Kamareddy District News
-
అన్నదాతపై హమాలీ భారం
బాన్సువాడ : ఆరుగాలం శ్రమించి పండించిన ఉత్పత్తులను కొనుగోలు కేంద్రాలకు తరలిస్తే హమాలీ లోడింగ్ ఖర్చు రైతులకు తడిసి మోపెడవుతుంది. కొన్ని గ్రామాల్లోని కేంద్రాల్లో హమాలీలకు ఒక్కో బస్తాకు (40 కిలోలు) రూ. 15 నుంచి రూ. 20 రైతులు ఇస్తుండగా మరి కొన్ని ప్రాంతాల్లో క్వింటాల్కు రూ.50 నుంచి రూ.60 ఇస్తున్నారు. గతంలో హమాలీ చార్జి ప్రభుత్వమే చెల్లించేది. దీంతో అన్నదాతపై కొంత భారం తగ్గేది. కానీ 2017 రబీ సీజన్ నుంచి ప్రభుత్వం చేతులెత్తేసింది. మద్దతు ధర క్వింటాల్కు గ్రేడ్ ఏ రూ. 2320, కామన్ రకం రూ.2300 చెల్లిస్తున్నారు. ఇందులో హమాలీలకు, సుతీలు, లారీలకు కలిపి రూ.50 రైతులే చెల్లిస్తున్నారు. కానీ లారీ యజమానులకు గిట్టుబాటు కాకపోవడంతో రైతుల వద్ద అదనంగా సంచికి రూ. 2 చొప్పున తీసుకుంటున్నారు. ఊపందుకున్న కొనుగోళ్లు.. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ఊపందుకున్నాయి. సహకార సంఘాల ఆధ్వర్యంలో 263 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే, ఐకేపీ ఆధ్వర్యంలో 183 కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఈ యాసంగిలో నాట్లు వేసిన వారం నుంచే మొగిపురుగు ఆశించి రైతులను కోలుకోలేని దెబ్బతీసింది. పంటు కాపాడుకునేందుకు రసాయన మందులు వాడారు. ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టగా దిగుబడి అంతంతే వస్తుందని రైతులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాల ద్వారా ఇప్పటివరకు 3.17 లక్షల టన్నుల ధాన్యం సేకరించారు. చేతులెత్తేసిన ప్రభుత్వం గతంలో క్వింటాలుకు రూ.5.30 చొప్పున ప్రభు త్వం హమాలీలకు చెల్లించేది. మిగిలిన డబ్బులు రైతులు కలుపుకుని ఇచ్చేవారు. దీంతో అన్నదాతలకు కొంత ఊరట లభించేది. 2017 నుంచి ప్రభు త్వం చేతులెత్తేయగా, అప్పటి నుంచి రైతులపై భారం పడుతోంది. హమాలీలు ధాన్యం ఎత్తడం, తూకం వేయడం చేయాలి. పెరిగిన పెట్టుబడులకు మద్దతు ధర సరిపోతలేదని రైతులు వాపోతున్నారు.హమాలీ చార్జీలు పూర్తిగా ప్రభుత్వమే భరించేలా చూడాలని రైతులు కోరుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసి మోపెడవుతున్న ఖర్చులు క్వింటాల్కు రూ.50 వరకు వసూలు ప్రభుత్వమే చెల్లించాలని కోరుతున్న రైతులు భవిష్యత్తులో జమ అవుతాయి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో ప్రస్తుతం మద్దతు ధర జమ అవుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేయగానే భవిష్యత్లో హమాలీ చార్జీలు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. జూన్ 10 వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనసాగుతాయి. – రామ్మోహన్రావు, డీసీవో, కామారెడ్డి భారం తగ్గుతుంది ఐదెకరాల్లో సన్నరకం వరి సాగు చేసి వారం రోజుల క్రితం పంటను కోశాం. వాతావరణ మార్పులు, తెగుళ్లతో ఈ సారి ఆశించిన దిగుబడి వచ్చేలా కనిపిస్తలేదు. ఎకరాకు రూ. 25 వేల పెట్టుబడి పెట్టాను. హమాలీలకు ప్రభుత్వం చెల్లిస్తే కొంత భారం తగ్గుతుంది. –నారాయణ రైతు,బాన్సువాడ. -
సమ్మర్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలి
రామారెడ్డి : జిల్లా యువజన క్రీడశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మర్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన క్రీడాధికారి జగన్నాథం పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన రామారెడ్డిలో సమ్మర్ క్యాంప్ను ప్రారంభించారు. ఈసందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ ...జిల్లాలో 10 సమ్మర్ కోచింగ్ క్యాంప్లను నిర్వహిస్తున్నామని, రామారెడ్డిలో ఫుట్ బాల్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ను ప్రారంభించామన్నారు. 34 మంది బాలబాలికలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. క్యాంప్ను సద్వినియోగం చేసుకొని జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని సూచించారు. ఈకార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ సంజయ్ కుమార్, తహసీల్దార్, ఉమలత, ఎంపీడీవో తిరుపతి రెడ్డి ఎంఈవో ఆనంద్ రావు, కార్యదర్శి క్రాంతి కుమార్, సమ్మర్ కోచింగ్ నిర్వాహకులు బాలరాజు పాల్గొన్నారు. శతాధిక వృద్ధురాలి మృతి తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రానికి చెందిన శతాధిక వృద్ధురాలు పుల్లూరి బాలవ్వ (101) సోమవారం రాత్రి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. మృతురాలికి 25మంది కూతుర్లు, మనమండ్లు, మనుమరాళ్లు ఉన్నారన్నారు. బాలవ్వ అంత్యక్రియలు మంగళవారం నిర్వహించారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి టౌన్: సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కళాబృందం ప్రతినిధి ప్రభాకర్ తెలిపారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సెట్విన్ వృత్తి విద్యా కోర్సు విద్యార్థులకు షీ టీం, పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఆన్లైన్ బెట్టింగ్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కు సంప్రదించాలన్నారు. విద్యార్థినులు, మహిళలు వేధింపులకు గురైతే షీ టీంను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో షీ టీం, భరోసా సిబ్బంది, కళాబృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100 డయల్ చేయాలి బాన్సువాడ : అత్యవసర పరిస్థితుల్లో విద్యార్థులు 100 డయల్ చేయాలని షీటీం సభ్యులు అనిల్, ప్రియాంకలు సూచించారు. మంగళవారం బాన్సువాడ నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు షీటీంపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సైబర్ నేరాలపై, టీ–సేఫ్ యాప్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. పోకిరిలబెడదఉన్నప్పుడువెంటనే 8712686094కు సంప్రదించాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. తాడ్వాయిలో.. తాడ్వాయి(ఎల్లారెడ్డి) : గ్రామాలలో తరచుగా సైబర్ మోసాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ సంతోష్ కుమార్ అన్నారు.మండల కేంద్రంలో మంగళవారం పోలీసుల కళాబృందం ఆధ్వర్యంలో సైబర్ నేరాలతో పాటు పలుఅంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ద్విచక్రవాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలను నడుపొద్దని, జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోఎస్ఐ రాజయ్య,కళాబృందం ప్రతినిధులు ప్రభాకర్, పోలీసు సిబ్బంది, కళాకారులు గ్రామస్తులు పాల్గొన్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామ శివారులోని ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలో ఆటో బోల్తా పడి ఓ వృద్ధుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఆర్మూర్ మండలం పిప్రి గ్రామానికి చెందిన గోక అశోక్ తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం నందిపేట మండలంలోని కుద్వాన్పూర్ ఎల్లమ్మ ఆలయానికి మొక్కు తీర్చుకోవడానికి వచ్చాడు. దర్శనం చేసుకున్న అనంతరం తిరిగి ఇంటికి బయలుదేరగా ఎల్లమ్మ గుట్ట పైనుంచి ఆటో కిందికి దిగుతుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో ప్రయాణిస్తున్న గోక సాయన్న (65), మమత, నితిన్, లక్ష్మిప్రసన్నలకు గాయాలు కాగా వారిని నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గోక సాయన్న మృతి చెందాడు. మృతుడి కొడుకు గోక అశోక్ ఫిర్యాదు మేరకు ఆటోడ్రైవర్ గట్టు సత్యనారాయణపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. పిట్లం మండలంలో.. పిట్లం(జుక్కల్): బైక్ అదుపుతప్పి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని రాంపూర్ గ్రామ శివారులోని పిట్లం–బాన్సువాడ రహదారిపై చోటు చేసుకుంది. పిట్లం ఎస్సై రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మానూర్ గ్రామానికి చెందిన సౌదర్పల్లి యాదగిరి (34) తన బైక్పై సోమవారం రాత్రి అంకోల్ తండా నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యలో మండలంలోని రాంపూర్ గ్రామ శివారులో బైక్ అదుపుతప్పడంతో యాదగిరి కిందమీద పడి తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతుడి తల్లి విట్టవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వర్ని మండలంలో.. వర్ని: వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవూరు–చందూరు గ్రామాల మధ్య సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గంగారాం (60) అక్కడికక్కడే మృతి చెందినట్లు వర్ని మహేష్ వెల్లడించారు. రోడ్డుపై వెళ్తున్న గంగారాంను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. డొంకేశ్వర్ మండలంలో.. డొంకేశ్వర్(ఆర్మూర్): మండలంలోని అన్నారం మాజీ గ్రామ సర్పంచ్ మంగ్లారం పోశన్న (47) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నికాల్పూర్లో సోమవారం జరిగిన బంధువుల ఫంక్షన్కు పోశన్న వెళ్లాడు. రాత్రి స్కూటీపై తిరిగి ఇంటికి బయలుదేరాడు. అన్నారం గ్రామ శివారులోకి రాగానే మూల మలుపు వద్ద స్కూటీ అదుపుతప్పడంతో కింద పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య సాయమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు. అంత్యక్రియలు బుధవారం స్వగ్రామంలో జరగనున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత చెందారు. ఆటో అదుపుతప్పి నందిపేట మండలంలో ఓ వృద్ధుడు, బైక్ అదుపుతప్పి పిట్లం మండలంలో ఓ యువకుడు, డొంకేశ్వర్ మండలంలో ఒకరు చనిపోయారు. వర్ని మండలంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతిచెందారు. -
40 ఏళ్ల తర్వాత ఒక్కచోటికి..
దోమకొండ: మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం మంగళవారం నిర్వహించారు. 1984–85 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి విద్యార్థులు దాదాపు 40 సంవత్సరాల తర్వాత 45 మంది పూర్వ విద్యార్థులు కలుసుకుని వారి బాగోగులు మాట్లాడుకున్నారు. వారి వ్యక్తిగత వృత్తి వివరాలు, పిల్లల వివరాలు చేస్తున్న ఉద్యోగా లు తదితర విషయాలపై పరిచయం చేసుకున్నారు. మరణించిన తమ తోటి పూర్వ విద్యార్థుల మృతికి శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు బాపురెడ్డి, శ్రీనివాస్శర్మ, రాంరెడ్డి, ప్రభాకర్రెడ్డి, సంజీవ్రెడ్డి, రాజేందర్, శ్రీనివాస్రెడ్డి, సిద్దరామేశ్వర్రెడ్డి, నర్సింలు, నాగరాజు పాల్గొన్నారు. నేహాశెట్టి సందడి పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ పట్టణంలో మంగళవారం డీజే టిల్లు సినిమా ఫేమ్ నేహా శెట్టి సందడి చేశారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో ఎల్వీఆర్ షాపింగ్ మాల్ను మంగళవారం సినీనటి నేహాశెట్టి, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్రెడ్డి ప్రారంభించారు. ఈసందర్భంగా నేహా శెట్టితో సెల్ఫీలు తీసుకోవడానికి అభిమానులు ఎగబడ్డారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, నాయకులు పండిత్ పవన్, ఎల్వీఆర్ షాపింగ్ మాల్ యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు. పోలీసునంటూ బెదిరించి నగదు అపహరణ నవీపేట: నవీపేట శివారులో ఓ వ్యక్తి పోలీసునంటూ బెదిరించి, ఒకరి వద్ద నగదు అపహరించాడు. బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మద్దెపల్లికి చెందిన యుడ్ కిషన్ ఈనెల 5న నవీపేట నుంచి స్వగ్రామానికి బైక్పై బయలుదేరాడు. నవీపేట శివారులో గు ర్తుతెలియని వ్యక్తి బైక్పై వచ్చి కిషన్ వాహనా న్ని ఆపాడు. పోలీసునంటూ బెదిరించి కిషన్ జేబులోని రూ.10500ల నగదుతోపాటు అన్ని కార్డులను బలవంతంగా లాక్కొని, పోలీస్ స్టే షన్కు రమ్మని పారిపోయాడు. అతని ఆచూకీ కోసం ఆరా తీయగా పోలీసు కాదని తెలుసుకున్నాడు. అతడిని పట్టుకుని చర్యలు తీసుకోవా లని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
కాలభైరవుడికి 108 స్వీట్లతో నైవేద్యం
రామారెడ్డి: దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం ఇసన్నపల్లి (రామారెడ్డి) శ్రీ కాలభైరవుడి ఆలయంలో వైశాఖమాస రెండో మంగళవారం పురస్కరించుకొని స్వామివారికి 108 రకాల స్వీట్లతో నైవేద్యం సమర్పించారు. ఈసందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారికి అలంకరించే కరెన్సీ దండకు భక్తులు భారీగా విరాళాలు సమర్పించారు. మూడో మంగళవారం 108 రకాల కూరగాయలతో, నాలుగో మంగళవారం 108 రకా ల పూలతో కాలభైరవుడిని అలంకరిస్తారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఎండ వేడిమి తట్టుకునేందుకు టెంట్లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ప్రభు గుప్తా, అర్చకులు రాచర్ల శ్రీనివాసశర్మ, వంశీకృష్ణశర్మ, జూనియర్ అసిస్టెంట్లు లక్ష్మణ్, నాగరాజ్, మాజీ చైర్మన్ గంజి సతీష్గుప్తా పాల్గొన్నారు. భైరవ నామసర్మణతో మార్మోగిన రామారెడ్డి భారీగా తరలివచ్చిన భక్తులు -
ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి
లింగంపేట/తాడ్వాయి/ రాజంపేట/బాన్సువాడ రూరల్ : ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని వ్యవసాయాధికారులు తెలిపారు. లింగంపేట మండలం పొల్కంపేట, బాయంపల్లి గ్రామాల్లో రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మంగళవారం ప్రారంభించినట్లు మండల వ్యవసాయాధికారి అనిల్కుమార్ తెలిపారు.తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్ రైతు వేదిక కార్యాలయంలో రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్లపై మండల వ్యవసాయాధికారి నర్సింలు అవగాహన సదస్సు నిర్వహించారు. రాజంపేట మండలంలో రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీపై మండల కేంద్రంలోని రైతు వేదికలో అవగాహన కల్పించినట్లు కామారెడ్డి డివిజనల్ వ్యవసాయ సంచాలకులు అపర్ణ తెలిపారు. బాన్సువాడ మండలం రాంపూర్ తండాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్లు చేపట్టినట్లు క్లస్టర్ ఏఈవో దత్తేశ్వరి తెలిపారు. ప్రతి రైతు తనకున్న భూములకు సంబంధించిన వివరాల సమాచారంతో ఈ ఫార్మర్ రిజిస్ట్రీ ఉంటుందని, దీనికి రైతులందరూ ఆధార్ లింకు ఉన్న సెల్ ఫోన్, ఆధార్ కార్డ్, పట్టా పాస్ బుక్ తెచ్చుకొని తమ సమీప వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించాలని కామారెడ్డి డివిజనల్ వ్యవసాయ సంచాలకులు అపర్ణ సూచించారు.ఈకార్యక్రమంలో ఏఈవోలు, ఏవోలు, రైతులు పాల్గొన్నారు. -
లక్ష్యం మేర మొక్కలు సిద్ధం
నిజాంసాగర్: ప్రతి పంచా యతీ పరిధిలో లక్ష్యం మేర మొక్కలను సిద్ధం చేస్తున్నామని ఈజీఎస్ ఏపీడీ వామన్రావు పేర్కొన్నారు. లక్ష్యంపై నిర్లక్ష్యం శీర్షికన మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. మంగళవారం ఆయన ప్లాంటేషన్ మేనేజర్ సురేందర్తో కలిసి తెల్గాపూర్లోని వన నర్సరీని సందర్శించారు. వన నర్సరీలో 4 వేల మొక్కల పెంపకం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. మొక్కల సంరక్షణను వన సేవకులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు చూసుకోవాలని సూచించారు. వారి వెంట ఈజీఎస్ ఏపీవో శివకుమార్, టెక్నికల్ అసిస్టెంట్ బాల్సింగ్, పంచాయతీ కార్యదర్శి గంగారాం, ఫీల్డ్ అసిస్టెంట్ అనిల్ తదితరులు ఉన్నారు. -
ప్రకృతి వనం.. ఆహ్లాదానికి దూరం
పట్టించుకునేవారు లేక ఆనవాళ్లు కోల్పోయిన వైనంఎల్లారెడ్డి: ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రకృతి వనాలు పట్టించుకునేవారు లేక ఆనవాళ్లు కోల్పోతున్నాయి. జిల్లాలో 526 గ్రామ పంచాయతీలలో పల్లె ప్రకృతి వనాలు, మూడు బల్దియాలలో పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ఉపాధి హామీ నిధుల నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 6 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. వీటితో ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి, రక్షణ కోసం కంచెలు, పార్కులో కూర్చోవడానికి సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేసి పార్క్ నిర్వహణ కోసం సిబ్బందిని నియమించారు. పట్టణాలలో వార్డుకు ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు. ప్రజలు సైతం పలుచోట్ల స్వచ్ఛందంగా ముందుకువచ్చి స్థలాలు, బెంచీలు ఇతర సామగ్రి సమకూర్చారు. ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలు ఎండిపోతే కొత్తవి నాటాల్సి ఉంటుంది. అయితే ఏర్పాటు చేసిన కొన్నాళ్లకే వీటిని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించారు. పంచాయతీలు, మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం పూర్తయ్యాక వాటిని పట్టించుకునేవారే కరువయ్యారు. దీంతో చాలాచోట్ల ప్రకృతి వనాలు అస్థిత్వాన్ని కోల్పోయాయి. మొక్కలు ఎండిపోయి కళావిహీనంగా మారిపోయాయి. పూలు, అలంకార మొక్కలు, ఆహ్లాదాన్ని పంచే వృక్షాలతో కళకళలాడాల్సిన పల్లెప్రకృతి వనాలు ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. దీంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అయ్యి ప్రజలకు ఆహ్లాదం కరువయ్యింది. మొక్కలు ఎండకుండా చూస్తాం ఎల్లారెడ్డి పట్టణంలోని 12 వార్డులలో ఉన్న పట్టణ ప్రకృతి వనాలలో మొక్కలు ఎండకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. ఎండిన మొక్కల చోట కొత్త మొక్కలను నాటుతాం. – మహేశ్కుమార్, మున్సిపల్ కమిషనర్, ఎల్లారెడ్డి -
రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కామారెడ్డి విద్యార్థే!
సాక్షి ప్రతినిధి, కా మారెడ్డి : స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా నియమితులై న ఐఎఫ్ఎస్ అధికా రి డాక్టర్ జి.చంద్రశేఖర్రెడ్డి కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సై న్స్ కళాశాల పూర్వ విద్యార్థి. ఆయన 1982 –85 లో ఇక్కడ బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు చదివారు. కళాశాల అలుమ్నికి పలుమార్లు హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోర్గావ్ గ్రామానికి చెందిన చంద్రశేఖర్రెడ్డి.. అప్పట్లో కామారెడ్డిలో స్నేహితులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ బీఎస్సీ ఫారెస్ట్రీ పూర్తి చేశారు. కామారెడ్డిలో ఆయనకు చాలామంది మిత్రులున్నారు. డిగ్రీ పూర్తయ్యాక ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి లైఫ్ సైన్సెస్లో పీజీ చేశారు. 1991లో ఐఎఫ్ఎస్ అధికారిగా ఎంపికై వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. ‘కొలతల ప్రకారం నిర్మించుకోవాలి’ నిజాంసాగర్: కొలతల ప్రకారంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటేనే బిల్లులు వస్తాయని జెడ్పీ సీఈవో చందర్ నాయక్ పేర్కొన్నారు. మంగళవారం జుక్కల్ మండల కేంద్రంతో పాటు బంగారుపల్లె గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. ఇంటి నిర్మాణాలు ప్రారంభించిన వారికి విడతల వారీగా బిల్లులు వస్తాయన్నారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సుధాకర్ తదితరులున్నారు. వినియోగదారుల ఫోరం జిల్లా ప్రతినిధుల నియామకం కామారెడ్డి అర్బన్ : వినియోగదారుల ఫోరం జిల్లా కార్యవర్గంలో పలువురికి అవకాశం క ల్పించినట్లు ఫోరం జిల్లా అధ్యక్షుడు కుసుమ రమేష్ తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా కుంట నర్సింలు, ప్రధాన కార్యదర్శిగా ఉప్పు నూతల రమేష్గౌడ్, కార్యదర్శిగా బొల్లి రా జు, సంయుక్త కార్యదర్శిగా బాబు గౌడ్, రా జేశ్ ఖన్నాలను నియమించినట్టు పేర్కొన్నా రు. త్వరలోనే ఫోరం ప్రతినిధులకు అవగా హన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కొనుగోళ్లలో వేగం పెంచాలి తాడ్వాయి : ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని జిల్లా సహకార శాఖ అధికారి రామ్మోహన్, మానిటరింగ్ అధికారి సాయిలు సూ చించారు. బ్రాహ్మణపల్లిలోని వరికొనుగోలు కేంద్రాన్ని మంగళవారం వారు తనిఖీ చేశా రు. రైతులకు ఇబ్బంది కలుగకుండా ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తూకం వేసి, రైస్మిల్లుల కు తరలించాలని సూచించారు. టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలన్నారు. వడ్లు అమ్మిన రైతులకు త్వరగా డబ్బులు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారి వెంట సొ సైటీ డైరెక్టర్ నర్సింలు, కార్యదర్శి నర్సింలు, ఏఈవో హారిక తదితరులున్నారు. ‘ఉత్తీర్ణులయ్యేలా చూడాలి’ గాంధారి : విద్యార్థులందరూ పాస్ అయ్యే లా చూడాలని ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీ సర్ షేక్ సలాం సూచించారు. ఇంటర్లో ఫె యిలైన విద్యార్థుల కోసం గాంధారి కళాశాల లో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను మంగళవారం తనిఖీ చేశారు. ప్రిన్సిపాల్ గడ్డం గంగారాం, అధ్యాపకులతో సమావేశమై సబ్జెక్టులవారీగా వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించా రు. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించిన అఫిలి యేషన్ ప్రతిపాదనలు పంపాలని ప్రిన్సిపాల్కు సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రాజగోపాల్, లక్ష్మణ్, విజయకుమార్, రమేష్, వెంకటస్వామి, స్వప్న, మమత తదితరులు పాల్గొన్నారు. -
విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
కామారెడ్డి టౌన్ : విద్యుత్ సిబ్బంది విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో విద్యుత్ భద్రత వారోత్సవాలు నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఉద్యో గులు భద్రత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పటి విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. విద్యుత్ ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన ప్రాథమిక చికిత్సలు, సీపీఆర్ గురించి వైద్యుడు రమేష్ బాబు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కళాబృందం నాటకం ద్వారా వ్యవసాయదారులకు విద్యుత్ సంబంధిత ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించింది. కార్యక్రమంలో విద్యుత్ శాఖ డీఈ (టెక్నికల్, భద్రత అధికారి) ప్రభాకర్, డీఈ(ఆపరేషన్) కల్యాణ చక్రవర్తి, డీఈ(ఎంఆర్టీ) నాగరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ భద్రత వారోత్సవాల్లో కలెక్టర్ సంగ్వాన్ -
తొమ్మిదేళ్లుగా శతశాతం ఉత్తీర్ణత
బీబీపేట : ఉత్తీర్ణులవడమే కాదు.. మంచి మార్కు లు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు మాందాపూ ర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు. ఈ పాఠశాల వరుసగా తొమ్మిదోసారి పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణతను నమోదు చేసింది. ఈసారి 36 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా అందరూ పాసయ్యారు. ఇందులో 17 మంది 500 మార్కులపైన సాధించడం గమనార్హం. తమ పాఠశాల విద్యార్థులు 2017 సంవత్సరం నుంచి వంద శాతం పాసవుతున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. ఎంతోమంది ఐఐఐటీకి ఎంపికయ్యారని పేర్కొన్నారు. మాందాపూర్లో ప్రత్యేక తరగతులకు హాజరైన విద్యార్థులు (ఫైల్)ఉత్తమ ఫలితాల కోసం.. ఈ ఏడాది పదో తరగతిలో 17 మందికి 500లకుపైగా మార్కులు ఆదర్శంగా నిలుస్తున్న మాందాపూర్ సర్కారు బడిఉత్తమ ఫలితాల కోసం విద్యార్థులతోపాటు ఉ పాధ్యాయులు శ్రమిస్తున్నారు. ఉపాధ్యాయులు రోజూ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ఉద యం 8 గంటలకే పదో తరగతి విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయి. ప్రత్యేక తరగతులు నిర్వహించే సమయంలో రాత్రి 9 గంటల వరకు విద్యార్థులతో చదివిస్తారు. రోజూ ఇద్దరు ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులను పర్యవేక్షిస్తారు. దీంతో విద్యార్థులంతా ఉత్తీర్ణులవడమే కాకుండా మంచి మార్కులు సాధించగలుగుతున్నారు. -
పట్టాలకు సిఫారసు చేయాలి
లింగంపేట: భూభారతి చట్టం ప్రకారం భూ ముల వివరాలు సేకరించి ఎలాంటి సమస్యల కు తావులేకుండా ఉన్నట్లయితే పట్టాలకు సిఫారసు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ముంబోజీపేట, నల్లమడుగు గ్రామాలకు చెందిన రైతులు రెవెన్యూ సదస్సుల్లో ఽఇచ్చిన దరఖాస్తులను మంగళవా రం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులతో మాట్లాడి సర్వే నంబర్లు, భూ విస్తీర్ణం, సా గు చేస్తున్న రైతుల సంఖ్య, ఎన్నేళ్ల నుంచి సాగు లో ఉన్నారు అన్న వివరాలను తెలుసుకున్నా రు. సదరు భూములు అటవీ ప్రాంతమా లేక పట్టా భూములా అని అటవీ శాఖ, రెవెన్యూ శా ఖ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి పరిశీలించాలని ఆదేశించారు. అనంతరం భవానీపేటలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోళ్ల వివరాలు, రైతులకు కల్పించిన వసతుల గురించి తెలుసుకున్నారు. ధాన్యం తూకాలను వేగవంతం చేయాలని నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదన పు కలెక్టర్ విక్టర్, భూభారతి ప్రత్యేకాధికారి రా జేందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి’
బాన్సువాడ రూరల్ : ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే వి ధంగా పోలీస్ సేవలు ఉండాలని ఎస్పీ రాజేశ్ చంద్ర సూచించారు. మంగళవారం ఆయన బాన్సువా డ, బీర్కూర్ పోలీస్స్టేషన్లను తనిఖీ చేశారు. రికార్డులతోపాటు పలు విభాగాలను పరిశీలించారు. రో జూ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆధారంగా పనిచేయాలని సి బ్బందికి సూచించారు. కేసుల దర్యాప్తులో నాణ్యత కు ప్రాధాన్య ఇవ్వాలన్నారు. డయల్ 100 కాల్స్కు బ్లూకోల్ట్స్ సిబ్బంది వెంటనే స్పందించాలన్నారు. ఆన్లైన్ బెట్టింగ్స్, సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజలపై రోడ్డు భ ద్రత నియమాలపై అవగాహన కల్పించాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని సూచించారు. గ్రామ పోలీసు అ ధికారి తరచూ తమ గ్రామాలను సందర్శించి ప్రజ లను చైతన్య పర్చాలన్నారు. ఏవైనా సమస్యలుంటే పై అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సీఐ అశోక్, సిబ్బంది పాల్గొన్నారు. -
బడిలో సెల్పై ఆంక్షలు!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఉచ్ఛతర ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు అన్నీ కలిపి 1,011 ఉన్నాయి. వాటిలో దాదాపు లక్ష మంది విద్యార్థులు చదువుతున్నారు. 4 వేల పైచిలుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. చాలామంది ఉపాధ్యాయులు బాధ్యతగా పనిచేస్తూ, తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అయితే కొద్దిమంది మాత్రమే విధులు ఎగ్గొడుతూ యూనియన్ రాజకీయాలు, సొంత వ్యాపారాలతో బిజీగా ఉంటున్నారు. స్కూల్కు వచ్చినా నిరంతరం ఫోన్లో మునిగితేలుతున్నారు. పేరెంట్స్ స్కూల్కు వెళ్లినపుడు కొందరు టీచర్లు సెల్ఫోన్ సంభాషణలు, చాటింగ్లతో కాలక్షేపం చేస్తుండడాన్ని చూసి తల్లిదండ్రులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి కొందరి మూలంగా ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం సడలుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు బడిలో సెల్ఫోన్ వాడకంపై ఆంక్షలు విధించేందుకు చర్యలు చేపట్టారు. ఇటీవల జరిగిన విద్యాశాఖ అధికారుల సమావేశంలో తరగతి గదిలో ఏ ఉపాధ్యాయుడు కూడా సెల్ఫోన్ వాడకూడదంటూ ఆదేశాలు ఇవ్వాలని, ఆకస్మిక తనిఖీలు చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొందరి వల్ల చెడ్డపేరు.. ఉపాధ్యాయుల్లో చాలా మంది విధ్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు శ్రమిస్తున్నారు. కొందరైతే ప్రత్యేక తరగతులు కూడా తీసుకోవడం, విద్యార్థులను వారికి ఇష్టమైన రంగాల్లో ప్రోత్సహించడం ద్వారా వారిలోని నైపుణ్యాన్ని వెలికితీస్తూ వారికి వెన్నంటూ నిలుస్తున్నారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పరిశోధనల్లో దూసుకుపోతున్నారు. ఆటలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ సత్తా చాటుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకన్నా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ఆయా రంగాల్లో సక్సెస్ అవుతున్నారు. వారికి గైడ్గా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులు చేస్తున్న శ్రమ వల్లే విద్యార్థులు రాణిస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు చిన్నచిన్న అవసరాలకు సొంతంగా డబ్బులు ఖర్చు చేసేవారు ఉన్నారు. అయితే ఇంత కష్టపడుతున్న ఉపాధ్యాయులు ఒకవైపు ఉంటే, కొందరు మాత్రం బడులకు రాకుండా రాజకీయాలతో కాలక్షేపం చేస్తూ విధులను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒకరిద్దరు డుమ్మాల మాస్టర్లు, బిజినెస్ టీచర్ల ధోరణితో మిగతావారికీ చెడ్డపేరు వస్తోంది. ఆ కొందరిపై అధికారుల అజమాయిషీ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందనే భావన అందరిలోనూ ఉంది. అధికారులను మేనేజ్ చేసుకుని బడికి డుమ్మా కొట్టి సొంత వ్యాపకాల్లో మునిగిపోయి కొందరు, బడికి వచ్చినా తమ వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాలపై సెల్ఫోన్లలో నిమగ్నమవుతూ మరికొందరు ఉంటున్నారు.సెల్ వద్దంటే ఎలా?బడిలో సెల్ఫోన్ వాడొద్దన్న విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలపై ఉపాధ్యాయులు భి న్నంగా స్పందిస్తున్నారు. సెల్ఫోన్ వాడకుండా ఉండడమే మంచిదని కొందరు అంటుండగా, మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. కు టుంబ సభ్యుల నుంచి అత్యవసర పరిస్థితుల్లో కాల్ వస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే స్కూల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించి విద్యార్థుల హాజరు విషయంలో ఫేస్ రికగ్నైజేషన్కు సెల్ఫోన్ వాడాల్సి ఉంటుందని, చాలా స మాచారం ఫోన్ల ద్వారానే పంపుతామని పే ర్కొంటున్నారు. సెల్ఫోన్ వాడద్దంటే ఈ పనులన్నీ ఎలా చేయాలన్న ప్రశ్నలు ఉత్పన్నమవు తున్నాయి. ఫేస్ రికగ్నైజేషన్, ఆన్లైన్ వర్క్స్ కోసం ట్యాబ్లు గానీ, ఇతర పరికరాలుగానీ అందిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సెల్ఫోన్ వాడొద్దంటూ విద్యాశాఖ ఆదేశాలు అతిక్రమించేవారిపై చర్యలు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమలులోకి.. ఉపాధ్యాయుల్లో భిన్నాభిప్రాయాలు బడిలో సెల్ఫోన్ వినియోగంపై ఆంక్షలు విధించాలని విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరంనుంచి ఇది అమలులోకి రానుంది. తరగతి గదిలో సెల్ఫోన్ వినియోగించకుండా చూడాలని ఇప్పటికే విద్యాశాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. జిల్లా అధికారులు స్కూళ్లను తనిఖీ చేసి, సెల్ఫోన్ వాడే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది. దీంతో ఉపాధ్యాయుల్లో బడిలో సెల్ వాడకంపై చర్చ నడుస్తోంది. -
ఫార్మర్ రిజిస్ట్రీ ప్రారంభం
కామారెడ్డి రూరల్: కేంద్ర ప్రభుత్వం చేపట్టి న ‘ఫార్మర్ ఐడీ’ ప్రాజెక్టు అమలులో భాగంగా సోమవారం చినమల్లారెడ్డి క్లస్టర్ పరిధి లోని పాతరాజంపేటలో రైతుల నమోదు కా ర్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కామారె డ్డి ఏడీఏ అపర్ణ మాట్లాడుతూ ప్రతి రైతు నుంచి వివరాలు సేకరించి ప్రత్యేక డిజిటల్ కార్డులను జారీ చేస్తామన్నారు. భవిష్యత్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసే రైతు సంక్షేమ పథకాలకు ఈ కార్డు ప్రామాణికం కానుంద న్నారు. రైతులందరూ వివరాలు నమోదు చే సుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పవన్ కుమా ర్, ఏఈవో శ్రీనివాస్రెడ్డి, సొసైటీ డైరెక్టర్ బ క్కన్నగారి రాజు, రైతులు నరేష్, రాజయ్య, లక్ష్మణ్, బాల్కిషన్ తదితరులు పాల్గొన్నారు. -
నగలు, నగదు కోసం కొన్ని..
● వివాహేతర నంబంధాల నేపథ్యంలో మరికొన్ని.. ● సమాజంలో పెరుగుతున్న నేర ప్రవృత్తి ● ఆందోళన కలిగిస్తున్న ఘటనలుజిల్లాలో ఇటీవలి కాలంలో హత్యల పరంపర కొనసాగుతోంది. సగటున వారానికో హత్య జరుగుతోంది. చాలా కేసుల్లో అయిన వారే హంతకులుగా తేలుతున్నారు. కొన్ని సంఘటనల్లో నగలు, నగదుకోసం, మరికొన్ని సంఘటనలు వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరుగుతున్నట్టు తెలుస్తోంది. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : నేరస్తులకు శిక్షలు పడుతున్నా సమాజంలో నేర ప్రవృత్తి తగ్గడంలేదు. పైపెచ్చు మరింతగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి మే 1 వరకు జిల్లాలో 16 హత్యలు జరిగాయి. అంటే వారానికొక హత్య జరిగినట్లు స్పష్టమవుతోంది. గతేడాది కూడా వారానికొకరు అన్నట్టుగానే 47 మంది హత్యకు గురయ్యారు. కొన్ని సంఘటనల్లో నిందితులు ఎలాంటి క్లూ దొరక్కుండా జాగ్రత్త పడ్డా.. పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ హత్య కేసులను తేలుస్తున్నారు. కొన్ని కేసుల్లో ఒకటి రెండు రోజుల్లోనే నేరస్తులు చిక్కుతున్నారు. కొన్ని హత్యలు వివాహేతర సంబంధాల నేపథ్యంలో జరిగినట్టు స్పష్టమవుతుండగా, మరికొన్ని నగలు, నగదు, ఆస్తి వంటి విషయాల్లో జరుగుతున్నాయి. కాగా కొన్ని కేసుల్లో కుటుంబ సభ్యులు, రక్త సంబంధీకులే హంతకులుగా తేలుతున్నారు. ఇటీవల మాచారెడ్డి మండలం ఘన్పూర్(ఎం) గ్రామానికి చెందిన కుమార్ అనే యువకుడిని ఫరీదుపేట శివారులో వెంబడించి ఇనుపరాడ్లు, గొడ్డలితో దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో రోడ్డు మీదుగా వెళ్లేవారు గమనించడంతో దాడి చేసిన వ్యక్తులు పారిపోయారు. తీవ్ర గాయాలపాలైన కుమార్ను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ కేసును విచారించిన పోలీసులు బాధితుడి భార్యనే కుట్రదారుగా తేల్చారు. సుఫారీ ఇచ్చి భర్త హత్యకు కుట్ర పన్నినట్టు తేల్చి భార్యతో పాటు పలువురు నిందితులను హత్యాయత్నం కేసులో అరెస్టు చేశారు. ఇలాంటి సంఘటనలు సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాల్లోనే ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. అలాగే నగలు, నగదు కోసం కూడా హత్యలకు పాల్పడుతున్నారు. -
ఎల్ఆర్ఎస్కు స్పందన అంతంతే!
