breaking news
Kamareddy District News
-
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
● వీసీలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికామారెడ్డి క్రైం: వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం ఆయన హైదరాబాద్నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు రూ.కోటి విడుదల చేశామన్నారు. అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి వెనక్కి పిలిపించాలని సూచించారు. జాగ్రత్తలు తీసుకుంటున్నాం జిల్లాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంత్రితో పేర్కొన్నారు. జిల్లాలో 43 లోలెవెల్ బ్రిడ్జిలు, కాజ్వేలు ఉన్నాయన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, గ్రామపంచాయతీ, పోలీస్, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వరద పరిస్థితిని సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. అవసరం ఉన్నచోట్ల బాధితులకు వసతి కల్పించడం కోసం పాఠశాలలు, గ్రామపంచాయతీ భవనాలు, ఫంక్షన్ హాళ్లలో రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేశామని వివరించారు. వీసీలో ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్ పాల్గొన్నారు. -
సంక్షిప్తం
బెజుగంచెరువుతండాలోనే జీపీ భవనాన్ని నిర్మించాలి నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని బెజుగంచెరువుతండాలోనే గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించాలని కోరుతూ తండావాసులు గురువారం ఎంపీడీవో ప్రభాకరచారికి వినతిపత్రాన్ని అందజేశారు.గ్రామపంచాయతీ నూతనంగా ఏర్పడినప్పటి నుంచి తమ తండాలోనే పంచాయతీ కార్యాలయం కొనసాగుతుందని వారు చెప్పారు. తమ తండాలో గల సర్వే నం.171లోనే గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించేందుకు పనులు చేపడితే ఏర్రకుంటతాండవాసులు అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. బెజుగంచెరువుతండా గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించేందుకు పలుమార్లు తండాపెద్దల సమక్షంలో మాట్లాడినా సమస్య పరిష్కారం కావడంలేదన్నారు. ప్లకార్డులతో కాంగ్రెస్ నాయకుల నిరసన లింగంపేట(ఎల్లారెడ్డి): లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్గాంధీ అరెస్టుకు నిరసనగా గురువా రం లింగంపేట అంబేడ్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోడీ దొంగ ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినట్లు ఆరోపించారు. కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణాగౌడ్, కాసిఫ్, రాజేశ్వర్గౌడ్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళా సంఘాలు అన్ని విధాలా అభివృద్ధ్ది చెందాలి తాడ్వాయి : గ్రామాలలోని మహిళా సంఘాలు అన్ని రకాల అభివృద్ధి చెందాలని సీసీ గంగారెడ్డి అన్నారు. మండలంలోని కరడ్పల్లి గ్రామంలో గురువారం గ్రామ సమాఖ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పొదుపు సంఘాలకు సంబందించి రికార్డులను పరిశీలించారు. ఆర్థిక లావాదేవిలపై చర్చించారు. ప్రతినెల 10వ తేదీ లోపు శ్రీనిధి, బ్యాంకు లింకేజీ రుణాలు చెల్లించేలా తీర్మానాలు చేశారు. కొత్తగా వృద్ధుల సంఘాలు, వికలాంగుల సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. వీవోఏలు, పొదుపు సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఇన్సూరెన్సు ద్వారా రక్షణ పొందాలి ఎల్లారెడ్డిరూరల్: యువకులు 18 ఏళ్లు నిండిన తర్వాత బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని, బీమా చేయించుకోవాలని ఎస్బీఐ ఫీల్డ్ ఆఫీసర్ సనత్కుమార్ అన్నారు. గురువారం మండలంలోని మత్తమాల గ్రామంలో బ్యాంకు ఖాతాదారులకు అవగాహన కల్పించారు. ప్రతిఒక్క ఖాతాదారుడు పీఎంఎస్బీవై, పీఎంజేజేబీవై ఇన్సూరెన్సు చేసుకొని రక్షణ పొందాలన్నారు. -
అందరికీ ‘సంక్షేమం’ బాధ్యత అధికారులదే
భిక్కనూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపైన ఉందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. గురువారం భిక్కనూరు రైతు వేదికలో మండలంలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైన ఉద్యోగుల విధులకు అటకం కలిగిస్తే చూస్తూ ఉరుకోబోమన్నారు. నిబంధనలను తుంగలో తొక్కాలని లొత్తిడి తీసుకువచ్చిన వారి భరతం పడతానని హెచ్చరించారు. డిసెంబర్ నాటికి తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించి రెండెళ్లు పూర్తి అవుతాయని, అప్పటిలోగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందకుంటే ఊరుకునేది లేదని పేర్కొన్నారు. సమావేశంలో తహసీల్దార్ సునీత, ఎంపీడీవో రాజ్కిరణ్రెడ్డి, ఎంఈవో రాజ్గంగారెడ్డి, ఏఈ సంకీర్త్, ప్రభుత్వ వైద్యురాలు యెమీమా తదితరులు పాల్గొన్నారు. -
పరీక్ష కేంద్రం పరిశీలన
భిక్కనూరు: భిక్కనూరులోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్లో గురువా రం పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 171 మంది విద్యార్థులకుగాను 169 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని పరీక్షల నియంత్రణ అధికా రి సంపత్కుమార్ పరిశీలించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ సుధాకర్గౌడ్ ఉన్నారు. కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈనెల 22న ఉద యం 8 గంటలకు జిల్లా స్థాయి అండర్–14, 16, 18, 20 బాలబాలికల జూనియర్స్ ట్రయథ్లాన్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్రెడ్డి, అనిల్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఒక్కో పాఠశా ల నుంచి ఒక్కో అంశంలో ఇద్దరు క్రీడాకారులకు మాత్రమే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. క్రీడాకారులు తప్పనిసరిగా ఆధార్కార్డు లేదా పుట్టిన తేది ధ్రువీకరణ ప త్రం వెంట తీసుకురావాలని సూచించారు. కామారెడ్డి అర్బన్: సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ శాఖ కామారెడ్డి డీఈ కల్యాణ్ చక్రవర్తిని ఉద్యోగులు ఘెరావ్ చేశారు. గురువారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో విద్యుత్ ఉద్యోగు ల 1104 సంఘం ఆధ్వర్యంలో డీఈ కార్యా లయంలో నేలపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 15 ఏళ్లుగా స మస్యలను పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఆఫీసులో కనీ సం మూత్రశాలలు లేకపోవడం సిగ్గుచేటన్నారు. సమస్యల పరిష్కారానికి సీఎండీ, ఇతర ఉన్నతాధికారులు అనుకూలంగా ఉన్నా కామారెడ్డి, దోమకొండ, ఎల్లారెడ్డి డీఈలు నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. 30 రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని డీఈ లు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో అందోళన విరమించారు. నిరసనలో 1104 యూనియన్ జిల్లా అధ్యక్షుడు కమలాకర్, కార్యదర్శి శ్రీనివాస్, ప్రతినిధులు జగదీష్, పర్వయ్య, రాములు, కృష్ణమూర్తి, నర్సింలు, రవీందర్ పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట: వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలాన్ని మరోమారు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేసింది. 2019 ఫిబ్రవరిలో సమకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించగా ఈ ఏడాది ఫిబ్రవరిలో పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం పదవీకాలాన్ని ఆరునెలలపాటు పొడిగించింది. ఆ గడువు గురువారంతో ముగియగా.. మరో ఆరు నెలలపాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. నిజాంసాగర్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి గురువారం 2,334 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటమట్టం 1,405అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. గురువారం సాయంత్రానికి 1,393.50 అడు గుల (5.863 టీఎంసీలు) నీరు నిల్వ ఉంద ని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఈ సీజన్ లో ఇప్పటివరకు 2.969 టీఎంసీల వరద నీరు వచ్చి చేరిందని పేర్కొన్నారు. జూన్ నెలాఖరు వరకు 0.406 టీఎంసీ ఇన్ఫ్లో రాగా.. జూలైలో 0.899 టీఎంసీ, ఆగస్టులో ఇప్పటివరకు 1.392 టీఎంసీల నీరు వచ్చిందని తెలిపారు. సింగూరు ప్రాజెక్టు వరద గేటు ఎత్తి నీటిని విడుదల చేస్తుండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టుకు మరింత వరద వచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ‘కల్యాణి’లోకి 230 క్యూసెక్కులు.. ఎల్లారెడ్డిరూరల్: తిమ్మారెడ్డి శివారులోని కల్యాణి ప్రాజెక్టులోకి 230 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 అడుగులు కాగా.. 408.50 అడుగుల నీటిని ఉంచుతూ 230 క్యూసెక్కులను నిజాంసాగర్ మెయిన్ కెనాల్కు మళ్లిస్తున్నారు. -
దారి దోపిడీ ముఠా అరెస్ట్
కామారెడ్డి క్రైం: రోడ్డుపై వెళ్తున్న కంటెయినర్ లారీలోకి రన్నింగ్లోనే చొరబడి సెల్ఫోన్లు, హెడ్సెట్ బాక్సులను ఎత్తుకెళ్లిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గతనెల 11న తెల్లవారుజామున కామారెడ్డికి సమీపంలోని టేక్రియాల్ వద్ద హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న ఓ కంటెయినర్ దారి దోపిడీకి గురైంది. బైక్పై వచ్చిన దుండగులు కంటెయినర్ రన్నింగ్లో ఉండగానే కట్టర్లతో సీల్ కట్ చేసి తలుపులు తెరిచి సినీ ఫక్కీలో లోనికి చొరబడి, దాదాపు రూ.8 లక్షల విలువైన ఫోన్లు, హెడ్సెట్ల బాక్సులను దొంగిలించారు. లారీని ఆపి డ్రైవర్ అడ్డుకోబోగా అతడిని చాకుతో బెదిరించి పరారయ్యారు. డ్రైవర్ ఫిర్యాదుతో దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్ జిల్లాకు చెందిన ప్రదీప్ హుడా, విమల్ సిసోడియా, రితిక్ జాంజా, బలరాం జాంజా, మాల్వియా దీపక్ కుమార్, దేవిసింగ్ సిసోడియాలుగా గుర్తించారు. వారిలో రితిక్ జాంజా, దీపక్ కుమార్, దేవిసింగ్ సిసోడియాలను గురువారం అరెస్టు చేసి విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రధాన నిఽందితులు ప్రదీప్ హుడా, విమల్ సిసోడియాలు పరారీలో ఉన్నారన్నారు. నిందితుల వద్ద నుంచి చోరీకి ఉపయోగించిన వస్తువులు, ఓ బైకు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు ఛేదనలో విశేషంగా కృషి చేసిన కామారెడ్డి రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సై రంజిత్, మాచారెడ్డి ఎస్సై అనిల్, సిబ్బంది రవికిరణ్, రామస్వామి, అరుణ్, బందగి, శ్రీనివాస్, లక్ష్మీకాంత్లను అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.కామారెడ్డి క్రైం: రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలతో జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈసారి 7 నెలల కాలంలో యాక్సిడెంట్లు గణనీయంగా తగ్గాయని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. గతేడాది మొదటి 7 నెలల్లో 170 ప్రమాదాలలో 179 మంది మరణించారని పేర్కొన్నారు. ఈ యేడాది ఇప్పటివరకు 129 ప్రమాదాలు జరగ్గా 135 మంది మరణించారని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 41 రోడ్డు ప్రమాదాలు, 44 మరణాలు తగ్గాయని వివరించారు. ప్రమాదాలను అరికట్టడం కోసం జిల్లా పోలీసు శాఖ చేస్తున్న కృషిని డీజీపీ జితేందర్ ప్రశంసించారని పేర్కొన్నారు.కామారెడ్డి క్రైం: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వారం రోజులపాటు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ ద్వారా జిల్లాలో పోగొట్టుకున్న, చోరీకి గురైన 154 సెల్ఫోన్లను రికవరీ చేశామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. వాటి విలువ దాదాపు రూ. 26 లక్షలు ఉంటుందన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. సీఈఐఆర్ విధానంలో ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 3,705 సెల్ఫోన్లను రికవరీ చేశామన్నారు. రికవరీలో ప్రతిభ చూపిన బృందం సభ్యులను ఎస్పీ అభినందించారు. ఫోన్లు పోగొట్టుకున్నవారు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఆర్ఎస్సై బాల్రాజు(8712686114) ను సంప్రదించి తమ సెల్ఫోన్లు తీసుకువెళ్లాలని సూచించారు. -
రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
బీబీపేట: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. గురువారం ఆయన తుజాల్పూర్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాన్ని తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. భారీ వర్షాలు, వరద ముప్పుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, నెలలు నిండిన గర్భిణులను డెలివరీ కోసం ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు ముందుగానే చేయాలని ఆదేశించారు. అవసరమైన ఇతర మౌళిక సదుపాయాల గురించి తగిన ఏర్పాట్లు చేయాలని డీఎంహెచ్వో చంద్రశేఖర్కు సూచించారు. అనంతరం జనగామ, మాందాపూర్ గ్రామాల మధ్యనున్న ఎడ్ల కట్ట వాగు లోలెవల్ బ్రిడ్జిని పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో వరదలు ముంచెత్తితే వాహనాల రాకపోకలను కట్టడి చేయాలని అధికారులకు సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్వో ప్రభుకిరణ్, వైద్యాధికారి శిరీష, ఎంపీడీవో పూర్ణచంద్రోదయకుమార్, తహసీల్దార్ గంగాసాగర్, ఎస్సై ప్రభాకర్ పాల్గొన్నారు. పెద్ద చెరువు పరిశీలన కామారెడ్డి క్రైం: కామారెడ్డి పెద్ద చెరువును కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం సాయంత్రం ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం చెరువు నీటి మట్టం, ఇన్ఫ్లో, ఔట్ఫ్లోల గురించి తెలుసుకున్నారు. అలుగు పైనుంచి ప్రజలు వెళ్లకుండా బారికేడ్లను పెట్టాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ మల్లేష్, చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్, ఈఈ వెంకటేశ్వర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. -
ఊరంతా ఒక్కటై.. మద్య నిషేధానికి జై
● స్వచ్ఛందంగా మద్య నిషేధం అమలు ● ఆదర్శంగా నిలుస్తోన్న పలు గ్రామాలు12 ఏళ్లుగా మద్యపాన నిషేధం అమలుచేస్తున్న సురాయిపల్లి లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పలుగ్రామాల్లో గ్రామ పెద్దలు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కలిసి గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహించొద్దని తీర్మానించారు. సురాయిపల్లి గ్రామస్తులు గత 12 ఏళ్లుగా సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తున్నారు. మూడేళ్ల క్రితం శెట్పల్లిసంగారెడ్డి, మెంగారం గ్రామాలు మద్యం విక్రయాలు నిలిపివేశాయి. ఈఏడాది కొత్తగా సజ్జన్పల్లి, పోతాయిపల్లి, కేశాయిపేట, అన్నారెడ్డిపల్లి, పర్మళ్ల గ్రామాలు సైతం స్వచ్ఛందంగా మద్య నిషేధం అమలు చేస్తున్నాయి. బెల్టు షాపులు, కిరాణం దుకాణాల్లో మద్యం విక్రయాలు నిలిపివేయాలని ఆంక్షలు విధించారు. ఈనిబంధనలు అతిక్రమిస్తే రూ. 50,000 నుంచి రూ.లక్షవరకు జరిమానా విధించాలని తీర్మానించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా ఎక్కడా మద్యపాన నిషేధం అమలు కావడం లేదు. గ్రామ పెద్దలు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల చొరవతో జిల్లాలోని కొన్ని గ్రామాల్లో మద్యపాన నిషేధం అమలవుతుంది.79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగ్రామాలపై ప్రత్యేక కథనం. రాజంపేట: మండలంలోని కొండాపూర్, గుండారం జీపీ పరిధిల్లోని బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలను నిషేధిస్తూ 2025 జూన్లో ఇరు గ్రామాల ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మితే వారికి రూ. లక్ష జరిమానాతో పాటు 7 చెప్పుదెబ్బలని తీర్మానంలో పేర్కొన్నారు. గ్రామంలో మద్యం అమ్మిన వారి సమాచారం తెలిపితే రూ. 10 వేల పారితోషకం అందిస్తామని, అదే విధంగా సంబంధిత వ్యక్తి పేరు గోప్యంగా ఉంచుతామని తీర్మానంలో వివరించారు. కొండాపూర్లో తీర్మాన పత్రాన్ని చూపుతున్న గ్రామస్తులు (ఫైల్) -
స్వాతంత్య్ర పోరులో పిట్లం వీరులు
● జ్ఞాపకార్థంగా బాన్సువాడ తహసీల్ ఎదుట శిలాఫలకం ఏర్పాటు ● తామ్రపత్రం ఇచ్చి సత్కరించిన అప్పటి భారత ప్రభుత్వం పిట్లం(జుక్కల్): స్వాతంత్య్ర సమర పోరాటంలో పిట్లం గ్రామానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అ ప్పటి నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడ డివిజన్ పరిధిలో 8 మంది స్వాతంత్య్ర సమరయోధులు ఉ ండగా, వారిలో 7 గురు పిట్లం గ్రామానికి చెందిన వారు కావడం విశేషం. వీరిలో నీలకంటి లోక నా రాయణ, నీలకంటి లోక లక్ష్మయ్య, ఉప్పు లక్ష్మయ్య, గంగా నాగయ్య, కొండ నారాయణ, వంజరి బాలరాజు, కుమ్మరి లక్ష్మారెడ్డి ఉన్నారు. ప్రస్తుతం వీరెవరు బతికిలేరు. వీరిలో నీలకంటి లో క నారాయణ పిట్లం సర్పంచ్ గా పని చేశారు. గ్రా మంలోని పాత గడి హనుమాన్ ఆలయం నుంచి పోలీస్ స్టేషను వరకు కాలి బాటగా ఉన్న రోడ్డు ను వెడల్పు చేసిన ఘనత, గ్రామానికి మొదటిగా విద్యుత్ తెచ్చిన ఘనత ఈయనకు దక్కింది. ఇతని సోదరుడు నీలకంటి లోక లక్ష్మయ్య తహసీల్దార్ గా పదవి విరమణ చేసినంతరం అన్నతో కలిసి పోరాటంలో పాల్గొన్నారు. ఉప్పు లక్ష్మయ్య పిట్లం గ్రామ సర్పంచ్గా పని చేశారు. అప్పట్లో తెలంగాణ విమోచన కోసం, రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అప్పటి భారత ప్రభుత్వం వీరందరికి తామ్ర పత్రం ఇచ్చి సత్కరించింది. ఇ ప్పటికి బాన్సువాడ తహసీల్ కార్యాలయం ఎదుట శిలాఫలకంపై వీరి పేర్లు ఉండటం విశేషం. వీరి జ్ఞాపకార్థం గ్రామంలో ప్రధాన కూడలిలో గాంధీ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈకూడలిలో వీరి తదనంతరం వారి వారసులు జెండా ఎగురవేస్తున్నారు.స్వాతంత్య్ర పోరులో పాల్గొన్న పిట్లం వీరుల ఫ్లెక్సీ , బాన్సువాడ తహసీల్ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన శిలాఫలకం, పిట్లంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం పిట్లం అనే పేరు ఇలా వచ్చింది స్వాతంత్య్ర సమర పోరాటం జరగుతున్న సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రహస్యంగా పిట్లంకు చెందిన సమరయోధులు రహస్యంగా యువకులచే ఒక పటాలం (గ్రూప్)ను ఏర్పాటు చేశారు. వీరందరికి రామ మందిరం వద్ద శిక్షణ ఇచ్చేవారు. పటాలం అనే పేరు కాలక్రమంలో మార్పుచెంది గ్రామానికి పిట్లంగా పేరు వచ్చింది. -
గతేడాది నవంబర్ నుంచి బొమ్మన్దేవ్పల్లిలో..
నస్రుల్లాబాద్ : మండలంలోని బొమ్మన్దేవ్ పల్లి గ్రామంలో 2024 నవంబర్ నుంచి మద్యం నిషేధం అమలు చేస్తున్నారు. గ్రామంలో ఎవ్వరైనా మద్యం అమ్మితే జరిమానా విధించాలని గ్రామస్తులు తీర్మానించారు. యువతను మద్యం నుంచి దూరంగా ఉంచితే మద్యానికి బానిసగా మారకుండా ఉంటారని గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలో మద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా విధించడంతో పాటు పట్టించిన వారికి రూ.25 వేల పారితోషికం అందిస్తూ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఈఏడాదిఫిబ్రవరి నుంచి బండారెంజల్లో... బిచ్కుంద(జుక్కల్) : మండలంలోని బండారెంజల్ గ్రామంలో 2025 ఫిబ్రవరి నుంచి మద్యపాన నిషేధం కొనసాగుతుంది.మద్యం మత్తులో వాహనాలు అదుపుతప్పి ప్రమాద బారినపడుతున్నారు. అందరి మద్దతుతో గ్రామంలోకి మద్యం తీసుకురావొద్దు, విక్రయించొద్దని తీర్మానం చేశారు. గత ఆరు నెలల నుంచి మద్యం నిషేధం కొనసాగుతుంది. గతేడాదిసెప్టెంబర్ నుంచి ఆజామాబాద్లో.. ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని ఆజామాబాద్లో 2024 సెప్టెంబర్ నుంచి గ్రామస్తులు మద్యం అమ్మకాలు నిషేధిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా మద్యం విక్రయిస్తే రూ. 50 వేల జరిమానా విధిస్తామని గ్రామస్తులు తీర్మానం చేశారు. గ్రామస్తులు చేసిన తీర్మానానికి అందరు ఇప్పటి వరకు కట్టుబడి ఉన్నారు. -
మారాల్సిందెంతో!?
కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులుకామారెడ్డి క్రైం/కామారెడ్డి అర్బన్: వందేళ్ల భారతావనిని ప్రపంచంలో అగ్రగామిగా చూడాలంటే రానున్న రోజుల్లో వ్యవస్థాపరంగా, సామాజికంగా ఇంకా ఎన్నో మార్పులు రావాల్సిన అవసరం ఉందని యువత పేర్కొంది. దేశం స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలకు సమీపిస్తున్న నేపథ్యంలో ‘వందేళ్ల భారతం ఎలా ఉండాలి’ అనే అంశంపై ‘సాక్షి’ జిల్లా కేంద్రంలోని సాందీపని డిగ్రీ కళాశాలలో గురువా రం టాక్ షో నిర్వహించింది. ఇందులో యువత పాల్గొని తమ మనోగతాన్ని సాక్షితో పంచుకుంది. కొంతకాలంగా పలు రంగాల్లో అభివృద్ధి, మార్పు కనిపిస్తున్నప్పటికీ పాలనా వ్యవస్థల్లో అవినీతి, ఓటు బ్యాంకు రాజకీయాలు ఇప్పటికీ దేశాన్ని పట్టి పీడిస్తున్నాయనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు. సాంకేతికతలో దేశం ముందంజలో ఉన్నా విద్య, వైద్యం, మౌలిక వసతులు, వ్యవసాయం, దేశ రక్షణ తదితర ముఖ్యమైన రంగాలకు మరిన్ని మెరుగులు దిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలు మహిళల వ్యక్తిగత, సామాజిక భద్రతకు పెద్దపీట వేయాలని సూచించారు. ప్రతి పనిలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలన్నారు. అలా లేకపోవడం వల్లే చాలా సందర్భాల్లో వనరుల దుర్వినియోగం జరిగి దేశ ప్రగతి వెనక్కి నెట్టబడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అవినీతిని అంతం చేసి ప్రతిభకు పట్టం కట్టాలని, అన్ని రంగాల్లో మార్పు కోసం ప్రభుత్వాలు దృష్టి సారించాలని కోరారు. తద్వారా సామాజిక న్యాయం జరిగి ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సాక్షి ప్రతినిధి వేణుగోపాలచారి, ప్రతినిధులు సత్యనారాయణ, సురేష్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.యువత చేసే చిన్న ఆలోచన దేశాభివృద్ధిలో పెద్ద ఆవిష్కరణ అవుతుందని సాందీపని కళాశాలల డైరెక్టర్ బాలాజీరావు పేర్కొన్నారు. సాధారణ డిగ్రీ చదివి ఐఏఎస్లు అయిన వారెందెరో ఉన్నారన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, సాంకేతిక దేశాభివృద్ధికి తోడ్పడతాయని పేర్కొన్నారు. ఓటమి అంటే ప్రయత్నం చేయకపోవడమనే విషయాన్ని యువత గుర్తించాలని సూచించారు. విచ్చలవిడితనం, ఊహలనుంచి సహజమైన జీవితానికి అలవాటుపడాలన్నారు. సామాజిక మాధ్యమాలను అవసరం మేరకు మాత్రమే ఉపయోగించుకోవాలని, తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని ఆ రంగంలో ఉన్నత స్థానాలకు చేరుకేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. పాలన వ్యవస్థలు అవినీతిరహితం కావాలి విద్య, వైద్యం, మహిళల భద్రత మెరుగుపడాలి వ్యవసాయం, రక్షణ రంగాలు మరింత బలపడాలి ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం దక్కాలి అప్పుడే దేశం అన్ని రంగాల్లో ముందుంటుంది ‘వందేళ్ల భారతం ఎలా ఉండాలి’ ‘సాక్షి’ టాక్ షోలో యువత మనోగతం -
‘వరి ఉత్పత్తిలో మనమే టాప్’
బాన్సువాడ రూరల్: రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో బాన్సువాడ నియోజికవర్గమే మొదటి స్థానంలో ఉందని ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. బుడ్మిలో రూ. 26 లక్షలతో నిర్మించిన సొసైటీ గోదాంను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ జాకోర, జలాల్పూర్ ప్రాంతాలకు నిజాంసాగర్ కాల్వల ద్వారా నీటిని అందించేందుకు రూ. 300 కోట్లతో సిద్దాపూర్ రిజర్వాయర్ ప్రాజెక్ట్ పనులు చేపడుతున్నామన్నారు. వ్యవసాయ గోదాంలతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకురుతుందన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్, నాయకులు గంగారాం, మధుసూదన్రెడ్డి, నాందేవ్, గోపాల్రెడ్డి, పిట్ల శ్రీధర్, ఎజాజ్, అంజిరెడ్డి, గురువినయ్, సుధాకర్గౌడ్, ఖమ్రు, గోపాలకృష్ణ, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
చెరువులో మునిగి యువకుడి మృతి ఎల్లారెడ్డి: మండలంలోని లక్ష్మాపూర్ గ్రామ శివారులో గల ఊర చెరువులో ఓ యువకుడు నీట మునిగి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాలు ఇలా.. జాన్కంపల్లి ఖుర్దు గ్రామానికి చెందిన మూడ్ పూల్యా(45) జీపీ మల్టీపర్పస్ వర్కర్గా విధులను నిర్వహిస్తుండేవాడు. గ్రామంలోని ఊర చెరువు మీదుగా వచ్చే విద్యుత్ తీగలు తెగిపోవడంతో గ్రామానికి చెందిన విద్యుత్ శాఖ లైన్మెన్, విద్యుత్ ఆపరేటర్లు చెరువులోని విద్యుత్ స్తంభానికి మరమ్మతుల కోసం పూల్యాను తీసుకువెళ్లారు. ప్రమాదవశాత్తు పూల్యా నీటిలో మునిగి మృతి చెందడంతో లైన్మెన్, ఆపరేటర్లు పూల్యా మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం వారు పోలీసు స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు. చికిత్స పొందుతూ ఒకరు.. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. మండలంలోని తాండూర్కు చెందిన బోరంచ లచ్చయ్య (20)కు భార్య లావణ్యతో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతుండేవి. దీంతో ఆమె రాఖీపండగ సందర్భంగా బాన్సువాడలోని తన పుట్టింటికి వెళ్లింది. అంతకుముందు ఆమె భర్త లచ్చయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడు మనస్తాపం చెంది ఈ నెల 12న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని గాంధీఆస్పత్రికి తరలించగా బుధవారం రాత్రి చికిత్స పొందుతూ లచ్చయ్య మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. చీనూర్లో మరొకరు.. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని చీనూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన దాసరి సంజీవులు(47) కొన్ని రోజుల క్రితం ఆర్థికపరమైన విషయమై కుటుంబసభ్యులతో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపం చెంది అతడు ఈనెల 11న రాత్రి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. బుధవారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై వివరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. వడ్లం గ్రామంలో.. పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని వడ్లం గ్రామంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో పురుగుల మందు తాగగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామనికి చెందిన మంతోల సుభాష్ (35) గురువారం సాయంత్రం సమయంలో మద్యంమత్తులో పురుగుల మందు తాగి పోలీస్ స్టేషన్ వెళ్లాడు. వెంటనే పోలీసులు అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నిజామాబాద్కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందినట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. కాలువలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి భిక్కనూరు: మండల కేంద్రం సమీపంలోని టోల్ప్లాజా వద్ద ఉన్న కాలువలో గుర్తుతెలియని వ్యక్తి పడి మృతి చెందినట్లు భిక్కనూరు ఎస్సై అంజనేయులు గురువారం తెలిపారు. సదరు వ్యక్తి వయస్సు 35 సంవత్సరాల వరకు ఉంటుందని, అతడు జాతీయ రహదారిపై అటుఇటు తిరిగేవాడని, ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెంది ఉంటాడన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. -
స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు
మువ్వన్నెల కాంతుల్లో కలెక్టరేట్సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవాలకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో అధికారులు వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా వ్యవసాయ, రైతుల సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం జరిగే సమావేశంలో ఆయన ప్రసంగిస్తారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతుల ప్రదానం, ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ఉదయం 9.30 గంటలకు జాతీయ పతాకావిష్కరణ జరుగుతుంది. 9.40 గంటలకు జిల్లా పురోగతిపై ముఖ్య అతిథి ప్రసంగం, 10.10 గంటలకు అతిథులు, అధికారుల పరిచయం, 10.20 గంటలకు శకటాల ప్రదర్శన, 10.40 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 11.10 గంటలకు ప్రశంసా పత్రాల ప్రదానం కార్యక్రమాలు ఉంటాయని అధికారులు తెలిపారు. 12 గంటలకు వందన సమర్పణతో కార్యక్రమం ముగుస్తుందని పేర్కొన్నారు. -
అవినీతే అసలు సమస్య!
● స్వేచ్ఛ, సమానత్వం అంతంతే... ● చట్టసభలు నిజాయితీగా పనిచేయాలి ● ‘సాక్షి’ సర్వేలో ప్రజలుస్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే మరింత నిజాయితీగా పనిచేయాల్సిన రంగం..మీరు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏదీ?స్వేచ్ఛ, సమానత్వం నిజంగానే అందరికీ అందుతున్నాయా? ● అధికార యంత్రాంగం● చట్ట సభలు● న్యాయ స్థానాలు● పేదరికం● అవినీతి● నాణ్యమైన విద్య● అవును● కొద్దిగా● లేదుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ‘‘దేశంలో అవినీతి అనేది పెద్ద సమస్యగా మారింది. అవినీతి అంతమైతేనే ముందుకు వెళ్లగలుగుతాం. స్వతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే చట్టసభలు నిజాయితీగా పనిచేయాల్సిన అవసరం ఉంది’’ అని వివిధ వర్గాలు అభిప్రాయపడ్డాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ‘సాక్షి’ సర్వే నిర్వహించింది. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య గురించి 30 మందిని అడిగితే 18 మంది అవినీతి గురించే చెప్పారు. పేదరికం గురించి ఆరుగురు, ఇతర సమస్యల గురించి మరో ఆరుగురు వివరించారు. కుల వివక్ష, వైద్యం గురించి ఎవరూ ప్రస్తావించలేదు. స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే చట్టసభలు, అధికార యంత్రాంగం మరింత నిజాయితీగా పనిచేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ అంశంలో మీడియా గురించి ఎవరూ ప్రస్తావించలేదు. -
పోక్సో కేసులో ఒకరికి 20 ఏళ్ల జైలు
కామారెడ్డి క్రైం: పోక్సో కేసులో ఒకరికి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కామారెడ్డి కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. వివరాలిలా ఉన్నాయి. బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామానికి చెందిన కల్లూరి మహేశ్ ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడినట్లు 2021 నవంబర్ 4న కేసు నమోదైంది. మహేశ్ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన జిల్లా జడ్జి సీహెచ్వీఆర్ఆర్ వరప్రసాద్ నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.70 వేలు జరిమానా విధిస్తూ గురువారం తీర్పు వెల్లడించారు. నిందితుడికి శిక్షపడేలా కేసు విచారణ జరిపిన, సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ రాజేశ్చంద్ర అభినందించారు. తప్పిపోయిన బాలిక అప్పగింత కామారెడ్డి క్రైం: తల్లిదండ్రులను వెతుక్కుంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లి తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారిని పోలీసులు గుర్తించి తల్లికి అప్పగించారు. వివరాలు ఇలా.. జిల్లా కేంద్రంలోని ఆర్బీ నగర్ కాలనీలో నివాసం ఉండే కడమంచి జానకి, నరసింహులు దంపతులకు నాలుగేళ్ల కుమార్తె లాస్య ఉంది. లాస్య ఇంట్లో ఆడుకుంటుండగా దంపతులిద్దరూ ఇప్పుడే వస్తామని బయటకు వెళ్లారు. బాలిక తల్లిదండ్రులను వెతుక్కుంటూ బయటకు వెళ్లి తప్పిపోయింది. దంపతులు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. పట్టణ ఎస్హెచ్వో నరహరి ఆధ్వర్యంలో సిబ్బంది సీసీ కెమెరాలు పరిశీలించడంతోపాటు ఓ పాల వ్యాపారి ఇచ్చిన సమాచారంతో బాలికను సమీపంలోని మరో కాలనీలో గుర్తించి తల్లికి అప్పగించారు. రెండు గంటల్లోనే చిన్నారి ఆచూకీ గుర్తించిన పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
తాడ్వాయి (ఎల్లారెడ్డి): తాడ్వాయి మండలంలోని కరడ్పల్లి గ్రామంలో బుధవారం పట్టపగలు తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన పరువాజిగారి శివాజీ రావు కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి పెళ్లి నిమిత్తం ఇతర గ్రామానికి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి చొరబడ్డారు. అనంతరం బీరువా తాళాలు పగులగొట్టి అందులో ఉన్న రెండుతులాల బంగారం, రూ.40వేల నగదు, వెండి ఆభరణాలు అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మురళి తెలిపారు. అదుపుతప్పిన కంటైనర్ సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామశివారు 44వ జాతీయ రహదారిపై కంటైనర్ అదుపుతప్పింది. బుధవారం తెల్లవారుజామున నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న కంటైనర్ అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. ఘటనలో డ్రైవర్, క్లీనర్లు సురక్షితంగా బయటపడ్డారు. సదాశివనగర్ పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
డ్రంకెన్ డ్రైవ్లో ఒకరికి రెండు రోజుల జైలు
కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో కామారెడ్డి కోర్టు కృష్ణ అనే వ్యక్తికి బుధవారం రెండ్రోజుల జైలుశిక్ష విధించింది. రెండు రోజుల క్రితం పట్టణ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా కృష్ణ డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడ్డాడు. కోర్టులో హాజరుపర్చగా ద్వితీయశ్రేణి న్యాయమూర్తి చంద్రశేఖర్ రెండు రోజుల జైలు శిక్ష, రూ.200 జరిమానా విధించినట్లు పట్టణ ఎస్హెచ్వో నరహరి తెలిపారు. తాడ్వాయిలో ఒకరికి.. తాడ్వాయి(ఎల్లారెడ్డి): డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన మండలంలోని ఎర్రాపహాడ్కు చెందిన రాజాగౌడ్కు కామారెడ్డి ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి చంద్రశేఖర్ రెండ్రోజుల జైలు శిక్ష, రూ.200 జరిమానా విధించినట్లు ఎస్సై మురళి తెలిపారు. ముప్కాల్ పరిధిలో ఇద్దరికి.. బాల్కొండ: ముప్కాల్ పోలీస్స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన నిర్మల్ జిల్లా జాఫ్రాపూర్కు చెందిన దర్శనం రాజేశ్వర్, తాండ్రాకు చెందిన బదావత్ సాయికిరణ్లకు ఆర్మూర్ ద్వితీయ శ్రేణి మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ రెండ్రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై రజనీకాంత్ తెలిపారు. ఐదుగురికి జైలు.. 15 మందికి జరిమానా ఖలీల్వాడి: మద్యం తాగి వాహనాలు నడిపిన ఐదుగురికి జైలు శిక్ష పడినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన 20 మందికి నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు కౌన్సిలింగ్ నిర్వహించామన్నారు. అనంతరం సెకండ్క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరచగా 15 మందికి రూ. 28వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని హస్గుల్ క్వారీ నుంచి మంగళవారం రాత్రి సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తడ్కల్ గ్రామానికి అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను సముందర్ తండా శివారులో పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు.అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై అరుణ్ కుమార్ హెచ్చరించారు. -
పొడిగింపా.. ప్రత్యేకాధికారుల పాలనా?
