breaking news
Kamareddy District Latest News
-
నేడు పెన్షనర్స్ డే ముగింపు ఉత్సవాలు
నిజామాబాద్ రూరల్: నగరంలోని న్యూ అంబేడ్కర్ ఆడిటోరియంలో నేడు (బుధవారం) సాయంత్రం అఖిల భారతీయ పెన్షనర్స్ డే ముగింపు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పండరినాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గంగాకిషన్ ఒక ప్రకటనలో తెలిపారు. వేడుకలకు జిల్లాలోని రిటైర్ట్ ఎంప్లాయీస్ అందరూ కుటుంబసమేతంగా హాజరు కావాలని కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్గౌడ్, కలెక్టర్ వినయ్కృష్ణరెడ్డితోపాటు ముఖ్య నేతలు హాజరు కానున్నట్లు తెలిపారు. కొనసాగుతున్న క్రీడాపోటీలు నగరంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో రిటైర్డ్ ఉద్యోగుల క్రీడాపోటీలు కొనసాగుతున్నాయి. క్యారమ్, పరుగుపందెం, టేబుల్ టెన్నీస్, షటిల్, మ్యూజిక్ చైర్, స్కిల్ గేం, చెస్, పాటల పోటీలు వంటి అంశాల్లో రిటైర్డ్ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రపంచ తెలుగు కవుల సమ్మేళనానికి ప్రేమ్లాల్ నిజామాబాద్ రూరల్: తెలుగు భాష రక్షణ వేదిక మాజీ అధ్యక్షు డు పొట్లూరి హరికృష్ణ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28 తేదీలలో విజయవాడలో నిర్వహించే ప్ర పంచ తెలుగు కవుల సమ్మేళనానికి జిల్లాకు చెందిన కవి,రచయిత ప్రేమ్లాల్కు ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా ఆయనకు సాహితీ మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలిపారు. నిజామాబాద్ లీగల్: నిజామాబాద్ అదనపు సీనియర్ సివిల్ కోర్టు జడ్జి సాయిసుధను నిజామాబాద్ సీనియర్ సివిల్ కోర్టు జడ్జిగా బదిలీ చేస్తు తెలంగాణ హైకోర్టు విజిలెన్స్ రిజిస్ట్రార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు సాయిసుధ ఈ పదవిలో ఇన్చార్జిగా సీనియర్ సివిల్ కోర్టు జడ్జిగా కొనసాగుతుండగా, ప్రస్తుతం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా ఉంటు అదనపు సీనియర్ సివిల్ కోర్టు ఇన్చార్జ్జ్ జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తారు. సాయిసుధ నిజామాబాద్ జిల్లా న్యాయసేవ సంస్థ ఇన్చార్జిగా సైతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా న్యాయసేవ సంస్థ కార్యదర్శి పోస్టు ఖాళీగా ఉంది. బాన్సువాడ రూరల్: పంచాయతీ ఎన్నికల నే పథ్యంలో మంగళవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వా న్ బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సిబ్బంది ఎలాంటి గందరగోళానికి గురికాకుండా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సామగ్రి తీసుకెళ్లాలన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే అధికారుల దృష్టికి తేవాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని రకాల ఏర్పాట్లు సరిచూసుకోవాలని ఆర్వోలకు సూచించారు. తప్పనిసరిగా మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి ఉన్నారు. -
పోలింగ్ శాతం పెరిగేలా..
● మూడో విడత ఆర్మూర్ డివిజన్లో 3.14లక్షల మంది ఓటర్లు ● దాదాపు అందరికీ పోలింగ్ స్లిప్పులు పంపిణీ చేసిన అధికారులు మోర్తాడ్(బాల్కొండ): పంచాయతీ తుది విడత పోలింగ్కు ఓటర్లు పోటేత్తెలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. మొత్తం ఓటర్లకు పోలింగ్ స్లిప్పులను పంపిణీ చేస్తూ వారు స్వచ్ఛందంగా పోలింగ్ బూత్కు వచ్చి ఓటు వేసేలా బూత్ లెవల్ అధికారులు(బీఎల్వో) అవగాహన కల్పిస్తున్నారు. మొదటి విడతలో 81.37 శాతం పోలింగ్ నమోదు కాగా రెండో విడతలో కాస్తా తగ్గిపోయింది. ఈ విడతలో 76.71 శాతం మాత్రమే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడో విడతలో 85 శాతంకు పోలింగ్ శాతం మించిపోవాలని అధికారులు భావిస్తున్నారు. బాల్కొండ, ఆర్మూర్ నియోజకవర్గాలలోని వివిధ గ్రామాలలో 3,14,091 మంది ఓటర్లు ఉండగా దాదాపు అందరికీ పోలింగ్ స్లిప్పులను బీఎల్వోలు పంపిణీ చేశారు. పోలింగ్ సమయంలో ఓటర్లకు ఎలాంటి తికమక ఉండకుండా ఉండేందుకు పోలింగ్ బూత్ చిరునామా, ఓటరు సంఖ్య అన్ని ఉండేలా స్లిప్పులను ఎన్నికల సంఘం ముద్రించి బీఎల్వోలకు అందించింది. ఈ స్లిప్పులు ఉంటే ఓటర్లకు తాము ఎక్కడి పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకోవచ్చనే విషయం సులభంగా తెలుస్తుంది. వారం రోజుల నుంచి బీఎల్వోలు తమకు నిర్దేశించిన పోలింగ్ స్టేషన్ పరిధిలోని ఓటర్లకు స్లిప్పులను ఇంటింటికి వెళ్లి అందిస్తున్నారు. మంగళవారం కూడా పోలింగ్ స్లిప్పులను పంపిణీ చేశారు. బీఎల్వోలు పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లకు అందుబాటులో ఉండి సమాచారం కూడా ఇవ్వనున్నారు. పోలింగ్ స్లిప్పులను పంపిణీ చేయడం వల్ల ఓటర్లకు తమ బాధ్యతను గుర్తుచేసినట్లు ఉంటుందనే ఆలోచనలో ఎన్నికల సంఘం ఉంది. పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 1గంటకే ముగిసిపోనుంది. అందుకే ఉదయం నుంచే పోలింగ్ శాతం పెరిగేలా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని అధికార యంత్రాంగం సూచిస్తుంది. ఓటర్లు బద్దకం వీడీ పోలింగ్ స్టేషన్లకు ఎలా తరలివస్తారో బుధవారం వెల్లడికానుంది. -
మూడో విడతకు సర్వం సిద్ధం
సాక్షి నెట్వర్క్: మూడో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మూడో పంచాయితీ ఎన్నికలకు సర్వం సిద్దం చేశారు. జిల్లాలో మూడో విడతలో బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మంగళవారం బాన్సువాడ మండలానికి సంబంధించి ఎన్నికల సామగ్రి స్వీకరణ కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, బీర్కూర్లో మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎన్నికల సామగ్రి స్వీకరణ కేంద్రం, నస్రుల్లాబాద్ మండలానికి సంబంధించి ఎంపీడీవో కార్యాలయం నుంచి ఎన్నికల సామగ్రి స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయా సామగ్రి స్వీకరణ కేంద్రాల నుంచి ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది ఎన్నికల సామగ్రిని తీసుకెళ్లారు. ఎన్నికల సిబ్బంది ఉదయం ఆరున్నర గంటలకు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని మొదట మాక్పోల్ నిర్వహించిన అనంతరమే పోలింగ్ ప్రారంభించాలని ఉన్నతాధికారులు సూచించారు. ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
నందిపేటకు చేరుకున్న గోదావరి పరిక్రమ
● సాధుసంతులకు ఘన సన్మానం ● భక్తిశ్రద్ధలతో కన్యాపూజలు నందిపేట్(ఆర్మూర్): ఉత్తర్ప్రదేశ్లోని మలూక్ పీఠాధిపతి రాజేంద్రనాథ్ దాస్జీ 500 మంది సాధుసంతులతో కలిసి చేపట్టిన పవిత్ర గోదావరి పరిక్రమ యాత్ర నందిపేటకు చేరుకుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతులు, సాధుసంతులు కేదారేశ్వర ఆశ్రమంలో నిర్వహించిన కన్యాపూజలో పాల్గొన్నారు. ఆశ్రమ పీఠాధిపతి కేదారానంద స్వామి రాజేంద్రనాథ్ దాస్జీకి పాదపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రనాథ్దాస్ జీ భక్తులనుద్దేశించి మాట్లాడుతూ.. పరిక్రమ యాత్ర అంటే ఒక పవ్రితమైన ప్రదేశం (నది, పర్వతం, ఆలయం) చుట్టూ ప్రదక్షిణ చేసే ఆధ్యాత్మిక యాత్ర అని అన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ, గో రక్షణ, హిందూధర్మ ప్రచారం యాత్ర ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీన పరిక్రమ యాత్ర తిరిగి నాసిక్కు చేరుకుంటుందని, యజ్ఞంతో యాత్రను సంపూర్ణం చేస్తామన్నారు. కేదారేశ్వర ఆశ్రమ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. -
మధ్యాహ్న భోజన బియ్యంలో తరుగు!
● ఒక్కో బస్తాలో 7 నుంచి 8 కిలోలు తక్కువగా వస్తున్న వైనం ● హెడ్మాస్టర్ల ఆవేదన బోధన్: మధ్యాహ్న భోజనానికి సరఫరా అవుతోన్న సన్నబియ్యంలో తరుగు వస్తోంది. దీంతో ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థుల మ ధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వం సన్న బియ్యం నేరుగా సివిల్ సప్లయ్ గోదాముల నుంచి సరఫరా చేస్తోంది. పాఠశాల విద్యార్థుల సంఖ్య మేరకు 50 కిలోల సంచితో నెలకు సరిపడా 2 నుంచి 4 క్వింటాళ్ల మేరకు సన్నబియ్యం సరఫరా జరుగుతుంది. ప్రతినెల లారీల్లో బియ్యాన్ని పాఠశాలలకు చేర్చుతున్నారు. అయితే 50 కిలోల సంచికి 7 నుంచి 8 కి లోల వరకు తరుగు వస్తోందని పాఠశాలల హెచ్ ఎంలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం పట్టణ కేంద్రంలోని ఓ పాఠశాల హెచ్ఎం బియ్యం సంచిని తూకం వేయించగా అందులో 7 కిలోల 50 గ్రాములు తక్కువ వచ్చింది. మధ్యాహ్న భోజనం పథకం పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం ఆ బాధ్యతలను హెచ్ఎంలకు అప్పగించింది. కాగా, తరుగు విషయంలో గతంలో రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా బియ్యం తూకం వేసుకొని తీసుకోవాలని సూచించారని హెచ్ఎంలు అంటున్నారు. పాఠశాలలో బియ్యం తూకం వేసే మిషన్ లేకపోవడం గమనార్హం. బియ్యం తరుగుతో క్షేత్రస్థాయిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు బియ్యం తరుగు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. -
వైభవంగా దేవునిపల్లి మల్లన్న జాతర
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లి మల్లన్న స్వామి ఉత్సవాల్లో(సట్టి తీర్థం) భాగంగా మంగళవారం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉదయం బోనాలు, సాయంత్రం ఎడ్ల బండ్ల ఊరేగింపు, ఒడి బియ్యం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. డప్పు వ్యాయిద్యాలతో సాంప్రదాయంగా అలంకరించిన ఎడ్లబండ్ల ఊరేగింపునకు ఆయా గ్రామాల నుంచి కాకుండా వారి బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి మల్లన్న స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దేవునిపల్లి నవచైతన్య క్లబ్ ఆధ్వర్యంలో సిద్ధిపేట శ్యామ్ కల్చరల్ అకాడమీ కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, వీడీసీ అధ్యక్షుడు గూడెల్లి గంగారాం, ప్రధాన కార్యదర్శి ద్యావరి నరేష్, ప్రతినిధులు పాల్గొన్నారు. ఘనంగా సుదర్శన నారసింహ హోమం మాచారెడ్డి: మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా మంగళవారం సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న–సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన 16 జంటలు ఈ హోమంలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కమలాకర్రెడ్డి, ఈవో ప్రభురాంచంద్రం, జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, నర్సింహాచార్యులు, పరంధామాచార్యులు, సంజీవాచార్యులు పాల్గొన్నారు. వేంకటేశ్వర, గోదాదేవిలకు ప్రత్యేక పూజలు తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని వేంకటేశ్వర ఆలయంలో మంగళవారం వేంకటేశ్వరస్వామి, గోదాదేవీలకు ప్రత్యేక పూజలు చేశారు. పల్లకీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మహేందర్ పంతులు, సదాశివుడు, సద్ది రాంరెడ్డి, పరమేశ్వర్, రవికుమార్ పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
కరెంట్ షాక్తో మహిళ మృతి వేల్పూర్: వేల్పూర్ మండలం లక్కోర గ్రామ సమీపంలో కరెంటు షాక్తో ఓ మహిళ మృతిచెందింది. వేల్పూర్ ఎస్సై సంజీవ్ తెలిపిన వివరాలు ఇలా.. భీమ్గల్ మండలం సంతోష్నగర్కు చెందిన పాల్థియప్పి అంబి(58) అనే మహిళ లక్కోర పెట్రోలు పంపు వద్ద కూలీపని చేసుకుంటూ జీవించేది. ఈక్రమంలో మంగళవారం పనిలో భాగంగా చెత్తను పెట్రోలు పంపు వెనుక భాగంలో పారవేయడానికి వెళ్లింది. సమీపంలో కరెంటు వైర్లు తెగిపడి ఉండటంతో ఆమెకు ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కామారెడ్డిలో వృద్ధురాలు ..కామారెడ్డి క్రైం: పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి గేటు వద్ద ఓ వృద్ధురాలు మృతిచెందింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి గేటు వద్ద మంగళవారం ఓ వృద్ధురాలు పడి ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఆస్పత్రి వద్దకు చేరుకొని వృద్ధురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లగా, వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మొదట ఆమెను గుర్తుతెలియని వృద్ధురాలిగా భావించారు. మృతురాలి వద్ద లభించిన ఆధార్ కార్డు ద్వారా ఆమె ఇందిరానగర్ కాలనీకి చెందిన గుంటి గంగవ్వ (65)గా గుర్తించారు. అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పట్టణ పోలీసులు విచారణ జరుపుతున్నారు. నస్రుల్లాబాద్: మండలంలోని కామిశెట్టిపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. వివరాలు ఇలా.. కామిశెట్టిపల్లి గ్రామానికి చెందిన మన్నె నాగరాజు మంగళవారం నస్రుల్లాబాద్ నుంచి స్వగ్రామానికి సైకిల్పై బయలుదేరాడు. గ్రామ శివారులో డీసీఎం వాహనం ఎదురుగా వచ్చి అతడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడు తీవ్రంగా గాయపడగా, సదరు వాహన డ్రైవర్ తనను పక్కకు పడేసి పారిపోయాడని బాధితుడు పేర్కొన్నాడు. స్థానికులు బాధితుడిని గుర్తించి చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి నిజామాబాద్కు తరలించారు. -
జంగంపల్లిలో వివాహిత ఆత్మహత్య
భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్లు భిక్కనూరు ఎస్సై అంజనేయులు తెలిపారు. వివరాలు ఇలా.. జంగంపల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్వరీ (30) ఐకేపీలో సీఏగా పనిచేస్తోంది. మంగళవారం మధ్యాహ్నం ఆమె ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె గత కొన్ని రోజులుగా మెడ నొప్పితో బాధపడుతోంది. అలాగే ఇటీవల ఒక ఇంటిని కొనుగోలు చేశారు. దీంతో వీరికి కొద్దిగా అప్పులు అయ్యాయి. అట్టి విషయాన్ని మనసులో పెట్టుకుని బాధపడుతుండేదని కుటుంబీకులు తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు. ధర్పల్లి: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి మృతదేహం మంగళవారం స్వగ్రామానికి చేరుకుంది. వివరాలు ఇలా.. ధర్పల్లి మండల కేంద్రానికి చెందిన మచ్చ రవి (45) గత కొన్నేళ్లుగా ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్తున్నాడు. నెల రోజుల క్రితం సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అతడు మృతి చెందాడు. నెల రోజుల తర్వాత మంగళవారం అతడి మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. మృతదేహాన్ని చూసిన కుటుంబీకులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. అంత్యక్రియల్లో ప్రజలు పాల్గొని రవికి కన్నీటి వీడ్కోలు పలికారు. రవి మృతదేహం వస్తుందనడంతో కుటుంబీకులు ఇంట్లో రోధిస్తుండగా మృతుడి నడ్పి నాన్న మచ్చ రమేష్(60) హైబీపీకి గురయ్యాడు. వెంటనే కుటుంబీకులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి అతడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఒకే కుటుంబంలోని ఇద్దరు మృతిచెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
ప్రజలకు సమస్యలు రాకుండా చూడాలి
● బోధన్లో పారిశుధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలి ● ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి బోధన్టౌన్(బోధన్): పట్టణ ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆవరణలో మంగళవారం నూతనంగా కొనుగోలు చేసిన 15 చెత్త సేకరణ ఆటోలకు పూజలు చేసి ప్రారంభించారు. అనంతరం సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ.. ప ట్టణంలో పారిశుధ్య పనుల్లో ఇబ్బందులు తలెత్త కుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పారిశుధ్య కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు ఇ చ్చేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజ లు పన్నులను సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలన్నారు. బల్దియాకు నూతన భవ న నిర్మాణాన్ని త్వరలో నిర్మిస్తామన్నారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులను నియమించాలని విద్యార్థులు, ప్రిన్సిపల్ కౌసర్ ఆయనకు విన్నవించారు. బోధన్లోని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించి, డయాలసీస్ రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, కో అపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, మహిపాల్ రెడ్డి, తూము శరత్రెడ్డి, పాషా, నాగేశ్వరరావు, నరేందర్ రెడ్డి, శ్రీకాంత్ గౌడ్, మీర్ నజీర్ అలీ, ప్రమోద్ చిన్న, విష్ణు వర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోలింగ్ సజావుగా జరగాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● డిస్ట్రిబ్యూషన్ కేంద్రం పరిశీలనబిచ్కుంద/నిజాంసాగర్(జుక్కల్): మూడో విడత ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పోలింగ్ అధికారులకు సూచించారు. ఎక్కడా తప్పులు జరగకుండా చూడాలన్నారు. బిచ్కుంద మార్కెట్ యార్డు, జుక్కల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి మంగళవారం సందర్శించారు. బస్సులలో పోలింగ్ కేంద్రాలకు వెళుతున్న సిబ్బంది, ఎన్నికల సామగ్రిని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడో విడతలో 144 గ్రామ పంచాయతీలు, 1020 వార్డులలో ఎన్నికలు జరగనున్నాయని అన్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో వందశాతం పోలింగ్ నమోదు అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. బూత్లు, గ్రామాల వారీగా ఎన్నికల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లకు ఎన్నికల సిబ్బంది సహకరించాలన్నారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఏదైనా సమస్యలు ఎదురైతే వెంటనే మీ పైఅధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వారి వెంట తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవోలు గోపాల్, శ్రీనివాస్ తదితరులు అధికారులు ఉన్నారు. నిబంధనలను పాటించాలి కామారెడ్డి క్రైం: ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. జిల్లాలో జరుగుతున్న మూడో దశ గ్రామ పంచాయితీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. బుధవారం ఎన్నికలు జరిగే అన్ని మండలాల పరిధిలో ఉదయం 5 నుంచి ఓట్ల లెక్కింపు పూర్తయి ఎన్నికల సామగ్రి సురక్షితంగా నిల్వ చేసే వరకు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 (144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
నాడు సతి.. నేడు పతి
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్నగర్ మండలంలోని గున్కుల్ గ్రామాన్ని 2018లో గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. 2019 లో ఎన్నికలు నిర్వహించగా బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన గంగి సునీత గెలిచి గ్రామ తొలి సర్పంచ్ అయ్యారు. ప్రస్తుత ఎన్నికలలో బీసీ జనరల్ రావడంతో ఆమె భర్త రమేశ్ యాదవ్ కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసి గెలిచారు. భిక్కనూరు: భిక్కనూరు రైల్వేస్టేషన్ గ్రామం భిక్కనూరు గ్రామపంచాయతీ పరిధిలో కొంత భాగం, బస్వాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో మరికొంత భాగం ఉండేది. పంచాయతీల పునర్విభజనలో ఈ గ్రామాన్ని పంచాయతీగా చేశారు. ఊరి పేరును శ్రీసిద్దరామేశ్వరనగర్గా మార్చారు. 2019లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో శ్రీసిద్దరామేశ్వరనగర్ బీసీ జనరల్ అయ్యింది. బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన జనగామ శ్రీనివాస్ సర్పంచ్గా గెలుపొందారు. ప్రస్తుతం బీసీ మహిళకు కేటాయించడంతో ఆయన భార్య రాణి బరిలో నిలిచి గెలిచారు. ఎల్లారెడ్డి: మండలంలోని సోమార్పేట్ గ్రామంలో ట్రాక్టర్ దాడిలో గాయపడిన వారిని మాజీ మంత్రి కేటీఆర్ మంగళవారం హైదరాబాద్లో పరామర్శించారు. కాంగ్రెస్ నాయకుల దాడిలో ఐదుగురు గాయాలపాలయ్యారని, దాడి చేసిన వారితోపాటు కారకులను సైతం కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ● బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే మదన్మోహన్రావు ఎల్లారెడ్డిరూరల్: సోమార్పేట్ గ్రామంలో ట్రాక్టర్ ప్రమాద ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తప్పవని ఎమ్మెల్యే మదన్ మోహన్రావు పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బిట్ల భారతి, బాలమణిలను ఎమ్మెల్యే మంగళవారం హైదరాబాద్లో పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందజేసి, వారి కుటుంబాలకు ధైర్యం చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఘటనకు సంబంధించి ఎస్పీ, డీఎస్పీలతో మాట్లాడి సంపూర్ణ విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. -
నేడు తుది పోరు
● ఎనిమిది మండలాల్లో 142 సర్పంచ్, 1,020 వార్డులకు ఎన్నికలు ● పోలింగ్కు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పంచాయతీ ఎన్నికలు చివరి దశకు వచ్చాయి. మూడో విడత ఎన్నికలకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు మంగళవారమే చేరుకున్నారు. చివరి విడతలో జుక్కల్, బాన్సువాడ నియోజక వర్గాల పరిధిలోని ఎనిమిది మండలాల్లో 168 గ్రామాల సర్పంచ్, 1,482 వార్డులున్నాయి. 26 మంది సర్పంచ్లు, 449 మంది వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవమయ్యారు. 13 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మిగిలిన 142 గ్రామాల సర్పంచ్, 1,020 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 142 గ్రామాల సర్పంచ్ పదవులకు 462 మంది, 1,020 వార్డులకు 2,790 మంది పోటీ పడుతున్నారు. బుధవారం పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కేంద్రాలకు చేరిన సిబ్బంది.. మూడో విడత ఎన్నికలు జరుగుతున్న గ్రామాలకు మంగళవారమే పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలు, ఇతర సామగ్రిని తీసుకుని వెళ్లారు. పలు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సబ్కలెక్టర్ కిరణ్మయి తదితరులు సందర్శించారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని సూచించారు. భద్రత విధుల్లో 812 మంది.. తుది విడత పోలిం గ్కు పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. 812 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు.కామారెడ్డి క్రైం: చివరి విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐదంచెల భద్రతా వ్యవస్థలో మొత్తం 812 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుతో పాటు, అదనంగా 37 రూట్ మొబైల్ పార్టీలు, 8 స్ట్రైకింగ్, 3 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలను మోహరించామని తెలిపారు. మూడో విడతలో ఉన్న 10 సమస్యాత్మక, 9 సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రత చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇంక్ బాటిళ్లు, ఇంక్ పెన్నులు, అగ్గిపెట్టెలు, వాటర్ బాటిళ్లు, కత్తులు తీసుకురావడం నిషిద్ధమని పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రూ.8,52,170 విలువైన 1,054.54 లీటర్ల మద్యం, రూ.4,50,250 విలువైన 1.635 కిలోల గంజాయి, 43 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నేర చరిత్ర కలిగిన 211 మందిని బైండోవర్ చేశామని, ఎన్నికల నియమావళి పరిమితికి మించి తీసుకెళ్తున్న రూ.10,89,000 నగదును స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి 18 కేసులు నమోదు చేశామని తెలిపారు. -
బెంబేలెత్తిస్తున్న బెబ్బులి
● మరో మూడుచోట్ల పశువులపై దాడి ● ఆందోళనలో ప్రజలుదోమకొండ పాత తాలూకా పరిధిలోని మాచారెడ్డి, పాల్వంచ, దోమకొండ, బీబీపేట, భిక్కనూరు మండలాల్లో నాలుగైదు రోజులుగా పెద్దపులి సంచరిస్తూ మూగజీవాలపై పంజా విసురుతోంది. అంబారిపేటలో లేగదూడను బలితీసుకున్న సంఘటనతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు.. వేట మొదలుపెట్టారు. ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి పులి కదలికలను గమనిస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి బెబ్బులి పెద్దమల్లారెడ్డి, కాచాపూర్, మాందాపూర్, సంగమేశ్వర్, జనగామ, అంబారి, ఫరీదుపేట, బండరామేశ్వర్పల్లి గ్రామాల శివారు ప్రాంతాల గుండా మాచారెడ్డి మండలం చుక్కాపూర్ అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్టు అటవీ అధికారులు చెబుతున్నారు. పెద్దమల్లారెడ్డిలో ఓ రైతు చేను వద్ద కట్టేసిన ఆవుపై దాడి చేసి దాన్ని చెరకు తోటలోకి లాక్కెళ్లి తిన్నట్లు గుర్తించారు. తర్వా సంగమేశ్వర్ గ్రామ శివారులో లేగదూడపైనా దాడి చేసింది. అంబారిపేట శివారులో గేదైపె దాడి చేసి చంపేసింది. పులి కదలికల ఆధారంగా చుక్కాపూర్ అటవీ ప్రాంతంలోకి వెళ్లినట్టుగా భావిస్తున్నామని జిల్లా అటవీ అధికరి నిఖిత ‘సాక్షి’తో తెలిపారు. పొలాలకు వెళ్లాలంటే జంకుతున్న రైతులు యాసంగి పంటలు సాగు చేసే సమయంలో పెద్దపులి సంచరిస్తుండడంతో రైతులు పొలాల దగ్గరకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. మైదాన ప్రాంతం కావడంతో పులి పొదల చాటున ఉండాల్సిందే. దీంతో పొలాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. అంబారిపేట ప్రాంతంలో మూడు రోజులుగా రైతులకు కునుకు ఉండడం లేదు. దాదాపు అందరూ పశువులను పొలాల దగ్గర గుడిసెలు, పందిళ్ల కింద కట్టేసి వస్తుంటారు. పులి దాడులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ వైపు నుంచి పులి దాడి చేస్తుందోనని భయపడుతున్నారు.సాధారణంగా పెద్దపులులు దట్టమైన అటవీ ప్రాంతంలో తిరుగుతాయి. వాటికి అక్కడే రక్షణ ఉంటుంది. కానీ మైదాన ప్రాంతంలో పులి తిరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. దోమకొండ, బీబీపేట, భిక్కనూరు మండలాల్లో ప్రస్తుతం పెద్దపులి తిరిగినట్టు భావిస్తున్న గ్రామాల శివార్లలో గుట్టలు ఉన్నాయి తప్ప ఎక్కడా అడవైతే లేదు. అలాంటి మైదాన ప్రాంతంలో పులి సంచరిస్తుండడం సంచలనంగా మారింది. మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామ శివారు దాటి ఇసాయిపేట, అన్నారం వైపు వెళితేనే అటవీ ప్రాంతం ఉంటుంది.పెద్దపులి సంచరిస్తుండడంతో అటవీ అధికారులకు కునుకు కరువైంది. మూడు రోజులుగా దోమకొండ, మాచారెడ్డి, బీబీపేట, భిక్కనూరు మండలాల్లోని ఆయా ప్రాంతాల్లో పశువులపై దాడి చేసిన ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు. పులి ఎటువైపు వెళ్లిందన్న దాన్ని పసిగట్టేందుకు పులి అడుగులను గమనిస్తూ కిలోమీటర్ల మేర నడక సాగించారు. కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి, కామారెడ్డి రేంజ్లలో పనిచేసే అటవీ అధికారులు, సిబ్బంది ఎక్కడినుంచి పులి దాడి చేసిందన్న సమాచారం వచ్చిన్నా ఆ గ్రామాలకు వెళుతున్నారు. అక్కడి పరిసరాలను పరిశీలించి అడుగులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. -
పోలీసుల అదుపులో మావోయిస్టు నేత!
● డివిజినల్ కమిటీ మెంబర్ హోదాలో పనిచేస్తున్న ఎర్రగొల్ల రవి ● రూ.5 లక్షల రివార్డు సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రెండున్నర దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న జిల్లాకు చెందిన మావోయిస్టు నేత ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ సోమవారం రాత్రి పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పాల్వంచ మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన ఎర్రగొల్ల రామయ్య, భూమవ్వల కుమారుడైన ఎర్రగొల్ల రవి 2001 లో కామారెడ్డిలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో అప్పటి పీపుల్స్వార్లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పటి నుంచి ఆయన దండకారణ్యంలోనే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అజ్ఞాతంలోకి వెళ్లిన నాటి ఆయన నుంచి ఇంటి ముఖం చూడలేదు. కొడుకుకోసం తల్లి భూమవ్వ ఎంతగానో తపించింది. లొంగిపోవాలని కొడుకును కోరిన ఆమె తన కోరిక తీరకుండానే ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ రెండున్నర దశాబ్దాలుగా పీపుల్స్వార్, మావోయిస్టు పార్టీలలో వివిధ హోదాల్లో పనిచేశాడు. ప్రస్తుతం డివిజనల్ కమిటీ మెంబర్గా కొనసాగుతున్నట్లు సమాచారం. అతడిపై రూ.5 లక్షల రివార్డు ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. కామారెడ్డి జిల్లా ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన లోకేటి చందర్ అలియాస్ స్వామి అలియాస్ ప్రభాకర్ దండకారణ్యంలో వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఆయన కుమారుడు రమేశ్ కూడా అజ్ఞాతంలో పనిచేస్తూ ఇటీవలే లొంగిపోయిన విషయం తెలిసిందే. -
గ్రామాల్లో చాటింపు
దోమకొండ/మాచారెడ్డి: దోమకొండనుంచి అంబారిపేటకు వెళ్లే దారిలో ఇటుకబట్టి వద్ద రైతు శ్రీనివాస్కు చెందిన బర్రెను మంగళవారం తెల్ల వారుజామున పులి చంపివేసింది. కొంతసేపటికే సంఘమేశ్వర్ శివారులో రైతు నారాయణకు చెందిన ఆవునూ చంపేసింది. అంబారిపేటలో బర్రె ను చంపిన స్థలాన్ని జిల్లా అటవీ అధికారి నిఖిత, డివిజనల్ పారెస్ట్ అధికారి రామకృష్ణ, పశుసంవర్ధక శాఖ అఽధికారి శివకుమార్ పరిశీలించారు. ఫరీద్పేట, అంబారిపేట, గొట్టిముక్కుల, మందాపూర్ ప్రాంతాల్లో ఎడ్లకట్ట వాగు పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్లు గుర్తించామని వారు తెలిపారు. అంబారిపేట, సంఘమేశ్వర్ శివార్లలో పశువులపై దాడి చేసిన పెద్దపులి చుక్కాపూర్, మాచారెడ్డి అటవీ ప్రాంతం వైపు వెళ్లిందని గుర్తించామన్నారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు గ్రామాలలో చాటింపు వేయించారు. ఫారెస్ట్ బీట్ అధికారులు పద్మ, పారూఖ్, అంబారిపేట సర్పంచ్ అరుట్ల కవిత, సంఘమేశ్వర్ సర్పంచ్ లోయపల్లి శ్రీనివాస్రావు తదితరులు అధికారుల వెంట ఉన్నారు. మాచారెడ్డి మీదుగా.. కామారెడ్డి నియోజకవర్గ ప్రజలను వణికిస్తున్న పెద్దపులి మంగళవారం రాత్రి మాచారెడ్డి మీదుగా రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దమ్మ అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ట్రాక్ కెమెరాల్లో నమోదైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. -
సోమార్పేట్లో ఉద్రిక్తత
● ఓడిన అభ్యర్థి ఇంటిపై దాడి ● ట్రాక్టర్తో ఢీకొట్టిన సర్పంచ్ తమ్ముడు ● ఆందోళనకు దిగిన గ్రామస్తులుఎల్లారెడ్డి/ఎల్లారెడ్డిరూరల్: ఎన్నికలలో గెలిచినా ఆ సర్పంచ్ కుటుంబం సంతృప్తి చెందలేదు. బరిలో నిలిచి తమను ఇబ్బందులు పెట్టాడని ప్రత్యర్థిపై కక్ష పెంచుకున్న సదరు సర్పంచ్ తమ్ముడు.. ఏకంగా ట్రాక్టర్తో దాడి చేశాడు. ఐదుగురికి గాయాలు కావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సోమార్పేట్లో సర్పంచ్ పదవి కోసం కుర్మ పాపయ్యతోపాటు బిట్ల బాలరాజు పోటీ చేశారు. ఆదివారం జరిగిన ఎన్నికలలో పాపయ్య విజయం సాధించారు. అయితే ఓడిపోయిన బాలరాజును సోమవారం పలువురు పరామర్శించారు. ఇంటిముందు కూర్చొని మాట్లాడుతుండగా.. ఆ దారిలో ట్రాక్టర్ తీసుకుని వచ్చిన సర్పంచ్ తమ్ముడు కుర్మ చిరంజీవులు అక్కడున్నవారిని ఢీకొట్టాడు. ట్రాక్టర్ దుక్కి దున్నే నాగలి కింద గంజి భారతి ఇరుక్కు పోవడంతో ఆమె నడుము విరిగి పోయింది. బూడమీద బాలమణి చేయి విరిగింది. మూడేళ్ల బాలుడు అద్విక్ కాలు విరగ్గా.. తోట శారద, పద్మ సత్యవ్వలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గంజి భారతి, బాలమణి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని హైదరాబాద్కు తరలించారు. మిగిలిన ముగ్గురు ఎల్లారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎల్లారెడ్డిలో రాస్తారోకో.. ఎన్నికలలో తన అన్నకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై కుర్మ చిరంజీవులు కక్ష పెంచుకున్నాడని, అతడు కావాలనే ట్రాక్టర్తో ఢీకొట్టాడని సోమార్పేట్ గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటనను నిరసిస్తూ ఎల్లారెడ్డిలోని రామాలయం వద్దనున్న ప్రధాన రహదారిపై నాలుగు గంటల పాటు రాస్తారోకో చేశారు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రాస్తారోకోలో పాల్గొన్నారు. ఎన్నికలలో గెలిచిన తర్వాత అందరి సంగతి చూసుకుంటామని సర్పంచ్, అతడి తమ్ముడు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుర్మ సాయిబాబాలు బెదిరించారని గ్రామస్తులు ఆరోపించారు. ట్రాక్టర్తో దాడి చేసిన చిరంజీవులుతో పాటు సర్పంచ్ పాపయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుర్మ సాయిబాబాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక పోలీసు బలగాలు.. రాస్తారోకోను విరమింపజేసేందుకు పోలీసులు ప్ర యత్నించినా ఎవరూ వినలేదు. దీంతో డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రాజారెడ్డి, ఎస్సై మహేశ్ ప్రత్యేక పోలీసు బలగాలను రప్పించారు. ఎస్పీ రాజేశ్ చంద్ర మాజీ ఎమ్మెల్యే జాజాలతో ఫోన్లో మాట్లాడా రు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో గ్రామస్తులు రాస్తారోకో విరమించారు. ఆందోళనలో బీఆర్ఎస్ నాయకు లు జలంధర్రెడ్డి, మనోహర్రెడ్డి, సతీష్, బీజేపీ నాయకులు నర్సింలు, బాలకిషన్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరా ఎల్లారెడ్డి: సోమార్పేట్ సంఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మాజీ ఎమ్మెల్యే జాజాలతో ఫోన్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కేటీఆర్ ఎస్పీతో ఫోన్ ద్వారా మాట్లాడారని, సర్పంచ్ తమ్ముడితో పాటు దాడికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారని జాజాల సురేందర్ తెలిపారు. బాధితులను పరామర్శించేందుకు కేటీఆర్ మంగళవారం సోమార్పేట్కు రానున్నారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. హైదరాబాద్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన అనంతరం ఆయన సోమార్పేట్కు వస్తారని పేర్కొన్నారు.సోమార్పేట్లో ట్రాక్టర్తో ఢీకొట్టి చంపాలని చూసిన వ్యక్తిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డి ఎస్సై మహేశ్ తెలిపారు. గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పటినుంచి తన ప్రత్యర్థి అయిన కురుమ పాపయ్యతో పాటు అతడి కుటుంబ సభ్యులు, బంధువులు కుర్మ సాయి బాబా, కుర్మ శంకర్, కుర్మ చిరంజీవులు, కుర్మ సాయిలు, కుర్మ స్వప్న, కుర్మ లత, కుర్మ శోభ, కుర్మ దుర్గవ్వ బెదిరింపులకు దిగుతున్నారని బిట్ల బాలరాజు ఆరోపించారు. తమకు ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని, మీ అంతు చూస్తామని బెదిరించారని పేర్కొన్నారు. సోమవారం కురుమ చిరంజీవులు అనే వ్యక్తి ట్రాక్టర్తో ఢీకొట్టగా ఐదుగురికి గాయాలయ్యాయని, తాను తప్పించుకున్నానని.. ట్రాక్టర్తో దాడి చేసిన వారందరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బాలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.సోమార్పేట్ ఘటనలో గాయపడిన తోట శారద, అద్విక్, పద్మ సత్యవ్వలను మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు పరామర్శించారు. ఈ సందర్భంగా చిన్నరాజులు మాట్లాడుతూ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అనుచరులు నియోజకవర్గంలో రౌడీయిజం చెలాయిస్తున్నారన్నారు. అమాయకులపై దాడులు చేయడం సరికాదన్నారు. సోమార్పేట్లో ట్రాక్టర్తో ఢీకొట్టి ఐదుగురిని గాయపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. -
చల్లటి చలికి వెచ్చటి గొంగళి
రామారెడ్డి: జిల్లాలో చలి చంపేస్తోంది. వెచ్చదనం కోసం జనాలు పడరాని పాట్లు పడుతున్నారు. చలి మంటలు వేసుకుంటున్నారు. అయినా రాత్రిపూట ఈ వారం రోజులుగా తీవ్రమైన చలి తీవ్రతకు తట్టుకోలేకపోతున్నారు. వెచ్చదనం కోసం స్వెట్టర్లు, మఫ్లర్లు, అన్నీ కప్పుకున్నా చలి నుంచి తట్టుకోకపోవడంతో గ్రామాలలో పల్లెల్లో చేతితో తయారుచేసిన గొంగడిని ఖరీదు చేసి చలి బారి నుంచి కొంతమేర ఉపశమనం పొందుతున్నారు. ఒక్కో గొంగడికి రూ.15 వందల నుంచి 2 వేల వరకు డిమాండ్ పలుకుతోంది. అయితే ఈ గొంగళ్లు మూడు నుంచి 5 సంవత్సరాల వరకు ప్రతిరోజూ వాడినా నాణ్యత బాగా ఉంటోందని, అందుకే అంత డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు. గొంగడిని ఎక్కువగా కురుమ, యాదవ కులస్తులే వాడేవారు. కానీ ప్రస్తుతం చలికి తట్టుకోలేక అందరూ గొంగడిని కొని రాత్రి వేళలో కప్పుకుంటున్నారు. ● పల్లెల్లో గొంగడికి పెరిగిన డిమాండ్ ● చేతితో తయారు చేసిన గొంగళికి రూ.1500 నుంచి 2000 వరకు డిమాండ్ గొంగళ్లు అమ్ముతున్న మహిళ గొంగడి కప్పుకున్న వృద్ధుడు -
ష్.. గప్చుప్!