● ముగిసిన గడువు ● 30 శాతం కూడా స్పందించని దరఖాస్తుదారులుకామారెడ్డి టౌన్ : అక్రమ లేఅవుట్లు, అనధికార ప్లాట్ల క్రమబద్ధీకరణకోసం దరఖాస్తుదారుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే వచ్చింది. ఎల్ఆర్ఎస్పై 25 శాతం రాయితీ అవకాశం కల్పించినా దరఖాస్తుదారులు పెద్దగా పట్టించుకోలేదు. మూడు బల్దియాల పరిధిలో 20,500 దరఖాస్తులు రాగా.. 5,166 మంది మాత్రమే స్పందించారు. ఎల్ఆర్ఎస్ కోసం 2020లో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. జిల్లాలోని మూడు ము న్సిపాలిటీలకు సంబంధించి ఎల్ఆర్ఎస్ కోసం 20,500 దరఖాస్తులు వచ్చాయి. ఆ భూములను క్ర మబద్ధీకరించడం కోసం ప్రభుత్వం మార్చిలో 25 శాతం రాయితీ కల్పిస్తూ ఎల్ఆర్ఎస్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఆ గడువు మార్చి నెలాఖరు తో ముగిసినా దరఖాస్తుదారులు పెద్దగా స్పందించలేదు. దీంతో ప్రభుత్వం గడువును రెండోసారి పొడిగించింది. ఏప్రిల్ 30 వరకు గడువు ఇచ్చినా ఫలి తం లేకపోయింది. చివరిసారిగా ఈనెల 3వ తేదీ వరకు గడువును పొడిగించినా నామమాత్రపు స్పందనే వచ్చింది. గడువు ముగిసే నాటికి 5,166 మంది ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించారు. ఇందులో 1,755 దరఖాస్తులను పరిష్కరించి క్రమబద్ధీకరిస్తూ ప్రొసిడింగ్ పత్రాలను అందజేశారు. ఎల్ఆర్ఎస్ ద్వారా మూడు బల్దియాలకు కలిపి రూ. 12.16 కోట్ల ఆదా యం మాత్రమే సమకూరింది.క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నాం దరఖాస్తుదారులందరికి ఫోన్ల ద్వారా సమాచారం ఇచ్చాం. అయినా ఎల్ఆర్ఎస్కు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. గడువులోపు ఫీజు చెల్లించిన వారి దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తూ, పరిష్కరిస్తున్నాం. –గిరిధర్, టీపీవో, కామారెడ్డి3475,1664,580ఫీజు చెల్లించినవారు23910.88 కోట్లుఆదాయం (రూ.లలో) 38 లక్షలు90 లక్షలు12.16 కోట్లుస్పందన ఎందుకు లేదంటే..ఎల్ఆర్ఎస్ ఫీజులో 25 శాతం రాయితీ అవకాశం ఇచ్చినా దరఖాస్తుదారులు ఎందుకు స్పందించడం లేదోన్న విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలలో ఎల్ఆర్ఎస్ కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నవారిలో చాలామంది ఆ ఫ్లాట్లను ఇతరులకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. మరికొందరు విస్తీర్ణం తక్కువగా ఉన్న ప్లాట్లలో ఎల్ఆర్ఎస్ లేకున్నా నిర్మాణాలు చేసుకున్నారు. మరికొంత మంది ఆర్థిక సమస్యలతో ఫీజు కట్టడానికి ముందుకు రాలేకపోయారు. ఇంకొందరు ఫ్లాట్లలో ఇల్లు కుట్టుకునే ఉద్దేశం లేదని, వాటిని ఎప్పటికై నా ఇతరులకు విక్రయించేదే కదా అన్న ఉద్దేశంతో ఎల్ఆర్ఎస్కు ముందుకు రాలేదని తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ దందాలో స్తబ్ధత నెలకొనడంతోనూ ఎల్ఆర్ఎస్కు ఆశించిన స్పందన లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
విద్యార్థులకు సన్మానం
కామారెడ్డి క్రైం : బీసీ సంక్షేమ గురుకుల పా ఠశాలల్లో చదివి పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థు లను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం త న చాంబర్లో సన్మానించారు. విద్యార్థులు బామన్ రమేష్, పైడి మౌర్యానంద్ రెడ్డి, శ్రీ చైతన్య, మంజ్యా శివ, గాదె అనిరుధ్, రక్షితలను అభినందించారు. భవిష్యత్తులో మరి న్ని విజయాలు సాధించి ఉన్నత స్ధానాలకు చేరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆ యా గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యా యులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ‘కొనుగోళ్లను వేగవంతం చేయాలి’ రామారెడ్డి: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఐకేపీ డీపీఎం రమేష్బాబు సూ చించారు. రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి, మోషంపూర్లలో ఏర్పాటు చేసిన ధా న్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. రామారెడ్డిలో స్ట్రిచ్చింగ్ సెంటర్ ను పరిశీలించారు. నిర్వాహకులకు పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీఎం ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘రైతులు అధైర్యపడొద్దు’ బీబీపేట: అకాల వర్షాలతో తడిసిపోయిన ప్రతి గింజను సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడొద్దని డీఆర్డీవో సురేందర్ పేర్కొన్నారు. సోమవారం ఉప్పర్పల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని ఐకేపీ డీపీఎం రమేష్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్లను కొనుగోలు చేసిన వెంటనే త్వరగా ట్యాబ్ ఎంట్రీ చేయాలన్నారు. అకాల వర్షాలు కురుస్తున్నందున వడ్లపై కవర్లను కప్పి ఉంచుకోవాలని రైతులకు సూచించారు. ఆయన వెంట ఏపీఎం బాలపోచయ్య, సీసీలు బాల్చంద్రం, నవీన్, శ్రీనివాస్, రాజేశ్వర్రెడ్డి ఉన్నారు. ‘దోస్త్’ కోసం హెల్ప్లైన్ సెంటర్ కామారెడ్డి అర్బన్: దోస్త్ (డిగ్రీ అన్లైన్ సర్వీసెస్, తెలంగాణ) రిజిస్ట్రేషన్లో విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. దోస్త్కు తాను జిల్లా హెల్ప్లైన్ సెంటర్ చైర్మన్గా, అధ్యాపకుడు విశ్వప్రసాద్ సమన్వయకర్తగా, అనిల్కృష్ణ, అజారుద్దీన్ సహాయకులుగా ఉంటారని పేర్కొన్నారు. దోస్త్లో ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇతర రాష్ట్రాల విద్యార్థుల మార్కుల జాబితా, మొబైల్ నంబర్లు తదితర అంశాలపై తలెత్తే సమస్యలను గ్రీన్ చానల్ ద్వారా వెంటవెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఆర్ట్స్ కళాశాలను ఎంపిక చేసుకోండి విద్యార్థులు డిగ్రీలో ప్రవేశం కోసం కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కళాశాల ప్రిన్సిపల్ విజయ్కుమార్ కోరారు. తమ కళాశాలలో రాష్ట్రంలో ఎక్కడా లేని ప్రత్యేక కోర్సులున్నాయన్నారు. ఇక్కడ చదివినవారు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, గ్రూప్ వన్ అధికారులు గా, ప్రొఫెసర్లుగా, అధ్యాపకులుగా, ఆర్మీ, పోలీస్, సాఫ్ట్వేర్, బ్యాంకింగ్ రంగాలలో మంచి స్థానాలలో ఉన్నారని పేర్కొన్నారు. కళాశాలలో చేరాలని విద్యార్థులను కోరారు. 15 లోగా దరఖాస్తు చేసుకోవాలి నిజామాబాద్ అర్బన్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్కు సంబంధించిన ప్రవేశ పరీక్ష కోసం ఈనెల 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నిజామాబాద్ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. వచ్చేనెల 25న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. -
మాతాశిశు సంరక్షణ కార్డుల కొరత
బిచ్కుంద : మహిళలు గర్భందాల్చినప్పటి నుంచి బిడ్డకు ఐదేళ్లు వచ్చేవరకు ఇచ్చే టీకాలు, ఎదురైన ఆరోగ్య సమస్యలు, వైద్య పరీక్షల వివరాలను న మోదు చేయడం కోసం ప్రభుత్వం మాతాశిశు సంరక్షణ సమాచార కార్డులను అందిస్తుంది. కానీ జిల్లా లో ఏడు నెలలుగా ఈ కార్డుల సరఫరా లేదు. దీంతో గర్భిణులు, వైద్యులు ఇబ్బందులు పడుతున్నా రు. ఏడు నెలలుగా కార్డులు లేకపోవడంతో గర్భిణులకు అందించిన వైద్య సేవల వివరాలు తెలుసుకోలేకపోతున్నారు. కార్డులు ఎందుకంటే.. మాతాశిశు సంరక్షణ కార్డులతో గర్భిణులు, బాలింతలు, పిల్లలు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. మహిళలు ముందుగా అంగన్వాడీ టీచర్, ఏఎన్ఎం వద్దకు వెళ్లి గర్భందాల్సిన తేదీ, నెల నమోదు చేసుకోవాలి. వారు వివరాలు నమోదు చేసుకున్న వెంటనే మాతా శిశు సంరక్షణ కార్డు అందిస్తారు. అందులో గర్భిణి పేరు, ఆధార్ కార్డు, ప్రతి నెల వై ద్య పరీక్షలు చేసిన వివరాలు, హిమోగ్లోబిన్ శాతం, బీపీ, మూత్ర పరీక్షలు, బరువు, ఎత్తు, అంగన్వాడీ ద్వారా తీసుకుంటున్న పౌష్టికాహారం, బిడ్డ ఎదుగుదల చెప్పే స్కానింగ్ రిపోర్టుల వివరాలు నమోదు చేస్తారు. అలాగే జన్మించిన బిడ్డకు 5 ఏళ్ల వయస్సు వరకు ఇవ్వాల్సిన టీకాలతోపాటు ఇతర వివరాలుంటాయి. గర్భిణులకు ఈ కార్డు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయి. ఇన్ని ఉపయోగా లు ఉన్న కార్డులను అందించడంలో అధికారులు అ లసత్వం వహిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొంద రు గర్భిణులు కార్డు జిరాక్స్లు తీసుకొని వివరాలు నమోదు చేయించుకుంటున్నారు. మాతా శిశు సంరక్షణ బుక్లెట్ కార్డు జిరాక్స్ కోసం 150 రూపాయ లు తీసుకుంటున్నారని పలువురు తెలిపారు. ప్రస్తు తం జిల్లాలో 14,800 మంది గర్భిణులు ఉన్నారు. మాతాశిశు సంరక్షణ కార్డులు లేవన్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని పీహెచ్సీల వైద్యాధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం కార్డులను పంపించగానే పీహెచ్సీలు, సబ్ సెంటర్లకు పంపిస్తామంటున్నారు. జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారులు స్పందించి కార్డులు తెప్పించి గర్భిణులకు అందించాలని ప్రజలు కోరుతున్నారు. 7 నెలలుగా నిలిచిన సరఫరా ఇబ్బందులు పడుతున్న గర్భిణులు, వైద్యులు -
స్వల్పంగా కంపించిన భూమి
కామారెడ్డి అర్బన్/మాచారెడ్డి: జిల్లాలోని పలు ప్రాంతాలలో భూమి స్వల్పంగా కంపించింది. కామారెడ్డి పట్టణంతోపాటు మాచారెడ్డి మండలంలోని సోమారంపేటలో సోమవారం సాయంత్రం భూకంపం వచ్చిందని ప్రజలు తెలిపారు. భూమి లోపలనుంచి పెద్దగా శబ్దాలు వచ్చాయని, భూమి కదిలినట్లు అనిపించిందని పేర్కొన్నారు. దీంతో ఇళ్లలోనుంచి బయటికి పరుగులు తీశామన్నారు. జిల్లా కేంద్రంలో భూకంపం వచ్చిన సమయంలోనే ఆకాశంలో ఉరుములు, మెరుపులు వచ్చాయి. నిజామాబాద్ జిల్లాలో.. సిరికొండ/మోర్తాడ్ : నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం స్వ ల్పంగా భూమి కంపించిందని ప్రజలు తెలిపా రు. సిరికొండ మండల కేంద్రంతోపాటు మైలారం, నర్సింగ్పల్లి, చీమన్పల్లి, చిన్నవాల్గోట్, రావుట్ల, కుర్దుల్పేట్, హుస్సేన్నగర్లతోపాటు మోర్తాడ్, కమ్మర్పల్లి, భీమ్గల్, మెండోరా మండల కేంద్రాల్లో స్వల్పంగా భూమి కంపించిందని పేర్కొన్నారు. కొన్ని నెలల క్రితం భీమ్గల్, మెండోరా మండలాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. -
సన్న రకాలకు అందని బోనస్
బాన్సువాడ : జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ ఊపందుకుంది. మరో వారం, పది రోజుల్లో కొనుగోళ్లు చివరి దశకు చేరనున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో ధాన్యంకు సంబంధించి డబ్బులు జమ అవుతున్నా..బోనస్ మాత్రం జమ కావడం లేదు. జిల్లాలో ఈ యాసంగిలో 2.61.110 ఎకరాల్లో వరి సాగుచేశారు. ఇందులో సన్నరకాలు 57.445 ఎకరాల్లో సాగయ్యాయి. జిల్లాలో 1.32 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం దిగుబడులు వచ్చాయి. గత నెల ఏప్రిల్ మొదటి వారం నుంచే జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. బాన్సువాడ డివిజన్లోనే మొదటగా వరి నాట్లు వేస్తారు. కొనుగోళ్లు కూడా ముందే ప్రారంభించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సన్న, దొడ్డు రకాలకు సంబంధించి 2.06.750 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. సేకరించిన ధాన్యానికి సంబంధించి రైతుల ఖతాల్లో రూ. 310 కోట్లు జమ చేశారు. సన్నరకం ధాన్యానికి ఇప్పటికి బోనస్ చెల్లించకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పాలకులు, అధికారులు స్పందించి సన్నరకం విక్రయించిన రైతులకు బోనస్ చెల్లించాలని కోరుతున్నారు. 57.445 ఎకరాల్లో సన్నరకం సాగు చేసిన రైతులు రైతులకు తప్పని ఎదురుచూపులు రాని బోనస్ డబ్బులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాం. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించడంతో చాల మంది రైతులు సన్నరకం ధాన్యం పండించారు. ధాన్యంకు సంబంధించిన డబ్బులు ఖాతాల్లో జమ అయ్యాయి. బోనస్ డబ్బులు మాత్రం పడలేదు. –వెంకటి రైతు,బాన్సువాడ బోనస్ ఇస్తామంటేనే సన్నరకం సాగు చేశాం ధాన్యంకు సంబంధించిన డబ్బులతో పాటే బోనస్ ఖాతాల్లో జమ చేయాలి. ధాన్యం కొనుగోళ్లు పూర్తియ్యాయి. కానీ బోనస్ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. బోనస్ ఇస్తామంటేనే సన్నరకం వడ్లు సాగు చేశాం. –సాయిలు రైతు,బాన్సువాడ -
ఫేక్ కాల్ చేసిన ఒకరి రిమాండ్
ఖలీల్వాడి: నగరంలోని రైల్వేస్టేషన్లో బాంబు పెట్టినట్లు ఫేక్ కాల్ చేసిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. ఈ నెల 2న రాత్రి 7.41 గంటలకు రైల్వే స్టేషన్లో బాంబు పెట్టినట్లు డయల్ 100కు కాల్ వచ్చిందన్నారు. వెంటనే డాగ్ స్క్వాడ్, బీడీ టీం, సిబ్బందితో కలిసి రైల్వేస్టేషన్లో అన్ని ప్రాంతాలను పరిశీలించి ఫేక్ కాల్గా గుర్తించామన్నారు. డయల్ 100కి కాల్ చేసిన వ్యక్తిని రంగారెడ్డి జిల్లా కీసర మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన శ్రీమంత్ గౌడ్గా గుర్తించి, పట్టుకున్నట్లు తెలిపారు. వ్యక్తిగత సమస్యలుండడంతో ప్రజలను భయాందోళనకు గురిచేసి హింసను ప్రేరేపించాలని దురుద్దేశంతో కాల్ చేశానని విచారణలో వెల్లడైందన్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించామన్నారు. వామ్మో.. ఎంత పెద్ద పాము రుద్రూర్: మండలంలోని చిక్కడపల్లి గ్రామ శివారులో ఉపాఽ ది పనులు చేస్తున్న ప్రదేశంలో సోమవారం తాటి జెర్రి పాము ప్రత్యక్షమైంది. పామును చూ సిన ఉపాధి కూలీలు భయాందోళనకు గురయ్యారు. హన్మ య్య అనే వ్యక్తి చాకచాక్యంగా పామును చంపివేయడంతో అంతా ఊపీరిపీల్చుకున్నారు. పాము పొడవు పది ఫీట్ల వరకు ఉంటుందని ఉపాధి కూలి సాయన్న తెలిపారు. -
ప్రజావాణికి అధికారులు డుమ్మా
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ తహసీల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి తహసీల్దార్ సవాయిసింగ్, వ్యవసాయశాఖ ఏవో నవ్య హాజరయ్యారు. మిగితా ఎంపీడీవో అనిత, ఐసీడీఎస్ సూపర్ వైజర్ రాజేశ్వరితో పాటు వివిదశాఖల అధికారులు ప్రజవాణికి గైర్హాజరయ్యారు. నేడు, రేపు కోర్టు విధులకు దూరంగా న్యాయవాదులు కామారెడ్డి టౌన్: హైకోర్టు న్యాయ మూర్తి జ స్టిస్ ప్రియదర్శిని, కామారెడ్డి సీనియర్ న్యాయ వాది మోహనరావుల మృతికి సంతాపంగా జిల్లా కోర్టులో మంగళవారం, బుధవారం విధులకు దూరంగా ఉంటున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నంద రమేష్,సురేందర్రెడ్డిలు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం బార్ అసోసియేషన్ భవనంలో జరిపే సంతాప సభకు న్యాయవాదులు హాజరుకావాలని కోరారు. సైబర్ నేరాలపై అవగాహన రాజంపేట : మండల కేంద్రంలో సోమవారం కామారెడ్డి పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో సైబర్ క్రైం, రోడ్డు ప్రమాదాలపై కళాజాత కార్యక్రమాన్ని నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, సైబర్ క్రైం నేరాలపై అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై పుష్పరాజ్, కళాజాత బృందం సభ్యులు తిరుపతి, ప్రభాకర్, శేషారావ్, సాయిలు పాల్గొన్నారు. గాలికుంటు నివారణ టీకాలను వేయించాలి తాడ్వాయి(ఎల్లారెడ్డి): రైతులు తమ పశువులకు తప్పనిసరిగా గాలికుంటూ వ్యాధి నిరోధక టీకాలను వేయించాలని మండల పశువైద్యాధికారి రమేశ్ అన్నారు. మండలంలోని కరడ్పల్లి గ్రామంలో సోమవారం ఆవులు, గేదేలకు గాలికుంటూ నివారణ టీకాలను వైద్య సిబ్బంది వేశారు. కార్యక్రమంలో పాలకేంద్రం అధ్యక్షుడు నారాయణరెడ్డి, వీఎల్వో పోచయ్య, జేవీవోలు కొండల్రెడ్డి, ప్రేంసింగ్, గోపాల మిత్రలు మహిపాల్రెడ్డి, ఎల్లయ్య, కిష్టయ్య, రైతులు పాల్గొన్నారు. -
రెండేళ్లయినా అందని సీఎం రిలీఫ్ ఫండ్
కామారెడ్డి అర్బన్: పట్టణంలోని ఆర్బీ నగర్కి చెందిన కుతాడి ఎల్లవ్వది నిరుపేద కుటుంబం. ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలున్నారు. ఎల్లవ్వకు 2022 లో నిత్యం బ్లీడింగ్ సమస్య రక్త హీనతతో పాటు బోన్ మ్యారో వ్యాధి వచ్చింది. భర్త కుతాడి ప్రశాంత్ హైదరాబాద్లోని కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించగా రూ.2.17 లక్షల వరకు ఖర్చు అయింది. దీంతో ఆకుటుంబం తీవ్ర ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతుంది. ఎల్లవ్వ భర్త 2023 ఫిబ్రవరిలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేశాడు. ఇప్పటివరకు మంజూరు కాలేదు. స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణరెడ్డి, ఉన్నతాధికారులను సైతం కలిసి విజ్ఞప్తి చేసిన ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ మంజూరు కాలేదు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి తమ ఆదుకోవాలని ఎల్లవ్వ భర్త ప్రశాంత్ కోరుతున్నాడు. అనారోగ్యంతో పాటు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఓ కుటుంబం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పట్టించుకోవాలని వేడుకోలు -
నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు
భిక్కనూరు: నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చెప్పారు. సోమవారం మండలంలోని తిప్పాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ప్రాణహిత చేవెళ్ల పథకం ద్వారా పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ. 23 కోట్లను మంజూరు చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలో ఉన్న పలు సమస్యలను షబ్బీర్ అలీకి వివరించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ విభాగం ఉప అధ్యక్షులు కుంట లింగారెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ స్వామి, వీడీసీ అధ్యక్షుడు కొండ సిద్దరాములు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ధర్మయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 96 వినతులు వచ్చాయి. వాటిలో ఎక్కువగా భూ సమస్యలు, డబుల్ బెడ్రూం ఇళ్లు, రైతు భరోసా, పింఛన్లు మంజూరు తదితర అంశాలపై ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులను పెండింగ్లో ఉంచరాదన్నారు. వెంటనే పరిష్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. సాధ్యాసాధ్యాల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తీసుకున్న చర్యలపై దరఖాస్తు దారునికి సమాచారం అందించాలని తెలిపారు. ఈకార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్, ఆర్డీవో వీణ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రజావాణికి 96 వినతులు -
ఉబ్బసంతో ఉక్కిరిబిక్కిరి
జిల్లాలో ఆస్తమా బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఆస్తమా వాయునాళాలకు సంబంధించిన వ్యాధి. నాళాలకు వాపు రావడంతో జిగురుగా ఉండే పదార్థం(శ్లేష్మం) తయారవుతుంది. దీంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. దుమ్ము, పుష్పాల దూళి, గాలి కాలుష్యం, పరిశ్రమల నుంచి విడుదలయ్యే రసాయనాలు, చల్లటి, పొడి గాలులు ఆస్తమా బారిన పడేందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కొంతమందిలో ఆస్తమా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. గుర్తించండి ఇలా.. సాధారణ పనులు, వ్యాయామం చేయడంలో ఇబ్బందులు ఏర్పడుతాయి. ఛాతి బిగపట్టినట్లు ఉంటుంది. విపరీతంగా దగ్గు వస్తుంది. నడిచినా, మెట్లెక్కినా త్వరగా అలసిపోతారు. వ్యాధిగ్రస్తులకు జాగ్రత్తలు.. పొగ తాగడం మానేయాలి. ఇతరులు తాగితే దూ రంగా ఉండాలి. దుమ్ము, ధూళి, చల్లని ప్రదేశాల్లో సంచరించొద్దు. పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. విటమిన్ ‘డి’ సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి. ఏం తినాలి? ఏం తినొద్దు? విటమిన్ ‘ఏ’ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి.ప్రధానంగా క్యారెట్లు, పాలకూర, చిలగడదుంప, చేప, పాల ఉత్పత్తులు, గుడ్లు తినాలి. మాంసం, చీజ్, ఐస్క్రీమ్, పాలకొవ్వు వంటి సంతృప్త ఆమ్లాలను నివారించాలి. వీటితో వాపు పెరిగి ఇబ్బందులు కలుగుతాయి. కొబ్బరి నూనె, పామ్ఆయిల్తో చేసిన ఆహారంతో ఆస్తమా పెరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు పాటిస్తే ఉపశమనం నేడు ప్రపంచ ఆస్తమా దినోత్సవం వాతావరణంలోని అలర్జీ కలిగించే పదార్థాల కారణంగానో.. వంశపారంపర్యంగానో వచ్చే ఉబ్బసం(ఆస్తమా) వ్యాధి మనిషిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఊపిరి తీసుకోవడం కష్టతరమవుతోంది. దీంతో రోజూవారీ జీవితం ప్రభావితమవుతోంది. దీనికి శాశ్వత పరిష్కారం లేనప్పటికీ.. సమర్థవంతమైన చికిత్స, మందుల వాడకంతో సంతృప్తికరంగా జీవించొచ్చని ప్రముఖ పల్మనాలజిస్టు రాజేంద్రప్రసాద్ తెలిపారు. నేడు ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. – నిజామాబాద్ నాగారం భయపడొద్దు.. ఆస్తమా అనేది దీర్ఘకాలిక వ్యాధి. భయపడాల్సిన అవసరం లేదు. వైద్యుల సలహాలు, సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార నియమాలు పాటిస్తే వ్యాధిని తరిమికొట్టవచ్చు. వైద్యులు సూచించిన మందులతోపాటు ఇన్హెలర్ వాడాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. దుమ్ము, ధూళి, చల్లని ప్రదేశాల్లో తిరుగొద్దు. – డాక్టర్ బొద్దుల రాజేంద్రప్రసాద్, ప్రముఖ పల్మనాలజిస్ట్ -
ఆదర్శంగా ప్రభుత్వ, గురుకుల పాఠశాలలు
ఎల్లారెడ్డిరూరల్: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలతో పాటు ప్రభుత్వ గురుకుల పాఠశాలలు పదో తరగతి ఫలితాలలో వంద శాతం ఉత్తీర్ణతను సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభమైననాటి నుంచి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉపాధ్యాయులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేస్తున్నారు. ఎల్లారెడ్డి మండలంలో మూడు జెడ్పీ, ఒక గురుకుల పాఠశాలలో వంద శాతం ఫలితాలు జిల్లాలో ఈఏడాది పదోతరగతి ఫలితాలలో వంద శాతం ఉత్తీర్ణతను 146 పాఠశాలలు సాధించాయి. వీటిలో జిల్లా పరిషత్ పాఠశాలలు 71, ప్రైవేటు పాఠశాలలు 45, కేజీబీవీలు 11, బీసీ వెల్ఫేర్ 07, మైనార్టీ రెసిడెన్షియల్ 02, సోషల్ వెల్ఫేర్ 03, ట్రైబల్ వెల్పేర్ 02,ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 03, మోడల్స్కూళ్లు 02 వంద శాతం ఫలితాలను సాధించాయి. ఎల్లారెడ్డి మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గత 9 ఏళ్లుగా వంద శాతం ఫలితాలను సాధిస్తోంది. ప్రఽ దానోపాధ్యాయులు బదిలీ అయినప్పటికి అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. అన్నాసాగర్ జెడ్పీ పాఠశాలలో 2015వ సంవత్సరం నుంచి వరుసగా వంద శాతం ఫలితాలు సాధిస్తున్నారు. వీరితో పా టు మండలంలోని వెల్లుట్ల జెడ్పీ పాఠశాల సైతం వరుసగా రెండోసారి పదో తరగతిలో వంద శాతం ఫలితాలను సాధించింది. గిరిజన బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థినులు సైతం వంద శాతం ఫలితాలను సాధించారు. ప్రతి పాఠానికి సంబంధించిన అంశాలను రోజు వారీగా స్లిప్ టెస్టు లు పెట్టి పాఠానికి సంబంధించిన జవాబులు నేర్చుకునేలా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. రాత్రి పది గంటల వరకు చదవడంతో పాటు ఉదయం 5 గంటలనే నిద్ర లేచే వేకప్ కాల్ విధానంతో విద్యార్థులకు చదువుపై ఆసక్తిని కలిగిస్తున్నారు. జిల్లాలో వంద శాతం ఫలితాలు సాధించిన 146 పాఠశాలలు వరుసగా 9వ సారి వంద శాతం సాధించిన జెడ్పీ అన్నాసాగర్ పాఠశాల ప్రత్యేక తరగతులు ఉపయోగపడ్డాయి పాఠశాలలో ఉదయం, సా యంత్రం సమయాలలో పదో తరగతికి ప్రత్యేక తరగతులను నిర్వహించేవారు.దీంతో పాఠశాల ముగిసిన తరువాత చదువుకునేందుకు సమయం దొరికేది. పాఠాలకు సంబంధించిన సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేశారు. దీంతో మంచి మార్కులను సాధించాను. – అమూల్య, జెడ్పీ పాఠశాల, అన్నాసాగర్ -
చోరీ కేసులో ఒకరి అరెస్ట్
● బంగారం, వెండి స్వాధీనం బాన్సువాడ : బాన్సువాడలో జరిగిన చోరీ కేసులో ఒకరిని అరెస్ట్ చేసినట్లు సీఐ అశోక్ తెలిపారు. గత నెల 19న పట్టణంలోని సంగమేశ్వర కాలనీకి చెందిన చెనంగారి లక్ష్మి ఇంటికి తాళం వేసి అత్త సా యవ్వ, ఆడబిడ్డ రాణిలతో కలిసి ఇంటిపైన నిద్రించారు. బోర్లం క్యాంపు తండాకు చెందిన నేనావత్ ఈశ్వర్ తాళం పగులగొట్టి ఇంట్లో ఉన్న బంగారు నగలు, వెండి, నగదును ఎత్తుకెళ్లాడు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని గాంధీచౌక్లో ఈశ్వర్ అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకొని విచారించడంతో తానే దొంగతనం చేసి నట్లు ఒప్పుకున్నాడన్నారు. నిందితుడి నుంచి 6 తులాల బంగారం, 86 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వెల్లడించారు. ఈశ్వర్పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. కేసులో చాకచక్యంగా పనిచేసిన కానిస్టేబుల్ అశోక్ హోంగార్డు హేమాద్రిని సీఐ అభినందించారు. -
పాసుపుస్తకాలు, సర్వే నంబర్ల మిస్సింగ్..
రెవెన్యూ గ్రామాలవారీగా దరఖాస్తుల వివరాలు..దరఖాస్తుపై విచారణ నిమిత్తం కన్నాపూర్లో పర్యటిస్తున్న కలెక్టర్ సంగ్వాన్, సబ్కలెక్టర్ కిరణ్మయి, అధికారులు (ఫైల్)రెవెన్యూ దరఖాస్తులు గ్రామం శెట్పల్లి సంగారెడ్డి 914 పోతాయిపల్లి 453 లింగంపల్లి కుర్దు 337 ముంబోజీపేట్ 309 భవానీపేట్ 232 లింగంపేట్ 200 పర్మల్ల 187 పోల్కంపేట్ 183 మోతె 173 బాణాపూర్ 128 కొండాపూర్ 125 కన్నాపూర్ 106 శెట్పల్లి 103 నల్లమడుగు 99 బాయంపల్లి 96 రాంపూర్ 95 కోర్పోల్ 90 ఎల్లారం 86 మెంగారం 84 బోనాల్ 75 కంచుమల్ 72 నాగారం 60 జల్దిపల్లి 18సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ధరణి స్థానంలో తీసుకువచ్చిన భూ భారతి చట్టాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. అందులో లింగంపేట మండలం ఒకటి. భూ భారతిని ప్రయోగాత్మకంగా అమలు చేయడంలో భాగంగా గతనెల 17 నుంచి 30 వరకు రెవెన్యూ గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించారు. ఆయా సదస్సుల్లో భూ సమస్యలపై రెతుల నుంచి దరఖాస్తులు తీసుకున్నారు. కొన్ని గ్రామాల్లో వందలాది దరఖాస్తులు వచ్చాయి. లింగంపేట మండలంలోని 23 గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో కలిపి మొత్తం 4,255 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ‘సాక్షి’కి వివరించారు. ప్రజల నుంచి వచ్చిన అన్ని దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు వారికి నోటీసులు ఇచ్చి రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో విచారణ జరుపుతున్నారని తెలిపారు. ఇప్పటివరకు 367 దరఖాస్తులకు సంబంధించి క్షేత్ర స్థాయిలో విచారణ జరిగిందన్నారు. అత్యధికంగా శెట్పల్లి సంగారెడ్డిలో.. భూ భారతి సదస్సులకు భారీ స్పందన లభించింది. కొన్ని గ్రామాల్లో వందలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా శెట్పల్లి సంగారెడ్డిలో 914 దరఖాస్తులు రాగా అత్యల్పంగా జల్దిపల్లిలో 18 దరఖాస్తులు వచ్చాయని అఽధికారులు తెలిపారు. పోతాయిపల్లిలో 453 దరఖాస్తులు, లింగంపల్లి కుర్దులో 337, ముంబోజీపేటలో 309, భవానీపేటలో 232, లింగంపేటలో 2 వందల దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. . వేగంగా విచారణ... పైలట్ మండలంలో భూ సమస్యలను పరిష్కరించడంపై అధికారులు ఫోకస్ చేశారు. రెవెన్యూ సదస్సులు ముగిసిన వెంటనే రెవెన్యూ గ్రామాల వారీ గా రైతులు ఇచ్చిన దరఖాస్తులన్నింటినీ ఆన్లైన్లో నమోదు చేశారు. దరఖాస్తులన్నింటినీ పరిశీలిస్తు న్నారు. ఆయా సమస్యలపై క్షేత్ర స్థాయిలో దరఖాస్తుదారులను పిలిపించి వారి సమక్షంలో విచారణ చేపడుతున్నారు. సదస్సులు పూర్తయిన తర్వాత 367 దరఖాస్తులకు సంబంధించి విచారణ జరిగింది. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి గ్రామాలకు వెళ్లి విచారణ జరుగుతున్న తీరును పరిశీలిస్తున్నారు. రెవెన్యూ అధికారులకు స లహాలు ఇస్తూ విచారణ వేగంగా పూర్తయ్యేలా చూ డాలని ఆదేశిస్తున్నారు. భూ భారతి పైలట్ ప్రాజెక్టు మండలంలో 23 సదస్సులు రైతుల నుంచి 4,225 దరఖాస్తులు.. సమస్యల పరిష్కారంపై అధికారుల దృష్టి క్షేత్ర స్థాయిలో మొదలైన విచారణ ఇప్పటివరకు 367 సమస్యల పరిశీలనరెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో 45 శాతం పాసుపుస్తకాలు రాలేదని, డిజిటల్ సంతకాలు లేవని, సర్వే నంబర్లు మిస్ అయ్యాయని, భూ విస్తీర్ణం తక్కువగా వచ్చిందని, మ్యుటేషన్ అమలు కాలేదన్న సమస్యలపైనే ఉన్నాయి. 25 శాతం అసైన్డ్ భూములకు సంబంధించిన సమస్యలపై వచ్చాయి. 15 శాతం రెవెన్యూ, అటవీ వివాదాలకు సంబంధించినవి కాగా.. పది శాతం సాదా బైనామాలు, ఐదు శాతం అసైన్డ్ భూముల క్రయవిక్రయాలకు సంబంధించినవి. -
ఇక ప్రతి రైతుకు గుర్తింపు!
● 11 నంబర్ల యునిక్ కోడ్తో ఐడీ కార్డులు ● ఆధార్, పాస్బుక్, మొబైల్ నంబర్లతో లింక్ ● నేటి నుంచి నెలాఖరు వరకు ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ కార్యక్రమంకామారెడ్డి క్రైం: కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఫార్మర్ ఐడీ ప్రాజెక్టు అమలులో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నుంచి జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ నెలాఖరు వరకు కొనసాగనుంది. ప్రతి రైతు నుంచి వివరాలు సేకరించి రైతులందరికీ ప్రత్యేక డిజిటల్ కార్డులను జారీ చేయనున్నారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా అన్ని క్లస్టర్ల పరిధిలో ఫార్మర్ రిజిస్ట్రీని ప్రారంభించనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ తెలిపారు. భవిష్యత్ అవసరాలకు, కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలకు ఈ కార్డు ప్రామాణికం కానుందని పేర్కొన్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన రుణమాఫీ, రైతు భరోసా తదితర పథకాలకు ఈ కార్డుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో సంక్షేమ పథకాలను పొందడానికి అర్హులుగా ఉండాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. పీఎం కిసాన్ లబ్ధిదారులు తదుపరి లబ్ధి పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ కార్డు నంబరు ద్వారా ఆన్లైన్లో రైతు పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.ఆధార్ తరహాలో..రైతులకు సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలకు ఫార్మర్ ఐడీ కీలకం కానుంది. ఈ గుర్తింపు సంఖ్య పొందడం సులువే.. ఆధార్, పట్టాదారు పాస్బుక్, ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్ వివరాలను వ్యయసాయ విస్తీర్ణాధికారులకు అందిస్తే.. వారు వివరాలు నమోదు చేసి, 11 నంబర్లు గల ఫార్మర్ ఐడీ సంఖ్య ఇస్తారు. రెవెన్యూ శాఖ వద్దనున్న భూయాజమాన్య వివరాలను ప్రామాణికంగా తీసుకుని రైతులకు ఐడీ కార్డులు జారీ చేస్తారు. కార్డు జారీ చేయడానికి ముందే భూమి వివరాలు సర్వే నంబర్ భూమి రకం, సాగు చేస్తున్న పంటల వివరాలు అన్నింటినీ తెలుసుకుని రెతుకు సబంధించిన పూర్తి సమాచారం ఇందులో నమోదు చేస్తారు. -
అకాల వర్షంతో రైతన్న ఆగమాగం
● కొనుగోలు కేంద్రాల వద్ద తడిసిన ధాన్యం ● వడగళ్లతో ఇతర పంటలకూ నష్టం ● పిడుగుపాటుతో ఇద్దరి పరిస్థితి విషమంకామారెడ్డిటౌన్/కామారెడ్డిరూరల్/భిక్కనూరు/ దోమకొండ/తాడ్వాయి/గాంధారి/లింగంపేట/రాజంపేట/బీబీపేట: జిల్లాలోని పలు ప్రాంతాలలో ఆదివారం అకాల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాలలో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కొన్నిచోట్ల వడ్లు కొట్టుకుపోయాయి. జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్లో వడ్లు ఆరబెట్టిన రైతులు.. వర్షం రాకతో ఆగమయ్యారు. గంట పాటు కురిసిన వర్షంతో ఇబ్బందిపడ్డారు. కామారెడ్డి పట్టణంలో గంట పాటు కురిసిన వర్షంతో రోడ్లపై నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మాచారెడ్డి, రాజంపేట తదితర మండలాల్లో వడగళ్లు కురిశాయి. భిక్కనూరు, దోమకొండ మండలాల్లోని పలు గ్రామాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. కోతకు వచ్చిన వరి పంట నేలవాలింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. లింగంపేట మండలంలోని భవానీపేట, జల్దిపల్లి, రాంపూర్, ముంబోజీపేట, గాంధారి మండలంలోని పలు గ్రామాలలో, తాడ్వాయి మండలకేంద్రంతోపాటు కరడ్పల్లి, కన్కల్, దేమికలాన్, కృష్ణాజీవాడి, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో బలమైన గాలులతో కూడిన వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డి, పాతరాజంపేట్, సరంపల్లి, క్యాసంపల్లి, దేవునిపల్లి, లింగాపూర్, నర్సన్నపల్లి, చిన్నమల్లారెడ్డి పరిధిలోని గురు రాఘవేంద్ర కాలనీలలో వడగండ్లు కురిశాయి. ఆరబోసిన వడ్లు తడిసిపోయాయి. మామిడి కాయలు రాలిపోయాయి. మొక్కజొన్న నేలవాలింది. పలుచోట్ల ఇళ్ల రేకులు లేచిపోయాయి. బీబీపేట మండలం మాందాపూర్లో విద్యుత్ స్తంభం విరిగి ట్రాన్స్ఫార్మర్పై పడింది. వడ్లను వెంటవెంటనే తూకం వేసి, రైస్మిల్లులకు తరలించకపోవడంతో నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షంతో నష్టపోయినవారిని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. తుజాల్పూర్లో పిడుగుపాటు కలకలం అకాల వర్షం ఐదుగురి ప్రాణాల మీదికి తెచ్చింది. బీబీపేట మండలంలోని తుజాల్పూర్కు చెందిన గోప వివేక్, కలకుంట్ల రాజు, గోప కవిత, గోప హేమలత, గోప రంజిత్ వర్షం వస్తుండడంతో వడ్లను కుప్పచేసి చెట్టుకిందికి చేరారు. ఆ చెట్టుపై పిడుగుపడింది. దీనిని గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
‘దేశం కోసం ఓ బిడ్డను ఇవ్వాలి’
కామారెడ్డి అర్బన్: ప్రతి హిందూ కుటుంబం ఐదు గురు పిల్లలను కనాలని, దేశం కోసం ధర్మం కోసం ఓ బిడ్డను ఇవ్వాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్రెడ్డి పేర్కొన్నారు. పాతరాజంపేట ఆర్ష గురుకులంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న ఆర్య వీర్దళ్ యువ నిర్మాణ శిబిరం ఆదివారం ముగిసింది. కా ర్యక్రమంలో రాకేష్రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం ధర్మం కోసం ప్రతికుటుంబం ఒక బిడ్డను ఇవ్వకుంటే కష్టపడి సంపాదించిన సంపదను ఉగ్రవాదులకు అప్పగించాల్సి వస్తుందని హెచ్చరించారు. హిందువులు ఇంకా సెక్యులర్ మంత్రం జపిస్తే మిగిలేది ఏ మీ ఉండదన్నారు. హిందువుల నాశనం కోరుతున్న రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో బుద్ధిచెప్పాలన్నారు. చక్కని విద్యనందిస్తున్న ఆర్ష గురుకులాల్లో పిల్లల ను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ముగింపు సభలో విద్యార్థులు చేసిన కర్రసాము, కత్తిసాము విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీసీసీ బీ మాజీ చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, ఆర్ష గురుకులం అధి పతి బ్రహ్మానంద సరస్వతి, ఆర్య సమాజం ప్రతినిధులు బాజన్న, వేదమిత్ర వేదార్థి ఆర్య, హరిదాస్ ఆర్య, ఆచార్య సందీప్ ఆర్య, శైలేష్కుమార్, కనిష్క, రాంనివాస్, ఆచార్య నరేందర్ ఆర్య పాల్గొన్నారు. -
భారంగా మారిన పశు పోషణ
బిచ్కుంద(జుక్కల్): యాసంగిలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. కొందరు గడ్డి వ్యాపారులు ట్రాక్టర్లకు గడ్డి మోపుచుట్టే పరికరాలు బిగించి గడ్డి కట్టలు కడుతున్నారు. పశువులు లేని రైతులకు వ్యాపారులు కొంత నగదు ఇచ్చి పొలంలో వదిలేసిన గడ్డిని కొనుగోలు చేస్తున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో గడ్డి ధరలు విపరీతంగా పెరగడంతో రైతులపై భారం పడనుంది. గడ్డి వ్యాపారులు ట్రాక్టర్ యంత్రాలతో గడ్డి మోపులు కట్టి వాహనాల్లో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు తరలించి అమ్ముకుంటున్నారు. గడ్డి ధరలు పెరగడంతో స్దానిక పాడి రైతులకు భారంగా మారింది. ఒక్కో మోపు ధర రూ. 25 నుంచి 35 లకు విక్రయిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఒక్కో గడ్డి మోపును రూ. 70 విక్రయిస్తున్నారు. ఖరీఫ్, రబీలో బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, పిట్లం మండలాల్లో ఎక్కవగా సోయా, కంది పంటలు సాగు చేస్తారు. సోయా, కంది పంటల నూర్పిళ్లు జరిగిన వెంటనే వ్యాపారులు రైతులకు కొంత నగదు చెల్లించి పొట్టును తీసుకెళ్తున్నారు. వ్యాపారుల రాకతో స్థానిక పాడి రైతులకు గడ్డి, కంది, సోయా పొట్టు దొరకడం భారంగా మారింది. పాల ఫ్యాట్ రావడానికి కొనుగోలు చేసిన గడ్డితో పాటు పశువులకు దాణా ఇవ్వాల్సి వస్తుంది. రోజుకు రూ. 100 నుంచి 150 ఖర్చు చేయాల్సి వస్తుంది. పాలు అమ్మిన గిట్టుబాటు కావడం లేదని రైతులు వాపోతున్నారు. గడ్డి విత్తనాలు అందించని ప్రభుత్వం పాడి రైతులు, మేకలు, గొర్రెలు ఉన్న రైతులకు గతంలో ప్రభుత్వం ఉచితంగా గడ్డి విత్తనాలు, దాణా అందించేది. ఐదారు ఏళ్ల నుంచి ప్రభుత్వం వీటి సరఫరా నిలిపి వేయడంతో పశు పోషణ రైతులకు భారంగా మారింది. సంవత్సరం పాటు నిలువ ఉంచడానికి గడ్డి మోపులను కొనుగోలు చేయాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. వ్యవసాయ భూమి, బోరు మోటారు ఉన్న రైతులకు ప్రభుత్వం గడ్డి విత్తనాలను, అలాగే దాణా సరఫరా చేస్తే పోషణ భారం తగ్గుతుందని రైతులు అభిప్రాయపడు తున్నారు. పశుగ్రాసం కొరతతో ఇబ్బందులు పక్క రాష్ట్రాలకు తరలుతున్న గ్రాసం స్థానికంగా ధరలు పెంచిన వ్యాపారులు -
ప్రాణహిత– చేవెళ్ల పథకం వైఎస్సార్ కల
భిక్కనూరు: కోనసీమ జిల్లాల మాదిరిగా తెలంగాణలో కూడా రైతులు మూడు పంటలు పండించాలనే ఉద్దేశంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత– చేవెళ్ల పథకాన్ని ప్రారంభించాడని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ప్రాణహిత– చేవెళ్ల పథకానికి ప్రభుత్వం రూ. 23 కోట్ల 15 లక్షలను మంజూరు చేయడానికి కృషి చేసిన షబ్బీర్అలీని భిక్కనూరు,దోమకొండ కాంగ్రెస్ నేతలు ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ప్రాణహిత–చేవెళ్ల పూర్తి చేయాలని వైఎస్సార్ కలలు కన్నాడన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల అధికారంలో ఏ మాత్రం నిధులను మంజూరు చేసిన పాపన పోలేదన్నారు.22,23 ప్యాకేజీలను పూర్తి చేయించి రైతులు మూడు పంటలు పండించే విధంగా కృషిచేస్తానన్నారు. మరో 200 కోట్లు ఈ పథకానికి అవసరమతాయన్నారు. ఈ నిధులను మంజూరు చేయించేందుకు కృషిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్, దోమకొండల మండల అధ్యక్షుడు అనంత్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, విండో చైర్మన్ గంగళ్ల భూమయ్య, నేతలు శ్రీరాం వెంకటేశ్, నీల అంజయ్య, లింబాద్రి, దుంపల మోహన్రెడ్డి, అందె దయాకర్రెడ్డి, నర్మల రాంచంద్రం, శ్రీకాంత్, రమేష్ , సలీం తదితరులు పాల్గొన్నారు. 22, 23వ ప్యాకేజీలను పూర్తి చేయిస్తాం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ -
వీడీసీలపై చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్నాగారం: గ్రామాల్లో వీడీసీల ఆగడాలపై అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇప్పటికై నా స్పందించి ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ కోయడ నరసింహులు గౌడ్ అన్నారు. నగరంలోని సంఘం జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ గ్రామాలలో వీడీసీల కబంధ హస్తాలలో సాంఘిక బహిష్కరణలు ఈతవనం దగ్ధాలు, బెదిరింపులు ఆగకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం వెంటనే వీడీసీలను నిషేధించాలని వారి ఆగడాలను అరికట్టాలన్నారు. వీడీసీలపై బహుజన, వృత్తి, ప్రజా సంఘాలు అన్నీ కలిసి ఉద్యమాలు, పోరాటాలు చేయాలన్నారు. తాళ్ల రాంపూర్లో గౌడ గీత కుటుంబాల బహిష్కరణ, ఈతవనం దగ్ధం, గౌడ మహిళకు ఆలయంలో అవమానం ఘటన అనంతరం చెంగల్ కల్దుర్కి తగ్గేల్లి తదితర మండలాల్లో వేలాది ఈత వనాలను దగ్ధం చేయడం సరికాదన్నారు. అలాగే అంకాపూర్, కోటా ఆర్మూర్ గంగాసాగర్, మాక్లూరు బోర్గాంలలో వీడీసీలు బహిష్కరణలు, బెదిరింపులకు పాల్పడుతుండటం మాత్రం ఆగడం లేదన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం వీడీసీలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, దగ్ధమైన ఈతవనాలకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. వీడీసీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కల్లు గీత కార్మిక సంఘం జిల్లా నాయకులు శ్రీరాంగౌడ్, శేఖర్ గౌడ్, కిషన్ గౌడ్, తాళ్ల శ్రీనివాసగౌడ్లు ఉన్నారు. -
నిరుపయోగంగా నీటి ట్యాంకులు
నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల్లో నిధులు లేవని నీటి ట్యాంకులను నిరుపయోగంగా వదిలేశారు. మండలంలోని బొప్పాస్ పల్లి గ్రామంలో గతంలో నర్సరీలో ఉపయోగించిన నీటి ట్యాంకును అలాగే వదిలేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన నర్సరీకి కొత్తది కొని వాడుతున్నారు. అంకోల్ తండాలో నీటి సమస్య తీర్చడానికి పంచాయతీ నిధులతో సింగిల్ ఫేజ్ మోటారు వద్ద ట్యాంకు ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల క్రితం దిమ్మో కూలి పోవడంతో నీటి ట్యాంకును అలాగే వదిలేశారు. ఉన్న వాటిని ఉపయోగించకుంటే నిధుల కొరత ఉండదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. -
దశాబ్దాల తర్వాత ఒక్కచోటికి..