నాగిరెడ్డిపేట: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలక వర్గాల పదవీకాలం గురువారంతో ముగియనుంది. అయితే పాలకవర్గాల గడువు మరోమారు పొడిగిస్తారా లేక ప్రత్యేకాధికారులను నియమిస్తారా అన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు. జిల్లాలో మొత్తం 55 సహకార సంఘాలున్నాయి. వీటిలో 1.55 లక్షల మంది రైతులు సభ్యత్వం కలిగి ఉన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 2019 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాలకవర్గాల పదవీ కాలాన్ని ఆరు నెలలపాటు పొడిగించారు. ఆ గడువు కూడా ఈనెల 14తో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో సహకార సంఘాల పాలక వర్గాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది. పదవీ కాలం ముగుస్తుండడం, గడువు పొడిగింపుపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎవరు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారన్న అంశంపై చర్చ నడుస్తోంది. నేటితో ముగియనున్న సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలం స్పష్టత ఇవ్వని సర్కారుఎలాంటి సమాచారం లేదు.. సహకార సంఘాల పాలక వర్గాల పదవీకాలం గురువారంతో ముగియనుంది. పాలకవర్గాల గడువు పొడిగిస్తారా, లేదా అన్నది ప్రభుత్వ పరిధిలోని అంశం. దీనిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు. – రామ్మోహన్, డీసీవో, కామారెడ్డి -
డ్రెయినేజీలను శుభ్రం చేయించండి
కామారెడ్డి క్రైం: మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించి, నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో బుధవారం ఆయన పర్యటించారు. మురికి కాలువలు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కాలనీల్లో ఎక్కడా మురికి కాలువలు మూసుకుపోకుండా చూడాలన్నారు. అటంకం లేకుండా మురికి నీరు ప్రవహించేలా శుభ్రం చేయించాలన్నారు. మురుగు నీరు రోడ్ల మీదికి, ఇళ్లలోకి రాకుండా ముందస్తుగా అన్ని డ్రెయినేజీలను వెంటనే శుభ్రం చేయించాలన్నారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. క్రమం తప్పకుండా వాహనాల ద్వారా చెత్త సేకరణ జరగాలన్నారు. దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయాలని, ఫాగింగ్ చేయించాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో కార్మికులకు పరికరాలను అందజేశారు. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా పనిచేసే కార్మికులకు రెయిన్ కోట్స్, అత్యవసర సామగ్రిని అందజేయడానికి అవసరమైన ప్రతిపాదనలను వెంటనే అందజేయాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డిని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, తహసీల్దార్ జనార్దన్, సిబ్బంది పాల్గొన్నారు. మురుగునీరు రోడ్లపైకి రాకుండా చూడండి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
‘డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం’
కామారెడ్డి క్రైం: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేయాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లావ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, వాటి దుష్ప్రభావాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృతంగా అవగాహన కల్పించే ఉద్దేశంతో నషా ముక్త్ భారత్ అభియాన్ అమలు చేస్తున్నాయన్నారు. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు చేపడుతున్న ఈ కార్యక్రమం ఐదో వార్షికోత్సవం సందర్భంగా జిల్లావ్యాప్తంగా సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలను రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మాదక ద్రవ్యాలను ఎవరైనా సరఫరా చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, సీఐలు నరహరి, శ్రీధర్, సిబ్బంది పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర దినోత్సవాల అతిథిగా కోదండరెడ్డి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా తెలంగాణ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి రానున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోదండరెడ్డి 15న జిల్లా కేంద్రంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసులనుంచి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. అనంతరం జరిగే సమావేశంలో జిల్లా ప్రగతిపై ప్రసంగిస్తారు. కామారెడ్డికి చెందిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ ఆదిలాబాద్ జిల్లాకు అతిథిగా వెళ్తున్నారు. పీజీ ఫలితాలు విడుదల కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. తెలంగాణ విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి కే.సంపత్కుమార్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ కే.కిష్టయ్య ఫలితాలను విడుదల చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు రాజేందర్, రాములు తదితరులు పాల్గొన్నారు. పోచారం ప్రాజెక్టు పరిశీలన నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్టులో నీటిమట్టాన్ని బుధవారం ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు పరిశీలించారు. రెండు, మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రాజెక్టులోని నీటిఅంచుకు ఎవరూ వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏఈ అక్షయ్కుమార్కు సూచించారు. ఆయన వెంట ఏఈతోపాటు వర్క్ఇన్స్పెక్టర్ యాదగిరి ఉన్నారు. ‘నాణ్యమైన విద్యుత్ సరఫరాయే లక్ష్యం’ బీబీపేట: జిల్లాలో నాణ్యమైన విద్యుత్ సరఫరాయే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రవణ్కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఇస్సానగర్ విద్యుత్ సబ్స్టేషన్లో నూతన బ్రేకర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సబ్స్టేషన్లో గ్రామంలో విద్యుత్ సరఫరాకు ఒక బ్రేకర్, వ్యవసాయ కనెక్షన్లకు మరొకటి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీని వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా ఉంటుందన్నారు. ఎవరూ సొంతంగా మరమ్మతులు చేయరాదని, ఏదైనా సమస్య ఉంటే విద్యుత్ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో డీఈ కల్యాణ్ చక్రవర్తి, ఏడీఈ సుదర్శన్రెడ్డి, ఏఈ విజయభాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు. విపత్తులను ఎదుర్కోవడానికి సిద్ధం కామారెడ్డి అర్బన్: భారీ వర్షాలు కురిసినప్పు డు ఎదురయ్యే పరిస్థితులు, విపత్తులను ఎదు ర్కొని చక్కదిద్దడానికి తమ సిబ్బంది సిద్ధంగా ఉన్నారని విద్యుత్ ఎస్ఈ శ్రావణ్కుమార్ తెలిపారు. వినియోగదారులు అత్యవసర పరిస్థితుల్లో 1912తో పాటు 87124 81946 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
మంజూరు 99.. ప్రారంభం 12
పిట్లం(జుక్కల్): పేదలకు ఇళ్లు ఇవ్వాలన్న ఉదేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే వారికి విడతల వారీగా మొత్తం రూ. 5 లక్షలు అందజేస్తుంది. పిట్లం మండలంలో ఇళ్ల నిర్మాణాకి ముందుకు రావడం లేదు. మండలంలోని హోస్నపూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి 99 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 12 మంది లబ్ధిదారులు మాత్రమే ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించగా, అందులో ఆరుగురు మాత్రమే చురుకుగా పనులు చేసుకోవడంతో వారికి మొదటి విడత రూ.లక్ష చొప్పున బిల్లులు అందజేశారు. ఇందులో 49 మంది లబ్ధిదారులు పంటలు వచ్చాక, కొంత మంది, దసర, దీపావళి పండుగల తర్వాత నిర్మాణాలు సుముఖంగా ఉన్నారు. మిగిలిన 38 మంది ఇళ్ల వద్దని రాతపూర్వకంగా రాసి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. పిట్లం మండలంలో 423 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయి. అందులో 138 మంది లబ్ధిదారులు కట్టుకుంటామని ముందుకు వచ్చి ముగ్గు పోశారు. అందులో 50 మంది లబ్ధిదారులు చురుకుగా పనులు చేసుకొవడంతో వారికి మొదటి విడత రూ. లక్ష చొప్పున బిల్లులు అందజేశారు. మిగితా 285 మంది లబ్ధిదారులు ఇంకా పనులు ప్రారంభించలేదు. అధికారులు, ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పిస్తే ఇళ్ల నిర్మాణంలో వేగం పెరిగే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్ల పైలట్ గ్రామం హోస్నపూర్లో పరిస్థితి పిట్లం మండలంలో ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాని లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకోవాలి ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించుకోవాలని సూచిస్తున్నాం. ఇళ్లు కట్టుకునే వారికి విడతల వారీగా బిల్లులు చెల్లిస్తున్నాం. అయిన కొంత మంది లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. కొందరు పంటల తర్వాత, పండగల తర్వాత కట్టుకుంటామని అంటున్నారు. – రఘు, ఎంపీడీవో, పిట్లం -
ప్రజలకు అందుబాటులో ఉండాలి
మాచారెడ్డి/పాల్వంచ : ప్రభుత్వ శాఖల అధికారులు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలందించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆదేశించారు. బుధవారం మాచారెడ్డి, పాల్వంచ మండలాల అధికారులతో వేర్వేరుగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన విజన్ అవినీతిరహిత పాలన అని, దానికి అనుగుణంగా అధికారులు మసలుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తే అధికారులకు రక్షకుడిగా ఉంటానన్నారు. ఎలాంటి అవకతవకలకు పాల్పడినా ఊరుకోనని హెచ్చరించారు. సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న తరుణంలో పంచాయతీ కార్యదర్శులు పారిశుద్య పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ చేయించాలన్నారు. అలాగే వైద్య అధికారులు, సిబ్బంది సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లను అనర్హులు కాకుండా అర్హులకే కేటాయించాలని అధికారులకు స్పష్టం చేశారు. సమావేశాల్లో తహసీల్దార్లు సరళ, హిమబిందు, ఎంపీడీవోలు గోపిబాబు, శ్రీనివాస్, ఎస్ఐ అనిల్, వైద్యాధికారి ఆదర్శ్, ఆయా శాఖల అధికారులు ఉన్నారు. పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే కాటిపల్లి రామారెడ్డి: మండలంలోని మద్దికుంట, రెడ్డిపేట గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో చదువు ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులు, స్టాఫ్ రూంను పరిశీలించారు సమస్యలుంటే తన దృష్టికి తేవాలని విద్యార్థులకు సూచించారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పాల్వంచ, మాచారెడ్డి మండలాల అఽధికారులతో సమీక్ష -
పక్కాగా టీచర్ల హాజరు
సదాశివనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయు ల డుమ్మాలు, ఆలస్యానికి చెక్ పెడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్ఆర్ఎస్(ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్ విధానం)కు శ్రీకారం చుట్టింది. ఈవిధానం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆగస్టు 1న ప్రారంభమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఈఫేస్ రికగ్నేషన్ కార్యక్రమం ఇప్పటికే కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదన్న ఫిర్యాదులు రావడం, చాలా చోట్ల ఉపాధ్యాయులు పని చేస్తున్నచోట నివాసం ఉండకుండా దూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తు పాఠశాలలకు సమయానికి చేరుకోక పోవడం ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పరస్పరం సహకరించుకుంటు విధులకు హాజరు కాకున్నా మరుసటి రోజు రిజిస్టర్లో సంతకాలు చేస్తున్నారనే ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈవిధానాన్ని ప్రవేశ పెట్టింది. ప్రత్యేకంగా ఉపాధ్యాయుల హాజరుశాతంపై దృష్టి పెట్టింది. జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో ఉద్యోగులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు సమయపాలన పాటించే విధంగా, హాజరును వారే నేరుగా ఆన్లైన్లో నమోదు చేసుకునేలా యాప్ను తీసుకొచ్చింది. ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఇలా... జిల్లా వ్యాప్తంగా 191 ఉన్నత పాఠశాలలు, 06 ఆదర్శ పాఠశాలలు, 698 ప్రాథమిక పాఠశాలలు, 124 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. బోధనేతర సిబ్బందికి కూడా ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఉద్యోగుల సమ య పాలనకు కొత్తగా ప్రవేశపెట్టిన టీజీఎఫ్ఆర్ఎ స్ యాప్ను సంబంధిత ఉద్యోగి స్మార్ట్ ఫోన్లో డౌ న్లోడ్ చేస్తారు. మొదటగా ఉద్యోగి వివరాలతో రి జిస్టర్ చేసుకొని లాగిన్ కావాలి. యాప్ ఇన్స్టాలేషన్ సమయంలోనే సంబంధిత కార్యాలయం, పాఠశా ల ఆవరణ లాంగిట్యూడ్, లాటిట్యూడ్లను టెక్నీషియన్ అప్లోడ్ చేస్తారు. ఒకసారి లాగిన్ అయిన తర్వాత యాప్ను నిరంతరంగా వినియోగించవచ్చు. ఉద్యోగి ఉదయం నిర్దేశిత సమయానికి కా ర్యాలయంలోకి వచ్చిన తరువాత యాప్ను ఓపెన్ చేసి క్లాక్ ఇన్ అనే అప్షన్పై నొక్కితే సదరు ఉద్యోగి వచ్చిన సమయం ఆన్లైన్లో సంబంధిత పర్యవేక్షణ అధికారికి చేరుతుంది. ఆఫీసులో పని సమ యం ముగిసిన తర్వాత క్లాక్ఔట్ అని ఆప్షన్పై టచ్ చేస్తే ఉద్యోగి కార్యాలయాన్ని విడిచి వెళ్లే సమయా న్ని, పని చేసిన గంటలను లెక్కించి తిరిగి సంబంధిత పర్యవేక్షణ అధికారికి ఆన్లైన్లో చేరుతుంది. పాఠశాలల్లో ప్రారంభమైన ఎఫ్ఆర్ఎస్ విధానం ఉపాధ్యాయుల డుమ్మాలు, ఆలస్యానికి చెక్ ఉత్తమ బోధనే లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి ఉద్యోగులు సమయపాలన పాటిస్తారు ఈ విధానం మొదటగా విద్యార్థులకు అమలు చేస్తున్నారు. అలాగే ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు కూడా ప్రవేశ పెట్టడంతో సమయపాలన పాటిస్తారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, కార్యాలయాల్లో ఈవిధానాన్ని వర్తింప జేయాలి. బోధన, బోధనేతర సిబ్బందికి కూడా ఈ విధానం అమలు చేయడం మంచి నిర్ణయం. – చింతల లింగం, టీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు,కామారెడ్డి ఉత్తమ ఫలితాలు వస్తాయి ఫేస్ రికగ్నైజేషన్ విధానంతో ఉత్తమ ఫలితాలు వస్తాయి. ప్రధానంగా ఈవిధానంలో సాంకేతిక సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉపాధ్యాయుల డుమ్మాలు, ఆలస్యానికి చెక్ పెట్టినట్లు అవుతోంది. ఎంఈవో తనిఖీలు ఎక్కువగా ఉండవు. ఈ విధానం బాగుంది. – గాధారి రాజిరెడ్డి, పీఆర్టీయూ మండలాధ్యక్షుడు,సదాశివనగర్ -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
కామారెడ్డి క్రైం: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కేంద్ర ప్రభుత్వం నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రారంభించి ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాదక ద్రవ్యాలతో కలిగే దుష్ప్రభావాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాలామంది యువకులు గంజాయి, కల్తీ కల్లు, మద్యం, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని కట్టడి చేయడానికి జిల్లా సంక్షేమ శాఖ, ఎకై ్సజ్ శాఖల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్, జిల్లా సంక్షేమ ఆధికారి ప్రమీల, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
సాధారణ కాన్పులే అధికం
బాన్సువాడ : కడుపు కోతలను నివారించి, సాధారణ ప్రసవాలను పెంచడమే లక్ష్యంగా బాన్సువాడ మాతాశిశు సంరక్షణ ఆస్పత్రి వైద్యులు కృషి చేస్తున్నారు. గర్భిణులకు అవగాహన కల్పిస్తూ నార్మల్ డెలివరీలు చేస్తున్నారు. బాన్సువాడ, జుక్కల్, నారాయణ్ఖేడ్ నియోజకవర్గాలతో పాటు సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు బాన్సువాడలో మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఆస్పత్రి ప్రారంభించినప్పటి నుంచి ఇక్కడ సాధారణ కాన్పులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. రోజు నాలుగైదు కాన్పులు చేస్తున్నారు. ఇక్కడి వైద్యులు గర్భిణులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి సాధారణ కాన్పులకే మొగ్గు చూపేలా ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఆస్పత్రిలో సగానికిపైగా సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి. అవసరం అయితేనే సిజేరియన్ చేస్తున్నారు. బాన్సువాడ ఎంసీహెచ్లో సగానికిపైగా నార్మల్ డెలివరీలేఎంసీహెచ్లో నమోదైన ప్రసవాలు.. నెల సిజేరియన్ నార్మల్ జనవరి 125 169 ఫిబ్రవరి 97 139 మార్చి 118 165 ఏప్రిల్ 163 163 మే 147 157 జూన్ 168 155 జూలై 162 183 మొత్తం 980 1,131అవగాహన కల్పిస్తున్నాం సాధారణ ప్రసవాలపై గర్భిణులకు అవగాహన కల్పి స్తున్నాం. దీంతో బాన్సువాడ మాతాశిశు సంరక్షణ ఆస్పత్రిలో ఎక్కువగా సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి. – విజయలక్ష్మి, ఇన్చార్జి సూపరింటెండెంట్, బాన్సువాడ -
స్వయం ఉపాధితో రాణింపు
లింగంపేట: మహిళా సంఘం సభ్యురాలిగా చేరి పొదుపు చేస్తూ, బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకుంటూ స్వయం ఉపాధితో ముందుకు సాగిన మోతెకు చెందిన సులోచన.. దేశ రాజధానిలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవాలకు ప్రత్యేక అతిథిగా ఎంపికయ్యారు. లఖ్పతి దీదీగా ఆ వేడుకలలో పాల్గొనబోతున్నారు. ఈ అవకాశం వచ్చినందుకు ఆమె ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇరవై ఏళ్ల క్రితం సంఘంలో చేరిక మోతె గ్రామంలో 20 ఏళ్ల క్రితం ఓం సాయి మహిళా సంఘంలో సులోచన సభ్యులుగా చేరారు. ఆమె చొరవతో మోతె మహిళా పరస్పర సహాయ సహకార పొదుపు, పరపతి గ్రామ సంఘం ఏర్పాటు చేసుకున్నారు. మహిళా సంఘంలో సాధారణ సభ్యురాలిగా చేరిన సులోచన.. ప్రతి నెల చిన్న మొత్తంలో పొదుపు జమ చేయడంతోపాటు స్వయం ఉపాధికోసం సంఘం నుంచి రుణం తీసుకున్నారు. అలాగే సంఘ సభ్యులతో కలిసి బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలు పొందారు. వాటిని తొలుత వ్యవసాయానికి అవసరమైన పెట్టుబడులకు వినియోగించారు. తర్వాతి కాలంలో పిండి గిర్ని ఏర్పాటు చేసుకున్నారు. కూరగాయలు, పూలు తదితర పంటలు పండిస్తూ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు.నాయకత్వ లక్షణాలతో ముందుకు..అందరి సహకారంతోనే..లఖ్పతి దీదీ కేటగిరిలో దేశ స్వాతంత్య్ర దినోత్సవాలకు ఎంపికవడంపై సులోచన హర్షం వ్యక్తం చేశారు. మహిళా సంఘంలోని తోటి సభ్యులతోపాటు గ్రామ, మండల, జిల్లా సమాఖ్య సభ్యులు, ఐకేపీ అధికారుల సహకారంతోనే రాణిస్తున్నానన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, డీఆర్డీవో సురేందర్, ఏపీఎం వినోద్కుమార్, సీసీ రాజారెడ్డి ప్రోత్సాహంతో మహిళా సంఘాల సభ్యులం ఆర్థిక స్వావలంబన దిశగా సాగుతున్నామని పేర్కొన్నారు. ఆర్థిక స్వావలంబన సాధిస్తున్న సులోచన స్వాతంత్య్ర దినోత్సవాలకు ప్రత్యేక అతిథిగా ఎంపికై న ‘లఖ్పతి దీదీ’మొదట మహిళా సంఘంలో సభ్యురాలిగా చేరిన సులోచన.. తర్వాత సంఘానికి నాయకురాలు అయ్యారు. గ్రామ సంఘాలకు అధ్యక్షురాలిగా, మండల సమాఖ్య అధ్యక్షురాలిగా, జిల్లా సమాఖ్య పాలకవర్గ సభ్యురాలిగా సేవలు అందించారు. అలాగే గ్రామ సంఘాల ఆదాయం పెంచడానికి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. కొనుగోలు కేంద్రాన్ని గ్రామస్తుల సహకారంతో విజయవంతంగా నడిపించారు. ఇలా మహిళా సంఘం సభ్యురాలిగా రాణిస్తూ, స్వయం ఉపాధితో ఆర్థిక స్వావలంబన సాధిస్తున్న మహిళలను గౌరవించడం కోసం కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవాలకు ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించింది. లఖ్పతి దీదీ కేటగిరిలో పలువురిని ఎంపిక చేసి ఆహ్వానాలు పంపింది. రాష్ట్రంలో ఐదుగురికి ఆహ్వానం రాగా.. అందులో లింగంపేట మండలం మోతెకు చెందిన సులోచన ఒకరు. ఈనెల 15న ఢిల్లీలో నిర్వహించే వేడుకలలో ఆమె పాల్గొననున్నారు. -
చికిత్స పొందుతూ కేజీబీవీ విద్యార్థిని మృతి
నిజామాబాద్నాగారం/ఆర్మూర్: తీవ్రగాయాలతో ప్రగతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేజీబీవీ విద్యార్థిని కావేరి(16) బుధవారం ఉదయం మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని దుబ్బకు చెందిన కావేరి ఆర్మూర్ పట్టణంపెర్కిట్లో ఉన్న కేజీబీవీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నెల 5న అర్ధరాత్రి కేజీబీవీ భవనం నుంచి కావేరి కిందకు దూకింది. తలకు తీవ్రగాయాలు కావడంతో కేకలు వేసింది. స్పందించిన కేజీబీవీ సిబ్బంది వెంటనే స్థానికంగా ఉన్న ఎంజే ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ప్రగతి ఆస్పత్రికి తరలించారు. వారం రోజులుగా చికిత్స పొందిన కావేరి బుధవారం ఉదయం 8.40 నిమిషాల సమయంలో మరణించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్కు తరలించారు. కోతులకు భయపడే.. కావేరి ఈ నెల 5న తెల్లవారుజామున హాస్టల్లోని వాష్రూంకు వెళ్లి వస్తుండగా కోతులు వెంటపడడంతో భయపడి హాస్టల్ పోర్టువాల్ ఎక్కి కిందకు దూకినట్లు కేజీబీవీ అధికారులు తెలిపారు. తలకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కాగా, కావేరి తండ్రి గణేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మూర్ పోలీసులు తెలిపారు. చికిత్స పొందుతూ యువకుడు.. రామారెడ్డి: ఆర్థిక ఇబ్బందులతో గడ్డి మందు తాగిన ఓ యువకుడు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు రామారెడ్డి ఎస్సై లావణ్య తెలిపారు. రామారెడ్డికి చెందిన పోగుల నాగరాజు (37) కొంతకాలంగా మద్యం, పేకాటకు బానిసయ్యాడు. దురలవాట్లతో అప్పులు కావడంతో మానసిక ఒత్తిడికి గురై ఈ నెల 1న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. 9న గుర్తుతెలియని గడ్డి మందు తాగిన నాగరాజును కుటుంబసభ్యులు గుర్తించారు. వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య సంధ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి కొడుకు, కూతురు ఉన్నారు. -
ఇంజినీరింగ్ కళాశాలలో 61 మంది చేరిక
తెయూ(డిచ్పల్లి): నూతనంగా ఏర్పాటైన తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో 3వ విడత కౌన్సెలింగ్లో 81 మందిని కేటాయించగా, బుధవారం సాయంత్రం వరకు 61 మంది విద్యా ర్థులు అడ్మిషన్స్ తీసుకున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ)లో 48 మంది, సీఎస్ ఐటీలో ముగ్గురు, సీఎస్ (ఏఐ) లో ఏడుగురు, డాటా సైన్స్లో ముగ్గురు విద్యార్థులు ప్రవేశాలు పొందినట్లు ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతి తెలిపారు. హాస్టల్ వసతి లేక వెనుకంజ ఇంజినీరింగ్ విద్యార్థులకు తెయూ క్యాంపస్లో హాస్టల్ వసతి కల్పించడం లేదు. దీంతో కౌన్సెలింగ్లో కేటాయించబడిన మరికొంత మంది విద్యార్థులు క్యాంపస్కు వచ్చి ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న వసతి, సౌకర్యాలను తెలుసుకున్నారు. హాస్టల్ వసతి లేకపోవడంతో కొందరు బాలికలు ఇక్కడ అడ్మిషన్ తీసుకునేందుకు వెనుకంజ వేశారు. నాలుగు కోర్సులకు 264 సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ కళాశాల మంజూరులో ఆలస్యం కావడం, హాస్టల్ వసతి లేకపోవడంతో విద్యార్థులు తక్కువ సంఖ్యలో చేరడానికి కారణమవుతున్నట్లు తెలుస్తోంది. సీట్ల భర్తీకి ఇక స్పాట్ కౌన్సెలింగ్పైనే ఆశలు పెట్టుకోవాల్సి ఉంటుంది. -
గురుకులాలపై సమ్మెపోటు
ఎల్లారెడ్డిలోని ఎస్సీ గురుకులంలో కూరగాయలు కోస్తున్న తాత్కాలిక సిబ్బందిజిల్లాలో వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడిచే 34 గురుకులాల్లో దాదాపు 2,350 మంది విద్యార్థులు చదువుతున్నారు. మెనూ ప్రకారం వారికి భోజనం పెట్టేందుకు అవసరమైన అన్ని వస్తువులను కాంట్రాక్టర్లు సరఫరా చేస్తుంటారు. నిత్యావసరాలను ముందుగా సరఫరా చేసినా.. కూరగాయలు, పండ్లు, మాంసం, చికెన్, కోడిగుడ్లు దాదాపు అదేరోజు సరఫరా చేయాల్సి ఉంటుంది. అయితే ఆయా సరుకులు సరఫరా చేసేవారంతా సమ్మెకు వెళ్లడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. చాలా పాఠశాలల్లో నిల్వలు లేక పాఠశాలల నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు వంట ఏజెన్సీలు కూడా సమ్మెబాట పట్టాయి. చాలా స్కూళ్లలో సాధ్యమైనంత వరకు ఏ రోజుకు ఆ రోజు సరఫరా చేస్తుంటారు. కొన్నింటిని నాలుగైదు రోజులకు సరిపడా సరఫరా చేస్తారు. సరుకు సరఫరాదారులంతా సమ్మెబాట పట్టడంతో సరఫరా నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. బుధవారం విద్యార్థులకు మెనూ ప్రకారం మటన్, చికెన్ కర్రీ వండాల్సి ఉంటుంది. అయితే సంబంధిత కాంట్రాక్టర్లు మాంసం, చికెన్ సరఫరా చేయకపోవడంతో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టలేకపోయారు. ఈ విషయంలో కొన్ని స్కూళ్లలో సరఫరాదారులకు నోటీసులు జారీ చేశారు. కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా..గురుకులాలకు సంబంధించి వంట సామగ్రి, కూరగాయలు, పండ్లు, మాంసం వంటివి సరఫరా చేయడానికి ప్రభుత్వం కొత్త విధివిధానాలను రూపొందించింది. మండలం/జిల్లా యూనిట్గా టెండర్లు ఆహ్వానించింది. వీటిని పొందాలంటే రూ. కోట్లల్లో పెట్టుబడి అవసరం అవుతుంది. దానికి తోడు జీఎస్టీ లైసెన్స్ కలిగి ఉండాలనడం, ఇతర నిబంధనలు పాటించాలంటే ప్రస్తుతం సరఫరా చేస్తున్న వారిలో ఏ ఒక్కరికీ అవకాశం దక్కదు. ప్రస్తుతం సరుకులు సరఫరా చేస్తున్న వారంతా చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారు కావడం వల్ల అంత పెద్ద మొత్తంలో పెట్టుబడి సమకూర్చే పరిస్థితి లేదు. దీంతో వారంతా టెండర్లకు దూరం కావాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో పాత పద్ధతిలోనే సరుకుల టెండర్లు పిలవాలని వారు డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు.తాత్కాలిక సిబ్బందితో వంటఎల్లారెడ్డిరూరల్: గురుకులాలకు సరుకులు సరఫరా చేసేవారితోపాటు వంట చేసేవారు సమ్మె బాట పట్టడంతో విద్యార్థులు ఇబ్బంది పడకుండా ప్రిన్సిపాల్స్ చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం తాత్కాలిక సిబ్బందితో వంట చేయించారు.మెనూ అమలు కష్టమే..గురుకుల పాఠశాలలు, కళాశాలలకు కూరగాయలు, పండ్లు, మటన్, చికెన్, గుడ్లు, ఇతర సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లు సమ్మెబాట పట్టారు. దీంతో బుధవారం నుంచి సరుకుల సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు భోజనం అందించేందుకు ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్స్ ఇబ్బందిపడుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి సరుకుల కాంట్రాక్టులో కొత్త నిబంధనలపై సరఫరాదారుల నిరసన టెండర్లలో పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ జిల్లాలో నిలిచిపోయిన సరుకుల సరఫరామాంసం, కూరగాయలు, పండ్లు, ఇతర సామగ్రి సరఫరా నిలిచిపోవడంతో మెనూ అమలు జరగడం కష్టంగా మారింది. మెనూలో రోజుకో రకమైన భోజనం ఉంటుంది. వారంలో రెండు రోజులు మాంసంతో కూడిన భోజనం పెట్టాలి. మాంసం సరఫరా నిలిపివేయడం వల్ల విద్యార్థులకు మాంసాహారంతో కూడిన భోజనం అందే పరిస్థితి లేదు. విద్యార్థులకు సరిపడా మాంసం అప్పటికప్పుడు తీసుకురావడం సాధ్యమయ్యే పనికూడా కాదు. వంట ఏజెన్సీలు కూడా సమ్మెలోకి వెళ్లడంతో విద్యార్థులకు భోజనం అందించడం కష్టసాధ్యంగా మారే అవకాశాలున్నాయి. -
జడివాన జాడేది?