● ముగిసిన పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం ● రేపు చివరి విడత పోలింగ్సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచార గడువు సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. సైలెన్స్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవడానికి అభ్యర్థులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. జిల్లాలో చివరి విడతలో బాన్సువాడ, బిచ్కుంద, బీర్కూర్, డోంగ్లీ, జుక్కల్, మద్నూర్, నస్రుల్లాబాద్, పెద్దకొడప్గల్ మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి, మలి విడతల్లో అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఎక్కువ స్థానాలు గెలుచుకున్నారు. చివరి విడతలోనూ పట్టు నిలుపుకోవాలని ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీల నేతలు సైతం తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవడానికి కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో చివరి నిమిషం దాకా ప్రచారం చేశారు. అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓట్లభ్యర్థిస్తూనే పలుచోట్ల ర్యాలీలు తీశారు. ప్రచారంలో పార్టీల ప్రముఖులు ఎన్నికల్లో తమ తమ పార్టీల మద్దతుదారులను గెలిపించుకునేందుకు ఆయా పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అభివృద్ధిని చూసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆయన తనయుడు డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి కాంగ్రెస్ మద్దతుదారుల తరఫున ప్రచారం చేశారు. బీఆర్ఎస్ మద్దతుదారుల కోసం మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రచారంలో పాల్గొన్నారు. బాన్సువాడ కాంగ్రెస్లో రెండు గ్రూపులున్నాయి. పోచారం శ్రీనివాస్రెడ్డి వర్గీయులతోపాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి అనుచరులు చాలాచోట్ల పోటీచేస్తున్నారు. ఎవరికివారే పోటాపోటీగా ప్రచారం చేశారు. బీజేపీ నేతలు కూడా వారి మద్దతుదారుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. జుక్కల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు చాలా గ్రామాల్లో ప్రచారం చేశారు. అభివృద్ధి కోసం తమ పార్టీ మద్దతుదారులను గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. జుక్కల్, మద్నూర్, పెద్దకొడప్గల్, బిచ్కుంద, డోంగ్లీ మండలాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే కూడా చాలా గ్రామాల్లో తమ పార్టీ మద్దతుదారుల కోసం ప్రచారం చేశారు. నామినేషన్ల దాఖలు నుంచి ఎన్నికల ప్రచారం ముగిసేదాకా తమ పార్టీకి చెందిన అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. మద్నూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బీజేపీ మద్దతుదారుల తరఫున మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే అరుణతార ప్రచారం చేశారు. -
‘పాలకవర్గంపై కక్షతోనే ఫిర్యాదులు’
గాంధారి: ఏకగ్రీవంగా ఎన్నికై న పంచాయతీ పాలకవర్గంపై కొందరు కావాలనే తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని సోమ్లానాయక్ తండావాసులు పేర్కొన్నారు. ఈ విషయమై సోమవారం తహాసల్దార్ రేణుకా చౌహాన్, ఎంపీడీవో రాజేశ్వర్లను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమ్లానాయక్ తండా సర్పంచ్, ఉప సర్పంచ్తో పాటు వార్డు సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఈనెల 7న పంచాయతీ రిటర్నింగ్ అధికారి ప్రకటించి ధ్రువీకరణ పత్రాలు అందించారన్నారు. అయితే పంచాయతీ పరిధిలోని పంతులు నాయక్ తండాకు చెందిన కొందరు వ్యక్తిగత కక్షతో నూతన పాలకవర్గాన్ని రద్దు చేయాలని లేదా తమ తండా అభివృద్ధికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో, తహసీల్దార్లను కోరారు. -
మూడో దశ పోలింగ్కు ర్యాండమైజేషన్
కామారెడ్డి క్రైం: జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం కలెక్టరేట్లో చేపట్టారు. సాధారణ పరిశీలకులు సత్యనారాయణరెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ల ఆధ్వర్యంలో ర్యాండమైజేషన్ నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: చౌకధరల దుకాణాల ద్వారా డిసెంబర్ నెలకు సంబంధించిన రేషన్ బియ్యంను ఈనెల 18 వరకు పంపిణీ చేయన్నారు. ఈ విషయాన్ని పౌర సరఫరాల అధికారులు తెలిపారు. విడతల వారీగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉండడంతో బియ్యం పంపిణీని పొడిగించామని పేర్కొన్నారు. కామారెడ్డి క్రైం: తమను సాంఘిక బహిష్కరణ చేసిన గ్రామ పెద్దలపై చర్యలు తీసుకోవాలని భిక్కనూరు మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన పలువురు దళితులు అదనపు కలెక్టర్ విక్టర్కు ఫిర్యాదు చేశారు. సోమవారం వారు కలెక్టరేట్కు తరలివచ్చారు. వారు మాట్లాడుతూ గ్రామంలో 40 దళిత కుటుంబాలున్నాయన్నారు. గ్రామంలో ఇటీవల ఓ వ్యక్తి చనిపోయాడని, అంత్యక్రియల్లో డప్పు కొట్టాలని అతడి కుటుంబ సభ్యులు అడిగారని పేర్కొన్నారు. అయితే తమ పిల్లలందరూ చదువుకుంటున్నారని, డప్పు కొట్టేవారు లేరని చెప్పామని వివరించారు. దీంతో గ్రామ పెద్దలు 40 దళిత కుటుంబాలను సాంఘిక బహిష్కరణ పేరిట వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీరు, వైద్యం, రవాణా సదుపాయాలు అందకుండా చూస్తున్నారన్నారు. ఎవరైనా ఈ ఆంక్షలను అతిక్రమిస్తే రూ.50 వేల జరిమానా విధిస్తామని బెదిరిస్తున్నారన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ విషయమై ఎస్పీ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేస్తామన్నారు. -
పోలీసుల విస్తృత తనిఖీలు
నందిపేట్(ఆర్మూర్): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నందిపేట మండలంలో సోమవారం పోలీసులు, ఎన్నికల అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఉమ్మెడ బ్రిడ్జి సమీపంలో అయిలాపూర్, కంఠం, నందిపేట, వెల్మల్ గ్రామాల సమీపంలోని ప్రధాన రోడ్ల వెంట అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్యాంరాజ్ మాట్లాడుతూ వాహనాల్లో మద్యం బాటిళ్లు, రూ. 50 వేలకు మించి నగదు తరలించరాదని హెచ్చరించారు. ఆర్మూర్లో..ఆర్మూర్టౌన్: పట్టణంలో సోమవారం రాత్రి ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పాతబస్టాండ్లో ప్రయాణికుల బ్యాగులు, హోటళ్లు, పాన్షాపులతోపాటు పలు దుకాణాల్లో నిషేధిత మత్తు పదార్థాలు, చట్టవిరుద్ధ వస్తువులను గుర్తించేందుకు స్నిపర్ డాగ్స్ ద్వారా పరిశీలించారు. -
జిల్లాలో మరోసారి పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. అది కూడా మైదాన ప్రాంతంలో తిరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మాచారెడ్డి, పాల్వంచ, దోమకొండ, బీబీపేట మండలాల సరిహద్దు ప్రాంతంలోని ఎగువ మానేరు జలాశయం ఎగువ భాగాన పెద్దపులి తిరుగుతున్నట్టు స్పష్టమైంది. – సాక్షి ప
అంబారిపేట ప్రాంతంలో పెద్దపులి తిరుగుతోంది. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ అది సంచరించే అవకాశం ఉంటుంది. అందుకే ఆయా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. పెద్దపులి సంచారం గురించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం. దాని కదలికలను గమనిస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై ఆరా తీస్తున్నాం. – నిఖిత, జిల్లా అటవీ అధికారి, కామారెడ్డి జిల్లాలోని మైదాన ప్రాంతంలో సంచారం లేగదూడలపై దాడితో వెలుగులోకి.. పాదముద్రలను పరిశీలించి కెమెరా ట్రాప్స్ ఏర్పాటు కెమెరాలో రికార్డయిన పెద్దపులి సంచరిస్తున్న దృశ్యాలు అప్రమత్తమైన అటవీ అధికారులు -
భిక్కనూరులో చిరుత పులి సంచారం
భిక్కనూరు: మండలంలోని లక్ష్మిదేవునిపల్లి, బంజర్ల, కాచాపూర్ శివారుల్లోని వ్యవసాయ క్షేత్రాల వద్ద చిరుతపులి సోమవారం వేకువజామున సంచరించింది. దూరం నుంచి చూసిన రైతులు పులి కనిపించిందని అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అటవీశాఖ సెక్షన్ అధికారి బాబా, బీట్ అధికారులు దీపిక, సురేశ్ పరిశీలించి ఆనవాళ్లను సేకరించారు. చిరుతకు సంబంధించిన కాలి గుర్తులు కనిపించాయని అటవీశాఖాధికారులు తెలిపారు. చిరుత దాడి.. దూడ మృతి తాడ్వాయి (ఎల్లారెడ్డి): తాడ్వాయి మండలంలోని ఎర్రాపహాడ్ శివారులో గల వ్యవసాయ పొలం వద్ద కట్టేసిన దూడపై చిరుత దాడిచేసింది. గ్రామానికి చెందిన భూంపల్లి సంగయ్య రోజూ మాదిరిగానే ఆదివారం సాయంత్రం దూడను గ్రామ శివారులోని తన కొట్టం వద్ద కట్టేసి ఇంటికి వచ్చారు. రాత్రి పశువులకు మేత(గడ్డి)ను వేసేందుకు వెళ్లగా కట్టేసిన దూడను చిరుత పులికొరికి చంపివేసినట్లు కనిపించింది. దీంతో సంగయ్య భయాందోళన చెంది గ్రామస్తులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న గ్రామస్తులు చిరుత దాడిచేసి చంపినట్లు నిర్ధారించారు. కాగా, ఎర్రాపహాడ్ శివారు పక్కనే ఉన్న మోతే శివారులో చిరుత తిరుగుతున్నట్లు ఇప్పటికే ప్రచారం ఉంది. సోమవారం ముస్తాపూర్ బీట్ ఆఫీసర్ కళ్యాణి, ఎర్రాపహాడ్ సెక్షన్ ఆఫీసర్ వినోద్, మండల పశువైద్యాధికారి రమేశ్ ఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం చేయించారు. -
హాకీ ఉమ్మడి జిల్లా జట్ల ఎంపిక
కామారెడ్డి అర్బన్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల బాలబాలికల అండర్–17 హాకీ ఎంపికలు సోమవారం కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించారు. అత్యంత ప్రతిభ చూపిన క్రీడాకారులను జట్టుకు ఎంపిక చేశారు. వీరు రాష్ట్రస్థాయి అండర్–17 హాకీ క్రీడల్లో పాల్గొంటారని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి కే హీరాలాల్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అధికారి ఆర్ వెంకటేశ్వరగౌడ్, వ్యాయామ ఉపాధ్యాయులు నోముల మధుసూదన్రెడ్డి, ఆంజనేయులు, స్వామి, నగేశ్ తదితరులు పాల్గొన్నారు. -
వచ్చింది పెద్దపులే!
దోమకొండ మండలం అంబారిపేట శివారులోని పంట చేల వద్ద ఆదివారం దూడలపై పులి దాడి నేపథ్యంలో అటవీ అధికారులు రంగంలోకి దిగారు. ఆ ప్రాంతంలో పాదముద్రలను పరిశీలించిన అధికారులు.. అవి కచ్చితంగా పెద్దపులివే అన్న నిర్ధారణకు వచ్చారు. వెంటనే అక్కడికి చుట్టుపక్కల ప్రాంతంలో కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేశారు. ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో దూడలను చంపిన ప్రాంతంలో పులి సంచరించినట్లు కెమెరాల్లో రికార్డయ్యింది. జిల్లా అటవీ అధికారి బోగ నిఖిత ఆ ప్రాంతాన్ని సందర్శించి, రైతులతో మాట్లాడారు. పెద్దపులి ఎటువైపు నుంచి ఎటు వెళ్లిందన్న దానిపై అటవీ సిబ్బందితో సమీక్షించారు. రైతుల్లో ఆందోళన జిల్లాలో పెద్దపులి సంచారం నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. టైగర్ తిరిగిన ప్రాంతమంతా వ్యవసాయ క్షేత్రాలే కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి వరి నాట్లు వేయడానికి సన్నద్ధమవుతున్నవారు భయపడుతున్నారు. జూలై, ఆగస్టు మాసాల్లో రామారెడ్డి, మాచారెడ్డి, సిరికొండ మండలాల అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరించి ఆవులపై దాడులు చేసింది. అయితే దాని జాడ కోసం దాదాపు నెల రోజుల పాటు అటవీ అధికారులు నిఘా వేసినా అది ఎటువైపు వెళ్లిందో తేల్చలేకపోయారు. నాలుగు నెలల తర్వాత మరో పులి రావడం సంచలనంగా మారింది. మైదాన ప్రాంతంలో తిరుగుతున్న పెద్దపులి ఎవరిపై పంజా విసురుతుందోనని ఆందోళన చెందుతున్నారు. పొలాల దగ్గరకు వెళ్లాలంటేనే రైతులు జంకుతున్నారు. పెద్దపులి జాడ వెలుగు చూసిన అంబారిపేటకు చుట్టుపక్కల గ్రామాలైన గోపాల్పేట, కోనాపూర్, యాడారం, ఫరీదుపేట, బండరామేశ్వర్పల్లి, లచ్చాపేట తదితర గ్రామాల పరిధిలో వేలాది ఎకరాల్లో పంటలు సాగు చేస్తారు. అటువైపు పెద్దపులి రావడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కవ్వాల్ నుంచి వచ్చిందా...? అంబారిపేట ప్రాంతంలో పెద్దపులి జాడలు బయటపడిన నేపథ్యంలో అది ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయమై అటవీ అధికారులు దృష్టి సారించారు. మన దగ్గర పులులు లేవన్న కచ్చితమైన అభిప్రాయంతో ఉన్న అటవీ అధికారులు.. అప్పట్లో జిల్లాలో తిరిగిన పెద్దపులి కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వివిధ జిల్లాలు తిరుగుతూ వచ్చిందని పేర్కొన్నారు. సిరికొండ, మాచారెడ్డి, రామారెడ్డి మండలాల్లో దాని కదలికలు బయటపడ్డాయి. అయితే అప్పట్లో ట్రాప్ కెమెరాల ద్వారా దాని కదలికలు కనుక్కునే ప్రయత్నం చేసినా ఫలించలేదు. అది ఎటువైపు వెళ్లిందన్నదీ స్పష్టం కాలేదు. తాజాగా అంబారిపేట ప్రాంతంలో దూడలపై పెద్దపులి దాడి చేయడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. దాని కదలికలపై నిఘా పెట్టారు. ఇప్పటికే కెమెరాలకు చిక్కడంతో పెద్దపులి ఇదే ప్రాంతంలో ఉండి ఉంటుందన్న నిర్ధారణకు వచ్చారు. మానేరు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరీవాహక ప్రాంతంతో పాటు పాల్వంచ వాగు పరీవాహక ప్రాంతంలో తిరుగుతుండవచ్చని భావిస్తున్నారు. -
డ్రా పద్ధతిలో వార్డు సభ్యుడి ఎన్నిక
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట గ్రామపంచాయతీ పరిధిలోని 4వ వార్డుకు ఆదివారం జరిగిన ఎన్నికలో ఇద్దరు అభ్యర్థులకు సమానమైన ఓట్లు రావడంతో వారిలో ఒకరిని అధికారులు డ్రా పద్ధతిలో ఎన్నుకున్నారు. 4వ వార్డు స్థానానికి గ్రామానికి చెందిన చాకలి శ్రీకాంత్, మంగలి మహేశ్ నామినేషన్లు వేశారు. వీరికి 61 చొప్పున సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో ఇరువురి పేర్లను చీటీలలో రాసి డ్రా తీయగా అందులో చాకలి శ్రీకాంత్ పేరు రావడంతో ఆయనను వార్డు సభ్యుడిగా ఎన్నుకున్నారు. లింగంపేట(ఎల్లారెడ్డి): ముంబోజీపేట గ్రామానికి చెందిన సోను జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడలకు ఎంపికై నట్లు తండావాసులు తెలిపారు. ఈ నెల 15 నుంచి 19 వరకు సౌత్ ఇండియా యూనివర్సిటీ వాలీబాల్ పోటీలు తమిళనాడులోని చైన్నెలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో నిర్వహించే పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. సోను హైదరాబాదులోని జేఎన్టీయూహెచ్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. జిల్లాలోని మారుమూల తండా నుంచి జాతీయ స్థాయి క్రీడలకు ఎంపిక కావడంతో తండావాసులు సోనును అభినందించారు. బాన్సువాడ: బీర్కూర్ మండలం నుంచి నస్రుల్లాబాద్ వైపునకు వెళ్తున్న కారులో రూ.6.70 లక్షలను ఎస్ఎస్టీ బృందం సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. బృందం సభ్యులు జ్యోతి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో నగదును తీసుకెళ్లకూడదన్నారు. నస్రుల్లాబాద్: మండల కేంద్రంలోని మద్యం, కల్లు దుకాణాలను అధికారులు సీజ్ చేశారు. మూడో విడత ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మద్యం దుకాణాలు మూసివేయాలని ఎకై ్స జ్ అధికారులు ఆదేశించారు. అందులో భాగంగా నస్రుల్లాబాద్, దుర్కి వైన్సులను, ఆయా గ్రామాల్లో ఉన్న కల్లు దుకాణాలకు ఎకై ్సజ్ కానిస్టేబుల్ శ్రీకాంత్, సందీప్లు సీలు వేశారు. వేల్పూర్: వేల్పూర్ మండలం వెంకటాపూర్, కోమన్పల్లి గ్రామాలలో స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆర్మూర్ సబ్కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా సోమవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు సరియైన సౌకర్యాలు ఉన్నవి లేనివి చూశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉండాలని మండలస్థాయి అధికారులకు సూచించారు. ఓటర్లకు తాగునీరు, నీడకోసం టెంట్, వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో బాలకిషన్, ఆర్.ఐ. గోపాల్,జీపీల కార్యదర్శులు ఉన్నారు. నిజామాబాద్ అర్బన్: ఓ తల్లి రెండు నెలల కు మారుడిని విక్రయించిన ఘటన జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మగుట్టకు చెందిన శ్రీనివాస్ ఈ నెల 5న తన భార్య, కుమారుడు కని పించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ నెల 10న సదరు మహిళ తిరిగి ఇంటికి వచ్చింది. అయితే తల్లితోపాటు కుమారుడు లేకపోవడంతో శ్రీనివాస్ ఆమెను నిలదీశాడు. అతని ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు తల్లే కుమారుడిని మహారాష్ట్ర పుణెలోని విశాల్ అనే వ్యక్తికి రూ.2.40 లక్షలకు విక్రయించినట్లు తేల్చారు. బాలుడి విక్రయంలో ఎల్లమ్మగుట్టకు చెందిన ఇద్దరు, హైదరాబాద్కు చెందిన మరో వ్యక్తి మధ్యవర్తిత్వం వహించారు. పోలీసులు బాలుడి తల్లిని, ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బాలుడిని తండ్రికి అప్పగించారు. -
సంఘటన స్థలం పరిశీలన
దోమకొండ: అంబారిపేట శివారులో పెద్దపులి దాడిలో చనిపోయిన దూడల కళేబరాలను సోమవారం మండల పశువైద్యాధికారి శివకుమార్, సిబ్బంది పరిశీలించారు. సంఘటన స్థలంలో పంచనామా నిర్వహించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎంఏ పారూఖ్, బీట్ ఆఫీసర్ పద్మ తదితరులు పాల్గొన్నారు. పాదముద్రల పరిశీలన బీబీపేట: మాందాపూర్ శివారులో పులి సంచరిస్తోందని గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో సోమవారం అటవీ శాఖ సిబ్బంది వచ్చి పాదముద్రలను సేకరించారు. ఎడ్ల కట్ట వాగు శివారులో పులి సంచరించినట్లు గుర్తించారు. పెద్దపులి సంచారం నేపథ్యంలో రాత్రి సమయంలో ఎవరూ అటవీ ప్రాంతాలకు వెళ్లరాదని చాటింపు వేయించారు.అంబారిపేట శివారులో పంచనామా నిర్వహిస్తున్న పశువైద్యాధికారి శివకుమార్ -
అవినీతి రహిత కామారెడ్డికి కృషి చేయాలి
● తాయిలాలు ఇవ్వకుండా గెలిస్తేనే ప్రజాసేవ చేస్తాం ● కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డికామారెడ్డి టౌన్: అవినీతి రహిత కామారెడ్డి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సూచించారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలిచిన బీజేపీ మద్దతుదారులను సోమవారం ఆయన జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచకుండా విజయం సాధించినప్పుడే ప్రజలకు సేవ చేయగలమన్నారు. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసి గెలిస్తే ప్రజల సొమ్ము దారి తప్పి అభివృద్ధి కుంటపడుతుందన్నారు. ప్రజా సేవ కోసమైతేనే రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఓటర్లు కూడా మద్యం, డబ్బుకు లొంగకుండా నిజాయితీపరులను, ప్రజా సేవకులను గెలిపించుకోవాలని కోరారు. బీజేపీ మద్దతుదారులు మద్యం, డబ్బు పంచకుండా పోటీ చేసి గెలుపొందడం అభినందించదగ్గ విషయమన్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఇదే విజయ స్ఫూర్తితో ముందుకు వెళ్తామన్నారు. -
అంబారిపేట శివారులో చిరుత సంచారం
● రెండు దూడలపై దాడి ● భయాందోళనల్లో గ్రామస్తులుదోమకొండ: అంబారిపేట గ్రామ శివారులో ఆదివారం చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతులు రంగోల్ స్వామిగౌడ్, బంజారా ప్రవీణ్రెడ్డి ఆదివారం తెల్లవారుజామున వ్యవసాయ క్షేత్రానికి వెళ్లేసరికి రెండు దూడలు మృతిచెంది ఉన్నాయి. చిరుత దాడిచేసి చంపేసి ఉంటుందని భావించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఫారెస్ట్ అధికారులు చిరుత పాదముద్రలను గుర్తించారు. పెద్ద సైజులో పాదముద్రలు ఉన్నట్లు గుర్తించామని మాచారెడ్డి ఫారెస్ట్ రేంజ్ అధికారి రమేశ్ తెలిపారు. మగ చిరుతపులి లేదా పులి సైజులో పాద ముద్రలు ఉన్నాయన్నారు. ఇక్కడి ప్రాంతంలో పులి సంచరించే అవకాశాలు తక్కువగా ఉన్నందున మగ చిరుతపులివే అయి ఉంటాయని భావిస్తున్నామన్నారు. అంబారిపేట, ఫరీదుపేట ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు ఒంటరిగా వ్యవసాయ క్షేత్రాల వద్దకు వెళ్లవద్దని సూచించారు. కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎంఏ పారూఖ్, బీట్ ఆఫీసర్ పద్మ, సర్పంచ్ అరుట్ల కవిత తదితరులున్నారు. -
రెండో విడతలోనూ పోటెత్తారు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఏడు మండలాల్లోని 153 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులతో పాటు 873 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఉదయం 7 గంటలకే చాలాచోట్ల ఓటర్లు బారులు తీరారు. పెద్ద గ్రామాల్లో భారీ లైన్లు కనిపించాయి. పోలింగ్ సమయం ముగిసే సమయంలో వరుసలో నిల్చున్న వారందరి ఓటేసే అవకాశం కల్పించారు. రెండో విడతలో 86.08 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. లింగంపేట మండలంలో పోలింగ్ ఉదయం మందకొడిగా సాగినా చివరికి 83.64 శాతం ఓట్లేశారు. ఎల్లారెడ్డి మండలంలో అత్యధికంగా 89.72 శాతం పోలింగ్ నమోదు కాగా.. నిజాంసాగర్లో 88.73 శాతం, నాగిరెడ్డిపేటలో 88.69 శాతం, మహ్మద్నగర్లో 86.68 శాతం, గాంధారిలో 85.22 శాతం, పిట్లంలో 84.12 శాతం పోలింగ్ రికార్డయ్యింది. పోలింగ్ కేంద్రాల సందర్శన రెండో విడత ఎన్నికలు జరిగిన గ్రామాలలోని పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, ఆర్డీవోలు, డీఎస్పీలు సందర్శించారు. పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. 153 సర్పంచ్, 873 వార్డులకు పోలింగ్ ఓటింగ్ శాతం 86.08 గా నమోదు ప్రశాంతంగా ముగిసిన ప్రక్రియ ఎన్నికల సరళిని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ -
నాడు ఓటమి.. నేడు గెలుపు
నిజాంసాగర్: మహ్మద్నగర్ మండలం హసన్పల్లి గ్రామ సర్పంచ్ పదవి కోసం బోయిని హరిన్కుమార్, సంగమేశ్వర్ గౌడ్ పోటీ చేశారు. ఈ ఎన్నికలలో హరిన్కుమార్ తన ప్రత్యర్థిపై 261 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. కాగా గత ఎన్నికల్లోనూ వీరిద్దరే ప్రత్యర్థులు కావడం గమనార్హం. నాటి ఎన్నికలలో హరిన్కుమార్పై సంగమేశ్వర్ గౌడ్ గెలిచారు. నిజాంసాగర్: మహమ్మద్నగర్ మండలం కోమలంచ గ్రామానికి చెందిన బండారి లక్ష్మి గ్రామ సర్పంచ్గా విజయం సాధించారు. ఆమె 2019లో ఎంపీటీసీ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచి ఐదేళ్లపాటు ఎంపీటీసీగా సేవలందించారు. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పంచాయతీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటికే రెండు విడతల ఎన్నికలు ముగియగా.. ఇక చివరి విడతకు సంబంధించి ప్రచార పర్వం సోమవారంతో ముగియనుంది. ఆయా స్థానాలకు ఈనెల 17న పోలింగ్ నిర్వహించనున్నారు. జిల్లాలో చివరి విడతలో బాన్సువాడ, బీర్కూర్, బిచ్కుంద, డోంగ్లీ, జుక్కల్, మద్నూర్, నస్రుల్లాబాద్, పెద్దకొడప్గల్ మండలాల పరిధిలోని 168 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో 26 గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. అలాగే 1,482 వార్డులకుగాను 4 వందల వార్డులకు సింగిల్ నామినేషనే దాఖలయ్యింది. మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అభ్యర్థులు గెలుపుకోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారం సోమవారం సాయంత్రం 5గంటలకు ముగియనుంది. ఉన్న కాస్త సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పలువురు అభ్యర్థులు ర్యాలీలు తీయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. బీఎన్ఎస్ సెక్షన్ 163 అమలు.. పోలింగ్ జరగనున్న గ్రామాల్లో సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 163 సెక్షన్ అమలులో ఉండనుంది. 17వ తేదీన కౌంటింగ్ పూర్తై విజేతలను ప్రకటించే వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలలో కల్లు, మద్యం దుకాణాలు మూసి ఉంటాయని పేర్కొన్నారు. -
కాంగ్రెస్ జోరు..
● రెండో విడతలో మెజారిటీ పంచాయతీలు హస్తం ఖాతాలోకి.. ● పోటీ ఇచ్చిన బీఆర్ఎస్ మద్దతుదారులు ● గాంధారిలో రికార్డు స్థాయి మెజారిటీరాష్ట్రంలో ప్రజాపాలనకు ఆశీర్వాదమే పంచాయతీ ఎన్నికల ఫలితాలు. జుక్కల్ నియోజకవర్గంలో 75 శాతం పంచాయతీలలో ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారు. మూడో విడతలోనూ ఎక్కువ స్థానాలను గెలుచుకుంటాం. ప్రభుత్వం అందించే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల అభిమానాన్ని మరింత చూరగొంటాం. – లక్ష్మీకాంతారావు, ఎమ్మెల్యే, జుక్కల్ కాంగ్రెస్ పాలనలో ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. అందుకే మా పార్టీకి అండగా నిలిచారు. ఓటర్ల ఆదరణతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మెజారిటీ పంచాయతీలను కాంగ్రెస్ కై వసం చేసుకుంది. ప్రజల మద్దతుతో గ్రామాల అభివృద్ధికి మరింతగా కృషి చేస్తాం. – మదన్మోహన్రావు, ఎమ్మెల్యే, ఎల్లారెడ్డిజిల్లాలో రెండో విడతలో గాంధారి, లింగంపేట, మహ్మద్నగర్, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్, పిట్లం, ఎల్లారెడ్డి మండలాల పరిధిలోని 197 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో 44 గ్రామాల సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. 1,654 వార్డులు ఉండగా 776 మంది వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 153 సర్పంచ్ పదవులకు 606 మంది, 873 వార్డులకు 2,655 మంది పోటీ పడ్డారు. ఆదివారం పోలింగ్ నిర్వహించారు. సర్పంచ్ స్థానాలు ఎక్కువగా కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. ఆదివారం ఎన్నికలు నిర్వహించిన 153 స్థానాలలో 104 పంచాయతీలు కాంగ్రెస్ మద్దతుదారులు గెలుచుకోగా.. 29 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు, ఎనిమిది చోట్ల బీజేపీ మద్దతుదారులు, 12 స్థానాలలో స్వతంత్రులు గెలుపొందారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో.. ఎల్లారెడ్డి మండలంలో 31 పంచాయతీలు ఉండగా ఐదు ఏకగ్రీవమయ్యాయి. 26 సర్పంచ్ పదవులకు 70 మంది పోటీ పడ్డారు. 20 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు, ఐదు గ్రామాల్లో బీఆర్ఎస్, ఒక పంచాయతీలో ఇండిపెండెంట్ గెలుపొందారు. లింగంపేట మండలంలో 41 పంచాయతీలకుగాను 14 ఏకగ్రీవమయ్యాయి. 29 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా 24 గ్రామాల్లో కాంగ్రెస్, మూడు చోట్ల బీఆర్ఎస్, రెండు చోట్ల బీజేపీ మద్దతుదారులు విజయం సాధించారు. నాగిరెడ్డిపేట మండలంలో 27 పంచాయతీలకుగాను ఆరు ఏకగ్రీవమయ్యాయి. 21 పంచాయతీలకు ఎన్నికలు జరిగ్గా.. ఎనిమిది గ్రామాల్లో కాంగ్రెస్, ఐదు గ్రామాల్లో బీఆర్ఎస్, ఒక చోట బీజేపీ, ఏడు చోట్ల స్వతంత్రులు గెలిచారు. గాంధారి మండలంలో 45 పంచాయతీలు ఉండగా 16 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 29 స్థానాలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. 22 చోట్ల కాంగ్రెస్, నాలుగు స్థానాల్లో బీఆర్ఎస్, రెండింటిలో బీజేపీ మద్దతుదారులు, ఒకచోట స్వతంత్య్ర అభ్యర్థి గెలుపొందారు. గాంధారి మండల కేంద్రంలో.. మండల కేంద్రమైన గాంధారిలో మమ్మాయి రేణుక భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆమె తన సమీప ప్రత్యర్థి ఆకుల కల్పనపై 2,119 ఓట్ల భారీ మెజారిటీ సాధించారు. అడివిలింగాల సర్పంచ్ అభ్యర్థుల భవితవ్యాన్ని టాస్ నిర్ణయించింది. సర్పంచ్ అభ్యర్థులు మంగళి సంతోష్కుమార్, పెంట మానయ్యలకు చెరో 483 ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు టాస్ ద్వారా సర్పంచ్ను ఎంపిక చేశారు. టాస్లో మంగళి సంతోష్కుమార్ను అదృష్టం వరించింది.మహ్మద్నగర్లో 13 పంచాయతీలుండగా ఒకటి ఏకగ్రీవమయ్యింది. 12 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. తొమ్మిది చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు, రెండు గ్రామాల్లో బీఆర్ఎస్, ఒకచోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. నిజాంసాగర్ మండలంలో 14 పంచాయతీలకు గాను ఒకటి ఏకగ్రీవమైంది. 13 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఏడు గ్రామాల్లో కాంగ్రెస్, నాలుగు గ్రామాల్లో బీఆర్ఎస్, ఒకచోట బీజేపీ, మరోచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. పిట్లం మండలంలో 26 పంచాయతీలకుగాను ఒకటి ఏకగ్రీవమైంది. 25 పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. 19 చోట్ల కాంగ్రెస్, నాలుగు గ్రామాల్లో బీఆర్ఎస్, రెండు పంచాయతీలలో బీజేపీ మద్దతుదారులు గెలుపొందారు.పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. మలి విడతలోనూ ఆ పార్టీనే అత్యధిక స్థానాలను గెలుచుకుంది. బీఆర్ఎస్ పోటీ ఇచ్చింది. బీజేపీ నామమాత్రంగానే జీపీలను గెలుచుకుంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి -
అభివృద్ధిలో భాగమవుతా
● పంచాయతీలకు ఫర్నిచర్ అందిస్తా ● ప్రముఖ వ్యాపారవేత్త సుభాష్రెడ్డిబీబీపేట: పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేయడంలో భాగస్వామినవుతానని ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జనగామ గ్రామంలోని ఆయన నివాసంలో నూతనంగా ఎన్నికై న పలు గ్రామాల సర్పంచ్లు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులను సన్మానించారు. ఈ సందర్భంగా సుభాష్రెడ్డి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తన వంతు సాయం అందిస్తానన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీకి అవసరమైన ఫర్నిచర్ అందిస్తానని పేర్కొన్నారు. ఫర్నిచర్ కోసం చిన్న పంచాయతీకి లక్ష రూపాయల వరకు, పెద్ద పంచాయతీలకు రూ. 2 లక్షల వరకు వెచ్చించనున్నట్లు తెలిపారు. నూతన పాలకవర్గాలు అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. -
హసన్పల్లిలో ఉత్కంఠగా ప్రత్యర్థుల పోరు
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలంలోని హసన్పల్లి గ్రామ పంచాయతీలో ఇద్దరు ప్రత్యర్థుల మధ్య పోరు ఉత్కంఠబరితంగా సాగుతోంది. గత పంచాయతీ ఎన్నికల్లో బరిలో నిలిచిన ఇద్దరు అభ్యర్థులు మళ్లి ప్రస్తుత ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామానికి చెందిన మోత్కుల సంగమేశ్వర్ గౌడ్, బోయిని హరీన్ సర్పంచ్ కుర్చీ కోసం పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో మోత్కుల సంగమేశ్వర్ గౌడ్ 27 ఓట్లతో బోయిని హరీన్పై విజయం సాధించారు. గ్రామంలో 997 మంది ఓటర్లు ఉండగా పురుషులు 436 మంది, సీ్త్రలు 561 మంది ఉన్నారు. ఈసారి ఓటర్లు మాత్రం ఎవ్వరికి పట్టం కడుతారో తేలాల్సి ఉంది. -
క్రైం కార్నర్
రుద్రూర్: మండలంలోని సులేమాన్నగర్ శివారులో మన్నె శ్రీను (43) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎడపల్లికి చెందిన మన్నె శ్రీను గత నాలుగేళ్ల నుంచి రుద్రూర్ మండలం కొందాపూర్లోని తన మేన మామ వద్ద గేదెలు మేపుతూ జీవిస్తున్నాడు. ఈ నెల 9వ తేదీన ఎడపల్లికి వెళ్లిన అతడు.. శనివారం ఉదయం సులేమాన్నగర్ శివారులో మృతదేహమై కనిపించాడు. మద్యం సేవించే అలవాటు ఉన్న శ్రీను.. మత్తులో మూత్ర విసర్జనకు నడుచుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోర్ల పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతుడి మేనమామ బాల్రాజ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్ల ఎస్సై సాయన్న తెలిపారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి వృద్ధురాలు.. బాన్సువాడ: పట్టణానికి చెందిన ఉప్పరి లక్ష్మి(65) అనే వృద్ధురాలు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందింది. పట్టణంలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్న లక్ష్మి అప్పుడప్పుడు కల్కి చెరువుకు వెళ్లి స్నానం చేసి బట్టలు ఉతుక్కునేది. ఈ నెల 12వ తేదీన చెరువు వద్దకు స్నానానికి వెళ్లిన లక్ష్మి ప్రమాదవశాత్తు కాలు జారి పడి నీట మునిగి చనిపోయింది. మృతురాలి కుమార్తె గంట లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. -
ప్రజల దృష్టి మళ్లించేందుకే ఫుట్బాల్ మ్యాచ్
నిజామాబాద్అర్బన్: రాష్ట్రంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫుట్బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహించిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. మెస్సి హైదరాబాద్కు వచ్చి ఫుట్బాల్ ఆడినందుకు రూ.వందల కోట్లు ఖర్చు చేయడం అవసరమా అని ప్రశ్నించారు. దీనిపై కేంద్రం విచారణ చేపట్టేలా రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు ఒత్తిడి తేవాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి ఎమిరేట్స్ టీ షర్టు ధరించి ఆ సంస్థను ప్రమోట్ చేయడం అన్యాయమని అన్నారు. ఆయన కమీషన్ల వాటా ఎంత అని ప్రశ్నించారు. ఇది హైదరాబాద్ ప్రతిష్ట పెంచే ఈవెంట్ కాదని కోట్లు కొల్లగొట్టే పేమెంట్ కార్యక్రమమని విమర్శించారు. మెస్సి ఫుట్బాల్ ఆటగా డు అయితే.. రేవంత్రెడ్డి ఓటుకు నోటులో కేటుగా డని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల సంపదను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని, తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలు బ్రేక్ వేశారన్నారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు నరేందర్, ప్రభాకర్, రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫుట్బాల్ మ్యాచ్కు రూ.వందల కోట్లా..? హైదరాబాద్ ప్రతిష్ట పెంచే మ్యాచ్ కాదు.. కోట్లు కొల్లగొట్టే పేమెంట్ కార్యక్రమం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డి విమర్శలు -
ఏకగ్రీవం చేసి అన్యాయం చేశారు
కామారెడ్డి క్రైం: సర్పంచ్ స్థానాన్ని ఏకగ్రీవం చేసి తమ తండాకు అన్యాయం చేశారని గాంధారి మండలం సోమ్లానాయక్ తండా జీపీ పరిధిలోని పంతులు నాయక్ తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వారు కలెక్టరేట్కు తరలివచ్చి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. జీపీగా ఏర్పడిన తర్వాత 2019 లో ఓట్లు ఎక్కువగా ఉన్న సోమ్లానాయక్ తండా పెద్దలు కలిసి సర్పంచ్ స్థానాన్ని ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేశారన్నారు. తాజా ఎన్నికల్లో తమ గ్రామం నుంచి ఒక నామినేషన్ వేయించామన్నారు. మద్యం, డబ్బులతో మభ్యపెట్టి అతడిని విత్డ్రా చేయించారని ఆరోపించారు. ఏవైనా సమస్యలు, నిధుల వినియోగంపై జీపీకి వెళ్లి అడిగితే తమ తండా ప్రజల ఓట్లు తక్కువగా ఉన్నాయనే భావనతో చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల నాటికి పంతులు నాయక్ తండాను గతంలో మాదిరిగా బూర్గుల్ జీపీలో కలపాలని, లేదా ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం కొందరు ఇతరులను మభ్యపెట్టి చేసిన ఏకగ్రీవాన్ని రద్దు చేయాలని, తిరిగి ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎన్నికల నోడల్ అధికారి సతీశ్ యాదవ్కు వినతిపత్రం ఇచ్చారు. -
లెక్క లేనంత ఖర్చు !
మోర్తాడ్(బాల్కొండ): సర్పంచులుగా పని చేసే వారికి ప్రతి నెలా రూ.6,500 చొప్పున గౌరవ వేతనాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఈ లెక్కన వారి పదవీ కాలంలో మొత్తం పొందే వేతనం రూ.3.90లక్షలు. కానీ పదవిని దక్కించుకునేందుకు ఎన్నికల సమయంలో అభ్యర్థులు మాత్రం లెక్క లేనంతగా ఉంటోంది. పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సర్పంచ్ల వేతనం, గెలవడం కోసం వారు చేస్తున్న ఖర్చుపై పల్లెల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. మేజర్ పంచాయతీలు, మండల కేంద్రాల్లో సర్పంచ్లుగా బరిలో ఉన్న అభ్యర్థులు రూ.25 లక్షల నుంచి రూ.60లక్షల వరకూ ఖర్చు చేస్తున్నారు. చిన్న గ్రామాల్లో రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చు చేసేందుకు అభ్యర్థులు వెనుకాడటం లేదు. వేలం పాట ద్వారా సర్పంచ్ పదవిని పొందినవారు రూ.10 లక్షల నుంచి రూ.35లక్షల వరకూ గ్రామాభివృద్ధి కమిటీలకు చెల్లింపులు పూర్తి చేశారు. వేలం పాట లేని చోట ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎంత ఖర్చుకై నా అభ్యర్థులు వెనుకాడటం లేదు. మద్యం, మాంసంతోపాటు ఓటుకు ఇంత అని ధర నిర్ణయించడం గమనార్హం. జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ఇద్దరు, ముగ్గురు అభ్యర్థులు పోటీ పడితే వారు అందరూ కలిసి చేస్తున్న ఖర్చు రూ.1.50 కోట్లు దాటిపోతోంది. సర్పంచ్ల గౌరవ వేతనానికి, వారు గెలవడానికి చేస్తున్న ఖర్చుకు తేడా ఎంతో ఉండటం ప్రజాస్వామ్యానికి కీడు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వేతనం నామమాత్రం.. సర్పంచుల గౌరవ వేతనం నెలకు రూ.6,500 ఎన్నికల్లో గెలిచేందుకు రూ.లక్షల్లో ఖర్చు వేతనం.. ఖర్చులపై పల్లెల్లో ఆసక్తికర చర్చ -
కారు దహనం
ఆర్మూర్టౌన్: ఆలూర్ మండలం మచ్చర్లలో మాజీ ఎంపీపీ పస్క నర్సయ్యకు చెందిన కారుకు దుండగులు శుక్రవారం అర్ధరాత్రి నిప్పంటించారు. ఎప్పటిలాగే నర్సయ్య కారును పార్క్ చేసి ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి వేళ కారు దహనమవుతున్నట్లు గమనించిన స్థానికులు అతడికి సమాచారం అందించారు. నర్సయ్య అక్కడికి చేరుకునే సరికి కారు మంటల్లో కాలిపోతోంది. అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుడు నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
సర్పంచులు @ పట్టభద్రులు
బీబీపేట: స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాన్యులే కాకుండా ఉన్నత విద్యావంతులు సైతం బరిలో నిలిచి, గెలుపొందారు. బీబీపేట గ్రామ సర్పంచ్ ఏదుళ్ల సాద్విక ఎంబీఏ పూర్తి చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి మీద 1470 ఓట్ల మెజార్టీతో గెలుపొంది ప్రజల మన్ననలు పొందింది. ప్రచారంలో సైతం తాను విద్యావంతురాలినని, గ్రామాభివృద్ధే లక్ష్యంగారాజకీయాల్లోకి వస్తున్నాని, ఆశీర్వదించాలని కోరింది. దీంతో ప్రజలు ఆమెను భారీ మెజార్టీతో గెలిపించారు. మాందాపూర్ గ్రామంలో సర్పంచ్ స్థానం కోసం 11 మంది బరిలో నిలువగా పీజీ పూర్తి చేసిన ఆకుల హరీష్ విజయం సాధించారు. ఆయనకు పోటీగా మాజీ సర్పంచులు ఇద్దరు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు అలాగే రాజకీయ నాయకులు సైతం నిలిచినప్పటికీ హరీష్ చెప్పిన నిజాయితీ మాటలకే ప్రజలు పట్టం కట్టారు. 276 ఓట్ల మెజార్టీతో సర్పంచ్ పదవి పొందారు. అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవికి సైతం నామినేషన్ వేశాడు. రాజకీయాల్లో కావల్సింది ప్రజాసేవ మాత్రమేనని దానికోసమే రాజకీయాల్లోకి ప్రవేశించానని ఆయన తెలిపారు. నాడు భార్య ఎంపీటీసీ.. నేడు భర్త సర్పంచ్ మాచారెడ్డి: పాల్వంచ మండల కేంద్రానికి చెందిన కూచని శేఖర్ సర్పంచ్ ఎన్నికల్లో ఉమ్మడి మాచారెడ్డి మండలంలో అత్యధికంగా 502 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అతడి భార్య లావణ్య ఎంపీటీసీగా పోటీ చేసి 705 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంతకుముందు 2011లో భార్యాభర్తలిద్దరూ వార్డు సభ్యులుగా గెలుపొందారు. ఇద్దరు రాజకీయాల్లో రాణిస్తుండడంతో గ్రామస్తులు అభినందిస్తున్నారు. -
పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలి
● ఓట్ల లెక్కింపు ఆలస్యం కాకుండా చూడండి ● ఎన్నికల సిబ్బందితో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్నిజాంసాగర్/ఎల్లారెడ్డి/లింగంపేట: ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఎన్నికల సిబ్బందికి సూచించారు. శనివారం ఆయన ఎల్లారెడ్డి, లింగంపేట, నిజాంసాగర్ మండల కేంద్రాలలోని ఎన్నికల సామగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి అవసరమైన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో విడతలో ఏడు మండలాల పరిధిలోని 153 సర్పంచ్, 873 వార్డు స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయమే మాక్ పోలింగ్ నిర్వహించాలని, 7 గంటలకు తప్పనిసరిగా పోలింగ్ ప్రారంభించాలని సూచించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటు వేసేందుకు క్యూలైన్లో ఉన్న వారికి టోకెన్లు ఇచ్చి పోలింగ్ కంటిన్యూ చేయాలన్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టాలని, మేజర్ గ్రామ పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ఆలస్యం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. శీతాకాలం నేపథ్యంలో ఎన్నికల సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు, బస్ సౌకర్యాం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమాలలో సబ్కలెక్టర్ కిరణ్మయి, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు శివకృష్ణ, భిక్షపతి, రూట్ అధికారులు అమర్ప్రసాద్, తిరుపతిరెడ్డి, ఎల్లారెడ్డి ఎంపీడీవో తాహేరాబేగం, ఎల్లారెడ్డి తహసీల్దార్ ప్రేమ్కుమార్ తదితరులున్నారు. -
బీజేపీ జెండా కనిపిస్తే భయపడుతున్నారు
సుభాష్నగర్: బీజేపీ జెండా కనిపిస్తే కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారని, సర్పంచ్ ఎన్నిక ల్లో తమ పార్టీ బలపర్చిన అభ్యర్థులను గెలిపిస్తే ప్ర జల వద్దకు పాలన అందిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపర్చిన 48 మంది పోటీ చేయగా.. 18 మంది విజయం సాధించారని సంతోషం వ్యక్తంచేశారు. కొన్నిచోట్ల స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారని పేర్కొన్నారు. రెండు, మూడు విడతల్లో మరిన్ని సర్పంచ్ స్థానాలు భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుంటే.. ఆ అభివృద్ధిని కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. అనంతరం మొదటి విడతలో గెలుపొందిన సర్పంచ్, వార్డుసభ్యులను సన్మానించారు. పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా..? బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేశ్గుప్తాకు దినేష్ సవాల్ విసిరారు. ఇటీవల ధన్పాల్ సూర్యనారాయణపై అవాస్తవ ఆరోపణలు చేసి గణేశ్గుప్తా తన రాజకీయ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ రెండేళ్లలో రూ.138 కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చారని గుర్తుచేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ల లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు న్యాలం రాజు, జిల్లా కార్యదర్శి జ్యోతి,రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, పాల్గొన్నారు. -
తిప్పాపూర్లో ‘కత్తెర’ హ్యాట్రిక్!