చిన్ననాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒక్కచోటికి చేరడంతో హర్షం వ్యక్తం చేశారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయావంటూ ఆనాటి స్నేహితులు ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు. జిల్లాలోని వివిధ గ్రామాల ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈసందర్భంగా చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు పలకరించుకుంటూ అనాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యార్థులు, గురువులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. – సాక్షి నెట్వర్క్ పలు చోట్ల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన పూర్వవిద్యార్థులు ఆత్మీయ పలకరింపులతో భావోద్వేగానికి గురైన మిత్రులు -
గుంతల రోడ్డుతో ఇబ్బందులు
మద్నూర్(జుక్కల్): మండలంలోని రూసేగావ్ గేటు నుంచి కోడిచిర వరకు గల బీటీ రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలోని రూసేగావ్ గేటు నుంచి చిన్న ఎక్లార మీదుగా కోడిచిర వరకు గల ఆరు కిలోమీటర్ల బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి నూతన రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. భిక్కనూరులో తైబజార్ పేరిట అధిక వసూలు భిక్కనూరు : మండలంలో ఆదివారం జరిగిన సంతలో తైబజార్పేరిట అధిక డబ్బులను కాంట్రాక్టర్ మనుషులు వసూలు చేస్తున్నారని కూరగాయల వ్యాపారులు వాపోయారు. ఒక్క గంపకు రూ.15 తీసుకోవాల్సి ఉండగా కాంట్రాక్టర్తో పాటు ఆయన సంబంధీకులు రైతు ల వద్ద నుంచి గంపకు రూ. 30 నుంచి రూ. 40 వసూలు చేస్తున్నారు. ఈవిషయంలో రైతులు సంఘటితమై కాంట్రాక్టర్తో పాటు ఆయన సంబంధీకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే భిక్కనూరు సంతకు తాము పండించే కూరగాయలను విక్రయించేందుకు తీసుకరామని రైతులు స్పష్టం చేశారు. సంతలో తాగేందుకు కనీసం నీటి సౌకర్యం కూడా కల్పించలేదని రైతులు కాంట్రాక్టర్తో వాగ్వాదానికి దిగారు. గంపకు రూ.15 మాత్రమే చెల్లిస్తామని స్పష్టం చేశారు. అధికంగా టెండర్వేసి తమకు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆగ్రహించారు. దీంతో పలువురు వారిని సముదాయించి శాంతింపజేశారు. ఒలింపిక్ సంఘ భవన స్థలాన్ని కాపాడుకుంటాం నిజామాబాద్నాగారం: ఒలింపిక్ సంఘ భవన స్థ లం కోసం కేటాయించిన స్థలాన్ని కాపాడుకుంటా మని సంఘం జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య అ న్నారు. ఆదివారం నగరంలోని ముబారక్నగర్లో ఉన్న ఒలంపిక్ సంఘ భవన స్థలాన్ని సభ్యులతో కలిసి పరిశీలించారు. 2010లో గత ప్రభుత్వం ఖలీల్వాడిలో ఉన్న స్టేడియం స్థలానికి బదులు ముబారక్నగర్లో 7ఎకరాల35 గుంటల స్థలంతో పాటు పక్కనే ఉన్న 700 గజాల స్థలాన్ని సంఘ భవనం కోసం కేటాయించిందని అన్నారు. ఈ స్థలంలో గ తంలో మంత్రి ఉన్న సుదర్శన్రెడ్డి మంజూరు చేసిన రూ. 15 లక్షల నిధులతో బేస్మెంట్, పిల్లర్ల వరకు పనులు చేపట్టినట్లు తెలిపారు. కొందరు భూకబ్జాదారులు స్థలాన్ని తమదంటు ఆక్రమణలకు పాల్ప డుతున్నారని అన్నారు. ఎవరైనా స్థలాన్ని కబ్జా చే యాలని చూస్తే సహించేది లేదన్నారు. -
పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ఖలీల్వాడి: పోలీసు సిబ్బంది ఎల్లప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సీపీ సాయిచైతన్న అన్నారు. సిబ్బంది విధి నిర్వహణలో ఉండటంతో తమ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడంతో ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నారని, తమ ఆరోగ్యంతోపాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిజామాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్లో ఆదివారం పోలీస్శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఫీనిక్స్ ఫౌండేషన్, శంకర కంటి ఆస్పత్రి సౌజన్యంతో‘ ఉచిత కంటి పరీక్షల శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులలో కంటి వ్యాధులు ఎంతో వేగంగా విస్తరిస్తున్నాయని తెలిపారు. వ్యాధుల భారీన పడకుండా ఉండేందుకు తగిన ఆరోగ్య సూచనలు పాటిస్తే ఎంతో మంచిదన్నారు. ప్రతి ఒక్కరు పౌష్టిక ఆహారం తీసుకోవాలని తెలిపారు. పోలీసులు ఉచిత కంటి పరీక్షలు సద్వినియోగం చేసుకువాలని, ప్రతి ఒక్కరూ 6 నెలలకు ఒక్కసారి కంటి పరీక్షలు తప్పనిసరిగ్గా చేయించుకోవాలన్నారు. అనంతరం వైద్యులు 450 మంది సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రొబేషనర్ ఐపీఎస్ సాయికిరణ్, అదనపు డీసీపీ(ఏఆర్) రామచందర్ రావు, ఏసీపీలు శ్రీనివాస్, మస్తాన్ అలీ, రిజర్వు సీఐ శేఖర్బాబు, సతీష్, సరళ తదితరులు పాల్గొన్నారు. -
బైరాపూర్లో ఒకరి ఆత్మహత్య
మోపాల్: మండలంలోని బైరాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెంది న లకావత్ ప్రసాద్ (33) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆరేళ్లుగా అతడు తలనొప్పితో బాధపడుతున్నాడు. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా, చికిత్స లు చేయించుకున్న నొప్పి నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. ఈక్రమంలో శనివారం రాత్రి అతడు పురుగుల మందు తాగాడు. ఆదివా రం మధ్యాహ్నం కడుపు నొప్పి రావడంతో కుటుంబసభ్యులకు పురుగుల మందు తాగానని చెప్పాడు. వెంటనే వారు అతడిని నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రసాద్ భార్య సవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. అడ్లూర్ ఎల్లారెడ్డిలో వివాహిత.. సదాశివ నగర్(ఎల్లారెడ్డి): మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పా ల్పడింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. అ డ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన మాందాపురం మంజుల (30)కు పాల్వంచ మండలం భవానిపేట గ్రామానికి చెందిన బాలకిషన్తో 9ఏళ్ల క్రితం వివా హం జరిగింది. దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నా రు. కొన్నిరోజుల నుంచి వారి కుటుంబంలో తరచు గొడవలు జరుగగా, మంజుల చెయ్యి విరిగింది. దీంతో ఆమె పుట్టింటికి వచ్చింది. మంజుల తన భ ర్త, అత్తమామలతో ఇటీవల ఫోన్లో మాట్లాడగా వా రు నువ్వు ఇక్కడికి వస్తే మేము చనిపోతాం అని చె ప్పడంతో మనస్తాపం చెందింది. దీంతో ఆమె పుట్టినింట్లోనే చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతికి కారకులైన భర్త, అత్త, మామలపై చర్యలు తీసుకోవాలని మృతురాలి సోదరుడు ఫి ర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. -
సమ్మెకు సై!
ఉపాధి హామీ సిబ్బంది సమ్మెకు సన్నద్ధమవుతున్నారు. పేస్కేల్ అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సర్కారు స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొంటున్నారు. – నాగిరెడ్డిపేటఅదనపు కలెక్టర్కు వినతిపత్రం ఇస్తున్న ఉపాధి హామీ ఉద్యోగులు (ఫైల్)ఉపాధి హామీ పథకంలో జిల్లావ్యాప్తంగా 14 మంది ఏపీవోలు, తొమ్మిది మంది ఈసీలు, 65 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 328 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 40 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 22 మంది అటెండర్లు, ఎనిమిది మంది డీఆర్డీఏ కార్యాలయ సిబ్బంది పనిచేస్తున్నారు. టీఏలు మినహా ఇతర సిబ్బందికి మూడు, నాలుగు నెలలుగా వేతనాలు అందడంలేదు. నెలనెలా వేతనాలు అందకపోవడం వల్ల కుటుంబ పోషణ భారంగా మారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని పేర్కొంటున్నారు. వేతనాలు సకాలంలో రాకపోవడంతో నెలనెలా చెల్లించాల్సిన ఈఏంఐలు చెల్లించలేకపోతున్నామని, దీంతో ఫైన్లు పడుతున్నాయని, సిబిల్ స్కోర్ సైతం పతనమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి సకాలంలో వేతనాలు అందేలా చూడాలని, పేస్కేల్ అమలు చేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. లేకపోతే సమ్మెకు వెళ్లేందుకూ వెనకాడబోమని హెచ్చరిస్తున్నారు.ఆందోళనలు..ఉపాధి హామీ పథకం కింద విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టారు. గత నెల 29న కలెక్టర్తోపాటు డీఆర్డీవోలకు వినతి పత్రాలు అందించిన ఉద్యోగులు.. 30వ తేదీ నుంచి పెన్డౌన్, షట్ డౌన్తో సహాయ నిరాకరణ చేశారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయాల వద్ద శాంతియుతంగా నిరసన తెలిపారు. శనివారం మంత్రులతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాలు ఇవ్వనున్నారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు వెళ్తామని పేర్కొంటున్నారు. ఆందోళన బాటలో ఉపాధి సిబ్బంది పేస్కేల్ అమలు.. పెండింగ్ వేతనాల విడుదల డిమాండ్లతో.. కొనసాగుతున్న నిరసన కార్యక్రమాలు సర్కారు స్పందించకపోతే సమ్మెకు వెళ్తామంటున్న ఉద్యోగులుపెండింగ్ వేతనాలు చెల్లించాలి ఉపాధి హామీ సిబ్బందికి సకాలంలో వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలి. పే స్కేల్ అమలు చేయాలి. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. – కృష్ణాగౌడ్, ఉపాధిహామీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్, కామారెడ్డి -
‘వైద్య సేవల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు’
కామారెడ్డి టౌన్: పీహెచ్సీలలో వైద్యులు, సిబ్బంది వైద్య సేవల్లో నిర్లక్షం చేస్తే చర్యలు తప్పవని డీఎంహెచ్వో చంద్రశేఖర్ హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ హాల్లో పీహెచ్సీల వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. వైద్య కార్యక్రమాల లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలన్నారు. పీహెచ్సీలలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. గ్రామాలలో డయాబెటిక్, బీపీ, టీబీ, క్షయ, హెచ్ఐవీ తదితర వ్యాధులకు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. రక్షేత స్థాయిలో ప్రజలకు స్క్రీనింగ్ వైద్య పరీక్షలు చేయాలన్నారు. ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో చిన్నపిల్లలకు క్రమం తప్పకుండా టీకాలు ఇవ్వాలన్నారు. -
జొన్న కొనుగోలు కేంద్రం పరిశీలన
పెద్దకొడప్గల్: మండల కేంద్రంలోని సొసైటీలో ఏర్పాటు చేసిన జొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం మార్క్ఫెడ్ రాష్ట్ర మేనేజర్ చంద్రశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గన్నీ బస్తాలను విడతల వారీగా పంపుతున్నామన్నారు. కార్యక్రమంలో మార్క్ఫెడ్ డీఎం మహేష్ కుమార్, సొసైటీ చైర్మన్ హన్మంత్ రెడ్డి, కార్యదర్శి సందీప్ తదితరులు పాల్గొన్నారు.ఈవోపై చర్యలకు సిఫారసు భిక్కనూరు: శ్రీసిద్దరామేశ్వరాలయంలో హుండీ లెక్కింపులో చేతివాటం ప్రదర్శించిన ఎల క్ట్రీషియన్ లక్ష్మీనారాయణకు నామమాత్రపు నోటీసు ఇచ్చిన ఈవో శ్రీధర్పైనా చర్యలు తీసుకోవాలని ఆర్జేసీకి సిఫారసు చేసినట్లు దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామరావు తెలిపారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు. పేరు, లేఖ నంబర్ లేకుండా సంజాయీషీ నోటీస్ ఇవ్వడం, ఆ నోటిస్లో ఉన్నతాధికారులకు ప్రతులు పెట్టకపోవడం ఈవో నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. దేవాలయాలను అప్రతిష్టపాలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. హుండీ లెక్కింపులో చేతివాటం ప్రదర్శించిన ఎలక్ట్రీషియన్పై శాఖాపరమైన చర్యలతో పాటు పోలీసు కేసు కూడా పెట్టాలని ఈవోను ఆదేశించామన్నారు. 7 వరకు విద్యుత్ భద్రత వారోత్సవాలు కామారెడ్డి అర్బన్: జిల్లాలో ఈనెల 7వ తేదీ వరకు విద్యుత్ భద్రత వారోత్సవాలు నిర్వహించనున్నట్టు ఎస్ఈ శ్రావణ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ ప్రమాదాల నివారణ, విద్యుత్ పొదుపు, రైతుల భద్రత, సులభంగా సేవలు పొందడం, టోల్ఫ్రీ నంబర్ –1912 పై వినియోగదారులను చైతన్యం చేయడం కోసం వారోత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 5 నుంచి జిల్లా స్థాయి వేసవి శిబిరం కామారెడ్డి టౌన్: సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి 20వ తేదీ వరకు టేక్రియాల్ కేజీబీవీలో విద్యార్థినులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డీఈవో రాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంగీతం, నృత్యం, గణితం, స్పోకెన్ ఇంగ్లిష్, చిత్ర లేఖనం, కంప్యూటర్ స్కిల్స్, ఆటలు, యోగా తదితర అంశాలలో శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇతర వివరాలకు టేక్రియాల్లోని కేజీబీవీలో ఈనెల 5తేదీలోపు సంప్రదించాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం కామారెడ్డి అర్బన్: జిల్లాలో ర్యాంప్ పథకం అమలు కోసం మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయనున్నట్లు జిల్లా పరిశ్రమల అధికారి లాల్సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగలవారు ఈనెల 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో గానీ, ఎంఎస్ఎంఈ వెబ్సైట్లోగాని సంప్రదించాలని సూచించారు. విచారణ జరిపిస్తాం : రామారెడ్డి ఎంపీడీవో రామారెడ్డి: మండలంలోని కన్నాపూర్ గ్రామంలో శవాలను పూడ్చే చోట ఉపాధి హామీ పనులు అనే శీర్షికన గురువారం ప్రచురితమైన కథనంపై రామారెడ్డి ఎంపీడీవో తిరుపతిరెడ్డి స్పందించారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పని కల్పించడానికి ఉపాధి హామీ మేట్ కూలీల వద్ద డబ్బులు డిమాండ్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. దీనిపై విచారణ జరుపుతామన్నారు. -
జిల్లాకో మండలంలో రెవెన్యూ సదస్సులు
కామారెడ్డి క్రైం: పైలట్ ప్రాజెక్టు జిల్లాలను మినహాయించి మే 5 నుంచి 20 వరకు జిల్లాకు ఒక మండలం చొప్పున అన్ని జిల్లాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు, సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. భూ భారతి చట్టం, రెవెన్యూ సదస్సులు, నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ, ఇందిరమ్మ ఇళ్లు తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూసమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని సూచించారు. జూన్ 2 వరకల్లా పైలట్ ప్రాజెక్ట్ కింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా జరిగే రెవెన్యూ సదస్సుల్లో దాదాపు 15 లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ భూములలో పొజిషన్ కలిగిన రైతుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. భూమి లేని నిరుపేదలు పొజిషన్లో ఉంటే వారికి పట్టాలు ఇవ్వడానికి సీఎంతో మాట్లాడి సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. హైకోర్టు నుంచి అనుమతి రాగానే సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలన్నారు.అసైన్డ్ భూములను విక్రయిస్తే..గతంలో పంపిణీ చేసిన అసైన్డ్ భూములను ఎవరైనా విక్రయిస్తే ముందుగా ఆ పట్టాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అలాంటి భూములను కొనుగోలు చేసిన వారు ఒకవేళ భూమి లేని నిరుపేదలైతే ఎంత భూమిని క్రమబద్ధీకరించాలి అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అటవీ భూముల వివాదాల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. మే 4న జరిగే నీట్ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అర్బన్ పీఎం ఆవాస్ యోజన కింద లక్షా 13 వేల ఇండ్లు మంజూరయ్యాయని మంత్రి తెలిపారు. 600 చదరపు గజాలకంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మిస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు రావన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. హౌజింగ్ శాఖ కోసం ప్రత్యేకంగా ప్రతి మండలానికి ఏఈలను కేటాయిస్తామన్నారు.4,225 దరఖాస్తులు..భూ భారతిలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన లింగంపేట్ మండలంలో 4,225 దరఖాస్తులు వచ్చాయని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోగా ఆయా దరఖాస్తులను పరిష్కరిస్తామన్నారు. వీడియో కాన్ఫ రెన్స్లో సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్, హౌజింగ్ పీడీ జైపాల్రెడ్డి, భూ భారతి ప్రత్యేకాధికారి రాజేందర్రెడ్డి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, లింగంపేట తహసీల్దార్ సురేశ్ తదితరులు పాల్గొన్నారు. 5 నుంచి 20 వరకు.. వీసీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నీట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశం -
ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
కామారెడ్డి టౌన్: ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాల్లో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కుల గణన దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్లు రాష్ట్ర కులగణన సర్వేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎడాదిన్నరలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని బీఆర్ఎస్, బీజేపీలు చూసి ఓర్వలేకపోతున్నాయన్నారు. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేసిన బీఆర్ఎస్కు, తెలంగాణకు నయా పైసా ఇవ్వని బీజేపీ కి మాట్లాడే అర్హత లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతీ కార్యకర్త, నాయకుల రుణం తీర్చుకుంటామన్నారు. ఏఐసీసీ ఆదేశాలు మేరకు గ్రామ, మండల, బ్లాక్ కమిటీల ఏర్పాటుకు అందరూ సహకరించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని స్థానాలలో గెలవడానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తామని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్రావు, ఆగ్రో పరిశ్రమల రాష్ట్ర చైర్మన్ కాసుల బాలరాజ్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, జిల్లా ఇన్చార్జీలు సత్యనారాయణ గౌడ్, వేణుగోపాల్ యాదవ్, నాయకులు పండ్లరాజు, రాజిరెడ్డి, జ్ఞానేశ్వరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కులగణన దేశానికి ఆదర్శం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డిలో జిల్లా కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశం -
ఇష్టంగా చదివా.. టాపర్గా నిలిచా
కామారెడ్డి టౌన్: ‘‘కష్టంగా కాకుండా ఇష్టంగా చదివా. ఎస్సెస్సీలో మంచి మార్కులు సాధించా’’ అని ఎస్సెస్సీలో అత్యుత్తమ మార్కులు సాధించిన అంచిత ‘సాక్షి’తో పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా చదివితే తప్పక విజయం వరిస్తుందన్నారు. ఐఏఎస్ కావడమే లక్ష్యమని పేర్కొంది. ఎస్సెస్సీలో 596 మార్కులు సాధించిన జిల్లా కేంద్రానికి చెందిన అంచితను శుక్రవారం ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలు.. రోజూ ఉదయం 5 గంటలకే నిద్ర లేచేదాన్ని. గంటన్నరపాటు చదివా. స్కూళ్లో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విన్నా. కాన్సెప్ట్ను అర్థం చేసుకుని, ఏమైనా డౌట్ ఉంటే వెంటనే టీచర్స్ను అడిగి నివృత్తి చేసుకునేది. సాయంత్రం ఇంటికి వచ్చాక రోజంతా చెప్పిన క్లాసులను రివైజ్ చేసుకున్నాను. అన్ని పాఠ్యాంశాలలో ఏ ఒక్క ప్రశ్నను వదలకుండా ప్రాక్టీస్ చేశాను. లాంగ్వేజ్ సబ్జెక్ట్లు స్కోరింగ్ కోసం ఉపయోగపడ్డాయి. ఐఏఎస్ కావడమే లక్ష్యం ఇంటర్లో ఎంపీసీ తీసుకుంటా. ఇప్పటినుంచే జేఈఈకి సన్నద్ధమవుతున్నా. ఐఏఎస్ కావాలన్నదే నా లక్ష్యం. తప్పకుండా ఐఏఎస్ సాధిస్తానన్న నమ్మకం నాకుంది. సెల్ఫోన్కు బానిసకావొద్దు.. విద్యార్థులు అన్ని సబ్జెక్ట్లపై శ్రద్ధ వహించాలి. పాఠాలను అర్థం చేసుకోవాలి. సెల్ఫోన్, సోషల్ మీడియాకు బానిస కావొద్దు. ఇంటర్నెట్ను చదువుల్లో మన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వినియోగించుకోవాలి.ఒత్తిడి లేదు..నాన్న శశిధర్రెడ్డి కాంట్రాక్టర్. అమ్మ కీర్తన గృహిణి. స్కూల్లో ఉపాధ్యాయులు గానీ, ఇంటి వద్ద అమ్మనాన్న గానీ ఏ రోజు కూడా బాగా చదువు.. మార్కులు బాగా తెచ్చుకో అంటూ ఒత్తిడి చేయలేదు. దీంతో ప్రశాంతంగా చదవగలిగా. ప్రధానంగా పరీక్షలంటే భయపడలేదు. దీంతో పరీక్షలు బాగా రాసి, ఉత్తమ మార్కులు సాధించగలిగాను. ప్రణాళికాబద్ధంగా చదివితే విజయం వరిస్తుంది మార్కుల కోసం అమ్మానాన్నలు ఒత్తిడి చేయలేదు ‘సాక్షి’తో ఎస్సెస్సీలో అత్యుత్తమ మార్కులు సాధించిన అంచిత -
రైతుల వివరాలు అప్డేట్ చేయాలి
సుభాష్నగర్ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతుల వివరాలు, మిస్సింగ్ డేటాను రుణమాఫీ పోర్టల్లో అప్డేట్ అయ్యేలా చూడాలని ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి కోరారు. రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని హైదరాబాద్లోని తన కార్యాలయంలో శుక్రవారం రమేశ్ రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి జిల్లాల్లోని సొసైటీల్లో సీబీలో నమోదు చేయని కారణంగా రుణమాఫీ వర్తించలేదని, ఆ రైతుల వివరాలను పోర్టల్లో అప్డేట్ చేసి రుణాలు మాఫీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన చైర్మన్ కోదండరెడ్డి విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరగా రుణమాఫీ అమలయ్యేలా చూస్తామని హామీనిచ్చారన్నారు. అంతకుముందు కోదండరెడ్డిని శాలువాతో సత్కరించారు. సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు, టీజీసీఏబీ ఎండీ కృష్ణారావు పాల్గొన్నారు. -
ఎప్సెట్ రాసి తిరిగి వెళ్తూ అనంతలోకాలకు..
జక్రాన్పల్లి: నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలంలోని అర్గుల్ శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. జక్రాన్పల్లి ఎస్సై ఎండీ మాలిక్ రహమాన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని లోతర్య తండాకు చెందిన బానవత్ మంజుల(19), బానవత్ అశ్విని(17) శుక్రవారం ఎప్సెట్ రాసేందుకు కారులో హైదరాబాద్ వెళ్లారు. పరీక్ష రాసి తిరిగి వస్తుండగా.. అర్గుల్ శివారులోని జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. కారులో ప్రయాణిస్తున్న అక్కా చెల్లెళ్లు మంజుల, బానవత్ అశ్విని అక్కడికక్కడే మృతి చెందారు. కారును నడుపుతున్న జాదవ్ హంసరాజుకు కాలు, చేయి విరిగాయి. అతడిని ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం ఇద్దరు నిర్మల్ జిల్లావాసులు మృతి -
కార్యదర్శులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలి
కామారెడ్డి క్రైం: జీపీ కార్యదర్శులు శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకుని విధులకు సంబంధించిన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. జిల్లాలోని పలువురు పంచాయతీ కార్యదర్శులకు శుక్రవారం కలెక్టరేట్లో శిక్షణ తరగతులు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై సలహాలు, సూచనలు అందజేశారు. అలాగే పంచాయతీ రాజ్ చట్టం, గ్రామ పంచాయతీ స్థాయిలో పారదర్శకతను పెంపొందించడం, సమాచార హక్కు చట్టం–2005, పంచాయతీ కార్యదర్శి పాత్ర, గ్రామసభ, సమాచార హక్కులాంటి అంశాలపై నిపుణులు అవగాహన కల్పించారు. పంచాయతీ కార్యదర్శులు, రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. -
డ్రెయినేజీ నిర్మించక ఇబ్బందులు
దోమల బెడద ఎక్కువైంది డ్రెయినేజీ లేకపోవడంతో మురుగు నిల్వ ఉంటుంది. దీంతో దోమలతో రోగాల బారిన పడుతున్నాం. అధికారులు స్పందించి డ్రెయినేజీ నిర్మించాలి. – స్వామిగౌడ్, స్థానికుడుకంపు కొడుతోంది తాత్కాలిక డ్రెయినేజీ నిర్మాణం కోసం కాలువ తీయడంతో మురికి నీరు చేరి కంపు కొడుతోంది.దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. అధికారులు స్పందించాలి. – సాయికిరణ్, స్థానికుడు మాచారెడ్డి: మండలంలోని గజ్యానాయక్ తండా చౌరస్తాలో నాలుగు లైన్ల రోడ్డు నిర్మించినప్పుడు రోడ్డుకిరువైపుల డ్రెయినేజీ నిర్మించకపోవడంతో మురుగు వీధుల్లో చేరి కంపుకొడుతోంది. ఎన్ని సార్లు అధికారులకు మొర పెట్టుకున్నా లాభం లేకుండా పోతోందని గ్రామస్తులు వాపోతున్నారు. దోమలు స్వైర విహారం చేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి డ్రెయినేజీ నిర్మించాలని కోరుతున్నారు.ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి రిజ్వానా బేగంను సంప్రదించగా ప్రస్తుతం గ్రామ పంచాయతీలో నిధులు లేవని, నిధులు మంజూరైన తర్వాత డ్రెయినేజీ నిర్మాణాన్ని చేపడతామన్నారు. గజ్యా నాయక్ తండా చౌరస్తాలో గ్రామస్తుల ఆవేదన సమస్య పరిష్కరించాలని వినతి -
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్ రవికుమార్ డిచ్పల్లి: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత నుంచి ఉచిత శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్ఎస్ఈటీఐ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ(ఆర్ఎస్ఈటీఐ) నూతన డైరెక్టర్గా ఎం రవికుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సంస్థ డైరక్టర్గా పని చేసిన సుంకం శ్రీనివాస్ ఏప్రిల్ 30న పదవీ విమరణ పొందారు. ఆయన స్థానంలో ఎస్బీఐ ఉన్నతాధికారులు రవికుమార్ను నియమించారు. బాధ్యతలు స్వీకరించి న అనంతరం రవికుమార్ మాట్లాడుతూ.. ఎలక్ట్రీషియన్(30రోజులు), సీసీటీవీ ఇన్స్టాలేషన్(13 రోజులు) ఫొటో అండ్ వీడియోగ్రఫీ (30 రోజులు) కోర్సులలో పురుషులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నెల 3 నుంచి 20వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన 19 నుంచి 40 ఏళ్ల లోపు వయసు కలిగిన యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసువాలని కోరారు. ఆధార్కార్డు, రేషన్ కార్డు, పదో తరగతి ధ్రువీకరణ పత్రం, ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు డిచ్పల్లిలో ఉన్న ఎస్బీఐ శిక్షణ కేంద్రంలో సందర్శించాలని, 08461–295428 నంబర్ను సంప్రదించాలని సూచించారు. -
రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలి
భిక్కనూరు: కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకోవాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల మానిటరింగ్ అధికారి సురేందర్ సూచించారు. శుక్రవారం ఆయన పెద్దమల్లారెడ్డి గ్రామంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి వివరాలను తెలుసుకున్నారు. కాంటాలు జరిగిన వెంటనే రైసుమిల్లులకు ధాన్యంను పంపించి ట్యాబ్ ఏంట్రీ వెంటవెంటనే చేయాలన్నారు. సీఈవో మోహన్గౌడ్ ఉన్నారు. కొనుగోలు కేంద్రం పరిశీలన నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలంలోని నర్వలో కొనుగోలు కేంద్రం వద్ద సన్నరకాల ధాన్యాన్ని శుక్రవారం మండల వ్యవసాయశాఖ అధికారిణి నవ్య పరిశీలించారు. యంత్రం ద్వారా సన్నరకాల వరిధాన్యానికి కొలతలు తీశారు. నిబంధనల ప్రకారంగా ధాన్యాన్ని ఆరబెట్టి, తాలులేకుండా, నూకశాతం తగ్గకుండా చూసుకోవాలని రైతులకు సూచించారు. వ్యవసాయశాఖ ఏఈవో మధుసూదన్, సెంటర్ ఇన్చార్జీలు రాజేందర్, రాజు, రైతులు ఉన్నారు. -
టైరు పేలి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు
కామారెడ్డి క్రైం: దేవునిపల్లి శివారులో ఉన్న దేవి విహార్ వద్ద ఎల్లారెడ్డి–కామారెడ్డి ప్రధాన రహదారిపై శుక్రవారం సాయంత్రం ఓ కారు ప్రమాదానికి గురైంది. టైరు పేలడంతో రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని ఢీ కొన్నది. కారు రోడ్డు కిందకు చెట్ల పొదల్లోకి దూసుకుపోగా విద్యుత్ స్తంభం విరిగిపోయింది. తాడ్వాయిలో ట్రాన్స్కో సబ్ ఇంజినీర్గా పని చేస్తున్న శివతేజ కారు నడిపిస్తున్నారు. ప్రమాదంలో అతడికి గాయాలు కాగా స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సంభవించినప్పుడు సమీపం నుంచి ఎలాంటి వాహనాలు రాకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. గుండారం మాజీ ఎంపీటీసీకి రిమాండ్ రాజంపేట: మండలంలోని గుండారం మాజీ ఎంపీటీసీ హజీ నాయక్ను శుక్రవారం రిమాండ్కు తరిలించినట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. గత నెల నడిమి తండాకు చెందినన హజీనాయక్ గ్రామంలోని గొడవలను సృష్టించడం, తండాలో జరిగే గొడవలపై కేసులు పెట్టిన వారిపై దాడి చేసినందుకుగాను బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. కోర్టు అనుమతి మేరకు రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. -
ఇంటర్లో తెలుగును తప్పనిసరి చేయాలి
కామారెడ్డి అర్బన్: కవులు, రచయితలు మనుషులను మానవీయం చేయడానికి కృషి చేయాలని తెలంగాణ రచయితల సంఘం (తెరసం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.శంకర్ అన్నారు. తెరసం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక విజన్ కళాశాలలో కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు రుద్రంగి రమేష్ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్య అతిథిగా శంకర్ హాజరయ్యారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించి మృతులకు సంతాపం ప్రకటించి మౌనంతో శ్రద్ధాంజలి ఘటించారు. ఇంటర్లో తెలుగును తప్పని సరిచేయాలని తీర్మాణించారు. అనంతరం శంకర్ మాట్లాడుతు.. తెరసం తెలంగాణ అస్తిత్వ చైతన్యంతో పనిచేస్తుందని, కొత్త తరం రచయితలను ప్రోత్సాహించాలన్నారు. బాన్సువాడకు చెందిన కవి నారాయణభట్టుపై మరిన్ని రచనలు రావాలన్నారు. సమవేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సుప్పని సత్యనారాయణ, ప్రతినిధులు పి.కై లాస్, వడ్ల రమేష్, శ్రీనివాస్, వెంకన్న, ఓరం సంతోష్, మారుతి, అశోక్కుమార్, సిహెచ్ ప్రకాష్, సిరిగాద శంకర్, పూర్ణచందర్రావు, తగిరంచ నరసింహరెడ్డి, బి.చలపతి తదితరులు పాల్గొన్నారు. -
రైతన్న ఐడియా అదుర్స్
బీబీపేట: మండలంలోని జనగామ మర్రి వద్ద ప్రధాన రహదారిపై తండ్రీకొడుకులు తమ సొంత ఆలోచనలతో ఆరబోసిన వడ్లను వాహనం సహాయంతో ఎండబెట్టారు. నేర్పారు. కల్లాలు లేకపోవడంతో రోడ్లపైనే ఆరబోసిన ధాన్యాన్ని ద్విచక్ర వాహనానికి వెనుకాల ఒక చెక్కతో ఏర్పాటు చేసి తాడు సహయంతో వాహనాన్ని నడుపుతూ ధాన్యం ఆరబెట్టుతుండగా ఈ దృశ్యాన్ని శుక్రవారం ‘సాక్షి’ క్లిక్మనిపించింది. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత మద్నూర్(జుక్కల్): డోంగ్లీ మండలంలోని సిర్పూర్ శివారులో ఉన్న మంజీర నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ను శుక్రవారం పట్టుకున్నట్లు ఆర్ఐ సాయిబాబా తెలిపారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. అనంతరం రెవెన్యూ సిబ్బందితో కలిసి ట్రాక్టర్ను మద్నూర్ పీఎస్కు తరలించినట్లు తెలిపారు. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బోధన్ నుంచి హైదరాబాద్కు కొత్త బస్సు సర్వీసురుద్రూర్: ఎండకాలం ప్రయాణికుల సౌకర్యార్థం బోధన్ బస్టాండ్ నుంచి హైదరాబాద్కు రుద్రూర్, వర్ని, బాన్సువాడ, మెదక్ మీదుగా కొత్తగా హైటెక్ బస్సును నడుపుతున్నట్లు డిపో మేనేజర్ విశ్వనాథ్ తెలిపారు. బోధన్ బస్టాండ్ నుంచి రాత్రి పది గంటలకు బస్సు బయలు దేరుతుందని అన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రయాణికులు రాత్రి వేళ ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపుతున్నారని డిపో సిబ్బంది సీనియర్ కంట్రోలర్ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో వెల్లడైందన్నారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి హైటెక్ సర్వీస్ను ప్రారంభించామని అన్నారు. -
బాకీ డబ్బులు అడిగినందుకే హత్య
కామారెడ్డి క్రైం: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని సరంపల్లి శివారులో వద్ద రెండు రోజుల క్రితం జరిగిన ఓ మహిళ హత్య కేసును 48 గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగినందుకే నిందితుడు ఆమెను హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. హత్యకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర వివరాలు వెల్లడించారు. నర్సన్నపల్లి గ్రామానికి చెందిన కవిత(44) బుధవారం సాయంత్రం వ్యవసాయ పొలానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె భర్త గంగారెడ్డి, కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా చెట్టుకు ఉరేసుకొని కనిపించింది. మృతురాలు ఒంటిపై ఆభరణాలు లేకపోవడంతో దుండగులు ఆమెను హత్య చేసి ఉంటారని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్జానం, ఆధారాలతో నిందితుడిని పాత నేరస్తుడు జంగంపల్లి మహేశ్గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. ఏడాది క్రితం నిందితుడు భిక్కనూర్ పీఎస్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. ఆ కేసులో జైలులో ఉన్న అతడికి బెయిల్ మంజూరు చేయించడానికి గాను అతడి కుటుంబ సభ్యులు ఈ కేసులో మృతురాలైన చిదుర కవిత వద్ద రూ.లక్ష అప్పు తీసుకున్నారు. మహేశ్ నెల రోజుల క్రితం బెయిల్ పై బయటకు వచ్చాడు. తన వద్ద తీసుకున్న రూ.లక్ష తిరిగి ఇవ్వాలని కవిత పలుమార్లు మహేశ్ను అడగడంతో ఆమెను చంపేస్తే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదని భావించిన అతను పథకం ప్రకారం బుధవారం సాయంత్రం వ్యవసాయ క్షేత్రం దగ్గరకు వస్తే డబ్బులు ఇచ్చేస్తానని చెప్పి నమ్మించాడు. ఒంటరిగా ఉన్న కవితపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. ఆపై చీరతో మెడకు ఉరి బిగించి హత్య చేసి మృతురాలి ఒంటిపై ఉన్న ఆభరణాలు ఎత్తుకెళ్లాడని ఎస్పీ వివరించారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. 48 గంటల్లోనే కేసును చేధించడంలో విశేషంగా కృషి చేసిన కామారెడ్డి రూరల్ సీఐ రామన్, దేవునిపల్లి ఎస్సై రాజు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. నర్సన్నపల్లి మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్ చంద్ర -
‘దోస్త్’ నోటిఫికేషన్ విడుదల