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రాష్ట్రమంతటా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. కానీ జిల్లాలో జడివాన జాడలేదు. జిల్లావ్యాప్తంగా చిరు జల్లులు కురిశాయే తప్ప ఎక్కడా భారీ వర్షాలు రికార్డు కాలేదు. జిల్లాలో ఇప్పటికీ సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఎనిమిది మండలాల్లో లోటు వర్షపాతమే ఉంది. పెద్దకొడప్గల్, పిట్లం, నిజాంసాగర్, బిచ్కుంద, మద్నూర్, జుక్కల్, ఎల్లారెడ్డి, బీబీపేట మండలాలలో భారీ లోటు వర్షపాతం ఉంది. ఆగస్టు నెలలో ఈరోజు వరకు సాధారణ వర్షపాతం 113.7 మి.మీ. నమోదు కావాల్సి ఉండగా 86.5 మి.మీ. మాత్రమే వర్షం పడింది. అంటే సాధారణంకన్నా 23 శాతం లోటు వర్షపాతం ఉంది. సీజన్ ఆరంభమైన నాటి నుంచి నేటి వరకు 502.7 మి.మీ. కురవాల్సి ఉండగా 464.2 మి.మీ. నమోదైంది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవగా.. చాలా చోట్ల భారీ వర్షాలు కురవలేదు. వాగుల్లో ప్రవాహం మొదలైనా ఉధృతంగా ఒకటి రెండు రోజులు కూడా ప్రవహించిన దాఖలాలు లేవు. ఓ వైపు తెలంగాణలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతుండగా.. కామారెడ్డి జిల్లాలో మాత్రం ఆ ఛాయలు కనిపించడం లేదు. అప్పుడప్పుడు ముసురు పెడుతుందే తప్ప భారీ వర్షం మాత్రం కురవడం లేదు. దీంతో అన్నదాతలు నిరాశ చెందుతున్నారు. జిల్లా అంతటా చిరుజల్లులే తప్ప భారీ వర్షాల్లేవ్ ఇప్పటికీ ఎనిమిది మండలాల్లో లోటు వర్షపాతమే..కల్యాణి ప్రాజెక్టులోకి 210 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఎల్లారెడ్డిరూరల్: తిమ్మారెడ్డి గ్రామ శివారులోని కల్యాణి ప్రాజెక్టులోకి బుధవారం 210 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఈ నీటిని నిజాంసాగర్ మెయిన్ కెనాల్లోకి మళ్లిస్తున్నామన్నారు. -
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
ఎల్లారెడ్డిరూరల్/బాన్సువాడ రూరల్/మద్నూర్/నస్రుల్లాబాద్/ సదాశివనగర్ : ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నషా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా బుధవారం కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేశారు. ఈసందర్భంగా ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ మాట్లాడారు.డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం విద్యార్థులు పాటుపడాలని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీకళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ గులాం ముస్తఫా అన్నారు. రాష్ట్ర యాంటి నార్కోటిక్ బ్యూరో ఆదేశానుసారం కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ 1,3 ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిరోధక అవగాహన సదస్సు నిర్వహించి మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు ఆధ్వర్యంలో కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది నషాముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేశారు. మద్నూర్ బాలుర గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి వెంకట్ మాట్లాడుతు మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియశీల భాగస్వామిని అవుతానని పేర్కొన్నారు. బీబీపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో అధ్యాపకులు నషాముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. నస్రుల్లాబాద్ మండలం నెమ్లి జెడ్పీహెచ్ఎస్లో సైబర్ నేరాలు, ఫోక్సో కేసుల తదితర వాటిపై షీ టీం కానిస్టేబుల్ అనిల్ కుమార్ అవగాహన కల్పించారు.యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పారా లీగల్ వలంటీర్ మఠం విజయ్ కుమార్ సూచించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఎలా ఉండాలనే విషయాలను తెలియజేసే వాల్ పోస్టర్లను సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్ చేతుల మీదుగా మర్కల్ చౌరస్తా వద్ద ఆవిష్కరించారు. అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తు లేకుండానే కుల ధ్రువీకరణ పత్రం
● నూతన విధానాన్ని అమలులోకి తెచ్చిన ప్రభుత్వం ● హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు ● అవగాహన కల్పించని అధికారులు డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): కుల ధ్రువీకరణ పత్రాల జారీలో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు చేసింది. మీసేవ నుంచి పత్రాన్ని పొందిన వ్యక్తి మరోసారి దరఖాస్తు చేసే వెసులుబాటు గతంలో ఉండేది. కులం మారదు కనుక ఇప్పుడు అలాంటి విధానానికి స్వస్తి పలకడంతోపాటు ప్రభుత్వం నూతన విధానాన్ని అమలులోకి తెచ్చింది. కుల ధ్రువీకరణపత్రం గతంలో ‘కమ్యూనిటీ డేట్ ఆఫ్ బర్త్’ గా వచ్చేది. దీంతోపాటు ఆధార్ కార్డు ప్రకారం పుట్టిన తేదీ వివరాలు వచ్చేవి. ప్రస్తుతం కుల ధ్రువీకరణ పత్రంలో జనన వివరాలు అవసరం లేదని ప్రభుత్వం గుర్తించింది. పత్రంలో ఈ వివరాలను తొలగించి కేవలం ‘కమ్యూనిటీ’ పేరుతోనే నూతన పత్రాన్ని జారీ చేస్తోంది. కొత్త విధానంతో ధ్రువపత్రాలు పొందడానికి క్షణాల్లో పని పూర్తయితే బాగానే ఉంటుంది. కానీ, గతంలో పొందిన కుల ధ్రువపత్రాల్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని మార్చుకునే వెసులుబాటు లేదు. ఎస్సీ వర్గానికి వర్తించదు.. కుల ధ్రువీకరణ పత్రం జారీలో అన్ని సామాజిక వర్గాలకు పాత ధ్రువపత్రం చూపిస్తే అప్పటికప్పుడు కుల ధ్రువీకరణ పత్రం జారీ కానుండగా ఎస్సీ సామాజిక వర్గానికి మాత్రం వర్తించదని అధికారులు చెబుతున్నారు. వారు కొత్తగా దరఖాస్తు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రచారం కరువు.. నూతన విధానంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అధికార యంత్రాంగం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. నూతన మార్పులను పత్రికా ప్రకటనల ద్వారా ప్రజలకు తెలపాల్సి ఉండగా తదనుగుణ చర్యలు లేకపోవడం గమనార్హం. కొత్త విధానంలో కులధ్రువీకరణ పత్రం ఎలా తీసుకోవాలో తెలియక చాలామంది పాత విధానాన్నే అనుసరిస్తూ సమయంతోపాటు డబ్బు వృథా చేసుకుంటున్నారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులను సంప్రదించగా ప్రభుత్వం నుంచి ఇంకా గైడ్లైన్స్ రాలేదని రాగానే ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. పాత సర్టిఫికెట్ చూపిస్తే సరి.. ఇక మీదట ప్రతిసారి కుల ధ్రువీకరణ పత్రం పొందడానికి దరఖాస్తు చేయాల్సిన పని లేదు. పాత ధ్రువీకరణ పత్రంలోని నంబర్ లేదా ఆధార్ ద్వారా అప్పటికప్పుడు మీసేవలో సర్టిఫికెట్ తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీంతో విద్యార్థులు, ఇతరత్రా వారికి సేవలు సులభతరం కానున్నాయి. గతంలో మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకొని, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, నాయబ్ తహసీల్దార్, తహసీల్దార్ ఆమోదం పొందిన తర్వాత కుల ధ్రువీకరణ పత్రం తీసుకోవాల్సి వచ్చేది. ఈ ప్రక్రియకు కనీసం పక్షం రోజులు సమయం పట్టేది. కొత్త విధానంలో భాగంగా పాత సర్టిఫికెట్ చూయించి వెంటనే కొత్త సర్టిఫికెట్ పొందే అవకాశం కల్పించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
క్రైం కార్నర్
మట్టిలో కూరుకుపోయి కూలీ మృతి బాల్కొండ: ముప్కాల్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి 44 విస్తరణ పనుల్లో బిహార్కు చెందిన సురాజ్ నిశాద్(40) అనే కూలీ మట్టిలో కూరుకుపోయి మృతి చెందాడు. ఎస్సై రజనీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన కొంతమంది కూలీలు ఓ కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్నారు. మంగళవారం ముప్కాల్ మండల కేంద్రంలో జరుగుతున్న రోడ్డు విస్తరణలో పని చేసేందుకు సునీల్, సురాజ్, ధీరేంద్రయాదవ్, రాజు వచ్చారు. పనిలో భాగంగా పైపులను పక్కకు జరిపేందుకు సురాజ్, ధీరేంద్రయాదవ్లు గుంతలోకి దిగారు. ప్రమాదవశాత్తు పైపులైన్ పక్కన ఉన్న మట్టి పెల్లాలు కూలి సురాజ్ పూర్తిగా కూరుకుపోగా, ధీరేంద్రయాదవ్ ఛాతి వరకు మట్టి పడింది. ఇద్దరినీ హైవే అంబులెన్స్లో ఆర్మూర్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే సురాజ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. కాగా, ధీరేంద్రయాదవ్ చికిత్స పొందుతున్నాడు. -
నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం
కామారెడ్డి క్రైం: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకంగా పని చేస్తాయని కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం లోని గాంధీగంజ్లో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంగళవారం ఆమె ప్రారంభించి మాట్లడారు. మీడియం గూడ్స్ వెహికల్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 16 సీసీ కెమెరాలు, కంట్రోల్ రూంను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, వ్యాపారులు, సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ ఎస్హెచ్వో నరహరి, సిబ్బంది, మీడియం గూడ్స్ వెహికల్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు విఠల్రావు, సురేష్, బాల్రాజ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి -
గ్రామానికి చెందిన భూమి మాకే చెందాలి
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని తిర్మన్పల్లి గ్రామ శివారులో గల ఇనాం భూమిని అమ్మడానికి, కొనుగోలు చేయడానికి వీలు లేదని ఈభూమి గ్రామానికే చెందాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. గ్రామానికి సేవ చేస్తున్న గైని కులస్తులకు గత కొన్ని సంవత్సరాల క్రితం అప్పటి పెద్ద మనుషులు 3 ఎకరాల 15 గుంటల భూమిని ఇచ్చారు. ఈభూమిని గ్రామస్తులకు తెలియకుండా మర్కల్కు చెందిన మర్కంటి బుచ్చన్నకు సేల్డీడ్ చేయించిన విషయం గ్రామస్తులకు తెలియడంతో మంగళవారం బుచ్చన్నను గ్రామానికి పిలిపించి ఇనాం భూమిని ఎలా కొన్నావని ప్రశ్నించారు. గైని వారికి కొన్ని డబ్బులు ఇచ్చానని నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇస్తే ఈభూమిని వారికే ఇస్తానని సమాధానం చెప్పారు. దీనికి గ్రామస్తులు ఒప్పుకోలేదు. తమ గ్రామానికి చెందిన భూమి తమకే చెందే వరకు ఊరుకునేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి గ్రామానికి చెందని యెడల టిప్పర్లతో మొరం నింపి భూమిని చదును చేస్తామని హెచ్చరించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు భూమిలో ఎలాంటి పంట పెట్టవద్దని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ మధుసూదన్ రావు, మాజీ సర్పంచ్ బాల్రెడ్డి, విండో డైరెక్టర్లు మధుసూదన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. -
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
బీబీపేట/దోమకొండ : మండల స్థాయిలు అఽధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు.బీబీపేట, దోమకొండ మండల పరిషత్ కార్యాలయాల్లో మండలానికి చెందిన వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులతో మాట్లాడారు. ఇక నుంచి ప్రతి రెండు నెలలకు ఒకసారి రివ్యూ సమావేశం ఉంటుందని, తానే హాజరవుతునాని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయా శాఖల్లో ఉన్న సమస్యలను అధికారులు వివరించారు. అలాగే ప్రతి గ్రామంలో వంద శాతం పన్నులు వసూలు చేయాలని కార్యదర్శులకు సూచించారు. అంగన్వాడీ లో నూతన భవనాలు మంజూరు అయినందన ప్రభుత్వ స్థలాన్ని చూసి కేటాయించాలని తహసీల్దారుకు తెలిపారు. విద్య, వైద్యంలో ఎలాంటి పొరపాట్లు జరిగినా ఊరుకునేది లేదని అన్నారు. గ్రామాల వారిగా పూర్తి వివరాలు ఉన్నాయని ఏ శాఖలో తప్పులు జరిగినా సహించేది లేదని సూచించారు. వైన్స్ల వద్ద ఉన్నటువంటి పర్మిట్ రూంల్లో వసతులు ఉండాలని తెలిపారు.రైతులకు యూరియా కొరత రాకుండా చూడాలని వ్యవసాయశాఖ అధికారులు, సింగిల్విండో కార్యదర్శులకు ఆదేశించారు. సమావేశంలో తహసీల్దార్లు గంగసాగర్, సుధాకర్, ఎంపీడీవోలు పూర్ణచంద్రోదయకుమార్, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, మండల వ్యవసాయాధికారులు దీపిక, నరేందర్, ఎకై ్సజ్శాఖ సీఐ మధుసూధన్రావ్, ఐసీడీఎస్ సీడీపీవో రోషిశ్మ, ఉపాధిహమీ ఏపీవో రజని, తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణతో బంగారు భవిష్యత్తు భిక్కనూరు: విధ్యార్థులు చిన్నతనం నుంచి క్రమశిక్షణతో ముందుకెళ్తే వారి భవిష్యత్తు బంగారుమయం అవుతుందని ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి అన్నారు. భిక్కనూరు మండలం ఇసన్నపల్లి, భాగిర్తిపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను అకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్బంగా పాఠశాలలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన వైద్యం విద్య పేదలకు అందాలి అధికారులతో సమీక్షలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి -
మహిళను కాపాడిన పోలీసులకు అభినందన
కామారెడ్డి క్రైం: ఆత్మహత్య చేసుకునేందుకు చెరువులో దూకిన మహిళను కాపాడిన ఇద్దరు పోలీసులను పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేశ్ చంద్ర మంగళవారం అభినందించారు. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో నివాసం ఉండే ఓ మహిళ కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకునేందుకు పట్టణ శివారులోని ఓ కుంటలో సోమవారం దూకేసింది. స్థానికుల సమాచారం మేరకు దేవునిపల్లి 2 వ ఎస్సై భువనేశ్వర్, కానిస్టేబుల్ బాలకృష్ణలు హుటాహుటినా అక్కడకు చేరుకుని మహిళను చెరువులో నుంచి బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. కోలుకున్న తరువాత మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మహిళ ప్రాణాలు కాపాడిన ఎస్సై, కానిస్టేబుల్లకు నగదు రివార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి, సీఐ రామన్ తదితరులు పాల్గొన్నారు. -
సూచిక బోర్డుల ఏర్పాటు
నస్రుల్లాబాద్ : మండలంలో జరుగుతున్న 765డి రోడ్డు పనులలో భాగంగా ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్త కోసం సూచిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు ఎస్సై రాఘవేంద్ర తెలిపారు. మంగళవారం మండల వ్యాప్తంగా ప్రమాదకరంగా ఉన్న గుంతల వద్ద సంబంధిత వారితో మాట్లాడి సూచిక బోర్డులను పెట్టించారు. రాత్రి వేళ్లలో గుంతలు ఉన్న చోటు కనబడే విధంగా రేడియం స్టిక్కర్లు ఉంచాలన్నారు. ఆయన వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు. డ్రంకెన్డ్రైవ్లో రెండురోజుల జైలు శిక్ష కామారెడ్డి క్రైం: పట్టణంలో ఇటీవల పోలీసులు డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామానికి చెందిన నిఖిల్ మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. అతడిని పోలీసులు మంగళవారం కామారెడ్డి కోర్టులో హాజరుపర్చారు. ద్వితీయశ్రేణి న్యాయమూర్తి చంద్రశేఖర్ అతడికి రెండు రోజుల జైలుశిక్ష, రూ.200 జరిమానా విధించినట్లు పట్టణ ఎస్హెచ్వో నరహరి తెలిపారు. భిక్కనూరులో.. భిక్కనూరు : మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డ ఒక్కరికి కామారెడ్డి ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి చంద్రశేఖర్ రెండు రోజలు జైలు శిక్ష విధించినట్లు ఎస్సై అంజనేయులు మంగళవారం తెలిపారు. మండల కేంద్రంలోని టోల్ప్లాజా వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి ఒక్కరూ మధ్యం సేవించి వాహనం నడుపుతు పట్టుబడ్డాడు. సదరు వ్యక్తిని అరెస్టు చేసి కామారెడ్డి ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి చంద్రశేఖర్ ముందర ప్రవేశపెట్టగా రెండు రోజలు జైలుశిక్షతో పాటు రూ.200 జరిమానా విధించినట్లు ఎస్సై వివరించారు.పేకాడుతున్న 10మంది అరెస్టు పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని వడ్లం గ్రామంలో పేకాట ఆడుతున్న పదిమందిని అరెస్టు చేసినట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు గ్రామంలోని పేకాట స్థావరంపై సోమవారం రాత్రి దాడి చేశారు. పేకాడుతున్న పది మందిని పట్టుకొని, వారి వద్ద నుంచి రూ.14430 నగదును, 9 ఫోన్లు, ఐదు బైక్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. -
ఎల్వోసీ అందజేత
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మండలం గర్గుల్ గ్రామానికి చెందిన విఠల్ రెడ్డి సతీమణి స్వరూప కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఆపరేషన్ అవసరమగా, ఆర్థిక సహాయం కోసం కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఆయన రూ.3 లక్షల విలువైన ఎల్వోసీని ఇప్పించినట్లు మాజీ సర్పంచ్ రవితేజ గౌడ్ తెలిపారు. విఠల్ రెడ్డి కుటుంబ సభ్యులు షబ్బీర్ అలీకి కృత/్ఞతలు తెలిపారు. సీఎంను కలిసిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కామారెడ్డి టౌన్: సీఎం రేవంత్ రెడ్డిని హైదరాబాద్లోని తన నివాసంలో మంగళవారం టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించినట్లు చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. ఈసందర్భంగా సీఎంను శాలువాతో చంద్రశేఖర్రెడ్డి సన్మానించారు.కామారెడ్డిలో పార్టీ పరిస్థితిని సీఎం అడిగి తెలుసుకున్నారని తెలిపారు. -
ఇందిరమ్మ ఇళ్ల సమస్యలు పరిష్కరించండి
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్కు ఎమ్మెల్యే మదన్మోహన్ రావు విన్నవించారు. మంగళవారం ఆయనను హైదరాబాద్లో ఎమ్మెల్యే కలిసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను చర్చించారు. పలు డిమాండ్లను, సూచనలను అందజేశారు. ఇళ్ల నిర్మాణం పూర్తయి ఫోటోలు అప్లోడ్ చేసి నెల రోజులు కావస్తున్నా కొందరు లబ్ధిదారులకు డబ్బులు జమ కావడం లేదని ఎమ్మెల్యే ఎండీకి వివరించారు. అలాగే పథకం ప్రారంభానికి ముందు నిర్మించిన బేస్మెంట్లకు ఆమోదం ఇచ్చినా చెల్లింపులు జరగడం లేదని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన పరిమితి కంటే చిన్న ప్లాట్లలో కూడా జీ ప్లస్ నిర్మాణానికి అనుమతించాలని కోరారు. 400–600 చదరపు అడుగుల పరిమితిలో 20 చదరపు అడుగులు వరకు భిన్నంగా ఉన్నా అనుమతించాలని కోరారు. ఇళ్ల నిర్మాణం వేగవంతం కావడానికి ప్రతి మండలానికి ఒక అసిస్టెంట్ ఇంజనీర్ను నియమించి పర్యవేక్షణ బలోపేతం చేయాలని కోరారు. అర్హులైన ఇతర కుటుంబాలకు కూడా అదనపు ఇళ్లు మంజూరు చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో ఏవైనా చిన్న లోపాలు ఉంటే వాటిని సరిదిద్దుతూ బిల్లులు చెల్లింపులు చేయాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించుకున్న లబ్ధిదారుల చెల్లింపులు ఆలస్యం అవుతున్న కారణంగా వారికి త్వరగా బిల్లులు చెల్లించేలా చూడాలని సూచించారు. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీకి ఎమ్మెల్యే మదన్మోహన్రావు విన్నపం -
విద్యా బలోపేతానికి కృషి
బిచ్కుంద(జుక్కల్): రాష్ట్రంలో విద్యా బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తొందని, అన్ని పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మంగళవారం బిచ్కుందలోని మైనారిటీ బాలుర గురుకుల పాఠశాల సందర్శించి రికార్డులు, కిచెన్, తరగతి గదులు పరిశీలించారు. విద్యార్థులు, ప్రిన్సిపాల్ సునీతతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థులకు గురుకుల పాఠశాలలు వరంగా మారాయన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు రుచికరమైన భోజనం పెట్టాలన్నారు. క్లోరినేషన్ చేసిన నీటిని అందించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సునీత, నాయకులు నాగ్నాథ్ పటేల్, గంగాధర్, బొగడమీది సాయిలు, ఉపాధ్యాయులు ఉన్నారు. అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మద్నూర్(జుక్కల్): మండలంలోని సుల్తాన్పేట్కు చెందిన కాంగ్రెస్ నాయకుడు, రిటైర్డ్ టీచర్ మొయిన్పటేల్ అనారోగ్యంతో మృతి చెందారు. మంగళవారం జరిగిన అంత్యక్రియల్లో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. గురుకుల పాఠశాల సందర్శించిన ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు -
విద్యార్థులకు క్రీడాదుస్తుల వితరణ
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని గోపాల్పేట హైస్కూల్లో 25మంది విద్యార్థులకు మంగళవారం స్థానిక ఎస్సై భార్గవ్గౌడ్ క్రీడాదుస్తులను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై భార్గవ్గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నతస్థాయికి చేరాలన్నారు. హెచ్ఎం వెంకట్రాంరెడ్డి, పీడీ సభాత్కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో టై, బెల్ట్లు.. భిక్కనూరు: మండలంలోని తిప్పాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కామారెడ్డి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం టై, బెల్ట్లను పంపిణీ చేశారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రోటరీ క్లబ్ ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో తపస్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవరెడ్డి, రోటరీ క్లబ్ అధ్యక్షుడు శంకర్, ఉపాధ్యాక్షులు జైపాల్రెడ్డి,పొగ్రాం కో–ఆర్డినేటర్ పున్న రాజేశ్, సభ్యుడు సుధాకర్,హెచ్ఎం యాదగిరి, ఉపాధ్యాయులు నర్సింహరెడ్డి, ఉమారాణి, సురేశ్, అజ్జులు పాల్గొన్నారు. 23న ఎల్లారెడ్డికి మందకృష్ణ మాదిగ రాక ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డికి ఈనెల 23న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ రానున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు సామెల్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధిక సంఖ్యలో పెన్షన్ దారులు హాజరు కావాలని కోరారు. నాయకులు పద్మారావు తదితరులున్నారు. -
అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
కామారెడ్డి క్రైం : జిల్లాలో రాబోయే 72 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర సమయాల్లో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 08468–220069 లో సంప్రదించాలన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్ని జిల్లాల కలెక్టరు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు చర్యలపై సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. వీసీ అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. వర్షాల వల్ల జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్లలోంచి బయటికి రావద్దని సూచించారు. ఈత కొట్టడానికి పిల్లలను చెరువులు, వాగుల్లోకి పంపరాదన్నారు. మత్స్యకారులు చేపలు పట్టడానికి వెళ్లవద్దన్నారు. రైతులు విద్యుత్ మోటార్లు, వంగి ఉన్న విద్యుత్ స్తంభాల వద్ద జాగ్రత్తగా ఉండాలన్నారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో ఉండటం మంచిది కాదన్నారు. ప్రమాదకరంగా వరద నీరు ప్రవహించే లోలెవెల్ వంతెనలు, కల్వర్టులు, కాజ్వేల వద్దనుంచి ప్రజలు, వాహనాలు వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేయాలని పోలీసు, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. బుధవారం ఉదయం 11 గంటలకు అన్ని మండల కేంద్రాల్లో మండల స్థాయి అధికారులు పంచాయతీల కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ముందస్తు చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ రాజేశ్చంద్ర, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
జవాబుదారీతనమే ప్రధానం
కామారెడ్డి క్రైం : జవాబుదారీతనం గల సమాజాన్ని నిర్మించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సమాచార చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల పీఐవో(పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్)లు, జిల్లా, డివిజన్, మండల స్థా యి అఽధికారులకు మంగళవారం కలెక్టరేట్లో సమా చార హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. సమావేశంలో రాష్ట్ర సమాచార చీఫ్ కమిషనర్తో పాటు సమాచార కమిషనర్లు మొహ్సినా పర్వీన్, దేశాల భూపాల్, అయోధ్య రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో చీఫ్ కమిషనర్ మాట్లాడుతూ తక్కువ ఫి ర్యాదులు ఉన్న జిల్లాల్లో కామారెడ్డి మూడో స్థానంలో ఉందన్నారు. ఇక్కడ జవాబుదారీతనం ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే ప్రతి కార్యాలయం, సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని పౌరులు పొందవచ్చన్నారు. ఇందుకోసం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పీఐవోలను తప్పనిసరిగా నియమించాల న్నారు. రికార్డులు, ఉద్యోగుల వివరాలు, విధులు, బాధ్యతలతో కూడిన 41బి రిజిస్టర్లు అన్ని కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలన్నారు. సమాచారం అడిగే వ్యక్తి ఎందుకు సమాచారం అడుగుతున్నాడో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. దరఖాస్తు తీసుకున్న 30 రోజుల్లోగా (సేకరించి ఇవ్వాల్సిన సందర్భాల్లో 45 రోజులు) పీఐవో సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. లేని పక్షంలో దరఖాస్తుదారుడు మొదటి అప్పీల్ చేసుకోవచ్చన్నారు. 90 రోజుల్లోగా సమాచారం రాకుంటే రెండో అప్పీల్కు వెళ్లవచ్చన్నారు. ఆలస్యం చేస్తే నష్టపరిహారం వరకు వెళ్లే వెసులుబాటు చట్టంలో ఉందన్నారు. అన్ని స్థాయిల అధికారులు సమాచార హక్కు చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.పారదర్శకతతోనే విశ్వసనీయత.. ప్రతి పౌరుడికి సమాచారం అడిగే హక్కు ఉంది తక్కువ ఫిర్యాదులున్న జిల్లాల్లో కామారెడ్డికి 3 స్థానం రాష్ట్ర సమాచార చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డిపారదర్శకత, జవాబుదారీతనం, అవినీతి రహి త పాలనతోనే ప్రజల్లో విశ్వసనీయత పెరుగు తుందని కమిషనర్ అయోధ్యరెడ్డి పేర్కొన్నారు. పీఐవోలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కార్యాలయాల్లోని పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కమిషన్ ఆధ్వర్యంలో ఏ కార్యాలయంలో, ఎప్పుడైనా తనిఖీ లు జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. భోజన విరామం తర్వాత జరిగిన రెండో సెషన్లో జిల్లాకు సంబంధించి రెండో అప్పీల్ కేసులపై శాఖల వారీ గా విచారణ జరిపారు. కార్యక్రమంలో ఎస్పీ రాజేశ్చంద్ర, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఏఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, ఆర్డీవోలు వీణ, పార్థసింహారెడ్డి, వివిధ శాఖల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు, పీఐవోలు, సిబ్బంది పాల్గొన్నారు. -
రక్తదానానికి ముందుకు రావాలి
కామారెడ్డి క్రైం: రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పిలుపునిచ్చారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థుల సహకారంతో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కళాశాల పూర్వ విద్యార్థి బాల్రాజ్ గౌడ్ జ్ఞాపకార్థం కళాశాల ఆడిటోరియంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదానం చేసిన విద్యార్థులు, అధ్యాపకులను కలెక్టర్ అభినందించారు. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా రక్తదానం విషయంలో రాష్ట్రంలోనే జిల్లా ముందుండాలన్నారు. కార్యక్రమంలో రెడ్క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ రాజన్న, కళాశాల ప్రిన్సిపాల్ విజయకుమార్, రెడ్క్రాస్ ప్రతినిధులు రఘుకుమార్, దస్తీరాం, నరసింహం, రమేశ్రెడ్డి, అధ్యాపకులు శ్రీనివాస్రావు, సుధాకర్, బాల్రాజ్ గౌడ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
ఈవీఎంలపై ఆరోపణలు అర్థరహితం
కామారెడ్డి టౌన్: ప్రజాక్షేత్రంలో ఓటమి పాలవుతూ కాంగ్రెస్ నాయకులు ఈవీఎంలపై ఆరోపణలు చేయడం అర్థరహితమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు విమర్శించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజా శ్రేయస్సు, దేశ ప్రయోజనాలే ప్రధానంగా దేశ ప్రధాని మోదీ పని చేస్తున్నారన్నారు. వరుసగా మూడు పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ నాయకులు ఈవీఎంలను తప్పబట్టిడం సమంజసం కాదన్నారు. కర్ణాటక, తెలంగాణల్లోనూ ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహించారని, ఆ ఎన్నికలలో గెలిచినప్పుడు ఎందుకు ఈవీఎంలపై ఆరోపణలు ఎందుకు చేయలేదని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. బీజేపీకి, మోదీకి ప్రజల్లో ఆదరణ పెరగడాన్ని జీర్ణించుకోలేకే రాహుల్గాంధీ, ఇండి కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఓటరు జాబితాపై అనుమానాలు ఉంటే ఈసీ అడిగినట్లుగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు శ్రీకాంత్, నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలది తప్పుడు ప్రచారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు -
రుణాలను సకాలంలో చెల్లించాలి
నాగిరెడ్డిపేట: మహిళా సంఘాల సభ్యులు సీ్త్రనిధి ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని జిల్లా సీ్త్రనిధి రీజినల్ మేనేజర్ కిరణ్కుమార్ సూచించారు. మంగళవారం గోపాల్పేట, బొల్లారం, చీనూర్, ధర్మారెడ్డి, జలాల్పూర్, తాండూర్ గ్రామాల్లో రుణ బకాయిల వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ ఏడాది సీ్త్రనిధి ద్వారా రూ. 95 కోట్లు రుణాలుగా అందించాలన్నది లక్ష్యమన్నారు. వాటిలో ఇప్పటివరకు 30 శాతం రుణాలను అందించాలమన్నారు. జిల్లావ్యాప్తంగా రూ. 20 కోట్ల సీ్త్రనిధి రుణాల బకాయిలు ఉన్నాయన్నారు. నాగిరెడ్డిపేట మండలంలో రూ. 3 కోట్ల వరకు బకాయిలున్నాయని పేర్కొన్నారు. బకాయిల వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నామన్నారు. ఆయన వెంట సీసీలు దత్తు, శ్రీనివాస్రెడ్డి, సుజాత, అకౌంటెంట్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
‘లక్పతి దీదీ’కి మూడు సంఘాల ఎంపిక
కామారెడ్డి క్రైం: గ్రామీణాభివృద్ధి శాఖ ద్వా రా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ‘లక్పతి దీదీ’ అనే కేటగిరీకి మన జిల్లా నుంచి 3 స్వయం సహాయక సంఘాలు ఎంపికయ్యాయని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం 5 సంఘాలను ఎంపిక చేయగా వాటిలో 3 సంఘాలు మన జిల్లాకు చెందినవేనని పేర్కొన్నారు. ఎంపికై న లింగంపేట, కామారెడ్డి మండల సమాఖ్యల అధ్యక్షులు గడ్డం సులోచన, గరిగె గోదావరి, బీర్కూర్ మండలం నుంచి బొందుగుల సవిత ఈనెల 15 న ఢిల్లీలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవాల్లో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటారని తెలిపారు. వారు కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపికై న వారిని కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సురేందర్, అదనపు డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
న్యాయవాదులకు హెల్త్ కార్డులు
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని బార్ అ సోసియేషన్ కార్యాలయంలో మంగళవారం న్యాయవాదులకు హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేశ్ మాట్లాడుతూ కార్డు ద్వారా రూ. 2 లక్షల వరకు ఉచితంగా వైద్యం పొందవచ్చన్నారు. హెల్త్ కార్డులు మంజూరు చేసిన సీఎం రేవంత్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. హెల్త్ కార్డు పరిమితిని రూ. 10 లక్షలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బండారి సురేందర్రెడ్డి, అడిషనల్ పీపీ నిమ్మ దామోదర్రెడ్డి, ప్రతినిధులు అమృతరావు, బి.దామోదర్ రెడ్డి, గజ్జెల భిక్షపతి, లక్ష్మణ్రావు, ప్రదీప్రెడ్డి, రజనీకాంత్, కాంగ్రెస్ లీగల్ సెల్ చైర్మన్ దేవరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.‘పౌష్టికాహారం అందించాలి’కామారెడ్డి క్రైం : గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ ఝాన్సీరాణి సూచించారు. మంగళవారం జిల్లాకు వచ్చిన ఆమె కలెక్టరేట్లోని సంక్షేమ శాఖ అధికారి కార్యాలయాన్ని సందర్శించా రు. అధికారుల పనితీరు, అమలు చేస్తున్న పథకాలపై సమీక్షించారు. అనంతరం డ్రైవ ర్స్ కాలనీ, రాజీవ్నగర్ కాలనీల్లోని అంగన్వాడీ కేంద్రాలు, సఖి కేంద్రం, ప్రభుత్వ బాలికల వసతి గృహాలను సందర్శించారు. నిర్మాణంలో ఉన్న సఖి కేంద్రం భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకో వాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, సిబ్బంది పాల్గొన్నారు.ఇసుక అక్రమ రవాణాపై కేసుకామారెడ్డి క్రైం: ఇందిరమ్మ ఇళ్ల పేరిట ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. జుక్కల్ పోలీసులు మంగళవారం వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ ఇసుక ట్రాక్టర్ను పట్టుకున్నారు. డ్రైవర్ ఘోరీని విచారించగా ఇసుక అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది. జుక్కల్ మండలం సోపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో తహసీల్దార్ ద్వారా అనుమతి పత్రాలు పొంది మంజీర నుంచి ఇసుకను అక్రమంగా కర్ణాటక ప్రాంతానికి తరలిస్తున్నట్లు విచారణలో అంగీకరించారు. రూ.900 లకు వచ్చే ట్రాక్టర్ ఇసుకను రూ.9 వేలకు అమ్ముకుంటున్నారని తేలిందని ఎస్పీ పేర్కొన్నారు. ట్రాక్టర్ యజమాని మహమ్మద్ ఆదిల్ ఇక్కడి నుంచి కర్ణాటకకు చెందిన మదన్ సోపేంద్ర బీదార అనే వ్యక్తికి ఇసుకను పంపిస్తున్నాడని తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేశామని, ఇసుక ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని, డ్రైవర్ను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.నేడు ఇందిరమ్మ ‘మార్కింగ్ మహా మేళా’నిజామాబాద్అర్బన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల వేగవంతానికి నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల ‘మార్కింగ్ మహా మేళా’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. బుధవారం ఒకే రోజు 831 ఇళ్ల నిర్మాణానికి మార్కింగ్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. ఏకకాలంలో ఇందిరమ్మ ఇళ్ల పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాకు 17,301 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా.. అందులో 9,526 ఇళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. ఇందులో బేస్మెంట్ లెవల్లో 5,043, రూఫ్ లెవల్లో 796, స్లాబ్ పూర్తయినవి 256 ఉన్నాయి. ఇందిరమ్మ లక్ష్యాన్ని చేరుకుని రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉండాలన్న లక్ష్యంతో కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. -
‘ఉమ్మడి జిల్లాలో రూ. 120 కోట్ల రుణాలిచ్చాం’
నాగిరెడ్డిపేట : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.120 కోట్ల రుణాలను అందించామని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు జనరల్ మేనేజర్ అనుపమ తెలిపారు. సుమారు 98 వేల మంది రైతులు పంట రుణాలు, దీర్ఘ కాలిక రుణాలు పొందారన్నారు. మంగళవారం ఆమె నాగిరెడ్డిపేట సహకార కేంద్ర బ్యాంకును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో కర్షక్మిత్ర ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 1,500 మంది రైతులకు రూ. 30 కోట్ల వరకు రుణాలు ఇచ్చామన్నారు. సుమారు రూ.480 కోట్ల వరకు గోల్డ్లోన్లు అందించామన్నారు. ఖాతాదారులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి కొత్త రుణాలను పొందాలని సూచించారు. ఆమె వెంట డీజీఎం సుమమాల, స్థానిక బ్యాంకు మేనేజర్ ఎల్లేశం ఉన్నారు. -
పోచారం ప్రాజెక్టుకు జలకళ
నాగిరెడ్డిపేట : పోచారం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో వరదనీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టులో నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతూ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువయ్యింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21.5 అడుగులు(1.820 టీఎంసీలు) కాగా మంగళవారం సాయంత్రానికి 20 అడుగుల (1.682 టీఎంసీ) నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి వచ్చి చేరిన నీరు ఆయకట్టు పరిధిలో వానాకాలం పంటల సాగుకు సరిపోతుందని రైతులు పేర్కొంటున్నారు. అధికారుల్లో నిశ్చింత.. పోచారం ప్రాజెక్టు నుంచి ఆయకట్టు కోసం ఈనెల ఆరో తేదీన ప్రధాన కాలువలోకి నీటిని విడుదల చేశారు. ఆ సమయంలో ప్రాజెక్టులో 17 అడుగులతో 1.244 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అయితే సరైన వర్షాలు లేకపోవడం, ఆయకట్టు పరిధిలోని చెరువులు, కుంటలు ఖాళీగా ఉండడం, కాలువలు సైతం పొదలతో అధ్వానంగా ఉండడంతో చివరి ఆయకట్టు వరకు నీటిని అందించడం అధికారులకు ఇబ్బందిగా మారింది. ప్రాజెక్టులో ఉన్న నీటితో ఆయకట్టును చివరి వరకు గట్టెక్కించడం కష్టమన్న అభిప్రాయం వ్యక్తమయ్యింది. కానీ వారం రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టు నీటిమట్టం పెరగడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఉన్న నీటితో వానాకాలం పంటలకు పూర్తి స్థాయిలో నీరందించవచ్చని పేర్కొంటున్నారు. పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో జలాశయం వానాకాలం పంటల సాగుకు పూర్తి భరోసా -
జీవన్ దాన్!
శరీరంలో ప్రధానమైన గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం వంటి అవయవాలు దెబ్బతిని ఎంతోమంది ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. అవయవ మార్పిడి జరగక ఎన్నో జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోతున్నాయి. అయితే బ్రెయిన్ డెడ్కు గురైన వారి నుంచి అవయవాలను సేకరించి అలాంటి వారికి అమర్చడం ద్వారా ప్రాణాలను నిలిపే అవకాశాలున్నాయి. జిల్లాలో పలువురు బ్రెయిన్డెడ్ కాగా.. వారి కుటుంబ సభ్యులు అవయవాలను దానం చేసి ఎన్నో ప్రాణాలను నిలిపారు.సాక్షి ప్రతినిధి కామారెడ్డి : తమ ఇంటిదీపం ఆరిపోతోందని ఆందోళన చెందుతున్న కుటుంబాల్లో అవయవదాతలు వెలుగులు నింపుతున్నారు. మృత్యు అంచుల్లో ఉన్న వారిలో జీవకళ తెస్తున్నారు. తమ శరీరంలో దెబ్బతిన్న అవయవాల స్థానంలో ఇతరుల నుంచి సేకరించిన వాటిని అమర్చడంతో మృత్యువు దగ్గరిదాకా వెళ్లిన వారు సాధారణ జీవనం సాగిస్తున్నారు. చాలా వరకు రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారిలో మెదడు పనిచేయదు. దీనిని వైద్యులు బ్రెయిన్డెడ్గా పరిగణిస్తా రు. బ్రెయిన్ డెడ్ అయినా ఆ వ్యక్తి శరీరంలోని గుండె, కిడ్నీలు, కళ్లు, ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవాలు పనిచేస్తాయి. కు టుంబ సభ్యుల అంగీకారంతోనే వైద్యులు అవయవాలను సేకరిస్తున్నారు. వాటిని అవసరమైన వారికి అమర్చి పునర్జన్మ ఇస్తున్నారు. బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి నుంచి సేకరించిన గుండె, ఊపిరితిత్తులను నాలుగు గంటలలోపు, కాలేయాన్ని 12 గంటలలోపు, కిడ్నీలను 48 గంటల్లోపూ ఇతరులకు అమర్చాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో బాధితుడి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి, బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తి శరీరం నుంచి ఆయా అవయవాలను సేకరించి ఇతరులకు అమర్చడం ద్వారా నలుగురికి ఊపిరి పోస్తున్నారు వైద్యులు.జిల్లాలో ఇరవై మందికిపైగా...జిల్లాలో అవయవదానంపై అవగాహన పెరుగుతోంది. పదేళ్ల కాలంలో బ్రెయిన్ డెడ్ అయిన ఇరవై మందికిపైగా అవయవాలను దానం చేశారు. వారి కుటుంబ సభ్యుల ఆమోదం మేరకు అవయవాలను సేకరించి అవసరం ఉన్న రోగులకు అమర్చడం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి పునర్జన్మ ప్రసాదించారు. జీవన్దాన్ సంస్థ అవయవదానంపై అవగాహన కల్పించడంతో పాటు బ్రెయిన్డెడ్ అయిన వ్యక్తుల కుటుంబ సభ్యులను ఒప్పించి అవయవాలను దానం చేయడానికి సహకరిస్తోంది. జిల్లాలోనూ అవయవదానంపై వివిధ సంఘాలు అవగాహన కల్పిస్తున్నాయి. -
ఏటీసీలతో ఉజ్వల భవిష్యత్తు
కామారెడ్డి క్రైం : ప్రభుత్వ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ)లలో ప్రవేశం పొంది ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విద్యార్థులకు సూచించారు. జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏటీసీలలో అడ్మిషన్ల పెంపుపై కలెక్టరేట్లో సోమవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంప్రదాయ ఐటీఐ కోర్సులతో పాటు ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్లో నైపుణ్య ఆధారిత కోర్సుల అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయా కోర్సుల ద్వారా యువత త్వరగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పొందే అవకాశాలు ఉంటాయన్నారు. జిల్లాలోని విద్యార్థులు ఈ కోర్సుల్లో చేరేలా విస్తృత ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. గ్రామ పంచాయితీ కార్యదర్శుల ద్వారా స్థానికంగా ఉండే విద్యార్థులకు సమాచారం ఇప్పించాలన్నారు. బిచ్కుంద, తాడ్వాయి, ఎల్లారెడ్డిలలో ఉన్న ఏటీసీలలో చేరడానికి ఈ నెల 28 వరకు గడువు ఉందన్నారు. కార్యక్రమంలో డీపీవో మురళి, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రభుదాస్, ప్రిన్సిపాల్స్ ప్రమోద్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. మహిళా సంఘాలలో చేర్పించాలి జిల్లాలో మిగిలి ఉన్న వారిని స్వయం సహాయక సంఘాలలో చేర్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. కామారెడ్డిలోని కళాభారతి ఆడిటోరి యంలో సోమవారం డీఆర్డీఏ ఆధ్వర్యంలో సా మాజిక చేకూర్పు, నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చే శారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో స్వయం సహాయక సంఘాలలో లేనివారిని సంఘాలలో చేర్పించడానికి చర్యలు తీసుకోవాలన్నా రు. అలాగే 60 ఏళ్లు నిండిన వృద్ధ మహిళల కోసం వృద్ధుల సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్లలోపువారికోసం కిశోర బాలికల సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. వి భిన్న ప్రతిభావంతుల సంఘాలనూ తయారు చే యాలన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదన పు కలెక్టర్ చందర్నాయక్, డీఆర్డీవో సురేందర్, అదనపు డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీఎంలు శ్రీనివా స్, సాయిలు, సురేష్, శోభ, రాజయ్య, 22 మండలాల ఏపీఎంలు, సీసీలు, మండల సమాఖ్య ప్రతిని ధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కోర్సులపై అవగాహన కల్పించాలి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
నిరాశాజనకంగా నిజాంసాగర్
6వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. మెదక్ జిల్లాలోని ఘనపురం ఆనకట్టతో పాటు హల్దీ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ప్రాజెక్టులోకి సోమవారం సాయంత్రం 6,284 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు(17.8 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి 1,392.40 అడుగుల (5.203 టీఎంసీలు) నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు.నిజాంసాగర్ : ఉమ్మడి జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టు వెలవెలబోతోంది. దీంతో ఆయకట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వరుణుడు కరుణిస్తే తప్ప ఆయకట్టు గట్టెక్కే పరిస్థితులు కనిపించడం లేదు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద అలీసాగర్ రిజర్వాయర్ వరకు 1.15 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రధాన కాలువకు ఇరువైపులా మోటార్లు ఏర్పాటు చేసి మరో 15 వేల ఎకరాల వరకు అనధికారికంగా పంటలు పండిస్తున్నారు. రెండు విడతల్లో 1.58 టీఎంసీలు విడుదల ఈ సీజన్లో నిజాంసాగర్ ఆయకట్టుకు ఇప్పటివరకు రెండు విడతల్లో 1.58 టీఎంసీల నీటిని విడుదల చేశారు. జూన్ 25 నుంచి జూలై 9 వరకు మొదటి దఫాలో 0.766 టీఎంసీల నీరందించారు. అదేనెలలో 15 నుంచి 23 వరకు రెండో దఫాలో 0.814 టీఎంసీల నీరు విడుదల చేశారు. అయితే వర్షాకాలం ఆరంభం నుంచి ఇప్పటివరకు ప్రాజెక్టులోకి 1.224 టీఎంసీల నీరు మాత్రమే వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 5.203 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇందులో డెడ్ స్టోరేజీలో 0.9 టీఎంసీ ఉంటుంది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు కురియకపోతే ఆయకట్టు పంటలు గట్టెక్కడం అసాధ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎగువనుంచి ఆశలు అంతంతే.. నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువన సింగూరు ప్రాజెక్టుతో పాటు కొండపోచమ్మ, మల్లన్నసాగర్ రిజర్వాయర్లు ఉన్నాయి. సింగూరు ప్రాజెక్టు హైదరాబాద్ ప్రాంతంతోపాటు మిషన్ భగీరథ గ్రిడ్కు తాగు నీటి సరఫరాకు పరిమితం అయ్యింది. సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం 20 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. అయితే కొండ పొచమ్మ, మల్లన్న సాగర్ రిజర్వాయర్లలో నీటి నిల్వలు నిరాశాజనకంగా ఉండడంతో నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీరు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం అలీసాగర్ వరకు 1.3 లక్షల ఎకరాల్లో పంటల సాగు పంటలు గట్టెక్కాలంటే మరో నాలుగు తడులు అవసరం వెలవెలబోతున్న ప్రాజెక్టు.. వరుణుడి కరుణపైనే ఆశలువర్షాలు కురిస్తేనే.. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. ప్రాజెక్టు కింద సాగు చేసిన పంటలు గట్టెక్కాలంటే నాలుగు తడులైనా నీరివ్వాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటితో నాలుగు తడులు ఇవ్వలేం. వర్షాలు కురిసి ఎగువనుంచి వరదలు వస్తేనే ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందించగలం. – శ్రీనివాస్, సీఈ, కామారెడ్డి -
విచ్చలవిడిగా జూదం!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పేకాట ఎన్నో జీవితాలను బలితీసుకుంటోంది. సరదాగా మొదలైన ఆట వ్యసనంగా మారడంతో ఎంతో మంది అప్పులపాలై ఆస్తులు అమ్ముకున్నారు. కొందరైతే పొద్దస్తమానం పేక ముక్కలతోనే గడుపుతున్నారు. వ్యాపారం, వివిధ వృత్తుల్లో ఉన్నవారితో పాటు ఉద్యోగస్తులు సైతం అన్ని పనులు పక్కన పెట్టేసి పేకాడుతున్నారు. జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో సాగుతున్న పేకాటపై ఎస్పీ రాజేశ్ చంద్ర ఉక్కుపాదం మోపుతున్నా రోజుకో అడ్డాలో ఆట కొనసాగిస్తున్నారు. ఒక్కోసారి సమాచారం తెలిసి పోలీసులు దాడులకు ఉపక్రమించేలోపు పేకాడేవారు అడ్డా మార్చేస్తున్నారు. జిల్లాలో గతేడాది పేకాటకు సంబంధించి 207 కేసులు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో 1,160 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 40.17 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 103 కేసుల్లో 610 మంది అరెస్టయ్యారు. వారి వద్ద నుంచి రూ.11.49 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు దాడుల్లో దొరికినప్పటికీ నాలుగు రోజులకే తిరిగి ఆటలో లీనమవుతున్నారు. కొందరు పేకాటలో మునిగి తేలుతూ కుటుంబాలను కూడా పట్టించుకోవడం లేదు. రోజుల తరబడి ఇంటి ముఖం చూడని వారున్నారు. ఎన్ని అడ్డాలో... పేకాట ఆడేవారు తమ స్థాయిని బట్టి అడ్డాలు నిర్ణయించుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో కొందరు బడాబాబులు పేకాడేందుకు ఇళ్లనే అడ్డాలుగా మార్చుకున్నారు. కుటుంబ సభ్యులు ఊరికి వెళ్తే.. అదే పేకాడ అడ్డా అవుతోంది. అలాగే కొందరు పెంట్ హౌజ్లను పేకాట కోసం వాడుకుంటున్నారు. మరికొన్ని చోట్ల ఇళ్లను వ్యాపార కార్యకలాపాల కోసమంటూ అద్దెకు తీసుకుని అందులో పేకాడుతున్నారు. మరికొందరు ఫామ్ హౌజ్లను పేకాటకు వాడుకుంటున్నారు. పట్టణ శివార్లలో నిర్మాణాలు మద్యలో నిలిచిపోయిన ఇళ్లలో కొందరు పేకాట ఆడుతున్నారు. అలాగే పట్టణానికి చుట్టుపక్కల చెట్లల్లోకి వెళ్లి ఆడేవారున్నారు. మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది పొలాల వద్ద పేకాడుతున్నారు. సహజంగా అడవుల్లోకి ఎవరూ వెళ్లరు. దీంతో తమను పట్టుకునేవారు ఉండరనే ఉద్దేశంతో చాలా మంది పేకాడేవారు అడవిబాట పడుతున్నారు. పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించి పేకాటను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.రూ. లక్షల్లో నష్టపోతున్నా..పేకాటకు అలవాటు పడిన వారిలో చాలా మంది రూ.లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఆ టలో నష్టపోయిన సొమ్మును తిరిగి ఆటలోనే సంపాదించాలన్న పట్టుదలతో కొందరు మరి న్ని అప్పులు చేసి ఆడుతున్నారు. రోజుల తరబడి అప్పులు చేసి ఆటలో నష్టపోయి మరింత అప్పుల్లో కూరుకుపోతున్నారు. అప్పులు తీర్చేందుకు ఆస్తులు అమ్ముకుంటున్నారు. కామారెడ్డి పట్టణానికి చెందిన ఓ వ్యక్తి అప్పులపాలై ఇంటిని అమ్ముకున్నాడు. మరో వ్యక్తి సొంతూరులో ఉన్న వ్యవసాయ భూమిని అ మ్మేశాడు. ఇలా ఎంతో మంది ఆటలో నష్టపోయి కుటుంబాలను రోడ్డున పడేశారు. పే కాటలో నష్టపోయి ఆస్తులు కరిగిపోయి ఆత్మహత్యలకు పాల్పడిన వారూ ఉన్నారు. దాడులకు వెరవని పేకాటరాయుళ్లు అడ్డాలు మార్చి ఆడుతున్న వైనం ఏడు నెలల్లో 103 కేసులు నమోదు -
కొత్త సంఘాల ఏర్పాటు ఎప్పుడో?