● వరుసగా మూడుసార్లు ఈ గుర్తు అభ్యర్థులదే విజయంభిక్కనూరు: తిప్పాపూర్ గ్రామ సర్పంచ్గా పోటీ చేసిన అభ్యర్థులకు కత్తెర గుర్తు కలిసివస్తోంది. వరుసగా మూడు ఎన్నికలలోనూ ఈ గుర్తు వచ్చినవారే విజయ తీరాలకు చేరడం గమనార్హం. 2013లో తిప్పాపూర్ సర్పంచ్ స్థానాన్ని బీసీ మహిళకు కేటాయించడంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో తాటిపల్లి జమున పోటీ చేశారు. కత్తెర గుర్తుపై పోటీ చేసిన ఆమె గెలుపొందారు. 2019 సర్పంచ్ ఎన్నికల్లో ఎస్సీ జనరల్ అయ్యింది. కోక స్వామి కాంగ్రెస్ మద్దతుతో కత్తెర గురుపై పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికలలో ఈ స్థానాన్ని జనరల్కు కేటాయించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన కుంట లింగారెడ్డికి కత్తెర గుర్తు వచ్చింది. ఆయన తన సమీప ప్రత్యర్థి రాజయ్యపై 59 ఓట్ల వ్యత్యాసంతో గెలిచారు. వరుసగా మూడు పర్యాయాలు కత్తెర గుర్తుపై పోటీ చేసినవారే గెలుపొందడం మండలంలో చర్చనీయాంశమైంది. -
పోలీస్ ప్రజావాణి వాయిదా
నిజామాబాద్అర్బన్: ప్రతి సోమవారం నిర్వహించే పోలీసు ప్రజావాణిని వాయిదా వేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కార్యక్రమాన్ని వాయిదా వేశామని ప్రజలు గమనించాలని పేర్కొన్నారు. ప్రజావాణి మళ్లీ ఎప్పుడు నిర్వహించేది ప్రకటిస్తామని తెలిపారు. పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం మగ్గిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు సౌత్ ఇండియా యూనివర్సిటీ వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు పీఈటీ మధు శనివారం తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సంజూష, జీజీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న కీర్తీ, ఎస్ఎస్ఆర్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న స్పందన, నిషిత కళాశాలలో డిగ్రీ చదువుతున్న సాయిరాం, జీజీ కళాశాల విద్యార్థి అజయ్తోపాటు మేడ్చల్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్న నవీన సౌత్ ఇండియా యూనివర్సిటీ వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో త్వరలో నిర్వహించనున్న సౌత్ ఇండియా వాలీబాల్ పోటీల్లో అమ్మాయిలు, చైన్నైలో నిర్వహించనున్న పోటీల్లో అబ్బాయిలు పాల్గొంటారన్నారు. విద్యార్థులను పాఠశాల హెచ్ఎం హరిత, పీఈటీ మధు, వీడీసీ సభ్యులు అభినందించారు. ఇందల్వాయి: సమన్వయంతో పనిచేసి పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయాలని, తప్పిదాలు జరగకుండా చూడాలని ఎన్నికల సిబ్బందికి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఇందల్వాయిలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ శనివారం పరిశీలించారు. స్వేచ్ఛ వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎంపీడీవో అనంత్రావు, తహసీల్దార్ వెంకట్రావు తదితరులు ఆయన వెంట ఉన్నారు. ● అప్రమత్తమైన ప్రయాణికులు సదాశివనగర్(ఎల్లారెడి): మండలంలోని పద్మాజివాడి చౌరస్తాలో ఓ ఆర్టీసీ బస్సులో పొగలు రావడంతో కలకలం రేగింది. 67 మంది ప్రయాణికులతో కామారెడ్డి వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో నుంచి పద్మాజివాడి చౌరస్తాలో పొగలు వచ్చాయి. ప్రయాణికులు గమనించి వెంటనే డ్రైవర్ను అప్రమత్తం చేశారు. ఆందోళనతో కిందికి దిగారు. పద్మాజివాడి సర్పంచ్ లోకోటి సుబ్బారావు అక్కడికి చేరుకుని ప్రయాణికులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. -
హైవేపై కంటైనర్ బోల్తా
భిక్కనూరు : జంగంపల్లి గ్రామ శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం రాత్రి కంటైనర్ బోల్తాపడింది. కామారెడ్డి నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ ముందు వెళ్తున్న కారును ఢీ కొట్టి బోల్తా పడడంతో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులతోపాటు కంటైనర్ డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై లారీ బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో లారీని పక్కకు తప్పించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. -
మలి దశకు రెడీ
● నేడు రెండో విడత పంచాయతీ ఎన్నికలు ● 153 సర్పంచ్, 873 వార్డులకు పోలింగ్ ● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులుజిల్లాలోని లింగంపేట, నాగిరెడ్డిపేట, గాంధారి, ఎల్లారెడ్డి, నిజాంసాగర్, పిట్లం, మహమ్మద్నగర్ మండలాలలో రెండో విడతలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా మండలాల పరిధిలో 197 పంచాయతీలు, 1654 వార్డులు ఉండగా, 44 సర్పంచ్ పదవులు, 776 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 153 సర్పంచ్ పదవులకు 606 మంది, 873 వార్డులకు 2,655 మంది పోటీ పడుతున్నారు. 1,89,177 మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఆయా పంచాయతీల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. మొదట వార్డు సభ్యుల ఓట్లు లెక్కించిన తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. మొదటి విడతలో పలు మేజర్ పంచాయతీల్లో అర్ధరాత్రి దాటిన తర్వాతే కౌంటింగ్ పూర్తయ్యింది. ఈసారి కౌంటింగ్లో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. మలి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ తుది దశకు చేరింది. పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఏడు మండలాల పరిధిలోని 153 సర్పంచ్, 873 వార్డు స్థానాలలో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డిఆయా మండల కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, సామగ్రితో శనివారం పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆయా మండలాల్లో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు వెళ్లి అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. సిబ్బందికి అవసమరైన రవాణా, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, ఎక్కడా లోపం జరగకూడదని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంది.వారం, పది రోజులపాటు అభ్యర్థులు, వారి తరఫున ఆయా రాజకీయ పార్టీల నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో పోటాపోటీగా ఖర్చు చేశారు. ఊరూరా కుల సంఘాలకు విందులు ఇచ్చారు. చివరి రెండు రోజుల్లో పంపకాలు జరిగాయన్న ప్రచారం ఉంది. ప్రధానంగా పెద్ద పంచాయతీలైన గాంధారి, లింగంపేట, పిట్లం మండల కేంద్రాల్లో హోరాహోరీ పోరు నడుస్తోంది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గెలుపుకోసం భారీ ఎత్తున ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మూడు గ్రామాలు కూడా పెద్దవి కావడంతో అక్కడ తీవ్ర పోటీ నెలకొంది. ఆదివారం పోలింగ్ జరిగే స్థానాల్లో పలుచోట్ల ద్విముఖ, కొన్నిచోట్ల త్రిముఖ పోటీ నడుస్తోంది. పోటీలో ఉన్న వారి తరఫున ఆయా పార్టీల ముఖ్య నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. పిట్లం, మహమ్మద్నగర్, నిజాంసాగర్ మండలాల్లో ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే విస్తృతంగా తమ పార్టీ మద్దతుదారుల తరఫున ప్రచారం చేశారు. అలాగే ఆయా మండలాల్లోని పెద్ద గ్రామాల్లో సర్పంచ్ పదవితో పాటు వార్డుల్లోనూ గట్టి పోటీ నెలకొంది. చాలా చోట్ల ఇద్దరు, ముగ్గురు పోటీ పడుతున్నారు. ఎవరు గెలుస్తారన్నది రాత్రి వరకు తేలిపోనుంది. -
ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య
దోమకొండ: ఆర్థిక ఇబ్బందుల కారణంగా మండలంలోని అంచనూరు గ్రామానికి చెందిన యువకుడు భాస్కరి నందు (23) శుక్రవారం రాత్రి ఉరేసు కుని ఆత్మహత్యకు పాల్పడిన ట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. వివరాలిలా ఉన్నా యి. హైదరాబాద్లో కూలీ పనులు చేస్తూ జీవిస్తు న్న భాస్కర్ గురువారం గ్రామంలో జరిగిన పంచా యతీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న అతడు మనోవేదన కు గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డా డు. మృతుడి తల్లి భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అనారోగ్యం కారణంతో.. భిక్కనూరు: అనారోగ్య సమస్యల కారణంగా ఇసన్నపల్లి గ్రామానికి చెందిన మందస్వామి(52) అనే వ్యక్తి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఆంజనే యులు తెలిపారు.కొంతకాలంగా ఫిట్స్తో బాధపడుతున్న మందస్వామి జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కొద్ది సేపటికి వచ్చిన కుటుంబ సభ్యులు గమనించి అతడిని సిరిసిల్ల రాజన్న జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. భిక్కనూరు: మండలంలోని కా చాపూర్ గ్రామానికి చెందిన మె ట్టు నరేశ్ అనే యువకుడు అదృశ్యమైనట్లు ఎస్సై ఆంజనేయు లు శనివారం తెలిపారు.20 రో జుల క్రితం ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన నరేశ్ తిరి గి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలు చోట్ల వెతికారని తెలిపారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యా దు చేశారని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
ఎన్నికల వేళ కొత్త ‘పంచాయితీ’
ప్రభుత్వం పాలనను చేరువ చేసేందుకు 2018లో పంచాయతీల పునర్విభజన చేపట్టింది. 500 జనాభాకు మించి ఉన్న గ్రామాలు, తండాలను గ్రామపంచాయతీలుగా చేసింది. చిన్నచిన్న తండాలు, పల్లెలలో రెండు మూడింటిని కలిపి నూతన పంచాయతీలుగా మార్చింది. పంచాయతీల పునర్విభజనతో తమకు ప్రజాప్రతినిధులుగా అవకాశాలు దక్కుతాయని చాలామంది ఆశించారు. అయితే చిన్న పెద్ద తండాలు, ఆవాసాల మధ్య వివాదాలు తలెత్తుతుండడంతో చిన్న ఆవాసాల ప్రజలు తమకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పల్లెను కూడా గ్రామ పంచాయితీగా గుర్తించాలనే డిమాండ్ పెరుగుతోంది. గోకుల్ తండాలో ఓట్ల బహిష్కరణ రామారెడ్డి మండలంలోని గోకుల్ తండా పరిధిలో మీది తండా, కింది తండా ఉన్నాయి. మీది తండాలో 350, కింది తండాలో 250 మంది ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో ఓటర్లు ఎక్కువగా ఉన్న మీది తండావాసులు తమ తండాకు చెందిన వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకుని ఏకగ్రీవం చేసుకున్నారు. ఈసారి కూడా అలాగే చేస్తున్నారని ఆరోపిస్తూ కింది తండావాసులు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఉన్నతాధికారులు వెళ్లి మాట్లాడినా ఫలితం లేకపోయింది. జనగణన తర్వాతే అవకాశం! కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయాలంటే అసెంబ్లీ తీర్మానం పూర్తయి ప్రభుత్వం నుంచి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. 2018 లో అప్పటి ప్రభుత్వం 500 జనాభాకు మించి ఉన్న (2011 జనాభా లెక్కల ప్రకారం) గ్రామాలు, తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా గుర్తించింది. కామారెడ్డి జిల్లాకు సంబంధించి 65 గిరిజన తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. పాత వాటితో కలిపి కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో 2019 లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. ఇప్పట్లో పంచాయతీల పునర్విభజనకు అవకాశం లేదని తెలుస్తోంది. 2026–27 లో జనగణన చేపట్టనున్నారు. దీనిని బట్టి చూస్తే 2027 చివరికి జనాభా గణన పూర్తయితే కొత్త జనాభా లెక్కల ప్రకారం 500 జనాభా దాటిన పంచాయతీలు, గ్రామాలు, తండాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.గాంధారి మండలం సోమ్లానాయక్ తండాలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. 2018లో సోమ్లానాయక్ తండా పంచాయతీగా ఏర్పడింది. దీని పరిధిలో తక్కువ ఓటర్లు కలిగిన పంతులు నాయక్ తండా ఉంది. సోమ్లానాయక్ తండావాసులు ఏకగ్రీవాలు చేసుకుంటూ తమకు సర్పంచ్ అవకాశం ఇవ్వడం లేదని పంతులు నాయక్ తండావాసులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేశామని పేర్కొంటున్నారు. ఇవే కాకుండా 2018 లో ఏర్పడిన పంచాయతీల పరిధిలోని పలు హాబిటేషన్లలో ఇలాంటి సమస్యలున్నట్లు తెలుస్తోంది. ఓటర్లు ఎక్కువగా ఉన్న పంచాయతీ కేంద్రాల ప్రజలు, నాయకులు తమను పట్టించుకోవడం లేదని హాబిటేషన్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్న గ్రామాలకు అన్యాయం జరుగుతోందనే వాదన కొన్ని హ్యాబిటేషన్ల నుంచి వినిపిస్తోంది.పంచాయతీ ఎన్నికల వేళ కొత్త సమస్య తలెత్తింది. రెండుమూడు పల్లెలు కలిసి ఏర్పాటైన జీపీలలో తమకు సర్పంచ్ అవకాశం రావడం లేదని చిన్న పల్లెలవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. – కామారెడ్డి క్రైం ఆవాసాలు, పంచాయతీ కేంద్రాల మధ్య వివాదాలు తమకు సర్పంచ్ అవకాశాలు రావడం లేదని ఆవేదన ప్రత్యేక జీపీలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ -
నేతల ఫొటోలు లేకుండానే ప్రచారం
మోర్తాడ్: పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అ భ్యర్థులకు రాజకీయ పార్టీల మద్దతు ఉన్నా ఆ పార్టీ స్థానిక నేతల ఫొటోలు లేకుండానే సొంతంగా ప్ర చారంలో దూసుకుపోతున్నారు. తమ పార్టీల ము ఖ్య నేతల ఫొటోలను కరపత్రాలు, డోర్ స్టిక్కర్స్పై ప్రదర్శించేందుకు ఆలోచిస్తున్నారు. ఒక వేళ ఆ నాయకులపై వ్యతిరేకత ఉంటే ఆ ప్రభావం తమపై చూపుతుందని భయపడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీల జోక్యం నేరుగా లేదు. ఎక్కువ మంది అభ్యర్థులు వారికి కేటాయించిన గుర్తులు, వారి ఫొటోలను కరపత్రాలు, డోర్ స్టిక్కర్స్పై ముద్రించి ప్రచారం కొనసాగిస్తున్నారు. అనేక గ్రామాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు, నియోజకవర్గం నాయకుల ఫొటోలు కనిపించడం లేదు. నాయకులపై వ్యతిరేకత ఉంటే తమకు ఎక్కడ దెబ్బ పడుతుందోననే అనుమానం, పార్టీలకు అతీతంగా ఓట్లు రాబట్టుకోవాలనే కాంక్షతో అభ్యర్థులు సొంతంగానే ప్రచారం సాగిస్తున్నారు. ముఖ్య నేతల ఆశీస్సులు ఉన్నా వారి ఫొటోలు లేకుండా ప్రచారం సాగుతుండటం గమనార్హం. పార్టీలకు దూరంగా ఉంటూ గుర్తు, తమ ఫొటోతోనే బరిలోకి.. పార్టీల నాయకులపై వ్యతిరేకత తమపై ఎక్కడ ప్రభావం చూపుతుందోననే భయం -
ప్రశాంతంగా నవోదయ ప్రవేశ పరీక్ష
కామారెడ్డి టౌన్: జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశం కోసం శనివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 2,884 మంది దరఖాస్తు చేసుకోగా వారికోసం జిల్లావ్యాప్తంగా 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 2210 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 674 విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షలను డీఈవో రాజు పర్యవేక్షించారు.పెద్దకొడప్గల్: బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు జుక్కల్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారాం తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన పెద్దకొడప్గల్లో విలేకరులతో మాట్లాడారు. నాలుగుసార్లు జుక్కల్ ఎమ్మెల్యేగా గెలిచానని, మూడేళ్లపాటు ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా పనిచేశానని పేర్కొన్నారు. 2023లో కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరానన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి లేదా రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి ఇస్తానన్నా తీసుకోలేదన్నారు. ఆ పార్టీ నిర్వహించిన ఏ సమావేశానికీ హాజరుకాలేదన్నారు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని విమర్శించలేక, బీజేపీకి న్యాయం చేయలేక ఇబ్బందిపడుతున్నానని, ఈ నేపథ్యంలో బీజేపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. రాజీనామా లేఖను బీజేపీ, జిల్లా, రాష్ట్ర అధ్యక్షులకు పంపుతానని పేర్కొన్నారు. దోమకొండ : జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 7 నుంచి 8 డిగ్రీల మధ్య నమోదవుతుండడంతో జనం గజగజ వణుకుతున్నారు. గతేడాది జనవరిలో తీవ్ర ప్రతాపం చూపిన చలి ప్రస్తుతం డిసెంబరులోనే తీవ్రంగా ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. సాయంత్రం 5 గంటలనుంచే చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం 8 గంటల వరకు మంచు కురుస్తోంది. చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ఉదయం పనులకు వెళ్లేవారు, నైట్ డ్యూటీలు చేసేవారు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు.బాన్సువాడ : తెలంగాణ జూనియర్స్ వాలీబాల్ జట్టు కెప్టెన్గా జిల్లాకు చెందిన విస్లావత్ నరేందర్ ఎంపికయ్యాడు. నస్రుల్లాబాద్ మండలం రాములగుట్ట తండాకు చెందిన నరేందర్ నెమ్లి పాఠశాలలో పదో తరగతి వరకు చదివాడు. ఎల్లారెడ్డిలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. ప్రస్తుతం కామారెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు సిరిసిల్లలో జరిగిన రాష్ట్ర స్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో నరేందర్ ప్రతిభ చూపడంతో రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. ఈనెల 16 నుంచి 21 వరకు రాజస్థాన్లో జరిగే జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో తెలంగాణ జట్టుకు నరేందర్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. నరేందర్ను వీఎఫ్ఐ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ హన్మంత్రెడ్డి, కోచ్ సురేందర్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలు, రవీందర్రెడ్డి అభినందించారు. -
ఆ పల్లెల్లో తొలిపొరు ..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని కన్నారెడ్డి, చిన్నఆత్మకూర్ గ్రామపంచాయతీలలో ఆదివారం తొలిపొరు జరుగనుంది. యేడాది క్రితం మండలంలోని ధర్మారెడ్డి గ్రామపంచాయతీ నుంచి కన్నారెడ్డి, ఆత్మకూర్ గ్రామపంచాయతీ నుంచి చిన్నఆత్మకూర్ వేరు పడి నూతన గ్రామపంచాయతీలుగా ఏర్పడ్డాయి. దీంతో ఆ పల్లెలకు ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు తొలిపోరుగా మారాయి. కాగా కన్నారెడ్డి పంచాయతీ పరిధిలో 6 వార్డు స్థానాలుండగా 134మంది పురుషులు, 171మంది మహిళా ఓటర్లు ఉన్నారు. సర్పంచ్ స్థానానికి ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. చిన్నఆత్మకూర్ పంచాయతీ పరిధిలో 8 వార్డు స్థానాలుండగా 289మంది పురుషులు, 331మది మహిళలు ఓటర్లుగా నమోదై ఉన్నారు. సర్పంచ్ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మహమ్మద్ నగర్ మండలంలో.. నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండల కేంద్రంగా ఏర్పాటైన తర్వాత గ్రామంలో తొలిసారి పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుగా అందోల్ అశ్విని ఎన్నికల బరిలో నిలువగా, బీఆర్ఎస్ మద్దతుదారుగా దఫేదార్ బాలమణి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సదరు గ్రామ పంచాయతీలో 1,777 మంది ఓటర్లు ఉండగా పురుషులు 838 మంది, సీ్త్రలు 939 మంది ఉన్నారు. అందోల్ అశ్విని తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దఫేదార్ బాలమణి ఇప్పటికే రెండు పర్యాయాలు సర్పంచ్గా ఎన్నికవడంతో పాటు కుమారుడు రాజు ఒక్కసారి సర్పంచ్ కాగా, ఆమె భర్త దఫేదార్ కిషన్ సైతం సర్పంచ్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం దఫేదార్ బాలమణి మూడోసారి సర్పంచ్ బరిలో నిలిచారు. గ్రామ ప్రజల తీర్పుతో వీరిలో ఎవరు విజయం సాధిస్తారో ఆదివారం తేలనుంది. -
తమ అభ్యర్థికి ఓట్లు వేయలేదని దాడి
● రెంజల్ మండలం వీరన్న గుట్టలో ఘటన ● నలుగురి అరెస్ట్.. రిమాండ్కు తరలింపు ● వివరాలు వెల్లడించిన బోధన్ ఏసీపీ శ్రీనివాస్ బోధన్రూరల్: తమ అభ్యర్థికి ఓట్లు వేయలేదనే కక్షతో రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో పలువురిపై మారణాయుధాలతో దాడికి పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు బోధన్ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. బోధన్ పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. వీరన్నగుట్ట గ్రామ సర్పంచ్గా పోటీ చేసిన రిజ్వానా బేగంకు మద్దతు ఇవ్వలేదని, అనుకూలంగా ఓట్లు వేయలేదని ఆమె కొడుకులు ఇబ్రహీం, అబు బాకర్ తమ అనుచరులు సిరాజ్, వాజీద్, ఇలియాస్, అవేజ్, ఆరిఫ్, మోయిన్ ఖాన్ తదితరులతో కలిసి జమీలుద్దీన్, అఫ్సర్, హైమద్పై మరణాయుధాలతో ఈ నెల 12వ తేదీన నూర్ మసీద్ వద్ద ప్రార్థనల అనంతరం దాడి చేసి గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశా మని ఏసీపీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి దాడి కి ఉపయోగించిన ఎంహెచ్ 46 ఏఎల్ 6852 నంబర్ కారుతోపాటు రెండు కత్తులు, ఐరన్ రాడ్డులు, కర్రలు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న మరికొంత పరారీలో ఉన్నారని.. వారిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన వెల్లడించారు. సమావేశంలో బోధన్ రూరల్ సీఐ విజయ్బాబు, రెంజల్ ఎస్సై చంద్రమోహన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కలవరపెడుతున్న ఫలితాలు
● మెజార్టీ గ్రామాలు హస్తగతమైనా మేజర్ పంచాయతీలో భిన్నంగా తీర్పు ● ఆందోళనలో మూడో విడత అభ్యర్థులుమేజర్ పంచాయితీలు.. ● పొతంగల్ మండల కేంద్రంలో బీజేపీ అభ్యర్థి శారద విజయం సాధించింది. ● కోటగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ మద్దతుదారులు బర్ల మధుకర్ను గెలిపించారు. ● రుద్రూర్ జీపీలో కాంగ్రెస్ మద్దతుదారులు ఇందూర్ సునీతను గెలిపించారు. ● వర్ని మండలం సత్యనారాయణపురంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి కనకదుర్గ విజయం సాధించారు. ● చందూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరెడ్డి సర్పంచ్గా విజయం సాధించారు. ● మోస్రాలో బీజేపీ అభ్యర్థి భూపాల్రెడ్డిని ఓటర్లు గెలిపించారు.బాన్సువాడ : మొదటి విడత ఫలితాలు కలవరపెడుతున్నాయి. మెజారిటీ గ్రామాల్లో పైచేయి ఉన్నప్పటికి మేజర్ పంచాయతీలలో మాత్రం అందుకు భిన్నంగా తీర్పు వెలువడింది. బాన్సువాడ నియోజకవర్గం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో సగం సగం ఉంది. నిజామాబాద్ జిలాల్లో ఉన్న మండలాల్లో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరుగగా మిగతా మండలాల్లో మూడో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. నియోజకవర్గంలోని పొతంగల్, కోటగిరి, రుద్రూర్, వర్ని, చందూర్, మోస్రా మండలాల్లో మొదటి విడత ఎన్నికలు జరిగాయి. ఆయా మండలాల్లో మెజారిటీ పంచాయతీలు హస్త గతమయ్యాయి. కానీ మేజర్ పంచాయితీల్లో మాత్రం ఓటర్ల తీర్పు భిన్నంగా వచ్చింది. మూడో విడతలో కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఆయా మండలాల్లో చాలా పంచాయతీలు, గిరిజన తండాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా గ్రామాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడతలో వచ్చిన ఎన్నికల ఫలితాలు చూసి మూడో విడతలో ఎన్నికలు జరిగే గ్రామాల్లో అభ్యర్థులు భయాందోళనకు గురవుతున్నారు. ఓటర్ల నాడి తెలుసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికి వారి నాడి అంతుచిక్కడం లేదని తలలు పట్టుకుంటున్నారు. ఓటర్లకు రాచ మర్యాదలు చేస్తూ ఎక్కడా లేని ప్రేమలు ఒలకబోస్తున్నారు. భారీ సంఖ్యలో మహిళలను వెంట బెట్టుకుని ప్రచారం కొనసాగిస్తున్నారు. మేజర్ గ్రామ పంచాయతీల్లో ఓటర్ల తీర్పుపై సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా బీర్కూర్, నస్రుల్లాబాద్, బాన్సువాడ మండలాల్లోని మేజర్ పంచాయతీలలో రెబెల్ బెడద ఉంది. -
గ్రామాల అభివృద్ధే లక్ష్యం
● కేంద్ర, రాష్ట్ర నిధులతో సమస్యలు పరిష్కరిస్తాం ● ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకామారెడ్డి టౌన్: నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాలలో విజయం సాధించారు. దీనిని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఇందిరాచౌక్ నుంచి పార్టీ కార్యాలయం వరకు విజయోత్సవ ర్యాలీ తీశారు. ర్యాలీలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పంచాయతీలకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ. 3 వేల కోట్ల చొప్పున నిధులు రావాల్సి ఉందన్నారు. వాటితో అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. పంచాయతీ ఎన్నికలలో గెలిచిన వారికి అభినందించారు. కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్వగ్రామంలో 30 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ మద్దతుదారు విజయం సాధించారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే జోష్తో సత్తాచాటుతామన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్రావు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్రెడ్డి, పట్టణ, మండల అధ్యక్షులు పండ్ల రాజు, శ్రీనివాస్రెడ్డి, నాయకులు మోహన్రెడ్డి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
‘చక్కెర’ పెరుగుతోంది
● చాపకింద నీరులా విస్తరిస్తున్న మధుమేహం ● ఆందోళన కలిగిస్తున్న గణాంకాలుకామారెడ్డి టౌన్: మారుతున్న ఆహారపు అలవాట్లు, ఒత్తిడి నేపథ్యంలో మధుమేహం(డయాబెటిస్) చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఏటా షుగర్ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఎన్సీడీ ప్రోగ్రాంలో భాగంగా పీహెచ్సీ, సబ్ సెంటర్ల పరిధిలో సర్వే చేశారు. 30 ఏళ్ల పైబడిన వారి వివరాలు సేకరించారు. 5,59,492 మంది వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. ఇందులో 5,53,425 మందికి షుగర్ పరీక్ష చేయగా.. 63,979 మందికి మధుమేహ వ్యాధి ఉన్నట్లు తేలింది. పరీక్షలు చేసినవారిలో 11.56 శాతం మందికి షుగర్ ఉండడం గమనార్హం.జిల్లాలో అన్ని పీహెచ్సీల పరిధిలో ఎన్సీడీ ప్రోగ్రాంలో భాగంగా షుగర్, బీపీ పరీక్షలు చేస్తున్నాం. ప్రతినెల మందులను ఉచితంగా అందిస్తున్నాం. క్షేత్ర స్థాయిలో ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులు తమ జీవన శైలిని మార్చుకోవాలి. ప్రతిరోజు నడక, వ్యాయామం, యోగాసనాలు చేయాలి. – విద్య, డీఎంహెచ్వో, కామారెడ్డిరక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటే మధుమేహం వచ్చినట్లుగా నిర్థారిస్తారు. షుగర్ లెవల్స్ మోతాదులో ఉండాలి. పరిగడుపున 90 నుంచి 110, ఆహారం తిన్న తర్వాత 90 నుంచి 140 లోపు ఉండడం సాధారణ స్థాయిగా పరిగణిస్తారు. వాతావరణ కాలుష్యం, తినే ఆహారం, పీల్చే గాలి, తాగే నీరు, తీసుకునే చక్కెర.. ఇలా ఏదైనా కారణంతో రక్తపోటుతో పాటు మధుమేహం వస్తున్నాయి. ఇక కుటుంబంలో తల్లిదండ్రులకు షుగర్ ఉంటే వంశపారంపర్యంగా సంతానానికి ఈ వ్యాధులు వస్తున్నాయి. చాలామంది 30 దాటగానే మధుమేహం బారిన పడుతున్నారు. మధుమేహం వ్యాధి బారిన పడినవారు ఉదయం తప్పకుండా వాకింగ్ చేయాలని, డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే మిగతా అవయవాల మీద ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ వ్యాధి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.పరీక్షలు చేయించుకున్న 30 ఏళ్లపైబడినవారు 5,53,425 మధుమేహం నిర్ధారణ అయినవారు 63,979 శాతం 11.56 -
‘పనిచేసేవారినే ఎన్నుకోవాలి’
బాన్సువాడ రూరల్: పంచాయతీ ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేసే సత్తా ఉన్న యోగ్యులనే సర్పంచ్లుగా, వార్డు సభ్యులుగా ఎన్నుకోవాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రజలను కోరారు. శుక్రవారం ఆయన తాడ్కోల్, బుడిమి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ ఓటు వజ్రాయుధం లాంటిదని దాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు పోచారం భాస్కర్రెడ్డి, నాయకులు అందె రమేష్, ఖమ్రోద్దీన్, మధుసూదన్రెడ్డి, గోపాల్రెడ్డి, గంగుల గంగారాం, వెంకట్రెడ్డి, రాజు, లక్ష్మాగౌడ్, గౌస్, అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. -
కల్యాణిలో ఫ్లాగ్ మార్చ్
ఎల్లారెడ్డి రూరల్ : కల్యాణి గ్రామంలో పోలీసులు శుక్రవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గ్రామంలో ప్రతి కాలనీలో తిరిగి ఓటుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్రావు మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ప్రశాంతంగా ఓటు వేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ రాజారెడ్డి, ఎస్సై మహేశ్ తదితరులు పాల్గొన్నారు.నిజాంసాగర్: నిజాంసాగర్, మహమ్మద్నగర్ మండల కేంద్రాలతో పాటు మాగి గ్రామంలో శుక్రవారం పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య, ఎస్సై శివకుమార్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. -
మూడు సార్లు ఒకే ఓటుతో గెలుపు
● ఈసారి కూడా ఒక ఓటు తేడాతో ఒకటవ వార్డులో విజయం ● రామారెడ్డిలో అరుదైన ఘటన రామారెడ్డి: స్థానిక సంస్థల్లో ప్రతి ఓటుకు ఎంతో వి లువ ఉంటుంది. అలాంటిది మండల కేంద్రం రా మారెడ్డిలో 1వ వార్డులో మూడు పర్యాయాలుగా ఓ కే ఓటు తేడాతో వార్డు సభ్యులు గెలవడం ఆనావాయితీగా వస్తుంది. 2006 నుంచి గొల్ల రాజు.. చాతరబోయిన శంకర్పై ఒక ఓటు తేడాతో గెలుపొందారు. ఆ తర్వాత వచ్చిన పంచాయతీ ఎన్నికల్లో ఒకటో వార్డులో తుపాకుల స్వామి గౌడ్, ..అమ్ముల శృతిపై ఒక ఓటు తేడా తో గెలుపొందాడు. మళ్లీ 2025 డిసెంబర్ 11 జరిగిన ఎన్నికల్లో జరిగారిరాజేందర్, జీర్గారి రాజయ్యపై ఒక ఓటు తేడాతో గెలుపొందాడు. జీర్గారి రాజేందర్కు 103 ఓట్లు రాగా జీర్గారి రాజయ్యకు 102 ఓట్లు వచ్చాయి. 2019లో ఒక్కసారి తప్ప ప్రతిసారి ఒక టో వార్డులో ఒకే ఓటు తేడాతో గెలవడం విశేషం. -
ప్రతిపక్షాల అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి కుంటుపడుతుంది
పెద్దకొడప్గల్(జుక్కల్):ప్రతిపక్షాల అభ్యర్థిని గెలిపి స్తే అభివృద్ధి కుంటుపడుతుందని,ఎక్కడ వేసిన గొంగడి అక్కడే మాదిరిగా ఉంటుందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు.శుక్రవారం మండల కేంద్రంతో పాటు బేగంపూర్, కాస్లాబాద్, వడ్లం, బూరుగుపల్లి, సముందర్ తండా, జగన్నాథ్పల్లి, చిన్న తక్కడ్పల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే తోట ల క్ష్మీకాంతారావు కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్ర భుత్వంలో ఎమ్మెల్యే హన్మంత్ సింధే నియోజకవర్గా న్ని ఏ రకంగా అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తానని, అర్హులందరికి సంక్షేమ పథకాలు అందిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందరెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
ఎన్నికలలో పొరపాట్లకు తావివ్వొద్దు
● కౌంటింగ్ పూర్తవగానే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలి ● టెలి కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం: ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్ నుంచి వివిధ మండలాల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా రెండో విడత ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాలెట్ బాక్సులు, పే పర్లు, సీలింగ్ మెటీరియల్ను ముందుగానే సిద్ధం చే యాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద అభ్యర్థుల వి వరాలను నోటీసు బోర్డులో ప్రదర్శించాలన్నారు. అసలైన ఓటర్కు బదులుగా ఇతరులు ఓటు వేసినట్లు తేలి తే టెండర్ ఓటుకు వెళ్లాలన్నారు. టెండర్ ఓట్లు 0.1 శాతానికి మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపును మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించాలన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాలని, అనంతరం వార్డుల, సర్పంచ్ల ఓట్ల లెక్కింపు చే పట్టాలని సూచించారు. ఫలితాల అనంతరం విజేతల కు ఫాం 29 ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలన్నారు. ఉప సర్పంచ్ ఎన్నికలను కౌంటింగ్ పూర్తి కాగానే నిర్వహించాలన్నారు. ఈ ప్రక్రియలో సర్పంచ్తో పాటు 50 శాతం సభ్యుల హాజరు తప్పనిసరి అని పేర్కొన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో పోలింగ్కు సంబంధించిన ఎన్నికల సామగ్రి ముందుగానే పూర్తిగా సిద్ధం చేయాలన్నారు. పోలింగ్ శాతాన్ని ఉదయం 9, 11, మధ్యాహ్నం 1 గంటలకు, చివరగా తుది నివేదికను పంపడానికి ప్రత్యేక సిబ్బందిని నియమించాలని సూచించారు. అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. రెండో విడత సిబ్బందికి ర్యాండమైజేషన్ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను శుక్రవారం కలెక్టెరేట్లో నిర్వహించారు. జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు సత్యనారాయణరెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ల సమక్షంలో ఈ ప్రక్రియను పూర్తి చేసి జీపీలకు పీవోలు, ఏపీవోలను కేటాయించారు. -
కుంటలో పడి ఒకరు మృతి
లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేటలోని సూర్ణకుంటలో ఓ వ్యక్తి పడి మృతిచెందినట్లు ఎస్సై దీపక్ కుమార్ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన తిదిరి నవీన్(40) మూడు రోజుల క్రితం తన భార్య వద్దకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు నవీన్ భార్యకు పోన్ చేసి విచారించగా తన వద్దకు రాలేదన్నారు. శుక్రవారం మధ్యాహ్నం మండల కేంద్రంలోని సూర్ణకుంటలో నవీన్ మృతదేహం తేలడంతో స్థానికులు గుర్తించి, మృతుగి కుటుంబీకులకు, పోలీసులకు సమాచారం అందించారు. సూర్ణకుంటలో మృతుడు కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు తండ్రి లక్ష్మన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మెరుగైన వైద్య సేవలందించాలి
కామారెడ్డి టౌన్: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి టి.నాగరాణి సూచించారు. ఆరోగ్య సేవల సలహా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జీజీహెచ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రతి ఒక్కరు చట్టాలు, హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో విద్య, ఆర్ఎంవో రవీందర్గౌడ్, వైద్యుడు సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు.కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలో నూతన రైల్వే బ్రిడ్జీల నిర్మాణాలతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుందని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రైల్వే అధికారులతో కలిసి రోడ్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణాల కోసం స్థలాలను పరిశీలించారు. ఓరియంటల్ స్కూల్ నుంచి పాత బస్టాండ్ వరకు సర్క్యులేషన్ ఏరియా పెంచుతున్నామన్నారు. రైల్వే క్వార్టర్స్ షిఫ్ట్ చేసి రైల్వే స్టేషన్ ముఖద్వారం పెంచాల్సి వస్తుందన్నారు. ప్రియా టాకీస్ రోడ్ నుంచి రైల్వే స్టేషన్ మీదుగా ఇందిరా చౌక్ వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం స్థల పరిశీలన చేశామన్నారు. వికాస్నగర్ నుంచి రైల్వే ట్రాక్ మీదుగా ఇస్లాంపూర్కు, స్నేహపూరి కాలనీ నుంచి రైల్వే ట్రాక్ మీదుగా కలెక్టర్ ఆఫీస్ వరకు బ్రిడ్జీలను నిర్మిస్తామన్నారు. పాత రాజంపేట వద్ద బ్రిడ్జి గురించి అధికారులతో చర్చించామన్నారు. కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ఇంజినీర్ అమిత్ అగర్వాల్, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ నవశ్రీ, అధికారులు దుర్గాప్రసాద్, శశాంత్ నాందేవ్, శంభుదయాళ్ మీనా, ధర్మారావు తదితరులున్నారు. కామారెడ్డి టౌన్: జిల్లాలోని ప్రతి ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం ఎంటీపీ(మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ) నిర్వహణకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎంటీపీ ప్రోగ్రాం అధికారి ఎమీమ్ తెలిపారు. శుక్రవారం డీఎంహెచ్వో కార్యాలయంలో ఎంటీపీ జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ ఆస్పత్రులతో ఎంటీపీ అమలు, నిబంధనలు, అనుమతులపై చర్చింరారు. నిబంధనలు పాటించని అస్పత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రధాన వీధుల్లో కవాతు నిర్వహించారు. అనంతరం ఆయన లింగంపేట మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద మాట్లాడారు. ప్రజల్లో విశ్వాసం కల్గించడానికి కవాత్తు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రతీ ఓటరు స్వేచ్ఛగా ఓటు వేయాలన్నారు. లింగంపేటను సున్నిత ప్రాంతంగా గుర్తించినట్లు తెలిపారు. కవాతులో ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి, ఎస్సై దీపక్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. పిట్లం(జుక్కల్): తాను ఇచ్చిన హామీలు అమలు చెయ్యకపోతే రెండున్నర సంవత్సరాలలో రాజీనామా చేస్తానని.. ముందుగానే అంబేడ్కర్ విగ్రహానికి రాజీనామా లేఖను అందజేశారు స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి లోక మనోహర్. శుక్రవారం మండల కేంద్రంలో తన వర్గంతో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నీలకంటి లోక మనోహర్ మాట్లాడుతూ.. తాను 40 ఏళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నానని, ఓ పార్టీలో పనిచేస్తున్నా ఏనాడూ సముచిత స్థానం కల్పించలేదన్నారు. అందుకే స్వతంత్రంగా సర్పంచ్ బరిలో ఉన్నానని.. అవకాశం కల్పిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. గ్రామస్తులు ఒకసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని తనను సర్పంచ్గా గెలిపించాలని కోరారు. పెద్దకొడప్గల్(జుక్కల్): మండల కేంద్రంలో ఓ యువకుడు బస్సు అద్దాలను ధ్వంసం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా.. హైదరాబాద్ డిపో–2కు చెందిన బస్సు శుక్రవారం బిచ్కుంద నుంచి పెద్దకొడప్గల్ మీదుగా హైదరాబాద్కి బయలుదేరింది. మండలకేంద్రంలో ఓ యువకుడు బస్సెక్కి చిన్నకొడప్గల్కు టికెట్ ఇవ్వమని కండక్టర్ను కోరాడు. దీంతో కండక్టర్ చిన్నకొడప్గల్కు స్టాప్ లేదని చెప్పి, అతడిని బస్సు దిగమని సూచించాడు. సదరు యువకుడు బస్సు దిగి రాయితో బస్సు వెనక అద్దాలను ధ్వంసం చేశాడు. వెంటనే డ్రైవర్ బస్సు ఆపి, యువకుడిని వెంబడించి పట్టుకున్నారు. అతడిని పోలీసులకు అప్పగించి, ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న టిప్పర్ బస్సు ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. జంగంపల్లి శివారులోని జాతీయ రహదారిపై శుక్రవారం ఓ టిప్పర్ ఆగింది. ఈక్రమంలో మండల కేంద్రంలోని ఎంఎస్ఎన్ కంపెనీకి చెందిన బస్సు వెనుక నుంచి వచ్చి టిప్పర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ శ్రావన్కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే జీఎంఆర్ అంబులెన్స్లో డ్రైవర్ను చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. -
