నాందెడ్, బస్మత్, నాయ్గావ్, పర్బనీలో పట్టు వస్త్రాలను విక్రయిస్తారు. – ఆర్మూర్ -
విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీ
బాన్సువాడ రూరల్/కామారెడ్డి రూరల్/నిజాంసాగర్/నస్రుల్లాబాద్ / మాచారెడ్డి : విద్యార్థులకు పలు చోట్ల ఉపాధ్యాయులు శుక్రవారం పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలను పంపిణీ చేశారు. బాన్సువాడ మండలం బోర్లం జెడ్పీహైస్కూల్లో హెచ్ఎం వెంకట రమణ. రెడ్క్రాస్ బాన్సువాడ అధ్యక్షులు శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రావణి దేవేందర్రెడ్డిలతో కలిసి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులు, యూనిఫాంలను పంపిణీ చేశారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన పుస్తకాలు, ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. నిజాంసాగర్ మండలం వెల్గనూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థు లకు ఒక జత యూనిఫాం అందజేశారు. నస్రుల్లాబాద్ మండలం మైలారం గ్రామంలో ఎంపీడీవో సూర్యకాంత్ విద్యార్థులకు పుస్తకాలు,యూనిఫాంలు అందించారు. మాచారెడ్డి మండలం లచ్చాపేటలో విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేశారు. -
బీబీపేట బాలికల పాఠశాల బాలుర పాఠశాలకు బదిలీ
బీబీపేట: అరవై ఏళ్ల చరిత్ర కలిగిన బీబీపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను బాలుర పాఠశాలకు బదిలీ చేశారు. ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల 1965లో ప్రారంభించబడింది. దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఉత్తర్వులు జారీ.. బీబీపేటలో గత మూడేళ్ల క్రితం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభించడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు బాలుర ఉన్నత పాఠశాలలో కళాశాల కొనసాగింది. అయితే ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో పాటు పాఠశాల విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయనే ఉద్దేశ్యంతో అందులో నుంచి కళాశాలను ప్రస్తుతం బాలికల పాఠశాలకు తాత్కాలికంగా మారుస్తూ గురువారం డీఈవో రాజు ఉత్తర్వులు జారీ చేశారు. బాలికల పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులను బాలుర పాఠశాలకు వెళ్లాలని ఉత్తర్వుల్లో సూచించారు. ఆందోళనకు సిద్ధమైన విద్యార్థుల తల్లిదండ్రులు మండలంలో కేవలం ఒకటే బాలికల పాఠశాల ఉండడంతో దానిని బాలుర పాఠశాలకు మార్చడంపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళనకు సిద్దమవుతున్నారు. తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యాచరణకు సిద్ధమవుతున్నారు.పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని ధర్నామండల కేంద్రంలో ఉన్న పభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని కోరుతూ విద్యార్థినుల తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. శుక్రవారం స్థానిక పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. బాలికల పాఠశాలను ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కేటాయించడంపై విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ప్రధాన రోడ్డుపై బైఠాయించి రెండు గంటల పాటు నిరసన తెలిపారు. ఉన్నత విద్యాశాఖ అఽధికారులు స్పందించి పాఠశాలను యథావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. జూనియర్ కళాశాల కోసం బాలికల పాఠశాల కేటాయింపు వ్యతిరేకంగా కార్యాచరణకు సిద్ధమవుతున్న తల్లిదండ్రులు -
ఫోన్ చేస్తే బస్సు వేళలు.. చార్జీల వివరాలు
ఖలీల్వాడి: ఆర్టీసీ బస్సు ప్రయాణికుల కోసం సంస్థ మరో సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. నిజామాబాద్ రీజియన్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, కామారెడ్డి డిపోల నుంచి ఆయా ప్రాంతాలకు బస్సులు బయలుదేరు సమయం వివరాల తెలుసుకునేందుకు బస్టాండ్లకు వెళ్లే అవసరం లేకుండా ప్రత్యేక ఫోన్ నంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ నంబర్లకు ఫోన్ చేసి బస్సుల వేళలు, చార్జీల వివరాలు తెలుసుకోవచ్చు. సంస్థ కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని సురక్షిత ప్రయాణం చేయాలని ఆర్ఎం జ్యోత్స్న శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. -
● అయితే హత్యలు.. లేకపోతే ఆత్మహత్యలు ● చిన్నపాటి గొడవలకే కఠిన నిర్ణయాలు
● కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామానికి చెందిన స్రవంతి (25), తన కొడుకు రుద్రేశ్వర్ (4) తో కలిసి ఈనెల 6న చిన్నమల్లారెడ్డి చెరు వులో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబంలో గొడవలతో ఆత్మహత్యకు పాల్పడినట్టు మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.● లింగంపేట మండలం పోల్కంపేటలో భార్య తో జరిగిన గొడవ కొడుకు హత్యకు దారితీసింది. పిల్లలు ఆడుకుంటూ తోసుకున్న విషయమై అనిల్కు అతడి భార్యకు గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్యను కొట్టిన అనిల్.. తర్వాత నాలుగేళ్ల కొడుకు శశాంక్ను బయటకు తీసుకువెళ్లి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఇంటింటికీ మంటిపొ య్యే అన్నట్లుగా కలహాలు లేని కాపురాలు ఉండవు. ప్రతి ఇంట్లో పొరపొచ్చాలు సహజం. ఒకరినొకరు అర్థం చేసుకుంటే, ఓర్పుతో కూర్చుని మాట్లాడుకుంటే అంతా సర్దుకుంటుంది. తెగేదాకా లాగితేనే ఇ బ్బంది.. గొడవలు జరిగినప్పుడు, వివాదాలు తలెత్తినప్పుడు క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలతో విలువైన ప్రాణాలు పోతున్నాయి. కొందరు ఆవేశంలో ప్రాణాలు తీస్తుండగా.. మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కుటుంబా ల్లో తలెత్తే చిన్నపాటి గొడవలతో ఆవేశాలకు లోన వుతుండడంతో సమస్యలు పెరుగుతున్నాయి. వివాహేతర సంబంధాలతో.. చాలా సంఘటనల్లో వివాహేతర సంబంధాల వల్లే హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అన్యోన్యంగా ఉన్న జంట మధ్య అనుమానాలు తలెత్తి అ వి తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. తన భర్త పరాయి సీ్త్రతో తిరుగుతున్నాడని తెలిసిననుంచి ఇద్దరి మధ్య విభేదాలు మొదలై అవి చినికిచినికి గాలివానగా మారి హత్యలు, ఆత్మహత్యలకూ దారితీస్తున్నాయి. భార్య లేదా భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నపుడు ప్రియుడు/ప్రియురాలితో కలిసి కట్టుకున్న భర్త/భార్యను హతమారుస్తున్న సంఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. మద్యం, వ్యసనాలు కూడా కారణమే... కుటుంబాల్లో వివాదాలు, విభేదాలకు మద్యంతో పాటు జూదం, బెట్టింగులు కూడా కారణమవుతున్నాయి. తాగుడు, ఇతర వ్యసనాలకు అలవాటు పడిన కొడుకును తల్లిదండ్రులు మందలించినా, భర్తను భార్య మందలించినా తాగిన మత్తులో కన్నవారిని, కట్టుకున్న భార్యను చంపడానికి వెనుకాడడం లేదు. కొన్ని సందర్భాల్లో తాగి ఇబ్బంది పెడుతున్న కొడుకు/భర్తను భరించలేని కుటుంబ సభ్యులు ఆవేశంలో చంపేస్తున్నారు. మద్యంతో పాటు ఇతర వ్యసనాలు కాపురాలను కకావికలం చేస్తున్నాయి. ఇలాంటి ఘటనలు గతంలో జిల్లాలో చోటు చేసుకున్నాయి. చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలు, హత్యలు సాధారణంగా మారాయి. ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది. చిన్నచిన్న కారణాలతో హత్యలు చేస్తున్నారు. లేకపోతే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎక్కువగా క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలతో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. పిట్లం మండలం రూంతండాకు చెందిన ద రావత్ కృష్ణ (28) చిన్నకొడప్గల్ గ్రామ పంచా యతీ కార్యదర్శిగా ఉద్యోగం చేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయంలో సద రు మహిళకు ఆమె భర్తకు గొడవలు జరిగాయి. చివరకు వారిద్దరు కలిసి దరావత్ కృష్ణను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. మరో ఇద్దరి సహకారంతో కృష్ణను కత్తితో పొడిచి చంపి చెరువులో పడేశారు. -