ఎల్లారెడ్డి : సెర్ప్, మెప్మాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్వయం సహాయక సంఘాల నుంచి 60 ఏళ్లు నిండినవారిని తొలగిస్తున్నారు. సీ్త్రనిధి, బ్యాంకు లింకేజీల ద్వారా తీసుకున్న రుణాలేమైనా ఉంటే వాటి రికవరీ పూర్తయ్యే వరకు సభ్యులుగా ఉంచి తర్వాత సభ్యత్వం రద్దు చేస్తున్నారు. వృద్ధ మహిళలకు బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి రుణాలను అందించేందుకు బ్యాంకులు ముందుకు రావడం లేదని తెలిసింది. ఈ కారణంతోనే వృద్ధులను మహిళా సంఘాలనుంచి తొలగిస్తున్నట్లు సమాచారం. దీంతో జిల్లాలో వేలాది మంది మహిళలు సభ్యత్వాన్ని కోల్పోయారు. అయితే బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధిల నుంచి రుణాలను పొంది స్వయం ఉపాధి పొందుతున్నామని, ఇప్పుడు తమను సంఘాల నుంచి తొలగిస్తే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. తమకు 60 ఏళ్లు లేకున్నా రికార్డులలో పొరపాట్ల వల్ల మహిళా సంఘాలనుంచి తొలగిస్తున్నారని పేర్కొంటున్నారు. కష్టపడి పనిచేసే ఓపిక ఉన్నా సభ్యత్వం రద్దు వల్ల తమ స్వయం ఉపాధి కోసం కావాల్సిన పెట్టుబడి లేక ఊరికే కూర్చోవాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి వారికోసం ప్రత్యేక సంఘాలను ఏర్పాటు చేస్తామని గతంలో సర్కారు ప్రకటించింది. ఇటీవల ఇందిరా మహిళా శక్తి మిషన్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో వృద్ధులైన మహిళలతోపాటు కిశోర బాలికలకు వేర్వేరుగా ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దీంతో 60 ఏళ్లు దాటిన మహిళల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే సీఎం ప్రకటన చేసి నెలలు గడుస్తున్నా ప్రక్రియ మాత్రం ముందుకు కదలడం లేదు. జిల్లాలో 70 వేల మంది.. జిల్లాలోని 22 మండలాలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో ప్రస్తుతం 17,243 స్వయం స హాయక సంఘాలున్నాయి. వీటిలో 1.75 లక్షల మంది సభ్యులున్నారు. వృద్ధాప్య పింఛన్ పొందుతున్న మహిళలు 42,357 మంది, దివ్యాంగ పెన్షన్ పొందుతున్న మహిళలు 15,516 మంది, కిశోర బాలికలు 16 వేల వరకు ఉన్నారు. ఇందులో మహిళా సంఘాల సభ్యత్వానికి అర్హులైనవారి వివరాలు సేకరించాల్సి ఉంది. వీరందరికి సభ్యత్వం ఇవ్వాలనుకుంటే జిల్లాలో అదనంగా 7 వేల వరకు మహిళా సంఘాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మహిళా సంఘాల్లోంచి 60 ఏళ్లు నిండినవారి తొలగింపు వృద్ధులతోపాటు కిశోర బాలికలనూ చేర్పించాలన్న సర్కారు జిల్లాలో సభ్యత్వం కోసం ఎదురుచూస్తున్న 70 వేల మంది స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 60 ఏళ్లు నిండినవారితోపాటు కిశోర బాలికలకు సభ్యత్వం ఇస్తామని ప్రకటించింది. అయితే నెలలు గడుస్తున్నా ఆ దిశగా అడుగులు పడడం లేదు. దీంతో జిల్లాలో సుమారు 70 వేల మందికి ఎదురుచూపులు తప్పడం లేదు. -
ఎల్లారెడ్డి నియోజకవర్గానికి పది బస్సులు..
ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి నియోజకవర్గానికి పది బస్సులు కేటాయించాలని ఎమ్మెల్యే మదన్మోహన్రావు సోమవారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరారు. ఈ వి షయమై ఆయనకు వినతిపత్రం అందించా రు. దీనిపై స్పందించిన మంత్రి.. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి పది బస్సులను కేటాయించాలని ఆర్డీసీ ఎండీకి ఆదేశాలు జారీ చే శారు. దీంతో పాటు ఎల్లారెడ్డిలో డిపో ఏర్పా టుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఉప్పల్వాయి, రంగంపేట రైల్వే గేట్ల మూసివేత కామారెడ్డి అర్బన్: మరమ్మతుల కారణంగా ఉప్పల్వాయి, రంగంపేట రైల్వేగేట్లను 13, 14, 15 తేదీల్లో మూసి ఉంచనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఇంజినీరింగ్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మార్గంలో వెళ్లే ఉప్పల్వాయి, రామారెడ్డి, తిర్మన్పల్లి, మర్కల్, సదాశివనగర్, రంగంపట, మోషంపూర్, పోసానీపేట గ్రామస్తులు దీనిని గమనించాలని సూచించారు. ఇంజినీరింగ్ కాలేజీలో ఐదుగురి చేరిక తెయూ(డిచ్పల్లి): నూతనంగా ఏర్పాటైన తెలంగాణ యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలకు మూడో విడత కౌన్సెలింగ్లో 81 మందిని కేటాయించగా, మొదటిరోజైన సోమవారం ఐదుగురు విద్యార్థులు అడ్మిషన్స్ తీసుకున్నారు. వీరంతా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ)కి చెందిన విద్యార్థులేనని ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతి తెలిపారు. కౌన్సెలింగ్లో కేటాయించబడిన మరికొంత మంది విద్యార్థులు క్యాంపస్కు వచ్చి ఇంజినీరింగ్ కళాశాలలో ఉన్న వసతి సౌకర్యాలను పరిశీలించారన్నారు. అయితే ఈ విద్యాసంవత్సరం హాస్టల్ వసతి కల్పించకపోవడంతో పలువురు విద్యార్థినులు ఇక్కడ అడ్మిషన్ తీసుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. తొలి విద్యార్థి అల్లె శ్రీచరణ్ కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థి అల్లె శ్రీచరణ్ తెయూ ఇంజినీరింగ్ కళాశాల లో తొలి విద్యార్థిగా అడ్మిషన్ పొందారు. ఆ యనకు ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతి స్వాగతం పలికి అడ్మిషన్ అందజేశారు. విద్యుత్ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు బాన్సువాడ : విద్యుత్ సేవలలో ఎలాంటి స మస్యలున్నా ఫిర్యాదు చేయవచ్చని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక(సీజీఆర్ఎఫ్) చైర్మన్ ఎరుకల నారాయణ పేర్కొన్నారు. సోమవారం బీర్కూర్ విద్యుత్ కార్యాలయం వద్ద విద్యుత్ వినియోగదారు ల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించా రు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బీర్కూర్ మండలంలో విద్యుత్ సరఫరాలో, విద్యుత్ సమస్యలపై వినియోగదారులు పో స్టు ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ ఫోరమ్కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఫిర్యాదుదారు వివరాలను గోప్యంగా ఉంచుతామ న్నారు. ఎలాంటి రుసుము లేకుండా ఫిర్యా దు చేయవచ్చాన్నారు. కార్యక్రమంలో ఫో రం సభ్యులు రామకృష్ణ, కిషన్, రాజగౌడ్ త దితరులు పాల్గొన్నారు. -
భూగర్భ జలాల వృద్ధే లక్ష్యంగా..
సదాశివనగర్లో నిర్మిస్తున్న ఫాంపాండ్సదాశివనగర్ : వర్షపు నీరు వృథాగా పోకుండా నీటి కుంటల నిర్మాణానికి అధికారులు రైతులను ప్రో త్సహిస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప థకం కింద నిర్మాణ పనులు చేపడుతూ భూగర్భ జ లాల వృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రత్యేకంగా వ్యవ సా య బోరు బావుల రీచార్జ్ కోసం ఇంకుడు గుంతల నిర్మాణం చేపడుతున్నారు. పైభాగం నుంచి వచ్చే వరద నీరు భూమిలో ఇంకిపోయి వర్షాభావ సమయంలో పంట కాలానికి సరిపడా భూగర్భ జలాలు అందే అవకాశాలు ఉంటాయని అవగాహన కల్పిస్తున్నారు. ఫాంపాండ్స్ నిర్మాణంలో జిల్లాలో సదాశివనగర్ మండలం ఆదర్శంగా నిలుస్తోంది. ఏడు రకాల గుంతలు.. నీటి నిల్వ కోసం వివిధ రకాల ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నారు. కమ్యూనిటీ ఇంకుడు గుంత, డ్రెయి నేజీ ఇంకుడు గుంత, రాతి కట్టడాల చెక్డ్యాములు, అటవీ ప్రాంతాల్లో భారీ నీటి నిల్వ కుంటలను ఏ ర్పాటు చేస్తున్నారు. సదాశివనగర్ మండలంలో 52 నీటి కుంటల నిర్మాణం లక్ష్యం కాగా 27 నీటి కుంట ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 11 క మ్యూనిటీ నీటి గుంతల్లో ఆరు పూర్తయ్యాయి. 15 వ్యక్తిగత ఇంకుడు గుంతల్లో 10 ప్రారంభ దశలో ఉ న్నాయి. గ్రామానికి మూడు చొప్పున డ్రెయినేజీ ఇంకుడు గుంతల ప్రారంభించారు. 40 రాతి కట్టడా ల చెక్డ్యాములు పూర్తయ్యాయి. 20 లక్షల లీటర్ల నీ టి సామర్థ్యం గల రెండు ఫాంపాండ్లలో ఒకదాన్ని నిర్మిస్తున్నారు. రైతులను ప్రోత్సహిస్తున్నాం ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని ప్రజలను ప్రో త్సహిస్తున్నాం. ఇంకుడు గుంతల నిర్మాణంతో ఉపా ధి కూలీలకు పని దొరుకుతుంది. రైతులు బోరు బా వుల వద్ద ఇంకుడు గుంతల నిర్మాణం చేసుకునేందుకు ముందుకు రావాలి. అందరి కృషితో లక్ష్యాన్ని అధిగమిస్తాం. ఇంకుడు గుంతల నిర్మాణంలో మండలం ఆదర్శంగా నిలవడం గర్వంగా ఉంది. –సంతోష్కుమార్, ఎంపీడీవో, సదాశివనగర్ నీటి కుంటల నిర్మాణానికి అధికారుల కృషి సదాశివనగర్లో జోరుగా నిర్మాణాలు -
ప్రభుత్వ ఆస్తుల వివరాలు ఇవ్వాలి
కామారెడ్డి క్రైం: రూప్ టాప్ సోలార్ విద్యుత్ ప్యానెల్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ఇతర అన్ని ప్రభుత్వ ఆస్తుల వివరాలను వెంటనే సమర్పించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో విద్యుత్, రెడ్కో శాఖల అధికారులతో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలపై రూప్ టాప్ సోలార్ విద్యుత్ సిస్టం ద్వారా విద్యుత్ ఉత్పాదనకు చర్యలు తీసుకుంటోందన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ భవనాలను, ఆస్తులను సందర్శించి ఆయా సంస్థల భవనాలపై ఎండపడే ప్రాంతాల కొలతలు తీసుకుని, వివరాలను తొందరగా ఇవ్వాలని విద్యుత్ శాఖ ఎస్ఈని ఆదేశించారు.అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్ -
నలుగురికి రెండు రోజుల సాధారణ జైలు
ఆర్మూర్టౌన్: పట్టణంలో సోమవారం డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించినట్లు ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణ గౌడ్ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ చేసి కోర్టులో హాజరుపర్చామన్నారు. నలుగురు వ్యక్తులకు సెకండ్క్లాస్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధించినట్లు ఎస్హెచ్వో తెలిపారు. ‘డయల్ 100’ దుర్వినియోగంపై ఒకరికి జైలుధర్పల్లి: డయల్ 100ను దుర్వినియోగం చేసిన ఓ వ్యక్తికి కోర్టు నాలుగు రోజుల జైలు శిక్ష విధించింది. వివరాలు ఇలా ఉన్నాయి. మేడ్చల్కు చెందిన కేతావత్ పరశురాం తీజ్ పండుగ సందర్భంగా ఇటీవల మండలంలోని డీబీ తండాలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చాడు. మద్యం సేవించి ఈ నెల 8న డయల్–100కు పలుమార్లు ఫోన్చేసి పోలీసుల విధులను దుర్వినియోగం పరిచాడు. దీంతో పోలీసులు పరశురాంపై కేసు నమోదు చేసి సోమవారం నిజామాబాద్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జడ్జి నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై కళ్యాణి తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్లో ఇద్దరికి రెండు రోజులు..కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో కామారెడ్డి కోర్టు ఇద్దరికి రెండు రోజుల జైలు శిక్ష విధించింది. రెండు రోజుల క్రితం పట్టణ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా తాడ్వాయి మండలం కన్కల్ గ్రామానికి చెందిన కమలాకర్ రెడ్డి, మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన విశ్వనాథ్లు డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడ్డారు. సోమవారం వారిని కోర్టులో హాజరుపర్చగా ద్వితీయశ్రేణి న్యాయమూర్తి చంద్రశేఖర్ రెండు రోజుల జైలు శిక్ష, రూ.200 చొప్పున జరిమానా విధించినట్లు పట్టణ ఎస్హెచ్వో నరహరి తెలిపారు. సేవా సంస్థలో చోరీకి యత్నంఖలీల్వాడి: నగరంలోని గుర్బాబాది రోడ్ కెనాల్ కట్ట ప్రాంతంలో ఉన్న ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో సోమవారం దుండగుడు చోరీకి యత్నించాడు. మధ్యాహ్న సమయంలో కార్యాలయ తాళాలు పగులగొట్టి లోనికి చొరబడేందుకు ప్రయత్నించాడు. ఇందూరు యువత సిబ్బంది కార్యాలయానికి వచ్చేసరికి డోర్స్ తెరిచి ఉన్నాయి. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి మూడో టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయమై ఎస్సై హరిబాబును వివరణ కోరగా చోరీయత్నం జరిగిందని, దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. ఠాణాలో చేయి కోసుకున్న యువరైతు● భూ సమస్యను పరిష్కరించాలని ఆత్మహత్యాయత్నం నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): భూ వివాదాన్ని పరిష్కరించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నాగిరెడ్డిపేట మండలంలోని మాల్తుమ్మెద గ్రామానికి చెందిన సిద్ధిగారి యాదగిరి అనే యువరైతు సోమవారం రాత్రి స్థానిక పోలీస్స్టేషన్లో బ్లేడ్తో చేయికోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన ఎస్సై భార్గవ్గౌడ్ వెంటనే యాదగిరిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్లో మెదక్ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ, అందుకు యాదగిరి సహకరించకపోవడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ సందర్భంగా యాదరిగి మాట్లాడుతూ తన తండ్రి రాములు గతంలో గ్రామానికి చెందిన కొందరి వద్ద సుమారు రెండున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశాడన్నారు. ధరణి వచ్చిన తర్వాత తమ భూమి గ్రామానికి చెందిన ఇతరుల పేరిట నమోదైందని, ఈ విషయమై పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా, పోలీస్స్టేషన్కు వచ్చిన న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇంటిపై కూలిన భారీ మర్రిచెట్టు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మెంగారం గ్రామంలో సోమవారం రోడ్డు పక్కనే ఉన్న ఇంటిపై భారీ మర్రిచెట్టు కూలినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు నేల మెత్తబడడంతో మర్రిచెట్టు నేల వాలినట్లు తెలిపారు. దీంతో గ్రామానికి చెందిన ఎంకనోళ్ల ఎంకవ్వ ఇళ్లు కూలిపోయింది. అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని బాధితురాలు కోరింది. బైక్ పైనుంచి పడి యువకుడికి తీవ్రగాయాలుపిట్లం(జుక్కల్): బైక్పై నుంచి పడి యువకుడికి తీవ్రగాయాలైన ఘటన మండలంలోని మద్దెలచెరువు గ్రామ సమీపంలో పిట్లం– బాన్సువాడ రహదారిపై సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామానికి చెందిన యువకుడు బైకుపై పిట్లం నుంచి బాన్సువాడ వైపు వెళ్తుండగా మద్దెల చెరువు సమీపంలో అదుపు తప్పి కిందపడిపోయాడు. యువకుడికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం అంబులెన్స్లో బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మూడున్నర తులాల బంగారం చోరీమోపాల్: మండలంలోని గుడి తండాకు చెందిన రత్నావత్ గంగా అలియాస్ హారిక ఇంట్లో నుంచి మూడున్నర తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఎస్సై జాడె సుస్మిత సోమవారం తెలిపారు. గత నెల 27న కుమారుడి జన్మదినం సందర్భంగా బంగారు ఆభరణాలు ధరించారు. తిరిగి ఎప్పటిలాగే బీరువాలో దాచిపెట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా 8న బీరువా తెరిచి చూడగా, బంగారు ఆభరణాలు కన్పించలేదు. ఇంట్లో అంతా వెతికినా లభించకపోవడంతో చోరీకి గురైనట్లు నిర్ధారణకు వచ్చిన హారిక సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఓట్ల దొంగతనం ప్రజాస్వామ్యానికి అవమానం
కామారెడ్డి క్రైం: దేశంలో ఎన్నికల కమిషన్ ఓట్ల దొంగతనం చేయడం ప్రజాస్వామ్యానికి అవమా నమని డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కా ర్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 7న కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశం ఏర్పాటు చేసి దేశంలో ఓట్ల దొంగత నం ఎలా జరిగిందో ఆధారాలతో సహా కళ్లకు క ట్టినట్టుగా చూపించారన్నారు. ఇప్పటికై నా ఎ న్నికల కమిషన్ కళ్లు తెరిచి ఓటరు జాబితాను స రిదిద్ది, ప్రజాస్వామ్యానికి క్షమాపణ చెప్పాలని డి మాండ్ చేశారు. లేదంటే నిరసన కార్యక్రమాలు చేపట్టి పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించా రు. నాయకులు పండ్ల రాజు, గోనె శ్రీనివాస్, గు డుగుల శ్రీనివాస్, పాత శివ కృష్ణమూర్తి, రాజాగౌడ్, ఐరేని సందీప్, పంపరీ లక్ష్మణ్, లక్ష్మీరాజ్యం, మసూద్, రాంకుమార్ గౌడ్, సర్వర్, జమీల్, సిద్దిక్, సిరాజ్, భాస్కర్, దోమకొండ శ్రీనివాస్, లక్కపత్ని గంగాధర్, కిరణ్, కస్తూరి నరహరి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు అభినందన కామారెడ్డి క్రైం: దేవునిపల్లి జెడ్పీహెచ్ఎస్లో సోమవారం నిర్వహించిన నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమానికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హాజరయ్యారు. ఈసందర్భంగా పలువురు విద్యార్థులు ఒకే నిమిషంలో దేశఽంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల పేర్లు చెప్పడం లాంటి పలు నైపుణ్యాలను ప్రదర్శించారు. కలెక్టర్ వారిని అభినందించి, నోటు పుస్తకాలు, పెన్నులు, బహుమతిగా అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు. ఇద్దరు విద్యార్థినుల అదృశ్యంబాన్సువాడ: బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. సదరు విద్యార్థినులు ఉదయం నుంచి కనిపించకపోవడంతో వార్డెన్ మమత సోమవారం బాన్సువాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఎస్టీ కళాశాల హాస్టల్లో ఉండే ఇద్దరు విద్యార్థిను లు సోమవారం ఉదయం మరో విద్యార్థినితో కలిసి కాలేజీకి వెళ్లారు. తర్వాత వారు కనిపించక పోవడంతో వార్డెన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు వారి సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా సికింద్రాబాద్లో ఉన్నట్లు తెలుస్తోందని సీఐ అశోక్ తెలిపారు. -
పేదల చదువులకు ‘విద్యాలక్ష్మి’
వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి విద్యాలక్ష్మి’ పథకం అమలు చేస్తోంది. ● ఇంజినీరింగ్, వైద్య ఇతర వృత్తి విద్యా కోర్సులు, డిగ్రీ చదివే విద్యార్థులకు తోడు విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసే వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ● పేదల చదువుకు హామీ పత్రాలు అవసరం లేకుండానే తక్కువ వడ్డీతో బ్యాంక్ రుణం పొందే అవకాశం కల్పిస్తోంది. ● గూగుల్లో https://pmvidyalaxmi.co.in అనే వెబ్సైట్లోకి వెళ్లి పేరు, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ, చిరునామా నమోదు చేసుకోవాలి. ● రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక సాధారణ విద్యారుణ దరఖాస్తు పత్రం(సీఈఎల్ఏఎఫ్) పూర్తి చేయాలి. ● పదో తరగతి, ఇంటర్, డిగ్రీ మార్కుల జాబితాతోపాటు ఆదాయ ధ్రువీకరణపత్రాలు అప్లోడ్ చేయాలి. ● అర్హులైన పేదలకు మూడు విభాగాల్లో రుణం మంజూరు అవుతుంది. ● మొదటి విభాగంలో రూ.4లక్షల లోపు, రెండో విభాగంలో రూ.4లక్షల నుంచి 7.5 లక్షలు, మూడో విభాగంలో రూ.7.5 లక్షల కంటే ఎక్కువ రుణం అందిస్తారు. ● దరఖాస్తు చేసుకునే విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.4లక్షల లోపు ఉండాలి. – సదాశివనగర్ (ఎల్లారెడ్డి)మీకు తెలుసా? -
కొత్త టెండర్ విధానాన్ని మార్చాలి..
గురుకుల పాఠశాలలకు నిత్యవసర వస్తువులు సరఫరా కోసం తెచ్చిన కొత్త టెండర్ విధానాన్ని మార్చాలని కాంట్రాక్టర్లు కోరారు. ఈమేరకు వారు సోమవారం కలెక్టరేట్కు తరలివచ్చారు. ఇటీవల జరిగిన 2025–26 ఏడాదికి గాను నూతన టెండర్ విధానంలో ప్రభుత్వం అనేక నిబంధనలను కొత్తగా తీసుకువచ్చిందన్నారు. వాటి ప్రకారం వస్తువులు సరఫరా చేస్తే తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. కొత్త టెండర్ విధానాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. అలాగే 4 నెలల పెండింగ్ బిలుల్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. లేదంటే ఈ నెల 13 నుంచి సప్లయ్ నిలిపివేస్తామన్నారు. -
‘ఏఐపై అవగాహన పెంచుకోవాలి’
రామారెడ్డి: భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దేనని, దానిపై విద్యార్థులు ఇప్పటినుంచే అవగాహన పెంచుకోవాలని డీఈవో రాజు సూచించారు. రామారెడ్డి ప్రాథమిక పాఠశాలలో సోమవారం ఆయన ఏఐ ల్యాబ్ను ప్రారంభించారు. ఏఐపై విద్యార్థులకు అవగాహన కల్పించామని ఎంఈవో ఆనంద్రావు డీఈవోతో పేర్కొన్నారు. కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం ఆనంద్, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం గోపాల్రావు, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు రాజు తదితరులు పాల్గొన్నారు.దాడికి పాల్పడిన ముగ్గురిపై కేసు నమోదుమోపాల్: వ్యవసాయ భూమి దున్నడంతోపాటు ఆపాలని చెప్పినందుకు దాడికి పాల్పడిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జాడె సుస్మిత సోమవారం తెలిపారు. మంచిప్ప గ్రామశివారు లో అమ్ముల శ్రావణ్ వ్యవసాయ భూమికి కొద్ది దూరంలో తలారి సాయన్న భూమి ఉంది. గత నెల 21న తన భూమిలో ట్రాక్టర్తో దున్నుతున్న తలారి సాయన్నను ఆపాలని శ్రావణ్ కోరాడు. దున్నడం ఆపకపోగా సాయన్నతోపాటు ఆయన కుమారుడు నిఖిల్, అల్లుడు మనోహర్ కలిసి శ్రావణ్పై పిడిగుద్దులతో దాడి చేశారు. నిఖిల్ రాడ్తో తలపై కొట్టాడు. గాయాలపాలైన శ్రావణ్ 15రోజులకుపైగా ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అంతేగాకుండా తలారి సాయన్న కుటుంబీకులు శోభ, లక్ష్మి కలిసి శ్రావణ్ తల్లిని విపరీతంగా కొట్టారు. సోమవారం శ్రావణ్ ఫిర్యాదు మేరకు సాయన్న, నిఖిల్, మనోహర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
నులి పురుగుల మాత్రలు వేసుకోవాలి
కామారెడ్డి క్రైం: నులి పురుగుల నివారణ కోసం ఏడాదినుంచి 19 ఏళ్లలోపు ప్రతి ఒక్కరు ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఇంటర్మీడియట్ కళాశాలల్లో నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. విద్యార్థులకు ఆల్బండజోల్ మాత్రలు వేశారు. నులి పురుగుల నివారణ మాత్రలు వేసుకోని వారికి ఈనెల 18 న వేయించాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో చంద్రశేఖర్, డీఈవో రాజు, డిప్యూటీ డీఎంహెచ్వో ప్రభుకిరణ్, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి విద్య తదితరులు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 63 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో ప్రధానంగా భూ సంబంధిత రెవెన్యూ ఫిర్యాదులు, ఫించన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిర్యాదులు పెండింగ్లో లేకుండా చూసుకోవాలన్నారు. తీసుకున్న చర్యల వివరాలను దరఖాస్తుదారునికి తెలియపర్చాలని అధికారులకు సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, కలెక్టరేట్ ఏవో మసూర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు. డీపీఎం, ఏపీఎంలపై చర్యలు తీసుకోవాలి ఐకేపీ డీపీఎం రవీందర్, ఏపీఎం ప్రసన్న కుమార్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రామారెడ్డి మండలం రెడ్డిపేట గ్రామ సంఘం సమన్వయకర్త (వీవోఏ) లక్ష్మీనర్సవ్వ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆమె మాట్లాడుతూ.. తాను చాలా కాలంగా రెడ్డిపేట వీవోఏగా పని చేస్తున్నానని అన్నారు. 2024 అక్టోబర్లో రెడ్డిపేట డ్వాక్రా మహిళా సంఘాలలో అక్రమాలు జరిగాయని కొందరు అకారణంగా ఫిర్యాదులు చేయడంతో తనను విధుల నుంచి తొలగించారని తెలిపారు. గ్రామంలో ఉన్న అన్ని సంఘాలలో ఆడిట్ చేయించగా తాను ఎలాంటి తప్పు చేయలేదని తేలిందన్నారు. అయినప్పటికీ సంఘాల తరఫున రూ.80 వేలు సీ్త్రనిధి డబ్బులను తన చేత కట్టించారన్నారు. 9 నెలలు దాటినా ఇప్పటికీ లెక్కలు చేయించడం లేదనీ, విధుల్లోకి తీసుకోవడం లేదని వాపోయారు. సంబంధిత డీపీఎం, ఏపీఎంలపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. గురుకులానికి సొంత భవనం నిర్మించాలి కామారెడ్డి అర్బన్: లింగంపేటకు 2016లో మంజూరైన సాంఘీక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు ఐదు ఎకరాల స్థలం కేటాయించినా, ఇప్పటికీ పక్కా భవనం నిర్మించడం లేదని, వెంటనే భవనం నిర్మించాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు హరిలాల్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. లింగంపేటలో పక్కా భవనం లేనందున గత 9 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాల్లో అద్దె భవనాల్లో నడుపుతున్నారన్నారు. వెంటనే నిధులు మంజూరు చేసి లింగంపేటలో భవన నిర్మాణం చేపట్టాలని కోరారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజావాణిలో 63 ఫిర్యాదుల స్వీకరణ -
అలుగు పారుతున్న పెద్ద చెరువు
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పెద్ద చెరువు ఆదివారం సాయంత్రం నుంచి స్వల్పంగా అలుగు పారడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాడ్వాయి మండలంలో కురిసిన భారీ వానలకు అక్కడి కుంటలు, చెరువులు నిండి, పెద్దచెరువుకు వరద వచ్చింది. దీంతో కామారెడ్డి చెరువు నిండి అలుగు పారడంతో కింద భాగంలోని మత్తడిలోకి నీరుచేరుతుంది. ఇకపై ఏ కొద్ది వర్షం కురిసినా అలుగుపారి వృథా నీరు ఉగ్రవాయి, ఆరేపల్లి, భవానీపేట, పాల్వంచ వాగు ద్వారా ఎగువ మానేరు ప్రాజెక్ట్లోకి చేరుతుంది. ఈ వాగునీటి ద్వారా ఆయా గ్రామాల పరిధిలో ఇరువైపులా మోటారు పంపులు బిగించి వందల ఎకరాల్లో పంటలు సాగుచేస్తున్నారు. వానలను బట్టి దాదాపు రెండు నెలలు అలుగు పారే అవకాశం ఉంటుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. -
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తాం
గాంధారి(ఎల్లారెడ్డి) : నియోజకవర్గం పరిధిలో అన్ని గ్రామాల్లో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అన్నారు. గండివేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి, ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాని వారు ఆందోళన చెందరాదన్నారు. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి బేస్మెట్ లెవెల్ పనులు పూర్తయిన లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయన్నారు. అనంతరం గండివేట్ తండాలో నిర్వహించిన తీజ్వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయనతో పాటు మండల పరిధిలోని పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలున్నారు. కామారెడ్డిలో బంజారా సంఘం ఏర్పాటుకు కృషి చేస్తా ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో బంజారా సంఘం భవనం ఏర్పాటుకు సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడతానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. ఆదివారం ఎల్లారెడ్డి పట్టణంలోని ముత్యపు రాఘవులు ఫంక్షణ్ హాల్లో నిర్వహించిన తీజ్ ఉత్సవాలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. శ్రావణమాసంలో గిరిజన మహిళలు ఉపవాస దీక్షలు చేసి గోధుమ బుట్టలను పూజించడం జరుగుతుందన్నారు. నాగిరెడ్డిపేటలో బంజారా భవనం ఏర్పాటు చేస్తానని అన్నారు. అనంతరం బంజారా సంఘం నాయకులు ఎమ్మెల్యేను గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నారులు, మహిళలు గోధుమ బుట్టలతో పట్టణంలో అంబేడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. బంజారా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాములు నాయక్, జిల్లా అధ్యక్షులు సురేందర్నాయక్, మోతిసింగ్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట బంజారా సంఘం అధ్యక్షులు రాములు, రమేష్, బంజారా సంఘం నాయకులు సంగ్రాం, గణేష్, సర్దార్, సంతోష్, మున్సిపల్ మాజీ చైర్మెన్లు కుడుముల సత్యనారాయణ, పద్మ శ్రీకాంత్, మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిబాబా, వినోద్గౌడ్, సామెల్, శ్రీనివాస్రెడ్డి తదితరులున్నారు. పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలి లింగంపేట(ఎల్లారెడ్డి): పెద్దమ్మతల్లి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. మండలంలోని సజ్జన్పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. పెద్దమ్మ తల్లి ఆలయం నిర్మాణం, అభివృద్ధి కోసం తాను పూర్తి సహకారం అందజేస్తానన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు బట్టు విఠల్, మండల అధ్యక్షుడు సాయికుమార్, ఆలయ కమిటీ అధ్యక్షుడు రమేశ్, కార్యవర్గ సభ్యులు కిష్టయ్య, సిద్దిరాములు, పోచయ్య, సాయిలు, బాలయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర నారాగౌడ్, గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు, ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు. ఇళ్లు మంజూరు కాని వారు ఆందోళన చెందొద్దు పలు చోట్ల తీజ్ వేడుకల్లో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమెల్యే మదన్మోహన్ రావు -
ఎస్సారెస్పీలోకి గుర్రపు డెక్క
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటితో పాటు గుర్రపు డెక్క కొట్టుకువస్తోంది. దీంతో ప్రాజెక్ట్ నీటిలో గుర్రపు డెక్క మొక్కలు భారీగా పేరుకుపోగా, కొన్ని ఆనకట్ట అంచున వచ్చిచేరాయి. గుర్రపు డెక్క పేరుకుపోతే ఆనకట్టకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుర్రపు డెక్కతో అనర్థాలు.. గుర్రపు డెక్క నీటిలో పెరిగే కలుపు మొక్క. ఇది వేగంగా పెరిగి నీటి వనరులను మూసుకు పోయే లా చేస్తుంది. దీని వలన నీటి ప్రవాహానికి అంతరాయం ఏర్పడుతుంది. ప్రాజెక్ట్ అనకట్ట అంచున గురప్రుడెక్క పేరుకుపోతే రివిట్మెంట్లోకి నీరు అధికంగా వెళ్లి అనకట్టకు గండి పడే ప్రమాదం ఏర్పడుతుంది. చేపల పెంపకాననికి అంటకంగా మారుతుంది. దీని వలన అధికంగా దోమలు, ఇతర కీటకాలు పెరిగి నీటి నాణ్యతను దెబ్బతీస్తుంది. గుర్రపు డెక్క నీటిలో ఆక్సిజన్ స్థాయిలను తగ్గిస్తుంది. వ్యాధుల వ్యాప్తికి కారణమవుతుంది. ఒక్కసారి నాటుక పోతే తొలిగించడానికి చాలా ఖర్చు అవుతుంది. దీంతో ఆర్థికంగా కూడ తీవ్రంగా ప్రభావం చూపుతుంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఆనకట్ట అంచున పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలిగించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
మద్యంమత్తులో యువకుడి వీరంగం
నిజామాబాద్ రూరల్: మండలంలోని గూపన్పల్లి గ్రామంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించి, ముగ్గురిపై దాడిచేసి గాయపర్చాడు. నిందితుడిని పోలీసులు పట్టుకొని రిమాండ్కు తరలించా రు. రూరల్ ఎస్హెచ్వో మహ్మద్ ఆరీఫ్ తెలిపిన వి వరాలు ఇలా.. గ్రామానికి చెందిన మదన్ అనే వ్యక్తి శనివారం రాత్రి కల్లుబట్టిలో మద్యం తాగి సమీపంలో గల అనిల్ అనే వ్యక్తి ఇంటి ఎదుట నిద్రించాడు. కొద్దిసేపటికి ఇంటికి చెందిన అనిల్, శైలేందర్లు ఇంట్లోకి వెళుతుండగా మదన్కు కాళ్లు తగలడంతో మేల్కొన్నాడు. దీంతో మదన్ వారితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం మదన్ పగిలిన కల్లుసీసాతో శై లేందర్ ఎడమచేతిని గాయపరిచారు. అనిల్, అతడి అక్క దీపిక అడ్డురావడంతో మదన్ వారిపై సైతం దాడిచేసి గాయపర్చారు. వెంటనే గ్రామ పెద్దలు ఘటన స్థలానికి చేరుకొని ఇరువురిని సముదాయించి అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనపై బాధితులు మరుసటి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి, నిందితుడిని పట్టుకొని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ముగ్గురిపై కల్లుసీసాతో దాడి నిందితుడిని రిమాండ్కు తరలించిన రూరల్ పోలీసులు -
వృద్ధురాలి ఆత్మహత్య
సిరికొండ: మండలంలోని చీమన్పల్లి గ్రామంలో ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన చందాల లక్ష్మీ(63) అనే వృద్ధురాలు గత కొన్ని రోజుల నుంచి మానసిక స్థితి సరిగా ఉండటం లేదు. ఒంటరిగా నివసించడంతో తీవ్ర మనోవేదనకులోనై తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. హాస్టల్ వార్డెన్.. ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహం వార్డెన్ షబానా ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన షబానా గత సంవత్సరం ఆగస్టులో ఆర్మూర్లోని ఎస్సీ హాస్టల్లో విధుల్లో చేరింది. ఆర్మూర్ పట్టణంలోనే ఉంటూ విధులు నిర్వహిస్తుండేది. కాగ రెండు రోజులు సెలవులు రావడంతో ఆమె జగిత్యాలలోని ఆమె ఇంటికి వెళ్లింది. ఆమె స్వగృహంలో శనివారం సాయంత్రం ఉరి వేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది.ఈ ఘటనపై తోటి ఉద్యోగులు, హాస్టల్ విద్యార్థినులు విచారం వ్యక్తం చేశారు. -
బకాయిల ‘పంచాయితీ’
బిచ్కుంద(జుక్కల్) : బిచ్కుంద జీపీ నుంచి నూతన మున్సిపాలిటీగా ఏర్పడింది. నాలుగు నెలల క్రితం మున్సిపల్ అధికారులు జీపీ రికార్డులు స్వాధీనం చేసుకొని బాధ్యత తీసుకున్నారు. ఈక్రమంలో జీపీ బకాయిలు మున్సిపల్ కు సంబంధంలేదని అధికారులు చేతులెత్తెస్తున్నారు. బిచ్కుంద మున్సిపాలిటీ ఏర్పడక ముందు ఏడాదిన్నరలో బోరు మోటర్ల మరమ్మతులు, ట్రాక్టర్ చెత్త సేకరణ డీజిల్, పారిశుధ్య పనులు, క్లోరినేషన్ కోసం బ్లీచింగ్ పౌడర్, వీధిలైట్లు జీపీకి వ్యాపారులు సరఫరా చేశారు. ఈ బకాయిలు సుమారు రూ. 16 లక్షలు ఉన్నాయి. బోరు మెకానిక్లు, బ్లీచింగ్ పౌడర్, బల్బులు ఇచ్చిన వ్యాపారులు డబ్బుల కోసం మున్సిపల్ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. జీపీ పాత బకాయిలు చెల్లించడానికి మున్సిపల్ శాఖకు అనుమతులు ఉండవని, చిల్లిగవ్వ చెల్లించమని మున్సిపల్ కమిషనర్ ఖయ్యూం చెప్పడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. వీటికి ఎంబీ రికార్డులు ఉండవు మీ బకాయి డబ్బులు రావని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. సొంత డబ్బులు పెట్టి బోర్లు మరమ్మతులు చేశామని రూ. రెండు లక్షలు బకాయిలు ఉన్నాయని ఓ మెకానిక్ వాపోయాడు. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, కలెక్టర్ స్పందించి బోరు మెకానిక్, బ్లీచింగ్ పౌడర్, వీధిలైట్లు, పైపు లైన్ల మరమ్మతుల పాత బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు. బోరు మరమ్మతులకు ముందుకు రాని మెకానిక్లు.. పాత బకాయిలు ఇవ్వకపోవడంతో బోరు మోటార్లు మరమ్మతులు, వీధిలైట్లు, పైపులైన్ మరమ్మతులు చేయడానికి మెకానిక్లు ముందుకు రావడం లేదు. చెడిపోయిన సింగిల్ ఫేజ్ మోటార్లు మరమ్మతులు చేయిస్తామని మున్సిపల్ అధికారులు తీసుకెళ్లారు. 13,14,15,16 వార్డులలో మూడు నెలలు కావస్తున్న ఇప్పటి వరకు మోటారు బిగించలేదు. కొన్ని చోట్ల చెడిపోయిన మోటర్లను బోరులో నుంచి కనీసం తీయకుండా వదిలేశారు. నీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ నీరు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. మున్సిపల్లో విలీనమై జీపీ గ్రామాలు గోపన్పల్లి, కందర్పల్లి, దౌల్తాపూర్ బిచ్కుంద నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ గ్రామ ప్రజలు సమస్యలు తెలపడానికి బిచ్కుంద మున్సిపల్ కార్యాలయానికి రావాలి. మున్సిపల్ 12 వార్డులకు ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లను వార్డు ఆఫీసర్లుగా నియమించారు. ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. మోటర్లు, వీధిలైట్లు బిగించి డ్రెయినేజీలు శుభ్రం చేయించాలని ప్రజలు కోరుతున్నారు. బ్లీచింగ్ పౌడర్, వీధిలైట్లు జీపీకి సరఫరా చేసిన వ్యాపారులు రూ.16 లక్షల బకాయిలు మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయిన బిచ్కుంద పంచాయతీ పాత బకాయిలతో సంబంధం లేదంటున్న మున్సిపల్ అధికారులు ఆందోళనలో వ్యాపారులు మరమ్మతులు చేయిస్తాం.. జీపీ పాత బకాయిలు మున్సిపల్ కార్యాలయానికి సంబంధం లేదు. జీపీ పాత బకాయిలు చెల్లించాలని మున్సిపల్ శాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు. బకాయిల కోసం వచ్చిన వ్యాపారులకు చెల్లించమని చెప్పాం. వార్డు ఆఫీసర్లుగా ముగ్గురు సిబ్బందికి బాధ్యతలు అప్పగించాం. ఒక్కొక్కటిగా మోటరు మరమ్మతులు చేసి బిగిస్తున్నాం. – ఖయ్యూం, కమిషనర్, మున్సిపల్ బిచ్కుంద -
కట్టడి చేసినా.. గంజాయి సరఫరా..
