breaking news
Kamareddy District News
-
తగ్గుతున్న భూసారం
లింగంపేట(ఎల్లారెడ్డి): రైతులు పండించిన వరి పంట నూర్పిళ్లు చేసిన పది, పదిహేను రోజులకు వరి కొయ్య కాళ్లకు నిప్పు పెట్టి కాల్చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతీ ఏటా ఇలా చేయడం వల్ల చేనులో భూసారం తగ్గిపోయి దిగుబడి తగ్గిపోతోంది. కొయ్యలను కాల్చడం వల్ల భూసారం క్షీణించడం, పొలంలోని సేంద్రియ పదార్థం, పోషకాలు, సూక్ష్మజీవులు, మిత్ర పురుగులు నశించిపోతాయి. రైతులు నష్టపోకుండా ఉండాలంటే నూర్పిళ్లు చేసిన అనంతరం యంత్రం ద్వారా వచ్చిన గడ్డిని కట్టలు కట్టించాలి. రెండు, మూడు రోజుల్లో పొలం కలియదున్నాలి. దాంతో వరి నాట్లు వేసేవరకు భూమి లోపలికి గాలి ప్రవేశించి భూసారం పెరుగుతుంది. వరి కొయ్యలు సైతం మట్టిలో కుళ్లిపోయి సేంద్రీయ ఎరువుగా మారుతుంది. ఇది కలుపు మొక్కలను తగ్గించి, మొక్కల ఆరోగ్యకరమైన పెరుగుదలకు తోడ్పడుతుంది. వరి కొయ్యలను కాల్చకుండా వాటిని భూమిలో కలపడం చాలా శ్రేయస్కరం. నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పొలంలో కలిపిన కొయ్యలు కుళ్లిపోయి నేలలో సారం పెంచుతుంది. నీటిని నిలుపుకునే సామర్థ్యం పెరుగుతుంది. అలాగే నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తాయి. ప్రతీ ఏటా పంటల మార్పిడి చేయడం వల్ల భూసారం పెంచుకోవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. పంటల మార్పిడితో దిగుబడులు సైతం పెరుగుతాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కలుపు మొక్కలు తగ్గుతాయి.. వరి కొయ్యలు కుళ్లిపోవడం వల్ల కలుపు మొక్కల పెరుగుదల తగ్గుతుంది.నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది.నేల ఆరోగ్యం మెరుగుపడటం వల్ల మొ క్క వేళ్లు ఆరోగ్యంగా పెరిగి, అధిక దిగుబడి వస్తుంది. వరి కొయ్యలు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడతాయి.వరి పొట్టు కార్బన్కు మూలం. ఇది నేల లో నీటిని,పోషకాలను నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.వరి పొట్టును మల్చ్గా ఉపయోగించడం వల్ల కలుపు మొక్కల పెరుగుదలను తగ్గిస్తుంది. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం.. వరి కొయ్యలు కాల్చినప్పుడు వచ్చే పొగ, బూడిద వాతావరణ కాలుష్యాన్ని పెంచుతోంది. దీనివల్ల రైతులకు శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే పంట దిగుబడి తగ్గుతుంది. కొయ్యలు కాల్చడం వల్ల భూమి పైపొర గట్టిపడి, మట్టిని దున్నడం కష్టమవుతుంది. అలాగే నీరు భూమిలోకి ఇంకే సామర్థ్యం తగ్గిపోతుంది. రైతులు వరి పంటలను నూ ర్పి ళ్లు చేసిన తర్వాత కొయ్యలను కాల్చవద్దు. రైతులకు ‘రై తు నేస్తం’ కార్యక్రమం ద్వారా కొ య్యలు కాల్చవద్దని అవగాహ న కల్పిస్తున్నాం. ఖరీఫ్, యాసంగిలో ఒకే పంట వే యడం వల్ల దిగుబడి తగ్గుతుంది. పంటల మార్పిడి పద్ధతులు పాటిస్తే మేలు. కాలుష్యాన్ని నివారించడానికి కొయ్యలకు నిప్పు పెట్టడం నిలిపివేయాలి. – అనిల్కుమార్, ఏవో, లింగంపేట వరి కొయ్యలను తగులబెట్టడంతో దిగుబడిపై ప్రభావం పెరుగుతున్న కాలుష్యంతో రోగాల బారిన పడుతున్న రైతులు పంటల మార్పిడి అవసరమంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు -
మూడు ఆలయాల్లో చోరీ
మోపాల్: మండలంలోని సిర్పూర్ తండా, గుడి తండాలోని సేవాలాల్ ఆలయాల్లో, నర్సింగ్పల్లిలోని పెద్దమ్మ గుడిలో చోరీ జరిగినట్లు ఎస్ఐ సుస్మిత శనివారం తెలిపారు. గుర్తుతెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి సిర్పూర్ తండాలోని సేవాలాల్ ఆలయం తాళాలు ధ్వంసం చేసి, విగ్రహాలపై ఉన్న తులం బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. అదేవిధంగా నర్సింగ్పల్లిలోని పెద్దమ్మ గుడిలో తులం బంగారు పుస్తెలు, గుడి తండాలోని సేవాలాల్ మహారాజ్ గుడిలో బంగారు ముక్కుపుడక, పుస్తకం, ఇతర బంగారు ఆభరణాలు కలిపి తులం వరకు చోరీకి పాల్పడ్డారు. మరుసటి రోజు స్థానికులు చోరీలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలాలను పరిశీలించి, వివరాలు సేకరించారు. మూడు ఆలయాల్లో కలిపి సుమారు మూడు తులాలకుపైగా బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సుస్మిత తెలిపారు. -
విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు
ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో శనివారం 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఉదయం పాఠశాల స్థాయి విద్యార్థులకు ‘ఉగ్రవాదం పై భారత్ పోరు‘ అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. పైస్థాయి విద్యార్థులకు మధ్యాహ్నం ‘ప్రజాస్వామ్యం, ఎన్నికలు యువత‘ అనే అంశంపై ఉపన్యాస పోటీ నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ప్రొఫెసర్ కుమారస్వామి, రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ లైబ్రేరియన్ వీర ప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ భుజంగం, లెక్చరర్ రాజేంద్రప్రసాద్ ఉన్నారు. డిప్యూటీ లైబ్రేరియన్ రాజిరెడ్డి, అసిస్టెంట్ లైబ్రేరియన్ తారకం తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు కొనసాగుతుంది. ప్రస్తుతం 9454 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 8వేల క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 573 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో సమానంగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులుతో నిండుకుండలా ఉంది. 36.35 మెగావాట్ల విద్యుదుత్పత్తి.. ప్రాజెక్ట్ నుంచి ఎస్కెప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 8 వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుండటంతో స్థానిక జల విద్యుదుత్పత్తి కేంద్రంలో నాలుగు టర్బయిన్ల ద్వారా 36.35 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 78.8 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగిందని జెన్కో అధికారులు తెలిపారు. ● 32 మందికి జరిమానా నిజామాబాద్అర్బన్: నగరంలో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా, మద్యం తాగి వాహనాలు నడుపుతూ 40మంది పట్టుబడ్డారు. వారికి శనివారం ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సీఐ ప్రసాద్ కౌన్సెలింగ్ నిర్వహించి, అనంతరం నగరంలోని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. జడ్జి వారిలో 32 మందికి రూ. 10,000 చొప్పున జరిమానా విధించగా, 8 మందికి వారం రోజుల పాటు జైలుశిక్ష విధించారు. -
మండల ప్రభుత్వ కార్యాలయాలు– అధికారులు
మీకు తెలుసా.. రామారెడ్డి: ఒక మండలంలో సాధారణంగా ఉండే ప్రధాన కార్యాలయాలు, అధికారులు మండల కేంద్రంలోనే ఉంటాయి. ● ఒక మండలంలో ఎంతమంది అధికారులు, సిబ్బంది ఉంటారనేది ఆ మండలం పరిమాణం, జనాభా, ప్రభుత్వ నిర్ణయాలు పని భారాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ● మండలం ప్రధాన పాలనాకేంద్రాలు మండల రెవెన్యూ కార్యాలయం (తహసీల్ కార్యాలయం), మండల ప్రజా పరిషత్ కార్యాలయం (ఎంపీడీవో కార్యాలయం). ● ప్రధానంగా మండల రెవెన్యూ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాల్లో కలిపి ఒక మండలానికి సంబంధించిన కీలక అధికారులు సిబ్బంది నియమించబడతారు. ● తహసీల్ కార్యాలయం: ఇది రెవెన్యూ పాలన, భూరికార్డులు, పౌర సరఫరాలు, సామాజిక సంక్షేమ పథకాలు (పెన్షన్లు వంటివి), ఎన్నికల నిర్వహణ వంటి అంశాలను చూసుకుంటుంది. అధికారిగా తహసీల్దార్ ఉంటారు. ● డిప్యూటీ తహశీల్దార్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ ) తనిఖీలు, విచారణలు నిర్వహించడంలో తహసీల్దార్కి సహకరిస్తారు. ● జూనియర్ అసిస్టెంట్లు/రికార్డ్ అసిస్టెంట్లు/ఇతర సిబ్బంది. ● గ్రామ స్థాయిలో రెవెన్యూ పనుల కోసం గ్రామ రెవెన్యూ అధికారులు (జీపీవో)లను కాంగ్రెస్ సర్కార్ ఇటివల నియమించింది.. ● ఎంపీడీవో కార్యాలయం: ఇది స్థానిక సంస్థల (పంచాయతీ రాజ్) పాలన, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తుంది. ● మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) ఈయన మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి అధిపతి. మండలంలోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తారు. ● మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) గ్రామ పంచాయతీల పాలనా వ్యవహారాలలో ఎంపీడీవోకు సహకరిస్తారు. ● వ్యవసాయం, విద్య, వైద్యం ఇతర ముఖ్యమైన విభాగాలకు మండల కార్యాలయాలుంటాయి, ● మండల విద్యాశాఖ కార్యాలయం, మండల విద్యాధికారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ● ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ), మండల వైద్య ఆరోగ్య శాఖ అధికారి పర్యవేక్షణలో ఉంటుంది. ● విద్యుత్ ఉప కేంద్రం/ట్రాన్స్కో కార్యాలయం, విద్యుత్ ఇంజినీరింగ్ (ఏఈ) సిబ్బందితో ఉంటుంది. ● వ్యవసాయ శాఖ కార్యాలయం మండల వ్యవసాయాధికారి పరిధిలో ఉంటుంది. ● పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ లేదా సబ్ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తుంది. ● పోస్ట్ ఆఫీస్ (తపాలా కార్యాలయం), సబ్ ట్రెజరీ కార్యాలయం (కొన్ని ముఖ్యమైన మండలాల్లో) ఉంటాయి. -
మున్సిఫ్ కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కోర్టు సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి సుష్మ ప్రత్యేక లోక్ అదాలత్లో రాజీ చేసుకోదగ్గ కేసులను పరిష్కరించినట్లు వారు తెలిపారు. ప్రత్యేక లోక్ అదాలత్లో 164 కేసులను పరిష్కరించినట్లు చెప్పారు. వీటిలో 5 సివిల్, 32 క్రిమినల్, 127 పీటీ కేసులను న్యాయమూర్తి పరిష్కరించినట్లు వారు తెలిపారు. పీటీ, క్రిమినల్ కేసులకు సంబంధించి 2 లక్షల 72 వేల 137 రూపాయలు జరిమానాలు విధించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్రావు, పండరి, నవీద్, సాయిప్రకాష్, శ్రీనివాస్, సతీష్, శ్రీకాంత్ తదితరులున్నారు. కామారెడ్డి అర్బన్: విద్యుత్ వినియోగదారులకు అవసరమైన అన్ని సేవలు టీజీఎన్పీడీసీఎల్ యాప్, వాటాప్స్ నంబర్ 79016 28348 ద్వారా పొందాలని జిల్లా ఎస్ఈ శ్రావణ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గృహ వినియోగదారులతో పాటు రైతులు, పరిశ్రమలున్న వారు ఎలాంటి సమస్యలున్నా ఇబ్బందులు పడొద్దని, అవసరమైనప్పుడు 1912 నంబర్ కాల్ చేయాలని సూచించారు. ఆర్మూర్: ఆత్మరక్షణ కోసం విద్యార్థులు తైక్వాండో లాంటి క్రీడల్లో శిక్షణ పొందాలని జిల్లా అధ్యక్షుడు ఈరవత్రి రాజశేఖర్ సూచించారు. పట్టణంలోని క్షత్రియ కల్యాణ మండపంలో శనివారం తైక్వాండో పోటీలను నిర్వహించారు. తైక్వాండో గ్రాండ్ మాస్టర్ భోజన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పోటీల్లో 108 మంది క్రీడాకారులు పాల్గొనగా బెల్టులు సాధించిన వారికి ముఖ్య అతిథి చేతుల మీదుగా బెల్టులతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. కరాటే కోచ్ రాజు, ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు డిష్ రాంప్రసాద్, కొండి రాంచందర్, టైలర్ వినోద్ పాల్గొన్నారు. సిరికొండ: చిన్న వయస్సులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణకు ఇటీవల పితృ వియోగం కలిగిన విషయం తెలిసిందే. దీంతో మండలంలోని పాకాల గ్రామంలో ఉన్న పూర్ణను శనివారం రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పరామర్శించారు. పూర్ణ తండ్రి దేవిదాస్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. నాయకులు బాకారం రవి, భాస్కర్రెడ్డి, ఎర్రన్న, నరేష్, తదితరులు ఉన్నారు. -
అక్రమంగా మొరం తవ్వకాలు
కామారెడ్డి రూరల్ : ఎలాంటి అనుమతులు లేకుండా అసైన్డ్ భూముల్లో రాత్రి వేళల్లో అక్రమంగా మొరం తవ్వకాలు జరుపుతున్నారు. శాబ్దిపూర్ శివారులోని గూడెం రోడ్డు పక్కన గల అసైన్డ్ భూమి సర్వే నంబర్–38లో నుంచి రెండేళ్లుగా యథేచ్ఛగా మొరం తరలిస్తున్నారు. ప్రభుత్వ భూములు అమ్మ వద్దు, కొనరాదు అనే నిబంధనలు ఉన్నా వాటిని తుంగలో తొక్కి ఓ నాయకుడు రెండెకరాలు కొనుగోలు చేసి అందులో నుంచి రెండు సంవత్సరాలుగా టిప్పర్లతో మట్టి, మొరం తరలిస్తూ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అధిక లోడ్ టిప్పర్లతో మొరం తరలించడం వల్ల గ్రామంలో వేసిన రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయని పేర్కొన్నారు. మట్టి తరలింపు, భూమి కొనుగోలు, రోడ్ల ధ్వంసం విషయాలపై మైనింగ్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల సహకారంతోనే ఆ వ్యక్తి రాత్రింబవళ్లు మొరం తరలిస్తున్నాడని ఆరోపించారు. నిత్యం మట్టిని తవ్వుతూ టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారాయన్నారు. ఖనిజ సంపద తరలిపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. మొరం తవ్వకాలు తమ దృష్టికి రాలేదు. శాబ్దిపూర్ శివారులోని సర్వే నెంబర్–38లో గల అసైన్డ్ భూమిలో నుంచి అక్రమంగా మట్టి, మొరం రవాణాను ఉపేక్షించం. మొరం తవ్వుతున్న వాహనాలతో పాటు తరలిస్తున్న టిప్పర్లను సీజ్ చేస్తాం. వెంటనే ఆర్ఐని పంపించి వాహనాలను సీజ్ చేస్తాం. –జనార్దన్, తహసీల్దార్, కామారెడ్డి అసైన్డ్ భూముల్లో తవ్వి రాత్రి వేళల్లో తరలింపు రూ.లక్షలు గడిస్తున్న వ్యాపారులు చోద్యం చూస్తున్న రెవెన్యూ, మైనింగ్ అధికారులు -
క్రైం కార్నర్
నవీపేట: మండలంలోని నాళేశ్వర్ శివారులోని ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పడి నీటమునిగి మృతిచెందాడు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాలు ఇలా.. మాక్లూర్ మండలం ముత్యంపల్లికి చెందిన పెరిగె చిన్నసాయిలు(51) శుక్రవారం నందిపేట మండలం తల్వెదలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లాడు. అనంతరం అదేరోజు రాత్రి అతడు నాళేశ్వర్లోని బంధువు ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం చిన్నసాయిలు కాలకృత్యాల కోసం బయటకు వెళ్లి, తిరిగి రాలేడు. నాళేశ్వర్ శివారులోని ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో చిన్నసాయిలు మృతదేహం కనిపించింది. మృతుడి కుమారుడు సందీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాల్కొండ: మెండోరా మండలం దూదిగాం గ్రామంలో శనివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మెండోరా ఎస్సై సుహాసిని తెలిపిన వివరాలు ఇలా.. దూదిగాం వద్దగల జాతీయ రహదారి 44 సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెంది ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉండవచ్చన్నారు. బ్లూ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్, బెల్ట్ ధరించి ఉన్నాడన్నారు. తెల్లటి గడ్డం ఉందన్నారు. ఆచూకి తెలిసిన వారు మెండోరా పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసుకుని శవాన్ని ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. -
నిజాయితీని చాటుకున్న మహిళ
● దొరికిన పర్సు పోలీసులకు అప్పగింత రామారెడ్డి: ఓ మహిళ తనకు దొరికిన పర్సును పోలీస్ స్టేషన్ వెళ్లి పోలీసులకు అప్పగించి, నిజాయితీని చాటింది. వివరాలు ఇలా.. బాన్సువాడలోని మేకల సాయిసురేఖ ఇటీవల మండల కేంద్రంలోని కాలభైరవ స్వామి ఉత్సవాలకు వచ్చింది. శుక్రవారం రాత్రి ఆమె ఎక్కడో పర్సు పోగొట్టుకుంది. ఆ పర్సు కందూరి పెద్దలక్ష్మి అనే మహిళకు దొరికింది. లక్ష్మి పరుల సొమ్ము నాకెందుకని, దొరికిన పర్సును శనివారం పోలీస్స్టేషన్కె వెళ్లి ఎస్సై రాజశేఖర్కు అప్పగించింది. బాధితురాలు పర్సు పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి అదే సమయానికి వెళ్లింది. కానీ అప్పటికే ఆ పర్సు పోలీస్ స్టేషన్కు చేరడంతో ఎస్సై పర్సును, అందులోని రూ.20వేలనగదును బాధిత మహిళ కు అప్పగించారు. నిజాయితీగా పర్సును పోలీసులకు అప్పగించిన పెద్దలక్ష్మిని సన్మానించి అభినందించారు. -
తెయూలో ‘మహిళల కథలు –వికాసం, వైవిధ్యం’పై సదస్సు
మోపాల్(నిజామాబాద్రూరల్): తెలంగాణ విశ్వవిద్యాలయంలో శనివారం సాహిత్య అకాడమీ, తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో ‘తెలంగాణ మహిళల కథలు –వికాసం, విస్తృతి, వైవిధ్యం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. నిర్వాహకులు చంద్రశేఖర రాజు స్వాగతోపన్యాసం చేయగా, తెయూ ఆర్ట్స్ కళాశాల డీన్ కరిమిండ్ల లావణ్య ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం ఆమె రచించిన సాహితీ కిరణాలు (విమర్శన వ్యాసాలు అనే సంపుటి)ను సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యులు ఎస్వీ సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈసందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ మూలాలు తెలంగి, తెలుగు నుంచి వచ్చాయని తెలిపారు. ప్రముఖ రచయిత్రి, విమర్శకులు ఆచార్య ముదిగంటి సుజాతారెడ్డి. ఆచార్యులు కనకయ్య, లక్ష్మణ చక్రవర్తి, వంగరి త్రివేణి, సంధ్యారాణి, రజిని, వెల్దండి శ్రీధర్, దేవేంద్ర మాట్లాడా రు. తెయూ విద్యార్థులు, తెలుగు భాషోపాధ్యాయులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. -
వరి నారుమడిలో యాజమాన్యం
రుద్రూర్: ప్రస్తుతం చలికాలం కావడంతో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరగడంతో వరి నారుమడి యాజమాన్యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రొగ్రాం కో–అర్డినేటర్ సుప్రజ రైతులకు సూచిస్తున్నారు. చలి ప్రభావం వల్ల వరి నారు ఆకు కొనలు ఎర్రబడడం, ఎండిపోవడం, కొన్నిసార్లు చనిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయన్నారు. ఈ సమస్యలను నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చలి నుంచి రక్షణ: నారుమడిపై కర్రలతో ఊతమిచ్చి సాయంత్రం వేళల్లో పాలిథిన్ లేదా టార్పలిన్ షీట్తో కప్పాలి. మరుసటి రోజు ఉదయాన్నే షీట్ తీసివేయాలి. జింకు లోప లక్షణాల నియంత్రణ: నారు ఆకుల కొనలు ఎండిపోవడం, గోధుమ రంగు మచ్చలు కనిపించడం వంటివి జింకు లోప లక్షణాలు. నివారణకు లీటరు నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి, పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయండి. నీటి యాజమాన్యం: రాత్రి వేళల్లో నారుమడిని నీటితో నింపి చలి ప్రభావాన్ని తగ్గించాలి. తెల్లవారుజామున నీటిని తీసివేసి తాజా నీరు పెట్టాలి. రోగ నిరోధకత కోసం: వరి నారు ఆరోగ్యంగా పెరగడానికి, యూరియా వేస్తున్నప్పుడు ఒక కిలో యూరియాకు 2 గ్రాముల కార్బెండజిమ్, మ్యాంకోజెట్ మిశ్రమ మందు కలిపి వేయాలని వివరించారు. -
వైభవంగా వీరభద్రుడి ఉత్సవాలు
మద్నూర్(జుక్కల్): ఓం నమః శివాయా.. హర హ ర మహాదేవ్.. అంటూ భక్తులు వీరభద్రుడి దండకా ల మధ్య నిప్పు కణికలపై నడిచారు. మూడు రోజులుగా మండల కేంద్రంలో జరుగుతున్న వీరభద్రుడి ఉత్సవాలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా మండల ప్రజలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన భక్తులు హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి తర్వాత 9వ రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ అర్చకులు సంగాయప్ప స్వామి తెలిపారు. ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పల్లకీ ఊరేగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది. వీరభద్రుని ఉత్సవాల సందర్భంగా దక్ష యజ్ఞం(అగ్నిగుండం) నిర్వహించారు. ఈ సందర్బంగా భక్తులు నిప్పు కణికలపై నడిచి తమ భక్తిని చాటుకున్నారు. మద్నూర్లో పల్లకీ ఊరేగింపు నిర్వహిస్తున్న భక్తులు , అగ్ని గుండంలో నడుస్తున్న భక్తులు -
సిద్ధరామేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు
భిక్కనూరు: కార్తీక మాసం చివరి శనివారం సందర్భంగా దక్షిణకాశీగా పేరొందిన భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పండితులు సిద్ధగిరిశర్మ, రామగిరి శర్మ, రాజేశ్వరశర్మ, పూజారి సిద్దేశ్ స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, మాతా భువనేశ్వరి దేవికి కుంకుమ పూజలు, గండదీపం, కోడె మొక్కులు, సత్యనారా యణ వ్రతాలను నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీధర్, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ తాటిపాములు లింబాద్రి, డైరెక్టర్లు భక్తులకు సేవలు అందించారు. 17 వరకు రేషన్ బియ్యం పంపిణీ కామారెడ్డి రూరల్: రేషన్ షాపుల ద్వారా న వంబర్ నెలకు సంబంధించిన ఉచిత బి య్యం పంపిణీ ఈ నెల 17 వరకు కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ముందు గా ఈ నెల 15 చివరి తేదీ అని ప్రకటించినప్పటికీ.. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లను లారీల్లో రైస్ మిల్లులకు తరలించడం కారణంగా రేషన్ షాపులకు బియ్యం సరఫరా ఆ లస్యమైంది. ఈ కారణంగా పంపిణీ పూర్తి స్థాయిలో జరగకపోవడంతో పంపిణీ తేదీని పొడగించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు రేషన్ బియ్యం తీసుకోని వినియోగదారులు ఎవరైనా ఉంటే సంబంధిత రేషన్ షాపుల్లో బియ్యం తీసుకోవాలని పౌరసరఫరాలశాఖ అధికారులు సూచించారు. రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్ మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని సీ సీఐ, ప్రైవేట్ పత్తి కొనుగోళ్లను సోమవారం నుంచి బంద్ చేస్తున్నట్లు జిన్నింగ్ మిల్లుల యజమానులు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ కాటన్మిల్లులు, ట్రే డర్ల వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు ప త్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నామని పేర్కొన్నా రు. జిల్లాలో ఏకై క కొనుగోలు కేంద్రం ఉన్న మద్నూర్కు పత్తి తీసుకురావొద్దని రైతులకు వ్యాపారులు సూచించారు. పత్తి కొనుగోళ్ల లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విధించిన ఎల్1, ఎల్2, ఎల్3 ఆంక్షల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రైతులు సహకరించాలని వారు కోరారు. ఉపాధి కల్పనాధికారిగా కిరణ్కుమార్ కామారెడ్డి క్రైం: జిల్లా ఉపాధి కల్పనాధికారి గా కిరణ్కుమార్ నియమితులయ్యారు. ఇటీవలే గ్రూప్–1 సాధించిన కిరణ్ కామారెడ్డి జిల్లా ఉపాధి కల్పన అధికారిగా నియమితులయ్యారు. శనివారం బాధ్యతలు స్వీకరించి న అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను మ ర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఇదివరకు ఉపాధి కల్పనాధికారిగా ప నిచేసిన రజినీ కిరణ్ ఆదిలాబాద్ జిల్లాకు బ దిలీపై వెళ్లారు. 20 వరకు పీజీ స్పాట్ అడ్మిషన్లు కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈనెల 20వ తేదీ వరకు పీజీ స్పాట్ అడ్మిషన్లు పొందొచ్చని ప్రిన్సిపాల్ కే విజయకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ ఇంగ్లిష్, తెలుగు, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఎంఎస్డబ్ల్యూ, ఎంకాం, ఎమ్మెస్సీ బొటనీ, ఫారెస్ట్రీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఫిషరీస్ కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని, అన్ని ఒరిజనల్ సర్టిఫికెట్లతో విద్యార్థులు సంప్రదించి వెంటనే సీట్లు పొందవచ్చని తెలిపారు. -
1.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
● 429 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకాలు ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వేగం పెంచాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్నిజాంసాగర్(జుక్కల్): జిల్లాలోని 429 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 1.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణతోపాటు ధాన్యం తూకాలు, ట్యాబ్ ఎంట్రీపై దృష్టి సారించాలని సూచించారు. మండలంలోని సుల్తాన్నగర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, నిజాంసాగర్, బంజపల్లి, వెల్గనూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శనివారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధాన్యం దిగుబడులు, పెట్టుబడి ఖ ర్చులు, ధాన్యం విక్రయాలకు కల్పించిన సదుపాయాలను తెలుసుకున్నారు. కలెక్టర వెంట డిప్యూటీ కలెక్టర్ రవితేజ, సివిల్ సప్లయీస్ జిల్లా అధికారి శ్రీ కాంత్, అచ్చంపేట సొసైటీ చైర్మన్ నర్సింహారెడ్డి, ఎంపీడీవో శివకృష్ణ, తహసీల్దార్ భిక్షపతి, వ్యవసాయశాఖ అధికారి అమర్ప్రసాద్, హౌసింగ్ డీఈఈ మొగులయ్య, ఐకేపీ ఏపీ ఎం ప్రసన్నరాణి, ఎస్సై శివకుమార్, సొసైటీ సీఈ వో సంగమేశ్వర్గౌడ్, పంచాయతీ కార్యదర్శి రవిరాథోడ్ ఉన్నారు. ఇసుక తరలింపునకు అనుమతి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా చూసుకోవాలని తహసీల్దార్ భిక్షపతికి కలెక్టర్ సంగ్వాన్ సూచించారు. మంజీర వాగు నుంచి ఇసుక త రలించేందుకు మూడు మండలాలకు అనుమతులు ఇస్తున్నామని తహసీల్దార్ కలెక్టర్కు తెలిపారు. గండిమాసానిపేటలో.. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటి పరిధిలోని గండిమాసానిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. ధాన్యం కాంటా బస్తాకు 42 కిలోలు తూకం వేసినప్పటికీ రైస్మిల్ యజమానులు లారీకి 10 నుంచి 12 బస్తాల ధాన్యాన్ని తరుగు పేరుతో తీస్తున్నారని, లేదంటే లారీని వెనక్కి పంపుతామని ఇబ్బంది పెడుతున్నా రని రైతులు కలెక్టర్కు తెలిపారు. ఆర్డీవో పార్థసింహారెడ్డి, తహసీల్దార్ ప్రేమ్కుమార్, సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింలు, కార్యదర్శి విశ్వనాథం ఉన్నారు. -
రాజీ మార్గమే రాజమార్గం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ ● లోక్ అదాలత్లో 409 కేసుల పరిష్కారంకామారెడ్డి టౌన్ : రాజీ మార్గమే రాజమార్గమని న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీఆర్ఆర్ వరప్రసాద్ అన్నారు. జిల్లా కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. కక్షిదారులు రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కారం చేసుకోవచ్చని, ఇందుకోసం లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇరు పక్షాలకు న్యాయం జరుగుతుందని, బాధితులకు నష్టపరిహారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి నాగరాణి, జూనియర్ సివిల్ జడ్జి దీక్ష, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, న్యాయవాదులు శంకర్రెడ్డి, సలీం, సిద్ధిరాములు, మురళి, వేణుప్రసాద్, శ్రవణ్గౌడ్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆరు ప్రత్యేక బెంచీలు.. జిల్లా వ్యాప్తంగా ఆరు ప్రత్యేక లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసి 409 కేసులను పరిష్కరించారు. ఇందులో పోలీస్ కేసులు 385, ఎన్ఐ యాక్ట్ కేసులు రెండు, ఇతర కేసులు 22 ఉన్నాయి. -
ఇంటర్లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి) : ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేస్తున్నామని జిల్లా ఇంట ర్ విద్యాధికారి(డీఐఈవో) షేక్సలాం అన్నారు. నాగిరెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళా శాలలోని అధ్యాపకుల, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ప్రిపరేషన్లో భా గంగా ఏవైనా సందేహాలోస్తే అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకోవాలని విద్యార్థులకు ఆయన సూ చించారు. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి కళాశాలకు, అధ్యాపకులకు మంచిపేరును తీసుకురావాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యే క దృష్టి సారించి పరీక్షలకు సన్నద్ధం చేయాలని అధ్యాపకులకు ఆదేశించారు. ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళ ల్లో విద్యార్థులకు స్టడీ అవర్స్ కొనసాగిస్తున్నామని అన్నారు. ఆయనవెంట కళాశాల అధ్యాపకులు ఉన్నారు. -
భద్రత లోపాలు ఉండొద్దు
● టీజీఆర్టీసీ సీసీఈ కవితసుభాష్నగర్: బస్టాండ్లో ప్రయాణికుల సౌకర్యాలు, భద్రత, పరిశుభ్రతకు ఎలాంటి లోపాలు ఉండొద్దని టీజీఆర్టీసీ కార్పొరేట్ చీఫ్ ఇంజినీర్ (సీసీఈ) కవిత సూచించారు. జిల్లాకేంద్రంలోని బస్టాండ్, ఆర్ఎం కార్యాలయంలో ఉన్న భవనాల ను ఆమె శనివారం తనిఖీ చేశారు. భవనాల గోడ లు, పైకప్పులు, డ్రెయినేజీ వ్యవస్థ, ప్రయాణికుల విశ్రాంతి గదులు, టికెట్ కౌంటర్లు తదితర ముఖ్య విభాగాలను ఆమె స్వయంగా పరిశీలించారు. భవ నం పాడైపోయిన చోట్ల వెంటనే పనులు ప్రారంభించేందుకు సంబంధిత విభాగానికి ఆదేశాలు జారీచేశారు. బస్టాండ్లో మరమ్మతులు, అత్యవసరంగా చేయాల్సిన ప్రాంతాలను గుర్తించాలన్నారు. ఆమె వెంట నిజామాబాద్ రీజినల్ మేనేజర్ జ్యోత్స్న, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్, డిపో మేనేజర్లు, కార్యాలయ సిబ్బంది, ఇంజినీరింగ్ వి భాగం అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. -
బీసీ రిజర్వేషన్లు సాధించుకుందాం
● రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ● హాజరైన బీసీ సంఘాల నేతలు ● జిల్లా కేంద్రంలో బీసీ ఆక్రోశ సభకామారెడ్డి టౌన్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమించాలని రిజర్వేషన్ల సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సత్యగార్డెన్లో శనివారం నిర్వహించిన బీసీ ఆక్రోశ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బీసీ రిజర్వేషన్స్ను 9వ షెడ్యూల్లో పెట్టకుండా అడ్డుకుంటున్న బీజేపీపై, బీసీలపై నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న బీఆర్ఎస్పై, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీల అమలు కోసం కాంగ్రెస్పై అన్ని వర్గాలు పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. ఆ మూడు పార్టీలు స్వార్థ రాజకీయాలు, ఓట్ల కోసం బీసీలను మోసం చేశాయని విమర్శించారు. తమిళనాడులో చట్టబద్ధంగా బీసీలకు 69శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని తెలంగాణలో 56శాతం ఉన్న బీసీలకు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆర్టికల్ 30, 31బీ ప్రకారం ఉభయ సభల్లో బిల్ను పాస్ చేసి, గవర్నర్ ఆమోదం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే, రాజ్యాంగం 9 షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్, రాజ్యసభ, రాష్ట్రపతి ఆమోదం తెలిపితే బీసీలకు చట్టప్రకారం 42శాతం రిజర్వేషన్లు అమలు చేయొచ్చని అన్నారు. బీజేపీ ఊసరవెల్లిలా రంగులు మారుస్తోందని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేల బిడ్డలతో సమానంగా పేద, మధ్యతరగతి బిడ్డలకు విద్య, వైద్యం అందినప్పుడే దేశం, రాష్ట్రాలు అభివృద్ధి చెందినట్లన్నారు. అనంతరం రాబోయే అన్ని ఎన్నికల్లో బీసీ, బహుజన అభ్యర్థులకు ఓట్లు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. బీసీలను మోసం చేయొద్దు రాష్ట్ర అధ్యక్షుడు చిరంజీవులు మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్ల అమలును బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ఉసరవెల్లిలా రాజకీయాల కోసం బీసీలను మోసం చేయొద్దని కోరారు. వైస్ చైర్మన్ విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ.. బీసీలకు న్యాయం జరిగేలా రాష్ట్రంలో దళితులు, అన్ని వర్గాలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయపార్టీలు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. సభలో వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగౌని బాలరాజ్గౌడ్, సినిమా డైరెక్టర్ ఎన్ శంకర్, నాయకులు, మర్కంటి భీమన్న, బాలార్జున్గౌడ్, సిద్ధిరాములు, పుట్ట మల్లికార్జున్, రమేశ్బాబు, వేణుగోపాల్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్ బస్సు కిందపడి క్లీనర్ మృతి
నిజామాబాద్అర్బన్: నగరంలోని అర్సపల్లిలో శనివారం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు కిందపడి క్లీనర్ మృతి చెందాడు. ఆరో టౌన్ పోలీసులు తెలిపిన వి వరాల ప్రకారం... నిజామాబాద్ మండలం ధర్మారం(ఎం) గ్రామానికి చెందిన కిషన్(45) జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల బస్సు క్లీనర్గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం విద్యార్థులను తీ సుకువచ్చేందుకు పాఠశాల బస్సు అర్సపల్లి వెళ్లింది. ఆటోస్టాండ్ వద్ద బస్సు వెనక్కి తీసుకునే క్రమంలో వెనకాలే ఉన్న కిషన్ బస్సును చూసుకోలేకపోయాడు. డ్రైవర్ సైతం గమనించకపోవడంతో బస్సు కిషన్ ఢీ కొట్టింది. వెనుక టైర్ కిషన్ తల పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రైతు రత్న దరఖాస్తు గడువు పొడిగింపు
పాల్గొన్న బీసీ కులాల నాయకులు, కార్యకర్తలుకామారెడ్డి క్రైం: తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ సహకారంతో ఎంపిక చేయనున్న రైతు రత్న అవార్డుల దరఖాస్తు గడువును ఈ నెల 18 నుంచి 20వ తేదీకి పొడిగించినట్లు అసోసియేషన్ ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సుస్థిర, సమీకృత, వి నూత్న వ్యవసాయం, ఉద్యాన పంటల సాగు, సేంద్రియ, స్నేహపూర్వక వ్యవసాయానికి విశి ష్ట సేవలందించిన రైతులు, మహిళా రైతులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికై న వారిని హైదరాబాద్లోని హార్ట్ఫుల్నెస్ సెంటర్లో డిసెంబర్ 3 నుంచి 5 వరకు జరిగే మహాకిసాన్ మేళాలో భాగంగా అవార్డులతో సత్కరించనున్నామన్నారు. ఆసక్తి కలిగిన రైతులు మండల వ్యవసాయాధికారులను సంప్రదించి ఈ నెల 20వ తేదీ వరకు తమ దరఖాస్తులను అందజేయాలని సూచించారు. -
సీఎంఆర్ఎఫ్ చెక్కును చింపేసిన సీడీసీ చైర్మన్