భూ సమస్యల పరిష్కారానికే భూభారతి
దోమకొండ/తాడ్వాయి/నస్రుల్లాబాద్/సదాశివనగర్ : భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి కార్యక్రమం ప్రభుత్వం నిర్వహించిందని తహసీల్దార్ సుధాకర్ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. మండలంలోని అన్ని గ్రామాల్లో భూభారతి సదస్సులు ముగిసినట్లు వివరించారు. తాడ్వాయి మండలం సోమారం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ శ్వేత మాట్లాడారు. నస్రుల్లాబాద్ మండలం అంకోల్ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ సువర్ణ రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. గ్రామానికి చెందిన 40 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారని, వాటిని విచారణ జరిపి సమస్య పరిష్కరిస్తామన్నారు. సదాశివనగర్ మండలంలోని ఉత్తునూర్ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో తహసీల్దార్ సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు.ఈకార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్కుమార్, డిప్యూటీ తహసీల్దార్లు రేఖ, తిరుపతి, ఆర్ఐలు వెంకట స్వామి, సాహిత్య, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తహసీల్దార్ సుధాకర్ ముగిసిన రెవెన్యూ సదస్సులు -
పాముకాటుతో..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండలంలోని వాడి గ్రామానికి చెందిన బాల్లింగం కిష్టయ్య(67) అనే వ్యక్తి పాముకాటుతో మృతిచెందాడు. కిష్టయ్య గురువారంరాత్రి భోజనంచేసి తన ఇంట్లో నిద్రించాడు. శుక్రవారం వేకువజామున నాలుగు గంటలప్రాంతంలో తనను పాము కరిచిందని భార్య సిద్ధవ్వకు తెలిపాడు. వెంటనే ఆమె కుమారులతో కలిసి కిష్టయ్యను మెదక్ ఆస్పత్రికి తరలించింది. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించాలని సూచించారు. హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో కిష్టయ్య మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్ అర్బన్: ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులు సివిల్ సర్వీస్ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. 2026 సివిల్ సర్వీస్ పరీక్షకు సన్నద్ధమయ్యే వారికి ఉచితంగా లాంగ్టర్మ్ కోచింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 16 నుంచి జూలై 8వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలని సూచించారు. ఉచిత కోచింగ్ హైదరాబాద్లోని లక్ష్మీనగర్లో ఉంటుందని, దరఖాస్తు చేసుకున్న వారిలో వందమంది ప్రతిభావంతులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 08462 241055 నంబర్ను సంప్రదించాలని సూచించారు. కక్షిదారు వద్దకు న్యాయమూర్తి ఆర్మూర్టౌన్: జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ఆర్మూర్ కోర్టులో శుక్రవారం కొ ట్లాట కేసులో ఇరువురు రాజీపడ్డారు. అయి తే నడవలేని స్థితిలో ఉన్న కక్షిదారు దగ్గరకే న్యాయమూర్తి సరళ రాణి వచ్చారు. ఈ కేసులో రాజీ కుదిర్చారని ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. ఆస్పత్రిలో రోగి భర్త ఆత్మహత్య ఖలీల్వాడి: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మహమ్మద్ నగర్కు చెందిన సాయిలు (38) గురువారం అర్ధరాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయిలు భార్య సంగీతను అనారోగ్యం కారణంగా ఈ నెల 6న ఆస్పత్రిలో చేర్పించారు. సంగీత రక్త హీనతతో బాధపడుతుండగా, మరోవైపు ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెందిన సాయిలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
‘అంకిత భావంతో పాఠాలు బోధించాలి’
గాంధారి : ఉపాధ్యాయులు అంకిత భావంతో విద్యార్థులకు పాఠాలు బోధించాలని డీఈవో రాజు సూచించారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్య పుస్తకాలు అందించారు. కార్యక్రమంలో ఎంఈవో శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. రేపు ప్రణవానంద దాస్ స్వామీజీ రాక కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగే పలు కార్యాక్రమాలలో పాల్గొనేందుకు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) ప్రతినిధి ప్రణవానంద దాస్ రానున్నారని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భూమేశ్ గుప్తా తెలిపారు. శుక్రవారం కన్యకాపరమేశ్వరి ఫంక్షన్ హాల్లో విలేకరులతో మాట్లాడారు. స్వామీజీ రాక సందర్భంగా ఆదివారం సాయంత్రం పట్టణంలోని హౌసింగ్ బోర్డు శారదామాత ఆలయం నుంచి ధర్మశాల వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అనంతరం కన్యకా పరమేశ్వరి ఆలయంలో స్వామివారి ప్రవచన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఇస్కాన్ కామారెడ్డి ఇన్చార్జి వెంకటరాస్, కన్వీనర్ సిద్దిరాములు, ప్రతినిధులు శ్రీహరి, నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు. సర్టిఫికెట్ల జారీలో జాప్యంతో ఇబ్బందులు నాగిరెడ్డిపేట: అధికారులు రెవెన్యూ సదస్సులలో బిజీగా ఉండడంతో సకాలంలో సర్టిఫికెట్లు జారీ కాక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గత పది రోజులుగా భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. అధికారులు ఆయా సదస్సులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజీగా ఉంటున్నారు. దీంతో మిగతా కార్యకలాపాలపై ప్రభావం పడుతోంది. ప్రధానంగా విద్యాసంవత్సరం ప్రారంభం నేపథ్యంలో విద్యార్థులకు వివిధ రకాల సర్టిఫికెట్లు అవసరం అవుతాయి. కులం, ఆదాయం, లోకల్ సర్టిఫికెట్లకోసం వారు తహసీల్ ఆఫీస్కు వస్తున్నారు. కానీ అధికారులు అందుబాటులో లేకపోవడంతో వారి పనులు ముందుకు సాగడం లేదు. ఈ అంశాన్ని ‘సాక్షి’ నాగిరెడ్డిపేట తహసీల్దార్ శ్రీనివాస్రావు దృష్టికి తీసుకువెళ్లగా సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమేనన్నారు. సోమవారం నుంచి సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని పేర్కొన్నారు. -
నిబంధనలు పట్టవు.. తీరు మారదు..
