breaking news
Kamareddy District Latest News
-
సంక్షేమం తోడుగా..
ప్రగతి పరుగులుఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2026మాట్లాడుతున్న వీహెచ్సాక్షి ప్రతినిధి, కామారెడ్డి/కామారెడ్డి క్రైం : కామారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ అగ్రగామిగా నిలుస్తోందని ప్రభుత్వ బీసీ సంక్షేమం, అభివృద్ధి సలహాదారు వి.హనుమంతరావు పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఎగురవేసి, పోలీసులనుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా ప్రగతిని నివేదించారు. వీహెచ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ● జిల్లాలో 2,97,438 కుటుంబాలకు ఆహార భద్రతకు సంబంధించిన స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తున్నాం. ● జిల్లాలో రూ.500 లకు గ్యాస్ సిలిండర్ సరఫరా కింద ఇప్పటివరకు 1,51,503 మంది లబ్ధిదారులకు 8,93,705 సిలిండర్లు పంపిణీ చేశాం. దీనికి ప్రభుత్వం రూ.27.15 కోట్లు సబ్సిడీ ఇచ్చింది. ● చేయూత పథకం ద్వారా 1,55,344 మంది లబ్ధిదారులకు వివిధ రకాల పింఛన్ల కోసం ప్రతి నెల రూ.38.50 కోట్లు వెచ్చిస్తున్నాం. ● గృహజ్యోతి కింద జిల్లాలో 1,75,087 మంది వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్కోసం ఇప్పటివరకు రూ.155.31 కోట్లు ఖర్చు చేశాం. ● జిల్లాలో 1,18,827 వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ప్రస్తుత సంవత్సరం 924 నూతన వ్యవసాయ కనెక్షన్ల కోసం రూ.6.47 కోట్లు ఖర్చు చేశాం. ● రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో 18,369 మందికి శస్త్ర చికిత్సలకు రూ.50.56 కోట్లు, ఈ ఏడాది 5,691 మందికి రూ.16.51 కోట్లు వెచ్చించాం. ● బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో ఉండి చదువుకుంటున్న 4,725 మంది విద్యార్థులకు రూ. 5.31 కోట్లు ఉపకార వేతనంగా అందించాం. 935 మంది మైనారిటీ విద్యార్థులకు రూ.50.97 లక్షలు మంజూరు చేశాం. ఫీజు రీయింబర్స్మెంట్ కింద 3,351 మంది విద్యార్థులకు రూ.2.47 కోట్లు చెల్లించాం. ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా 36 మంది విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలల్లో చదువుకునే అవకాశం కల్పించాం. ● మైనారిటీ సంక్షేమం లో భాగంగా 79 మందికి ఉపాధి కల్పన నిమిత్తం రూ.46 లక్షలు మంజూరు చేశాం. ● కులాంతర వివాహం చేసుకున్న 28 జంటలకు ఎస్సీ సంక్షేమ శాఖ ద్వారా రూ.70 లక్షలు ఇచ్చాం. ● ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన మెరుగుప డింది. ఈ విద్యాసంవత్సరంలో 4,031 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందారు. ●పోలీస్ శాఖ ద్వారా జిల్లాలో రోడ్డు ప్రమాదాల ని వారణకు అరైవ్ అలైవ్ కార్యక్రమం చేపట్టడం ద్వా రా ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. ఆపరేషన్ కవచ్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రివెంటివ్ పోలీసింగ్ ద్వారా ప్రజలకు నమ్మకమైన రక్షణ కవచంగా పోలీసు శాఖ నిలిచింది. అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలుస్తున్నాం ప్రభుత్వ బీసీ సంక్షేమం, అభివృద్ధి సలహాదారు వి.హనుమంతరావు ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవాలు -
స్టెప్పులతో సందడి చేసిన వీహెచ్
స్వాతంత్య్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చిన వీహెచ్.. సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులతో కలిసి స్టెప్పులేశారు. బాన్సువాడ గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు సాంస్కృతిక ప్రదర్శన ఇస్తున్న సమయంలో.. ఉత్సాహాన్ని ఆపుకోలేక ఆయన వేదిక దిగి వారి వద్దకు వచ్చి నృత్యం చేశారు. వీహెచ్తో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జత కలిశారు. స్వాతంత్య్ర దినోత్సవాలలో ఎస్పీ రాజేశ్ చంద్ర, డీఎఫ్వో నీరజ్ కుమార్ టిబ్రెవాల్, అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో అడ్డదారి
● చోరీకి పాల్పడి కటకటాల పాలు ● కేసు వివరాలు తెలిపిన ఎస్పీ రాజేశ్చంద్రకామారెడ్డి క్రైం : ఓ వ్యక్తి అగ్ని ప్రమాదంలో ఆస్తులు కోల్పోయాడు. ఆర్థిక ఇబ్బందులనుంచి గట్టెక్కేందు కు అడ్డదారిని ఎంచుకుని చోరీకి పాల్పడి కటకటాల పాలయ్యాడు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జిల్లాకేంద్రంలోని దేవునిపల్లి విద్యుత్నగర్ కాలనీకి చెందిన ట్రాన్స్కో ఉద్యోగి సురేశ్ కుటుంబం ఈనెల 7 న ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది. మరుసటి రోజు తిరిగి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు 16 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి, రూ.90 వేలు నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించి దేవునిపల్లికి చెందిన వడ్ల శ్రీనివాస్ను నిందితుడిగా గుర్తించి శనివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా నేరం ఒప్పుకున్నాడని ఎస్పీ తెలిపారు. గతంలో నిందితుడు శ్రీనివాస్కు చెందిన ఇల్లు, దుకాణం అగ్నిప్రమాదంలో కాలిపోయాయి. అప్పులతో ఆర్థిక ఇబ్బందుల పాలయ్యాడు. దీంతో తేలికగా డబ్బులు సంపాదించాలని భావించి దొంగతనానికి ఒడిగట్టాడు. నిందితుడి వద్దనుంచి 16 తులాల బంగారు ఆభరణాలు, రూ.50 వేలు నగదు రికవరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. కేసు చేదనలో విశేషంగా కృషి చేసిన డీఎస్పీ మధుసూదన్, రూరల్ సీఐ శ్రీధర్గౌడ్, సీసీఎస్ సీఐ రామన్, ఎస్సైలు రంజిత్, మహేష్, సిబ్బంది రాజేందర్, రవి, శ్రీనివాస్, లక్ష్మీకాంత్, కిరణ్లను అభినందించారు. -
‘ప్రతి ఒక్కరికీ న్యాయం పొందే హక్కు’
కామారెడ్డి టౌన్ : ప్రతి పౌరుడికి న్యాయం పొందే సమాన హక్కు ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముక్తిద పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో ‘ఉచిత న్యాయ సహాయం – న్యాయాన్ని పొందే హక్కు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. న్యాయమూర్తి మాట్లాడుతూ మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, ఎస్సీ ఎస్టీలు, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఉచితంగా న్యాయవాది సేవలు, సలహాలు, కోర్టు సంబంధిత సహాయాన్ని అందిస్తున్నామన్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా ఉచిత న్యాయ సహాయం కోసం టోల్ఫ్రీ నంబర్ 15100 ను వినియోగించుకోవాలన్నారు. విద్య, క్రీడలు, ఇతర పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ సూపరింటెండెంట్ చంద్రసేనరెడ్డి, జూనియర్ అసిస్టెంట్ ఖాజా సమీఉల్లా ఖాన్, జుడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు భుజంగరావు, ప్రధాన కార్యదర్శి వెంకట్రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రణీత, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ సురేష్ పాల్గొన్నారు. ‘మత్తు పదార్థాల నిర్మూలనకు కృషి చేయాలి’ కామారెడ్డి అర్బన్ : మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ‘నషా ముక్త్ భారత్’ కరపత్రాల ఆవిష్కరణతోపాటు ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు, కౌన్సిలర్లు, బ్రహ్మకుమారీలు మీనాక్షి, గంగ, సమత, అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. క్రీడల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటాలి దోమకొండ : క్రీడల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటాలని జాతీయ అర్చరీ అసోసియేషన్ అధ్యక్షుడు కామినేని అనిల్కుమార్ పిలుపునిచ్చారు. శనివారం గడికోటలో మండలానికి చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ నర్సయ్య, ఉపసర్పంచ్ శ్రీనివాస్, నాయకులు తిర్మల్గౌడ్, అంజలి, సదానంద, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు సిద్దరాములు తదితరులు పాల్గొన్నారు. -
నేడు బిచ్కుందకు సీఎం రాక
● ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కూతురు వివాహ విందులో పాల్గొననున్న రేవంత్రెడ్డి ● భారీ భద్రత ఏర్పాట్లుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : వెనకబడిన ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుందకు ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నారు. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కూతురు వివాహ విందులో ఆయన పాల్గొంటారు. ఎమ్మెల్యే తన కూతురు పెళ్లి రిసెప్షన్కు రావాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు పెద్ద ఎత్తున ఆహ్వాన పత్రికలు పంపించారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్రెడ్డి తొలిసారిగా జుక్కల్ నియోజకవర్గానికి వస్తుండడంతో ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశాలున్నాయి. సీఎం పెళ్లి వేడుకలో పాల్గొనడానికే వస్తున్నప్పటికీ నియోజకవర్గంపై వరాల జల్లులు కురిపిస్తారన్న ఆశలో జనం ఉన్నారు. ప్రజలు ఏం ఆశిస్తున్నారంటే.. నియోజకవర్గంలో సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వర్షాలపైనే ఆధారపడి ఆరుతడి పంటలు పండిస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఉన్నా ఈ నియోజకవర్గానికి పెద్దగా ఉపయోగపడదు. రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలతో సింగితం రిజర్వాయర్ రి టెయినింగ్ వాల్ కొట్టుకుపోయింది. తాత్కాలిక మ రమ్మతులతోనే నెట్టుకొస్తున్నారు. పూర్తిస్థాయి మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. ● అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అయిన లెండి పనులు దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. గత ప్ర భుత్వ హయాంలో మంజూరైన నాగమడుగు ఎత్తిపోతల పథకం మొదట్లోనే ఆగిపోయింది. దాన్ని పూర్తి చేయాల్సి ఉంది. ఆయా ప్రాజెక్టులకు సీఎం నిధులు మంజూరు చేస్తారని ఆశిస్తున్నారు. ● కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రాలకు దూరాన ఉన్న జుక్కల్ ప్రాంతంలో ఉన్నత విద్యావకాశాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ప డుతున్నారు. ఇక్కడ పీజీ సెంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ● జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే సరైన బస్సు సౌ కర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. బస్ డిపో ఏర్పాటు చేస్తే మారుమూల ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. ● నియోజకవర్గంలో అపరాలు ఎక్కువగా సాగవుతాయి. అయితే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు లేకపోవడంతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించలేకపోతున్నారు. ఆయా పరిశ్రమల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.సీఎం రాక నేపథ్యంలో చేసిన ఏర్పాట్లుహెలీప్యాడ్ సిద్ధం..నిజాంసాగర్ : బిచ్కుంద పట్టణ శివారులోని డీ బీఎల్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించే జు క్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కూతురు వివా హ విందు కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నా రు. ఈ నేపథ్యంలో అధికారులు హెలీప్యాడ్ను సిద్ధం చేశారు. హెలీప్యాడ్నుంచి డీబీఎల్ ప్రాంగణం వరకు భారీ భద్రత కల్పించారు. -
కామారెడ్డి హైవే పై రోడ్డు ప్రమాదం
● రెండు కార్లు ఢీ.. ఏడుగురికి గాయాలు కామారెడ్డి రూరల్: కామారెడ్డి హైవే పై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న ఓ కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న మరో కారు ఢీకొన్నది. రెండు కార్లలో ప్రయాణిస్తున్న ఏడుగురికి గాయాలయ్యాయి. వీరిని స్థానికులు కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడవి తండాకు చెందిన పరశురాములు, దేవిదాస్, రాజేశ్, బాలాజీ, మరో కారులో ప్రయాణిస్తున్న రోహిణి తండాకు చెందిన ప్రతిభ, చిన్నారులు శివాన్సీ, రియాన్సీలు గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
క్రైం కార్నర్
అనుమానాస్పద స్థితిలో ఎకై ్సజ్ ఉద్యోగి మృతి కామారెడ్డి రూరల్: ఎకై ్సజ్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పో లీసులు తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని కల్కినగర్లో నివాసం ఉంటున్న మామిడి అనిల్ కుమార్(41) దోమకొండ ఎకై ్సజ్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం తన ఇంట్లో తీవ్ర అనారోగ్యానికి అతన్ని కుటుంబీకులు 108 అంబులెన్సులో జీజీహెచ్కు తరలించాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనిల్కు భార్య నీరజ, పిల్లలు శాన్వి, జాహ్నవి, రిషిత్ ఉన్నారు. తల్లి ఇందిర ఫిర్యా దు మేరకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి అర్బన్: కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే బ్రాహ్మణపల్లి బాలయ్య సతీమణి బాలగంగామణి (82) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2019లో బాలయ్య మృతి చెందారు. వీరికి ఎనిమిది మంది సంతానం కాగా నలుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు. శనివారం ఉదయం బాలగంగామణి అంతిమయాత్ర కామారెడ్డి పాత బస్టాండ్ సమీపంలోని వారి ఇంటినుంచి నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. గాంధారి: పాము కాటుతో ఒకరు మృతి చెందిన ఘటన మండలంలోని ముదెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఏఎస్సై రవి కుమార్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఒల్లెపు శ్రీనివాస్(27) భార్య తల్లిగారింటికి వెళ్లగా గురువారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్నాడు. నిద్రలో ఉండగానే పాము కాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ప్రత్యూష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. పిట్లం: హైదరాబాద్ నుంచి గుజరాత్కు జాతీయ రహదారి గుండా అక్రమంగా తరలిస్తున్న 30 టన్నుల రేషన్ బియ్యాన్ని శుక్రవారం పట్టుకున్నట్లు పిట్లం పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకున్నామని అన్నారు. 632 పాలిథిన్ కవర్లలో ఉన్న రేషన్ బియ్యాన్ని(30 టన్నులు) స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. డ్రైవర్లు పర్బత్ కరంటా దేవరాజ్, శరద్ ఆబా బచ్కర్, ఓనర్ ఇబ్రహీం పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
చోరీ కేసును ఛేదించిన పోలీసులు
సదాశివనగర్: మండలంలోని ధర్మారావ్పేట్ ఎల్లమ్మ ఆలయంలో జరిగిన చోరీ ఘటనను సదాశివనగర్ పోలీసులు శుక్రవారం ఛేదించారు. ఆలయంలో చోరీ జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ధర్మారావ్పేట్కు చెందిన తొగరి శ్రీనివాస్, తొగరి మల్లేశ్వరీలను నిందితులుగా గుర్తించారు. ఈ నెల 8న ఇద్దరు కలిసి గ్రామంలోని ఆలయానికి వెళ్లి తాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు. అమ్మవారి మెడలో ఉన్న బంగారు ముక్కుపోగులను దొంగిలించారు. వీరు బంగారు ముక్కు పోగులను కామారెడ్డిలో విక్రయించడానికి శుక్రవారం బైక్పై వెళ్తుండగా మర్కల్ చౌరస్తా వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అనుమానం వచ్చిన పోలీసులు వారిని పట్టుకొని విచారణ చేపట్టారు. ఆలయంలో చోరీ చేసింది తామేనంటు నిందితులు నేరం ఒప్పుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు సీఐ సంతోష్కుమార్ తెలిపారు. ఎస్సై పుష్పరాజ్, పోలీస్ సిబ్బంది అజర్ ఫారూఖ్, నరేశ్, ఇసాక్, ప్రభు ఉన్నారు. -
విమానాశ్రయం ఏర్పాటు చేయాలి
జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు జరగాలి. రింగ్రోడ్లు, బ్రిడ్జీలు, రోడ్లు, డ్రెయినేజీ, ట్రాఫిక్ వ్యవస్థల్లో విప్లవాత్మకమైన మార్పులు రావాలి. ఆ దిశగా ప్రజాప్రతినిధులు, అధికారులు పని చేయాలి. ఇలాంటి మార్పులు, సౌకర్యాలు ఉంటేనే అభివృద్ధి సాధ్యం. –నవ్యశ్రీ, డిగ్రీ విద్యార్థిని ఘనంగా హన్మంత్ సింధే బర్త్డే నిజాంసాగర్(జుక్కల్): జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధేకు గురువారం జుక్కల్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. డోన్గావ్ గ్రామంలోని తన ఇంట్లో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ సింధే కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఆనంతరం జుక్కల్ చౌరస్తా నుంచి మద్నూర్ మైథిలి ఫంక్షన్ హాల్ వరకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ కాన్వాయ్తో ర్యాలీ తీశారు. కార్యకర్తలు రక్తదానం చేశారు. హన్మంత్సింధేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు, బాన్సువాడ బీఆర్ఎస్ నేత మురెల్లి శ్రీనివాస్, సొసైటీల చైర్మన్లు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జన్మదిన వేడుకల్లో... జేబు దొంగలు మైథిలి ఫంక్షన్ హాల్లో హన్మంత్సింధే జన్మదిన వేడుకలో జేబు దొంగలు హల్ చల్ చేశారు. పెద్దకొడప్గల్, మహమ్మద్ నగర్ మండలాలకు చెందిన ఇద్దరు బీఆర్ఎస్ కార్యకర్తల జేబులను కత్తిరించి రూ. 26,800 చోరీ చేశారు. -
బోరు మోటారు వైర్ల చోరీ
భిక్కనూరు: మండలంలోని రామేశ్వర్పల్లిలో వ్యవసాయ బోరు బావుల వద్ద ఉన్న మోటారు వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు శుక్రవారం వేకువజామున చోరీ చేశారు. 12 మోటర్ల వైర్లను చోరీ చేసి వాటిని దగ్ధం చేసి అందులో ఉన్న కాపర్ తీగలను ఎత్తుకెళ్లారు. నెల రోజులుగా బస్వాపూర్, గుర్జకుంట, ర్యాగట్లపల్లి, రామేశ్వర్పల్లి గ్రామాల్లో మోటర్ వైర్లను, ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులో ఉన్న కాపర్ కాయిల్స్ను అపహరించుకెళ్లారు. పోలీసులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కామారెడ్డి రూరల్: బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తిని అడవి పంది ఢీకొనడంతో అతనికి గాయాలయ్యాయి. తాడ్వాయి మండలం దేవాయిపల్లికి చెందిన రాములు అనే వ్యక్తి కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ శివారులోని ఎస్పీఆర్ పాఠశాలలో అటెండర్గా పనిచేస్తున్నాడు. అతను బైక్పై డ్యూటీలో భాగంగా స్కూల్కు వస్తుండగా లింగాపూర్ రోడ్డుపై బైక్ను అడవిపంది ఢీకొన్నది. గాయాలపాలైన రాములును స్థానికులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పిట్లం(జుక్కల్): మండలంలోని కంబాపూ ర్ గ్రామం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం పా ము కలకలం రేపింది. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు పాము కనిపించడంతో విద్యార్థులు కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ప్రధానోపాధ్యాయుడు గ్రామస్తుల సహాయంతో పామును చంపివేశారు. ఇదే పాఠశాలలో గతంలో సైతం పాము వచ్చింది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాఠశాలకు ప్రహరీ నిర్మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
‘ఎల్నినో’ను అధిగమించడానికి కృషి చేయాలి
కామారెడ్డి క్రైం: రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం వల్ల వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. రాష్ట్ర సచివాలయం నుంచి శుక్రవారం ఆయన కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎల్నినో నేపథ్యంలో పంట మార్పిడి, మండల ప్రజావాణి నిర్వహణ తదితర అంశాలపై సూచనలిచ్చారు. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయన్నారు. దీనిని ఎదుర్కొనేందుకు రైతులు పంట మార్పిడి పద్ధతి పాటించేలా చూడాలన్నారు. అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. సకాలంలో పరిహారం అందించాలి కామారెడ్డి క్రైం: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు నిబంధనల ప్రకారం సకాలంలో పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో శుక్రవారం జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు, అట్రాసిటీ కేసుల నమోదు, దర్యాప్తు, బాధితులకు అందుతున్న పరిహారం తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతినెలా సివిల్ రైట్స్డే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, జెడ్పీ సీఈవో చందర్ నాయక్, డీఎస్పీలు మధుసూదన్, శ్రీనివాస్రావు, విఠల్రెడ్డి, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 17 నుంచి మండలస్థాయి ప్రజావాణి కామారెడ్డి క్రైం: ప్రజల సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు ఈ నెల 17 నుంచి ప్రతి సోమవారం మండల స్థాయి ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదన్నారు. సమస్యలపై ప్రతి సోమవారం ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిలో దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు వెంటనే పరిశీలించి, పరిష్కరించాలని ఆదేశించారు. తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి తదితరులు పాల్గొన్నారు. -
వారికి చేతకాక నిధులు తెచ్చుకోలేదు
● ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డివర్ని: ‘కేసీఆర్ హయాంలో శ్రీనివాస్రెడ్డి ఎక్కువ నిధులు ఎలా తెచ్చాడు.. మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు తేలేదు అంటే వారికి చేతకాక తెచ్చుకోలేదు, నాకు చేతనై తెచ్చుకున్నాను’ అని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన చందూరు మండలం మేడిపల్లి లక్ష్మాపూర్ రోడ్డుపై కోటి రూపాయలతో నిర్మించిన వంతెన, రూ. 70 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, మేడిపల్లిలో రూ. 25 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే బాన్సువాడలో ఎక్కువ అభివృద్ధి జరిగిందన్నారు. రాష్ట్రంలో ఎక్కువ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, పోడు భూముల పంపిణీ, రైతులకు నూరు శాతం సాగునీరు అందించిన ఘనత తనదేనన్నారు. నియోజకవర్గంలో 1.48 లక్షల ఎకరాలకు రెండు పంటలకు సాగునీరు అందించానన్నారు. తెలంగాణలో ఎక్కడా లేనివిధంగా నియోజకవర్గంలో 2,670 మంది గిరిజనులకు 4,600 ఎకరాల పోడు పట్టాలు ఇప్పించానని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని, నాణ్యత విషయంలో పొరపాట్లు జరిగితే కాంట్రాక్టర్ను నిలదీసి పనులు నిలిపివేయాలని ప్రజలకు సూచించారు. అనంతరం లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, మేడిపల్లి సర్పంచ్ శ్రావణి రవి, లక్ష్మాపూర్ సర్పంచ్ ఉమా సంజీవ్, చందూర్ సొసైటీ చైర్మన్ ప్యారం అశోక్, మాజీ సర్పంచులు సత్యనారాయణ, నరేందర్రెడ్డి, సాయిరెడ్డి పాల్గొన్నారు. -
అందుబాటులో ఉంటూ..