● సోదరి చికిత్స కోసం రూ.32 లక్షలు ఖర్చు పెట్టిన ఇర్షాదుద్దీన్ ● సీఎంఆర్ఎఫ్ కింద రూ.60 వేలే రావడంతో మనస్తాపం సదాశివనగర్ (ఎల్లారెడ్డి): అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన సీడీసీ చైర్మన్ ఇర్షాదుద్దీన్ ప్రభుత్వం నుంచి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును చింపివేసిన ఘటన శుక్రవారం జరిగింది. ఇర్షాద్ సోదరి నేహా బేగం 2024లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో నేహాబేగంకు వైద్యం చేయించేందుకు రూ.32లక్షలు ఖర్చుపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. సోదరి చికిత్స కోసం అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టానని పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ కింద కనీసం 30 లేదా 40 శాతం వరకు డబ్బులు వస్తాయేమోనని ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు తెలిపారు. చివరకు కేవలం రూ.60 వేలు రావడంతో మనస్థాపంతో చెక్కును చింపి వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంజూరైన రూ.60వేలను ఏ అప్పుల వారికి చెల్లించాలి అని ఆవేదన చెందారు. పార్టీ కోసం కష్టపడిన నాకే ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదని పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కామారెడ్డి అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో (యూడైస్ కోడ్ ఉన్న పాఠశాలలు) 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ విద్యార్థుల నుంచి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ–పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, అనంతరం వాటిని ఆయా పాఠశాలల హెడ్మాస్టర్లకు అందజేయాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేయడానికి కుల ధ్రువీకరణ, ఆదాయ, విద్యార్థి బ్యాంక్ పాస్బుక్, బోనఫైడ్, పాస్సైజ్ ఫో టో అవసరం అవుతాయని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు కామారెడ్డి టౌన్: వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు డీఈవో రాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు ఈనెల 20లోపు ఎలాంటి అపరాద రుసుం లేకుండా రూ. 125 పరీక్ష ఫీజును చెల్లించాలన్నారు. రూ.50 అపరాధ రుసుంతో 29 వరకు చెల్లించవచ్చన్నారు. రూ. 200 అపరాధ రుసుముతో డిసెంబర్ 11 వరకు, రూ. 500 అపరాధ రుసుముతో డిసెంబర్ 29వరకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని పదో తరగతి విద్యా ర్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈవో అన్నారు. 17న వాహనాల వేలం కామారెడ్డి అర్బన్: ఎకై ్సజ్ కేసుల్లో పట్టుబడిన పలు వాహనాలను వేలం వేయనున్నట్లు కామారెడ్డి ఎకై ్సజ్ సీఐ సీహెచ్ సంపత్కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ శివారులోని నర్సన్నపల్లి వద్ద గల తమ కార్యాలయంలో ఈనెల 17న ఉదయం 11గంటలకు వాహనాలను వేలం వేయనున్నట్టు పేర్కొన్నారు. వేలంలో పాల్గొనే ఆసక్తిగల వారు ముందుగా రూ.5వేలు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. వేలంపాట వాహనం ధరపై 18శాతం జీఎస్టీ ఉంటుదని గమనించాలని సీఐ వివరించారు. -
పుస్తక పఠనం ప్రతిరోజు చేయాలి
కామారెడ్డి అర్బన్ : విద్యార్థులు, యువత ప్ర తిరోజు గ్రంథాలయానికి వచ్చి పుస్తకపఠనం చేయాలని, దీంతో అనుకున్న లక్ష్యాలను చే రుకోవచ్చని అడిషనల్ కలెక్టర్ మధుమోహన్, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి అన్నారు. ప ట్టణంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శు క్రవారం జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ను వారు ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమానికి సంస్థ జిల్లా చైర్మన్ మద్ధి చంద్రకాంత్ రెడ్డి అధ్యక్షత వహించారు. వారం రోజుల పా టు వివిధ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చైర్మన్ చంద్రకాంత్రెడ్డి ప్రకటించా రు. జిల్లా గ్రంథాలయ సంస్థకు స్థానిక వ్యాపా రి బాలాజీ రేడియో హౌస యాజమాని మహిపాల్ రోహిత్ జైన్ రూ.50 వేల విలువైన అహుజా సౌండ్ సిస్టంను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాతను చైర్మన్ చంద్రకాంత్రెడ్డి సన్మానించి జ్ఞాపికను అందజేశారు. సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు. -
ఎస్సెస్సీలో వందశాతం ఉత్తీర్ణత సాధిస్తాం
● విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ● డీఈవో రాజు నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఈయేడు జరుగనున్న పదోతరగతి(ఎస్సెస్సీ) వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధిస్తామని డీఈవో రాజు అన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్పేట మోడల్స్కూల్లో శుక్రవారం జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఈవో మాట్లాడుతూ.. ప్రస్తుత సంవత్సరం పదోతరగతి పరీక్షలకు ఇప్పటివరకు 12,126మంది విద్యార్థులు ఫీజు చెల్లించారన్నారు. కాగా పరీక్షఫీజు చెల్లింపు కోసం ఈనెల 13 వరకు గడువు విధించగా తాజాగా ఫీజు చెల్లింపు తేదీని ఈనెల 20 వరకు పొడిగించినట్లు తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 64 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. గతయేడు పదోతరగతి పరీక్షల్లో జిల్లా విద్యార్థులు 96శాతం ఉత్తీర్ణత సాధించారని, ఈయేడు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేస్తామన్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్నిపాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులకు సాయంత్రంవేళ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఆదర్శ బడుల్లో అడ్మిషన్లకు పోటీ జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో చక్కని బోధన జరుగుతుందని, ఎన్ని గురుకులాలు వెలిసినా ఆదర్శ పాఠశాలల్లో అడ్మిషన్లకు పోటీ తగ్గడంలేదని డీఈవో రాజు అన్నారు. గోపాల్పేట ఆదర్శ పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నాగిరెడ్డిపేట మండలంలోని ఆదర్శపాఠశాలలో విద్యార్థులను సి.వి.రామన్, శకుంతలదేవి, అబ్దుల్కలాం, రవీంద్రనాథ్ ఠాగూర్ హౌస్లుగా విభజించడం చాలా బాగుందన్నారు. అనంతరం గత దసరా సెలవుల్లో వృత్తివిద్య కోర్సులకు సంబంధించి ఇంటర్న్షిప్ పూర్తి చేసుకున్న 22మంది విద్యార్థులకు సర్టిఫికేట్లను అందజేశారు. బాలల దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు తోటివిద్యార్థులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ లక్ష్మి, ప్రిన్సిపాల్ రాంప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ జ్యోత్స్న, హెచ్ఎం వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్పీఏను తగ్గించడమే ప్రధాన లక్ష్యం
● ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డిసుభాష్నగర్ : రాబోయే రికవరీ సీజన్లో అన్ని వి ధాలుగా ప్రయత్నించి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎన్పీఏను తగ్గించడమే ప్రధాన లక్ష్యంతో పాలకవర్గం, ఉద్యోగులు ముందుకెళ్తున్నారని ఎన్డీసీసీ బీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి పేర్కొన్నారు. ఎన్డీసీ సీబీ బ్యాంకు వ్యాపార కార్యకలాపాలు రూ.2,500 కోట్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా జిల్లాకేంద్రంలోని ప్రధాన కార్యాలయంలో ఆయన కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తంచేశారు. ఈ మైలురాయి చేరుకోవడంలో సహకరించిన సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బ్యాంకు మేనేజర్ల తో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చైర్మన్ మా ట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు రూ.3,000 కోట్ల వ్యాపార కార్యకలాపాలకు చేరుకోవాలని సూచించారు. ఈ మైలురాయి ప్రతి ఉద్యోగి కి గుర్తుండిపోయేలా జ్ఞాపికలను అందజేస్తామని తె లిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన కామధేను డిపాజిట్ ను విరివిగా ప్రచారం చేసి డిపాజిట్లు తీసుకురావా లని పేర్కొన్నారు. బ్యాంకులో ఉన్న అన్ని స్థాయిల ఉద్యోగులు తనకు తానుగా లక్ష్యాలను నిర్దేశించుకొని చేరుకోవాలని సూచించారు. రూ.2,500 కోట్ల మైలురాయి చేరుకోవడంలో ప్రత్యేక భూమిక పో షించి, నిరంతరం సమీక్షిస్తూ క్షేత్రస్థాయిలో విలువైన సూచనలు, బ్యాంకు పటిష్టతకు తీసుకుంటున్న చర్యలకు సీఈవో, ఉన్నతాధికారులకు ప్రత్యేక ధన్య వాదాలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, డైరెక్టర్లు లింగయ్య, ఆనంద్, సీఈవో నాగభూషణం వందే, ఉన్నతాధికారులు, 63 శాఖల మేనేజర్లు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రతపై అవగాహన అవసరం
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● జిల్లాకేంద్రంలో ‘కిడ్స్ విత్ ఖాకీ, సేఫ్ కామారెడ్డి’ కార్యక్రమాల నిర్వహణ కామారెడ్డి క్రైం: ప్రతి ఒక్కరిరు రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో శుక్రవారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు శాఖ ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థులతో కలిసి కిడ్స్ విత్ ఖాకీ, సేఫ్ కామారెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మద్యం తాగి వాహనాలు నడపడంతో ఓ కుటుంబం ఏవిధంగా సర్వం కోల్పోతుందో, అమాయకులు సైతం ఎలా ప్రాణాలు కోల్పోతున్నారో నాటిక ప్రదర్శన ద్వారా విద్యార్థులు కళ్లకు కట్టినట్లు వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం సేఫ్ కామారెడ్డి పోస్టర్లలను కలెక్టర్, ఎస్పీ రాజేష్ చంద్రలు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. డీపీవోను సందర్శించిన విద్యార్థులు జిల్లా పోలీస్ కార్యాలయం సందర్శనలో భాగంగా విద్యార్థులకు ఫింగర్ ప్రింట్, స్పెషల్ బ్రాంచ్, క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వంటి విభాగాల పనితీరుపై సిబ్బంది సమగ్ర అవగాహన కల్పించారు. సైబర్ క్రైౖమ్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. షీటీం, భరోసా కేంద్రం, పోలీస్ కంట్రోల్ రూం పనితీరు, సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లను తెలియజేశారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో గంజాయి, పేలుడు పదార్థాలు వంటి వాటితోపాటు పల అంశాలను ప్రత్యక్షంగా చూపించారు. అనంతరం విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. అదనపు ఎస్పీ నర్సింహరెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా నెహ్రూ జయంతి కామారెడ్డి క్రైం: పట్టణంలోని జిల్లా పోలీసు కా ర్యాలయంలో శుక్రవారం దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా నెహ్రూ చిత్రపటానికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. -
చికిత్స కేంద్రం ఏర్పాటు
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్డులో ఉదయ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యసన చికిత్స కేంద్రం ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ ఇన్చార్జి బోడ రాజు తెలిపారు. శుక్రవారం పట్టణ సీఐ నరహరిని మర్యాదపూర్వకంగా కలిసారు. కేంద్రం కరపత్రాన్ని అందజేశారు. డ్రగ్స్, ఆల్కహాల్ వ్యసనాల బారినపడిన వ్యక్తులకు ఈ చికిత్స కేంద్రంలో చేర్పించి మానసిక వైద్యులతో ఉచితంగా చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు. అలాగే బాధితుల కుటుంబ సభ్యులకు కౌన్సిల్ నిర్వహిస్తున్నట్లు సీఐకి తెలిపారు. బాధితులు ఉంటే కేంద్రానికి పంపించాలని కోరారు. -
చట్టాలపై అవగాహన
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం న్యాయచైతన్య సదస్సు నిర్వహించారు. మున్సిఫ్ కోర్టు న్యా యమూర్తి సుష్మ విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల హక్కుల గు రించి వివరించారు. సీఐ రాజారెడ్డి, బార్ అసో సియేషన్ అధ్యక్షుడు గోపాల్రావు, న్యాయవాదులు సాయిప్రకాష్, పండరి, సతీష్, నవీద్ తదితరులున్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మొక్కజొన్న కొనుగోళ్ల ను డిసెంబర్ 10 కల్లా పూర్తి చేయాలని మా ర్క్ఫెడ్ మేనేజర్ శశిధర్ రెడ్డి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో విండో ఆధ్వర్యంలో చేపడుతున్న మొక్కజొన్న కొనుగోళ్లను ఆయన ప రిశీలించారు. మొక్కజొన్నలో తేమ శాతం పరిశీలించిన తర్వాతనే తూకం వేయాలన్నారు. తూ కం చేసిన బస్తాలను వెంటనే తరలించాలన్నారు. విండో చైర్మన్ కమలాకర్ రావు, సీఈవో విఘ్నేశ్ గౌడ్, ఏవో ప్రజాపతి, రైతులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: అంతర్జాతీయ సీనియర్ సిటిజన్స్ వారోత్సవాల సందర్భంగా జిల్లా సీనియర్ సిటిజన్స్ ఫోరం భవనంలో శుక్రవారం సాయంత్రం క్యారం పోటీలను జిల్లా అధ్యక్షుడు పున్న రాజేశ్వర్ ప్రారంభించారు. వారోత్సవాల్లో భాగంగా సీనియర్ సిటిజన్లకు వివిధ పోటీలు, కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఫోరం ప్రతినిధులు పీవీ నర్సింహం, మోహన్రెడ్డి, పురుషోత్తం, అంతిరెడ్డి, బాపురావు, రామచంద్రం, భద్రప్ప తదితరులు పాల్గొన్నారు. -
డ్రంకన్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు
బోధన్టౌన్: డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ ఇద్దరికి బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేషతల్పసాయి జైలు శిక్షను విధించినట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ శుక్రవారం తెలిపారు. ఇటీవల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా పట్టణానికి చెందిన లక్ష్మీనారాయణ, బోర్గాం గ్రామానికి చెందిన పోశెట్టి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వీరిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చగా పోశెట్టికి మూడు రోజుల, లక్ష్మీనారాయణకు ఏడు రోజుల జైలు శిక్షను విధించారని సీఐ తెలిపారు.రావుట్లవాసికి ఏడు రోజులు.. ధర్పల్లి: డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ ఓ వ్యక్తికి మెజిస్ట్రేట్ ఏడు రోజుల జైలు శిక్షను విధించినట్లు ధర్పల్లి ఎస్సై కల్యాణి శుక్రవారం తెలిపారు. మండల కేంద్రంలో ఈనెల 12న నిర్వహించిన వాహనాల తనిఖీల్లో మద్యం సేవించి పట్టుబడ్డ సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన వ్యక్తిని కోర్టులో హాజరుపర్చామన్నారు. మెజిస్ట్రేట్ అతనికి ఏడు రోజుల జైలు శిక్షను విధించినట్లు ఎస్సై తెలిపారు. ఆర్మూర్లో నలుగురికి జరిమానా ఆర్మూర్టౌన్: మద్యం సేవించి వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ నలుగురికి ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ జరిమానా విధించినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలో శుక్రవారం రాత్రి చేపట్టిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో నలుగురు వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. జడ్జి వీరికి రూ. పదివేల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్హెచ్వో తెలిపారు.బాల్కొండలో ఇద్దరికి.. బాల్కొండ: డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ ఇద్దరికి ఆర్మూర్ కోర్టు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ రూ. పదివేల చొప్పున జరిమానా విధించినట్లు బాల్కొండ ఎస్సై శైలేందర్ శుక్రవారం తెలిపారు. బాల్కొండ పీఎస్ పరిధికి చెందిన పెంటు నర్సయ్య, దినేశ్ ఇటీవల మద్యం మత్తులో పట్టుబడడంతో వారిని కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై పేర్కొన్నారు. జడ్జి వీరికి రూ. పదివేల చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. వాహనదారులు మద్యం మత్తు సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మోపాల్: మండలంలోని సిర్పూర్ గ్రామంలో జంగం గణేశ్ నివాసంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు ఏఎస్సై కే పరమేశ్వర్ శుక్రవారం తెలిపారు. ఏఎస్సై కథనం ప్రకారం.. గణేశ్ గ్రామంలో పూజారిగా చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంట్లో చార్జింగ్ పెట్టిన ల్యాప్టాప్ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదంలో రెండు బెడ్లు, ఫర్నీచర్, ల్యాప్టాప్, వ్యక్తిగత డాక్యుమెంట్లు, ఏసీ, దుస్తులు, పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.2.56లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. స్థానికుల సహకారంతో మంటలను నియంత్రించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. భిక్కనూరు: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన భిక్కనూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన తిరుమల రాజయ్య(75)కు ఐదు నెలల క్రితం కాలుకు గాయమైంది. పలు ఆస్పత్రుల్లో చూయించినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఇంటర్ బోర్డు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ఆర్మూర్టౌన్: ఇంటర్ బోర్డు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ అన్నారు. ఆర్మూర్లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, గిరిజన బాలుర జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ బాలుర జూనియర్ కళాశాల, చీమన్పల్లి గిరిజన బాలికల జూనియర్ కళాశాలను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటర్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతి అధ్యాపకుడు విద్యార్థుల శ్రేయస్సు కోసం పని చేయాలన్నారు. విద్యార్థులు అధ్యాపకులు బోధిస్తున్న పాఠాలను శ్రద్ధగా విని ప్రయోజకులుగా మారాలన్నారు. ఆయన వెంట ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ఉన్నారు. -
మాక్లూర్లో భారీ చోరీ
● రెండు కిలోల వెండి, అర్ధతులం బంగారం, రూ. 2.50 లక్షల నగదు అపహరణ మాక్లూర్: మండల కేంద్రంలో శుక్రవారం వేకువ జామున భారీ చోరీ జరిగింది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గూండ్ల పెద్దన్న కొత్త ఇల్లును నిర్మించుకున్నాడు. కొత్త ఇంట్లోనే నివాసం ఉంటున్న అతను పాత ఇంట్లోని వస్తువులు ఇంకా కొత్త ఇంటికి చేర్చలేదు. గురువారం రాత్రి 8 వరకు పాత ఇంట్లోనే ఉన్న అతను తిరిగి కొత్త ఇంటికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న అద్ద తులం బంగారం, రూ. 2లక్షల50వేల నగదు, 2 కిలోల వెండి చోరీకి గురైందని పెద్దన్న తెలిపారు. చోరీ విషయం తెలుసుకున్న నార్త్ జోన్ సీఐ శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకొని పరీశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
శభాష్ పోలీసన్న
రుద్రూర్: మండల కేంద్రంలో వాహనంలో ఫిట్స్ వచ్చి బాధపడుతున్న ఓ వ్యక్తిని వాహనాల తనిఖీ చేపడుతున్న పోలీసులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం సాయంత్రం రుద్రూర్ ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో పోలీసులు మండల కేంద్రంలో వాహనాల తనిఖీ చేపడుతున్న సమయంలో ఆగి ఉన్న ఓ లారీలో డ్రైవర్ ఫిట్స్తో ఇబ్బంది పడుతున్నట్టు ఎస్సై గుర్తించారు. వెంటనే 108 వాహనాన్ని రప్పించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఫిట్స్ వచ్చిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించేలా కృషి చేసిన ఎస్సై తీరును పలువురు అభినందించారు. శభాష్ పోలీస్ అన్న అంటూ పలువురు అభినందనలు తెలిపారు. -
తలసేమియా బాధితుల కోసం రక్తదానం చేయండి
కామారెడ్డి అర్బన్: తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులు తమ బంగారు బాల్యాన్ని కోల్పోడం విచారకరమని, వారిని కాపాడుకోవడానికి ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుందని, బాధ్యతగా యువత ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని పట్టణ సీఐ నరహరి కోరారు. బాలల దినోత్సవం సందర్భంగా తలసేమియా వ్యాధిపై అవగాహన కోసం శుక్రవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 250 మంది చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని కామారెడ్డి రక్తదాతల సమూహం వ్యవస్థాపకులు, రెడ్క్రాస్ సొసైటీ జిల్లా సమన్వయకర్త బాలు తెలిపారు. రక్తదాతల సమూహం అధ్యక్షుడు జమీల్ అహ్మద్, గౌరవ అధ్యక్షుడు వేదప్రకాష్, ప్రతినిధులు చంద్రశేఖర్, గంప ప్రసాద్, వెంకటరమణ, పి.అనిల్ తదితరులు పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): అక్కంపల్లిలో మంగలి ఈశ్వరమ్మ నూతనంగా నిర్మించిన ఇంటిని శుక్రవారం ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి పరిశీలించారు. ఈశ్వరమ్మ ఇంటిపై ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన తీరుపై గురువారం పలు దినపత్రికలలో ప్రచురితమైన కథనాలకు ఆయన స్పందించారు. ఈ మేరకు ఆయన అక్కంపల్లికి చేరుకొని నూతనంగా నిర్మించిన ఇంటిని పరిశీలించారు. ఇంటినిర్మాణం చేపట్టిన తీరును ఈశ్వరమ్మను అడిగి ఆయన తెలుసుకున్నారు. పూర్తి నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఆర్డీవో తెలిపారు. నాగిరెడ్డిపేట తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో లలితకుమారి, ఆర్ఐ మహ్మద్, పంచాయతీ కార్యదర్శి కిష్టయ్య తదితరులున్నారు. -
విద్యుత్షాక్తో ఒకరి మృతి
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్బోర్డులో ఓ ఇంటినిర్మాణ పనులు చేస్తున్న ఓ వ్యక్తికి విద్యుత్షాక్ తగలడంతో మృతి చెందాడు. ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పాలిత కుమార్ లహరి(35) రెండేళ్ల క్రితం ఆర్మూర్కు వచ్చి మేసీ్త్ర పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం రాత్రి హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న అతనికి భవనంపై ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
ప్లాస్టిక్ దుష్పరిణామాలపై అవగాహన
కామారెడ్డి అర్బన్: పర్యావరణ మార్పులు, ప్లాస్టిక్ వినియోగం– దుష్పరిణామాలు, ప్ర త్యామ్నాయాలు, దాని ప్రభావం, డెయిరీ రంగంపై వాటి ప్రభావం, రైతులు, డెయిరీ వి ద్యార్థులు తెలుసుకోవాల్సిన అంశాలపై శుక్రవారం కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేషనల్ యూత్ ఎన్విరాన్మెంట్ కన్సార్టియం సమన్వయకర్త మణిదీప్ వివిధ అంశాలపై వివరించారు. పేపర్ బ్యాగుల తయారీ విధా నం ప్రదర్శించారు. కళాశాల అసోసియేట్ డీన్ సురేష్ రాథోడ్, అధ్యాపకులు స్వర్ణలత, ఉమా పతి, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. బాలల చట్టాలపై అవగాహన ఉండాలి భిక్కనూరు: బాలల సంరక్షణ, హక్కులు, చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి అన్నారు. మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం బాలల చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నాయయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నపిల్లలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించేవిధంగా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చిన్నారులు ఎలాంటి ఇబ్బందులు ఎదురైన తల్లిదండ్రులకు బంధువులకు తెలియజేయాలన్నారు. విద్యార్థులు చదువుతోపాటు సమాజసేవ దేశ ప్రగతికి కృషిచేయాలన్నారు. అనంతరం పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని వారు పరిశీలించారు. ఎంఈవో రాజ్గంగారెడ్డి, ఆర్ఐ బాలయ్య తదితరులు పాల్గొన్నారు. భిక్కనూరు: ఎంఎస్ ఆఫ్తమాలజీలో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకును భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన ఎస్పీ సంకీర్తన సాధించారు. సంకీర్తన హైదరాబాద్లోని మల్లారెడ్డి మెడికల్ కళాశాలలో ఎంఎస్ ఆప్తమాలజీ చదువుతోంది. గురువారం వెలువడిన ఎంఎస్ ఆప్తమాలాజీ పీజీ ఫలితాల్లో ఆమె రెండో ర్యాంకు సాధించింది. -
సీసీ రోడ్డుకు నిధులు కేటాయించాలి
బీబీపేట: మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయం నుంచి సొసైటీ, ప్రభుత్వాసుపత్రి, తహసీల్ కార్యాలయం వరకు సీసీ రోడ్డుకు నిధులు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డిని సొసైటీ డైరెక్టర్లు వినతి పత్రం అందజేశారు. కార్యాలయాలకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని, లారీల్లో ధాన్యం, యూరియా తరలించడానికి సైతం ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొన్నారు. అలాగే తాగునీటికి సైతం ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. బోరుబావి తవ్వించాల్సిందిగా కోరారు. ఎమ్మెల్యే సాను కూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. సొసై టీ వైస్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, నరేందర్, శ్రీనివాస్, మల్లేశం, కిషన్రావు తదితరులు ఉన్నారు. -
కాలువలో పడి వృద్ధురాలి మృతి
నందిపేట్: మండల కేంద్రంలోని పలుగుట్ట సమీపంలోని నిజాంసాగర్ కాలువలో పడి కై రి గంగామణి (68) అనే వృద్ధురాలు మృతి చెందింది. నందిపేట్ ఎస్సై శ్యాంరాజ్ తెలిపిన వివరాల ప్రకా రం.. జిల్లా కేంద్రంలోని బోర్గాం(పి) శాస్త్రినగర్కు చెందిన కై రి గంగామణి గత 45 ఏళ్ల క్రితం ఆలూర్ మండల కేంద్రానికి చెందిన కృష్ణగౌడ్తో విడాకులు తీసుకుంది. నాటి నుంచి శాస్త్రినగర్లో ఉంటున్న తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ప్రతి నెల నందిపేటలోని పలుగుట్ట పుణ్య క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్లేది. ఈ నెల 5న పలుగుట్టకు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి తిరిగి రాలేదు. శుక్రవారం ఉదయం నిజాంసాగర్ కాలువలో మృతదేహం ఉందన్న స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. వారు మృతురాలి వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలు కాలకృత్యాలకు వచ్చి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి తమ్ముడు గంగాధర్గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
చదువుతోనే సమాజంలో గుర్తింపు
● కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిభిక్కనూరు: చదువుతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో డీప్ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో పాఠశాలకు ఆయన 5 కంప్యూటర్లను అందజేయించారు. ఈ సందర్బంగా కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేవీఆర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచే క్రమశిక్షణతో మెలిగి ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగితే వారి భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుందన్నారు. ఎంఈవో రాజగంగారెడ్డి, హెచ్ఎం ప్రసూనదేవి, ఎన్సీసీసీ ప్రథమశ్రేణి అధికారి జి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చేప పిల్లల పంపిణీ బీబీపేట: ప్రభుత్వం మంజూరు చేసిన వంద శాతం రాయితీతో కూడిన చేప పిల్లలను శుక్రవారం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి బీబీపేట పెద్ద చెరువులో విడుదల చేశారు. మత్స్య శాఖ సంఘం సభ్యులు పాల్గొన్నారు. సంఘాల అభివృద్ధికి కృషి చేస్తా రాజంపేట: మండలంలో సంఘాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు.పొందూర్తిలో శుక్రవారం మాల కుల సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు కల్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు సంపత్రెడ్డి,ప్రధాన కార్యదర్శి నరేందర్రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు గంగారెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు సతీష్రెడ్డి పాల్గొన్నారు. -
పెట్రోలింగ్ టెన్షన్
శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రతి క్షణం పని చేసే పోలీసులు కొన్ని సందర్భాల్లో తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవాల్సి వస్తోంది. పని ఒత్తిడిని జయిస్తున్న ఖాకీలు కొన్ని నైట్ పెట్రోలింగ్ వంటి డ్యూటీ అంటేనే ఒకింత ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి కారణం వెన్నాడుతున్న యాక్సిడెంట్ ఘటనలే. నైట్ పెట్రోలింగ్ అంటేనే టెన్షన్ పడుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి● ఖాకీలను వెన్నాడుతున్న యాక్సిడెంట్లు ● ఎనిమిది నెలల్లో మూడు ఘటనలు ● ఒకరి మృతి.. నలుగురికి గాయాలునేరాల నియంత్రణ కోసం చేపట్టే నైట్ పెట్రోలింగ్ పోలీసులకు సవాల్గా మారుతోంది. దీనికి కారణంగా వరుసగా చోటు చేసుకుంటున్న యాక్సిడెంట్లే. రాత్రి పెట్రోలింగ్ సమయంలో పోలీసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. డ్యూటీలో ఉన్నపుడు, డ్యూటీకి వెళ్లే సమయంలో, తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల జిల్లాలో జరిగిన ఘటనల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, నలుగురు గాయాలపాలయ్యారు. బుధవారం వేకువజామున 44వ నంబరు జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు తమ వాహనాన్ని యూటర్న్ తీసుకునే క్రమంలో వేగంగా వచ్చిన లారీ వెనక నుంచి ఢీకొట్టడంతో కారులో ఉన్న కానిస్టేబుల్ సైదయ్య, డ్రైవర్ స్వామిరెడ్డి గాయపడ్డారు. సైదయ్యకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. మార్చి 20వ తేదీన గాంధారి మండల కేంద్రంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, వేగంగా వచ్చిన కారు ఢీకొన్న ఘటనలో కానిస్టేబుల్ వడ్ల రవికుమార్ దుర్మరణం చెందాడు. మరో కానిస్టేబుల్ సుభాష్ తృటిలో తప్పించుకున్నాడు. ఈ నెల 11న మాచారెడ్డి మండలం చుక్కాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ సుభాష్రెడ్డికి గాయాలయ్యాయి. వరుస సంఘటనలతో పోలీసు సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. పట్టణాలతోపాటు మండలాల్లోనూ పోలీసులకు నైట్ డ్యూటీలు తప్పనిసరిగా ఉంటాయి. నైట్ పెట్రోలింగ్ లేకుంటే నేరస్తులు రెచ్చిపోతారు. అందుకే అన్ని ప్రాంతాల్లో రాత్రి పెట్రోలింగ్ తప్పనిసరిగా నిర్వహిస్తారు. నైట్ పెట్రోలింగ్ సమయంలో ఎటువైపు నుంచి ఏ వాహనం వచ్చి ఢీకొంటుందో తెలియని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అప్రమత్తంగా ఉంటేనే.. రాత్రి వేళల్లో నేరాలు ఎక్కువగా జరిగే అవకాశాలున్న నేపథ్యంలో పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాల్సిందే. ముఖ్యంగా ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేయడం, దారి దోపిడీలు, హత్యలు, దాడులు.. ఇలా ఎన్నో నేరాలు చీకట్లోనే జరుగుతాయి. అలాగే నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా కూడా రాత్రుల్లోనే జరుగుతుంది. అందుకే నైట్ పెట్రోలింగ్లో ఉండే సిబ్బంది నిద్ర ముంచుకొచ్చినా సరే డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఉన్నతాధికారులు పెట్రోలింగ్ను పర్యవేక్షించేందుకు స్వయంగా రంగంలోకి దిగుతారు. ఏదేని పరిస్థితుల్లో డ్యూటీని పక్కన పెట్టేసి నిద్రపోతున్నా, నిర్లక్ష్యం చేసినా చర్యలు తీసుకుంటారు. దీంతో డ్యూటీలో ఉన్న వారు తప్పనిసరిగా పనిచేయాల్సిందే.రాత్రిపూట పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న పో లీసులు చలికాలంలో అవసరమైన రక్షణ చర్యలు తీసుకుని విధులు నిర్వహించాల్సిందే. అలా వర్షం దంచికొడుతున్నా సరే రెయిన్ కోట్లు ధరించి డ్యూటీ చేయాలి. వాన, చలిని పక్కన పెట్టేసి బాధ్యతలు నిర్వహించాలని అధికారులు ఇచ్చే ఆదేశాలను పాటించాలి. ఒక్కోసారి రాత్రుల్లో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిందంటే ఫోన్ రాగానే పరుగులు పెట్టాలి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడం, వాహనాలు రోడ్డుపై జామ్ అయితే ట్రాఫిక్ క్లియర్ చేయడం, వాహనాలు ఒకదానికొకటి గుద్దుకుని ఇరుక్కుపోయినపుడు తక్షణ చర్యలు తీసుకోవడంపై దూకుడుగా పనిచేయాల్సి ఉంటుంది. అయితే డ్యూటీలో ఉన్న సమయంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. -
ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు
బాన్సువాడ : ఆదాయానికి, ఖర్చులకు తేడా ఉండడంతో బాన్సువాడ మున్సిపాలిటీ ఆర్థిక వ్యవహారాల్లో ‘సర్దుబాటు’ తలనొప్పిగా మారింది. ఏడాదికి రూ. 7.80 కోట్ల ఖర్చు ఉండగా, ఆదాయం మాత్రం రూ. 6.50 కోట్ల లోపే ఉంటోంది. మున్సిపాలిటీ పరిధి లోని 19 వార్డుల్లో మొత్తం 10,383 వేల పైగానే భవనాలు ఉండగా ఏడాదికి రూ.6.50 కోట్లు ఆస్తి పన్ను ద్వారా సమకూరుతున్నాయి. నల్లా కనెక్షన్లు 4,300 ఉంటే బిల్లులు మాత్రం రూ.11 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు వసూలవుతున్నాయి. ఆస్తి పన్ను, నల్లా బిల్లులు కలుపుకుంటే మొత్తం రూ.6.50 కోట్ల రాబడి వస్తోంది. అయితే డబ్బులు నేరుగా సీడీఎంఏ ఖాతా లో జమవుతుండగా ఐదారు నెలలకోసారి మున్సిపాలిటీలకు ప్రభుత్వం పంపుతోంది. కానీ మున్సిపాలిటీలో అన్ని ఖర్చులకు ఏడాదికి దాదాపు రూ.7.80 కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారు. 158 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు వివిధ పనుల కోసం మొత్తం 158 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. మున్సిపాలిటీ సాధారణ నిధుల నుంచి వీరికి వేతనాల కింద ప్రతి నెల రూ.20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. వాహనాల డీజిల్కు ఏడాదికి రూ.2 లక్షలు, పంప్హౌస్, వీధి దీపాలు, పవర్ బోర్స్, ఆఫీస్ కరెంట్ బిల్లు నెలకు రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు వస్తుంది. పైపులైన్ల నిర్వహణ, లీకేజీలకు మరమ్మతులకు రూ.2 లక్షలు, వాహనాల నిర్వహణ ఖర్చు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఉంటుంది.పట్టణంలో ఏర్పాటవుతున్న వ్యాపారాలన్నింటిని ఎప్పటికప్పుడు అసెస్మెంట్ చేయడం ద్వారా మున్సిపాలిటీ ఆదాయ వనరులు పెంచుకునే అవకాశం ఉంటుంది. కానీ అధికారులు మధ్య సిబ్బంది మధ్య సమన్వయలోపంతోపాటు రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగా ఆస్తి పన్నును పెంచుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. ఆదాయ వనరులను అందిపుచ్చుకోవాలని సీడీఎంఏ అధికారులు చెబుతున్నా ఆ దిశగా మున్సిపల్ యంత్రాంగం అడుగులు వేయడం లేదు. అస్తి పన్ను, నల్లాబిల్లులు ద్వారా ఆదాయం దాదాపు రూ.10 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉన్నా..ఆ దిశగా దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.విద్యుత్ బిల్లులు, కార్మికుల వేతనాలు, వాహనాల సంఖ్య పెరగడంతో డీజిల్ ఖర్చులు కూడా పెరిగిపోయాయి. మున్సిపాలిటీకి పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఆదాయ వనరులు కూడా పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీహరి రాజు, కమిషనర్ బాన్సువాడ మున్సిపాలిటీకి సరిపోని ఆదాయం ఖర్చు రూ.7.80 కోట్లు.. ఆదాయం రూ.6.50 కోట్లు నెలనెలా జమకాని భవనాల అనుమతుల సొమ్ము మున్సిపల్ సిబ్బందికి తప్పని సర్దుబాటు ఇక్కట్లు ప్రభుత్వం కార్మికులకు వేతనాలు ఇస్తేనే ఆర్థిక భారం తప్పే అవకాశం -
సలహాదారే కాదు.. జిల్లాకు మంత్రి!