కామారెడ్డి టౌన్: జిల్లాలోని కామారెడ్డి, బాన్సువా డ, ఎల్లారెడ్డి డివిజన్ల పరిధిలో పలు ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను పాటించడం లేదు. పర్యవేక్షణ, క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సిన విద్యాశాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో కొందరు గల్లీలో, అపార్ట్మెంట్లలో, గృహాల్లో బడులను నెలకొల్పుతూ విద్యను వ్యాపారంగా మార్చుతున్నారు. అనుమతులు రాకముందే కొన్ని ప్రారంభిస్తున్నారు. విద్యాశాఖ సమయసారిణి విస్మరిస్తూ తరగతులు కొనసాగిస్తున్నరనే విమర్శలు ఉన్నాయి. అయినా అధికారులు అటువైపు చూడకపోవడం, తనిఖీలు చేయకపోవడంపై అనుమానాలు తలెత్తున్నాయి. కనిపించని కనీస ప్రమాణాలు పాఠశాలలు ఏర్పాటు చేయాలంటే అనుమతి తప్ప నిసరి. ఏ పేరుతో అనుమతి తీసుకుంటారో దానినే బోర్డు, కరపత్రాలపై ముద్రించాలి. టెక్నో, ఈ టె క్నో, ప్రైమ్, టాలెంట్ లాంటి తోక పేర్లను జోడించవద్దని నిబంధనలు ఉన్నా జోడించి మరి ప్రచారం చేయడంతోపాటు బోర్డులపై ఏర్పాటు చేస్తున్నారు. గాలి, వెలుతురు వచ్చేలా విశాలమైన తరగతి గదు లు, పిల్లలు కూర్చునేందుకు వీలుగా బెంచీలు, క్రీడ ల కోసం మైదానాలు, అగ్నిమాపక శాఖ అనుమతి, అగ్నిమాపక పరికరాలు, తదితర సౌకర్యాలు కల్పించాలి. కానీ కొన్ని స్కూల్స్లలో కనీస ప్రమాణాలు పాటించడం లేదు. ఇరుకై న గదులు, దుకాణ, ఇళ్ల సముదాయాలు వంటి వాటిలో తరగతులు నిర్వహిస్తున్నారు. మైదానాలు వేరే చోటు లీజుకు తీసుకుంటున్నట్లు చూపిస్తున్నారు. జిల్లాలో అధికారికంగా ప్రైవేట్ స్కూళ్లు సుమారు 200కు పైగా ఉండగా, అ నధికారికంగా మరో 40కిపైగా ఉంటాయి. తాజాగా జిల్లా కేంద్రంలోనే 7 పాఠశాలలకు అనుమతులు లేవని తల్లిదండ్రులు గమనించాలని డీఈవోనే ప్రకటన విడుదల చేశారు. గుర్తింపులేని బడుల్లో చదవితే ధ్రువపత్రాలు లభించక విద్యార్థులు భవిష్యత్లో ఇబ్బందులు పడే పరిస్థితులుంటాయి. జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల ఇష్టారాజ్యం అధిక ఫీజు వసూళ్లు అపార్ట్మెంట్లు, నివాస గృహాల్లో స్కూల్ల నిర్వహణ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ఓ కార్పొరేట్ స్కూల్ అపార్ట్మెంట్లో కొనసాగుతుంది. పార్కింగ్ స్థలం, క్రీడా మైదానం అసలే లేదు. ఇరుకు గదుల్లో వందల సంఖ్యలో విద్యార్థులను కూర్చోబెడుతారు. విద్యానగర్ కాలనీలోగల అపార్ట్మెంట్లో ఒకటి, బహుళ అంతస్తు భవనంలో మరొకటి నిబంధనలకు విరుద్దంగా స్కూళ్లు కొనసాగుతున్నాయి. ఇరుకు గదులు, ఫైర్ సెఫ్టీ లేకుండా, మైదానం, పార్కింగ్ స్థలం కనీస ప్రమాణాలు పాటించకుండా స్కూల్స్ కొనసాగిస్తున్నారు. గోదాం రోడ్లో ప్రభుత్వ గోదాంల పక్కన నాలుగు అంతస్తుల ఇరుకు భవనంలో ఓ స్కూల్ నిర్వహిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఏమైనా ప్రమాదం జరిగితే కనీసం బైక్ వెళ్లడానికి వీలులేకుండా సెట్బ్యాక్ కూడా లేదు. పార్కింగ్, మైదానానికి గజం స్థలం కూడా లేదు. గాంధీనగర్, దేశాయిబ్రదర్స్ వెనకాల, పెద్దబజార్, ఎన్జీవోస్ కాలనీ, అశోక్నగర్ కాలనీ, కలెక్టరేట్కు కూత వేటు దూరం భవానీనగర్లో గృహ నిర్మాణ భవనాల్లో నిబంధనలకు విరుద్దంగా కనీస ప్రమాణాలు పాటించకుండా స్కూళ్లు కొనసాగుతున్నాయి. నిబంధనలు పాటించకుంటే చర్యలు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యాశాఖ నిబంధన లను పాటించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నిబంధనల మేరకు మౌలిక స దుపాయాలు కల్పించాలి. క్రీ డామైదానాలు ఏర్పాటు చేసుకోవాలి. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయవద్దు. స్కూల్లో బుక్స్, యూనిఫాం తదితర సామగ్రి విక్రయా లు చేస్తే సీజ్ చేస్తాం. తల్లిదండ్రుల నుంచి ఫిర్యా దులు వస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. –ఎస్.రాజు, డీఈవో, కామారెడ్డి ప్రత్యేక కోర్సుల పేరిట ఫీజులు జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఇ ష్టారితీన ఫీజులు వసూళ్లు చేస్తున్నాయనే విమర్శలున్నాయి. కేవలం నర్సరీ, ఒకటోతరగతి పిల్లల కే ఏడాదికి రూ. 50వేలకు పైగా వసూళ్లు చేస్తున్నా రు. అడ్మిషన్, ట్యూషన్, కంప్యూటర్, ఐఐటీ, అబాకస్ తదితర కోర్సుల పేరిట అధనంగా దండుకుంటున్నారు. జిల్లా స్థాయిలో ఫీజుల నియంత్రణ కమిటీ ఊసే లేదు. యూనిఫాం, ప్రత్యేకంగా ఒక రోజు మరో జత, రెండు రకాల బూట్లు, బెల్టు, టై, నోట్, పాఠ్య పుస్తకాలు తమకు అనుసంధానంగా ఉన్న స్టాల్లోనే కొనుగోలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులకు హుకుం జారీ చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థికభారం పడుతోంది. ఇప్పటికై నా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ చేపడితే పిల్లలకు, తల్లిదండ్రులకు మేలుజరుగుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
బీజేపీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి
ఎల్లారెడ్డి: కేంద్రంలో 11ఏళ్ల బీజేపీ పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు అన్నారు. ఎల్లారెడ్డిలో గురువారం కేంద్రంలో బీజేపీ పాలన పదకొండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో దేశంలోని ప్రజలు సుఖశాంతులతో ఉన్నారన్నారు. అనంతరం ఎల్లారెడ్డి పట్టణ బీజేపీ కార్యవర్గాన్ని ప్రకటించి, నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. పట్టణ అధ్యక్షుడిగా రాజేష్, ఉపాధ్యక్షుడిగా కాశీనాథ్, పులి రమేష్, అల్లం స్వరూప, పోచయ్య, కార్యదర్శులుగా శంకర్, శ్రీను, సహాయ కార్యదర్శులుగా శివకుమార్, రమేష్, పద్మ, పండరి, కోశాధికారిగా గజానంద్ను ఎన్నుకున్నట్లు తెలిపారు. మున్సిపల్ పార్కు ప్రారంభం కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రం పరిధిలోని