నాగిరెడ్డిపేట మండలం తాండూర్ సర్పంచ్ యాదాగౌడ్ గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటారు. సర్పంచ్ హోదాలో రోజూ చేసే పనులన్నింటినీ ఆయన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన యాప్లో రోజువారీగా తప్పనిసరిగా నమోదు చేస్తుంటారు. గ్రామంలో సర్కు సంబంధించి చాలా మంది ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారాలను ఆయనే స్వయంగా నింపి ఇచ్చారు. గ్రామస్తులు ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల కోసం వైకుంఠరథంతో పాటు, నీళ్ల ట్యాంకర్ను సమకూరుస్తున్నారు. సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించి వారితో దరఖాస్తు చేయిస్తున్నారు. నిరుద్యోగులకు వాట్సాప్ గ్రూపుల ద్వారా ఉద్యోగాల సమాచారం చేరవేస్తూ వారిని గైడ్ చేస్తున్నారు. -
‘స్థానికం’లో నవశకం!
స్వతంత్ర భారతంలో యువతరం అన్ని రంగాలలోనూ సత్తా చాటుతోంది. రాజకీయాల్లోనూ పలువురు రాణిస్తున్నారు. జిల్లాలో సగానికిపైగా గ్రామాల్లో పాలన యువత చేతుల్లోనే ఉంది. యువ సర్పంచ్లు, వార్డు సభ్యులు తమదైన ఆలోచనలతో గ్రామాల్లో సమస్యలకు పరిష్కారాలు వెతుకుతున్నారు. నిత్యం ప్రజల మధ్యకు వెళ్లడానికి ప్రాధాన్యమిస్తున్నారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రోడ్లు, వీధి దీపాలు వంటి మౌలిక సమస్యలతో పాటు గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. జిల్లాలో 532 గ్రామ పంచాయతీలు ఉండగా దాదాపు సగం గ్రామాల్లో సర్పంచ్లు 40 ఏళ్లలోపు వారే ఉండడం గమనార్హం. కొందరు సర్పంచ్లు పొద్దున లేవగానే ఊరంతా కలియ తిరుగుతున్నారు. సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ‘సర్’లో చురుకుగా.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో చాలా గ్రామాల్లో సర్పంచ్లు కీలకపాత్ర పోషించారు. బూత్ లెవల్ ఆఫీసర్ల ద్వారా ఎన్యుమరేషన్ ఫారాలు ఇంటింటికి చేర్చడమే కాదు, వాటిని పూరించి తిరిగి అప్పగించేలా చూశారు. దీంతో చాలా గ్రామాల్లో వంద శాతం పూర్తయ్యింది. అలాగే ప్రభుత్వ పథకాలు తమ గ్రామాలకు ఎక్కువ మందికి అందేలా చొరవ తీసుకుంటున్నారు. కొత్త పింఛన్ల కోసం అర్హులైన వారితో దరఖాస్తులు చేయించడానికి ప్రయత్నిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న యువ సర్పంచ్లు.. గ్రామ పాలనలోనూ డిజిటల్ విధానాలను ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ పథకాల గురించి, సమావేశాలు, సభల గురించి వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో వాట్సాప్ ద్వారా గ్రామస్తులు ప్రస్తావించే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళుతున్నారు. వాట్సాప్ గ్రూపులలో పంచాయతీ కార్యదర్శి, జీపీవో, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది, వ్యవసాయ విస్తీర్ణాధికారి, అటవీ అధికారి, గ్రామ పోలీసు అధికారుల నంబర్లు చేర్చి ఎప్పటికప్పుడు ఆయా శాఖలకు సంబంధించిన అంశాలు ప్రజలకు తెలిసేలా చూస్తున్నారు.చాలా గ్రామాల్లో పంచాయతీల్లో ముఖ్యంగా యువత ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రామాల్లో కొత్తకొత్త ఆలోచనలతో ముందుకు నడుస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో కొత్త విధానాలు, ప్లాస్టిక్ నియంత్రణ, మొక్కల పెంపకం, సీసీ కెమెరాల ఏర్పాటు, వీధిలైట్ల నిర్వహణ, పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన వంటి వాటి విషయంలో చురుకుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ నిధులతో పాటు దాతల సాయంతో అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్లు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచే విషయమై ప్రత్యేక శ్రద్ధ చూపారు. పలువురు స్వయంగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచారు.పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు.. అలాంటి పల్లె పాలనలో ఒకప్పుడు పెద్దలదే కీలక భూమిక. కానీ పరిస్థితి క్రమంగా మారుతోంది. ప్రస్తుతం యువతరం సైతం సత్తా చాటుతోంది. జిల్లాలో చాలా పంచాయతీల్లో సర్పంచ్లుగా యువతే ఎన్నికయ్యారు. సరికొత్త ఆలోచనలతో పలువురు తమ గ్రామాల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డిప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో పాటు స్థానికంగా దాతల సాయంతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో తమదైన ముద్ర వేసుకునే ప్ర యత్నం చేస్తున్నారు పలువురు యువ సర్పంచ్లు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. చాలా గ్రామాల్లో మురికి కాలువలు అధ్వానంగా తయారైన పరిస్థితుల్లో.. వాటిని శుభ్రం చేయించడంతో పాటు కొత్తగా మురికి కాలువల నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారు. ఉపాధి హామీ, ఇతర పథకాల ద్వారా సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. తాగునీటి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారు. పల్లె పాలనలో కీలకంగా యువత సగానికిపైగా పంచాయతీలు వారి చేతిలోనే.. సరికొత్త ఆలోచనలతో అభివృద్ధికి బాటలు వేస్తున్న పలువురు స్వతంత్ర భారతంలో మారుతున్న గ్రామాల ముఖచిత్రం -
వికసిత్ భారత్.. యువశక్తే కీలకం
● స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి పల్లెల రూపురేఖలు మారాలి ● ‘సాక్షి’ డిబేట్లో విద్యార్థులుకామారెడ్డి క్రైం/కామారెడ్డి టౌన్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు అవుతోంది. స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ థీమ్గా కేంద్రప్రభుత్వం ‘యువశక్తి’ని ఎంచుకుంది. ఈ నేపథ్యంలో 2047 నాటికి జిల్లా, దేశం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, దేశ ప్రగతిలో యువత పాత్ర అన్న అంశాలపై శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ కళాశాలలో ‘సాక్షి’ ప్రత్యేక డిబేట్ నిర్వహించింది. విద్యార్థులు తమ ఆలోచనలను, ఆకాంక్షలను వెలిబుచ్చారు.విద్యార్థుల అభిప్రాయాలు 8లో.. -
‘తప్పులను సరిదిద్దుకునేలా ప్రోత్సహించాలి’
కామారెడ్డి టౌన్: పిల్లలు తప్పులు చేస్తే సరిదిద్దుకునేలా ప్రోత్సహించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జిల్లా న్యాయమూర్తి నాగరాణి సూచించారు. శుక్రవారం అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆధ్వర్యంలో జువైనల్స్, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత తమ హక్కులు, బాధ్యతలు చట్టపరమైన అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. జువైనల్స్ విషయంలో చట్టం కేవలం శిక్షలకే పరిమితం కాకుండా, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడం, పునరావాసం కల్పించడం, కౌన్సెలింగ్, సరైన మార్గదర్శకత్వం ద్వారా వారిని సత్ప్రవర్తన వైపు నడిపించడమే ప్రధాన లక్ష్యంగా జువైనెల్ జస్టిస్ బోర్డు(జేజేబీ) పనిచేస్తుందన్నారు. జేజేబీ సభ్యులు రమణ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి స్రవంతి, లీగల్ ఎయిడ్ క్లినిక్ కౌన్సిల్ గంగరాజు, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ రామేశ్వర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. బిచ్కుంద: బిచ్కుంద పట్టణానికి ఈనెల 16 ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రానున్నారని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు తెలిపారు. శుక్రవారం ఆయన బిచ్కుందలో విలేకరులతో మాట్లాడారు. ఈనెల 22న తన కూతురు వివాహం ఉందని, 16న బిచ్కుందలోని డీబీఎల్ కందర్పల్లి రోడ్లో నిర్వహించే విందులో సీఎం పాల్గొంటారని తెలిపారు. పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు విఠల్రెడ్డి, నాగ్నాథ్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: మహిళలు తమ వ్యాపారాల్లో నాణ్యత, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్కు ప్రాధాన్యత ఇవ్వాలని డీఆర్డీవో దామోదర్రెడ్డి సూచించారు. కలెక్టరేట్లో శుక్రవారం డే–ఎన్ఆర్ఎల్ఎం, సెర్ప్ల ఆధ్వర్యంలో ఇంక్యుబేటర్లపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణప్రాంత మహిళా వ్యా పారవేత్తలను ప్రోత్సహించడం, సాంకేతిక పరిజ్ఞానం, మార్గదర్శకత్వం, మార్కెటింగ్, ఆర్థిక సహకారం అందించడమే ఇంక్యుబేటర్ ఉద్దేశమన్నారు. అర్హత కలిగిన మహిళా వ్యాపారవేత్తలను గుర్తించి మార్గదర్శకత్వం అందించాలని ఏపీఎం, సీసీలకు సూచించారు. అడిషనల్ డీఆర్డీవో విజయలక్ష్మి, డీపీఏం సాయిలు, ఏపీఎం రాజేందర్ పాల్గొన్నారు. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో ఈనెల 24న జాబ్మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే మదన్మోహన్రావు తెలిపారు. శుక్రవారం ఆయన పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాబ్మేళా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పదేళ్లుగా జాబ్మేళాలను నిర్వహిస్తూ ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామన్నారు. 24న నిర్వహించే మేళాలో 70 ఇంటర్నేషనల్ కంపెనీలు పాల్గొంటాయని, సుమారు 5వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ పూర్తి చేసిన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. తాడ్వాయి: రైతులు రసాయన ఎరువులకు స్వస్తిచెప్పి, సహజ వ్యవసాయంపై దృష్టిపెట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్రెడ్డి సూచించారు. కరడ్పల్లి శివారులో సహజ వ్యవసాయంతో సాగుచేసిన పలువురు రైతుల పొలాలను శుక్రవారం ఆయన సందర్శించారు. రైతులకు పలు సూచనలిచ్చారు. అనంతరం ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద పంపిణీ చేసిన మినుము, కందికి సంబంధించిన మినీకిట్ ప్రదర్శన క్షేత్రాలను సందర్శించారు. పుష్పించే దశలో ఉన్న పంటలలో పురుగుల నివారణకు సహజ వ్యవసాయంలో ఉపయోగించే బ్రహ్మాస్త్రంను పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. ఏవో నర్సింలు, ఏఈవో రాకేష్, రైతులు పాల్గొన్నారు. -
అన్నింటా ముందుంటూ..
తాడ్వాయి మండలం దేవాయిపల్లి సర్పంచ్ ముత్యాల నరేశ్ పల్లె పాలనలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టేకన్నా ముందే గ్రామంలో తాగునీటి పరిష్కారం కోసం శుద్ధ జలాలు అందించే ప్లాంటును ఏర్పాటు చేయించారు. గ్రామంలో ప్లాస్టిక్ వద్దనే నినాదాన్ని ముందుకు తీసుకువచ్చి.. ఫంక్షన్లలో స్టీల్ ప్లేట్లు వాడాలంటూ చైతన్యం చేస్తున్నారు. గ్రామానికి సరఫరా అయ్యే విద్యుత్ లైను మూడు గ్రామాలకు కలిపి ఉంది. దీంతో అనేక సమస్యలు తలెత్తేవి. దీంతో గ్రామానికి ప్రత్యేక 11 కేవీ లైన్ కోసం ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నారు. వేసవి కాలంలో గ్రామంలో రాగిజావ పంపిణీ చేపట్టారు. తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
గ్రామాభివృద్ధే ధ్యేయంగా..
బీబీపేట: కోనాపూర్ సర్పంచ్ చెప్యాల రాజేశ్ గ్రామాభివృద్ధికి తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. మండల కేంద్రంనుంచి గ్రామానికి వచ్చే రోడ్డుపక్కన ప్రమాదకరంగా పెద్దపెద్ద బండరాళ్లున్నాయి. రాజేశ్ సర్పంచ్గా గెలిచిన నెలరోజుల్లోనే వాటిని తొలగింపజేశారు. పారిశుద్ధ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నారు. స్వయంగా దోమల నివారణకు ఫాగింగ్, కాలనీల్లో గడ్డి మందు పిచికారి చేస్తుండడం గమనార్హం. గ్రామంలో నిత్యం పంచాయతీ పాలకవర్గం సభ్యులు, కార్మికులు చేయాల్సిన పనులను, చేసిన పనులను డైరీలో నోట్ చేస్తున్నారు. -
నిత్యం జనం మధ్యే..