మోర్తాడ్(బాల్కొండ): జిల్లాలో గంజాయి కట్టడికి పోలీసులు ఎంత ప్రయత్నం చేస్తున్నా.. స్మగ్లర్లు ఏదో ఒకవిధంగా తమ దందాను కొనసాగిస్తున్నారు. జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలోగల పలు గ్రామాలకు పొరుగు జిల్లాల నుంచి గంజాయి సరఫరా కొనసాగుతోంది. నిందితులను పోలీసులు పట్టుకుంటూ, గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నా స్మగ్లర్లు దందాను ఆపడం లేదు. ఇదీ పరిస్థితి.. బాల్కొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో పొరుగు జిల్లాలైన జగిత్యాల్, నిర్మల్ల నుంచి గంజాయి స్మగ్లర్లు వచ్చి తమ దందాను కొనసాగిస్తున్నారు. తాజాగా కమ్మర్పల్లిలో పోలీసులు మెట్పల్లికి చెందిన నాంపల్లి వికాస్ను అతడికి సహకరిస్తున్న స్థానికుడైన షేక్ ఇమ్రాన్ను అరెస్టు చేయడం పరిశీలిస్తే పొరుగు జిల్లాల నుంచి గంజాయి దిగుమతి అవుతుందని వెల్లడవుతోంది. నాంపల్లి వికాస్ను అరెస్టు చేసిన పోలీసులు అతడికి గంజాయి అందించేవారు ఎవరు? ఎంత మొత్తంలో సరఫరా చేస్తారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. గంజాయి దందాకు కీలకమైన వ్యక్తులను పట్టుకుంటేనే ఈ దందాను పూర్తిగా అంతమొందించవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కౌన్సెలింగ్ ద్వారానే మార్పు.. గంజాయికి బానిసలైన యువకులను గుర్తించి వారికి, వారి తల్లితండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తేనే గంజాయికి పూర్తిస్థాయిలో చెక్ పెట్టవచ్చనే వాదన బలంగా వినిపిస్తోంది. గతంలో మోర్తాడ్ ఎస్సైగా పనిచేసిన సంపత్ గంజాయికి బానిసలైన వారితోపాటు వారి తల్లిదండ్రులను పోలీసు స్టేషన్కు రప్పించి అందరి సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఉన్నతాధికారులు స్పందించి కౌన్సెలింగ్ ద్వారానే యువతలో మార్పు తీసుకరావాలని పలువురు సూచిస్తున్నారు. పొరుగు జిల్లాల నుంచి బాల్కొండ నియోజకవర్గ గ్రామాలకు సప్లయ్ పోలీసులు పట్టుకుంటున్నా వెరవని స్మగ్లర్లు ఎవరు విక్రయించినా ఉపేక్షించం గంజాయిని ఎవరైన, ఎక్కడైన విక్రయిస్తే ఉపేక్షించేది లేదు. గంజాయి విషయంలో మా యంత్రాంగం సీరియస్గా ఉంది. గంజాయి విక్రయించేవారి గురించి సమాచారం ఇస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. ప్రజల సహకారంతోనే గంజాయిని నిర్మూలించడం సాధ్యమవుతుంది. – సత్యనారాయణ, సీఐ, భీమ్గల్ -
కలుషితమవుతున్న మత్తడి వాగు నీరు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని పెద్దమ్మ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన రైస్ మిల్లుల నుంచి వెలువడుతున్న వ్యర్థ పదార్థాలను అటవీ ప్రాంతంలో ఉన్న వాగులోకి వదిలేస్తున్నారు. బాయిల్డ్ మిల్లు నుంచి వెలువడుతున్న వ్యర్థ పదార్థాలను నేరుగా ఒక కాలువ ద్వారా వాగులోకి వదులుతున్నారు. మిల్లుల నుంచి వెలువడుతున్న కలుషిత నీటితో ఆ ప్రాంతంలో ఉన్న పంట భూముల్లో సైతం కలుషిత నీరు పారుతుందని రైతులు వాపోతున్నారు. మిల్లులు ప్రారంభం కాక ముందు ఇంతలా వ్యర్థపు నీరు వదలలేదని, గత ఏడాది కాలంగా భారీగా వ్యర్థపు నీటిని వదులుతున్నారని ఆ ప్రాంత రైతులు పేర్కొంటున్నారు. మిల్లుల నుంచి వెలువడుతున్న వ్యర్థాలను అరికట్టాలని గతంలో ప్రజావాణిలో సైతం ఫిర్యాదులు ఇచ్చిన ఎలాంటి స్పందన లేదని రైతులు చెబుతున్నారు. ఈకలుషిత నీటిని తాగిన పశువులు రోగాల బారిన పడుతున్నాయని పశువుల కాపరులు చెబుతున్నారు. గతంలో అటవీ ప్రాంతంలో కేవలం మత్తడి వద్ద పుష్కలమైన నీరు లభించేదని, ఇప్పుడు నీరు వ్యర్థాలతో ప్రమాదకరంగా ఉందన్నారు. కాలుష్య నియంత్రణ అధికారులు దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మిల్లుల నుంచి వెలువడుతున్న వ్యర్థాపు నీటిని అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. బాయిల్డ్ రైస్మిల్లుల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు కాలువద్వారా వాగులోకి.. నీరు తాగి రోగాల బారిన పడుతున్న పశువులు -
ఏజెంట్ల మోసంపై విచారణ
మోర్తాడ్(బాల్కొండ): జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఏజెంట్ల మోసానికి గురికాగా, ఈ ఘటనపై భా రత విదేశాంగ శాఖ విచారణ ప్రారంభించింది. వివరాలు ఇలా.. వేల్పూర్ మండలం పడి గెల వాసి గంగాప్రసాద్ యూర ప్ వెళ్లే ప్రయత్నంలో ఏజెంట్ల మోసానికి గురై దుబాయ్లో మూడేళ్ల నుంచి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండిపోయాడు. ఏజెంట్లు బాధితుడి నుంచి రూ.8.77 లక్షలు వసూలు చేసి టోకరా వేసిన విషయం విధితమే. ఈ విషయంపై బాధితుడి తండ్రి భోజన్న ఇటీవల ప్రవాసీ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. మరోవైపు గంగాప్రసాద్ సామాజిక మాధ్యమం ద్వారా ఎంపీ అర్వింద్ కార్యాలయానికి ఫిర్యాదు చేశాడు. దీంతో రెండ్రోజుల క్రితం దుబాయ్లో ఉన్న గంగాప్రసాద్ను విదేశాంగశాఖ అధికారులు ఎంబసీకి పిలిపించుకున్నారు. వారు ఏజెంట్ల పేర్లు, వారి వివరాలను నమోదు చేసుకున్నట్లు బాధితుడు ‘సాక్షి’కి ఫోన్లో తెలిపారు. తన వీసా గడువు ముగిసిపోగా ఈ అంశంపై ఉన్నతాధికారులతో చర్చిస్తామని హామీ ఇచ్చారన్నారు. మరోవైపు ప్రవాసీ ప్రజావాణి లేఖ మేరకు విచారణ చేపట్టాలని వేల్పూర్ ఎస్సై సంజీవ్ను సీపీ సాయి చైతన్య ఆదేశించారు. దీంతో సదరు ఏజెంట్ల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ● దుబాయ్లో చిక్కుకున్న జిల్లావాసితో మాట్లాడిన ఎంబసీ అధికారులు ● వేల్పూర్లోనూ పోలీసుల ఆరా -
క్రైం కార్నర్
డ్రెయినేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం ఖలీల్వాడి: నగరంలోని రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫారెస్ట్ ఆఫీస్ వద్ద గల డ్రెయినేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై సయ్యద్ ముజాహిద్ తెలిపారు. మురికి కాలువలో మృతదేహాన్ని ఆదివారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటన స్థలానికి వచ్చి పరిసరాలను పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేవని, అడి వయస్సు సుమా రు 40ఏళ్లు ఉంటాయని ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు వివరించారు. చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి ఖలీల్వాడి: నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఆరో టౌన్ ఎస్సై వెంకట్రావు తెలిపిన వివరాలు ఇలా.. నగరంలోని నెహ్రూనగర్ బస్టాండ్ దగ్గర నెల రోజుల క్రితం ఒక గుర్తుతెలియని వ్యక్తి అనారోగ్య సమస్యలతో అపస్మారక స్థితి లో పడిఉన్నాడు. అతడిని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని అతడిని చికిత్స నిమి త్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆదివారం చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి వయస్సు సుమారు యాబై ఏళ్లు ఉంటాయని, ఎవరైనా అతడిని గుర్తిస్తే పోలీస్ స్టేషన్లో గాని, లేదా 8712659848, 8712659734కు సంప్రదించాలన్నారు. చోరీకి గురైన బైక్ రికవరీ సదాశివనగర్(ఎల్లారెడ్డి): చోరీకి గురైన బైక్ను నిందితుడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా.. మండలంలోని పద్మాజివాడి చౌరస్తా వద్ద పోలీసులు ప్రత్యేక చెక్పోస్టు ఏర్పాటు చేసి, వాహన తనిఖీలు చేపడుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఓ వ్యక్తి అనుమానాస్పదంగా బైక్పై వెళుతుండగా పోలీసులు అతడిని ఆపారు. వివరాలు సేకరించగా బైక్ను చోరీ చేసి తీసుకువస్తున్నట్లు అతడు పేర్కొన్నాడు. వెంటనే పోలీసులు బైక్ను స్వాధీనం చేసుకొని, వాహన యజమానికి సమాచారం అందించారు. పట్టుబడ్డ నిందితుడిని కామారెడ్డి పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. -
రోడ్లపై నిలుస్తోన్న వాన నీరు
● కేకేవై రహదారిలో వాహనదారులకు ఇబ్బందులు కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పట్టణం గుండా వెళ్లే కేకేవై (కరీంనగర్–కామారెడ్డి–ఎల్లారెడ్డి) వంద ఫీట్ల రోడ్డు కబ్జాలతో ఇరుకుగా మారి ఓవైపు వాహనాదా రులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఈ దారిలో డ్రెయినేజీ లేకపోవడంతో వర్షం కురిస్తే రోడ్డుపైనే నీరు నిలిచి మరిన్ని అవస్థలు పడాల్సి వస్తోంది. వంద ఫీట్ల కేకేవై రోడ్డు పట్టణంలో సిరిసిల్లరోడ్డు, స్టేషన్రోడ్డు, పోలీసు స్టేషన్, రైల్వే బ్రిడ్జి మీదుగా ఉంది. ఈ రోడ్డులో ఎక్కడికక్కడ అక్రమ కట్టడాలతో కబ్జా చేశారు. సిరిసిల్ల రోడ్డులో రామేశ్వరపల్లి వెళ్లే జాతీయ రహదారి సర్వీసు రోడ్డు సైతం ఇలాగే వాన నీటితో నిండిపోయింది. జాతీయ రహదారి నిర్వాహకులు మూసుకుపోయిన మురికికాల్వల్లో మట్టిని తొలగించకపోవడంతో నీరు రోడ్డుపై నిలుస్తోంది. ఉన్నతాధికారులు స్పందించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో పతకాల పంట
కామారెడ్డి అర్బన్ : ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో ఈనెల 7, 8 తేదీల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి సీనియర్ యోగాసన పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తాచాటారు. ఈ పోటీల్లో జిల్లాకు ఎనిమిది పతకాలు వచ్చాయని యోగా అండ్ స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు యోగా రాంరెడ్డి తెలిపారు. డి.సురేందర్ బ్యాక్ బెండింగ్ విభాగంలో బంగారు, ట్రెడిషన్ విభాగంలో రజత పతకాలు సాధించారని పేర్కొన్నారు. సీహెచ్.రాజ్కుమార్ ట్విస్టింగ్, సుపైన్లో కాంస్యం, ఫార్వర్డ్ బెండింగ్లో వెండి పతకాలు, యు.అనిల్కుమార్ ఫార్వర్డ్ బెండింగ్లో కాంస్యం సాధించారని తెలిపారు. సీహెచ్.తిరుపతి హ్యాండ్ బ్యాలెన్స్లో కాంస్యం, ఏ.రాజు ట్రెడిషన్ విభాగంలో వెండి పతకాలు సాధించారని వివరించారు. మరికొందరు క్రీడాకారులు ప్రశంస పత్రాలు అందుకున్నారన్నారు. -
నిజాంసాగర్లోకి 5,393 క్యూసెక్కుల ఇన్ఫ్లో
నిజాంసాగర్: ఎగువన మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఆదివారం 5,393 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ప్రాజెక్టు ఏఈ అక్షయ్ తెలిపారు. ఘణపురం ఆనకట్ట పొంగి పొర్లుతుండడంతో 2,917 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వస్తోందన్నారు. అలాగే సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు 600 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోందన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా ఆదివారం సాయంత్రానికి 1,391.5(4.723 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. ‘కల్యాణి’లోకి 250 క్యూసెక్కులు.. ఎల్లారెడ్డిరూరల్: తిమ్మారెడ్డి గ్రామ శివారులోని కల్యాణి ప్రాజెకులోకి ఆదివారం 250 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 అడుగులు కాగా.. 408.50 అడుగుల నీటిని నిలువ ఉంచుతున్నారు. ఇన్ఫ్లో నీటిలో 179 క్యూసెక్కులను నిజాంసాగర్ మెయిన్ కెనాల్కు మళ్లిస్తుండగా.. 71 క్యూసెక్కులను ఒక వరద గేటు ఎత్తి మంజీర నదిలోకి వదులుతున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న ఎడ్లకట్ట వాగు బీబీపేట: ఎగువన కురుస్తున్న వర్షాలతో జనగామ – మాందాపూర్ గ్రామాల మధ్యనున్న ఎడ్లకట్ట వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు వాగులో నుంచి ఎవరూ దాటే ప్రయత్నం చేయకుండా బందోబస్తు నిర్వహించారు. బీబీపేట పెద్ద చెరువుకు ప్రధానంగా ఎడ్లకట్ట వాగే ఆధారం. ఈ వాగు ప్రవహిస్తుండడంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేశారు. చెరువుల్లోకి నీరు.. తాడ్వాయి: మండలంలో నాలుగైదు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో చెరువులు, కుంటలు నిండుకుండలా మారుతున్నాయి. కృష్ణాజీవాడి చెరువు అలుగు పారుతోంది. మండలంలో మక్క, పత్తి, సోయా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారు. ఈ పంటలు ఏపుగా పెరిగాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. -
వన మహోత్సవం లక్ష్యం నెరవేరేనా?
నిజాంసాగర్ : వర్షాకాలం సీజన్ప్రారంభమై రెండు నెలలు గడిచిపోయినా జిల్లాలో ఇప్పటికీ మొక్కలు నాటే కార్యక్రమం జోరందుకోలేదు. దీంతో జిల్లా వన మహోత్సవం లక్ష్యానికి దూరంగానే ఉండిపోయింది. ప్రతి పంచాయతీ పరిధిలో నాలుగు వేల మొక్కలు నాటాలని ముందుగా నిర్ణయించారు. అయితే సరైన వర్షాలు లేకపోవడంతో లక్ష్యాన్ని సగానికి తగ్గించారు. ఈనెలాఖరు వరకు ప్రతి పంచాయతీలో 2 వేల మొక్కలు నాటాల్సి ఉన్నా ఎక్కడా వన మహోత్సవం సరిగా సాగుతున్న దాఖలాలు లేవు. మరోవైపు నర్సరీలలోనూ మొక్కల పెంపకం తూతూమంత్రంగానే సాగింది. ప్రతి నర్సరీలో 4 వేల మొక్కలను సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నా.. చాలాచోట్ల అరకొరగానే మొక్కలున్నాయి. వన మహోత్సవంపై పంచాయతీ అధికారులు, ఈజీఎస్ సిబ్బంది శ్రద్ధ చూపకపోవడంతో నర్సరీల నిర్వహణ అధ్వానంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి. నర్సరీల్లో అరకొరగానే మొక్కలు పట్టించుకోని అధికారులు -
పండుగ పూట విషాదం
నవీపేట: రాఖీ పండుగను పురస్కరించుకొని ఓ సోదరుడు అక్కతో రాఖీ కట్టించుకొని స్కూటీపై తిరిగి వస్తుండగా అనంత లోకాలకు వెళ్లిన ఘటన నవీపేట మండలం అబ్బాపూర్ (ఎం) శివారులో చోటు చేసుకుంది. ఎస్సై వినయ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా బాసరకు చెందిన వర్గంటి సాయినాథ్, కవితలకు కుమార్తె సాయిప్రియి, కుమారుడు సాయిబాబు అలియాస్ బబ్లూ(21) ఉన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గాజుల్పేట్లో ఉంటున్న కవిత వద్దకు బబ్లూ రాఖీ పండుగ సందర్భంగా శనివారం ఉదయం స్నేహితుడు అరవింద్తో కలిసి స్కూటీపై వెళ్లాడు. అక్కతో రాఖీ కట్టించుకొని తిరిగి వస్తుండగా అబ్బాపూర్(ఎం)–జగ్గారావు ఫారమ్ మధ్యలో ముందు వెళ్తున్న కంటెయినర్ను ఓవర్టేక్ చేయబోయి దానిని ఢీకొన్నారు. ఈ ఘటనలో బబ్లూ కిందపడి తలకు తీవ్రగాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అరవింద్కు స్వల్ప గాయాలయ్యాయి. మృతుడి మేనమామ బలగం రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.● రాఖీ కట్టించుకొని తిరిగి వెళ్తుండగా ప్రమాదం ● కంటెయినర్ ఢీకొని యువకుడి మృతి -
యువజన కాంగ్రెస్ బలోపేతానికి కృషి
బాన్సువాడ: జిల్లాలో యువజన కాంగ్రెస్ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మన్సూర్ అన్నారు. శనివారం బాన్సువాడలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..యువజన కాంగ్రెస్లో పని చేయడమే లక్ష్యంగా ప్ర తి కార్యకర్త ముందుకు వెళ్లాలని అన్నారు. పార్టీలో కష్టపడి పని చేసే వారికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. యువజన నాయకులు కాసుల రోహిత్, అలిబిన్అబ్దుల్లా, ఖలేక్, నగేష్, అప్రోజ్, రెంజర్ల సాయిలు, అజీం, గంగాధర్, భాను, అర్జున్, గౌస్, ఇలియాస్, తదితరులు ఉన్నారు. బిచ్కుందలో.. బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావం దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. పార్టీ కార్యాలయంలో జెండాను యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు భాస్కర్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ 9 ఆగస్టు 1960లో యూత్ కాంగ్రెస్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండల అధ్యక్షుడు దర్పల్ గంగాధర్, అశోక్, జీవన్, విఠల్రావు, అజీం పాల్గొన్నారు. -
మెరుగైన వైద్య సేవలు అందించాలి
● డిచ్పల్లి సీహెచ్సీని తనిఖీ చేసిన కలెక్టర్ డిచ్పల్లి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. శనివారం డిచ్పల్లి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిసెప్షన్ సెంటర్, ఇన్ పేషంట్, జనరల్ వార్డు, ల్యా బ్ తదితర విభాగాల పనితీరును పరిశీలించారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న వైద్యులు, సిబ్బంది గురించి ఆరా తీసిన కలెక్టర్ అటెండెన్స్ రిజిస్టర్ను తనిఖీ చేశారు. సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా కృషి చేయాలని వైద్యులకు సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, రౌండ్ ది క్లాక్ ఆస్పత్రుల్లో అన్ని సమయాల్లో వైద్యులు, సిబ్బంది విధుల్లో ఉండాలని ఆదేశించారు. ప్రతీ నెల రెండో శనివారం ప్రత్యేకంగా నిర్వహించే ఆరోగ్యశ్రీ శిబిరానికి అన్ని విభాగాల స్పెషలిస్టు డాక్టర్లు హాజరయ్యేలా చూడాలని, పీహెచ్సీలు, సీహెచ్సీల పనితీరును ప్రతి రోజు పర్యవేక్షణ చేయాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రాజశ్రీని ఆదేశించారు. భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలి భూభారతి దరఖాస్తుల పై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. డిచ్పల్లి తహసీల్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యల గురించి తహసీల్దార్ సతీశ్రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
చోరీకి పాల్పడిన ముగ్గురి నిందితుల అరెస్ట్
మాక్లూర్: మండలంలోని కృష్ణనగర్లో ఇటీవల శ్రీహరి ఇంట్లో దొంగతనానికి పాల్పడిన ముగ్గురి నిందితులను మాక్లూర్ పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ రాజారత్నం తన చాంబర్లో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 1న కృష్ణనగర్లో తాళం వేసి ఉన్న శ్రీహరి ఇంట్లో నిందితులు చోరీకి పాల్పడగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో శనివారం మాణిక్బండార్ చౌరస్తాలో అనుమానంగా తిరుగుతున్న ముగ్గురి నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారింగా కృష్ణనగర్లో చోరీకి పాల్పడింది తామేనని నిందితులు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి 4.8 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. పదివేల నగదు, రెండు ఫోన్లు, ఐదు బైక్లు, రూ. 50 వేలు విలువ చేసే రోల్డ్ గోల్ బంగారాన్ని స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. పట్టుబడిన వారిలో కామారెడ్డి జిల్లాకు చెందిన చాకలి రాజు, కన్నె లింగం, మరొకరు నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం దూపల్లికి చెందిన నగేశ్ పోలీసులు గుర్తించారు. వీరు జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన మాక్లూర్ ఎస్సై రాజశేఖర్ను ఏసీపీ అభినందించారు. -
క్రైం కార్నర్
దుస్తుల షాపు దగ్ధం మాక్లూర్: మండలంలోని ముల్లంగి(బి)లో శనివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో బట్టల షాపు దగ్ధం కాగా సుమారు రూ. 12 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన నీరడి ప్రశాంతి నాలుగేళ్ల క్రితం గ్రామంలో కిరాణ షాపుతో పాటు బట్టల షాపును నిర్వహిస్తున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా పెద్ద మొత్తంలో చీరలు కొనుగోలు చేసి దుకాణంలో పెట్టారు. ఈ నేపథ్యంలో శనివారం తెల్లవారు జామున షార్ట్సర్క్యూట్ జరగడంతో షాపులో ఉన్న వస్తువులు, బట్టలన్నీ కాలిపోయాయి. ప్రమాద విషయమై తహసీల్దార్కు ఫిర్యాదు చేయగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ పంచనామా నిర్వహించినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత కుటుంబీకులు కోరుతున్నారు. గుర్తు తెలియని మృతదేహం లభ్యం ఇందల్వాయి: మండలంలోని చంద్రాయన్పల్లి గ్రామ శివారులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై సందీప్ శనివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. చంద్రాయన్పల్లి శివారులోని జాతీయ రహదారి పక్కన కుళ్లిన స్థితిలో వ్యక్తి మృతదేహం ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉందని, మృతుడి ఒంటిపై నెవీ బ్లూ కలర్ ప్యాంట్, తెల్లటి బనియన్, వైట్ అండ్ బ్రౌన్ చెక్స్ కలిగిన షర్ట్ ధరించి ఉన్నాడన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712659854 నంబర్కు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. పేకాట స్థావరంపై దాడి తాడ్వాయి: మండల కేంద్రంలోని పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఎస్సై మురళి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రంలోని ఓ రేకుల షెడ్డు వద్ద పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో ఇద్దరిని పట్టుకోగా వారి నుంచి రూ. 1700 నగదును, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా పేకాట ఆడితే కేసులు నమోదు చేస్తామని ఎస్సై హెచ్చరించారు. విద్యుత్షాక్తో మేకలు మృతి ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని అడివిలింగాల గ్రామ శివారులో విద్యుత్ షాక్ తగిలి రెండు మేకలు మృతి చెందినట్లు స్థానికులు శనివారం తెలిపారు. గ్రామంలోని మహ్మద్ సలీంకు చెందిన మేకలు గ్రామ శివారులో మేత మేస్తుండగా ట్రాన్స్ఫార్మర్కు సంబంధించిన విద్యుత్ తీగలు తగలడంతో షాక్ తగిలి మృతి చెందాయి. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి నష్ట పరిహారం అందేలా చూడాలని బాధితుడు కోరుతున్నాడు. యువకుడి అదృశ్యం మోపాల్: మండలంలోని నర్సింగ్పల్లికి చెందిన దుబ్బాక సాయితేజ అదృశ్యమైనట్లు ఎస్సై జాడె సుస్మిత శనివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయితేజ విజయ్ రూరల్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. అక్కడే హాస్ట ల్లో ఉంటున్నాడు. సెలవుల కోసం నర్సింగ్పల్లికి వచ్చిన సాయితేజ ఆ తర్వాత హాస్టల్కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లాడు. సుమారు రెండు నెలల నుంచి సాయితేజ కనిపించకపోవడంతో స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లి దుబ్బాక సావిత్రి ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
కాంగ్రెస్ పార్టీ నేతలతో ఎమ్మెల్యే సమావేశం
పిట్లం(జుక్కల్):మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు.. మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నాయకులు గ్రామాలలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. పలు సమస్యలను అప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. గురుకులంలో విశ్వ సంస్కృత భాషా దినోత్సవం మద్నూర్(జుక్కల్): భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిరూపం సంస్కృత భాష అని సంస్కృత భాష ప్రచార సమితి జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బి.వెంకట్ అన్నారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం విశ్వ సంస్కృత భాషా దినోత్సవాన్ని నిర్వహించి మాట్లాడా రు.అన్ని భాషలకు సంస్కృతం అమ్మభాష అని అన్నా రు. వేదాలు, పురాణాలు, శాస్త్రాలు, కావ్యాలు, రామాయణం, మహాభారతం తది తర గ్రంథాలు దేవనాగరిలిపిలో రచించబడ్డాయని చెప్పారు. భారతదేశంలో అనేక విశ్వవిద్యాలయాల్లో సంస్కృతం బోధిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ సంస్కృత భాషను ప్రేమించాలని, నేర్చుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులు సంస్కృత గేయాలు, సుభా షితాలను, శ్లోకాలను ఆలపించారు. ప్రిన్స్పాల్ గంగాకిషోర్, ఉపాధ్యాయులు సుమన్, నరహరి, సంజీవ్, ఆశోక్, ప్రవీణ్, హన్మండ్లు, నరేష్, బస్వరాజు, విద్యార్థులున్నారు. ఉదారత చాటుకున్న చింత శ్రీనివాస్రెడ్డి నిజామాబాద్ రూరల్ : మండలంలోని మూడో డివిజన్ గూపన్పల్లి గ్రామంలోని బీజేపీ పార్టీ సీనియర్ నాయకుడు చింత శ్రీనివాస్రెడ్డి రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉదారత చాటుకున్నాడు. తన తల్లి నర్సమ్మ జ్ఞాపకార్థం మేరకు శనివారం నుంచి గ్రామంలో జన్మించిన ప్రతి ఆడ బిడ్డకు తనవంతు సహాయంగా రూ. 5116 ఇస్తానని ప్రకటించారు. -
బస్సులు లేక.. ముందుకు వెళ్లలేక
రక్షాబంధన్ సందర్భంగా తమ సోదరులకు రాఖీలు కట్టేందుకు ఊళ్లకు బయల్దేరిన అక్కాచెల్లెళ్లు పండుగ పూట చుక్కలు చూశారు. ఓ వైపు బస్సులు లేకపోవడం.. మరోవైపు పోలీసుల తనిఖీల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ పుట్టిళ్లకు శనివారం బయల్దేరిన మహిళలు రామారెడ్డి బస్టాండ్ వద్ద బస్సుల కోసం గంటలతరబడి పడిగాపులు కాశారు. మరోవైపు మండల కేంద్రం వైపు నుంచి కామారెడ్డికి వెళ్లే మార్గంలో గొల్లపల్లి స్టేజ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టడంతో జరిమానాలకు భయపడి ఆటోలు, బైక్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో ఊళ్లకు బయల్దేరిన మహిళలు మధ్యలోనే ఆగిపోయారు. పండగ పూట తమకు ఇదేం పరిస్థితి అని, సమయమంతా రోడ్లపైనే గడిచిపోయిందని విస్మయం వ్యక్తం చేశారు. – రామారెడ్డి -
రైతు బీమాకు వేళాయె..