తెయూ(డిచ్పల్లి): డిగ్రీ ప్రవేశాలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి శుక్రవారం ‘దోస్త్’ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ) 2025–26 నోటిఫికేషన్ను విడుదల చేసింది. మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాలకు అవకాశం కల్పించింది. ఈ సారి దోస్త్ ప్రక్రియను రద్దు చేసి ఇంటర్ మార్కుల ఆధారంగా డిగ్రీలో ప్రవేశాలు కల్పించాలని మొదట ఉన్నత విద్యామండలి అధికారులు భావించారు. అయితే చివరకు ఆలస్యంగా శుక్రవారం దోస్త్ నోటిఫికేషన్ను ఉన్నత విద్యామండలి చైర్మన్, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ వి బాలకిష్టారెడ్డి విడుదల చేశారు. గతేడాది మాదిరిగానే ఈ సారి విద్యార్థికి ఇష్టమైన సబ్జెక్టును ఎంచుకునేందుకు వీలు కల్పించే విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. గతేడాది సున్నా అడ్మిషన్లు జరిగిన 82 కళాశాలలకు ఈ సారి అనుబంధ గుర్తింపు ఇవ్వకూడదని అధికారులు నిర్ణయించారు. కొత్త కోర్సులు ప్రారంభించాలనుకునే కాలేజీల సీట్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. డిగ్రీలో విద్యాప్రమాణాల పెంపు, సిలబస్ మార్పుపై నాలుగు నెలలుగా మండలి తీవ్రంగా కృషి చేస్తోంది. వర్సిటీల వీసీలు, విద్యారంగ నిపుణులతో సిలబస్ మార్పుపై మండలి చైర్మన్ చర్చలు జరిపారు. ఈ ఏడాది నుంచే కొత్త సిలబస్ అమలులోకి తెస్తామని తెలిపారు. అయితే దీనికి విద్యాశాఖ ఇంతవరకూ ఆమోదం తెలుపకపోవడంతో సిలబస్ మార్పుపై సందేహాలు నెలకొన్నాయి. రాష్ట్రంలోని ఏ విశ్వవిద్యాలయంలోనైనా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, జేఎన్టీయూ, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణ మండలి(టీఎస్బీటీఈటీ) డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి దోస్త్ సింగిల్ విండో ద్వారా సేవలను అందిస్తోంది. విద్యార్థులు ఎవరి సహాయం లేకుండా స్వయంగా తమ డిగ్రీ అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్లో పేర్కొంది. దోస్త్ వెబ్సైట్ https:// dost. cgg. gov. in ద్వారా విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తెయూ పరిధిలో 69 కళాశాలలు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అనుబంధ డిగ్రీ (ప్రభుత్వ 15, ప్రభుత్వ అటానమస్ 5, ప్రైవేటు 49) కళాశాలలు మొత్తం 69 ఉన్నాయి. ఈ కళాశాలల్లో మొత్తం 33,830 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే గతేడాది కేవలం 12,764 సీట్లు(37.73 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ సారి కూడా 40 శాతం లోపే సీట్లు భర్తీ అయ్యే అవకాశం ఉంది. మూడు విడతల్లో డిగ్రీ ప్రవేశాలు తెయూ పరిధిలో 33,830 సీట్లు మొదటి విడత: మే 3 నుంచి 21వరకు మొదటి విడతగా దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. మే 10నుంచి 22వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. మే 29న మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. రెండవ విడత: మే 30 నుంచి జూన్ 8వరకు దరఖాస్తుల స్వీకరణ. మే 30 నుంచి జూన్ 9వరకు వె బ్ ఆప్షన్లు. జూన్ 13న సీట్ల కేటాయింపు ఉంటుంది. మూడవ విడత: జూన్ 13 నుంచి 19వరకు దరఖాస్తుల స్వీకరణ. జూన్ 13 నుంచి 19వరకు వెబ్ ఆప్షన్లు. జూన్ 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 30 నుంచి డిగ్రీ కళాశాలల్లో తరగతులు ప్రారంభం. -
అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి
రాజంపేట: అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా యువత నడుచుకోవాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి అన్నారు. శుక్రవారం శివాయిపల్లి గ్రామంలోని వినాయక యూత్ అసోసియేషన్, మాల సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాణంలో అంబేడ్కర్ కృషి మరువలేనిదని, ప్రపంచ దేశాలకు అంబేడ్కర్ మార్గదర్శిగా నిలిచాడని కొనియాడారు. కార్యక్రమంలో విగ్రహ దాతలు బక్కి నవీన్, బక్కి ప్రశాంత్, మాలమహానాడు జిల్లా అధ్యక్షులు కంకణాల రమేష్, వినాయక యూత్ అసోసియేషన్ సభ్యులు కంకణాల బాల్నర్స్, మెపాల్, కంకణాల రవీందర్, ప్రభాకర్, సిద్ధ రాములు, రమేష్, ఉదయ్, మాజీ ఉపసర్పంచ్ సంధ్య బాలరాజ్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
‘డబుల్’ బిల్లుల కోసం రాస్తారోకో
ఎల్లారెడ్డి: డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులు చెల్లించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం సోమార్పేట్ గ్రామస్తులు ఎల్లారెడ్డిలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమార్పేట్ గ్రామానికి చెందిన పది మందికి 2023లో డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరయ్యాయన్నారు. ఇళ్లు నిర్మించుకుని ఏడాది కావస్తున్నా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా బిల్లు చెల్లించలేదన్నారు. ఎమ్మెల్యే సూచనతో అధికారులు రెండు నెలల క్రితమే ఇళ్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినా ఇప్పటివరకు బిల్లులు మంజూరు చేయలేదన్నారు. బిల్లుల కోసం తలా కొంత జమ చేసి డీఈఈ గిరిధర్కు లక్షన్నర రూపాయలు అందించామన్నారు. అధికారులు మరిన్ని డబ్బులు అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని సముదాయించి రాస్తారోకో విరమింపజేశారు. బిల్లుల ఈ విషయమై డీఈఈ గిరిధర్ను వివరణ కోరగా సోమార్పేట్ గ్రామస్తులకు సంబంధించిన డబుల్ బెడ్రూం ఇళ్ల వివరాలు 15 రోజుల క్రితమే ఆన్లైన్లో నమోదయ్యాయన్నారు. లబ్ధిదారులు ఇంతవరకు వారి ఇళ్లకు సంబంధించిన అగ్రిమెంట్ కాపీలను అందించలేదన్నారు. తనకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదని, అనవసరంగా తనపై ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి డబ్బులు రాగానే కాంట్రాక్టర్ ద్వారా లబ్ధిదారులకు అందిస్తామన్నారు. -
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
తాడ్వాయి(ఎల్లారెడ్డి): నియోజక వర్గాన్ని అన్ని రంగాలలో మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అన్నారు. ఆయన శుక్రవారం మండలంలోని చిట్యాల గ్రామంలో రూ.2.11 కోట్లతో 33–11కేవీ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈసబ్స్టేషన్ నిర్మాణం పూర్తయినట్లయితే మండలంలోని చిట్యాల, సంతాయిపేట్, సోమరం, సోమారం తండాతో పాటు అన్నారం గ్రామానికి నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేయవచ్చన్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా రైతులు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని దీంతో 22వ ప్యాకేజీ కింద రూ.23కోట్ల నిధులను మంజూరు చేయించాన్నారు. అన్ని గ్రామాలలో రూ. 25కోట్లతో సీసీరోడ్లు, డ్రెయినేజీలను నిర్మించమన్నారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి చిట్యాల– సంతాయిపేట్ రూట్లతో ఆర్టీసీ బస్సు ట్రిప్పులను పెంచేలా కృషిచేస్తానన్నారు. ఎరువులను నిల్వ చేసేందుకు చిట్యాలలో గోదాంను మంజూర్ చేయిస్తానన్నారు.అంతకు ముందు మండల కేంద్రం నుంచి చిట్యాల వరకు బైక్ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో విద్యుత్ ఎస్ఈ శ్రావణ్, డీఈలు కల్యాణ్ చక్రవర్తి, నాగరాజు, ఏడీఈ కిరణ్ చైతన్య, ఏఈ కరుణాకర్, పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, నాయకులు శివాజీ, మహేందర్రెడ్డి, లక్ష్మణచారీ, తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకస్థాపన -
వాహనాల తనిఖీ : పలువురికి జరిమానాలు
లింగంపేట/సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని నల్లమడుగు చౌరస్తాలో శుక్రవారం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలపై పెండింగ్ ఉన్న చాలన్లను చెల్లించాలని సూచించారు. వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించని వారికి జరిమానాలు విధించారు. కార్లలో ప్రయాణం చేసేవారు సీట్ బెల్టు ధరించాలని సూచించారు. ధ్రువపత్రాలు, హెల్మెంట్ ధరించని 10 మందికి జరిమానాలు విధించినట్లు తెలిపారు. అలాగే సదాశివనగర్ మండలం పద్మాజివాడి, మోడెగాం గ్రామాల చౌరస్తాల వద్ద ఎస్సై రంజిత్ వాహనాల తనిఖీ నిర్వహించారు. కార్యక్రమంలో పీఎస్ఐ రాఘవేందర్, హెడ్కానిస్టేబుల్ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. కొలతల ప్రకారం పనులను చేయాలి తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఉపాధిహామీ పథకంలో కొలతల ప్రకారం పనిచేసినట్లయితే పనికి తగ్గ వేతనం వస్తుందని మండల ప్రత్యేక అధికారి రా జారాం అన్నారు. మండలంలోని చిట్యా ల గ్రా మ శివారులో నడుస్తున్న ఉపాధిహామీ పనులను ఆ యన శుక్రవారం పరిశీలించారు. అనంతరం సంతాయిపేట్లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించారు. ఎంపీడీవో సయ్యద్ సాజీద్అలీ, ఎంపీవో సవితారెడ్డి, తదితరులున్నారు. -
గుర్తు తెలియని మహిళ మృతదేహం గుర్తింపు
మోపాల్: మండలంలోని కాల్పోల్, పూర్వ వర్ని మండలంలోని తిమ్మాపూర్ అటవీ శివారులో గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు గురువారం రాత్రి గుర్తించారు. గుర్తు తెలియని మహిళ తునికాకు సేకరణకు వచ్చి దారితప్పిపోయి ఉండవచ్చని గ్రామస్తులు భావిస్తున్నారు. మూడు, నాలుగు రోజుల కిందటే మహిళ మృతిచెంది ఉంటుందని స్థానికులు పేర్కొన్నారు. ఈ విషయమై స్థానికులు పోలీసులు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. కేసు విషయమై మోపాల్ ఎస్సై యాదగిరిని వివరణ కోరగా మహిళ మృతదేహంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని శుక్రవారం ఘటన స్థలాన్ని పరిశీలిస్తామని తెలిపారు. మృతదేహం మోపాల్ శివారు, పాత వర్ని శివారు ప్రాంతమ అనేది తెలియాల్సి ఉంది. ఇసుక వేలంతో రూ.51వేల ఆదాయంమోర్తాడ్: భీమ్గల్ మండలం బెజ్జోరా వాగు నుంచి ఇసుకను తవ్వి అక్రమంగా నిలువ చేయగా వాటిని ఇటీవల రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. గురువారం వాటికి వేలం నిర్వహించగా రూ.51వేల ఆదాయం లభించింది. బెజ్జోరా శివారులోని వాగు నుంచి తరలించి డంప్ చేసిన 25 ట్రాక్టర్ల ఇసుకకు తహసీల్దార్ మహమ్మద్ షబ్బీర్ వేలం నిర్వహించారు. ఏడుగురు వ్యాపారులు వేలంలో పాల్గొనగా బాబాపూర్కు చెందిన సమీర్ ఇసుక టెండర్ను దక్కించుకున్నాడు. కేసులో వృద్ధురాలిని విచారించిన జడ్జిఖలీల్వాడి: అదనపు కట్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వృద్ధురాలిని నిజామాబాద్ రెండవ అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ శ్రీనివాస్రావు గురువారం కోర్టు ఆవరణలో విచారించారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని శివాజీనగర్కు చెందిన ఓ మహిళ పలువురిపై వేధింపులు, అదనపు కట్నం పేరిట కోర్టులో కేసు వేశారు. విచారణలో భాగంగా నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలు అనసూయను జడ్జి ఆమె వద్దకు వచ్చి విచ్చారించి వివరాలు తెలుసుకున్నారు. -
ప్రభుత్వ పాఠశాలల్లో కొరవడిన నాణ్యమైన విద్య
నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన కొరవడింది. దీనికి నిదర్శనమే బుధవారం వెలువడిన పదో తరగతి ఫలితాలు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందాలన్నా, మంచి ఫలితాలు రావాలన్నా బోధన ఎంత ముఖ్యమో.. పర్యవేక్షణ కూడా అంతే ముఖ్యం. విద్యావ్యవస్థలో సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే ‘పది’ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడ్డాయని చెప్పొచ్చు. జిల్లా కేంద్రంలో పరీక్షల నిర్వహణ పకడ్బందీగా జరిగిందని జిల్లా అధికారులు పేర్కొంటున్నా మెరుగైన ఫలితాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టిసారించకపోవడమే అతి తక్కువ ఉత్తీర్ణత నమోదైందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. నార్త్, సౌత్ మండలాల్లో తక్కువ.. నార్త్ మండలంలో 248 మంది పరీక్ష రాయగా 215 మంది విద్యార్థులు పాసయ్యారు. ఇందులో అర్సపల్లి ప్రభుత్వ పాఠశాలలో 32 మందికి 25 మంది, కుమార్గల్లి పాఠశాలలో 19 మందికి 15 మంది, ఖలీల్వాడి పాఠశాలలో 79 మందికి 65 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. సౌత్ మండలంలో 361 మంది పరీక్ష రాయగా 240 మంది విద్యార్థులు పాసయ్యారు. కోటగల్లి శంకర్ భవన్ పాఠశాలలో 107 మందికి 61 మంది విద్యార్థులే పాసయ్యారు. వాటర్ ట్యాంక్ ఉన్నత పాఠశాలలో 21 మందికి 13 మంది, కసాబ్గల్లి పాఠశాలలో 135 మందికి 93 మంది, ఖిల్లా ప్రభుత్వ పాఠశాలలో 62 మందికి 45 మంది విద్యార్థులు పాసయ్యారు. జిల్లా వ్యాప్తంగా 766 మంది విద్యార్థులు ఫెయిల్ అయితే అందులో నార్త్, సౌత్ మండలంలో 154 మంది విద్యార్థులు ఉన్నారు. నార్త్, సౌత్ మండలాల్లో విద్యావ్యవస్థ గాడితప్పింది. ఇక్కడ జిల్లా కేంద్రం కావడంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఇక్కడే ఉన్నారు. వారు సంఘాల పేరిట ప్రతి రోజు నిరసన కార్యక్రమాలు, సభ్యత్వాల నమోదు వంటి కార్యక్రమాలు చేపడుతూ పాఠశాలలకు డుమ్మాలు కొడుతున్నారు. గైర్హాజరును అరికట్టేందుకు ఉన్నతాధికారులు కూడా దృష్టిసారించకపోవడం విద్యావ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. తరచూ విద్యార్థి సంఘాల తరగతుల బహిష్కరణ కూడా దీనికి కొందరు ఉపాధ్యాయ సంఘం నాయకులు వత్తాసు పలుకుతుండడంతో పాఠశాలల్లో నాణ్యమైన బోధన కొరవడుతోంది. సరైన విద్యాబోధన చేపట్టకపోవడంతోనే విద్యార్థులు చాలా మంది ఉత్తీర్ణులు కాలేదని పలువురు పేర్కొంటున్నారు. ఇందుకు నిదర్శనమే ‘పది’ ఫలితాలు నార్త్, సౌత్ మండలాల్లో 154 మంది విద్యార్థులు ఫెయిల్పరిశీలన చేస్తాం నార్త్, సౌత్ మండలాల్లో ఫలితాలు తక్కువ రావడంపై పరిశీలన చేస్తాం. మెరుగైన ఫలితాలు వచ్చేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఈ మండలాల్లో మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తాం. మెరుగైన ఫలితాల కోసం ప్రణాళిక రూపొందిస్తాం. – అశోక్, డీఈవో -
వేర్వేరు కారణాలతో పలువురి ఆత్మహత్య
కామారెడ్డి క్రైం: వేధింపులకు మరో నిండు ప్రాణం బలైంది. తరచూ భర్త వేధించడంతో ఓ వివాహిత భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలానికి చెందిన పసుపులేటి సాయి అనే వ్యక్తికి అదే మండలానికి చెందిన పూజిత(20)తో తొమ్మిది నెలల క్రితం వివాహం జరిగింది. కొంత కాలంగా సాయి కామారెడ్డి సమీపం లోని ఎంఎస్ఎన్ ఫార్మా కంపనీలో ఉద్యోగం చేస్తూ తన భార్యతో కలిసి అశోక్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. కొద్ది రోజులుగా సాయి మరో మహిళతో నిత్యం ఫోన్లో మాట్లాడుతున్నాడనే విషయంలో భార్యా భర్తల మధ్య గొడవ జరుగుతోంది. దీంతో పాటు పెళ్లి సమయంలో ఒప్పుకున్న అర ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేయించాలని సాయి తన భార్యతో తరచూ గొడవపడుతూ వేధింపులకు గురి చేసేవాడు. బుధవారం రాత్రి కూడా వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లు కుటుంబీకులు తెలిపారు. దీంతో భర్త వేధింపులు తాళలేక మనస్థాపానికి గురైన పూజిత గురువారం ఉదయం వారు నివాసం ఉంటున్న రెండు అంతస్తుల భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. భర్త వేధింపులతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆమె తండ్రి కృష్ణారావు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. జీవితంపై విరక్తితో ఒకరు..రుద్రూర్: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి జీవితంపై విరక్తితో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై సునీల్ గురువారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. కోటగిరి పీఎస్ పరిధిలోని పొతంగల్ మండలం సోంపూర్ గ్రామానికి చెందిన సీతాపులే సంజీవ్(42) మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంపై విరక్తితో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. కుమార్తె కాపురంలో కలహాలు రావడంతో..మోర్తాడ్: కుమార్తె కాపురంలో కలతలు రావడంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మోర్తాడ్లో చేసుకుంది. ఎస్సై విక్రమ్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. మోర్తాడ్కు చెందిన కట్టెకోల్ల గోపి(51) వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని కుమార్తె ప్రేమ వివాహం చేసుకోగా ఆమె కాపురంలో సమస్యలు తలెత్తాయి. దీంతో తండ్రి వద్ద ఉంటోంది. మరోవైపు కాలికి ఏర్పడిన గాయం మధుమేహం వ్యాధితో తగ్గకపోవడంతో జీవితంపై విరక్తితో గోపి బుధవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.ఆర్మూర్లో మరొకరు..ఆర్మూర్టౌన్: పెర్కిట్కు చెందిన సయ్యద్ జాఫర్(42) అనే వ్యక్తి జీవితంపై విరక్తితో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ గురువారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. జాఫర్ కొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో జీవితంపై విరక్తితో బుధవారం రాత్రి పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత
ఇందల్వాయి: మండలంలోని లింగాపూర్ వాగు నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న రెండు ఇసుక ట్రాక్టర్లను గురువారం పట్టుకొని పీఎస్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. పాటితండాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో వెంటనే వాగులో తనిఖీలు చేపట్టి వారిని పట్టుకున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మోపాల్లో..మోపాల్: మండలంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న బదావత్ మోహన్కు చెందిన ట్రాక్టర్ను పట్టుకున్నట్లు ఎస్సై యాదగిరిగౌడ్ గురువారం తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారని సమాచారం రావడంతో ట్రాక్టర్ను పట్టుకొని పీఎస్కు తరలించినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం.. ఆయిల్ చోరీనవీపేట: మండలంలోని నిజాంపూర్ ఎత్తిపోతల పథకానికి చెందిన ట్రాన్స్ఫార్మర్ను దుండగులు బుధవారం రాత్రి ధ్వంసం చేసినట్లు ఎస్సై వినయ్ గురువారం తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి అందులోని కాపర్ కాయిల్స్, ఆయిల్ను ఎత్తు కెళ్లారని పేర్కొన్నారు. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతిమాక్లూర్: గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన మాక్లూర్ మండలం వెంకటాపూర్లో శివారులో చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆలూర్ మండలం ఢీకంపల్లి గ్రామానికి చెందిన తంబాకు గౌరి(44), తంబాకు సాయిలు భార్యాభర్తలు. వీరు బోధన్ మండలం అమ్దాపూర్లో గురువారం నిర్వహించిన బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి బైక్పై వస్తుండగా వెంకటాపూర్ శివారులో ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొన్నది. ఈ ఘటనలో గౌరి పై నుంచి వాహనం వెళ్లడంతో ఆమె ఘటన స్థలిలోనే మృతి చెందింది. సాయిలుకు హెల్మెట్ ఉండడంతో స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గతంలోనే ఈ రోడ్డు గుండా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ‘సాక్షి’ పలుమార్లు కథనాలు ప్రచురించింది. అధికారుల్లో మాత్రం స్పందన కరువవుతోంది. ఈ రోడ్డు గుండా అనేక మూలమలుపులు ఉన్నాయి. కనీసం సూచిక బోర్డులు సైతం లేకపోవడంతో పలువురు వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేకాట స్థావరంపై దాడిసిరికొండ: మండలంలోని చిన్నవాల్గోట్ శివారులో పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురిని గురువారం పట్టుకున్నట్లు ఎస్సై ఎల్ రామ్ తెలిపారు. వారి నుంచి రూ. 5,250 నగదు, ఐదు బైకులు, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ప్రజలను అప్రమత్తం చేయాలి
నస్రుల్లాబాద్ (బాన్సువాడ): ఆన్లైన్ బెట్టింగ్, సైబర్క్రైమ్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు వారికి అవగాహన కల్పించాలని ఎస్పీ ఎం రాజేశ్చంద్ర సూచించారు. నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డ్లు, రిసెప్షన్, టెక్ టీమ్, లాక్ అప్ రూమ్, పార్కింగ్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో వినియోగించే డయల్ 100 కాల్స్కు వెంటనే స్పందించాలని ఆదేశించారు. స్టేషన్కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని సిబ్బందికి సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా చేపడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని, గ్రామాల్లో మూఢనమ్మకాలు, బాల్యవివాహాలపై అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట బిచ్కుంద సీఐ నరేశ్, ఎస్సై లావణ్య, ఉన్నారు. -
నోటీసు ఉత్తుత్తిదేనా..?
భిక్కనూరు: మండల కేంద్రంలోని సిద్ధరామేశ్వర ఆలయంలో హుండీ లెక్కింపు సమయంలో ఎలక్ట్రి షియన్ డబ్బులు తీసిసినట్లు ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. అయితే ఎలక్ట్రిషియన్కు ఈవో శ్రీధర్ నోటీసు జారీ చేసిన తీరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. గత నెల 22వ తేదీన హుండీ లెక్కిస్తున్న సమయంలో ఎలక్ట్రిషియన్ లక్ష్మీనారాయణ చేతివాటం ప్రదర్శించగా ఆలయ పునర్నిర్మాణకమిటీ చైర్మన్ అందె మహేందర్రెడ్డి రెడ్హ్యాండెడ్గా పట్టుకుని ఈవోకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ‘సాక్షి’ దినపత్రిక అదే నెల 29వ తేదీన వెలుగులోకి తీసుకురాగా భక్తులు ఆలయానికి చేరుకుని ఈవోను నిలదీశారు. అయితే తాను ఎలక్ట్రిషియన్కు 23వ తేదీనే నోటీసు ఇచ్చినట్లు ఈవో వారికి తెలిపారు. 29వ తేదీన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో అదే రోజు ఉదయం హుటాహుటిన ఆలయానికి చేరుకున్న ఈవో పాత తేదీ(23)తో నోటీసు రూపొందించి ఎలక్ట్రిషియన్ నుంచి రిసీవ్డ్ సంతకం తీసుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. నోటీసు ఎవరికి ఇచ్చింది కనీసం అందులో లేదని, ఎలక్ట్రిషియన్ సంతకం ఎలా పెట్టారని పలువురు ప్రశ్నించగా, ఆయన సంతకం చేయడంతోనే పేరు అందులో రాయలేదని ఈవో సమాధానమిచ్చారు. ఆ తరువాత ఎలక్ట్రిషియన్ పేరును నోటీసు మధ్యలో ఇరికించి మీడియాకు పంపించారు. ఈవో శ్రీధర్ లెటర్ నంబర్, క్రమసంఖ్య లేకుండా నోటీసు ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. గతంలో చిన్న తప్పు చేసిన ఓ ఉద్యోగిని ఎలాంటి విచారణ లేకుండానే సస్పెండ్ చేసిన ఈవో.. హుండీ లెక్కింపులో చేతి వాటం ప్రదర్శించిన ఉద్యోగిని ఎందుకు వెనుకేసుకొస్తున్నారని, పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. నిబంధనలు పాటించకుండా జారీ -
ఏ నేల.. ఏ పంటకు అనుకూలం?
రాజంపేట: భూసారాన్ని తెలుసుకోవడంతోపాటు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి పంట దిగుబడులను పెంచేందుకు చేపట్టాల్సిన భూసార పరీక్షలు నాలుగేళ్లుగా జిల్లాలో చేపట్టడం లేదు. రైతులు స్వల్ప పెట్టుబడులతో అధిక దిగుబడులు సాధించాలని ప్రభుత్వాలు పదే పదే చెబుతుండడంతోపాటు నేల స్వభావాన్ని బట్టి పంటలు సాగు చేయాలని సూచిస్తున్నాయి. ఇందులో ఎంతోకీలకమైన భూసార పరీక్షలు మాత్రం చేపట్టడం లేదు. మండలాల వ్యవసాయాధికారులకు కిట్లను అందజేసినా నాలుగేళ్లుగా భూసార పరీక్షల జాడలేకపోవడం గమనార్హం. జిల్లా వ్యాప్తంగా వానాకాలం సీజన్లో లక్షల ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగ వుతాయి. కేవలం రాజంపేట మండలంలోనే 9 వేల ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో పంటలు సాగవుతా యి. గతంలో వేసవిలో భూసార పరీక్షలు ఏఈవోల ద్వారా చేసేవారు. ఆ ఫలితాలకు అనుగుణంగా రైతులు పంటల సాగుకు ప్రాధాన్యం ఇచ్చేవారు. అయితే నాలుగేళ్లుగా ఆ ఊసే లేకపోవడంతో రైతు లు ఇష్టారీతిన ఎరువులను వినియోగిస్తున్నారు. దీంతో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడు తోంది. గతంలో ఏటా నీటి లభ్యత ఉన్న ప్రాంతా ల్లో పదెకరాలకు ఒక మట్టి నమూనా, వర్షాధారిత ప్రాంతాల్లో 25 ఎకరాలకు ఒక మట్టి నమూనా సేకరించి పరీక్షలు చేసి నేల పరిస్థితులపై రైతు లకు అవగాహన కల్పించేవారు. తదనుగుణంగా రైతులు ఎరువులను వాడేవారు. నాలుగేళ్లుగా భూసార పరీక్షల కార్యాచరణను రూపొందించడం లేదు. బడ్జెట్ లేక ఆలస్యం గత నాలుగు సంవత్సరాలుగా భూసార పరీక్షలు నిర్వహించడం లేదు. బడ్జెట్ లేకపోవడమే ఇందుకు కారణం. ఈ విషయంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే భూసార పరీక్షలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం – శృతి, ఏవో రాజంపేట మూలకు చేరిన పరికరాలుప్రభుత్వం 2018లో భూసార పరీక్షలను ప్రారంభించగా 2020 వరకు సజావుగా సాగాయి. ఇందుకోసం రూ.1.30 లక్షల విలువైన ఒక్కో కిట్టును ఏఈవోలకు అందించారు. అప్పట్లో రైతు వేదికలు లేకపోవడంతో గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఉంచారు. రైతు వేదికలను నిర్మించిన తరువాత వాటిని అందులోకి మార్చినప్పటికీ మూలకు చేరాయి. 2020 వరకు ఈ పరీక్షలు సజావుగా సాగాయి.జిల్లాలో నాలుగేళ్లుగా భూసార పరీక్షలకు బ్రేక్ ఇష్టారీతిన ఎరువులు వినియోగిస్తున్న రైతులు తగ్గుతున్న భూసారం.. పంట దిగుబడి -
ఎస్సెస్సీ టాపర్లకు సన్మానం
కామారెడ్డి టౌన్ : ఎస్సెస్సీలో స్టేట్ టాపర్లుగా నిలిచిన విద్యార్థులను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం తన చాంబర్లో సన్మానించారు. 596 మార్కులు సాధించిన నిమ్మ అన్షితతో పాటు 590 మార్కులు సాధించిన కొండ గాయత్రి, శ్రేణితను ఘనంగా సన్మానించారు. ఎస్పీఆర్ స్కూల్ కరస్పాండెంట్ మారుతి, టీచర్లు పాల్గొన్నారు. భూ భారతితో సమస్యలకు పరిష్కారం నిజాంసాగర్(జుక్కల్) : భూ భారతితో భూ ముల సమస్యలు పరిష్కారమవుతాయని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. జుక్కల్లోని క్యాంపు కార్యాలయానికి గురువారం వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు తాము ఎదుర్కొంటున్న భూ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టాపాస్ పుస్తకాలతోపాటు సాదాబైనామా తదితర సమస్యలకు భూభారతితో పరిష్కారం లభిస్తుందన్నారు. ధరణి కారణంగా పాస్పుస్తకాలు లేక ఎంతో మంది రైతులు రైతుబంధు, రైతుబీమాకు దూరమయ్యారని రైతులు అన్నారు. భూముల సమస్యలను తెలుసుకునేందుకు గ్రామాల వారీగా అధికారులు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి, పరిష్కారం చూపిస్తారన్నారు. సమ్మె విరమణ భిక్కనూరు : యూనివర్సీటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారని కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణగుప్తా అన్నారు. సౌత్ క్యాంపస్లోని దీక్షాశిబిరం వద్ద గురువారం ఆయన మాట్లాడారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం తరఫున సీఎంను కలిసి సమస్యలను వివరించగా పరిష్కారానికి ఆయన సానుకూలంగా స్పందించారని, దీంతో సమ్మె విరమిస్తున్నామన్నారు. ప్రిన్సిపాల్ సుధాకర్గౌడ్ కాంట్రాక్ట్ అధ్యాపకులకు నిమ్మరసం అందజేసి సమ్మెను విరమింపజేశారు. అధ్యాపకురాలు ప్రతిజ్ఞ, కాంట్రాక్ట్ అధ్యాపకులు సరిత, యాలాద్రి, సునీత, నర్సయ్య, రమాదేవి, వైశాలి, శ్రీకాంత్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం కామారెడ్డి టౌన్: కేంద్ర కేబినెట్ జనగణనతో పాటు కులగణన నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేపట్టిన కులగణన తప్పుల తడకగా ఉందని, ప్రస్తుతం కేంద్రం చేపట్టబోయే జనగణన, కులగణనతో పూర్తి స్పష్టత వస్తుందన్నారు. దేశాభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని అన్నారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తోట బాలరాజు, పట్టణ అధ్యక్షుడు ఉప్పు లక్ష్మీపతి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రంజిత్ మోహన్, నాయకులు పోతరాజు వెంకటేశ్, గోపు స్వామి, శ్రీకాంత్, గోవర్ధన్ పాల్గొన్నారు. ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు కామారెడ్డి టౌన్: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) గడువును ఈనెల 3వ తే దీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం జీవో విడుదల చేసింది. 25శాతం ఫీజు రా యితీతో గడువును పెంచింది. ఈ అవకాశా న్ని సద్వినియోగం చేసు కోవాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి కోరారు. -
ఆర్టీసీ సమ్మె వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
కామారెడ్డి టౌన్: ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఈనెల 7 నుంచి తలపెట్టిన ఆర్టీసీ సమ్మెను విజయవంతం చేయాలని ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ వెంకట్గౌడ్, వీడీ దాస్లు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా కేంద్రంలోని కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ ముందు సమ్మె పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ ర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయా లని, ట్రెడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలని,గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, 2017 వేతన సవరణ బకాయిలను చె ల్లించాలని తదితర డిమాండ్లను రాష్ట్ర ప్రభు త్వం పరిష్కరించాలని కోరారు. ఆర్టీసీ జేఏసీ నాయకులు బాలాగౌడ్, శేకర్, ప్రేమ్కుమార్, గిరి, బుచ్చిరెడ్డి, అంజయ్య, శ్యామ్ కార్మికులు పాల్గొన్నారు. -
‘గణన’ నిర్ణయం బీసీ సంఘాల విజయం
కామారెడ్డి అర్బన్: జనాభా లెక్కలతోపాటు సమగ్ర కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం బీసీ సంఘాల ఉద్యమాల విజయమని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సాప శివరాములు అన్నారు. పట్టణంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నరేంద్రమోదీ ప్రభుత్వానికి బీసీ సంఘాలు ధన్యవాదాలు తెలుపుతున్నాయన్నారు. బీసీల జనాభా ప్రకారం జాతీయ, రాష్ట్రస్థాయిలో ఉద్యోగాలు, రాజకీయ పదవులు, చట్టసభల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని, అంతవరకు ఉద్యమాలు కొనసాగుతాయన్నారు. సమావేశంలో నాయకులు నీల నాగరాజు, ఐరేని సందీప్, నాగరాజుగౌడ్, మోహనచారి, సాయాగౌడ్, రవికుమార్, వడ్ల సురేశ్, దయాకర్, జే నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
బీబీపేట : రోజురోజుకీ పెరుగుతున్న మాంసం వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని పశువుల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మాంసం ఉత్పత్తిని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. పశువులతోపాటు మేత, దాణా లభ్యతను పెంచేందుకు సైతం జాతీయ పశు సంపద మిషన్ (ఎన్ఎల్ఎం) ద్వారా రుణ అవకాశం కల్పిస్తోంది. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ స్కీం ద్వారా రుణాలు పశువుల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ స్కీం(ఎన్ఎల్ఎం) ద్వారా రుణాలను మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగా గొర్రె లు, మేకలు, పొట్టేళ్లు, పందులు, నాటుకోళ్లు, పుంజులతోపాటు పశుగ్రాసం, దాణా పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం కల్పించనుంది. 2021–22 ఆర్ధిక సంవత్సరంలో ప్రారంభమైన ఈ పథకాన్ని పశుసంవర్ధక శాఖ అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. పశువుల పెంపకానికి ఆసక్తి ఉన్న వారికి సబ్సిడీ రుణాలు మంజూరు చేసేందుకు కృషి చేస్తోంది. రూ.10లక్షల నుంచి 50 లక్షల వరకు సబ్సిడీ ఎన్ఎల్ఎం పథకం ద్వారా రూ.10లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సబ్సిడీని మంజూరు చేస్తుంది. లబ్ధిదారుడికి విడతల వారీగా సబ్సిడీ అందించనున్నారు. యూనిట్ నెలకొల్పి న తర్వాత సబ్సిడీ వచ్చే వరకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పర్యవేక్షిస్తుంది.ఎన్ఎల్ఎం అందించే పథకం, రాయితీ వివరాలు..(రూ.లలో)మాంసం ఉత్పత్తి పెంచే దిశగా చర్యలు రూ. 50లక్షల వరకు రుణాలపై రాయితీ ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు ఆహ్వానం అవగాహన లేకపోవడంతో అందని పథకం ఎన్ఎల్ఎం పథకానికి ఆసక్తిగల వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆ తరువాత విచారణ చేపట్టి రుణం మంజూరు చేస్తారు. అలాగే పశువుల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేస్తుంది. దీని ద్వారా రైతులు లబ్ధి పొందడంతోపాటు వారి జీవనాభివృద్ధికి ఉపయోగపడుతుంది. – సంజయ్, జిల్లా పశువైద్యాధికారి, కామారెడ్డి -
భవన నిర్మాణాలకు భూమిపూజ
కామారెడ్డి అర్బన్: తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం (టీఎన్జీవోస్) భవన నిర్మాణ పనులకు టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్రెడ్డి బుధవారం భూమి పూజ చేశారు. వేదపండితుడు జి ఆంజనేయశర్మ పూజలు నిర్వహించి ప్రతినిధులకు తీర్థప్రసాదాలు అందజేశారు. భవన నిర్మాణానికి స్థలం కేటాయించిన కలెక్టర్ కు టీఎన్జీవోస్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముల్క రాజు, అసోసియేట్ అధ్యక్షుడు చక్రధర్, కోశాధికారి దేవరాజు, ప్రతినిధులు లక్ష్మణ్, రాజ్యలక్ష్మి, బి రాజేశ్వర్, పోచయ్య, రాజ్కుమార్, సంతోష్కుమార్, సాయినాథ్, పవన్, కిషన్, అనుదీప్, సురేఖ, శివకుమార్ ఆయా శాఖల నాయకులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ భవనానికి.. కామారెడ్డి అర్బన్: పట్టణంలోని ఎన్జీవోస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. కేశవ ట్రస్ట్ పేరిట ప్లాటు కొనుగోలు చేసి దాదాపు రూ.కోటి వ్యయంతో భవనాన్ని నిర్మిస్తున్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు బి.శంకర్, నగర అధ్యక్షుడు కే.స్వామి, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రంజిత్మోహన్, ఎం.శ్రీకాంత్, నాయకులు ఆకుల భరత్కుమార్, నరేందర్, రాజు పాటిల్, కాసర్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా బసవేశ్వర జయంతి