మాచారెడ్డి సర్పంచ్ సంతోష్రెడ్డి నిత్యం జనం మధ్యే ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. గ్రామంలో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం చూపారు. ముఖ్యంగా గ్రామంలోని ఒక ప్రాంతానికి సరైన రోడ్డు లేక ఇబ్బందులు పడుతుంటే ఆ సమస్యను పరిష్కరించారు. గ్రామంలో నీటి సమస్య పరిష్కారానికి బోర్లు తవ్వించారు. ప్రభుత్వం ఫించన్ల కోసం అర్హుల నుంచి దరఖాస్తులు అడగకముందే గ్రామంలో అర్హత ఉన్న వారి జాబితాను రూపొందించి వారికి అవసరమైన సర్టిఫికెట్లు తయారు చేయించి రెడీ చేశారు. గ్రామంలో విద్యుత్ దీపాల సమస్య, రోడ్ల సమస్యలకు పరిష్కారం చూపారు. అధికారులతో కలిసి గ్రామంలో తిరుగుతూ ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. -
ఘనంగా తిరంగా ర్యాలీ
కామారెడ్డి టౌన్ : వందేమాతర గీతం 150 ఏళ్ల ఉత్సవాలు, 80వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో దేశభక్తిని, జాతీయ ఐక్యతను చాటేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేపట్టారు. గాంధీ గంజ్ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. జేపీఎన్ రోడ్, సుభాష్ రోడ్, తిలక్ రోడ్, సిరిసిల్ల రోడ్, స్టేషన్రోడ్, రైల్వే కమాన్ మీదుగా నిజాంసాగర్ చౌరస్తా వరకు సాగింది. చేతుల్లో త్రివర్ణ పతాకాలు ధరించిన ప్రజలు.. ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’ నినాదాలు ఇస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కౌన్సిలర్లు, వ్యాపారులు, యువకులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘చిత్ర’మైన సహాయం
● అచ్చంపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్థి చేయూత ● మారిన బడి రూపురేఖలునిజాంసాగర్(జుక్కల్): నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్థి చేయూతనిచ్చాడు. అచ్చంపేట గ్రామానికి చెందిన సైమన్ సదరు పాఠశాలలో 2006 సంవత్సరంలో 5వ తరగతి పూర్తి చేశారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఇంటిరియర్ డిజైనర్గా, రాయల్ కలర్ మెన్గా పనిచేస్తున్నాడు. పాఠశాల తరగతి గదులకు రంగులు దిద్దడంతో పాటు అక్షరాల నామాలు, చిత్రాలను గోడలపై దిద్దాడు. వేల రూపాయల ఖర్చుతో కూడిన రంగులు స్వయంగా తన చేతులతో కుంచె వేశాడు. పండుగలు, శుభకార్యాల కోసం గ్రామానికి వచ్చినప్పుడల్లా సైమాన్ ప్రభుత్వ పాఠశాలల స్థితి గతులను చూసి చలించాడు. దీనికి తోడు సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లాల్ సింగ్ పాఠశాల అభ్యున్నతికి కోసం దాతల సహయాన్ని కోరాడు. పాఠశాల అభ్యున్నతికి కోసం సైమన్ ముందుకు వచ్చాడు. పాఠశాల తరగతి గదులకు సొంత డబ్బులతో పేయింటింగ్ స్వయంగా వేశాడు. తరగతి గదులు రంగుల మయంగా మారడంతో పాఠశాల రూపు రేఖలు మారాయి. సైమన్ సేవలను స్ఫూర్తిగా తీసుకున్న గ్రామస్తులు దాతలుగా పాఠశాలకు సహాయం చేస్తున్నారు. సదరు పాఠశాలలకు ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్, ఎల్ఈడీ టీవీని విరాళంగా అందజేశారు. పాఠశాల ఆవరణలో గదికి షెడ్డు ఏర్పాటు చేయించారు. -
కోతుల బెడదకు చెక్
● కొండ ముచ్చు వేషధారణలో విద్యార్థి భిక్కనూరు: కోతుల బెడద నివారణకు భిక్కనూరు మండలంలో ఒక విద్యార్థి కొండ ముచ్చు ముసుగు ధరించి వీధుల్లో సంచరిస్తున్నారు. దీంతో కోతులు బెంబెలెత్తి పారిపోతున్నారు. మండల కేంద్రానికి చెందిన అంబల్ల ఆగ్నేష్ అనే ఇంటర్ విద్యార్థి నగరేశ్వరాలయం సమీపంలో తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఇళ్లలో చొరబడి ఆహారాన్ని పారపోయడం కోతులు ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఆ ప్రాంతంలో ప్రతిరోజు కోతులు హంగామా చేస్తున్నాయి. ఇది గమనించిన ఆగ్నేష్ కోతుల బెడద నివారణకు ఉపాయం ఆలోచించాడు. దీంతో ఆన్లైన్లో కొండ ముచ్చు ముఖ ముసుగును కొనుగోలు చేశాడు. ఐదు రోజులుగా ప్రతి రోజు కళాశాలకు వెళ్లే ముందు, సాయంత్రం కళాశాల నుంచి వచ్చిన తర్వాత ఒక గంట పాటు కొండు ముచ్చు ముఖ ముసుగును ధరించి ఆ ప్రాంతంలోని నాలుగు ఐదు వీధుల్లో తిరుగుతున్నాడు. దీంతో కోతుల బెడద కొంతమేర తగ్గింది. -
సీపీగెట్లో ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు
కామారెడ్డి అర్బన్: సీపీగెట్–2026 (తెలంగాణ కామన్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్)ఫలితాల్లో కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపి ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్ కే విజయ్కుమార్ తెలిపారు. కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు. కెమిస్ట్రీలో వసంత్ (34వ ర్యాంకు), తరుణి (36వ ర్యాంకు) విష్ణువర్ధన్ (74), హిమవంతిని (120), బాటనీలో తరిణి (36), శ్రీనికేతన్ (84), హిందీలో బి.ఈశ్వర్ (54), ఫిజిక్స్లో కే స్రవంతి 79వ ర్యాంకు సాధించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధిపతులు, అధ్యాపకులు జయప్రకాశ్, దినకర్, శ్రీనివాస్రావు, రాజశ్రీ, మానస, రాజ్గంభీర్రావు, శారద, శ్రీనివాస్, శ్రీలత, పవన్, వెన్నెల, రమణ తదితరులు పాల్గొన్నారు. ఖలీల్వాడి: అఖిల భారత విద్యార్థి సమా ఖ్య (ఏఐఎస్ఎఫ్) జాతీ య కార్యవర్గ సభ్యుడిగా ఉ మ్మడి నిజామాబాద్ జి ల్లాకు చెందిన బానోత్ రఘురాంనాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంస్థ 90వ వార్షికోత్సవాలను ఈనెల 12, 13 తేదీల్లో ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని బారాబంకిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నుకున్న జాతీయ కార్యవర్గంలో రఘురాంకు చోటుదక్కింది. బాన్సువాడ మండలం రాంపూర్తండాకు చెందిన రఘురాం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా విద్యార్థి ఉద్యమాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా రఘురాం జాతీయ, రాష్ట్రనాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల అభివృద్ధి, ప్రభుత్వ విద్యారంగ బలోపేతమే లక్ష్యంగా తన పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు. -
జిల్లా గ్రంథాలయానికి విరాళం
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి పట్టణానికి చెందిన టౌన్ బిల్డర్ (చిగులపల్లి) శ్రీనివాస్–కిరణ్మయి దంపతులు గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థకు రూ.లక్షా 51 వేలు విరాళంగా అందజేశారు. పోటీ పరీక్షలకు సిద్ధ మౌతున్న నిరుద్యోగ అభ్యర్థులు, విద్యార్థులకు ఉపయుక్తంగా పుస్తకాలు కొనుగోలు చేయాలని వారు సూచించారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి దాతలను సన్మానించారు. కార్యక్రమంలో సంస్థ జిల్లా కార్యదర్శి వంశీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. -
నిజం నిగ్గుతేలేనా..?
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో 13 ఏళ్ల నుంచి కొనసాగుతున్న వివాదాస్పద నియామకాలపై జాతీయ ఎస్టీ కమిషన్ శుక్రవారం హైదరాబాద్లో విచారణ చేపట్టనుండడంతో ఉత్కంఠ నెలకొంది. కమిషన్ ఎదుట తెయూ ఉన్నతాధికారులు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, నియామకాలపై కమిషన్ను ఆశ్రయించిన బాధితుడు హాజరు కానున్నారు. అధ్యాపకుల నియామకాల్లో కనీస నిబంధనలు పాటించలేదని, రోస్టర్ పాయింట్ల గందళగోళం వల్ల తనకు అన్యాయం జరిగిందని వెంకట్నాయక్ అనే వ్యక్తి అందజేసిన ఫిర్యాదు మేరకు జాతీయ ఎస్టీ కమిషన్ ఈ నెల 3వ తేదీన నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే 2012 (2013–14) నాటి నియామక ప్రక్రియపై ప్రభుత్వం నియమించిన ద్విసభ్య కమిటీ, రిటైర్డ్ జడ్జ్ సీవీ రాములు నివేదికలు, తెలంగాణ హైకోర్ట్ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు, పాలకమండలి తీర్మానాలు, ఇతర వివరాలను వర్సిటీ ఉన్నతాధికారులు ఎస్టీ కమిషన్ కమిషనర్కు చూపిస్తారా.. లేదా గోప్యంగా ఉంచుతారా అనేది వర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నియామకాల రోస్టర్ పాయింట్లో తేడా కారణంగా అన్యాయం జరిగిందని వెంకట్నాయక్ ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ, కాలేజియేట్ కమిషనర్కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ నెల 14న హైదరాబాద్లో విచారణకు హాజరు కావాలని జాతీయ ఎస్టీ కమిషన్ నోటీసు జారీ చేసింది. కేవలం సమాధాన పత్రాలు పంపడం కాకుండా, 2013 నాటి నియామక నోటిఫికేషన్, రోస్టర్ పాయింట్ రిజిస్టర్లు, ఎంపిక జాబితాలు, మెరిట్ లిస్ట్లతో సహా.. అన్ని సంబంధిత అసలు రికార్డులను తీసుకొని విచారణకు హాజరుకావాలని కమిషన్ నోటీసులో స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు డివిజన్ బెంచ్ వద్ద ఉండటం, ఇదే సమయంలో జాతీయ ఎస్టీ కమిషన్ స్వయంగా జోక్యం చేసుకోవడం, పైగా అధికారులను నేరుగా హాజరు కావాలని ఆదేశించడంతో ఈ విచారణ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ విచారణ తర్వాత వర్సిటీ నియామకాలపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోనని వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తెయూలో వివాదాస్పద నియామకాలపై నేడు విచారణ జాతీయ ఎస్టీ కమిషన్ ఎదుట హాజరు కానున్న వర్సిటీ ఉన్నతాధికారులు యూనివర్సిటీవర్గాల్లో తీవ్ర ఉత్కంఠ -
యువత సన్మార్గంలో నడవాలి
సదాశివనగర్: యువత సన్మార్గంలో నడవాలని ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ ప్రముఖ్ ముత్యం సూచించారు. గురువారం మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయ ప్రాంగణంలోని ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన యువ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్యవక్తగా హాజరై మాట్లాడారు. 15–35 సంవత్సరాల మధ్య వయస్సు గల సుమారు 237 మంది కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ యువకులు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి వారి ఆశయాలను నెరవేర్చాలన్నారు, యువత మత్తు పదార్థాలను, మాదకద్రవ్యాలకు బానిస కావొద్దన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ మండలాధ్యక్షుడు కొప్పుల నర్సారెడ్డి, వివిధ గ్రామాల యువకులు పాల్గొన్నారు. -
ఏఐసీసీ కార్యదర్శితో గడ్డం చంద్రశేఖర్రెడ్డి భేటీ
కామారెడ్డి టౌన్ : హైదరాబాద్లోని గాంధీభవన్లోని ఏఐసీసీ చాంబర్లో తెలంగాణ ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్తో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డి గురువారం భేటీ అయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితులు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన పార్టీ కార్యక్రమాలపై చర్చించినట్లు గడ్డం చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. భిక్కనూరు: ఇందిరమ్మ లబ్ధిదారులు ఇళ్లను వేగంగా నిర్మించుకోవాలని భిక్కనూరు గ్రామపంచాయతీ ఈవో మహేశ్ గౌడ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో పలు ఇందిరమ్మ ఇళ్లకు ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు. వార్డు సభ్యులు ఉన్నారు. -
బెదిరింపులతోనే మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య
● రెండేళ్ల తర్వాత కేసులో ట్విస్ట్ ● విలేకరుల ముసుగులో వేఽధింపులు ● ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులుకామారెడ్డి క్రైం : వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగినిగా పనిచేసే మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య కేసులో రెండేళ్ల తర్వాత ఊహించని పరిణామం చోటుచేసుకుంది. విలేకరుల ముసుగులో కొందరు వ్యక్తులు బెదిరింపులు, డబ్బుల డిమాండ్కు పాల్పడటమే ఆమె ఆత్మహత్యకు కారణమని పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇప్పటికే జైలులో ఉండగా మరో ఇద్దరిని పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కామారెడ్డి సబ్ డివిజన్ పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మధుసూదన్ వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలో నివాసం ఉండే చేపూరి శిరీష (28) వైద్య ఆరోగ్య శాఖలో ఫార్మసిస్ట్గా పని చేసేవారు. విలేకరుల ముసుగులో వసూళ్లకు పాల్పడే కొందరు వ్యక్తులు ఆమె ఉద్యోగం, జీతం, సర్వీస్ వివరాలను ఆర్టీఐ చట్టం ద్వారా సేకరించి, ఉద్యోగం కోల్పోయేలా చేస్తామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేసినట్లు విచారణలో తేలిందని డీఎస్పీ తెలిపారు. నిందితులను బాపూరావు, ఇందూరి సిద్దాగౌడ్, లాండె భాస్కర్గా గుర్తించారు. బాపూరావు ఇటీవలే పీడీ యాక్టు నమోదై జైలులో ఉండగా, మిగిలిన ఇద్దరిని గురువారం అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారన్నారు.నిందితులు ముగ్గురు విలేకరులుగా పరిచ యం చేసుకొని ఉద్యోగులు, వ్యాపారులు, పలుకుబడి కలిగిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు తేలింది. చాలామందికి ఇదే తరహాలో డబ్బులు ఇవ్వకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తామని, ఉద్యోగాలు పోయేలా చేస్తామని, వ్యతిరేక వార్తలు రాస్తామని బెదిరింపులకు పాల్పడిన ఆధారాలు లభించాయని డీఎస్పీ వెల్లడించారు. నిందితులపై బెదిరింపులు, డబ్బుల వసూళ్లకు సంబంధించి కామారెడ్డి, ఎల్లారెడ్డి, దోమకొండ, గాంధారి, దేవునిపల్లి పోలీస్ స్టేషన్లలో గతంలోనూ కేసులు నమోదై ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఫార్మసిస్ట్ శిరీషపై ఒత్తిడి, బెదిరింపులు, మానసిక వేధింపులకు పాల్పడినట్లు దర్యాప్తులో వెల్లడి కావడంతో నిందితులను రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో పట్టణ ఎస్హెచ్వో నరహరి, సిబ్బంది పాల్గొన్నారు. -
పెట్టుబడా మోసం
శుక్రవారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 2026– 8లో uఉపాధి కోసం దుబాయి వెళ్లొచ్చిన రామారెడ్డి మండలం రమణతండాకు చెందిన భుక్యా నవీన్ తాను పనిచేసిన ఓ ఆన్లైన్ గేమింగ్ కంపెనీతో కుమ్మకై ్క అధిక లాభాలను ఆశచూపి కామారెడ్డితోపాటు ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన 7,636 మందితో రూ.కోట్లల్లో పెట్టుబడులు పెట్టించాడు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ముగ్గురిలో ఇద్దరిని గత నెల 31న, మరో నిందితుడిని నాలుగు రోజుల క్రితం పోలీసులు రిమాండ్కు పంపారు.సైబర్ నేరాలకు సంబంధించి కామారెడ్డి జిల్లాలో గతేడాది మొత్తం 980 ఫిర్యాదులు రాగా, వాటిలో విచారణ పూర్తయిన తర్వాత 160 కేసులు నమోదు చేశారు. ఆయా కేసుల్లో రూ.5.83 కోట్లను బాధితులు నష్టపోయారు. వాటి నుంచి రూ.1.07 కోట్లను పోలీసులు రికవరీ చేసి బాధితులకు అప్పగించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 400లకు పైగా ఫిర్యాదులు వచ్చినట్లు తెలిసింది. అయితే, సైబర్ నేరాలను ప్రధాన సమస్యగా భావించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలకు ఉపక్రమించాయి. సైబర్ వారియర్ పేరిట ప్రతి పీఎస్లో ఒక అధికారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి, బాధ్యతలు అప్పగించడంతోపాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. పోలీసు కళాబృందాల ఆధ్వర్యంలో బ్యాంకులు, బస్టాండ్లు, పాఠశాలలు, కళాశాలల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఫ్రాంచైజీ, ఉద్యోగాల పేరిట అమాయకులకు గాలం ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 400కు పైగా ఫిర్యాదులు అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన -
హర్ ఘర్ తిరంగా ర్యాలీ
బాన్సువాడ రూరల్: తాడ్కోల్లో సీ్త్రశిశు సంక్షేమశాఖ, మహిళాసాధికారిత కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి గ్రామ పంచాయతీ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సౌభాగ్య, మహిళా సాధికారిత కేంద్రం సభ్యులు తులసీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్ భారతి, అన్వరి, ఆశవర్కర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. పిట్లం: పారేడ్పల్లి గ్రామంలో గురువారం రైతులకు ఎఫ్ఎఫ్ఎస్ (ఫ్రేమ్వర్క్ ఫర్ ఫెర్టిలైజర్ సెల్) యాప్పై వ్యవసాయాధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విస్తర్ణ అధికారి సురేశ్ మాట్లాడుతూ రైతులకు అవసరమైన ఎరువులను యాప్లో బుక్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు. బాన్సువాడ రూరల్: పొలం పట్టా పాస్బుక్ ఉన్న ప్రతి రైతు ఆధార్కార్డుకు మొబైల్ నంబర్ లింక్ ఉండాలని కోనాపూర్ క్లస్టర్ ఏఈవో జ్ఞానేశ్వర్ అన్నారు. గురువారం ఆయన కాద్లాపూర్లో రైతులకు ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ యాప్పై గ్రామ పంచాయతీలో అవగాహన కల్పించారు. సర్పంచ్ శీతల్ అంకూష్, ఉప సర్పంచ్ ఫత్రుసాబ్, రైతులు గడిగె గణేష్, శంకర్, మనోజ్, రామదాసు, హస్సన్ తదితరులు పాల్గొన్నారు. రాజంపేట(భిక్కనూరు): రాజంపేట పీహెచ్సీలో గురువారం అమ్మఒడి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వైద్యురాలు విజయ మహాలక్ష్మి గర్భిణులకు పరీక్షలు నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.వైద్యురాలు సంగీత, ఎంపీహెచ్ఈవో మంజూర్, ల్యాబ్ టెక్నిషియన్ ఉన్నారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం గాంధారి: చెల్లితో గొడవ కావడంతో మనస్థాపం చెందిన ఓ విద్యార్థిని గడ్డిమందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గాంధారి మండలం గుజ్జుల్ తండాలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. తండాకు చెందిన జర్పుల దివ్య మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. చెల్లెలితో గొడవపడి ఇంట్లో ఉన్న గడ్డిమందు సేవించగా కుటుంబసభ్యులు గమనించి కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కామారెడ్డి అర్బన్: జిల్లాలోని అన్ని పాఠశాలల హెడ్ మాస్టర్లు, పీడీ, పీఈటీలు చొరవ తీసుకుని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల, జోనల్, జిల్లా స్థాయి క్రీడలు నిర్వహించాలని ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీధర్ ఒక ప్రకటనలో కోరారు. ఆయా మండలాల ఎంఈవోలు ఈనెల 15 వరకు మండల సమావేశాలు ఏర్పాటు చేసి మండల, జోనల్ స్థాయి క్రీడలు నిర్వహించాలన్నారు. ఆగస్టు మూడవ వారం లోగా మండల స్థాయి క్రీడలు నిర్వహించి జోనల్ క్రీడలు నిర్వహించాలని, సెప్టెంబర్ 2వ వారంలోగా జోనల్ క్రీడల అనంతరం జిల్లా స్థాయి జట్లను ఎంపిక చేసి సెప్టెంబర్ 4వ వారంలోగా ఉమ్మడి జిల్లా స్థాయి క్రీడలు నిర్వ హించాల్సి ఉంటుందన్నారు. కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంఎస్డబ్ల్యూ పీజీ రెండోఏడాది 4వ సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రారంభం కానున్నట్టు వైస్ ప్రిన్సిపల్, పరీక్షల నియంత్రణ అధికారి కే.కిష్టయ్య తెలిపారు. -
విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
బీర్కూర్లో విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేస్తున్న ప్రిన్సిపల్ మోహన్రెడ్డిగాంధారిలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేస్తున్న ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాంగాంధారి: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నోట్బుక్స్ను జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు.కళాశాల ప్రిన్సిపల్ సింగం శ్రీనివాస్, అధ్యాపకులు రాజగోపాల్, లక్ష్మణ్, శ్రీధర్, విజయకుమార్, రమేష్, సంబాజి, సరిత, సుజాత, స్వప్న, మమత, మల్లయ్య, తేజ, సిబ్బంది గణేష్, ఆరిఫ్, రాములు, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ/బీబీపేట/సదాశివనగర్/లింగంపేట : బీర్కూర్, బీబీపేట, లింగంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రిన్సిపల్స్ మోహన్రెడ్డి, శంకర్, నరేందర్ విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థులకు డిజిటల్ తరగతులతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఉన్నారు. -
220 కిలోల నల్లబెల్లం స్వాధీనం
కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రంలో ఎకై ్సజ్ అధికారులు నిర్వహించిన దాడుల్లో 220 కిలోల నల్లబెల్లం, 64 కిలోల పటిక పట్టుబడింది. వివరాలిలా ఉన్నాయి. నాటు సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం, పటిక లను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం రావడంతో కామారెడ్డి ఎకై ్సజ్ అధికారులు గురువారం జిల్లా కేంద్రంలోని సిరిసిల్లా రోడ్లో వాహనాల తనిఖీలు చేపట్టారు. రాజన్న సిరిసిల్లా జిల్లా గంభీరావుపేట మండలం వీర్నపల్లి గ్రామానికి చెందిన భుక్యా గంగా అనే వ్యక్తి కారులో తరలిస్తున్న 60 కిలోల నల్లబెల్లం, 10 కిలోల పటికను స్వాధీనం చేసున్నారు. అనంతరం భుక్యా గంగా వాంగ్మూలం మేరకు పట్టణంలోని గంజి మార్కెట్ యార్డులో ఉన్న కృష్ణకుమార్ మర్చంట్ దుకాణంలో సోదాలు జరిపారు. అక్కడ మరో 160 కిలోల నల్లబెల్లం, 54 కిలోల పటిక లభ్యమైనట్లు ఎకై ్సజ్ సీఐ సంపత్ కృష్ణ తెలిపారు. నల్లబెల్లం, పటిక లను స్వాధీనం చేసుకుని భుక్యా గంగాతో పాటు దుకాణ యజమాని కృష్ణకుమార్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని వెల్లడించారు. దాడుల్లో ఎకై ్సజ్ ఎస్సై విక్రమ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
యువతతోనే దేశాభివృద్ధి
● విద్యాభారతి సంయోజక్ హరిస్మరణ్రెడ్డి ఎల్లారెడ్డిరూరల్: యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉన్నదని, వారితోనే దేశం అభివృద్ధి చెందుతుందని విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర పూర్వ విద్యార్థి పరిషత్ సంయోజక్ హరిస్మరణ్రెడ్డి అన్నారు. ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎల్లారెడ్డిలో గురువారం నిర్వహించిన హిందూ యువ సమ్మేళన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువకులు దేశం కోసం, సమాజం కోసం సమయం కేటాయించాలన్నారు. కార్యక్రమంలో రెడ్డి సాయిలు, బజరంగ్దళ్ కార్యకర్తలు, వివిధ గ్రామాల యువకులు తులసి, వినోద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మాచారెడ్డి: సేంద్రియ పంటలే మానవాళికి శ్రేయస్కరమని డీఆర్డీవో దామోదర్ రెడ్డి అన్నారు. మండలంలోని కొత్తపల్లిలో శ్రీకాంత్ రెడ్డి అనే యువ రైతు వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. ఫాం పాండ్లో నీటిని నిల్వ చేసుకొని దాంట్లో పెంచుతున్న చేపలను పరిశీలించారు. సేంద్రియ ఎరువులతో పండిస్తున్న కూరగాయలు, డ్రాగన్ ఫ్రూట్, కొబ్బరితోపాటు జిల్లాలోనే మొట్ట మొదటిసారిగా గ్యాక్ ఫ్రూట్ సాగును చూసి శ్రీకాంత్ రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో ఏపీవో సాయిబాబా, పంచాయతీ కార్యదర్శి జీవన్, సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ ఐలయ్య పాల్గొన్నారు. నిజాంసాగర్(జుక్కల్): సింగితం రిజర్వాయర్ నీరు వృథా కాకుండా నీటిపారుదల శాఖ సిబ్బంది మట్టి, మొరం బస్తాలతో అడ్డుకట్ట వేస్తున్నారు. నర్వ గ్రామ శివారులో మూడేళ్ల కిందట రిటెయినింగ్ వాల్ కొట్టుకుపోవడంతో సాగు జలాలు వృథా అవుతున్నాయి. రిటెయినింగ్ వాల్తోపాటు బుంగల ద్వారా నీరు వృథా కాకుండా నాలుగు రోజులుగా సిబ్బంది మట్టి, మొరం బస్తాలను అడ్డుగా వేస్తున్నారు. రిజర్వాయర్ నీటిమట్టాన్ని తగ్గించి తాత్కాలిక పనులు చేపట్టారు. అయితే, ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వరద వస్తే తాత్కాలిక బస్తాలు తట్టుకోలేవని, శాశ్వత మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.సదాశివనగర్(ఎల్లారెడ్డి): ప్రార్థన సమయానికి హాజరుకాని ఇద్దరు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. సదాశివనగర్ మండలం ధర్మారావ్పేట్ ఉన్నత పాఠశాలను ఈ నెల 7న స్థానిక సర్పంచ్ ఉమర్ తనిఖీ చేయగా, ప్రార్థన సమయంలో ఇద్దరు ఉపాధ్యాయులు గైర్హాజరయ్యారు. ఈ విషయమై ఎంఈవో దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఉపాధ్యాయులకు గురువారం షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు ఎంఈవో యోసెఫ్ తెలిపారు. -
ప్రజావాణిని పకడ్బందీగా నిర్వహించాలి
నాగిరెడ్డిపేట: మండల కేంద్రంలో ఈ నెల 17 నుంచి ప్రారంభంకానున్న మండలస్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జడ్పీ సీఈవో చందర్ నాయక్ సూచించారు. మండలంలోని మాల్తుమ్మెద గ్రామ శివారులో నూతనంగా చేపట్టిన బోర్వెల్ రీచార్జీ పిట్ను బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం మండలంలోని పోచారం ప్రాజెక్టును, అక్కడి నుంచి మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని పలు రికార్డులను, కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహించబోయే సమావేశపు హాల్ను పరిశీలించారు. ఎంపీడీవో గంగాధర్, ఎంపీవో ప్రభాకరచారి, ఏపీవో సక్కుబాయి, మాల్తుమ్మెద, పోచారం గ్రామాల సర్పంచులు సాయిలు, సంజీవరావు, టీఏ సత్యప్రసాద్, జీపీ కార్యదర్శి అశోక్, ఏఫ్ఏ సాయిలు ఉన్నారు. -
ఉచిత న్యాయసేవలను సద్వినియోగం చేసుకోవాలి
భిక్కనూరు: అందరికీ న్యాయసేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం న్యాయసేవ అధికార సంస్థను ఏర్పాటు చేసి ఉచిత న్యాయసేవలను అందిస్తోందని కామారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి అన్నారు. బుధవారం భిక్కనూరు మండలంలోని బస్వాపూర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో జడ్జి ముఖ్యఅతిథిగా పాల్గొని మా ట్లాడారు. మహిళలు, బాలికలు, విద్యార్థుల భధ్రత, చట్టపరమైన హక్కులు వారిపై జరుగుతున్న మోసా లు, పలు అంశాలపై విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో సీడబ్ల్యూఎల్ సభ్యురాలు స్వర్ణలత, జూనియర్ అసిస్టెంట్ సామ్యూల్ ఖాన్, పార లీగల్ వలంటీర్ నరేశ్ తదితరులు పాల్గొన్నారు. -
17న డ్రాఫ్ట్ ఓటరు జాబితా
ఎల్లారెడ్డి: ఓటర్ డ్రాఫ్ట్ జాబితాను ఈనెల 17న విడుదల చేయనున్నట్లు ఆర్డీవో ప్రభాకర్ అన్నారు. బుధవారం ఆర్డీవో కార్యాలయంలో అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో మొత్తం 2,28,503 ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయగా, వాటిని బీఎల్వో యాప్ ద్వారా వంద శాతం డిజిటలైజేషన్ పూర్తి చేయడం జరిగిందన్నారు. వీటిలో 22,469 ఫారాలు మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, డబుల్ ఓటర్లుగా గుర్తించామని తెలిపారు. అభ్యంతరాల స్వీకరణ ఈనెల 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు ఆర్డీవో కార్యాలయంలో తీసుకోవడం జరుగుతుందన్నారు. తుది ఓటరు జాబితా అక్టోబర్ 10న విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రేమ్ కుమార్, గిర్దావర్ భరత్, ఎన్నికల సిబ్బంది, నాయకులు అజహర్, బాలకిషన్, నర్సింలు, దేవేందర్ పాల్గొన్నారు. పాఠశాల తనిఖీ ఎల్లారెడ్డి: గిరిజన బాలికల గురుకుల పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని ఆర్డీవో ప్రభాకర్ ప్రిన్సిపాల్కు సూచించారు. ఆర్డీవో పట్టణంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను ఆర్డీవో పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తహసీల్దార్ ప్రేమ్కుమార్, ప్రిన్సిపాల్ ప్రమీల, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు. -
ఎమ్మార్పీఎస్ మండల కార్యవర్గం ఏర్పాటు
నాగిరెడ్డిపేట: ఎమ్మార్పీఎస్ మండలస్థాయి నూతన కార్యవర్గాన్ని నాగిరెడ్డిపేట మండలకేంద్రంలో బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ఇన్చార్జి మంథోని సామెల్ ఆధ్వర్యంలో మండల కమిటీని ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షుడిగా నింగమొల్ల ఊశయ్య, అధికార ప్రతినిధిగా అక్కమొల్ల సురేందర్, ఉపాధ్యక్షులుగా గడ్డమీది సాయిలు, ఎర్ర కుమార్, రాజగల్ల యాదగిరి, ప్రధాన కార్యదర్శులుగా తొంట బాబు, ఎర్రోళ్ల సాయిలు, కోశాధికారిగా బుర్ర సాయిలు, కార్యదర్శులుగా తొంట బాలు, మాసగల్ల ఊశయ్య, గుడ్డివెంకని అశోక్, గుడ్డివాని చంద్రబాబు, సహాయ కార్యదర్శులుగా పసులాది దుర్గయ్య, నాగంపల్లి గోపాల్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్, కిష్టాఫర్, సాయిలు, బాబురావు, పద్మారావు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: కామారెడ్డి పట్టణ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం పట్టణ అధ్యక్షుడిగా ముదాం వెంకటేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా రామడిపేట రాజు, కోశాధికారిగా అనుమండ్ల రమేశ్ ఎన్నికయ్యారు. పట్టణ మున్నూరు కాపుల సమాజ అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తానని వెంకటేశ్వర్ పేర్కొన్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని సంఘ సభ్యులు, ప్రతినిధులు సన్మానించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు రావుల గంగాధర్, ముదాం శ్రీనివాస్, బొజ్జ రవి, స్వామి, వెంకట్రాజ్, శంకర్, సాయిలు, నవీన్, రాజేశ్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. నిజాంసాగర్: జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను బుధవారం ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు. ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాలకు విడతల వారీగా బిల్లులు మంజూరు చేస్తామని చెప్పారు. ఆయన వెంట ఎంపీవో రాములు, పంచాయతీ అధికారి తదితరులు ఉన్నారు. బాన్సువాడ రూరల్: మండలంలోని తాడ్కోల్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను సర్పంచ్ అందె రమేశ్ జీపీ కార్యదర్శి భరత్తో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసుకోవాలని సూచించారు. నిర్మాణాలు ప్రారంభించని వారు వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. -
చోరీ కేసుల్లో నిందితుడి అరెస్టు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలో వివిధ రకాల దొంగతనాలకు పాల్పడ్డ వ్యక్తిని పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు సీఐ సంతోష్కుమార్ తెలిపారు. మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో బుధవారం ఆయన వివరాలు వెల్లడించారు. వజ్జపల్లి తండాలోని జగదాంబ ఆలయంలో ఇటీవల జరిగిన చోరీ కేసును చేధించి, పూర్యానాయక్ తండాకు చెందిన మాలోత్ నవీన్ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. అతని వద్ద బంగారు ఆభరణాలు, నగదును, దొంగతనానికి ఉపయోగించిన బైక్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. రెండు బంగారు ఉంగరాలను గాంధారిలోని గోల్డ్ షాప్లో విక్రయించి రూ.40,600 పొందినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. మిగిలిన బంగారు ఆభరణాలను పోలీసులకు దొరకకుండా తన ఇంటిలో దాచిపెట్టినట్లు నిర్ధారించారు. ఎస్సై పుష్పరాజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్కు అభినందన
నాగిరెడ్డిపేట: మండలంలోని గోపాల్పేట మోడల్స్కూల్ ప్రిన్సిపాల్ రాంప్రసాద్ను బుధవారం విద్యాశాఖ కమిషనర్, డైరెక్టర్ నవీన్ నికోలస్ ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాల అభివృద్ధికి ప్రిన్సిపాల్ చేస్తున్న కృషితోపాటు తీసుకుంటున్న చొరువను గుర్తించి విద్యాశాఖ కమిషనర్ హైదరాబాద్లోని తన ఛాంబర్లో ఆయనను అభినందించి ప్రశంసాపత్రాన్ని అందజేశారు. భిక్కనూరు: దక్షిణ కాశీగా పేరొందిన భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయం భూముల సర్వే మూడు రోజులుగా కొనసాగుతోంది. దేవాలయానికి సంబంధించిన భూమల విస్తీర్ణం, హద్దులకు సంబంధించిన రికార్డులను పరిశీలించి నమోదు చేస్తున్నారు. దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, ఆలయ ఈవో శ్రీధర్రావు, సర్వే అధికారి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: కామారెడ్డి సనానత సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపకులు, నృత్యకళాకారుడు మాలోత్ నవీన్కు ఉత్తరప్రదేశ్ అయోధ్యకు చెందిన త్రేతాయుగ్ ఫౌండేషన్ ‘ది ఐకానిక్ ఇండియా’ పురస్కారం ప్రకటించింది. స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో నిర్వహించే జాతీయస్థాయి కార్యక్రమంలో నవీన్కు ది ఐకానిక్ ఇండియా పురస్కారం అంద జేయనున్నట్లు త్రేతాయుగ్ ఫౌండేషన్ పేర్కొంది. -
కల్తీ పేరుతో గీత వృత్తిపై దాడులు మానుకోవాలి
కామారెడ్డి టౌన్/ భిక్కనూర్/ మాచారెడ్డి: కల్తీ కల్లు పేరుతో కల్లుగీత వృత్తిపై పథకం ప్రకారం చేస్తున్న దాడులను తక్షణం నిలిపివేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీ రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న ‘గీతన్నల చైతన్య బస్సు యాత్ర’ బుధవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని రేణుక ఫంక్షన్ హాల్లో సభను ఏర్పాటు చేశారు. అనంతరం బస్సు యాత్ర భిక్కనూర్, మాచారెడ్డి మండల కేంద్రాలకు చేరుకుంది. వారికి సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు. -
సర్వీస్ రోడ్డుకు మోక్షం
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలో సిరిసిల్ల రోడ్డు నుంచి నేషనల్ హైవే 44కు వెళ్లే ప్రధాన రహదారి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పూ ర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారింది. స్థానికులు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ దృష్టికి సమస్యను తీసుకువెళ్లగా ఆయన తక్షణ మే స్పందించి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెండు రో జుల్లోనే గుంతలను పూడ్చివేసి, రహదారిని పు నరుద్ధరించి బుధవారం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వ సలహాదారుకు పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. భిక్కనూరు: ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ అన్నారు. బుధవారం హైదరాబాద్లో ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ పొట్టిగిని శంకర్, వార్డు సభ్యుడు జ్ఞానప్రకాశ్రెడ్డి, సీనియర్ నేత డప్పు రవి ఎమ్మెల్యేను కలిశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేయాలన్నారు. బాన్సువాడ రూరల్: ‘రాజు రాకట చూడు..రోడ్డు నూకుట చూడు’ అన్న చందంగా మండలంలోని బోర్లంక్యాంపులో గల సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయంలో పరిశుభ్రత పనులు కొనసాగాయి. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పాఠశాలకు వస్తున్నారనే సమాచారంతో ప్రాంగణంలోని ముళ్లపొదలు, గడి తొలగింపునకు చర్యలు చేపట్టారు. దోమకొండ: ఆయిల్పామ్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ జిల్లా సీనియర్ మేనేజర్ ఉప్పర్పల్లి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధవారం మండలంలోని అంబరిపేట గ్రామానికి చెందిన రైతుగునిగంటి ప్రవీణ్రావు గత నాలుగేళ్లుగా భూమిలో ఆయిల్ పామ్సాగు చేయగా, ఈ ఏడాది గేలలు కటింగ్కు వచ్చాయన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతి, క్లస్టర్ అధికారి సత్యనారాయణ, కామారెడ్డి క్లస్టర్ ఉద్యాన అధికారులు సుమన్ తదితరులు పాల్గొన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలింగంపేట: మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో బుధవారం పలు గ్రామాల లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను తహసీల్దార్ సు రేశ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయిరాంయాదవ్, రమేశ్, విఠల్, రవి, ఏదుల్, అశోక్, సతీశ్, బాలాగౌడ్, హర్షద్పాష, రాజు, కృష్ణమూర్తి, సంజీవ్ పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి చెక్కులు.. లింగంపేట: మండలంలోని బాణాపూర్, పొ ల్కంపేట గ్రామాల్లో పలువురు లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సాయిరాంయాదవ్ పంపిణీ చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకిషన్, అశోక్, రాములు, నాగరాజు, దేవేందర్రెడ్డి, మహేశ్గౌడ్ పాల్గొన్నారు. ఎల్లారెడ్డి: మోడల్ స్కూల్లో నిర్వహించిన మాక్ ఎలక్షన్స్లో పాఠశాలకు చెందిన హెడ్బాయ్గా సాయికుమార్ గెలుపొందినట్లు ప్రిన్సిపాల్ తోటగాంధీ బుధవారం తెలిపారు. పాఠశాలలో నిర్వహించిన మాక్ ఎలక్షన్లో హెడ్ బాయ్, హెడ్ గర్ల్, డిప్యూటీ హెడ్ బాయ్, డిప్యూటీ హెడ్ గర్ల్కు ఎన్నికలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. వైస్ ప్రిన్సిపాల్ జహంగీర్, ఉపాధ్యాయులు రాజశేఖర్, ప్రియదర్శిని పాల్గొన్నారు. -
30 పడకలు.. ముగ్గురే వైద్యులు!