కామారెడ్డి క్రైం: ఇంటికి పెద్ద దిక్కయిన రైతు ఏదైనా కారణంతో చనిపోతే ఆ కుటుంబం వీధిన పడకుండా ఆదుకునేందుకు ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని అమలు చేస్తోంది. ప్రతి ఏడాది పథకం కాలపరిమితి ఆగస్టు 14వ తేదీతో ముగుస్తుంది. వచ్చే ఏడాది (2025–26) కాలానికి గాను రైతు బీమా పఽథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను శనివారం విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఉన్న రైతుల జాబితాతోపాటు జూన్ 5వ తేదీ వరకు భూ భారతి పోర్టల్ ద్వారా కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అర్హులైన రైతులు ఈ నెల 13వ తేదీ లోగా తమ వివరాలతో సంబంధిత ఏఈవోలను సంప్రదించి నమోదు చేసుకోవాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. జిల్లాలో 1.90 లక్షల మంది రైతులు రైతు తరఫున ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తూ పథకాన్ని అమలు చేస్తోంది. 18 నుంచి 59 ఏళ్ల వయస్సున్న రైతులు ఈ పథకానికి అర్హులు. జిల్లాలో మొత్తం 3.14 లక్షల మంది రైతులు ఉండగా, వారిలో గతేడాది 1.90 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించి పథకంలో భాగస్వామ్యం చేశారు. వారిలో 1,117 మంది రైతులు వివిధ కారణాలతో చనిపోగా, రైతు బీమా కింద ఆయా కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందింది. ఈ సారి పథకానికి అర్హులైన రైతుల సంఖ్యలో కొద్దిపాటి మార్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రీమియం చెల్లిస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం రైతుబీమా పథకం అమలు కోసం గతేడాది ఎల్ఐసీ సంస్ధతో ఒప్పందం చేసుకుని ఒక్కో రైతు తరఫున రూ.2,700 ప్రీమియం చెల్లించి పథకాన్ని అమలు చేసింది. ఈ ఏడాది ప్రీమియంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన (జూన్ 5 లోపు) రైతులు ఈ నెల 13 లోగా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు తమ ఆధార్ కార్డు, పట్టాదారు పాస్బుక్, నామినీ ఆధార్ కార్డుతో సంబంధిత ఏఈవోలను సంప్రదించాలి. జిల్లాలో అర్హులైన రైతులందరినీ పఽథకంలో భాగస్వామ్యం చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. అర్హులైన రైతులందరికీ వర్తింపు జిల్లాలో 3.14 లక్షల మంది రైతులు ఉన్నారు. ప్రస్తుతం రైతుబీమా పథకంలో 1.90 మంది రైతులు అర్హులుగా ఉన్నారు. కొత్త రైతులు 13 లోగా దరఖాస్తులు అందజేయాలి. అర్హులందరినీ పథకంలో భాగస్వాములను చేస్తాం. 59 ఏళ్ల లోపు వారికే పథకం వర్తిస్తుంది. – మోహన్రెడ్డి, డీఏవో, కామారెడ్డి జూన్ 5 నాటికి పట్టాపాస్పుస్తకాలు పొందిన రైతులకు అవకాశం ఈ నెల 13వ తేదీలోగా నమోదు చేసుకోవాలి మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం -
నిండుకుండలా పెద్ద చెరువు
కామారెడ్డి అర్బన్: జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణానికి ప్రధాన నీటివనరుగా ఉన్న వారసత్వ పెద్ద చెరువు ఎట్టకేలకు నిండుకుండలా మారుతోంది. దీంతో పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శనివారం పౌర్ణమి కావడంతో చెరువులో ఎలాంటి అలలు లేకుండా కదలకుండా నిండుగా కనిపించడం ఆకట్టుకుంది. చెరువు కింద సేద్యం లేకున్నప్పటికీ బోరుబావులు, పాత పట్టణానికి నీరందించడం, మత్స్యకారుల ఉపాధి కోసం చేపల పెంపకం, పశువులకు నీరు, భూగర్భజలాల వృద్ధికి పెద్ద చెరువు ప్రధాన ఆధారంగా ఉంది. చెరువు పైభాగంలోని ఉమ్మడి తాడ్వాయి మండలంలో గత మూడునాలుగు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో గుండమ్మవాగు ద్వారా భారీగా వరద చేరుతోంది. చెరువు అలుగు పారడానికి అరఫీటు నీరు అవసరంగా కాగా.. రెండుమూడురోజుల్లో పూర్తిగా నిండుతుందని ప్రజలు అంటున్నారు. -
● అభినందిస్తున్న ఎస్పీ రాజేశ్ చంద్ర
● సమాచారం అందిన వెంటనే స్పందిస్తున్న పోలీసులు ● ఆత్మహత్యాయత్నాలకు పాల్పడిన వారి ప్రాణాలు కాపాడి పునర్జన్మనిస్తున్నారు ● శాంతిభద్రతలతోపాటు ప్రాణాల రక్షణశాంతిభద్రతల పరిరక్షణే కాదు.. ప్రజల ప్రాణాలు కాపాడటం తమకు ముఖ్యమేనంటున్నారు పోలీసులు. వివిధ కారణాలతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యాయత్నం చేస్తున్న వారి ప్రాణాలను కాపాడుతూ ప్రాణదాతలుగా నిలుస్తున్నారు. సమాచారం అందిన నిమిషాల్లోనే ఘటనాస్థలాలకు చేరుకుని విలువైన ప్రాణాలను కాపాడుతున్నారు. -
ఎస్సారెస్పీలోకి పెరిగిన వరద
బాల్కొండ: ఎస్సారెస్పీలోకి స్థానిక ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల వరద మరింత పెరిగింది. ప్రాజెక్ట్లోకి 14630 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 3 వేల క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 3 వేలు, లక్ష్మికాలువ ద్వారా 150, సరస్వతి కాలువ ద్వారా 300, అలీసాగర్ లిప్టు ద్వారా 180, గుత్ప లిప్టు ద్వారా 270, ఆవిరి రూపంలో 462, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగుల నీ రు కాగా శనివారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1078.40(40.8 టీఎంసీలు) అడుగుల నీటి ని ల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు పేర్కొన్నారు. టీఎన్జీవీఏ నూతన కార్యవర్గం ఎన్నిక డొంకేశ్వర్: తెలంగాణ నాన్ గెజిటెడ్ వెటరినేరియన్స్ అసోసియేషన్ (టీఎన్జీవీఏ) నూతన కార్యవర్గం ఎన్నికై ంది. జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో శనివారం జరిగిన ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా తిరుమల వినీత ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. కార్యదర్శి గా గంగరాజు, సహాధ్యాక్షుడిగా వినోద్, కోశాధికారిగా వెంకటి, ఉపాధ్యాక్షులుగా రమేశ్, ప ద్మావతి, నారాయణ, గంగాధర్, చంద్రశేఖర్ ఎన్నికయ్యారు.నూతన కార్యవర్గాన్ని టీఎన్జీవో స్ జిల్లా అధ్యక్షుడు సుమన్తో పాటు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బింగి సురే శ్,అభిషేక్ రెడ్డిలుసన్మానించి అభినందించారు. క్యాంపస్లో కొనసాగుతున్న తీజ్ ఉత్సవాలు తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ లో శనివారం ఆరో రోజు తీజ్ ఉత్సవాలు కొ నసాగాయి. ఈ సందర్భంగా తెయూ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు సాగర్నాయక్ మా ట్లాడుతూ.. బంజారాల సంస్కృతి, సాంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రతికగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో రవీందర్నాయక్, గిరిజనశక్తి విద్యార్థి సంఘం అధ్యక్షు డు శ్రీనురాథోడ్, సచిన్, మోహన్, రాము, రాజు, విద్యార్థినులు అశ్విని పాల్గొన్నారు. అడవి మామిడిపల్లి రైల్వేగేట్ శాశ్వతంగా మూసివేత మాక్లూర్: మండలంలోని అడవి మామిడిపల్లి వద్ద ఆర్వోబీ పనులు పూర్తయి, వాహనా ల రాకపోకలు సాగుతుండటంతో అక్కడ ఉ న్న రైల్వేగేట్ను శాశ్వతంగా మూసివేస్తున్న ట్లు రైల్వే అధికారులు శనివారం తెలిపారు. ఈనెల 9 నుంచి రైల్వేగేట్ను ఎత్తివేస్తున్నట్లు మాక్లూర్ తహసీల్దార్, పోలీసులకు ఉత్తర్వు కాపీలను పంపించినట్లు వెల్లడించారు. కానీ కొందరు వాహనదారులకు ఈ విషయం తెలియక ఇంకా శనివారం రాత్రి వరకు రైల్వేగేట్ నుంచే రాకపోకలు సాగించారు. ఆర్మూర్లో చిరుత కలకలం ఆర్మూర్టౌన్: పట్టణ శివారులోని పెద్దమ్మ ఆలయం పరిసరాల్లో చిరుతపులి సంచారం కలకలం రేపింది. శుక్రవారం ఉదయం ఆలయానికి వెళ్లిన పలువురు భక్తులకు ఒక్కసారిగా కోతులు పరిగెత్తిరావడంతో ఆందోళన చెందారు. ఈక్రమంలో వారు పరిసరాలను పరిశీలించగా సుదూరంలో చిరుత కనిపించడంతో భయంతో హుటాహుటిన ఆలయం నుంచి వెనుదిరిగారు. ఇదిలా ఉండగా కొన్ని రోజుల క్రితం ఆలయ పరిసరా ప్రాంతాల్లో మేతకు వెళ్లిన గొర్రెల మంద నుంచి ఒక మేక కనబడకుండపోయినట్లు గొర్ల కాపరులు శుక్రవారం రాత్రి ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుత ఆనవాళ్లను గుర్తించడానికి ఆదివారం వెళ్లనున్నట్లు ఫారెస్టు అధికారులు తెలిపారు. -
గిరిజన ఉత్పత్తులలో నంబర్ వన్
లింగంపేట(ఎల్లారెడ్డి) : ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని కుమురం భీమ్ ఆదివాసి బంజారా భవన్లో సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి గిరిజన ఉత్పతుల ప్రదర్శనలో లింగంపేట ప్రథమ స్థానంలో నిలిచిందని ఏపీఎం వినోద్కుమార్ తెలిపారు. రాష్ట్రం వ్యాప్తంగా పది మందిని స్వయం సహాయక సంఘాల సభ్యులను ఎంపిక చేయగా, కామారెడ్డి నుంచి లింగంపేట మండల కేంద్రానికి చెందిన రాథోడ్ దుర్గాబాయి ఎంపికై నట్లు తెలిపారు. ఆమె తయారు చేసిన బంజారా ఆభరణాలు, అలంకరణ వస్తువులు ఆకట్టుకున్నాయన్నారు. ఈ సందర్భంగా దుర్గాబాయిని మండల సమాఖ్య సిబ్బంది అభినందించారు. దుర్గాబాయిని ప్రోత్సహించిన ఏపీఎంతోపాటు సీసీలు మెహర్, అశోక్ను జిల్లా అధికారులు అభినందించారు. -
క్రీడలతోనే మానసికోల్లాసం
నిజామాబాద్ నాగారం: క్రీడలతోనే మానసికోల్లాసం కలుగుతుందని, క్రీడల ద్వారానే విద్యార్థులు మానసికంగా, శారీరకంగా ధృడంగా తయారవుతారని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో శుక్రవారం ఇందూర్ ఫుట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై, పోటీలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు సరైన సౌకర్యాలతో కూడిన మినీ స్టేడియం కావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానన్నారు. ఇందూర్ బిడ్డలు జాతీయ, అంతర్జాతీయ, ఒలింపిక్స్ స్థాయిలో రాణించి జిల్లాకు మరింత పేరుప్రతిష్టలు తీసుకురావాలన్నారు. నాయకులు ఎర్రం సుదీర్, నాగోళ్ళ లక్ష్మినారాయణ, కృష్ణ తదితరులు ఉన్నారు. -
పంద్రాగస్టుకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్అర్బన్: స్వాతంత్య్ర దినోత్సవ వే డుకలను అట్టహాసంగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కాన్ఫరె న్స్ హాల్లో శుక్రవారం అన్ని శాఖల అధికారుల తో కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించా రు. వేదిక, సీటింగ్ ఏర్పాట్లను పక్కాగా చేసుకోవాలని, వర్షాలు కురుస్తున్నందున వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని సూచించారు. లోటుపాట్ల కు తావులేకుండా వేడుక లు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నా రు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్ర గతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. అ న్ని శాఖల పనితీరును చాటేలా శకటాల ప్రదర్శనతోపాటు స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రొ టోకాల్ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలన్నారు. జాతీయ భావన పెంపొందేలా విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పా టు చేయాలన్నారు. ఎక్కడ కూడా జాతీయ ప తాకం గౌరవానికి భంగం వాటిల్లకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్ర శంసాపత్రాల బహూకరణ కోసం శాఖల వారీ గా ఉత్తమ ఉద్యోగుల పేర్లతో కూడిన ప్రతిపాదనలను నిర్ణీత గడువు లోపు పంపించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకి త్, కిరణ్ కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, నగ ర పాలక సంస్థ కమిషనర్ దిలీప్కుమార్, నిజామాబాద్ ఆర్డీవో రాజేంద్రకుమార్, నిజామాబా ద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, ఏవో ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితుడి అరెస్టు
మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్ మండలం దొన్కల్లో ఒకరిని హత్య చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు భీమ్గల్ సీఐ సత్యనారాయణ తెలిపారు. మోర్తాడ్ పోలీసు స్టేషన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దొన్కల్లోని వడ్డెర కాలనీలో జూన్ 26న ఒల్లెపు నాగరాజు, షేక్ రహమాన్తో మద్యం సేవిస్తూ ఘర్షణ పడ్డారు. ఈక్రమంలో రహమాన్ను నాగరాజు కర్రతో కొట్టగా అతడు మృతిచెందాడు. అప్పటి నుంచి నిందితుడు నాగరాజు పరారీలో ఉన్నాడన్నారు. విశ్వసనీయ సమాచారం రావడంతో నాగరాజును పట్టుకొని, రిమాండ్కు తరలించినట్లు సీఐం తెలిపారు. ఎస్సై రాము, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇసుక టిప్పర్ల పట్టివేత రుద్రూర్: మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో శుక్రవారం తెల్లవారుజామున రెండు ఇసుక టిప్పర్లను పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాటిని పోలీస్స్టేషన్ తరలించినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. సిరికొండ మండలంలో.. సిరికొండ: మండలంలోని గోప్యతండా పరిధిలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై రామకృష్ణ శుక్రవారం తెలిపారు. గడ్డమీదితండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు తమ ట్రాక్టర్లలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తుండగా పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
భక్తిశ్రద్ధలతో రాజరాజేశ్వరీ దేవి నవమి వార్షికోత్సవాలు
కామారెడ్డి అర్బన్: స్థానిక వీక్లీ మార్కెట్లోని శ్రీరాజరాజేశ్వరీ దేవి ఆలయ నవమి వార్షికోత్సవం పట్టణ మున్నూరుకాపు సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మహిళలు అష్టోత్తర కలశాలతో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి సమర్పించారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పట్టణ మున్నూరు కాపు సంఘం నాయకులు ఎమ్మెల్యేను సన్మానించారు. నేతలు ముదాం శ్రీనివాస్, మల్లేశం, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కొనసాగుతున్న శ్రావణమాస భజనలు సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంతో పాటు అమర్లబండ, తుక్కోజీవాడి, తిమ్మోజీవాడి, పద్మాజీ వాడి, ఉత్తునూర్, కల్వరాల్ తదితర గ్రామాల్లో శ్రావ ణమాస భజనలు కొనసాగుతున్నాయి. ఆలయాల్లో ప్రతి రోజు కీర్తనలు ఆలపిస్తూ భక్తిని చాటుతున్నారు. -
జోరుగా పేకాట దందా
● అడ్డంగా బుక్ అవుతున్న బడాబాబులు ● చేతులు మారుతున్న రూ.లక్షలుబాన్సువాడ: పోలీసుల కంటపడకుండా ఉండేందుకు పేకాట ఆడేవారు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. టాస్క్ఫోర్స్ పేరుతో ఎవరైనా వచ్చి పట్టుకుంటారేమోనని ఆందోళనతో వీరు ఎవరి కంటపడకుండా ఉండేందుకు రహస్య ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. వారం పది రోజులుగా పోలీసులు జరుపుతున్న దాడుల్లో బడాబాబులు అడ్డంగా బుక్ అవుతున్నారు. బాన్సువాడ డివిజన్లోని బాన్సువాడ, బీర్కూర్, నస్రూల్లాబాద్ ప్రాంతాల్లో పేకాటరాయుళ్లు గ్రుపులుగా ఏర్పడి పేకాట కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పది పదిహేను రోజులుగా పేకాట స్థావరాలపై పోలీసులు నిర్వహిస్తున్న దాడుల్లో బడా వ్యాపారవేత్తలు బుక్ అవుతున్నారు. ఈ కేంద్రాల్లో రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు పేకాటాడుతుండడంతో నిత్యం రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. మూడు మండలాల అటవీ ప్రాంతం.. బాన్సువాడ, బీర్కూర్, నస్రూల్లాబాద్ శివారులో ఉండే అటవీ ప్రాంతాల్లో పోలీసులు ఈ దిశగా దృష్టి సారించలేకపోతున్నారు. బాన్సువాడ మండలంలోని ముదెల్లి అటవీ ప్రాంతంతో పాటు హన్మాజీపేట్, కొత్తాబాది, బుడ్మి గ్రామ శివారుల్లో పేకాట అడ్డాలు కొనసాగుతున్నాయి. బాన్సువాడ పట్టణంలో దాడులు జరుగుతున్నా పేకాట రాయుళ్లు మాత్రం తమ పద్ధతి మార్చుకోవడం లేదు. పోలీసులకు ఇటీవల బడా వ్యాపారవేత్తలు, రియల్టర్లతో పాటు పలువురు దొరికారు. కొందరు బాన్సువాడకు చెందిన కొందరు వ్యాపారులు పేకాట ఆడేవారిని కర్ణాటక, మహారాష్ట్రలకు తమ సొంత వాహనాల్లో తరలిస్తున్నట్లు తెలిసింది. ఆయా రాష్ట్రాల్లో రెండు, మూడు రోజులు అక్కడే ఉండి పేకాట ఆడించి మళ్లీ తమ వాహనాల్లోనే బాన్సువాడకు తీసుకువస్తారు. ఇలా తీసుకెళ్తే వారికి వాహనాల అద్దెతో పాటు ఆయా రాష్ట్రాల్లో ఉన్న పేకాట అడ్డాల నిర్వాహకులకు కమీషన్ కూడా ఇస్తారని తెలిసింది.ఇటీవల పోలీసులు జరిపిన దాడుల వివరాలు.. మూడు నెలల కిత్రం బాన్సువాడ–బోధన్ రోడ్డులోని ఓ హోటల్లో పేకాట ఆడుతున్నవారిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 8న బాన్సువాడ పట్టణంలో పార్కుకు వెళ్లే దారిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ నెల 3న సంగోజీపేట్లో పేకాట స్థావరంపై దాడి చేసి 9 మందిని అరెస్ట్ చేశారు. 6న పట్టణంలోని సరస్వతి మందిరం సమీపంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు.ప్రత్యేక నిఘా పెట్టాం పేకాట స్థావరాలపై ప్రత్యేక నిఘా పెడుతున్నాం. పేకాట ఆడే వాళ్లలో ఎంత పెద్ద వాళ్లు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. పేకాట ఆడేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లే వారిపై కూడా నిఘా పెడతాం. పేకాట ఆడి జీవితాలు నాశనం చేసుకోవద్దు. – అశోక్, సీఐ, బాన్సువాడ -
కమ్మర్పల్లిలో గంజాయి పట్టివేత
కమ్మర్పల్లి: మండలంలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను భీమ్గల్ సీఐ సత్యనారాయణ శుక్రవారం కమ్మర్పల్లి పోలీస్స్టేషన్లో వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ అనిల్రెడ్డి, సిబ్బంది కలిసి కమ్మర్పల్లిలోని మెట్పల్లి రోడ్లోగల రైస్మిల్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో స్కూటీపై ఇద్దరు వ్యక్తులు కమ్మర్పల్లి వైపు వస్తుండగా, పోలీసులు వారిని తనిఖీ చేయగా 4 గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. వెంటనే వాటిని స్వాధీనం చేసుకొని సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. వారిని జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన నాంపల్లి వికాస్, కమ్మర్పల్లికి చెందిన షేక్ ఇమ్రాన్గా గుర్తించారు. గంజాయిని కమ్మర్పల్లిలో విక్రయించడానికి తీసుకువస్తున్నామని, ఇంతకుముందు కూడా వికాస్ వద్ద గంజాయి కొనుగోలు చేసి కమ్మర్పల్లిలో విక్రయించానని షేక్ ఇమ్రాన్ ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. పట్టుకున్న గంజాయి 20 గ్రాములు ఉందన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. ఎస్ఐ అనిల్రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ మహ్మద్ అప్సర్ సిబ్బంది రాజ్కుమార్, లక్ష్మణ్గౌడ్,, నవీన్చంద్ర, లక్ష్మణ్నేత, గణపతినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
నూరుశాతం పన్ను వసూళ్లు చేయాలి
● ట్రేడ్ లైసెన్సుల్లో జాప్యం వద్దు ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలి : కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● నగర పాలక సంస్థ పనితీరుపై సమీక్ష నిజామాబాద్ సిటీ : బల్దియాకు రావాల్సిన వసూళ్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, వంద శాతం పన్ను వసూళ్లు జరగాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా కార్యాలయంలో కమిషనర్ దిలీప్కుమార్తో కలిసి అభివృద్ధి పనులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, మెప్మా విభాగాల్లో జరుగుతున్న పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కమిషనర్ దిలీప్కుమార్ అన్ని విభాగాలపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్కు వివరించారు. ఆస్తి పన్ను వసూళ్లు, నీటి చార్జీలు, తాగునీటి సరఫరా, శానిటేషన్ పనులు, భవన ని ర్మాణాలకు అనుమతులు, ఎల్ఆర్ఎస్, ఇంజినీరింగ్ పనుల పురోగతి తదితర అంశాలకు సంబంధించిన పనితీరును పరిశీలించిన కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు. పాత బకాయిలు రికవరీ చేయాలని ఆదేశించారు. పెద్ద మొత్తంలో ఆస్తి ప న్ను పెండింగ్లో ఉంటే, వాటి యజమానులకు నో టీసులు జారీ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని, స్పందించకుంటే సీజ్ చేయాలన్నా రు. 100 రోజుల ప్రణాళిక పక్కాగా అమలు జరిగే లా పర్యవేక్షణ చేయాలని తెలిపారు. అనుమతులు లేకుండా నిర్మించే భవనాలు నిలిపివేయాలని ఏసీపీ ని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, మెప్మా కార్యకలాపాలపై ఎ ప్పటికప్పుడు రిపోర్టు సిద్ధం చేయాలన్నారు. సీవో లు పని తీరును మెరుగుపర్చుకోవాలని, పనితీరును ఎప్ప టికప్పుడు సమీక్షించాలని టీపీఆర్వో చిదుర రమేశ్ ను ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాల ని ర్వహ ణ, పర్యవేక్షణకు శానిటరీ సూపర్వైజర్లు తనిఖీలు చేయాలన్నారు. శానిటేషన్ి సిసబ్బంది హాజరులో గోల్మాల్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. చెత్త సేకరణను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఇన్చార్జి ఎంహెచ్వో రవిబాబు, ఈఈ మురళీ మోహన్ రెడ్డి, డీఈలు సుదర్శన్రెడ్డి, ముస్తా క్, రషీద్, ఏఈ పావని, కరీం, ఏసీపీ శ్రీనివాస్, టీపీఆర్వో చిదుర రమేశ్, శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు. -
బకాయి రుణాల వసూళ్లపై దృష్టి సారించండి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యుల వద్ద పేరుకుపోయిన రుణ బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఐకేపీ ఏపీఎం రాంనారాయణగౌడ్ సూచించారు. నాగిరెడ్డిపేట ఐకేపీ కార్యాలయంలో శుక్రవారం పలు గ్రామాలకు చెందిన వీవోఏలతోపాటు సీసీలతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. మండలంలో సీ్త్రనిధి రుణాలకు సంబంధించి 87 శాతం బకాయిలు ఉన్నాయన్నారు. వీటితోపాటు మండలంలోని వివిధ గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులకు ఈ యేడు బ్యాంకు లింకేజీ ద్వారా రూ.37కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.7 కోట్లు ఇచ్చారని చెప్పారు. గ్రామాల్లో వృద్ధుల, వికలాంగుల, కిషోర బాలికల సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు. మండల సమాఖ్య అధ్యక్షులు బేస్త శాంత, అకౌటెంట్ రాజు, సీసీలు తదితరులు పాల్గొన్నారు. -
తల్లి పాల వారోత్సవాలు
బీబీపేట: తల్లి పాల ప్రాముఖ్యతపై సరైన అవగాహన లేకపోవడం, కుటుంబ పరిస్థితుల కారణంగా తల్లులు తమ పిల్లలకు తల్లి పాలను సక్రమంగా అందించడం లేదు. ఫలితంగా పిల్లలకు సరైన పోషకాలు అందక వ్యాధుల బారిన పడుతున్నారు. వారి ఎదుగుదలపై కూడా ప్రభావం పడుతోంది. దీనిని గుర్తించిన ప్రభుత్వం తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా తల్లి పాల వారోత్సవాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా తల్లి పాల వారోత్సవాలను ప్రారంభించింది. దోమకొండ ప్రాజెక్టు పరిధిలో 238 కేంద్రాలు.. దోమకొండ ప్రాజెక్టు పరిధిలో దోమకొండ, బీబీపేట, భిక్కనూర్, మాచారెడ్డి, రాజంపేట, పాల్వంచ మండలాలు ఉన్నాయి. మొత్తం 238 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఆయా కేంద్రాల పరిధిలో 1,293 మంది గర్భిణులు, 1,109 మంది బాలింతలు ఉ న్నారు. 6 నెల లోపు చిన్నారులు 1,121 మంది ఉండగా, 7 నెలల నుంచి 6 సంవత్సరాల వయసు వర కు 12,456 మంది చిన్నారులున్నారు. వీరందరికి అంగన్వాడి కార్యకర్తలు పౌష్టికాహారం అందిస్తున్నా రు. పౌష్టికాహారంతో పాటు తల్లి పాల ప్రాము ఖ్యతను వివరిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఫలితా లు రాకపోవడంతో ప్రభుత్వం తల్లి పాల వారోత్సవాలపై ఊరూర అవగాహన కార్యక్రమాలకు శ్రీకా రం చుట్టింది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారోత్సవాల్లో తల్లిదండ్రులతో పాటు ఆశ వర్కర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, వైద్య సిబ్బంది, ఇతర శాఖల అధికారుల ను భాగస్వామ్యం చేసింది. వీరంతా గ్రామాల్లో నిర్వహిస్తున్న వారోత్సవాల్లో తల్లి పాల ప్రాముఖ్య తను వివరిస్తున్నారు. బిడ్డ పుట్టగానే గంటలోపు త ల్లి పాలను బిడ్డకు పట్టించాలని, 6 నెలల వరకు తల్లి పాలను అందించాలని, తల్లి పాలలో బిడ్డ ఎదుగుదలకు అవసరమైన అనేక పోషకాలు అందుతాయని, చిన్నారుల్లో వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందని వారు అవగాహన కల్పిస్తున్నారు. అవగాహన కల్పిస్తున్నాం ప్రతి ఏటా నిర్వహిస్తున్న ట్లుగానే ఈ ఏడు కూడా అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపా ల వారోత్సవాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా ప్రతి కేంద్రంలో తల్లుల కు తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తున్నాం. వాటి వల్ల ఉపయోగాలు, చిన్నారులకు ఎంత వరకు ఆరోగ్యంగా ఉంటాయో చెబుతున్నాం. తల్లులు కచ్చితంగా తమ పిల్లలకు బయటి పాలు తాగించొద్దు. కచ్చితంగా తల్లిపాలను మాత్రమే పట్టాలి. – రోచిష్మ, ఐసీడీఎస్ సీడీపీవో, దోమకొండ అంగన్వాడీల్లో తల్లులకు అవగాహన కల్పిస్తున్న ఐసీడీఎస్ చిన్నారులు వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు చెబుతున్న సిబ్బంది -
ఎస్సారెస్పీకి పెరిగిన ఇన్ఫ్లో
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి స్థానిక ఎ గువ ప్రాంతాల్లో కురిసిన వర్షంతో వరద పెరిగింది. దీంతో శుక్రవారం ఉదయానికి 7593 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 3వేల క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 3 వేల క్యూసెక్కు లు, లక్ష్మికాలువ ద్వారా 200 క్యూసెక్కులు, సర స్వతి కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, అలీసా గర్ లిప్టు ద్వారా 180 క్యూసెక్కులు, గుత్ప లిప్టు ద్వారా 270 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 462 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో, ఔ ట్ఫ్లో సమానంగా ఉండటంతో ప్రాజెక్ట్ నీటి మ ట్టం నిలకడగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగుల నీరు కాగా శుక్రవారం సాయంత్రానికి ప్రాజెక్ట్లో 1078.20 (40.30 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు. -
ప్రముఖులకు రాఖీలు కట్టిన బ్రహ్మకుమారీలు
కామారెడ్డి అర్బన్ : ప్రజాపిత బ్రహ్మకుమారీ స్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కామారెడ్డి ఓం శాంతి కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్తో పాటు అడిషనల్ కలెక్టర్లు, అధికారులు, రాజకీయ నాయకుల కు రాఖీలు కట్టి, మిఠాయిలు అందజేసి రక్షబంధన్ ప్రాధాన్యతను వివరించారు. కార్యక్రమంలో ఓం శాంతి నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఇన్చార్జి బీకే జయ దీదీ, అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాధ్యతల స్వీకరణ బోధన్టౌన్(బోధన్): బోధన్ మున్సిపల్ కమిషనర్గా రాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం బల్దియా కార్యాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరాపై సిబ్బంది ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. బల్దియాకు వచ్చే ఆదాయంతోపాటు బల్దియాకు రావాల్సిన బకాయిలపై శ్రద్ధచూపాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని వెల్లడించారు. ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి బల్దియా అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. గంటల తరబడి తిప్పాల్సిందే.. బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి లక్ష్మి కాలువ ద్వారా నీటి విడుదల చేపట్టలన్నా.. నీటి విడుదల పెంచాలన్నా.. తగ్గించాలన్నా గంటల తరబడి గేట్లను తిప్పాల్సిందే. లేదంటే గేట్లు లేవవు, దిగవు. గేట్లకు కరెంట్ సరఫరా లేకపోవడంతో సిబ్బంది చేతులతోనే వాటిని ఎత్తుతున్నారు. శుక్రవారం నీటి విడుదల పెంచడం కోసం ఉదయం 7గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు గేట్లను తిప్పితే 200 క్యూసెక్కులకు నీటి విడుదల పెరిగింది. గంటల తరబడి గేట్లను తిప్పడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ఇందల్వాయి: మండలంలోని రూప్లనాయక్ తండా వద్ద గల జాతీయ రహదారి 44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఎస్సై సందీప్ తెలిపిన వివరాలు ఇలా.. తండాకు చెందిన తుంగర్ బాలాజి(50) స్థానిక హోటల్లో పని చేస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి అతడు రూప్లానాయక్ తండా నుంచి దేవి తండాకు నడుచుకుంటూ హైవేపై వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కొడుకు పవన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.ఆలయంలో చోరీ ఖలీల్వాడి: నగరంలోని సాయిబాబా ఆలయంలో దొంగతనం జరిగినట్లు మూడో టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి వెండి కిరీటం, ఇత్తడి సాయిబాబా విగ్రహం, ఇత్తడి సామగ్రి అపహరించినట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం ఆలయ అర్చకులు గుడికి వెళ్లగా, చోరీని గుర్తించి పోలీసుకలు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి వారు చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలుడి కిడ్నాప్ మోపాల్: మండలంలోని ముదక్పల్లి తండాకు చెందిన కెతావత్ హరీష్ (17) కిడ్నాప్నకు గురైనట్లు ఎస్సై జాడె సుస్మిత శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. తండాకు చెందిన హరీష్కు అదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. ఈ విషయం ఆమె భర్తకు తెలియడంతో వారిని మందలించాడు. ఈక్రమంలో వివాహితను ఆమె భర్త ఈనెల 5న రాంచంద్రపల్లిలోని తల్లిగారింట్లో వదిలేసి వచ్చాడు. 7న సదరు వివాహిత హరీష్కు ఫోన్ చేయడంతో అతడు నిజామాబాద్ వెళ్లాడు. అప్పటి నుంచి అతడు తిరిగి ఇంటికి రాలేడు. దీంతో బాలుడి సోదరి హరీష్ కిడ్నాప్కు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. దాబాపై పోలీసుల దాడి నిజామాబాద్ రూరల్: మండలంలోని గుండారం శివారులో గల దాబాపై గురువారం రాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతి లేకుండా దాబాలో, బెల్టుషాపులో లిక్కర్ అమ్మకాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రూరల్ ఎస్హెచ్వో మహ్మద్ఆరీఫ్ తెలిపారు. ఈ దాడిలో ఆరు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు వివరించారు. పేకాడుతున్న పలువురి అరెస్టు పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలో పేకాట స్థావరంపై గురువారం రాత్రి పోలీసులు దాడి చేసి పేకాడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి రూ.4,320 నగదు, 7 సెల్ ఫోన్లు, 2 బైకులతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. రుద్రూర్ మండలంలో.. రుద్రూర్: మండలంలోని రాణంపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్టు ఎస్సై సాయన్న తెలిపారు. వీరి వద్ద నుంచి రూ. 4510 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్సై వివరించారు. రెంజల్ మండలంలో.. రెంజల్(బోధన్): మండలంలోని సాటాపూర్ శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకున్నట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 8470 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు. -
బ్రహ్మాజివాడిలో ఒకరి ఆత్మహత్య
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని బ్రహ్మాజివాడి గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామాస్తులు తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన జోలే శ్రీకాంత్రావు(30) కామారెడ్డిలో ఓ ప్రయివేటు జాబ్ చేస్తున్నాడు. అతడికి వివాహం జరిపించడానికి కుటుంబ సభ్యులు గత కొన్ని సంవత్సరాల నుంచి పెండ్లి సంబంధాలు చూస్తున్నప్పటికీ కుదర లేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన శ్రీకాంత్రావు శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి రాజేశ్వర్రావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని, మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు.. బాన్సువాడ రూరల్: ఆత్మహత్యకు యత్నించిన ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. వివరాలు ఇలా.. మండలంలోని చిన్నరాంపూర్ గ్రామం పులికుచ్చ తండాకు చెందిన జప్పిబాయి (60) అనే వృద్దురాలు గత కొన్ని సంవత్సరాలుగా మతిస్థిమితం కోల్పోయింది. ఈక్రమంలో ఈనెల 7న ఆమె పురుగుల మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్సనిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
వ్యవసాయంలో ‘డ్రోన్’ సాయం
ధర్పల్లి: ఒకప్పుడు డ్రోన్లను ఆర్మీ, నిఘా సంస్థలు మాత్రమే వాడేవి. మారుతున్న సాంకేతిక విప్లవంతో డ్రోన్లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అన్ని రంగాల్లో డ్రోన్ల వాడకం విరివిగా జరుగుతుండగా, వ్యవసాయంలోనూ వాటి వాడకం పెరిగిపోయింది. పల్లెల్లోనూ రైతులు డ్రోన్లతో వ్యవసాయ పనులు చేస్తూ పనిభారం తగ్గించుకుంటున్నారు. తగ్గనున్న ఖర్చులు.. రైతులు పంటలకు సకాలంలో ఎరువులు వేయడం, పురుగు మందులు చల్లడం లాంటి పనులు చేయడానికి కూలీలపైనే ఆధారపడాల్సి వచ్చేది. కూలీలు సమయానికి రాకపోతే రైతు నష్టాలను భరించాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు డ్రోన్ల రాకతో రైతులు కూలీల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రతి పల్లెల్లో డ్రోన్ వ్యవస్థ విస్తరించింది. కొందరు యువత జీవనోపాధి కోసం డ్రోన్లు కొనుగోలు చేసి ఆపరేటింగ్ చేస్తున్నారు. ఎకరానికి రూ.500 చొప్పున తీసుకొని కేవలం ఐదు నిమిషాల్లోనే ఎకరా భూమిలో క్రిమిసంహారక మందులను చల్లేస్తున్నారు. ఈ విధానంలో ఎరువులైన, మందులైన ఒకచోట ఎక్కువ, ఒకచోట తక్కువ కాకుండా సమానంగా పరుచుకుంటాయి. ఈ విధానంలో రైతుకి పురుగుమందు ఆదా అవడంతోపాటు పంట దిగుబడి పెరుగుతుంది. డ్రోన్ వినియోగం వల్ల రైతులకు కూలీల సమస్య తీరడంతోపాటు ఖర్చులు తగ్గుతున్నాయి. అలాగే డ్రోన్లను పంటలను పర్యవేక్షించడానికి కూడా వినియోగిస్తున్నారు. స్వయం ఉపాధి పొందుతున్నా.. గల్ఫ్ దేశంలో పనిచేయడం ఇష్టం లేక, స్వయం ఉపాధి పొందాలనే ఆలోచనతో రూ.5 లక్షల వ్యయంతో డ్రోన్ను కొనుగోలు చేశాను. శిక్షణ తీసుకొని పొలాల్లో డ్రోన్తో మందుల పిచికారి చేస్తున్నాను. చార్జి ఒక ఎకరాకు రూ.500 తీసుకుంటున్నాను. రోజుకు 10 నుంచి 20 ఎకరాల వరకు స్ప్రే చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నాను. –జీ రఘు, డ్రోన్ నిర్వాకుడు, గడ్కోల్ ఎంతో ఉపయోగం.. నాకు గ్రామంలో మూడు ఎకరాల పొలం ఉంది. గతంలో పంటలకు పాత పద్ధతిలో మందుల పిచికారి చేయడానికి కూలీలతోపాటు స్ప్రే మెషిన్కు రూ.3వేలు వరకు ఖర్చు అయ్యేది. ఇప్పుడు డ్రోన్ వల్ల రూ.పదిహేను వందలకే పూర్తవుతుంది. వ్యవసాయంలో డ్రోన్ను ఉపయోగించడం వల్ల కూలీలతోపాటు సమయం, శ్రమ, ఖర్చు బాగా తగ్గుతుంది. – బి ప్రసాద్, రైతు, గడ్కోల్ పల్లెల్లో పంటలకు డ్రోన్లతో మందులు పిచికారి చేస్తున్న వైనం కూలీల కొరతకు చెక్ -
మహిళల స్వయం ఉపాధికి రోటరీ కృషి అభినందనీయం
కామారెడ్డి అర్బన్: మహిళల స్వయం ఉపాధికి రోటరీ క్లబ్, పీపుల్ ఫర్ ఇండియా సంస్థ ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్లు అందజేయడం అభినందనీయమని అదనపు కలెక్టర్ చందర్ నాయక్ అన్నారు. కామారెడ్డి మండలం గర్గుల్లో దాదాపు రూ.4 లక్షల విలువైన ఎంబ్రాయిడరీ మిషన్, రూ.50 వేల విలువైన తాటిపత్రిలు పంపిణీ చేశారు. రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఎం.జైపాల్రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి ప్రమీల, రోటరీ ప్రతినిధులు శంకర్, కృష్ణహరి, ప్రొగ్రాం చైర్మన్ రాజనర్సింహారెడ్డి, వెంకట రమణ, గర్గుల్ సింగిల్ విండో మాజీ చైర్మన్ కొలిమి భీంరెడ్డి, నవీన్కుమార్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
తోరణాలు కావవి.. మొక్కజొన్న జోళ్లు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): బెజుగంచెరువుతండాలో ఓ రైతు తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మొక్కజొన్న జోళ్లు చూడడానికి చక్కని తోరణాల మాదిరిగా కనిపిస్తున్నాయి. గత రబీ సీజన్లో సాగుచేసిన మొక్క జొన్న దిగుబడులను రాబోయే కాలంలో తినడానికి పురుగుపట్టకుండా నిల్వ చేసుకోవడానికి ఇంటి ముందు ఇలా జోళ్లను ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా చేయడం వల్ల మొక్కజొన్న గింజలకు పురుగు పట్టకుండా ఉంటుందని గిరిజన రైతు రమావత్ కిషన్నాయక్ తెలిపారు. దీంతోపాటు రాబోయే రోజుల్లో తాము వాటిని పిండిగా మార్చుకొని రొట్టెలు చేసుకుంటామని ఆయన చెప్పారు. -
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి
బీబీపేట: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీడీవో పూర్ణచంద్రోదయ కుమార్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని శేరిగల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు. పంచాయతీ కార్యదర్శి రమేష్, ఆరోగ్య కార్యకర్తలు హరిప్రసాద్, సుశీల, ఆశ కార్యకర్తలు గంగ, జ్యోతి పాల్గొన్నారు. ప్రతి శుక్రవారం నిల్వనీటిని పారబోయాలి బాన్సువాడ రూరల్: వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి శుక్రవారం నీటి తొట్టెలు, ట్యాంకుల్లో నీటిని పారబోసి కొత్త నీటిని నింపుకోవాలని బోర్లం పంచాయతీ కార్యదర్శి సాయికుమార్ సూచించారు. శుక్రవారం ఆయన బోర్లం గ్రామంలో ఆరోగ్య, ఆశ కార్యకర్తలతో కలిసి ప్రజలను చైతన్య పరిచారు. ఏఎన్ఎం అనురాధ, ఆశ కార్యకర్త సుచిత్ర తదితరులు పాల్గొన్నారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలో శుక్రవారం ఫ్రైడేడ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు గ్రామాలలో తిరుగుతూ సీజనల్ వ్యాధులు ఎలా వ్యాపిస్తాయో ప్రజలకు అవగాహన కల్పించారు. -
ఇసుక, మొరం కొరత లేకుండా చూడాలి
రామారెడ్డి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక, మొరం, ఇటుకల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మండలంలోని రంగంపేటలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తున్నందున పనులనుత్వరగా పూర్తి చేయాలని సూచించారు. పేదలు సంతోషంగా సొంత ఇంటిలో నివసించేందుకు ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇంటి నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల మెటీరియల్స్ లభ్యమయ్యేలా అధికార యంత్రాంగం చూసుకుంటుందని పనులు పూర్తి చేసుకోవాలని అన్నారు. అనంతరం రైతు వేదికలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో హౌజింగ్ పీడీ విజయపాల్రెడ్డి, తహసీల్ధార్ ఉమాలత, ఎంపీడీవో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అగ్రస్థానం!
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలోజుక్కల్ మండలం బంగారుపల్లిలో మక్తవార్ గంగవ్వ గృహ ప్రవేశం చేసిన ఇందిరమ్మ ఇల్లు సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలిచింది. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి జిల్లా యంత్రాంగం నిరంతరం శ్రమించిన ఫలితంగా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. ఇదే విషయాన్ని ఇటీవల జిల్లాలో పర్యటించిన రాష్ట్ర హౌజింగ్ కార్పొరేషన్ సెక్రెటరీ, మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం.. రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్తోపాటు జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. జిల్లాలోని నాలుగు నియోజక వర్గాలకు కలిపి 12,090 ఇళ్లు కేటాయించగా, 11,818 ఇళ్లు మంజూరు చేశారు. 5,770 ఇళ్లు గ్రౌండింగ్ అవడంతోపాటు 2,342 ఇళ్లు బేస్మెంట్ పనులు పూర్తయ్యాయి. 157 ఇళ్ల గోడల పనులు కాగా, 75 ఇళ్లు రూఫ్ లెవల్కు చేరాయి. ఒక ఇంటి నిర్మాణం పూర్తయ్యింది. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ క్షేత్ర స్థాయి పర్యటనల్లో భాగంగా ప్రతిరోజూ ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. దీంతో పనులు వేగంగా సాగుతున్నాయి. శ్రావణ మాసం పూర్త య్యేలోగా వందకు పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి గృహ ప్రవేశాలు జరిపించాలనే లక్ష్యంతో అధికారులు అడుగులు వేస్తున్నారు. ప్రతి రోజూ పురోగతి నివేదిక! ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు మరింత వేగవంతం అయ్యేలా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రోజుకు ఒకటి రెండు మండలాల్లో పర్యటిస్తున్నారు. జిల్లాలోని నాలు గు నియోజకవర్గాల్లోని ఆయా మండలాల్లో పనులు వేగవంతం అయ్యేలా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలను పరిశీలించే క్రమంలో లబ్దిదారులతో మాట్లాడి ఏమైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రతి రోజూ సాయంత్రం వరకు ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పురోగతి పై నివేదిక తెప్పించుకుని, ఎక్కడైనా వెనుకబడి ఉంటే అక్కడి అధికారులతో మాట్లాడుతున్నారు. స్వయం సహాయక రుణాలు లబ్ధిదారులు సొంత డబ్బులు పెట్టుకుని మొదలుపెట్టాల్సి ఉంటుంది. బేస్మెంట్ వరకు పనులు అయి న తరువాత మొదటి బిల్లు ఖాతాలో జమవుతుంది. అయితే చాలా మంది చేతిలో డబ్బులు లేక ని ర్మాణానికి అవసరమైన సామగ్రి తెచ్చుకోలేకపోతున్నారని గుర్తించిన ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల ద్వారా రుణం తీసుకునే అవకాశం కల్పించింది. ఎస్హెచ్జీ రుణాల కోసం 970 మంది ఇందిరమ్మఽ లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా, 501 మంది వివరాలు బ్యాంకులకు చేరాయి. కాగా 439 మందికి ఇప్పటి వరకు రూ.5.13 కోట్లు మంజూరయ్యాయి. ఇంటి నిర్మాణ పనులు మొదలు పెట్టేందుకు ఇబ్బందులు తొలగిపోవడంతో పనుల్లో వేగం పెరుగుతోంది.మరింత వేగంగా జరగాలిఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం సంతోషం కలిగించింది. పనులు మరింత వేగంగా జరగాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రతి రోజూ క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులను పర్యవేక్షిస్తున్నాం. ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తున్నందున లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి అయ్యేలా చూసుకోవాలి. సామగ్రి కొరత తలెత్తకుండా, అలాగే బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. – ఆశిష్ సంగ్వాన్, కలెక్టర్నియోజక వర్గాల వారీగా.. రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన కామారెడ్డి జిల్లా పురోగతిలో సగానికిపైగా ఇళ్ల నిర్మాణాలు.. బంగారుపల్లిలో ఓ ఇంటి నిర్మాణం పూర్తి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పర్యవేక్షిస్తున్న కలెక్టర్ సంగ్వాన్ -
హైవే రూట్ మ్యాప్ రెడీ!