టేక్రియాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపల్ చిల్డ్రన్ పార్కును గురువారం కలెక్టర్ ఆశిష్ సంంగ్వాన్ ప్రారంభించారు. ఈ ప్రాంత పిల్లలు ఆడుకునేందుకు వీలుగా ఈ పార్కును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, ఏఈ శంకర్, వార్డు ఆఫీసర్ దీప్తి, సానిటరీ ఎస్ఐ పర్వేజ్ తదితరులున్నారు. పెండింగ్ కేసులను పరిష్కరించాలి నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట స్టేషన్ పరిధిలో ఉన్న పెండింగ్ కేసులను వెంటనే పరిష్కరించాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు సూచించారు. నాగిరెడ్డిపేట పోలీస్టేషన్ను గురువారం ఆయన తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో గల పెండింగ్ కేసులపై సమీక్షించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎల్లారెడ్డి సీఐ రవీందర్నాయక్, నాగిరెడ్డిపేట ఎస్సై మల్లారెడ్డి తదితరులున్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి కామారెడ్డి టౌన్: ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్(ఎస్టీయూటీఎస్) జిల్లా అధ్యక్షుడు హన్మంత్రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ దేవునిపల్లిలో గురువారం నిర్వహించిన యూనియన్ జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ సభ్యులు కుంట రాములు, ప్రవీణ్కుమార్, రాజేందర్, యూసుఫ్, కలీబుద్దిన్ తదితరులున్నారు. విద్యుత్ షాక్తో దూడ మృతి ఎల్లారెడ్డి రూరల్: మండలంలోని మల్లయ్యపల్లిలో విద్యుత్ షాక్తో లేగ దూడ మృతి చెందినట్లు బాధితుడు గడ్డం లక్ష్మీకాంతం గురువారం తెలిపారు. బలంగా వీచిన ఈదురు గాలులకు విద్యుత్ తీగలు తెగి పడడంతో మేత మేస్తున్న లేగ దూడకు విద్యుత్ షాక్ తగిలి మరణించిందన్నారు. విద్యుత్ శాఖ అధికారులు నష్టపరిహారం అందేలా చూడాలని కోరారు. -
కబ్జా నుంచి చెరువును కాపాడండి
గాంధారి(ఎల్లారెడ్డి): కబ్జాకు గురవుతున్న నాగ్లూర్ చెరువును కాపాడాలని గ్రామస్తులు కోరారు. ఈమేరకు వారు గురువారం మండలంలో పర్యటించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్కు సమస్యను విన్నవించారు. చెరువు నుంచి నల్లమట్టిని అక్రమంగా తరలిస్తూ చెరువును కబ్జా చేస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే స్పందించి, సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేకు మండల పరిధిలోని కారోబార్లు, పారిశుధ్య కార్మికులు పెండింగ్ వేతనాలు ఇప్పించాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చారు. అధికారులతో మాట్లాడి వేతనాలు ఇప్పిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కారోబార్లు పండరి, శ్రావణ్, మనసారామ్, సాయిలు, అనిల్, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
అనుమానాస్పదస్థితిలో ఒకరి మృతి
బాన్సువాడ : పట్టణంలోని వాసవీకాలనీలో అద్దె ఇంట్లో నివాసముంటున్న గోజే రాఘవేందర్ (36) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసు లు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పిట్లం మండలం మద్దెల్చెర్వు గ్రామానికి చెందిన రాఘవేందర్ మూడేళ్లుగా ఓ స్టీల్ దుకాణంలో పనిచేస్తూ బా న్సువాడలో నివాసముంటున్నాడు. గుంటూరుకు చెందిన అంబికను ప్రేమించి పెద్దల అంగీకరంతో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నా రు. ఈ నెల 9న అంబిక తన బంధువుల ప్రథమ దినకర్మకు గుంటూరుకు వెళ్లింది. పిల్లలను మద్దెల్చెర్వులో ఉండే బావ రాజేందర్ ఇంట్లో ఉంచింది. రెండు రోజులుగా భర్త రాఘవేందర్కు ఫోన్ చేసినా కలవకపోవడంతో రాజేందర్కు స మాచారం ఇచ్చింది. దీంతో రాజేందర్ తల్లిని బాన్సువాడ లోని తమ్ముడి ఇంటికి పంప గా, లోపలి నుంచి తాళాలు వేసి ఉన్న విషయం తెలిపింది. రాజేందర్ డయల్ 100కు సమాచారం ఇవ్వ గా, పోలీసులు వచ్చి తలుపులు పగులగొట్టడంతో రాఘవేందర్ శవమై కనిపించాడు. కుటుంబసభ్యు ల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. -
మహిళల్లో రక్తహీనత నివారణకు కృషి చేయాలి
కామారెడ్డి టౌన్: మహిళల్లో రక్తహీనత నివారణకు కృషి చేయాలి జిల్లా మాతా శిశు ఆరోగ్య అధికారిణి అనురాధ అన్నారు. జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి పీహెచ్సీలో గురువారం ఆమె జిల్లా పార్మసిస్టులతో ఎనీమియా ముక్త్ భారత్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనురాధ మాట్లాడుతూ.. జిల్లా మహిళల్లో రక్తహీనత నివారణకు సకాలంలో అన్ని పీహెచ్సీలకు మందులు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. మందులు వాడేందుకు సప్లయ్ చైర్ మేనేజ్మెంట్పై పూర్తిస్థాయి శిక్షణ అందించారు. అధికారులు జానా బాయి, దీప్తి తదితరులు పాల్గొన్నారు. -
భార్యపై కోపంతో కొడుకు హత్య
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): భార్యపై కోపంతో నాలుగేళ్ల కొడుకును ఓ తండ్రి హతమార్చిన ఘటన గురువారం నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై మల్లారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పోచారం గ్రామానికి చెందిన బోయిని శ్రీహరి తన కూతురు అక్షితను ఐదేళ్ల క్రితం లింగంపేట మండలం పొల్కంపేట గ్రామానికి చెందిన నర్వ అనిల్కు ఇచ్చి పెళ్లి చేశాడు. వీరికి కొడుకు శశాంక్(4), కూతురు మనుశ్రీ (7 నెలలు) ఉంది. కాగా, అనిల్, అక్షిత పిల్లలతో కలిసి మంగళవారం మెదక్ జిల్లా శా లిపేట గ్రామంలో జరిగిన బోనాల పండుగ కో సం బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ పిల్లలు ఆడుకుంటున్న క్రమంలో అనిల్ చెల్లెలు కూతురు ను శశాంక్ మెట్లపై నుంచి తోసేశాడు. ఈ విషయమై శాలిపేటలో గొడవ జరిగింది. తిరిగి పొ ల్కంపేటకు చేరుకున్న తర్వాత భార్యాభర్తలిద్ద రూ గొడవ పడ్డారు. అదే సమయంలో అనిల్ తన భార్య అక్షితను కొట్టాడు. గురువారం అక్షితకు వైద్యం చేయించేందుకు పిల్లలతో కలిసి పోచారం గ్రామానికి వచ్చారు. అనంతరం కొడుకు శశాంక్ను బయట తిప్పుతానని చెప్పి బైక్పై పోచారం గ్రామశివారుకు తీసుకెళ్లాడు. శశాంక్ ముక్కు, నోరు మూసి స్పృహ కోల్పోయేలా చేసి అత్తారింటికి తీసుకువచ్చాడు. గమనించిన కుటుంబసభ్యులు శశాంక్ను చికిత్స నిమ్తితం మండల కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వై ద్యులు బాలుడు అప్పటికే మృతి చెందాడని చె ప్పారు. అనిల్ను నిలదీయగా భార్యపై కోపంతో తానే శశాంక్ను హత్య చేశానని చెప్పి పారిపోయాడు. అక్షిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఊపిరాడకుండా చేసి అంతమొందించిన తండ్రి -