కామారెడ్డి అర్బన్/ బాన్సువాడ రూరల్/ బిచ్కుంద/ పెద్దకొడప్గల్/ ఎల్లారెడ్డి/ పిట్లం/ కామారెడ్డిటౌన్: కవి, ఆధ్యాత్మిక తత్వవేత్త, సంఘ సంస్కర్త బసవేశ్వర జయంతిని బుధవారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పలు ప్రజా, రాజకీయ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా గ్రంథాలయ సంస్థలో సంస్థ జిల్లా చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి పూజలు చేశారు. బసవేశ్వరుడు కుల వ్యవస్థ లేకుండా అందరికి సమాన అవకాశాలుండాలని ఆకాంక్షించారని అన్నారు. బాన్సువాడలోని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీకళాశాలలో బసవేశ్వర జయంతి నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గులాం ముస్తఫా, అక్బర్ బాషా, పోతరాజు శ్రీనివాస్, విఠల్, శంకర్రావు, అంబయ్య, బాలరాజు, వినయ్కుమార్, చిరంజీవి, మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలోని రాజుల్లా చౌరస్తాలో బిచ్కుంద బండయప్ప మఠం ఫీఠాధిపతి శ్రీ సోమయప్ప స్వామి, బీజేపీ నాయకులు అరుణతార జెండా విష్కరణ చేశారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మల్లికార్జునప్ప షెట్కార్, నాగ్నాథ్ పటేల్, మాశెట్టి సంజీవ్, రాజు పటేల్, నాయకులు పాల్గొన్నారు. పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని వీరశైవ లింగాయత్ మండల అధ్యక్షుడు సంతోష్ దేశాయ్ బసవేశ్వర పతాకాన్ని ఆవిష్కరించారు. బసవేశ్వర చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు మహేందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయ్ దేశాయ్, వివిధ పార్టీల నాయకులు, లింగాయత్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో బసవేశ్వరుడి జయంతిని పురస్కరించుకుని వీరశైవ లింగాయత్ సంఘం అధ్యక్షులు వీరప్ప నీలకంఠేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. బసవేశ్వరుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వీరశైవ సంఘం నాయకులు బసప్ప, రామప్ప, సంగమేశ్వరప్ప తదితరులున్నారు. పిట్లం మండలంలోని కంబపూర్లో వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో బసవేశ్వర జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా బసవేశ్వర విగ్రహావిష్కరణ చేశారు. విగ్రహానికి గ్రామస్తులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వీరశైవ లింగాయత్ సభ్యులు, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయశంకర్ కాలనీలో ఉన్న ఓంకారేశ్వరాలయంలో వీరశైవ లింగాయత్ సమాజ్ సభ్యులు బసవేశ్వర జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కంది శివరాములు, వీరన్న పటేల్, పట్నం శెట్టి శ్రీనివాస్, ఎం ఆంజనేయులు, జీవన్ దేశాయ్, పటేల్ రాజు, బండాయ స్వామి, మారుతి, చంద్రం, ఇంద్రశేఖర్, రామ శంకర్, అర్చకులు అవినాష్ తదితరులు పాల్గొన్నారు. -
నగదు, ఆభరణాల కోసమే మహిళ హత్య
కామారెడ్డి క్రైం: లింగంపేట మండల కేంద్రంలో ఈనెల 23న వెలుగు చూసిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఒంటరిగా నివసిస్తున్న మహిళ వద్దనున్న నగదు, ఆభరణాల కోసమే నిందితుడు హత్య చేసినుట్లు పోలీసుల విచారణలో తేలింది. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్చంద్ర వివరాలు వెల్లడించారు. లింగంపేటకు చెందిన లక్ష్మి(45) ఒంటరిగా ఉంటూ స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఆమె భర్త ప్రభాకర్ గతంలో అనారోగ్యంతో మృతి చెందగా కుమార్తె శిరీషకు వివాహం జరిగి హైదరాబాద్లో ఉంటుంది. ఇటీవల ఆమెకు కన్నాపూర్ గ్రామానికి చెందిన మరో కూలీ గారబోయిన శ్రీకాంత్తో పరిచయం ఏర్పడింది. ఈనెల 20న శ్రీకాంత్ ఆమె ఇంటికి వెళ్లగా, ఆమె ఇంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలపై కన్నేశాడు. ఎవరూ లేనిది చూసి చీరతో మెడకు ఉరివేసి హతమార్చాడు. అనంతరం మృతురాలి సెల్ఫోన్ తీసుకుని, ఇంటికి ఓ తాళం బిగించి, ఆభరణాలు, నగదుతో ఉడాయించాడు. ఆమె కుమార్తె ఫోన్ చేయగా లేపకపోవడంతో ఇంటి పక్కింటివారిని సంప్రదించింది. వారు ఇంటికి వెళ్లగా దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా సాంకేతిక పరిజ్ఞానం సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడిని బుధవారం లింగంపేట వద్ద అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడు గతంలో ఘట్కేసర్ పీఎస్ పరిధిలో కూడా ఇలాంటి హత్యకే పాల్పడ్డాడని, పలుమార్లు జైలుకు సైతం వెళ్లి వచ్చాడని, అతడిపై మొత్తం 9కేసులు ఉన్నాయని ఎస్పీ వివరించారు. కేసు చేధనలో విశేషంగా కృషి చేసిన ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస రావు, సీఐ రవీందర్ నాయక్, ఎస్సై వెంకట్ రావు, సిబ్బంది మురళి, జవ్వి నాయక్, శ్రీనివాస్ లను అభినందించారు. లింగంపేట మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్చంద్ర -
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఆర్మూర్: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారికి ఇళ్లు అద్దెకు ఇచ్చే సమయంలో జాగ్రత్తలు పాటిస్తూ అద్దెకు ఇవ్వాలని ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి సాయికిరణ్ సూచించారు. పట్టణంలోని కమలానెహ్రూ కాలనీ, టీచర్స్ కాలనీల్లో బుధవారం తెల్లవారు జామున కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐలు సత్యనారాయణ, శ్రీధర్రెడ్డి, తొమ్మిది మంది ఎస్సైలు తమ 110 మంది పోలీసు బలగాలతో ఆయా కాలనీని జల్లెడ పట్టారు. ప్రతీ ఇంటిలో సోదాలు నిర్వహిస్తూ 9మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 10 బైక్లను, రెండు ఆటోలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. -
షార్ట్సర్క్యూట్తో దుకాణం దగ్ధం
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం గాలీపూర్ గ్రామంలో బుధవారం మధ్యాహ్నం షార్ట్సర్క్యూట్తో కిరాణం దుకాణం పూర్తిగా దగ్ధమైంది. గ్రా మానికి చెందిన గంజి రాజు కిరాణం దుకాణంలో బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కిరాణ సామగ్రి తగలబడటంతోపాటు నగదు పూర్తిగా అగ్నికి అహుతి అయ్యాయి. స్థానికులు గమనించి బిందెలతో నీటిని తీసుకువచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో దుకాణం పూర్తిగా కాలిబూడిదయింది. ఈ ప్రమాదంలో రూ. 2 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిసింది. యువకుడి అదృశ్యం కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలోని పెద్దబజార్ ప్రాంతానికి చెందిన మామిండ్ల రవింద్ర నిఖిల్ అనే యువకుడు అదృశ్యమైనట్లు పట్టణ ఎస్హెచ్వో చంద్రశేఖర్రెడ్డి బుధవారం తెలిపారు. ఈ నెల 28న ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతడు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చాలాచోట్ల వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో అతడి తల్లి నందిని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
కార్మికుల బతుకుల్లో కానరాని కాంతులు
ఆర్మూర్: కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ శాఖను ఏర్పాటు చేసినా వారి బతుకులు మారడం లేదు. కార్మికుల పక్షాన పోరాటాలు చేయడానికి అనేక యూనియన్లు పుట్టుకొచ్చినా, ఉద్యమాలు చేసినా వారి జీవితాల్లో కాంతులు నిండటం లేదు. కనీసం ఉద్యమంలో పాల్గొని సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలోనైనా తమ బతుకులు మారేనా అని కార్మికులు పదకొండేళ్లుగా ఆశ గా ఎదురు చూస్తూనే ఉండాల్సిన దుస్థితి నెలకొంది. మే 1న ప్రపంచ వ్యాప్తంగా కార్మిక దినోత్సవా న్ని ఘనంగా జరుపుకుంటున్నా కార్మికుల బతుకులు చీకటిలో మగ్గిపోతున్నాయనేది అక్షర సత్యం. జీపీ కార్మికుల వెట్టి చాకిరీ.. జిల్లాలో పారిశుధ్య కార్మికులు వెట్టి చాకిరీ చేస్తున్నా రు. అనేక మంది కార్మికులకు చాలీచాలని జీతాలతో పొట్ట గడవడం కష్టంగా ఉంది. పంచాయతీల ఆదాయం, పన్నుల వసూళ్లతో సంబంధం లేకుండా వేతనాలను చెల్లించాలని కార్మికులు ఉద్యమాలు చే సిన ఫలితంగా ఇటీవల వేతనాలను రాష్ట్ర ప్రభు త్వం చెల్లిస్తోంది. కానీ మూడు, నా లుగు నెలల వేతనం పెండింగ్లో ఉంచి వేతనాల చెల్లింపు చేయడంతో కార్మికులు ఇక్కట్లు పడుతున్నారు. బీడీ కార్మికులకు చేతి నిండా పని కరువు.. జిల్లాలో వ్యవసాయం తరువాత ఎక్కువ మంది బీడీ పరిశ్రమను నమ్ముకొని జీవిస్తున్నారు. పీఎఫ్ ఉన్న బీడీ కార్మికులకు వెయ్యి బీడీలు చుడితే రూ. 250 కూలీ, పీఎఫ్ లేని వారికి రూ.270 లభిస్తున్నా యాజమాన్యాలు అనుసరిస్తున్న తీరుతో చేతి నిండా పని లేకుండా పోయింది. బీడీలు చుట్టేందుకు కార్మికులు ముందుకు వచ్చినా వర్దీ బీడీల వల్ల వె య్యి బీడీలకు సంగం కూలీ తీసుకోవాల్సి వస్తోంది. మరోవైపు పారిశుధ్య కార్మికులు, బీ డీ కార్మికుల వేతనాలకంటే ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల పరిస్థితి బాగుంది. కూలీలకు పని సమయం తక్కువగా ఉన్నా, రోజు కూలీ లభిస్తుండడంతో పనులు భేషుగ్గా ఉన్నాయని పలువురు అ భిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు స్పందించి కార్మికులకు సరైన ఉపాధి, సకాలంలో వేతనాలు అందించాలని పలువురు కోరుతున్నారు. యూనియన్లు ఉన్నా.. పోరాటాలు చేసినా మారని జీవితాలు నేడు కార్మికుల దినోత్సవం ‘మేడే’ -
తాళం వేసిన రెండిళ్లల్లో చోరీ
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని తాళాలు వేసిన రెండు ఇళ్లల్లో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. గ్రామానికి చెందిన వంకాయపల్లి సాయిలు భార్య ఇంటికి తాళం వేసి ఇతర గ్రామాలకు వెళ్లారు. గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాన్ని పగులగొట్టి ఇంట్లో ఉన్న తులం బంగారం పడిగెలు, అరతులం కమ్మలు, అరతులం గుండ్లు, 40తులాల వెండి కాళ్లకడియాలు, పట్ట గొలుసులు, రూ.8వేల నగదును దొంగలించారు. అదే గ్రామానికి చెందిన జోగు పరుశరాములు ఇంటి తాళం పగులగొట్టి 7తులాల వెండి పట్టగొలుసులు, బంగారు నగలు, రూ.39వేల నగదును దొంగలించారు. బాధితుల సమాచారం మేరకు ఎస్ఐ రాజయ్య ఘటనస్థలాలను పరిశీలించి, వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లారీ నుంచి రోడ్డుపై పడ్డ ధాన్యం బస్తాలు తాడ్వాయి(ఎల్లారెడ్డి): వడ్ల సంచుల లోడ్తో ఉన్న లారీ బుధవారం లింగంపేట్ నుంచి కామారెడ్డి వైపు వెళుతుండగా సంచులు రోడ్డుపై పడ్డాయి. అక్కడ ఎవరు లేక పోవడంతో ప్రమాదం తప్పింది. 20 సంచుల వరకు రోడ్డుపై జారిపడ్డాయి. స్థానికులు గమనించి, డ్రైవర్కు తెలపడంతో అతడు లారీని ఆపి, సంచులను మళ్లీ ఎక్కించుకొని బయలుదేరాడు. సంచులు పడే సమయంలో ఇతర వాహనదారులు ఉంటే ప్రమాదం జరిగిఉండేదని, ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. -
భూసమస్యలను పరిష్కరించాలి
సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ కామారెడ్డి క్రైం: రెవెన్యూ సదస్సుల దృష్టికి వచ్చిన ప్రతి భూసమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ సూచించారు. భూభారతి చట్టంపై పైలెట్ మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న రాష్ట్రం లోని నాలుగు జిల్లాల కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లతో బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. లింగంపేట్ తహసీల్ కార్యాలయం నుంచి కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అధికారులు వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ కమిషనర్ మాట్లాడుతూ.. భూభారతి చట్టం అమలులో భాగంగా ముందస్తుగా నాలుగు పైలెట్ మండలాలను ఎంపిక చేసుకొని, రెవెన్యూ సదస్సులను నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించామన్నారు. సదస్సుల్లో భాగంగా భూసమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించి సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. వీసీలో భాగంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ.. లింగంపేట్ మండలంలో ఉన్న 23 రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, దాదాపు 3,700 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. సర్వే నంబర్ సమస్యలు, విస్తీర్ణ సమస్యలు, సాదా బైనామా లాంటి పలు రకాల భూ సమస్యలపై దరఖాస్తులు వచ్చాయని కమిషనర్కు వివరించారు. భూభారతి చట్టం నిబంధనల ప్రకా రం దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. వీసీలో అదనపు కలెక్టర్ వి విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీవో ప్రభాకర్, ప్రత్యేకాధికారి రాజేందర్, తహసీల్దార్ సురేశ్, భూ కొలతల సహా య సంచాలకులు ఎం శ్రీనివాస్ పాల్గొన్నారు. -
వేర్వేరు ఘటనల్లో పలువురి మృతి
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని నల్లమడుగు పెద్ద తండాకు చెందిన ఓ యువతి రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు తండావాసులు తెలిపారు. వివరాలు ఇలా..తండాకు చెందిన అర్చన(19) అనే ఇంటర్ విద్యార్థిని మంగళవారం సోదరుడు అరవింద్తో కలిసి ఈఏపీసెట్ పరీక్ష రాశారు. బుధవారం ఉదయం అరవింద్, అర్చన ఇద్దరు కలిసి బైక్పై హైదరాబాద్ నుంచి స్వగ్రామం నల్లమడుగు పెద్ద తండాకు బయలుదేరారు. మేడ్చల్ రింగ్ రోడ్డు సమీపంలో వీరి బైక్ను ఓ లారీ వెనుక నుంచి వచ్చిన ఢీకొట్టింది. ఈ ఘటనలో అర్చన అక్కడికక్కడే మృతి చెందగా, అరవింద్కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. రైలు ఢీకొని వృద్ధురాలు.. డిచ్పల్లి: డిచ్పల్లి రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వృద్ధురాలు మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయరెడ్డి బుధవారం తెలిపారు. వివరాలు ఇలా.. డిచ్పల్లి మండలం దూస్గాం గ్రామానికి చెందిన రాయ సాయవ్వ (65) బుధవారం ఉదయం డిచ్పల్లి రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా అప్పుడే వేగంగా వచ్చిన ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈఘటనలో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ చందన్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. దాబా పైనుంచి పడి యువకుడు.. డిచ్పల్లి: మండలంలోని డిచ్పల్లి రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఓ యువకుడు దాబా పైనుంచి కింద పడి మృతిచెందాడు. ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపిన వివరా లు ఇలా.. డిచ్పల్లి రైల్వేస్టేషన్ ప్రాంతంలో నివసించే షేక్ అజహర్ (29) పెయింటర్గా పని చేస్తూ, మద్యానికి బానిసగా మారాడు. దీంతో అతడి భా ర్య కొన్ని నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మద్యం మత్తులో ఉ న్న అజహర్ తమ ఇంటి దాబా పైనుంచి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబీకులు జి ల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుడి త ల్లి తస్లీమ్బేగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వ్యాన్ కింద పడి బాలుడు.. సిరికొండ: మండలంలోని ము షీర్నగర్ గ్రామంలో డీజే బా క్సుల వ్యాను కింద పడి ఓ బా లుడు మృతి చెందినట్లు ఎస్సై రామ్ బుధవారం తెలిపారు. గ్రామానికి చెందిన మాలావత్ బాలు కుమారుడు జగదీష్(13), గణేష్ అనే వ్యక్తి తో కలిసి వ్యానులో మంగళవారం రాత్రి డీజే బా క్సులు తీసుకురావడానికి వెళ్లాడు. గణేష్ వాహనా న్ని అజాగ్రత్తగా నడపడంతో వ్యాను వెనుక బాక్సులపైన కూర్చున్న జగదీష్ కింద పడిపోయాడు. అతడి తలపై నుంచి వాహనం వెళ్లడంతో జగదీష్ అక్కడిక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చాలి
బాన్సువాడ రూరల్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలను నెర వేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభు త్వ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్లో దళిత నాయకులు, అంబేడ్కర్ యువజనసంఘం ప్రతినిధులతో కలిసి బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. అనంతరం గ్రామ స్తులు పోచారంను సన్మానించి అంబేడ్కర్ ప్రతిమ ను బహూకరించారు. కార్యక్రమంలో నాయకులు మాలెపు నారాయణరెడ్డి, కాసుల రోహిత్, నెర్రె నర్సింహులు, ఉద్దర హన్మాండ్లు, బంగారు మైస య్య, గ్రామ అధ్యక్షులు శివయ్య, చెట్లూరి సాయి లు, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అందరివాడు.. బిచ్కుంద(జుక్కల్): డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని, ఆయన అందరివాడని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. సిర్సముందర్లో బుధవారం అంబేడ్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. విగ్రహ దాత, కాంగ్రెస్ నాయకుడు, రిటైర్డ్ ఉపాధ్యాయుడు సీమ గంగారాంను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు మల్లికార్జునప్ప షెట్కార్, విఠల్రెడ్డి, వెంకట్రెడ్డి, నాగ్నాథ్, ధర్పల్ గంగాధర్, సీమ గంగారాం, గోపాల్రెడ్డి, నాగనాథ్ పటేల్, దళిత నాయకులు తుకారాం, సాయిలు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ ఆశిష్సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో రెవెన్యూ అధికారులతో బుధవారం సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లింగంపేట మండలంలోని 23 రెవెన్యూ గ్రామాల్లో 3,700 దరఖాస్తులు అందాయని వివరించారు. మొత్తం తొమ్మిది టీములను ఏర్పాటు చేశామని, తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, సర్వేయర్ల టీముల్లో ఉంటారని, ఒక్కో టీము 400 దరఖాస్తులను పరిశీలించాలని టీములకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని తహసీల్దార్ సురేశ్కు సూచించారు. అదనపు కలెక్టర్ విక్టర్, సబ్కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీవో ప్రభాకర్, తహసీల్దార్ సురేశ్, భూభారతి ప్రత్యేకాధికారి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి రేషన్ బియ్యం పంపిణీ
కామారెడ్డి రూరల్: రేషన్ బియ్యం పంపిణీ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఒక్కో యూనిట్కు ఆరు కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నారు. అంత్యోదయ కార్డులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డులకు 10 కిలోల చొప్పున అందిస్తారు. అయితే ప్రతి నెలా 1 నుంచి 15వ తేది వరకు మాత్రమే బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాలశాఖ అధికారులు తెలిపారు. స్టేషన్లకు ప్రొబెషనరీ ఎస్సైలుకామారెడ్డి క్రైం: జిల్లాలో ముగ్గురు ప్రొబెషనరీ ఎస్సైలకు శిక్షణలో భాగంగా పోలీస్ స్టేషన్లను కేటాయిస్తు ఎస్పీ రాజేశ్చంద్ర బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్స్టేషన్ నిర్వహణ విధులు తెలుసుకునేందుకుగాను నెల రోజులపాటు ఆయా పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించనున్నారని ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు. లింగంపేట పీఎస్కు పి రాఘవేంద్ర, నస్రుల్లాబాద్కు అరుణ్కుమార్, రామారెడ్డికి నవీన్చంద్రను కేటాయించారు. పదిహేను రోజుల్లో బస్టాండ్ను ప్రారంభిస్తాం ఎల్లారెడ్డి: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ను 15 రోజుల్లో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు. బస్టాండ్, ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే బుధవారం పరిశీలించారు. ఆర్టీసీ బస్టాండ్లో సీసీ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేసి 15 రోజుల్లో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. అలాగే ఆస్పత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసి జూన్ చివరిలోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. మధ్యంతరంగా నిలిచిన ఆర్టీసీ బస్టాండ్, వంద పడకల ఆస్పత్రి పనులకు మంత్రితో చర్చించి నిధులు మంజూరు చేయించామన్నారు. ఆయనవెంట మున్సిపల్ మాజీ చైర్మన్ పద్మశ్రీకాంత్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వినోద్గౌడ్, కాంగ్రెస్ నాయకులు విద్యాసాగర్, పప్పు వెంకటేశం, రఫీక్, ఆరిఫ్, అజహర్ తదితరులున్నారు. రేపు కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంకామారెడ్డి టౌన్: కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాలులో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేశ్ షెట్కార్, వ్యవసాయ సలహాదారు శ్రీనివాస్రెడ్డితోపాటు పార్టీ ఎమ్మెల్యేలు హాజరవుతారని పేర్కొన్నారు. సమావేశానికి జిల్లాలోని తాజా, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరుకావాలని కోరారు. -
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి
కామారెడ్డి క్రైం: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశం ధాన్యం సేకరణే అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి హైదరాబాద్ నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడగా, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అధికారులు తాడ్వాయి మండల కేంద్రం నుండి వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్త మ్ మాట్లాడుతూ.. రైస్ మిల్లులకు బ్యాంక్ గ్యారెంటీల విషయంలో ఎలాంటి మినహాయింపు ఇవ్వ డం కుదరదని స్పష్టం చేశారు. అవసరమైతే ధాన్యాన్ని గోదాములకు తరలించాలని అన్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు జిల్లాలో ఇప్పటివరకు 446 కొనుగోలు కేంద్రాల ద్వారా 22,785 మంది రైతుల నుంచి 1,81,776 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. 1,01,038 మె ట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.234.41 కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయని, 5,315 మంది రైతులకు సన్న ధాన్యానికి రూ.25.89 కోట్ల బోనస్ చెల్లించామని వివరించారు. ఆర్డీవో వీణ, డీఎస్వో మల్లికార్జున్బాబు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, సహకార అధికారి రామ్మోహన్, డీఏవో తిరుమల ప్రసాద్, డీఆర్డీవో సురేందర్, డీపీవో ము రళి, మార్కెటింగ్ అధికారిణి రమ్య పాల్గొన్నారు. ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశం ధాన్యం సేకరణే.. బ్యాంక్ గ్యారెంటీల అంశంలో రైస్మిల్లర్లకు మినహాయింపు ఉండదు వీసీలో మంత్రి ఉత్తమ్కుమార్ -
భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి
రాజంపేట/తాడ్వాయి/కామారెడ్డి రూరల్ : భూసమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ భారతిని తీసుకొచ్చిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. రాజంపేట, తాడ్వాయి మండల కేంద్రాలతోపాటు కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి రైతు వేదికల్లో బుధవారం నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ధరణికి బదులు తీసుకొచ్చిందని భూ భారతితో ప్రతి ఒక్క రైతుకూ మేలు జరుగుతుందన్నారు. సెక్షన్ నాలుగు ప్రకారం హక్కుల రికార్డులో తప్పుల సవరణకు, భూమి హక్కులు ఉండి రికార్డుల్లో పేర్లు లేని వారికి హక్కుల రికార్డులో పేరును నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.సెక్షన్ ఐదు ప్రకారం వ్యవసాయభూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసుకోచ్చని తెలిపారు. 2014 జూన్ 2కు ముందు సాదాబైనామా ద్వారా భూమి కొనుగోలు చేసి క్రమబద్ధీకరణకోసం అందిన దరఖాస్తులపై ఆర్డీవోల ద్వారా విచారణ చేపట్టి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందన్నారు. ఆధార్ కార్డుల మాదిరిగా రైతులకు భూధార్ కార్డులను జారీ చేస్తామని తెలిపారు. గతంలో ధరణీలో అప్పీలు కు ఆస్కారం లేనందున సివిల్ కోర్టుకు వెళ్ళవలసి ఉండేదని, ప్రస్తుతం తహసీల్దార్ ఇచ్చిన తీర్పులో అభ్యంతరం ఉంటే ఆర్డీఓ కు, ఆర్డీఓ తీర్పులో అభ్యంతరం ఉంటే కలెక్టర్ కు అప్పీలు. చేసుకోవచ్చని, కలెక్టర్ ఇచ్చిన తీర్పు అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్ కు అప్పీలు చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఆర్డీవో వీణ మాట్లాడుతూ.. ధరణిలో 33 మాడ్యూల్స్ ఉండేవని, భూభారతి చట్టంలో కేవలం 6 మాడ్యూల్స్లతో భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి వీలవుతుందన్నారు. మాజీ వైస్ ఎంపీపీ నర్సింలు మాట్లాడుతూ.. మండలంలో ఇనాం భూములు కలిగిన రైతులకు పట్టా పాస్పుస్తకాలు ఇవ్వాలని కలెక్టర్ను కోరారు. కార్యక్రమంలో మండలాల ప్రత్యేకాధికారులు రాజారాం, అపర్ణ, తహసీల్దార్లు రహీమొద్దీన్, సతీశ్రెడ్డి, ఎంపీడీవోలు సయ్యద్ సాజీద్అలీ, రఘురాం, సింగిల్విండో చైర్మన్లు నల్లవెల్లి అశోక్, కంది శివరాములు, కపిల్రెడ్డి పాల్గొనగా, చిన్నమల్లారెడ్డిలో నిర్వహించిన సదస్సులో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ధర్మగోని లక్ష్మీరాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పోర్టల్ తీసుకువచ్చింది వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసుకోవచ్చు అవగాహన సదస్సులో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
ఉపాధి ప్రణాళిక ఖరారు
కామారెడ్డి రూరల్: గ్రామాల్లో వలసలను నివారించి కూలీలకు పని కల్పించేందుకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద 2025–26 ఆర్ధిక సంవత్సరానికి పనిదినాలను అధికారులు ఖరారు చేశారు. గతేడాది అక్టోబరు నుంచి డిసెంబరు వరకు గ్రామాల్లో ఉపాధి పనుల గుర్తింపు కోసం అధికారులు గ్రామసభలను నిర్వహించారు. 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31వరకు స్థానికంగానే కూలీలకు పనులు కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మండలంలోని 14 గ్రామ పంచాయతీల పరిధిలో.. కామారెడ్డి మండలంలోని 14 గ్రామపంచాయతీల పరిధిలో 2025–26 ఆర్థికసంవత్సరంలో మొత్తం 2,20,200 పనిదినాలను కల్పించాలని డీఆర్డీవో అధికారులు నిర్ణయించారు. మొత్తం 6,538 జాబ్ కార్డులున్నాయి. కార్మిక బడ్జెట్ రూ. 12.43 కోట్లు, మెటిరియల్ బడ్జెట్ రూ. 2 కోట్ల 69 లక్షల 78 వేలు మంజూర య్యాయి. గతానికి భిన్నంగా గ్రామం యూనిట్ గా పనులు చేపట్టాలని రెండేళ్లక్రితం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పనుల గుర్తింపు, కూలీల వేతనాలను చెల్లించేందుకు కొత్త సాప్ట్వేర్ను ఎన్ఐసీని (నేషనల్ ఇన్ఫార్మాటెక్ సెంటర్)వినియోగిస్తున్నారు. ఈ విధానం ద్వారా ఉపాధి పనులకు హాజరైన కూలీలకు ఆధార్కార్డు నంబర్తో లింక్ ఉన్న బ్యాంకు ఖాతాలో వేతనాలను జమ చేస్తున్నారు.చేపట్టనున్న పనులు...కేంద్ర ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఈ ఏడాది గ్రామాలకు ఉపయోగపడే పనులను గుర్తించారు. ప్రధానంగా చెరువులు, కుంటలు, పంట కాలువల్లో పూడికతీత, నీటికుంటల నిర్మాణం, ఇంకుడుగుంతలు, వనమహోత్సవానికి గుంతల తవ్వకం, పంటపాలాలకు కొత్త దారుల నిర్మాణం తదితర పనులు చేపట్టనున్నారు. ప్రతి గ్రామంలో వందమందికి తగ్గకుండా ఉపాధి పనులు కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టారు. 2025–26 ఏడాదిలో 2.20 లక్షల పనిదినాలు వ్యవసాయ పనులకు ప్రాధాన్యత కామారెడ్డి మండలంలో 6,538 జాబ్ కార్డులు -
లారీలు రావు.. ధాన్యం బస్తాలు పోవు
నిజాంసాగర్ : నిజాంసాగర్, మహమ్మద్నగర్ మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ధాన్యం బస్తాల తరలింపునకు లారీలు కొరత తీవ్రంగా ఉంది. దీంతో ధా న్యం తూకాలు వేసినా లారీలు సక్రమంగా రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో బస్తాల నిల్వలు పేరుకుపోతున్నాయి. మహమ్మద్నగర్ మండలంలోని కోమలంచ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం తూకాలు చేపడుతున్నారు. రైతుల నుంచి ధాన్యం కాంటా వేయడంతో పాటు ధాన్యం బస్తాల తరలింపునకు తంటాలు పడుతున్నారు. ఈ కొనుగోలు కేంద్రానికి లారీలు సక్రమంగా రాకపోవడంతో కొనుగోలు కేంద్రం వద్ద సుమారు 3 వేల వరకు ధాన్యం బస్తాలు పేరుకుపోయాయి. రోజుకు ఒక్క లారీ చొప్పున వస్తుండడంతో ధాన్యం బస్తాల నిల్వలు రోజురోజుకు పేరుకుపోతున్నాయని రైతులంటున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రం వద్ద తూకాలు చేసే యంత్రాలు చెడిపోతుండడంతో నిర్వాహకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. కోమలంచ కొనుగోలు కేంద్రంలో రైతులకు తిప్పలు మూడు వేల బస్తాలు కేంద్రంలోనే ఉన్నాయి ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కేంద్రం నిర్వహిస్తున్నాం. బిహారీ కూలీలు హమాలీ చేస్తుండటంతో తూకాలు చేపడుతున్నాం. రోజుకు ఒక్కలారీ మాత్రం వస్తుండటంతో ధాన్యం బస్తాల నిల్వలు పేరుకుపోతున్నాయి. ప్రస్తుతం మూడు వేల బస్తాల ధాన్యం కేంద్రంలోనే ఉన్నాయి. రోజు ఒక్క లారీ మాత్రం వస్తుండటంతో ధాన్యం బస్తాలు రైస్ మిల్లులకు వెళ్లడం లేదు. రోజుకు రెండు, మూడు లారీలు పంపిస్తే కొరత ఉండదు. – విజయ, గ్రామ సంఘం అధ్యక్షురాలు -
రహదారి విస్తరణతో తొలగుతున్న మలుపులు
ఎల్లారెడ్డి: హైదరాబాద్ –మెదక్ –బోధన్(హెచ్ఎంబీ) జాతీయ రహదారి(765 డి) విస్తరణలో భాగంగా నేషనల్ హైవే అథారిటీ అధికారులు మలుపులను తొలగిస్తున్నారు. దీంతో వాహనదారులకు దూరభారం తగ్గనుంది. 765 డి జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా దిండిగల్ నుంచి రుద్రూర్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. ఇప్పటికే దిండిగల్ నుంచి మెదక్ వరకు 10 మీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. టూ లైన్ విత్ పేవ్డ్ షోల్డర్స్ పద్ధతిన మెదక్ నుంచి రుద్రూర్ వరకు కొత్త డిజైన్ ప్రకారం జాతీయ రహదారి నిర్మిస్తున్నారు. దిండిగల్ నుంచి నర్సాపూర్ అటవీ ప్రాంతం గుండా మెదక్ వరకు నిర్మించిన రోడ్డులో భారీ మలుపులను తొలగించి రోడ్డు నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం మెదక్ నుంచి రుద్రూర్ వరకు జరుగుతున్న రోడ్డు పనులలో భాగంగా మెదక్ శివారులోని ఔరంగాబాద్, హవేళీ ఘణపురం, పోచారం అభయారణ్యం, ప్రాజెక్ట్ పైబ్రిడ్జి నిర్మాణంతో బైపాస్ రోడ్డు, తాండూర్ గేట్, జానకంపల్లి, మెల్లకుంట తండా, కన్నారెడ్డి, మాచాపూర్ గ్రామాల వద్ద ఎల్లారెడ్డి వరకు భారీ మలుపులను తొలగించా రు. ఎల్లారెడ్డి నుంచి రుద్రూర్ వరకు లింగారెడ్డిపేట్, తిమ్మారెడ్డి, అన్నాసాగర్, కామ్శెట్టిపల్లి, నస్రుల్లాబాద్ ప్రాంతాలలో భారీ మలుపులను తొలగించి నేరుగా రోడ్డు వేస్తున్నారు. దిండిగల్ నుంచి రుద్రూర్ వరకు మలుపులను తొలగించడం వల్ల సుమారు 35 కిలోమీటర్ల దూరం తగ్గే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. దీని ప్రకారం ఎల్లారెడ్డి నుంచి సికింద్రాబాద్ బస్టాండ్ వరకు గతంలో 138 కిలోమీటర్ల దూరం ఉండగా కొత్త రోడ్డు నిర్మాణంతో 125 కిలోమీటర్లకు తగ్గనున్నట్లు తెలుస్తోంది. జాతీయ రహదారుల నిర్మాణంలో భారీ మలుపులను తొలగించడం వల్ల దూరభారం తగ్గనుండడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తగ్గనున్న దూరభారం హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు -
కువైట్లో ఎల్లారెడ్డిపల్లెవాసి మృతి
ఇందల్వాయి: మండలంలోని ఎల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన గోషికొండ గంగ నర్సయ్య(36) శుక్రవారం కువైట్లో అనారోగ్యంతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడు నాలుగు సంవత్సరాలుగా కువైట్లో ఉంటున్నాడని, మృతుడికి భార్య, ఏడేళ్ల లోపు ఇద్దరు కొడుకులు ఉన్నట్లు తెలిపారు. మృతదేహం స్వగ్రామం చేరుకునేలా ప్రభుత్వం చొరవ చూపాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. చోరీ సొత్తుతో పట్టుబడ్డ దొంగ రాజంపేట: చోరీకి పాల్పడి సొత్తుతో బైక్పై వెళ్తున్న దుండగుడు పోలీసులకు పట్టుబడ్డాడు. ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాలు ఇలా.. రాజంపేట పోలీస్ స్టేషన్ సిబ్బంది ప్రేమ్సింగ్, మహమ్మద్ అజీమ్లు సోమవారం రాత్రి గస్తీ నిర్వహిస్తుండగా తెల్లవారుజామున అనుమానాస్పదంగా బైక్పై వెళ్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా అతడు చోరీ చేసిన సొమ్ము, వస్తువులు కనిపించాయి. నిందితుడు భిక్కనూర్ మండలం, కామారెడ్డి పట్టణంలో దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించి, కేసు నమోదు చేశారు. అనంతరం జ్యుడీషియల్ రిమాండ్కు పంపించారు. రాత్రివేళ నైట్ డ్యూటీ నిర్వహిస్తూ నిందితుడిని పట్టుకున్న కానిస్టేబుళ్లను ఎస్సై పుష్పరాజ్ అభినందించారు. షార్ట్సర్క్యూట్తో గడ్డి దగ్ధం మోపాల్: మండలంలోని సిర్పూర్ గ్రామంలో సోమవారం రాత్రి డీసీఎంలో తరలిస్తున్న గడ్డికట్టలు షార్ట్ సర్క్యూట్తో దగ్ధమయ్యాయి. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని సిర్పూర్ నుంచి ముదక్పల్లికి డీసీఎంలో గడ్డి కట్టలు తీసుకెళ్తున్నారు. సిర్పూర్ గ్రామ పంచాయతీ వద్ద విద్యుత్ తీగలు వ్యాన్కు తగిలి మంటలు చెలరేగాయి. స్థానికులు బోరు పైపుతో నీరు పట్టి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ గడ్డి కట్టలకు మంటలు అంటుకుని చెలరేగడంతో గ్రామస్తులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారమందించారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో డీసీఎం వ్యాన్ స్పల్పంగా దెబ్బతినగా, గడ్డి కట్టలు కాలిపోయాయి. డ్రంకన్డ్రైవ్ కేసులో మూడురోజుల జైలుశిక్ష డిచ్పల్లి: మండల కేంద్రంలోని నాగ్పూర్ గేట్, సీఎంసీ చౌరస్తాలో ఈ నెల 20న ఎస్సై ఎండీ షరీఫ్ ఆధ్వర్యంలో పోలీసులు డ్రంకన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. బీబీపూర్ తండాకు చెందిన బదావత్ మంగులాల్, మహరాష్ట్రకు చెందిన శ్రీరంగు రామ మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వారిని మంగళవారం కోర్టులో హాజరుపర్చగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రహీముద్దిన్ నిందితులకు మూడు రోజుల జైలు శిక్ష విధించారు. దీంతో నిందితులను జైలుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. దోమకొండలో వ్యక్తి అదృశ్యం దోమకొండ: మండల కేంద్రానికి చెందిన అవధూత నర్సింలు (49) అదృశ్యమైనట్లు ఎస్సై స్రవంతి మంగళవారం తెలిపారు. ఈనెల 25న ఉదయం నర్సింలు ఇంట్లో మేస్త్రి పనికి వెళ్లి వస్తా అని చెప్పి బయటకు వెళ్లాడు. ఇప్పటివరకు తిరిగి ఇంటికి రాలేడు. నాలుగు రోజులుగా కుటుంబసభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. దీంతో మంగళవారం నర్సింలు కుమారుడు సిద్ధిశ్వర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. -
ఎన్ఫోర్స్మెంట్ టీంకు క్యాష్ప్రైజ్
ఖలీల్వాడి: నిజామాబాద్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ టీంకు రాష్ట్ర ఎకై ్సజ్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి మంగళవారం రూ. 15వేల క్యాష్ రివార్డు అందజేశారు. ఇటీవల నవీపేట్ మండలం యంచ వద్ద 30కిలోల డ్రై గంజాయి, ఒక కారు, రెండు మోటార్ సైకిళ్లను ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది స్వాధీనం చేసుకుని, ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈసందర్భంగా వారిని అభినందిస్తూ క్యాష్ప్రైజ్ను అందజేశారు. అలాగే ఫిబ్రవరి 14న కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్లో 91కిలోల ఎండుగంజాయిని పట్టుకున్నారు. వీరికి రూ.30 వేల క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. ఎకై ్సజ్ అదనపు కమిషనర్ ముఖర్జీ, డీసీ సోమిరెడ్డి, ఎస్టీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ ప్రణవని, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ ప్రదీప్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ స్వప్న, ఎస్సై రామకుమార్, సిబ్బంది హమీద్, అవినాష్, విష్ణు, సుకన్య, శ్యామ్ సుందర్, సాయి కుమార్లు ఉన్నారు. -
ఫైనాన్స్ దందా ఆగం..
