విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తోంది
కామారెడ్డి క్రైం: మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తున్నదని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని 25వ వార్డులో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి వీజీ గౌడ్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్కు మున్సిపల్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ బాకీ కార్డులను ఓటర్లకు పంపిణీ చేశారు. నాయ కులు ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