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనను కృషిచేయాలి
బాన్సువాడ రూరల్: బడీడు పిల్లలను బడిలో చేర్పించడం ద్వారా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఏఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అయ్యాల సంతోష్రావు అన్నారు. అంతర్జాతీయ బాలకార్మిక నిర్మూలన దినోత్సవం సందర్బంగా గురువారం ఆయన రాజారాం దుబ్బలోని నిరుపేద కుటుంబాలకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల సౌకరర్యాలను సద్వినియోగం చేసుకుంటూ పిల్లలకు విద్య అందించాలని వారికి సూచించారు. ఆటో బోల్తా.. పలువురికి గాయాలు గాంధారి(ఎల్లారెడ్డి): అదుపు తప్పి ఆటో బోల్తా పడడంతో ఒకే కుటుంబానికి చెందిన పలువురికి గాయాలైన ఘటన మండల పరిధిలోని మేడిపల్లి సమీపంలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు, అంబులెన్సు సిబ్బంది ఈఎంటీ సురేశ్, పైలట్ ప్రకాశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గాంధారి మండల కేంద్రానికి చెందిన ఆరిఫ్ కుటుంబసభ్యులతో బడాపహాడ్ దర్శనం కోసం ఆటోలో బయల్దేరారు. గాంధారి– బాన్సువాడ ప్రధాన రహదారిలో బుగ్గగండి ప్రాంతంలో ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కన లోయలో పడిపోయింది. దీంతో ఆటో నడుపుతున్న ఆరిఫ్తోపాటు అందులో ప్రయాణిస్తున్న మహిళలు, పిల్లలకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు, గండివేట్ మాజీ సర్పంచ్ ఫారూఖ్ 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. క్షతగాత్రులను లోయలో నుంచి పైకి తీసుకొచ్చి అంబులెన్సులో ఎక్కించారు. ఆరిఫ్తోపాటు చిన్నారులు అమ్రాన్, అర్ఫాన్, షరీనా, షాబీనాకు తీవ్రగాయాలు కాగా మహిళలకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయం చేసిన మాజీ సర్పంచ్ ఫారూఖ్ను పలువురు అభినందించారు. -
రాళ్ల గుట్టపై.. నీళ్ల బావి
ఆర్మూర్ పట్టణంలోని నళ్లని రాళ్లతో సహ జ సిద్ధంగా ఏర్పడిన నవనాథ సిద్దుల గుట్టపై తాగునీటి అవసరాలు తీర్చే చేద బావిలో నీళ్లు, కోనేరులో ఊట ద్వారా వచ్చే నీళ్లు భక్తులకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తాయి. ● సాగు అవసరాల కోసం వందల ఫీట్లు బోరు బావులు తవ్వే ఈ ప్రాంతంలో రాళ్ల గుట్టపై ఊట లేదా వర్షం ద్వారా నీళ్లు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ● ఎత్తయిన రాళ్ల గుట్టపై నిత్యం నీరుండేలా కోనేరును ఉంది. ● రామాలయం ఎదురుగా తవ్విన బావిలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైతం నిత్యం నీళ్లు అందుబాటులో ఉండి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ● వందల ఏళ్ల క్రితం నవనాథులు గుట్టపై తపస్సు చేసుకొంటూ సిద్ధేశ్వరుడిని కొలిచే కాలంలో ఈ చేద బావి, కోనేరును నిర్మించినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. – ఆర్మూర్ మీకు తెలుసా? -
ముగిసిన పోలీసు బదిలీలు
కామారెడ్డి క్రైం: జిల్లా పోలీసు శాఖలో బదిలీల ప్రక్రియ ముగిసింది. జిల్లాలోని మూడు పోలీసు సబ్ డివిజన్ల పరిధిలో పని చేస్తున్న సివిల్ హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్సైల బదిలీలను జిల్లా పోలీసు కార్యాలయంలో నాలుగు రోజులపాటు చేపట్టారు. గురువారం నిర్వహించిన సమావేశంలో ఎస్పీ రాజేశ్చంద్ర మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల సర్వీస్ పూర్తిచేసిన హెడ్ కానిస్టేబుళ్లు, మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఏఎస్సైల బదిలీల్లో భాగంగా విల్లింగ్ స్టేషన్లు, సీనియారిటీ, దంపతుల సేవలు (స్పౌస్), ఆరోగ్య పరిస్థితులు, సర్వీస్ రికార్డులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. ప్రతి పోలీసు అధికారి క్రమశిక్షణతో మెలగాలని, నిబద్ధత, నిజాయితీతో వ్యవహరించాలని సూచించారు. ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలన్నారు. అప్పుడే పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం బలపడుతుందని పేర్కొన్నారు. అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, ఏఆర్ డీఎస్పీ యాకూబ్రెడ్డి, ఎస్బీ సీఐ తిరుపయ్య, ఆర్ఐలు నవీన్కుమార్, కృష్ణ, అధికారులు పాల్గొన్నారు. క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలన్న ఎస్పీ రాజేశ్చంద్ర -
పంటమార్పిడితో సుస్థిర ఆదాయం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పంటమార్పిడి ప్రక్రియ చేపట్టడం వల్ల రైతులు సుస్థిర ఆదాయం పొందవచ్చని మండలంలోని మాల్తుమ్మెద ఏరువాకకేంద్రం శాస్త్రవేత్తలు అనిల్రెడ్డి, రేవంత్ అన్నారు. మండలంలోని పోచారం గ్రామంలో గురువారం రైతు ముగింట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తక్కువ యూరియా వాడడం వల్ల సాగు ఖర్చు తగ్గించుకోవచ్చన్నారు. అవసరం మేరకు రసాయనాలను వినియోగించి నేలతల్లి ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలు చేసిన రషీదులను రైతులు భద్రపర్చుకోవాలని, కష్టకాలంలో నష్టపరిహారాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. ఏవో సాయికిరణ్, హెచ్వో కమలాకర్రెడ్డి, హిందూస్థాన్ యూనిలివర్ జనరల్ మేనేజర్ అశోక్, ఫీల్డ్ఆఫీసర్ పరమేశ్వర్రెడ్డి, మాల్తుమ్మెద సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యతతో పని చేయాలి