పిట్లం: మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రి భవనం అందుబాటులోకి వచ్చినా.. అందుకు అనుగుణంగా వైద్య సిబ్బందిని నియమించకపోవడంతో వైద్య సేవలు ఆశించిన స్థాయిలో అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో మొత్తం ఆరుగురు వైద్యులు అవసరం ఉండగా ప్రస్తుతం ముగ్గురే విధులు నిర్వహిస్తున్నారు. అందులో ఒకరు ఇన్చార్జి, మరొకరు రెగ్యులర్, ఇంకొకరు కాంట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు నర్సింగ్, ఇతర సహాయక సిబ్బంది కొరత కూడా రోగులకు ఇబ్బందిగా మారుతోంది. వైద్యుల కోసం ఎదురుచూపులు పిట్లంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి మండలం నుంచే కాకుండా సంగారెడ్డి జిల్లా తడ్కల్, కంగ్టి మండలాల నుంచి కూడా రోగులు వైద్యం కోసం ప్రతి రోజు సుమారు 250 మంది వస్తుంటారు. వైద్యుల సంఖ్య తక్కువగా ఉండటంతో కొన్ని సమయాల్లో వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయని రోగులు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాల్లోని ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. సిబ్బంది లేక.. ఆస్పత్రికి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించినా అవసరమైన స్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో ఎక్స్రే మిషన్ ఉన్నా దానికి సంబంధించిన టెక్నీషియన్ లేరు. దంత వైద్యులు లేరు. ఫార్మసిస్ట్ బిచ్కుంద నుంచి డిప్యుటేషన్పై వారానికి రెండు రోజులు మాత్రమే పిట్లం ఆస్పత్రికి వస్తుంటారు. స్టాఫ్నర్స్లు 14 మంది ఉండగా వారిలో ముగ్గురిని బాన్సువాడ ఆస్పత్రికి డిప్యుటేషన్పై పంపించారు. ప్రస్తుతం 11 మంది మాత్రమే ఉన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ డిప్యుటేషన్పై ఎల్లారెడ్డి నుంచి వస్తుంటారు. గైనకాలజిస్ట్ను డిప్యుటేషన్పై బాన్సువాడకు వేయగా ఆమె మూడు రోజులు పిట్లంలో, మరో మూడు రోజులు బాన్సువాడలో విధులు నిర్వహిస్తున్నారు. శస్త్ర చికిత్స అవసరం ఉన్న వారికి బాన్సువాడ, కామారెడ్డి, నిజామాబాద్ ఆస్పత్రులకు రెఫర్ చేస్తున్నారు. రాత్రి సమయాల్లో అత్యవసర వైద్యానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదే విధంగా వర్షం పడినప్పుడు ఆస్పత్రికి వెళ్లే రోడ్డు చిత్తడిగా మారుతోంది. పాదచారులు, వృద్ధులు నడవలేని స్థితిలో రోడ్డు ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేసి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని, అలాగే రోడ్డు సమస్యను పరిష్కరించాలని మండల ప్రజలు కోరుతున్నారు. వైద్యులు, సిబ్బంది కొరతతో రోగులకు ఇబ్బందులు పిట్లం నూతన ఆస్పత్రిలో పూర్తిస్థాయి వైద్య సేవలకు ఆటంకం ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని ప్రజల డిమాండ్ -
అమృత్ 2.0 పనుల పరిశీలన
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో కొనసాగుతున్న అమృత్ 2.0 పనులను మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ బుధవారం పరిశీలించారు. పనుల నాణ్యతను పరిశీలించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. వైస్ చైర్పర్సన్ మత్తమాల భా గ్యవతి, సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్గౌడ్, కౌ న్సిలర్లు తిరుపతి, చంద్రయ్య, గఫార్ ఉన్నారు. ఎల్లారెడ్డిరూరల్: మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ పరిశీలించారు. పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని సిబ్బందికి సూచించారు. కౌన్సిలర్ సయ్యద్ గఫార్ తదితరులు ఉన్నారు. -
ముళ్లపొదల్లో నవజాత శిశువు
మోపాల్(నిజామాబాద్రూరల్): నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలకేంద్రంలోని బీసీ వసతిగృహం వద్దగల ముళ్లపొదల్లో బుధవారం నవజాత శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. ముడి వేసి ఉన్న బ్యాగులోనుంచి శిశువు ఏడుపులు రావడంతో అటుగా వెళ్లిన స్థానికులు గమనించి పోలీసులు, అంగన్వాడీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని శిశువును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చికిత్స నిమిత్తం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉందని, బుధవారమే జన్మించినట్లు నిర్ధారించినట్లు తెలిసింది. శిశువును ఎవరు వదిలి వెళ్లారనే విషయాలను వైద్య, ఆ రోగ్యసిబ్బంది ఆరా తీ స్తున్నారు. అలాగే మండలంలో నేడో, రేపో ప్రసవ తేదీలు కలిగిన గర్భిణుల వివరాలు సేకరిస్తున్నారు. మానవత్వం మంటగలిసేలా కన్న తల్లి పేగుబంధాన్ని మర్చిపోయి అప్పుడే పుట్టిన బిడ్డను వదిలించుకోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. -
సిద్ధరామేశ్వరాలయం హుండీ ఆదాయం రూ. 5.41 లక్షలు
భిక్కనూరు: భిక్కనూరు సిద్దరామేశ్వరాలయం హుండీని బుధవారం లెక్కించారు. ఐదు నెలలకు సంబంధించిన హుండీని లెక్కించగా.. రూ. 5,41,830 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో శ్రీధర్రావు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయశాఖ పరిశీలకులు సత్యనారాయణ, ఆలయ అనువంశిక అర్చకులు రామగిరిశర్మ, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ లింబాద్రి, కామారెడ్డి సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. నిజాంసాగర్: సూపర్ ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు తగిన చర్యలు చేపట్టాలని జెడ్పీ సీఈవో చందర్నాయర్ నాయక్ సూచించారు. బుధవారం నిజాంసాగర్లో నిజాంసాగర్, మహ్మద్నగర్ మండలాల మండల పరిషత్, ఈజీఎస్, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలసిరిని ఒడిసి పట్టుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. గ్రామాలలో ఫాంపాండ్స్, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలన్నారు. సమావేశంలో ఎంపీడీవోలు శివకృష్ణ, అనిత తదితరులు పాల్గొన్నారు. భిక్కనూరు: జ్యోతీబా ఫూలే సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో నీట్, జేఈఈలకు ఉచితంగా లాంగ్ టర్మ్ శిక్షణ అందిస్తున్నారు. ఈ విషయాన్ని బీసీ గురుకులాల ఉమ్మడి జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త రాధిక తెలిపారు. బాలికలకు నాగోల్లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కళాశాలలో, బాలురకు అబ్దుల్లాపూర్మెట్లోని సెంటర్ ఆప్ ఎక్సలెన్స్ కళాశాలలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. నీట్ యూజీ, జేఈఈ 2027 ప్రవేశపరీక్షకు హాజరయ్యే బీసీ విద్యార్థులు ఈనెల 16లోగా https://mjptbcadmissions.org వెబ్సైట్ ద్వా రా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నాగిరెడ్డిపేట: రైతులు ఆయిల్పాం సాగు చేప ట్టి లాభాలు పొందాలని జిల్లా ఉద్యానశాఖ అ ధికారి(డీహెచ్వో) జ్యోతి సూచించారు. మా ల్తుమ్మెద ఉద్యానక్షేత్రాన్ని బుధవారం ఆమె సందర్శించారు. పరిసరాలను పరిశీలించి దిన సరి కూలీలకు పలు సూచనలు ఇచ్చారు. అ నంతరం ఎల్లారెడ్డి మండలంలోని మాచాపూర్లో ఏర్పాటు చేస్తున్న ఆయిల్పాం నర్సరీని పరిశీలించారు. ఆమె వెంట ఎల్లారెడ్డి హెచ్వో సుమన్, హెచ్యూఎల్ మేనేజర్ శ్రీనివాస్గౌడ్, ఏరియా మేనేజర్ ప్రశాంత్ తదితరులున్నారు. భిక్కనూరు: ఇటలీలో జూలై 30 నుంచి ఆగస్టు 7 వరకు జరిగిన సెయిలింగ్ ఇంటర్నేషనల్ కాడెట్ చాంపియన్షిప్లో ప్రతిభ చూపిన భిక్కనూరు విద్యార్థిని రిశ్వితను రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించారు. బుధవారం హైదరాబాద్లో తనను కలిసిన రిశ్వితను ఆయన సన్మానించారు. భవిష్యత్తులో మరెన్నో విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. ఎల్లారెడ్డి: పట్టణంలోని వీక్లీ మార్కెట్లో నివాసముండే హోంగార్డు అర్జున్ భార్య ప్రమీల (40) బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కుమారులు చదువులో వెనకబడి ఉండడంతో ఆమె మనస్తాపం చెంది, ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
లెఫ్టీ.. ప్రతిభలో మేటి
● విభిన్నతే వారి ప్రత్యేకత ● ఎడమ చేతివాటం అరుదైన వరం ● నేడు లెఫ్ట్ హ్యాండర్స్ డే సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జనాభాలో కేవలం పది శాతం మంది మాత్రమే ఎ డమ చేతివాటం కలి గి ఉంటారు. అల్బర్ట్ ఐన్స్టీన్, అబ్దుల్ కలాం వంటి మహానుభావులు విభిన్న ఆలోచనలతో ప్రపంచంలో గుర్తింపు పొందారు. ఎడమ చేతివాటం అనేది ఎటువంటి లోపం కాదని, అది ప్రకృతి ఇచ్చిన ఒక అరుదైన వరమని పేర్కొంటారు. విభిన్నంగా ఆలోచించే తత్వమే వారిని ప్రత్యేకంగా నిలబెడుతోంది. మన దగ్గర ఎంతో మంది ఉపాధ్యాయులుగా, ఉద్యోగులుగా ఎడమ చేతివాటంతో గుర్తింపు పొందిన వారున్నారు. వ్యా పార రంగంలోనూ ఎడమచేతి వాటం వారు ముందున్నారు. స్నేహితులు, కుటుంబసభ్యులు ఆటపట్టించినా ఎక్కడా తగ్గకుండా కుడి చేతివాటం వారికన్నా అన్నింటా ముందుంటారు. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అన్నారో సినీ కవి. ఎడమ చేతివాటమని కొందరు ఆటపట్టిస్తుంటారు. కానీ ఎడమ చేతివాటం ఉన్నవాళ్లు ప్రతిభావంతులుగా, సృజనశీలురుగా, తాము ఎంచుకున్న రంగంలో ముందుంటారని చెబుతారు. గురువారం లెఫ్ట్ హ్యాండర్స్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఓనమాల నుంచి ఎడమ చేతితోనే రాసేవాడిని. ఎడమ చేతితో నే అన్ని పనులు చేస్తాను. అందరిలాగే చేసినట్టు అనిపిస్తుంది. చూసేవారికే ప్రత్యేకంగా కనబడుతోంది. – ప్రకాశ్, సీనియర్ అసిస్టెంట్, మండల పరిషత్, నాగిరెడ్డిపేట -
ఘాట్ రోడ్డు.. ఆపై ప్రమాదకర మలుపులు!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రం నుంచి రాజంపేట మండలం మీదుగా మెదక్ జిల్లా కేంద్రానికి వెళ్లే అంతర్ జిల్లా రహదారిపై పలుచోట్ల ప్రమాదకర మూలమలుపులు ఉన్నాయి. ఈ మార్గంలో నిత్యం వేలాది మంది ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, జీపులు, బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఘాట్ ఉన్న అటవీ ప్రాంతం మొత్తం సింగిల్ రోడ్డే కావడంతో ఇక్కడ వాహనాలు నడపడం కత్తిమీద సాములా ఉంటుంది. ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్డు కోతకు గురై మరింత ప్రమాదకరంగా మారింది. ప్రధానంగా రాజంపేట మండలం కొండాపూర్ అటవీ ప్రాంతంలోని ఘాట్ సెక్షన్లో ఉన్న మలుపులలో వాహనదారులు అరచేతిలో ప్రాణాలను పెట్టుకుని వాహనాలను నడుపుతుంటారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇక్కడ ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు చొరవ చూపి రోడ్డు విస్తరణకు అటవీ అనుమతులు సాధించి, అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
హెచ్ఐవీ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత
కామారెడ్డి టౌన్: హెచ్ఐవీ, ఎయిడ్స్ నివారణ కేవ లం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ఐఐఈసీ ప్రచార కార్యక్రమాన్ని డీఎంహెచ్వో వెంకట్తో కలిసి ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఎయిడ్స్ వ్యాధిపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. జీజీహెచ్ ఆర్ఎంవో రవీందర్ గౌడ్, హెచ్ఐవీ నివారణ జిల్లా అధికారి ప్రదీప్ కు మార్, ఏఆర్టీ వైద్యులు స్నేహ, ఆంచల్, వైఆర్జీ కేర్ ఉమ్మడి జి ల్లా డీఆర్పీ గర్దాస్ సుధాకర్, కౌన్సిలర్లు మేక నాగ రాజు, శేఖర్, పాముల లలిత కుమారి, మెహరాజ్, చిరంజీవి, ప్రవీణ్ గౌడ్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
సహపాఠ్య కార్యక్రమాలపై దృష్టిసారించాలి
● విద్యార్థులకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఉద్బోధ ● మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్, ఎస్పీబాన్సువాడ రూరల్: విద్యతోపాటు సహపాఠ్య కార్యక్రమాలు, సామాజిక అంశాలపై విద్యార్థులు దృష్టి సారించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బాన్సువాడ మండలం బోర్లం క్యాంపులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయాన్ని ఆయన బుధవారం తనిఖీ చేశారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థినులతో కాసేపు మాట్లాడారు. ఐఐటీ, జేఈఈ అడ్వాన్స్కు ప్రిపరేషన్ కొనసాగుతోందా? ప్రతిరోజు యోగా చేస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. సహపాఠ్య కార్యక్రమాలతో కలిగే ప్రయోజనాలు, ఎల్నినో ప్రభావం, సహజ ఎరువుల వినియోగంతో ప్రయోజనాలు ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థినులు చక్కగా సమాధానం ఇవ్వడంతో సంతోషం వ్యక్తపరుస్తూ నోట్బుక్స్ బహుమతిగా అందజేశారు. అనంతరం పీఎంశ్రీలో భాగంగా ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్ను ప్రారంభించారు. విద్యార్థులకు గుణాత్మక విద్య అందించాలని, ప్రయోగ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అనంతరం ఎస్పీ రాజేశ్చంద్ర, ఆర్డీవో రవీందర్రెడ్డి విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆహారం నాణ్యత, రుచి, మెనూ అమలు, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డీసీవో శివరాంనాయక్, ప్రిన్సిపల్ డాక్టర్ శారద, ఎంపీడీవో ఆనంద్, తహసీల్దార్ నరేందర్ గౌడ్, గిర్ధావర్ అలీం, పంచాయతీ కార్యదర్శి రాహేలాబేగం తదితరులు ఉన్నారు. -
ఇంటి(వ)ంట.. కష్టాలు!
పెరుగుతున్న నిత్యావసరాల ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి. పెరిగిన ధరలను చూసి నిత్యావసరాలు కొనాలంటేనే జంకుతున్నారు. ఇటీవలి కాలంలో బియ్యంతో పాటు పప్పులు, నూనెల ధరలు పెరిగాయి. ఇదే సమయంలో ఉల్లి ఘాటెక్కగా.. వెల్లుల్లి, అల్లం ధరలు సైతం చుక్కలు చూపుతున్నాయి. కూరగాయల ధరలూ తక్కువేం లేవు. ఇంటి అద్దెలు ఇప్పటికే అడ్డగోలుగా పెరిగి కూర్చున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎలాగోలా మధ్యతరగతి నెట్టుకొస్తుండగా, కూలీనాలీ చేసుకొని బతికే పేదల పరిస్థితి దయనీయంగా మారింది. ఉల్లి.. మళ్లీ కన్నీళ్లు పెట్టిస్తోంది.. మార్కెట్లో ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. కిలో తెల్ల ఉల్లిగడ్డను రూ.50 కి అమ్ముతున్నారు. ఎర్ర ఉల్లి కిలోకు రూ.40 పలుకుతోంది. కిలో వెల్లుల్లి రూ.280 నడుస్తోంది. పావుకిలో కావాలంటే రూ.80 కి అమ్ముతున్నారు. అల్లం కిలో రూ.240 కి చేరింది. పావుకిలో అంటే రూ. 70 కి తక్కువ ఇవ్వడం లేదు. దీంతో పేద, మధ్య తరగతివారు వంటలో ఉల్లి, అల్లం, వెల్లుల్లి వాడకాన్ని తగ్గిస్తున్నారు. మాంసం ధరలూ అదే దారిలో.. కోడిగుడ్డు, చికెన్ ధరలు కూడా ఎక్కువే. మొన్నటి వరకు రిటేల్ మార్కెట్లో ఒక కోడిగుడ్డు ధర రూ.8 ఉండగా.. ప్రస్తుతం కాస్త తగ్గింది. కిలో చికెన్ ధర రూ.280 నుంచి రూ.320 వరకు ఉంది. మేక, గొర్రె మాంసం ధర కిలోకు రూ. 860 ఉంది.జిల్లాలో సన్నబియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. మొన్నటి వరకు హెచ్ఎంటీ క్వింటాలుకు రూ.6,200 ఉండగా, ఇప్పుడు రూ.6,600 కు చేరింది. రూ. 400 పెరిగింది. ఇతర సన్నరకాల ధరలూ క్వింటాలుకు రూ.500 నుంచి రూ.700 వరకు పెరిగాయి. కందిపప్పు కిలో రూ.130 ఉండగా, రూ.10 పెరిగి రూ.140 కి చేరింది. కొన్నిచోట్ల రూ.150 కూడా అమ్ముతున్నారు. మినపప్పు కిలో రూ.130 ఉండగా, ఇప్పుడు రూ.148 కి చేరింది. శనగపప్పు కిలో రూ.75 ఉండగా, రూ. 85 కి విక్రయిస్తున్నారు. రిఫైన్డ్ ఆయిల్స్ లీటర్ ప్యాకెట్ ధర రూ.170 ఉండగా, ఇప్పుడు రూ.178 కి చేరింది. చక్కెర ధర హాఫ్ సెంచరీ దాటింది. ఇతర కిరాణ వస్తువుల ధరలూ గణనీయంగా పెరిగాయి.టమాట ధర కిలోకు రూ. 30 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. కిలో మిర్చి ధర రూ.60 నుంచి రూ. 80 పలుకుతోంది. చిక్కుడు, బెండ, బీర, కాకర ధరలు కూడా కిలో రూ. 50 పైనే ఉన్నాయి. కొత్తిమీర, పూదీన కూడా ఎక్కువే. మార్కెట్కు వెళ్లి బస్తా నిండా కూరగాయలు తెచ్చుకునే వారు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఓవైపు పిల్లల స్కూల్ ఫీజుల మోత.. మరోవైపు పంటల సాగుకు అయ్యే పెట్టుబడులు పెరిగి ఇబ్బందుల్లో ఉన్న సామాన్యులు.. నిత్యావసరాలు, కూరగాయల ధరలు సైతం గణనీయంగా పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. నెలవారీ ఖర్చులకు సంబంధించిన బడ్జెట్ తలకిందులైందని ఆవేదన చెందుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి అడ్డగోలుగా పెరిగిన నిత్యావసరాల ధరలు సన్నబియ్యం క్వింటాలుపై రూ.400 పెరుగుదల పప్పులు, నూనె ధరలకూ రెక్కలు కూరగాయల ధరలూ ౖపైపెకి.. ఉల్లి, అల్లం, వెల్లుల్లి.. ఏవీ కొనలేని పరిస్థితి ఇబ్బందిపడుతున్న సామాన్యులు -
నాణ్యమైన విద్యను అందించాలి
బాన్సువాడ : అధ్యాపకులు నిరంతరం అభ్యాసం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించవచ్చని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రొగ్రాంను ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుతున్న విద్యావిధానాలకు అనుగుణంగా అధ్యాపకులు నూతన బోధనా పద్ధతులు అలవర్చుకోవాలని, విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాలని దిశానిర్దేశం చేశారు. అంతకుముందు కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేశారు. రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రశంసించారు. కార్యక్రమంలో ఆర్డీవో రవీందర్రెడ్డి, నోడల్ అధికారి సలాం, తహసీల్దార్ జనార్దన్గౌడ్, మున్సిపల్ కమిషనర్ గంగాధర్, అభివృద్ధి కమిటీ సభ్యులు ఎజాస్, దాసరి శ్రీనివాస్, బాలికల కళాశాల ప్రిన్సిపల్ అసద్ ఫారుఖ్, జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ యాదాగౌడ్ తదితరులు ఉన్నారు. -
వరి వైపే మొగ్గు!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్న వాతావరణ శాస్త్రవేత్తల హెచ్చరికలతో ప్రభుత్వం రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లించే ప్రయత్నాలు చేసింది. అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. అయితే జిల్లాలో ఇటీవల దంచికొట్టిన భారీ వర్షాలతో అంతటా జలకళ సంతరించుకుంది. ఇప్పటి వరకు సాధారణంకన్నా 32 శాతం అదనంగా వర్షపాతం నమోదైంది. దీంతో రైతులు ఆలస్యమైనా వరి నాట్లు ముమ్మరం చేశారు. జిల్లాలో ఇప్పటికే 2,75,032 ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ఇంకా సాగు పనులు నడుస్తూనే ఉన్నాయి. ఈసారి కూడా వరి సాగు 3 లక్షల ఎకరాలు దాటే అవకాశాలున్నాయి. భారీ వర్షాలతో మారిన పరిస్థితి.. ఇటీవల జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. పోచారం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీ నుంచి అలుగులు పారే స్థాయికి చేరుకుంది. నిజాంసాగర్ ప్రాజెక్టుకు కూడా ఇన్ఫ్లో రావడంతో 12 టీఎంసీల నీటి మట్టానికి చేరువైంది. వాగులు, వంకలన్నీ పొంగి పొర్లాయి. జిల్లాలో సగానికిపైగా చెరువులు, కుంటలు అలుగులు పారాయి. భూగర్భ జలమట్టం కూడా క్రమంగా పెరుగుతోంది. దీంతో రైతులు వరి సాగుకే మొగ్గు చూపారు. వర్షాల్లేక వరి సాగు విషయంలో వెనకడుగు వేసిన రైతులు.. ఇప్పుడు నారు ముదిరిపోయినా సరే నాట్లు వేసేస్తున్నారు. కొందరు రైతులు నారు ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్లి కొనుక్కొచ్చి మరీ నాట్లు వేస్తున్నారు. దీంతో వరి సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. రాజంపేట, తాడ్వాయి, గాంధారి, లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, దోమకొండ, మాచారెడ్డి, పాల్వంచ, నిజాంసాగర్, మహ్మద్నగర్, బిచ్కుంద, పిట్లం తదితర మండలాల్లో వరి నాట్లు సాగుతున్నాయి. పోచారం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడంతో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల్లో వరి నాట్లు ముమ్మరమయ్యాయి. 5.08 లక్షల ఎకరాల్లో పంటల సాగు... జిల్లాలో వానాకాలం సీజన్లో ఇప్పటివరకు 5.08 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని వ్యవసాయ శాఖ నివేదికలు చెబుతున్నాయి. 2,75,032 ఎకరాల్లో వరి వేయగా, తర్వాతి స్థానంలో సోయా ఉంది. సోయా పంట 87,701 ఎకరాల్లో సాగైంది. పత్తి 45,864 ఎకరాలు, మక్క 47,208 ఎకరాలు, కంది 48,164 ఎకరాల్లో సాగు చేశారు. పెసర 2,198 ఎకరాలు, మినుము 1,851 ఎకరాలు, ఇతర పంటలు 578 ఎకరాలలో సాగవుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రైతుల్లో ఉత్సాహం ఇప్పటికే జిల్లాలో 2.75 లక్షల ఎకరాల్లో నాట్లు.. ఇంకా సాగుతున్న పనులు -
కార్యాలయానికి స్థల పరిశీలన