● అవసరానికి సర్దుబాటు కాని పరిస్థితి ● ఇబ్బంది పడుతున్న పేద, మధ్యతరగతి వర్గాలు ● ఎవరిని కదిలించినా డబ్బు సమస్యనే.. ● పల్లె పట్నం అంతటా ఇదే తీరు సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : గతంలో డబ్బులు అవసరం ఉందంటే ఎవరో ఒకరు సర్దుబాటు చే సేవారు. స్నేహితులు, బంధువులు చేబదలు ఇ చ్చేవారు. లేదంటే అప్పైనా పుట్టేది. వాటితో అ వసరాలు వెళ్లదీసుకుని, డబ్బులు సర్దుబాటు అయ్యాక తిరిగి చెల్లించేవారు. వడ్డీ వ్యాపారులు, ఫైనా న్స్ నిర్వాహకులు కూడా నమ్మకం ఉన్న వారికి అ ప్పులిచ్చేవారు. ఇప్పుడు పరిస్థితులు తలకిందులయ్యాయి. అవసరానికి డబ్బులు సర్దుబాటు కావ డం లేదని, కనీసం అప్పు కూడా పుట్టడం లేదని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఆపదలో కూడా డబ్బులు సర్దుబాటు కాక పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందిపడుతున్నా రు. వ్యవసాయంలో పెట్టుబడులు పెరగడం, దిగుబడులు తగ్గడంతో కష్టానికి ఫలితం దక్కడం లేదు. ఏడాదికేడాది అప్పులు పెరగడమే తప్ప మిగులుబాటు లేకుండాపోయింది. కుల వృత్తులు, స్వయం ఉపాధి చేసుకునేవారు కూడా అద్దెలు, విద్యుత్ బిల్లులు, నిర్వహణ వ్యయం పెరిగిపోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నచిన్న వ్యా పారాలు చేసుకునేవారు కూడా మడిగెల అద్దెలు భా రంగా మారడం, వ్యాపారంలో పోటీ పెరగడంతో వారి ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింది. రోజువారీ పనులు చేసుకునేవారి సంపాదన బట్టకు, పొట్టకు అన్నట్టుగా తయారైంది. పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, ప్లాటు కొనుగోలు, ఇంటి నిర్మాణం.. ఇలా దేనికై నా అప్పులు చేయాల్సినని పరిస్థితి. అయితే ఏ అవసరం ఉన్నా ఎవరో ఒకరు డబ్బులు సర్దుబాటు చేస్తారన్న నమ్మకం లేకుండాపోయింది. దీంతో చాలా మంది మనోవేదనకు గురవుతున్నారు. కలిసిరాని కాంట్రాక్టు పనులు.. ప్రభుత్వ అభివృద్ధి పనుల కాంట్రాక్టులు చేసి నాలుగు డబ్బులు వెనకేసుకోవాలని కొందరు కింది స్థాయి నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అప్పులు చేసి పనులు పూర్తి చేశారు. ఏళ్లు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్లు చాలా మంది రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా పనుల మీద పెట్టుబడులు పెట్టారు. వారంతా రెండుమూడేళ్లుగా బిల్లులు రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఓ మారుమూల గ్రామ సర్పంచ్ చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో భూమిని అమ్ముకుని అప్పులు కట్టాడు. లాభాల మాట అటుంచితే అప్పుల కింద ఉన్న భూమి పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చిన్నచిన్న కాంట్రాక్టర్లతో పాటు బడా కాంట్రాక్టర్లు కూడా బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నారు. బంగారమే ఆధారం.. బయట అప్పు పుట్టని పరిస్థితుల్లో బంగారమే ఆధారమవుతోంది. చాలామంది బ్యాంకుల్లో బంగారం, ఆభరణాలు తాకట్టుపెట్టి అప్పు తీసుకుంటున్నారు. బంగారం అమ్మితి తిరిగి కొనలేమని కుదువపెడుతున్నారు. ప్రతి బ్యాంకులో నిత్యం ఐదు నుంచి పది మంది గోల్డ్ లోన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. మారుమూల గ్రామాల నుంచి పట్టణాలు, నగరాల దాకా బ్యాంకుల్లో గోల్డ్ లోన్లు విపరీతంగా తీసుకుంటున్నారు. ఏ అవసరం ఉన్నా సరే ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి అప్పు పొందుతున్నారు. అప్పులు తీసుకున్న వారు చాలా మంది డబ్బులు సర్దుబాటు కాక చేతులెత్తేయడంతో కొందరు ఫైనాన్స్ వ్యాపారులు దెబ్బతిన్నారు. దీనికి తోడు అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారంటూ పోలీసులు ఫైనాన్స్ నిర్వాహకులు, వడ్డీ వ్యాపారుల ఇళ్లపై దాడులు నిర్వహిస్తున్నారు. దీంతో చాలా మంది వడ్డీ, ఫైనాన్స్ వ్యాపారులు దందాను వదిలేశారు. కొందరు ఫైనాన్స్, వడ్డీ వ్యాపారులు కూడా డబ్బులు రికవరీ కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. వరుస దెబ్బలతో ఫైనాన్స్ రంగం కుదేలైంది. వెరసి సామాన్యుడికి అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడింది. ‘రియల్’ కుదేలై.. చాలామంది భూముల మీద పెట్టుబడులు పెట్టారు. భూముల క్రయవిక్రయాలతో సులువుగా డబ్బులు సంపాదించవచ్చనే భావనతో డబ్బున్నవారితో పాటు మధ్య తరగతి ప్రజలు కూడా అప్పులు చేసి మరీ భూములు కొన్నారు. అయితే కొంతకాలంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలై భూములు, ప్లాట్ల క్రయవిక్రయాలు సాగడం లేదు. సంవత్సరాల తరబడిగా వ్యాపారంలో వృద్ధి లేకపోగా, ధరలు పడిపోవడం అయినా సరే అమ్ముదామంటే కొనేవారు లేకపోవడంతో అప్పులు చేసి పెట్టుబడులు పెట్టిన వారంతా ఇంకా మునిగిపోతున్నారు. జిల్లా కేంద్రంలో ఇళ్లు నిర్మించి అమ్మేవారు ప్లాట్లతో పాటు ఇళ్ల నిర్మాణానికి డబ్బులు వెచ్చించారు. ఇప్పుడు ఇళ్లు అమ్ముడుపోక అవన్నీ ఇరుక్కుపోయాయి. దీంతో అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన వారంతా దివాలా అంచున ఉన్నారు. ప్లాటు ధర, ఇంటి నిర్మాణానికి అయిన వ్యయం ఇచ్చినా సరే అమ్ముదామంటే కొనేవాళ్లు లేరని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వడ్డీలకు వడ్డీలు పెరిగి అవస్థలు పడుతున్నామంటున్నారు. -
గోశాలకు ఆవుల తరలింపు
రామారెడ్డి: కరీంనగర్ జిల్లా నుంచి మూడు చిన్న టాటా ఏస్ వాహనాల్లో 16కు పైగా ఆవులను మంగళవారం మండుటెండలో తూప్రాన్ తరలిస్తుండగా మాచారెడ్డి పోలీసులు పట్టుకొని మద్దికుంటలోని గోశాలకు తరలించారు. ఈ ఆవులను తూప్రాన్ సంతలో రైతులకు అమ్మడానికి తీసుకెళ్తున్నట్టుగా సమాచారం. కానీ ఆవులకు కనీస వసతులు కల్పించకుండా ఒక్కో వాహనంలో ఆరు ఆవులను ఎండలో తరలిస్తుండడంతో అవి విలవిలకొట్టుకోవడాన్ని పోలీసులు గమనించి అడ్డుకున్నారు. నిర్వాహకులపై కేసు నమోదు చేసి, ఆవులను మద్దికుంట గోశాలకు తరలించారు. దొంగల ముఠా సభ్యుల అరెస్టు ఇందల్వాయి: వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన దొంగల ముఠాలోని ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందల్వాయి పోలీస్స్టేషన్లో మంగళవారం ఎస్సై సందీప్, డిచ్పల్లి సీఐ మల్లేశ్ వివరాలు వెల్లడించారు. గన్నారం ఎక్స్ రోడ్ దగ్గర పోలీసులు మంగళవారం ఉదయం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు కారులో అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని పట్టుకొని, విచారించారు. వారం రోజుల కిందట ఇందల్వాయి మండలంలో జరిగిన వరుస దొంగతనాలు, జక్రాన్పల్లి మండలం పడకల్ల్లో జరిగిన దొంగతనాలకు, భిక్కనూరులోని బస్వాపూర్లో జరిగిన దొంగతనాలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో చందుర్తి, కోనారావుపేటల్లో చోరీలకు పాల్పడిన దొంగల ముఠాలోని సభ్యులుగా గుర్తించారు. నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో సుమారు పది కేసులలో నిందితులుగా ఉన్నారన్నారు. వారి వద్ద నుంచి రెండు కార్లు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. రోడ్డు ఆక్రమణల తొలగింపు ఖలీల్వాడి: నగరంలోని ఆర్ఆర్ చౌరస్తా, న్యాల్కల్ ప్రాంతాలలో రోడ్డు వరకు ఉన్న షెడ్లు, ఆక్రమణలను మంగళవారం ట్రాఫిక్ ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో తొలగించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ట్రాఫిక్కు అంతరాయం కలిగించేలా ఆక్రమణలు ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. దుకాణదారులు నగర ప్రజలకు ఇబ్బందులు లేకుండా వ్యాపారాలు నిర్వహించుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు. -
ఉగ్రదాడిని ప్రతిఒక్కరూ ఖండించాలి
తెయూ(డిచ్పల్లి): జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం పహల్గాంలో పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేసి హతమార్చడాన్ని ప్రతి ఒక్క భారత పౌరుడు ఖండించాలని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ యాదగరి అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టూటా) ఆధ్వర్యంలో మంగళవారం పహల్గాం అమరుల కుటుంబాలకు సంఘీభావం తెలియజేశారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ముఖ్యఅతిథిగా పాల్గొని, మాట్లాడారు. ఉగ్రదాడికి ప్రతిగా కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్కు, ముస్లిం ఉగ్రవాదులకు ధీటైన జవాబు ఇవ్వాలన్నారు. ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, టూటా అధ్యక్షుడు పున్నయ్య, కోశాధికారి నాగరాజు, వర్సిటీ ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ శివనారాయణసింగ్, అధ్యాపకులు శిరీష, వాసం చంద్రశేఖర్, పాత నాగరాజు, బాలకిషన్, మహేందర్ రెడ్డి, స్రవంతి, స్వప్న, నాన్ టీచింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సాయాగౌడ్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అధ్యక్షుడు సురేష్ పాల్గొన్నారు. -
వీడీసీలను కట్టడి చేయండి
ఆర్మూర్: గ్రామాల్లో రాజ్యాంగానికి వ్యతిరేకంగా సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ)లను కట్టడి చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. వీడీసీలకు కుల వృత్తిదారులు వెట్టి చాకిరీ చేసే దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్లో మంగళవారం బీసీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో వీడీసీల ఆగడాలను నిరసిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉన్న అన్ని కులాలపై వీడీసీలు పెత్తనం చెలాయిస్తూ కుల వృత్తులను నిర్వీర్యం చేస్తున్నారన్నారు. తాళ్లరాంపూర్లో గౌడ కులస్తుల మీదనే కాకుండా జిల్లాలోని నాగంపేట్, మెండోర, పల్లికొండ, చేంగల్ తదితర గ్రామాల్లో యాదవులు, గంగపుత్రులు, రజక, ముదిరాజ్ తదితర కుల వృత్తులపై సైతం వీడీసీల ఆగడాలు కొనసాగుతున్నాయన్నారు. ఆయా కులవృత్తిదారుల నుంచి లక్షల రూపాయలు బలవంతంగా వసూలు చేస్తున్నారన్నారు. ఇకపై బీసీ కులాల జేఏసీ ఈ ఆగడాలను నియంత్రించడంలో పోరాటం చేస్తుందన్నారు. అనంతరం ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్కు గ్రామాభివృద్ధి కమిటీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు రాజారాం యాదవ్, ఆర్మూర్ జేఏసీ అధ్యక్షులు నరసింహ చారి, వివిధ కుల సంఘాల ప్రతినిధులు బిజ్జు దత్తాద్రి, దేగం యాదగౌడ్, బస్సాపూర్ శంకర్, మహిపాల్ యాదవ్, బీఎస్ఎన్ఎల్ రాజన్న, రాజమల్లు యాదవ్, స్వామి యాదవ్, భుమన్న యాదవ్, గూపన్ పల్లి శంకర్, బట్టు నరేందర్, లక్ష్మి నర్సయ్య, రవినాథ్, పల్లికొండ నర్సయ్య, వేల్పూర్ శ్రీనివాస్ గౌడ్, సుదర్శన్, రామగౌడ్, గంగాధర్, చందు, గంగాధర్, నర్సింగ్, రమేష్, శంకర్ గౌడ్ పాల్గొన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆర్మూర్లో బీసీ కులాల జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ -
హడలెత్తిస్తున్న చోరులు
బాన్సువాడ : పట్టణంలో దొంగలు హడలెత్తిస్తున్నారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్గా దోపిడీకి పాల్పడుతున్నారు.దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.పట్టణానికి చెందిన చెనంగారి సాయవ్వ ఈ నెల 19న ఇంటికి తాళం వేసి డాబాపై పడుకోవడంతో ఇంట్లో ఉన్న 12 తులాల బంగారం, సుమారు 60 తులాల వెండి చోరీకి గురయ్యాయి. మనువరాలి పెళ్లికి ఉపయోగపడుతుందని 12 తులాల బంగారం జమ చేస్తే దొంగలు దోచుకెళ్లారని ఆమె వాపోయింది. బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులే ఇంట్లో అంత బంగారం ఎందుకు పెట్టుకున్నారని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. చోరీలు జరిగిన సమయంలో హల్చల్ చేసే పోలీసులు చోరీకి గురైన సొత్తును రికవరి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలో వరుస చోరీలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతి గురువారం జరిగే వారంతపు సంతలో నిఘా పెట్టాల్సి ఉంది. పోలీసులు స్పందించి రాత్రి వేళల్లో గస్తీ పెంచాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు.. ● ఈ నెల 18న పాత బాన్సువాడ ముదిరాజ్ సంఘం వద్ద ఓ పెళ్లికి వచ్చిన బంధువుది పట్టపగలే ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. ● అదే రోజు రామ మందిర్ సమీపంలోని ఓ మిల్క్ సెంటర్ నిర్వహకుడు ఎర్రవాటి సాయిబాబా కౌంటర్పై నుంచి సెల్ఫోన్ చోరీకి గురైంది. ● మార్చి 12 క్రితం పట్టణంలోని సంగమేశ్వర కాలనీకి చెందిన దుబాస్ రాములు కుటుంబం తన బంధువుల ఇంటికి వెళ్లగా ఇంట్లో ఉన్న రూ. 6500 నగదుతో పాటు 5 తులాల వెండి చోరీకి గురైంది. తలుపులు పూర్తిగా ధ్వంసం చేశారు. ● అదే రోజు అదే కాలనీలో మరో వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. పాఠశాలలో వాచ్మెన్గా పనిచేసే ఓ వ్యక్తికి చెందిన పర్సును దొంగిలించారు. తాళం వేసిన ఇళ్లే టార్గెట్ వాహనాలు సైతం.. భయాందోళనలో బాన్సువాడ ప్రజలుపెద్ద చోరీలు ఐతేనే స్పందిస్తున్నారు బాన్సువాడలో దొంగతనాలు నివారించడంలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఓ చోట చోరీ జరిగిందంటే చుట్టు పక్కల గ్రామాలు, మండల కేంద్రాల్లో విసృతంగా తనిఖీలు చేసేవారు. పెద్ద పెద్ద చోరీలు ఐతేనే స్పందిస్తున్నారు. బైకులు, చిన్న చిన్న దొంగతనం చేస్తే పట్టించుకోవడం లేదు. – దుబాస్ రాములుసీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాం ఇటీవల జరిగిన చోరీలు స్థానికంగా ఉండే వారే చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నాం. పట్టణంలో గస్తీ పెంచుతాం. చోరీల నివారణకు చర్యలు తీసుకుంటాం. – అశోక్, సీఐ బాన్సువాడ -
ఎలక్ట్రీషియన్కు నోటీస్
భిక్కనూరు: దక్షిణ కాశీ గా పేరొందిన భిక్కనూ రు శ్రీసిద్దరామేశ్వరాల యం హుండీ లెక్కింపు లో చేతివాటం ప్రదర్శించిన ఎలక్ట్రీషియన్ బి.లక్ష్మీనారాయణకు సంజాయిషీ నోటీస్ జారీ చేసినట్లు ఆలయ ఈవో శ్రీధర్ తెలిపారు. ‘హుండీ లెక్కింపులో ఉ ద్యోగి చేతివాటం’ శీర్షికన ‘సాక్షి’లో మంగళ వారం ప్రచురితమైన వార్తపై గ్రామస్తులు స్పందించారు. సింగిల్ విండో చైర్మన్ గంగళ్ల భూమయ్య, నేతలు మైపాల్రెడ్డి, దుంపల మోహన్రెడ్డి, నీల అంజయ్య, నర్మల రాంచంద్రం, ద్యాగల కిరణ్, సుధాకర్, జనార్దన్రెడ్డి ఆలయానికి వెళ్లి ఈవో శ్రీధర్తో మాట్లాడారు. సీసీ ఫుటేజీలను చూపించాలని పట్టుబట్టారు. చేతివాటం ప్రధర్శించిన ఉద్యోగిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని డి మాండ్ చేశారు. దీంతో ఈవో శ్రీధర్ మాట్లాడుతూ సీసీ ఫుటేజీల కోసం టెక్నీషియన్ను పిలిపిస్తానన్నారు. ఎలక్ట్రీషియన్ లక్ష్మీనారాయణ వ్యవహారంపై ఆలయ అభివృద్ధి కమి టీ చైర్మన్ మహేందర్రెడ్డి తనకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు లక్ష్మీనారాయణకు సంజాయిషీ నోటీస్ జారీ చేశామన్నారు. నేడు బాల్య వివాహాల నిరోధంపై అవగాహన కార్యక్రమం కామారెడ్డి టౌన్: బాల్య వివాహాల నిరోధంపై బుధవారం జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జస్ట్ ఫర్ రైట్ సాధన సంస్థ జిల్లా కోఆర్డినేటర్ గిరిజ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయాలు, ప్రార్థన స్థలాల వద్ద ప్రజలు, పురోహితులు, వివిధ మతాలకు చెందినవారికి అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. రేపటినుంచి అథ్లెటిక్స్ వేసవి శిబిరం కామారెడ్డి టౌన్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు గురువారంనుంచి అథ్లెటిక్స్ వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు కోచ్ శివ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజంపేట మండలంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తామని పేర్కొన్నారు. మే 30వ తేదీ వరకు కొనసాగే శిబిరాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నీటికోసం నిధుల కేటాయింపు నాగిరెడ్డిపేట : రోజురోజుకు ఎండలు ముదురుతున్న నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు ముందుజాగ్రత్తగా ప్రభుత్వం జిల్లాకు ప్రత్యేక నిధులను కేటాయించింది. జిల్లాకు రూ. కోటి మంజూరయ్యాయి. జిల్లాలోని మొత్తం 536 గ్రామపంచాయతీల ఖాతాలలో నాలుగురోజుల క్రితం ఆ నిధులను జమ చేశారు. పంచాయతీ స్థాయినిబట్టి ఒక్కోదాని ఖాతాలో రూ.10 వేల నుంచి రూ.29 వేల వరకు జమయ్యాయి. గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాగా వీటిని పైపులైన్ లీకేజీలు, బోర్మోటార్ మరమ్మతులు వంటి అత్యవసర పనులకు వినియోగించాలని అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన నిధులు గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు సరిపోవు. కానీ ఉన్న నిధులను సర్దుబాటు చేసుకునేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. రోజురోజుకు భూగర్భజలాలు పడిపోతుండడంతో గ్రామాల్లో బోరుబావుల్లో నీటిమట్టం తగ్గుతోంది. ఈ క్రమంలో తాగునీటి సమస్య తీవ్రమవుతోంది. ప్రస్తతం విడుదలైన నిధులు కొంత ఊరట ఇవ్వనున్నాయి. గ్రామపంచాయతీ ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు సంయుక్తంగా ఈ నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. సొసైటీకి తాళం మాక్లూర్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొట్టుముక్కల గ్రామానికి చెందిన రైతులు మాక్లూర్ సొసైటీకి తాళం వేశారు. మంగళవారం ఉదయం సొసైటీకి చేరుకున్న రైతులు సిబ్బందిని బయటకి పంపి తాళం వేసి ధర్నా చేశారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ శేఖర్ సొసైటీ చైర్మన్ బూరోల్ల అశోక్ను వెంటబెట్టుకుని సొసైటీ వద్దకు చేరుకుని రైతులతో మాట్లాడారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని వారు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
‘భూభారతి’తో సామాన్యుడికి మేలు
నాగిరెడ్డిపేట/లింగంపేట : భూభారతి చట్టం ద్వా రా సామాన్యుడికి మేలు జరగుతుందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులే టి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఆయ న శెట్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఏది చెబితే అదే చట్టంగా ఉండేదన్నారు. దొర గారు ధరణి పథకాన్ని భూస్వాముల కోసం తెచ్చి వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. భూభా రతి చట్టం అలా కాకుండా పకడ్బందీగా పేదోడికి న్యాయం జరిగేలా రూపొందించామన్నారు. 18 రా ష్ట్రాల్లోని చట్టాలను అధ్యయనం చేసి, 9 నెలలు మే ధోమథనం చేసి మేధావుల సూచనలు, సలహాలు తీసుకొని ఈ చట్టాన్ని తెచ్చామన్నారు. ఇది దేశానికి రోల్ మోడల్ కాబోతుందన్నారు. తరతరాలుగా రై తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు భూభారతి పో ర్టల్ ద్వారా తీరనున్నాయని పేర్కొన్నారు. అంచెలంచెలుగా సమస్యల పరిష్కారం భూభారతి చట్టం ద్వారా తహసీల్దార్, ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్, సీసీఎల్.. ఇలా వివిధ స్థా యిలలో భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ఆయా స్థాయిలలో పరిష్కారం కాకపోతే స్పెషల్ ట్రిబ్యునల్ ప్రవేశపెట్టడానికి చట్టంలో వెసులుబాటు కల్పించామన్నారు. రెవెన్యూ అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తే ఈ చట్టం ద్వారా సదరు అధికారిపై చర్యలు తీసుకోవడానికి వీలుంటుందన్నారు. లింగంపేట మండలంలో ప్రైవేటు, ప్రభుత్వ, అసైన్మెంటు భూముల సమస్యలు ఉ న్నందున కలెక్టర్ విచారణ చేసి పరిష్కరించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే విన్నపం మేరకు.. ముందుగా రాష్ట్రంలో 4 జిల్లాల్లో 4 మండలాలను ఎంపిక చేసి, చట్టాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యే మదన్మోహన్రావు విన్నపం మేరకు లింగంపేట మండలాన్ని పైలట్ మండలంగా ఎంపిక చేశామన్నారు. ఇప్పటివరకు మండలంలోని 23 రెవెన్యూ గ్రామాలకుగాను 20 చోట్ల సదస్సులు పూర్తయ్యాయని, వివిధ భూసమస్యలపై 3,400 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. హామీలు అమలు చేసి తీరుతాం.. ఇందిరమ్మ రాజ్యంలో పేదల కోసం ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హామీలన్నింటిని అమ లు చేసి తీరుతామని పొంగులేటి స్పష్టం చేశారు. ఇప్పటికే పలు పథకాలను అమలు చేస్తున్నామన్నా రు. ప్రజల కోరిక మేరకు పక్షం రోజుల్లో వీఆర్వో లు, వీఆర్ఏలను నియమించనున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడి ప్రాణహిత ప్యాకేజీ పనులకు నిధులు మంజూరయ్యేలా చూస్తానని జ హీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ పేర్కొన్నారు. ఎల్లారెడ్డి నియోజక వర్గంలో భూ సమస్యలు ఎక్కువగా ఉన్న విషయాన్ని సీఎం, రెవెన్యూ మంత్రి దృష్టికి తీసుకువెళ్లానని, వారు స్పందించి భూభారతి చట్టం అమలుకు లింగంపేట మండలాన్ని పైలట్ మండలంగా ఎంపిక చేశారని ఎమ్మెల్యే మదన్మోహన్రావు పేర్కొన్నారు. రైతులకు భూ సమస్యలు లేకుండా చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, అదనపు కలెక్టర్ విక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, భూభారతి ప్రత్యేకాధికారి రాజేందర్, ఆర్డీవో మన్నె ప్రభాకర్, తహసీల్దార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.మంత్రి దృష్టికి ‘పోచారం’ భూముల సమస్య నాగిరెడ్డిపేట: పోచారం గ్రామశివారులోని భూముల సమస్యను గ్రామానికి చెందిన మాల్తుమ్మెద సొసైటీ డైరెక్టర్ శ్రీనివాస్రెడ్డి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. శెట్పల్లి సదస్సు భూసమస్యపై రైతులెవరైనా మాట్లాడాలని మంత్రి సూచించగా.. పోచారం గ్రామానికి చెందిన శ్రీనివాస్రెడ్డి మాట్లాడారు. తమ గ్రామశివారులోని రైతుల భూములకు పట్టాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. పోచారం ప్రాజెక్టు అంచునగల సర్వే నం. 268లో రైతులకు 1975 లోనే అప్పటి ప్రభుత్వం విడతలవారీగా సుమారు 150 ఎకరాలకు పట్టాపాసుపుస్తకాలు ఇచ్చిందన్నారు. కానీ ధరణి వల్ల కొత్త పాస్బుక్కులు రాలేదన్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్తే సర్వే నం. 268లో 54 ఎకరాల భూమి మాత్రమే ఉందని, కానీ 150 ఎకరాలకు పట్టాలు ఇచ్చారని చెప్పారని పేర్కొన్నారు. తమ గ్రామ రైతులకు పట్టాలు ఇప్పించాలని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ రెవెన్యూ అధికారులను వివరణ కోరారు. మరోసారి భూములను సర్వే చేయించి సమస్యను పరిష్కరిస్తామని ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్ పేర్కొన్నారు. 18 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఈ చట్టాన్ని తెచ్చాం ఇది దేశానికి రోల్ మోడల్ కాబోతోంది త్వరలో వీఆర్వోలు, వీఆర్ఏలను నియమిస్తాం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి -
హుండీ లెక్కింపులో ఉద్యోగి చేతివాటం!
భిక్కనూరు: భిక్కనూరు శ్రీసిద్దరామేశ్వరాలయం హుండీ లెక్కింపులో ఆలయంలో పనిచేసే ఓ ఉద్యోగి చేతి వాటాన్ని ప్రదర్శించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. ఈనెల 22న శ్రీసిద్దరామేశ్వరాలయం హుండీని లెక్కించారు. దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామరావు ఆధ్వర్యంలో ప్రక్రియ సాగింది. భక్తులు హుండీ లెక్కిస్తున సమయంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి దేవాదాయశాఖ సహాయ కమిషనర్ విజయరామరావుతో ఆలయ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చిస్తుండగా ఓ ఉద్యోగి చేతివాటాన్ని ప్రదర్శించి, ఓ నోట్ల కట్టను పాకెట్లో పెట్టుకుని నందిమండపం వైపు వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన ఆలయ కమిటీ చైర్మన్ మహేందర్రెడ్డి అతడి వెనకే వెళ్లారు. అక్కడ సదరు ఉద్యోగి లేకపోవడంతో కల్యాణం నిర్వహించే షెడ్డు వైపు వెళ్లగా ఆక్కడ కనిపించాడు. మహేందర్రెడ్డి అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జేబులు చూపించమనగా.. ఓ నోట్ల కట్ట కనిపించింది. తొలిసారి తప్పు చేశానని, క్షమించాలని సదరు ఉద్యోగి వేడుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ను వివరణ కోరగా ఓ ఉద్యోగి హుండీ లెక్కింపు సమయంలో చేతివాటాన్ని ప్రదర్శించింది వాస్తవమేనని, దీనిపై ఈవోకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. కాగా శ్రీసిద్దరామేశ్వరాలయంలో ఇలాంటి ఘటనలు గతంలోనూ జరిగాయి. ఉన్నతాధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో పునరావృతం అవుతున్నాయని భక్తులు పేర్కొంటున్నారు. కఠిన చర్యలు తీసుకుని ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని కోరుతున్నారు. -
వేర్వేరు ఘటనల్లో ఏడుగురి మృతి
చికిత్స పొందుతూ ఒకరు.. కామారెడ్డి క్రైం: రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు ఇలా.. పాల్వంచ మండలం ఇసాయిపేట గ్రామానికి చెందిన బొట్ల సంజీవ్ (35) కామారెడ్డి గాంధీ గంజ్లో డీసీఎం డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 27న సాయంత్రం అతడు బైక్పై స్వగ్రామానికి బయలుదేరాడు. ఉగ్రవాయి వద్ద అతడి బైక్ను కామారెడ్డి వైపు వెళ్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో సంజీవ్కు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు దేవునిపల్లి ఎస్ఐ రాజు తెలిపారు.ఆర్మూర్టౌన్: ఆలూర్ మండల కేంద్రంలోని ఊర చెరువులో ఓ వ్యక్తి పడిపోయి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన పుట్ట నవీన్(41) మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సోమవారం ఉదయం ఊర చెరువులో అతడి మృతదేహం తేలింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్లో చిట్యాల మాజీ సర్పంచ్.. తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అంబీర్ శారద(50) హైద్రాబాద్లో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. హైదరాబాద్లో శారద భర్త మధుసుదన్రావుతో కలిసి బైక్పై వెళుతుండగా వెనుక నుంచి లారీ వచ్చి బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో శారద అక్కడిక్కడే మృతిచెందగా, మదుసుధన్ రావుకు తీవ్రగాయాలు అయ్యాయన్నారు. శారద 1993–98 వరకు చిట్యాల సర్పంచ్గా పనిచేసిందన్నారు. మధుసుదన్రావు గతంలో తాడ్వాయి ఎంపీపీగా పనిచేశాడన్నారు. శారద మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఆమె స్వగ్రామమైన చిట్యాలలో సోమవారం అంత్యక్రియలను జరిపించారు. బావిలో పడి ఒకరు.. ఎడపల్లి(బోధన్): మండలంలోని మంగళ్పాడ్ గ్రామంలో ఓ యువకుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన దేవదాస్ (28) ఆదివారం స్నేహితులతో కలిసి గ్రామశివారులోని పంటపొలాల్లో మద్యం సేవించడానికి వెళ్లారు. కొద్దిసేపటికి దేవదాస్ పక్కనే ఉన్న బావి వద్దకు మూత్ర విసర్జనకు వెళ్లగా ప్రమాదవవాత్తు బావిలో పడి ఈత రాక చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం ఉదయం మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎడపల్లి ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు అశోక్ సాగర్లో పడి వృద్ధురాలు.. ఎడపల్లి(బోధన్): మండలంలోని జానకంపేట గ్రామ శివారులోగల అశోక్సాగర్లో ఓ వృద్ధురాలు ప్రమాదవశాత్తు పడి మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామనికి చెందిన బోదాసు దేవమ్మ (60) ఆదివారం సాయంత్రం గ్రామ శివారు కాలకృత్యాలకని వెళ్లి, ప్రమాదవశాత్తు అశోక్ సాగర్లో పడి మృతి చెందింది. మృతదేహాన్ని సోమవారం ఎడపల్లి పోలీసులు బయటకు తీసి, బోధన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ రెడ్డి తెలిపారు.ఖలీల్వాడి: నగరంలోని తిలక్ గార్డెన్ కాంప్లెక్స్ సమీపంలోగల గ్లామర్ హోటల్ ఎదుట గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి సోమవారం తెలిపారు. హోటల్ ఎదుట అతడు అపస్మారక స్థితిలో ఉండగా అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడిని వైద్యులు పరిశీలించగా మృతి చెందినట్లుగా నిర్ధారించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, సుమారు 40నుంచి 45 ఏళ్ల వయస్సు ఉంటుందని తెలిపారు. మృతుడు బ్లూ కలర్ షర్టు, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించినట్లు తెలిపారు. ఎవరికై నా తెలిసినచో వన్టౌన్ పోలీస్ స్టేషన్లో లేదా 87126 59714ను సంప్రదించాలని తెలిపారు. జానకంపేటలో.. ఎడపల్లి: మండలంలోని జా నకంపేట శివారులోగల అశోక్ సాగర్ తూము వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం తేలింది. జానకంపేట గ్రామానికి చెందిన జీపీ కార్మికుడు గుంజ శ్రీనివాస్ మృతదేహాన్ని గమనించి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు 45నుంచి 50ఏళ్ల లోపు ఉంటుందన్నారు. అతడి వద్ద ఆధారాలు ఏవీ లభించలేవన్నారు. నీలం కలర్ లుంగీ, తెలుపు బనియన్ ధరించి ఉన్నాడని, ఎవరైనా గుర్తిస్తే 87126 59873 లేదా 87126 59780ను సంప్రదించాలని పోలీసులు తెలిపారు. -
భర్తను హత్య చేసేందుకు భార్య కుట్ర
కామారెడ్డి క్రైం: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్తను హత్య చేయించేందుకు చేసిన కుట్ర ఫెయిల్ అవ్వడంతో నిందితులు కటకటాల పాలయిన ఘటన మాచారెడ్డి మండలంలో వెలుగుచూసింది. ఈ కేసులో మొత్తం ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర వివరాలు వెల్లడించారు. మాచారెడ్డి మండలం ఘన్పూర్(ఎం) గ్రామానికి చెందిన సాడెం కుమార్ మెదక్ జిల్లాలోని ఓ మున్సిపాలిటిలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అల్వాల్కు చెందిన కాంపల్లి మహేష్ ప్రస్తుతం రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్లపల్లి వద్ద ఉన్న లలిత మ్మ గుడిలో పూజారిగా పనిచేస్తున్నాడు. కుమార్ భార్య రేణుక నాలుగేళ్లుగా మహేష్తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. ఈక్రమంలో తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న కుమార్ను హతమార్చాలని రేణుక, మహేష్లు కుట్ర పన్నారు. ఆ తర్వాత అతని ఉద్యోగాన్ని, ఆస్తిని దక్కించుకోవాలని భావించారు. అల్వాల్కు చెందిన మహమ్మద్ అశ్వాక్తో రూ.15 లక్షలకు సుపారీ మాట్లాడుకున్నారు. అశ్వాక్, అతని అనుచరులు ముబిన్, అమీర్, అన్వర్, మోసిన్లకు అడ్వాన్సుగా రూ.2లక్షలు ఇచ్చారు. ఈ నెల 21న కుమార్ బైక్పై వెళ్తుండగా ఫరీద్పేట సమీపంలోని సోలార్ ప్లాంట్ వద్ద దారి కాచిన సుపారీ గ్యాంగ్ అతడిని అడ్డుకుని రాడ్లతో దాడి చేశారు. అదే సమయంలో అటుగా కారులో ఓ ఇద్దరు వ్యక్తులు రావడం చూసి అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. వెంటనే కుమార్ను స్థానికులు, పోలీసులు కలిసి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసిన మాచారెడ్డి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం, సీసీ పుటేజ్ల ఆధారంగా నిందితులను గుర్తించారు. వారిని పట్టుకొని విచారించగా నేరం అంగీకరించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితులైన మహేష్, రేణుకలతో పాటు సుపారీ గ్యాంగ్కు చెందిన అశ్వాక్, ముబీన్, అమీర్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామన్నారు. పరారీలో ఉన్న ఇద్దరి నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. నిందితుల వద్ద నుంచి ఓ కారు, ఆటో, రెండు బైక్లు, గొడ్డలి, రాడ్లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. కేసు ఛేదనలో విశేషంగా కృషి చేసిన రూరల్ సీఐ రామన్, ఎస్ఐ అనిల్, సిబ్బందిని అభినందించారు. ప్రియుడితో కలిసి ఐదుగురికి రూ.15లక్షల సుపారీ మొత్తం ఐదుగురు అరెస్టు, పరారీలో ఇద్దరు వివరాలు వెల్లడించిన ఎస్పీ రాజేశ్చంద్ర -
భూభారతిని సద్వినియోగం చేసుకోవాలి
నిజాంసాగర్/బాన్సువాడ రూరల్: భూముల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భూరతి చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. సోమవారం నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలాలతోపాటు బాన్సువాడలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సదస్సులలో మాట్లాడారు. భూభారతి చట్టం గురించి వివరించారు. రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామని పేర్కొన్నా రు. కార్యక్రమంలో పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్కుమార్ పటేల్, బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు, నిజాంసాగర్ మండల ప్రత్యేకాధికారి అరుణ, ఏవో నవ్య, తహసీల్దార్లు సవాయిసింగ్, వరప్రసాద్, బాన్సువాడ ఎంపీడీవో బషీరుద్దీన్, నాయకులు రవీందర్రెడ్డి, రమేష్ యాదవ్, మల్లయ్యగారి ఆకాష్, నాగభూషణం గౌడ్, తోట రాజు, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
రజతోత్సవ సభ కాదది ప్రగల్బాల సభ
భిక్కనూరు: వరంగల్లో బీఆర్ఎస్ నిర్వహించిన సభ రజతోత్సవ కాదు ప్రగల్బాల సభ అని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బల్యాల సుదర్శన్ అన్నారు. సోమవారం భిక్కనూరులో విలేకరులతో ఆయన మాట్లాడుతూ భూమిలేని దళితులకు గిరిజనులకు మూడు ఎకరాల భూమి అన్ని నమ్మించి మోసం చేశాడన్నారు. ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేశ్, విండో అధ్యక్షుడు గంగళ్ల భూమయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దయాకర్రెడ్డి, సీనియర్ నేతలు లింబాద్రి, నర్సింహరెడ్డి , దుంపల మోహన్రెడ్డి, కాంగ్రెస్సీనియర్ నేతలు మహిపాల్ రెడ్డి, నీల అంజయ్య, కర్నాల శ్రీనివాస్, నర్మల రాంచంద్రం, నర్సింలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రదేశాల పరిశీలన
ఎల్లారెడ్డి: రోడ్డు ప్రమాదాలు జరిగిన సంఘటన స్థలాలను సీఐ రవీందర్నాయక్ ఆధ్వర్యంలో సోమవారం అధికారులు పరిశీలించారు. మండలంలోని హాజీపూర్, అడివిలింగాల, తిమ్మారెడ్డి, జంగమాయిపల్లి, భిక్కనూర్, మీసాన్పల్లి, మాచాపూర్ గ్రామ శివార్లలోని మూల మలుపులను వారు పరిశీలించారు. మూల మలుపుల వద్ద జరిగిన ప్రమాదాలలో మృతి చెందిన సంఘటన స్థలాలను పరిశీలించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను ఉన్నతాధికారులకు నివేదిక పంపనున్నట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై మహేష్, ఆర్అండ్బీ ఏఈ ఐశ్వర్య, మున్సిపల్, పంచాయత్ రాజ్ అధికారులు ఆంజనేయులు, మల్లేష్ ఉన్నారు. -
మామను చంపిన అల్లుడు
నవీపేట: మండలంలోని అనంతగిరి గ్రామంలో మామ అల్లుళ్ల మధ్య జరిగిన ఘర్షణలో మామ హతమయ్యాడు. నిజామాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై వినయ్లు సోమవారం వివరాలు వెల్లడించారు. ఛత్తీస్గడ్ రాష్ట్రంలోని కచర్దాం జిల్లా చిర్పాలి గ్రామానికి చెందిన బిలంసింగ్ మరవి(48) కూతురు గోమతి దుర్వే, అల్లుడు రాజేష్ దుర్వేలతో కలిసి మండలంలోని గోదాం నిర్మాణంలో కూలీలుగా పనిచేస్తున్నారు. రాజేష్ దుర్వే తరచూ భార్యను మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. ఈవిషయమై ఆదివారం రాత్రి మద్యం సేవించాక మామ, అల్లుడు గొడవపడ్డారు. ఆగ్రహానికి లోనైన అల్లుడు ఇటుకను తీసుకొని మామ తలపై విచక్షణరహితంగా బాదాడు. దీంతో మామ బిలం సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
సమస్యలను వెంటనే పరిష్కరించాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను, ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 95 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఫిర్యాదులు పెండింగ్లో లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వీణ, కలెక్టరేట్ పాలనాధికారి మసూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చెడిపోయిన మున్సిపల్ నీటి బోరు కామారెడ్డి టౌన్: పట్టణంలోని 26వ వార్డు శేర్గల్లిలో గత 40రోజులుగా మున్సిపల్ నీటి మోటారు, షార్టర్ చెడిపోయింది. దీంతో కాలనీవాసులు నీటికి ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులకు నెల రోజులుగా విన్నవించినా పట్టించుకోవడం లేరని కాలనీవాసులు తెలిపారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.బల్దియా స్థలంలో బోరుకు అనుమతి ఇవ్వాలి మున్సిపాలిటీకి చెందిన స్థలంలో బోరు వేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ జిల్లా కేంద్రం లోని అశోక్ నగర్ విద్యాభారతి పురం సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్రజావాణికి తరలి వచ్చారు. వారు మాట్లాడుతూ.. కాలనీలో తీవ్రమైన నీటి సమస్య ఉందన్నారు. బోరు వేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్ ప్రజావాణికి 95 వినతులు.. -
గాంధీ విగ్రహానికి పార్ట్ టైం అధ్యాపకుల వినతి
భిక్కనూరు: తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించాలని కోరుతూ తెలంగాణ యునివర్సిటీ సౌత్క్యాంపస్లోని పార్ట్ టైం అధ్యాపకులు సోమవారం క్యాంపస్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. తమకు కనీస వేతనం కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని జీవోనంబర్ 21ను సవరించి తమ సర్వీసులను పరిగణలోకి తీసుకుని తమకు ఉద్యోగ భఽద్రత కల్పించేలా చూడాలన్నారు. పదో రోజుకు చేరిన కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మె ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ యునివర్సిటీల కాంట్రాక్టు అధ్యాపకులు చేపట్టిన సమ్మె పదో రోజుకు చేరుకుంది. సోమవారం సౌత్క్యాంపస్లో దీక్ష శిబిరంలో కూర్చున్న కాంట్రాక్టు అధ్యాపకులకు మద్దతుగా పలువురు విద్యార్థి సంఘాల ప్రతినిధులు వచ్చి సంఘీభావం తెలిపారు. -
కాంగ్రెస్ వాళ్లు కళ్లుండి చూడలేకపోతున్నారు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : బీఆర్ఎస్ సభకు అనుకున్నదానికన్నా ఎక్కువ మంది తరలివచ్చారని, సభ సక్సెస్ అయ్యిందని మీడియా మొత్తం చెబుతుండగా కాంగ్రెస్ వాళ్లు కళ్లుండి చూడలేకపోతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి సుమారు 40 వేల మందికిపైగా సభకు హాజరయ్యారని తెలిపారు. సభ విజయవంతానికి కృషి చేసిన రెండు జిల్లాల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, రాష్ట్ర, జిల్లా, మండల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. సభ సక్సెస్ కావడాన్ని మంత్రులు, కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే అడ్డగోలుగా వాగుతున్నారని విమర్శించారు. 17 నెలల పాలనలో కాంగ్రెస్పై, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై వచ్చిన వ్యతిరేకత సభకు వచ్చిన లక్షలాది ప్రజల్లో స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులను ఇతర యంత్రాంగాన్ని వాడుకుని సభ విజయవంతం కాకుండా కుట్రలు చేసినప్పటికీ ప్రజలు భారీగా తరలివచ్చారని, కాంగ్రెస్ కుట్ర కారణంగా సభకు చేరుకోలేకపోయిన వారు రోడ్లపైనే కిలోమీటర్ల కొద్దీ వేచి ఉన్నారని తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రజల నుంచి తప్పించుకోలేదని, ఆ పార్టీ వైఫల్యాలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గ్రామాల్లో ప్రజల పక్షాన ఎక్కడికక్కడ నిలదీస్తాయని స్పష్టం చేశారు. రజతోత్సవ సభను విజయవంతం చేసిన వారికి ధన్యవాదాలు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి -
దుకాణ యజమానులకు జైలుశిక్ష
బోధన్టౌన్(బోధన్): పట్టణంలోని రంగర్గల్లికి చెందిన పవన్ చారీ తన బంగారు దుకాణాన్ని, శక్కర్నగర్ కాలనీకి చెందిన షేక్ యాకూబ్ తన మిల్క్ డైరీని, అలాగే ఓ బేకరీ యజమాని రాత్రి వేళలో సమయానికి మించి దుకాణాలను తెరిచి ఉంచినందున పోలీసులు వారిని అరెస్టు చేశారు. సోమవారం వారిని కోర్టులో హాజరు పర్చగా బేకరి యజమానికి రెండు రోజుల జైలు, మిగిలిన ఇద్దరికి ఒక రోజు జైలు శిక్షను జడ్జి విధించారు. ఇసుక ట్రాక్టర్ల పట్టివేత నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని వదల్పర్తి గ్రామశివారులోని వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలించేందుకు ప్రయత్నిస్తున్న రెండు ట్రాక్టర్లను ఆదివారం రాత్రి పట్టుకున్నట్లు ఎస్సై మల్లారెడ్డి తెలిపారు. లింగంపేట మండలం అయ్యపల్లికి చెందిన పోచబోయిన భాస్కర్, ఎక్కపల్లికి చెందిన ఎల్లమోల్ల సాయిలు వదల్పర్తి శివారులోని వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలించే ప్రయత్నం చేశారు. ఈ సమాచారం అందిన వెంటనే వారిని, ట్రాక్టర్లను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై తెలిపారు. రుద్రూర్: పోతంగల్ మండలం కొడిచర్ల గ్రామ శివారు నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను సోమవారం పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్ను పోలీస్స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. నిజాయితీ చాటిన హోటల్ యజమాని నిజాంసాగర్(జుక్కల్): ఓ మహిళ హోటల్లో మర్చిపోయిన బంగారు అభరణాలను హోటల్ యజమాని బాధిత మహిళకు అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు. వివరాలు ఇలా.. తాడ్వాయి మండలం కుప్రియల్ గ్రామానికి చెందిన సైదగారి బాలమణి ఆదివారం మధ్యాహ్నం నిజాంసాగర్ బస్టాండ్లో బస్సుదిగింది. అనంతరం సమీపంలోని హోటల్లో టిఫిన్ తినడానికి వెళ్లింది. అదే సమయంలో బంగారు చెవి కమ్మలను హోటల్లో మర్చిపోయి వెళ్లిపోయింది. కొద్దిసేపటికి కమ్మలు కనిపించకపోవడంతో బంధువులకు తెలపగా, వారు హోటల్ యజమానికి ఫోన్లో సంప్రదించారు. యజమాని కమ్మలను భద్రంగా ఉంచాడు. బాధితురాలిని పోలీస్ స్టేషన్కు పిలిపించి చెవి కమ్మలను అందజేశాడు. పేకాడుతున్న పలువురి అరెస్టు కామారెడ్డి టౌన్: మున్సిపల్ పరిధిలోని దేవివిహార్ ఫేస్–3 కాలనీలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారని పోలీసులకు సమాచారం రావడంతో దేవునిపల్లి ఎస్సై రాజు, సిబ్బంది దాడులు జరిపారు. పేకాట ఆడుతున్న 9మందిని అరెస్టు చేశారు. అలాగే వారి వద్ద నుంచి రూ. 60,400 నగదుతో పాటు రెండు బైకులు, తొమ్మిది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. బోధన్ మండలంలో.. బోధన్ రూరల్: మండలంలోని కలదుర్కి గ్రామంలో పేకాట స్థావరంపై దాడిచేసి పేకాడుతున్న 10మందిని అరెస్ట్ చేసినట్లు బోధన్ రూరల్ ఎస్సై సందీప్ సోమవారం తెలిపారు. వారి వద్ద నుంచి రూ.6,600 నగదు, 8సెల్ ఫోన్లు, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బోధన్ పట్టణంలో.. బోధన్టౌన్: పట్టణ శివారులోని డంపింగ్ యార్డ్ వద్ద పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు సోమవారం పట్టణ సీఐ వెంకట నారాయణ, ఎస్సై హబీబ్, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. పేకాడుతున్న ఐదుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1950 నగదు, 4 ఫోన్లు, ఒక బైక్, ఒక కార్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ట్రాన్స్ఫార్మర్ చోరీ రెంజల్(బోధన్): మండలంలోని కందకుర్తి ఎత్తిపోతల పథకం ట్రాన్స్ఫార్మర్ను రెండు రోజుల కిందట గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి, కాపర్ వైరును చోరీ చేసినట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. ధ్వంసమైన ట్రాన్స్ఫార్మర్ను ఆదివారం రాత్రి స్థానిక రైతులు గుర్తించారు. సోమవారం ఉదయం ఎత్తిపోతల చైర్మన్ గయాస్కు తెలుపగా ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పట్టా భూములను రికార్డుల్లో నుంచి తొలగించారు
పట్టా భూములను రెవెన్యూ రికార్డుల్లో నుంచి తొలగించారని గాంధారి మండలం బొప్పాజీవాడి గ్రామానికి చెందిన రైతులు తెలిపారు. వారు మాట్లాడుతూ.. గ్రామానికి సమీపంలో ఉన్న చింతల చెరువు శిఖంలో దాదాపు 20 మంది రైతులకు సంబ ంధించిన 15.15 ఎకరాల స్వంత పట్టా భూములు ఉండేవన్నారు. చెరువులో ప్రతి ఏటా నీరు తగ్గాక యాసంగి పంటలు సాగు చేసుకునేవారమని వెల్లడించారు. గతేడాది గ్రామంలో పర్యటించిన అధికారులు చెరువు శిఖం సర్వే నెంబర్ 14,15 లను, మా పట్టా భూములను రికార్డుల్లో నుంచి తొలగించారన్నారు. రికార్డుల్లో మాభూములను తిరిగి నమోదు చేయాలని ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. -
ఎక్స్గ్రేషియా చెక్కుల అందజేత
ఖలీల్వాడి: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హెడ్ కానిస్టేబుల్ రాథోడ్ ప్రతాప్ సింగ్ సతీమణికి సోమవారం రూ.16 లక్షల ఎక్స్ గ్రేషియా చెక్కును సీపీ కార్యాలయంలో సీపీ సాయి చైతన్య అందజేశారు. నిజామాబాద్ అదనపు డీసీపీ (ఎఆర్)రామచంద్రరావు, ఏఓ అనిసాబేగం, ఆఫీస్ సూపరింటెండెంట్ వనజ, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షకీల్ పాషా తదితరులు ఉన్నారు. బీర్కూర్లో యువకుడి ఆత్మహత్య బాన్సువాడ రూరల్: బీర్కూర్ మండల కేంద్రంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు లా.. మండల కేంద్రానికి చెందిన భూతిపిల్లి మహేష్(35) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం రాత్రి అతడు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు బీర్కూర్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఈత చెట్లు దగ్ధం భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి గ్రామంలో రేణుకాదేవి ఎల్లమ్మ ఆలయం సమీపంలో ఉన్న ఈత వనం సోమవారం దగ్ధమైంది. గౌడసంఘం ఆధ్వర్యంలో ఆరు ఎకరాల స్థలంలో ఈత చెట్లను పెంచుతున్నారు. సోమవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఈత చెట్లు దగ్ధం అయ్యాయి. వెంటనే స్థానికులు ఫైర్ఇంజన్కు సమాచారం అందించగా, వారు ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. అప్పటికే రెండు వేల చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. చెట్ల దగ్ధం ఘటన మందుబాబుల పనే కావచ్చునని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. తగ్గెల్లి గ్రామంలో.. బోధన్: సాలూర మండలంలోని తగ్గేల్లి గ్రామ శివారులో గల కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం పరిధిలోని ఈత వనంలో సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఐదు ఎకరాల విస్తీరణంలో ఉన్న ఈత వనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి చెట్లు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. నాలుగేళ్లుగా ఆరుగాలం కష్టపడి పెంచిన ఈత చెట్లు కాలిపోవడం వల్ల రూ.15 నుంచి 20 లక్షల వరకు నష్టం వాటిల్లిందని సంఘ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. -
నేడు శెట్పల్లికి మంత్రి పొంగులేటి రాక
లింగంపేట: శెట్పల్లి గ్రామంలో మంగళవా రం నిర్వహించే రెవెన్యూ సదస్సులో పాల్గొనడానికి రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రా నున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షు డు బుర్ర నారాగౌడ్ తెలిపారు. మంత్రి రాక నేపథ్యంలో సోమవారం శెట్పల్లిలో ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా నారాగౌడ్ మాట్లాడుతూ మంత్రితోపాటు స్థానిక ఎమ్మెల్యే మ దన్మోహన్రావు సదస్సులో పాల్గొంటారన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని రైతులను కోరారు. ఏర్పాట్లను పరిశీలించినవారిలో భూభారతి మండల ప్రత్యే కాధికారి రాజేందర్, తహసీల్దార్ సురేష్, ఎంపీడీవో నరేష్ తదితరులున్నారు. ఒకటి నుంచి రేషన్ బియ్యం పంపిణీ కామారెడ్డి రూరల్ : మే నెలకు సంబంధించి న రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియను ఒక టో తేదీనుంచి ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఒక్కో యూనిట్కు ఆరు కిలోల చొప్పున ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. అంత్యోదయ కార్డులకు 35 కిలోలు, అన్నపూర్ణ కార్డులకు 10 కిలోల చొప్పున అందిస్తామని తెలిపారు. 15వ తేదీ వరకు బి య్యం పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. డీఏవోకు పదోన్నతి కామారెడ్డి క్రైం: జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్కు పదోన్నతి లభించింది. ఇప్పటివరకు వ్యవసాయ శాఖలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్గా ఉన్న ఆయనకు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్గా పదో న్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే సింది. కలెక్టరేట్లోని వ్యవసాయ శాఖ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయనను జి ల్లాలోని ఏడీఏలు, మండలాల వ్యవసాయ అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల శ్రేయస్సుకు కృషి సదాశివనగర్ : రైతుల శ్రేయస్సు కోసం సహకార సంఘాలు కృషి చేస్తున్నాయని డీసీవో రామ్మోహన్ పేర్కొన్నారు. అడ్లూర్ ఎల్లారెడ్డి సింగిల్ విండో కార్యాలయంలో సోమవారం అంతర్జాతీయ సహకార సంవత్సరాన్ని ఘ నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీ సీవో మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా గుర్తించిందన్నారు. సహకార సంఘం చేపడుతున్న వివిధ రకాల కార్యకలాపాల్లో పాలు పంచుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో విండో చైర్మన్ సదాశివరెడ్డి, సీడీసీ చైర్మన్ ఇర్షాదొద్దీన్, మా నిటరింగ్ అధికారి సాయిలు, సీఈవో భై రయ్య, డైరెక్టర్లు రాములు, ప్రవీణ్రెడ్డి, భాస్కర్, ఉమామహేశ్వర్రావు, సిబ్బంది లింగమూర్తి, భైరేశ్, గంగరాజు పాల్గొన్నారు. లండన్లో తప్పిపోయిన రెంజర్ల విద్యార్థి బాల్కొండ: ముప్కా ల్ మండలం రెంజర్ల గ్రామానికి చెందిన విద్యార్థి నల్ల అనురాగ్రెడ్డి ఈనెల 25న లండన్లో తప్పిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనురాగ్రెడ్డి ఉన్నత చదువులో కోసం ఏడాదిన్నర క్రితం స్టూడెంట్ వీసాపై లండన్ వెళ్లాడు. ఈనెల 25న సా యంత్రం స్నేహితులతో కలిసి కార్డిప్ ప్రాంతానికి వెళ్లి కనిపించకుండా పోయాడు. అత డి స్నేహితులు ఇచ్చిన సమాచారంతో ఆందోళన చెందిన తల్లి హరితారెడ్డి ఈ విషయా న్ని సోమవారం టీఎస్ఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు. తన కుమారుడిని వెతికించి, స్వదేశానికి రప్పించాలని కోరారు. ఈరవత్రి అనిల్ స్పందించి సీఎంవో కార్యాలయ అధికారులతో మాట్లాడారు. ఈ విషయమై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లీలోని విదేశాంగ శాఖకు, లండన్లోని ఇండియా హైకమిషన్కు లేఖలు రాసినట్లు అనిల్ కుమార్ తెలిపారు. -
సైబర్ నేరాలపై అవగాహన
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని బస్టాండులో సోమవారం ఏఎస్సై ప్రకాశ్నాయక్ సైబర్ నేరాలపై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిచితులకు బ్యాంకు ఖాతా నంబర్లు ఇవ్వద్దన్నారు. ప్రయాణం చేసే సమయంలో విలువైన వస్తువులు, డబ్బులు జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. సెల్ ఫోన్లు పోయినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.మత్తు పదార్థాలకు బానిసలు కావద్దన్నారు. వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించి, ధువ్రపత్రాలు వెంట పెట్టుకోవాలని సూచించారు. కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రుల పాలైతేనే చర్యలు..