బాన్సువాడ : మున్సిపాలిటీ పరిధిలోని వార్డు ఆఫీసర్లు, వార్డు ఇన్చార్జీలు బాధ్యతతో పని చేయాలని, వార్డుల్లో పర్యటిస్తూ ఇందిరమ్మ ఇళ్ల పనులు పురోగతిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ గురువారం సమీక్షాసమావేశం నిర్వహించి వార్డుల వారీగా ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. పోచారం శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్ నుంచి ఫోన్లో అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో మాట్లాడారు. బాన్సువాడ పట్టణానికి మొదటి విడతలో 260 ఇందిరమ్మ ఇళ్లు మంజురయ్యాయని, వార్డుల వారీగా ఏ వార్డులో ఎన్ని ప్రారంభించారో, ఎన్ని బెస్మిట్ వరకు వచ్చాయనే విషయాలు వార్డు ఆఫీసర్లు, ఇన్చార్జీలకు తెలుసని, ప్రతి ఒక్క లబ్ధిదారుని కలిసి ఇల్లు నిర్మించుకునేలా ప్రొత్సాహించాలని అన్నారు. ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఇసుక రాష్ట్రంలోనే మన నియోజకవర్గంలో అతి తక్కువ ధరకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గంలోని బీర్కూర్, కిష్టాపూర్, చించోల్లి, దామరంచ క్వారీల్లో ఇసుక అందుబాటులో ఉందని, ఒక్క ఇంటి నిర్మాణానికి 20 ట్రాక్టర్ల ఇసుక అవసరమవుతుందని, వర్షాకాలం దృష్ట్యా సరిపడా ఇసుకను సొంత స్థలాల్లో డంపు చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు బాన్సువాడ పట్టణంలో 2500 డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇచ్చామని, ఇప్పుడు ఇందిరమ్మ పథకం ద్వారా స్థలం ఉన్న వారికి 260 ఇళ్లు మంజురు చేశామని, స్థలాలు లేని వారి వివరాలు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి త్వరలో మంజురయ్యేలా చూస్తానని పోచారం అన్నారు. రెండు, మూడు రోజుల్లో బాన్సువాడకు వచ్చి వార్డు ఆఫీసర్లు, ఇన్చార్జీల పనితీరును పర్యవేక్షిస్తానని అన్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం గంగాధర్, కమిషనర్ శ్రీహరిరాజు, నాయకులు కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, ఎజాస్, అసద్, సురేశ్, నార్ల రవీందర్, మాసాని శేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉండాలి వార్డు ఆఫీసర్లు, ఇన్చార్జీలు వార్డుల్లో పర్యటించాలి వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి -
సాయుధ దళాల పతాక నిధికి రూ.లక్ష విరాళం
సుభాష్నగర్/కామారెడ్డి అర్బన్: దేశ రక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తున్న భా రత త్రివిధ దళాల సేవలు మరువలేనివని, వారి సంక్షేమానికి పౌరునిగా చేయూతనంది స్తూ సాయుధ దళాల పతాక నిధికి విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి, కామారెడ్డికి చెందిన కే కృష్ణమూర్తి రూ.లక్ష విరాళం ప్రకటించారు. ఈ మేరకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి డీ రమేశ్కు ఆయన గురువారం చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి శర్మ దంపతులను శాలువాతో సత్కరించి అభినందించారు. అనంతరం అధికారి రమేశ్ మా ట్లాడుతూ కృష్ణమూర్తి శర్మను స్ఫూర్తిగా తీసుకొని ఉమ్మడి జిల్లాలోని వ్యాపారులు, ప్రజ లు దేశ రక్షణలో విధులు నిర్వహిస్తున్న సైనికులు, వారి కుటుంబాలకు స్వచ్ఛందంగా విరాళాలు అందించి చేయూతనందించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయ సిబ్బంది బదాం గంగామోహన్, ఉమేర్ పాల్గొన్నారు.భూభారతితో సమస్యలకు పరిష్కారంరామారెడ్డి: రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలు భూ భారతితో పరిష్కారమవుతాయని కామారెడ్డి ఆర్డీవో కే వీణ పేర్కొ న్నారు. రామారెడ్డి మండలం కన్నా పూర్లో గురువారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో రామారెడ్డి తహసీల్దార్ ఉమాలతతో కలిసి ఆర్డీవో వీణ పాల్గొన్నారు. కన్నాపురం గ్రామానికి చెందిన 116 మంది రైతులు భూ సమస్యలపై ఫిర్యాదులు అందజేసినట్లు ఆర్ఐ రవికాంత్ తెలిపారు. విచారణ చేపట్టి ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామన్నారు.రక్తదాన శిబిరాలనిర్వహణలో జిల్లాకు అవార్డుకామారెడ్డి క్రైం: జిల్లాలో రక్తదాన శిబిరాల నిర్వహణలో జిల్లాకు అవార్డు దక్కింది. దాతల నుంచి రక్తాన్ని సేకరించి పేదల ఆరోగ్య అవసరాలకు వినియోగించేందుకు ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో బ్లడ్ యూనిట్లను అందించినందుకుగాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అవార్డును ప్రకటించింది. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఈనెల 14వ తేదీన హైదరాబాద్లో నిర్వహించనున్న కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్వర్మ చేతుల మీదుగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అవార్డును అందుకోనున్నారు. జిల్లా కలెక్టర్తోపాటు నరేంద్ర ఆచార్య మఠ్సంస్థాన్ వారు సైతం అవార్డును స్వీకరించనున్నారు.దరఖాస్తుల ఆహ్వానంకామారెడ్డి అర్బన్: జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక పథకం కింద డి – అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి ఆసక్తి ఉన్న స్వచ్ఛంద సంస్థల (ఎన్జీవో) నుంచి ఈనెల 30వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి ఏ ప్రమీల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మాదకద్రవ్యాల బారిన పడిన వారిని వ్యసనాల నుంచి బయటకు తీసుకు రావడానికి కృషి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దరఖాస్తులను ఈ–అనుధాన్ పోర్టల్లో ఆన్లైన్ ద్వారా దాఖలు చేయాల్సి ఉంటుందని, పూర్తి వివరాలకు కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.