బాన్సువాడ: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో తాను క్యాంప్ కార్యాలయం నిర్మించుకోనున్న స్థలాన్ని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి మంగళవారం పరిశీలించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఇంజినీర్తో క్యాంప్ కార్యాలయం భవనానికి సంబంధించిన ప్లానింగ్ వేయించారు. ఏనుగు రవీందర్రెడ్డి నస్రుల్లాబాద్కు వస్తున్న విషయం తెలుసుకున్న కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా కార్యకర్తలు చూడాలన్నారు. పార్టీ స్థితిగతులపై కార్యకర్తలతో చర్చించారు. కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్యాదవ్, మాసాని శ్రీనివాస్రెడ్డి, కొత్తకొండ భాస్కర్, మంత్రి గణేశ్, కరుణాకర్రెడ్డి, బోయిని లక్ష్మణ్, బుద్దె గంగాధర్, ఉప్పరి లింగం, పాత బాలకృష్ణ, నందురెడ్డి, వెంకట్రెడ్డి, దేవేందర్రెడ్డి తదితరులు ఉన్నారు. దోమకొండ: మండల కేంద్రంలోని గడికోటలో మంగళవారం పర్యాటకుల సందడి నెలకొంది. సీనియర్ సిటిజన్ జిల్లా అధ్యక్షుడు పున్న రాజేశ్వర్, రెడ్క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు రాజం ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన 60 మంది రిటైర్డు ఉద్యోగులు బస్సుల్లో గడికోటకు తరలివచ్చారు. కోటలోని మహదేవుని ఆలయం, వెంకటపతిభవన్, క్లాక్భవన్, అద్దాలమేడ, ప్రహరీ వాటి చరిత్రను తెలుసుకున్నారు. వారి వెంట రిటైర్ట్ ఎంప్లాయీస్ ఉమ్మడి దోమకొండ మండల అధ్యక్షుడు వెంకయ్య, సర్పంచ్ ఐరేని నర్సయ్య, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు బత్తిని సిద్ధరాములు తదితరులు ఉన్నారు. నిజాంసాగర్(జుక్కల్): రైతులు పట్టాదారు పాసుబుక్కులకు ఈకేవైసీ తప్పనిసరిగా చేయించాలని వ్యవసాయశాఖ ఏఈవో మధుసూదన్ అన్నారు. మంగళవారం మహమ్మద్ నగర్ మండలం గున్కుల్ గ్రామ పంచాయతీలో ఈకేవైసీ ప్రాముఖ్యతపై రైతులకు అవగాహ కల్పించారు. ఈకేవైసీ లేకుంటే ప్రభుత్వ పథకా లకు దూరం అవుతారని పేర్కొన్నారు. సర్పంచ్ గంగి రమేష్యాదవ్, పంచాయతీ కార్యదర్శి అంజయ్య రైతులు వెంకాగౌడ్, ఎల్లారెడ్డి తదితరులు ఉన్నారు. లింగంపేట: మండల ఏఎస్సైగా పెంటయ్యకు మంగళవారం పదోన్నతి వచ్చినట్లు ఎస్సై దీపక్కుమార్ తెలిపారు. పెంటయ్య లింగంపేట పోలీస్స్టేషన్లో హెడ్కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. మంగళవారం పెంటయ్యను ఎస్సై దీపక్కుమార్ అభినందించారు. అలాగే శెట్పల్లిసంగారెడ్డికి చెందిన గ్రామస్తులు పెంటయ్యను లింగంపేట పోలీస్ స్టేషన్లో సన్మానించారు. అంజయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటూ.. పీఆర్టీయూకు పుట్ట శ్రీనివాస్ అందిస్తున్న సేవలు అభినందనీయమని మండల పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రసాద్, అవినాష్ పేర్కొన్నారు. 2026–28కిగానూ పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికై న నేపథ్యంలో పుట్ట శ్రీనివాస్ను మంగళవారం మండలకేంద్రంలో వారు ఘనంగా సత్కరించారు. ఎంఈవో వెంకట్రెడ్డి, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నందిపేట్: నందిపేట్ పీఎస్ పరిధిలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ ఐదుగురికి మెజిస్ట్రే ట్ గట్టు గంగాధర్ జైలు శిక్ష విధించినట్లు ఎస్సై వినయ్ తెలిపారు. నందిపేటకు చెందిన టేకు సాయి లు, గోసం చిన్నయ్యలకు ఐదు, సాయిలుకు నాలు గు, నిజామాబాద్ మండలం న్యాల్కల్కు చెందిన అశోక్కు ఐదు, నవీపేటకు చెందిన బొమ్మల రాజు కు మూడు రోజుల జైలు శిక్ష విధించినట్లు పేర్కొన్నారు. వాహనదారులు మద్యం సేవించి వాహ నాలు నడపకూడదని సూచించారు. -
నిండుకుండలా ఎల్లయ్య చెరువు
● పూడికతీతతో పెరిగిన భూగర్భ జలాలు ● హర్షం వ్యక్తం చేస్తున్న పట్టణ వాసులుబాన్సువాడ : పట్టణంలోని ఎల్లయ్య చెరువులో పూడిక పెరిగిపోవడంతో భూగర్బ జలాలు అట్టడుగుకు చేరి టీచర్స్ కాలనీ, సంగమేశ్వర కాలనీ, గూడేంగల్లీ, చైతన్య కాలనీ, శ్రీరామకాలనీల్లో ఉన్న నివాస గృహాల్లో బోర్లు ఎత్తిపోయాయి. సింగూర్ నుంచి మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో మే, జూన్, జూలై నెలల్లో ఆయా కాలనీల్లోని ప్రజలకు తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఈ నేపథ్యంలో చెరువు సుందరీకరణ పనుల కోసం ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజురు చేశారు. దీంతో చెరువులో ఏడు మీటర్ల లోతుతో పూడిక తీశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ఎల్లయ్య చెరువులోకి పూర్తి స్థాయిలో నీరొచ్చింది. నిండుకుండలా మారడంతో భూగర్బ జలాలు వృద్ధి చెంది ఆయా కాలనీల్లో ఎత్తిపోయిన బోర్లు నీళ్లను పోస్తున్నాయి. దీంతో ఆయా కాలనీల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. -
● అదిరే.. లుక్ అదిరే!
బాన్సువాడ : ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి మంగళవారం కొత్త లుక్తో కనిపించారు. ఎక్కువగా సంప్రదాయ వస్త్రధారణతో కనిపించే ఆయన.. ఈరోజు సూటు, బూటుతో గిరిజనుల ఉత్సవాలలో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం సంగెంలో నిర్వహించిన తీజ్ ఉత్సవాలలో పాల్గొని, గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తోందన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్యామల, మాజీ ఎంపీపీ విఠల్ తదితరులు పాల్గొన్నారు. -
విడతల వారీగా నీటివిడుదల
మండలంలోని పోచారం ప్రాజెక్టు నుంచి నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లో అధికారికంగా 10,200 ఎకరాలకు, అనధికారికంగా మరో 5 వేల ఎకరాల వరకు సాగు నీరు అందుతుంది. గతంలో ఖరీఫ్ పంటలసాగు పనులు ప్రారంభమైనప్పటి నుంచి సాగు పూర్తయ్యేవరకు ప్రాజెక్టు నుంచి నిరంతరాయంగా నీటిని విడుదల చేసేవారు. రబీ సీజన్లో విడతలవారీగా నీరిచ్చేవారు. కాగా ఈయేడు నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో తొలిసారి ఖరీఫ్లోనూ విడతలవారీగా నీరివ్వాలని నిర్ణయించారు. ఆయకట్టుకు నాలుగు విడతల్లో ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయనున్నారు. 15 రోజులపాటు నీటిని విడుదల చేసి తర్వాతి 10 రోజులు విరామమిస్తారు. ఇలా నాలుగుసార్లు నీరందిస్తారు. ప్రస్తుతం మొదటి విడత నీటివిడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టునుంచి నీటి విఉడదల కొనసాగుతుండడంతో ఆయకట్లు రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. -
ఐదేళ్లలోపు పిల్లల మరణాలను నివారించాలి
● డీఎంహెచ్వో రాజశ్రీ సుభాష్నగర్ : ఐదేళ్లలోపు పిల్లల మరణాలను నివారించేలా వైద్యులు, సిబ్బంది చర్యలు చేపట్టాలని డీఎంహెచ్వో రాజశ్రీ సూచించారు. మంగళవారం నగరంలోని కలెక్టరేట్లో గల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఐదేళ్లలోపు పిల్లల మరణాలపై డీఎంహెచ్వో సమీక్ష నిర్వహించారు. గర్భిణులు, చిన్న పిల్లల్లో ప్రమాదకర వ్యాధి లక్షణాలను ముందే గుర్తించాలని, బాలింతలను క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. సీపీఆర్పై అందరూ అవగాహన కలిగి ఉండాలని, మదర్ ఇన్, మదర్ ఔట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇచ్చి పుచ్చుకోవాలన్నారు. ఎంసీహెచ్ కార్డును తూ.చ తప్పకుండా అనుసరిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. శాశ్వత, తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన కల్పించాలన్నారు. పోచంపాడ్, నందిపేట్, రెంజల్, బినోల, చంద్రశేఖర్ కాలనీ, రుద్రూర్, జక్రాన్పల్లి, ముదక్పల్లి, వేల్పూర్, మోస్రా పీహెచ్సీల వైద్యాధికారులు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశాలతో సమీక్షించారు. డీఐవోఎం అశోక్, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి
దోమకొండ : ఫిర్యాదుదారులతో మర్యాదగా, బాధ్యతయుతంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. మంగళవారం దోమకొండ పోలీస్స్టేషన్ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పరిశుభ్రతను పాటించాలని సూచించారు. పోలీస్స్టేషన్లోని రిసెప్షన్, రికార్డు గదులు, రైటర్ రూమ్ తదితర విభాగాలను పరిశీలించి, కేసులకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు. పోలీస్స్టేషన్కు వచ్చే బాధితుల సమస్య పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కేసుల నమోదు, దర్యాప్తు, రికార్డుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. నేరాల నియంత్రణకు పోలీస్ అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో గస్తీ, బీట్లు, పెట్రోలింగ్ను ముమ్మరం చేయాలని సూచించారు. రౌడీషీటర్ల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ, అనుమానాస్పద వ్యక్తులు, కార్యకలాపాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. డయల్ 112 ద్వారా వచ్చే అత్యవసర సమాచారంపై వెంటనే స్పందించి, ఆపదలో ఉన్న ప్రజలకు తక్షణ సహాయం అందించాలని సూచించారు. భిక్కనూరు సీఐ నరేష్, ఎస్ఐ ప్రభాకర్, ఏఎస్ఐ శ్రీనివాస్, సిబ్బంది ఉన్నారు. పేకాట స్థావరంపై దాడి ... దోమకొండ మండల కేంద్రంలోని గుండ్ల చెరువు సమీపంలో పేకాట స్థావరంపై మంగళవారం పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించారు. ఎస్ఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో పేకాట స్థావరంపై దాడిచేసి ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.28 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సందర్బంగా ఎస్పీ రాజేశ్ చంద్ర మాట్లాడారు. జూదానికి బానిసై విలువైన సమయం, డబ్బును కోల్పోవడంతో పాటు తమ కుటుంబాల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. పాత పోలీస్స్టేషన్ భవనాన్ని పంచాయతీకి అప్పగించాలి దోమకొండ మండల కేంద్రంలోని పాత పోలీస్స్టేషన్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని దీనిని గ్రామ పంచాయతీకి అప్పగించాలని పంచాయతీ పాలకవర్గ సభ్యులు మంగళవారం జిల్లా ఎస్పీ రాజేశ్చంద్రను కలిసి వినతిపత్రం అందజేశారు. దోమకొండ పోలీస్స్టేషన్కు సందర్శించిన ఎస్పీ రాజేశ్చంద్రను సర్పంచ్ ఐరేని నర్సయ్య, మాజీ జడ్పిటిసి తిర్మల్గౌడ్, ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్తో పాటు చేనేత సహకార సంఘం అధ్యక్షుడు బత్తిని సిద్దరాములు కలిసి శాలువాతో సన్మానించి వినతిపత్రం అందజేశారు.కార్యక్రమంలో వార్డుసభ్యులు ఉన్నారు. కేసుల నమోదు, రికార్డుల నిర్వహణ, నవీకరణ సక్రమంగా చేపట్టాలి నేరాల నియంత్రణకు నిరంతరం గస్తీ, బీట్లు, పెట్రోలింగ్ నిర్వహించాలి ఎస్పీ రాజేశ్ చంద్ర -
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం
భిక్కనూరు: మండలంలోని రామేశ్వర్పల్లి శివారు లో ఉన్న వ్యవసాయ పొలాల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను దుండగులు మంగళవారం ధ్వంసం చేశారు. అందులో ఉన్న కాపర్ కాయిల్స్ను దొంగిలించారు. వరుసగా వ్యవసాయ పొలాల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసానికి గురవుతుండడంతో పంటలు ఎలా పండించాలంటు రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిజామాబాద్ అర్బన్ : నగరంలోని కోటగల్లికి చెందిన విద్యప్రసాద్(54) అదృశ్యమైనట్లు రెండో టౌన్ ఎస్సై యాదగిరిగౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లిన అతను తిరిగి రాలేదు. విద్యాప్రసాద్కు మానసిక స్థితి బాగాలేదని గతంలో కూడా పలుమార్లు ఇంటినుంచి వెళ్లి తిరిగిరాలేదని కుటుంబీకులు తెలిపారు. భార్య వేదవతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి
● పింఛన్ల దరఖాస్తుల పరిశీలన, నమోదు వేగవంతం చేయాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి టౌన్: గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి కోసం ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలను రూపొందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని కలెక్టరేట్లో మంగళవారం ఆయన అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే మూడు ఆర్థిక సంవత్సరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళికలు ఉండాలన్నారు. చేయూత పెన్షన్ దరఖాస్తులను గ్రామస్థాయిలో స్వీకరించి పరిశీలించాలన్నారు. అర్హులైన ఏ ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం కాకుండా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. అలాగే జలసిరి కార్యక్రమం కింద ఇంకుడు గుంతలు, చెరువులు, కుంటల పునరుద్ధరణ ద్వారా భూగర్భ జలాలను పెంపొందించే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామసభల ద్వారా ప్రజల భాగస్వామ్యంతో పనులను ఎంపిక చేసి, లక్ష్యాలను సాధించేలా పనిచేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్వై గిరి, డీఆర్డీవో దామోదర్రెడ్డి, డీపీవో మురళి, జెడ్పీ సీఈవో చందర్ నాయక్, ఎంపీడీవోలు, ఎంఈవోలు, స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. -
పోచారం.. అసహనం
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలపై మరోమారు అసహనం వ్యక్తం చేశారు. సీఎం చెప్పినా బిల్లులు రాకపోవడం, మంత్రులు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ‘కేసీఆర్ను మోసం చేసిపోవడం ఇష్టం లేకుండే.. అన్నం పెట్టినోళ్లను మరిచిపోతమా’ అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. బీర్కూర్ మండల కేంద్రానికి సమీపంలో మంగళవారం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఏడాదిన్నర కాలంలో జరిగిన పరిణామాలను వివరిస్తూ మంత్రుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలోనూ సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించడానికి వెళ్లిన పోచారం నీటిపారుదల శాఖ అధికారితో ఫోన్లో మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దల తీరుపై అసహనం వ్యక్తం చేసిన వీడియో సంచలనం కలిగించింది. ఇప్పుడు మరోమారు పోచారం అదే రీతిలో స్పందించారు. ఈ సమ్మేళనంలో పోచారం మాట్లాడిన వీడియోలు సైతం వైరల్ అయ్యాయి. పెండింగ్ బిల్లుల విషయంలో సీఎం రేవంత్రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి పొంగులేటిలకు బాధ్యత అప్పగించాడని, వారు ఫోన్ చేస్తే స్పందించడం లేదని పేర్కొన్నారు. బిల్లుల విషయమై సీఎంను మరోసారి కలిసి రూపాయి కూడా రాలేదని చెబితే వేం నరేందర్రెడ్డికి బాధ్యత అప్పగించి మార్చి లోపు మూడు విడతల్లో బిల్లులు ఇప్పించమన్నాడన్నారు. ఆయన కూడా తెల్లారి నుంచి ఫోన్ లేపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాబై సార్లు ఫోన్ చేసినా ఫలితం లేదన్నారు.పోచారం చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించాయి. కేసీఆర్ను మోసం చేసి వెళ్లడం ఇష్టం లేకున్నా, అభివృద్ధి కోసమే కండువా మార్చాల్సి వచ్చిందని పోచారం పేర్కొనడంతో ఆయన దారెటు అన్న చర్చ కూడా మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలో పోచారం ఒక్కరే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో బాన్సువాడ కాంగ్రెస్ ఇన్చార్జీగా వ్యవహరించిన ఏనుగు రవీందర్రెడ్డి పట్టు సాధించే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐదేళ్లు మంత్రిగా, ఐదేళ్లు స్పీకర్గా నియోజక వర్గంలో తిరుగులేని నేతగా ఉన్న పోచారం శ్రీనివాస్రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇబ్బందులు పడ్డారు. అప్పటికే జరిగిన అభివృద్ధి పనులు, డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించిన బిల్లుల కోసం ఇబ్బందులు తలెత్తాయి. స్వయంగా సీఎం ఇంటికి వచ్చి పార్టీలో చేరాలని ఆహ్వానించడంతో పోచారం కండువా కప్పుకున్నారు. అయితే ఆరు నెలల్లో అన్ని జరుగుతాయని ఆశించిన పోచారం శ్రీనివాస్రెడ్డికి నిరాశే ఎదురైంది.కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పోచారం శ్రీనివాస్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఆయన అంతర్మథనంలో ఉన్నట్లు భావిస్తున్నారు. ఏళ్లుగా కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో పనులు ఆగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దాపూర్ రిజర్వాయర్, ఆస్ప్రత్రి భవనాల నిర్మాణాలకు సంబంధించి రూ. వందల కోట్లు రావాల్సి ఉంది. ఈ విషయాన్ని పలుమార్లు సీఎంకు చెప్పినా పని జరక్కపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కేసీఆర్ను మోసం చేసి వెళ్లాలని లేకుండే. అభివృద్ధి కోసం తప్పలేదు’ అన్న వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లోనూ మన జెండానే గెలుస్తుందన్న ఆయన పేర్కొనడంతో ఏ పార్టీ అన్న చర్చ జరుగుతోంది. సర్కారు తీరుపై తీవ్ర అసంతృప్తి సీఎం చెప్పినా బిల్లులు రాలేదని ఆవేదన ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారిన వ్యాఖ్యలు అధికార పార్టీ నేతల్లో చర్చ -
ఇంటింటా జాతీయ జెండాల పంపిణీ
కామారెడ్డి రూరల్: హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మంగళవారం దేవునిపల్లిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు ప్రజలకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుమేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు కాసర్ల రవీందర్, చిన్నోళ్ల రజినీకాంత్, భోజన్నగారి రాజు పాటిల్, తుమ్మ నవీన్, శేఖర్, దొడ్లె స్వామి, ధోనీ, ఉప్పురాజు తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో అర్హత కలిగిన అనేక మంది పేద కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో మరో 2వేల ఇళ్లు మంజూరు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం హైదరాబాద్లో రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. మొదటి విడతలో ఇళ్ల మంజూరులో అవకాశం దక్కని అర్హులైనవారందరికీ అవకాశం కల్పించేలా అదనపు ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. నిధులు సకాలంలో అందితే లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులను త్వరితగతిన విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కామారెడ్డి అర్బన్: పట్టణంలోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్టస్థాయి యోగా పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల హెచ్ఎం మాధవి, పీఈటీ హీరాలాల్ తెలిపారు. ఇటీవల జరిగిన జిల్లాస్థాయి అండర్–14 యోగాసన పోటీల్లో రిథమిక్ యోగాలో శ్రీకాంత్, శశివర్ధన్ బంగారు పతకాలు పొందగా, ఆర్టిస్టిక్ యోగాలో భానుతేజ, రాంచరణ్ బంగారు పతకాలు సాధించారు. సింగిల్ ఆర్టిస్టిక్ యోగాలో శశివర్ధన్ బంగారు పతకం గెలుచుకున్నారు. దీంతో వీరిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారని హెచ్ఎం తెలిపారు. తాడ్వాయి: సాగులో శాసీ్త్రయ పద్ధతులు అవసరమని, వ్యవసాయశాఖ సూచనల మేరకు రైతులు ఎరువుల యాజమాన్యం, కలుపు నివారణ, చీడపీడల పర్యవేక్షణను సకాలంలో చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని డీఏవో మోహన్రెడ్డి అన్నారు. మండలంలోని ఎండ్రియాల్ గ్రామంలో చాకలి రాస్వామి అనే రైతు అలెక్ మిషన్ ద్వారా (డైరెక్ట్ సోయింగ్) సాగు చేసిన వరి పంటను మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా రైతుతో మాట్లాడి పంట పెరుగుదల, పోషక నిర్వహణ, నీటి వినియోగ సామర్థ్యం, కలుపు నివారణ, సమగ్ర పంట యాజమాన్యంపై సూచనలు అందించారు. తక్కువ నీరు, తక్కువ కూలీ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేందుకు ప్రత్యక్ష విత్తన వరి సాగు ఒక ఉత్తమ ప్రత్యామ్నాయ పద్ధతి అని వివరించారు. అనంతరం రైతుకు పీఎస్బీ ఫార్ములా–6, నానో యూరియా పంపిణీ చేశారు. ఏడీఏ సుధామాధురి, ఏవో నర్సింలు, సర్పంచ్ నర్సింలు తదితరులు పాల్గొన్నారు. మాచారెడ్డి: గజ్యానాయక్ తండా (మాచారెడ్డి) చౌరస్తాలో ఇద్దరు తోబుట్టువులు డెంగీ సోకి ఆస్పత్రి పాలయ్యారు. అక్కాచెల్లెళ్లు ఇద్దరికి ఈనెల 5న జ్వరం రాగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు డెంగీ సోకినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో గోపిబాబు, వైద్యాధికారి ఆదర్శ్, సర్పంచ్ వినోద, ఉప సర్పంచ్ భిక్షపతి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. వైద్య సిబ్బంది గ్రామంలో పలువురినుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. -
భార్య కాపురానికి రావడం లేదంటూ..