నిజామాబాద్అర్బన్/సుభాష్నగర్ : బోధన్ ఎమ్మె ల్యే సుదర్శన్రెడ్డి ప్రభుత్వ సలహాదారుడే కాదు.. జిల్లాకు మంత్రి కూడా అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నా రు. ప్రభుత్వ సలహాదారులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా పాత కలెక్టరేట్ మైదానంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం సన్మాన సభను ఏర్పాటు చేశారు. మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ సీనియర్ నాయకుడైన సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలోనే తామంతా పనిచేస్తామన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల తీసుకురావడంలో ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా జిల్లా కు 20, 21, 22 ప్యాకేజీ తీసుకురావడంతో ఆయన ప్రధానపాత్ర పోషించారన్నారు. ఆరు మాసాలు ప్ర భుత్వం ఉంటే కెనాల్లు, ప్యాకేజీలు పూర్తయ్యేవని, ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టులను అటకెక్కించా రని విమర్శించారు. జిల్లాకు 35 ఏళ్ల కల అయిన ఇంజినీరింగ్ కళాశాలను తమ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు మంజూరు చేశామన్నారు. టెంపుల్ కారిడార్లో భాగంగా ధర్మపురి, కొండగట్టు, వేము లవాడ, లింబాద్రి గుట్ట, బాసర వరకు కొత్త రోడ్డు నిర్మాణానికి రూ.370 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. లింబాద్రి గుట్ట, ఆర్మూర్ సిద్ధుల గుట్టలో టూరిజం గెస్ట్హౌస్లు నిర్మిస్తామని, లింబాద్రి గుట్ట గెస్ట్హౌస్ కోసం రూ.4 కోట్లు గురువారమే మంజూ రు చేస్తూ జీవో వచ్చిందన్నారు. కాంగ్రెస్ అభివృద్ధి పార్టీ అని, సంక్షేమం ఇచ్చే పార్టీ అని పేర్కొన్నారు. ప్రజాసంక్షేమాన్ని విస్మరించారు బీఆర్ఎస్ నాయకులు ప్రజా సంక్షేమాన్ని మరిచి దోచుకున్నారని ప్రభుత్వ సలహాదారులు పొద్దుటూ రి సుదర్శన్రెడ్డి విమర్శించారు. జిల్లాకు అవసరమైన పనులు చేపట్టకుండా బీఆర్ఎస్ నాయకులే లబ్ధిపొందారని ఆరోపించారు. దొంగ ఓట్లతో అధి కారంలోకి వచ్చారని, గత కాంగ్రెస్ ప్రభుత్వ హ యాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. అభివృద్ధిని విస్మరించిన దద్దమ్మలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరుకు పంటకు ప్రత్యామ్నాయంగా బోధన్ ప్రాంతంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. రైతులు కూడా పామాయిల్ పంటను పండించాలని సూచించారు. సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలోనే పని చేస్తాం.. దేవుడి పేరుతో బీజేపీ నాయకులు ఓట్లు అడుగుతున్నారు.. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ -
కదిలిన రథం..వెలిగిన అగ్నిగుండం
రామారెడ్డి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇసన్నపల్లి (రామారెడ్డి) కాలభైరవుడి జన్మదిన వేడుకలు గురువారం నిర్వహించిన రథోత్సవం, అగ్నిగుండాలతో(దక్షయజ్ఞం) ముగిశాయి. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రారంభమైన రథోత్సవం ఇసన్నపల్లి, రామారెడ్డి గ్రామాలలో కొనసాగింది. యువకులు రథాన్ని లాగడానికి భారీగా తరలివచ్చారు. కాలభైరవుని నామస్మరణతో రెండు గ్రామాలు మారుమోగాయి. మహిళలు మంగళహారతులతో కాలభైరవుడికి స్వాగతం పలికి కానుకలు సమర్పించారు. రథం ఆలయ ప్రాంగణానికి చేరుకోగానే వేడుకల్లో ముఖ్యమైన అగ్ని గుండాలను (దక్షయజ్ఞం) వీరశైవ మహేశ్వరులు ప్రారంభించారు. అగ్నిగుండాలు ముగిసిన అనంతరం ఆలయంలో దండకాలు వేశారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పోలీసులు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు దాతల సాయంతో అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో ప్రభుగుప్తా తెలిపారు. స్వామివారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రూ.80 లక్షలు మంజూరు చేయించానని, రానున్న కాలంలో రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. తాను రామారెడ్డి గ్రామంలో పుట్టి పెరిగానని తన చిన్న తనంలో కాలభైరవుడి కొబ్బరి కాయల ప్రసాదం తిని కాలభైరవుడి ఆశ్వీర్వాదంతోనే ఈ స్థాయికి వచ్చనని అన్నారు. వైభవంగా కొనసాగిన రథోత్సవం అగ్నిగుండాలకు తరలివచ్చిన భక్తులు ముగిసిన కాలభైరవుడి జన్మదిన వేడుకలు రూ.10కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తానన్న ఎమ్మెల్యే -
సుదర్శన్రెడ్డికి సన్మానం
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులై తొలిసారి నిజామాబాద్కు వచ్చిన బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్రెడ్డిని టీపీసీసీ అధికార ప్రతినిధి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నా యకుడు ఏబీ శ్రీనివాస్(చిన్నా) గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణార్జునుల మాదిరిగా రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ కృషి చేస్తున్నారన్నారు. వారికి తోడు అపరచాణక్యుడిగా పేరు న్న సుదర్శన్రెడ్డి జిల్లా, రాష్ట్ర అభివృద్ధిలో తన చాతుర్యం చూపిస్తారన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ముజాహిద్ అలంఖాన్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: హైదరాబాద్కు చెందిన ఎక్సిటెల్ కంపెనీలో ఉద్యోగాల భర్తీకోసం శనివారం ఉదయం 10.30గంటలకు కలెక్టరేట్లో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధికల్పనాధికారి ఎం రజనికిరణ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు కనీసం ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్ చదివి ఉండి 30 ఏళ్లలోపు వారై ఉండాలని, ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట రెండుసెట్ల బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్, ఫొటోలు తీసుకురావాలని, వివరాలకు 63000 57052, 76719 74009 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఎంపికై న వారికి అర్హతల ఆధారంగా నెలకు రూ.13వేల నుంచి రూ.31 వేల వరకు వేతనం ఉంటుందని, హైదరాబాద్లో పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కామారెడ్డి టౌన్: ప్రసిద్ధిగాంచిన యాదగిరిగు ట్ట, స్వర్ణగిరి పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బ స్సులను నడుపనున్నట్లు కామారెడ్డి డిపో మేనేజర్ దినేశ్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి బస్సు డిపో నుంచి ప్రతి ఆదివారం ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తున్నా మని పేర్కొన్నారు. ఉదయం 6.30 గంటలకు బయలుదేరనున్న బస్సు దోమకొండ, బీబీపేట, దుబ్బాక, సిద్దిపేట మీదుగా యాదగిరి గు ట్టకు చేరుతుందని, యాదగిరిగుట్ట నుంచి మ ధ్యాహ్నం ఒంటి గంటకు బయల్దేరి స్వర్ణగిరికి 1.30 గంటలకు చేరుకుని అక్కడి నుంచి 3.00 గంటలకు కామారెడ్డికి బయలు దేరుతుందని వివరించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కామారెడ్డి క్రైం: జిల్లాలో గుర్తించిన 16 గ్రా మాల్లో భూముల రీ సర్వే కోసం గెజిట్ నోటి ఫికేషన్ విడుదల చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు. భిక్కనూర్ మండలం ఇసన్నపల్లి, బస్వా పూర్, డోంగ్లీ మండలం ఇల్దేగావ్, ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్, గాంధారి మండ లం సీతాయిపల్లి, చెన్నాపూర్, బిచ్కుంద మండలం హస్గుల్, మద్నూర్ మండలం సో మూర్, మహ్మద్నగర్ మండలం కోనంపల్లి, తెల్లాపూర్, నార్సాపూర్, వెంగలంపల్లి, జు క్కల్ మండలం సావర్గావ్, పెద్దకొడప్ల్ మండలం పోచారం, పాల్వంచ మండలం దేవన్పల్లి, బీబీపేట మండలం తుజాల్పూర్ గ్రామాల్లో భూముల రీసర్వే చేయనున్నట్లు వివరించారు. ఆయా భూముల పట్టాదారు లు అధికారులు సమాచారం ఇచ్చినప్పుడు నిర్దేశించిన సమయంలో సర్వేకు హాజరుకావాలని కోరారు. -
క్రైం కార్నర్
డ్రంకన్డ్రైవ్ కేసులో పలువురికి జైలుశిక్ష బోధన్టౌన్(బోధన్): పట్టణంలో ఇటీవల పోలీసులు డ్రంకన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా, సాలూర మండలం ఖాజాపూర్ గ్రామానికి చెందిన చింతల సాయిలు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. గురువారం అతడిని బోధన్ కోర్టులో హాజరుపర్చగా, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్పసాయి 3 రోజుల జైలుశిక్ష, రూ. 2 వేల జరిమాన విధించినట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు. వర్ని: మండలంలో ఇటీవల పోలీసులు డ్రంకన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా, రుద్రూర్ మండలం అంబం గ్రామానికి చెందిన ఇసుక లక్ష్మణ్ మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. గురువారం అతడిని బోధన్ కోర్టులో హాజరుపర్చగా, జడ్జి 2రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై మహేష్ వెల్లడించారు. వేల్పూర్: వేల్పూర్ క్రాస్రోడ్డు వద్ద బుధవారం పోలీసులు డ్రంకన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా భీమ్గల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు, వేల్పూర్కు చెందిన ఒకరు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. వారిని గురువారం ఆర్మూర్ కోర్టులో హాజరుపర్చగా, జడ్జి ఒక్కొక్కరికి రూ. 10వేల చొప్పున రూ.30వేల జరిమానా విధించినట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు. నిజామాబాద్ అర్బన్: నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఇటీవల డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా పలువురు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని గురువారం నిజామాబాద్ కోర్టులో హాజరుపర్చగా, జడ్జి 8 మందికి జైలుశిక్ష, 13 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్అలీ తెలిపారు. 13 మందికి రూ.10వేల చొప్పున జరిమానా విధించగా, ఐదుగురికి ఏడు రోజుల జైలు శిక్ష, ఒకరికి ఐదు రోజులు, మరొకరికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు వివరించారు. వాహనం నడిపిన మైనర్లకు.. నిజామాబాద్ అర్బన్: నగరంలో ఇటీవల పలువురు మైనర్లు వాహనాలు నడుపుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారిని గురువారం నిజామాబాద్ కోర్టులో హాజరుపర్చగా, జడ్జి వారితో ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రధాన రోడ్లపై ప్రచారం చేయించాలని తీర్పు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. బాలికపై అత్యాచారం: నిందితుడిపై పోక్సో కేసు నమోదు నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారం చేయగా, పోక్సో కేసు నమోదు చేసినట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. సదరు గ్రామానికి చెందిన బాలికను నిందితుడు నాలుగునెలల క్రితం మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకోవడంతోపాటు పలుమార్లు అత్యాచారం చేశాడన్నారు. విషయం ఎవరికై నా చెబితే చంపేస్తానని బెదిరించడంతో సదరు బాలిక కుటుంబసభ్యులకు చెప్పలేకపోయింది. ఇటీవల బాలిక తరుచూ వాంతులు చేసుకోవడంతో కుటుంబసభ్యులు ఆమెను మెదక్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి బాలిక మూడునెలల గర్భం దాల్చినట్లు తెలిపారు. వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిపై పోక్సో కేసునమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
రెవెన్యూ దరఖాస్తులను పరిష్కరించాలి
అదనపు కలెక్టర్ విక్టర్ భిక్కనూరు: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. ఆయన గురువారం భిక్కనూరు తహసీల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కార పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను వెంటనే జారీచేయాలన్నారు.ఆయన వెంట తహశీల్దార్ సునీత, ఆర్ఐ బాలయ్యలు ఉన్నారు. అలాగే మండల కేంద్రంలోని ఏఎంసీ యార్డును, నూతనంగా నిర్మించనున్న షాపింగ్ కాంప్టెక్స్ స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట జిల్లా మార్కెటింగ్ అధికారి ర మ్య, విండో చైర్మన్ గంగళ్ల భూమయ్య, వైస్ చైర్మన్ రాజిరెడ్డి, సీఈవో రాజు, తదితరులు పాల్గొన్నారు. -
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి క్రైం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు సూచించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కో ఆపరేటీవ్ మేనేజ్మెంట్, నేషనల్ కో ఆపరేటీవ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని అమృత గ్రాండ్ హోటల్లో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంస్థల వ్యాపార వైవిధ్యీకరణ, సామర్థ్య నిర్మాణ శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలను రైతులు, సహకార సంస్థలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మేనేజ్మెంట్ ఖర్చుల నిధులను సైతం ఉపయోగించుకుంటూ రైతు ఉత్పత్తిదారుల సంస్థల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఐసీఎం, ఎన్సీడీసీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. అంగన్వాడీ సూపర్వైజర్లు తనిఖీలు పెంచాలి అంగన్వాడీ సూపర్వైజర్లు తమ పరిధిలోని కేంద్రాల్లో తనిఖీల సంఖ్యను పెంచాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం ఏర్పాటు చేసిన సమీక్షాసమావేశంలో మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో అసంపూర్తిగా ఉన్న భవనాలు, మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీటి వసతులను త్వరితగతిన పూర్తి చేయించాలన్నారు. మూడు నెలలో కాలంలో తనిఖీల సంఖ్య తక్కువగా ఉన్న సూపర్వైజర్లు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అంగన్వాడీ చిన్నారుల ఆధార్ నమోదుకు ప్రత్యేక క్యాంప్లను ఏర్పాటు చేయాలని ఈడీఎం ప్రవీణ్కు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రంలో వృద్దాశ్రమం ప్రారంభోత్పవానికి సంబంధించిన ఏర్పాట్లు, అక్కడకు వెళ్లే రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, సీడీపీవోలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
సోయాలో తేమ 12 శాతం లోపు ఉండాలి
మద్నూర్(జుక్కల్): క్వాలిటీ లేదని సోయాను కొనుగోలు కేంద్రంలో తిరస్కరిస్తున్నారని తెలిసిందని నేషనల్ కో ఆపరేటీవ్ కన్జ్యుమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మేనేజర్ రవిచంద్ర అన్నారు. మండల కేంద్రంలోని యార్డులో కొనసాగుతున్న సోయా కొనుగోలు కేంద్రాన్ని గురువారం రాష్ట్ర బృందం అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో సోయాను విక్రయించాలంటే తేమ శాతం 12 లోపు ఉండాలని, అలాగే మట్టి 2 శాతం కన్నా ఎక్కువ ఉండొద్దని అన్నారు. కానీ అధిక వర్షాలతో సోయాలో 8 శాతం మట్టి ఉండటంతో సోయా రిజెక్ట్ అవుతోందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సోయా పంటను ఎలా అమ్ముకోవాలని, బయటి మార్కెట్లో క్వింటాల్కు రూ.వెయ్యి నష్టపోతామని రైతులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మట్టి శాతం ఎక్కువ ఉన్నందుకు రెండు కిలోల సోయా అదనంగా ఇస్తామని ప్రభుత్వ కొనుగోలు సెంటర్లో తీసుకోవాలని రైతులు కోరారు. అలాగే వేలిముద్రల సందర్భంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు అధికారులకు తెలుపగా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో నేష్నల్ కో ఆపరేటీవ్ కన్జ్యుమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు దువ్వ వినయ్, మహేశ్, అధికారులు ఉన్నారు. -
నిలిచిన తరగతి గదుల నిర్మాణం
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో ప్రభుత్వం కోటి 60 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసింది. దీంతో జీప్లస్ వన్ పద్ధతిలో 8 తరగతి గదుల నిర్మాణ పనులు ప్రారంభించారు. పనులు ఉన్నపళంగా నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం 1957లో నిర్మించారు. పాఠశాలలో 6వ తరగతి నుంచి 10 వరకు 109 మంది విద్యార్థులు, 10 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ప్రభుత్వ మన ఊరు మన బడి పథకం కింద కోటి 60 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసింది. భవనం స్లాబ్ పనులు పూర్తి కాగా.. డైనింగ్ హాల్ నిర్మాణం కేవలం పిల్లర్లకు మాత్రమే పరిమితమైంది. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో శిథిలావస్థకు చేరిన భవనంలో తరగతులు నిర్వహించవద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలో తరగతులు నిర్వహించాలని పాఠశాల ప్రిన్సిపల్కు సూచించారు. దీంతో జూనియర్ కళాశాల భవనంలో తరగతులు నిర్వహించారు. వర్షాలు తగ్గిన తర్వాత శిథిలావస్థకు చేరిన భవనంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అర్ధంతరంగా నిలిచి పోయిన తరగతి గదుల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల గదులలోనే చదువులు భారీ వర్షాలు కురిసిన సమయంలో జూనియర్ కళాశాల భవనంలో తరగతుల నిర్వహణ ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు -
ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
గాంధారి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జెడ్పీ సీఈవో చందర్ నాయక్ అధికారులకు సూచించారు. గురువారం ఆయన మండలంలో పర్యటించారు. ముందుగా పల్లెలమడుగు తండాలో రెండు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్కింగ్ వేయించారు. గాంధారిలో ఓ లబ్ధిదారుని ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పోయించారు. అనంతరం మండల కార్యాలయంలో ఐకేపీ, ఉపాధిహామీ సిబ్బంది, అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణ పనులను నిత్యం పర్యవేక్షించాలన్నారు. ఇప్పటి వరకు ప్రారంభం కాని పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఎంపీడీవో రాజేశ్వర్, ఏపీఎం ప్రసన్నకుమార్, ఆయాగ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ, ఉపాధిహామీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కళాశాల తనిఖీ
పిట్లం(జుక్కల్): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం జిల్లా నోడల్ అధికారి షేక్ సలామ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. అధ్యాపకులు, విద్యార్థులకు పలు సలహాలు,సూచ నలు ఇచ్చారు. కామారెడ్డి అర్బన్: జిల్లా పోలీసు కార్యాలయం ప్రజా సంబంధాల అధికారి(పీఆర్వో) జి. రాములు ఉత్తమ ప్రతిభ చూపినందుకు డీజీపీ శివధర్రెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. హైదరాబాద్ పోలీసు శిక్షణ సంస్థలో పోలీసు పీఆర్వోల మూడు రోజుల శిక్షణ బుధవారం ముగిసిన సందర్భంగా డీజీ పీ నుంచి రాములు ఉత్తమ ప్రశంసా పత్రం అందుకున్నారు.గురువారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర.. పీఆర్వో రాములును అభినందించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ప్రజాసేవలో, సోషల్మీడియా, కమ్యూనికేషన్ వ్యవస్థలో వినియోగించాలని ఎస్పీ ఆకాంక్షించారు. కామారెడ్డి టౌన్: నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కామారెడ్డి జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆటో బోల్తా పడి విద్యార్థులు గాయపడిన ఘటనలో ఉద్యోగులను బాధ్యులుగా చేస్తూ తొలగించడం సరికాదన్నారు. భిక్కనూరు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 15న నిర్వహిస్తున్న బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేయాలని బీసీ సంఘం ప్రతినిధి పెరుక నరేష్ కోరారు. గురువారం రామేశ్వర్పల్లిలో సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. నేతలు వినోద్గౌడ్, కుడిక్యాల రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపిస్తా
ఎమ్మెల్యే మదన్మోహన్ రావు తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందేలా తన వంతు కృషి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అన్నారు. ఆయన గురువారం తాడ్వాయి మండల కేంద్రంతో పాటు కృష్ణాజీవాడి, బ్రాహ్మణపల్లి, సోమారం, నందివాడ గ్రామాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తాడ్వాయిలో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లు నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారురాలైన మెట్టు లావణ్య, ఆమె భర్త టీకయ్యలకు నూతన వస్ట్రాలు అందించి మిఠాయిలను తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇళ్లు నిర్మించుకునే నిరుపేదల కల నెరవేరిందన్నారు. అత్యధికంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇందిరిమ్మ ఇళ్లను మంజూరు చేశామని, తాడ్వాయి మండల కేంద్రంలో 55 ఇండ్లు మంజూరు చేయగా.. అందులో 38 ఇండ్లు వివిధఽ నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. అలాగే కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. బ్రాహ్మణపల్లి, తాడ్వాయిలో అంగన్వాడీ భవన నిర్మాణాలకు భూమి పూజ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, ఎంపీడీవో సాజీద్అలీ, నాయకులు షౌకత్అలీ, శివాజీ, రాజీవ్ కుమార్, ఆకిటి వెంకట్రాంరెడ్డి, మహేందర్రెడ్డి, అఖిల్రావు, తదితరులు పాల్గొన్నారు. సహకార బ్యాంకు భవనం ప్రారంభంఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో సహకార బ్యాంకు భవనాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గురువారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సహకార బ్యాంకుల ద్వారా అన్ని రకాల రుణాలు రైతులు పొందవచ్చని అన్నారు. డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, ఆర్డీవో పార్థసింహారెడ్డి, తహసీల్దార్ ప్రేమ్కుమార్, మున్సిపల్ కమిషనర్ మహేష్కుమార్, తదితరులు ఉన్నారు. -
పంజా విసురుతున్న చలి
● గాంధారిలో 10.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ● జిల్లా అంతటా పెరిగిన చలితీవ్రతసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చలితీవ్రత పెరిగింది. జిల్లా అంతటా చలి పెరిగి జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు చలితీవ్రత పెరిగి మరింత ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి పూట గడపదాటలేని పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం గాంధారిలో 10.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్దేవ్పల్లిలో 11 డిగ్రీలు, పాల్వంచ మండలం ఎల్పుగొండ, బీబీపేట మండల కేంద్రాల్లో 11.1, నస్రుల్లాబాద్, మాచారెడ్డి మండలం లచ్చాపేటలో 11.2, రామారెడ్డి, గాంధారి మండలం రామలక్ష్మణ్పల్లిలో 11.4, సర్వాపూర్లో 11.5, డోంగ్లీలో 11.6, మద్నూర్ మండలం మేనూర్లో 11.8, పాల్వంచ మండలం ఇసాయిపేట, జుక్కల్లో 11.9, బీర్కూర్లో 12, భిక్కనూరులో 12.4, బిచ్కుంద మండలం పుల్కల్లో 12.5, బిచ్కుంద, లింగంపేట, హసన్పల్లిలో 12.6, దోమకొండలో 12.7, నాగిరెడ్డిపేట, మహ్మద్నగర్లో 12.9, బాన్సువాడ మండలం కొల్లూరులో 13.3, కామారెడ్డి మండలం పాతరాజంపేటలో 13.5, పిట్లంలో 13.7, సదాశివనగర్లో 13.8, మద్నూర్ మండలం సోమూర్లో 14.5, రాజంపేట మండలం ఆర్గోండ, పెద్ద కొడప్గల్లో 15.2, తాడ్వాయిలో 16.4, కామారెడ్డి కలెక్టరేట్లో 16.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
న్యాయం లభిస్తేనే చట్టంపై విశ్వాసం
కామారెడ్డి క్రైం: బాధితులకు న్యాయం జరిగితేనే వారికి చట్టంపై విశ్వాసం పెరుగుతుందని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం స్టేషన్ రైటర్లు, సర్కిల్, డీఎస్పీ కార్యాలయాల రైటర్లతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎఫ్ఐఆర్ నుంచి చార్జిషీట్ వరకు అన్ని వివరాలు స్పష్టంగా, సమగ్రంగా, తప్పులు లేకుండా నమోదు చేయడం ప్రతి రైటర్ బాధ్యత అని అన్నారు. కేసుల దర్యాప్తు, విచారణ, పరిశోధనలో నాణ్యతాప్రమాణాలు పాటించడం అత్యంత కీలకమన్నారు. సాక్షుల, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు ప్రతి కేసులో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. నేరస్తులకు అనుకూలంగా ఇచ్చే స్టేట్మెంట్లు విచారణ నాణ్యతను దెబ్బతీస్తాయన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, అధికారులు, జిల్లాలోని అన్ని పీఎస్ల రైటర్లు పాల్గొన్నారు. వేల్పూర్: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని డీఈవో అశోక్ సిబ్బందికి సూచించారు. మండలంలోని పచ్చలనడ్కుడ హైస్కూలును గురువారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు వండుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వంట పాత్రలను చాలా శుభ్రం చేసి వండాలని నిర్వాహకులకు సూచించారు. విద్యార్థులకు నిర్వహిస్తున్న డిజిటల్ తరగతుల గురించి హెచ్ఎం రమేశ్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. పదోతరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతుల నిర్వహణపై ఆరాతీశారు. పాఠశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: సారంగాపూర్లోని తెలంగాణ విశ్వవిద్యాలయం బీఈడీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిగ రవీందర్కు ‘హిందుస్థాన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సాధించాడని అధ్యాపక సిబ్బంది గురువారం తెలిపారు. ‘కోవిడ్–2019 కాలంలో అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వేబినార్లు, కాన్ఫరెన్స్లు ఈ–క్విజ్ పోటీలలో రవీందర్ పాల్గొని, 140 ఈ–సర్టిఫికెట్లను పొందారు. అభ్యసనం– విద్యా శ్రేష్టత’కు వారు చేసిన అంకిత భావానికి గుర్తింపుగా హిందుస్థాన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించింది. ఈసందర్భంగా ఆయనకు ప్రిన్సిపాల్ సాయిలు, అధ్యాపక సిబ్బంది అభినందనలు తెలిపారు. -
నిధుల మంజూరుకు ప్రతిపాదనలు
బాన్సువాడ రూరల్: తిర్మలాపూర్ శివారులో నిజాంసాగర్ ప్రధాన కాలువ డిస్ట్రీబ్యూటరీ కెనాల్– 9 వద్ద ఇటీవల కురిసిన వర్షాలకు కట్టకు బుంగ పడింది. దీంతో అప్పటికప్పుడు అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేయించారు. అయినా ప్రధాన కాలువకు నీరు వదిలినప్పుడల్లా లీకేజీ అవుతుండటంతో శాశ్వత మరమ్మతులు చేయించాలని అధికారులు నిర్ణయించారు. దీనిలో భాగంగా గురువారం నీటిపారుదలశాఖ ఎస్ఈ దక్షిణామూర్తి, ఈఈ రాజశేఖర్, డీఈఈ శ్రీచంద్ తదితరులు ప్రధాన కాలువను పరిశీలించారు. ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి మంజూరు రాగానే శాశ్వత మరమ్మతులు చేయిస్తామన్నారు. ఏఈలు నితిన్, గజానంద్, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి తదితరులున్నారు. -
ధాన్యం తూకం వేగవంతం చేయాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): ధాన్యం తూకాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మండలంలోని ఎల్లారం గ్రామాన్ని కలెక్టర్ గురువారం సందర్శించారు. ముందుగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. సేకరించిన ధాన్యం వివరాలు ట్యాబ్లో నమోదవుతున్నాయా, డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేస్తున్నారా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హమాలీలతో మాట్లాడిన కలెక్టర్.. వెంటవెంటనే ధాన్యం తూకం చేస్తూ లారీల్లో లోడ్ చేయాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. దశల వారీగా బిల్లులు అందుతున్నాయా అని ఆరా తీశారు. ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి సమస్యలున్నా అధికారులకు వివరించాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన తర్వాత సామూహిక గృహప్రవేశాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో సురేందర్, హౌజింగ్ ఎంపీడీవో నరేశ్, ఎంపీవో మల్హారి, డీఈ సుభాష్, ఏఈలు రజినీకాంత్, సతీశ్, సృజన్కుమార్, యూసుఫ్, ఆయా శాఖల అధికారులు ఉన్నారు. -
సోయా రైతులను ఇబ్బందులు పెట్టొద్దు
బిచ్కుంద(జుక్కల్): వర్షాల కారణంగా కొంత మేర సోయా పంట దెబ్బతిన్నదని, రెండు, మూడు శాతం నాణ్యత లోపించినప్పటికీ రైతులను ఇబ్బందులు పెట్టకుండా పంట దిగుబడిని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అధికారులకు సూచించారు. ఎన్సీసీఎఫ్, మార్క్ఫెడ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గురువారం బిచ్కుంద మార్కెట్ యార్డులో సోయాను పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని, మార్క్ఫెడ్ నిబంధనల్లో కొంత వెసులుబాటు కల్పించి దెబ్బతిన్న సోయాను కూడా కొనుగోలు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. రైతులు ఆందోళన చెందొద్దన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీఎఫ్ రాష్ట్ర అధికారి రవిచంద్ర, వినయ్ మహనామ, సర్వేయర్ మహేశ్, మార్క్ఫెడ్ ఎండీ శశిధర్రెడ్డి, చందు, సొసైటీ చైర్మన్ బాలాజీ, ఏవో అమర్ప్రసాద్, సంఘం కార్యదర్శి శ్రావణ్, రైతులు పాల్గొన్నారు. -
పాఠశాల భవన పునర్నిర్మాణానికి రూ.కోటి విరాళం
దోమకొండ: మండల కేంద్రంలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవన పునర్నిర్మాణానికి గ్రామానికి చెందిన పబ్బ విజయ్కుమార్ రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు బుధవారం పాఠశాల హెచ్ఎం రాధాలక్ష్మికి బాండ్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను చదువుకున్న పాఠశాలను తన సొంత నిధులతో పునర్నిర్మిస్తానని, భవనానికి తన తల్లిదండ్రులు పబ్బ రుక్మమ్మ, బలరామయ్య పేర్లు పెట్టాలని కోరారు. భవన నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా, అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో తానే చేపడతానని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పన్యాల బాపురెడ్డి, శ్రీనివాస్శర్మ, నాయకులు పున్న లక్ష్మణ్, గుడూరి నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి క్రైం: సేకరించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేసి మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని నర్సన్నపల్లి కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దని, లోడింగ్, అన్లోడింగ్ వెంట వెంటనే జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత మండలస్థాయి అధికారులు క్రమం తప్పకుండా నిత్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ–గ్రేడ్ ధాన్యం క్వింటాల్కు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర చెల్లించడంతోపాటు సన్న రకానికి అదనంగా క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ అందిస్తోందని తెలిపారు. కలెక్టర్ వెంట సివిల్ సప్లయీస్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. గాంధారి(ఎల్లారెడ్డి): కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు నాణ్యతను పాటించాలని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ శశిధర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోయాబీన్, మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఇప్పటి వరకు ఎంత కొనుగోలు చేశారు.. మార్కెట్లో ఎన్ని క్వింటాళ్ల కాంటా చేయాల్సి ఉంది తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత విషయంలో రాజీపడొద్దని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట మార్క్ఫెడ్ పర్యవేక్షకులు చందు, సింగిల్ విండో సీఈవో సాయిలు, ఏఈవో నిఖిత తదితరులు ఉన్నారు. -
కాలినడకన బడికి!
ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల తండాకు చెందిన ఒకటి, రెండో తరగతి చదివే ఐదారేళ్ల వయస్సున్న పిల్లలు రోజూ మూడు కిలోమీటర్ల దూరాన ఉన్న వెల్లుట్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. మార్గమధ్యలో అడవి జంతువులు, కోతుల నుంచి తమల్ని తాము కాపాడుకునేందుకు పిల్లలు కర్రలు పట్టుకుని వెళ్తుంటారు. వీరికి ఇప్పటి వరకు ఎలాంటి రవాణా భత్యం రావడం లేదు. ఈ ఏడాది ప్రతిపాదించిన దాంట్లో కూడా లేకపోవడం గమనార్హం.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : విద్యార్థులు ఉన్న చోట బడి ఉండదు.. బడి ఉన్న చోట పంతుళ్లుండరు. ముఖ్యంగా మారుమూల గ్రామాలు, తండాల్లో బడులు లేక, బడులు ఉన్నా టీచర్లు లేక చదువు కోసం విద్యార్థులు పొరుగూళ్లకు వెళ్లాల్సి వస్తోంది. రవాణా సౌకర్యం లేకపోవడంతో వేలాది మంది పిల్లలు కాలినడకన స్కూళ్లకు వెళ్తున్నారు. రెండు మూడు కిలోమీటర్ల నుంచి ఐదారు కిలోమీటర్లు కూడా నడిచి వెళ్లే వారున్నారు. మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో విద్యార్థులు తక్కువగా ఉన్నారనే కారణంతో గడిచిని పదేళ్లలో యాభైకి పైగా పాఠశాలలు మూతబడ్డాయి. కొన్ని చోట్ల విద్యార్థులు ఉన్నా టీచర్లు లేక మొక్కు‘బడి’గా నడుస్తున్నాయి. దీంతో మారుమూల గ్రామాలు, తండాలకు చెందిన పిల్లలు చదువు కోసం పొరుగూళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. రవాణా భత్యం కొందరికే.. అందుబాటులో బడులు లేని విద్యార్థులు పొరుగూళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వం సర్వశిక్షా అభియాన్తోపాటు పీఎం శ్రీ నిధుల నుంచి రవాణా భత్యం ఇస్తుంటారు. అయితే రకరకాల నిబంధనలతో చాలా మంది విద్యార్థులకు భత్యం అందడం లేదు. 2024–25 విద్యాసంవత్సరంలో జిల్లాలో 1,056 మంది విద్యార్థులకు రూ.6 వేల చొప్పున భత్యం మంజూరైంది. ఈ విద్యాసంవత్సరం 59 స్కూళ్లకు చెందిన 1,565 మంది విద్యార్థులకు రవాణా భత్యం అందించాలని ప్రతిపాదనలు పంపించారు.ప్రాథమిక పాఠశాలలు 702 విద్యార్థులు 30,045 ప్రాథమికోన్నత పాఠశాలలు 124 విద్యార్థులు 8,819 ఉన్నత పాఠశాలలు 191 విద్యార్థులు 32,109 అందుబాటులో స్కూళ్లు లేక పొరుగూళ్లకు బస్సులు లేకపోవడంతో నడిచి వెళ్లాల్సిందే కొందరికే అందుతున్న రవాణా భత్యం సౌకర్యం కల్పించడమే పరిష్కారం -
బంగారు భైరవుడికి డోలోత్సవం
● వైభవంగా కొనసాగుతున్న కాలబైరవుడి జన్మదినోత్సవాలు ● నేడు రథోత్సవం.. అగ్నిగుండాలురామారెడ్డి: దేశంలో ప్రముఖ పుణ్యాక్షేత్రంగా పేరుగాంచిన ఇస న్నపల్లి(రామారెడ్డి) కాలభైరవుడి జన్మదిన వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో ముఖ్యమైన ఘట్టమైన డోలారోహ ణం (తోట్లె) బుధవా రం రోజున ఘనంగా నిర్వహించారు. కాలభైరవ నామస్మరణ, లాలి పాటలతో డోలోత్సవం సాగింది. మూడు రోజులపాటు కొనసాగిన సంతతదారాభిషేకం బుధ వారం ఉదయం 6 గంటలకు ముగిసింది. మ ధ్యాహ్నం ఒంటి గంట నుంచి సింధూర పూజ లు నిర్వహించి మధ్యాహ్నం 3 గంటలకు కాలభైరవుడికి నైవేద్యం సమర్పించారు. స్వామివారి బంగారు విగ్రహాన్ని తొట్లెలో వేసి లాలిపాటలు పాడారు. ఆలయ పరిసరాలు కాలభైరవ నామస్మరణతో మారుమోగాయి. ఆలయాన్ని పూలమాలలతో విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. గురువారం రాత్రి 3గంటల నుంచి రథోత్సవం ప్రారంభం కానుంది. స్వామివారి ఉ త్సవ విగ్రహాన్ని ఇసన్నపల్లి(రామారెడ్డి) గ్రామా లలో రథంపై ఊరేగించిన అనంతరం ఆలయానికి రథం చేరుకోగానే వీరశైవ మహేశ్వరులతో అగ్నిగుండాలు (దక్షయజ్ఞం) ప్రారంభమవుతుంది. రథోత్సవం, అగ్నిగుండాలకు రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వామి సేవలో ప్రముఖులు కాలభైరవుడి డోలారోహణం కార్యక్రమానికి నిజామాబాడ్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర, ఏఎస్పీ చైతన్యరెడ్డి హాజరయ్యారు. ఆలయ ఈవో ప్రభుగుప్తా, అర్చకులు శ్రీనివాస శర్మ, వంశీకృష్ణ శర్మ, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
దళారులకు ‘తుపాను’ మేలు
● మధ్యవర్తులకు కలిసొచ్చిన తుపాను ● తప్పని పరిస్థితుల్లో దళారులకు ధాన్యాన్ని విక్రయిస్తున్న రైతులుసదాశివనగర్(ఎల్లారెడ్డి): రైతులను ఆగం చేసిన తుపాను దళారులకు మేలు చేసింది! చేతికొచ్చిన పంటను నూర్పిడి చేసే దశలో కురిసిన వర్షాలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మరోవైపు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయిద్దామంటే అధికారులు ఇప్పటికీ కనీస వసతులు కల్పించకపోవడంతో రైతులు అయోమయస్థితిలో పడుతున్నారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం, ప్రారంభమైన కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు లేకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. కొందరు రైతులు వరి, మొక్కజొన్న, సోయా తదితర పంటలను దళారులకే విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన దళారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాల్ మొక్కజొన్నకు రూ.2400 ధర ప్రకటించగా దళారులు రూ.1600 నుంచి రూ.1900 చెల్లిస్తున్నారు. సోయాకు మార్కెట్ ధర రూ.5,328 ఉండగా దళారులు రూ.4 వేల నుంచి రూ.4,300 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.చేతికొచ్చిన మొక్కజొ న్న, వరి, సోయా పంటలు అ కాల వర్షాలతో తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తోంది. ధాన్యం ఆరబెట్టుకోవడానికి స్థలాలు లేక రోడ్లమీద పోస్తున్నాం. కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో ధాన్యాన్ని తీసుకోకపోవడంతో దళారులకే అమ్ముకోవాల్సి వస్తోంది. – రాజిరెడ్డి, తిర్మన్పల్లి, సదాశివనగర్ -
బూత్స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలి
కామారెడ్డి క్రైం: బూత్స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. పార్టీల ప్రతినిధులతో బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో సహకారం అందించాలన్నారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలన్నారు. తప్పులు లేకుండా ఓటరు జాబితా సవరణ చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, అధికారులు పాల్గొన్నారు. మినీ రైస్మిల్తో ఆర్థిక లాభం.. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన మినీ రైస్మిల్ పనితీరును కలెక్టర్ సంగ్వాన్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇలాంటి యూనిట్ లను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు, మహిళా సంఘాల సభ్యులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. ఈ యూనిట్లను పరిశ్రమల మాదిరిగా ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సింగిల్ ఫేజ్ కరెంట్తో నడిచే ఈ మినీ రైస్మిల్ గంటకు 250 కిలోల వడ్లను బియ్యంగా చేసి ఇస్తుందని తెలిపారు. పనులను వేగవంతం చేయాలి కామారెడ్డి టౌన్: వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో కొనసాగుతున్న పనులను బుధవారం ఆయన పరిశీలించారు. కళాశాల భవనం, బాలికల హాస్టల్, బాలుర హాస్టల్, డైనింగ్ హాల్ భవనాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పనుల పురోగతిపై, వైద్య కళాశాలకు అవసరమైన మంచి నీటి వసతిపై మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులతో మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చిలోగా నాణ్యతతో కూడిన నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్అండ్బీ ఈఈ మోహన్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, ఆయా శాఖల అధికారులు ఉన్నారు. -
పేకాటపై పోలీస్ ఫోకస్
● స్థావరాల నిర్వాహకులపై దృష్టి ● పెరుగుతున్న కేసుల సంఖ్యకామారెడ్డి క్రైం: ‘పేకాట’ సరదాగా మొదలయ్యి ఎంతో మందికి వ్యసనంగా మారుతోంది. పేకాట ఆడే ఒక్కరి కారణంగా కుటుంబం ఆర్థికంగా సర్వం కోల్పోతూ వీధిన పడుతోంది. ఈ నేపథ్యంలో పేకాట నియంత్రణపై జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. స్థావరాల నిర్వాహకులపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇటీవల జిల్లా వ్యాప్తంగా పేకాట కేసుల సంఖ్య పెరిగింది. అడ్డాలు మారుస్తూ.. జిల్లా కేంద్రంతోపాటు ఎల్లారెడ్డి, నిజాంసాగర్, మద్నూర్, జుక్కల్, బాన్సువాడ, బీర్కూర్, గాంధారి, సదాశివనగర్, భిక్కనూరు తదితర ప్రాంతాలు పేకాటకు పెట్టింది పేరు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా నిత్యం పేకాట జోరుగా సాగుతోంది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఎప్పటికప్పుడు అడ్డాలు మారుస్తూ జూదస్థావరాలు నిర్వహిస్తుంటారు. గతంలో జరిపిన దాడుల్లో ప్రజాప్రతినిధులు సైతం పట్టుబడ్డారు. అయితే, జిల్లాలో నిఘా ఉందనే కారణంతో కొందరు మహారాష్ట్రలోని పేకాట క్లబ్లకు వెళ్లి రావడం గమనార్హం. జిల్లాలో కేసులు.. జిల్లా పోలీసుశాఖ పరిధిలో 3 సబ్ డివిజన్లు, 6 సర్కిళ్లు ఉండగా.. వాటి పరిధిలో 23 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. 2023లో 155, 2024లో 207, 2025 ఆగస్టు వరకు 102 పేకాట కేసులు నమోదయ్యాయి.పేకాటతో వల్ల తలెత్తే అనర్థాలు, జిల్లాలో పరిస్థితిని గుర్తించిన ఎస్పీ రాజేశ్చంద్ర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక పోలీసులతోపాటు టాస్క్ఫోర్స్ బృందాలు సైతం పేకాటపై నిఘా కొనసాగిస్తున్నాయి. పేకాట ఆడేవారి కన్నా ముందు నిర్వాహకులను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టారు. నెల రోజుల క్రితం పిట్లం పోలీస్స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై జరిపిన దాడుల్లో రూ.3.60 లక్షలు పట్టుకోవడంతోపాటు నిర్వాహకుడిని జైలుకు పంపారు.జూదం కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా నలిగిపోతున్నాయి. పేకాట నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా పెట్టాం. పేకాట ఆడినా, ఆడించినా సహించేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. – రాజేశ్చంద్ర, ఎస్పీ, కామారెడ్డి -
పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన లారీ
● కానిస్టేబుల్, హోంగార్డుకు గాయాలుకామారెడ్డి క్రైం: పెట్రో లింగ్ నిర్వహిస్తూ జాతీ య రహదారిపై యూ టర్న్ తీసుకుంటున్న పోలీసు వాహనాన్ని అతివేంగా వచ్చిన గు ర్తు తెలియని లారీ ఢీకొనడంతో ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యా యి. వివరాలు ఇలా ఉన్నాయి.. బుధవారం జిల్లా కేంద్రానికి సమీపంలోని క్యాసంపల్లి వద్ద హైవే పెట్రోలింగ్ కారు (ఇన్నోవా) యూటర్న్ తీసుకోబోయింది. అదే సమయంలో వేగంగా హైదరాబాద్ వైపు నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సదయ్య, హోంగార్డు స్వామిరెడ్డికి గాయాలయ్యాయి. వారిని వెంటనే జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. సదయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు హైదరాబాద్కు రిఫర్ చేశారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లారీని ఇందల్వాయి టోల్గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. -
ట్రాన్స్ఫార్మర్ చోరీ
కామారెడ్డి టౌన్: జిల్లాకేంద్రంలోని సిరిసిల్లా రోడ్ త్రిశక్తి ఆలయం వెనకాల ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. అందులోని కాపర్ కాయిల్స్, ఆయిల్ను దొంగలించారు. మరుసటి రోజు ఏఈ మనోరంజన్ ట్రాన్స్ఫార్మర్ను పరిశీలించి, పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రూ. 80వేలకు పైగా నష్టం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. పాన్షాపులో .. నవీపేట: మండల కేంద్రంలోని వైన్షాపు సమీపంలోగల పాన్షాపులో గుర్తుతెలియని దుండగులు మంగళవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. మరుసటి రోజు ఉదయం షాపు నిర్వాహకుడు చోరీని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. షాపు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు రూ.8500 నగదుతో పాటు రూ. 10వేల విలువైన సామగ్రిని ఎత్తుకెళ్లారు. ఈమేరకు బాధితుడు ముజాహిద్ అలీఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
ఫోర్జరీ సంతకాలతో రుణం
సదాశివ నగర్(ఎల్లారెడ్డి): తనకు తెలియకుండా రుణం తీసుకున్నారని ఆరోపిస్తూ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన స్నేహ మహిళా సంఘం సభ్యురాలు షెకెల్లి త్రివేణి అనే మహిళ బుధవారం మహిళా సంఘం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. సంఘ సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి వీవోఏ వరలక్ష్మి, ఐకెపీ సీసీ లింగం కలిసి బ్యాంకులో రూ.15 లక్షల రుణం తీసుకున్నారని త్రివేణి ఆరోపించారు. దీనిపై డీఆర్డీవో, కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశానన్నారు. సంతకాలు ఫోర్జరీ చేసి రుణం తీసుకున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని త్రివేణి డిమాండ్ చేశారు. -
క్రైం కార్నర్
స్వదేశానికి చేరిన మృతదేహం లింగంపేట(ఎల్లారెడ్డి): దుబాయ్లో నెలరోజుల క్రితం మృతిచెందిన ఓ వ్యక్తి మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. వివరాలు ఇలా.. మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన మన్నె సంగమేశ్వర్(39) ఉపాధి నిమిత్తం గతేడాది దుబాయ్ దేశానికి వెళ్లాడు. గత నెల 11న అక్కడ పనులు చేస్తున్న చోట ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు కుటుంబ సభ్యులకు సమాచారం అందగా, వారు దుబాయ్లోని భారత సేవా సమితి సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం వారు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి షార్జా నుంచి హైదరాబాదుకు సంగమేశ్వర్ మృతదేహాన్ని తరలించే ఏర్పాట్లు చేశారు. మృతుడికి తల్లిదండ్రులు పోచవ్వ, ఎల్లయ్య, భార్య సరిత, ఇద్దరు కుమారులు కార్తీక్, కౌశిక్ ఉన్నారు. రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత మద్నూర్(జుక్కల్): మంజీరా నది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండ అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకోని సీజ్ చేసినట్లు డోంగ్లీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా బుధవారం తెలిపారు. పోతంగల్ మంజీరా శివారులోని కోడిచెర్ల నుంచి రెండు ఇసుక ట్రాక్టర్లు డోంగ్లీ గుండా వెళ్తుండగా పట్టుకొని, డోంగ్లీ తహసీల్దార్ కార్యాలయానికి తరలించి సీజ్ చేశామని తెలిపారు. పిట్లం మండలంలో.. పిట్లం(జుక్కల్): బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామం నుంచి మంగళవారం రాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పిట్లం శివాజీ చౌక్ వద్ద పట్టుకున్నట్లు ఎస్సై వెంకట్రావ్ తెలిపారు. మండల పోలీస్ స్టేషన్ బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
ఎస్జీఎఫ్ క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ
బాన్సువాడ రూరల్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడల్లో మండలంలోని తెలంగాణ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబర్చారని పీఈటీ సుప్రిత బుధవారం తెలిపారు. రన్నింగ్ పోటీల్లో శ్రీనందిని, సౌజన్య, వాణి బహుమతులు సాధించారన్నారు. శ్రీనందిని, సౌజన్య రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. అలాగే అండర్–14 విభాగంలో 200మీటర్ల పరుగు పందెంతో పాటు లాంగ్జంప్లో జి. సాత్విక జిల్లాస్థాయిలో రెండు బంగారు పతకాలు అందుకుని రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్కు ఎంపికై ందన్నారు. ప్రతిభ చాటిన విద్యార్థినులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. మోపాల్(నిజామాబాద్రూరల్): తెలంగాణ యూనివర్సిటీని అక్రమాలకు అడ్డాగా మార్చొద్దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి విజ్ఞప్తిచేశారు. ఈమేరకు బుధవారం తెలంగాణ యూనివర్సిటీలో వీసీ యాదగిరి రావును ఆయన మర్యాదపూర్వకంగా కలిసి, మాట్లాడారు. తెయూలో 2012 లో జరిగిన నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో వివిధ పత్రికల్లో వస్తున్న కథనాల గురించి వీసీతో చర్చించారు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎంపీ అర్వింద్ ధర్మపురి కృషి చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం రూ.20కోట్ల నిధులు మంజూరు చేసిందని గుర్తుచేశారు.మండల అధ్యక్షుడు చంద్రకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్రెడ్డి, నాయకులు శ్యామ్రావు, సురేష్, శ్రీనివాస్ గౌడ్,పరుశరాం, లక్ష్మీనారాయణ, పృథ్వీ, సమీర్, వినోద్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఇంటి బిల్లు ఇప్పించమని ప్రార్థన..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): తాను నూతనంగా నిర్మించుకున్న ఇంటికి ఇందిరమ్మ ఇంటి బిల్లులను అందించాలని కోరుతూ చేస్తూ నాగిరెడ్డిపేట మండలంలోని అక్కంపల్లిలో మంగలి ఈశ్వరమ్మ అనే వితంతు బుధవారం తన ఇంటిపై ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని తెలిసిన వెంటనే తాను బేస్మెంట్ నిర్మాణం చేపట్టానని, ఆ తరువాత తర్వాత పంచాయతీ కార్యదర్శితోపాటు ఇతరులు వచ్చి బేస్మెంట్ పక్కన ఉన్న ఖాళీస్థలంలో మార్కింగ్ ఇచ్చి మంజూరుపత్రం అందజేశారని తెలిపింది. నూతనంగా నిర్మించిన బేస్మెంట్ పైనే మార్కింగ్ ఇవ్వాలని తాను కోరినప్పటికీ అధికారులు పక్కనే ఉన్న తన సోదరులకు సంబంధించిన ఖాళీస్థలంలో మార్కింగ్ ఇచ్చారని ఆమె వాపోయింది. తన ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో అప్పటికే నిర్మించుకున్న బేస్మెంట్పై, ఇందిరమ్మ ఇంటి నిర్మాణ కొలతల ప్రకారమే పనులు చేపట్టానని తెలిపింది. ఇంటినిర్మాణం కోసం తాను సుమారు రూ.7లక్షల వరకు అప్పు చేశానని, భర్తను కోల్పో యి ఒంటరి మహిళగా ఉన్న తనకు ఇందిరమ్మ ఇంటి బిల్లులను అందించి ఆదుకోవాలని ప్రజాప్రతినిధులను, అధికారులను ఆమె కోరుతోంది. నిబంధనలకు వ్యతిరేకంగా ఇంటి.. గ్రామంలోని మంగలి ఈశ్వరమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైన మాట వాస్తవమేనని పంచాయతీ కార్యదర్శి కిష్టయ్య తెలిపారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా మార్కింగ్ ఇచ్చిన స్థలంలో కాకుండా పక్కనే ఉన్న స్థలంలో ఇదివరకు నిర్మించిన బేస్మెంట్పై ఈశ్వరమ్మ ఇంటినిర్మాణం చేపట్టారన్నారు. దీంతో ఆమెకు ఇందిరమ్మ ఇంటిబిల్లులు చెల్లించే అవకాశం లేదని పంచాయతీ కార్యదర్శి స్పష్టం చేశారు. -
ఇంటర్లో మంచి ఫలితాలు సాధించాలి
● ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ షేక్సలాంఎల్లారెడ్డి: మోడల్ కళాశాల విద్యార్థులు ఇంటర్లో మంచి ఫలితాలు సాధించాలని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ ఆఫీసర్ షేక్ సలాం అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి మోడల్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. కళాశాలలోని అడ్మిషన్ రిజిస్టర్ను తనిఖీ చేసి విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ప్రిన్సిపాల్ గాంధీ, అధ్యాపకులు జహంగీర్, రాజశేఖర్, ప్రియదర్శిని, లక్ష్మణ్ సింగ్ తదితరులు ఉన్నారు. లింగంపేటలో.. లింగంపేట: ఇంటర్ వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా ఇంటర్ విద్యా నోడల్ అధికారి షేక్ సలామ్ సూచించారు. లింగంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న అర్ధవార్షిక పరీక్షలను తనిఖీ చేశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అధ్యాపకులకు సూచించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ నరేందర్, అధ్యాపకులు నాగు, దుర్గయ్య, శివ, రాజు, హైమద్, ధర్సింగ్, సంధ్యారాణి, శ్రీలత, స్వామిగౌడ్, ఆనంద్రెడ్డి తదితరులు ఉన్నారు. -
అప్పులు తీర్చేందుకు చోరీకి యత్నం
కామారెడ్డి క్రైం: ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి ఓ యువకుడు అప్పులు చేయగా, వాటిని తీర్చడానికి చోరీకి యత్నించాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. జిల్లాకేంద్రంలో చోటుచేసుకున్న ఘటన వివరాలను బుధవారం కామారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి వెల్లడించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా రవింగర్కోటకు చెందిన దుయ్యవార్ రోహిత్ మారుతి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. ఇటీవల అతడు నీట్లో ర్యాంకు సాధించి వెటర్నరీ సీటు సంపాదించాడు. కానీ ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి రూ.60వేల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చడం కోసం దొంగతనాలు, దోపిడీలబాట పట్టాడు. ఈక్రమంలో కామరెడ్డిలోని వివేకానంద కాలనీలో మంగళవారం సాయంత్రం కొండా లలిత అనే వృద్ధురాలు తన ఇంట్లో ఒంటరిగా ఉండగా అతడు ఆమె వద్దకు వెళ్లి మంచి నీళ్లు కావాలని అడిగాడు. ఆమె నీళ్లు తేవడానికి ఇంట్లోకి వెళ్తుండగా వెనుక నుంచి దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. అతడు కాలనీలో పరిగెడుతుండగా అటుగా వచ్చిన ఎన్సీసీ క్యాడెట్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకుని చుట్టుపక్కల సీసీ కెమెరాలు పరిశీలిస్తూనే గాలింపు చర్యలు చేపట్టారు. ఓచోట నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అప్పులు తీర్చడం కోసం చోరీకి యత్నించినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నామనన్నారు. పట్టణ ఎస్హెచ్వో నరహరి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డిలో వృద్ధురాలి మెడలో నుంచి బంగారు చైన్ను లాక్కెళ్లిన యువకుడు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించిన పోలీసులు వివరాలు వెల్లడించిన ఏఎస్పీ చైతన్య రెడ్డి -
జీపీవోలు అందుబాటులో ఉండాలి
ఎల్లారెడ్డి: జీపీవోలు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని తహసీల్దార్ ప్రేమ్కుమార్ సూచించారు. బుధవారం తహసీల్ కార్యాలయంలో జీపీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జీపీవోలు వారికి కేటాయించిన రెవెన్యూ గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలకు కావాల్సిన ధ్రువపత్రాలను సకాలంలో అందించాలని సూచించారు. కార్యక్రమంలో గిర్దావార్ శ్రీనివాస్, జీపీవోలు తదితరులు పాల్గొన్నారు. తాడ్వాయి: జిల్లా కేంద్రంలో ఈనెల 15వ తేదీన నిర్వహించే బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ తాడ్వాయి మండల కన్వీనర్ గడ్డం బాబు సాయికుమార్ బుధవారం కోరారు. 40 శాతం బీసీ రిజర్వేషన్ సాధనకు అందరూ పోరాటం చేయాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన ఉద్యోగులు, రాజకీయ నాయకులు, విద్యావంతులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని అశోక్నగర్ కాలనీలో అనుమతి లేకుండా చెట్లను నరికివేసిన వ్యక్తికి ఫారెస్ట్ అధికారులు రూ. 30,530 జరిమానాను బుధవారం విధించారు. తమ ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన ఫారెస్టు అధికారులకు బీఆర్ఎస్ నాయకులు అభినందనలు తెలిపారు. నాయకులు కుంబార రవియాద్, భాను, కృష్ణయాదవ్, చంద్రకాంత్, సాయి, సమీర్, సాయి తదితరులు ఉన్నారు. నాగిరెడ్డిపేట: మండలంలోని తాండూర్లో ఉన్న మల్లికార్జునస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. వేదపండితులు ఆలయం వద్ద రుద్రహోమం చేపట్టారు. అనంతరం మల్లన్న స్వామి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. రాజంపేట: మండల పంచాయతీ అధికారిగా ఎండీ జబీర్ ఇమాముద్దీన్ హైమద్, కార్యాలయ పర్యవేక్షకుడిగా జనార్దన్రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించినట్లు మండల అభివృద్ధి అధికారి బాలకృష్ణ తెలిపారు. వీరికి కార్యాలయ సిబ్బంది, మండల పంచాయతీ కార్యదర్శులు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. -
రుణం లేదు.. పరికరాలూ లేవు
● ఫలితమివ్వని పీఎం విశ్వకర్మ పథకం ● రుణం, పరికరాలు అందించాలని లబ్ధిదారుల వినతి ఎల్లారెడ్డి: కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల వృత్తి నైపుణ్యాలు, జీవన ప్రమాణాలు మెరుగు పర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం క్షేత్ర స్థాయిలో అనుకున్న ఆశయాలను సాధించడం లేదు. ఈ పథకం కింద కుల వృత్తులైన స్వర్ణకార, వడ్రంగి, మేసిన్, మత్స్యకార, మంగలి, రజక, కంసాలి, టైల్స్ వేయడం, దర్జీ లాంటి కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి వారి వృత్తుల్లో మరింత నైపుణ్యం పెంచుకునేందుకు శిక్షణ ఇచ్చి, వారి వృత్తికి ఉపయోగపడే రూ. 15 వేల విలువగల మెరుగైన పరికరాలను అందించాలి. వారి వృత్తి వ్యాపారాల అభివృద్ధికి వ్యక్తిగత పూచీకత్తుపై రూ. లక్ష రుణాన్ని అందించాల్సి ఉంటుంది. గతంలో ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు వారి రంగాల్లో నిపుణులైన ప్రైవేట్ సంస్థల ద్వారా శిక్షణ ఇచ్చేరే తప్ప సగానికి పైగా దరఖాస్తుదారులకు రుణాలు అందలేదు. అలాగే రుణాలు అందిన వారిలో చాలా మందికి ఈ పథకం కింద ఇవ్వాల్సిన వృత్తి పరికరాలు లభించలేదు. కామారెడ్డి జిల్లాలో విశ్వకర్మ పథకం కింద గతేడాది 4,711 మందికి శిక్షణ ఇవ్వగా 1,927 మందికి రూ. లక్ష రూపాయల రుణం లభించింది. రుణం లభించిన వారిలో 1,394 మంది లబ్ధిదారులకు వారి కుల వృత్తుల పరికరాలు లభించాయి. మిగితా వారికి కేవలం శిక్షణ మాత్రమే లభించింది. ఈ పథకం కింద ఇస్తామన్న రూ. లక్ష రుణం, వృత్తి పరికరాలు ఎప్పుడు ఇస్తారన్న ప్రశ్నకు ఏ అధికారి సరైన వివరణ ఇవ్వడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. -
అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం
మద్నూర్: సోయా పంట కొనుగోలులో అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డోంగ్లి, మద్నూర్ మండల కేంద్రాల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నాఫెడ్, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం సోయా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మద్దతు ధరతో సోయా పంట కొనుగోలు చేయాలని సహకార సంఘాలకు ప్రభుత్వం సూచించింది. అలాగే రైతులకు ఇబ్బందులు కలుగకుండా సోయా కొనుగోలు చేయాలని స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సైతం సిబ్బందిని ఆదేశించారు. కానీ సోయా పంట కొనుగోలు చేసే అధికారులు బుధవారం రైతులు మార్కెట్ యార్డులో ఉంచిన సోయాను పరిశీలించి పంట బాగాలేదని చాలా మంది రైతుల సోయాను రిజెక్ట్ చేశారు. సోయా పంటకు చెన్ని చేసి పంటను తీసుకోవాలని ఇలా రిజక్ట్ చేస్తే ఎలా అని రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో పంట తీసుకోకుంటే బయటి మార్కెట్లో పంటను విక్రయిస్తే క్వింటాలుకు రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సోయాలో మట్టి బాగా ఉండడంతోనే రిజక్ట్ చేశామని కొనుగోలు చేసే అధికారులు, సిబ్బంది తెలిపారు. -
నేషనల్ కబడ్డీ క్యాంప్నకు ఎంపిక
నిజామాబాద్ నాగారం: జిల్లాకు చెందిన ఐదుగురు కబడ్డీ క్రీడాకారులు జాతీయస్థాయి కబడ్డీ క్యాంప్కు ఎంపికయినట్లు నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆంద్యాల లింగయ్య, గంగాధర్ రెడ్డి బుధవారం తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో బాలికల విభాగంలో గౌతమీ, స్నేహ, శిరీష, బాలుర విభాగంలో శ్రీనివాస్, ప్రమోద్ పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చారు. దీంతో వారు జాతీయస్థాయి క్యాంప్కు ఎంపికయ్యారు. ఈనెల 12 నుంచి బాచుపల్లిలో నిర్వహించనున్న జాతీయ స్థాయి కబడ్డీ క్యాంప్లో వారు పాల్గొననున్నట్లు తెలిపారు. -
యూడైస్లో విద్యార్థుల వివరాలను నమోదు చేయాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● దర్యాపూర్లో ప్రభుత్వ పాఠశాల, భవితకేంద్రం తనిఖీ నవీపేట: యూడైస్ యాప్లో విద్యార్థుల పూర్తి వివరాలను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మండల కేంద్రంలోని దర్యాపూర్ ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. యూడైస్ యాప్లో విద్యార్థుల వివరాలు నమోదు కాకపోవడంపై పాఠశాల హెచ్ఎం హన్మంత్రావ్పై అసహనం వ్యక్తం చేశారు. జనన ధ్రువీకరణ పత్రాలు లేని విద్యార్థులకు వెంటనే మంజూరు చేయాలని తహసీల్దార్ వెంకట రమణకు సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలను ముఖ గుర్తింపు విధానంతో నమోదు చేయాలన్నా రు. అనంతరం భవితభవిత కేంద్రాన్ని తనిఖీ చేసి, ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల వివరాలను తెలుసుకున్నారు. కొనసాగుతున్న భవిత ప్రత్యేక కేంద్రం పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భవిత కేంద్రాల పనితీరు, మరమ్మతులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తానన్నారు. డీఈవో అశోక్, ఎంపీడీవో నాగనాథ్, తహసీల్దార్ వెంకట రమణ తదితరులు ఉన్నారు. -
ధాన్యాన్ని నిబంధనల మేరకు ఆరబెట్టాలి
గాంధారి(ఎల్లారెడ్డి): రైతులు ధాన్యాన్ని నిబంధనల మేరకు ఆరబెట్టాలని డీఆర్డీవో సురేందర్ సూచించారు. మంగళవారం ఆయన మండలంలో పర్యటించారు. మేడిపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ఏపీఎం ప్రసన్న కుమార్, రైతులున్నారు. తూకం వేగవంతం చేయాలి లింగంపేట(ఎల్లారెడ్డి): కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేగవంతం చేయాలని డీఆర్డీవో సురేందర్ సూచించారు. మంగళవారం ఆయన లింగంపేట మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాల్లో తూకం పరిశీలించారు. అనంతరం ఆయన రైతులతో మాట్లాడారు. ఐకేపీ డీపీఎం సాయిలు, ఏపీఎం వినోద్కుమార్, సీసీ గంగ రాజం, తదితరులు ఉన్నారు. -
శుభ్రమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలి
బాన్సువాడ రూరల్: రైతులు శుభ్రమైన ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోనాపూర్ క్లస్టర్ ఏఈవో జ్ఞానేశ్వర్ అన్నారు. మంగళవారం ఆయన సొసైటీ కార్యదర్శి సురేందర్రావు, సెంటర్ ఇన్చార్జి సాదఖ్ తదితరులతో కలిసి ధాన్యం కుప్పలను పరిశీలించారు. 17శాతం లోపు తేమ ఉండేలా ధాన్యం ఆరబెట్టాలని, తాళ్ళు, రంగుమారిన గింజలు లేకుండా చూడాలన్నారు. పొతంగల్ కలాన్లో ధాన్యం కాంటాల ప్రారంభం గాంధారి(ఎల్లారెడ్డి): రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సింగిల్ విండో చైర్మన్ సాయికుమార్ అన్నారు. మంగళవారం పోతంగల్ కలాన్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటాలను ప్రారంభించారు. విండో డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. -
క్రీడల్లో గెలుపోటములు సహజం
● ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్బాన్సువాడ: క్రీడల్లో గెలుపోటములు సహజమని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ అన్నారు. ఉమ్మడి జిల్లా స్థాయి మహిళ, పురుషుల విభాగాల వాలీబాల్ టోర్నమెంట్ బాన్సువాడలో నిర్వహించా రు. మంగళవారం నిర్వహించిన టోర్నమెంట్ ము గింపు కార్యక్రమానికి హాజరైన కాసుల బాల్రాజ్ మాట్లాడుతూ.. క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి క్రీడలు దోహదపడతా యని అన్నారు. బాన్సువాడలో జిల్లా స్థాయి క్రీడలే కాకుండా రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించేందుకు కృషి చేస్తామని అన్నారు. పోటీల్లో ఉమ్మడి జిల్లా స్థా యి వాలీబాల్ టోర్నమెంట్ విజేత జట్టుగా బాన్సు వాడ నిలిచింది. మహిళల విభాగంలో బాన్సువాడ–మగ్గిడి జట్లు హోరాహోరీ సాగింది. పోటీల్లో బాన్సువాడ జట్టు విజయం సాధించింది. పురుషుల విభాగంలో బాన్సువాడ–తాడ్వాయి జట్టు త లపడగా బాన్సువాడ జట్టు విజయం సాధించింది. విజయం సాధించిన జట్లకు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ కప్లతో పాటు మెడల్స్ అందజేశారు. అలాగే విజయం సాధించిన క్రీడాకారులకు వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి ఫోన్లో అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు కృష్ణారెడ్డి, ఎజాస్, ఖలేక్, నార్ల సురేశ్, రవీందర్, వాహబ్, గౌస్, దావుద్, జిల్లా వాలీబాల్ అసో సియేషన్ ప్రతినిధులు మల్లేశ్గౌడ్, రవీందర్రెడ్డి, కామారెడ్డి డీవైఎస్వో రంగాగౌడ్, నిజామాబాద్ డీ వైఎస్వో నవీన్, పీడీలు తదితరులు పాల్గొన్నారు. -
‘రైతు నేస్తం’ సద్వినియోగం చేసుకోవాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి మోహన్రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పంటల సాగు, ఎరువుల యాజమాన్యం, చీడ పీడల నివారణ తదితర విషయాలపై శాస్త్రవేత్తలు రైతులకు సూచనలు, సలహాలు, జాగ్రత్తల గురించి వివరించారు. అలాగే మామిడి తోటలు పూత దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచించారు. ఏడీఏ లక్ష్మీప్రసన్న, మండల వ్యవసాయాధికారి అనిల్కుమార్, ఏవో సంతోష్, ఏఈవో రాకేశ్, రైతులు పాల్గొన్నారు. -
‘మత్స్య పరిశ్రమను విద్యార్థులు వృత్తిగా స్వీకరించాలి’
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఫిషరీస్, జువాలజీ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఆక్వేరియం చేప పిల్లల విక్రయాన్ని మంగళవారం ప్రిన్సిపల్ కె.విజయకుమార్ ప్రారంభించారు. విద్యార్థులు మత్స్య పరిశ్రమలను వృత్తిగా స్వీకరించేందుకు ముందు వరుసలో ఉండాలని, వాణిజ్యపరంగా ఎన్నో అవకాశాలుంటాయన్నారు. సమన్వయకర్తలు విశ్వప్రసాద్, జయప్రకాష్, సుధాకర్, అధ్యాపకులు దినకర్, ఫిషరీస్ విభాగం అధిపతి తిరుమల మల్సూర్, రాములు, జి.శ్రీనివాస్రావు, పవన్ కుమార్, మానస తదితరులు పాల్గొన్నారు. -
అటవీ భూమిని చదును చేసిన గిరిజనులు
● పది మందిపై కేసు నమోదు ఇందల్వాయి: ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని గన్నారం బీట్ మెగ్యా నాయక్ తండాలో అటవీ శాఖ అధికారులు నాటిన మొక్కలను ధ్వంసం చేసి భూమి చదును చేసిన పదిమంది గిరిజనులపై కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్వో రవిమోహన్ బట్ తెలిపారు. అనుమతులు లేకుండా అడవులను ధ్వంసం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ● ఒక రోజు జైలు శిక్ష విధించిన కోర్టు కామారెడ్డి క్రైం: మద్యం మత్తులో డయల్–100కు పలుమార్లు ఫోన్ చేసి విసిగించిన యువకుడికి కామారెడ్డి కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన షేక్ అమీర్ అనే యువకుడు మంగళవారం తనకు ఎలాంటి అత్యవసరం లేకపోయినా డయల్–100 కు పదే పదే ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు అతడికి వైద్యపరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరిచారు. ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి చంద్రశేఖర్ నిందితుడికి రూ.వెయ్యి జరిమానా, ఒక రోజు జైలు శిక్ష విధించింది. పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని పట్టణ ఎస్హెచ్వో నరహరి తెలిపారు. నవీపేట: మండలంలోని జన్నెపల్లి గ్రామానికి చెందిన నీరడి శ్రీను(42) అదృశ్యమైనట్లు ఎస్సై తిరుపతి మంగళవారం తెలిపారు. ఉపాధి నిమిత్తం దుబాయి నుంచి వచ్చిన శ్రీను కొన్ని రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఇంట్లో గొడవలు జరగడంతో గత నెల 26న బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ తెలియరాలేదు. శ్రీను భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బీబీపేట: మద్యానికి బానిసైన ఓ యువకుడు గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బీబీపేట మండలం తుజాల్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రభాకర్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోడ సునీల్(30) కొన్ని రోజులుగా ఎలాంటి పనులు చేయకుండా తిరుగుతూ మద్యం తాగేవాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. సోమవారం సాయంత్రం వీరి మధ్య మరోసారి గొడవ కావడంతో సునీల్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. కుటుంబీకులు అతని కోసం వెతుకుతుండగా మల్కాపూర్ గ్రామ శివారులో గడ్డిమందు తాగి కిందపడిపోయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వారు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బోధన్: రెండ్రోజుల్లో పెళ్లి జరుగనుండగా పెళ్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. వివరా లు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని మంగల్ పహాడ్ గ్రామానికి చెందిన చేపూరి నారాగౌడ్కు ముగ్గురు కుమారులు. చిన్న కొడుకు ప్రతా ప్ గౌడ్ (31) ఇంటి వద్ద వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. ప్రతాప్ గౌడ్ కు ఇటీవల పెళ్లి కుదిరింది. ఈ నెల 13న పెళ్లి జరగాల్సి ఉంది. అయితే సోమవారం నుంచి ప్రతాప్ గౌడ్ కనిపించకుండా పోయాడు. కుటుంబీకులు వెతికినా ఆచూకి లభించలేదు. మంగళవారం స్థానికులకు గ్రామ శివారులోని గుట్ట ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఉన్న స్థితిలో ప్రతాప్ గౌడ్ మృత దేహం కనిపించింది. దీంతో కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పెళ్లి కొడుకు ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. -
తెలంగాణ వైతాళికులు విశ్వనాథ శాస్త్రి
కామారెడ్డి అర్బన్: తెలంగాణ వైతాళికులు, జ్ఞాననిధి, సదాచారులు శాస్త్రుల విశ్వనాథశాస్త్రి(శివ్వంపేట) శత జయంతి ఉత్సవాన్ని మంగళవారం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో సంకష్టహర గణపతి ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్థలతో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేదపండితులు గణేష పూజతో పాటు విశ్వనాథశాస్త్రికి పుష్పాంజలి సమర్పించారు. నృత్యప్రదర్శనలు చేశారు. శ్రీమల్లికార్జున శివారాధ్యపీఠం పండితులు కాచాపురం నందీశ్వరశర్మ, బెజుగామ రామమూర్తి దంపతులను ఘనంగా సన్మానించారు. కామారెడ్డి అర్బన్: కాంగ్రెస్ పార్టీ ఉత్తుత్తి బీసీ బిల్లు పెట్టి ప్రజలు మోసం చేయాలని చూస్తుందని బీసీ ఆక్రోశ సభ రాష్ట్ర అధ్యక్షుడు, విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు, వైస్ చైర్మన్ విశారదన్ మహరాజ్ అన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 42శాతం రిజర్వేషన్ అమలు కోసం నవంబర్ 15న కామారెడ్డి సత్యగార్డెన్లో నిర్వహించే బీసీ ఆక్రోశ సభకు బీసీలందరు తరలిరావాలని వారు పిలుపు నిచ్చారు. పట్టణంలోని స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో మంగళవారం వారు వివిధ కులాల నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో తమిళనాడు తరహా రిజర్వేషన్ల బిల్లు కోసం కార్యాచరణ ప్రారంభించి శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో ఆక్రోశ సభ ఆహ్వాన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ చైర్మన్లుగా మర్కంటి భూమన్న, క్యాతం సిద్ధిరాములు, బాలార్జున్గౌడ్ ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా వెంకట్, వేణుగోపాల్గౌడ్, పుట్ట మల్లికార్జున్, రమేష్బాబు, జీవీఎం విఠల్, లక్ష్మణ్, అరవింద్, భువనేశ్వర్, రాజు, సిరిగాద నర్సయ్య, పి.అంజయ్య, నాగభూషణం, సబ్బని కృష్ణహరి, డి.రాజయ్య, ధర్మపురి పాల్గొన్నారు. -
డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ పలువురికి జైలు
డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ పలువురికి జడ్జిలు జైలు శిక్షతో పాటు జరిమానాలను విధించినట్లు ఎస్సైలు తెలిపారు. ఏర్గట్ల పీఎస్ పరిధిలో ఒకరికి నూతన చట్టం ప్రకారం రూ. పదివేల జరిమానాను విధించారు. రుద్రూరు: డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ ఓ వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్షతోపాటు రూ. రెండు వేల జరిమానాను బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్పసాయి విధించినట్లు కోటగిరి ఎస్సై సునీల్ మంగళవారం తెలిపారు. రెండు రోజుల క్రితం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నాయిగావ్ గ్రామానికి చెందిన పవర్ దానాజీ మద్యం సేవించి కోటగిరిలో వాహనం నడుపుతుండగా పట్టుకొని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు పేర్కొన్నారు. జడ్జి అతనికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ. రెండు వేల జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు. సిరికొండలో నలుగురికి నాలుగు రోజులు.. సిరికొండ: సిరికొండ పీఎస్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ నలుగురికి న్యాయమూర్తి నాలుగు రోజుల జైలు శిక్ష విధించారని ఎస్సై రామకృష్ణ తెలిపారు. సిరికొండ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు, పెద్దవాల్గోట్కు చెందిన ఒకరు, సిరికొండ చెందిన మరొకరిని కోర్టులో హాజరుపర్చగా వారికి న్యాయమూర్తి నాలుగు రోజుల జైలు శిక్ష విధించారని ఎస్సై తెలిపారు.బీబీపూర్ వాసికి నాలుగు రోజులు.. మోపాల్: డిచ్పల్లి పీఎస్ పరిధిలో నాగ్పూర్ గేట్ వద్ద ఈనెల 9న మద్యం సేవించి వాహనం నడిపిన బీబీపూర్కు చెందిన రాథోడ్ జై సింగ్కు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు. ఎవరైనా మద్యం సేవించి వాహనం నడిపిస్తే జైలు శిక్ష తప్పదని ఎస్సై హెచ్చరించారు. జక్రాన్పల్లిలో ఇద్దరికి రెండు రోజులు.. జక్రాన్పల్లి: మద్యం తాగి బైక్ నడిపిన ఇద్దరు వ్యక్తులకు ఆర్మూర్ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి గట్టు గంగాధర్ రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు జక్రాన్పల్లి ఎస్సై మహేశ్ తెలిపారు. నూతన మోటర్ వెహికిల్ చట్టం ప్రకారం మొదటి సారి డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడితే రూ. పది వేల జరిమానా ఉంటుందని అన్నారు. నవీపేటలో ఇద్దరికి నాలుగు రోజులు.. నవీపేట: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన ఇద్దరికి నిజామాబాద్ జడ్జి మంగళవారం జైలు శిక్ష విఽధించినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. నవీపేట శివారులో ఇటీవల నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్లో నవీపేటకు చెందిన మోహన్, కమలాపూర్కు చెందిన ముల్కల అఖిలేష్ మద్యం సేవించి వాహనం నడిపారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు పంపగా జడ్జి ఇద్దరికి నాలుగు రోజుల జైలు శిక్షను విధించినట్లు పేర్కొన్నారు. మూడు, నాలుగో టౌన్ల పరిధిలో.. నిజామాబాద్ అర్బన్: నగరంలోని మూడో టౌన్ పీఎస్ పరిధిలోని పట్టుబడిన శివకుమార్కు నాలుగు రోజుల జైలు శిక్ష, నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన అశ్విన్, సాయికిరణ్కు నాలుగు రోజుల జైలు శిక్షను విధించినట్లు ఎస్సైలు తెలిపారు. అదే విధంగా మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ ఏనుగంటి అవినాయక్ గౌడుకు రెండు రోజుల జైలు శిక్ష, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్టుబడ్డ కిషన్ గౌడ్, శివాజీ సుమ కాంత్కు జడ్జి రెండు రోజుల జైలు శిక్షను విధించినట్లు ఎస్సైలు పేర్కొన్నారు. ఇందల్వాయి: డ్రంకన్ డ్రైవ్లోపట్టుబడ్డ ఇద్దరికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ జైలు శిక్షను విధించినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఇందల్వాయి మండలం మెగ్యానాయక్ తండాకు చెందిన కాట్రోత్ రవికి ఏడు రోజులు, పాట తండాకు చెందిన లావుడ్య నర్సయ్యకు నాలుగు రోజుల జైలు శిక్షను విధించినట్లు పేర్కొన్నారు.మోపాల్: మోపాల్ పీఎస్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన ముగ్గురికి స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్సై జాడె సుస్మిత తెలిపారు. డిచ్పల్లి మండలం ఆరెపల్లికి చెందిన చిట్టి నారాయణకు రెండు రోజులు, కులాస్పూర్కు చెందిన బూస భానుచందర్కు మూడు రోజులు, బైరాపూర్కు చెందిన కెతావత్ మహా పాతలాల్కు ఏడు రోజుల జైలు శిక్షను విధించారని అన్నారు.మోర్తాడ్: డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ ఓ వ్యక్తికి నూతన వాహన చట్టం ప్రకారం రూ. పది వేల జరిమానాను ఆర్మూర్ జడ్జి గట్టు గంగాధర్ విధించినట్లు ఏర్గట్ల ఎస్సై పడాల రాజేశ్వర్ తెలిపారు. ఏర్గట్ల పీఎస్ పరిధిలో సోమవారం సాయంత్రం నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం కోజన్కొత్తూర్ గ్రామానికి చెందిన నాని అనే వ్యక్తి మద్యం సేవించి ఏర్గట్లలో వాహనం నడుపుతుండగా పట్టుకొని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. జడ్జి అతనికి రూ. పదివేల జరిమానా విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
సోయా పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలి
మద్నూర్(జుక్కల్): సోయా పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోమవారం పంట కొనుగోళ్లు షురు చేస్తామని చేయకపోగా మంగళవారం నాఫెడ్ అధికారులు పంటను పరిశీలించి కొనుగోళ్లను ప్రారంభించారు. కానీ చాలా మంది రైతుల సోయా పంట నాణ్యత లేదని, పంట రంగు మారిందని, మట్టి ఎక్కువగా ఉందని, తేమ శాతం రావడం లేదని నాఫెడ్ అధికారులు చెప్పగా రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట బాగున్నా, ఎందుకు అడ్డంకులు చెబుతున్నారని వారు ప్రశ్నించారు. పంట కొనుగోలులో ఆలస్యం జరుగుతుండటంతోపాటు అధికారులు కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులందరి సోయా పంటను కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పెద్దకొడప్గల్(జుక్కల్): విద్యుత్ వైర్లను ఇళ్లపై నుంచి తొలగించాలని గాంధీనగర్ కాలనీవాసులు డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో ఉదయం 6 గంటల సమయంలో 11కేవీ విద్యుత్ వైర్లు తెగి పలువురి ఇళ్లపై పడడంతో కాలనీవాసులు భయందోళనకు గురయ్యాయారు. దీంతో కాలనీవాసులు ఇళ్లపై నుంచి వైర్లను వెంటనే తొలగించాలని కోరారు. వైర్లను ఇళ్లపై నుంచి తొలగించే వరకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకూడదన్నారు. అనంతరం గాంధీ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో మధ్యాహ్నం 3 గంటల వరకు మండల కేంద్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయమేర్పడింది. ఉదయం నుంచి విద్యుత్ లేకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలకు, వ్యాపారులకు ఇబ్బందిగా మారింది. -
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
● జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుబిచ్కుంద(జుక్కల్): జుక్కల్ నియోజకవర్గంలోని ఏకైక మున్సిపాలిటీ బిచ్కుందని, దీనిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. సెంట్రల్ లైటింగ్, రోడ్డు వెడల్పు పనులలో నాణ్యతా ప్రమాణాలు, పనులు సజావుగా జరగడం, పట్టణ అభివృద్ధిపై అఖిల పక్షం నాయకులు, ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పనులపై అవగాహన లేని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వారిని పట్టించుకోవద్దని కోరారు. ప్రతిపక్ష నాయకులు రాజకీయం పక్కన పెట్టి అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో ముందుకు వెళ్లి ఎవరికీ నష్టం జరగకుండా వేగంగా రోడ్డు పనులు చేయాలని సూచించారు. రోడ్డుపై దుమ్ము వస్తుందని వ్యాపారులు, ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా నీళ్లతో క్యూరింగ్ చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. అనంతరం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఆర్అండ్బీ ఈఈ మోహన్, డీఈ వినోద్, మున్సిపల్ కమిషనర్ ఖయ్యుం, వివిధ శాఖల అధికారులు, నేతలు పాల్గొన్నారు. -
‘న్యుమోనియా’ను నివారిద్దాం..!
● జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు● నేడు ప్రపంచ న్యుమోనియా నివారణ దినం నిజామాబాద్నాగారం: బ్యాక్టీరియా, వైరస్ల కారణంగా ఊపిరితిత్తుల్లోని గాలి సంచులు చీము, ద్రవాలతో నిండిపోయి శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. దీనినే న్యుమోనియా అంటారు. ఇది ఒక్కోసారి ప్రాణాంతకంగా మారొచ్చు. బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే న్యుమోనియా ఇతరులకు సైతం వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఏటా అనేక మంది న్యుమోనియా బారిన పడుతూ ఇబ్బందులు పడుతున్నారు. నేడు నిర్వహించే న్యుమోనియో దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. జిల్లా వ్యాప్తంగా ఇలా.. న్యుమోనియా వ్యాధి బాధితులు నిజామాబాద్ జిల్లాలో నిత్యం పెరుగుతూనే ఉన్నారు. బ్యాక్టీరియాతో వచ్చే న్యుమోనియా బాధితులు జిల్లాలో వారానికి సుమారు 200 మంది ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు సంబంధిత వైద్యాధికారులు చెబుతున్నారు. మరోవైపు చలికాలంలో అధికంగా వచ్చే వైరల్ న్యుమోనియాతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిత్యం 40 నుంచి 50 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వైరల్ న్యుమోనియాకు మందులు వాడితో వారం రోజుల్లో తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాధి రావడానికి కారణాలు.. గాలి పీల్చేటప్పుడు బ్యాక్టీరియాలు, వైరస్లు శరీరంలోకి ప్రవేశించి, తెల్లరక్త కణాలను నిర్వీర్యం చేస్తాయి. దీంతో శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలు, వృద్ధులు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. పిల్లల్లో ఆర్ఎస్వీ, వృద్ధుల్లో ఇన్ఫ్లుయెంజా వైరస్వల్ల ఇది సోకుతుంది. పౌష్టికాహారం తీసుకోని వారి కి, మద్యపానం, పొగతాగడం, మధుమేహం, ఎ యిడ్స్, గుండె, ఊపిరితిత్తులు, మూత్రనపిండాల సమస్యలు, క్యాన్సర్తో బాధపడే వారు న్యుమోనియా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటా యని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలకు చిన్నతనంలో ఇచ్చే బీసీజీ వంటి టీకాలతో పాటు న్యు మోనియా రాకుండా టీకాలు అందిస్తే దీనిని నివారించవచ్చు. పిల్లలకు ఆరు నెలల వరకు తల్లి పాలు పట్టించడం వల్ల వారిలో రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధి బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.న్యుమోనియపై కచ్చితంగా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ప్రమాదం. ప్రతి సంవత్సరం నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ యూనిట్లో న్యూమోనియా దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, ఉచిత శ్వాసకోశ పరీక్షలు, వైద్య సలహాలు అందిస్తున్నాం. – డాక్టర్ ప్రశాంత్, శ్వాసకోశ వ్యాధుల నిపుణులు, మెడికవర్ హాస్పిటల్దీర్ఘకాలిక రోగులతో బాధపడేవారు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గుండె, షుగర్, బీపీ, కిడ్నీ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. వృద్ధులు కచ్చితంగా న్యుమోనియపై అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఏటా 10 శాతం మంది న్యుమోనియాతో మరిణిస్తున్నారు. – వీవీరావు, జీజీహెచ్ పల్మనాలజిస్ట్, హెచ్వోడీ -
పత్తి అమ్మడానికి అవస్థలు
● సీసీఐ కొత్త నిబంధనలతో తంటాలు పడుతున్న అన్నదాతలు ● ఎకరానికి 7క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామంటున్న అధికారులుమద్నూర్(జుక్కల్) : పత్తి అమ్మడానికి సీసీఐ అధికారులు నిబంధనల పేరుతో అవస్థలు పెడుతున్నా రని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎ న్నడు లేనంతగా పత్తిని అమ్ముకోవడానికి నిబంధ నలు పెట్టినట్లు వారు వాపోతున్నారు. ఎకరాకు 13 క్వింటాళ్లకు బదులుగా 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు చెబుతు న్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన యాప్లోనే ప త్తి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించడంతో చా లా మంది రైతుల వద్ద ఆండ్రాయిడ్ ఫోన్లు లేక కష్టా లు పడుతున్నారు. అలాగే పత్తికి తేమ శాతం 8కి మించకుడదని అధికారులు చెప్పడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు 54,357 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. కొనుగోలు కేంద్రాలు మాత్రం ఉమ్మడి నిజామాబాద్, కామా రెడ్డి జిల్లాలో కేవలం మద్నూర్లోనే కొనసాగుతున్నాయి. ఈక్రమంలో పత్తిని అమ్మడానికి ఉమ్మడి జిల్లా రైతులు మద్నూర్కు తీసుకువస్తున్నారు. కానీ అధికారులు మాత్రం తేమ శాతం సరిగ్గా లేదని, పత్తి పంట నల్లగా మారిందని ఇలా అనేక కారణాలు చూపుతూ పత్తిని తీసుకొచ్చిన రైతులను తిప్పి పంపిస్తున్నారని వారు ఆందోళన చెందుతున్నారు. పంట కొనుగోళ్లకు ఒకవైపు అధికారులు కొర్రీలు పెడుతుండగా, మరోవైపు కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి రైతులు తెచ్చిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని పలువురు కోరుతున్నారు. -
గాయాలెన్నో..
● జిల్లాలోని పలుచోట్ల ఛిద్రమైన రోడ్లు, దెబ్బతిన్న వంతెనలు ● నెలలు గడుస్తున్నా మరమ్మతులు కరువు ● అవస్థలు పడుతున్న ప్రజలు వర్షం చేసినఈయేడు వానాకాలంలో భారీ వర్షాలతో జిల్లాకు అపార నష్టం జరిగింది. ధ్వంసమైన రోడ్లు, దెబ్బతిన్న వంతెనలు మానని గాయాలుగా జిల్లాను వెంటాడుతున్నాయి. నెలలు గడుస్తున్నా వర్షం చేసిన గాయాల నుంచి ఇంకా కోలుకోవడం లేదు. రహదారులకు సంబంధిత అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : వానాకాలంలో భారీ వ ర్షాలతో రోడ్లు, వంతెనలు ఎన్నో దెబ్బతిన్నాయి. జి ల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రధాన రహదారులతోపాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడం, కోతకు గురవడంతో రాక పోకలకు ఇబ్బందికరంగా మారింది. పట్టణాల్లోనూ అనేక రోడ్లు కోతకు గురయ్యాయి. ముఖ్యంగా కా మారెడ్డి జిల్లా కేంద్రంలో చాలా రోడ్లు దెబ్బతిన్నా యి. కానీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల తాత్కాలిక మరమ్మతులు చేశారు. ఇంకాచాలా చోట్ల అలాగే వదిలేశారు. మరమ్మతులకు సుమారు రూ.170 కోట్లు.. ఆగస్టు చివరి మాసంలో కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. జిల్లాలోని వివిధ మండలాల్లో మూడు రోజు ల్లో 50 సెం.మీ.ల నుంచి 70 సెం.మీ. వర్షపాతం న మోదైంది. దీంతో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నా యి. నెలలు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జిల్లాలో రోడ్లు భవనాల శాఖ (ఆర్అండ్బీ)కి సంబందించి 65 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతినగా, 48 కల్వర్టులు పాడయ్యాయి. వీటికి తాత్కాలి క మరమ్మతుల కోసం రూ. 5.50 కోట్లు, పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయడానికి రూ.120 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అప్పట్లో అంచ నాలు వేశారు. అలాగే పంచాయతీరాజ్శాఖ పరిధి లో 122 రోడ్లు, కల్వర్టులు దెబ్బతినగా వాటికి తా త్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు రూ.8కోట్లు అ వసరం అవుతాయని పంచాయతీరాజ్ శాఖ అధికారులు నివేదికలు రూపొందించారు. పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టేందుకు రూ.37.50 కోట్లు అవసరమని అంచనాలు తయారు చేశారు. భారీ మొ త్తంలో నష్టం జరిగినప్పటికీ ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతులకు తప్ప, పూర్తిస్థాయి మరమ్మతులకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. కాగా కొన్ని చోట్ల తాత్కాలిక పనులు చేపట్టారు. అవి కూడా ఇ బ్బందికరంగానే ఉన్నాయి. రాకపోకలకు ఇబ్బందులుభారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు నెలలు గడిచి నా మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు రాకపోకలకు నానా ఇబ్బందులు ఎదుర్కోవా ల్సి వస్తోంది. జిల్లాలోని రామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, బీబీపేట, దోమకొండ, భిక్కనూరు, కామారెడ్డి, తాడ్వాయి, రాజంపేట, లింగంపేట, ఎల్లారెడ్డి, గాంధారి తదితర మండలాల్లో ఎ క్కువగా రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. అ యితే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ఇబ్బందులు తొలగించాల్సి ఉండగా.. రోడ్లు, భవనా ల శాఖతోపాటు పంచాయతీరాజ్ శాఖ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. కొన్ని ప నులు చేపట్టి, మిగతా వాటిని అలాగే వదిలేశా రు. నిధుల సమస్య వల్లే పనులు ముందుకు క దలడం లేదని సమాచారం.ఎమ్మెల్యేలు చొరవ చూపితేనే.. జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, వంతెనల మరమ్మతులకు అవసరమైన నిధులు సాధించేందుకు ఎమ్మెల్యేలు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. నిధుల సమస్యతో మరమ్మతులకు నోచుకోక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యేలు స్పందించి జిల్లాకు నిధులు తీసుకురావడానికి ప్రయత్నించాలని పలువురు కోరుతున్నారు. -
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి
● ధాన్యం కొనుగోలు కేంద్రాలను సజావుగా నడిపించాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తాడ్వాయి(ఎల్లారెడ్డి)/కామారెడ్డి క్రైం : ధాన్యం కొ నుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, కేంద్రాలను సజావుగా నడిపించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కామారెడ్డి మండలం ఇస్రోజివాడిలోని వరి కొనుగోలు కేంద్రాన్ని, తాడ్వాయి, కృష్ణాజీవాడి శివారులో ఉన్న మక్క, వరి కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా రైతులతో క లెక్టర్ ముఖాముఖిగా మాట్లాడి, సమస్యలను తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతుల సూచనలు సేకరించి పంటల కొనుగోలు ప్రక్రియను పా రదర్శకంగా సమయ పాలనతో కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షణ చేయాలని, రైతులకు డబ్బు చెల్లింపులు సకాలంలో జరిగే లా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మొత్తం 427 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 11,196 మంది రైతుల నుండి 1,23,993 మెట్రిక్ ట న్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. అందు లో 59,162 మెట్రిక్ టన్నులు దొడ్డురకం, 64,831 మెట్రిక్ టన్నులు సన్నరకం ఉన్నట్లు వెల్లడించారు. రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.145 కోట్లు జమ చేశామన్నారు. తాడ్వాయి మండలంలోని కొనుగో లు కేంద్రం వద్ద ఒక రైతు తన కొడుకుతో కలసి ఉండడాన్ని కలెక్టర్ గమనించారు. ఆ బాలుడు పాఠశా లకు ఎందుకు వెళ్లలేదని ఆరా తీశారు. పిల్లలను ప్ర తిరోజు పాఠశాలకు పంపడం తల్లిదండ్రుల బాధ్య త అని వారికి సూచించారు. అదనపు కలెక్టర్ విక్టర్, డిప్యూటి ట్రెయినీ కలెక్టర్ రవితేజ, సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్, డీసీవో రామ్మోహన్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీవో సాజీద్అలీ, ఎంపీవో సవిత తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న జన్మదినోత్సవాలు
● నేడు కాలభైరవుడి డోలారోహణం ● సాయంత్రం బండ్ల ఊరేగింపురామారెడ్డి (ఎల్లారెడ్డి): మండలంలోని కాలభైరవుడి ఆలయంలో స్వామివారి జన్మదినోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మూడరోజు సంతత ధారాభిషేకం కొనసాగింది. ఆలయానికి భక్తులు ఉదయం నుంచే భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. నేడు (బుధవారం) ఉదయం ఆరు గంటలకు సంతతధారాభిషేకం పరిసమాప్తి అవుతుంది. అనంతరం మధ్యాహ్నం డోలారోహణం (తొట్లే) నిర్వహించనున్నారు. స్వామివారి కిలో బంగారు విగ్రహాన్ని పోలీస్ బందోబస్తు మధ్య ఆలయానికి తీసుకొచ్చి తొట్లలో వేసి డోలారోహణం నిర్వహిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు బండ్ల ఊరేగింపు ఉంటుంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రామారెడ్డి ఎస్సై రాజశేఖర్ తెలిపారు. -
పంట కోత పనులు 60 శాతం పూర్తి
● డీఏవో మోహన్రెడ్డి ● మాల్తుమ్మెద విత్తనక్షేత్రంలో ధాన్యం వేలం నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): జిల్లాలో వానాకాలం పంటలకు సంబంధించి 60శాతం కోత పనులు పూర్తయ్యాయని డీఏవో(జిల్లా వ్యవసాయాధికారి) మోహన్రెడ్డి తెలిపారు. మండలంలోని మాల్తుమ్మెద విత్తనోత్పత్తిక్షేత్రంలో మంగళవారం జరిగిన ధాన్యం వేలంపాట నిర్వహణలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈయేడు వానాకాలం పంటలకు సంబంధించి మొత్తం 6లక్షల మెట్రిక్టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారని, ఇప్పటివరకు లక్షా23వేల992మెట్రిక్టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ఇటీవల సంభవించిన వదరల కారణంగా జిల్లాలో జరిగిన 26,429ఎకరాల పంటనష్టానికి సంబంధించి పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదించామన్నారు. కాగా మండలంలోని మాల్తుమ్మెద విత్తనక్షేత్రంలో ఈ యేడు యాసంగిలో 30ఎకరాలలో వరి, 20ఎకరాలలో జనుము, నస్రుల్లాబాద్ మండలంలోని బొప్పాస్పల్లి విత్తనక్షేత్రంలో 110ఎకరాలలో వరి, 10ఎకరాలలో జనుము పంటలను సాగు చేస్తారని ఆయన వివరించారు. అనంతరం మండలకేంద్రంలోని వ్యవసాయశాఖ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. నాగిరెడ్డిపేట శివారులో గల ఆయిల్పామ్ పంటను పరిశీలించారు. మాల్తుమ్మెద విత్తనక్షేత్రంలో 2021వానాకాలం, యాసంగి సీజన్లలో సాగుచేసిన పంటలకు సంబంధించిన 770.50క్వింటాళ్ల ధాన్యాన్ని వేలం వేశారు. వేలంపాటలో నలుగురు వ్యాపారులు పా ల్గొనగా మండలంలోని తాండూర్కు చెందిన ఆగమయ్య అనే వ్యాపారి క్వింటాల్కు రూ. 1,910 చొప్పున పాడి ధాన్యాన్ని దక్కించుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ సీడ్స్ ఆర్ఎం రఘు, డీఏవో కార్యాలయ ఏడీఏ లక్ష్మిప్రసన్న, టెక్నికల్ ఏవో సంతోష్, విత్తనక్షేత్ర ఏడీఏ ఇంద్రసేన్, ఎల్లారెడ్డి ఏఎంసీ సీనియర్ అసిస్టెంట్ శశికాంత్, ఏఈవో శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
బాన్సువాడ: ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని ఇంటర్మీడియట్ బోర్డు డిప్యూటీ సెక్రెటరీ పద్మ అన్నా రు. బాన్సువాడ ప్రభుత్వ బాలికల జూనియ ర్ కళాశాలను మంగళవారం ఆమె సందర్శించారు. కళాశాలలో వసతులు, సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం డిప్యూ టీ సెక్రెటరీని కళాశాల అధ్యాపకులు సన్మానించారు. ప్రిన్సిపల్ అసద్ ఫారుఖ్ సిబ్బంది ఉన్నారు. విధుల్లో ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలి పిట్లం(జుక్కల్) : పోలీసు సిబ్బంది విధుల్లో ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజేష్చంద్ర అన్నారు. పిట్లం పోలీస్ స్టేషన్ ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందితో మాట్లాడి, వారి పనితీరును స్వయంగా పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల అ వసరాలకు అనుగుణంగా పనిచే యడం ప్ర తి పోలీస్ సిబ్బంది బాధ్యత అని అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం జ రగకూడదని సూచించారు. సిబ్బంది ఏవైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వాటిని పైఅధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి, సీఐ తిరుపతయ్య, ిఎస్సై వెంకట్రావ్ పాల్గొన్నారు. మిల్లర్ల దోపిడీని అరికట్టాలి బీబీపేట: రైస్మిల్లర్లు తరుగు పేరిట చేస్తున్న దోపిడీని అరికట్టాలని రైతులు డిమాండ్ చే శారు. ఈమేరకు మండల కేంద్రంలోని ప్ర ధాన చౌరస్తాలో మంగళవారం మండలంలో ని ఉప్పర్పల్లి రైతులు ట్రాక్టర్లలో ధాన్యాన్ని తీసుకువచ్చి ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. లారీలో తూ కం వేసి పంపించిన వడ్లను ముత్యంపేట నందిని రైస్మిల్ తరుగు పేరిటి 30 బ్యాగు లు కట్ చేస్తామని లేదంటే లారీని తిరిగి పంపిస్తామని రైస్మిల్ యజమాని తెలిపారన్నా రు. దీంతో విసుగుచెంది బీబీపేటకు వచ్చి ధర్నాకు దిగామన్నారు. గంటపాటు రోడ్డుపై బైఠాయించగా ఎస్సై ప్రభాకర్ అక్కడకు చే రుకొని రైతులను సముదాయించారు. రైస్మిల్ యజమానితో మాట్లాడుతానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి
● జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ● క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహణనిజాంసాగర్ (జుక్కల్): ప్రజా సమస్యల పరిష్కా రం దిశగా అధికారులు తమవంతు కృషి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. జుక్కల్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. గ్రామాల వారీగా వచ్చిన సమస్యలను తెలుసుకొని ఆయా శాఖల అధికారుల దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. జుక్కల్లో పోస్ట్ఆఫీస్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని సామాజికవేత్త తమ్మేవార్ అజయ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యేను ఆయన సన్మానించారు. -
జిల్లాకేంద్రంలో విస్త ృత తనిఖీలు
కామారెడ్డి క్రైం: ఢిల్లీ బాంబు పేలుళ్ల నేపథ్యంలో రా ష్ట్ర పోలీసు శాఖ సూచనల మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈసందర్భంగా మంగళవారం సాయంత్రం కామారెడ్డిలో పోలీసుల సిబ్బంది ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అదనపు ఎ స్పీ నరసింహరెడ్డి ఆధ్వర్యంలో పలువురు సీఐలు, ఎస్సైలతో కూడిన 60 మంది సభ్యులు గల బృందా లు పట్టణంలోని కొత్త బస్టాండ్, రైల్వే స్టేషన్, ప్రధా న కూడళ్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో విస్తృతంగా త నిఖీలు చేపట్టారు. ప్రయాణికులు బ్యాగులు, పార్సిళ్లను క్షుణంగా పరిశీలించారు. అనుమానిత వ్యక్తు లు కానీ, వస్తువులు కాని కనబడితే తమకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. తనిఖీ ల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలున్నాయి. -
కాలనీలో సమస్యలు పరిష్కరించాలి
కాలనీలో ఎన్నో రోజులుగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీవాసులు సోమవారం కలెక్టరేట్కు తరలివచ్చారు. వారు మాట్లాడుతూ.. కాలనీలోని డబుల్ బెడ్రూం ఇండ్లకు నీరందించేందుకు గతంలో రోడ్లు తవ్వి పైప్లైన్ వేశారని తెలిపారు. ఇప్పటికీ కాలనీకి తాగు నీరు రాలేదన్నారు. మురికి కాలువలు సక్రమంగా లేక మురికంతా రోడ్లపై పారుతోందన్నారు. మురికి నీరు రోడ్లపైకి రావడంతో గుంతలు ఏర్పడి రోడ్లు అధ్వానంగా మారాయన్నారు. ఇకనైనా స్పందించి సమస్యలను పరిష్కరించాలని ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. -
కొనుగోలు కేంద్రాల తనిఖీ
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పోచారం, మాల్తుమ్మెద, తాండూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం స్పెషల్ టాస్క్ఫోర్స్ ఓఎస్డీ శ్రీధర్రెడ్డి, డీఎస్పీ శేఖర్రెడ్డి ఇతర అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ప్రధానంగా పోచారంలో గ్రామ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో గత శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఖాళీ గన్నీ సంచుల దగ్ధం ఘటనను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా గన్నీ సంచులు దగ్ధమైన తీరుపై వారు వివరాలను సేకరించారు. గన్నీ సంచుల దగ్ధంపై వారు అనుమానం వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్గౌడ్కు సూచించారు. అనంతరం మండలంలోని మాల్తుమ్మెద, తాండూర్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు పరిశీలించారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులతో మాట్లాడారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాలను స్థానిక సిబ్బందిని అడిగి వారు తెలుసుకున్నారు. రైతులు వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అసిస్టెంట్ సివిల్ సప్లయ్ అధికారి సుదర్శన్రెడ్డి, ఎస్సై శ్రీనివాస్, ఎన్ఫోర్స్మెంట్ డీటీ సురేష్, ఎస్సై భార్గవ్గౌడ్, ఏపీఎం రాంనారాయణగౌడ్, గ్రామసంఘం అధ్యక్షులు లక్ష్మి, సీసీ నారాయణ తదితరులున్నారు. -
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● ప్రజావాణికి 80 వినతులుకామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 80 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూసమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు, బిల్లుల మంజూరులకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించి సమస్యలను పరిష్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. ఫిర్యాదులను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. పెండింగ్ లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. బాన్సువాడ సబ్కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, ఆర్డీవో వీణ, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, ఏవో మసూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. లింగంపేటలో అధికారుల డుమ్మా..! లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో ప్రతీ సోమవారం ఏర్పాటు చేసే ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం పలు శాఖల అధికారులు గైర్హాజరయ్యారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు ప్రజావాణిలో పాల్గొనాల్సి ఉండగా కేవలం రెండు శాఖల అధికారులు మాత్రమే హాజరుకావడం విశేషం. కార్యక్రమానికి తహసీల్దార్ సురేష్, ఎంపీడీవో నరేష్, ఎంపీవో మలహరి మాత్రమే హాజరయ్యారు. అన్ని శాఖల అధికారులు హాజరయ్యేవిధంగా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా
కమ్మర్పల్లి: భీమ్గల్ మండలం కుప్కాల్ ఒర్రెల నుంచి కమ్మర్పల్లికి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తాపడిన ఘటన కమ్మర్పల్లి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని హాసకొత్తూర్లో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏ, భీమ్గల్ వైపు నుంచి ఇసుక ట్రాక్టర్ వస్తుండడాన్ని గమనించి అనుమానంతో తనిఖీ చేశాడు. అనుమతి పత్రాలు లేకపోవడంతో ఆర్ఐ శరత్కుమార్కు ఫోన్లో సమాచారం అందించారు. ఆర్ఐ ఆదేశాలతో వీఆర్ఏ ట్రాక్టర్ను పోలీస్స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించగా, డ్రైవర్ వేగంగా నడపడంతో కమ్మర్పల్లి శివారులోని బీడీ కంపెనీ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాక్టర్తోపాటు ఇసుకను పోలీస్స్టేషన్కు తరలించారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ యజమాని వేముల భాస్కర్, డ్రైవర్ పల్లపు సాయికుమార్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఎంఎల్హెచ్పీ పోస్టులకు దరఖాస్తులు
నిజామాబాద్నాగారం: జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలో కాంట్రాక్టు పద్ధతిలో 17 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్వో రాజశ్రీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 నుంచి 14 వరకు నూతన కలెక్టరేట్ కార్యాలయంలోని డీఎంహెచ్వో ఆఫీసులో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలు nizamabad.telangana.gov.in వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.సిరికొండ: మండలంలోని గడ్కోల్ గ్రామంలో తాటి చెట్టు పైనుంచి పడి గీతకార్మికుడు తాళ్లపల్లి నర్సాగౌడ్(58) సోమవారం మృతి చెందినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. కల్లు తీయడానికి నర్సాగౌడ్ చెట్టు వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య సరోజన ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తకపోవడంతో కుటుంబసభ్యులకు, తోటి గీత కార్మికులకు సమాచారం ఇచ్చింది. తాటివనంలో వెతకగా ఒక చెట్టు వద్ద మృతి చెంది ఉన్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ● కాపర్ ఆయిల్ చోరీ పెద్దకొడప్గల్(జుక్కల్): మండల కేంద్రంతోపాటు శివారు గ్రామ శివారులోని రెండు ట్రాన్స్ఫార్మర్లను దుండగులు ధ్వంసం చేశారు. రైతులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆదివారం రాత్రి శివాపూర్ గ్రామ శివారులో చావునితండాకు చెందిన సహరి బాయ్, పెద్దకొడప్గల్ గ్రామానికి చెందిన ఆట్కరి హన్మంత్ రావుకు చెందిన ట్రాన్స్ఫార్మర్లలోని ఆపర్ ఆయిల్ను దుండగులు చోరీ చేశారు. పంచాయతీ కార్యదర్శి శివాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. -
క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి
● వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డిబాన్సువాడ: క్రీడాకారులు జాతీయ స్థాయిలోనే కా కుండా అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి ఆకాంక్షించారు. సోమవారం బాన్సువాడ మినీ స్టేడియంలో ఉ మ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారుల కోసం బా న్సువాడలో మినీ స్టేడియం నిర్మించామని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్న ని ర్వాహకులు పంతులు నరే ష్ను అభినందించారు. కా ర్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం గంగా ధర్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కుశాల్, నాయ కులు పోచారం సురేందర్రెడ్డి, కృష్ణారెడ్డి, ఎజాస్, ఖలేక్, నార్ల సురేష్, నార్ల రవీందర్, మధుసూదన్రెడ్డి, హకీం, లింగం, ఉప్పరి లింగం, సాయిబాబా, పసుపుల సాయిలు, అఫ్రోజ్, గౌస్, వాహబ్, బాబా, టోర్నమెంట్ నిర్వాహకులు పంతులు నరేష్, పీఈటీలు సురేందర్, అనీల్, రవి తదితరులున్నారు. అందెశ్రీకి నివాళులు.. ప్రముఖ గాయకులు అందెశ్రీ మృతికి సంతాపంగా సోమవారం వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. అందెశ్రీ ఆలపించిన జయజయయే తెలంగాణ గేయాన్ని విద్యార్థులకు వినించారు. ఆయన పాడిన గేయాలు తెలంగాణ చరిత్రలో నిలిచిపోతాయని పోచారం అన్నారు. -
రెండు గ్రామాల మధ్య ఇసుక పంచాయతీ
నిజాంసాగర్(జుక్కల్): మంజీరా నదిలో ఇసుక దిబ్బ లు ఇరు గ్రామాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ఇసుక తరలింపు కోసం మంజీరా నదిలో సోమవారం మాగి గ్రామస్తులు పైపులు ఏర్పాటు చేసి మట్టి, మొరంతో రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట గ్రామస్తులు, యువకులు ఇసుక దిబ్బల వద్దకు చేరుకొని పైపులైన్ పనులను అడ్డుకున్నారు. మంజీరా నది పరివాహక ప్రాంతంలోని ఇసుక దిబ్బలు ఉన్న ప్రదేశం తమదంటే, తమదంటూ ఇరు గ్రామాల రైతులు, ట్రాక్టర్లు యజమానులు వాదులాడుకున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు మంజీరా నది వద్దకు చేరుకున్నారు. పైపులైన్ పనులను ఆపాలని మాగి గ్రామస్తులకు సూచించారు. ఇసుక కోసం రోడ్డు మార్గం.. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటిని మంజీరా నదిలోకి విడుదల చేశారు. మంజీరా నదిలో వరద నీటి ప్రవాహం కారణంగా ఇసుక దిబ్బలు పేరుకున్నాయి. మంజీరా నదిలో కుప్పలు, తెప్పలుగా ఉన్న ఇసుక దిబ్బల కోసం చుట్ట ప్రక్క గ్రామాల ట్రాక్టర్లున్న యజమానులు, రైతులు పోటీ పడుతున్నారు. అయితే మంజీరా నదిలో ఉన్న ఇసుక నిల్వలను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరిట ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. అచ్చంపేట, ఆరేడ్, ఆరేపల్లి, పెద్ద ఆరేపల్లి, బ్రాహ్మణపల్లి, మాగి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక అనుమతులు తీసుకుంటున్నారు. ఆయా గ్రామాల నుంచి పట్టణాలకు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
రేషన్బియ్యం పట్టివేత
బాల్కొండ: మెండోరా మండలం బుస్సాపూర్లోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 46 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సోమవారం పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఎస్సై సుహాసిని తెలిపిన వివరాల ప్రకారం.. బుస్సాపూర్ కేంద్రంగా బాల్కొండకు చెందిన వినీష్, నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన సుపీయన్లు ఓ ఇంట్లో రేషన్ బియ్యం దాచి అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో దాడి చేసి రేషన్బియ్యం పట్టుకున్నామన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. బోధన్లో 28 క్వింటాళ్లు.. బోధన్: ఎడపల్లి మండల కేంద్రం శివారులో రేషన్బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఆటో గూడ్స్ వాహనాన్ని సోమవారం సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు. ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ ఇచ్చిన సమాచారం మేరకు నిఘా పెట్టి అక్రమంగా తరలిస్తున్న రేషన్బియ్యం వాహనాన్ని పట్టుకున్నట్లు సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మహేశ్ కుమార్, పవన్కుమార్ తెలిపారు. వాహనంలో 28 క్వింటాళ్ల 60 కిలోల బియ్యం ఉన్నట్లు వెల్లడించారు. వాహనం, బియ్యం స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పేర్కొన్నారు. డ్రైవర్ మహ్మద్ మదినితోపాటు మరో వ్యక్తి షేక్ ఆఫ్పాన్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు డ్రైవర్ చెప్పాడని పేర్కొన్నారు. ఇద్దరి రిమాండ్ ఆర్మూర్టౌన్: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని సోమవారం రిమాండ్కు తరలించినట్లు పట్టణ ఎస్హెచ్వో సత్యనారాయణ తెలిపారు. పట్టణానికి చెందిన పద్మ రంజిత్, వేల్పూర్కు చెందిన రేషన్డీలర్ మేకల పాపన్న ఈ నెల 7న రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిని సోమవారం ఆర్మూర్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
ద్విచక్రవాహనం పైనుంచి పడి మహిళ మృతి
సదాశివనగర్: మండలంలోని దగ్గి గ్రామ శివారు 44 జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు.. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గౌరారం గ్రామానికి చెందిన కనకంటి సావిత్రి (45), భర్త సాయిరెడ్డితో కలిసి పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై కామారెడ్డికి వెళ్లారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో దగ్గి చివర్లోకి రాగానే వాహనంపై ఉన్న మహిళ రోడ్డుపై పడడంతో తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా సావిత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సదాశివనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రుద్రూర్: పోతంగల్ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం స్థానికులు ఇసుక టిప్పర్లను అడ్డుకున్నారు. అక్రమ ఇసుక తరలింపును నిలిపివేయాలని నినాదాలు చేశారు. అనుమతి కన్నా రెట్టింపు సంఖ్యలో ఇసుక తరలిస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అవసరమైతే ట్రాక్టర్ల ద్వారా తరలించేందుకు అనుమతించాలన్నారు. అధికారుల ఉదాసీనతతో అక్రమార్కులు విచ్చలవిడిగా ఇసుక తరలిస్తున్నారని వాహనాలను అడ్డుకున్నారు. పెద్ద టిప్పర్ల ద్వారా ఇసుక తరలించడంతో వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ రవాణాను అడ్డుకున్న వారిపై ఇసుక మాఫీయా బెదిరింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న కోటగిరి ఎస్సై సునీల్తో వాగ్వాదానికి దిగారు. అధికారులు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. -
దీపంతో అగ్ని ప్రమాదం
బాల్కొండ: ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో బొంత రాజేందర్కు చెందిన ఇంట్లో సోమవారం ఉదయం దేవుళ్ల ఫొటో ముందు దీపం వెలిగించారు. కొన్ని గంటల తర్వాత ఇంట్లో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు అప్రమత్తమై నీటితో చల్లార్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబసభ్యులు కోరారు. నవీపేట : మండలంలోని నాళేశ్వర్ గ్రామానికి చెందిన ఆలూరు అక్షయ్ (18) సోమవారం చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. రోజులాగే గోదావరి నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన అక్షయ్ కాళ్లకు వల చిక్కుకోవడంతో నీట మునిగి మృతి చెందాడు. నది ఒడ్డున చెప్పులు, బట్టలు ఉండడంతో తల్లి సుమలత అనుమానం వచ్చి నదిలో వెతికారు. సాయంత్రం అక్షయ్ మృతదేహం లభించింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో జమీర్ ఆర్డర్ మెస్లో జమీర్ అనే వ్యక్తి డబ్బులు తీసుకొని పేకాట ఆడిస్తున్నాడన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. పేకాడుతున్న ఆరుగురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.14,460 నగదు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. వర్ని: మోస్రా మండలం గోవూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ (33) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వర్ని ఎస్సై మహేశ్ తెలిపారు. భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావడం లేదని మనస్తాపంతో ప్రశాంత్ ఈనెల 6న పురుగుల మందు సేవించాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాల్కొండ: మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద సోమవారం సాయంత్రం ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. దీంతో కార్లలో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ నుంచి ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చిన పర్యాటకుల వాహనాలు ఒకే రోడ్డుపై ఎదురెదురుగా వేగంగా రావడంతో అదుపుతప్పి ఢీకొన్నాయి. పలువురికి స్వల్పగాయాలు కావడంతో నిర్మల్లోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. వేల్పూర్: మండలంలోని లక్కోర మాజీ సర్పంచ్ వంశీకృష్ణపై ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన నాగం రాజేశ్, నాగం నర్సయ్యలు కత్తితో దాడి చేసినట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు. దాడిలో వంశీకృష్ణకు కడుపు పైభాగంలో, చేతులకు గాయాలు కాగా గ్రామస్తులు ఆర్మూర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారని పేర్కొన్నారు. గ్రామంలో రోడ్డుపై వంశీకృష్ణకు, రాజేశ్, నర్సయ్య ఎదురుపడగా మాటామాట పెరిగి దాడికి దారితీసినట్లు తెలుస్తోంది. వంశీకృష్ణ భార్య సౌందర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మద్యం సేవించి వాహనాలు నడుపొద్దు
● డ్రంకెన్ డ్రైవ్లో పలువురికి జైలు, జరిమానా విధింపుకామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు నడుపొద్దని పట్టణ ఎస్హెచ్వో నరహరి సూచించారు. జిల్లా కేంద్రంలో రెండు రోజులుగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్లో 24 మంది పట్టుబడినట్లు తెలిపారు. కోర్టుకు హాజరుపరుచగా బాలక్రిష్ణ, తిరుపతి రెడ్డి అనే ఇద్దరికి ఒక రోజు జైలు శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా, మిగితా 22 మందికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించినట్లు వెల్లడించారు. డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వాహనదారులకు సోమవారం టౌన్ పీఎస్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్సై మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు. తాడ్వాయిలో ఇద్దరికి జైలు.. తాడ్వాయి(ఎల్లారెడ్డి): డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష పడినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. సోమవారం తాడ్వాయి పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టు నిర్వహించారు. కన్కల్ గ్రామానికి చెందిన ఏలేటి బాలురెడ్డి, సంగోజివాడికి చెందిన దుడ్డెల ప్రవీన్ అతిగా మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి కామారెడ్డిలోని కోర్టులో హాజరుపరచగా ద్వితీయశ్రేణి న్యాయమూర్తి చంద్రశేఖర్ వారికి ఒక రోజు జైలు శిక్ష , రూ.1000 చొప్పున జరిమాన విధించారు. -
మెడికల్ దందా!