జుక్కల్ ఎమ్మెల్యేకు నిరసన సెగ
పెద్దకొడప్గల్: బేగంపూర్ తండా మీదుగా ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు బేగంపూర్ తండాలో ఆగకపోవడంతో తండావాసులు ఆగ్రహానికి గురయ్యారు. తిరుగు ప్రయాణంలో ఆయనను అడ్డుకుని నిరసన తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు శుక్రవారం బేగంపూర్ తండాకు ప్రచారానికి వస్తారని బేగంపూర్ సర్పంచ్ అభ్యర్థి తండావాసులకు సమాచారం ఇచ్చారు. దీంతో తమ తండా సమస్యలు చెప్పుకోవచ్చని తండావాసులు ఆశించారు. అయితే బేగంపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారం ముగించుకొని తండా మీదుగా కాస్లాబాద్ గ్రామానికి వెళ్తున్న సమయంలో తండాలో ఎమ్మెల్యే ఆగలేదు. దీంతో ఆగ్రహించిన తండావాసులు తిరుగు ప్రయాణంలో ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. మీ తండాలో ఎందుకు ఆగాలని ఎమ్మెల్యే దురుసుగా ప్రశ్నించడంతో పలువురు యువకులు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే తండాలోకి వెళ్లకుండానే అక్కడినుంచి వెళ్లిపోయారు. -
చిన్నమల్లారెడ్డిలో ఒకరి ఆత్మహత్య
కామారెడ్డి క్రైం: కామారెడ్డి మండలంలో ని చిన్నమల్లారెడ్డిలో ఓ వ్యక్తి ఆత్మహత్య కు యత్నించగా,ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై రంజిత్ తెలిపిన వివరాలు ఇలా.. రామాయంపేటకు చెందిన ఇబ్రహీం(35)కు బా న్సువాడకు చెందిన ఓ మహిళతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. దంపతుల మధ్య గొడవలు రావడంతో కొంతకాలంగా భార్య పిల్లలను తీసుకొని తల్లిగారింట్లో ఉంటోంది. దీంతో ఇబ్రహీం కొంతకాలంగా తన అ మ్మమ్మ గ్రామమైన చిన్న మల్లారెడ్డిలో ఉంటూ ప్రైవేటుగా మెకానిక్ పను లు చేస్తున్నాడు. భార్య కాపురానికి రావడం లేదని కొద్దిరోజులుగా అతడు మనస్థాపానికి గురవుతున్నాడు. శుక్రవారం ఉదయం అతడు జీవితంపై విరక్తి చెంది చిన్నమల్లారెడ్డిలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే స్థానికులు గుర్తించి, అతడిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ప్లీజ్ ఏడవద్దు.. మనం ఓడి గెలిచాం
● 335 మందికి నేను ప్రతినిధిని ● భిక్కనూరులో బోర్డు ఏర్పాటు చేసిన ఓడిన అభ్యర్థిభిక్కనూరు: ‘‘డబ్బులు ఇచ్చి ఓట్లు కొనడం మాకు నచ్చదు. భిక్కనూరు గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం, మార్పును తీసుకువద్దాం అనే ఉద్దేశంతో సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేశాను. 335 మంది నా అభిప్రాయాలను సమర్థించారు. నేను ఓడిపోయినందుకు మీరు ఎవరూ ఏడవద్దు’’ అంటూ భిక్కనూరుకు చెందిన పెద్దబచ్చగారి మైత్రేయి తనను పలకరించేందుకు వచ్చి కంటనీరు పెట్టుకుంటున్న మహిళలను ఓదారుస్తున్నారు. మనం ఓడి గెలిచామని, తన కుటుంబం భిక్కనూరులోనే నివసిస్తూ ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. ఈ విషయమై ఆమె తన ఇంటి ముందు బోర్డు ఏర్పాటు చేశారు. పోలింగ్కు రెండు రోజుల ముందు పలువురు ఓటర్లు మైత్రేయి ఇంటికి వెళ్లి తాము ఓట్లు వేయాలంటే డబ్బులు, మందు ఇవ్వాలని డిమాండ్ చేయగా ఆమె తిరస్కరించారు. ‘‘ఓట్లు కొనం.. పైసలు పంచం.. మందు తాగించం.. నిజాయితీగా ఆలోచించి ఓటు వేయండి’’ అంటూ ఇంటి ముందు బోర్డు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ తర్వాత తనకు ఓటేసిన వారిని ఓదార్చుతూ ఏర్పాటు చేసిన బోర్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
క్రైం కార్నర్
పర్మిట్ రూంలో ఒకరి మృతి నిజాంసాగర్(జుక్కల్): మండల కేంద్రంలోని భ్రమరాబ వైన్స్షాపు ఆవరణలోని పర్మిట్ రూంలో మద్యం సేవించిన మంగళి సాయిలు(40) అనే వ్యక్తి బుధవారం రాత్రి మెట్ల కిందపడి చనిపోయినట్లు స్థానిక ఎస్సై శివకుమార్ తెలిపారు. ఒడ్డేపల్లి గ్రామానికి చెందిన సాయిలు స్థానిక వైన్స్షాపులో మద్యం కొనుగోలు చేసి వైన్స్ వెనుకభాగంలో ఉన్న పర్మిట్ రూంలో సేవించాడు. మెట్లపై కూర్చున్న సాయిలు ఆకస్మికంగా కిందపడటంతో తీవ్ర రక్తస్రావమై అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి అన్న ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
రేపు నవోదయ ప్రవేశ పరీక్ష
ఖలీల్వాడి: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి ఈ నెల 13న పరీక్షను నిర్వహించనున్నటలు డీఈవో అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 5,124 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు 2,240 మంది, కామారెడ్డి జిల్లాకు చెందిన 2,884 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 11 గంటల లోపు చేరుకోవాలని, ఆ తర్వాత లోనికి అనుమతించబోమని తెలిపారు. ఉదయం 11.30 నుంచి 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు హాల్ టికెట్తోపాటుగా ఆధార్, రేషన్కార్డు తప్పనిసరిగా తీసుకొని రావాలని సూచించారు. సందేహాలుంటే నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ లేదా ఇంచార్జీ ప్రభాకర్ 97019 07749 నెంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. ఖలీల్వాడి: అంబేడ్కర్ దూర విద్య పరీక్ష ఫీజు ఈ నెల 27 వరకు చెల్లించాలని ప్రిన్సిపాల్ డాక్టర్ రాంమోహన్ రెడ్డి, కోఆర్డినేటర్ డాక్టర్ రంజిత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ ఒకటి, మూడు, ఐదో సెమిస్టర్ల ఫీజును చెల్లించాలని పేర్కొన్నారు. బీఎస్సీ, బీకాం కంప్యూటర్స్ విద్యార్థులు థియరీ పరీక్ష ఫీజుతోపాటు ప్రాక్టికల్స్ కోసం కూడా ఫీజు చెల్లించాలని సూచించారు. వివరాలకు 7382929612 నెంబర్లో సంప్రదించాలని తెలిపారు. ఎంబీఏ, బీఎల్ఐఎస్ఏ సెమిస్టర్– 2 విద్యార్థులు ఈ నెల 27లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. ● పోలింగ్ కేంద్రాలను సందర్శించిన నాగేశ్రెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బోధన్ డివిజన్లోని వివిధ మండలాల్లో గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాటిపల్లి నాగేశ్ రెడ్డి పర్యటించారు. రెంజల్, ఎడపల్లి మండలా ల్లోని వివిధ పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి పరిశీలించారు. నాగేశ్రెడ్డితోపాటు జిల్లా గ్రంథాల య సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మాజీ జె డ్పీటీసీ నాగభూషణ్రెడ్డి, పులి శ్రీనివాస్, యు వజన నాయకుడు వేణురాజ్, కౌశిక్, ఆయా మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు పాల్గొన్నారు. సుభాష్నగర్: రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీపై పరికరాలు, ఇతర ప్రోత్సాహకాలు అందిస్తున్నాయని జేఎంకేపీఎం రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు పాట్కూరి తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహానందిలో అరటి, పసుపు రైతుల ఉత్పత్తిదారుల సంఘాన్ని రైతులతోపాటు తిరుపతిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఎఫ్పీవో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు పండించిన పంటలు మార్కెటింగ్ అంశాలు, దిగుబడులు, పెట్టుబడి, ఆదాయ వ్యయాలపై తిరుపతిరెడ్డి వివరించారు. అనంతరం తిరుపతిరెడ్డిని ఎఫ్పీవో ప్రతినిధులు సన్మానించారు. -
స్థానికంలోనూ త్రిముఖమే
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జిల్లాలో రాజకీయ ముఖచిత్రం విడతలవారీగా మారుతూ వస్తోంది. గతంలో రెండు ప్రధాన పార్టీల మధ్య మాత్రమే ముఖ్యంగా పార్లమెంట్, అసెంబ్లీ, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నువ్వా నేనా అనేవిధంగా పోటాపోటీ ఉండేది. అయితే గత ఆరేడు సంవత్సరాల కాలంలో ముఖాముఖి పోటీ బదులు త్రిముఖ పోటీ నెలకొంటోంది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు కాంగ్రెస్–టీడీపీ, కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీల మధ్య పార్లమెంట్, శాసనసభ, పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో పోరు నడిచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక మాత్రం ఉమ్మడి ఇందూరు జిల్లాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో బీజేపీ ఢీకొడుతూ వస్తోంది. ఈ క్రమంలో బీజేపీ గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో (2019, 2024) వరుసగా విజయకేతనం ఎగురవేసింది. అయితే శాసనసభ, స్థానిక ఎన్నికల విషయానికి వస్తే పట్టణ ప్రాంతాల్లో మాత్రమే బీజేపీ ప్రభావం చూపుతూ వచ్చింది. ఇదిలా ఉండగా గత శాసనసభ ఎన్నికల్లో మాత్రం రాష్ట్రంలో ఎక్కడా లేనవిధంగా బీజేపీ ఉమ్మడి జిల్లాలో మూడు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్ నియోజకవర్గాలను గెలుచుకోవడంతో పాటు కామారెడ్డిలో అయితే ఏకంగా కేసీఆర్, రేవంత్రెడ్డిలనే బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఓడించడం గమనార్హం. ఇతర నియోజకవర్గాల్లోనూ పార్టీ గణనీయమైన స్థాయిలో ఓట్లు సాధించింది. మరోవైపు గత మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నిజామాబాద్ నగరపాలక సంస్థలో అతి పెద్ద పార్టీగా నిలిచింది. ఈసారి మేయర్ పీఠం దిశగా పావులు కదుపుతోంది. ఇతర మున్సిపాలిటీల్లోనూ సత్తా చాటేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. క్రితంసారి ఎన్నికల్లో జిల్లాలో అక్కడక్కడా జెడ్పీటీసీలు, ఎంపీపీలు గెలుచుకున్నప్పటికీ గ్రామ పంచాయతీల విషయంలో బీజేపీ నామమాత్రంగానే పోటీ ఇచ్చేది. అయితే గతంలో ఎన్నడూ లేనవిధంగా ప్రస్తుతం పంచాయతీ పోరులో బీజేపీ హోరాహోరీగా తలపడుతోంది. అధికార కాంగ్రెస్ పార్టీ తరువాత బీఆర్ఎస్తో సమానంగా జిల్లాలో బీజేపీ పంచాయతీల్లో పోటీ చేస్తోంది. మొదటి విడతలో ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో కీలక పంచాయతీలను బీజేపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. రెండు, మూడు విడతల్లోనూ చెప్పుకోదగిన స్థాయిలో పంచాయతీలను కై వసం చేసుకునేందుకు బీజేపీ శ్రేణులు పోరాడుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో స్థానిక ఎన్నికల్లో త్రిముఖ పోరు నడుస్తున్నట్లు స్పష్టమైంది. పంచాయతీ పోరులోనే త్రిముఖ పోరు ఉంటే రానున్న పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో హోరాహోరీ త్రిముఖ పోరు తప్పదని రాజకీయ, ఇతర వర్గాల్లో చర్చ నడుస్తోంది. పార్లమెంట్, అసెంబ్లీ మాదిరిగా పోటాపోటీ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థుల హోరాహోరీ రానున్న పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పదనే చర్చ -
రోడ్ల విస్తరణకు నిధులివ్వండి
● గడ్కరీని కోరిన ఎమ్మెల్యే కేవీఆర్ కామారెడ్డి టౌన్: కామారెడ్డి నియోజకవర్గంలో రింగ్రోడ్డు, రోడ్ల విస్తరణ కోసం నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. గురువారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి నిధుల కోసం వినతిపత్రం అందజేశారు. జిల్లా కేంద్రం చుట్టూ 54 కిలో మీటర్ల పొడవైన ఔటర్ రింగ్రోడ్డు ఏర్పాటు చేయాలని గడ్కరీని కోరానని ఆయన తెలిపారు. లింగాపూర్ స్జేజీ నుంచి మెడికల్ కళాశాల, మైనారిటీ రెసిడెన్షియల్ కళాశాల మీదుగా టేక్రియాల్ జాతీయ రహదారి వరకు నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ కోసం రూ. 40 కోట్లు ఇవ్వాలని కోరానన్నారు. భిక్కనూరు నుంచి తిప్పాపూర్, తలమడ్ల మీదుగా రాజంపేట వరకు డబుల్ రోడ్డు కోసం రూ. 18 కోట్లు, కామారెడ్డి పాత బస్టాండ్ నుంచి జాతీయ రహదారి వరకు రోడ్డు విస్తరణ కోసం రూ. 8 కోట్లు, పాల్వంచ మర్రి నుంచి మాందాపూర్ మీదుగా భిక్కనూరు వరకు డబుల్ రోడ్డు విస్తరణకు రూ. 24 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశానన్నారు.కామారెడ్డి అర్బన్: జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశం కోసం ఈనెల 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని డీఈవో రాజు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 2,884 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, వీరికోసం 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విద్యార్థులు హాల్టికెట్తో పాటు ఆధార్కార్డు లేదా రేషన్కార్డుతో గంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, ఏవైనా సందేహాలుంటే 97019 07749 నంబర్లో సంప్రదించాలని సూచించారు. నాగిరెడ్డిపేట: మాల్తుమ్మెద విత్తన్తోత్పత్తి క్షేత్రంలో చెడిపోయిన మోటారుకు మరమ్మతులతోపాటు నూతన బోర్ల తవ్వకానికి నిధుల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపామని జిల్లా వ్యవసాయాధికారి మోహన్రెడ్డి తెలిపారు. మాల్తుమ్మెద విత్తన క్షేత్రంలో నెలకొన్న సాగునీటి ఇబ్బందులపై ‘సాక్షి’ దినపత్రికలో గురువారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై జిల్లా వ్యవసాయ అధికారి స్పందించారు. ప్రభుత్వంనుంచి నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. కామారెడ్డి క్రైం: మొదటి విడత గ్రామ పంచాయితీ ఎన్నికల విధులకు రిపోర్ట్ చేయని 53 మందిపై కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. పీవోలు, ఏపీవోలుగా విధులు కేటాయించిన ప్రదేశాల్లో రిపోర్ట్ చేయనందుకు వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం తొలి విడత ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేలగా.. శుక్రవారంతో రెండో విడత ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడుతుంది. ఆ తర్వాత సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుంది. గాంధారి, లింగంపేట, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, మహ్మద్నగర్, నిజాంసాగర్, పిట్లం మండలాలలో రెండో విడతలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మండలాల పరిధిలో 197 పంచాయతీలకుగాను 43 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 1,654 వార్డులకుగాను 778 వార్డుల సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మిగిలిన స్థానాలలో పోటీ ఉంది. అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేస్తు న్నారు. పోలింగ్కు సమయం తక్కువగా ఉండడంతో గెలుపు కోసం అభ్యర్థులు చమటోడుస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లభ్యర్థిస్తూనే కుల సంఘాలు, మహిళా సంఘాలను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడనుంది. -
జిల్లా వ్యాప్తంగా ఎన్నికై న సర్పంచ్లు వీరే
తాడ్వాయి బ్రహ్మాజీవాడి డాకూరి అంజనీబాయి బీఆర్ఎస్ 6 బ్రాహ్మణపల్లి ఔరగోని పెద్దరాజాగౌడ్ బీజేపీ – చందాపూర్ జంగం మంగారెడ్డి బీఆర్ఎస్ 339 చిట్యాల గుండ్రెడి రంజిత్రెడ్డి బీఆర్ఎస్ – దేమికలాన్ కటికం భార్గవి బీఆర్ఎస్ 580 దేవాయిపల్లి కమ్మరి నరేష్ కాంగ్రెస్ 235 కాలోజీవాడి ఏలేటి చంద్రారెడ్డి బీఆర్ఎస్ 4 కన్కల్ మైలారం రవీందర్రెడ్డి బీఆర్ఎస్ – కరడ్పల్లి దెబ్బటి పుష్పలత బీఆర్ఎస్ 6 కృష్ణాజీవాడి శేర్బద్దం సుమలత బీజేపీ 680 నందివాడ సంకు పోచయ్య ఇండిపెండెంట్ 5 పల్లెగడ్డతండా జాదవ్ రేణుక బీఆర్ఎస్ – సంగోజీవాడి మహ్మద్ తాజొద్దీన్ బీఆర్ఎస్ 11 సంతాయిపేట్ లింగారెడ్డి భాస్కర్రెడ్డి కాంగ్రెస్ 138 సోమారం బల్లాన వినోద కాంగ్రెస్ 30 తాడ్వాయి మెట్టు విజయ బీఆర్ఎస్ 480 ఎండ్రియాల్ కొర్ని నర్సింలు బీఆర్ఎస్ 123 ఎర్రాపహాడ్ సొంటికే మల్లవ్వ బీజేపీ 59 భిక్కనూరు భిక్కనూరు – – అయ్యవారిపల్లి సత్యం కాంగ్రెస్ ఇసన్నపల్లి మేకల రాములు కాంగ్రెస్ మల్లుపల్లి మాల నారాయణ కాంగ్రెస్ అంతంపల్లి వలకొండ మంజుల కాంగ్రెస్ రామేశ్వర్పల్లి చేపూరి రాణి కాంగ్రెస్ భాగిర్తిపల్లి నర్సింలు కాంగ్రెస్ తిప్పాపూర్ కుంట లింగారెడ్డి కాంగ్రెస్ కాచాపూర్ జ్యోతి కాంగ్రెస్ బస్వాపూర్ తుడుం పద్మ కాంగ్రెస్ గుర్జకుంట సామ సంతోష్ రెడ్డి కాంగ్రెస్ జంగంపల్లి దేవరబోయిన శ్రీవాణి బీఆర్ఎస్ శ్రీసిద్దరామేశ్వరనగర్ జనగామ రాణి బీఆర్ఎస్ మోటాట్పల్లి గంధం భూదయ్య బీఆర్ఎస్ ర్యాగట్లపల్లి ఆకిటి భాగ్యమ్మ బీఆర్ఎస్ పెద్దమల్లారెడ్డి సాయ గౌడ్ బీఆర్ఎస్ లక్ష్మిదేవునిపల్లి లింబారెడ్డి బీజేపీ కంచర్ల గెల్లు అరుణ ఇండిపెండెంట్ -
జంగంపల్లిలో భారీ మెజారిటీ
● 1,561 ఓట్ల తేడాతో గెలుపు భిక్కనూరు: జంగంపల్లి సర్పంచ్గా దేవరబోయిన శ్రీ వాణి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ బీఆర్ఎస్ మద్దతుతో బరిలో దిగిన శ్రీవాణికి 2,162 ఓట్లు రాగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి మానసకు 601 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో శ్రీవాణి 1,561 ఓట్ల తేడాతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. గ్రామంలో ఇప్పటివరకు ఎవరూ ఇంత భారీ మెజారిటీతో గెలవలేదని గ్రామస్తులు తెలిపారు. భార్య సర్పంచ్, భర్త వార్డు సభ్యుడు.. జంగంపల్లి సర్పంచ్గా ఎన్నికై న శ్రీవాణి భర్త వాసుయాదవ్ ఏడో నంబర్ వార్డు నుంచి పోటీ చేశారు. ప్రత్యర్థి నరేశ్ మూర్తిపై 95 ఓట్లతో గెలుపొందారు. భార్యాభర్తలపై భార్యాభర్తల గెలుపు.. జంగంపల్లి సర్పంచ్ అభ్యర్థులుగా శ్రీవాణి, మానస పోటీపడగా.. శ్రీవాణి భర్త వాసుయాదవ్, మానస భ ర్త నరేశ్ మూర్తి ఏడోవార్డులో ప్రత్యర్థులుగా నిలిచారు. ఎన్నికలలో శ్రీవాణి వాసుయాదవ్ దంపతులు మా నస నరేశ్మూర్తి దంపతులపై పైచేయి సాధించారు.కామారెడ్డి క్రైం: కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. కార్యక్రమంలో డీపీవో మురళి, ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రం.. దోమకొండ: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ దోమకొండ ప్రభుత్వ బాలికల పాఠశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. సిబ్బందికి సూచనలి చ్చారు. పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు, ఎన్సీసీ సిబ్బంది, ఆశవర్కర్లతో మాట్లాడారు. ఆయన వెంట జిల్లా పరిషత్ సీఈవో చందర్, ఆర్డీవో వీణ, మండల ప్రత్యేకాధికారి జ్యోతి, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, తహసీల్దార్ సుధాకర్ తదితరులున్నారు. -
చలిలోనూ ఓటెత్తారు
● తొలి విడత పోలింగ్ ప్రశాంతం ● ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు ● 79.40 శాతం పోలింగ్ నమోదు ● కేంద్రాలను సందర్శించిన కలెక్టర్, ఎస్పీకామారెడ్డి డివిజన్ పరిధిలోని బీబీపేట, భిక్కనూరు, దోమకొండ, కామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, రాజంపేట, రామారెడ్డి, సదాశివనగర్, తాడ్వాయి మండలాల పరిధిలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 167 పంచాయతీలు ఉండగా.. 11 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 156 గ్రామాల సర్పంచ్ పదవులకు గురువారం ఎన్నికలు నిర్వహించారు. అలాగే 1,520 వార్డులకుగాను 433 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మూడు చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 1,084 వార్డులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 2,42,913 మంది ఓటర్లుండగా 1,92,870 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 79.40 గా నమోదయ్యింది. ఆయా మండలాల్లో పోలింగ్ను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, ఏఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్లు మధుమోహన్, విక్టర్ తదితరులు పరిశీలించారు. చలిని లెక్క చేయకుండా.. జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే ఓటేసేందుకు ఓటర్లు ఉదయమే తరలివచ్చి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. బీబీపేట మినహా అన్ని మండలాల్లో ఉదయం 9 గంటల వరకు దాదాపు 20 శాతం పోలింగ్ రికార్డయ్యింది. 11 గంటల వరకు అన్నిచోట్ల 50 శాతం ఓట్లు పోలయ్యాయి. ఓటేసేందుకు మహిళల ఆసక్తి... ఓటు వేయడానికి ఎప్పటిలాగే మహిళలు ఆసక్తి చూపారు. పది మండలాల్లో 1,27,375 మంది మహిళలు ఉండగా 1,04,228 మంది ఓటేశారు. 81.83 శాతం మహిళలు ఓటేసినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే పురుషులు 1,15,535 మంది ఉండగా 88,642 మంది ఓటు వేశారు. ఓటింగ్ శాతం 76.72 గా ఉంది. సరాసరిన మొత్తం 79.40 శాతం ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. మండలం 9 గంటలు 11 గంటలు 1 గంట భిక్కనూరు 21.11 52.78 81.05 బీబీపేట 7.36 49.09 83.65 దోమకొండ 19.14 51.19 76.82 కామారెడ్డి 23.68 56.45 78.45 మాచారెడ్డి 19.46 52.46 78.19 పాల్వంచ 20.49 55.89 81.09 రాజంపేట 21.02 58.02 80.05 రామారెడ్డి 22.61 50.84 75.26 సదాశివనగర్ 20.96 56.42 78.81 తాడ్వాయి 18.76 52.59 80.63 సరాసరి 19.70 53.31 79.40 -
సమర్థత కలిగిన నేతను ఎన్నుకోండి
● ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావ్ పిట్లం(జుక్కల్): పిట్లం భవిష్యత్తు పిట్లం గ్రామస్తుల చేతుల్లోనే ఉందని, ఉంగరం గుర్తుకు ఓటు వేసి సమర్థత కలిగిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్ధి కుమ్మరి శేఖర్ను గెలిపించాలని, ప్రతిపక్షాలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిస్తే గ్రామాలు అభివృద్ధికి దూరమవుతాయని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావ్ పేర్కొన్నారు. ఆయన గురువారం గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పిట్లం మండల కేంద్రంలో సర్పంచ్ అభ్యర్ధి కుమ్మరి శేఖర్, నాయకులతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ధి కావాలంటే అధికార పార్టీనే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. శేఖర్కు తన పూర్తి సహకారం ఉంటుందని పేర్కొన్నారు. ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తా నిజాంసాగర్(జుక్కల్): ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే, గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానని మహమ్మద్నగర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థి అందోల్ అశ్విని అన్నారు. గురువారం మహమ్మద్నగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ మద్దతు సర్పంచ్ అభ్యర్థి అశ్విని ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. పదేళ్లు అధికారంలో ఉన్న సర్పంచ్తో పాటు బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. నాయకులు మల్లయ్యగారి శివరాజ్, ఆకాష్, చింతకింది కాశయ్య, ఇఫ్తేకర్ దొర, తోట రాజు, సంగమేశ్వర్ తదితరులున్నారు. -
ఎన్నికల సామగ్రి సిద్ధం
దోమకొండ సంఘమేశ్వర్ లోయపల్లి శ్రీనివాస్రావు బీఆర్ఎస్ 599 ముత్యంపేట ఆశబోయిన అక్షర కాంగ్రెస్ 258 అంబారిపేట అరుట్ల కవిత ఇండిపెండెంట్ 360 అంచనూరు జనగామ నరేష్ బీఆర్ఎస్ 352 చింతమాన్పల్లి బక్కారం సిద్దరాములు బీఆర్ఎస్ 90 సీతారాంపల్లి వెన్నెల బానుశ్రీ బీఆర్ఎస్ 94 లింగుపల్లి పట్నం లక్ష్మి బీజేపీ 35 గొట్టిముక్కుల నత్తి సంజీవ్ కాంగ్రెస్ 153 దోమకొండ –– –– –– నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని గ్రామ పంచాయతీలకు రెండో విడతలో జరుగునున్న ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని గురువారం సిబ్బంది సిద్ధం చేశశారు. మండలంలో ఎన్నికలు జరగాల్సిన సర్పంచ్ స్థానాలతోపాటు వార్డు స్థానాలకు సంబంధించి అవసరమైన సామగ్రిని రిటర్నింగ్ అధికారులు వారి సిబ్బందితో సిద్ధం చేశారు. బ్యాలెట్ పేపర్స్, మార్క్డ్ ఓటర్ లిస్ట్లతోపాటు ఇతర సామగ్రిని వారు సిద్ధం చేసుకున్నారు. ఎన్నికల సామాగ్రిని సిద్ధం చేసుకోవడంతో సిబ్బందికి తలెత్తిన సందేహాలను ఎల్లారెడ్డి డీఎల్పీవో సురేందర్ నివృత్తి చేశారు. దీంతోపాటు వారికి ఆయన అవగాహాన కల్పించారు. -
సమన్వయంతో పనిచేయాలి
కామారెడ్డి క్రైం: ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, సమస్యలు లేకుండా సాగేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులు, ఎన్నికల సిబ్బందికి సూచించారు. జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి జెడ్పీ పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైన సామగ్రిని పోలింగ్ కేంద్రాల వారీగా వేరు చేసి సిద్ధంగా ఉంచాలని సూచించారు. బ్యాలెట్ పత్రాలను జాగ్రత్తగా ప్యాకింగ్ చేయాలన్నారు. పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటింగ్ నిర్వహణ ఏర్పాట్లను నిర్ధారణ చేసుకోవాలని సూచించారు. సిబ్బంది రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సిబ్బందికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏమైనా సమస్యలు, లోపాలు ఎదురైతే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ సందర్శన రాజంపేట: మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ/స్వీకరణ కేంద్రాన్ని బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించారు. ఎన్నికల నిర్వహణ, నియమాలపై అధికారులకు పలు సూచనలు అందించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి అపర్ణ, తహసీల్దార్ జానకి, ఎంపీవో ఇమాముద్దీన్, కార్యాలయ సిబ్బంది జనార్దన్రెడ్డి, నరే ష్, అనంత్, ప్రవీణ్ పాల్గొన్నారు. -
తొలిపోరుకు వేళాయె!
● 156 సర్పంచ్, 1,084 వార్డు స్థానాలకు ఎన్నికలు ● 1,457 పోలింగ్ బూత్ల ఏర్పాటు ● అభ్యర్థుల భవితవ్యం తేలేది నేడే...చిన్నమల్లారెడ్డి పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సామగ్రిని పరిశీలిస్తున్న సిబ్బందిజిల్లాలో తొలి విడతలో కామారెడ్డి, దోమకొండ, భిక్కనూరు, మాచారెడ్డి, పాల్వంచ, రాజంపేట, బీబీపేట, రామారెడ్డి, తాడ్వాయి, సదాశివనగర్ మండలాల్లోని 167 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందులో 11 పంచాయతీల్లో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే 1,520 వార్డుల్లో 433 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు వార్డులలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మిగిలిన 156 గ్రామాల్లో సర్పంచ్ పదవులకు 727 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. 1,084 వార్డులకు 3,048 మంది పోటీ పడుతున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 1,457 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. హోరాహోరీ పోటీ.. సర్పంచ్ పదవితో పాటు వార్డు స్థానాలకూ పోటీ హోరాహోరీగా సాగుతోంది. చిన్నచిన్న పంచాయతీల్లో సైతం సర్పంచ్ పదవికి ఐదు నుంచి పది మంది వరకు బరిలో నిలవడంతో తీవ్ర పోటీ నెలకొంది. అందరూ గెలుపు కోసం పోటాపోటీగా ఖర్చు చేశారు. కుల, యువజన సంఘాలను మచ్చిక చేసుకునేందుకు అనేక రకాల తాయిలాలు ప్రకటించారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్నవారు అడ్డగోలుగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. నిన్నమొన్నటి దాకా విస్త్రృత ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. పోలింగ్ కేంద్రాలకు చేరిన సిబ్బంది.. బ్యాలెట్ పద్ధతిన పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో పోలింగ్ సిబ్బందికి సామగ్రిని అందించగా.. వారు ప్రత్యేక వాహనాల్లో బుధవారమే కేంద్రాలకు చేరుకున్నారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల భవితవ్యం గురువారం సాయంత్రమే తేలనుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ పూర్తి చేసి, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. సర్పంచ్ స్థానంతో పాటు వార్డు సభ్యులకు వచ్చిన బ్యాలెట్ పత్రాలను వేరు చేసిన తర్వాత ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వస్తాయో లెక్కించి విజేతను ప్రకటిస్తారు.మొత్తం ఓటర్లు 2,48,668 పురుషులు 1,18,342 మహిళలు 1,30,322 ఇతరులు 04 పోలింగ్ కేంద్రాలు 1,457 పోలింగ్ అధికారులు (పీవో) 1,848 ఇతర పోలింగ్ అధికారులు (ఓపీవో) 2,501 తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామాలు 167 ఏకగ్రీవమైన పంచాయతీలు 11 పోలింగ్ జరిగే పంచాయతీలు 156 బరిలో ఉన్న అభ్యర్థులు 727 తొలి విడత ఎన్నికలు జరిగే వార్డులు 1,520 ఏకగ్రీవమైన వార్డులు 433 నామినేషన్లు దాఖలు కాని వార్డులు 03 పోలింగ్ జరుగుతున్న వార్డులు 1,084 బరిలో ఉన్న అభ్యర్థులు 3,048 -
ఆటో బోల్తా పడి విద్యార్థి మృతి
● ఐదుగురికి గాయాలునిజాంసాగర్: ఆటో బోల్తా పడిన ఘటనలో పదో తరగతి విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. జుక్కల్ మండలం విఠల్వాడి తండా, సావర్గావ్ గ్రామ విద్యార్థులు ఖండెబల్లూర్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. రోజులానే బుధవారం ఉదయం 15 మంది విద్యార్థులు ఆటోలో పాఠశాలకు బయలు దేరారు. సావర్గావ్ శివారులో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సావర్గావ్కు చెందిన పదో తరగతి విద్యార్థి కాంబ్లే ప్రణవ్ (17) అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ఐదుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను బాన్సువాడ, నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. డ్రైవర్ వినోద్ అతివేగంగా అజాగ్రత్తగా డ్రైవింగ్ చేయడం వల్లే ఆటో బోల్తాపడిందని స్థానికులు ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్నామని జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర తెలిపారు. విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు డీఈవో రాజుతోపాటు వైద్యులు, పోలీసులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. గాయపడినవారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. మరణించిన విద్యార్థి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి, వారిని ఓదార్చారు. -
18 గుర్తింపు కార్డుల్లో ఏదైనా సరే..
కామారెడ్డి క్రైం: ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటరు గుర్తింపు కార్డు ఒకటే ప్రధానం కాదని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. 18 రకాల కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించి ఓటు వేయవచ్చన్నారు. ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, హెల్త్ కార్డు, దివ్యాంగుల ధ్రువీకరణ పత్రం, పట్టదారు పాసుపుస్తకం, స్వాతంత్య్ర సమరయోధుల గుర్తింపు కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, ఫొటోతో కూడిన పోస్ట్ ఆఫీస్/బ్యాంక్ పాస్ బుక్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ తదితర ప్రభుత్వం జారీ చేసిన కార్డులలో దేనినైనా చూపించి ఓటు వేయవచ్చని తెలిపారు. ఓటరు స్లిప్ను ఆన్లైన్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. -
ప్రాణం తీసిన కంచె..
● విద్యుదాఘాతంతో రైతు మృతి నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నారుమడి రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె తగిలి రైతు మృతి చెందిన ఘటన నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లికలాన్లో బుధవారం చోటు చేసుకుంది. అల్లపురం లింగయ్య(59)అనే రైతు రోజూమాదిరిగానే ఉదయం గ్రామశివారులోని తన పొలంలో వరి నారుమడికి నీరు పెట్టేందుకు వెళ్లగా పందుల నుంచి రక్షణ కోసం ఏర్పాటు చేసిన కరెంట్ కంచెకు తగిలా డు. విద్యుత్ షాక్తో నారుమడి లో పడి ప్రాణాలు కోల్పోయా డు. మృతుడికి భార్య లస్మవ్వ, కొడుకు సురేశ్తోపాటు ముగ్గు రు కూతుళ్లు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇంచార్జి ఎస్హెచ్వో మనోహర్ తెలిపారు. -
ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
కామారెడ్డి క్రైం: పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలలో ప్రత్యేక బలగాలను మోహరించింది. ఐదంచెల భద్రత కల్పించింది. జిల్లాలో మూడు విడతల్లో కలిపి మొత్తం 532 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 609 లొకేషన్లలో 4,470 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 33 ప్రాంతాలు సమస్యాత్మకమైనవిగా, మరో 33 లొకేషన్లు సున్నితమైనవిగా గుర్తించారు. ఆయా ప్రాంతాలలో మొత్తం 780 పోలింగ్ కేంద్రాలున్నాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో వివాదాలు, దాడులు, కేసుల వరకు వెళ్లిన ఘర్షణలు లాంటివి ఉంటే వాటిని సమస్మాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తిస్తారు. చిన్నచిన్న వివాదాలు జరిగిన వాటిని సున్నితమైనవిగా పరిగణిస్తారు. ఇలా మొదటి విడత ఎన్నికల్లో 14, రెండో విడతలో 9, మూడో విడతలో 10 సమస్మాత్మక పోలింగ్ కేంద్రాలు, అలాగే మొదటి విడతలో 14, రెండో విడతలో 10, మూడో విడతలో 9 సున్నితమైన కేంద్రాలున్నట్లు గుర్తించారు. సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఐదంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడత ఎన్నికల కోసం 54 రూట్ మొబైల్, 10 స్ట్రైకింగ్, 3 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లను నియమించారు. రెండో విడత కోసం 36 రూట్ మొబైల్, 7 స్ట్రైకింగ్, 3 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లను, మూడో విడత కోసం 37 రూట్ మొబైల్, 8 స్ట్రైకింగ్, 3 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఎస్పీ, ఏఎస్పీల ఆధ్వర్యంలో ప్రత్యేక రిజర్వ్డ్ బలగాలతో కూడిన బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా ఒక్కో విడతలో 800 మంది పోలీసు సిబ్బంది, అన్ని స్థాయిల్లోని పోలీసు అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. సూక్ష్మ పరిశీలకులు, సీసీ కెమెరాలతో నిఘా.. సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలకు అదనపు బలగాలు, సిబ్బందిని కేటాయించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు సూక్ష్మపరిశీలకులను నియమించారు. ఎన్నికల సిబ్బందితో పాటు ఒక ఎస్సై స్థాయి అధికారితో పాటు పోలీసు సిబ్బంది, అదనపు బలగాలు విధుల్లో ఉంటాయి. సున్నితమైన కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మొత్తం ప్రక్రియను వెబ్కాస్టింగ్ చేయనున్నారు. పోలింగ్ కేంద్రాల నుంచి 100 మీటర్ల దూరం వరకు 163 బీఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉండనుంది. అన్ని విడతల్లో ఆయా మండలాల పరిధిలో ఎన్నికల పోలింగ్, ఫలితాల ప్రకటన పూర్తయ్యే వరకు నిశ్శబ్ద కాలం, డ్రై డే లాంటివి అమలులో ఉంటాయి. ప్రలోభాలకు గురి చేయడం నేరమని, ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరుతున్నారు.ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నాం. సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరిస్తున్నాం. సీసీ కెమెరాలు, ప్రత్యేక పోలీసు బృందాలతో ఐదంచెల భద్రతా ఏర్పాట్లు చేశాం. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలి. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, వదంతులు వ్యాప్తి చేసేవారిపై ప్రత్యేక నిఘా ఉంది. గొడవలకు దిగడం, ప్రలోభాలకు గురి చేయడం చేస్తే కేసులు నమోదు చేస్తాం. – రాజేశ్ చంద్ర, ఎస్పీ, కామారెడ్డి కామారెడ్డి రూరల్: పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూసేందుకు విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ రాజేశ్ చంద్ర పేర్కొన్నారు. సున్నితమైన, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు సిబ్బంది నియమించామని, అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. బుధవారం ఆయన కామారెడ్డి, రాజంపేట మండలాల్లోని పోలింగ్ బూతులను పరిశీలించారు. చిన్నమల్లారెడ్డి, రాజంపేట పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడ విధుల్లో ఉన్న సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బందితో మాట్లాడి ఏర్పాట్లపై సూచనలు ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద అనుచిత కార్యకలాపాలు, గుంపులుగా తిరగడం, బెదిరింపులు లేదా ప్రలోభాలకు ఎట్టి పరిస్థితిలోనూ తావు లేకుండా చూడాలన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో కామారెడ్డి అసిస్టెంట్ ఎస్పీ చైతన్యరెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు, ఎస్సైలు ఉన్నారు. జిల్లాలో 33 సమస్యాత్మక ప్రాంతాలు సున్నితమైనవి మరో 33.. ఆయా చోట్ల 780 పోలింగ్ కేంద్రాలు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఐదంచెల భద్రత గొడవలకు దిగితే కేసులు తప్పవంటున్న పోలీసులు -
నారుమడిపై చలి ప్రభావం
● జాగ్రత్తలు పాటించాలంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు రుద్రూర్: జిల్లాలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో పంటలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పలు సూచనలను రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రమ్య రాథోడ్ రైతులకు వివరించారు. చలి తీవ్రత ఎ క్కువగా ఉంటే నారు సరిగ్గా ఎదగక, ఎర్రబడి కొ న్నిసార్లు చనిపోతుందని అన్నారు. యాసంగిలో వరి సాగు చేసే రైతులు నారుమడి యాజమాన్యంపై ప్ర త్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వరి మొలకెత్తటానికి 25–45 డిగ్రీల సెల్సియస్, మొక్కల ఎదుగుదలకు 25–35 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండడం మంచిదని, కానీ జిల్లాల్లో వారం రోజుల నుంచి 4–5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు అవుతోంది. దీంతో భూమిలోని పోషకాలు మొక్కకు అందక ఆకులు పసుపు రంగు మారి ఆ తర్వాత ఎండిపోతాయన్నారు. రాత్రి ఉష్ణోగ్రతల్లో వరినారు ఎదగదని, ఈ పరిస్థితుల్లో రైతులు చేస్తున్న పలు రకాల మందుల పిచికారీలతో ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. నారు ఎర్రబడటం, తెగుళ్లు ఆశించడం కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని, రాత్రి ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరిగితే మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని పేర్కొన్నారు. నారుమడి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రివేళల్లో నారుమడిపై టార్పాలిన్, పాలిథిన్ షీట్ లేదా సంచులతో కుట్టిన పట్టాలను కప్పి ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలి. దీంతో చలి ప్రభావం తక్కువగా ఉండి నారు త్వరగా పెరుగుతుంది. ● చలికి నారు దెబ్బతినకుండా నారుమడికి సాయంత్రం నీటిని ఎక్కువగా పెట్టి మరుసటి రోజు ఉదయాన్నే చల్లటి నీటిని తీసేసి మళ్లీ కొత్తనీరు పెట్టాలి. ● అధిక చలితో జింక్ లోప లక్షణాలు కనిపిస్తే లీటరు నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి నారుమడిలో పిచికారీ చేయాలి. ● వరి నారుమడికి పది గ్రాముల 19:19:19 పోష కాన్ని, 2.5గ్రాముల కార్బెండజిమ్, మ్యాంకోజ బ్ మిశ్రమాన్ని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్త సూచించారు. -
అభ్యర్థి ఎవరైనా.. ప్రచారకర్తలు వారే..!