అన్ని కులవృత్తుల్లానే కల్లు గీత వృత్తి కూడా నిరాదరణకు గురవుతోంది. ప్రధానంగా యువతరం ఈ వృత్తికి దూరంగా ఉంటున్నారు. దీంతో కల్లు గీసేవారు కరువై స్వచ్ఛమైన కల్లు దొరకకుండా పోతోంది. కల్తీ కల్లు మాత్రం విరివిగా లభిస్తోంది. ఎకై ్సజ్ అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో కల్తీ కల్లు తయారీ, విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్న ఆరోపణలున్నాయి.● వృత్తికి దూరమవుతున్న యువతరం ● చెట్లెక్కి కల్లు గీసేవారు కరువు.. ● పెరిగిన కృత్రిమ కల్లు తయారీ ● పట్టించుకోని ఎకై ్సజ్ అధికారులు కామారెడ్డి క్రైం : గతంలో గ్రామ శివారు ప్రాంతాల్లో ఉండే ఈత వనాలకు వెళ్లి చెట్లను గీసి కల్లు తీసేవారు. ఆ కల్లును తెచ్చి అమ్మేవారు. సరైన ఆదరణ లేక కల్లు గీత వృత్తి చాలా రోజులుగా తగ్గుతూ వస్తోంది. ఓవైపు కొంత కాలంగా కల్లుగీసేవారు తగ్గిపోతున్నా.. మరోవైపు గ్రామాలు, పట్టణాల్లో కల్లు దుకాణాల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతుండడం గమనార్హం. కొంతమంది ఒక్క చుక్క కూడా స్వచ్ఛమైన కల్లు లేకుండానే వేల లీటర్ల కల్లు తయారు చేస్తున్నారు. కల్లు తయారీలో పోటీలు పడి మరీ మత్తు పదార్థాలు వాడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కృత్రిమ కల్లే దిక్కు.. పొద్దంతా శ్రమించే వారు సాయంత్రం కాగానే అలసటను తీర్చుకోవడం కోసం కల్లు సేవిస్తుంటారు. కొంతమంది రోజూ కల్లు తాగుతుంటారు. ఇది చాలామందికి అలవాటుగా కూడా మారింది. కల్లు లేకపోతే పిచ్చిగా ప్రవర్తించే ప్రమాదకర పరిస్థితులను చూస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ నిత్యం కల్లు విక్రమాలు జరుగుతున్నాయి. అయితే చాలాచోట్ల స్వచ్ఛమైన కల్లు అనేది మచ్చుకై నా కనిపించడం లేదు. అంతా మత్తు పదార్థాలను కలిపి తయారు చేసిన కృత్రిమ కల్లే అందుబాటులో ఉంటోంది. ఈ కల్లుకు అలవాటు పడినవారి పరిస్థితి దారుణంగా మారుతోంది. ఇటీవల దుర్కి అంకోల్, దామరంచ రాంపూర్, సంగెం, గౌరారం గ్రామాలకు చెందిన 83 మంది ప్రజలు కల్తీ కల్లు కారణంగా ఆస్పత్రుల పాలైన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే ఎకై ్సజ్ అధికారులు హడావుడి చేస్తారని, మిగతా సమయాల్లో కల్తీ కల్లు ఏరులై పారుతున్నా పట్టించుకోరనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఇటీవల వెలుగు చూసిన కల్తీ కల్లు వ్యవహారాన్ని కలెక్టర్తో పాటు మొత్తం జిల్లా యంత్రాంగం సీరియస్గా తీసుకుంది. బాధితులకు వైద్యం అందించడంతో పాటు ఘటనకు కారణాలపై ఆరా తీయడం మొదలు పెట్టి కల్లు త యారు చేసిన డిపో యజమానులు సురేందర్, అంజాగౌడ్లపై కేసులు నమోదు చేశారు. జిల్లావ్యాప్తంగా 173 చోట్ల కల్లు దుకాణాల్లో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో మరో 32 కల్తీ కల్లు విక్రయిస్తున్న కేసులు నమోదు చేసి 28 మంది కల్తీ కల్లు విక్రయదారులను అరెస్ట్ చేశారు. 50 గ్రా ముల అల్ఫ్రాజోలం పట్టుబడింది. మరో 150 శాంపిళ్లు సేకరించారు. కల్లు తయారీలో అల్ప్రా జోలం వినియోగించినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిందితులు పరారీలో ఉండడంతో కల్లు తయారీలో వినియోగించిన డోసు విషయంలో స్పష్టత రాలేదు. కల్తీ కల్లు వ్యవహారం ఎప్పట్నుంచో నడుస్తున్నదే కానీ దుర్ఘటన ఏదైనా జరిగినప్పుడు మాత్రమే అధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నారనే విమర్శలున్నాయి. ఈత వనాలపై నిర్లక్ష్యం.. కల్తీ కల్లును అరికట్టడం దేవుడెరుగు, స్వచ్ఛమైన కల్లు తయారీని ప్రోత్సహించే విషయంలోనూ సరైన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. కల్లు గీత కార్మికులకు ఉపాధి కల్పించేందుకు స్వచ్ఛమైన కల్లును ప్రోత్సహించే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం, హరిత హారంలలో భాగంగా జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో ఈత వనాలు ఏర్పాటు చేశారు. అయితే అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ లోపాల కారణంగా చాలాచోట్ల నాటిన మొక్కలు ఎండిపోయాయి. దీంతో నిధులు వృథా అయ్యాయి. ఇందులో కూడా ఎకై ్సజ్ శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్ని చెట్లు పెట్టారు, ఎన్ని ఉన్నాయి, ఎన్ని వృథాగా పోయాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈత వనాలు పెంపకంపై దృష్టి సారించి స్వచ్ఛమైన కల్లు దొరికేలా అధికారులు చర్యలు చేపట్టాలని కల్లు ప్రియులు కోరుతున్నారు. కల్తీ కల్లు విక్రయిస్తే చర్యలు తప్పవు జిల్లాలో కల్తీ కల్లు విషయంలో క్రమం తప్పకుండా తని ఖీలు చేస్తున్నాం. కల్తీ కల్లు వల్ల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తున్నాం. మత్తు పదార్థాలపై నిఘా పెట్టాం. కల్తీ కల్లు విక్రయిస్తే చర్యలు తప్పవు. – హన్మంతరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ -
సిరులు ఒడిసిపట్టు!
బీబీపేట: పట్టు పురుగుల పెంపకం (మల్బరీ సా గు) సిరులు కురిపిస్తోంది. ఒక్కసారి మల్బరీ మొ క్కలు నాటితే ఏకంగా 30 ఏళ్ల పాటు ఆదాయం వ చ్చే అవకాశాలుంటాయి. తక్కువ పెట్టుబడితో ఎ క్కువ ఆదాయం వస్తుండడంతో ఈ పంట సాగుకు జిల్లా రైతులు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో 27 ఎకరాల్లో.. జిల్లావ్యాప్తంగా 27 ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ సా గవుతోంది. మరో 40 ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెంచేందుకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు పంట విధానంతోపాటు మార్కెటింగ్, కేంద్ర ప్రభుత్వ అందించే రాయితీల గురించి వివరిస్తు న్నారు. బహు వార్షిక పంటైన మల్బరీ మొక్క ఒక సారి నాటితే 30 ఏళ్ల వరకు పంట ఇస్తుంది. మొద టి సంవత్సరం 2 నుంచి 3 పంటలు రాగా రెండో సంవత్సరం నుంచి 7 లేదా 8 పంటలు వస్తాయి. సాగు చేయడం ఇలా.. కనీసం రెండు ఎకరాల విస్తీర్ణంలో మల్బరీ సాగు చే యాలి. తోట పరిసర ప్రాంతంలో 20 ఫీట్ల అడ్డం, 50 ఫీట్ల పొడవు సీడ్స్ షెడ్డును ఏర్పాటు చేయాలి. షెడ్డు నిర్మాణం పరికరాలకు సిల్క్ సమగ్ర పథకం–2లో భాగంగా కేంద్రం రాయితీని అందజేస్తోంది. రెండు ఎకరాల్లో పట్టు పురుగులను పెంచేందుకు మల్బరీ మొక్కలు నాటి 250 గుడ్లు తెచ్చుకోవాల్సి ఉంటుంది. గుడ్ల నుంచి బయటికి వచ్చిన పురుగులకు ఆకు కోసి వేయాల్సి ఉంటుంది. ఏర్పాటు చేసుకున్న షెడ్డులో చల్లటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. 20 నుంచి 25 రోజుల్లో పురుగులు గూళ్లను అల్లుకుంటాయి. చంద్రికల నుంచి పట్టుగూళ్లను వే రు చేసి మార్కెట్కు తరలించుకోవచ్చు. ఇలా మల్బ రీ సాగులో సరైన యాజమాన్య పద్ధతులు అమలు చేస్తే స్థిరమైన అధిక ఆదాయాన్ని రైతులు సొంతం చేసుకోవచ్చు. నీటి సౌకర్యం కలిగిన నల్లరేగడి, చౌడు మినహా అన్ని భూములు మల్బరీ సాగుకు అనుకూలమని అధికారులు చెబుతున్నారు. పట్టు పరిశ్రమతో అధికాదాయం.. పట్టు పరిశ్రమపై జిల్లావ్యాప్తంగా రైతులకు అవగాహ న కల్పిస్తున్నాం. రైతులు నే రుగా మమ్మల్ని సంప్రదించి నా వివరాలు చెబుతాం. ప్ర భుత్వం అందించే రాయితీ ని ఉపయోగించుకొని పట్టు పరిశ్రమలు నెలకొల్పా లి. పట్టు సాగుతో అధిక ఆదాయం పొందవచ్చు. – జ్యోతి, జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి మల్బరీ మొక్కలను ఒక్కసారి నాటితే 30 ఏళ్ల వరకు ఆదాయం ఏడాదికి ఎనిమిది పంటలు.. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు జిల్లాలో పెరుగుతున్న మల్బరీ సాగుకేజీ పట్టు రూ.600 పట్టు పురుగుల గూళ్ల తయారీ అనంతరం వాటి నాణ్యత ఆధారంగా ధర ఉంటుంది. ప్రస్తుతం కేజీ పట్టు ధర రూ.600 ల వరకు పలుకుతోంది. దీంతోపాటు రైతుకు అదనంగా కేజీకి రూ.75 రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందిస్తోంది. రైతులు సాగుచేసిన పట్టుగూళ్లు విక్రయించుకునేందుకు హైదరాబాద్లోని తిరుమలగిరి, వరంగల్ జిల్లాలోని జనగామలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించింది. -
ఐదుగురి ప్రాణాలు నిలబెట్టిన అవయవదానం
గాంధారి(ఎల్లారెడ్డి): తాను చనిపోయినా మరో ఐదుగురికి అవయవాలు దానం చేసి ప్రాణాలు నిలబెట్టాడు మండల కేంద్రానికి చెందిన యువకుడు మోచి చరణ్రాజ్(30). వివరాలు ఇలా.. మండల కేంద్రానికి చెందిన మోచి రవి, పద్మ దంపతుల చిన్న కుమారుడు చరణ్రాజ్ హైదరాబాద్లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 22న జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడి తలకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో అతడు కోలుకోవడం కష్టమని వైద్యులు సూచించడంతో శనివారం చరణ్ తల్లిదండ్రులు, భార్య పెద్ద మనసుతో అతడి అవయవాలు దానం చేసి మరో ఐదుగురి ప్రాణాలు నిలబెట్టారు. అనంతరం అతడి అంత్యక్రియలు ఆదివారం స్వగ్రామంలో నిర్వహించారు. -
అదృశ్యమైన వ్యక్తి.. నాలుగేళ్లకు ఆచూకీ లభ్యం
బోధన్టౌన్(బోధన్): పట్టణానికి చెందిన అబ్దుల్ అజీమ్ నాలుగేళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయి, ఆదివారం తిరిగి తనవాళ్లకు వద్దకు చేరుకున్నాడు. అనం ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపిన వివరాలు ఇలా.. బోధన్కు చెందిన అబ్దుల్ అజీమ్ నాలుగేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఖమ్మంలోని కారెపల్లిలో తిరుగుతూ ప్రజలపై దాడికి పాల్పడుతుండగా అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి మానసిక పరిస్థితిని గమనించి ఆనం సేవా ఫౌండేషన్కు అప్పగించారు. అక్కడ అతడికి వైద్య చికిత్స అందించగా కొద్ది రోజుల నుంచి తన కుటుంబ సభ్యుల వివరాలు వెల్లడిస్తుండంతో ఆదివారం అతడిని బోధన్కు తీసుకు వచ్చి ఆచన్పల్లిలో నివాసం ఉంటున్న వరుసకు తమ్ముడైన అబ్దుల్ నయీమ్కు పోలీసుల సమక్షంలో అప్పగించారు. ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాస్, రావట్ల జనార్ధన్, పద్మాసింగ్, పోలీసులు ఉన్నారు. -
పేకాడుతున్న ఏడుగురి అరెస్టు
ఖలీల్వాడి/ఆర్మూర్టౌన్: ఆర్మూర్ శివారులోని బైపాస్ రోడ్డులో గల మల్లారెడ్డి గెస్ట్హౌస్లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఆదివారం నిజామాబాద్ సీసీఎస్ పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం రావడంతో సీపీ సాయిచైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో సీసీఎస్ సీఐ రవికుమార్, సిబ్బంది దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకున్నారు. అలాగే వారి వద్ద నుంచి రూ.21830 నగదును స్వాధీనం చేసుకున్నారు. రూ.2,35,000 ఆన్లైన్ చెల్లింపులు యూపీఏల ద్వారా చెల్లించినట్లు గుర్తించి ఫోన్లను సీజ్ చేశారు. అనంతరం ఆర్మూర్ పోలీసులకు అప్పగించారు. శివాలయంలో చోరీ లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని మెంగారం గ్రామంలోని శివాలయంలో దుండగులు చోరీకి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆలయం తాళాలను దుండగులు శనివారం రాత్రి ఇనుప రాడ్తో పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అలాగే ఆలయంలో ఉన్న హుండీని పగుల గొట్టి నగదు, అమ్మవారి మెడలో గల బంగారు పుస్తెను అపహరించారు. ఆలయంలో చోరీ జరగడం ఇది నాలుగోసారి కావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగతనాల నివారణకు పోలీసులు పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. నగరంలో ఆపరేషన్ ఛబుత్రా ఖలీల్వాడి: నగరంలోని బర్కత్పురా, గాజులపేట్, హయిత్గల్లీ, శివాజీనగర్, అహ్మద్పురా కాలనీలో ఆదివారం రాత్రి పోలీసులు ఆపరేషన్ ఛబుత్రా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయా కాలనీల్లోని ప్రజల వాహనాలకు సంబంధించిన పత్రాలను పోలీసు సిబ్బంది పరిశీలించారు. 36 బైక్లు, 6 ఆటోలకు పత్రాలు లేకపోవడంతో సీజ్ చేశారు. పాత నేరస్తులు, రౌడీషీటర్ల గురించి తెలుసుకున్నారు. ఎవరైనా అనుమానితులు ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. పట్టణ సీఐ శ్రీనివాస్ రాజు, ఎస్సైలు యాసీన్ ఆరాఫత్, హన్మండ్లు, ఆర్ఎస్సై అజయ్, సిబ్బంది పాల్గొన్నారు. -
పనులు త్వరగా పూర్తిచేయాలి
పసుపు వాగు అంచున నా పొలాలున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వంతెన నిర్మిస్తామంటే కాంట్రాక్టరుకు నా సొంత సాగు భూమిని ఇసుక, కంకర, ఇతర సామగ్రి నిల్వ కోసం కౌలు ధరకు ఇచ్చాను. ఏడాదిన్నర కావస్తున్న పనులు ముందుకు సాగడం లేదు. సామగ్రి పంట పొలంలోనే మిగిలిపోయి ఉంది. ఈ ఏడాదికి సంబంధించి రావాల్సిన కౌలు డబ్బులు రూ.లక్షా 35 వేలు కాంట్రాక్టరు చెల్లించడం లేదు. వంతెన పనులు త్వరితగతిన పూర్తి చేస్తే రైతులకు మేలు జరుగుతోంది. – బుర్క చిన్న లింగాగౌడ్, రైతు, పాన్గల్లీ, బోధన్ -
రోడ్డు ప్రమాదంలో బల్దియా కార్మికుడికి గాయాలు
నిజామాబాద్ సిటీ: నగర కార్పొరేషన్ లో పారిశుధ్య కా ర్మికుడిగా పని చేస్తు న్న శంకర్కు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉ న్నాయి. శంకర్ డంపింగ్ యార్డులో శనివారం విధులు ముగించుకొని బైక్పై తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఎదురుగా ఓ వ్యక్తి బైక్తో వచ్చి ఢీకొట్టాడు. ఈ ఘటనలో శంకర్కు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన మాక్లూ ర్ మండలం మెట్పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిని ఐదో టౌన్ పోలీసులకు అప్పగించారు. రుద్రూర్లో వ్యవసాయ కళాశాల కోసం ప్రయత్నాలురుద్రూర్: రుద్రూర్ మండలం అక్బర్నగర్ శివారులో వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి జిల్లాకు వ్యవసాయ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో ఫిబ్రవరిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో, నల్గొండ జిల్లా కంపసాగర్లో వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. దీంతో ఈ ప్రాంత వాసులు, రైతులు వ్యవసాయ కళాశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ కళాశాల ఏర్పాటుకు అవసరమగు స్థలం, మౌలిక వసతులు ఉన్నాయి. వ్యవసాయ విద్యాబోధనకు అనుకూలమైన వాతవరణం ఉంది. ఇక్కడ పరిశోధన కేంద్రంతో పాటు కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, ఆహార శాస్త్ర విజ్ఞాన కళాశాలలు ఉన్నాయి. పరిశోధన కేంద్రం ద్వారా వ్యవసాయ పద్ధతలను మెరుగు పరచడం, చీడపీడల నివారణ, వరి, చెరకులో కొత్త వంగడాలను రూపొందించి రైతులకు పరిచయం చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్ను ఇటీవల స్వచ్ఛంద సంస్థ రైడ్స్ ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రాలు అందజేశారు. రుద్రూర్లో వ్యవసాయ కళాశాలను ఏర్పాటు చేస్తే ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందని వారు పేర్కొంటున్నారు. వ్యవసాయ పరిశోధన కేంద్రం భూములను పరిశీలించడానికి అధికారులను పంపించాలని వ్యవసాయ శాఖ మంత్రిని స్థానికులు కోరుతున్నారు. ● ఎమ్మెల్యే, ఎంపీకి వినతిపత్రాలు అందజేత -
ఆత్మీయ పలకరింపులు.. మధుర స్మృతులు
లింగంపేట/నిజాంసాగర్/భిక్కనూరు/బీబీపేట/రాజంపేట/నాగిరెడ్డిపేట/రామారెడ్డి: ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని పూర్వ విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయావంటూ ఆనాటి స్నేహితులు ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో హర్షం వ్యక్తంచేశారు. జిల్లాలోని వివిధ గ్రామాల ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల పదోతరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఈసందర్భంగా చిన్నానాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే వేదికపై కలుసుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఒకరినొకరు పలకరించుకుంటూ అనాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకున్నారు. నాడు చదువు నేర్పిన ఉపాధ్యాయులను సమ్మేళనానికి ఆహ్వానించి, సన్మానించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. అనంతరం విద్యార్థులు, గురువులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. జిల్లాలో పలుచోట్ల సమ్మేళనాలు నిర్వహించిన పూర్వవిద్యార్థులు ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో భావోద్వేగానికి గురైన మిత్రులు -
యూనిఫాం కుట్టు కూలి చెల్లించేదెప్పుడో?
బిచ్కుంద(జుక్కల్): ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా యూనిఫాం అందిస్తోంది. గతేడాది యూనిఫాం కుట్టు చార్జీలు ప్రభుత్వం కొన్ని చెల్లించింది. సుమారు రూ.45 లక్షలు మహిళా సంఘాలకు చెల్లించాల్సి ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అందించిన యూనిఫాంలు కొందరు విద్యార్థులకు టైట్, మరికొందరికి లూజ్, చిన్న పెద్దగా ఇచ్చారు దీంతో విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం యూనిఫాం కుట్టే బాధ్యతను స్థానిక మహిళా సంఘాల సభ్యులకు అప్పగించింది. వారు పాఠశాలకు వెళ్లి విద్యార్ధుల కొలతలు తీసుకొని కుట్టారు. ఒక్కో జతకు రూ. 50 చెల్లిస్తామని ప్రభుత్వం అప్పట్లో ప్రకటించగా.. అనంతరం రూ.75 చెల్లిస్తామని ప్రభుత్వం ఒప్పుకుంది. గత ఏడాది కుట్టిన కూలీ రూ.50 తోనే చెల్లించింది ఇంకా జతకు రూ. 25 చెల్లించాల్సి ఉంది. జిల్లాలో సుమారు రూ.45 లక్షలు పాత కుట్టు బకాయిలు చెల్లిస్తేనే కొత్త యూనిఫాం కుడుతామని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అప్పులు తీసుకొని కుట్టే వారికి చార్జీలు చెల్లించామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత బకాయిలు వెంటనే ప్రభుత్వం చెల్లించాలని వారు కోరుతున్నారు. కొత్త యూనిఫాం కోసం మండలాలకు చేరుతున్న క్లాత్... పాఠశాలలు ప్రారంభం కాకముందే అన్ని పాఠశాలలకు యూనిఫాంలు చేరే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో విద్యార్థులకు రెండు జతలు ఇవ్వనున్నారు. జిల్లాలో 49,054 బాలికలు, 45,279 బాలురు మొత్తం 94,333 మంది విద్యార్థులకు యూనిఫాం అందించనున్నారు. జిల్లా కేంద్రం నుంచి యూనిఫాం క్లాత్ మండలాలకు పంపడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి కూడా మహిళా సంఘాల సభ్యులకు కుట్టే బాధ్యత అప్పగిస్తున్నారు. పాఠశాలలకు వెళ్లి కొలతలు తీసుకుంటున్నారు ఒక జతకు రూ.75 చెల్లిస్తామని అధికారులు అంటున్నారు. ఒక్కో విద్యార్థికి రెండు జతలు ఇవ్వనున్నారు. 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు బాలికలకు యూనిఫాం ఒకే విధంగా ఉండేలా మార్పులు చేశారు. 6 నుంచి గురుకులాల ఇంటర్ వరకు బాలుర విదార్థులకు ప్యాంట్లు, షర్టులు ఇవ్వనున్నారు. వీటి పరిశీలన బాధ్యత ఎంఈవోలకు అప్పగించనున్నారు. మే నెలాఖరులోగా యూనిఫాంలు పూర్తి చేసి బడిబాటకు ముందే పాఠశాలలకు చేరేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. తరగతులకు పిల్లలు కొత్త దుస్తుల్లో హాజరయ్యేలా కార్యచరణ రూపొందించినట్లు విద్యా శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో పాత బకాయి రూ.45 లక్షలు పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త దుస్తులు కుడుతామంటున్న మహిళా సంఘాల సభ్యులు జిల్లాలో 94,333 విద్యార్థులు -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
బిచ్కుంద(జుక్కల్): మండలంలోని హజ్గుల్ సమీపంలోగల మంజీరా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న 10 ట్రాక్టర్లను కందర్పల్లి వద్ద ఆదివారం పొలీసులు పట్టుకున్నారు. వేబిల్లు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని సమాచారం మేరకు తనిఖీలు చేపట్టి పట్టుకున్నట్లు ఎస్సై మోహన్రెడ్డి తెలిపారు. ఖాళీ బిందెలతో మహిళల నిరసన రుద్రూర్: మండల కేంద్రంలోని రాంమందిర్ కాలనీలో ఆదివారం నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గత 15 రోజులుగా పంచాయతీ కుళాయిలు రావడం లేదన్నారు. నీటి కోసం సమీప కాలనీల్లోకి వెళ్తే ఘర్షణ పడుతున్నారని వాపోయారు. మండుటెండలో నీటి కోసం తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై జీపీలో విన్నవిస్తే స్పందన కరువైందన్నారు. ఇకనైనా జీపీ అధికారులు సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
నిధులు సరిపోక నిలిచిన పనులు
బోధన్: బోధన్ పట్టణ శివారులోని బోధన్–బాన్సువాడ బైపాస్ రోడ్డు సమీపంలో గల పసుపు వాగుపై హైలెవల్ వంతెన నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. పనులకు కెటాయించిన నిధులు సరిపోక, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీన వైఖరి ఇలా అనేక కారణాల వల్ల పనులు అర్ధాంతరంగా నిలిచిపోయి, ముందుకు సాగడం లేదు. కాలయాపన వల్ల పనుల అంచనా వ్యయం పెరిగిపోతోంది. మరో వైపు అదనపు నిధుల కోసం పంపిన ప్రతిపాదనలు మేరకు నిధుల మంజూరులో ఆలస్యం జరుగుతోంది. అయినా పాలకులు, అధికారులు స్పందించడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఐదేళ్ల క్రితం ప్రతిపాదనలు.. పసుపు వాగుపై వంతెన నిర్మాణం కోసం 2021–22 ఆర్థిక సంవత్సంరలో పీఎంజీఎస్వై (ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన) కింద రూ. 3కోట్ల నిధులు మంజూరయ్యాయి. పీఆర్ ఇంజినీరింగ్ శాఖ పనుల కోసం టెండర్లు నిర్వహించగా 2023లో ప్రక్రియ పూర్తి చేసి కాంట్రాక్టర్కు అప్పగించారు. 2023 సెప్టెంబర్లో పనులు ప్రారంభించి 2025 మార్చి 1వరకు పూర్తి చేయాలని గడువు విధించారు. కానీ గడువు ముగిసిపోయిన పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. 10 పిల్లర్లు నిర్మించగా, రెండు పిల్లర్ల మేర స్లాబ్ వేసి వదిలేశారు. ఐదేళ్ల క్రితం ప్రతిపాదనల మేరకు మంజూరైన నిధులతో పనులు పూర్తి చేశామని, మరో రూ.3 కోట్లు నిధులు మంజూరుకు ఏడాదిక్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్టు అధికారులు చెబుతున్నారు. నిధులు ఎప్పుడు మంజూరవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. బోధన్–కోటగిరి మండలాలకు అనుసంధానం బోధన్ పట్టణ శివారు నుంచి పసుపు వాగు వంతెన మీదుగా కోటగిరి మండలంలోని ఎత్తొండ, రాయ్కూర్, దోమలెడ్గి వరకు సుమారు 14 కిలో మీటర్ల పొడువున పీఎంజీఎస్వై కింద రూ.6 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టి రెండేళ్ల క్రితమే పూర్తిచేశారు. వాగుపై చేపట్టిన వంతెన నిర్మాణం పూర్తి చేస్తే కోటగిరి మండల ప్రజలకు పట్టణ కేంద్రానికి వచ్చేందుకు దూరం తగ్గడమే కాక మరింత సౌకర్యంగా మారనుంది. ప్రస్తుతం వాగులో తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు మీదుగా రెండు మండలాల ప్రజలు రాకపోకలు సాగుతున్నాయి. అలాగే పసుపు వాగు అవతలి ఒడ్డున పట్టణ రైతులకు సంబంధించి 250 ఎకరాలకు పైగా సాగు భూములున్నాయి. వర్షాకాలంలో పంట పొలాలకు వెళ్లెందుకు ఏళ్లుగా రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. వంతెన పూర్తయితే సాగు కష్టాలు తీరుతాయని సంబుర పడ్డారు. కానీ పనులు ముందుకు సాగకపోవడంతో రైతులు, ఇరు మండలాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసి, పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బోధన్ శివారులోని పసుపువాగుపై ఏడాది క్రితం వంతెన పనులు ప్రారంభం రూ.3కోట్ల నిధులు సరిపోక అర్ధంతరంగా నిలిచిన బ్రిడ్జి నిర్మాణం -
‘జయంత్యోత్సవాలకు తరలిరావాలి’
బోధన్: పట్టణంలో ఈనెల 30న అంబేడ్కర్, జ్యోతిబాపూలే, జగ్జీవన్రాం జయంతిని పురస్కరించుకుని నిర్వహించనున్న మహనీయుల జయంత్యోత్సవ సభ, ర్యాలీకి ప్రజలు తరలిరావాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర ప్రతినిధి పరిమి కోటేశ్వర్రావు కోరారు. బోధన్లోని తాలూకా రైస్మిల్లర్స్ అసోసియేషన్ భవన్లో ఆదివారం డివిజన్ కమిటీ ప్రతినిధులతో కలిసి ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా వేలాది మందితో ర్యాలీ నిర్వహించనున్నామని, సభను అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. కమిటీ కన్వీనర్ నీరడి ఈశ్వర్, ప్రతినిధులు రవి కుమార్, వెంకటి, సింగాడి పాండు, సూర్యకాంత్, దేవేందర్, కారం స్వామి, రాహుల్, సురేందర్ పాల్గొన్నారు. ఐకమత్యంతో ముందుకు సాగాలినిజామాబాద్ రూరల్: బ్రాహ్మణులు ఐకమత్యంతో ముందుకు సాగాలని రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య శాశ్వత చైర్మన్ వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ పేర్కొన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో బ్రాహ్మణులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఆదివారం జిల్లా కేంద్రంలోని అర్వపల్లి పురుషోత్తం గుప్త కల్యాణ మండపంలో నిర్వహించారు. రాష్ట్రంలో పరిషత్ ద్వారా వచ్చే నిధులు త్వరలోనే విడుదలవుతాయని తెలిపారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోత్కూరి రామేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న పేద బ్రాహ్మణులకు, పేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందించేలా కృషి చేస్తామన్నారు. నూతనంగా ఎన్నికై న రాష్ట్ర శాశ్వత చైర్మన్ను సన్మానించారు. కార్యక్రమంలో ఉమాకాంత్, డాక్టర్ చంద్రశేఖర్ బిర్లా రామారావు, భూపతి రావు, ప్రవీణ్ కులకర్ణి, గాయత్రి కులకర్ణి, శరత్ కుమార్, వైద్య రణధీర్, ప్రవీణ్ మహరాజ్, రాజగోపాల చారి, రామ్ శ్యామ్, నవీన్, విజయ్, సభ్యులు పాల్గొన్నారు. నేత్ర, శరీర అవయవ దాతల సంఘం కన్వీనర్గా ప్రేమ్లాల్ నిజామాబాద్ రూరల్: తెలంగాణ నేత్ర శరీర అవయవ దాతల సంఘం నిజామాబాద్ సిటీ కన్వీనర్గా బానోత్ ప్రేమ్లాల్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉపేందర్రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కామిడి సతీశ్రెడ్డి ఆయనకు నియామకపత్రాన్ని అందజేశారు. -
విద్యుత్ షాక్తో పశువుల మృత్యువాత
సిరికొండ: మండల కేంద్రంలోని చీమన్పల్లి రోడ్డులో ప్రమాదవశాత్తు ట్రాన్స్ఫార్మర్కు తగిలి విద్యుత్ షాక్తో ఆవు ఆదివారం మృతి చెందింది. సిరికొండకు చెందిన బొందెరి రవికి చెందిన ఆవు తన వ్యవసాయ క్షేత్రానికి సమీపంలో మేత మేస్తోంది. అక్కడే తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్కు ఆవు తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఆవు విలువ రూ. 60వేల వరకు ఉంటుందని, నష్ట పరిహరం ఇచ్చి ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. పాల్దా గ్రామంలో.. నిజామాబాద్ రూరల్: మండలంలోని పాల్దా గ్రామ చెరువు శివారులో విద్యుదా ఘాతంతో మూడు పాడిగేదెలు మృతిచెందినట్లు పాడిరైతులు ఆదివారం పేర్కొన్నారు. గ్రామానికి చెందిన సంగేశ్ ప్రశాంత్, చాకలి ఆశోక్కు చెందిన పాడిగేదెలు ఊరు బయట చెరువు వద్దకు మేతకు వెళ్లాయి. ప్రమాదవశాత్తు కిందపడిన విద్యుత్వైర్ గేదెలకు తగలడంతో కరెంట్షాక్తో మృతిచెందాయి. ప్రభుత్వం స్పందించి తమకు నష్టపరిహారం అందించాలని బాధిత పాడిరైతులు కోరారు. -
కూరగాయలు C/o అంకోల్ క్యాంప్
● అంగళ్లకు ఇక్కడి నుంచే సరఫరా ● లాభాలు గడిస్తున్న రైతులు నస్రుల్లాబాద్ : సాధారణంగా ఏ గ్రామంలో అయి నా కొద్దిమంది మాత్రమే కూరగాయలు సాగు చే స్తుంటారు. కానీ అంకోల్ క్యాంప్లో మాత్రం ఊరుఊరంతా కూరగాయలు సాగు చేస్తుంది. అది కూ డా సేంద్రియ ఎరువులు వాడుతూ కూరగాయలు పండిస్తున్నారు. వీరు పండించిన కూరగాయలను బాన్సువాడ, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, పిట్లం, బి చ్కుంద, నిజామాబాద్, బోధన్, కోటగిరి, సాలూ ర, సాటాపూర్, నవీపేట్, పొతంగల్, వర్ని, నారా యణ్ఖేడ్ తదితర ప్రాంతాల్లోని అంగళ్లకు తీసుకువెళ్లి విక్రయిస్తుంటారు. అంకోల్ క్యాంప్లో మొత్తం 105 కుటుంబాలున్నాయి. సుమారు 60 కుటుంబాలు కూరగాయల ను సాగు చేస్తున్నాయి. సాధారణ పంటలతోపాటు దాదాపు 45 ఎకరాల్లో ఆయా రకాల కూరగాయలు పండిస్తున్నారు. బెండకాయ, క్యాబేజీ, మిర్చి, వంకాయ, టమాట, క్యాలీఫ్లవర్, సోరకాయ, బీరకా య, కాకరకాయలు ఎక్కువగా పండిస్తారు. రోజూ కూరగాయలు తెంపి, చుట్టు పక్కల గ్రామాల్లో నిర్వహించే అంగళ్లకు తీసుకువెళ్లి విక్రయిస్తారు. అతివలదే ప్రధాన పాత్ర.. కూరగాయల సాగులో మహిళలే క్రియాశీలక పాత్ర పోషిస్తుంటారు. విత్తనాలు విత్తడం, నీరు పెట్టడం, కలుపు తీయడం, ఎరువులు వేయడం, పంట కోయడం వంటి పనులన్నీ మహిళలే చేస్తారు. ఉదయం పంట కోసి బుట్టలు సిద్ధంగా ఉంచితే మగవారు వాటిని తీసుకెళ్లి అమ్ముకొని వస్తారు. కొందరు మహిళలు సైతం మార్కెట్కు వెళ్లి కూరగాయలు విక్రయిస్తుంటారు. అన్నీ నేనే చేస్తా.. అర ఎకరం భూమిలో కూరగాయలు పండిస్తాం. మిగతాది వరి పండిస్తాం. పంట కోయడం, కలుపు తీయడం, నీరు పారించడం, మందులు చల్లడం వంటివి నేనే చేసుకుంటాను. మా ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటాను. – శోభ, రైతు, అంకోల్ క్యాంపు రెండెకరాల్లో కూరగాయలు పండిస్తున్నా ఉదయం నిద్ర లేచింది మొదలు సాయంత్రం వరకు పొలంలోనే ఉంటా. కూరగాయలు మార్కెట్ వెళ్లగానే తినేసి వచ్చి పనులు చేసుకుంటాం. 2 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు పండిస్తాం. – లక్ష్మి, రైతు, అంకోల్ క్యాంపు మా కూరగాయల కోసం ఎదురుచూస్తారు మా ఊరి పంట బండ్ల కోసం ప్రజలు ఎదురుచూస్తారు. చుట్టు పక్కల ఎక్కడ అంగడి ఉన్నా మా గ్రామం నుంచే కూరగాయలు పంపిస్తాం. శుభకార్యాలకు ప్రత్యేకంగా వచ్చి తీసుకెళతారు. – సిద్దమ్మ, రైతు, అంకోల్ క్యాంపు సంతోషంగా ఉంది మా ఊరి రైతులు కూర గాయలే కాకుండా వరి పండించడంలోనూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కూరగాయల సాగు పను లన్నీ మహిళలే చూస్తా రు. కూరగాయల సాగుతో మా ఊరి రైతులు లాభాలు గడిస్తున్నందుకు సంతోషంగా ఉంది. –వెంకటరమణ, మాజీ సర్పంచ్, అంకోల్ క్యాంపు● ఈమె పేరు చంద్రమ్మ. 73 ఏళ్లు. తనకున్న 1.05 గుంటల భూమిలో వరితోపాటు ఉల్లిగడ్డ, పాలకూర, టమాట, తోటకూర, మెంతికూర, కొత్తిమీర సాగుచేస్తోంది. తానే స్వయంగా పొలంలో పనులు చేస్తుంది. ఇద్దరు కూతుళ్లతోపాటు కొడుకు పెళ్లి చేసింది. కొడుకు హైదరాబాద్లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటుండగా, ఇద్దరు మనవళ్లతో పొలం పనులు చూసుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది. -
పీఎం మన్కీ బాత్ వీక్షించిన బీజేపీ నాయకులు
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని 12వ వార్డులో ఆదివారం ప్రధాన మంత్రి మన్కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు టీవీ లో వీక్షించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, పట్టణ ఉపాధ్యక్షుడు రజినీకాంత్ రావు, 12 వార్డు బూత్ అధ్యక్షుడు గోపాల్, రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు తుమ్మ బాలకిషన్, నాయకులు రవీందర్, గోవర్ధన్, దొడ్ల స్వామి, రజినీకాంత్, ప్రభాకర్, శ్రీకాంత్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు. 4న వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభం కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో మే 4 నుంచి 31వ తేదీ వరకు వేసవి క్రికెట్ శిబిరం నిర్వహించనున్నారు. హైదరాబాద్, నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ల సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా క్రికెట్ అసోసియేష న్ అధ్యక్ష, కార్యదర్శులు మోజామ్ అలీఖాన్, ముప్పారపు ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోజూ ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శిబిరం ఉంటుందని పేర్కొ న్నారు. 13 నుంచి 23 ఏళ్లలోపువారు అర్హుల ని తెలిపారు. క్రీడాకారులు తెల్లని క్రికెట్ దు స్తులు, క్యాన్వస్ షూస్, క్రికెట్ కిట్ వెంట తీసుకొని రావాలని, వివరాలకు 96666 77786లో సంప్రదించాలని సూచించారు. చిన్నారిని బలిగొన్న కూలర్ మాక్లూర్ : కూలర్ షా క్తో చిన్నారి మృతి చెందిన ఘటన చిక్లి లో చోటు చేసుకుంది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చిక్లికి చెంది న గడ్డం అర్చన, నవీన్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న అసెంబుల్డ్ ఐరన్ కూలర్ వద్ద తల్లిదండ్రులతోపాటు పెద్దకూతురు విహంకిత(5) నిద్రపోయింది. సుమారు 2 గంటల సమయంలో నిద్ర నుంచి మేల్కొన్న విహంకిత అకస్మాత్తుగా పక్కనే ఉన్న కూలర్కు తగలడంతో విద్యుదాఘాతానికి గురైంది. దీంతో ఇంటి దర్వాజ నుంచి వాకిట్లో పడిపోయింది. ఇంటి ఎదుట రహదారి గుండా వెళ్లేవారు గమనించి తల్లిదండ్రులకు తెలపడంతో విహంకితను వెంటనే జన్నేపల్లిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించారు. అప్పటి వరకు తమతో ఆడుతూ పాడుతూ గడిపిన కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. -
బడులకు భద్రత కరువు
నాగిరెడ్డిపేట: పాఠశాలలకు ఈనెల 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. దీంతో సెలవులు పూర్తయ్యేవరకు పాఠశాలలవైపు కన్నెత్తి చూసేవారు ఉండరు. ఇదే అదనుగా భావించే ఆకతాయిలు పాఠశాలల భవనాలను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మార్చుకునే అవకాశాలుంటాయి. దీంతోపాటు గతంలో జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో సెలవుల్లో చోరీలు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. జిల్లాలో 710 ప్రాథమిక, 212 ప్రాథమికోన్నత, 322 ఉన్నత పాఠశాలలున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా జిల్లాలోని చాలా పాఠశాలలకు డిజిటల్ బోర్డులు, కంప్యూటర్లు, డెస్క్బెంచీలతో పాటు తాగునీటి సరఫరాకు సంబంధించి ఆర్వో ప్లాంట్లను సరఫరా చేశారు. పీఎంశ్రీ పథకం ద్వారా కొన్ని పాఠశాలలకు కంప్యూటర్లు, ట్యాబ్లను అందజేశారు. దీంతోపాటు పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన సరుకులున్నాయి. చాలా పాఠశాలల భవనాల చుట్టూ ప్రహరీలు లేవు. కొన్ని పాఠశాలల భవనాల చుట్టూ ప్రహరీలున్నా అవి పూర్తిస్థాయిలో లేవు. మరికొన్ని పాఠశాలల భవనాలకు సరైన గేట్లు కూడా లేవు. ప్రస్తుతం వేసవి సెలవులు ఇవ్వడంతో పాఠశాలలకు భద్రత కరువయ్యింది. వేసవి సెలవులు ముగిసేవరకు కాపలా కోసం తాత్కాలికంగా వాచ్మన్లను నియమించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రారంభమైన వేసవి సెలవులు వాచ్మన్లు లేక ఇబ్బందులు -
‘దయానందుడు చూపిన మార్గం ఆచరణీయం’
కామారెడ్డి అర్బన్ : ఆర్య సమాజ స్థాపకులు మహర్షి దయానంద సరస్వతి చూపిన మార్గం ఎంతో ఆచరణీయమైందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి ఆర్య సమాజం స్వర్ణోత్సవాలను ఆదివారం జిల్లాకేంద్రంలోని శ్రీసరస్వతి విద్యామందిర్ హైస్కూల్ ఆవరణలో నిర్వహించారు. 108 కుండాలతో గాయత్రి మహాయాగం జరిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా స్వర్ణోత్సవ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కామారెడ్డి ఆర్యసమాజం 50 ఏళ్లుగా వేద ధర్మాన్ని ప్రచారం చేస్తూ సమాజ ఉద్ధరణకు పాటుపడుతుండడం అభినందనీయమన్నారు. ఆర్యసమాజం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఆర్యసమాజం బాధ్యతలను యువతకు అప్పగించాలని సూచించారు. ఆర్ష గురుకులం అధిపతి బ్రహ్మానంద సరస్వతి, కోల్కతాకు చెందిన మహేంద్రపాల్ ఆర్య మాట్లాడుతూ ప్రతిఒక్కరు దేశభక్తి కలిగి ఉండాలని, వేదమార్గంలో పయనించాలని సూచించారు. కార్యక్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్యప్రతినిధి సభ కార్యదర్శి హరికిషన్ వేదాలంకార్, కామారెడ్డి ఆర్యసమాజం అధ్యక్షుడు కంకణాల కిషన్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే నేరెళ్ల ఆంజనేయులు, ఆర్యసమాజం ప్రతినిధులు గరిపల్లి అంజయ్యగుప్తా, గడ్డం రాంరెడ్డి, అర్వపల్లి రమేష్, నందనం కృపాకర్, ఆచార్య సత్యవీర్, దోమకొండ అరుణ, వంగాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.బాహుబలి దివ్యవాణి గ్రంథం.. కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్యసమాజం స్వర్ణోత్సవాలను ఆదివారం జిల్లాకేంద్రంలోని సరస్వతి విద్యామందిర్ హైస్కూల్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా పుస్తకాల స్టాళ్లు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా తూంపల్లికి చెందిన మర్రి కృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన స్టాల్ అందరినీ ఆకర్షించింది. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథం దివ్యవాణి నాలుగు వేదాల గ్రంథాన్ని ప్రదర్శించారు. 24 కిలోల బరువున్న వేదాల గ్రంథం వెల రూ. 24వేలని మర్రి కృష్ణారెడ్డి తెలిపారు. 4 వేల పేజీలతో 15/20 సైజులో ఈ గ్రంథం ఉంది. నాలుగు వేదాలను సులభమైన భాషలో అనువదించినట్లు మర్రి కృష్ణారెడ్డి తెలిపారు. -
భరోసా కల్పించడానికే భూభారతి
దోమకొండ/బీబీపేట: రైతులకు భరో సా కల్పించడానికే ప్రభుత్వం భూభార తి చట్టాన్ని తీసుకువచ్చిందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. శనివారం దోమకొండ, బీబీపేటలలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సుల లో ఆయన పాల్గొన్నారు. ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి మండలాల వారీగా సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. భూ సమస్యలకు ఈ చట్టంలో పరిష్కారాలు ఉన్నాయన్నారు. ఫాం పాండ్స్ నిర్మించుకోవాలి రైతులు పొలాల్లో ఫాం పాండ్స్ నిర్మించుకోవాలని కలెక్టర్ సూచించారు. వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోయేలా చేసి భూగర్భ జలాలను పెంచేందుకు ఫాం పాండ్స్, ఇంకుడు గుంతలు, కాంటూరు కందకాలు ఉపయోగపడతాయన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఉపా ధి హామీ పథకం కింద కనీసం 5 ఫాం పాండ్స్ నిర్మించాలని సూచించారు. కా ర్యక్రమంలో భిక్కనూరు ఏఎంసీ చైర్మన్ పాత రాజు, ఆర్డీవో వీణ, దోమకొండ మండల ప్రత్యేకాధికారి జ్యోతి, తహసీ ల్దార్లు సంజయ్రావు, సత్యానారాయణ, ఎంపీడీవోలు ప్రవీణ్కుమార్, పూర్ణచంద్రోదయ కుమార్, నాయకులు తిర్మల్ గౌడ్, ఐరేని నర్సయ్య పాల్గొన్నారు. మధ్యలోనే వెళ్లిపోయిన కలెక్టర్ దోమకొండలో కలెక్టర్ మాట్లాడుతున్న సమయంలో ఇద్దరు రైతులు తమ భూ సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. గతంలో అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అధికారులు వారికి సర్దిచెప్పినా వినలేదు. దీంతో కలెక్టర్ తన ప్రసంగం ముగించి మధ్యలోనే వెళ్లిపోయారు. -
ప్రాణహాని ఉందని సీపీకి ఫిర్యాదు
ఎడపల్లి(బోధన్): తనకు, కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన సుండు సతీష్ శనివారం సీపీ సాయిచైతన్యకు ఫిర్యాదు చేశారు. తనపై కక్ష గట్టిన సుండు యాదగిరి, అరుణ్ కుమార్, సుండు నర్సయ్యలు తనను చంపడానికి యత్నిస్తున్నారని, వీరిపై చర్యలు తీసుకువాలని, తనకు కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలని కోరారు. ఇప్పటి వరకు తనపై తన ఇంటిపై రెండు సార్లు దాడి చేశారని, దాడులకు సంబంధించిన వీడియోలను ఎడపల్లి పోలీసులకు ఇచ్చి ఫిర్యాదు చేశానన్నారు. కానీ ఇప్పటి వరకు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని సీపీ దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు. షార్ట్ సర్క్యూట్తో దుకాణం దగ్ధం కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని గాంధీ గంజ్లో రైతుబజార్ పక్కనే ఉన్న బేకరి, ఎగ్ సెంటర్ రేకుల షెడ్ దుకాణంలో శుక్రవారం అర్ధరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంతో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో దుకాణంలో మంటలు చెలరేగి సామగ్రి పూర్తిగా దగ్ధం అయింది. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. రూ. 2లక్షలకు పైగా నష్టం జరిగిందని దుకాణం యజమాని ఆసిఫ్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదం కాదు.. హత్యే..