● హోర్డింగ్ ఎక్కి ఆత్మహత్యాయత్నంఎల్లారెడ్డి: భార్య కాపురానికి రావడం లేదంటు ఓ వ్యక్తి హోర్డింగ్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థా నికులు తెలిపిన వివరాల ప్ర కారం.. లింగారెడ్డిపేట గ్రా మానికి చెందిన వడ్ల సత్యనారాయణకు భార్యకు గొడ వలు జరగడంతో కాపురానికి రావడం లేదు. దీంతో అతను సోమవారం రాత్రి పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న హోర్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతుండగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సత్యనారాయణను సముదాయించి కిందికి దిగేలా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. -
విద్యార్థులను చితకబాదిన వార్డెన్
వర్ని : చందూర్ మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులను హాస్టల్ వార్డెన్ చితకబాదిన ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు సిగరెట్లు తాగుతున్నారని ఆరోపిస్తూ వార్డెన్ కల్పలత ఆదివారం పదిమంది విద్యార్థులను కర్రతో చితకబాదినట్లు విద్యార్థు లు ఆరోపించారు. ఎలాంటి తప్పు చేయకపోయినా వార్డెన్ తిడుతూ కొడుతోందని, మోకాళ్లపై కూర్చోబెడుతోందని, స్నాక్స్ కరెక్ట్గా ఇవ్వ డం లేదని, గుంజీలు తీయిస్తోందని ఆరోపించారు. విషయం తెలుసు కున్న తల్లిదండ్రులు హాస్టల్కు వచ్చి వార్డెన్ను నిలదీశారు. విద్యార్థు లు సిగరెట్లు తాగడం వల్లే కొట్టానని ఇకముందు ఇలా జరగకుండా చూస్తానని తల్లిదండ్రులకు వార్డెన్ హామీ ఇచ్చారు. ఈ విషయమై వార్డెన్ను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. -
‘జిల్లాలో మాతృశక్తి సత్సంగాలు నిర్వహించాలి’
కామారెడ్డి అర్బన్: సనాతన ధర్మంలో మహిళలను మాతృమూర్తిగా పూజించి గౌరవించే సంప్ర దాయం ఉందని, అది నేటి కలియుగంలోనూ కొనసాగాలని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ ప్రాంత మాతృ శక్తి సంయోజక పద్మశ్రీ, సహ సంయోజక వాణిశ్రీ అన్నారు. వీహెచ్పీ ఆధ్వర్యంలో మంగవారం కామారెడ్డి అయ్యప్ప ఫంక్షన్హాల్లో మహిళా పరిచయ వర్గ కార్యక్రమం నిర్వహించగా వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు నిత్యానందం అధ్యక్షత వహించారు. ఇంటిని కాకుండా సమాజాన్ని ప్రభావితం చేసే మహిళా శక్తి గూర్చి వివరించారు. జిల్లాలో విస్తృతంగా మహిళా పరిచయ వర్గలు, సత్సంగాలు నిర్వహించాలని పద్మశ్రీ, వాణిశ్రీ సూచించారు. వీహెచ్పీ జిల్లా కార్యదర్శి గంగాధర్, గంగారెడ్డి, పాపారావు, మాతృశక్తి దుర్గా వాహిని ప్రతినిధులు పాల్గొన్నారు. -
గుంతలతో వాహనదారులకు చింత
బీబీపేట – ఇస్సానగర్ వెళ్లే రోడ్డులో ఏర్పడిన గుంతలుబీబీపేట: మండలంలోని ఆయా గ్రామాలకు వెళ్లే రోడ్లు పూర్తిగా ధ్వంసమై అడుగుకో గుంతలమయంగా మారింది.గుంతల్లో నీళ్లు నిలువడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మెదక్, హైదరాబాద్ వెళ్లేందుకు ప్రధాన రోడ్డు.. బీబీపేట మండలంలోని 11 గ్రామాల ప్రజలు ఉప్పర్పల్లి, ఇస్సానగర్ మీదుగా రామాయంపేట నుంచి హైదరాబాద్, మెదక్ జిల్లాలకు వెళ్తుంటారు. బీబీపేట, ఇస్సానగర్ మధ్యలో పెద్ద చెరువు కట్ట కింద రోడ్డుకు భారీ గుంతలు ఏర్పడ్డాయి. మూలమలుపుల వద్ద గుంతలు ఏర్పడడంతో వాహనాదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. బీబీపేట నుంచి కామారెడ్డి వెళ్లే ప్రధాన రహదారిపై కూడా వంతెన వద్ద భారీ గుంతలు ఏర్పడ్డాయి. అలాగే జనగామ గ్రామంలోని మూలమలుపు వద్ద సైతం గుంతలు ఏర్పడడంతో ఇప్పటికే చాలాసార్లు గ్రామస్తులు పూడ్చారు. అయినప్పటికీ అవి అలాగే ఉన్నాయి. ఇప్పటికై నా అధికారులు గుంతలు పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. -
తెయూ సమాచారం..
తెయూలో రెడ్ క్రాస్ సొసైటీ క్లబ్ ప్రారంభం తెయూ(డిచ్పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ క్లబ్ను ఆర్ట్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ లక్ష్మణ చక్రవర్తి మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్ష్మణ చక్రవర్తి మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని అన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ నోడల్ అధికారి లావణ్య మాట్లాడుతూ.. యువత బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కే అపర్ణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు అతీక్, హలీమ్ఖాన్, శ్రీనివాస్, భ్రమరాంబిక, ఎన్ స్వామి, పీఆర్వో కేవీ రమణాచారి, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. పీజీ బ్యాక్లాగ్ పరీక్షల్లో ఒకరి డిబార్ తెయూ(డిచ్పల్లి): తెయూ పరిధిలో కొనసాగుతున్న పీజీ 1, 3వ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షల్లో మంగళవారం మాల్ప్రాక్టీస్కు పాల్పడుతూ ఒక విద్యార్థి డిబార్ అయినట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మొత్తం 490 మందికి 405 మంది హాజరు కాగా 85 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ కాలేజ్ పరీక్షా కేంద్రంలో ఒకరు డిబార్ అయినట్లు తెలిపారు. క్యాంపస్లో 17 నుంచి 25 వరకు తీజ్ తెయూలో ప్రతి ఏటా నిర్వహించే తీజ్ ఉత్సవాలను ఈ సారి కూడా జరుపుకొంటామని నిర్వాహకులు తెలిపారు. బంజారాల పవిత్రమైన పండుగగా భా వించే తీజ్ ఈ నెల 17 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. వర్సిటీ బంజారా బోధనేతర సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షలు తెయూ ఇంజినీరింగ్ కళాశాలలోని బీటెక్ సీఎస్ఈ, ఏఐ 2వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. పరీక్షలకు 70 మందికి అందరు విద్యార్థులు హాజరైనట్లు అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ తెయూ ఏబీవీపీ కమిటీ ఆధ్వర్యంలో హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేశారు. లాసెట్ 2026 ద్వారా తెలంగాణ యూనివర్సిటీ లా కాలేజ్లో ప్రవేశాలు పొందడాని కి వచ్చిన విద్యార్థులకు హెల్ప్డెస్క్ ద్వారా అవసర మైన సాయం అందజేశారు. కార్యక్రమంలో ఏబీవీ పీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శివకుమార్రెడ్డి, రాష్ట్ర వనవాసి కన్వీనర్ అశోక్, వర్సిటీ ఉపాధ్యక్షులు విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేడు దోస్త్ ధ్రువపత్రాల పరిశీలన తెయూ పరిధిలోని దోస్త్ 2026 ద్వారా 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక కేటగిరి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన బుధవారం నిర్వహించనున్నట్లు తెయూ దోస్త్ కోఆర్డినేటర్ వాసం చంద్రశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటలవరకు తెయూ అడ్మిషన్స్ డైరెక్టరేట్ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. పీహెచ్, సీఏపీ, ఎన్సీసీ, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులమ్ ఆక్టివిటీస్ కేటగిరి విద్యార్థులు ఈ వెరిఫికేషన్కు హాజరు కావాలని ఆయన సూచించారు. అభ్యర్థులు తమ వెంట ఒరిజనల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు తప్పనిసరిగా తీసుకురావాలని ఆయన తెలిపారు. -
రైలులో ఆరు కిలోల గంజాయి స్వాధీనం
కామారెడ్డి క్రైం : రైలులో తరలిస్తున్న ఆరు కిలోల గంజాయిని ఎకై ్సజ్, రైల్వే పోలీసులు మంగళవారం గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సంభాల్పూర్ నుంచి మహారాష్ట్ర లోని నాందేడ్ వెళ్తున్న నాగవళ్లి ఎక్స్ప్రెస్ రైలు కామారెడ్డికి రాగానే ఎకై ్సజ్, రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో ఓ ప్యాకెట్లో నింపిన ఆరు కిలోల ఎండు గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎవరనేది తెలియరాలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎకై ్సజ్ సీఐ సంపత్ కృష్ణ తెలిపారు. దాడుల్లో టాస్క్ఫోర్స్ సీఐ సుందర్ సింగ్, ఎస్సైలు విక్రమ్ కుమార్, శ్రీనివాస్రావు, శరత్ కుమార్, ట్రెయినీ ఎస్సైలు అనిల్, మధు, సిబ్బంది పాల్గొన్నారు. పొతంగల్లో గంజాయి పట్టివేత? రుద్రూర్: పొతంగల్ మండలంలోని చెక్పోస్ట్ వద్ద భారీ మొత్తంలో గంజాయి పట్టుబడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మంగళవారం పోలీసులకు వ చ్చిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తుండ గా గంజాయి తరలిస్తున్న వ్యక్తి పట్టుబడినట్లు స మాచారం. ఈ ఘటనకు సంబంధించి సదరు వ్యక్తి ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పట్టుబ డిన గంజాయి పరిమాణం, నిందితుని వివరాలు, గంజాయిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు తదితర పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడితే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
ప్రాజెక్టు నిండే.. అన్నదాత మురిసే..
నాగిరెడ్డిపేట: ఎల్నినో ప్రభావంతో ఈయేడు వర్షాభావ పరిస్థితులు ఏర్పడవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన వ్యక్తమైంది. వర్షాకాలం ప్రారంభమై సుమారు రెండు నెలలు కావచ్చినా సరైన వర్షాలు లేకపోవడంతో సాగు పనులు ముందుకు సాగలేదు. ఇటువంటి తరుణంలో కురిసిన భారీవర్షాలతో మండలంలోని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండింది. దీంతో నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల్లోని పోచారం ప్రాజెక్టు ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈయేడు ఆయకట్టు పరిధిలో ఖరీఫ్ పంటల సాగుకు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని, పంటల సాగుపై ధీమా కలిగిందని అన్నదాతలు పేర్కొంటున్నారు. ఖరీఫ్ సాగుకు భరోసా ఇచ్చిన భారీ వర్షాలు నిండుకుండలా తొణికిసలాడుతున్న పోచారం ప్రాజెక్టు హర్షం వ్యక్తం చేస్తున్న ఆయకట్టు రైతులు -
నిలువ నీడేది?