డైట్లో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు..కామారెడ్డి అర్బన్: నిజామాబాద్ డైట్ కళాశాలలో తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ మీడియంలో బోధించేందుకు 14 అతిథి అధ్యాపక (గెస్ట్ లెక్చరర్) పోస్టుల భర్తీకి అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ టి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. సొషియాలజీ, సైకాలజీ, సైన్స్, మ్యాథ్స్, సోషల్, తెలుగు, ఫైన్ ఆర్ట్స్, ఫిజికల్ డైరెక్టర్, సోషల్ సైన్స్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. సంబంధిత సబెక్ట్ లో పీజీ, ఎంఈడీ చేసిన 65 సంవత్సరాలలోపు వారు ఈనెల 19వ తేదీ వరకు దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంఈడీ లేనిపక్షంలో బీఈడీ చేసిన వారికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులకు ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు మెరిట్ ప్రాతిపదికన ఇంటర్వ్యూలు నిర్వహించి నియమిస్తామని తెలిపారు. మరిన్ని వివరాలకు 94404 14198 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
మొదటి రోజు హుషారుగా
కామారెడ్డి టౌన్: జిల్లా వ్యాప్తంగా గురువారం పాఠశాలలు పున:ప్రారంభమయ్యాయి. తొలి రోజు విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ఉపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేశారు. హాజరైన విద్యార్థులకు పుస్తకాలు, ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా సుమారు 50 శాతం విద్యార్థులు హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. 1040 పాఠశాలల్లో సుమారు 35వేలకు పైగా విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. బడిబాట కార్యక్రమం, అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోందని డీఈవో ఎస్ రాజు తెలిపారు. పున:ప్రారంభమైన పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా 50శాతం విద్యార్థులే హాజరు -
లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి టౌన్: ఈనెల 14వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్అదాలత్లో వీలైనన్ని కేసుల పరిష్కారానికి కృషి చేయాలని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ అన్నారు. కోర్టు భవనంలో న్యాయవాదులతో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కాంపౌండబుల్, క్రిమినల్, సివిల్ తదితర కేసులు పరిష్కారం అయ్యేలా ఇరు వర్గాలతో రాజీ కుదుర్చాలని అన్నారు. సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి సుమలత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి, జూనియర్ సివిల్ జడ్జి కే సుధాకర్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి దీక్ష, కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేశ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజ్గోపాల్గౌడ్, ఏజీపీ షబానా, న్యాయవాదులు పాల్గొన్నారు. పోస్టర్ల ఆవిష్కరణ జిల్లాలోని ఏడు బెంచీలతో లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ జిల్లా చైర్మన్ వరప్రసాద్ తెలిపారు. గురువారం సాయంత్రం తన చాంబర్లో న్యాయమూర్తులతో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి, న్యాయమూర్తులు సుమలత, సుధాకర్, దీక్ష, సూపరింటెండెంట్ చంద్రసేన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సాగర్ కింద సాగుకు సన్నద్ధం
ఆయకట్టు కింద నారుమడినిజాంసాగర్: ఉమ్మడి జిల్లా వరప్రదాయని నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ ఆశాజనకంగా ఉంది. వానాకాలం పంటల సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు భరోసా ఏర్పడింది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభానికి ముందే ప్రాజెక్టులో 5 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉంది. దీంతో సుమారు నెల రోజులముందే పంటల సాగుకు ఆయకట్టు ప్రాంత రైతులు సన్నద్ధమవుతున్నారు. ప్రాజెక్టు కింద 2.5 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. అయితే అలీసాగర్ రిజర్వాయర్ వరకు 1.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రం నిజాంసాగర్ ప్రాజెక్టు నీరందుతుంది. మిగతా ఆయకట్టుకు గుత్ప, అర్గుల్ రాజారాం ఎత్తిపోతల ద్వారా సాగు నీరు అందనుంది. కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్, మహమ్మద్నగర్, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ 26 వరకు 33 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, మిగతా ఆయకట్టు నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉంది. మొదటి ఆయకట్టుతోపాటు డిస్ట్రిబ్యూటరీ 49 వరకు నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ ఆశాజనకంగా ఉండటంతో బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, వర్ని, రుద్రూర్, కొటగిరి, ఎడపల్లి, నవీపేట మండలాల్లోని రైతులు నారుమళ్లను సిద్ధం చేసుకున్నారు. ఒక్క నిజాంసాగర్, మహమ్మద్నగర్ మండలాల రైతులు నారుమళ్లుకు ఆలస్యం చేస్తున్నారు. మొదటి ఆయకట్టు ప్రాంతం కావడంతోపాటు బోరుబావులు లేక ప్రధాన కాలువపైన ఆధారపడ్డారు. ప్రధాన కాలువకు నీటి విడుదల చేపట్టకపోవడంతో మొదటి ఆయకట్టు ప్రాంత రైతులు నారుమళ్లు వేయడం ఆలస్యమవుతోంది. ప్రాజెక్టు ఆయకట్టు కింద పంటల సాగుకు సన్నద్ధమైన రైతులను భూముల దుక్కితోపాటు నారుమళ్లకు వర్షాలు ఆదుకున్నాయి. ఆశాజనకంగా నిజాంసాగర్ నీటిమట్టం పంటల సాగుకు భరోసా లభించిందంటున్న రైతులు 1.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు అందనున్న నీరుస్వల్ప ఇన్ఫ్లోనిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 590 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 1393.5 అడుగుల (5.9 టీఎంసీలు) నీరు నిల్వ ఉందన్నారు. -