● దేవునిపల్లికి చెందిన నరేందర్కు జ్వరంతోపాటు ఒళ్లు నొప్పులు రావడంతో ఓ మెడికల్ షాప్కు వెళ్లి సమస్య చెప్పాడు. దుకాణం నిర్వాహకుడు కొన్ని రకాల మందులు ఇచ్చి ఎలా వాడాలో సూచించాడు. డాక్టర్ ప్రిిస్క్రప్షన్ ఏదీ లేకుండానే మెడికల్ షాప్లో ఇచ్చిన ఆ మందులను మూడు రోజులపాటు వాడినా జ్వరం తగ్గకపోవడంతో నరేందర్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ పరీక్షలు నిర్వహించి, రక్తంలో ఇన్ఫెక్షన్ ఉండడంతో ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందించారు. ● కామారెడ్డిలోని అయ్యప్పనగర్కు చెందిన సురేశ్.. తన తల్లికి వైద్యుడు రాసిచ్చిన మందులను తీసుకోవడానికి ఓ మెడికల్ షాప్కు వెళ్లాడు. మెడికల్ షాప్ నిర్వాహకుడు బ్రాండెడ్కు బదులు జనరిక్ మందులు ఇచ్చి.. అసలు ధర వసూలు చేశాడు. దీనిని గమనించిన సురేశ్ దుకాణం నిర్వాహకుడితో వాగ్వాదానికి దిగాడు. మందులు వాపస్ ఇచ్చి వేరే షాప్లో తీసుకున్నాడు. కామారెడ్డి టౌన్ : మెడికల్ దందాకు కేరాఫ్గా కామారెడ్డి పేరుగాంచింది. హైదరాబాద్ తర్వాత ఇక్కడే మెడికల్ ఏజెన్సీలు ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో 600లకుపైగా మెడికల్ దుకాణాలు రిజిస్ట్రర్ అయి ఉన్నాయి. అనధికారికంగా నడుస్తున్నవి మరో ఐదారు వందల వరకు ఉంటాయి. ఏదైనా మెడికల్ షాప్లోనో ఆస్పత్రిలోనో కొంతకాలం పనిచేసినవారు బీఫార్మసీ సర్టిఫికెట్ను అద్దెకు తీసుకుని దుకాణం తెరుస్తున్నారు. చాలాచోట్ల ఫార్మసిస్ట్లే ఉండడం లేదు. దుకాణం నిర్వాహకులే మందులు అమ్ముతున్నారు. జనరిక్ మందు.. బ్రాండెడ్ రేటు.. అర్హతలు లేకున్నా మందుల దుకాణం నిర్వహిస్తున్నవారు ఎక్కువగా జనరిక్ మందులనే అంటగడుతున్నట్లు తెలుస్తోంది. అదీ పూర్తి ధరకు అమ్ముతున్నారు. వైద్యులు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్(మందుల చీటి) చూసి మాత్రమే మందులు ఇవ్వాల్సి ఉండగా.. ఈ నిబంధనను ఎవరూ పట్టించుకోవడం లేదు. రోగి చెప్పిన లక్షణాల ఆధారంగా యాంటీబయాటిక్స్తోపాటు రెండుమూడు రకాల మందులు ఇచ్చి పంపిస్తున్నారు. చాలా మెడికల్ షాప్లలో ఇష్టారాజ్యంగా మందులు విక్రయిస్తున్నారు. మందులకు సంబంధించిన బిల్లులు సైతం ఇవ్వడం లేదు. అలాగే రికార్డులను సైతం నిర్వహించడం లేదు. సమయం దొరికినప్పుడు తీరిగ్గా కూర్చుని ఒకేసారి బిల్లులు తయారు చేసుకుంటున్నారని, తనిఖీల సమయంలో వాటిని చూపిస్తూ తప్పించుకుంటున్నారని తెలుస్తోంది. జిల్లాలో రెగ్యులర్గా మెడికల్ దుకాణాలను తనిఖీ చేస్తున్నా. మెడికల్ షాప్లలో ఫార్మసిస్టులు మాత్రమే మందులు విక్రయించాలి. బిల్లులు, రికార్డులు తప్పనిసరిగా నిర్వహించాలి. ఫార్మసిస్టు లేకున్నా, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించినా చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే లైసెన్స్ రద్దు చేస్తాం. – రాజిరెడ్డి, డ్రగ్ ఇన్స్పెక్టర్, కామారెడ్డి తనిఖీలు లేక.. ఔషధ నియంత్రణ శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఒక్కరే ఉన్నారు. దీంతో జిల్లాలో మెడికల్ షాప్లపై తనిఖీలు కరువయ్యాయి. అప్పుడప్పుడు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారన్న విమర్శలున్నాయి. తనిఖీల సమాచారం ముందే లీకవుతుండడంతో దుకాణాల నిర్వాహకులు ఆ సమయంలో ఫార్మసిస్టులను అందుబాటులో ఉంచుతున్నారు. దాడుల సమయంలో కొందరు షాప్లను మూసి ఉంచుతున్నారు.జిల్లాలో మెడికల్ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఎలాంటి అర్హతలు లేకున్నా సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుని దుకాణాలను నిర్వహిస్తున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకున్నా మందులు అమ్ముతున్నారు. జనరిక్ మందులను సైతం పూర్తి ధరకు అంటగడుతూ దోచుకుంటున్నారు. అర్హత లేకున్నా అద్దె సర్టిఫికెట్లతో నిర్వహణ షాపుల్లో కనిపించని ఫార్మసిస్టులు జనరిక్ మందులనూ ఎమ్మార్పీకే అంటగడుతున్న వైనం డాక్టర్ చీటీ లేకున్నా అమ్మకాలు చర్యలు తీసుకోని అధికారులు -
17న ఖేలో ఇండియా అథ్లెటిక్స్ పోటీలు
కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈనెల 17న అస్మిత ఖేలో ఇండియా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ లీగ్ పోటీలు నిర్వహించనున్నారు. అండర్–14, 16 బాలికల విభాగంలో ఈ పోటీలు జరగనున్నాయి. బాలికలను క్రీడారంగంలో ప్రో త్సహించడం, వచ్చే ఒలింపిక్స్ కోసం సన్న ద్ధం చేయడానికి కేంద్ర క్రీడ, యువజన శాఖ సంకల్పం మేరకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అ ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్రెడ్డి, అ నిల్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల బాలికలు బోనఫైడ్ సర్టిఫికెట్తోపాటు క్రీడా దుస్తులు ధరించి ఈనెల 17న ఉద యం 8 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియాని కి రావాలని సూచించారు. లాంగ్జంప్, హై జంప్, షార్ట్పుట్, డిస్క్త్రో, జావెలిన్త్రో అంశాలలో పోటీలుంటాయని తెలిపారు. కలెక్టర్ను కలిసిన మార్క్ఫెడ్ డీఎం కామారెడ్డి క్రైం: మార్క్ఫెడ్ డీఎం శశిధర్రెడ్డి సోమవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను కలిసి మొక్కను అందజేశారు. ఆయన గతంలో మార్క్ఫెడ్ రాష్ట్ర కార్యాలయంలో పనిచేశారు. ఇటీవలే కామారెడ్డి జిల్లా మేనేజర్గా బాధ్యతలు స్వీకరించారు. విదేశీ పర్యటన ముగించుకుని సోమవారం కలెక్టరేట్కు వచ్చిన కలెక్టర్ను ఆయన మర్యాదపూర్వకగా కలిశారు. ఇక్కడ పనిచేసిన మార్క్ఫెడ్ డీఎం మహేష్ నిర్మల్ జిల్లాకు బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే. బాధ్యతల స్వీకరణలింగంపేట: మండల వైద్యాధికారి హిమబిందు సోమవారం ఎల్లారెడ్డి డివిజన్ ఉప వైద్యాధికారిగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తనకు అప్పగించిన అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. అనంతరం వైద్య సిబ్బంది ఆమెను సన్మానించా రు. సీహెచ్వో రమేశ్, పర్యవేక్షకులు ఫరీదా, సిబ్బంది చంద్రకళ, యాదగిరి, ఫార్మసిస్టు ప్రదీప్, ల్యాబ్ టెక్నిషియన్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు. టీఎన్జీవోస్ సభ్యత్వం.. కామారెడ్డి అర్బన్: జిల్లా ట్రెజరీ, ఉద్యానవన శాఖల ఉద్యోగులు సోమవారం తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం సభ్యత్వం స్వీకరించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరాల వెంకట్రెడ్డి, ముల్క నాగరాజు, ప్రతినిధులు దేవరాజు, రాజేశ్వర్, అనుదీప్రెడ్డి, స్వప్న, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
సోయా కొనుగోళ్లలో కొర్రీలు
● కొత్తగా బయోమెట్రిక్ విధానం అమలు ● ఎకరానికి 7.50 క్వింటాళ్లు మాత్రమే సేకరణ ● ఆందోళనలో రైతులుబిచ్కుంద : ఆరుగాలం శ్రమించే రైతన్నలు.. దున్నకాలనుంచి పండించిన పంటను అమ్ముకునే వరకు అనేక పాట్లు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలలో నిబంధనలతోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది సోయా కొనుగోళ్లలో మార్క్ఫెడ్ కొత్తగా బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. గతంలో పట్టాదారు ఆధార్ కార్డును తీసుకునివచ్చి కుటుంబ సభ్యులెవరైనా పంటను విక్రయించడానికి అవకాశం ఉండేది. కానీ నూతన విధానం ప్రకారం పాస్బుక్లో పేరున్న రైతు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రానికి వచ్చి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. అలాగే క్రాప్ బుకింగ్ సమయంలో సోయా పంటను పండిస్తున్నట్లు వివరాలు ఇస్తేనే పంటను అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సిందే. మిగతా పంటను ఏం చేయాలి? కొనుగోలు కేంద్రాలలో ఎకరానికి 7.5 క్వింటాళ్ల సోయాలను మాత్రమే కొనుగోలు చేయనున్నారు. అధిక వర్షాలు కురిసే ప్రాంతాలలో ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. నీరు నిలువ ఉండని సారవంతమైన భూములలో ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల పంట పండుతుంది. కానీ కొనుగోలు కేంద్రాలలో 7.5 క్వింటాళ్ల పంటను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో మిగతా పంటను ఏం చేయాలో పాలుపోవడం లేదని రైతులు పేర్కొంటున్నారు. పండిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దళారులను చెక్ పెట్టేందుకే బయోమెట్రిక్! సోయా కొనుగోళ్లలో దళారులకు చెక్ పెట్టేందుకే బయోమెట్రిక్ విధానం అమలులోకి తీసుకు వచ్చినట్లు మార్క్ఫెడ్ అధికారులు పేర్కొంటున్నారు. పాత పద్ధతిలో దళారులు ఎక్కడి నుంచో సోయాలను తీసుకునివచ్చి రైతు పేరుతో విక్రయించి లబ్ధిపొందుతున్నారని గుర్తించిన ప్రభుత్వం.. బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చిందని పేర్కొంటున్నారు. కొత్త విధానంతో పట్టాదారు మాత్రమే కొనుగోలు కేంద్రంలో పంటను అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు. అయితే వృద్ధులు, మహిళా రైతులు, అనారోగ్యంతో ఉన్న వారు కొనుగోలు కేంద్రం వరకు వచ్చే పరిస్థితి ఉండదని, వారు పంటను ఎలా విక్రయించుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎకరానికి ఆరునుంచి పది క్వింటాళ్ల వరకు సోయా పంట పండుతుంది. కానీ కొనుగోలు కేంద్రాలలో 7.5 క్వింటాళ్లు మాత్రమే తీసుకుంటాం అంటున్నారు. మిగిలిన సోయాలను ఎక్కడ అమ్ముకోవాలి. పండిన పంటను పూర్తిగా కొనుగోలు చేయాలి. – యాదవరావు, రైతు ఫత్లాపూర్ -
కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
● రైతులకు ఇబ్బందులు కలగనీయొద్దు ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం : కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం తగదని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో కొనుగోలు కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టెర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉన్నట్లయితే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 08468 –220051 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు గడువులోగా పూర్తయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, డీసీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో సురేందర్, డీఏవో మోహన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన కామారెడ్డి క్రైం: కలెక్టరేట్కు సమీపంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం సందర్శించారు. రికార్డులు, తీసుకుంటున్న భద్రత చర్యలు, సీసీ కెమెరాల నిఘా తదితర అంశాలను పరిశీలించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, డిప్యూటీ తహసీల్దార్లు రవి, అనిల్, సిబ్బంది పాల్గొన్నారు. -
కాలభైరవుడికి లక్షదీపార్చన
రెండో రోజు కొనసాగిన సంతతధారాభిషేకం ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తున్న భక్తులురామారెడ్డి : దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం ఇసన్నపల్లి(రామారెడ్డి)లో వెలసిన శ్రీకాలభైరవుడి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 72 గంటల సంతతధారాభిషేకం సోమవారం రెండోరోజూ కొనసాగింది. సాయంత్రం 6 గంటలకు లక్ష దీపార్చన ప్రారంభమైంది. ఆలయ అర్చకుడు శ్రీనివాసశర్మ, ఈవో ప్రభుగుప్తా తదితరులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. భైరవ నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. -
భూసేకరణను వేగవంతం చేయాలి
● రైతులకు త్వరగా పరిహారం చెల్లించాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి క్రైం: జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. రహదారుల భూసేకరణ పనులపై సోమవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మెదక్ నుంచి ఎల్లారెడ్డి మార్గంలో జరుగుతున్న జాతీయ రహదారి (ఎన్హెచ్–765డీ) ప్రాజెక్టుకు సంబంధించి రైతులకు నష్ట పరిహారం త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్లారెడ్డి నుంచి రుద్రూర్ వరకు చేపట్టాల్సిన రహదారి పనులకు గాను భూ సేకరణను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ఎల్లారెడ్డి ఆర్డీఓ పార్థసింహా రెడ్డి, సంబంధిత శాఖల ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అసలే అక్రమం.. ఆపై రాజకీయం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రోస్టర్ పాటించకుండా అడ్డదారిలో నియామకమైన తెలంగాణ వర్సిటీ అధ్యాపకులు.. క్యాంపస్లో కొత్త రాజకీయాలకు తెరతీశారు. 2014లో కేసు కోర్టులో ఉన్న సమయంలోనే ఉద్యోగంలో నియామకమయ్యేటప్పుడు కోర్టు తీర్పునకు కట్టుబడతామని సదరు అధ్యాపకులు రాసిచ్చారు. తీరా ఇప్పుడు హైకోర్టు ఆ నియామకాలను రద్దు చేసినప్పటికీ తమను ఎవరూ ఏంచేయలేరన్నట్లుగా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. కోర్టు తీర్పును ధిక్కరిస్తూ వర్సిటీకి వస్తున్న ఆ 45 మంది అధ్యాపకులు తాజాగా మరో నీచ రాజకీయానికి బీజం వేశారు. ఎన్ఎస్యూఐ పేరిట తమకు అనుకూలంగా వర్సిటీలో ఆందోళన చేయించారు. ఇలా చేసిన కొద్ది సేపటికే దానిని ఖండిస్తూ ఎన్ఎస్యూఐ నుంచి ప్రకటన రావడం గమనార్హం. ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్ ఈ ప్రకటన విడుదల చేశారు. ఎన్ఎస్యూఐ ఉపాధ్యక్షుడిగా చెప్పుకుంటున్న నవీన్కు యూనియన్తో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. గతంలో తెలంగాణ వర్సిటీ ఎన్ఎస్యూఐ కమిటీలో పనిచేసినవారెవరూ ప్రస్తుతం అందుబాటులో లేనందున కొత్త కమిటీని నియమించలేదన్నారు. 2012 నోటిఫికేషన్ మీద హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఆయా అధ్యాపకుల పోస్టులను క్రమబద్ధీకరించాలంటూ చేసిన ఆందోళనకు ఎన్ఎస్యూఐకి సంబంధం లేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్కుమార్రెడ్డి ప్రభు త్వం ఉన్న సమయంలో అప్పటి తెయూ వీసీ అక్బ ర్ అలీఖాన్ చేసిన అక్రమ నియామకాలపై ఆ ప్రభు త్వం రెండు కమిటీలు వేసింది. ఈ నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా చేసినట్లు రెండు కమిటీ లూ నివేదికలు ఇవ్వగా తరువాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం సదరు నివేదికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టింది. ఈ అధ్యాపకుల నియామకాలను, వీళ్లకు ప్రమోషన్లు ఇచ్చే విషయమై పాలకమండలి ప్రతిసారి తిరస్కరిస్తూ వ చ్చింది. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది. హైకోర్టు ఈ నియామకాలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును అమలు చేసే విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సదరు అధ్యాపకులు కీలక నేతలను బదనాం చేసే పనిలో బిజీగా ఉండడం విశేషం. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కొందరు బ్యూరోక్రాట్లు ఈ అక్రమాన్ని సక్రమం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తుండడం గమనార్హం.కోర్టు తీర్పును ధిక్కరిస్తున్న అక్రమ అధ్యాపకులు అధికార పార్టీ నాయకుల ప్రతిష్టనూ దెబ్బతీసే పని చేస్తుండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పేర్లను కూడా వాడుతున్నారు. అధికార పార్టీ అండ తమకుందంటూ వర్సిటీలో విభజన రాజకీయాలు చేస్తున్నారు. విద్యార్థి సంఘాలను భ్రష్టు పట్టించేందుకు కుయుక్తులు పన్నిన ఈ అధ్యాపకులు ఏకంగా ప్రభుత్వంలో, అధికార పార్టీలో కీలకంగా ఉన్న నేతనూ బదనాం చేస్తుండడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తగినవిధంగా ముందుకు వెళ్లేందుకు వీసీ యాదగిరిరావు సంసిద్ధం అవుతున్నప్పటికీ రిజిస్ట్రార్ యాదగిరి మాత్రం కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడుతున్నట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అడుగడుగునా అడ్డదారులు వెతుకుతున్న అక్రమ అధ్యాపకులు హైకోర్టు తీర్పు నేపథ్యంలో విద్యార్థి సంఘాలను భ్రష్టు పట్టించే యత్నం అధికార పార్టీ నేతలనూ బదనాం చేస్తున్న వైనం ఎన్ఎస్యూఐ పేరిట ఆందోళన చేయించడంతో.. ఖండిస్తూ ఆ సంస్థ ప్రకటన -
జాడలేని సబ్సిడీ టార్పాలిన్లు!
ధర్పల్లి: ఆరుగాలం శ్రమించి పండించిన పంట ఉత్పత్తులను ఆరబెట్టుకోవడానికి, వర్షాల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఎప్పుడు వర్షం వ స్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈక్రమంలో అకాల వర్షాల నుంచి పంట ఉత్పత్తులను కాపాడు కునేందుకు టార్పాలిన్లు రైతులకు ఇప్పుడు అత్యవసరం. దీంతో గతంలో ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై టార్పాలిన్లను రైతులకు సరఫరా చేసేది. కానీ గత ఏడు సంవత్సరాల నుంచి ప్రభుత్వం టార్పాలి న్ల పంపిణీని నిలిపివేసింది. మార్కెట్లో టార్పాలిన్ల ధరలు అధికంగా ఉండటంతో కొనలేక టాపర్లను రైతులు అద్దెకు తెచ్చుకుంటూ పంటను కాపాడుకుంటున్నారు. 2018 వరకు పంపిణీ.. వర్షాలు, ప్రకృతి విపత్తుల నుంచి పంటలను రక్షించుకోవడానికి వ్యవసాయ శాఖ గతంలో సబ్సిడీపై రైతులకు టార్పాలిన్లు అందించేది. మార్కెట్లో రూ. 2500కు లభించే టార్పాలిన్లను 50 శాతం సబ్సిడీ తో రూ.1250కే ప్రభుత్వం రైతులకు అందించేది. ప్రభుత్వం రాయితీపై సరఫరా చేసే టార్పాలిన్లు నాణ్యతతో పాటు ఎక్కువ కాలం మన్నికగా ఉండేవి. ఈవిధంగా 2018 వరకు ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై టార్పాలిన్లను పంపిణీ చేసింది. రైతులు కూడా వాటిని తీసుకోవడానికి పోటీపడేవారు. ప్రతి సారి ఆశించిన మేర టార్పాలిన్లు రాకపోవడంతో ఉన్నంత మేరలో అధికారులు రైతులకు అందించేవారు. కానీ 2018 తర్వాత సబ్సిడీ టార్పాలిన్ల జాడే లేదు. వాటికోసం రైతులు ఏడేళ్లుగా ఎదురుచూపులు చూస్తూనేఉన్నారు. ప్రస్తుతం ధాన్యం విక్రయాలు జోరుగా జరుగుతున్నాయి. పంట కోస్తే ధాన్యం ఆరబెట్టడానికి టార్పాలిన్లు లేకపోవడంతో అద్దెకు తీసుకుంటున్నాం. ఒక రైతు సుమారు రూ.వెయ్యి నుంచి రూ.2వేల వరకు టార్పాలిన్ల కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి గతంలో మాదిరిగా టార్పాలిన్లను సబ్సిడీపై అందించాలి. –తిరుపతి, రైతు, కార్నల్ తండా రోజుకు అద్దె రూ.25.. జిల్లాలోని పెద్ద గ్రామాలు, పట్టణ శివా రులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు వ్యక్తులు టార్పాలిన్లను అద్దెకిచ్చి ఉపాధి పొందుతున్నారు.ఒక్క టార్పాలిన్కు రోజుకు రూ.15 నుంచి రూ.25 వరకు చెల్లించి అద్దె ప్రతిపాదికన రైతులు తీసుకుంటున్నారు. ధాన్యం ఆరబెట్టుకోవడానికి సాధారణంగా ప్రతి రైతుకు కనీసం ఆరు నుంచి పది టార్పాలిన్లు అవసరం అవుతుండగా, వాటిపై ప్రతిరోజు సుమారు రూ.100నుంచి రూ. 250 వరకు భారం పడుతుంది.ఇలా రోజుల త రబడి టార్పాలిన్లను అద్దైపె తీసుకువస్తే రైతుల పై రూ.వెయ్యికి పైగా ఖర్చవుతోంది. దీంతో టా ర్పాలిన్ల అద్దె భారం మోయలేకపోతున్నట్లు రైతు లు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి గతంలో మాదిరిగా టార్పాలిన్లను సబ్సిడీపై అందజేయాలని రైతులు కోరుతున్నారు. ఏడేళ్లుగా రైతుల ఎదురుచూపులు బహిరంగ మార్కెట్లో అధిక ధరలు కొనలేక అద్దెకు తెచ్చుకుంటున్న అన్నదాతలు -
క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటాలి
జక్రాన్పల్లి: క్రీడాపోటీల్లో క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటాలని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ గురుకులాల జాయింట్ సెక్రెటరీ తిరుపతి అన్నారు. మండలంలోని మునిపల్లిలో గల మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలికల కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలలో ఆదివారం అండర్ 14, 19 జిల్లా స్థాయి క్రీడాపోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోటీల్లో క్రీడాకారులు తమ సత్తా చాటాలన్నారు. డీసీవో శ్రీకర్, ఆర్సీవో సత్యనాథ్, ప్రిన్సిపాల్ అనూష, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు. -
చెరువులో పడి ఒకరి మృతి
జక్రాన్పల్లి: మండలంలోని అర్గుల్ గ్రామంలోగల చెరువులో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పడిపోయి మృతిచెందాడు. ఎస్సై మహేష్కుమార్ తెలిపిన వివరాలు ఇలా..డిచ్పల్లి మండలంలోని నడిపల్లి గ్రామానికి చెందిన తీట్ల ప్రభాకర్ (50) అనే వ్యక్తి ఆదివారం అర్గుల్ చెరువులో గాలం వేసి చేపలు పడుతున్నాడు. ఈక్రమంలో చెరువు నీటిలో గాలం తట్టుకోవడంతో దానిని తీయడానికి నీటిలోకి దిగాడు. లోతు ఎక్కువగా ఉండడంతో కాళ్లకు గడ్డి చుట్టుకోవడంతో బయటకు రాలేక ఊపిరాడక ప్రభాకర్ మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి ఎస్సై తన సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మక్కలను వదలని కోతుల దండు
బాల్కొండ: వనంలో ఉండాల్సిన కోతులకు ఆహరం లభించక జనంలోకి వచ్చి ఆహార ఆన్వేషణ చేస్తూ, కంటికి కనిపించిన పదార్థాలను తింటున్నాయి. ఈక్రమంలో ముప్కాల్ మండలం నల్లూర్ శివారులో జాతీయ రహదారి 44 పక్కన ఆదివారం ఓ రైతు ఆరబెట్టిన మక్కలను సైతం వానరాలు తిన్నాయి. ఈ చిత్రాన్ని సాక్షి ‘క్లిక్’మన్పించింది. ముప్కాల్ మండలంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. జాతీయ రహదారి పరిసర ప్రాంతాల్లో ఎలాంటి పండ్లను ఇచ్చే చెట్లు లేకపోవడంతో కోతులు గ్రామంలోకి వస్తున్నాయి. ఆకలి, దప్పికలను తట్టుకోలేక కనిపించిన వస్తువులను తింటూ ఆకలిని తీర్చుకుంటున్నాయి. ఆహరం లభించక కోతులు చేసే చేష్టలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కోతుల బెడద నుంచి కాపాడలని ప్రజలు కోరుతున్నారు. -
బోల్తాపడిన ఆటో: పలువురికి గాయాలు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి శివారులో ఆదివారం ఓ ఆటో బోల్తా పడి పలువురికి గాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామానికి చెందిన 12మంది ఒక శుభకార్యక్రమంలో పాల్గొనడానికి ఆటోలో సంతాయిపేట్ నుంచి తాడ్వాయికి బయలుదేరారు. తాడ్వాయి శివారులోకి రాగానే ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఒకరికి చేయి విరుగగా పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఆత్మీయ పలకరింపులు.. మధుర స్మృతులు..
● పలుచోట్ల సమ్మేళనాలు నిర్వహించిన పూర్వవిద్యార్థులు ● ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో భావోద్వేగానికి గురైన చిన్ననాటి మిత్రులు నందిపేట్/ఆర్మూర్టౌన్/బాన్సువాడ/దోమకొండ/లింగంపేట(ఎల్లారెడ్డి): ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయావంటూ ఆత్మీయంగా పలుకరించుకున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈసందర్భంగా చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు పలకరించుకుంటూ అనాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యార్థులు, గురువులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. నందిపేట మండలంలోని తల్వేద ప్రాథమికోన్నత పాఠశాలలో 1996–97లో 7వ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అలాగే లింగంపేట మండలంలోని పోతాయిపల్లి ఉన్నత పాఠశాలలో 2006–07 నుంచి 2019–20 వరకు బ్యాచ్లకు చెందిన పూర్వ విద్యార్థులంతా ఒకే చోట ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. -
బాన్సువాడలో గంజాయి స్వాధీనం
బాన్సువాడ: బాన్సువాడ ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలోని దుర్కి శివారులో గంజాయి అమ్ముతున్న ముగ్గురి అదుపులోకి తీసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ దిలీప్ తెలిపారు. దుర్కి శివారులో శంభుకుమార్, కార్తీక్గౌడ్, నందు, ఫరూఖ్ అనే వ్యక్తులు గంజాయి అమ్ముతుండగా, పోలీసులకు విశ్వసనీయ సమాచారం రావడంతో దాడులు చేశారు. గంజాయిని విక్రయిస్తున్న నలుగురిని పట్టుకునే ప్రయత్నం చేయగా, ముగ్గురు పోలీసులకు పట్టుబడగా, ఫరూఖ్ పరారీ అయ్యారు. వారి నుంచి 225 గ్రాముల ఎండు గంజాయిని, మూడు సెల్పోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రావణ్, కానిస్టేబుళ్లు శ్రీకాంత్, షరుబోద్దీన్, రూపేష్, స్నేహా, సుదీప్, నాగరాజు ఉన్నారని ఆయన అన్నారు. -
బాధ్యతల స్వీకరణ
నిజామాబాద్అర్బన్: నగరంలోని నాలుగోటౌన్ ఎస్హెచ్వోగా సతీష్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఈ పోలీస్ స్టేషన్కు ఎస్సైస్థాయి అధికారి కొనసాగారు. స్టేషన్ పరిధి ఎక్కువగా ఉండడం, కేసులు ఎక్కువగా నమోదు అవుతుండటంతో ఇటీవల దీని పరిధిని ఎస్హెచ్వోగా విస్తరించారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్టేషన్కు ఎస్హెచ్వో స్థాయి అధికారిని నియమించగా, సతీష్ బాధ్యతలు స్వీకరించారు. బాన్సువాడ రూరల్: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా హరితహారం కార్యక్రమంలో భా గంగా నాటిన మొక్కలు ఎదిగి చెట్లుగా మారా యి. కాగా రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగి బాటసారులకు నీడనిస్తున్న చెట్లను కొందరు నిరక్షరాస్యులైన రైతులు నరికి వేస్తున్నారు. పోచారం తండా శివారులో కొన్నేళ్లుగా ఉపాధి హామీలో భాగంగా పెంచిన సుమారు 10 చెట్లను నరికివేశారు. నరికివేతకు గురైన చెట్ల స్థానంలో కొత్త మొక్కలు నాటడంతో పాటు చెట్లను నరికి వేసిన వారిని గుర్తించి చట్టప్రకారం శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సుభాష్నగర్ : స్వదేశీ, స్వాభిమానము, స్వావలంబనతో కూడిన సమాజ నిర్మాణమే రాష్ట్రీయ స్వ యంసేవక్ సంఘ్ లక్ష్యమని.. అందుకోసం 100 ఏళ్లుగా నిర్విరామంగా కృషి చేస్తోందని ఆర్ఎస్ఎస్ ఇందూరు విభాగ్ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్ అన్నారు. ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దేశంలోని ప్రతి హిందూ గృహానికి వెళ్లి వారి కర్తవ్యా న్ని గుర్తు చేయడమే లక్ష్యంగా రానున్న నెల రోజులపాటు స్వయం సేవకులు పర్యటించనున్నారని తెలిపారు. ఇందూరు నగర పథ సంచలన్ కార్యక్రమా న్ని చంద్రశేఖర్ కాలనీలోని హెచ్పీఎస్ పాఠశాల నుంచి ప్రారంభించి కంఠేశ్వర ప్రాంతంలోని వివిధ కాలనీల గుండా కదిలిన వందలాది మంది స్వయం సేవకులు తిరిగి అక్కడికే వచ్చి ప్రార్థనతో కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ప్రత్యేక అతిథిగా పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. దేశ సేవలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పాత్ర ఎంతో కీలకమన్నారు. సమాజ నిర్మాణంలో, సాంస్కతిక విలువల పరిరక్షణలో ఆర్ఎస్ఎస్ అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. పథ సంచలన్ సందర్భంగా దేశభక్తి గీతాలు, నినాదాలతో నగరం ఉత్సాహభరిత వాతావరణాన్ని సంతరించుకుంది. జిల్లా సంఘచాలకులు డాక్టర్ కాపర్తి గురు చరణం, విభాగ సహకార్యవాహ వరంగంటి శ్రీనివాస్ నగర కార్యవాహ అరుగుల సత్యం, సహకార్యవాహలు సుమిత్, వెంకటేశ్ పాల్గొన్నారు. -
క్రీడల్లో ఉన్నతస్థాయికి ఎదగాలి
నిజామాబాద్నాగారం: క్రీడాకారులు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నతస్థాయికి ఎదగాలని జిల్లా మైనారిటీ సంక్షేమాధికా రి కృష్ణవేణి అన్నారు. నగరంలోని నాగారంలోని రా జారాం స్టేడియంలో ఖైసర్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. ఈ కారక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ మొదటి విద్యా శాఖమంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినం పురస్కరించుకుని, మైనారిటీ ఎడ్యుకేషన్ డే సందర్బంగా అథ్లెటిక్ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ సయ్యద్ ఖైసర్ మాట్లాడుతూ... ప్రతి ఏడాది ఈటోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అండర్–12, 16, 19 విభాగాల నుంచి బాలబాలికలకు పోటీలు జరిగాయి. 80మీటర్లు, 100మీ,150మీ, 200మీ, 300మీ, 400మీ, 600మీ, 800 మీటర్లలో పోటీల్లో పాల్గొన్న విన్నర్, రన్నర్లకు మెడల్స్ సర్టిఫికెట్లు, టీషర్టులు అందజేశారు. పోటీల్లో ఓవరల్ చాంపియన్గా నిలిచిన నాగారంమైనారిటీ బాలుర గురుకుల పాఠశాల క్రీడాకారుల కు క్యాష్అవార్డుతో పాటు మెడల్స్, సర్టిఫికెట్లు అందజేశారు. బాలికల్లో చాంపియన్గా నిలిచిన మైనారి టీ బాలికల–4 జట్టుకు సైతం అందజేశారు. గురుద్వార్ వైస్ ప్రెసిడెంట్ సోరన్సింగ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళ అధ్యక్షులు రేవతి, కరాటే రమేష్, సర్దార్ నరేందర్ సింగ్, షేక్ హుస్సేన్, ఉషు రాష్ట్ర కార్యదర్శి ఉమర్, నాయకులు ప్రవీణ్ పాల్గొన్నారు. -
రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
రుద్రూర్: మండల కేంద్రంలో శనివారం రాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్స్టేషన్కు తరలించినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. అలాగే కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తునట్లు వివరించారు. ఆగని ఇసుక అక్రమ రవాణా పోతంగల్ మండలంలోని మంజీరా నది నుంచి ని త్యం ఇసుక అక్రమ రవాణ కొనసాగుతూనే ఉంది. అక్రమార్కులు ఇసుక రీచ్ల నుంచి విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరిపి పట్టణ ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కోటగిరి, పోతంగల్, రుద్రూర్ మండలాల్లో రహస్య ప్రాంతాల్లో డంప్ చేసి నిబంధనలకు విరుద్దంగా రాత్రివేళల్లో టిప్పర్లు, ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. పత్రికల్లో వార్తలు వచ్చినపుడు మాత్రమే ఒకటి, రెండు ట్రాక్టర్లను పట్టుకుని పోలీసులు కేసు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎల్లారెడ్డి: మండలంలోని బ్రాహ్మణపల్లి పరిసరప్రాంతంలోగల పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకొని, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి రూ.12,510 నగదుతోపాటు నాలుగు ఫోన్లు, మూడు మోటార్సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. వృద్ధురాలి అదృశ్యం మోపాల్: మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముదక్పల్లి గ్రామానికి చెందిన కంజర్ల రాజవ్వ ఈనెల 6 నుంచి కనిపించడం లేదని ఎస్సై జాడె సుస్మిత తెలిపారు. గురువారం మధ్యాహ్నం రాజవ్వ చందూరు గ్రామంలోని తన చిన్న కుమార్తె ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్లింది. ఇప్పటికీ ఇంటికి రాలేదు. దీంతో ఆమె కుమారుడు కంజర్ల భూమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై ఆదివారం తెలిపారు. రాజవ్వ ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్కి లేదా మోపాల్ పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని వారు కోరారు. -
పొలాన్ని ప్లాట్గా మార్చుకోవచ్చు
మీకు తెలుసా..రామారెడ్డి: సాధారణంగా సాగు చేయని లేదా బంజరు భూమి మాత్రమే మార్పిడికి అనుకూలంగా ఉంటుంది. సారవంతమైన వ్యవసాయ భూమి మార్పిడికి కొన్ని రాష్ట్రాల్లో అనుమతి ఉండదు. లేదా నిబంధనలు కఠినంగా ఉంటాయి. కొన్ని నిబంధనలతో వ్యవసాయ భూమిని ప్లాట్గా మార్చుకోవచ్చు. ● నివాస (రెసిడెన్షియల్) లేదా వాణిజ్య (కమర్షియల్) ప్రయోజనాల కోసం సదరు భూమిని ఉపయోగించాలంటే, ముందుగా దానిని ప్రభుత్వ అనుమతితో వ్యవసాయేతర భూమి (నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ )గా మార్చాలి. ఇందుకోసం చేయవల్సినవి ఇలా.. ● నాలా చట్టం ప్రకారం వ్యవసాయ భూమిని, వ్యవసాయేతర భూమిగా వినియోగ మార్పిడి (కన్వెన్షన్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ టు నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ నాలా) ప్రక్రియను పూర్తి చేయాలి. ● మొదట దరఖాస్తును స్థానిక రెవెన్యూ కార్యాలయంలో లేదా ఆన్లైన్లో (మీసేవ లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ ద్వారా) చేసుకోవాలి. ● కావాల్సిన పత్రాలు: భూమి టైటిల్ డీడ్ కాపీ, పట్టాదార్ పాస్ పుస్తకం కాపీ ● భూమి ప్రాథమిక విలువ ధ్రువీకరణ పత్రం ● దరఖాస్తుదారుడి గుర్తింపు పత్రాలు (ఆధార్, ఇతర పత్రాలు మొదలైనవి) అవసరం. ● వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూ మిగా మార్చినందుకు ప్రభుత్వానికి నిర్దిష్ట మొ త్తంలో నాలా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ● లేఅవుట్ అనుమతి లేఅవుట్ అప్రూవల్ నా లా మార్పిడి పూర్తయిన తర్వాత, మీరు ఆ భూ మిని చిన్న ప్లాట్లుగా విభజించడానికి రోడ్లు, డ్రె యినేజీ వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి లే–అవుట్ అనుమతి పొందాలి. ● రాష్ట్రంలో హెచ్ఎండీఏ/డీటీసీపీ సంస్థలు ఈ అనుమతులను ఇస్తాయి. ● ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ (రేరా): రియల్ ఎస్టేట్ డెవలపర్లయితే, ప్రాజెక్ట్ను తప్పనిసరిగా రేరా (రియల్ ఎస్టేట్ రెగ్యులారిటీ అథారిటీ )లో నమోదు చేయాల్సి ఉంటుంది -
వ్యవసాయ వ్యర్థాలతో భూసారం!
పెర్కిట్(ఆర్మూర్): పొలంలోని వ్యవసాయ వ్య ర్థాలను తగులబెట్టడం వల్ల భూసారం కోల్పో యి దిగుబడులు తగ్గుతాయి. కానీ చాలామంది రైతులు పంట చేతికొచ్చిన తర్వాత వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టి తర్వాత సాగుకు సిద్ధమవుతున్నారు. ఇలా వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టడం ద్వారా వాతావరణ కాలుష్యంతో పాటు భూమి వేడెక్కి భూసారం దెబ్బతింటుంది. అలాకాకుండా వ్యవసాయ వ్యర్థాలను దమ్ముచేయడంతో భూసారాన్ని పెంచుకోవచ్చని ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు నలిమెల చిన్నారెడ్డి తెలియజేస్తున్నారు. పొలం కోసిన తర్వాత కొంత నీరు పెట్టి ఎకరాకు రెండు 50 కేజీల సూపర్ పాస్పేట్ మందును చల్లి దమ్ము చేసుకోవడం వల్ల వ్యర్థాలు భూమిలో కలిసి పోతాయి. నెల రోజుల పాటు అలాగే ఆరబెట్టిన అనంతరం చిన్న నాగలితో దున్నుకుని భూమిని మరో పంటకు సిద్దం చేసుకోవచ్చు. పంట నిడివి కాలం తక్కువగా ఉంటే పొలంలో నీటిని అలాగే ఉంచడం వల్ల వ్యర్థాలు కుళ్లిపోయి భూమిలో కలిసి పోతాయి. ఇలా వ్యవసాయ వ్యర్థాలను భూమిలో కలియబెట్టడం వల్ల భూసారం పెరుగుతుంది. అలాగే వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. -
తప్పిపోయిన వ్యక్తి అప్పగింత
కామారెడ్డి క్రైం: లింగంపేట మండలం సూరాయిపల్లి గ్రామానికి చెందిన పాకాల పెంటయ్యకు కొంతకాలంగా మతిస్థిమితం సక్రమంగా ఉండటం లేదు. ఈక్రమంలో రెండు రోజుల క్రితం అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లి, తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చాలాచోట్ల గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో ఆయన ఆచూకీ కోసం సామాజిక మా ధ్యమాల ద్వారా ప్రచారం చేశారు. ఆదివారం పెంటయ్య కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఎదుట కూర్చుని ఉండటాన్ని గమనించిన అవుట్పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ అనుమానం వచ్చి ఆరా తీశారు. విషయం తెలుసుకుని అతని కుటుంబ స భ్యులకు సమాచారం ఇచ్చారు. వారు రాగానే పెంటయ్యను అప్పగించారు. పెంటయ్య కుటుంబ స భ్యులు హెడ్ కానిస్టేబుల్కు కృతజ్ఞతలు తెలిపారు. -
గుడ్విల్ దందా..