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): గ్రామపంచాయతీలకు జరుగుతున్న ఎన్నికల కారణంగా కొన్ని గ్రామాల్లో దినసరి కూలీలకు రోజువారీగా లభిస్తున్న ఉపాధితో కొంత ఊరట కలుగుతుంది. గ్రామంలో అభ్యర్థులెవరూ ప్రచారానికి వెళ్లినా వెంట వచ్చేందుకు ముందుగానే కూలీలను మాట్లాడుకుంటున్నారు. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభ్యర్థులు కూలీలను వెంట తిప్పుకొని ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వెంటవచ్చినందుకు కూలీలకు టిఫిన్ చేయించి, టీ తాగించడంతోపాటు కొంత నగదును ముట్టజెప్పుతున్నారు. గ్రామాల్లో ఏ అభ్యర్థి ప్రచారం చేసిన వారే ఉండడం విశేషం. కానీ ఒక రోజు ఒక అభ్యర్థి వెంట వచ్చిన కూలీలే మరుసటిరోజు మరో అభ్యర్థి వెంట రావడం చూసి గ్రామాల్లో ఓటర్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఏదేమైనా ఎన్నికల పుణ్యమా అని నిరుపేద కూలీలకు కొంత ఉపాధి కలుగుతుంది. గెలుపు ధీమాలో అభ్యర్థులు సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంతోపాటు 22 గ్రామ పంచాయతీల పరిధిలో గురువారం ఎన్నికలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో తమను అభివృద్ధి పథకాలు గెలిపిస్తాయని అధికార పార్టీ మద్ధతుదారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ తామంటే తామే గెలుస్తామని బీఆర్ఎస్, బీజేపీలు బలపరచిన అభ్యర్థులు ధీమాలో ఉన్నారు. ఒకరికంటే ఒకరు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఓటర్ల వద్దకు వచ్చి మద్యం, డబ్బులను పంపిణీ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అన్ని పార్టీల నాయకులు కుల సంఘాలతో చర్చలు జరుపుతున్నారు. -
సర్పంచ్ అభ్యర్థి ఇంట్లో అగ్నిప్రమాదం
● గ్యాస్ సిలిండర్ పేలి గుడిసె దగ్ధం ● చద్మల్ గ్రామంలో ఘటన గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని చద్మల్ గ్రామంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. గ్రామస్తులు, గిర్దావర్ ప్రదీప్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మరాఠీ బాలయ్య, ఆయన కూతురు రోజా ఒకే గుడిసెలో నివాసుముంటున్నారు. బుధవారం మధ్యాహ్నం వారు పనినిమిత్తం గాంధారికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో వంట గ్యాస్ సిలిండర్ పేలి గుడిసెకు మంటలు అంటుకున్నాయి. గ్రామస్తులు గమనించేలోపే పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. ఇంట్లో ఉన్న వంట సామగ్రి కాలిబూడిదయ్యాయి. గిర్దావర్ ప్రదీప్ బాధితుల వివరాలు సేకరించారు. కాగా, చద్మల్ సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో రోజా పోటీలో ఉన్నారు. ఎన్నికల ఖర్చుల కోసం తెచ్చి పెట్టిన నగదు కాలిబూడిదైనట్లు బాధితులు తెలిపారని ఆర్ఐ తెలిపారు. -
పోలింగ్ ప్రక్రియను సాఫీగా నిర్వహించాలి
దోమకొండ/భిక్కనూరు: ఎన్నికల సిబ్బంది పోలింగ్ ప్రక్రియను సాఫీగా నిర్వహించాలని ఎన్నికల సంఘం రాష్ట్ర పరిశీలకుడు సత్యనారాయణరెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికలు తొలివిడతలో భాగంగా నేడు పది మండలాల్లో పోలీంగ్, కౌంటింగ్ జరుగనుంది. ఈక్రమంలో దోమకొండ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎన్నికల విధులకు హాజరైన అధికారులతో ఆయన మాట్లాడారు. ప్రిసైడింగ్ అధికారులు మొత్తం పోలింగ్ ప్రక్రియను సమగ్రంగా పర్యవేక్షించి, ఎటువంటి లోపాలు లేకుండా చూసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి అధికారి ఖచ్చితంగా పాటించాలన్నారు. నేడు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటింగ్ ఉంటుందని, అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగనుందని తెలిపారు. ఓటింగ్ విషయంలో గోప్యత పకడ్బందీగా అమలు జరిగేలా చూడాలన్నారు. పోలింగ్ శాతం, ఓట్ల లెక్కింపు వివరాల ప్రకటనలో అప్రమత్తంగా ఉంటూ పక్కాగా నిర్ధారణ చేసుకున్న తరువాతనే ఓటింగ్ శాతాన్ని, కౌంటింగ్ వివరాలను వెల్లడించాలని సూచించారు. అలాగే భిక్కనూరులోనూ సత్యనారాణరెడ్డి పర్యటించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. దోమకొండ మండలంలో 9 గ్రామ పంచాయతీల పరిధిలో జరుగనున్న ఎన్నికలకు పూర్తిస్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేశారు. అదనపు కలెక్టర్ విక్టర్, మండల ప్రత్యేకాధికారి జ్యోతి, ఎంపీడీవో ప్రవీన్కుమార్, తహశీల్దార్ సుధాకర్, మండల అధికారులు పాల్గొన్నారు. గ్రామాలకు తరలిన పోలింగ్ సిబ్బంది.. రామారెడ్డి/బీబీపేట/కామారెడ్డి రూరల్/సదాశివనగర్/మాచారెడ్డి/తాడ్వాయి: రామారెడ్డి మండల వ్యాప్తంగా 18 సర్పంచ్ స్థానాలకు, 166 వార్డు స్థానాలకు నేడు పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తిచేసినట్లు ఎంపీడీవో నాగేశ్వరరావు తెలిపారు. పోలింగ్ సిబ్బంది పోలింగ్ సామగ్రితో బుధవారం సాయంత్రం వరకే ఆయా గ్రామాలకు చేరుకున్నారన్నారు. బీబీపేట మండలంలోని 11 గ్రామ పంచాయతీలకు నేడు జరుగనున్న పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. సదాశివనగర్ మండలంలోని 24 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో రెండు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా గురువారం 22 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నట్లు ఎంపీడీవో సంతోష్కుమార్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. తాడ్వాయి మండలంలో పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎంపీడీవో సయ్యద్ సాజీద్అలీ, తహసీల్దార్ రహిమొద్దీన్ తెలిపారు. మండలంలో 18 గ్రామాలకు గాను 168 పోలింగ్బూత్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మాచారెడ్డి మండలంలో జీపీ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు వేణుగోపాల్రావు, అశోక్ కుమార్ అన్నారు. అలాగే ఆయా మండల కేంద్రాల్లో బుధవారం పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ చేసి, వారికి కేటాయించిన గ్రామాలకు తరలించారు. కామారెడ్డి మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు నేడు పోలింగ్ జరుగనుండగా, ఆయా గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది సామగ్రితో చేరుకున్నారు. అధికారులు ఎన్నికల విధుల్లో అలసత్వం వహించొద్దు రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సత్యనారాయణరెడ్డి తొలివిడతకు అన్ని ఏర్పాట్లు పూర్తి -
కోనాపూర్ సర్పంచ్ బరిలో 10 మంది అభ్యర్థులు
కమ్మర్పల్లి: కమ్మర్పల్లి మండలం కోనాపూర్ సర్పంచ్ ఎన్నికల బరిలో 10 మంది అభ్యర్థులు నిలిచారు. మూడో విడతలో జరగనున్న ఈ ఎన్నికల్లో సర్పంచ్ రిజర్వేషన్ జనరల్(అన్ రిజర్వుడ్)కు కేటాయించారు. గ్రామంలో 1,419 మంది ఓటర్లు ఉండగా, 10 వార్డులు ఉన్నా యి. ఇప్పటికే 4 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్ స్థానానికి పోటీచేస్తున్న వారిలో ఒకరు కాంగ్రెస్, మరొకరు బీఆర్ఎస్ మద్దతుదారులు ఉన్నారు. మిగతా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. సర్పంచ్ స్థానానికి 10 మంది అభ్యర్థులు పోటీ పడుతుండడంతో ఎన్నికలు ఆసక్తిగా మారాయి. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ వర్సిటీ పరిధిలో డిగ్రీ రెగ్యులర్, బ్యాక్లాగ్ పరీక్షలు బుధవారం ముగిసినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 11 పరీక్ష కేంద్రాలలో మధ్యాహ్నం జరిగిన 4వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షకు 83 మంది విద్యార్థులకు 72 మంది విద్యార్థులు హాజరుకాగా 11 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. డిగ్రీ పరీక్షలు ముగిసేంత వరకు మొత్తం 20 మంది విద్యార్థులు డిబార్కు గురైనట్లు తెలిపారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని పీజీ 3వ సెమిస్టర్ (థియరీ, ప్రాక్టికల్), ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులు (ఏపీఈ, ఐపీసీహెచ్, ఐఎంబీఏ) 3వ, 9వ సెమిస్టర్ పరీక్షల ఫీజు ఈ నెల 24 వరకు చెల్లించాలని కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ మొదటి సెమిస్టర్, ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సు (ఏపీఈ) అన్ని సబ్జెక్టుల కలిపి పరీక్ష ఫీజు రూ.500, ప్రాసెసింగ్ ఫీజు రూ.100 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ పీజీ ఐపీసీహెచ్ అన్ని సబ్జెక్టులు కలిపి పరీక్ష ఫీజు రూ.600, ప్రాసెసింగ్ ఫీజు రూ.100 చెల్లించాలన్నారు. పీజీ (ఎంఏ, ఎమ్మెస్డబ్ల్యూ, ఎంకాం) అన్ని సబ్జెక్టులు కలిపి రూ.500, ఇంటిగ్రేటెడ్ పీజీ ఏపీఈ, ఐఎంబీఎ అన్ని సబ్జెక్టులు కలిపి రూ.800 చెల్లించాలని తెలిపారు. రూ.100 అపరాధ రుసుముతో ఈ నెల 30 వరకు పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు తెలంగాణ యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించాలన్నారు. వేల్పూర్: అంక్సాపూర్ సంతమల్లన్నను సీపీ సాయిచైతన్య బుధవారం దర్శించుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన సంతమల్లన్న జాతర బుధవారం వరకు జరిగింది. సంతమల్లన్నను దర్శించుకున్న సీపీ సాయిచైతన్యకు అంక్సాపూర్ వీడీసీ సభ్యులు, పూజారులు ఘనంగా స్వాగతం పలికి, శాలువాతో సన్మానించారు. అనంతరం సీపీ దత్తాశ్రమంలోని పాదరసలింగం శివాలయాన్ని దర్శించుకొని పూజలు చేశారు. ఆయన వెంట వేల్పూర్ ఎస్సై సంజీవ్, పోలీసు సిబ్బంది ఉన్నారు. -
లారీ బోల్తా
ఇందల్వాయి: లారీ టైరు పేలడంతో అదుపుతప్పి బోల్తా పడిన ఘటన ఇందల్వాయి మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలుగడ్డల లోడ్తో హర్యానా నుంచి హైదరాబాద్ వెళుతున్న లారీ 44 నెంబర్ జాతీయ రహదారిపై ఇందల్వాయి బస్టాండ్ వద్దకు రాగానే టైరు పంచర్ అయ్యింది. సర్వీస్ రోడ్డుపై లారీ బోల్తా పడటంతో డీజిల్ ట్యాంకులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా, క్లీనర్కి స్వల్ప గాయాలైనట్లు తెలిపారు. గన్నారం అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. క్షతగాత్రులను అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. -
విత్తన క్షేత్రంలో సాగునీటి తిప్పలు
నాగిరెడ్డిపేట: మాల్తుమ్మెద విత్తనోత్పత్తి క్షేత్రాన్ని సమస్యలు వీడడం లేదు. సాగునీటి ఇబ్బందులతో పంటల సాగు ముందుకు సాగడం లేదు. వందల ఎకరాల భూమి ఉన్న విత్తనక్షేత్రంలో పంటల సాగుకు పోచారం ప్రాజెక్టు నీరే ప్రధాన ఆధారం. ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా విత్తన క్షేత్రంలోని బావిలోకి చేరిన నీటిని ఎత్తిపోసేందుకు సుమారు నాలుగు దశాబ్దాల క్రితం రెండు 30 హెచ్పీ మోటార్లను ఏర్పాటు చేశారు. ఇవి నీటిని ఎత్తిపోస్తూ సాగుభూములకు నీరందిస్తున్నాయి. ఇందులో ఒక మోటారు ఐదేళ్లుగా మొరాయిస్తోంది. దీంతో పంటలకు నీటిని అందించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో విత్తన క్షేత్రంలో పంటల సాగును తగ్గిస్తూ వస్తున్నారు. పంటల సాగుకు నోచుకోక విత్తన క్షేత్ర భూములు బీళ్లుగా ఉన్న సందర్భాలూ ఉన్నాయి. హైదరాబాద్లోనే మరమ్మతులు.. 30 హెచ్పీ మోటారుకు మరమ్మతులు చేయించేందుకు క్షేత్ర అధికారులు తిప్పలు పడుతున్నారు. ఈ మోటారుకు హైదరాబాద్లోనే మరమ్మతులు చేసే అవకాశం ఉండడంతో గతంలో పలుమార్లు వారు దానిని అక్కడికి తీసుకెళ్లి మరమ్మతులు చేయించారు. కానీ గతంలో మరమ్మతులు చేయించిన మోటారు ప్రస్తుతం పూర్తిగా చెడిపోయింది. నలభై ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పైపులైన్ సైతం దెబ్బతింది. 30 హెచ్పీ మోటార్తోపాటు పైపులైన్ మరమ్మతుల కోసం ఇటీవల అధికారులు రూ.15 లక్షల అంచనాతో ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. తడిసి మోపైడెన కరెంట్ బిల్లు.. మాల్తుమ్మెద విత్తన క్షేత్రానికి సంబంధించిన కరెంట్ బిల్లు కొంతకాలంగా భారీగా వస్తోంది. గతంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా విత్తన క్షేత్రంలో త్రీఫేజ్ కరెంట్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. కాగా 30 హెచ్పీ సామర్థ్యంతో కూడిన మోటార్లను వినియోగించడం వల్ల విత్తన క్షేత్రానికి ఉచిత విద్యుత్ వర్తించడం లేదు. క్షేత్రంలో కరెంట్ను వినియోగించినా, వినియోగించకపోయినా త్రీఫేజ్కు సంబంధించి ప్రతినెలా కరెంట్ బిల్లు వస్తోందని క్షేత్రఅధికారులు చెబుతున్నారు. బకాయిలు రూ.44లక్షలకు చేరాయని పేర్కొంటున్నారు. విత్తన క్షేత్రంలో 10 బోర్లను తవ్వించేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. దీంతో ఇటీవల భూగర్భజల శాఖ అధికారులు విత్తన క్షేత్రంలో పర్యటించి బోర్ల తవ్వకం కోసం స్థలాలను గుర్తించారు. ఉన్నతాధికారులు నిధులు మంజూరు చేసిన వెంటనే బోర్లను తవ్విస్తామని అధికారులు చెబుతున్నారు. కొత్త బోర్లలో 5 హెచ్పీ నుంచి 7.5 హెచ్పీ సామర్థ్యం కలిగిన మోటార్లు ఏర్పాటు చేసి పంటలను సాగుచేయాలని అధికారులు భావిస్తున్నారు. తక్కువ సామర్థ్యం ఉన్న మోటార్ల వినియోగించి ఉచిత విద్యుత్ పథకాన్ని విత్తన క్షేత్రానికి వర్తింపజేసేలా సంబంధిత అధికారులకు ప్రతిపాదనలు పంపనున్నారు.విత్తన క్షేత్రంలో చాలాకాలం క్రితం ఏర్పాటు చేసిన మోటార్లలో ఒకటి చెడిపోయింది. మరమ్మతులతోపాటు పైపులైన్ సరిచేయించేందుకు అవసరమైన నిధుల కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. దీంతోపాటు నూతన బోర్ల తవ్వకం కోసం సైతం ప్రతిపాదనలు పంపాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం. – ఇంద్రసేన్, ఏడీఏ, మాల్తుమ్మెద విత్తనోత్పత్తిక్షేత్రం చెడిపోయిన 30 హెచ్పీ మోటారు ప్రతిపాదనలకే పరిమితమైన మరమ్మతులు క్షేత్రంలో ఏటేటా తగ్గుతున్న పంటలసాగు విస్తీర్ణం -
రైల్వే మంత్రిని కలిసిన ఎమ్మెల్యే కేవీఆర్
కామారెడ్డి టౌన్: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బుధవారం ఢిల్లీలో కలిశారు. జిల్లా కేంద్రంలో రైల్వే బ్రిడ్జి, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని వినతిపత్రం అందించారు. పట్టణంలో ట్రాఫిక్ రద్దీ తీవ్రమైనందున బ్రిడ్జీల నిర్మాణాలకు సహకరించాలని కోరానని ఎమ్మెల్యే తెలిపారు. స్నేహపురి కాలనీ నుంచి కలెక్టర్ ఆఫీస్ రోడ్ వరకు, వికాస్ నగర్ కాలనీ నుంచి ఇస్లాంపురా వరకు, పాత రాజంపేట రైల్వే గేట్ వద్ద, ప్రియ టాకీస్ రోడ్డు నుంచి ఇందిరా చౌక్ వరకు, రోడ్ ఓవర్ బిడ్జ్రి(ఆర్వోబీ)ల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశానన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.కామారెడ్డి అర్బన్: విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి బీసీ, ఇతర విద్యార్థులకు అవసరమైన శిక్షణ ఇవ్వనున్నట్లు నిజామాబాద్ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ వెంకన్న ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ స్కాలర్షిప్లు పొందడానికి వీలుగా అవగాహన, శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల వారు ఈనెల 21వ తేదీ వరకు టీజీ బీసీ స్టడీ సర్కిల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఇతర వివరాలకు 08462–241055 నంబర్లో సంప్రదించాలని సూచించారు. పెద్దకొడప్గల్: జొన్న పంటను మొగి పురుగు ఆశించడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. మండలంలో 9,600ల ఎకరాలలో జొన్న పంట సాగవుతోంది. పంట మొలక దశ నుంచి మొగి పురుగు, పచ్చ పురుగు బెడద ఎక్కువగా ఉందని రైతులు తెలిపారు. పురుగుల నివారణకు మందులు పిచికారి చేస్తున్నా ఫలితం ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పంటలను పరిశీలించి నివారణ చర్యలు సూచించాలని కోరుతున్నారు. కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు ఎం.ఉదయ్కిరణ్, అబ్దుల్ సమీర్ తెలంగాణ విశ్వవిద్యాలయం వాలీబాల్ క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ చూపి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 12 నుంచి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో నిర్వహించే జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల్లో వీరు రాష్ట్ర జట్టు తరఫున పాల్గొంటారని కళాశాల ఇన్చార్జి పీడీ జి.శ్రీనివాస్రావు తెలిపారు. ఉదయ్కిరణ్, అబ్దుల్ సమీర్లను ప్రిన్సిపల్ విజయ్కుమార్, వైస్ ప్రిన్సిపల్ కిష్టయ్య, అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంటర్నల్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. రిజిస్ట్రార్ ఎం యాదగిరితో కలిసి వర్సిటీ వైస్చాన్స్లర్ టి యాదగిరిరావు ఎగ్జామినేషన్ సెంటర్ను తనిఖీ చేశారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతికి సూచించారు. అనంతరం ఇంజినీరింగ్ విద్యార్థులతో కలిసి వీసీ, రిజిస్ట్రార్లు గ్రూప్ ఫొటో దిగారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి కే సంపత్ కుమార్, అధ్యాపకులు నందిని, అతిక్ సుల్తాన్ ఘోరీ, భ్రమరాంబిక, నీలిమ, పార్ట్ టైం లెక్చరర్లు వినాయక్, సంతోష్రెడ్డి, గణేశ్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. -
మద్యం పట్టివేత
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని గోపాల్పేటలో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను ఫ్లయింగ్ స్క్వాడ్ టీం (ఎఫ్ఎస్టీ) అధికారులు బుధవారం పట్టుకున్నట్లు ఇంచార్జీ ఎస్హెచ్వో మనోహర్రావు తెలిపారు. లింగంపేట మండలం శెట్పల్లి సంగారెడ్డి గ్రామానికి గుర్జరి సాయిబాబా కారులో 96 బీరుబాటిళ్లను తరలిస్తుండగా ఎఫ్ఎస్టీ అధికారులు పట్టుకున్నారని తెలిపారు. పట్టుబడ్డ బీరుబాటిళ్ల విలువ రూ.12,480 ఉంటుందని వివరించారు. ఎఫ్ఎస్టీ ఇంచార్జీ ప్రదీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. లింగంపేట మండలంలో.. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని అయ్యపల్లి శివారులో అక్రమంగా తరలిస్తున్న మధ్యం బాటిళ్లను బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై దీపక్కుమార్ తెలిపారు. వివరాలు ఇలా.. అయ్యపల్లి గ్రామ శివారులో ఇద్దరు వ్యక్తులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మద్యం తరలిస్తుండగా ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారులు అడ్డగించి పట్టుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ సుమారు రూ. 18వేలు ఉంటుందన్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను లింగంపేట పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. భిక్కనూరు మండలంలో.. భిక్కనూరు: మండల కేంద్రంలో ఓటర్లకు డబ్బులు, మద్యం బాటిళ్లను పంచుతున్న సమయంలో రెడ్హ్యాండెడ్గా పట్టుకొని కేసులు నమోదు చేసినట్ల భిక్కనూరు ఎస్సై అంజనేయులు బుధవారం తెలిపారు. మండల కేంద్రంలోని సుభాష్గల్లిలో డబ్బులు పంచుతున్నారన్న సమాచారం మేరకు దాడి చేయగా రూ.39వేల నగదు పట్టుబడిందన్నారు. అలాగే జండాగల్లి ప్రాంతంలో 55 మద్యం బాటిళ్లు, కుమ్మరిగల్లిలో 11 మద్యం బాటిళ్లను స్వా ధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. -
విద్యాదానం గొప్పది
బోధన్టౌన్(బోధన్): అన్నిదానాల కంటే విద్యాదా నం గొప్పదని, విద్యార్థులు ప్రధానంగా తల్లిదండ్రు లు, గురువులను దైవంతోపాటు పూజించాలని బ్ర హ్మశ్రీ వేదమూర్తులు, పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ఉద్బోధించారు. పట్టణంలోని ఆజాంగంజ్ వి జయసాయి ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో విద్యాధనం, సర్వధనం, ప్రధానం అనే అంశాలపై బుధ వా రం ఏర్పాటు చేసిన ప్రవచన కార్యక్రమానికి ఆ య న ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. పి ల్లల పట్ల తల్లిదండ్రులు ప్రత్యేకమైన పరిరక్షణతోపా టు బాధ్యతగా ఉండాలని, వారి దైనందిన కార్యక్రమా ల్లో వెన్నంటి ఉండి భాగస్వాములు కా వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పిల్లలను ఒంటరిగా ఉండన్విరాదని సూచించారు. తల్లిందడ్రులు చేసే ప్రతి పని వారిపై ప్రభావం పడుతుందని,పిల్లలు భ విష్యత్తులో వాటిని అనుసరించే అవకాశం ఉందని పేర్కొన్నారు. గురువులు విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉండేలా బోధన సాగించాలన్నారు. అంతకుముందు పలువురు విద్యార్థుల భరతనాట్యం, కూచిపుడి నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం కృష్ణమోహన్, మేనేజర్ చక్రవర్తి, సీపీ సాయిచైతన్య, డీటీసీ ప్రమీల, అసిస్టెంట్ కలె క్టర్ శ్యాంప్రసాద్, ఏసీపీ శ్రీనివాస్, సీఐ వెంకట నా రాయణ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
భూమి తగాదాలతో ఒకరి దారుణ హత్య
● నిందితుల ఇంటి వద్ద బంధువుల ఆందోళన బీబీపేట: భూ తగాదాలతో ఒకరు హత్యకు గురైన ఘటన బీబీపేట గ్రామ పరిధిలోని రాంరెడ్డిపల్లిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, ఎస్సై విజయ్ తెలిపిన వివరాల ప్రకారం.. రాంరెడ్డిపల్లికి చెందిన కోకట్ల సత్తయ్య (50), కాల్ల లచ్చయ్య, కాల్ల దేవయ్య వ్యవసాయ భూములు పక్కపక్కనే ఉంటాయి. కొంతకాలంగా భూ విషయమై తగాదాలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి 11:30 గంటలకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు సత్తయ్య ఇంటి నుంచి బయటికి రావడంతో నిందితులు బలమైన ఆయుధంతో దాడి చేశారు. దీంతో తీవ్రగాయాలపాలైన సత్తయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం కాల్ల లచ్చయ్య, కాల్ల దేవయ్య పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. బుధవారం గ్రామానికి చేరుకున్న మృతుడి బంధువులు నిందితుల ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. లచ్చయ్య, దేవయ్యలు సత్తయ్యను హత్య చేశారని, వారిని తమకు అప్పగించాలని బైఠాయించారు. బాధితులను పోలీసులు, కుల పెద్దలు సముదాయించారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ తెలిపారు. -
మొక్కల పరిరక్షణకు కృషి చేయాలి
● బీఎస్ఐ డెక్కన్ రీజినల్ సెంటర్ అధిపతి, శాస్త్రవేత్త రాసింగం తెయూ(డిచ్పల్లి): జిల్లాలోని మొక్కల పరిరక్షణకు, వాటిని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (బీఎస్ఐ) ద్వారా సర్వే చేపట్టి మొక్కల ఉపయోగాల తోడ్పాటుకు కృషి చేస్తున్నట్లు బీఎస్ఐ డెక్కన్ రీజినల్ సెంటర్ అధిపతి శాస్త్రవేత్త ఎల్.రాసింగం తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ బోటనీ విభాగం ఆధ్వర్యంలో ‘హెర్బేరియం తయారీ – నేచర్ వాక్’పై బుధవారం కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎస్ఐ శాస్త్రవేత్త రాసింగం ప్రసంగిస్తూ.. బీఎస్ఐ ఆధ్వర్యంలో ఇటీవల సుమారు 40 కొత్త మొక్కల జాతులను కనుగొన్నామన్నారు. కొత్త మొక్కలను పరిరక్షించేందుకు హెర్బేరియం ప్రక్రియ ద్వారా నిల్వ చేయవచ్చని తెలిపారు. విద్యార్థులు పరిశోధనలు నిర్వహించి అంతరించిపోతున్న మొక్కల నమూనాలను సేకరించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రానంతరం ప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ జానకీ అమ్మాళ్ ఆధ్వర్యంలో బీఎస్ఐ పునర్వ్యవస్థీకరణ జరిగిందన్నారు. ప్రస్తుతం బీఎస్ఐ దేశవ్యాప్తంగా 12 ప్రాంతీయ కేంద్రాలతో పనిచేస్తూ, 25 లక్షలకు పైగా మొక్కల నమూనాలను కలిగిన సెంట్రల్ నేషనల్ హెర్బేరియంను నిర్వహిస్తోందన్నారు. కార్యక్రమంలో బోటనీ హెచ్వోడీ అబ్దుల్ హలీమ్ ఖాన్, బీవోఎస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.అరుణ, ప్రొఫెసర్ విద్యావర్ధిని, అధ్యాపకులు శ్రీనివాస్, జలందర్, క్యాంపస్ విద్యార్థులతోపాటు తెయూ పరిధిలోని పలు కళాశాలలకు చెందిన బోటనీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
చైన్ స్నాచింగ్ల కలకలం
నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలో బుధవారం ఉదయం రెండు వేర్వేరు చోట్ల చైన్ స్నాచింగ్లు కలకలం రేపాయి. వినాయక్నగర్, కసాబ్గల్లీలో నంబర్ లేని పల్సర్ బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అయితే, ఈ రెండుచోట్ల చోరీకి పాల్పడిన వ్యక్తులు ఒక్కరే అని పోలీసులు గుర్తించారు. ఉదయం 7:30 గంటల సమయంలో వినాయకనగర్లోని నాయుడి స్వరూప ఇంటి ఎదుట అలుకు వేస్తోంది. బైక్పై వచ్చిన ఇద్దరు దుండగుల్లో ఒకరు వచ్చి స్వరూపను తెలిసిన వారి అడ్రస్సు చెప్పాలని మాట్లాడుతూ మెడలోని తులంన్నర బంగారు చైన్ను లాక్కొని పారిపోయాడు. అనంతరం కసాబ్గల్లీలో ఇంటి ఎదుట ఉన్న లక్ష్మి అనే మహిళ మెడలోని రెండు తులాల బంగారు చైన్ను లాక్కెళ్లారు. ఆమె కేకలు వేసి పక్కింటి వారిని పిలిచే సరికి నిందితులు బైక్పై పరారయ్యారు. నాల్గో టౌన్ ఎస్హెచ్వో సతీశ్, రెండో టౌన్ ఎస్సై సయ్యద్ ముజాహిద్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. బాధితులు స్వరూప, లక్ష్మి ఫిర్యాదు మేరకు రెండు స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ● నగరంలో రెండు చోట్ల ఘటనలు ● ఇద్దరే చేసినట్లు పోలీసుల నిర్ధారణ -
మేనమామ– అల్లుడి మధ్య పోటీ
బాన్సువాడ: బీర్కూర్ మండల కేంద్రంలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మేనమామ, మేనల్లుడికి మధ్య పోటీ నెలకొంది. బీర్కూర్ సర్పంచ్ పదవికి మాజీ సర్పంచ్ సానేపు గంగారాం పోటీలో ఉండగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన మేనల్లుడు, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మేకల విఠల్ రంగంలోకి దిగారు. గతంలో ఐదేళ్లు సర్పంచి పదవిలో కొనసాగిన సానేపు గంగారాంకు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా పేరుంది. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురికావడంతో చాలా రోజులు ఆస్పత్రిలో ఉండి ఈ మధ్యనే ఇంటికి వచ్చాడు. ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికల్లో తాను కూడా పోటీలో ఉంటానని నామినేషన్ వేశారు. మాజీ సర్పంచ్ చెల్లెలి కుమారుడైన మేకల విఠల్ 40 ఏళ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి ఈ మధ్యనే పదవీ విరమణ చేశారు. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్గా పోటీ చేస్తానని కాంగ్రెస్ నాయకులను ఆశ్రయించి నామినేషన్ వేశారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో సర్పంచ్ పదవికి మేనమామ, మేనల్లుడు పోటీకి సై అంటున్నారు. పోటీలో మరొక అభ్యర్థి ధర్మతేజ(బీఆర్ఎస్ మద్దతుదారు) కూడా ఉన్నారు. -
‘కాయకల్ప’పై శిక్షణ
నిజామాబాద్ నాగారం: నగరంలోని జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో మంగళవారం జిల్లాస్థాయి ‘కాయకల్ప ఓరియంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం’ నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్వో రాజరశ్రీ మాట్లాడుతూ.. ఆస్పత్రి పరిశుభ్రత, ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్, వేస్ట్ మేనేజ్మెంట్, హైజిన్ ప్రమోషన్ గురించి సిబ్బందికి అవగాహన కల్పించారు. ప్రోగ్రాం ఆఫీసర్స్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ డాక్టర్ రాజు మాట్లాడుతూ.. జన ఆరోగ్య సమితి సమావేశం గురించి తెలిపారు. టీబీ ముక్త్ భారత్, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై వివరించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు దేవి నాగేశ్వరి, సామ్రాట్ యాదవ్, ఆశోక్, రాజు, అశ్విని, శ్వేత, ఎంఎల్హెచ్పీలు తదితరులు పాల్గొన్నారు. అందుబాటులో ఎరువులు నవీపేట: రబీ పంటల సాగుకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని డీఏవో వీరాస్వామి అన్నారు. మండలంలోని బినోల, నాగేపూర్, నవీపేట సొసైటీల గోదాములతోపాటు ప్రైవేట్ ఫెర్టిలైజర్ దుకాణాల ను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ పోస్’ పరికరం ద్వారా ఎరువుల అమ్మకాలను జరపాలని, రైతుల కు రసీదులను కచ్చితంగా ఇవ్వాలని సూ చించారు. గోదాములతోపాటు ఫెర్టిలైజర్ దుకాణాల్లోని రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఆయన వెంట ఏవో నవీన్కుమార్ ఉన్నారు. తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ సెమిస్టర్ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా జరిగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో మొత్తం 17 పరీక్ష కేంద్రాల్లో ఉదయం నిర్వహించిన ఐదవ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షకు 386 మందికి 374 మంది హాజరు కాగా 12 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. -
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
● సర్పంచ్ అభ్యర్థి కుమ్మరి శేఖర్ పిట్లం(జుక్కల్): గ్రామాన్ని అబివృద్ధి చెయ్యడానికి సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని, మీ చల్లని దీవెనలతో నన్ను సర్పంచ్గా ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే, అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు సహకారంతో నిధులు తెచ్చి పిట్లం గ్రామపంచాయతీని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ అభ్యర్థి కుమ్మరి శేఖర్ హామీ ఇస్తూ మంగళవారం పిట్లం మండల కేంద్రంలోని ప్రచారాన్ని ముమ్మురంగా కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తన తండ్రి కుమ్మరి సాయిలు గతంలో పిట్లం ఉప సర్పంచ్ గా సేవలందించారని పేర్కొన్నారు. తాను బీఎడ్ చదివిన ఉద్యోగం కోసం ప్రయత్నించకుండా, పుట్టిన ఊరుని అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో రాజకీయాలలోకి వచ్చానని పేర్కొన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
పర్యాటక కేంద్రంగా గుర్తింపు తీసుకొస్తా
● జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావునిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ ప్రాజెక్టుకు ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా గుర్తింపు తీసుకొస్తానని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. పర్యాటక ప్రాంత అభివృద్ధి కోసం తాను ఎనలేని కృషి చేస్తున్నానని, ఇప్పటికే మొదటి విడత 20 కాటేజీల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.12 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. మంగళవారం మహమ్మద్నగర్, నిజాంసాగర్ మండలాల్లోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ సానుభూతి సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న నాయకులు ప్రజాసమస్యలను పట్టించుకోలేదని, అభివృద్ధి పనులను విస్మరించారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పి భూస్థాపితం చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిస్తూ, కాంగ్రెస్ మద్దతుదారులను ఎన్నికల్లో గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, ఏఎంసీ చైర్మనన్ చీకోటి మనోజ్, ఎన్ఆర్ఐ భాస్కర్రెడ్డి, సాయిపటేల్, మహమ్మద్నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ కేంద్రం పరిశీలన
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కేంద్రాన్ని మంగళవారం ఎంపీడీవో సంతోష్ కుమార్ పరిశీలించారు. మండలంలోని ఉద్యోగులు తమ ఓటును వినియోగించుకున్నట్లు తెలిపారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: హైదరాబాద్లో రెండు రోజుల పాటు నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్కు రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కేంద్రంగా ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న కార్యక్రమంలో వ్యవసాయ రంగంలో పెట్టుబడులపై రూపొందించిన పుస్తకాన్ని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకాటి శ్రీహరి, రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిలతో కలిసి గడుగు గంగాధర్ ఆవిష్కరించారు. ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాలలో టాస్క్ సౌజన్యంతో జియో కంపెనీలో వివిధ ఉద్యోగాల కోసం జాబ్ డ్రైవ్ నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ రంగరత్నం మాట్లాడుతూ.. కళాశాల విద్యార్థులకు విద్యతో పాటు అనేక నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తూ, వాటికి అనుగుణమైన ఉద్యోగాల కోసం ప్రాంగణ నియామకాలను కూడా టీఎస్కేసీ చేపడుతుందన్నారు. జిల్లాలోని నవీపేట్, నందిపేట్, బాల్కొండ, వేల్పూర్, నిజామాబాద్ నుంచి సుమారు 200 మంది ఉద్యోగార్థులు ఈ డ్రైవ్ లో పాల్గొన్నారు. వీరిలో 22 మంది మిగతా రౌండ్లకు ఎంపికయ్యారని టీఎస్కేసీ సమన్వయకర్త రామకృష్ణ తెలిపారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి భరత్రాజ్, ఆంగ్ల విభాగాధిపతి దండు స్వామి, టాస్క్ జిల్లా మేనేజర్ రఘు తేజ, టీఎస్కేసీ మెంటార్ శ్రీకాంత్, సంస్థ హెచ్ ఆర్లు మహవీర్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులకు బాలిక అప్పగింత
మాక్లూర్: ఎవరూ తోడు లేక అటూ ఇటూ తిరుగుతూ బస్టాండ్లో నిద్రిస్తున్న బాలికను ఆలూర్ మండలం కల్లెడి గ్రామస్తులు గుర్తించి చేరదీశారు. మూడు రోజులుగా బాలిక సంబంధీకులు ఎవరూ రాకపోవడంతో పోలీసులకు మంగళవారం అప్పగించగా వారు అనాథ బాలికల హోమ్కు తరలించారు. కల్లెడి గ్రామస్తుడు గంగోళ్ల ప్రళయ్తేజ్ తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజుల నుంచి ఐదేళ్ల బాలిక గ్రామంలో ఒంటరిగానే తిరుగుతూ రాత్రికాగానే బస్టాండ్లో నిద్రిస్తుందని తెలిపారు. తాము గమనించి భోజనం, కప్పుకోడానికి దుప్పటి అందించి మూడు రోజులుగా ఇంటి వద్ద ఉంచుకున్నట్లు తెలిపారు. మంగళవారం నాటికి కూడా బాలిక సంబంధీకులు ఎవరూ రాకపోవటంతో పోలీసులకు అప్పగించగా వారు బాలికను అనాథ పిల్లల హోమ్కు తరలించినట్లు ప్రళయ్తేజ్ తెలిపారు. బాలిక వచ్చిరాని మాటలతో స్పష్టంగా మాట్లాడటం లేదన్నారు. ప్రళయ్తేజ్, గంగూలీ, నవీన్, గ్రామస్తులు ఉన్నారు. -
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
డిచ్పల్లి: మండలంలోని కంచెట్టి దాబా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మతి చెందినట్లు ఎస్సై మహమ్మద్ ఆరిఫ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలు ప్రకారం.. తెల్లవారుజామున దాబా ఎదురుగా ఓ వ్యక్తి రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి మెడ కుడి వైపునకు టాటూ, ఎడమ, కుడి చేయి మణికట్టుల వద్ద టాటూలు ఉన్నాయి. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712659852, 8712659851 నంబర్లకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు. గాంధారి(ఎల్లారెడ్డి): రోడ్డుపై నిలిపిఉంచిన ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. గాంధారి మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన సోమార్పేట లింగయ్య(60) మంగళవారం తన టీవీఎస్ ఎక్సెల్పై పశువుల దాణా కోసం బాన్సువాడ వెళ్లాడు. రాత్రివేళ పశువుల దాణాను ఎక్సెల్పై తీసుకొని స్వగ్రామానికి బయలుదేరాడు. మొండిసడక్– బాన్సువాడ ప్రధాన రహదారిపై ఇసుక లోడుతో ఉన్న ట్రాక్టర్ టైర్ పంక్చర్ కావడంతో అక్కడే నిలిపిఉంచారు. ఈక్రమంలో లింగయ్య ఎక్సెల్పై అదే రోడ్డు గుండా వస్తుండగా ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందిచారు. వారు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇసుకను కిందికి తోడేసి ట్రాలీని పక్కకు తీసినట్లు ఎస్సై తెలిపారు. ప్రమాదంపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై తెలిపారు. నాగిరెడ్డిపేట: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగిరెడ్డిపేట మండలం గోలిలింగాల గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిట్ల పోచయ్య(42) గతేడాది పొలంలో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడి చేయి విరిగింది. విరిగిన చేయికి పలుచోట్ల వైద్యం చేయించినా సరికాలేదు. దీంతో మనస్తాపానికి గురైన పోచయ్య మంగళవారం వేకువజామున ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. బీబీపేట: మండలంలోని మాందాపూర్ గ్రామంలో ఎన్నికల కోడ్ను అతిక్రమించి ఓ కార్ఖానాలో దాచి ఉంచిన మద్యం బాటిళ్లను ఎఫ్ఎస్టీ వెంకటలక్ష్మి పట్టుకున్నారు. మొత్తం 171 క్వార్టర్ బాటిళ్లు, రూ. 35 వేల విలువ గల మద్యాన్ని పట్టుకొని సీజ్ చేసినట్లు ఆమె తెలిపారు. మల్లయ్యపల్లి శివారులో..ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని మల్లయ్యపల్లి శివారులో మూడు కాటన్ల మద్యం సీసాలు పట్టుబడినట్లు ఎస్సై మహేశ్ మంగళవారం తెలిపారు. గ్రామ శివారులో ఎఫ్ఎస్టీ టీం అధికారులు గిర్దావార్ శ్రీనివాస్, కానిస్టేబుల్ శ్రీనివాస్తో కలిసి వాహనాల తనిఖీ చేపడుతుండగా పాపన్నపేట్ మండలం పాత లింగయ్యపల్లి గ్రామానికి చెందిన చింతకాయల రమేశ్ అనే వ్యక్తి ఆటోలో మూడు కాటన్ల మద్యాన్ని తీసుకెళ్తుండగా పట్టుకున్నామని దీని విలువ రూ. 28 వేలు ఉంటుందని అన్నారు. మద్యాన్ని సీజ్ చేసి మద్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
చోరీ కేసుల్లో నిందితుల అరెస్టు
నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. ఎస్హెచ్వో తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన హైమద్ హుస్సేన్, అబూబకర్ అనే ఇద్దరు సోమవారం సాయంత్రం రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ చౌరస్తా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సమాచారం అందడంతో పట్టుకున్నట్లు తెలిపారు. విచారణలో వారు నగరంలోని 1, 3, 4వ పోలీస్స్టేషన్ల పరిధిలోని పలు ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారని, దొంగిలించిన వస్తువులను భైంసాకు చెందిన నాంపల్లి వెంకటచారి, నాంపల్లి సాయిచరణ్కు విక్రయించినట్లు నిందితులు ఒప్పుకున్నారు. వీరి నుంచి 70 గ్రాముల బంగారం, వెండి వస్తువులు, ఏడు చేతిగడియారాలు, ఒక బైక్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదుచేసి 14 రోజుల పాటు రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో పేర్కొన్నారు. ప్రజలు ఎవరైనా వేరే గ్రామాలకు వెళ్తే ఇంట్లో బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, నగదు ఉంచకూడదని సూచించారు. ఇద్దరు నిందితులు.. నిజామాబాద్అర్బన్: బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరి నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బోధన్ పట్టణంలోని రాకాసిపేట్కు చెందిన అమీర్ఖాన్, కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ హనీఫ్ అనే ఇద్దరు కొంత కాలంగా జిల్లా కేంద్రంలోని ఒకటో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో తరచూ బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. పక్కా సమాచారం మేరకు వీరిపై నిఘా ఉంచి పట్టుకున్నట్లు తెలిపారు. వీరి నుంచి ఐదు బైక్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
నాడు అత్త ఎంపీటీసీ.. నేడు కోడలు సర్పంచ్ బరిలో..