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
కామారెడ్డి క్రైం: బాల కార్మిక వ్యవస్ధ నిర్మూలనుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ప్రపంచ బాల కార్మిక నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం తన చాంబర్లో వాల్ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు చిన్నతనంలోనే తమ పిల్లలను పనికి పంపిస్తే వారి ఆరోగ్యం, భవిష్యత్ నాశనం అవుతాయని, బాలలు తప్పనిసరిగా పాఠశాలల్లో ఉండాలన్నారు. బాల కార్మికులను గుర్తించే విషయంలో గ్రామ, వార్డు వలంటీర్లు, పంచాయతీ సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, సూపరింటెండెంట్ విజయభాస్కర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ కోటేశ్వర్లు, డీసీపీవో స్రవంతి, సాధన కో ఆర్డినేటర్ గిరిజ, తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య..సదాశివనగర్(ఎల్లారెడ్డి): ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఆయన గురువారం దుస్తులు పంపిణీ చేశారు. పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన ప్రముఖ సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో దుస్తులను అందజేశారు. డీఈవో రాజు, మండల ప్రత్యేకాధికారి సతీశ్యాదవ్, ఎంపీడీవో సంతోష్కుమార్, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంఈవో యోసెఫ్, డీపీఎం రమేశ్బాబు, ఏపీఎం రాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిల్లలతో పని చేయిస్తే వారి ఆరోగ్యం, భవిష్యత్ నాశనం అవుతాయి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
వివాహేతర సంబంధమే కారణం
కామారెడ్డి క్రైం: ఇటీవల హత్యకు గురైన చిన్నకొడప్గల్ జీపీ కార్యదర్శి దరావత్ కృష్ణ కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తేల్చారు. ఈమేరకు బుధవారం జిల్లాకేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాజేశ్చంద్ర వివరాలు వెల్లడించారు. పిట్లం మండలం రూమ్ తండాకు చెందిన దరావత్ కృష్ణ (28) చిన్న కొడప్గల్ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తుండేవాడు. చిన్నకొడప్గల్కు చెందిన లింగంపేట మల్కయ్య అలియాస్ మల్కన్న ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వెళ్లి ఇటీవల ఇంటికి వచ్చాడు. తన భార్య సుజాతకు పంచాయతీ కార్యదర్శి కృష్ణతో వివాహేతర సంబంధం ఏర్పడిందని గుర్తించాడు. ఈ విషయంలో భార్యతో తరచుగా గొడవపడేవాడు.చివరికి తమ సంసారం చక్కబెట్టుకోవాలని భార్యాభర్తలు నిర్ణయించుకొని, కృష్ణను చంపాలనుకున్నారు. ఇందుకోసం తమ కులస్తులైన ఏరనోళ్ల బాల్రాజ్, మల్కయ్యల సహాయం తీసుకున్నారు. ఈనెల 5న సుజాత ద్వారా కృష్ణను ఇంటికి పిలిపించుకుని నలుగురూ కలిసి కత్తి, గొడ్డలి ఇనుపరాడ్డులతో కొట్టి చంపారు. ఆపై మృతదేహాన్ని, కృష్ణ బైక్ను సమీపంలోని రెడ్డి చెరువులో పడవేశారు. 7న గాయాలతో కూడిన కృష్ణ మృతదేహాన్ని రెడ్డి చెరువులో పోలీసులు గుర్తించారు. విచారణ చేపట్టి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. వారిని రిమాండ్కు తరలిస్తున్నామని వెల్లడించారు. హత్య కేసును చేధించిన బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి, రూరల్ సీఐ రాజేష్, పిట్లం ఎస్సై రాజును ఆయన అభినందించారు. చిన్నకొడప్గల్ జీపీ కార్యదర్శి హత్య కేసును ఛేదించిన పోలీసులు నలుగురు నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్ర -
తాళం వేసిన ఇంట్లో చోరీ
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో తాళం వేసిన ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన మన్నె అంజవ్వ, కుటుంబ సభ్యులు నాలుగు రోజుల కిందట ఇంటికి తాళం వేసి, హైదరాబాద్ వెళ్లారు. కాగా మంగళవారం రాత్రి వారు ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండటంతోపాటు బీరువా తెరచి ఉండటం గమనించి, పోలీసులకు సమాచారం అందించారు. ఇన్చార్జీ ఎస్సై రాజు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో దాచిన 40 తులాల వెండి అభరణాలు, రూ. 25వేల నగదును ఎత్తుకువెళ్లినట్లు తెలిపారు. ఈమేరకు బాధిత కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మోటార్ కేబుల్ వైరు.. భిక్కనూరు: మండల కేంద్రంతో పాటు అంతంపల్లి గ్రామ శివారుల్లో ఉన్న వ్యవసాయ బోరు బావుల వద్ద మోటర్ కేబుల్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం వేకువ జామును కత్తిరించి అపహరించుకెళ్లారు. సుమారు 11మంది రైతులకు సంబందించిన కేబుల్ వైర్లు చోరీ కాగా, ఈ విషయమై వారు భిక్కనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్ఫార్మర్ కాపర్, ఆయిల్.. బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోని లక్ష్మి లిప్టు కోసం ముప్కాల్ మండలం నల్లూర్ శివారులో నిర్మించిన సబ్స్టేషన్ నుంచి ట్రాన్స్పార్మర్ కాపర్ కాయిల్స్, ఆయిల్ చోరీకి గురైంది. లిప్టు ఆపరేటర్ భానుచందర్ బుధవారం ఉదయం సబ్స్టేషన్ వద్దకు వెళ్లి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై బుధవారం ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, ముప్కాల్ ఎస్సై రజనీకాంత్ విచారణ చేపట్టారు. మే31 నుంచి జూన్ 10 మధ్య కాలంలో చోరీ జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దుండగులు రెండు ట్రాన్స్ఫార్మర్లను కింద పడేసి కాపర్ కాయిల్స్, ఆయిల్ ఎత్తుకెళ్లారు. లక్ష్మి లిప్టు డిప్యూటీ ఈఈ సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.