● మద్యం వ్యాపారుల బేరసారాలు ● రూ.లక్షలు పలుకుతున్న మద్యం దుకాణాలుబాన్సువాడ : లక్కీడ్రాలో దుకాణాలు దక్కని లిక్కర్ వ్యాపారులు మరో ప్రయత్నానికి తెరలేపారు. నూతనంగా వైన్ షాపులను దక్కించుకున్న వారిని నేరుగా కలిసి గుడ్విల్ ఇస్తామని, దుకాణాలను అప్పగించాలని బేరాలు చేస్తున్నారు. దుకాణాల విక్రయాల మేరకు రూ.80 లక్షల వరకు ఇచ్చేందుకు వ్యాపారులు సిద్ధపడుతున్నారు. బాన్సువాడ ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలోని బాన్సువాడ పట్టణంలో 5, బీర్కూర్–1, నస్రుల్లాబాద్–2 నిజాంసాగర్–1 మద్యం దుకాణాలకు 239 దరఖాస్తులు రాగా లక్కీ డ్రా ప్రక్రియ ముగిసింది. అయితే, లక్కీ డ్రాలో కొత్తవారికి 5 మద్యం దుకాణాలు వచ్చాయి. దీంతో మద్యం వ్యాపారులకు నిరాశకు గురయ్యారు. డిమాండ్ ఉన్న దుకాణాలను దక్కించుకునేందుకు రాయబేరాలు మొదలుపెట్టారు. రూ.50 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఇచ్చి వైన్సులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 140 దరఖాస్తులు వేసిన ఓ సిండికేట్కు నామమాత్రంగా 9 దుకాణాలే రావడంతో మరింత పెట్టుబడి పెట్టి మరో నాలుగైదు వైన్స్లను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బాన్సువాడ పట్టణంలోని ఓ మద్యం దుకాణం కొత్త వారికి వచ్చింది. దీంతో ఆ వైన్స్కు లిక్కర్ వ్యాపారులు రూ.60 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు గుడ్విల్ చెల్లించేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. అయితే, సదరు లక్కీడ్రా అదృష్టవంతుడు ఎవరు ఎక్కువ గుడ్విల్ ఇస్తే వారికే మద్యం దుకాణం అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.బాన్సువాడ ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలో లక్కీడ్రాలో ఎక్కువగా కొత్తవారికే వైన్స్లు వచ్చాయి. పాత వారికి తక్కువగా దుకాణాలు వచ్చాయి. డిసెంబర్ 1 నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమవుతాయి. – దిలీప్, ఎకై ్సజ్ సీఐ బాన్సువాడ -
సెంటర్లో ఒక లెక్క.. మిల్లులో మరోలెక్క..!
● తరుగు పేరిట దోచుకుంటున్న రైస్మిల్లర్లు ● నష్టపోతున్న అన్నదాతలుబాన్సువాడ రూరల్: అన్నదాతకు అడుగడుగునా కష్టాలు తప్పడం లేదు. పంట చేతికొచ్చిన దశలో అకాల వర్షాలు ఆగం చేశాయి. చైన్మిషన్లతో వరి కోయడంతో ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. ధాన్యం కాంటా పూర్తయ్యిందని ఊపిరిపీల్చుకునేలోపే తరుగు పేరిట కోతలు పెడుతూ రైస్మిల్లర్లు రైతులకు పిడుగులాంటి వర్తమానాలు పంపుతున్నారు. అఽధికారులు, ప్రజాప్రతినిధులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో రైతులు మనోవేదనకు గురువుతున్నారు. అదనంగా కోత! కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కాంటా సమయంలో 40 కేజీల బస్తాకు బదులు కేజీన్నర అధికంగా 41.500 కి.గ్రా తూకం వేస్తున్నారు. ధాన్యం మిల్లుకు చేరిన తర్వాత తేమ అధికంగా ఉందని, సంచి బరువు తక్కువ వచ్చిందని, రంగు మారిందని తదితర సాకులు చెబుతూ కొర్రీలు పెడుతున్నారు. ఇలా ఒక్కో బస్తాకు 500 గ్రాముల నుంచి 1 కేజీ వరకు తరుగు తీస్తున్నారు. ఇటీవల నాగారం గ్రామంలో జరిగిన అధికారిక బహిరంగ సభలో ఓ రైతు బాన్సువాడ పట్టణంలోని ఓ ప్రముఖ రైస్మిల్లు యజమాని తరుగు పేరిట దగా చేశాడని అధికారులు, ప్రజాప్రతినిధుల ముందే వాపోయాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.తరుగు పేరిట జరుగుతు న్న దోపిడీని అరికట్టాలి. అధికారుల పర్యవేక్షణ లేకనష్టపో వాల్సి వస్తోంది. సెంటర్ నిర్వాహకులు తేమ శాతం చూశాకే కాంటా చేస్తున్నారు. మిల్లుకు వెళ్లిన తర్వాత తేమ పెరగటం ఆశ్చర్యం కలిగిస్తోంది. – చాకలి శ్రీనివాస్, ఇబ్రాహింపేట్మా గ్రామంలోని ముగ్గు రు రైతులకు చెందిన 700 బ స్తాల ధాన్యాన్ని మిల్లుకు పంపించాం. మాకు సమాచారం ఇవ్వకుండానే బస్తాకు 600 గ్రాముల చొప్పున తరుగు కట్ చేశారు. తీవ్రంగా నష్టపోయాం. – ఖాదర్, రైతు, ఇబ్రాహింపేట్ -
నేడు విధుల్లో చేరనున్న కలెక్టర్ సంగ్వాన్
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం తిరిగి విధుల్లో చేరనున్నారు. ఆయన వారం రోజుల పాటు లండన్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్చార్జి కలెక్టర్గా నిజామాబాద్ కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు నిర్వహించారు. లండన్ పర్యటనను ముగించుకుని వచ్చిన సంగ్వాన్.. సోమవారం తిరిగి విధుల్లో చేరనున్నారు. ఆయన ప్రజావాణిలో పాల్గొంటారని అధికార వర్గాల ద్వారా తెలిసింది.● జిల్లా సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి మాచారెడ్డి: ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి పేర్కొన్నారు. మాచారెడ్డి మండలంలోని గజ్యనాయక్ తండా రైతు వేదికలో ఆదివారం ఏర్పాటు చేసిన న్యాయసలహా సదస్సుకు ఆమె హాజరై ప్రసంగించారు. పౌరులందరికీ సమాన న్యా యం అందించేందుకు లీగల్ ఎయిడ్ క్యాంపులు, లోకల్ అదాలత్లు చట్టాలపై అవగాహన కల్పిస్తాయన్నారు. కార్యక్రమంలో కా మారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేశ్, ఐసీఎఫ్ఏఐ న్యాయ కళాశాల ప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు. ● రెండ్రోజులపాటు నిలిపివేత నిజాంసాగర్(జుక్కల్): సింగూరు ప్రాజెక్టు వాటర్ గ్రిడ్ పంపుహౌస్ల మరమ్మతు నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు సంబంధిత శాఖ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాటర్గ్రిడ్ పంపుల మరమ్మతుల కారణంగా 740 గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోనుంది. జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల పరిధిలోని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయతీ అధికారులు బోరుమోటార్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని మిషన్ భగీరథ ఏఈఈ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మోపాల్: క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుందని బీసీ గురుకులాల డిప్యూటీ సెక్రెటరీ తిరుపతి తెలిపారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని కంజర్ శివారులో మహాత్మా జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో అండర్–14, 19 ఉమ్మడి జిల్లాస్థాయి క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ క్రీడలతో శారీరక దారుఢ్యం మెరుగుపడుతోందన్నారు. ప్రతి విద్యార్థి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్సీవో సత్యనాథ్రెడ్డి, ప్రిన్సిపాల్ మురళి, శంకర్ పాల్గొన్నారు. -
ప్రతి హిందువు జాగృతం కావాలి
● ఆర్ఎస్ఎస్ తెలంగాణ సహప్రాంత ప్రచారక్ కల్పగురి ప్రభుకుమార్ ● కామారెడ్డిలో శతాబ్ది పథ సంచలన్కామారెడ్డి అర్బన్: ప్రతి హిందువు జాగృతం కావాలని, జీవన విధానం స్వదేశం కావాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ సహప్రాంత ప్ర చారక్ కల్పగురి ప్రభుకుమార్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కా మారెడ్డి పట్టణంలో నిర్వహించిన పథ సంచలన్ కా ర్యక్రమానికి ఆయన ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. స్వదేశీ, కుటుంబం, సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, పౌరవిధులను ప్రతిఒక్కరూ పాటించాలన్నారు. మారుమోగిన దేశభక్తి నినాదాలు ఆర్ఎస్ఎస్ శతాబ్ది పథ సంచలన్ దేశభక్తి నినాదాల తో మారుమోగింది. పట్టణంలోని బస్తీల వారీగా మ ధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి సరస్వతి విద్యా మందిర్ మైదానానికి సాయంత్రానికి చేరుకున్నారు. దేవునిపల్లి జడ్పీహైస్కూల్ నుంచి దత్తబస్తీ, కల్కినగర్, విద్యానగర్, దేవునిపల్లి, లింగాపూర్, హౌసింగ్ బోర్డు కాలనీ సేవకులు పథసంచలన్లో పాల్గొన్నారు. అశోక్నగర్ వాసవీ హైసూల్ మైదానం నుంచి అశోక్నగర్, కాకతీయ, శ్రీనివాస బస్తీలు, టేక్రియాల్, శ్రీరాం బస్తీలు పాల్గొనగా, వీక్లీమార్కెట్ నుంచి భైరవ, పంచముఖి, ఇంద్రానగర్, గాంధీగంజ్, అంబేద్కర్, ఈశ్వరపుర బస్తీలకు చెందిన ఆర్ఎస్ఎస్ సేవకులు సరస్వతి విద్యామందిర్ మైదానానికి చేరుకున్నారు. విభాగ్ సహ సంఘచాలక్ పాలేటి వెంకటరావు, జిల్లా సంఘచాలక్ బొడ్డు శంకర్, జిల్లా సహ సంఘచాలక్ కొమిరెడ్డి స్వామి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజు పాల్గొన్నారు. -
ఒక్కో బస్తాకు రూ.2
నిజాంసాగర్(జుక్కల్): ధాన్యం బస్తాలను తరలించేందుకు లారీల డ్రైవర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కొక్క బస్తాకు రూ. 2 చొప్పున చెల్లిస్తేనే మిల్లుకు తీసుకెళ్తామని ఖరాఖండీగా చెప్తున్నారు. ఆదివారం మహమ్మద్ నగర్ మండలం ముగ్ధంపూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం బస్తాలను తరలించేందుకు ఓ లారీ చేరుకుంది. అయితే, ముందస్తుగా రూ. 800 చెలిస్తేనే బస్తాలను తీసుకువెళ్తానని లారీ డ్రైవర్ డిమాండ్ చేసినట్లు సొసైటీ డైరెక్టర్, కేంద్రం ఇన్చార్జి బషీర్ విలేకరులతో తెలిపారు. డబ్బులు ఇవ్వబోమని చెప్పడంతో సదరు డ్రైవర్ లారీని వెనక్కి తీసుకుపోయాడు. దీంతో కేంద్రంలో తూకం చేసిన ధాన్యం బస్తాలు అలాగే నిల్వ ఉన్నాయి. గాలీపూర్ గ్రామంలోని ఐకేపీ కేంద్రానికి వచ్చే లారీ డ్రైవర్లు సైతం బస్తాకు రూపాయి చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
కాలభైరవం భజే..
● వైభవంగా సంతతధారాభిషేకం ● ప్రారంభమైన కాలభైరవ స్వామి జన్మదినోత్సవాలురామారెడ్డి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇసన్నపల్లి (రామారెడ్డి) కాలభైరవుడి జన్మదినోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. గణపతి పూజ అనంతరం72 గంటలపాటు నిరంతరంగా కొనసాగే సంతతధారాభిషేకాన్ని ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ, వంశీకృష్ణ శర్మ, మనీష్ శర్మ, ఆలయ ఈవో ప్రభు గుప్తా ఉదయం 6 గంటలకు ప్రారంభించారు. మధ్యాహ్నం బద్దిపోచమ్మకు బోనాలు ఊరేగింపు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ లక్ష్మణ్, నాగరాజ్, సిబ్బందితోపాటు భక్తులు భారీగా పాల్గొన్నారు. నేడు లక్ష దీపార్చన ఉత్సవాలలో ముఖ్యమైన ఘట్టం లక్షదీపార్చనను సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. -
నిర్లక్ష్యమేల..?
సింగితం రిజర్వాయర్ రిటైనింగ్ వాల్ కొట్టుకుపోవడంతో వృథాగా వెళ్తున్న జలాలుజిల్లాలో ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలు, వరదధాటికి చెరువులు, కుంటలతోపాటు రిజర్వాయర్లు, ప్రధాన కాలువలకు గండ్లు పడ్డాయి. వరద తాకిడికి మట్టికట్టలు కొట్టుకుపోయి, గండ్లు పడటంతో సాగు నీరు వృథా అవుతోంది. శాశ్వత పనుల కోసం ప్రతిపాదనలు నీటి పారుదల శాఖ అధికారులు జిల్లాలోని పోచారం ప్రాజెక్టు రూ.5 కోట్లు, సింగితం రిజర్వాయర్ రిటైనింగ్ వాల్ సిమెంట్ లైనింగ్కు రూ. 1.85 కోట్లు, కళ్యాణి ప్రాజెక్టు రూ. కోటి, మిగితా చెరువులు, కుంటలు, పంట కాలువల శాశ్వత పనుల కోసం రూ. 42.01 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే, ఇప్పటి వరకు నిధులు విడుదల కాలేదు. తాత్కాలిక మరమ్మతులకూ నోచుకోని సింగితం, కళ్యాణి నిజాంసాగర్ ప్రాజెక్టు అనుసంధానంగా ఉన్న సింగి తం రిజర్వాయర్ రిటైనింగ్ వాల్ గతేడాది కురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది. అప్పట్లో తాత్కాలిక మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.8 లక్షలు మంజూరు చేసింది. దీంతో ఇసుక బస్తాలను అడ్డుగా వేసి మొరం, మట్టితో అడ్డుకట్ట వేశారు. ఈ సంవత్సరం కురిసిన వర్షాలు, వరదకు ఇసుక బస్తాలు, మట్టికట్ట కొట్టుకుపోవడంతో సింగితం రిజర్వాయర్ నీరు వృథాగా పోతోంది. కళ్యాణి ప్రాజెక్టు మరమ్మతులకు రూ.16 లక్షలు మంజూరయ్యాయి. ఆగస్టు 28న వరద పో టెత్తడంతో ప్రాజెక్టుకు రెండు వైపులా ఉన్న మట్టికట్ట తెగిపోయింది. దీంతో కళ్యాణి ప్రాజెక్టు ఖాళీ అయ్యింది.పాత చెరువు కింద పంట కాలువ కొట్టుకుపోవడంతో యాసంగి పంటకు నీళ్లు రాకుండా పోయాయి. పంట కాలువ కొట్టుకపోయి గండిపడటంతో అలుగు, తూము నీళ్లు వాగులోకి పోతున్నాయి. పంట కాలువకు సిమెంట్ లైనింగ్ పనులు చేపట్టాలి. ఆయకట్టు కింద పంటల సాగుకు సార్లు సహకరించాలి. – శిరిగిరి గంగారాం, గ్రామస్తుడు, నర్వసింగితం రిజర్వాయర్ గోడ కొట్టుకుపోవడంతో నీళ్లు ఎళ్లిపోతున్నాయ్. ఇసుక బస్తాలు, మట్టి, మొరం పోసినా వరద పాలయ్యాయి. గోడ కూలడంతో నీళ్లు వాగు పాలవుతున్నాయి. యాసంగి పంటల సాగుకు నీళ్లు లేకుండా పోతున్నాయి. తాత్కాలిక మరమ్మతులు కాకుండా శాశ్వత పనులు చేపట్టాలి. – మల్లేశ్ యాదవ్, ఆయకట్టు రైతు, నర్వవర్షాలు, వరదలతో దెబ్బతిన్న 184 చెరువులు, కుంటల తాత్కాలిక మరమ్మతుల కోసం అధికారులు ప్రతిపాదనలు పంపగా, 88 చెరువులు, కుంటలు, పంట కాలువలకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రూ. 1.18 కోట్లు మంజూరు చేశారు. దీంతో నీటి పారుదలశాఖ అధికారులు ఇటీవల తాత్కాలిక పనులకు అనుమతించారు. ఇప్పటి వరకు 28 చెరువులు, కుంటలు, పంట కాలువలకు తాత్కాలిక మరమ్మతులు పూర్తయ్యాయి. 6 చోట్ల పనులు పురోగతిలో ఉండగా, 54 చెరువులు, కుంట కట్టల మరమ్మతు పనులు ఇంకా మొదలుకాలేదు.ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో రికార్డుల స్థాయిలో కురిసిన వర్షాలకు జిల్లాలోని 241 చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, పంట కాలువలకు గండ్లుపడ్డాయి. సింగితం రిజర్వాయర్ రిటైనింగ్ వాల్ కొట్టుకుపోవడంతోపాటు కళ్యాణి ప్రాజెక్టుకు రెండువైపులా మట్టి కట్టలు తెగిపోయాయి. వరద ప్రవాహానికి పోచారం ప్రాజెక్టు అలుగు వద్ద మట్టికొట్టుకుపోయి గోతిపడింది. పోచారం ప్రధాన కాలువకూ అక్కడక్కడ గండ్లుపడ్డాయి. అంతేకాకుండా సాగు నీరందించే పంట కాలువలు కొట్టుకుపోవడం, తూములు దెబ్బతినడంతో ఆయకట్టుకు నీరందని పరిస్థితులు నెలకొన్నాయి.కొట్టుకుపోయిన చెరువు కట్టలు, గండ్లు పడిన కాలువలు ఆయకట్టు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లాలో ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలకు 241 చెరువులు, కాలువలు, రిజర్వాయర్లు దెబ్బతిన్నాయి. భారీ వర్షాలు, ఎగువ నుంచి వచ్చిన వరద ప్రవాహానికి దెబ్బతిన్న చెరువులు, రిజర్వాయర్లు ఇప్పటికీ మరమ్మతుకు నోచుకోలేదు. – నిజాంసాగర్(జుక్కల్) వర్షాలకు దెబ్బతిన్న 241 చెరువులు, రిజర్వాయర్లు సాగునీటి వనరులపై ప్రభుత్వం చిన్నచూపు తాత్కాలిక మరమ్మతులకు నోచుకోని వైనం ఆందోళన చెందుతున్న ఆయకట్టు రైతులు -
బీసీ రిజర్వేషన్లపై ఏ పార్టీకి చిత్తశుద్ధి లేదు
● 15న కామారెడ్డిలో బీసీ ఆక్రోశసభ ● పార్టీలకతీతంగా బీసీలు తరలిరావాలి ● బీసీ రిజర్వేషన్ల సాధన సమితి గౌరవ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్యకామారెడ్డి అర్బన్: రాష్ట్రంలో బీసీలకు 42శాతం రి జర్వేషన్ల అమలుపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు చిత్తశుద్ధి లేదని, బీసీలంతా ఏకమై ఉద్యమించాలని బీసీ రిజర్వేషన్ల సాధన సమితి గౌరవ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. కామారెడ్డి ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో కామారెడ్డి బీసీ ఆక్రోశ సభ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం జస్టిస్ ఈశ్వ రయ్య మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం 42 శాతం బీసీ రిజరేషన్ల కోసం తాను ఇచ్చిన తమిళనాడు తరహా బీసీ రిజర్వేషన్ల ముసాయిదాను పక్కన పెట్టి సొంత ఆలోచనతో ముందుకు వెళ్లి రిజర్వేషన్ల అమలుపై చిత్తశుద్ధి లేదని రుజువు చేసిందని ఆరోపించారు. ఏం చేసినా సుప్రీంకోర్టు 50 శాతానికి మించి రిజర్వేషన్లను అంగీకరించదని జస్టిస్ ఈశ్వరయ్య స్పష్టం చేశారు. 1990లో తమిళనాడు పాటించిన విధానంతో పార్లమెంట్ ఆ మోదం ద్వారా 42 శాతం బీసీ రిజర్వేషన్లు తీసుకురావడమే ఏకై క మార్గం కాగా, సీఎం రేవంత్రెడ్డి తప్పు డు విధానాలు అవలంబిస్తున్నారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లలో బీఆర్ఎస్ తొలి నుంచి వ్యతిరేకంగానే ఉందని, బీజేపీ బీసీల పార్టీకాదన్నారు. రాజకీయాలకు అతీతంగా బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలకు అన్యాయం జరుగుతున్నందున జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశా రు. ఈ నెల 15న కామారెడ్డి సత్యగార్డెన్లో నిర్వహించే బీసీ ఆక్రోశసభను విజయవంతం చేయాలని జస్టిస్ ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. బీసీలకు మద్దతు ఇస్తున్న ఎస్సీ, ఎస్టీ ప్రజా, బహుజన సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి బీసీ ఆక్రోశ సభతో బీసీ ఉద్యమం జాతీయ ఉద్యమం అవుతుందన్నారు. బీసీ సాధన సమితి, వివిధ సంఘాల నా యకులు డాక్టర్ విజయభాస్కర్, గంగాధర్యాదవ్, క్యాతం సిద్ధిరాములు, మర్కంటి భూమన్న, విఠల్ ముదిరాజ్, బాలార్జున్గౌడ్, హరికిషన్గౌడ్, సునీల్గౌడ్, దేవరాజ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
మాలావత్ పూర్ణకు పితృ వియోగం
సిరికొండ: అతిపిన్న వయస్సులో ఎవరెస్ట్ను అధిరోహించిన మాలావత్ పూర్ణకు పితృ వియోగం కలిగింది. పూర్ణ తండ్రి మాలావత్ దేవిదాస్ కొన్ని నెలల కిందట కోమాలోకి వెళ్లారు. కామారెడ్డిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. మృతుడికి భార్య లక్ష్మీతో పాటు కూతురు పూర్ణ, కొడుకు నరేష్ ఉన్నారు. పూర్ణ స్వగ్రామం సిరికొండ మండలంలోని పాకాల లో ఆయన అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం నిర్వహించారు. కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ జగన్ ఫోన్లో పూర్ణాను పరామర్శించినట్లు గ్రామస్తులు తెలిపారు. -
వృద్ధురాలి ఆత్మహత్య
భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఆంజనేయులు శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన బీరవ్వ గత కొన్నేళ్లుగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతోంది. ఈ విషయమై తరచు ఆవేదన చెందేది. ఈక్రమంలో శుక్రవారం ఉదయం జీవితంపై విరక్తి చెంది ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. గ్రామంలోని పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. మధ్యాహ్నం మృతదేహం తేలడంతో స్థానికులు గుర్తించి, కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి, వివరాలు సేకరించి, కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై వివరించారు. మాక్లూర్: ఉపాధి కోసం దుబాయి దేశానికి వెళ్లిన మండలంలోని గొట్టుముక్కల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా.. గొట్టుముక్కల గ్రామానికి చెందిన యాస సురేశ్ (35) ఉపాధి కోసం 25 రోజుల క్రితం దుబాయిలోని ఓ కంపెనీలో కూలీ పని చేయడానికి వెళ్లాడు. శనివారం అతడు అక్కడ విధుల్లో చేరాల్సి ఉంది. కానీ గురువారం అతడు ఆ దేశంలో రోడ్డు దాటుతుండగా ఓ కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న మృతుడి కుటుంబీకులు బోరున విలపించారు. మృతుడి కుటుంబసభ్యులు నిరుపేదలు కావడంతో ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
అనర్హులకు ఉపాధి హామీలో హాజరు
● ఫీల్డ్ అసిస్టెంట్ల ఇష్టారాజ్యం ● పెద్దకొడప్గల్ ప్రజావేదికలో విస్తుపోయే విషయాలు పెద్దకొడప్గల్(జుక్కల్): ఉపాధి హామీ పనులలో ఫీల్డ్ అసిస్టెంట్లు అనర్హులకు హాజరు వేసి డబ్బులు దండుకున్నట్లు తనిఖీలో తేలింది. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీడీవో అభినవ్ చందర్ అధ్యక్షతన శుక్రవారం మహత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 4వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా 9 బృందాలతో 24 గ్రామాలకు సంబంధించిన ఉపాధి హామీ పనులపై తనిఖీలలో తేలిన విషయాలను ఏపీడీ వామన్ రావు దృష్టికి తీసుకోచ్చారు. వారం రోజుల పాటు గ్రామాల్లో జరిగిన సామాజిక తనిఖీల్లో అనేక విషయాలు వెలుగు చూశాయి. ప్రతి గ్రామంలోనూ లోపాలు ఉన్నట్లు, క్షేత్ర పరిశీలకుల వ్యవహార శైలి సక్రమంగా లేనట్లు సామాజిక తనిఖీ విభాగం సిబ్బంది గుర్తించారు. పోచారం, పోచారం తండాల్లో అనర్హులకు హాజరు వేసినట్లు గుర్తించారు. అలాగే గ్రామాల్లో మస్టర్లలో కూలీలకు బదులుగా సీనియర్ మేట్ సంతకాలు చేస్తున్నట్లు, దిద్దుబాట్లను గుర్తించారు. కాటేపల్లి గ్రామంలో సుమారు 66 మంది గ్రామస్తులు ఉపాధి హామీలో కూలి పనులు కల్పించాలని రెండేళ్లుగా రాసిస్తున్న మాస్టర్లలో పేర్లు రావడంలేదని తనిఖీ సమయంలో గుర్తించినట్లు బృందం సభ్యులు తెలిపారు. పనులు కొనసాగిన కొన్ని ప్రదేశాలలో అందుకు సంబంధించిన బో ర్డులను ఏర్పాటు చేయలేదు. వీటిపై ఏపీడీ వామన్ రావు స్పందిస్తూ చర్యలు తీసుకోవాలని మండలస్థాయి అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో ఎంపీవో లక్ష్మికాంత్ రెడ్డి, ఏపీవో సుదర్శన్, తనిఖీ బృందం తదితరులు పాల్గొన్నారు. రెంజల్(బోధన్): మండల కేంద్రంలో ఊర కుక్కల దాడిలో ఓ లేగ దూడ మృతిచెందింది. శుక్రవారం గ్రామంలోని కుక్కలు దాడి చేయడంతో అమ్రాది వెంకట్కి చెందిన లేగ దూడ మృతిచెందింది. ఇటీవల రేబీస్ వ్యాధితో ఆలయానికి చెందిన లేగ దూడ మృతిచెందింది. -
బోధన్లో గంజాయి పట్టివేత
బోధన్టౌన్(బోధన్): మహారాష్ట్రలోని బిలోలి నుంచి బోధన్కు వస్తున్న ఆటోలో 1,270 గ్రా ముల గంజాయిని పట్టుకున్నట్లు ఏసీపీ శ్రీనివా స్ తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్లో శుక్రవా రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ యన వివరాలు వెల్లడించారు. బోధన్ శివారులోని మర్రి మైసమ్మ ఆలయ సమీపంలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బిలోలి నుంచి బోధన్కు వస్తున్న ఓ ఆటోను తనిఖీ చేశారు. ఆటోలో మహారాష్ట్రలోని బిలోలికి చెందిన గోనేకర్ గణేష్ కాశీనాథ్, బోధన్లోని బ్రాహ్మణగల్లీకి చెందిన గాడె శేఖర్, నిజామాబాద్కు చెందిన ఫేక్ అబ్దుల్ ఖైసర్ ఉన్నారు. ఆటోలో తనిఖీ చేయగా పోలీసులకు 1270 గ్రాముల గంజాయి లభ్యమైంది. పోలీసులు ఆటోలోని వ్యక్తులతోపాటు, గంజాయిని పోలీస్స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. గంజాయిని పట్టుకున్న ఎస్సై మనోజ్, సిబ్బందిని సీపీ అభినందించారని తెలిపారు. -
ఉమ్మడి జిల్లా సబ్ జూనియర్ ఆర్చరీ పోటీలు
● రాష్ట్రస్థాయి పోటీలకు పలువురు క్రీడాకారుల ఎంపిక దోమకొండ: మండల కేంద్రంలోని గడికోటలో శుక్రవారం ఉమ్మడి జిల్లా సబ్ జూనియర్ జిల్లాస్థాయి పోటీలు నిర్వహించారు. ఈపోటీలను ఉమ్మడి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ కార్యదర్శి గంగరాజు, కామారెడ్డి జిల్లా ఆర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తిరుమల గౌడ్ ప్రారంభించారు. అర్చరీ సబ్ జూనియర్ ఇండియా రౌండ్ బాలుర విభాగంలో భువన్, శ్రీశాంత్, రాజేందర్, రామ్చరణ్ , ప్రణీత్ పతకాలు సాఽధించారు. బాలికల విభాగంలో ప్రీతి, లాస్య, సౌమ్య, స్నేహ, భావన, శ్రీవర్చనతో పాటు రికర్వు రౌండ్ బాలుర విభాగంలో సుమంత్,స్నేహిత్,రుత్విక్, బాలికలు విభాగంలో ఇందు, వర్షిణి, నక్షత్ర, నైతిక, అర్చిత పతకాలు సాధించారు. అదేవిధంగా అండర్–10 విభాగంలో వర్షిత, అండర్ 19 బాలుర విభాగంలో రాజేందర్, దీక్షిత్, రిత్విక్, బాలికల విభాగంలో అమూల్య, సుమిత్ర, అశ్విని, రికర్వు రౌండ్ అండర్–14 బాలుర విభాగంలో రుత్విక్, స్నేహిత్, బాలికల విభాగంలో వర్షిని, నక్షత్ర, నైనిక, అర్చిత, కాంపౌండ్ రౌండ్ కృష్ణసాయి ఎంపికయ్యారు. ఈ నెల 9న జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వీరు ఎంపికై నట్లు కోచ్ ప్రతాప్దాస్ తెలిపారు. పోటీలకు సహాయసహకారాలు అందించిన జాతీయ అర్చరీ అసోసియేషన్ అఽధ్యక్షుడు కామినేని అనిల్కుమార్, గడికోట ట్రస్ట్ మేనేజర్ బాబ్జీ, కామారెడ్డి అసోసియేషన్ సెక్రటరీ మోహన్రెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు భూపాల్ రెడ్డి, గంగాధర్ , వ్యాయామ ఉపాధ్యాయులు ఉదయ, సురేఖ,రవీందర్, తదితరులు పాల్గొనారు. రాష్ట్రస్థాయి విలువిద్య క్రీడాకారులకు సన్మానం రాష్ట్ర స్థాయి విలువిద్య పోటీల్లో పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న ఇద్దరు క్రీడాకారులను శుక్రవారం గడికోటలో జరిగిన కార్యక్రమంలో సన్మానించారు. దోమకొండకు గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి విలువిద్య పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపారు. మహబూబాబాద్ లో నిర్వహించిన విలువిద్య రికర్వు రౌండ్ పోటీల్లో బి. ఇందు అండర్–17 విభాగంలో వెండి పతకం సాధించగా, బి. వర్షిణి అండర్–14 విభాగంలో కాంస్య పతకం సాధించింది. దీంతో వీరిని సన్మానించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని కోచ్ ప్రతాప్దాస్ తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా ఆర్చరి అసోసియేషన్ అధ్యక్షుడు తిర్మల్గౌడ్, ప్రధాన కార్యదర్శి మోహన్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ పన్యాల నాగరాజ్రెడ్డి, నాయకులు అండెం శంకర్రెడ్డి, భూపాల్రెడ్డి, రవి, రాములు, కమ్మరి గంగాధర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై సమీక్ష
కామారెడ్డి అర్బన్: చిన్నమల్లారెడ్డి, లింగాయపల్లిలలో జిల్లా పరిషత్ సీఈవో చందర్ శుక్రవారం పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్షించారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకుంటే వెంటవెంటనే బిల్లులు చెల్లిస్తారని సీఈవో పేర్కొన్నారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి బాన్సువాడ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని బీర్కూర్ ఎంపీడీవో శ్రీనిధి తెలిపారు. శుక్రవారం మండలంలోని తిమ్మాపూర్, వీరాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. అన్నారం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఈవో సందర్శించారు. మండలంలోని ఆయా గ్రామాల్లోని పాఠశాలలో వందేమాతం గేయాన్ని ఆలపించారు. సూపరింటెండెంట్ భానుప్రకాష్, గ్రామ పంచాయితీ కార్యదర్శిలు దివ్య, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. తాడ్వాయి మండలంలో తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులను వేగ వంతం చేయాలని ఎంపీడీవో సయ్యద్ సాజీద్అలీ అన్నారు. ఆయన మండలంలోని కన్కల్, కరడ్పల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మార్కింగ్ చేశారు. గ్రామ కార్యదర్శులు, జీపివోలు, సీసీలు, వీవోఏలు, మహిళసంఘాల అద్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాజంపేట మండలంలో రాజంపేట: మండల కేంద్రంతో పాటు నడిమి తండా, షేర్ శంకర్ తండా, కొండాపూర్ గ్రామాల్లో నూతన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ మర్కౌట్ కార్యక్రమంలో ఎంపీడీవో బాలకృష్ణ పాల్గొన్నారు. అనంతరం రాజంపేట, ఆరెపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు కార్యక్రమంలో ఏపీవో, ఐకేపీ సీసీలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. లింగంపేట మండలంలో.. లింగంపేట : మండలంలోని నల్లమడుగు, బాణాపూర్ గ్రామాల్లో శుక్రవారం ఎంపీవో మలహరి ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి నిర్మాణాలు వేగవంతం చేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఇల్లు పూర్తయిన వెంటనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమచేయనున్నట్లు పేర్కొన్నారు. కార్యదర్శులు, లబ్ధిదారులు, గ్రామ పెద్దలు ఉన్నారు. సొంతింటి కల నెరవేరుతుంది నిజాంసాగర్(జుక్కల్): ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేరుతుందని మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని తుంకిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఆయా గ్రామాల్లో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయించాలని ఎంపీడీవో నరేశ్ సూచించారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పంచాయతీ కార్యదర్శులు సమావేశంలో మాట్లాడారు. గృహాలు మంజూరైన వారు వంద శాతం కట్టుకునేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఇంటి పన్నులు వంద శాతం వసూలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీవో మలహరి, ఆయా గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు. ముత్యంపేట గ్రామంలో.. దోమకొండ: నిర్ణీత కాలంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను లబ్ధిదారులు పూర్తి చేయాలని ఎంపీడీవో ప్రవీణ్కుమార్ కోరారు. శుక్రవారం మండలంలోని ముత్యంపేట గ్రామంలో గ్రామపంచాయితీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన పనులు ప్రారంభించని నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇళ్లు లేని వారు సద్వినియోగం చేసుకోవాలని, ఈవిషయంలో ఎవరు నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అంజయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంతరెడ్డి, శ్రీనివాస్, బాలరాజ్, తిరుపతిగౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు భాస్కర్ రెడ్డి, రాజు, విజయ, గంగమణి, రవి, తదితరులు పాల్గొన్నారు. -
లింబాద్రి గుట్టపై గుండెపోటుతో భక్తుడి మృతి
కమ్మర్పల్లి(భీమ్గల్): భీమ్గల్ లింబాద్రి గుట్ట శ్రీలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన ఓ భక్తుడు గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. ఆదిలాబాద్కు చెందిన పోలకొండ శ్రీనివాస్వర్మ(47) అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం లింబాద్రి గుట్టకు చేరుకున్నాడు. స్వామివారి దర్శనం అనంతరం రాత్రి కొండపై బస చేశారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా అతడికి గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు అంబులెన్స్లో అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. కుటుంబ సభ్యులు రోదిస్తూ వర్మ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. పేకాడుతున్న 8 మంది అరెస్టు నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని జలాల్పూర్, కన్నారెడ్డి శివారుల్లో పేకాట ఆడుతున్న 8మందిని అరెస్టు చేసినట్లు ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు జలాల్పూర్లోని పేకాట స్థావరంపై దాడి చేసి, పేకాడుతున్న నలుగురిని పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. అలాగే వారి వద్ద నుంచి రూ.13,308 నగదును, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. కాగా మండలంలోని కన్నారెడ్డి కల్లుకాంపౌండ్లో పేకాట ఆడుతున్న నలుగురిని పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. వారి నుంచి రూ.4,160 నగదుతోపాటు నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
150 ఏళ్ల ‘వందేమాతరం’ వేడుక
కామారెడ్డి క్రైం: బంకించంద్ర చటర్జీ ‘వందేమాతరం’ రచించి 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా వందేమాతర గేయాలాపన చేశారు. ఉదయం 10 గంటలకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో సామూహికంగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేశ్చంద్ర ఆధ్వర్యంలో, కలెక్టరేట్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుమోహన్ ఆధ్వర్యంలో అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరం నేపథ్యాన్ని, విశిష్టతను స్మరించుకున్నారు. కార్యక్రమాలలో ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు, పాల్గొన్నారు. -
15న బీసీ ఆక్రోశ సభ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : విద్య, ఉద్యోగా లతో పాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15న బీసీ ఆక్రోశ సభ నిర్వహించనున్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో కామారెడ్డిలోని సత్య కన్వెన్షన్లో సభ జరగనుంది. జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు తదితరుల ఆధ్వర్యంలో సభకు ప్లాన్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. అందులో రిజర్వేషన్లతో పాటు అనేక హామీలు ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నా ఏ ఒక్కటీ అమలు కాలేదని బీసీలు ఆగ్రహంతో ఉన్నారు. విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల అమ లు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావ డానికి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా బీసీ ఆక్రోశ సభకు ప్లాన్ చేశారు. మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు బీసీ సంఘాల ప్రతినిధులను సభకు ఆహ్వానిస్తున్నారు. మద్నూర్: విద్యార్థుల జీవితంలో ఇంటర్మీడియట్ ఎంతో ముఖ్యమైనదని డీఐఈవో ఒడ్డెన్న పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. విద్యార్థుల హజరు శాతంపై ఆరా తీశారు. విద్యార్థులు నిత్యం కళాశాలకు వచ్చేలా లెక్చరర్లు చూడాలన్నారు. ఇంటర్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ పాండురంగ్, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. సదాశివనగర్: అడ్లూర్ ఎల్లారెడ్డిలోని గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీలో శుక్రవారం చెరుకు క్రషింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేన్ క్యారియర్కు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం క్యారియర్లో చెరుకు గడలను వేశారు. అనంతరం ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్రావు మాట్లాడుతూ ఈ సీజన్ విజయవంతం అయ్యే వరకు రైతులు, కార్మికులు, ఉద్యోగులు సహకరించాలన్నారు. టన్ను చెరుకుకు రూ. 3,775 చెల్లిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ ఇర్షాదొద్దీన్, ఫైనాన్స్ మేనేజర్ మాలకొండయ్య, డిస్టిలరీ జనరల్ మేనేజర్ సుబ్బారావు, మేనేజర్ రెడ్డయ్య, సీనియర్ జీఎం ఇంజినీర్ వీరరాజు, జనరల్ మేనేజర్ కుటుంబరావు, మాజీ వైస్ ఎంపీపీ రూపేందర్ రెడ్డి, పర్సనల్ మేనేజర్లు బస్వ పున్నారెడ్డి, హరీశ్, కార్మిక సంఘాల నాయకులు రాజేశ్వర్, మహేశ్, మహీపాల్రెడ్డి, కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: దివ్యాంగుల కోసం విశేష సేవలు అందిస్తున్న వారికి రాష్ట్రస్థాయి పురస్కారాలు అందజేయనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం అర్హులైన వ్యక్తులు, సంస్థల నుంచి ఈనెల 12 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. వ్యక్తులు, సంస్థలు తాము చేస్తున్న దివ్యాంగ సేవలకు సంబంధించి తగిన ధ్రువీకరణ పత్రాలు జతచేసి అన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆ ప్రతులను కలెక్టరేట్లోని 31వ నంబర్ గదిలోని తమ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. ఎంపికై న వారికి డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పురస్కారాలు అందజేస్తారని తెలిపారు. కామారెడ్డి క్రైం: అవినీతి ఆరోపణలు రావడంతో బాన్సువాడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ అనే కానిస్టేబుల్పై ఎస్పీ రాజేశ్ చంద్ర క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అతడిని కామారెడ్డి డీఏఆర్కు బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఇటీవల పేకాట కేసుల్లో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున జరిమానా పడింది. డబ్బులు చెల్లించే విషయంలో ఒక్కో వ్యక్తి నుంచి జరిమానా కంటే అదనంగా డబ్బులు వసూలు చేసినట్లు సదరు కానిస్టేబుల్పై ఫిర్యాదులు వచ్చాయి. విషయం ఎస్పీ దృష్టికి రావడంతో అతడిని జిల్లా పోలీసు కార్యాలయంలోని డీఏఆర్కు అటాచ్ చేసినట్లు తెలిసింది. -
కోర్టు ధిక్కారమా?