జక్రాన్పల్లి: మండలంలోని సికింద్రాపూర్ 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఈ నెల 3న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో గాయపడగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మొదట యాక్సిడెంట్గా భావించగా, ఇటీవల హత్యగా పోలీసులు నిర్ధారించారు. జక్రాన్పల్లి పోలీస్స్టేషన్లో శనివారం డిచ్పల్లి సీఐ మల్లేష్, ఎస్సై తిరుపతి నిందితుల వివరాలను వెల్లడించారు. డిచ్పల్లి మండలంలోని మెంట్రాజ్పల్లికి చెందిన బైరం రవీంద్రవర్మ (37) హైవేపై తలకు గాయాలై అనుమానస్పద స్థితిలో పడి ఉండగా జక్రాన్పల్లి పోలీసులు అతనిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మొదటగా జక్రాన్పల్లి ఎస్సై తిరుపతి గుర్తు తెలియని వాహనం ఢీకొని రవీంద్ర వర్మ మృతి చెందాడని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కానీ ఘటన స్థలంలో మృతుడి సెల్ఫోన్, బ్యాగ్ లభించకపోవడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా నిందితులు ఏ1 లక్ష్మీనర్సింలు, ఏ2 చింతల కృష్ణ, ఏ3 కడమంచి మారుతిని పట్టుకుని విచారించారు. వీరు ముగ్గురు కూడా బంధువులు. జల్సాలకు అలవాటు పడిన ముగ్గురు నిందితులు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని పథకం ప్రకారం దారిదోపిడీలకు పాల్పడుతున్నారని తెలిపారు. అందులో భాగంగానే రవీంద్ర వర్మను ముగ్గురు నిందితులు లిఫ్ట్ ఇస్తామని తమ వాహనంపై ఎక్కించుకున్నారు. కొంతదూరం వెళ్లాక సికింద్రాపూర్ గ్రామ శివారులో వాహనాన్ని ఆపి పథకం ప్రకారం రవీంద్ర వర్మను భయపెట్టి, అతని వద్ద గల సెల్ఫోన్, బ్యాగ్, డబ్బులు దోచుకున్నారు. రవీంద్ర వర్మ ఎదురు తిరగడంతో వారు బండరాయితో మోదడంతో స్మృహ కోల్పోయి కిందపడిపోయాడు. నిందితులు అతడిని 44వ నెంబర్ జాతీయ రహదారిపై పడేసి ఏదో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టినట్లు చిత్రీకరించారు. మృతుడి సెల్ఫోన్ను కనుక్కోవడంతో అసలు విషయం బయటపడింది. దీంతో రవీంద్ర వర్మను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ, ఎస్సై తెలిపారు. నిందితుల వద్ద నుంచి సెల్ఫోన్లతో పాటు స్కూటీ, బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జక్రాన్పల్లి ఎస్సై తిరుపతి, సిబ్బందిని సీఐ అభినందించారు. ఈనెల 3న జరిగిన సికింద్రాపూర్ యాక్సిడెంట్ కేసును చేధించిన పోలీసులు ముగ్గురు నిందితుల అరెస్టు -
కుక్కల దాడిలో దూడలకు గాయాలు
తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి శివారులోని పందిరి కొట్టంలో ఉంచిన రెండు గేదె దూడలపై శనివారం కుక్కలు దాడిచేసి గాయపర్చాయి. స్థానికులు గమనించి వాటిని చికిత్స నిమిత్తం పశువుల ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా మండలంలోని కరడ్పల్లి, తాడ్వాయి, నందివాడ శివారులో పశువుల పాకలో ఉంచిన మేకలు, గొర్రెల పిల్లలు, లేగదూడలపై దాడిచేశాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి గ్రామాలలో ఉన్న కుక్కలను బయటకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రహదారి పరిశీలన గాంధారి(ఎల్లారెడ్డి): రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యల కోసం నియమించిన యాక్సిడెంట్ రిజల్యూషన్ బృందం శనివారం గాంధారిలో రహదారిని పరిశీలించారు. పలువురు స్థానియ నాయకులతో మాట్లాడారు. ఈ బృందంలో సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, ఎస్సై ఆంజనేయులు, సహాయ మోటారు వాహనాల ఇన్స్పెక్టర్ భిక్షపతి, ఆర్అండ్బీ ఏఈ రవితేజ తదితరులున్నారు. అలరించిన చిన్నారులు మాచారెడ్డి: మండలంలోని లచ్చాపేట ఉన్నత పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనతో అందరిని అలరించారు. ఈ సందర్భంగా పాఠశాల వేదిక నిర్మాణ దాత బూస శ్రీనివాస్, రూ. 50వేల విలువైన సామగ్రిని బహూకరించిన అర్కిడ్స్ పాఠశాల ప్రిన్సిపాల్ చెప్యాల గోవర్ధన్ రెడ్డి, పాఠశాలలో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన గ్రామస్తులతో పాటు ఇటీవల గ్రూప్– 1 పరీక్షలో విజయం సాధించిన భూస ఉదయ్ కిరణ్ ను సన్మానించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు లక్కిరెడ్డి రాజేశ్వరరెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు భవాని, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మక్బూల్, మాజీ ఎంపీటీసీ బూస శ్రీనివాస్, జయరామశర్మ, ఉపాధ్యాయులు గ్రామస్తులు ఉన్నారు. -
బేస్మెంట్ దశలో నిలిచిన మరుగుదొడ్ల నిర్మాణం
బాన్సువాడ రూరల్: మండలంలోని బోర్లం జెడ్పీహైస్కూల్లో విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకోవడానికి నిర్మించ తలపెట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పనులకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. 180మంది విద్యార్థులున్న ఈపాఠశాలలో ఒకే ఒక మరుగుదొడ్డి ఉండటంతో విద్యార్థినులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏడాది పూర్తి కావస్తున్న టాయిలెట్ల నిర్మాణం పూర్తికావడం లేదు. అధికారులు బిల్లు నమోదు చేయకపోవడంతో కాంట్రాక్టర్ పనులను బేస్మెంట్ దశలో నిలిపివేశారు. వచ్చే విద్యాసంవత్సరం వరకు టాయిలెట్ల నిర్మాణ పనులు పూర్తిచేసి విద్యార్థుల ఇబ్బందులు తొలగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
కుక్కల దాడిలో 20గొర్రెలు మృత్యువాత
ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని మల్లయ్యపల్లి గ్రామంలో కుక్కలు దాడి చేయడంతో 20 గొర్రెలు మృత్యువాత పడినట్లు గ్రామస్తులు శనివారం తెలిపారు. గ్రామంలోని కుర్మ మహేందర్కు చెందిన గొర్రెలపై కుక్కలు అకస్మాత్తుగా దాడి చేయడంతో 20 గొర్రెలు మృతి చెందాయని అన్నారు. మృతి చెందిన గొర్రెలను వెటర్నరీ వైద్యురాలు అర్చన పరిశీలించారు. ప్రభుత్వం నష్ట పరిహారం అందించేలా చూడాలని బాధితుడు కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా ఎమ్మెల్యే మదన్మోహన్ చర్యలు తీసుకుంటారని మండల పార్టీ అధ్యక్షుడు సాయిబాబా బాధితుడికి హామీ ఇచ్చారు. విద్యుత్ షాక్తో గేదె.. రుద్రూర్: మండలంలోని రాణంపల్లి శివారులో విద్యుత్ షాక్ తగిలి పాడి గేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన శ్రీనివాస్ గేదెల పెంపకం ప్రధాన వృత్తిగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. శనివారం గేదెలను మేత కోసం గ్రామ శివారులోకి తీసుకెళ్లగా ఒక గేదె ట్రాన్స్పార్మర్ వద్ద విద్యుత్ షాక్కు గురై మృతి చెందింది. మృతి చెందిన గేదె రూ.లక్షా 25వేల వరకు ఉంటుందని, నష్ట పరిహరం ఇప్పించాల్సిందిగా బాధిత రైతు కోరాడు. మహిళ అదృశ్యం రుద్రూర్: కోటగిరి మండలం వల్లాభాపూర్ గ్రామానికి చెందిన మేకల లక్ష్మి అదృశ్యమైనట్టు ఎస్సై సునీల్ శనివారం తెలిపారు. ఈ నెల 17న ఇంట్లోంచి వెళ్లిన లక్ష్మి ఇప్పటి వరకు తిరిగి రాలేదు.బంధువులు,స్నేహితుల వద్ద వెతికినప్పటికీ ఆమె ఆ చూకీ లభించలేదు. దీంతో ఆమె భర్త శివరాములు శనివారం పోలీస్స్టేషన్ ఫిర్యా దు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఇసుక టిప్పర్లు సీజ్ నిజాంసాగర్(జుక్కల్): కర్ణాటక రాష్ట్రానికి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు టిప్పర్లను శనివారం సీజ్ చేసినట్లు డోంగ్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా తెలిపారు. డోంగ్లి మండలంలోని మంజీరా వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తుండటంతో పట్టుకున్నామన్నారు. -
అంబలి కేంద్రం, చలివేంద్రాలను ప్రారంభించిన కలెక్టర్
కామారెడ్డి క్రైం: ఉద్యోగ జేఏసీ, టీఎన్జీవోఎస్ జిల్లా శాఖల ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన అంబలి కేంద్రం, చలివేంద్రాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ అవసరాల నిమిత్తం కలెక్టరేట్కు వచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇవి ఉపయోగపడతాయన్నారు. ఈకేంద్రాలను ఏర్పాటు చేసిన ఉద్యోగ జేఏసీ, టీఎన్జీవోఎస్ ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించాలని కలెక్టర్కు వినతి.. దోమకొండ: అర్హత కలిగిన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో భూభారతి కార్యక్రమాన్ని ముగించుకొని కామారెడ్డికి వెళ్తుండగా మార్గమధ్యలో షేక్ అల్మా బేగం ఇంటిని కలెక్టర్ పరిశీలించారు. తాను, తన భర్త కూలీ పనిచేస్తూ ఇద్దరు పిల్లలతో కలిసి ప్లాస్టిక్ కవర్లతో కప్పిన గుడిసెలో ఉంటున్నామని వారు ఆయనకు తెలిపారు. తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కలెక్టర్ను కోరారు. మండల ప్రత్యేక అధికారిని జ్యోతి, ఎంపీపీవో ప్రవీణ్కుమార్, జీపీ కార్యదర్శి యాదగిరి, తదితరులున్నారు. -
చోరీ కేసులో ముగ్గురి అరెస్టు
నవీపేట: మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన చోరీ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. నిజామాబాద్ నార్త్రూరల్ పోలీస్ స్టేషన్ ఆవణలో శనివారం సీఐ శ్రీనివాస్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ముప్కాల్ మండలంలోని కంజర్ గ్రామానికి చెందిన ముగ్గురు కూలీలు కాలూర్ లత, పంతుల విజయ, ఈర్ల సాయికుమార్ ప్రతిరోజు కలిసి కల్లు తాగేవారు. ఈక్రమంలో ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆలోచనలో షేర్చాట్ను ఫాలో అయ్యారు. కత్తి, కారంతో ఒక మహిళను బెదిరించి.. బంగారం దొంగిలించిన వీడియో వీరికి నచ్చింది. అంతే శుక్రవారం నవీపేటలో వారాంతపు కూరగాయల సంత ఉండడంతో అమాయకుల కోసం గాలించారు. ఈ క్రమంలో మండలంలోని నారాయణ్పూర్కు చెందిన రాచర్ల కిష్టాబాయి అనే వృద్ధురాలు ఒంటరిగా వెళ్తుండగా ఆమెను వెంబడించారు. కత్తితో బెదిరించి.. కంట్లో కారం చల్లి..బంగారు పుస్తెల గుండ్లు, పడిగెలను దోచుకుని పారిపోయారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దొంగతనానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. -
ధాన్యం కుప్పలు.. వాహనదారులకు తిప్పలు
ఎల్లారెడ్డిరూరల్: రైతులు పండించిన పంటలను కల్లంలో ఆరబెట్టాల్సి ఉన్నప్పటికి ప్రధాన రహదారులపై ఆరబెట్టడంతో పాటు పక్కన పెద్ద పెద్ద బండరాళ్లు ఉంచడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఎన్నిసార్లు అవగాహన కల్పిస్తున్నా రైతులు పెడచెవిన పెడుతున్నారు. ఈ కారణంగా రాత్రివేళల్లో వరి కుప్పలు కనిపించక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ తండా, లక్ష్మాపూర్ గ్రామాలలో ప్రధాన రహదారులపై ధాన్యం ఆరబెట్టడంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి రోడ్లపై పంటల నూర్పిడి చేయకుండా, ధాన్యం ఆరబెట్టకుండా తగిన చర్యలను తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. ఆరబెట్టకుండా చర్యలు తీసుకోవాలి రోడ్డుపై ధాన్యం ఆరబెట్టడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ధాన్యం ఆరబెట్టకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ప్రధానంగా బైకుపై వెళ్లేవారు గాయాలపాలవుతున్నారు. వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రోడ్డుపై ధాన్యం ఆరబెట్టకుండా చూడాలి. – విజయ్ కుమార్, లింగంపేట కల్లాల్లోనే ఆరబెట్టుకోవాలి రైతులు ధాన్యాన్ని కల్లాల్లోనే ఆరబెట్టుకోవాలి. రోడ్డుపై ధాన్యం ఆరబెట్టుకోవడం సరికాదు. ధాన్యం కుప్పల మీద రాళ్లు పెట్టడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అనుకోని ప్రమాదాలు జరిగితే దానికి పూర్తి బాధ్యులు ధాన్యం ఆరబెట్టిన వారవుతారు. – మహేష్, ఎస్సై, ఎల్లారెడ్డి ఎల్లారెడ్డి మండలంలో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు పట్టించుకోని అధికారులు -
కాంగ్రెస్ పార్టీ నుంచి కందూరి లింబాద్రి సస్పెండ్
రామారెడ్డి: కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు సేవ చేసే వారికే ప్రాధాన్యత ఉంటుందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మా గౌడ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ కబ్జాలతో పాటు, హత్య కేసులో నిందితుడిగా ఉన్న రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన కందూరి పెద్ద లింబాద్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే బాధిత కుటుంబానికి అండగా ఉంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శిలాసాగర్, ఇర్పాన్, రంజిత్, భాస్కర్ ,శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
కొనుగోళ్లను వేగవంతం చేయండి
దోమకొండ : ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూ చించారు. శనివారం దోమకొండలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అకాల వర్షా లు కురిసే ఆస్కారం ఉన్నందున రైతులకు టార్పాలిన్లు అందజేయాలన్నారు. తూకం వేసిన వడ్లను వెంటవెంటనే మిల్లులకు తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ వంటి ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌరసరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, డీసీవో రామ్మోహన్, మండల ప్రత్యేకాధికారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
నిలువ చేస్తే నిరాశే మిగిలింది
మోర్తాడ్(బాల్కొండ): నిలువ చేసిన పంటను సీజన్ ముగిసిన తర్వాత విక్రయించుకుందామనుకున్న ఎర్రజొన్న రైతులకు నిరాశే మిగిలింది. గత సీజన్లో ఎర్రజొన్న క్వింటాల్కు రూ.3,800 ధర లభించడంతో మోర్తాడ్కు చెందిన మహిపాల్ అనే రైతు 40 క్వింటాళ్ల ఎర్రజొన్నలను నిలువ చేసుకున్నాడు. సీజన్ ముగిసిన తర్వాత కనీసం రూ.4,200 ధర లభిస్తుందని ఆశించాడు. కానీ, విత్తన వ్యాపారుల సిండికేట్తో సీజన్ ముగిసినా ధర ఏమాత్రం పెరగకపోగా కనీసం సీజన్లో లభించిన ధర కూడా దక్కలేదు. దీంతో వారం కింద క్వింటాల్కు రూ.400 తక్కువకు పంటను విక్రయించాడు. సుమారు రూ.16 వేల నష్టానికే మహిపాల్ తన పంటను విక్రయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహిపాల్ మాదిరిగానే ఎర్రజొన్నలను నిలువ చేసుకున్న రైతులందరూ తక్కువ ధరకే తమ పంటను విక్రయించారు. రైతుల వద్ద దాదాపు 5వేల క్వింటాళ్ల ఎర్రజొన్నలు నిలువ ఉండగా ఒక్కో క్వింటాలుకు రూ.3,400 ధర ప్రకారం విక్రయించడంతో రూ.20 లక్షల వరకు లాభాన్ని కోల్పోయారు. గతంలో క్వింటాలుకు రూ.4,500 వరకు పలకగా, సీడ్ వ్యాపారుల గుత్తాధిపత్యంతో ధర పడిపోయి రైతులకు తీరని నష్టం మిగిల్చింది. ఆరబోసిన ఎర్రజొన్నలు(ఫైల్) తగ్గిన ఎర్రజొన్నల ధర ఆవేదనలో అన్నదాత -
కేసీఆర్ వెంటే..
‘తెలంగాణ’లోనూ..● తెలంగాణ కోసం బీఆర్ఎస్తో కలిసి నడిచిన జిల్లావాసులు ● రాష్ట్రమొచ్చాకా కారుకే మద్దతు ● పాతికేళ్ల ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తెలంగాణ రాష్ట్రం కోసం 2001 లో డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి గులాబీ జెండా అందుకుని కదనరంగాన దూకిన కేసీఆర్కు జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పల్లెలన్నీ ఆయన వెంట నడిచాయి. కరీంనగర్లో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివెళ్లారు. కామారెడ్డి న్యాయవాదులు అప్పటి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తిర్మల్రెడ్డి నాయకత్వంలో తెలంగాణ కోసం తొలి తీర్మానం చేసి కరీంనగర్ సభకు వెళ్లారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలోనే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గా ల్లో మెజారిటీ మండలాల్లో గులాబీ జెండా ఎగిరింది. ఉమ్మడి జిల్లా పరిషత్ను ఆ పార్టీ కై వసం చేసుకుంది. 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్తో బీఆర్ఎస్ పొత్తుపెట్టుకుంది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో కామారెడ్డి ప్రాంతంలోని అన్ని అసెంబ్లీ స్థానాలతోపాటు ఒక పార్లమెంట్ స్థానం కూడా కూటమే గెలుచుకుంది. 2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్, టీడీపీలు మహాకూటమిగా ఏర్పడి క్లీన్ స్వీప్ చేశాయి. అప్పటి సీఎం వైఎస్సార్ మరణానంతరం తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం మరోమారు ఊపందుకుంది. ఉద్యమ తీవ్రత పెరగడంతో టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, గంప గోవర్ధన్, హన్మంత్ సింధేలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడి గులాబీ కండువా కప్పుకున్నారు. 2010లో కామారెడ్డి, బాన్సువాడలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులుగా గోవర్ధన్, పోచారం పోటీచేసి గెలిచారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే 2014 లో జరిగిన ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక ఎంపీ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ కై వసం చేసుకుంది. 2018 ఎన్నికల్లో ఎల్లారెడ్డిలో మాత్రమే గులాబీ పార్టీ ఓడిపోయింది. అనంతరం రాజకీయ పరిణామాలతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ గూటికి చేరారు. జహీరాబాద్ ఎంపీ స్థానాన్ని బీఆర్ఎస్ నిలబెట్టుకుంది. కామారెడ్డి జిల్లా ఏర్పాటైన తర్వాత తొలి జెడ్పీ పీఠం, మండలాలు, మున్సిపాలిటీలు కూడా బీఆర్ఎస్ గెలుచుకుంది. 2023 ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్ ఓటమి చెందారు. ఎల్లారెడ్డి, జుక్కల్లలోనూ పరాజయం తప్పలేదు. బాన్సువాడలో గులాబీ జెండా ఎగిరినా.. కొద్ది కాలానికే పోచారం కాంగ్రెస్ గూటికి చేరారు. -
జోరుగా బెటి్టంగ్
నిఘా కరువు..కామారెడ్డి క్రైం : క్రికెట్ అంటే చాలామందికి ఇష్టం. గతంలో ఆటను ఆటగానే చూసేవారు. తమ అభిమాన ఆటగాళ్ల ఆటను చూసేందుకు టీవీల ముందునుంచి కదిలేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఆట జూదంగా మారిపోయింది. చాలామంది బెట్టింగ్ ఊబిలో కూరుకుపోయారు. బాల్ బాల్కు పందెం.. బెట్టింగ్ సంస్కృతి గల్లీలకూ పాకింది. నిర్వాహకుల ను సంప్రదించి మ్యాచ్ల వారీగా, ఓవర్ల వారీగా పందాలు కాస్తున్నారు. మ్యాచ్ ఆసక్తికరంగా మారి తే బంతి బంతికీ బెట్టింగ్ నడుస్తోంది. ఈ వ్యసనా నికి బానిసైనవారు బెట్టింగ్లో నష్టపోతూ ఆర్థికంగా దివాలా తీస్తున్నారు. మానసికంగానూ నలిగిపోతున్నారు. అప్పుల పాలై, వాటిని ఎలా తీర్చాలో తె లియక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు సైతం ఉన్నాయి. ఇటీవల దేవునిపల్లికి చెందిన ఓ యువకు డు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. అత ని అప్పులకు క్రికెట్ బెట్టింగ్ ప్రధాన కారణమని తె లిసింది. ఆస్తులు అమ్ముకునే పరిస్ధితి వచ్చిన కు టుంబాలు కూడా ఎన్నో ఉన్నాయి. పరువు పోతుందని బయటకు చెప్పుకోలేని వారు కూడా ఉన్నారు. గల్లీగల్లీకి పాకిన సంస్కృతి వ్యసనంగా మారిన వైనం దృష్టి సారించని పోలీసు శాఖ ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి జిల్లావ్యాప్తంగా జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. ఇది బహిరంగ రహస్యమే.. ఒక్క నిజామాబాద్ పోలీసులు మాత్రమే ఈ ఏడాది బెట్టింగ్ ముఠాను గుర్తించి పట్టుకున్నారు. మిగతా ఎక్కడా ఐపీఎల్ బెట్టింగ్ మూలాలను గుర్తించలేదు. కామారెడ్డి, బాన్సువాడ లలో గతంలో కొన్ని ముఠాలు బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకుని రిమాండ్కు పంపారు. ఈ సీజన్లో కూడా అన్ని ప్రాంతాల్లో జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో బెట్టింగ్ ముఠాలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. మండలాలు, గ్రామాల్లో వ్యక్తుల మధ్య నేరుగా పందాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దందాను అడ్డుకునే విషయమై పోలీసు శాఖ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
ఏదడిగినా కేసీఆర్ కాదనలేదు..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అభివృద్ధి పనుల విషయంలో ఏదడిగినా కేసీఆర్ కాదనలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ రజతోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ప్రశాంత్రెడ్డి పలు విషయాలను గుర్తుచేసుకున్నారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. మోతెలో తీర్మానం.. ముడుపు కట్టిన కేసీఆర్.. తీవ్రమైన కరువు సమస్యను ఎదుర్కొంటున్న వేల్పూర్ మండలంలోని మోతె గ్రామస్తులు తమ సమస్యలు పరిష్కారం కావాలంటే స్వరాష్ట్రం సాధించుకోవాల్సిందేనని నిశ్చయించుకున్నారు. 2001లో కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేశాక ఏకగ్రీవ తీర్మానం చేసి కేసీఆర్ వైపు నిలబడ్డారు. ఇదే స్ఫూర్తితో మెండోరా మండలంలోని బుస్సాపూర్ గ్రామస్తులు తీర్మానం చేసుకుని బీఆర్ఎస్కు జైకొట్టారు. తరువాత రాష్ట్రవ్యాప్తంగా వరుసగా అనేక గ్రామాల్లో బీఆర్ఎస్కు మద్దతు పెరిగింది. మోతె గ్రామానికి 2001 మే 5న కేసీఆర్ వచ్చి ఇక్కడి మట్టితో ముడుపు కట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్లో పాసయ్యాక 2014 మార్చి 28న కేసీఆర్ గ్రామానికి వచ్చి ముడుపు విప్పారు. తరువాత మళ్లీ ముఖ్యమంత్రి హోదాలో 2015 జూలై 6 న ఇక్కడికి వచ్చి గ్రామంపై వరాలు కురిపించారు. గ్రామంలో చెరువు, మాటు కాలువ, పాఠశాల, ప్రత్యేకంగా పీహెచ్సీ, కొత్త గ్రామపంచాయతీ, రూ.2 కోట్లతో సీసీ రోడ్లు నిర్మాణమయ్యాయి. అప్పుడు వేల్పూర్లోని మా పెంకుటిల్లులోనే కేసీఆర్ బస చేశారు. తండ్రి ఆశయాలను కొనసాగిస్తున్నా.. స్వరాష్ట్రం వస్తేనే అనుకున్న విధంగా అభివృద్ధి సాధ్యమని, గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలంటే చిన్ననీటి వనరులను పెపొందించుకోవాలని మా తండ్రి వేముల సురేందర్రెడ్డి చెప్పేవారు. ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తున్నా. ఇక్కడ మొదలుపెట్టి.. చెక్డ్యాముల నుంచి మొదలు అనేక నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి ప్రయోగం ఇక్కడే చేశాం. ఇక్కడ సక్సెస్ చేశాక కేసీఆర్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అమలు చేశారు. ఎస్సారెస్పీ వరద కాలువకు కింది లెవెల్లో 16 తూములు ఏర్పాటు చేయడంతో 45 చెరువు లు నిండుతున్నాయి. కాళేశ్వరం ద్వారా ప్రతి రెండున్నర ఎకరాలకు ఒక అవుట్లెట్ పాయింట్ ఏర్పాటు చేశాం. జగన్మోహన్రెడ్డికి పైలట్గా.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వచ్చినప్పుడు ఆయనను రిసీవ్ చేసుకుని పైలట్గా వ్యవహరించే బాధ్యతను కేసీఆర్ నాకు అప్పగించారు. దీన్ని ఎప్పటికీ మరిచిపోలేను. నీటిపారుదల విషయంలో ప్రతి ప్రయోగం ఇక్కడి నుంచే మొదలు మోతె గ్రామస్తుల ఉద్యమ స్ఫూర్తి అజరామరం స్వరాష్ట్రం సిద్ధించాక సీఎం హోదాలో మోతె వచ్చిన కేసీఆర్ రజతోత్సవ సభ నేపథ్యంలో ‘సాక్షి’తో వేముల ప్రశాంత్రెడ్డి -
రేవంత్ పాలనలో దిగజారిన రాష్ట్ర పరిస్థితి
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ పదేళ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమంలో అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిపారని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసమర్థ పాలనతో రాష్ట్రం పరిస్థితి దిగజారిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. శుక్రవారం కామారెడ్డిలో మాజీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యేలు హన్మంత్ సింధే, జాజాల సురేందర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ సీఎంగా ఉండగా తలసరి ఆదాయం దేశంలో ఒకటో స్థానంలో ఉంటే, ఇప్పుడు 11వ స్థానానికి పడిపోయిందన్నారు. జీఎస్డీపీ వృద్ధిలో మూడో స్థానంనుంచి 14 వ స్థానానికి దిగజారిందన్నారు. మోసపూరిత హామీలపై నిలదీస్తాం.. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి అన్ని వర్గాలను వంచించాడని ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి 11 వేలు మాత్రమే ఇచ్చారని, తాము అధికారంలో ఉన్నపుడు ఇచ్చిన నోటిఫికేషన్లు, పరీక్షలు, నిర్వహించిన ఇంటర్వ్యూలను కూడా వారి ఖాతాలో జమ చేసుకుంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించే బహిరంగ సభ ద్వారా కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ మోసాలు, వంచనను ఎండగడతారన్నారు. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు 420 వాగ్దానాల అమలు కోసం సర్కారుపై ఒత్తిడి పెంచడానికే సభ నిర్వహిస్తున్నామన్నారు. సభకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి 40 వేల మంది తరలిరానున్నారని వివరించారు. ఉమ్మడి జిల్లా నుంచి 250 ఆర్టీసీ బస్సులు, 264 ప్రైవేటు బస్సులు, 626 తుఫాన్లు తదితర వాహనాలు, 1,266 సొంత వాహనాలతో తరలివెళ్తామన్నారు. వడ్లను కొనుగోలు చేయడంలో తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోబోమన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు మనోహర్రెడ్డి, కుంబాల రవి, కపిల్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, రమేశ్, హఫీజ్, లక్ష్మీనారాయణ, బల్వంతరావ్ తదితరులు పాల్గొన్నారు. ఎల్కతుర్తి సభలో సర్కారును కేసీఆర్ నిలదీస్తారు సభకు ఉమ్మడి జిల్లా నుంచి 40 వేల మందిని తరలిస్తాం మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి -
రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసం ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. రహదారి భద్రత నిబంధనలపై నిత్యం అవగాహన కల్పిస్తున్నారు. వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ జరిమానాలు విధిస్తున్నారు. అయినా వాహనదారుల్లో మార్పు రావడం లేదు.
కామారెడ్డి క్రైం : జిల్లా పోలీసు శాఖ ఇటీవలి కాలంలో వాహనాల తనిఖీలను పెంచింది. వాహన పత్రాలు లేకపోయినా, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకపోయినా, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా, త్రిబుల్ రైడింగ్ చేస్తున్నా పోలీసులు ఎడాపెడా జరిమానాలు బాదేస్తున్నారు. మూడు నెలల కాలంలోనే (జనవరి నుంచి మార్చి వరకు) జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,19,606 చలాన్లు విధించారు. వాటిలో హెల్మెట్ లేదని విధించిన జరిమానాలే 89,936. హెల్మెట్ ధరించలేదనే కారణంతోనే రోజుకు దాదాపు వెయ్యి చలాన్లు పడుతున్నాయి. జిల్లాలో విస్తృతంగా వాహనాల తనిఖీ హెల్మెట్ లేకుంటే జరిమానా విధిస్తున్న పోలీసులు 3 నెలల్లో 89,936 మందికి ఫైన్.. అయినా మారని వాహనదారులు -
ఎమ్మెల్సీలకు సన్మానం
కామారెడ్డి టౌన్: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డిలతోపాటు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు మాట్లాడుతూ ఉపాధ్యాయ, విద్యారంగ, నిరుద్యోగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కానికి కృషి చేస్తామన్నారు. అనంతరం అహిల్యా బాయి హోల్కర్ త్రిశతాబ్ది జయంతి వేడుకలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో తపస్ రాష్ట అధ్యక్ష, కార్యదర్శులు హన్మంత్రావు, సురేష్, జిల్లా అధ్యక్షుడు పుల్గం రాఘవరెడ్డి, నాయకులు పాలేటి వెంకట్రావు, రవీంద్రనాథ్, రమేష్ కుమార్, భాస్కరాచారి, రాంచంద్రం, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.