మద్నూర్(జుక్కల్) : ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎ దురు చూస్తున్న మద్నూర్–బోధన్ జాతీయ రహ దారి నిర్మాణ పనులకు చకచకా అడుగులు పడుతు న్నాయి. బడ్జెట్, డిజైన్, విస్తరణ, మౌలిక వసతు లు, సాంకేతిక అంశాలు తదితర వాటికి సంబంధించి పనులు ముందుకు సాగుతున్నాయి. మద్నూర్ మండల కేంద్రం నుంచి సిర్పూర్, నిజామాబాద్ జిల్లాలోని పొతంగల్, కోటగిరి, రుద్రూర్ మీదుగా బోధన్ వరకు జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయి. ఈ జాతీ య రహదారికి 161బీబీ అని నామకరణం చేస్తూ ప్రభుత్వం 2021లో గెజిట్ విడుదల చేసింది. మొద ట మద్నూర్, బోధన్, బాసర, బైంసా వరకు రోడ్డు ను ప్రకటించారు. కానీ మద్నూర్ నుంచి బోధన్ వరకు ఒక హైవేగా నిర్ధారించి బోధన్ నుంచి బైంసా వరకు రహదారిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బోధన్ నుంచి భైంసా వరకు 90 శాతం జాతీయ రహాదారి పనులు పూర్తి కాగా మద్నూర్ నుంచి బోధన్ వరకు పలు కారణాలతో ఆలస్యం జరిగిందని హైవే అధికారులు తెలిపారు. రూ.640 కోట్లతో డీపీఆర్ సిద్ధం మద్నూర్ నుంచి బోధన్ వరకు జాతీయ రహదారి 161బీబీకి రూ.640 కోట్ల అంచనాతో 39 కిలోమీటర్ల దూరంతో డీపీఆర్ను సిద్ధం చేశారు. మద్నూర్, డోంగ్లీ రెండు మండలాల పరిధిలోని తొమ్మిది గ్రామాల శివారులోని భూమిని అధికారులు గుర్తించారు. మద్నూర్ మండలంలోని వాడి ఫత్తేపూర్ శివారులో 8 ఎకరాలు, మద్నూర్ శివారులో 5 ఎకరాలు, సోనాల శివారులో 17 ఎకరాలు, తడి హిప్పర్గా శివారులో 24 ఎకరాలు, మహల్సాపూర్ శివారులో 25 ఎకరాల భూమి జాతీయ రహదారికి అవసరం ఉందని సర్వే నిర్వహించారు. అలాగే డోంగ్లీ మండలంలోని లింబూర్ శివారులో 33 ఎకరాలు, హసన్ టాక్లీ శివారులో 13 ఎకరాలు, పెద్ద టాక్లీ శివారులో 16 ఎకరాలు, సిర్పూర్ శివారులో 21 ఎకరాల భూమి సేకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. మొత్తం 142 ఎకరాల భూమి అవసరమవుతుందని ఆర్అండ్బీ, నేషనల్ హైవే, రెవెన్యూ అధికారులు చెప్పారు. మద్నూర్ నుంచి బోధన్ వరకు గల గ్రామాల పక్క నుంచి ఈ రహదారి వెళ్తుంది. హైవే పనులు పూర్తయితే దూర ప్రాంతాల కనెక్టీవిటీ మెరుగుపడుతుంది. వ్యాపారులకు, ప్రజలకు అనేక ప్రయోజనాలు అందనున్నాయి. రోడ్డు నిర్మాణంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి రహదారిలో పలు భద్రతాప్రమాణాలు పాటించనున్నారు. మద్నూర్ నుంచి బోధన్ నిజామాబాద్కు నిత్యం వందల సంఖ్యలో ప్రజలు పనుల నిమిత్తం వెళ్తుంటారు. హైవే నిర్మాణంతో భవిష్యత్లో ఆర్థికాభివృద్ధి పుంజుకోనుంది. ముమ్మరమైన సర్వే పనులుమద్నూర్ నుంచి బోధన్ వరకు సర్వే పనులు చకచకపూర్తవుతున్నాయి. నేషనల్ హైవే, రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో సర్వే పనులు పూర్తి చేసి పెగ్ మార్కింగ్ వేయనున్నారు. నాలుగు వరుసల రహదారి కోసం భూసేకరణ పూర్తయిన వెంటనే పనులకు సంబంధించి టెండర్లు నిర్వహించనున్నారు.రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు..! హైవే నిర్మాణానికి అవసరం ఉన్న భూముల్లో సర్వే నిర్వహించామని, భూములు కోల్పోతున్న రైతుల వివరాలు, సర్వే నంబర్లను రెవెన్యూ అధికారులు నేషనల్ హైవే అధికారులకు పంపించారు. జాతీయ రహదారిలో భూములు కోల్పోతున్న రైతులకు నష్ట పరిహారంపై విచారణ నిర్వహించి రైతులకు మంచి ధర వచ్చేటట్లు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎకరానికి రూ.15 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు పరిహారం అందించేలా చర్యలు కొనసాగుతున్నట్లు తెలిసింది. మద్నూర్ – బోధన్ జాతీయ రహదారికి త్వరలో భూ సేకరణ పెగ్ మార్కింగ్కు సర్వం సిద్ధం 39 కిలోమీటర్ల నాలుగు లైన్ల జాతీయ రహదారి 9 గ్రామాల పరిధిలో 142 ఎకరాల భూమి అవసరం జిల్లాకు మరో 161బీబీ జాతీయ రహదారి -
ఢిల్లీలో కాంగ్రెస్ దొంగ దీక్షలు
కామారెడ్డి క్రైం: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ఢిల్లీలో కాంగ్రెస్ దొంగ దీక్షలు చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు అన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42 రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ డ్రామాలు చేస్తోందన్నారు. ముస్లిం లను బీసీల్లో కలపకుండా రిజర్వేషన్ ప్రక్రియ ప్రారంభిస్తే మద్దతు ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నారని ఇదివరకే కేంద్ర మంత్రులు స్పష్టం చేశారన్నారు. అయినప్పటికీ రిజర్వేషన్లను బీజేపీ ఆపుతోంది అంటూ కాంగ్రెస్ ఢిల్లీలో దొంగ దీక్షలు చేపట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్కు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలైన బీసీలకు అన్యాయం జరగకుండా ముస్లింలను బీసీ కోటా నుంచి తప్పించాలన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు రిజర్వేషన్ కల్పించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు పొతంగల్ కిషన్రావు, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మాచారెడ్డి : వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజలకు సూచించారు. పాల్వంచ మండలంలోని భవానీపేట–పోతారం గ్రామాల మధ్య ఉన్న వాగును కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీటి ఉధృతి అధికంగా ఉన్నందున వంతెన పైనుంచి నీరు ప్రవహించకముందే వాహనాల రాకపోకలను నిలిపివేయాలని ఆర్అండ్బీ ఈఈ మోహన్ను ఆదేశించారు. వర్షాల కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లా, మండల, గ్రామ స్థాయి అధికారులు అప్రమత్తంగా ఉంటూ లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. జిల్లా కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు వర్ష సూచనలు తెలుసుకుంటూ, ఆయా గ్రామాల్లోని వాట్సాప్ గ్రూపుల్లో, అలాగే దండోరా ద్వారా ప్రజలకు సమాచారం అందించాలన్నారు. ఆయనవెంట అదనపు కలెక్టర్ విక్టర్ తదితరులున్నారు. -
ప్లాస్టిక్ వినియోగించొద్దు
ఎల్లారెడ్డి : ప్రతి ఒక్కరూ మార్కెట్కు వెళ్లే స మయంలో చేతి సంచులను తీసుకెళ్లాలని మున్సిపల్ కమిషనర్ మహేశ్కుమార్ అన్నా రు. పట్టణంలోని కూరగాయల మార్కెట్కు చేతి సంచులతో వచ్చిన వారికి శుక్రవారం ఆయన పూలు అందజేసి అభినందించారు. ప్లాస్టిక్ గ్లాస్లు వినియోగించుకుండా గాజు గ్లాస్లు వినియోగిస్తున్న హోటళ్ల యజమానులను ఆయన సన్మానించారు. ప్రతి ఒక్క రూ ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండా లని ఆయన కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి జావెలిన్త్రోలో బంగారు పతకం కామారెడ్డి అర్బన్ : రాష్ట్రస్థాయి జావెలిన్ త్రో అథ్లెటిక్స్లో జిల్లాకు బంగారు పతకం దక్కింది. జనగామ జిల్లా ధర్మకంచ మినీ స్టేడియంలో నిర్వహించిన నాల్గో రాష్ట్రస్థాయి జావెలిన్ త్రో అథ్లెటిక్స్ మీట్–2025లో జిల్లాకు చెందిన క్రీడాకారిణి ఎం.అమృత అండర్ –20 విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబర్చి బంగారు పతకం సాధించిందని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.జైపాల్రెడ్డి, కేపీ అనిల్కుమార్ తెలిపారు. జట్టు కోచ్గా జి.నవీన్ వ్యవహరించారన్నారు. అమృతను పలువురు అభినందించారు. రైతునేస్తంతో లబ్ధి పొందాలి కామారెడ్డి అర్బన్ : ప్రతి మంగళవారం నిర్వహించే రైతునేస్తంలో పాల్గొని లబ్ధిపొందాలని రైతులకు జిల్లా వ్యవసాయాధికారి మోహన్రెడ్డి సూచించారు. మండలంలోని ఇస్రోజివాడిలో సాగవుతున్న పంటలను శుక్రవారం ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఇస్రోజివాడి రైతు వేదిక, గ్రామపంచాయతీ కార్యాలయాలను సందర్శించారు. పంటల సస్యరక్షణ, ఇందిరమ్మ ఇళ్లు, పారిశుద్ధ్యంపై మాట్లాడారు. ఆయన వెంట ఏఈవో దేవేంద్ర, మార్కెట్ డైరెక్టర్ సుదర్శన్రావు, తదితరులు ఉన్నారు. నిజాంసాగర్కు ఇన్ఫ్లో నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు శుక్రవారం సాయంత్రం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 600 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వస్తోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగుల (17.8 టీఎంసీ)కు గాను ప్రస్తుతం 1390.95 అడుగులు (4.448టీఎంసీ)ల నీరు నిల్వ ఉందన్నారు. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు 600 క్యూసెక్కుల నీటిని ఆయకట్టుకు విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. -
మెరుగైన వైద్య సేవలందించాలి..
కామారెడ్డి క్రైం : ఆస్పత్రికి వచ్చే వారికి మెరుగై న వైద్య సేవలందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సిబ్బందికి సూచించారు. కామారెడ్డి మండలం గర్గుల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రా న్ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. కేంద్రంలోని మౌలిక వసతులు, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆరోగ్య కేంద్రం భవనానికి విద్యుత్ సరఫరా, నీటివసతిని క ల్పించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని అధి కారులను ఆదేశించారు. ఆరోగ్య కేంద్రం పరిసరాల్లో రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వహించాలని పోలీసు అధికారులను, కేంద్రంలో అవసరమై న ఇతర మౌలిక సదుపాయాలకు తగిన ఏర్పా ట్లు చేయాలని డీఎంహెచ్వో చంద్రశేఖర్ను ఆ దేశించారు. వైద్యాధికారులు ప్రభు దయాకిరణ్, జోహా, వైద్య సిబ్బంది, ఆశ కార్యకర్తలు ఉన్నారు. -
ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
కామారెడ్డి క్రైం : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని రాజానగర్ కాలనీలో గురువారం పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా పునాదుల వరకు నిర్మాణం పూర్తయిన ఇళ్లకు మొదటి విడత బిల్లులు మంజూరయ్యాయా అని వాకబు చేశారు. ఇళ్ల నిర్మాణానికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఉచితంగా ఇసుక, మొరం అందజేస్తోందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు ఇసుక, మొరం, ఇతర నిర్మాణ సామగ్రికి సంబంధించి ఎలాంటి సమస్యలు లేకుండా పనులను పర్యవేక్షించాలని హౌసింగ్ పీడీ విజయ్పాల్రెడ్డి, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డిని ఆదేశించారు. ప్రారంభమైన అన్ని ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలన్నారు. ప్రభుత్వం ఉచితంగా ఇసుక, మొరం అందిస్తోంది అధికారులు నిరంతరం పనులను పర్యవేక్షించాలి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచన జిల్లా కేంద్రంలో పనుల పరిశీలన -
అక్కా చెల్లెళ్లకు ఆర్టీసీ షాక్!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పండగల సీజన్లో సాధారణంగా వస్తువుల మీద ఆఫర్లు ప్రకటిస్తుంటారు. కానీ ఆర్టీసీ యాజమాన్యం మాత్రం పండగ సీజన్లో చార్జీలు అది కూడా 25 శాతం నుంచి 35 శాతం పెంచి ప్రయాణిలపై అడ్డగోలు భారం మోపుతోంది. గత కొంత కాలంగా పండగల సీజన్లో చార్జీలు పెంచి వసూలు చేస్తున్న ఆర్టీసీ ఆఖరుకు రాఖీ పండగ రద్దీని క్యాష్ చేసుకునేందుకు బాధుడు షురూ చేసింది. కామారెడ్డి నుంచి జేబీఎస్కు సాధారణంగా డీలక్స్ బస్సు చార్జీ రూ.230 ఉండగా, దానిని పండగ సందర్భంగా రూ.300కు పెంచేసింది. అదే మహారాష్ట్ర లోని నాందేడ్ నుంచి హైదరాబాద్కు నడిచే బస్సు ఎక్కితే రూ.190 తీసుకుంటున్నారు. దానికి, దీనికి రూ.110 తేడా ఉంటోంది. కాగా హైదరాబాద్లో ఉంటున్న అక్కా చెల్లెల్లు కామారెడ్డికి రావాలన్నా, కామారెడ్డి ప్రాంతంలో ఉంటున్న అక్కాచెళ్లెల్లు హైదరాబాద్కు వెళ్లాలన్నా ఆర్టీసీ వడ్డనను భరించాల్సిందే. మహాలక్ష్మి పథకం ద్వారా ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించాలనుకున్నా అరకొర బస్సులు నడుపుతున్నారు. ముఖ్యంగా కామారెడ్డి నుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు ఎక్స్ప్రెస్ సర్వీసులు తక్కువగా ఉండడంతో నిలబడి కూడా వెళ్లలేని పరిస్థితి ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో డీలక్స్ బస్సులు ఎక్కుతున్నారు. డీలక్స్ చార్జీ ఇప్పటికే రూ.230 దాకా ఉండగా, పండగ పేరుతో రూ.300 వసూలు చేయడం మహిళలకు మరింత భారంగా మారింది. మరికొన్ని రూట్లలోనూ స్పెషల్ పేరుతో చార్జీలు పెంచి వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ తీరుపై మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అవ్వగారింటికి వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు మహిళలు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో ఇదేం దోచుకునుడు అంటూ నిష్టూరమాడుతున్నారు. తమ చేతిలో ఏమీ లేదని, అధికారులు ఏది చెబితే అది పాటిస్తామంటూ డ్రైవర్లు, కండక్టర్లు వారికి నచ్చజెప్పుతున్నారు.కుటుంబాలపై ఎంతో భారం..రాఖీ పండగ కోసం కుటుంబం మొత్తం బస్సులో సొంతూళ్లకు వెళ్లాలంటే అడ్డగోలు భారం మోయాల్సి వస్తోంది. నలుగురు కుటుంబ సభ్యులు కలిసి వెళ్లాలంటే అదనంగా రూ.280 భరించాల్సిన పరిస్థితి నెలకొంది. తిరిగి వెళ్లే సమయంలో మరో రూ.280 అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. అలాగే డీలక్స్లో మహిళలకు ఉచిత ప్రయాణం లేకపోవడం కారణంగా పూర్తి చార్జీ చెల్లించాల్సి రావడం భారం పడుతోంది. పండగల సందర్భంగా అందరూ ఆఫర్లు ఇచ్చి వస్తువుల ధరలు తగ్గిస్తే, ఆర్టీసీ సౌకర్యాలు కల్పించకపోగా, చార్జీలు పెంచి నడ్డివిరుస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ చార్జీల వడ్డనపై ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు నోరువిప్పాల్సిన అవసరం ఉంది.మహాలక్ష్మి పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్న ఆర్టీసీ అవసరం మేరకు ఎక్స్ప్రెస్ బస్సులను అందుబాటులో ఉంచడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. వాటిని పట్టించుకోని సంస్థ స్పెషల్ బస్సుల పేరుతో చార్జీల పెంపుపై ఆసక్తి చూపుతోంది. పండగ రోజుల్లో చార్జీలు పెంచే ఆర్టీసీ.. ఆడ బిడ్డలకు ఎంతో ప్రత్యేకమైన రాఖీ పౌర్ణమి సందర్భంగా డీలక్స్ బస్సు చార్జీలను పెంచింది. మహాలక్ష్మి పథకం ద్వారా ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణిద్దామంటే రద్దీ చాలా ఎక్కువగా ఉంటోందని, డబ్బులు చెల్లించి డీలక్స్ బస్సుల్లో వెళ్దామంటే టికెట్ చార్జీ పెంచేశారని ఆడబిడ్డలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాఖీ పండగకు పోవద్దా..అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడి ఆత్మీయతను తెలిపే రాఖీ పౌర్ణమి పండగ కోసం ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా తల్లిగారింటికి పయనమవుతారు. ఒకటి రెండు రోజుల ముందే చాలా మంది బయల్దేరుతారు. శుక్రవారం వరలక్ష్మి వ్రతం సెలవు దినం, శనివారం రాఖీ పౌర్ణమి, మరుసటి రోజు ఆదివారం సెలవు కావడంతో వరుస సెలవుల నేపథ్యంలో మూడు రోజులపాటు తల్లిగారింట గడపొచ్చని ఆడపిల్లలు ఎన్నో ఆశలతో బయల్దేరితే ఆర్టీసీ చార్జీల పెంపుతో చాలా మంది లబోదిబోమంటున్నారు. ఏడాదికోసారి వచ్చే రాఖీ పండగ పూట అన్నదమ్ములకు రాఖీ కట్టి ప్రేమను చాటుకునేందుకు వెళ్లాలంటే బస్సు చార్జీలు వారిని బాధిస్తున్నాయి. పండగకు ముందుగానే వెళ్తారని గ్రహించిన ఆర్టీసీ ముందుగానే చార్జీలను పెంచేసింది. కాగా పండగ కోసం తమ వారి వద్దకు వెళ్లేందుకు బస్సుల్లో బయల్దేరిన వారు ఒక్కసారిగా పెరిగిన చార్జీలను చూసి షాక్ అవుతున్నారు. కొందరైతే కండక్టర్లు, డ్రైవర్లతో గొడవకు దిగుతున్నారు. తామేం చేయలేమంటూ వారు చేతులెత్తేస్తున్నారు. అయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఏమోగానీ ఇతర బస్సుల చార్జీలను అడ్డగోలుగా పెంచిందని చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని ఎర్రాపహాడ్ గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన చెవుటి పెద్ద గంగయ్య మూడు రోజుల క్రితం తన ఇంటికి తాళం వేసి, కామారెడ్డి మండలంలోని టెక్రియాల్లో ఉన్న తన కూతురు వద్దకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించి బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు అతడి ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న 50తులాల వెండి ఆభరణాలు, 2 తులాల బంగారు అభరణాలు, రూ.10వేల నగదును అపహరించారు. మరుసటి రోజు ఉదయం చోరీని గుర్తించి బాధితులు పోలీసులకు సమచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జర్నలిస్టు కాలనీలో.. బాన్సువాడ: బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని జర్నలిస్టు కాలనీలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. వివరాలు ఇలా.. కాలనీలో నివాసముంటున్న పట్లోళ్ల సుగణ అనే మహిళ శనివారం ఇంటికి తాళం వేసి హైదరాబాద్లోని బంధువుల ఇంటికి వెళ్లింది. గురువారం సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకోగా, ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో ఉన్న రూ.2.50లక్షల నగదు చోరీ చేసినట్లు బాధితురాలు పేర్కొంది. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ అశోక్ తెలిపారు. గుర్తుతెలియని మృతదేహం లభ్యంఖలీల్వాడి: నగర పరిధిలోని జానకంపేట గ్రామ శివారులో ఉన్న అశోక్ సాగర్ చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించినట్లు ఆరో టౌన్ ఎస్సై వెంకట్రావు తెలిపారు. చెరువులో గురువారం ఉదయం మృతదేహం పైకి తేలయంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి వయస్సు సుమారు 50 ఏళ్లు ఉంటాయని, అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని ఎస్సై తెలిపారు. మృతుడి వివరాలు తెలిసినవారు ఆరో టౌన్ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు. -
కంప్యూటర్ల మాయంలో ఎవరి హస్తమెంత?
బాన్సువాడ: ఇంటి దొంగను ఈశ్వరుడైడా పట్టుకోలేరనే సామెతకు అద్దంపట్టినట్లు ఉంది.. పాఠశాలల్లో విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే కంప్యూటర్ల మాయం చేయడమనేది. ఉపాధ్యాయ వృత్తికే మాయని మచ్చలా తయారైంది. మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి. వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి. కానీ కంప్యూటర్ గదిలో ఉండాల్సిన కంప్యూటర్లు మాత్రం మాయమయ్యాయి. వివరాలు.. తాడ్కోల్లో ప్రతి సంవత్సరం ఒక్కో తరగతి అప్గ్రేడ్ కావడంతో 2024 ఫిబ్రవరిలో విద్యాశాఖ.. పాఠశాలకు పది కంప్యూటర్లను అందజేసింది. పాఠశాలలో కంప్యూటర్ విద్య బోధించే ఉపాధ్యాయుడు లేకపోవడంతో కంప్యూటర్లను ఓ గదిలో ఉంచి తాళాలు వేశారు. కంప్యూటర్లు ఉన్న గదికి మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి.. తాళాలు వేసినట్లే ఉన్నాయి. కిటికీలు మూసి ఉంచారు. ఈ ఏడాది మార్చి 15న నుంచి ప్రైమరీ చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఏఐఏఎక్స్ఎల్పై అవగాహన కల్పించాలని ఆదేశించింది. కంప్యూటర్ల రికవరీపై మల్లగుల్లాలుతాడ్కోల్ పాఠశాలలో ప్రైమరీ విద్యార్థులకు ఏఐఏఎక్స్ఎల్ నేర్చించాలని కంప్యూటర్ గది తాళం తీశారు. గదిలో పది కంప్యూటర్లు ఉండాల్సిన చోట ఐదు కంప్యూటర్లు మాత్రమే ఉన్నాయి. కంప్యూటర్లు కనపడకపోవడంతో పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయులు విషయాన్ని దాచిపెట్టారు. విషయం ఆలస్యంగా బయటకి రావడంతో పాఠశాలలో పని చేసే ఓ ఉపాధ్యాయుడు తన ఇంటికి తీసుకెళ్లిన ఒక కంప్యూటర్ను గుట్టుచప్పుడు కాకుండా పాఠశాలకు తెచ్చిపెట్టినట్లు తెలిసింది. మిగత నాలుగు కంప్యూటర్లపై విషయం తేలకపోవడంతో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసప్పను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారు. మాయమైన కంప్యూటర్లను రికవరీ చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2013–2014 విద్యా సంవత్సరంలో బీర్కూర్ మండలం దామరంచ ఉన్నత పాఠశాలలో 10 కంప్యూటర్లు మాయమైనా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విద్యాశాఖ అధికారులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దామరంచ ఉన్నత పాఠశాలలో మాయమైన కంప్యూటర్లకు, ప్రస్తుతం తాడ్కోల్ పాఠశాలలో మాయమైన కంప్యూటర్లపై లోతుగా విచారిస్తే అసలు విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. బాధ్యుడిపై సస్పెన్షన్ వేటు వేసి చేతులు దులుపుకున్న విద్యాశాఖ మరో ఉపాధ్యాయుడి పాత్ర ఉన్నట్లు అనుమానాలుపోలీసులకు ఫిర్యాదు చేస్తాం తాడ్కోల్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ల కనపడటం లేదు. ఈ విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసప్పపై సస్పెన్షన్ వేటు వేశారు. పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేస్తాం. కనిపించకుండా పోయిన కంప్యూటర్లను రికవరీ చేస్తాం. – నాగేశ్వర్రావు, ఎంఈవో, బాన్సువాడ -
వరలక్ష్మి.. వరప్రదాయినీ
నిజామాబాద్ రూరల్: శ్రావణ మాసంలో వరలక్ష్మి మాతను మహిళలు ప్రత్యేకంగా కొలుస్తుంటారు. ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వత్రాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈరోజున వరలక్ష్మి అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని, వ్రతం ఆచరించేవారు ఉపవాస దీక్ష పాటించడం శ్రేష్టమని పండితులు చెబుతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో మహిళలు నేడు వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. ఈరోజు మహిళలు ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రపరుచుకుని, ముగ్గులు తోరణాలు పెట్టి శోభాయమానంగా అలంకరిస్తారు. ధనధాన్య, విద్యా, వైద్య, సంతాన, అష్టలక్ష్మిలను పూజించిన ఫలితము ఈ ఒక్క వరలక్ష్మి ప్రతం నాడు అమ్మవారిని పూజించడంతో దక్కుతుందని పండితులు పేర్కొంటున్నారు. పూజా విధానం.. ఇత్తడి, రాగి, వెండి, బంగారు చెంబులో కొబ్బరికాయతో కలశ రూపంలో అమ్మవారిని పూజిస్తారు. కొందరు మహిళలు అమ్మవారిని ప్రార్థించి పాలు తేనె నెయ్యి వంటి వాటితో అభిషేకం నిర్వహిస్తారు. అమ్మవారికి చీరలు, రవికలు పండ్లు బెల్లం నెయ్యితో తయారుచేసిన నైవేద్యాలతో సమర్పించి యధాశక్తిగా పూజిస్తారు. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన మహిళలయితే బిందెలకు చీరలను కట్టి పూలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే విధంగా అమ్మవారిని పూజిస్తారు. వ్రతం చేసేటప్పుడు గోత్రనామాలతో సంకల్పం చేసుకుంటారు. అలాగే కలశ పూజ, గణపతి, గౌరీ పూజలను సైతం నిర్వహి స్తారు. లక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించి, అమ్మవారి నామాలతో, తామర పువ్వులతో పుష్పార్చన కుంకుమార్చన పూజలు నిర్వహించడం శ్రేష్ఠమని పండితులు విశ్లేషిస్తున్నారు. వ్రతం అనంతరం ముత్తయిదువులకు వాయినాలు ఇవ్వడం వల్ల పదికాలాలపాటు అష్టైశ్వర్యాలతో సౌభాగ్యాలతో ఉంటారని భక్తుల నమ్మకం. ఆలయాలు ముస్తాబు.. నగరంలోని దేవిరోడ్లోగల దేవీమాతా ఆలయం, వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం, లలితాదేవి ఆశ్రమాలయం, దుబ్బ మహాలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అలాగే ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నారు. నేడు వరలక్ష్మి వ్రతం శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున నిర్వహణ -
పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం
భిక్కనూరు: ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలుగుతారని భిక్కనూరు ప్రభుత్వ వైద్యురాలు యెమిమా అన్నారు. గురువారం భిక్కనూరు గురుకుల పాఠశాలలో పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. భోజనానికి ముందు చేతులను కడుక్కునే విధానం గురించి వివరించారు. విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఎంపీహెచ్ఈవో వెంకటరమణ, సూపర్వైజర్ రాజమణి, ప్రిన్సిపాల్ రఘు, ఏఎన్ఎం యాదమ్మ పాల్గొన్నారు. కస్తూర్బా వసతి గృహం తనిఖీ రామారెడ్డి: మండలంలోని కస్తూర్భా వసతి గృహాన్ని రామారెడ్డి ప్రభుత్వ వైద్యాధికారి సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ.. వసతి గృహంలో కూరగాయలు, వంట సామగ్రిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వసతి గృహంలో అనారోగ్యంతో ఉన్న పిల్లలను పరీక్షించారు. పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. సూపర్వైజర్ జానకమ్మ, ఆశవర్కర్ మంజుల పాల్గొన్నారు. -
బినామీ బండ్లపై ఫోకస్
చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ శాఖల్లో అధికారు ల వద్ద అద్దె వాహనాలు న డిపిస్తూ జీవిస్తున్నాం. వాహనాల బి ల్లులు నెలలు, ఏళ్ల తరబడి పెండింగ్లో పె డితే మా పరిస్ధితి ఏమిటి. వెంటనే బిల్లులు మంజూరు చేయాలని అధికారుల కు విన్నవించాం. అలాగే బినామీ పేర్ల మీద వాహనాలు నడిపే వారిపై కూడా చర్యలు తీసుకోవాలి. న్యాయం చేయాలి. – రాజాగౌడ్, హైర్ వెహికిల్స్ డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు● కలెక్టర్ దృష్టికి అద్దె వాహనాల వ్యవహారం ● మంజూరైన, పెండిగ్ బిల్లులపై ఆరా ● ఏవోకు వివరాలు సమర్పించిన హైర్ వెహికిల్స్ అసోసియేషన్ కామారెడ్డి క్రైం : జిల్లాలో దాదాపు సగం మందికిపైగా అధికారులు బినామీల పేర్లతో అద్దె వాహనాల బిల్లులు కాజేస్తున్నారని, బిల్లులు మంజూరు చేయడంలో ట్రెజరీ శాఖ కూడా నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. చాలా కాలంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో నడుస్తున్న బినామీ అద్దె వాహనాలు, పెండింగ్లో ఉన్న అద్దె వాహనాల బిల్లుల వ్యవహారం ఎట్టకేలకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ దృష్టికి వెళ్లింది. గత సోమవారం హైర్ వెహికల్స్ డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా, పూర్తి వివరాలు తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. తాజాగా అద్దె వాహనాల వ్యవహారంపై దృష్టి సారించిన కలెక్టర్.. పూర్తి వివరాలు ఇవ్వాలని ఏవోను ఆదేశించినట్లు తెలిసింది. ఏవో మసూర్ అహ్మద్ హైర్ వెహికల్స్ డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులను బుధవారం పిలిపించి మాట్లాడారు. దీంతో వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న అద్దె వాహనాల బిల్లులు, బినామీ పేర్లతో ఆయా శాఖల్లో అధికారుల వద్ద నడుస్తున్న వాహనాల వివరాలను అసోసియేషన్ ప్రతినిధులు ఏవోకు సమర్పించారు. వివరాలు అందజేత.. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం అధికారుల వద్ద అద్దె వాహనాలు పెట్టుకునే విఽధానాన్ని అమలు చేస్తోంది. అందుకు గాను వాహనానికి నెలకు రూ.33 వేల వరకు అద్దె చెల్లిస్తోంది. నిబంధనల ప్రకారం ప్రతి జిల్లా, డివిజన్, మండల స్ధాయి అధికారి తమ సొంత వాహనాలు కాకుండా అద్దె వాహనాలు పెట్టుకుని నడుపుకోవాల్సి ఉంటుంది. కానీ చాలామంది అధికారులు ప్రభుత్వ విధులకు తమ సొంత వాహనాలు నడిపిస్తూ బినామీ పేర్ల మీద ప్రతి నెలా బిల్లులు దండుకుంటున్నారనే ఆరోపణలు ఎంతో కాలంగా ఉన్నాయి. దీనిపై హైర్ వెహికల్స్ డ్రైవర్స్, ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా కలెక్టర్ దృష్టికి రావవడంతో చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆ శాఖల్లోనే.. బినామీ వాహనాలు ప్రధానంగా ఇరిగేషన్, మిషన్ భగీరథ, డీఆర్డీఏ, వైద్యారోగ్యం, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖల్లో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏ శాఖలో ఎన్ని బినామీ వాహనాలు ఉన్నాయనే పూర్తి వివరాలను ఏవోకు అందజేసినట్లు అద్దె వాహనాల అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. పెండింగ్ బిల్లులతో అవస్థలు.. ఆయా శాఖల్లో నిరుద్యోగులు అద్దె ప్రాతిపదికన పెట్టుకుని నడిపే వాహనాల బిల్లులు చాలా రోజులుగా రావడం లేదు. దీంతో వాహనాలు నడుపుతున్న వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. వాటిలో ప్రధానంగా మైనారిటీ సంక్షేమ శాఖలో నడుస్తున్న వాహనాలకు 30 నెలలుగా, వైద్యారోగ్య శాఖలో 11 నెలలుగా, డీఆర్డీఏలో 24 నెలులుగా, ఆర్అండ్బీలో 22 నెలలుగా, మిషన్ భగీరథలో 12 నెలలుగా, రాజంపేట ఎంపీబీవో దగ్గర నడుస్తున్న వాహనానికి 16 నెలలుగా.. ఇలా అన్ని ప్రభుత్వ శాఖల్లో నడుస్తున్న వాహనాలకు బిలుల్లు మంజూరు కావాల్సి ఉంది. బినామీ పేర్ల మీద నడిచే వాహనాలకు మాత్రం జాప్యం లేకుండా బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయనీ, నిజాయితీగా నిరుద్యోగులు నడిపే వాహనాలకు బిల్లులు ఇవ్వడం లేదని వాహనాల యజమానులు వాపోతున్నారు. పెండింగ్ బిల్లుల వివరాలు సైతం హైర్ వెహికల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఏవోకు అందజేశారు. -
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
తాడ్వాయి(ఎల్లారెడ్డి): పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని అదనపు కలెక్టర్ చందర్నాయక్ అన్నారు. ఆయన గురువారం ఎర్రాపహాడ్, నందివాడ గ్రామాలలో పర్యటించారు. మంచి నీటి ట్యాంకులను ఎప్పిటికప్పుడు కడుగుతూ శుభ్రం చేయాలన్నారు. డ్రెయినేజీలలో ఉన్న మురికి తొలగించి దోమల నివాణకు మందులను పిచికారీ చేయాలన్నారు. రోడ్లపై గుంతలు ఏర్పడినట్లయితే వెంటనే పూడ్చి వేయాలని, లేకుంటే నీరు నిలిచి దోమలు వృద్ధి చెంది ప్రజలు రోగాల బారిన పడే అవకాశముందన్నారు. మొక్కలను సంరక్షించి అవి చెట్లుగా మారే వరకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానాలను పరిశీలించారు. ఎంపీడీవో సయ్యద్ సాజీద్అలీ, తదితరులు ఉన్నారు. -
24న బస్వన్నపల్లిలో భారత్ కిసాన్ సంఘ్ శిక్షణ తరగతులు
రాజంపేట: మండల కేంద్రంలోని రైతు వేదికలో భారతీయ కిసాన్ సంఘ్ కార్యవర్గ సమావేశం గురువారం నిర్వహించినట్లు మండల అధ్యక్షులు మర్రి గోపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా ఉపాధ్యక్షులు సాయిరెడ్డి మాట్లాడుతూ.. సంఘ్ శిక్షణ తరగతులు ఈ నెల 24న బస్వన్నపల్లి గ్రామంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు, ప్రతి ఒక్క సభ్యుడు పాల్గొని రైతుల సమస్యలపై పోరాడాలన్నారు. కామారెడ్డి మండల అధ్యక్షుడు చిన్న అంజయ్య, జిల్లా విత్తన ప్రముఖ్ బోర్రెడ్డి భైరవరెడ్డి, మండల కార్యదర్శి కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ పది, ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తులుపెద్దకొడప్గల్(జుక్కల్): ఓపెన్ పది, ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నటులజి ల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్టడీ సెంటర్ అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ బి.కిషోర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏవైనా సమస్యలతో మధ్యలో బడి మానేసి 14 సంవత్సరాలు వయసు ఉంటే పది పరీక్షలకు, పది పాసై రెగ్యులర్గా ఇంటర్ చేయని వారు ఓపెన్ ఇంటర్లలో ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. ఈ అవకాశం ఈ నెల 18 వరకు మాత్రమేనన్నారు. ఇతర వివరాలకు పాఠశాలకు వచ్చి లేదా సెల్ నెంబర్ 97057 71871లకు సంప్రదించాలని సూచించారు. ప్రిప్రైమరీ పోస్టుల భర్తీలో రోస్టర్ విధానం పాటించాలికామారెడ్డి అర్బన్: జిల్లా ప్రాథమిక పాఠశాలల్లో ప్రి ప్రైమరీ పోస్టులు(71) భర్తీ రోస్టర్ కం మెరిట్ ఆధారంగా చేయాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఎం.హరిలాల్ నాయక్, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు మదన్లాల్ జాదవ్ డిమాండ్ చేశారు. గురువారం అదనపు కలెక్టర్ విక్టర్కు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. ఆవిధంగా భర్తీ చేయకపోతే ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని వివరించారు. రోస్టర్ లేకుండా నియమించిన పోస్టులను రద్దు చేసి మొత్తం ఖాళీలకు రోస్టర్ అమలు చేసి నియమించాలని కోరారు. -
ఎండీఎం కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
కామారెడ్డి టౌన్: మధ్యాహ్న భోజన(ఎండీఎం) కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం డీఈవో ఎస్.రాజుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సోఫియా మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.10 వేల గౌరవ వేతన హామీని అమలు చేయాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించాలన్నారు. కోడిగుడ్లను, వంట గ్యాస్ను ప్రభుత్వమే సరఫరా చేయాలని, యూనిఫాం, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోపునూరు చక్రపాణి, కార్మికులు సంగీత, హేమలత, రాజేశ్వరి, సాయిలు, సువర్ణ, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. -
చేనేత కార్మికులకు కేంద్రం అండ
దోమకొండ: చేనేత కార్మికులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం దోమకొండ మండల కేంద్రంలో గడికోట ట్రస్టు ఆధ్వర్యంలో స్థానిక ఆనంద్భవన్లో ఏర్పాటు చేసిన కార్యకమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తుందని, చేనేతలకు రుణం, ఇన్సూరెన్స్ సదుపాయాలు అందిస్తుందన్నారు. స్థానిక ఆనంద్భవన్లో మగ్గాలను ఏర్పాటు చేసి బట్టలను నేయడం, వాటిని ఇతర ప్రాంతాలకు పంపించి అమ్మకాలు చేయడం పట్ల ట్రస్టు ప్రతినిధులను అభినందించారు. చేనేత కార్మికులకు తనవంతుగా ఎలాంటి అవసరం ఉన్నా ఆదుకుంటానని వారికి హామీ ఇచ్చారు. చేనేత మహిళా కార్మికులను శాలువాతో సన్మానించారు. చేనేత జెండాను ఎగురవేశారు. గడికోట వారసులు కామినేని అనిల్కుమార్, అపోలో ఆస్పత్రుల డైరెక్టర్ కామినేని శోభన, గడికోట ట్రస్టు మేనేజర్ బాబ్జీ, మాజీ జెడ్పీటీసీ తిర్మల్గౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు భూపాల్రెడ్డి, మాజీ సర్పంచ్ నల్లపు అంజలి, చాముండేశ్వరి ఆలయ కమిటీ చైర్మన్ సిద్దారెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు కంది మనోజ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యుడు రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు రాఖీలు కట్టిన మహిళలు కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్రీయ సేవికా సమితి ఆధ్వర్యంలో మహిళలు రాఖీలు కట్టారు. మహిళలకు అన్ని విధాలుగా సోదరుడిగా అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గల్ఫ్ సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించాలి రామారెడ్డి: గల్ఫ్ కార్మికులు ఆయా దేశాల్లో ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రస్తావించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని కోరినట్లుగా గల్ఫ్ సమాఖ్య మండలాధ్యక్షుడు బండ సురేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను గురువారం క్యాంప్ కార్యాలయంలో కలిశారు. సన్మానించి గల్ఫ్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలిపారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి -
నాట్లు వేసేప్పుడు ఎందుకు అడ్డుకోలేదు?