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: 2012లో రోస్టర్ పాటించకుండా ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ వర్సిటీలో చేసిన అధ్యాపక నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. కాగా అడుగడుగునా కోర్టు ధిక్కార ధోరణితో వెళుతుండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కోర్టులో పిటిషన్ దాఖలయ్యాక నియామకపత్రాలు తీసుకున్న అధ్యాపకులు ఆ సమయంలో కోర్టు తీర్పునకు లోబడతామని రాసిచ్చారు. తీర్పు వచ్చాక దానిని ఉల్లంఘిస్తున్నారు. మరోవైపు ఈ అధ్యాపకుల ప్రమోషన్లకు సంబంధించి కోర్టు కేసును పట్టించుకోకుండా కథ నడిపించడం గమనార్హం. ఈ వ్యవహారంలో సుమారు రూ.5 కోట్లు చేతులు మారినట్లు అనుమానాలు మరింత బలపడుతున్నాయి. కాగా రాష్ట్రస్థాయిలో పనిచేసిన ఓ ఉన్నతాధి కారి ఒక్కరికే గతంలో రూ.1.5 కోట్లు ముట్టినట్లు తెలుస్తోంది. ఇందుకు రిజిస్ట్రార్ మధ్యవర్తిగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. అయితే గతంలో పాలకమండలి అడ్డుపడడంతో ఈ ప్రమోషన్ల వ్యవహారానికి బ్రేక్ పడుతూ వచ్చింది. కాగా పాలకమండలి పదవీకాలం పూర్తికావడంతో గతే డాది కాలంగా ప్రమోషన్ల ఫైలును మరింత స్పీడ్గా కదిపేందుకు రిజిస్ట్రార్ గట్టి ప్రయత్నాలు చేస్తూ రావడం విశేషం. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ కేసుతో ఈ కేసును పోల్చి పదోన్నతులు కల్పించే కుట్ర చేయడం గమనార్హం. పాలకమండలి లేకపోవడంతో గతంలో ఉన్నత విద్యాశాఖలో కీలకంగా ఉన్న ఓ ఉన్నతాధికారి ప్రత్యేకంగా ఈ ఫైలుపై సంతకం చేసి వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కేసు తీవ్రత కప్పిపెట్టి ప్రమోషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వానికి అభ్యంతరం లేదని లీగల్ ఒపీనియన్ పేరిట ఒక లేఖ సృష్టించడం విశేషం. విద్యాశాఖ న్యాయ నిపుణుల నుంచి కాకుండా వేరే విభాగానికి చెందిన న్యాయ నిపుణుల ఒపీనియన్ తీసుకున్నారు. ఇందుకు రూ.2 లక్షల ప్రభుత్వ (యూనివర్సిటీ) సొమ్ము ఖర్చు పెట్టినట్లు సమాచారం. లీగల్ ఒపీనియన్ పేరిట.. అనేక ఆరోపణల నేపఽథ్యంలో 2012 ఏడాది చివరిలో అధ్యాపక పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, 2013 ఫిబ్రవరి లో నియామక పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అందుబాటులో ఉన్నవాళ్లను జాయిన్ చేసుకున్నప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సదరు నియామకాలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో నియామకాల్లో అక్రమాలపై విద్యార్థి సంఘాలు సాక్ష్యాలను బయటపెట్టాయి. ఎంపిక కాని అర్హులు కొందరు ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడం, ఇక్కడే పనిచేస్తున్న అకడమిక్ కన్సల్టెంట్లు ఆందోళనలకు దిగడంతో ప్రభుత్వం స్పందించి ఈ నియామకాలపై సమగ్ర విచారణ జరిపేందుకు 2013 ఫిబ్రవరి 22న ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఏప్రిల్లోగా నివేదిక సమర్పించాలని కోరింది. ఈ నియామకాలకు సంబంధించి తదుపరి ఉత్తర్వులు వెలువరించవద్దని ప్రభుత్వం నిషేధం విధించింది. ఇదే సమయంలో అటు అకడమిక్ కన్సల్టెంట్లు సైతం ఈ నియామకాలపై హైకోర్టు నుంచి స్టే తెచ్చారు. ఈ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతూ రోజురోజుకూ వివాదాస్పదంగా తయారైంది. ఈ విషయమై జస్టిస్ సీవీ రాములు ఇచ్చిన నివేదికపై అప్పటి గవర్నమెంట్ ప్లీడర్ (ఉన్నత విద్యాశాఖ) వాణిరెడ్డి ద్వారా లీగల్ ఒపీనియన్ కోరుతూ 41వ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఈ నియామకాలపై జస్టిస్ సీవీ రాములు నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారు. 2018 సెప్టెంబర్ 26న జరిగిన పాలకమండలి సమావేశంలో జస్టిస్ సీవీ రాములు ఇచ్చిన నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన పాలకమండలి, ఆయా నియామకాల్లో అక్రమాలు జరిగాయని గుర్తించింది. నియామకాలు చేపట్టిన అప్పటి వీసీ అక్బర్ అలీఖాన్, రిజిస్ట్రార్ అశోక్లపై ఉస్మానియా యూనివర్సిటీ సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆ వర్సిటీకి లేఖ రాయాలని తెలంగాణ వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్లను పాలకమండలి సభ్యులు ఆదేశించారు. అప్పటి వీసీ అక్బర్ అలీఖాన్ పెన్షన్ బెనిఫిట్స్ను పూర్తిగా నిలిపేయాలని, అశోక్ను సర్వీస్ నుంచి తొలగించాలని నిర్ణయించారు. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ను ఉస్మానియా వర్సిటీ నుంచి తెప్పించుకోవాలని ఆదేశించారు. జస్టిస్ సీవీ రాములు నివేదిక ప్రకారం అక్బర్ అలీఖాన్, అశోక్లపై సత్వరమే క్రిమినల్ కేసు పెట్టాలని తెలంగాణ వర్సిటీ వీసీ సాంబయ్య, రిజిస్ట్రార్ బలరాములును పాలకమండలి ఆదేశించింది. ● ప్రభుత్వ ప్లీడర్ వాణిరెడ్డి ఒపీనియన్ను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, తమ నియామకాలను ఎందుకు రద్దు చేయకూడదో తెలియజేయాలని కోరుతూ 2014 నియామక అభ్యర్థులకు నోటీసులు జారీ చేయాలని అప్పటి వీసీ, రిజిస్ట్రార్లను పాలకమండలి ఆదేశించింది. ఇలా ప్రతి పాలకమండలి సమావేశంలో తిరస్కరణకు గురైన వివాదాస్పద నియామకాలకు విద్యాశాఖ కార్యదర్శితో ప్రస్తుత రిజిస్ట్రార్ యాదగిరి ఏవిధంగా లీగల్ ఒపీనియన్ తీసుకునేలా ఒప్పించారనేది ప్రశ్నార్థకంగా మారింది. మొదటి లీగల్ ఒపీనియన్ తీసుకునేముందే పాలకమండలి అనుమతి కోరారు. మరి ఇప్పుడు పాలకమండలిని ఎందుకు మరిచారో, పూర్తిస్థాయిలో పాలకమండలి లేని సమయంలో ఆగమేఘాల మీద లీగల్ ఒపీనియన్కు ఎందుకు పంపారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2019 మార్చి 30న జరిగిన 44వ పాలకమండలి సమావేశంలోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. తర్వాత తమకు పదోన్నతి కల్పించాలని కోరుతూ వివాదాస్పద 2014 అభ్యర్థులు పెట్టుకున్న వినతిని 48వ పాలకమండలి సమావేశం తోసిపుచ్చింది. ఇదిలా ఉండగా తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు 2014 నియామకాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ఉన్నత విద్యాశాఖ నుంచి 2022 జూలై 13న లేఖ వచ్చింది. అయినప్పటికీ ప్రస్తుతం ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. హైకోర్టు తీర్పును లెక్కచేయని వైనం తెయూ అధికారుల వ్యవహారంపై తీవ్ర విమర్శలు ప్రమోషన్ల ఫైలును కదిలించేందుకు పలుమార్లు యత్నం గతంలో అనేకసార్లు తిరస్కరిస్తూ చేసిన పాలకమండలి తీర్మానాల బేఖాతరు -
మక్కలు కొనేదెప్పుడు?
భిక్కనూరు: రైతులు దళారులను ఆశ్రయించవద్దని, కొనుగోలు కేంద్రాలలోనే పంటను విక్రయించి మద్దతు ధర పొందాలని పాలకులు చెబుతుంటారు. అయితే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినా తూకాల మాట ఎత్తకపోవడంతో విసిగిపోతున్న రైతులు.. వ్యాపారులకే పంటను అమ్ముకుంటున్నారు. దీంతో మద్దతు ధరకు దూరమవుతున్నారు. భిక్కనూరు మండలంలో సుమారు 800 ఎకరాలలో మొక్కజొన్న పండించారు. పంట కొనుగోలు కోసం ప్రభుత్వం మండలంలోని అంతంపల్లి, బస్వాపూర్ సింగిల్విండోలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. గతనెల 22 న అంతంపల్లి సింగిల్విండోలో మార్క్ఫెడ్ అధికారి చందు మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రానికి పంటను తీసుకువచ్చి, క్వింటాలుకు రూ. 2,400 మద్దతు ధర పొందాలని సూచించారు. అయితే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రెండు వారాలు కావస్తున్నా.. ఇప్పటికీ కొనుగోళ్ల జాడ లేదు. రైతులు వెళ్లి అడిగితే రెండు మూడు రోజులు ఆగాలన్న సమాధానం కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలనుంచి వస్తోంది. తేమ శాతం 14లోపు ఉండాలంటున్నారని, కానీ అకాల వర్షాలతో మక్కలను ఆరబెట్టడానికి ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. కాలయాపన జరుగుతుండడంతో రైతులు విసిగిపోయి దళారులను ఆశ్రయిస్తున్నారు. వారు క్వింటాలుకు రూ. 1,950 నుంచి రూ. 2 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని రైతులు చెబుతున్నారు. త్వరగా కొనుగోళ్లు ప్రారంభించాలని కోరుతున్నారు. పంట చేతికొచ్చి నెలరోజులు కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంతోనే సరి తూకాల జాడ కరువు దళారులకు అమ్ముకుంటున్న రైతులు పట్టించుకోని అధికారులునేను నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశాను. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా ఇప్పటికీ మక్కల కొనుగోళ్లు ప్రారంభించలేదు. రెండు మూడు రోజులు ఆగాలంటూ కాలయాపన చేస్తున్నారు. పది రోజులు ఓపిక పట్టిన. ఇప్పట్లో కొనెటట్లు లేరని 80 క్వింటాళ్ల మక్కలను క్వింటాలుకు రూ. 1980 చొప్పున వ్యాపారులకు అమ్ముకున్న. – తాటిపల్లి సిద్దరాములు, రైతు, తిప్పాపూర్ -
తనిఖీలు ముమ్మరం!
మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. జిల్లావ్యాప్తంగా నిత్యం వాహనాలు తనిఖీ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల తాండూరు సమీపంలో టిప్పర్, బస్సు ఢీకొన్న సంఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తర్వాత కూడా రాష్ట్రంలో పలు ప్రమాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. జాతీయ రహదారులపైనా ఫోకస్ చేశారు. ఎస్పీ రాజేశ్ చంద్ర ఆదేశాలతో గురువారం రాత్రినుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు ఎన్హెచ్–44పై భిక్కనూరు టోల్ప్లాజా వద్ద పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. భిక్కనూరు సీఐ సంపత్కుమార్, ఎస్సై అంజనేయులుతో పాటు సర్కిల్ పరిధిలోని ఎస్సైలు ఎనిమిది బృందాలుగా 1,139 వాహనాలను తనిఖీ చేశారు. ఇందులో 27 మంది వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. నిజామాబాద్నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన బస్సు డ్రైవర్ తాగి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. ఆ డ్రైవర్పై కేసు నమోదు చేసి బస్సును సీజ్ చేశారు. బస్సులో ఉన్న 45 మంది ప్రయాణికులను వేరే వాహనాల్లో తరలించారు. మద్యం సేవించి వాహనాలను నడపడం వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాగి వాహనాలను నడపకుండా చూసేందుకు హైవేలపై డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజల భద్రత కోసం నిరంతరం స్పెషల్ డ్రైవ్లను నిర్వహిస్తామన్నారు.మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరంతో పాటు ప్రాణాలతో ఆడే ప్రమాదకరమైన ఆట. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్, ట్రక్కులు, లారీలు, కార్ల డ్రైవర్లు వాహనాలను నడిపేప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించకూడదు. తాగి నడిపడం వల్ల నడిపేవారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకూ ప్రమాదం ఉంది. అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్పై సీరియస్గా వ్యవహరిస్తున్నాం. – రాజేశ్ చంద్ర, ఎస్పీ, కామారెడ్డిజిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్లో చిక్కిన వారిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపుతున్నారు. కోర్టులో జరిమానాలతో పాటు జైలు శిక్షలు కూడా విధిస్తున్నారు. దీంతో తాగి వాహనం నడిపితే జైలుకు వెళ్లాల్సి వస్తుందన్న భయం చాలా మందిలో ఏర్పడింది. పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించిన ప్రతీచోట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు చేస్తున్నారు. తాగి వాహనం నడిపిన వారు తప్పించుకోలేకపోతున్నారు. తాగి నడిపిన వారికి కౌన్సెలింగ్ ఇవ్వడం, జరిమానాలు విధించడంతోపాటు కోర్టు ద్వారా జైలు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటుండడంతో తాగి వాహనం నడపడానికి పలువురు వెనకాడుతున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల చర్యలు భిక్కనూరు టోల్ప్లాజా వద్ద స్పెషల్ డ్రైవ్ ఒక్క రాత్రే 1,139 వాహనాల తనిఖీ తాగి వాహనం నడిపినవారిపై కేసులు నమోదు -
పత్తి తీతలో మెలకువలు పాటించాలి
● తేమ శాతం 12 లోపు ఉండేలా చూసుకోవాలి ● మండల వ్యవసాయ అధికారి రాజు సూచనలుమద్నూర్లోని జిన్నింగ్ మిల్లుకు తరలించిన పత్తి మద్నూర్: జిల్లాలో పత్తి పంట చేతికొస్తోంది. దీంతో సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లనూ ప్రారంభించారు. అయితే కొనుగోలు కేంద్రాలలో తేమ 12 శాతంలోపు ఉంటేనే కొనుగో లు చేస్తారు. నాణ్యమైన పత్తికి మాత్రమే మద్దతు ధర లభిస్తుంది. ఈ నేపథ్యంలో పత్తి తీయడంలో పాటించాల్సిన మెలకువలను మండల వ్యవసాయ అధికారి రాజు వివరించారు. ఆయన సూచనలిలా ఉన్నాయి. వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో ఎండ అధికంగా ఉన్నప్పుడు పత్తి తీయవద్దు. ఆ సమ యంలో ఎండుటాకులు, వ్యర్థ పదార్థాలు విరిగి పత్తిలో కలిసే అవకాశాలు ఉంటాయి. పొద్దున, సాయంత్రం వేళల్లో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మాత్రమే తీయాలి. పంట కాలంలో కనీసం మూడుసార్లు పత్తిని తీస్తారు. పూర్తిగా విచ్చుకున్న తర్వాతే కాయల నుంచి పత్తిని ఏరాలి. ఏరిన తర్వాత మట్టిలో కుప్పలుగా పోయరాదు. పత్తిలో దుమ్ము ధూళి, ఎరువులు, పురుగుల మందులు, పెట్రోలియం పదార్థాలు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం, చీడపీడల వల్ల పాడైన పత్తిని వేరు చేయాలి. దీన్ని మంచి పత్తిలో కలపకూడదు. మొదట మొక్కల కింద భాగం కాయల నుంచి తీయాలి. ఎందుకంటే ముందుగా పైభాగంలోని కాయల నుంచి తీస్తే కింది కాయల పత్తిలో చెత్తపడే అవకాశం ఉంటుంది. సాధారణంగా చివరలో తీసే పత్తి కొంచెం నాసిరకంగా ఉంటుంది. కాబట్టి దాన్ని ప్రత్యేకంగా అమ్ముకోవాలి. పంట చివరికి వచ్చేసరికి మొక్కలో, నేలలోనూ పోషకాలు తగ్గడంతో పత్తి నాణ్యత లోపిస్తుంది. నిల్వ చేయాల్సిన పత్తిలో 12 శాతం కంటే తేమ ఎక్కువగా ఉంటే లోపల వేడి పెరిగి విత్తనంతో పాటు దూదిని కూడా పాడుచేస్తుంది. పత్తి తీసిన తర్వాత నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెడితే పత్తి రంగుమారి నాణ్యత తగ్గుతుంది. పత్తిని వీలైనంత వరకు గదుల్లో గానీ, షెడ్లలో గానీ సిమెంట్ నేలమీద గానీ పరచాలి. పూర్తిగా ఆరిన తర్వాతే బోరాల్లో నింపి పొడిగా ఉన్న ప్రదేశాల్లో నిల్వ చేయాలి.తడిసిన పత్తిని ఏం చేయాలి? వర్షానికి తడిసిన, మంచు బిందువులతో చ ల్లబడిన పత్తిని ఆరిన తర్వాతే సేకరించాలి. గింజ, దూదిపింజల్లో తేమశాతం లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాత తీయాలి. ఎక్కువ మంది రైతులు మంచులోనే పత్తిని సేకరిస్తారు. వర్షానికి తడిసిన పత్తిని మాత్రం ఎండకాసే సమయంలో, మంచు, నీరు లేని సమయంలో తీయాలి. ఎక్కువ రోజులు వర్షానికి తడిస్తే గింజలు మొలకెత్తుతాయి. అలాంటి పత్తిని సేకరించిన తర్వాత మూడు రోజుల పాటు ఎండలో ఆరబెట్టాలి. ఆరబెట్టిన పత్తిని మూడు గంటలకోసారి తిరిగేయాలి. తేమ పూర్తిగా తగ్గిన తర్వాతే బోరె(సంచు) ల్లో నింపాలి. కొద్దిపాటి తడిసిన పత్తిలో ఎటువంటి నాణ్యత లోపాలు ఉండవు. తడిసిన పత్తిని ఆరబెట్టిన తర్వాత టార్పాలిన్ కవర్ కప్పేటప్పుడు పూర్తిగా కాకుండా గాలి తాకేలా ఉంచాలి. లేకపోతే ఆవిరి వచ్చి తేమ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. -
ప్రణాళిక ఖరారు!
యాసంగిప్రధాన పంటల సాగు అంచనా వివరాలు(ఎకరాలలో).. వరి2,46,500సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో ఈ ఏడాది భారీ వర్షాలు కురిశాయి. దీంతో జలాశయాలు ఇప్పటికీ నిండుకుండల్లా కళకళలాడుతున్నాయి. నిజాంసాగర్, పోచారం, కౌలాస్నాలా ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలన్నీ నిండి ఉండడంతో వాటి కింద ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందనుంది. అలాగే బావులు, బోర్లలో నీరు పుష్కలంగా వస్తుండడంతో వాటి ద్వారానూ పంటలు ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే అవకాశాలున్నాయి. జిల్లాలో మొత్తం 4,04,595 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో 2,46,500 ఎకరాల్లో వరి సాగు అవుతుందని భావిస్తున్నారు. జొన్న, శనగ, మక్క పంటల సాగు విస్తీర్ణం సైతం గణనీయంగానే ఉంటుందని అంచనా వేశారు. జిల్లాలో 78 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు, 11,400 క్వింటాళ్ల శనగ, 3,750 క్వింటాళ్ల జొన్న విత్తనాలు, 3,400 క్వింటాళ్ల మక్క విత్తనాలు అవసరం ఉంటాయని ప్రతిపాదించారు. ఇందుకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు విత్తనాలు, ఎరువులను సిద్ధం చేస్తున్నారు. అలాగే 39 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని, డీఏపీ ఎరువులు 10 వేల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 12 వేల మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 8 వేల మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 5 వేల మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. సాగునీరు పుష్కలంగా ఉన్న నేపథ్యంలో జిల్లాలో ఈసారి అంచనాలకు మించి వరి సాగయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. వాగులు ఇప్పటికీ పారుతుండడం, ప్రాజెక్టులు, చెరువులు నిండుగా ఉండడం, బోర్లలోనూ పుష్కలంగా నీటి ఊటలు ఉండడంతో వరి సాగు పెరుగుతుందని భావిస్తున్నారు. కాగా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో శనగ విత్తనం వేశారు. కొన్నిచోట్ల ఇప్పటికే శనగ మొలకెత్తింది. మరికొన్ని ప్రాంతాల్లో విత్తనం వేస్తున్నారు. యాసంగిలో వరి సాగు చేయడానికి నారుమడులు పోయడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు.పుష్కలంగా సాగునీరు..జిల్లాలో దాదాపు రెండునెలలకుపైగా కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండి రోజుల తరబడిగా పొంగి పొర్లాయి. ఇప్పటికీ ప్రాజెక్టులకు వరద వస్తూనే ఉంది. వాగులైతే నెలన్నరగా ప్రవహిస్తూ జీవనదులను తలపిస్తున్నాయి. చెరువులు, కుంటలు అలుగులు పోస్తూనే ఉన్నాయి. జలవనరులన్నీ నిండుకుండల్లా ఉండడంతో భూగర్భ జలమట్టం గణనీయంగా పైకి వచ్చింది. గతంలో ఎన్నడూ లేనంతగా భూగర్భ జలాలు పైకి రావడంతో బోర్లు, బావుల్లో పుష్కలంగా నీరుంది. గతంలో ఎత్తిపోయిన బోర్లలోనూ నీటి ఊటలు వచ్చాయి. దీంతో యాసంగి పంటలకు సాగునీటికి ఢోకా ఉండదన్న అభిప్రాయాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు.యాసంగి సాగు ప్రణాళికను అధికారులు ఖరారు చేశారు. ఈసారి పుష్కలంగా సాగు నీరు అందుబాటులో ఉండడంతో 4 లక్షలకుపైగా ఎకరాలలో పంటలు సాగవుతాయని అంచనా వేశారు. ఇందులో సగానికిపైగా విస్తీర్ణంలో వరి నాట్లు పడతాయని భావిస్తున్నారు. ప్రణాళికకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతున్నారు. 4.04 లక్షల ఎకరాల్లో పంటల సాగు అంచనా 2.46 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడే అవకాశం విత్తనాలు, ఎరువులు సిద్ధం చేస్తున్న వ్యవసాయశాఖ -
తెయూలో అక్రమ నియామకాలకు చెక్
● రోస్టర్ను తుంగలో తొక్కి చేపట్టిన నియామకాలు రద్దుచేసిన హైకోర్టు ● తెరవెనుక వ్యవహారాలపై అక్షర యుద్ధం చేసిన ‘సాక్షి’సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: రోస్టర్ విధానాన్ని తుంగలో తొక్కి తెలంగాణ యూనివర్సిటీలో చేపట్టిన అధ్యాపకుల నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. రోస్ట ర్ నియామకాలను పట్టించుకోకుండా 2012లో నోటిఫికేషన్ ఇచ్చి 2014లో అక్రమ మార్గంలో చేపట్టిన నియామకాలు ఈ తీర్పుతో రద్దయ్యాయి. అప్పట్లో 91 పోస్టుల భర్తీకోసం ఈ నోటిఫికేషన్ ఇచ్చి 53 మందిని రిక్రూట్ చేసుకున్నారు. ప్రస్తుతం 45 మంది పనిచేస్తుండగా మిగతా 8 మందిలో కొందరు రిటైర్ కాగా, కొందరు మరణించారు. చేర్చకూడనివి చేర్చి.. చేర్చాల్సినవి వదిలేసి.. 2012లో ఇచ్చిన నోటిఫికేషన్లో చేర్చకూడని పోస్టులు చేర్చడం, చేర్చాల్సిన పోస్టులు వదిలేయడంతో సంబంధిత సబ్జెక్టుల రోస్టర్ పాయింట్లు మారిపోయాయి. దీనిపై అకడమిక్ కన్సల్టెంట్ల అసోసియేషన్ 2013 ఫిబ్రవరి 22న కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. తాజా తీర్పు వెలువరించిన హైకోర్టు కొత్త నోటిఫికేషన్ ఇచ్చుకోవచ్చని సూచించింది. జీవో 420 ప్రకారం వర్సిటీలో ఆర్ట్స్, సైన్స్ గ్రూపులను వేరుగా తీసుకుని, ప్రతి గ్రూప్లోని సబ్జెక్టులను అక్షరానుక్రమంలో పెట్టి, అన్ని పోస్టులకూ ఒకే రన్నింగ్ రోస్టర్ వర్తింపజేయాల్సి ఉంది. ప్రతి డిపార్ట్మెంట్కు వేర్వేరు రోస్టర్ నిర్వహించడం అసాధ్యం కావడంతో ఈ విధానం అమలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా వర్సిటీలో పోస్టులు భర్తీ చేయాలంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) ఆమోదం తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు నిలిపివేసి, వాటి స్థానంలో రెండేళ్ల కాలపరిమితితో కూడిన ఎంఏ ఎకానమిక్స్, ఎమ్మెస్సీ ఫార్మాసూటికల్ కెమిస్ట్రీ కోర్సులు ప్రవేశపెట్టాలని 20వ పాలకమండలి 2012 ఏప్రిల్ 27న నిర్ణయించింది. ఇంటిగ్రేటెడ్ కోర్సులకు యూనివర్సిటీ రెగ్యులర్ స్టాఫ్ను తీసుకోలేదు. ఎక్కువగా తాత్కాలిక కన్సల్టెంట్లతో క్లాసులు నిర్వహించింది. మార్పుల తర్వాత పోస్టుల లెక్కలు, రోస్టర్ పాయింట్లు మళ్లీ పరిగణనలోకి తీసుకుని పాలకమండలిలో పెట్టాల్సి ఉన్నప్పటికీ దీన్ని పాటించలేదు. పాలకమండలి తీర్మానాన్ని బేఖాతరు చేస్తూ.. వర్సిటీలో అక్రమాలపై గతంలో పాలకమండలి అలుపెరగని పోరాటం చేసింది. గత వీసీ రవీందర్ గుప్తా, రిజిస్ట్రార్ల అక్రమాలపై విజిలెన్స్ విచారణకు తీర్మానం చేసింది. విచారణ నడుస్తోంది. వాకాటి కరుణ ఇన్చార్జి వీసీగా ఉన్నప్పుడు పాలకమండలి సభ్యులు తిరస్కరించినప్పటికీ ప్రమోషన్ల అంశంపై లీగల్ ఒపీనియన్కు పంపాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వాకాటి కరుణ ప్రమోషన్ల వ్యవహారాన్ని అప్పటి ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్తో కలిసి తిరస్కరించారు. ఒకరికి ఒకలా.. మిగిలిన వారికి మరోలా.. యూజీసీ నిబంధనలు ఉల్లంఘించిన ఓ ప్రొఫెసర్ తనకు తానే ఉద్యోగోన్నతి పొందినట్లు రిజిస్ట్రార్ యాదగిరి ప్రభుత్వానికి తెలిపారు. దీనిపై లోక్ అదాలత్లో అప్పీల్ చేశారు. మరో నలుగురి విషయంలో మాత్రం అప్పీల్కు వెళ్లకుండా ప్రమోషన్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేయడం గమనార్హం. -
కళ్లకు గంతలతో నిరసన
కామారెడ్డి టౌన్: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధుల విడుదలలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద అంబేడ్కర్ విగ్రహం ముందు కళ్లకు గంతలు కట్టుకుని నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్: జిల్లా కార్యదర్శి ఆరుణ్కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల కోసం నాలుగు రోజులుగా డిగ్రీ, పీజీ ఇంజినీరింగ్, ఉన్నత విద్యా సంస్థలను బంద్ చేసినా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. తక్షణమే పెండింగ్లో ఉన్న రూ. 8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రాహుల్, శివ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
‘నేడు సామూహిక వందేమాతర గానం’
కామారెడ్డి క్రైం: బంకించంద్ర చటర్జీ వందేమాతరం గేయాన్ని రచించి 150 ఏళ్లవుతున్న సందర్భంగా ప్రభుత్వం దేశవ్యాప్తంగా సామూహిక వందేమాతర గానం చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గురువారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రైవేటు సంస్థలలో సామూహికంగా వందేమాతర గేయాన్ని ఆలపించాలని అదనపు కలెక్టర్ విక్టర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు వందేమాతరం పాడాలని సూచించారు. దేశభక్తి భావాన్ని బలపరచడం, జాతీయ గీతాన్ని గౌరవించడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ‘ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం’ నాగిరెడ్డిపేట: రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని డీఆర్డీవో సురేందర్ పేర్కొన్నారు. గురువారం ఆయన మాల్తుమ్మెదలోని ప్రభుత్వ భూమిని తహసీల్దార్ శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. అనంతరం ఐకేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మాల్తుమ్మెద శివారులోని ఎకరం భూమిలో మండల సమాఖ్య ద్వారా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం మండల సమాఖ్య నుంచి రూ.50 లక్షల వరకు వెచ్చిస్తామన్నారు. జిల్లాలో గ్రామసంఘాల ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ఇప్పటివరకు 3,393 మంది రైతుల నుంచి 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. 1,763 మంది రైతులకు రూ. 23.52 కోట్లు చెల్లించామన్నారు. అనంతరం కన్నారెడ్డి గేట్ వద్ద గ్రామ సంఘం సహకారంతో ఏర్పాటు చేసిన బోర్డును పరిశీలించారు. ఆయన వెంట డీపీఎం సురేష్, సీసీలు నారాయణ, రమేష్, దత్తు, అకౌంటెంట్ రాజు తదితరులున్నారు. విద్యార్థులకు పాఠం చెప్పిన ట్రైనీ కలెక్టర్ రామారెడ్డి: ట్రైనీ కలెక్టర్ రవితేజ టీచర్గా మారి విద్యార్థులకు పాఠం చెప్పారు. గురువారం ఆయన రామారెడ్డిలోని బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. విద్యార్థులకు పాఠం చెప్పారు. విద్యాబోధన గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీవో తిరుపతిరెడ్డి, ఉపాధ్యాయులు లింగపురం బాలరాజ్, మురళి గౌడ్ తదితరులున్నారు. మైనారిటీ కళాశాల తనిఖీ కామారెడ్డి అర్బన్: దేవునిపల్లి వాసవి కాలనీ లోని మైనారిటీ బాలుర జూనియర్ కళాశాల ను ఇంటర్ బోర్డు ప్రత్యేకాధికారి ఒడ్డెన్న గురువారం తనిఖీ చేశారు. తాగునీటి వ్యవస్థ, మరుగుదొడ్లు, వసతిగృహం, మౌలి క సదుపాయాలను పరిశీలించారు. సిబ్బంది, విద్యార్థుల హాజరు రిజిస్టర్లు, ప్రవేశాలు, డాక్యుమెంటేషన్ను ప్రత్యేకాధికారి వెంట వచ్చిన బృందం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇంతియాజ్ అలీ, అధ్యాపకులు పాల్గొన్నారు. పరీక్ష కేంద్రం వద్ద ఆంక్షలు నిజామాబాద్అర్బన్: నగరంలోని డిపార్ట్మెంటల్ పరీక్షల నిర్వహణకు సంబంధించి పరీక్ష కేంద్రం వద్ద నిషేధాజ్ఞలు విధించినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో డిపార్ట్మెంటల్ పరీక్షలు నిర్వహిస్తున్నందున నగరంలోని ఏవీ ఎంటర్ ప్రైజెస్ అర్సపల్లి బైపాస్ సెంటర్ పరిసరాల్లో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఇద్దరికన్నా ఎక్కువ మంది గుమిగూడవద్దని, నిషేధిత వస్తువులతో పరీక్ష కేంద్రం పరిసరాల్లో తిరగొద్దని సూచించారు. జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలని, లౌడ్ స్పీకర్లను వినియోగించొద్దని పేర్కొన్నారు. -
పరీక్షలను వాయిదా వేయాలి
● ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల అసోసియేషన్ ప్రతినిధుల నిరసన తెయూ(డిచ్పల్లి): ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అన్ని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్ పాటిస్తున్నందున పరీక్షలను వాయిదా వేయాలని ప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. గురువారం తెయూ క్యాంపస్ మెయిన్ గేట్ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. అనంతరం తెయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రాకపోవడంతో కళాశాలలు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అధ్యాపకులు, సిబ్బందికి నెలవారీ వేతనాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నాలుగు రో జుల నుంచి కళాశాలలను నిరవధికంగా బంద్ చేసి ప్రభుత్వ మొండి వైఖరిపై తమ నిరసన తెలియజేస్తున్నామన్నారు. కళాశాలలు బంద్ ఉండటంతో వి ద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించేందుకు రాలేకపోయారని తెలిపారు. కళాశాలల బంద్ పూర్తయ్యే వ రకు పరీక్షల టైంటేబుల్ విడుదల చేయొద్దని, పరీక్ష ఫీజు చెల్లించే తేదీని పొడిగించాలని విన్నవించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాల సుధాకర్, మారయ్యగౌడ్, శంకర్, శ్రీనివాసరాజు, గురువేందర్ రెడ్డి, అరుణ్, గిరి, రమణ, సత్యం, దత్తు, విజయ్, గంగాధర్, చందన్, గంగారెడ్డి, రషీద్, షకీల్, వెంకటకిషన్ పాల్గొన్నారు. -
క్రీడలు దేశ ఐక్యతలో భాగం
● ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ● 11వ జోనల్ లెవల్ గేమ్స్–స్పోర్ట్స్ మీట్ ప్రారంభం ఆర్మూర్: క్రీడలు దేశ ఐక్యతలో భాగమని, విద్యార్థులు చదువులతోపాటు క్రీడల్లో రాణించాలని ఆ ర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూ ర్ పట్టణం పిప్రి రోడ్డులోని సోషల్ వెల్ఫేర్ గురు కుల పాఠశాల మైదానంలో తెలంగాణ సోషల్ వె ల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే బాసర 2 జోన్ పరిధిలోని 11వ జోనల్ లెవల్ గేమ్స్–స్పోర్ట్స్ మీ ట్ను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా జోన్ పరిధిలోని నిజామాబాద్ ఉమ్మ డి జిల్లాతోపాటు జగిత్యాల్, నిర్మల్ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చ్ఫాస్ట్ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి మాట్లాడుతూ క్రీడా పోటీలతో ఆరోగ్యంతోపాటు మానసిక దృఢత్వం పెరుగుతుందన్నారు. మహిళల క్రికెట్ ప్రపంచకప్ సాధించిన క్రీడాకారులకు అభినందనలు తెలిపా రు. క్రీడల అభివృద్ధికి ఎమ్మెల్యేగా తన పూర్తి సహా య సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం రాకేశ్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు టీషర్టులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్మూ ర్, వేల్పూర్ సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఆయా జిల్లాలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్లు నిరంజన్, గంగాధర్, సత్యనారాయణ, జ్ఞానేశ్వర్, బీజేపీ నాయకులు మందుల బాలు, కేసీ ముత్యం తదితరులు పాల్గొన్నారు.