కామారెడ్డి రూరల్: చిన్నమల్లారెడ్డిలో బీమాయల నీలమ్మ నాడు బీఆర్ఎస్ అభ్యర్థిగా గ్రామ ఎంపీటీసీగా పోటీ చేసి ఐదేళ్ల పాటు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అయితే ఈ సారి చిన్నమల్లారెడ్డి గ్రామానికి ఎస్సీ మహిళ రిజర్వు కావడంతో నీలమ్మ కోడలు బీమాయల లక్ష్మీని నిలబెట్టారు. ఈ సారి తన కోడలు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా పోటీలో ఉన్నారని ఈ సారి కూడా ఎలాగైనా సర్పంచ్గా తన కోడలిని గెలిపించాలని సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. దీంతో నాడు అత్త, నేడు కోడలు పోటీలో ఉండడం గమనర్హం. -
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
నిజాంసాగర్(జుక్కల్): గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతో సాధ్యమవుతుందని, ఉంగరం గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని మహమ్మద్నగర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి అంధోల్ అశ్విని అన్నారు. మంగళవారం మహమ్మద్ నగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం, జుక్కల్ ఎమ్మెల్యే తోట.లక్ష్మీకాంతారావు సహకారం ఎంతో అవసరమన్నారు. నాయకులు చింతకింది కాశయ్య, మల్లయ్యగారి శివరాజ్, ఇఫ్తేకార్ దొర, తదితరులున్నారు. మద్నూర్(జుక్కల్): నాందేడ్లోని గురుద్వారాను దర్శించుకునేందుకు హైదారాబాద్కు చెందిన ఇద్దరు భక్తులు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. మండల కేంద్రం గుండా హైదారాబాద్కు చెందిన మోహన్ సింగ్, తేజాసింగ్లు కాలి నడకన మహరాష్ట్రలోన నాందేడ్లో గల పవిత్ర గురుద్వారా దర్శనం కోసం వెళ్తున్నట్లు మంగళవారం వారు తెలిపారు. 3 రోజుల క్రితం హైదరాబాద్ నుంచి బయలుదేరామని, మరో రెండు రోజుల్లో నాందేడ్కు చేరుకుంటామని వారు సాక్షితో చెప్పారు. లోక కల్యాణం, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ పాదయాత్ర చేపట్టినట్లు వారు తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ పాదయాత్ర చేపడతామని వారు అన్నారు. నిజాంసాగర్(జుక్కల్): సొంతిళ్లు లేని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని మహమ్మద్నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మహమ్మద్ నగర్ మండలం తుంకిపల్లిలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు సర్పంచ్ అభ్యర్థి కుమ్మరి రాములుకు మద్దతుగా ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా పలు కాలనీల్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. పంచాయతీ ఎన్నికలు పూర్తవగానే కొత్త సర్పంచ్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి పనులు చేయిస్తామన్నారు. నాయకులు లోక్యానాయక్, కమ్మరి కృష్ణ, నర్సింలు, శంకర్, గోపిసింగ్ తదితరులున్నారు. -
నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
కామారెడ్డి క్రైం: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టరేట్లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం ఆవిష్కరించనున్నారు. ఇందు కోసం అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. ఉదయం 9.15 గంటలకు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు కలెక్టర్ సోమవారం తెలిపారు. ఉద్యోగులు పాల్గొనాలి.. కామారెడ్డి అర్బన్: తెలంగాణ తల్లి విగ్రహా విష్కరణ కార్యక్రమంలో కలెక్టరేట్ కాంప్లెక్స్లోని ఆయా శాఖల ఉద్యోగులు, టీన్జీవోస్ నాయకులు విధిగా హాజరుకావాలని టీన్జీవోస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరాల వెంకట్రెడ్డి, ముల్క నాగరాజు ఒక ప్రకటనలో కోరారు.ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి మద్నూర్(జుక్కల్) : ఎన్నికల నేపథ్యంలో డ బ్బు, మద్య తరలించకుండా, ఎన్నికలు స జావుగా జరిగేలా ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. డోంగ్లీ మండలంంలోని సిర్పూర్ వద్ద తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సోమ వారం ఆమె తనిఖీ చేశారు. మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే ప్రతి ద్విచక్ర వాహనంతోపాటు కార్లు, ఇతర వాహనాలను చెక్పోస్ట్ సిబ్బంది తనిఖీ చేయాలన్నారు. ఆమెవెంట డోంగ్లీ రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు. ఎస్సీ గురుకుల అధ్యాపకులపై వేటు నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని అ చ్చంపేట ఎస్సీ గురుకుల పాఠశాలను జోన ల్ అధికారిణి ప్రత్యూష, డీసీవో శివరాం సో మవారం వేర్వేరుగా తనిఖీ చేశారు. గురుకు ల విద్యార్థి అజయ్ నీట మునిగి మృతి చెందిన ఘటన నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఇన్చార్జి ప్రిన్సి పాల్ గణపతికి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. అ లాగే ఉపాధ్యాయులు రవికాంత్, లక్ష్మణ్తోపాటు పీడీ రాజు, వాచ్మెన్ కిషన్పై సస్పెన్షన్ వేటు వేశారు. యాసంగి పంటలకు ‘సాగర్’ జలాలు నిజాంసాగర్(జుక్కల్): యాసంగి పంటల సాగు అవరాల కోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశామని బాన్సువాడ నీటి పారుదలశాఖ ఎస్ఈ దక్షిణమూర్తి అన్నారు. సోమవారం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లా ప రిధిలో 1.25 లక్షల ఎకరాల్లో యాసంగి పంటలు సాగు చేస్తున్నారన్నారు. ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటలకు ఆరు విడతల్లో 12.5 టీఎంసీల నీటిని అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఈఈలు సోలోమాన్, రాజశేఖర్, ఏఈలు అక్షయ్, సాకేత్, వర్క్ ఇన్స్పెక్టర్ కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణికి 43 ఫిర్యాదులు కామారెడ్డి క్రైం: కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 43 ఫిర్యాదులు అందాయి. ఏ వో మసూర్ అహ్మద్, అధికారులు ఫిర్యాదులను స్వీకరించారు. భూ సమస్యలు, పింఛన్ లు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. వివిధ శా ఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఓటర్లు ప్రలోభాలకు గురికావొద్దు
● ఎన్నికల నియమావళి పాటించాలి ● ర్యాలీలకు అనుమతులు తప్పనిసరి ● ఎస్పీ రాజేశ్చంద్ర నిజాంసాగర్(జుక్కల్): ఓటర్లు ప్రలోభాలకు గురికావొద్దని, శాంతి యుతంగా స్వేచ్ఛా వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఇందుకు పోలీసు వ్యవస్థ తగిన చర్యలు తీసుకుంటుందని ఎస్పీ రాజేశ్చంద్ర అన్నారు. జుక్కల్ మండలం సోపూర్ చెక్ పోస్టుతోపాటు మద్నూర్ మండలం సలాబత్ పూర్ చెక్పోస్టుతోపాటు జుక్కల్ పోలీస్ స్టేషన్ను సోమవారం సాయంత్రం ఎస్పీ తనిఖీ చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర వైపు నుంచి వస్తున్న వాహనాలను తనిఖీ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలు శాంతియుత వాతావరణంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం, డబ్బు రవాణా కాకుండా చెక్ పోస్టుల్లో తగు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆయన వెంట బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి, బిచ్కుంద సీఐ రవికుమార్, జుక్కల్ ఎస్సై రవికుమార్ తదితరులు ఉన్నారు. విధులను నిర్లక్ష్యం చేయొద్దు.. బాన్సువాడ : విధులను నిర్లక్ష్యం చేయొద్దని ఎస్పీ రాజేశ్చంద్ర పోలీసు సిబ్బందికి సూచించారు. బాన్సువాడ పోలీస్ స్టేషన్ను సోమవారం రాత్రి ఆయన సందర్శించారు. శాంతిభద్రతలపై ఆరా తీశారు. సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు. రికార్డులు, క్రైం రిపోర్టులను పరిశీలించారు. ఆయన వెంట బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి, సీఐలు శ్రీధర్, తిరుపయ్య, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు. -
విధులను సమర్థవంతంగా నిర్వహించాలి
● ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలి ● శిక్షణా తరగతుల్లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్దోమకొండ: పంచాయతీ ఎన్నికల అధికారులు పోలింగ్ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. మండ ల కేంద్రంలోని రైతువేదికలో ఎన్నికల అధికా రులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని క లెక్టర్ సోమవారం పరిశీలించి పలు కీలక సూచ నలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రతి అధికారి తన బాధ్యతను నిబద్ధతతో, న్యాయం, పారదర్శకత, శాంతి భద్రతలతో నిర్వర్తించాలని అ న్నారు. ప్రిసైడింగ్ అధికారులు మొత్తం పోలింగ్ ప్రక్రియను సమగ్రంగా పర్యవేక్షించి, ఎటువంటి లోపాలకు తావివ్వకుండా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ మెటీరియల్ అందుబాటులో ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలన్నారు. పో లింగ్ సమయంలో ఏవైనా అడ్డంకులు ఎదురైతే వెంటనే ఉన్నత అధికారులకు సమాచారం అందించాలని, శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని పోలింగ్ రోజున అనుసరించడం చాలా ముఖ్య మని పేర్కొన్నారు. పోలింగ్కు ఒకరోజు ముందే డిస్ట్రిబ్యుషన్ సెంటర్లకు చేరుకుని, తమకు కే టాయించిన కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్ ను తీసుకువెళ్ళాలని అన్నారు. పోలింగ్ శాతం, ఓట్ల లెక్కింపు వివరాల ప్రకటనలో అప్రమత్తంగా ఉంటూ పక్కాగా నిర్ధారణ చేసుకున్న తరువాతనే ఓటింగ్ శాతాన్ని, కౌంటింగ్ వివరాలను వెల్లడించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయాలని ఎలాంటి సందేహాలు ఉన్నా, ముందుగానే నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఆర్డీవో వీణ, తహసీల్దార్ సుధాకర్, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, ఏంఈవో విజయ్కుమార్, ఎన్నికల శిక్షణ నిర్వాహకులు నర్సింహులు, జ్యోతి, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ.. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను పారదర్శకంగా, స క్రమంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. లింగుపల్లి గ్రా మ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ కౌంటర్ను సందర్శించారు. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కున వినియోగించుకుంటున్న విధానాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. మూడు దశల్లో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి మండలాల వారీగా పోస్టల్ బ్యాలెట్ ఫామ్ల పంపిణీ , స్వీకరణ తదితర వివరాలు వెల్లడించారు.కామారెడ్డి క్రైం : ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. గ్రామ పంచాయితీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మైక్రో అబ్జర్వర్ లకు శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించారు. కలెక్టర్తోపాటు ఎన్నికల సాధారణ పరిశీలకులు సత్యనారాయణరెడ్డి హాజరై పలు సూచనలు చేశారు. అబ్జర్వర్ల బాధ్యతలు, ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన విధానాలపై దిశానిర్దేశం చేశారు. అదనపు కలెక్టర్ మదన్ మోహన్, డీపీఓ మురళి, ఆయా విభాగాలకు ఎంపిక చేయబడిన మైక్రో అబ్జర్వర్లు పాల్గొన్నారు. -
పర్మిషన్ ప్రకారం కట్టుడే.. లేకుంటే బాదుడే
జరిమానా తప్పదు..● అనుమతి లేకుండా నిర్మిస్తే భారీ జరిమానాలు ● ‘బిల్డ్ నౌ’ పోర్టల్ ద్వారా అనుమతులు ● అమలులోకి కొత్త మున్సిపల్ చట్టంమున్సిపల్ చట్టం ప్రకారం అనుమతులు, నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణాలు చే పట్టాలి. అనుమతులకు వి రుద్ధంగా నిర్మాణం చేపడితే వారికి నోటీసులు జారీ చే స్తాం. గడువులోగా సంజాయిషీ ఇవ్వాలి. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని కమర్షియల్ భవనా లు నిర్మించినా, సెట్బ్యాక్ లేని వారికి నోటీసులు ఇ చ్చి చర్యలు తీసుకుంటాం. స్పందించకుంటే కూల్చేస్తాం. – రాజేందర్రెడ్డి, కమిషనర్, కామారెడ్డికామారెడ్డి టౌన్ : మున్సిపాలిటీల పరిధిలో కొత్తగా ఇళ్లు నిర్మించుకునే కొందరు పట్టణ ప్రణాళిక విభాగం ద్వారా అనుమతులు తీసుకోవడం లేదు. మరి కొందరు అనుమతులు ఒకలా, నిర్మాణాలు మరోలా చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం అనుమతి తీసుకుంటే పెద్ద మొత్తంలో ఫీజు చెల్లించాల్సి వస్తుందని అధికారుల వద్దకు రాకుండా ప్రజాప్రతినిధులు, కిందిస్థాయి సిబ్బందికి ఎంతో కొంత ముట్టజెప్పి ఇళ్లు నిర్మించుకుంటున్నారు. చివరకు ఇంటి నంబర్ దరఖాస్తు సమయంలో అసలు విషయం బయటపడి ఇళ్ల యజమానులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇక నిబంధనల ప్రకారం అనుమతి లేకున్నా.. అక్రమంగా నిర్మించినా భారీగా జరిమానాలు విధించనున్నారు. ఇందులో భాగంగా నూతన చట్టం అమలులోకి తీసుకొచ్చారు. గతంలో టీఎస్బీపాస్ ద్వారా ఇంటి అనుమతులకు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉండేది. ఇక దానిని రద్దు చేసి ‘బిల్డ్ నౌ’ యాప్/పోర్టల్ ద్వారానే ఇక ఇంటి అనుమతులు తీసుకుంటున్నారు. గతంలో గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు నిబంధనలు ఒక విధంగా ఉండేవి. మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత చట్టం ప్రకారం నిబంధనలు అమలులోకి వచ్చాయి. మున్సిపాలిటీల పరిధిలో ఇంటి నిర్మాణం కోసం జీప్లస్–1 మొదటి అంతస్తు మాత్రమే అనుమతులున్నాయి. జీ ప్లస్–2 నిర్మించాలంటే తప్పనిసరిగా మార్టిగేజ్ చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు పార్కింగ్ స్థలం ఇవ్వాలి. ఆన్లైన్లోనే సెల్ఫ్ డిక్లరేషన్తో దరఖాస్తు చేసుకోవాలి. ప్రధాన వీధుల వెంట ఉన్నవాటికి, వ్యాపార సముదాయాలకు కచ్చితంగా కమర్షియల్ అనుమతి తీసుకోవాలి. కానీ చాలా మంది నిబంధనలు తెలియక కమర్షియల్ ఉన్న చోట కూడా రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకుంటున్నారు. బల్దియా ఆదాయానికి గండి కొడుతున్నారు.దండిగా దరఖాస్తులు కొత్త మున్సిపాలిటీ చట్టం ప్రకారం భవన నిర్మాణాలకు నిర్దిష్ట సమయంలో అనుమతులు జారీ చేసేలా సులువైన పద్ధతులు తీసుకొచ్చారు. సెప్టెంబర్ 15వ తేదీలోగా టీజీ బీపాస్ ద్వారా అనుమతులు ఇవ్వగా.. ఆ తర్వాత బిల్డ్ నౌ యాప్/పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రతి ఏడాది ఇళ్ల నిర్మాణం కోసం కామారెడ్డిలో 500 నుంచి 600 వరకు, బాన్సువాడలో 250కి పైగా, ఎల్లారెడ్డిలో 180కి పైగా దరఖాస్తులు వస్తున్నాయి. నూతనంగా ఏర్పడిన బిచ్కుంద మున్సిపాలిటీలో కూడా ప్రతి నెల 10 వరకు దరఖాస్తులు వస్తున్నాయి.రూ. లక్షల్లో ఖర్చు చేసి అనుమతి లేకుండా ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇంటి నంబర్ కోసం దరఖాస్తు చేసేసమయంలో ఈ విషయం బయట పడుతోంది. అనుమతి పత్రం లేకపోతే ఆస్తిపన్ను మదింపులో జరిమానా విధిస్తారని తె లుసుకోవడం లేదు యజమానులు. మొత్తం అ నుమతి లేకుంటే 100 శాతం, అదనపు నిర్మాణా లు ఉంటే 25శాతం నుంచి 75 శాతం అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ భవనాలకు బ్యాంకుల్లో రుణాలు మంజూరు కావు. ఈ విష యం తెలియక ఇళ్లు నిర్మించుకుంటున్న వారు తీ వ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. -
అన్ని పనులు సర్పంచ్లే చూసుకునేది
అన్నల చేతిలో హతమైన సర్పంచులు.. సర్పంచ్ సాబ్.. అనే పిలుపులోని మజాను ప్రస్తుత సర్పంచ్లు అనుభవిస్తున్నా.. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న రోజుల్లో మాత్రం ఆ పదవి అంటేనే జంకే పరిస్థితి ఉండేది. సర్పంచ్గా పోటీ చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నాటిది. తమ ఉనికిని పోలీసులకు తెలిపారనో.. లేదా ఇతర కారణాల వల్లనో సర్పంచ్లను నక్సల్స్ టార్గెట్ చేసేవారు. ఎంతో మంది వారి చేతుల్లో బలయ్యారు. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : నక్సలైట్ల కార్యకలాపాలు జోరుగా కొనసాగిన కాలంలో సర్పంచ్లే వారికి టార్గెట్ అయ్యేవారు. ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీల వద్దకు వెళ్లే క్రమంలో అలాగే వివిధ కేసుల విషయంలో పోలీసు స్టేషన్కు తిరగాల్సిన సందర్భాల్లో పలువురు సర్పంచ్లు నక్సల్స్ చేతిలో హతమయ్యారు. ఇన్ఫార్మర్ అనే ముద్ర వేసి చంపేసిన ఘటనలూ ఎన్నో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అధికార పార్టీలో పనిచేసినందుకు సర్పంచ్లను టార్గెట్ చేసేవారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్లపై దాడి చేసి గాయపర్చడం, హతమార్చడం వంటి సంఘటనలతో అప్పట్లో సర్పంచ్గా పోటీ చేయాలంటే చాలా మంది వెనుకడుగు వేసేవారు. కొన్ని గ్రామాల్లో అయితే రెండు మూడు పర్యాయాలు పంచాయతీ ఎన్నికలు జరగలేదు. పోటీ చేయడానికి సాహసించేవారు కాదు. బతికుంటే బలుసాకుతిని బతకొచ్చు అనుకుని రాజకీయాలకు దూరంగా ఉండేవారు. కాగా సార్వత్రిక ఎన్నికల సందర్భంలోనూ నక్సల్స్ ఎన్నికల బహిష్కరణ పిలుపుతో ప్రజలు ఓటు వేయడానికి భయపడేవారు. నక్సల్స్ కార్యకలాపాలు ఎక్కువగా కొనసాగిన ఉమ్మడి జిల్లాలోని మాచారెడ్డి, కామారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్, రాజంపేట, తాడ్వాయి, లింగంపేట, ఎల్లారెడ్డి, గాంధారి, పెద్దకొడప్గల్, మహ్మద్నగర్, బాన్సువాడ, సిరికొండ, ధర్పల్లి, భీమ్గల్, కమ్మర్పల్లి, మోర్తాడ్, వర్ని, డిచ్పల్లి తదితర మండలాల్లో పలువురు సర్పంచ్లు నక్సల్స్ చేతిలో హతమయ్యారు. పాల్వంచ మండలం భవానీపేటలో సర్పంచ్గా పనిచేసిన సూరవ్వను నక్సల్స్ కొట్టారు.. చాలా మంది వారి చేతుల్లో చావు దెబ్బలు తిన్నారు. నక్సల్స్కు సహకరించారని పోలీసులు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా నక్సల్స్ ప్రాబల్య గ్రామాల్లో సర్పంచ్లుగా పనిచేసిన వారు నక్సలైట్లకే కాదు పోలీసులకూ టార్గెట్ అయ్యేవారు. నక్సలైట్లు ఏదై నా పని చెబితే చేయాల్సిందే. దీంతో నక్సల్స్కు సహకరించారంటూ పోలీ సులు సర్పంచ్లపై కేసులు నమోదు చేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అజ్ఞాత నక్సలైట్లు గానీ, గ్రామాల్లో ఉండే మిలిటెంట్లు గానీ చెప్పి న పని వినకుంటే నక్సలైట్లకు కోపమొస్తుందని భ యంతో వారు చెప్పిన పని చేసిపెట్టేవారు. ఈ విష యం ఎక్కడో లీక్ అవడంతో పోలీసుల నుంచి పి లుపు వచ్చేది. అటు నక్సలైట్లు, ఇటు పోలీసుల మ ధ్య సర్పంచ్లు నలిగిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నక్సలైట్ల కార్యకలాపాలు తగ్గిన తరువా త సర్పంచ్లకు ఇబ్బందులు తగ్గాయనే చెప్పాలి.నక్సల్స్ చేతిలో బలైన వారెందరో... ఇన్ఫార్మర్లు అని.. అధికార పార్టీ అని.. ఎందరిపైనో దాడులు అప్పట్లో పోటీ చేయాలంటే భయపడే పరిస్థితి మాచారెడ్డి మండలం భవానీపేట సర్పంచ్గా, మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన మంద గంగారెడ్డిని కాల్చి చంపారు. భిక్కనూరు సర్పంచ్గా పనిచేసిన శ్రీరాం నాగభూషణం. పాల్వంచ మండలం సింగరాయపల్లి సర్పంచ్గా పనిచేసిన సామగంజి అంజయ్య. ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల సర్పంచ్ కరిచేవుల బాలరాజు. లింగంపేట మండలం భవానీపేట సర్పంచ్ ఆకుల అశోక్ బాన్సువాడ మండలం కోనాపూర్ సర్పంచ్ దొడ్లె నారాయణ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రా మాలకు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. అలాంటి సమయంలో గ్రామాల్లో సర్పంచ్లే అన్ని పను లు చూసుకోవాల్సి వచ్చేది. గ్రామంలో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి సర్పంచ్లు అధికారులకు సంధానకర్తలుగా వ్యవహరించాల్సి వచ్చేది. నక్సలైట్లకు సహకరిస్తున్నారని పోలీసులు గ్రామంలో ఎవరినైనా పట్టుకువెళ్లారంటే సర్పంచ్కు పనిపడినట్టే. పొ ద్దున్నే గ్రామస్తులతో కలిసి ఠాణాకు వెళ్లాలి. అధికారులతో మాట్లాడాలి. పెద్ద కేసుల్లో ఉంటే.. వారిని అరెస్టు చేసి రి మాండ్కు తరలిస్తే కోర్టుకు వెళ్లి న్యాయవాదుల ను మాట్లాడుకుని వారికి బెయిల్ ఇప్పించాల్సిందే. ఇలా ఎన్నో రకాల ఒత్తిడిలో సర్పంచ్లు పనిచేసేవారు. -
ఏకగ్రీవాల తిమ్మాపూర్
● 1962 నుంచి రెండుసార్లు మాత్రమే సర్పంచ్ ఎన్నికలు తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంఎల్లారెడ్డిరూరల్: సర్పంచ్ ఎన్నికలను ఏకగ్రీవంగా చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు తిమ్మాపూర్ గ్రామస్తులు. గ్రామ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి కేవలం రెండుసార్లు మాత్రమే ఎన్నికలు జరగగా ఆరుసార్లు సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జీపీ ఆవిర్భావం నుంచి.. తిమ్మాపూర్ గ్రామం 1962లో గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. నూతన జీపీకి మొట్ట మొదటి సర్పంచ్గా మామిడి కిష్టయ్య 25 ఏళ్లు (ఐదు టర్మ్లు) 1987 వరకు సర్పంచ్గా ఏకగ్రీవ సర్పంచ్గా కొనసాగారు. 1988లో మామిడి లక్ష్మీనారాయణ ఏకగ్రీంగా ఎన్నికయ్యారు.1995లో జరిగిన ఎన్నికల్లో సావిత్రి గెలుపొందారు. 2000లో ఠాక్రియా నాయక్ ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నికయ్యారు. 2006లో జరిగిన ఎన్నికల్లో మామిడి రవీందర్ సర్పంచ్గా గెలుపొందారు. 2012లో మామిడి అరవింద్, 2019లో మామిడి దామోదర్ ఏకగ్రీవ సర్పంచులుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో సైతం గ్రామస్తులు ధారవత్ సోనిని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సర్పంచ్ ఎన్నికల సమయంలో ఎలాంటి వివాదాలు, గొడవలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో అందరం కలిసి ఏకగ్రీవానికి మొగ్గు చూపుతున్నామని గ్రామస్తులు తెలిపారు. ఎన్నికల ఖర్చు తగ్గడంతోపాటు ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు అందించడంతో ఆ నిధులతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని, అందుకే ఏకగ్రీవానికి మద్దతు తెలుపుతున్నామని అంటున్నారు. -
హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తా
పిట్లం(జుక్కల్): సర్పంచ్గా ఎన్నికై న తర్వాత తాను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పదవికి రాజీనామా చేస్తానని పిట్లం సర్పంచ్ అభ్యర్థి నవాబ్ సుదర్శన్ గౌడ్ అన్నారు. ఈమేరకు సోమవారం బాండ్ పేపర్ రాసి అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా విడుదల చేశారు. నవాబ్ సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ.. తన పదవీకాలం సగం అంటే 2.5 ఏళ్లు పూర్తయ్యేలోగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైతే, తానే స్వయంగా సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని బాండ్ పేపర్ రాసి ప్రకటించారు. గ్రామ అభివృద్ధి కోసం పారదర్శక పాలన, మౌలిక వసతుల మెరుగుదల, పంచాయతీ పనుల్లో ప్రజా భాగస్వామ్యం పెంపు వంటి అంశాలను ప్రధాన ప్రాధాన్యాలుగా తీసుకొని ముందుకు సాగనున్నట్లు తెలిపారు. పిట్లం గ్రామాన్ని అభివృద్ధిలో ముందంజలో నిలపడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పిట్లంలో తన వర్గం సభ్యులతో కలిసి ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. -
సర్పంచ్ బరిలో స్వాతంత్య్ర సమరయోధుడి కుమారుడు
పిట్లం(జుక్కల్): ఆశతో కాదు ఆశయంతో సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని, మీ చల్లని దీవెనలతో నన్ను సర్పంచిగా లేడీ పర్సు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే, పిట్లంలో జన్మించిన ప్రతి ఆడబిడ్డను పిట్లం బంగారు తల్లిగా భావించి రూ.2 వేలు డిపాజిట్ చేస్తానని, సర్పంచ్ అభ్యర్థి నీలకంటి లోక మనోహర్ హామీ ఇస్తూ సోమవారం పిట్లం మండల కేంద్రంలోని పలు వార్డులలో ప్రచారాన్ని ముమ్మురంగా కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర సమరయోధుడైన మా తండ్రి నీలకంటి నారాయణ గతంలో పిట్లం గ్రామానికి సర్పంచ్గా పనిచేశారని, పిట్లంలో వీధి దీపాలు, పాఠశాలల ఏర్పాటు, గ్రామానికి రహదారి ఏర్పాటు, మురికి కాలువల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేశారని పేర్కొన్నారు. తాను 20 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నానని, అదృష్టవశాత్తు 20 ఏళ్ల తర్వాత బీసీకి సర్పంచ్గా నిలబడే అవకాశం వచ్చిందని, అందుకే బరిలో ఉన్నానని పేర్కొన్నారు. గ్రామంలో జన్మించిన ప్రతి ఆడబిడ్డను బంగారు తల్లిగా భావించి రూ. 2 వేలు డిపాజిట్ చేస్తానని హామీ సర్పంచ్ అభ్యర్థి నీలకంఠ లోక మనోహర్ -
జిల్లాలో 2 కోట్ల 85 లక్షల చేప పిల్లల పంపిణీ లక్ష్యం
ఎల్లారెడ్డి/ఎల్లారెడ్డి రూరల్: జిల్లాలోని 780 నీటి వనరుల్లో ఈ ఏడాది 2 కోట్ల 85 లక్షల చేప పిల్లలను విడుదల చేయడం లక్ష్యమని జిల్లా మత్స్యశాఖ అధికారి డోలిసింగ్ తెలిపారు. సోమవారం ఎల్లారెడ్డిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ సముదాయంలో ఎల్లారెడ్డి, సోమార్పేట్ గ్రామాల పరిధిలోని 11 మత్స్యసహకార సంఘాల సభ్యులకు ఆయన చేప పిల్లలను పంపిణీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని 652 సీజనల్ ట్యాంకుల్లో 35 నుంచి 40 ఎంఎం సైజు, ఏడాదిపాటు నీరు నిల్వ ఉండే 128 జలవనరుల్లో 80 నుంచి 100 ఎంఎం సైజు చేప పిల్లలను వంద శాతం సబ్సిడీపై విడుదల చేస్తామన్నారు. ఇంత వరకు 202 ట్యాంకుల్లో 48 లక్షల చేప పిల్లలను విడుదల చేశామని, మిగతా లక్ష్యాన్ని ఈనెల 15వ తేదీ వరకు పూర్తి చేస్తామని అన్నారు. మత్స్యశాఖ సహాయ అధికారులు సురేశ్, అతిఖ్, మత్స్యకార సంఘం సభ్యులు తదితరులు ఉన్నారు. -
వారం రోజుల్లో 150 కేసులు నమోదు
నిజామాబాద్అర్బన్: పోలీస్ కమిషనరేట్ పరిధిలో వారం రోజుల నుంచి చేపట్టిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 150 కేసులు నమోదైనట్లు సీపీ సాయి చైతన్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్మూర్, నిజామాబాద్, బోధన్ డివిజన్ల పరిధిలో ఈ తనిఖీలు నిర్వహించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 150 కేసులు నమోదు కాగా రూ.13లక్షల32వేలు జరిమానా, 21 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. ● నలుగురికి రూ. పదివేల చొప్పున జరిమానా బాల్కొండ/ ఆర్మూర్ టౌన్: డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి జడ్జి గట్టు గంగాధర్ ఒక రోజు జైలు శిక్షను విధించినట్లు ముప్కాల్ ఎస్సై కిరణ్పాల్ తెలిపారు. ముప్కాల్ పోలీస్స్టేషన్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో డొంకేశ్వర్ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి మద్యం తాగి పట్టుబడ్డాడు. సోమవారం ఆర్మూర్ కోర్టులో హాజరు పర్చగా జడ్జి అతనికి ఒక రోజు జైలు శిక్షను విధించినట్లు ఎస్సై తెలిపారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ కేసులో నలుగురికి రూ. పదివేల చొప్పున జడ్జి గంగాధర్ జరిమానా విధించినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో నలుగురు మద్యం తాగి పట్టుబడ్డారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా జడ్జి వారికి రూ. పదివేల చొప్పున జరిమానా విధించారు. మాక్లూర్: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వివాహిత పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న ఘటన మాక్లూర్ మండలం చిన్నాపూర్లో చోటు చేసుకుంది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగూబాయి(59) కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. పలు ఆస్పత్రుల్లో చూయించినా నయం కాకపోవడంతో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబీకులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
సమస్యాత్మక గ్రామాలపై నజర్
● సర్కిల్ పరిధిలో 7 గ్రామాల గుర్తింపు ● 98 మంది బైండోవర్బిచ్కుంద(జుక్కల్): ఎన్నికలు వచ్చాయంటే గొడవలు, ఘర్షణలు ఫలితాలు వచ్చే వరకు పోలీసులకు పరీక్షా కాలంగా ఉంటుంది. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎలాంటి అడ్డంకులు రాకుండా గొడవలకు తావు లేకుండా బిచ్కుంద సర్కిల్ పరిధిలోని మద్నూర్, బిచ్కుంద, జుక్కల్, పెద్దకొపడ్గల్ నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులు ప్రణాళిలు రచించి ముందస్తు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి శాంతియుతంగా ఎన్నికలు జరుపుకుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. గతంలో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని బిచ్కుంద పోలీసులు బిచ్కుంద మండలంలో వాజిద్నగర్, హజ్గుల్, జుక్కల్లో పెద్దగుల్లా, హంగర్గా, మద్నూర్, కొడిచిర, పెద్దకొడప్గల్ గ్రామాలను గుర్తించి నిఘా పెట్టారు. ప్రలోభాలకు సైతం అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. గతంలో శాసనసభ, పార్లమెంటు, స్ధానిక ఎన్నికల్లో జరిగిన ఘటనలు, రాజకీయ ఘర్షణలపై పోలీస్ అధికారులు అధ్యయనం చేసి ఆయా గ్రామాల్లో 98 మంది అనుమానితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా వారిని బైండోవర్ చేస్తున్నారు. బైండోవర్ ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలి. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలి. ఓ టు హక్కు అందరు సద్వినియోగం చేసుకోవాలి. ని బంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి అనుమానితులను అదుపులోకి తీసుకొని బైండోవర్ చేస్తున్నాం. – రవి కుమార్, సీఐ, బిచ్కుంద -
బంధువులొచ్చారు..!
భిక్కనూరు: సర్పంచ్ పదవికి పోటీపడుతుండడంతో అభ్యర్థి చుట్టాలు భిక్కనూరు పరిధిలో వారి గ్రామాలకు చేరుకున్నారు. సర్పంచ్ అభ్యర్థుల వెంట తిరుగుతూ వారు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో గ్రామాలన్నీ చుట్టాలతో నిండిపోయాయి. అభ్యర్థులు సైతం తమ చుట్టాలకు తమ కుమారుల స్నేహితులకు ముఖ్యమైన బాధ్యతలను అప్పగిస్తున్నారు. ముఖ్యంగా మద్యం కొనుగోలు చేసి తీసుకురావడం.. దాన్ని పంపిణీ చేయడం వంటి పనులతో పాటు ఇతర ముఖ్య పనులను కూడా వారికే అప్పగిస్తున్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): అన్ని రంగాల్లో గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పద్మాజీవాడి గ్రామ సర్పంచ్ అభ్యర్థి సుబ్బారావు అన్నారు. సోమవారం పద్మాజీవాడిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రధానంగా గ్రామంలో తాగునీటి సమస్య, పారిశుద్ధ్యం, రోడ్ల నిర్మాణాలు, వీధి దీపాలు తదితర అంశాలపై ప్రధాన దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. పద్మాజీవాడి చౌరస్తాలో తన సొంత నిధులతో బోరు వేయిస్తానని, క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టి యువతకు అండగా నిలుస్తానన్నారు. ప్రతీ సంవత్సరం గ్రామంలో మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తానన్నారు. విద్యావంతుడినైన తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల్లో ఈనెల 14న నిర్వహించనున్న ఎన్నికల కోసం అధికారులు సోమవారం ఎన్నికల సామగ్రిని సిద్ధం చేశారు. మండలంలో 41 గ్రామ పంచాయతీలకు 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 27 పంచాయతీలకు 148 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు. రాజంపేట: రాజంపేట సర్పంచ్ బరిలో నిలిచిన సర్పంచ్ అభ్యర్థులు వారి వారి పంథాలో ప్రత్యేకతను చాటుతూ ప్రచార కార్యక్రమాన్ని చేపడుతున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా నిలిచిన ఆముదాల నాగరాజుకు మద్దతుగా సోమవార జబర్దస్త్ టీం గడ్డం నవీన్, వినోదిని, ఫణి, కేఏ పాల్లు ఇంటింటి ప్రచారం చేపట్టారు. కత్తెరు గర్తుకు ఓటు వేసి ఆముద నాగరాజును గెలిపించాలని వారు కోరారు. జబర్దస్త్ టీం ప్రచారానికి రావడంతో వారిని చూడటానికి జనాలు ఉత్సాహాన్ని చూపారు. -
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
గాంధారి: కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని సోమవారం రాత్రి గాంధారి–బాన్సువాడ రహదారిలో ప్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా గాంధారి నుంచి బాన్సువాడ వైసు వెళ్తున్న కారు ఆపకుండా వెళ్లిపోవడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది వెంబడించి పట్టుకున్నారు. కారును తనిఖీ చేయగా అందులో 48 బీరు సీసాలతో పాటు నాలుగు లీటర్ల మద్యం ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మద్యం తరలిస్తున్న బాన్సువాడ మండలంలో సంగోజీపేట్కు చెందిన మరాఠీ బాలును అదుపులోకి తీసుకుని మద్యాన్ని స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి ప్రదీప్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
వేల్పూర్లో భారీ చోరీ
● 8 తులాల బంగారం అపహరణవేల్పూర్: మండల కేంద్రంలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన మంగలి సుదర్శన్, పక్కనే ఉండే మరో రెండు కుటుంబాల వారు అంక్సాపూర్ జాతరకు సోమవారం ఉదయం వెళ్లారు. దుండగులు సుదర్శన్ ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. తెలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన గ్రామస్తులు సుదర్శన్కు సమాచారం ఇచ్చారు. అతను వచ్చి చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. బీరువాలో ఉన్న 8 తులాల బంగారు నగలు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపాడు. మోతె వైపు వెళ్లే ఆర్అండ్బీ ప్రధానరోడ్డుకు సమీపంలో ఉన్న ఇంట్లో చోరీ జరగడంపై గ్రామస్తులు అవాక్కయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆలయంలో.. ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో దుండగులు సోమవారం చోరీకి పాల్పడ్డారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో దుండగులు ఆలయంలోకి చోరబడి హుండీని ఎత్తుకెళ్లారు. అనంతరం సర్వసమాజ్ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆలయాల ప్రాంతాల్లో పోలీసుల నిఘా ఉంచాలని స్థానికులు కోరుతున్నారు. -
పరిహారం చెల్లించలేదని ఆత్మహత్యాయత్నం
● విద్యుత్ టవర్ ఎక్కిన బాధితుడురుద్రూర్: తమ కుటుంబానికి రావాల్సిన నష్ట పరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని ఓ వ్యక్తి మనస్తాపంతో హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సోమవారం కోటగిరి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ఇందూరు సాయిలు కుమారుడు మహేశ్(22), అతని నెల రోజుల కుమార్తె గౌతమి రెండు నెలల క్రితం మండలకేంద్రంలోని ఓ రైస్మిల్లు గోడ కూలి మృతి చెందారు. ఈ ఘటనపై సాయిలు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. పేదరికం కుటుంబం కావడంతో ఘటనకు బాధ్యులైన వారి నుంచి నష్టపరిహారం చెల్లించేలా న్యాయం చేస్తామని గ్రామపెద్దలు బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. నాటి నుంచి ఎలాంటి నష్టపరిహారం అందలేదు. దీంతో ఆవేదనకు గురైన సాయిలు సోమవారం స్థానికంగా ఉన్న హైటెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న ఎస్సై సునీల్ ఘటన స్థలానికి చేరుకుని బాధితునితో సెల్ ఫోన్ ద్వారా మాట్లాడారు. తనవంతు సహకారం అందిస్తానని ఎస్సై సముదాయింపుతో కిందకు దిగి వచ్చిన సాయిలుకు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
మహిళా సంఘాల సభ్యులకు సర్టిఫికెట్ల ప్రదానం
కామారెడ్డి క్రైం: ఈవెంట్ మేనేజ్మెంట్లో ఐదు రోజుల శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా సంఘాల సభ్యులను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అభినందించారు. తన చాంబర్లో మంగళవారం సర్టిఫికేట్లను అందజేశారు. జిల్లాలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. డీఆర్డీవో సురేందర్, అదనపు డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీఎం సాయిలు, అధికారులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మండలంలోని జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లను అధికారులు సోమవారం పోలీస్స్టేషన్లో భద్రపరిచారు. ఈ నెల 14న రెండో విడతలో జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు రావడంతో ఎంపీవో ప్రకాష్ సిబ్బందితో కలిసి ఎల్లారెడ్డి పోలీస్స్టేషన్లో భద్ర పరిచారు. గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని పలు గ్రామాల్లో సోమవారం పర్యటించి క్షేత్ర స్థాయిలో యాసంగిలో సాగు చేసిన మొక్కజొ న్న పంటను పరిశీలించినట్లు ఏవో రాజలింగం తెలిపారు. మొక్కజొన్నలో కాండం తొలిచే పరుగు, ఎండాకు తెగులు ఆశించినట్లు గుర్తించి సంబంధిత రైతులకు సస్యరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిచికారీ చేయాల్సిన పురుగు మందులను సూచించినట్లు తెలిపారు. -
రోడ్లపై కూర్చుని వ్యాపారాలు చేయొద్దు
● కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ● దగ్గరుండి రోడ్లపైనుంచి వీక్లీ మార్కెట్కు తరలించిన ఎమ్మెల్యేకామారెడ్డి టౌన్ : జిల్లాకేంద్రంలో రోడ్లపై కూర్చుని కూరగాయలు, ఇతర వ్యాపారాలు చేయవద్దని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఆదివారం సుభాష్, జేపీఎన్, నాజ్టాకీస్ రోడ్లకు ఇరువైపులా కూర్చుని నిర్వహించే కూరగాయల మార్కెట్ను తరలించేందుకు ఎమ్మెల్యే సమక్షంలో మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. అదివారం తెల్లవారుజామున 5 గంటలకు మున్సిపల్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే అక్కడికి చేరుకున్నారు. రైతులు, కూరగాయల వ్యాపారులతో మాట్లాడి అక్కడి నుంచి వీక్లీ మార్కెట్కు వెళ్లేలా చేశారు. ఎమ్మెల్యే ఉదయం 9 గంటల వరకు ఉండి వ్యాపారాల తరలింపు చర్యలను పరిశీలించారు. రోడ్లపై కూర్చుని ఇబ్బందులు పడకుండా, ట్రాఫిక్ సమస్యకు కారణం కాకుండా ఉండాలంటే రోడ్లకు ఇరువైపులా ఎలాంటి విక్రయాలు చేయవద్దని సూచించారు. కూరగాయలు, చేపల మార్కెట్లను రోడ్లపై నుంచి తరలించడంతో సుభాష్, జేపీఎన్ రోడ్లు బోసిపోయాయి. అయితే ట్రాఫిక్ ఇబ్బందులు తొలగడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సర్వే నంబర్ 6లోని భూమిలో క్లీనింగ్, చదును పనులు కొనసాగుతున్నాయని, ప్రతి ఆదివారం ఈ భూమిలో మార్కెట్ నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, టీపీవో గిరిధర్, సానిటరీ ఎస్సైలు పర్వేజ్, నగేష్, జవాన్లు, కార్మికులు ఉన్నారు. -
నేడు‘సాగర్’ నీటి విడుదల
నిజాంసాగర్ : యాసంగి పంటల సాగు అవ సరాల కోసం సోమవారం ఉదయం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేయనున్నట్లు నీటిపారు దల శాఖ అధికారులు ఆదివారం ఒక ప్రకట నలో తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేయనున్నందన ప్రధాన కాలువ వైపు రైతులు త మ పశువులను తీసుకెళ్లవద్దని వెల్లడించారు. ఓటింగ్లో పాల్గొనం రామారెడ్డి: ఓటింగ్లో పాల్గొనకుండా ఉండాలన్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని గోకుల్ తండా పంచాయతీ పరిధిలోని కింది తండావాసులు స్పష్టం చేశారు. గోకుల్ తండా పంచాయతీ పరిధిలో మీదితండాలో 350 ఓట్లు, కింది తండాలో 250 ఓట్లున్నా యి. ఓటర్లు ఎక్కువగా ఉన్న తండావాసులు తమకు సర్పంచ్ అవకాశం దక్కకుండా చూ స్తున్నారని, ఆ తండాలో రూ. 13.52 లక్షల కు వేలం నిర్వహించి ఒక్క అభ్యర్థినే బరిలో నిలిపారని ఆరోపిస్తూ ఎన్నికలలో పాల్గొనబోమని కింది తండావాసులు తేల్చిచెప్పా రు. విషయం తెలుసుకున్న ఆర్డీవో వీణ ఈ నెల 5న తండాకు వెళ్లి మాట్లాడినా ఫలితం లేకపోయింది. ఆదివారం మరోసారి సమావేశమైన కింది తండావాసులు.. తమ తండాలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తేనే ఓట్లు వేస్తామని, లేకపోతే ఎన్నికలలో పాల్గొనబోమని స్పష్టం చేశారు. అయితే కింది తండాకు చెందిన ఇద్దరు సర్పంచ్ బరిలో ఉండడం గమనార్హం. కింది తండావాసులు పోలింగ్లో పాల్గొనేందుకు అధికారులు ఏ చర్యలు తీసుకుంటారోనన్న దానిపై ఆసక్తి నెలకొంది. ‘సమాజం గురించి ఆలోచించేవారు చిరంజీవులు’ సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : సమాజం గురించి ఆలోచించే వారిని ప్రజలు ఎన్నడూ మరిచిపోరని ప్రముఖ వైద్యుడు జయచందర్ పేర్కొన్నారు. కామారెడ్డికి చెందిన దివంగత జర్నలిస్టు దయానంద్ పేరిట ఆయన మిత్ర బృందం సీనియర్ జర్నలిస్టు పున్నంచంద్కు అరిమిశెట్టి దయానంద్ స్మారక పురస్కారాన్ని అందించింది. ఆదివారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జయచందర్ మాట్లాడుతూ సమాజం గురించి పనిచేసే వారు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ అనారోగ్యం బారిన పడి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామం, నడక, యోగాకు కొంత సమయం కేటాయించాలని సూచించారు. కార్యక్రమంలో దయానంద్ మిత్ర బృందం, పుస్తకలోకం ప్రతినిధు లు కే.శ్రీనివాస్, కే.శ్యాంరావ్, జగన్నాథం, డాక్టర్ అయాచితం శ్రీధర్, డాక్టర్ వీఆర్ శర్మ, టి.హన్మాండ్లు, కే. వేణుగోపాల్, సీహె చ్ అనిల్కుమార్, మధుసూదన్, నారాయ ణ, రాములు, కిషన్గౌడ్, ప్రభాకర్, దయానంద్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రజల మెప్పుపొంది గర్వంగా నిల్చున్నాం నిజామాబాద్ రూరల్: అభివృద్ధి, సంక్షేమంలో తమ ప్రభుత్వం ప్రజలతో శభాష్ కొట్టించుకుంటోందని, వారి మెప్పు పొంది గర్వంగా నిల్చున్నామని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్కుమార్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టని కిషన్రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఆయనకు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. బీజేపీ నాయకులు మహాధర్నా పేరిట ప్రజలను మోసం చేసే కుట్రలు పన్నుతున్నారన్నారు. కేసీఆర్ రూ.8 లక్షల కోట్ల అప్పుతో రాష్టాన్ని కాంగ్రెస్కు అప్పగించారని, తాము ఒకవైపు వడ్డీలు కడుతూ.. మరోవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. అయినప్పటికీ వచ్చే మూడేళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామన్నారు. ఆయనవెంట డీసీసీ అధ్యక్షుడు నగేశ్రెడ్డి, నుడా చైర్మన్ కేశవేణు, నరాల రత్నాకర్, పార్టీ నాయకులు ఉన్నారు. -
బ్యాలెట్ పేపర్పై గుర్తులు మాత్రమే!