గాంధారి(ఎల్లారెడ్డి): అటవీశాఖ భూమిలో వరి నాట్లు వేసేప్పుడు ఎందుకు అడ్డుకోలేదని సంబంధిత అధికారులను ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థిసంహారెడ్డి ప్రశ్నించారు. మండల పరిధిలోని సీతాయిపల్లి గ్రామాన్ని తహసీల్దార్ రేణుకాచౌహాన్, ఎఫ్ఆర్వో హేమచందనతో కలిసి ఆర్డీవో గురువారం సందర్శించారు. గండిమైసమ్మ అటవీప్రాంతంలో రైతులు కోరే పెద్ద మల్లయ్య, చిన్న మల్లయ్య సాగు చేస్తున్న వరి పొలంపై అటవీఅధికారులు గడ్డిమందు పిచికారీ చేయగా, పొలాన్ని ఆర్డీవోతోపాటు అధికారులు గురువారం పరిశీలించారు. రైతులు, గ్రామస్తులతో మాట్లాడి భూమి వివరాలు తెలుసుకున్నారు. భూమి అటవీ శాఖకు చెందినదైతే రైతులు గత కొన్నేళ్ల నుంచి ఎలా సాగు చేస్తున్నారన్నారు. పొలంపై గడ్డి మందు పిచికారి చేయడం సరికాదన్నారు. ఈ ఘటనపై లోతుగా విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో అన్నారు. ఆయనవెంట అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు ఉన్నారు.నిషేధిత గడ్డి మందు పిచికారీప్రభుత్వం నిషేధించిన గడ్డిమందును ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరు విక్రయించారని గ్రామస్తులు ప్రశ్నించారు. నిషేధించిన మందులను విక్రయిస్తే వ్యవసాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారని అన్నారు. విక్రయించిన వారు, తెచ్చిన వారు, పిచికారీ చేసిన వారిని బాధ్యులను చేసి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.బాధ్యులపై చర్యలు తీసుకోవాలి..నాటు వేసిన వరి పొలంలో గడ్డిమందు పిచికారి చేసి ధ్వంసం చేసిన అటవీశాఖ అధికారులపై చ ర్యలు తీసుకుని పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ సీతాయిపల్లి గ్రా మ రైతులు అదనపు కలెక్టర్ విక్టర్కు వినతిప త్రం అందజేశారు. గత 30 ఏళ్లుగా గ్రామ శివారులోని గండిమైసమ్మ కుంట ప్రాంతంలో సు మారు ఏడు ఎకరాల భూమిని సాగు చేస్తున్నా మన్నారు. సదరు భూమిని సాగు చేసిన రైతు త న భూమిని కుర్మసంఘానికి అప్పగించి గ్రామం విడిచి వలస వెళ్లాడని, సంఘం సభ్యుల నుంచి కోరె పెద్ద మల్లయ్య, చిన్న మల్లయ్య కౌలుకు తీ సుకుని వరి సాగు చేస్తున్నారన్నారు. అయితే అ టవీ శాఖ అధికారులు వరి సాగు చేసిన భూమి అటవీ శాఖకు చెందినదని పొలంపై గడ్డి మందు పిచికారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. -
అండర్పాస్ బ్రిడ్జి నిర్మించాలని వినతి
దోమకొండ: భిక్కనూరు మండలం బీటీఎస్ చౌరస్తా వద్ద దోమకొండకు వెళ్లే దారిలో అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతూ గురువారం ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికి కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. దోమకొండ, బీబీపేట మండలాలతో పాటు సిద్దిపేట జిల్లాకు వెళ్లే దారి కావడంతో అండర్పాస్ బ్రిడ్జి లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చొరవ తీసుకుని పనులు జరిగేలా చూడాలని వారు కోరారు. మాజీ జెడ్పీటీసీ తీగల తిర్మల్గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనంతరెడ్డి, మాజీ సర్పంచ్ నల్లపు అంజలి, తదితరులు ఉన్నారు. -
పోడు భూముల సమస్యలు పరిష్కరించాలి
మాచారెడ్డి: అక్కాపూర్లో పోడు భూముల సమస్యను పరిష్కరించి హక్కు పత్రాలు ఇవ్వాలని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ రాష్ట్ర సెక్రెటేరియట్ సభ్యుడు వి.ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం అక్కాపూర్లో అటవీ అధికారులు ధ్వంసం చేసిన రైతుల పంటలను పరిశీలించి మాట్లాడారు. యాబై ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వకుండా వారేసిన పంటలను ధ్వంసం చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ కామారెడ్డి జిల్లా కార్యదర్శి రామకృష్ణ, నాయకులు దేవరాం, రమేశ్, ప్రకాశ్, సురేశ్, కిషోర్, బాబన్న, దామోదర్, లింబన్న, తదితరులు ఉన్నారు. -
సకాలంలో వైద్యం అందడం లేదు
పెద్దకొడప్గల్(జుక్కల్): పశువుల డాక్టర్ అందుబాటులో ఉండటం లేదని, పశువులకు సకాలంలో వైద్యం అందడంలేదని ఆరోపిస్తూ బుధవారం పశువుల దవాఖాన ముందు పశుపోషకులు నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ దశరథ్కు పశువైద్యులు అందుబాటులో ఉండడం లేదని వినతి పత్రం అందజేశారు.ఈసందర్భంగా రైతులు మాట్లాడుతూ..మండల కేంద్రంలోని వైద్యశాలకు ఎప్పుడూ తాళం వేసి ఉంటుందని పేర్కొన్నారు. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలకు రోగాలు వచ్చి వైద్యం అందక చనిపోతున్నాయని వాపోయారు. ప్రైవేట్ వైద్యులను సంప్రదిస్తే రూ.వేలల్లో ఖర్చు అవుతున్నాయని అన్నారు. వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. కాలం చెల్లిన మందులు.. ప్రభుత్వ పశువైద్యశాలలో కాలం చెల్లిన మందులు ఫ్రిడ్జ్లో నిల్వ ఉన్నాయి.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే రూ.లక్షల విలువైన మందులు వృథా అవుతున్నా యని ఆరోపించారు. గతంలో కూడా కాలం చెల్లిన మందుల గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని, ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని మండల పశుపోషకులు కోరుతున్నారు. -
గంజాయి తరలిస్తున్న నలుగురి అరెస్టు
ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలో గంజాయి తరలిస్తున్న నలుగురి నిందితులను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ స్వప్న తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బుధవారం నగరంలోని అర్సపల్లి ప్రాంతంలో ఓ కారులో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో నలుగురు నిందితులు పట్టుబడగా వారు హైదరాబాద్కు చెందిన మహమ్మద్ మునావర్, మహమ్మద్ ఇర్ఫాన్, అమీర్ పాషా, నిజామాబాద్లోని ముజాయిత్నగర్కు చెందిన అన్వర్గా పోలీసులు గుర్తించారు. కారులో రెండు కిలోల వంద గ్రాముల ఎండు గంజాయి లభించిందని అన్నారు. నిందితులను అరెస్టు చేసి కారును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. దాడిలో ఎస్సైలు రామ్కుమార్, చారి, సిబ్బంది హమీద్, శివ, రాజన్న, భోజన్న, ఆశన్న, రాంబచన్, సాయిప్రసాద్ పాల్గొన్నారు. -
లబ్ధిదారులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి
దోమకొండ/భిక్కనూరు: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్తో కలిసి దోమకొండ మండలంలోని గొట్టిముక్కల గ్రామంలో, భిక్కనూరు మండలంలోని బస్వాపూర్, భిక్కనూరులలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఇసుక సరఫరా, బిల్లుల చెల్లింపు అంశాలపై లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉచితంగా ఇసుక సరఫరా అయ్యేలా చూడాలని, దశలవారీగా నిర్మాణం జరిగిన కొద్దీ బిల్లులు వెంటనే లబ్ధిదారులకు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హౌసింగ్ ఇంజినీర్లు నాణ్యతగా ఇల్లు నిర్మాణం జరిగేలా చూడాలన్నారు. దోమకొండలో జిల్లా అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, హౌసింగ్ పీడీ విజయ్పాల్రెడ్డి, ఆర్డీవో వీణ, హౌసింగ్ డీఈ సుభాష్, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, భిక్కనూరులో ఎంపీడీవో రాజ్కిరణ్ రెడ్డి, పంచాయతీ ఈవో మహేశ్గౌడ్, పంచాయతీ కార్యదర్శి దయాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం -
హైదరాబాద్కు తరలిన మధ్యాహ్న భోజన కార్మికులు
మద్నూర్(జుక్కల్): తమ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలంటూ మద్నూర్, డోంగ్లీ మండలాల మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు హైదరాబాద్లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి తరలివెళ్లారు. ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నేత సురేష్ గొండ మాట్లాడుతూ.. భోజన నిర్వహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికుల అరెస్టు లింగంపేట(ఎల్లారెడ్డి): పెండింగ్ బిల్లుల సాధన కోసం బుధవారం హైదరాబాదుకు వెళ్తున్న మధ్యాహ్న భోజన కార్మికులను లింగంపేటలో అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడారు. తమ న్యాయమైన కోర్కెల సాధన కోసం శాంతి యుతంగా నిరసన తెలపడానికి చలో హైదరాబాద్ కార్యక్రమం చేపడితే తమను అరెస్టు చేయడం శోచనీయమన్నారు. కిష్టయ్య, శ్రీరామ్, లక్ష్మీబాయి ఉన్నారు. -
త్యాగశీలి ప్రొఫెసర్ జయశంకర్
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి క్రైం: తెలంగాణ సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప త్యాగశీలి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ అని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా బుధవారం కలెక్టరేట్లో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రొఫెసర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అన్ని రంగాలలో వెనుకబడిన తెలంగాణ సమాజాన్ని చైతన్య పరచడానికి జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. తన రచనలు, ప్రసంగాల ద్వారా సమాజాన్ని తట్టి లేపి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమానికి ఊపిరి పోశారన్నారు. కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్గా వేలాది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి మార్గదర్శకంగా నిలిచారని కొనియాడారు. అదనపు కలెక్టర్ విక్టర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, టీఎన్జీవో, టీజీవో ప్రతినిధులు పాల్గొన్నారు. -
క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన
గాంధారి(ఎల్లారెడ్డి): పోతంగల్ కలాన్, గుజ్జుల్ తండా శివారులో బుధవారం క్షేత్రస్థాయిలో మొక్కజొ న్న, వరి పంటలను పరిశీలించినట్లు ఏవో రాజలింగం తెలిపారు. మొక్కజొన్నలో మొగి పురుగు, రసం పీల్చే పురుగు ఆశించినట్లు గుర్తించామన్నారు. ఈ పురుగుల నివారణకు హెమామెక్టిన్ బెంజాయిట్ 18.5 ఎస్జీ ఎకరానికి 200 గ్రాములు, క్లోరాంత్రనిప్రోల్ 100 మి.లీ. ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. వరిలో టెట్రాసైక్లిన్, కాపర్ ఆక్సీక్లోరైడ్, స్టెప్రోసైక్లిన్ 600 గ్రాములు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. ఎకరానికి 4 కి.గ్రా. పతేరా గుళికలు ఇసుకలో కలిపి చల్లాలని సూచించారు. తాడ్వాయి మండలం దేవాయిపల్లిలో.. తాడ్వాయి(ఎల్లారెడ్డి): దేవాయిపల్లి శివారులో పంటలను బుధవారం ఏవో నర్సింలు పరిశీలించారు. పంటల రక్షణలో రైతులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. మొక్కజొన్న పంటలో అక్కడక్కడ కత్తెర పురుగు ఉధృతి అధికంగా ఉందని, దానికి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. యూరియా వాడకాన్ని తగ్గించి నానో యూరియా స్ప్రే చేయాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పైడి సంజీవరెడ్డి మొక్కజొన్న పంటలో నానో యూరియా, నానో పొటాష్ను డ్రోన్ ద్వారా పిచికారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏఈవో రమ్య, రమేష్రెడ్డి, రైతులు ఉన్నారు. -
మెనూ ప్రకారం భోజనం అందించాలి
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను బుధవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని, ప్రతి రోజు సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని సూచించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి ఉపాధ్యాయులు అందరు కృషి చేయాలని కోరారు. పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలని ప్రిన్సిపాల్ రాగిణిని ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సబ్ కలెక్టర్ భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్ వేణుగోపాల్, ప్రిన్సిపాల్ రాగిణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.ఏబీవీపీ ఆధ్వర్యంలో రక్షాబంధన్కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ పాఠశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు రాఖీలు కట్టారు. సోదరీ, సోదరుల అనుబంధ గురించి వివరించారు. ఏబీవీపీ నాయకులు పవన్, దత్తారెడ్డి, అల్తాఫ్, సంజయ్, అంజి, విష్ణు, కృష్ణ, శ్రీకాంత్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మకత సదస్సుతాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో బుధవారం గ్రామీణ విశ్లేషణాత్మకత సదస్సును నిర్వహించారు. మహాజ్యోతిబాపూలే ప్రభుత్వ వ్యవసాయ కళాశాల, కరీంనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు పలు కార్యక్రమాలను చేపట్టారు. సోషల్ మ్యాప్, రిసోర్స్ మ్యాప్, టైంలైన్, ట్రాన్సాక్ట్వాక్, సీజ నాలిటీ చార్టు వంటి పద్ధతుల ద్వారా గ్రామ వాస్తవిక పరిస్థితులను అధ్యయనం చేశారు. రైతుల జీవన శైలి, గ్రామవనరులపై సమాచారాన్ని సేకరించారు. విద్యార్థులు, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.సీసీ రోడ్డు పనులు ప్రారంభంనస్రుల్లాబాద్: మండల కేంద్రంలో సీసీ రోడ్డు పనులను బుధవారం తహసీల్దార్ సువర్ణతో కలిసి ఏఎంసీ చైర్మన్ దుర్గం శ్యామల ప్రారంభించారు. నాణ్యత లోపం లేకుండా పనులు చేపట్టాలన్నారు. పనులకు రూ.12లక్షల ఎస్డీఎఫ్ నిధులను కేటాయించామన్నారు. నాయకులు పాల్త్య విఠల్, రాము, మాజీద్, కంది మల్లేష్, తదితరులు ఉన్నారు.దోమల నివారణకు చర్యలు తీసుకోవాలిభిక్కనూరు: మండల కేంద్రంలో దోమల తీవ్రత ఎక్కువ ఉన్నందున నివారణ చర్యలు చేపట్టాలని కోరుతూ బుధవారం ఎంపీడీవో రాజ్కిరణ్రెడ్డికి ఆర్టీఐ ప్రతినిధి రవీందర్ వినతి పత్రం సమర్పించారు. ఆర్టీఐ ప్రతినిధులు కర్నాల శ్రీనివాస్, రాజశేఖర్ తదితరులున్నారు. -
క్రైం కార్నర్
పాముకాటుతో యువకుడి మృతి బాన్సువాడ రూరల్: మండలంలోని తిర్మలాపూర్కు చెందిన వరగంతం రాజు (25) అనే యువకుడు పాముకాటుతో మృతి చెందినట్లు బాన్సువాడ సీఐ మండల అశోక్ తెలిపారు. దినసరి కూలి అయిన రాజు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటివద్దే ఉంటున్నాడు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాముకాటు వేయడంతో గమనించిన కుటుంబీకులు వెంటనే చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి తల్లి భూమవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అశోక్ తెలిపారు. అనారోగ్యంతో వృద్ధురాలి ఆత్మహత్య రెంజల్: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రెంజల్ మండలం దూపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పొతరాజు చిన్న గంగామణి(57) అనే వృద్ధురాలు ఇంట్లో ఒక్కరే ఉంటున్నారు. ఆమె ఐదేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతోంది. ఆస్పత్రుల్లో చూయించినా నయం కావడం లేదు. దీంతో జీవితంపై విరక్తితో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుమార్తె దేవ గంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని షేక్ చాంద్ హోటల్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న రాజారాందుబ్బాకు చెందిన దాసరి పోశెట్టిని అరెస్ట్ చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు. పక్కా సమాచారం మేరకు దాడి చేసి నిందితుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు నిజామాబాద్కు చెందిన ఆటో డ్రైవర్ బాబాఖాన్ వద్ద కొనుగోలు చేసి బాన్సువాడలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. పోశెట్టి నుంచి 275 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. పోశెట్టిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. -
ప్రైవేటు ఆస్పత్రికి నోటీసు
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి జిల్లా వైద్యాధికారులు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల క్రితం బిచ్కుంద మండలానికి చెందిన ఓ బాలుడికి జ్వరం రావడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు బాలుడిని నిజామాబాద్కు తీసుకెళ్లారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో బాన్సువాడలోని ఓ ప్రైవేటు ఆస్ప త్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందినట్లు బాలుడి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఆందోళన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసు కుని సముదాయించారు. జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి బాధ్యత రహితంగా వ్యవహరించినట్లు నిర్ధారించి ఆస్పత్రికి నోటీసు జారీ చేశారు. మూడు రోజుల్లో ఆస్పత్రిని మూసివేయాలని సూచించినట్లు తెలిసింది. ప్రమాద స్థలం పరిశీలన పెద్దకొడప్గల్(జుక్కల్): మండల కేంద్రంలోని జాతీయ రహదారి–161పై వారం రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని, అలాగే 20 రోజుల కింద మండలంలోని పోచారం చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని బుధవారం తహసీల్దార్ దశరథ్తో కలిసి సీఐ రవీందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ప్రమాదాలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏఎంవీఐ రజిని, ఎస్సై అరుణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మున్నూరు కాపు రాష్ట్ర రైతు విభాగం ఉపాధ్యక్షుడిగా భాస్కర్ సదాశివనగర్(ఎల్లారెడ్డి): కుప్రియాల్ గ్రామాని కి చెందిన గడీల భాస్కర్ను మున్నూరు కాపు సంఘం రాష్ట్ర రైతు విభాగం ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా నియామక పత్రాన్ని బుధవారం అందజేశారు. భాస్కర్ మాట్లాడుతూ.. మున్నూరు కాపుల సంక్షేమం కోసం కషి చేస్తానని పేర్కొన్నారు. పదవిని అప్పగించినందుకు రాష్ట్ర, జిల్లా కార్యవర్గానికి ప్రత్యేక కతజ్ఞతలు తెలిపారు. -
అల్బెండజోల్ మాత్రలను వేయించాలి
కామారెడ్డి టౌన్: జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఈనెల 11న జిల్లాలో 19 ఏళ్లలోపు ఉన్న ప్రతి ఒక్కరికి అల్బెండజోల్ మాత్రలను వేయించాలని అదనపు కలెక్టర్ చందర్నాయక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని 19 ఏళ్లలోపు విద్యార్థులు అల్బెండజోల్ మాత్రలు వేసుకునేలా విద్య, మున్సిపల్ శాఖల అధికారులు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్వో చంద్రశేఖర్, డీసీహెచ్ఎస్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సదా మీసేవలో..
● వీపీవో వ్యవస్థ బలోపేతానికి చర్యలు ● పోలీసుల ఫోన్ నంబర్లతో వాల్రైటింగ్సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో పోలీసుల పనితీరు మెరుగుపరిచేలా ఎస్పీ రాజేశ్ చంద్ర పలు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు పోలీసుల సేవలు మరింతగా చేరువవ్వాలన్న ఉద్దేశంతో గ్రామ పోలీసు అధికారి (వీపీవో) వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. గ్రామ పోలీసు అధికారి ఆ గ్రామంలో అందరితో కాంటాక్ట్లో ఉండాలని, నెట్వర్క్ను బలోపేతం చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామ పోలీసు అధికారులుగా పనిచేస్తున్న కానిస్టేబుళ్లు తమ ఫోన్ నంబర్లను ఆయా గ్రామాల్లో వివిధ వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ చేయించుకున్నారు. వాట్సాప్ గ్రూపులలో చేసే పోస్టింగులు, జరిగే సంభాషణలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులకు సమాచారం చేరవేస్తున్నారు. వీపీవో వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా ఆయా గ్రామాల్లో ప్రధాన కూడళ్ల వద్ద అందరికీ తెలిసేలా ‘సదా మీ సేవలో’ అంటూ గ్రామ పోలీసు అధికారి ఫోన్ నంబరు, పేరు, ఎస్సై ఫోన్ నంబరు, పోలీస్ స్టేషన్ ఫోన్నంబర్లను రాయిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా వాల్రైటింగ్ చేపట్టారు. ఏ ఆపద ఉన్నా, ఏదైనా సమాచారం ఉన్నా పోలీసు అధికారులకు సమాచారం చేరేలా నంబర్లను ఊరూరా రాయిస్తున్నారు. తద్వారా గ్రామాల్లో జరిగే ఘర్షణలు, అసాంఘిక కార్యకలాపాలు, రాజకీయ గొడవలు.. ఇలా అన్ని విషయాలు ముందుగానే పోలీసులకు తెలిసేందుకు అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. -
కరుణించని వరుణుడు
వర్షాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలవుతోంది. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన దాఖలాలు లేవు. అప్పుడప్పుడు జల్లులు, ఓ మోస్తరు వర్షం కురవడం తప్ప పెద్ద వానల జాడలేదు. సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డివర్షాలపైనే ఆధారపడి సాగు చేస్తున్న ఆరుతడి పంటలు సరైన వర్షాలు లేకపోవడంతో ఆరిపోతున్నాయి. జిల్లాలో ముఖ్యంగా జుక్కల్, మద్నూర్, పెద్దకొడప్గల్, బిచ్కుంద, పిట్లం మండలాల్లో ఎక్కువ విస్తీర్ణంలో సోయా, పత్తి, పప్పు దినుసుల పంటలు సాగు చేశారు. పది రోజులుగా సరైన వర్షాలు లేకపోవడంతో చాలా గ్రామాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. గాంధారి, సదాశివనగర్, రామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, బీబీపేట, దోమకొండ, భిక్కనూరు, కామారెడ్డి, తాడ్వాయి, లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల్లోనూ వర్షాలపై ఆధారపడి మక్క, పత్తి, సోయా తదితర పంటలు వేశారు. ఆయా మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.పెద్దకొడప్గల్లో వర్షం లేక దెబ్బతింటున్న సోయా పంటరోహిణి కార్తెకు ముందు వర్షాకాలాన్ని తలపించేలా వానలు కురిపించిన వరుణుడు.. అసలు సీజన్లో ముఖం చాటేశాడు. అడపాదడపా జల్లులు, అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం మినహా.. జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు కురియలేదు. దీంతో జిల్లాలోని జలాశయాలు వెలవెలబోతున్నాయి. జిల్లాలో సాధారణ వర్షపాతం 442.6 మి.మీ.కాగా.. ఇప్పటివరకు 391.9 మి.మీ. వర్షపాతమే నమోదయ్యింది. అంటే సాధారణంకన్నా 11 శాతం తక్కువగా వర్షాలు కురిశాయి. ఎనిమిది మండలాల్లో పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. ఆయా మండలాల్లో సాధారణంకన్నా 20 శాతంకంటే తక్కువ వర్షపాతం నమోదయ్యింది. దీంతో ఆయా మండలాల్లో వానాకాలం పంటలు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా జుక్కల్ నియోజకవర్గంలోని మద్నూర్, జుక్కల్, పెద్దకొడప్గల్, బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్ మండలాలతోపాటు ఎల్లారెడ్డి, బీబీపేట మండలాల్లోనూ దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటున్నాయి. నిండని చెరువులు.. జిల్లాలో చెరువులు, కుంటలు 1,425 ఉన్నాయి. 675 చెరువుల్లో 25 శాతం మేర నీరు వచ్చినట్టు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. 25 శాతం నుంచి 50 శాతం దాకా వచ్చినవి 429 చెరువులు. 50 శాతం నుంచి 75 శాతం దాకా నిండినవి 159 కాగా.. 75 శాతం నుంచి 100 శాతం దాకా నిండినవి 123 చెరువులు ఉన్నాయి. పూర్తిగా నిండి అలుగులు పారినవి 39 చెరువులే.. కాగా గత ఏడాది ఇప్పటికే చెరువులు, కుంటలన్నీ అలుగులు పారాయి. ఈసారి లోటు వర్షపాతం నమోదు కావడంతో పరిస్థితి దారుణంగా ఉంది. మెజారిటీ చెరువులు నీరు లేక వెలవెలబోతున్నాయి. వాగులు పొంగింది కూడా అంతంతమాత్రమే. దీంతో భూగర్భ జలమట్టం కూడా పెద్దగా వృద్ధి చెందలేదు.జిల్లాలో అత్యల్ప వర్షపాతం నమోదైన మండలాల వివరాలు..మండలం సాధారణం నమోదు వ్యత్యాసం (మి.మీ.) (మి.మీ.) (శాతం) పెద్దకొడప్గల్ 434.4 271.7 –37.5 పిట్లం 408.1 279.3 –31.5 నిజాంసాగర్ 435.5 300.2 –30.7 ఎల్లారెడ్డి 499.2 348.9 –30.1 బిచ్కుంద 441.7 339.1 –23.2 మద్నూర్ 422.7 330.4 –21.8 బీబీపేట 447.2 352.4 –21.2 జుక్కల్ 420.1 333.2 –20.7ప్రాజెక్టులు వెలవెల..తడి‘ఆరు’తోంది... జిల్లాలో 11 శాతం లోటు వర్షపాతం ఎనిమిది మండలాల్లో ఇబ్బందికర పరిస్థితి వెలవెలబోతున్న ప్రాజెక్టులు చెరువులు, కుంటల పరిస్థితీ అంతే... ఆందోళనలో రైతాంగంజిల్లాలో ప్రాజెక్టుల పరిస్థితి కూడా చెరువుల్లాగే ఉంది. ఎగువన వర్షాలు లేకపోవడంతో మంజీర నది పారడం లేదు. దీంతో నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టుల్లోకి నీరు రావడంలేదు. ఉన్న నీటిని తడుల కోసం వదులుతున్నారు. కౌలాస్ నాలా పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. వరుణుడు ఎప్పుడు కరుణిస్తాడో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు ఎప్పుడు నిండుతాయోనని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. -
కార్పొరేట్ శక్తులకు కేంద్రం వత్తాసు
కామారెడ్డి టౌన్: కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. బుధవారం కామారెడ్డి వీక్లీ మార్కెట్లోని మున్నూరుకాపు సంఘ భవనంలో సీపీఐ జిల్లా మూడో మహాసభలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుందని, ధనిక వర్గానికి మేలు చేస్తూ పేద, మధ్య తరగతి కుటుంబాలను విస్మరిస్తోందని విమర్శించారు. ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రశ్నించే గొంతులు, మావోయిస్టులు, అర్బన్ నక్సలైట్లు, దేశ పౌరులను చంపే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ధనికులు అంబానీ, అదానీకి మేలు చేసే విధంగా పాలన సాగిస్తున్నాడని ఆరోపించారు. దేశంలోని 90 శాతం నిరుపేదలను విస్మరిస్తూ, 10 శాతం ధనిక వర్గం కార్పొరేట్ శక్తులకు ప్రధాని మోదీ పని చేస్తున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాసభల్లో భాగంగా పట్టణంలోని ఆర్అండ్బీ అతిథి గృహం నుంచి వీక్లీ మార్కెట్ వరకు ర్యాలీ తీశారు. మహాసభలలో ిసీపీఐ జాతీయ నాయకురాలు పశ్య పద్మ, రాష్ట్ర నాయకులు వీఎల్. నర్సింహారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంజర భూమన్న, సీపీఐ జిల్లా కార్యదర్శి దశరథ్, ఉపాధ్యక్షులు బాలరాజ్, దుబాస్ రాములు, నాయకులు దేవయ్య, ఈశ్వర్, నాగమణి, మల్లేష్, రాజమణి, గంగాధర్, రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు -
రైతు ఆత్మహత్యాయత్నం
గాంధారి: అటవీ భూమిలో సాగు చేసిన పంటను ధ్వంసం చేయడానికి అధికారులు గడ్డిమందు పిచికారి చేయగా.. ఆ భూమిని సాగు చేసిన రైతు ఆవేదనతో ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామస్తులు, ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సీతాయిపల్లి శివారులోని గండిమైసమ్మ కుంట అటవీ ప్రాంతంలో ఇరవై ఏళ్ల నుంచి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి పంటలు పండిస్తున్నాడు. అతడికి అప్పులు ఉండడంతో ఆ భూమిని కుర్మ సంఘానికి అప్పగించి, ఊరు విడిచి వలసవెళ్లాడు. అదే సామాజికవర్గానికి చెందిన కోరె పెద్దమల్లయ్య, చిన్నమల్లయ్య ఆ భూమిని కౌలుకు తీసుకుని వరి వేశారు. బుధవారం అధికారులు ఆ పంటపై గడ్డిమందు పిచికారి చేయించారు. అనంతరం ఫిర్యాదు చేయడంకోసం అటవీ అధికారులు, రైతులు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఈ క్రమంలో చిన్నమల్లయ్య వరిపై పిచికారి చేసిన గడ్డి మందును వెంట తీసుకుని వెళ్లి స్టేషన్లో తాగాడు. దీనిని గమనించిన గ్రామస్తులు వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కామారెడ్డికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచనతో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కాగా అటవీ భూమిని ఆక్రమించి పంటలు సాగుచేస్తున్నారని, వారించబోగా తమపై దాడికి ప్రయత్నించారని అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ అరుణ.. కోరె మల్లయ్యతోపాటు మరికొందరిపై ఫిర్యాదు చేశారని ఎస్సై ఆంజనేయులు తెలిపారు. తమ పంటలను కావాలని నాశనం చేశారని అటవీ అధికారులపై సీతాయిపల్లి రైతులు ఫిర్యాదు చేశారన్నారు. -
ట్రాక్ కెమెరాలో చిరుత దృశ్యాలు
మాచారెడ్డి: అక్కాపూర్ అటవీ ప్రాంతంలో లేగదూడపై దాడి చేసి చంపిన చిరుతను గుర్తించేందుకు అటవీ అధికారులు మూడు చోట్ల ట్రాక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి ట్రాక్ కెమెరాలో చిరుత కదలికలు రికార్డయ్యాయని మాచారెడ్డి ఇన్చార్జి ఎఫ్ఆర్వో రమేశ్ తెలిపారు. చంపిన లేగదూడను తినేందుకు మళ్లీ వచ్చిందని పేర్కొన్నారు. పరిసర గ్రామాల ప్రజలు రాత్రి వేళల్లో అటవీ ప్రాంతంలో సంచరించవద్దని సూచించారు. ‘317 జీవోను రద్దు చేయాలి’ బాన్సువాడ : ప్రభుత్వం 317 జీవోను రద్దు చేసి ఉపాధ్యాయులను వారి స్థానిక జిల్లాలకు కేటాయించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంద్రనాథ్ ఆర్య డిమాండ్ చేశారు. బుధవారం బాన్సువాడలో తపస్ సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో మాట్లాడారు. విద్యాసంస్థలలో నెలకొన్న సమస్యలను, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో తపస్ ప్రతినిధులు తారాచంద్, కృష్ణ, వేదప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ‘ఉత్తమ ఫలితాలు సాధించాలి’ బాన్సువాడ : ఇంటర్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్ దాసరి ఒడ్డెన్న సూచించారు. బుధవారం బాన్సువాడ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను ఆయన సందర్శించారు. ఉదయం ప్రార్థన సమయానికి వచ్చి విద్యార్థులతో పాటు ప్రార్థన చేశారు. గతేడాది ఇంటర్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. అధ్యాపకులతో సమావేశమై మాట్లాడారు. గతేడాదికంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెంచాలని సూచించారు. యూనిట్ టెస్టులపై అధ్యాపకులతో మాట్లాడారు. వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ అసద్ ఫారూఖ్, నోడల్ అధికారి సలాం, అధ్యాపకులు శివకుమార్, శ్రీనివాస్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ ధర్నాలో జిల్లా నేతలు కామారెడ్డి టౌన్: బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ బుధవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వేదికగా ధర్నా నిర్వహించింది. ఇందులో జిల్లాకు చెందిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, ఎల్లారెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు మదన్మోహన్రావు, తోట లక్ష్మీకాంతారావు, కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ ఇందుప్రియ పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’లో కామారెడ్డి ఫస్ట్
కామారెడ్డి క్రైం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రగతిలో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ సెక్రెటరీ, ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు. బుధవారం ఆయన జిల్లాలో పర్యటించారు. భిక్కనూరు, దోమకొండ మండలాల్లో పర్యటించి నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై అధికారులతో సమీక్షించారు. లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకునేలా చూడడంతోపాటు సకాలంలో బిల్లులు చెల్లించడం, క్లస్టర్ వారీగా అధికారులను నియమించి సమీక్షలు నిర్వహించడం, క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ నిర్మాణాలను పర్యవేక్షిస్తుండడంతో కామారెడ్డి జిల్లా ఇందిరమ్మలో అగ్రస్థానంలో ఉందన్నారు. ఈ దిశగా కృషి చేసిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను, అధికార యంత్రాంగాన్ని అభినందించారు. భిక్కనూరులో మాదిరిగా ఫిల్టర్ రూఫ్ పద్ధతిలో నిర్మించుకుంటే నిర్మాణ వ్యయం తగ్గడమే కాకుండా ఇల్లు వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చ గా ఉంటుందన్నారు. దీనిపై లబ్ధిదారులు, ఇందిర మ్మ కమిటీ సభ్యులు, మేసీ్త్రలకు అవగాహన కల్పించాలన్నారు. ఇసుక సమస్య రాకుండా హౌసింగ్, రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు సమన్వయం చేసుకొని ఉచితంగా ఇసుక టోకెన్లు అందించాలన్నారు. రవాణా చార్జీలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర మాత్రమే చెల్లించేలా చూడాలన్నారు. మండల స్థాయి ధరల నియంత్రణ కమిటీల ద్వారా కంకర, ఐరన్, సిమెంటు, ఇటుకలు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మట్టి గట్టిగా ఉంటుందని, ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో పిల్లర్స్ తప్పనిసరి కాదని పేర్కొన్నారు. మట్టి గట్టిగా ఉన్న చోట్ల ప్లింత్ బీమ్తో నిర్మాణం చేపట్టవచ్చన్నారు. లబ్ధిదారులుగా అనర్హులను ఎంపిక చేసినట్లు గుర్తిస్తే పనులు ఏ స్థాయిలో ఉన్నా నిలిపివేసి సంబంధిత అధికారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ల సమస్యను పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం కృషి చేయాలని సూచించారు.11,883 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు..జిల్లావ్యాప్తంగా 12,090 ఇళ్లు నిర్మించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. వాటిలో ఇప్పటివరకు 11,883 ఇళ్లు మంజూరు చేశామని, ఇందులో 5,721 ఇళ్లకు ముగ్గు పోసి పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 2,182 ఇండ్లు బేస్మెంట్ వరకు, 66 ఇండ్లు రూఫ్ స్ధాయి వరకు చేరాయన్నారు. ఒక ఇంటి నిర్మాణం పూర్తయ్యిందన్నారు. 2,111 ఇళ్లకు నిర్మాణ దశను బట్టి బిల్లులు చెల్లించామన్నారు. 431 మందికి మహిళా సంఘాల ద్వారా బ్యాంకు లింకేజీ రుణాలను అందించామని వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్ నాయక్, ఆర్డీవో వీణ, హౌసింగ్ పీడీ విజయ్పాల్రెడ్డి, డీఈ సుభాష్, ఏఈలు, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. అన్ని ప్రాంతాల్లో పిల్లర్లు తప్పనిసరి కాదు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ సెక్రెటరీ, ఎండీ వీపీ గౌతమ్ అనర్హులను ఎంపిక చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక -
పోచారం నుంచి నీటి విడుదల
నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్టు నుంచి బుధవారం ప్రధాన కాలువలోకి నీటి విడుదలను ప్రారంభించారు. ఇరిగేషన్ ఇన్చార్జి ఎస్ఈ మల్లేశ్, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్పర్సన్ రజితరెడ్డి కలిసి ప్రాజెక్టు గేట్లను పైకి ఎత్తి 150 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని వారు సూచించారు. నీరు చివరి ఆయకట్టుకు చేరేలా చూడాలని ఇరిగేషన్ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు, ఇరిగేషన్ డీఈఈ వెంకటేశ్వర్లు, ఏఈ అక్షయ్కుమార్, వర్క్ఇన్స్పెక్టర్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే వల్లే.. ఎమ్మెల్యే మదన్మోహన్రావు ప్రయత్నం వల్లే ప్రాజెక్టునుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేశారని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీధర్గౌడ్ పేర్కొన్నారు. బుధవారం ఆయన నాగిరెడ్డిపేటలో విలేకరులతో మాట్లాడారు. గతంలో జిల్లా అధికారుల నిర్ణయం మేరకు ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసేవారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నీటిపారుదలశాఖ రాష్ట్రస్థాయి అధికారుల అనుమతులతోనే ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే మదన్మోహన్రావు అధికారులతో మాట్లాడి పోచారం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయించారని పేర్కొన్నారు. సమావేశంలో మాల్తుమ్మెద సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ రాంచందర్రెడ్డి, నాయకులు కిష్టయ్య, కిరణ్కుమార్, శ్రీరాంగౌడ్, ఇమామ్ తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించకపోవడం బాధాకరం
కామారెడ్డి టౌన్: విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాను యూఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు, టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్కుమార్ ప్రారంభించి మాట్లాడారు. ఎన్నో ప్రభుత్వాలు మారినా విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోవడం బాధాకరమన్నారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ బిల్లులను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పదవీ విరమణ చేసిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకపోవడం సిగ్గుచేటన్నారు. సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలన్నారు. యూఎస్పీసీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఆకుల బాబు, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు లింగం, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు దేవులా, నేతలు నరేందర్, గంగారాం, క్యాతం ిసిద్దిరాములు, తదితరులు పాల్గొన్నారు. యూఎస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు అనిల్ కుమార్