ఓటర్లు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు● అభ్యర్థుల పేర్లు ఉండవుభిక్కనూరు: గ్రామ భవిష్యత్తుకు సంబంధించి సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు అంత్యంత కీలకంగా భావించవచ్చు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి గుర్తులు మాత్రమే బ్యాలెట్ పేపర్పై ఉంటాయి. బ్యాలెట్పై పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఉండవు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల సమయంలో పోటీ చేసే అభ్యర్థుల పేర్ల పక్కనే ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తు అంటే రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు అయితే ఆ రాజకీయ పార్టీ గుర్తు, ఇండిపెండెంట్ అయితే ఎన్నికల సంఘం వారికి కేటాయించిన గుర్తు ఉంటుంది. సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసే అభ్యర్థుల పేర్లు బ్యాలెట్ పేపరుపై ఉండవు. దీంతో ఓటర్లకు గుర్తు గురించి అభ్యర్థులు పలుమార్తు చెప్పి అవగాహన కల్పించాల్సి ఉంటుంది. బ్యాలెట్ పేపర్పై గుర్తులు తప్ప పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఉండవన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ విషయం అభ్యర్థులకు తీవ్ర ఆందోళన కలగజేస్తోంది. అవగాహన లేకపోతే ఓటు వేరొకరికి పడే ప్రమాదం ఉంది. ఇది తమకుతీవ్రమైన నష్టం కలిగిస్తుందని ఆందోళన చెందుతున్నారు. ● తాము ఓటు వేయాలనుకునే అభ్యర్థి ఎన్నికల గుర్తును కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ● ఇంట్లోని వృద్ధులు, మహిళలకు కొత్త ఓట ర్లకు ఈ విషయాన్ని వివరించాలి. ● పోలింగ్ బూత్ వద్ద తొందరపడి గుర్తు చూడకుండా ఓటు వేయొద్దు. ● బ్యాలెట్ పేపరుపై ఉన్న గుర్తును సరిగా చూసిన తరువాతనే ఓటు వేయాలి. ● ఈ విషయాలను ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతై నా ఉందని పలువురు అంటున్నారు. యు వతతో పాటు అభ్యర్థులు తప్పనిసరిగా బ్యాలెట్ పేపర్పై అభ్యర్థుల పేర్లు ఉండవని, గుర్తులు మాత్రమే ఉంటాయని ప్రజల కు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
నీట మునిగి గురుకుల విద్యార్థి మృతి
● బహిర్భూమికని వెళ్లి.. ● ఈతకోసం నీటిలో దూకి మృత్యువాతనిజాంసాగర్(జుక్కల్): బహిర్భుమి కోసం బయటకు వెళ్లిన ఎస్సీ గురుకుల కళాశాల విద్యార్థి నీటి కుంటలో పడి మరణించాడు. అచ్చంపేట గ్రామ శివారులోని నిజాంసాగర్ ప్రాజెక్టు 16 గేట్లకు దిగువన చోటు చేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. బిచ్కుంద మండలం రాజపూర్ గ్రామానికి చెందిన గొట్టం అజయ్(17) అచ్చంపేట ఎస్సీ గురుకుల కళాశాలలో సీఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు అజయ్తోపాటు అశీష్, అఖిల్, అభిలాష్, మయూర్లు విధుల్లో ఉన్న టీచర్ అనుమతి తీసుకుని బహిర్భూమి కోసం బయటికి వెళ్లారు. అచ్చంపేట గ్రామ శివారులో బహిర్భూమికి వెళ్లిన తర్వాత ఐదుగురు స్నేహితులు నిజాంసాగర్ ప్రాజెక్టు 16 గేట్లకు కింది భాగానికి వచ్చారు. బండరాళ్ల మధ్య ఉన్న నీటి గుంతను చూసిన అజయ్.. ఈత కొట్టేందుకు అందులో దూకి మునిగిపోయాడు. మిగతావారు గాలించి బండరాళ్ల మధ్య ఇరుక్కున్న అజయ్ను ఒడ్డుకు తీసుకువచ్చారు. అయితే అప్పటికే అతడు అపస్మారక స్థితికి చేరుకోవడంతో అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్ వచ్చేసరికే అజయ్ మరణించాడు. సమాచారం అందుకున్న ఎస్సై శివకుమార్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు దాదాపు కిలోమీటర్ దూరంలోని అచ్చంపేట రోడ్డు వరకు మోసుకువెళ్లారు. అక్కడినుంచి ప్రైవేట్ వాహనంలో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్సీ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్, ఇన్చార్జి ప్రిన్సిపాల్ విధులలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల అజయ్ ప్రాణాలు పోయాయని మృతుడి బంధువులు ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
సర్పంచ్ బరిలో ముచ్చటగా మూడోతరం..
బాన్సువాడ రూరల్: ఇబ్రాహీంపేట్ గ్రామంలో వుద్దెర కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆ కుటుంబానికి చెందిన మూడోతరం సైతం సర్పంచ్ బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇబ్రాహీంపేట్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా గ్రామానికి చెందిన వుద్దెర గంగప్ప 1957 నుంచి 1983 వరకు సుమారు 26 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ప్రత్యేక పంచాయతీలుగా ఉన్న పోచారం, రాంపూర్, రాంపూర్ తండా, ఇబ్రాహీంపేట్ తండా, పులికుచ్చతండాలు 1984 వరకు ఉమ్మడి ఇబ్రాహీంపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉండేవి. ఆ తర్వాత రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో మరో అవకాశం కోసం 2001 వరకు వేచి ఉండాల్సి వచ్చింది. 2001లో సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో గంగప్ప కోడలు వుద్దెర కళావతి సర్పంచ్గా పోటీ చేసి గెలిచి ఐదేళ్లు పదవిలో ఉన్నారు. ఆమె 2019లో ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మళ్లీ సర్పంచ్ రిజర్వేషన్ బీసీ మహిళ వచ్చింది. దీంతో ఈసారి వుద్దెర కుటుంబానికి చెందిన మూడో తరం వ్యక్తిని బరిలో నిలిపారు. కళావతి పెద్ద కోడలు సంధ్యారాణి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆమె ఎంఏ, బీఈడీ చదివి సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. ఓటర్లు వుద్దెర కుటుంబానికి చెందిన మూడో తరాన్ని ఆదరిస్తారో లేదో ఈనెల 17న తేలిపోనుంది. ఓటర్లు 573.. అభ్యర్థులు 12.. మాచారెడ్డి : ఆ పంచాయతీ చిన్నదైనా పోటీ మాత్రం తీవ్రంగానే ఉంది. 573 ఓట్లున్న జీపీలో సర్పంచ్ పదవికోసం 12 మంది పోటీపడుతుండడం గమనార్హం. పరిపాలన సౌలభ్యం కోసం గత ప్రభుత్వం పంచాయతీల పునర్విభజన చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చిన్నచిన్న తండాలు కూడా పంచాయతీలుగా మారాయి. మాచారెడ్డి మండలంలోని కాకులగుట్టతండా, చెరువుకొమ్ముతండా, బ్రాహ్మణపల్లి తండాలను కలిపి కాకులగుట్ట తండా కేంద్రంగా పంచాయతీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఓటర్లు 573 మంది ఉన్నారు. ఇందులో 268 మంది పురుషులు, 305 మంది మహిళలున్నారు. సర్పంచ్ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ అయ్యింది. మూడు తండాల నుంచి 12 మంది పోటీ పడుతున్నారు. మాలోత్ గంగోత్రి, బూక్య సునీత, విస్లావత్ జమున, బూక్య అనురాధ, గుగులోత్ వనిత, అజ్మీర మంజుల, బానోత్ శోభ, బూక్య జ్యోతి, బూక్య సునీత, బూక్య రజిత, గుగులోత్ రాజీ, మాలోత్ తులసీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.మాచారెడ్డి : మండలంలోని గజ్యానాయక్ తండా చౌరస్తా గ్రామ పంచాయతీ బరిలో వార్డు సభ్యులుగా భార్యాభర్తలు జనపాల అనురాధ, నారాయణ పోటీ చేస్తున్నారు. అయితే వేరువేరు వార్డులనుంచి బరిలో ఉన్నారు. భార్య ఐదో వార్డునుంచి భర్త ఎనిమిదో వార్డునుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఇద్దరికీ గ్యాస్ స్టౌ గుర్తే రావడం గమనార్హం. -
ఎక్కడున్నా.. ఊరు ముచ్చటే!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి మనసు సొంతూరి ఎన్నికల గురించి ఆలోచిస్తోంది. ఊర్లో సర్పంచ్గా ఎవరు పోటీ చేస్తున్నారు? వార్డు సభ్యులుగా ఎవరెవరు బరిలో ఉన్నారు? అంటూ ఆరా తీస్తున్నారు. పోటీ చేసేవారిలో తమ స్నేహితులో, బంధువులో ఉంటే వారికి తమ మద్దతు తెలుపుతున్నారు. కొన్నిచోట్ల అయితే గల్ఫ్లో ఉన్న వారు తలా కొంత డబ్బు జమ చేసి తమ స్నేహితులకు ఎన్నికల ఖర్చుల కోసం పంపిస్తున్నారు. అంతేగాక ఎన్నికల్లో పోటీ చేస్తున్న తమ వారిని గెలిపించాలంటూ ఊళ్లోని తమ స్నేహితులు, బంధువులకు ఫోన్లు చేసి వేడుకుంటున్నారు. జిల్లానుంచి వేలాది మంది దుబాయి, అబుదాబీ, మస్కట్, కువైట్, ఇరాక్, మలేషియా తదితర దేశాలకు వలస వెళ్లారు. ఐదు దశాబ్దాలుగా తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళుతూనే ఉన్నారు. అప్పట్లో నక్సలైట్ల గొడవలు ఎక్కువగా ఉండి పోలీసులు, నక్సల్స్ మధ్య నలిగిపోయిన పల్లె యువత చాలా మంది గల్ఫ్ బాట పట్టారు. అప్పటి నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే సొంతూళ్లలో పంచాయతీ ఎన్నికలు నడుస్తుండడంతో గల్ఫ్లోని వలస జీవులు ఇక్కడి ఎన్నికల గురించి ఆసక్తి చూపుతున్నారు. గల్ఫ్ వెళ్లి వచ్చిన వారు కూడా చాలా మంది ఎన్నికల బరిలో నిలిచారు. వారికీ గల్ఫ్ వలస జీవులు స్నేహహస్తం అందిస్తున్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో ఓ గ్రామానికి చెందిన యువకుడు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తుండగా.. గల్ఫ్లో ఉన్న అతడి స్నేహితులు తలా కొంత జమ చేసి దాదాపు రూ.3 లక్షలు పంపించారు. పాల్వంచ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వారు గల్ఫ్ నుంచి తమ స్నేహితుడికి ఎన్నికల ఖర్చుల కోసం రూ. లక్ష పంపించారు. అంతేగాక తమ కుటుంబ సభ్యులకు, గ్రామంలో ఉన్న తమ బంధువులు, ఇతర స్నేహితులకు ఫోన్లు చేసి మనోడికి మద్దతు ఇవ్వాలంటూ ప్రాదేయపడుతున్నారు. అక్కడెక్కడో ఎడారి దేశంలో ఉన్న వారు ఫోన్లు చేసి బతిమాలుతుంటే కాదనలేకపోతున్నారు.ఉత్తర తెలంగాణలో గల్ఫ్ వలస వెళ్లిన గ్రామాలు రెండు వేలకు పైగా ఉంటాయని అంచనా. కొన్ని గ్రామాల్లో అయితే ఇంటికొకరు గల్ఫ్కు వెళ్లారు. ఇప్పటికీ వెళుతూనే ఉన్నారు. కొన్నిచోట్ల అయితే మూడు తరాల వారు గల్ఫ్ బాట పట్టారు. ఆయా గ్రామాల్లో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం మొదలైన నుంచి ఎవరు నామినేషన్లు వేస్తున్నారు? ఎవరి బలం ఎంత? ఎవరి మధ్య పోటీ ఉంటుంది? ఎవరు గెలిచే అవకాశాలున్నాయి? అన్న విషయాలపై ఫోన్లు చేసి కనుక్కుంటున్నారు. అలాగే ఊరుకు సంబంధించి సామాజిక మాధ్యమ గ్రూపులలో తమ వాయిస్ వినిపిస్తున్నారు. ఊరు అభివృద్ధి కోసం అవగాహన ఉన్న వారిని గెలిపించమని కొందరు వాయిస్ మెసేజ్లు పెడుతున్నారు. మరికొందరు తమ స్నేహితుడు, బంధువుకు మద్దతు ఇవ్వాలంటూ ప్రచారం చేస్తున్నారు. తొలి విడత నామినేషన్లు మొదలైన నాటి నుంచి గల్ఫ్ వలస జీవులు ఎప్పటికప్పుడు తమ ఊరి రాజకీయాల గురించి, ఇరుగుపొరుగు గ్రామాల్లోని రాజకీయాల గురించి తెలుసుకుంటున్నారు. వేల మైళ్ల దూరంలో ఉన్నా తమ మనసంతా సొంతూరుమీదే ఉందని చాటుతున్నారు.పల్లెపోరుపై గల్ఫ్లో ఆసక్తి పంచాయతీ ఎన్నికల గురించి తెలుసుకుంటున్న వలస జీవులు బరిలో నిలిచిన బంధుమిత్రులకు మద్దతుగా అక్కడి నుంచే ప్రచారం ఫోన్లు చేసి మనోడిని గెలిపించాలంటూ విజ్ఞప్తి సామాజిక మాధ్యమాల్లోనూ పోస్టులు ఉపాధి కోసమో.. ఉద్యోగాల కోసమో వలసవెళ్లినవారి మనసు సొంతూరు చుట్టే తిరుగుతోంది. పంచాయతీ ఎన్నికల గురించి తెలుసుకుంటున్నారు. తమవారు బరిలో ఉంటే.. వారికి ఓటేసి గెలిపించాలంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. బంధువులు, స్నేహితులకు ఫోన్లు చేస్తూ తమవారిని గెలిపించాలని కోరుతున్నారు. -
జాబితా.. తప్పుల తడక
● ఒకే వ్యక్తికి రెండు గ్రామాల్లో ఓటు హక్కు ● చనిపోయిన వారి పేర్లూ ఓటరు జాబితాలో.. ● బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామానికి చెందిన నీరడి శేఖర్కు గ్రామ ఓటరు జాబితాలో (ఇంటి నం.1–3) ఒకటో వార్డు 17 క్రమసంఖ్యలో అతడి పేరు ఉంది. ఇదే వ్యక్తికి బీర్కూర్లోని ఇంటి నంబర్ 1–3లోని ఒకటో వార్డు క్రమ సంఖ్య 24లో ఓటు వచ్చింది. ఒకే వ్యక్తికి ఇటు బైరాపూర్ లో, అటూ బీర్కూర్లో ఓటు హక్కు ఉండడం గమనార్హం. ఈ గ్రామంలో ఏళ్ల కింద చనిపోయిన వారి పేర్లు కూడా ఓటరు జాబితాలో ఉండటం విశేషం.బాన్సువాడ : పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా తప్పులతడకగా ఉంది. అధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యంతో అస్తవ్యస్తంగా జాబితా తయారు చేశారు. దీంతో రెండు, మూడేళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తుల పేర్లు కూడా ఓటరు జాబితాలో అలాగే ఉన్నాయి. సవరణకు అవకాశం ఇచ్చినా.. గతేడాది ఫిబ్రవరిలో పంచాయతీల పాలకవర్గ పదవీకాలం ముగిసింది. వీటికి ఎన్నికల నిర్వహించేందుకు 2024 సెప్టెంబర్ నుంచే ఎన్నికల సంఘం కసరత్తు చేసింది. జిల్లా అధికారులతో 2024 అసెంబ్లీ ఎన్నికల నాటి ఓటరు జాబితా ఆధారంగా ముసాయిదా జాబితా రూపొందించారు. అక్టోబర్ 1న తు ది జాబితాను ప్రకటించారు. ఈ జాబితా ప్రకారం బీర్కూర్ మండల కేంద్రంలో 7,044 ఓటర్లు ఉ న్నారు. పలు కారణాలతో ఎన్నికలు వాయిదా ప డగా 2025 జూన్ నుంచి కసరత్తు చేస్తూ సెప్టెంబర్లో పంచాయతీ ఓటర్ల తుది జాబితాను మరొ సారి ప్రకటించింది. మార్పులు, చేర్పులకు అవకా శం ఇచ్చినా బీఎల్వోలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పొరపాట్లు చోటు చేసుకున్నాయి. కొత్త ఓటర్లు పెరిగారు కానీ మరణించిన వారి ఓట్లు తొలగించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఓ వ్యక్తికి బైరాపూర్తోపాటు బీర్కూర్లోనూ ఓటు హక్కు కల్పించారు. మరణించినవారి ఓట్లూ జాబితాలో ఉన్నాయి. దీంతో ప్రస్తుతం పంచాయతీ బరిలో ఉన్న అభ్యర్థులు ఓటరు జాబితాను చూసి తలలు పట్టుకుంటున్నారు.మాది బైరాపూర్ గ్రామం. ఇక్కడే పుట్టిన. బైరాపూర్లో నే ఓటు ఉంది. ఈసారి పంచాయతీ ఎన్నికల జాబితా లో బీర్కూర్లో ఓటు ఉన్న ట్లు తెలిసింది. అక్కడ నా పే రుతో ఓటు ఎలా వచ్చిందో తెలియదు. సొంతూరు బైరాపూర్లోనే ఓటు వేస్తా. – శేఖర్, బైరాపూర్వాసి -
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగం
రాజంపేట: మండలంలో ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా 19 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు స్థానిక ఎంపీడీవో బాలకృష్ణ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ సరళిని జిల్లా ఎన్నికల అబ్జర్వర్ సత్యనారాయణ రెడ్డి పరిశీలించారు భిక్కనూరులో 31 పోస్టల్ ఓట్లు భిక్కనూరు: మండలానికి చెందిన 31 మందికి చెందిన పోస్టల్ ఓట్లు ఆదివారం పోలయ్యాయని భిక్కనూరు ఎంపీడీవో రాజకిరణ్ రెడ్డి తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు ఈనెల 9 తేది వరకు తమ ఓటును పోస్టల్ బ్యాలెట్ రూపకంగా వేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ రూపంలో వేయాలని కోరారు. బీబీపేట: మాందాపూర్ జీపీ కార్మికుడిగా పని చేస్తూ గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్గా చేస్తున్న సడుగు మల్లేశం తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రస్తుతం ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. మాందాపూర్లో ప్రస్తుతం 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మల్లేశం జీపీ కార్మికుల హక్కుల కోసం చాలా సార్లు ఉద్యమంలో పాల్గొన్నారు. గ్రామంలో జనరల్కు రిజర్వేషన్ రావడంతో పోటీలో నిలబడ్డారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని, ప్రతి అభివృద్ధిలో ముందంజలో ఉంటానని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. మాక్లూర్: మండల కేంద్రంలో పోలీసులు ఆదివారం కవాతు నిర్వహించారు. సర్పంచ్ ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలని పోలీసులు కోరారు. ఏసీపీ రాజావెంకట్రెడ్డి నార్త్జోన్ సీఐ శ్రీనివాస్, ఎస్సైలు రాజశేఖర్, తిరుపతి, గంగాధర్, మొగులయ్య పోలీసు సిబ్బందితో కలిసి మండల కేంద్రంతో పాటు కల్లెడి గ్రామాల్లో భారీ కవాతు చేపట్టారు. ఈ నెల 14న చేపట్టే ఎన్నికల్లో ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా చూడాలన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనిక ఓరారు. కవాతులో పోలీసులు పాల్గొన్నారు. నిజామాబాద్అర్బన్: నగరంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఓ మహిళ బస్సు ఎక్కే క్రమంలో మరో మహిళ బ్యాగ్ దొంగిలించింది. ఈ ఘటనకు సంబంధించి ఒకటో టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనుష్క అనే మహిళ హైదరాబాద్ నుంచి నిజామాబాద్కు ఆదివారం రైలులో వచ్చింది. ఆమె బోధన్కు వెళ్లేందుకని రైల్వేస్టేషన్ ఎదుట ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా ఆమె వెనుకాల ఉన్న ఓ వృద్ధ మహిళ బాధితురాలి బ్యాగ్ను దొంగిలించింది. కొద్దిసేపటికి బ్యాగ్ కనిపించకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బ్యాగులో 4.7 తులాల బంగారం, రూ. రెండు వేల నగదు ఉన్నట్లు బాధితురాలు పేర్కొన్నారు. అనంతరం పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో ఓ వృద్ధ మహిళ బాధితురాలి బ్యాగ్ను దొంగిలిస్తున్నట్లు సీసీ ఫుటేజీలో రికార్డు అయింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
సాయిబాబా ఆలయ కమిటీ కార్యవర్గం
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పట్టణం విద్యానగర్ సాయిబాబా దేవాలయ నూతన కమిటీని ఆదివా రం ఎన్నుకున్నారు. మాజీ కౌన్సిలర్లు మోతే కృష్ణా గౌడ్, కుంబాల రవియాదవ్, కొక్కొండ రవీందర్ స మక్షంలో ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా రా జూరి మనోహర్, వర్కింగ్ అధ్యక్షుడిగా పొగాకు శ్రీనివాస్, కార్యదర్శిగా కై లాస్ సంతోష్, కోశాధికారి గా జక్సాని చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. అనంతరం ప్రతినిధులను సన్మానించారు. ఆలయ కమిటీ మాజీ ప్రతినిధులు పి.రాజమౌళి, వాసరయ్య, బి.సీతారామారావు, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
పోచారంలో ఏకగ్రీవమే ఆచారం..!
బాన్సువాడ రూరల్: నాలుగు దశాబ్దాలుగా ఏకగ్రీవ పంచాయతీగా రికార్డు సాధించిన బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో ఈసారి కూడా అదే ఆచారం కొనసాగనుంది. గ్రామస్తులు కేతావత్ రమేశ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోగా అదే గ్రామానికి చెందిన నరేష్ రాథోడ్ విభేదించి నామినేషన్ దాఖలు చేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. నరేష్ రాథోడ్ నామినేషన్ పత్రాన్ని బలపరిచిన గులాబ్ సింగ్ అనే వ్యక్తి.. తనతో బలవంతంగా సంతకం చేయించారని రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో రిటర్నింగ్ అధికారి నామినేషన్ను స్క్రూట్నీలో కొట్టేశారు. కాగా ఆదివారం నరేశ్ రాథోడ్ బీఆర్ఎస్ లీగల్సెల్ సహకారంతో అప్పీల్కు వెళ్తాడని, కోర్టును ఆశ్రయిస్తాడనే ఊహాగానాలు వచ్చాయి. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ అజ్ఞాతం వీడిన నరేష్ రాథోడ్ గ్రామస్తుల నిర్ణయం మేరకే నడుచుకుంటానని ప్రకటించినట్లు తెలిసింది. దీంతో ఈసారి కూడా బాన్సువాడ ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డి స్వగ్రామం పోచారం గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. డిచ్పల్లి(జక్రాన్పల్లి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘా తం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డి సూచించారు. ఆదివారం జక్రాన్పల్లి పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. డిచ్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ వినోద్, జక్రాన్పల్లి ఎస్సై మహేశ్లతో శాంతిభద్రతలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ.. ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలు, హాట్స్పాట్ ప్రాంతాలను గుర్తించాలన్నారు. ప్రతి గ్రామానికి తగిన బందోబస్తు, సిబ్బంది కేటాయింపు, పికెటింగ్, గస్తీ, క్విక్ రెస్పాన్స్ టీమ్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. డిచ్పల్లి సీఐ, జక్రాన్పల్లి ఎస్సై, సిబ్బంది పాల్గొన్నారు. -
వలస ఓటర్లపై స్పెషల్ ఫోకస్
● రానూపోను ఖర్చులు అభ్యర్థులవే ● హామీ తీసుకుని ముందుగానే ఫోన్ఫే, గూగుల్ పే ద్వారా చెల్లింపులు ● మందు, విందు ఏర్పాట్లు రామారెడ్డి: అన్న నమస్తే.. అంతా మంచిదేనా ఎట్లా ఉన్నావ్.. సర్పంచ్గా పోటీ చేస్తున్నా. ఈ నెల 11న మన పోలింగ్ ఉంది. వదిన నీ పెద్ద కొడుకు నువ్వు బుధవారం సాయంత్రంలోగా ఊరికి వచ్చేలా ప్లాన్ చేసుకోండి.. ఏం ఫికర్ పడకు రానూపోను చార్జీలతోపాటు పైఖర్చులు కూడా చూసుకుంటా. నీ నంబరుకు ఫోన్ పే ఉంది కదా? రవాణా చార్జీలు పంపుతా.. లేదా.. మన ఊరోళ్లు మీ కాలనీలో ఎవరైనా ఉంటే ఓ కారు మాట్లాడుకొని అందరూ రండి.. కిరాయి నేనేస్త. నామీద ఒట్టే.. నువ్వు తప్పకుండా రావాలి. నాకు ఓటెయ్యాలి. హామీ ఇచ్చిన విధంగా ముందే రామారెడ్డి మండలంలోని ఓ గ్రామంలో ఓ సర్పంచ్ అభ్యర్థి పెద్ద హాల్ను కూడా మాట్లాడి పెట్టినట్లుగా సమాచారం ఇందులోనే మందు విందుతో పాటు తెలిసన వాళ్ల ఇంట్లో రాత్రి నిద్రకు ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వలస ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పడుతున్న కష్టాలివి. సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమే.. స్వల్ప తేడా ఓట్లతోనే ఫలితం తారుమారయ్యే అవకాశాలు ఉంటాయి. స్థానిక ఎన్నికలను అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ప్రతీ ఓటరుపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. నువ్వా నేనా అన్నట్లు ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ వార్డుల వారీగా అనుకూల ఓట్లపై ఆరా తీస్తూ వారిని ఎలా కలవాలి? అనే దానిపై ప్లాన్ చేస్తున్నారు. ఉపాధి కోసం వెళ్లినవారిపై ఫోకస్.. ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన గ్రామ ఓటర్లపై అభ్యర్థులు దృష్టి సారిస్తున్నారు. ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారని ఇప్పటికే ఆరా తీశారు. అభ్యర్థుల కుటుంబసభ్యులు, బూత్ కన్వీనర్లు, ఏజెంట్ల ద్వారా ఇంటింటికి తిరిగి ఓటర్ల వివరాలు సేకరిస్తున్నారు. ఒక్కో గ్రామంలో సుమారు 100 నుంచి 200 మంది వరకు వలస ఓటర్లు ఉన్నట్లు అంచనా వేసుకుంటూ ప్రత్యేకంగా బృందాలను రంగంలోకి దింపారు. వలస వెళ్లిన వారికి ఫోన్లపై ఫోన్లు చేయిస్తున్నారు. ఎక్కడ ఉన్నా పోలింగ్కు ఒక రోజు ముందుగానే స్వగ్రామాలకు రప్పించి తమకు అనుకూలంగా ఓటు వేయించుకునేందుకు పోటీ పడుతున్నారు. వారి ఫోన్ నంబర్లు సేకరిస్తూ వాట్సప్ గ్రూప్లు క్రియేట్ చేసి వారితో నిత్యం అభ్యర్థికి సంబందించిన వ్యక్తులు మాట్లాడుతున్నారు. ముందస్తు చెల్లింపులు కూడా... ముందుగానే డబ్బులు పంపిస్తే ఓటర్లు తమకు ఓట్లు వేస్తారని, లేకపోతే వేయకపోవచ్చని భావించి కొందరు అభ్యర్థులు ముందుగానే డబ్బులు ఆన్లైన్లో పేమెంట్ చేస్తున్నారు. ఓటర్ల సంఖ్య ఆధారంగా ఒక్కో ఓటరుకు రాకపోకలకయ్యే ఖర్చుతోపాటు అదనంగా ఓటుకు గ్రామ పంచాయతీని బట్టి రూ.500 వరకు పంపిస్తున్నట్లు తెలుస్తోంది. జీవనోపాధి కోసం గ్రామాల నుంచి దూరప్రాంతాలకు వెళ్లిన వారు గ్రామాల్లో జరిగే ఎన్నికల్లో ఓటు చేసేందుకు వచ్చినవారు తమకు వచ్చే కూలి డబ్బులు నష్టపోకుండా చెల్లింపులు చేస్తున్నారు. ’గుర్తు’ను గుర్తించుకోవడం కోసం..... పల్లె ప్రచారం జోరుగా సాగుతోంది. కొంత మంది సర్పంచ్ అభ్యర్థులు గుర్తును జనంలో తీసుకెళ్లేందుకు ఓటర్లకు వారికి కేటాయించిన ఉంగరం, కత్తెర, కప్పు సాసర్లు, బ్యాట్లు, కార్లు, జగ్గులు ఓటర్లకు పంపిణీ చేసి పడరాని పాట్లు పడుతున్నారు. సమస్యగా మారిన కుల సంఘాలు... అభ్యర్థులు గెలుపు కోసం ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. కానీ కుల సంఘాల దగ్గర వచ్చే సరికి ఇబ్బందులు పడుతున్నారు. కులం సభ్యులు పెద్ద మొత్తంలో డబ్బులను అడుగుతుండడంతో అంత డబ్బులు ఇవ్వలేక, ఇవ్వనని చెప్పలేకపోతున్నారు. -
పేదల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
● అభివృద్ధికి పట్టం కట్టాలి ● ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి రుద్రూర్: పేదల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, ఓపిక ఉన్నంత వరకు లక్ష్య సాధనకు కృషి చేస్తానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బాన్సువా డ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని శశిరేఖ గార్డెన్లో ఆదివారం సర్పంచ్ మద్దతుదారు వసంత తరఫున ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా ప్రతినిధులు ఎన్నికై పని చేయని వారిని ఓడించాలని, అభివృద్ధి చేసిన వారిని గెలిపించాలని అన్నారు. స్థానిక సమస్యలపై అవగాహన కలిగి ఉండి పరిష్కరించే వ్యక్తి సర్పంచ్గా ఉండాలని స్పష్టం చేశారు. మండల కేంద్రంలో అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం రూ. కోట్లు కేటాయించానని అన్నారు. సమావేశంలో రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, సర్పంచ్ అభ్యర్థి వసంత, జెడ్పీటీసీ నారోజి గంగారాం, విండో మాజీ చైర్మన్ పత్తి రాము, విండో చైర్మన్ సంజీవరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ నట్కరి సాయిలు తదితరులు పాల్గొన్నారు. -
మేజర్ పంచాయతీ అంటే..
మీకు తెలుసా..‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? సదాశివనగర్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లకు ఎవరూ నచ్చకపోతే నోటా(నన్ ఆఫ్ ది ఎబో) గుర్తుకు ఓటేసే అవకాశాన్ని ఈ సారి రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించింది. పోటీలో ఉన్న అభ్యర్థుల కన్నా అధికంగా ఓట్లు నోటాకు వచ్చినా ఎన్నిక రద్దయ్యే అవకాశం లేదు. ప్రస్తుత ఎన్నికల నిబంధనల ప్రకారం నోటాకు అందరికన్నా ఎక్కువ ఓట్లు పోలైనా తర్వాత ఓట్లు వచ్చినా అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. నోటాకు అధికంగా ఓట్లు పోలైనప్పుడు ఆ ఎన్నికను రద్దు చేసి మళ్లీ పోలింగ్ నిర్వహించాలని గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. నోటాకు వచ్చిన ఓట్ల కన్నా తక్కువ సాధించిన అభ్యర్థులను తదుపరి ఐదేళ్ల పాటు అన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా చూసేలా నిబంధనలు రూపొందించాలని అప్పట్లో పిటిషన్లో కోరారు. దీన్ని పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం ఎన్నికల సంఘానికి ఈ విషయంలో నోటీసులు జారీ చేసింది. అయినా ఇప్పటి వరకు ఈ అంశంపై ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పీపుల్స్ ఫర్ సివిల్ లిబర్టీస్(పీయూసీఎల్) వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంతో 2013లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఈవీఎంలలో నోటా మీటను ఏర్పాటు చేశారు. ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అభ్యర్థులు నచ్చకపోతే నోటా గుర్తుకు ఓటేసే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. సదాశివనగర్: మేజర్ పంచాయతీ అంటే సాధారణ గ్రామాలతో పోలిస్తే జనాభా, ఆదాయం ఎక్కువగా ఉండి, పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఎక్కువ నిధులు, వన రులు అందుబాటులో ఉండే ఒక పెద్ద గ్రామ స్థానిక స్వపరిపాలన సంస్థ. దీనికి ఎక్కువ బడ్జెట్తో పాటు, మెరుగైన మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపులు ఉంటాయి. ఇది చిన్న గ్రామ పంచాయతీల కంటే ఎక్కువ అధికారాలను కలిగి ఉంటుంది. ముఖ్య లక్షణాలు: అధిక పన్నులు, ప్రభుత్వ గ్రాంట్లు, ఇతర ఆదాయ మార్గాల వల్ల ఆర్థికంగా బలంగా ఉంటుంది. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, రోడ్లు, నీటి సరఫరా వంటి వాటిపై ఎక్కువ ఖర్చు చేయగలదు. పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి, ఒక కార్యనిర్వహణ అధికారి లేదా పంచాయతీ కార్యదర్శి వంటి అదనపు సిబ్బందిని నియమించుకోవచ్చు. ప్రభుత్వ అభివృద్ధి పథకాల్లో ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. ఎన్నికల సమయంలో కూడా ఎక్కువ ఖర్చు, డిమాండ్ ఉంటుంది. చిన్న గ్రామ పంచాయతీకి రూ. లక్ష వరకు ఖర్చు చేసే అవకాశం ఉంటే, మేజర్ పంచాయతీలకు అంతకంటే ఎక్కువ నిధులు అందుబాటులో ఉంటాయి. సంక్షిప్తంగా, మేజర్ పంచాయతీ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా, జనాభా పరంగా బలంగా ఉండి, మెరుగైన పాలన అందించే ఒక పెద్ద గ్రామ స్వపరిపాలనా విభాగం. పంచాయతీ రిజిస్టర్లు ఇవే.. డిచ్పల్లి: గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్. ప్రజాస్వామ్య వ్యవస్థలో చెక్ పవర్తో పాటు విశేషమైన అధికారులు ఉంటాయి. గ్రామపంచాయతీలో నిర్వహించాల్సిన రిజిస్టర్లు ఇలా ఉన్నాయి. గ్రామపంచాయతీ సమావేశపు ఎజెండా నోటీసు రిజిస్టర్ సభ్యుల హాజరు రిజిస్టర్ మినిట్స్ తీర్మానాల రిజిస్టర్ గ్రామసభ ఎజెండా నోటీను రిజిస్టర్ గ్రామసభ సభ్యుల హాజరు రిజిస్టర్ గ్రామసభ తీర్మానాలు–మినిట్స్ నగదు పుస్తకం(క్యాష్బుక్) ఇంటి పన్ను డిమాండ్ రిజిస్టర్ నెలవారీ నల్లా రుసుం డిమాండ్ రిజిస్టర్ వ్యాపార లైసెన్సు రిజిస్టర్ గృహ నిర్మాణాల అనుమతుల రిజిస్టర్ ఆదాయం వచ్చు ఆస్తుల రిజిస్టర్ చెల్లింపుల కోసం బిల్లులు పాస్ చేసిన రిజిస్టర్ చిల్లర పాటల రిజిస్టర్ ధర్మాదాయాల, ధర్మనిధుల రిజిస్టర్ అక్విటెన్సు రిజిస్టర్ ఆడిట్ రిజిస్టర్ డీసీబీ రిజిస్టర్ స్టాక్ రిజిస్టర్ టూల్స్ అండ్ ప్లాంట్స్ రిజిస్టర్ మనీ వాల్యు రిజిస్టర్ -
ఊపందుకున్న పంచాయతీ ప్రచారం..!
సదాశివనగర్(ఎల్లారెడ్డి): గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల జోరు ఊపందుకుంది. ప్రకటన రావడం, మొదటి.. రెండో.. మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మొదటి, రెండో విడతల అభ్యర్థులకు గుర్తులను కూడా కేటాయించారు. మూడో విడత నామినేషన్ల పరిశీలన అభ్యర్థులకు గుర్తులు కేటాయించాల్సి ఉంది. ఈ నెల 11, 14, 17 తేదీలలో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలపై గ్రామాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఇప్పటికే పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ● పెద్ద మనుషులతో మంతనాలు.. గ్రామాల్లో కాస్తో కూస్తో పలుకుబడి కలిగిన నాయకులు, పెద్ద మనుషులుగా చలామణి అయ్యే వారు, విశ్రాంత ఉద్యోగులు, యువకులు తదితరులతో అభ్యర్థులు తమకు మద్దతు ఇవ్వాలని మంతనాలు జరుపుతున్నారు. గ్రామాల్లో కుల సంఘాలు, మహిళా సంఘాలు, వ్యాపార వాణిజ్య సంఘాలతో ఎవరికి వారుగా లాబీయింగ్ నడుపుతున్నారు. తను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి పాటుపడతామని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పుకొంటూ ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థులే కాకుండా వారి కుటుంబ సభ్యులు సైతం ఎవరికివారు ఓటర్లను మెప్పించే పనిలో నిమగ్నమయ్యారు. ●రహస్యంగా విందులు.. అభ్యర్థులు గ్రామాల్లో రహస్యంగా విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం మొత్తం బలాబలాలపై సమీక్షించుకుంటున్నారు. సాయంత్రం కాగానే మందు పార్టీలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో ఉంటున్నారు. అభ్యర్థులు ప్రత్యర్థి గ్రూపుల్లో కోవర్టులను సైతం పెట్టుకుని ఎత్తుకుపైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ●వాట్సాప్ గ్రూప్ల్లో పోస్టులు.. ప్రతి గ్రామంలో 5 నుంచి 10 వాట్సాప్ గ్రూపులున్నాయి. ఆయా గ్రూపుల్లో 60 శాతానికి పైగా ఓటర్లు ఉంటున్నారు. అభ్యర్థులు తమను ఎందుకు గెలిపించాలి...తాము గెలిస్తే ఎలాంటి పనులు చేపడతాం. గ్రామాభివృద్ధిపై వారి అభిప్రాయాలను నేతల సందేశాలు, హామీలు , రోజువారీ ప్రచారచిత్రాలను పోస్టు చేస్తున్నారు. ప్రత్యర్థులు పెట్టే పోస్టులకు సమాధానాలు పెడుతున్నారు. అభ్యర్థులతో పాటు వారి సన్నిహితులు, కుటుంబ సభ్యులు వీటినే ప్రసార అస్త్రాలుగా మార్చుకుంటున్నారు. కొన్ని చోట్ల మహిళా వాట్సప్ గ్రూపుల ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ప్రచార జోరు పెంచారు. నిరక్ష్యరాస్యులైన అభ్యర్థులు సైతం వాయిస్ మెసేజ్లు ద్వారా ప్రచారం కొనసాగిస్తుండడం గమనర్హం. తెల్లవారంగానే ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న అభ్యర్థులు ఎవరికివారే జోరుగా ప్రచారం అవకాశాలన్నింటిని వినియోగించుకుంటున్న అభ్యర్థులు -
9న కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఈనెల 9న ఆవిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కామారెడ్డి కలెక్టరేట్లో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు దిమ్మెను నిర్మించి చుట్టూరా గ్రానైట్ను అతికించారు. అలాగే స్టీల్ రెయిలింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. విగ్రహాన్ని తీసుకువచ్చి బిగించారు. మిగిలిన పనులు పూర్తి చేసి ఈనెల 9న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. వామ్మో చలి! కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలో చలి తీవ్ర త ఎక్కువగా ఉండడంతో ప్రజలు గజగజ వ ణుకుతున్నారు. కొన్ని రోజులుగా జిల్లాలో క నిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలకన్నా తక్కువగా నమోదవుతున్నాయి. శనివారం కనిష్ట ఉష్ణోగ్రత10.3 డిగ్రీలుగా నమోదయ్యింది. చలి ఎక్కువగా ఉండడంతో తెల్లవారుజామునే పనులకు వెళ్లేవారు ఇబ్బందిపడుతున్నారు. వచ్చేనెలలో కామారెడ్డిలో రాష్ట్ర స్థాయి సైన్స్ఫెయిర్ సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఏటా నిర్వహించే రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ను ఈసారి కామారెడ్డి జిల్లాలో నిర్వహించనున్నారు. వచ్చే నెలలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఏడాదికో జిల్లాలో రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేస్తుంటారు. దీనికి ఈసారి కామారెడ్డి వేదిక కానుంది. జిల్లా కేంద్రంలోని ఏ పాఠశాలలో ఏర్పాటు చేయాలన్న విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. తేదీలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది. ఈవీఎం గోదాం పరిశీలన కామారెడ్డి క్రైం: కలెక్టరేట్కు సమీపంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సందర్శించారు. ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. భద్రత ఏర్పాట్లపై సూచనలు ఇచ్చారు. సీసీ కెమెరాలు నిరంతరాయంగా పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, తహసీల్దార్ జనార్దన్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది ఉన్నారు. కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మూడు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు మోడల్ కోడ ఆఫ్ కండక్ట్ అమలులో ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. గ్లోబల్ సమ్మిట్కు పైడి ఎల్లారెడ్డికి ఆహ్వానం కామారెడ్డి టౌన్: రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి జిల్లాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డికి ఆహ్వానం అందింది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8, 9 తేదీలలో హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ విజన్–2047 గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు ఎల్లారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
నిఘా నీడలో ఎన్నికలు
కామారెడ్డి క్రైం : గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా అక్రమంగా మద్యం, నగదు, ఇతర వస్తువుల తరలింపుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. ఇందుకోసం జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తనిఖీ బృందాలు, చెక్పోస్టులు నిరంతరంగా పని చేస్తున్నాయి. రూ.50 వేలకు మించి నగదు తరలింపుపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల పాత్ర ఎంతో కీలకం. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి అక్రమంగా మద్యం, నగదు, వస్తువుల రవాణా కాకుండా అడ్డుకునేందుకు ప్రత్యేకంగా 5 ఎస్ఎస్టీ (సర్వేలెన్స్ అండ్ స్టాటిస్టికల్ టీమ్)లను ఏర్పాటు చేశారు. జిల్లాలోని రాష్ట్ర సరిహద్దుల వద్దనున్న చెక్పోస్టులలో రెండు బృందాలను, జిల్లాకు ఆనుకుని ఉన్న ఇతర జిల్లాల నుంచి జరిగే రాకపోకలపై నిఘా వేసేందుకు మరో మూడు బృందాలను నియోగించారు. ఈ బృందాలు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా రవాణా జరిగినట్లు గుర్తిస్తే సీజ్ చేయడం, కేసులు నమోదు చేయడం చేస్తున్నారు. ఇవి కాకుండా గ్రామాల్లో ప్రత్యేక తనిఖీల కోసం పోలీసు, రెవెన్యూ, ఎకై ్సజ్ అధికారులతో కలిసి మండలానికో ఎఫ్ఎస్టీ (ఫ్లయింగ్ స్క్వాడ్ టీం) ఏర్పాటు చేశారు. ఆయా బృందాలు గ్రామాల్లో పర్యటిస్తూ వాహనాల తనిఖీలతో పాటు ఏవైనా ఫిర్యాదులు వస్తే వెంటనే అక్కడికి చేరకుని విచారణ జరుపుతాయి. వీడియోగ్రఫీతో కూడిన విచారణ, తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇవే కాకుండా వ్యయ పరిశీలన బృందాలు పోటీలో ఉన్న అభ్యర్థుల ఖర్చులను లెక్కించడంలో, ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) బృందాలు ఎన్నికల తీరును పరిశీలించడంలో నిమగ్నమయ్యాయి. మాచారెడ్డి వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును పరిశీలిస్తున్న ఎస్పీ (ఫైల్)విస్త ృతంగా తనిఖీలు..జిల్లాలో ఏర్పాటు చేసిన ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి విస్తృతంగా తనిఖీ చేస్తున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనల్లో భాగంగా రూ.50 వేలకు మించి ఎవరూ రవాణా చేయకూడదనే నిబంధన అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఐదు రోజుల క్రితం మాచారెడ్డి మండలంలో జరిగిన తనిఖీల్లో డీసీఎంలో ప్రయాణిస్తున్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్కు చెందిన ఓ వ్యక్తి వద్ద రూ.10 లక్షలను ఎఫ్ఎస్టీ బృందాలు గుర్తించి పట్టుకున్నాయి. ఆధారాలు పరిశీలించి తరువాత విడిచిపెట్టారు. మూడు రోజుల క్రితం తాడ్వాయి మండలం కన్కల్ గ్రామంలో ఓ సర్పంచ్ అభ్యర్థి పంపిణీకి సిద్ధంగా ఉంచిన 41 బిందెలను ఎఫ్ఎస్టీ బృందం పట్టుకుంది. రెండు రోజుల క్రితం రామారెడ్డిలో ఓ సర్పంచ్ అభ్యర్థి ఇంట్లో 96 మద్యం సీసాలు, అన్నారం బెల్టు షాప్లో 15 బాటిళ్ల మద్యం పట్టుకుని సీజ్ చేశారు. జిల్లాకు ఎన్నికల సాధారణ పరిశీలకుడిగా నియమితులైన సత్యనారాయణరెడ్డితో పాటు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్బందీగా అమలు చేసేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న అధికారులు నిరంతరం కొనసాగుతున్న తనిఖీలు మద్యం, నగదు, వస్తువుల తరలింపుపై ప్రత్యేక నిఘా -
ప్రచార జోరు
● రంగంలోకి ముఖ్య నేతలు ● సాధారణ ఎన్నికలను తలపిస్తున్న వాతావరణం – 9లో uఆదివారం శ్రీ 7 శ్రీ డిసెంబర్ శ్రీ 2025పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. తొలి, మలి విడతల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. మూడో విడతకు సంబంధించి ఉపసంహరణ ఘట్టం మిగిలి ఉంది. తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామాలలో ఇప్పటికే రాజకీయ వాతావరణం వేడెక్కగా.. రెండో విడత బరిలో నిలిచిన అభ్యర్థుల లెక్క శనివారం తేలడంతో వారు ప్రచార రంగంలోకి దిగారు. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఆయా పార్టీల ముఖ్యనేతలంతా పల్లె పోరుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికలు జరిగే పంచాయతీల్లో తమ పార్టీకి చెందినవారిని గెలిపించుకునేందుకు రంగంలోకి దిగారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు కొందరు ప్రచారంలోనూ పాల్గొంటున్నారు. మరికొందరు కుల సంఘాలు, యువజన సంఘాల నేతలను తమ దగ్గరకు పిలిపించుకుని మద్దతు కూడగడుతున్నారు. ముఖ్య నేతలు రంగంలోకి దిగడంతో పంచాయతీ ఎన్నికల ప్రచారం సాధారణ ఎన్నికలను తలపిస్తోంది. ● కామారెడ్డి నియోజకవర్గంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ మండల కేంద్రాలు, పెద్ద గ్రామాల్లో తమ పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించేందుకు ఆయా గ్రామాల పెద్ద మనుషులను తన వద్దకు రప్పించుకుని వారి మద్దతు కూడగడుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తమ పార్టీ మద్దతుదారులను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. పలు గ్రామాల ప్రజలతో ఆయన సమావేశాలు నిర్వహించారు. వీడియో సందేశాన్ని సామాజిక మాద్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ తరపున మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తమ పార్టీకి చెందిన వారి గెలుపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ● జుక్కల్ నియోజక వర్గంలో స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలాగే ఆయన గ్రామాలకు వెళ్లి ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే బీఆర్ఎస్ మద్దతుదారుల గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ మద్దతుదారుల తరపున మాజీ ఎంపీ బీబీ పాటిల్, మాజీ ఎమ్మెల్యే అరుణతార వివిధ వర్గాల వారితో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ● బాన్సువాడ నియోజకవర్గంలో డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన గ్రామాలకు వెళ్లి వివిధ వర్గాల వారితో మాట్లాడుతున్నారు. ఆయనతో పాటు కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాల్రాజ్ కూడా తిరుగుతున్నారు. బీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పార్టీ నేతలతో పలుమార్లు సమావేశమయ్యారు. పార్టీ మద్దతుదారులను గెలిపించాలని కోరుతున్నారు. ● ఎల్లారెడ్డి నియోజక వర్గంలో స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు పార్టీ మద్దతుదారుల గెలుపు కోసం కృషి చేస్తున్నారు. బీఆర్ఎస్ మద్దతుదారులను గెలిపించాలంటూ మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఓట్ల వేటలో అభ్యర్థులు.. తొలి, మలి విడతల్లో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులంతా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరోపక్క కులాలు, సంఘాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పోలింగ్ తేదీలు సమీపిస్తుండడంతో అంతటా ఎన్నికల గురించిన చర్చ నడుస్తోంది.మండలం సర్పంచ్ ఏకగ్రీవం ఎన్నికలు అభ్యర్థులు వార్డులు ఏకగ్రీవం ఎన్నికలు అభ్యర్థులు స్థానాలు జరిగేవి జరిగేవి గాంధారి 45 16 29 86 366 257 109 244 లింగంపేట 41 14 27 109 342 194 148 512 నాగిరెడ్డిపేట 27 06 21 70 232 103 129 282 ఎల్లారెడ్డి 31 04 27 75 246 141 105 223 మహ్మద్నగర్ 13 01 12 34 112 35 77 181 నిజాంసాగర్ 14 01 13 37 122 21 101 202 పిట్లం 26 01 25 71 234 27 203 454 మొత్తం 197 43 154 482 1,654 778 872 2,098 (పిట్లం మండలంలోని బ్రాహ్మణపల్లిలో నాలుగు వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు) -
తండ్రి, తల్లి, కొడుకు సర్పంచ్లు
రుద్రూర్: గ్రామానికి ఒక్కసారి సర్పంచ్గా ఎన్నికై తేనే ఎంతో అదృష్టంగా భావిస్తుంటారు. అలాంటిది పోతంగల్ మండలం హంగర్గా గ్రామ సర్పంచ్లుగా ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, తల్లి, కొడుకు పనిచేశారు. హంగర్గా సర్పంచ్గా నీరడి గంగాధర్ 1995లో ఎన్నికయ్యారు. గ్రామానికి అందించిన సేవలను గుర్తించిన గ్రామస్తులు 2001లో ఆయన భార్య నీరడి సావిత్రిని సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2013లో సర్పంచ్ పదవి బీసీ జనరల్కు కేటాయించడంతో గంగాధర్ కుమారుడు ఉదయ్ భాస్కర్ సర్పంచ్గా గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో ఉదయ భాస్కర్ మరోసారి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. -
బరిలో మేనమామ, అల్లుడు
బోధన్: సాలూర మండలంలోని కుమ్మన్పల్లి సర్పంచ్ స్థానం జనరల్కు కేటాయించారు. ఈ గ్రామంలో 628 మంది పురుషులు, 699 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. గ్రామ సర్పంచ్ స్థానానికి బుడిమె శ్రీనివాస్ రెడ్డి, శీలం మహేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. శ్రీనివాస్ రెడ్డి సొంత అక్క కుమారుడు మహేందర్ రెడ్డికి మేనమామ. మహేందర్ రెడ్డి తొలిసారిగా సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. శ్రీనివాస్ రెడ్డి సతీమణి హైమవతి గతంలో సర్పంచ్గా పనిచేశారు. ప్రస్తుత సర్పంచ్ ఎన్నికలో మేనమామ, అల్లుడు ప్రత్యర్థులుగా నిలిచారు. ఇరువురి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. -
ఘన్పూర్ దివంగత సర్పంచ్ భూమయ్య తీరేవేరు
మాచారెడ్డి: ప్రస్తుతం గ్రామాల్లో పంచాయతీ ఎ న్నికలు కొనసాగుతుండటంతో మాచారెడ్డి మండలం ఘన్పూర్(ఎం) గ్రామ సర్పంచ్గా రెండు పర్యాయాలు పనిచేసిన సాడెం భూమయ్య చేసి న సేవలను ప్రజలు గుర్తుకుతెచ్చుకుంటున్నారు. గ్రామానికి చెందిన భూమయ్యకు భార్య, పిల్లలు లేరు. 1991లో గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీలకు రిజర్వు కావడంతో భూమయ్యను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భూమయ్య ఉద యం లేవగానే సైకిల్పై ఊరంతా కలియతిరిగేవాడు. నల్లాల మోటార్లు చెడిపోయినా, పైపులై న్లు పగిలిపోయినా వాటర్మెన్తో కలిసి తాను వెళ్లి మరమ్మతులు చేసేవాడని గ్రామస్తులు చెబుతారు. తన వెంట ఉన్న చేతిసంచిలో సర్పంచ్, పంచాయతీ స్టాంపులు, ఇంక్ప్యాడు, దరఖాస్తు ఫారాలు పెట్టుకుని తిరుగుతూ పింఛన్లు రాని వా రికి దరఖాస్తుల మీద తన సంతకం, ముద్ర వేసి ఇస్తుండేవాడు. పది గంటలకు ఇంత సలిబువ్వ తినేసి సైకిల్ మీద మండల కార్యాలయాలకు వె ళ్లి అధికారులను కలిసేవాడు. ఓసారి భూమయ్య కలెక్టర్ వద్దకు వెళ్లి.. ‘ఓ సారూ నేను గన్పూర్ సర్పంచిని. నా పేరు సాడెం భూమయ్య. నువ్వు కలెక్టర్వట గద..’ అంటూ అప్పటి కలెక్టర్ చక్రపాణి చేయి పట్టుకుని చేతిలో ఉన్న దరఖాస్తును అందించాడు. తన చేయి పట్టుకున్న సాడెం భూ మయ్యతో ఆ కలెక్టర్ ఆప్యాయంగా మాట్లాడి ద రఖాస్తును చదివి వాటిని పరిష్కరించాడు. ఇలా ఐదేళ్ల పాటు ఆయన చేసిన సేవలతో గ్రామస్తులంతా ఆయన్ను ఎంతగానో అభిమానించేవారు. తరువాత 1996లో కూడా సర్పంచ్ పదవి ఎస్సీ జనరల్ రిజర్వు కావడంతో భూమయ్య ఎన్నికల బరిలో నిలిచాడు. అయితే పోటీకి మరొకరు రావడంతో ఎన్నిక జరిగింది. గ్రామస్తులు భూమయ్యనే గెలిపించారు. మరో ఐదేళ్లు ఆయన సర్పంచ్గా గ్రామస్తులకు సేవలందించాడు. 2001లో ఎస్టీ రిజర్వు కావడంతో భూమయ్య పోటీ చేసే అవకాశం చేజారింది. లే కుంటే మూడోసారి కూడా సర్పంచ్ అయ్యేవాడ ని గ్రామస్తులు చెబుతారు. 2011లో వృద్ధాప్యంతో చనిపోయాడు. రెండు పర్యాయాలు సర్పంచ్గా పనిచేసిన భూమయ్య చిల్లిగవ్వ కూడా వెనుకేసుకోలేదు. తన అంత్యక్రియలను గ్రామస్తులే నిర్వహించారు. ఆయన హయాంలో జరిగిన అ భివృద్ధ్ది పనులు, జీపీ భవనం, బడి భవనం, నీ టిట్యాంకులు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నా యని గ్రామస్తులు గుర్తు చేశారు. -
క్రైం కార్నర్
కుంటలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహంఆర్మూర్ టౌన్: పెర్కిట్లోని ఓ ట్రాక్టర్ షోరూమ్ వెనకాల ఉన్న కుంటలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. మృతుడి ఒంటిపై ఎర్రటి దుస్తులు ఉన్నాయని, వ యసు 45 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచామని పేర్కొన్నారు. మృతుడి సమాచారం తెలిస్తే ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని తెలిపారు. చికిత్స పొందుతూ ఒకరు మృతి కామారెడ్డి క్రైం: కత్తిపోటుకు గురైన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రామేశ్వర్పల్లి గ్రామస్తులు తెలిపారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని రామేశ్వర్పల్లి వద్ద బుధవారం రాత్రి కత్తిపోట్ల ఘటన చోటు చేసుకుంది. పాత కక్షలను మనసులో పెట్టుకొని రామేశ్వర్పల్లి వద్దనున్న డబుల్ బెడ్రూం కాలనీకి చెందిన గంగని ప్రవీణ్ అనే వ్యక్తి అదే కాలనీకి చెందిన రాజశేఖర్పై కత్తితో దాడి చేశాడు. రాజశేఖర్ హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. నిజామాబాద్అర్బన్: నగరంలోని మూడో టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఖానాపూర్ చౌరస్తా వద్ద బీహార్కు చెందిన రాంనాఽఽథ్ మెహతా గంజాయి విక్రయిస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రెండు గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంజాయి కొనుగోలు చేసేందుకు వచ్చిన ఏడుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై హరిబాబు తెలిపారు. -
ఒకే కుటుంబం నుంచి మూడోసారి..
బీబీపేట: సర్పంచ్ పదవిపై ఉన్న ఆసక్తితో ఆ కుటుంబాలు మూడోసారి సైతం బరిలో నిలిచి తమ సత్తా చూపించేందుకు సిద్ధమయ్యాయి. మండలంలోని ఇస్సానగర్ గ్రామంలో 2013–18 వరకు ఉప్పునూతుల రమణాగౌడ్ సర్పంచ్గా పనిచేశారు. అనంతరం 2018–23 వరకు ఆయన భార్య ఉప్పునూతుల కవిత సర్పంచ్గా ఉన్నారు. ప్రస్తుతం ఇస్సానగర్లో బీసీ జనరల్ రిజర్వేషన్ రావడంతో రమణాగౌడ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అలాగే జనగామ గ్రామంలో 2006–11 వరకు మట్ట శ్రీనివాస్ సర్పంచ్గా కొనసాగారు. తర్వాత 2013–18 వరకు ఆయన భార్య స్వరూప అయిదేళ్లు పదవిలో ఉన్నారు. ప్రస్తుతం బీసీ జనరల్ రిజర్వేషన్ రావడంతో శ్రీనివాస్ మరోసారి బరిలో ఉన్నారు. ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని మాచాపూర్ కారోబార్గా పని చేస్తు న్న ఖాజాపాషా కారోబార్ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్గా పోటీ చేస్తున్నారు. మా చాపూర్ జీపీలో అతడు 15 సంవత్సరాలుగా కారోబార్తోపాటు మల్టీపర్పస్ వర్కర్గా పని చేస్తు గ్రామానికి సేవలందిస్తున్నాడు. జీపీకి సంబందించి సర్పంచ్ స్థానం బీసీ జనరల్గా రిజర్వేషన్ రావడంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి పత్రాన్ని ఎంపీడీవోకు అందించారు. అనంతరం సర్పంచ్గా నామినేషన్ వేసి బరిలో ఉన్నారు. తనను సర్పంచ్గా గెలిపించాలని గ్రామ ఓటర్లను వేడుకుంటున్నారు. వేల్పూర్: మండలంలోని పచ్చలనడ్కుడ మాజీ సర్పంచ్ కోల్లే నర్సయ్య ప్రస్తుత సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇటీవల ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చారు. దశాబ్ద కాలంగా ఆయన ఇజ్రాయెల్ దేశంలో ఉంటున్నారు. ఈ ఎన్నికల్లో పచ్చలనడ్కుడ సర్పంచ్ స్థానం బీసీ జనరల్గా రిజర్వు అయింది. ఆయన బీసీ కావడంతో మళ్లీ సర్పంచ్గా పోటీ చేసేందుకు ఇజ్రాయెల్ నుంచి వచ్చారు. 2008లో పచ్చలనడ్కుడలో సర్పంచ్ స్థానం జనరల్గా ఉన్నప్పుడు పోటీచేసి గెలిచారు. అంతకుముందు 2003 నుంచి 2008 వరకు ఆయన భార్య కోల్లే మణి సర్పంచ్గా కొనసాగడం విశేషం. -
అభివృద్ధికి అంతా సహకరించాలి
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రం అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు. శనివారం ఆయన కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులను పరిశీలించారు. రైల్వే అధికారులతో మాట్లాడి నిర్మాణ పనులపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పట్టణంలో ప్రధానంగా నెలకొన్న ట్రాఫిక్ సమస్య, బల్దియా ఆదాయ మార్గాలపై దృషి పెట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా రెల్వే స్టేషన్ గోడను ఆనుకుని ఉన్న కోకలు, మడిగెలను తొలగిస్తే ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు. స్టేషన్ రోడ్డు మధ్యలో రైల్వే స్టేషన్లోకి ఎంట్రెన్స్ ఉంటుందన్నారు. తొలగించిన దుకాఽణదారులకు మున్సిపల్ స్థలాలైన పొట్టిశ్రీరాములు విగ్రహం పక్కన 41, గంజ్ స్కూల్ ముందు 75 మడిగెలను మూడు నెలల్లోపు నిర్మించి ఇస్తామన్నారు. సర్వే నంబర్ 6లో ఇతరుల కబ్జాలో ఉన్న రూ. 100 కోట్ల విలువైన స్థలాన్ని ఇటీవల ఖాళీ చేయించామన్నారు. ఆదివారం సుభాష్, జేపీఎన్, నాజ్టాకీస్ రోడ్లపై నిర్వహిస్తున్న కూరగాయల మార్కెట్ను సర్వే నంబర్ 6లోకి మారుస్తామని తెలిపారు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయన్నారు. రోడ్లపై కూర్చుని ఇబ్బందులు పడేకంటే బాజాప్త బల్దియా స్థలంలో కూరగాయలు అమ్ముకోవడం మంచిదని పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ లోపల కూడా అధికారులు మడిగెలు ఏర్పాటు చేస్తారన్నారు. అవసరం ఉన్నవారు అద్దె చెల్లించి అందులో దుకాణా లు నిర్వహించుకోవచ్చన్నారు. పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు వ్యాపారులు, ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. స్టేషన్రోడ్లో కోకా దుకాణాలను ఖాళీ చేయాలి బల్దియా స్థలంలో దుకాణాలు నిర్మించి ఇస్తాం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి -
చిరుత సంచారం
లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని గాంధీనగర్, మోతె గ్రామాల గేటు మధ్య చిరుత సంచరించినట్లు ప్రయాణికులు తెలిపారు. శుక్రవారం రాత్రి కామారెడ్డి, ఎల్లారెడ్డి కేకేవై రోడ్డు పక్కన చిరుత కనిపించినట్లు వాహన చోదకులు తెలిపారు. దీంతో గాంధీనగర్, బూరుగిద్ద, మోతె, ఎల్లమ్మతండా వాసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.అటవీ శాఖ అధికారులు చిరుతను బందించాలని ప్రజలు కోరుతున్నారు. ఎల్లారెడ్డి: భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు శనివారం సెల్టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఎల్లారెడ్డిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఎల్లారెడ్డికి చెందిన పవన్కు భార్య సుజాతతో ఇటీవల గొడవ జరిగింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన పవన్ పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు పవన్తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. దీంతో పవన్ టవర్ దిగి కిందికి రావడంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కామారెడ్డిలో ఒకరి ఆత్మహత్య కామారెడ్డి క్రైం: జిల్లాకేంద్రంలోని కాకతీయ నగర్లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా.. తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన అంబీర్ రాజు (45) కుటుంబంతో కలిసి కొన్నేళ్లుగాగా జిల్లా కేంద్రంలోని కాకతీయ నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. రాజు భిక్కనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టర్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో అతడు ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గుర్తించి వెంటనే దేవునిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య గొడవల కారణంగానే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. 9న జాబ్మేళా ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కా లేజీలో ఈ నెల 9న రిలయన్స్, జియోలో ఉ ద్యోగాలకు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు జిల్లా టాస్క్ మేనేజర్ రఘు తేజ శని వారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ అండ్ నాలెడ్జ్(టాస్క్) ఆ ధ్వర్యంలో రిలయన్స్, జియో ద్వారా రిక్రూట్మెంట్లు చేపడుతున్నామని పేర్కొన్నారు. పా యింట్ మేనేజర్ పోస్టుకు రూ.3.36 లక్షల వా ర్షిక వేతనం, అసిస్టెంట్ పాయింట్ మేనేజర్ పోస్టుకు రూ.2.10 లక్షల వార్షిక వేతనంతో ఉ ద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. నందిపేట్, నవీపేట్, వేల్పూర్, బాల్కొండ ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుందని, పురుషులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. డిగ్రీ, ఇంట ర్, పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వారు అర్హులని, స్థానికులకే అవకాశాలు కల్పిస్తామన్నారు. పోలీసుల తనిఖీలు ఆర్మూర్టౌన్: పట్టణంలో శనివారం రాత్రి నిషేధిత మాదకద్రవ్యాలపై ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. పాతబస్టాండ్లో ప్రయాణికుల బ్యాగులు, హోటళ్లు, పాన్షాపులతోపాటు పలు దుకాణాల్లో నిషేధిత మత్తు పదార్థాలు, చట్టవిరుద్ధ వస్తువులను గుర్తించేందుకు స్నిపర్ డాగ్స్ ద్వారా తనిఖీలు చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
పోలింగ్ సిబ్బందికి ర్యాండమైజేషన్ ప్రక్రియ
కలెక్టరేట్లో ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్న కలెక్టర్, అధికారులుకామారెడ్డి క్రైం: సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి రెండు, మూడు విడతల్లో పోలింగ్ ప్రక్రియ లో పాల్గొనే పీవో, ఏపీవోలకు శనివారం కలెక్టరేట్లో ర్యాండమైజేషన్ ద్వారా మండలాలను కేటాయించారు. ఎన్నికల సాధారణ పరిశీలకు లు సత్యనారాయణరెడ్డి సమక్షంలో కలెక్టర్ ఆశి ష్ సంగ్వాన్, అధికారులు ప్రక్రియను నిర్వహించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మధుమోహన్, జెడ్పీ సీఈవో చందర్, డీపీవో మురళి, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. -
43 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం
గాంధారి(ఎల్లారెడ్డి): రెండో విడత జీపీ ఎన్నికల్లో సుమారు 43 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమ య్యా యి. వాటిలో గాంధారి మండలంలోని 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయినట్లు ఎంపీడీవో రాజేశ్వర్ శనివారం తెలిపారు. మండలంలో మొ త్తం 45 గ్రామ పంచాయతీలున్నాయి. మిగిలిన స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. లింగంపేట మండలంలో..లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండలంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. 41 గ్రామ పంచాయతీలకు గాను 14 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 27 గ్రామ పంచాయతీలకు 109 మంది బరిలో నిలిచినట్లు ఎంపీడీవో నరేష్ తెలిపారు. అలాగే 342 వా ర్డు సభ్యులకు 194 వార్డులు ఏకగ్రీవం ఆయ్యాయి. 148 వార్డులకు 512 మంది సభ్యులు బరిలో ఉండడంతో వాటిలో ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. బరిలో ఉన్న అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. అలాగే ఎల్లారెడ్డి మండలంలో 4, మహమ్మద్ నగర్, పిట్లం ఒక్కో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు. లింగంపల్లి(ఖుర్దు).. లింగంపేట మండలంలోని లింగంపల్లి(ఖుర్దు) జీపీ ఏకగ్రీవమైంది. సర్పంచ్ పదవి కోసం ఇద్దరు వ్యక్తులు నామినేషన్ దాఖలు చేయగా, ఇటీవల ఒకరు నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. దీంతో గొల్ల ప్రత్యూష సర్పంచ్గా ఏకగ్రీవమైంది. అలాగే ఉపసర్పంచ్ దాసారం సంతోష్, వార్డు సభ్యులు బండి అశోక్, చౌడం సరిత, బండి సావిత్రి, దాసారం సంతోష్, పోతరాజు లక్ష్మన్, నాని, రాజు, కుమ్మరి పద్మ ఏకగ్రీవమయ్యారు. నాగిరెడ్డిపేట మండలంలో.. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలో మొత్తం 27 సర్పంచ్ స్థానాలకుగానూ 6 సర్పంచ్స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 21 సర్పంచ్స్థానాలకు 70మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మండలంలో మొత్తం 232 వార్డు స్థానాలుండగా వాటిలో 103 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 129 వార్డు స్థానాలకు 282మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నాం వరకు నామినేషన్ల విత్డ్రాకు గడువు ముగియడంతో ఎన్నికల అధికారులు ఎన్నికల్లో పోటీచే సే అభ్యర్థుల పేర్లతోపాటు వారికి కేటాయించిన గుర్తులతో కూడిన తుదిజాబితాను రూపొందించి నామినేషన్ల స్వీకరణకేంద్రాల బయట గోడలపై అ తికించారు. దీంతో ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులను చూసుకునేందుకు పోటీ పడ్డారు. మల్లూర్ తండా.. నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని మల్లూర్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. సర్పంచ్ స్థానానికి ముగ్గురు నామినేషన్లు వేయగా, వార్డు స్థానాలకు మాత్రం ఒక్కరు చొప్పున నామినేషన్ దాఖలు చేశారు. అయితే సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసిన ఇద్దరు అభ్యర్థులు విత్డ్రా చేసుకోవడంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం ఏకగ్రీవం అయ్యింది. సర్పంచ్గా కేతావత్ నారాయణ, ఉప సర్పంచ్గా వెంకట్రాం ఎన్నికయ్యారు. వార్డు సభ్యులుగా మోతిరాం, ఇస్లావత్ సంగీత, ప్రకాష్, నిర్మల, మారోని, సంతోష్, సుమలత ఏకగ్రీవమయ్యారు. నాగిరెడ్డిపేటలో విచిత్ర పరిస్థితి.. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామపంచాయతీ పాలకవర్గానికి జరుగనున్న ఎన్నికలో వింతపరిస్థితి నెలకొంది. సర్పంచ్ స్థానం ఏకగ్రీవం కాగా, వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్స్థానంతోపాటు 10 వార్డు స్థానాలున్నాయి. సర్పంచ్ స్థానం బీసీ జనరల్కు రిజర్వ్ కాగా, గ్రామానికి చెందిన మన్నె వెంకట్తోపాటు మరోవ్యక్తి నామినేషన్ వేశారు. సదరు వ్యక్తి తన నామినేషన్ను ఉపసంహరించుకోవడంతో వెంకట్ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతోపాటు గ్రామపంచాయతీ పరిధిలోని 1,3,6,7,8వార్డు స్థానాలు ఏకగ్రీవమవ్వగా 2,4,5,9,10వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. గాంధారి మండలంలో 16, లింగంపేట మండలంలో 14, నాగిరెడ్డిపేట మండలంలో 6 ఎల్లారెడ్డి మండలంలో 4, పిట్లం, మహమ్మద్ నగర్, నిజాంసాగర్ మండలాల్లో ఒక్కో స్థానం చొప్పున ఏకగ్రీవం -
హోంగార్డుల సేవలు వెలకట్టలేనివి
నిజామాబాద్అర్బన్: దేశ సరిహద్దులో సైన్యంతోపాటు అంతర్భాగంలో పోలీసులు, ఇతర విపత్తు నిర్వహణ సంస్థలతో కలిసి హోంగార్డులు చేస్తున్న సేవ వెలకట్టలేనిదని సీపీ సాయిచైతన్య అన్నారు. హోంగార్డులు అంటే కేవలం ఒక విభాగం కాదని, అది సమాజ సేవకు, శాంతి భద్రతలకు దృఢమైన మద్దతని వివరించారు. శనివారం పోలీస్ పరేడ్ గ్రౌండ్ల్లో హోంగార్డుల 63వ రైసింగ్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ శాంతి భద్రతలు, ప్రకృతి విపత్తులు, రవాణా, ట్రాఫిక్ నిర్వహణ, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో హోంగార్డుల పాత్ర అసాధారణమైందన్నారు. ఎన్నికల బందోబస్తు, పండుగల నిర్వహణ, కోవిడ్–19 పరిస్థితులలో కృషి అమోఘమన్నారు. హోంగార్డ్స్ మెడికల్ గ్రాంట్ కింద రూ.పది వేల చొప్పున ఆరుగురికి మంజూరైనట్లు పేర్కొన్నారు. ఇటీవల అత్యుత్తమ సేవలు అందించిన 20 మంది హోంగార్డులకు ప్రశంస పత్రాలు అందజేశారు. వెల్నెస్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ బస్వారెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ సతీష్, శేఖర్ బాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సర్పంచ్ బరిలో నాడు భార్య.. నేడు భర్త..
రాజంపేట: రాజంపేట గ్రామంరలో 2019 నిర్వహించిన సర్పంచ్ ఎన్నికలలో గ్రామానికి చెందిన ఆముద సౌమ్య బరిలో నిలిచి సర్పంచ్గా గెలుపొందారు. అనంతరం గ్రామాభివృద్ధిలో భాగంగా సౌమ్య సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తన ప్రత్యేకతను చాటింది. ప్రతి యువతి వివాహానికి 25 కిలోల సన్న బియ్యం అందజేసింది. ప్రస్తుత ఎన్నికల్లో సౌమ్య భర్త నాగరాజు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్ బరిలో నిలిచారు. నాగరాజుకు గతంలో గ్రామంలో ఉప సర్పంచ్గా చేసిన అనుభవం ఉంది. నాడు సతి పోటి పడగా నేడు పతి పోటీలో ఉండటం గమనార్హం. మర్కల్లో నాడు భర్త.. నేడు భార్య సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని మర్కల్ గ్రామంలో సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు అయింది. ఇప్పటి వరకు జూకంటి సంగారెడ్డి సర్పంచ్గా బాధ్యతలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు కావడంతో అతడు తన భార్య జూకంటి నాగలక్ష్మిని బరిలోకి దింపారు. వీరికి కాంగ్రెస్ పార్టీ మద్ధతునిస్తోంది. అలాగే బీఆర్ఎస్ నుంచి గతంలో సర్పంచ్గా బాధ్యతలు చేపట్టిన డోకూరి ఉదయ నర్సింహారెడ్డి, ఈ ఎన్నికల్లో రిజర్వేషన్ కలిసి రావడంతో మళ్లీ సర్పంచ్ బరిలో నిలిచారు. -
పోస్టల్ బ్యాలెట్కు ఏర్పాట్లు చేయండి
కామారెడ్డి క్రైం: పోస్టల్ బ్యాలెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న మండలాల రిటర్నింగ్ అధికారులు, సహాయ జిల్లా ఎన్నికల అధికారులైన ఎంపీడీవోలు, తహసీల్దార్లతో శనివారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోస్టల్ బ్యాలెట్ పత్రాలను ఏ విధంగా జారీ చేయాలి, వాటిని ఏవిధంగా ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాల్లో అందజేయాలి తదితర అంశాలపై సూచనలు ఇచ్చారు. మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న మండలాల్లో ఫెసిలిటేషన్ కేంద్రాలను ఈనెల 6 నుంచి 9వ తేదీ వరకు ఆయా ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించాలన్నారు. అన్ని పంచాయతీలు, వార్డుల ఓటరు జాబితాలు అందుబాటులో ఉంచాలన్నారు. ఫారం 17 లో ఓటరు డిక్లరేషన్ చేసిన తరువాత గెజిటెడ్ అధికారి సంతకం చేయాల్సి ఉంటుందన్నారు. ఓటరు సౌకర్యార్థం ప్రతి కేంద్రంలో ఒక గెజిటెడ్ అధికారిని నియమించాలన్నారు. ఫెసిలిటేషన్ కేంద్రాలను ప్రారంభించే తేదీలను పోటీలో ఉన్న అభ్యర్థులకు తెలియజేయాలన్నారు. పోలీసు భద్రత, వీడియోగ్రఫీ పక్కాగా చేపట్టాలన్నారు. -
నామినేషన్ల జోరు
మూడో విడతలోనూకాటేపల్లి పంచాయతీ వద్ద నామినేషన్ వేసేందుకు క్యూలో ఉన్న అభ్యర్థులుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం తుదిదశకు చేరుకుంది. మొదటి విడత ఎన్నికలు నిర్వహించే పంచాయతీలలో నామినేషన్ల ఘట్టం పూర్తయి అభ్యర్థుల లెక్క తేలడంతో ప్రచార పర్వం జోరందుకుంది. రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామాలలో బరిలో మిగిలిన అభ్యర్థుల లెక్క శనివారం తేలనుంది. మూడో విడతకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ఘట్టం శుక్రవారంతో ముగిసింది. సాయంత్రం 5 వరకు వచ్చిన వారందరినీ నామినేషన్ల దాఖలు కేంద్రాల్లో కూర్చోబెట్టారు. రాత్రి వరకు నామపత్రాల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. జిల్లాలో మూడో విడతలో బాన్సువాడ, బిచ్కుంద, బీర్కూర్, డోంగ్లీ, జుక్కల్, మద్నూర్, నస్రుల్లాబాద్, పెద్దకొడప్గల్ మండలాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా మండలాల పరిధిలోని 168 సర్పంచ్ పదవులతోపాటు 1,482 వార్డులకు బుధ, గురు, శుక్రవారాల్లో నామినేషన్లు స్వీకరించారు. మూడో విడతకు సంబంధించి వచ్చిన నామినేషన్ల పరిశీలన శనివారం జరగనుంది. 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంటుంది. ఆ తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటిస్తారు. తొలి విడత ఎన్నికలు నిర్వహించే గ్రామాలలో ప్ర చారం జోరందుకుంది. అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సోషల్ మీడియానూ ఉప యోగించుకుంటున్నారు. తొలి విడతలో ఈనెల 11న 10 మండలాల్లోని 167 గ్రామాల సర్పంచ్, 1,520 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి.మండలం సర్పంచ్ స్థానం నామినేషన్లు వార్డులు నామినేషన్లు బాన్సువాడ 25 159 222 477 బిచ్కుంద 23 141 204 436 బీర్కూర్ 13 94 114 294 డోంగ్లీ 13 91 116 253 జుక్కల్ 30 --- 270 --- మద్నూర్ 21 163 194 444 నస్రుల్లాబాద్ 19 129 164 337 పెద్దకొడప్గల్ 24 122 198 335 మొత్తం 168 --- 1,482 ---రెండో విడతలో ఏడు మండలాల్లోని 197 సర్పంచ్, 1,654 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ గడువు శనివారంతో ముగియనుంది. ఆ తర్వాత అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. దీంతో రెండో విడతలో ఎన్నికలు జరిగే గ్రామాలలో ప్రచారం జోరందుకోనుంది. ముగిసిన నామినేషన్ల స్వీకరణ మొదటి విడతలో హోరెత్తుతున్న ప్రచారం రెండో విడత బరిలో మిగిలిన అభ్యర్థుల లెక్క తేలేది నేడే..