● బస్ షెల్టర్ లేని మూడు జిల్లాల కూడలి ● మాచారెడ్డి చౌరస్తాలో ఇబ్బందిపడుతున్న ప్రయాణికులుమాచారెడ్డి: గజ్యానాయక్ తండా చౌరస్తా.. దీనినే మాచారెడ్డి చౌరస్తాగా పిలుస్తారు. ఇది కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల కూడలి ప్రాంతం. నిత్యం వేలాది మంది ఈ కూడలి మీదుగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఎండకు ఎండుతున్నామని.. వానకు తడుస్తున్నామని.. అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
నాందేవ్ మహరాజ్ గొప్ప సంఘసంస్కర్త
బాన్సువాడ : మేరు కుల గురువు నాందేవ్ మహ రాజ్ గొప్ప సంఘ సంస్కర్త అని మేరు సంఘం మండల అధ్యక్షులు హన్మాండ్లు అన్నారు. మంగళ వారం బాన్సువాడలో శ్రీ సంత్ శిరోమణి నాందేవ్ మహరాజ్ 676వ పుణ్య తిథిని నిర్వహించారు. ఆ యన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అ ర్పించారు. మేరు కులస్తులు కొత్త కొండ భాస్కర్, జీవన్, మహేష్, వార్కారీలు తదితరులు ఉన్నారు. ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని వెల్లుట్లపేట శివారులో ఉన్న చెనింగ రాజరాజేశ్వరాలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి, గ్రామస్తులు చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దుండగులు హుండీలో ఉన్న నగదును దొంగిలించినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
సాంకేతిక పరిజ్ఞానంతో బోధన
ఖలీల్వాడి : సాంకేతిక పరిజ్ఞానంతో మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు బోధన చే యాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కోటగల్లి జూనియర్ కళాశాల అధ్యాపకులకు రెండవ స్పెల్ రెండు రోజుల ఓరియంటేషన్ శిక్షణ తరగతులను డీఐఈవో మంగళవారం పరిశీలించారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట చూపే విధంగా అ ధ్యాపకులు బోధన చేయాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న అన్ని వర్గాల విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో విద్యా బోధన చేపట్టాలని సూచించారు. -
ఆర్థిక ఇబ్బందులతో దంపతుల ఆత్మహత్య
నిజామాబాద్ అర్బన్: ఆర్థిక ఇబ్బందులతో దంపతులిద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. నాలుగో టౌన్ ఎస్హెచ్వో సతీష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ కోటగల్లికి చెందిన శేషాల నరేశ్(33) విద్యుత్ శాఖలో బిల్ కలెక్టర్గా పనిచేస్తున్నాడు. అతడికి 2014లో మేఘన(30)తో వివాహమైంది. వీరికి తొమ్మిదేళ్ల వయసున్న ఆయాన్ష్, ఆరేళ్ల వయసున్న మిథున్ ఉన్నారు. నరేశ్ గతేడాది రూ.90 లక్షలతో ఇల్లు కొనుగోలు చేశాడు. హోమ్ లోన్ కోసం ప్రయత్నించగా మంజూరు కాలేదు. దీంతో అప్పులు పెరిగి ఇంటిని అమ్మేశాడు. ప్రస్తుతం వినాయక్నగర్లోని పంచముఖి హనుమాన్ టెంపుల్ సమీపంలో అద్దెకు ఉంటున్నారు. ఇంటి కోసం చేసిన అప్పుల భారం పెరిగిపోవడంతో మానసిక ఒత్తిడికి గురైన నరేశ్.. మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తర్వాత అతడి భార్య మేఘన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మేఘనకు తల్లి లావణ్య ఫోన్చేయగా ఆమె సరిగా మాట్లాడకపోవడంతో అనుమానించి భర్త మోహన్కు విషయం చెప్పింది. దీంతో ఆయన ఇంటికి చేరుకుని, కిటికీ చువ్వలను తొలగించి లోపలికి వెళ్లి చూడగా.. మేఘన పురుగుల మందు సేవించి పడిపోయి ఉంది. నరేశ్ ఉరివేసుకొని వేలాడుతున్నాడు. హుటాహుటిన నరేశ్ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ‘భార్యభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాం. మానసిక ఒత్తిడి ఉంది’ అని నరేశ్ రాసిన సూసైడ్ నోట్ ఇంట్లో లభించింది. మృతురాలి తండ్రి మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
రామాయంపేట(మెదక్) : రామాయంపేట వద్ద జాతీయ రహదారిపై వై జంక్షన్వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మల్కాపూర్కు చెందిన జూపల్లి వెంకట్రావు(49) హైదరాబాద్లో నివాసం ఉంటున్నాడు. రాత్రి స్కూటీపై తన స్వగ్రామానికి వస్తున్న క్రమంలో జంక్షన్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొన్నది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతడిని పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు రిషి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి.. నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ మామిడిపల్లి రైల్వేస్టేషన్ల మధ్య రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. ఈనెల 10న కరీంనగర్–నిజామాబాద్ ప్యాసింజర్ రైలు ఓ వ్యక్తిని ఢీకొనడంతో చికిత్స కోసం అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతను మంగళవారం మృతిచెందినట్లు పేర్కొన్నారు. అతని నుదిటిపై జై హో భీమా అనే టాటూ ఉందన్నారు. మృతుడి వివరాలు తెలిసిన 8712658591 నంబర్ను సంప్రదించాలన్నారు. -
బాబుల్గావ్కు బస్సొచ్చింది
పెద్దకొడప్గల్: మారుమూల గ్రా మమైన బాబుల్గావ్కు ఎట్టకేలకు బస్సొచ్చింది. దీంతో జనం మోములో సంతోషం వెల్లివిరిసింది. రెండు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న మారుమూల గ్రామమైన బాబుల్గావ్ సమస్యలపై జూన్ 29న ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై స్పందించిన అధికారులు ఆయా సమస్యలకు పరిష్కారం చూపింది. తాజాగా గ్రామానికి బస్సు సౌకర్యం కూడా కల్పించారు. మంగళవారం ఉదయం గ్రామానికి తొలిసారిగా ఆర్టీసీ బస్సు వచ్చింది. ఇప్పటివరకు బస్సు ఎరుగని గ్రామానికి బస్సు రావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇన్నాళ్లూ బస్సు లేకపోవడంతో ఇబ్బందిపడ్డాం. ఆటో చార్జీలు పెట్టుకుని వేరే ఊళ్లకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మా బాబుల్గావ్కు బస్సు వచ్చినందుకు ఆనందంగా ఉంది. బస్సులో ఫ్రీగా ప్రయాణం చేశాం. – చాకలి సులుబాయ్, బాబుల్గావ్వాసిమా ఊరునుంచి బస్సు లేకపోవడంతో పొరుగూళ్లకు నడుచుకుంటూ వెళ్లేవాళ్లం. ఇప్పుడిప్పుడు ఆటోలు వచ్చినై. ఇప్పుడు అధికారులు బస్సు వేయడంతో మాకు నడిచే బాధ తప్పింది. – గురుపల్లి మాణిక్, బాబుల్గావ్వాసిమా ఊరికి బస్సు సౌకర్యం లేదు. ఎక్కడికై నా వెళ్లాలంటే కాలినడకన లేదా ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చేది. మా సమస్యను సాక్షి దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. దీంతో అధికారులు స్పందించి మొదటిసారి బస్సు నడిపారు. సంతోషంగా ఉంది. ‘సాక్షి’కి, అధికారులకు కృతజ్ఞతలు. – రవి, సర్పంచ్, బాబుల్గావ్ -
శిథిలావస్థలో పశు వైద్యశాలలు
● కూలడానికి సిద్ధంగా భవనాలు ● భయంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది దోమకొండ: మండలకేంద్రంలో పశువైద్యశాల శిథిలావస్థకు చేరి కూలడానికి సిద్ధంగా ఉంది.అందులో పనిచేస్తున్న సిబ్బంది భయంభయంగా విధులు నిర్వహిస్తున్నారు. భవనంలో పాముల పుట్టలు వెలిశాయి. దీంతో వైద్య సిబ్బంది, పాడిరైతులు ఇబ్బందులు పడుతున్నారు. పక్కనే సామగ్రి నిల్వ కోసం కట్టిన గదిలో సేవలను అందిస్తున్నారు. అలాగే కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద, మద్నూర్ ప్రాంతాల్లో వెటర్నరీ ఏడీ కార్యాలయాలున్నాయి. జిల్లాలో 30 మండల స్థాయి పశువైద్యశాలలు, మరో 16 గ్రామాల్లో సబ్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా శిథిలావస్థకు చేరాయి. చాలా పశువైద్యశాలల్లో డాక్టర్లు, సిబ్బంది కొరత కూడా ఉంది. పశువులు, గొర్రెలు రోగాల బారిన పడకుండా ప్రతిఏటా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి మందులు అందజేయాల్సి ఉంటుంది. అధికారులు స్పందించి దోమకొండలో పశువైద్యశాల నూతన భవనం నిర్మించాలని పాడి రైతులు కోరుతున్నారు. -
క్రైం కార్నర్
అదుపుతప్పి బోల్తాపడ్డ ఆటో ● ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు వేల్పూర్(మెండోరా): మెండోరా మండలంలో సోమవారం మధ్యాహ్నం ఓ ఆటో అదుపుతప్పి బోల్తాపడగా, ఒకరు మృతిచెందారు. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన ఆటోడ్రైవర్ సాయికుమార్ తన సొంత ప్యాసింజర్ ఆటోలో ముప్కాల్ నుంచి మెండోరా మండలానికి ఏడుగురు ప్రయాణికులను తీసుకెళ్తున్నాడు. మెండోరా శివారులోని కాకతీయ కాలువ సమీపంలో ఆటోను అజాగ్రత్తగా వేగంగా నడపడం వల్ల ఆటో ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో కోడిచెర్ల గ్రామానికి చెందిన వేల్పూర్ దేవాయి(58)కి బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మిగతా ఆరుగురు ప్రయాణికులకు గాయాలు కాగా, వారి కుటుంబీకులు, బంధువులు ఘటనా స్థలానికి చేరుకొని ఆస్పత్రులకు తీసుకెళ్లారు. మృతురాలి కుటుంబీకులు ఫిర్యాదు మేరకు ఆటోడ్రైవర్పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ● డ్రైవర్కు తీవ్ర గాయాలు నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలకేంద్రం గోపాల్పేటలో ఆటోను కారు ఢీకొనడంతో ఆటోడ్రైవర్ తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గోపాల్పేటకు చెందిన షాహీద్ ఆఫ్రీదీ తన ఆటోలో స్థానిక పెట్రోల్బంకులో డీజీల్ పోయించుకొని ఇంటికి బయలుదేరాడు. అదేసమయంలో ఎల్లారెడ్డి వైపు నుంచి మెదక్ వైపు వెళ్తున్న ఓ కారు ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో నడుపుతున్న షాహీద్ ఆఫ్రీదీ తీవ్రంగా గాయపడి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం మొదట మెదక్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ తరలించారు. ఈ ఘటనపై కేసునమోదు చేసినట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. వర్ని: మోస్రా మండలం చింతకుంట అటవీ ప్రాంతంలో ఉన్న శివకేశవ మందిరంలో గుర్తుతెలియని వ్యక్తులు రాధాకృష్ణ విగ్రహాలను ధ్వంసం చేశారు. సోమవారం ఆలయానికి వెళ్లిన భక్తులు విగ్రహాల ధ్వంసాన్ని గమనించి, గ్రామస్తులకు సమాచారం అందించగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి ఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. -
మొక్కు తీర్చుకునేందుకు వెళ్లి.. అనంతలోకాలకు..
పెద్దకొడప్గల్(జుక్కల్): ఆషాడ మాసం సందర్భంగా మొక్కులు తీర్చుకునేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వాగు వద్దకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి అనంతలోకాలకు చేరుకున్న విషాద ఘటన మండలంలోని చిన్నతక్కడ్పల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఎస్సై అరుణ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా.. బిచ్కుంద గ్రామానికి చెందిన మిట్టపల్లి లక్ష్మణ్ (25)అనే యువకుడు కుటుంబ సభ్యులతో కలిసి పెద్దకొడప్గల్లో కొన్ని రోజులుగా పాత ఇనుప సామానుకు వస్తువులను అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి అతడు ఆదివారం మొక్కులు తీర్చుకునేందుకు చిన్నతక్కడ్పల్లి గ్రామ శివారులోని వాగు వద్దకు వెళ్లారు. కుటుంబ సభ్యులు వంట కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండగా లక్షణ్ మధ్యాహ్నం సమయంలో స్నానం చేసేందుకు వాగులోకి దిగాడు. ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. సాయంత్రం వాగులో గాలింపు చేపట్టగా, లక్ష్మణ్ మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులు బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోమవారం మృతుడి తల్లి సాయవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం చేయించామని ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. -
ఎరువుల కోసం సరికొత్త యాప్
● బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు .. ● ఎఫ్ఎఫ్ఎస్ విధానంలో రైతులందరికి ఎరువులు ఎల్లారెడ్డి: సబ్సిడీ ఎరువుల బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టి రైతులకు సకాలంలో ఎరువులు అందించేందుకు సరికొత్త యాప్ను కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎఫ్ఎఫ్ఎస్ (ఫ్రేమ్ వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ ) యాప్ పేరుతో రైతులకు సబ్సిడీ ఎరువులను పారదర్శకంగా నల్ల బజారుకు తరలిపోకుండా రైతులకు నేరుగా అందించడమే ఈ యాప్ ఉద్దేశం.యాప్ ద్వారా యూరియా, డీఏపీ, ఎంవో పీ, తదితర ఎరువులను రైతులు బుక్ చేసుకోవాలి. భూమి విస్తీర్ణం ఆధారంగానే .. ఈ విధానం ద్వారా రైతు పేరున ఉన్న భూమి వివరాలు ఫార్మర్ రిజస్ట్రీ లేదా పట్టాదార్ పాస్బుక్ల ద్వారా నిర్ణయింపబడుతుంది. రైతులు సాగుచేసే భూమి పరిమాణం, వేసే పంట ఆధారంగా సాఫ్ట్వేర్ సిస్టమే స్వయంగా ఎరువుల కోటాను గుర్తిస్తుంది.దీంతో నల్లబజారు దందా అరికట్టడంతో పాటు అర్హులైన రైతులందరికీ ఎరువులు అందుతాయి. ఎఫ్ఎఫ్ఎస్తో మూడు పద్ధతులలో బుకింగ్ ● గూగుల్ ప్లే స్టోర్ నుంచి అధికారిక ఎఫ్ఎఫ్ఎస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి ● యాప్లో కావాల్సిన భాషను ఎంచుకుని పట్టాదారు పాస్బుక్ నంబర్ లేదా ఆధార్ నంబర్ నమోదు చేయాలి. ● తర్వాత రిజిస్టర్డ్ మొబైల్కు వచ్చే ఓటీపీ ద్వారా లేదా ఫేస్ అఽథెంటికేషన్ (ఫేస్ ఐడీ) ద్వారా లాగిన్ అవ్వాలి ● హోమ్ స్క్రీన్పై వచ్చే బుక్ ఫర్టిలైజర్ క్లిక్ చేసి, తమ జిల్లా, మండలం, గ్రామాన్ని ఎంపిక చేసుకోవాలి. ● యాప్లోనే డీలర్ను, కావాల్సిన ఎరువుల బస్తాల సంఖ్యను ఎంచుకోవాలి.. ● వివరాలు నమోదు చేశాక రైతుల మొబైల్కు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఈ కోడ్ను రైతులు తాము ఎంచుకున్న దుకాణంలో చూపించాల్సి ఉంటుంది. ● డీలర్ వద్ద పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) యంత్రం ద్వారా బయోమెట్రిక్ లేదా మొబైల్ ఓటీపీ ద్వారా ధృవీకరణ చేసి ఎరువులు అందజేస్తారు సొసైటీలు, ఎరువుల డీలర్ల వద్ద .. ● రైతులు నేరుగా దుకాణానికి వెళ్లి అక్కడ డీలర్ లేదా సొసైటీ సిబ్బంది ద్వారా తమ పాస్బుక్ వివరాలు సిస్టమ్లో నమోదు చేసుకోవచ్చు ● అక్కడికక్కడే వారి భూమి కోటాను పరిశీలించి బయోమెట్రిక్ వేలిముద్ర లేదా మొబైల్ యాప్కు వచ్చిన ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేసి ఎరువులను విక్రయిస్తారు. మీ సేవ...కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా.. ● స్మార్ట్ఫోన్ లేని లేదా యాప్ వాడకం తెలియని సాధారణ రైతుల కోసం ప్రభుత్వం ఈ సౌకర్యాన్ని కల్పించింది. ● రైతులు తమ పట్టాదారు పాస్బుక్ నంబర్ లేదా ఆధార్ కార్డు తీసుకుని సమీపంలోని మీ సేవ లేదా సీఎస్సీకి సెంటర్లకు వెళ్లాలి. ● కేంద్ర నిర్వాహకుడికి వివరాలు అందిస్తే వారు ప్రభుత్వ పోర్టల్లో ఎరువులను బుక్ చేస్తారు. ● ఇందుకోసం ప్రభుత్వం రూ. 10 నామమాత్రపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా ఎ రువులను సులువుగా బుక్ చే సుకోవచ్చు..ఏ రైతుకు ఎంత కోటా అన్న విషయం యాప్ లోని సాఫ్ట్వేర్ గుర్తిస్తుంది. స్మా ర్ట్ఫోన్ లేని రైతులు సొసైటీలు, డీలర్ల వద్ద నుంచి లేదా మీ సేవా కేంద్రాల నుంచి తమకు కావాల్సిన ఎరువులు బుక్ చేసుకోవచ్చు. – మోహన్రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి
● ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి టౌన్ : స్వాతంత్య్ర పోరాట యోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ’హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలో తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం వేలాది మంది త్యాగధనుల ఫలితమని, వారి పోరాట పటిమను నేటి తరానికి గుర్తు చేయడానికే ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఇళ్ల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి భిక్కనూరు: మెదక్ జిల్లా పరిధిలోకి వెళ్లిన మండలంలోని భాగిర్తిపల్లి గ్రామంలోని 40 ఇళ్ల సమస్యలను పరిష్కరించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డిని గ్రామ బీజేపీ నేతలు కోరారు. గ్రామంలో 40 ఇళ్ల వారు ఇబ్బందులు పడుతున్నారని సమస్య పరిష్కరించాలని ఆయన్ను కోరారు. వార్డు సభ్యుడు నాయకులు బక్క కుమారస్వామి, గంగయ్య యాదగిరిలు ఉన్నారు. -
మోడల్ సీబీఎస్ఈ స్కూల్స్!?
● రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు ● వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలయ్యే అవకాశం ఎల్లారెడ్డిరూరల్: మోడల్స్కూల్స్ను బలోపేతం చేసేందుకు గాను ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే సీబీఎస్ఈ విధానం అమలు చేయాలని విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే 2027–28 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రణాళిక రూపొందించారు. దీనిద్వారా సంబంధిత పాఠశాలలు సీబీఎస్ఈ బోర్డు నుంచి అనుబంధ గుర్తింపును పొందవలసి ఉంటుంది. జిల్లాలో ఆరు మోడల్స్కూల్స్.. కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి, నిజాంసాగర్(అచ్చంపేట్), బాన్సువాడ(కొత్తాబాది), నాగిరెడ్డిపేట(గోపాల్పేట్), మద్నూర్(మేనూర్), సదాశివనగర్లలో మోడల్స్కూల్స్ ఉన్నాయి. ప్రతి మోడల్స్కూ ల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 500 మంది, ఇంటర్మీడియట్లో 320 మంది విద్యార్థులకు అడ్మిషన్లు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం నాగిరెడ్డిపేటలో 778, సదాశివనగర్లో 742, బాన్సువాడలో 735, నిజాంసాగర్లో 728, ఎల్లారెడ్డిలో 684, మద్నూర్లో 656 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రతి మోడల్స్కూల్లో ఇంటర్మీడియట్ విద్యార్థినుల కోసం వంద మందికి హాస్టల్ వసతిని కల్పిస్తున్నారు. జాతీయస్థాయి పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించే అవకాశం.. జాతీయ స్థాయి కాంపీటీటివ్ పరీక్షలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) సిలబస్తో కూడిన పరీక్షా విధానం ఉంటుంది. దీనివల్ల సీబీఎస్ఈ విధానంతో చదువుకున్న విద్యార్థులు ఆయా పరీక్షల్లో ప్రతిభ చూపి మంచి ర్యాంకులను సాధించి మంచి కళాశాలల్లో సీట్లను సాధిస్తున్నారు. స్టేట్ సెలబస్తో చదువుకున్న విద్యార్థులు కాంపిటీటివ్ పరీక్షలలో వెనకబడడంతో మంచి ర్యాంకులు రాక మంచి కళాశాలల్లో సీట్లు లభించక చదువులో వెనకంజలో ఉంటున్నారు. మోడల్స్కూల్స్లో సీబీఎస్ఈ విధానం అమలైతే గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం జాతీయస్థాయి కాంపిటీటివ్ పరీక్షలలో ఉత్తమ ర్యాంకులు సాధించి మంచి కళాశాలల్లో సీట్లు సాధించే అవకాశం ఉంటుంది. ఎల్లారెడ్డిలో గల మోడల్స్కూల్ -
ఏటీఎం చోరీకి యత్నం.. నిందితుడి అరెస్టు
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో చోరీకి యత్నించిన నిందితుడు పోలీసులకు పట్టుబడ్డాడు. ఎస్సై దీపక్కుమార్ తెలిపిన వివరాలు ఇలా.. గాంధారికి చెందిన శశికుమార్ అనే వ్యక్తి లింగంపేట మండలం లింగంపల్లి శివారులోని వాటర్ ప్లాంట్లో ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. శశికుమార్ సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఎస్బీఐ ఏటీఎంకు ఆటోలో వచ్చాడు. ఆటోను ఓ ఇంటి పక్కన సందులో నిలిపి ఏటీఎంలోకి చొరబడ్డాడు. ఏటీఎంలోని నగదును దోచుకునేందుకు ఏటీఎంను ధ్వంసం చేస్తుండగా శబ్ధం రావడంతో ఇంటి యజమాని పంబళ్ల శ్రీనివాస్ నిద్రలోనుంచి లేచి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్సై దీపక్కుమార్ తన సిబ్బందితో ఏటీఎం వద్దకు చేరుకొని చోరీకి యత్నిస్తున్న శశికుమార్ను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి ఉదయం ఏటీఎం కేంద్రం వద్దకు చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మున్సిపల్ కార్మికుడికి కరెంట్షాక్.. పట్టించుకోని అధికారులు
కామారెడ్డి టౌన్: ము న్సిపల్ పరిధిలోని అ డ్లూర్ ఎస్సీవాడ 2వ వార్డులో వీధిదీపాల కో సం విద్యుత్ స్తంభంపై మరమ్మతులు చేస్తుండగా కరెంట్ షాక్ తగి లి ప్రమాదవశాత్తు ము న్సిపల్ కార్మికుడు రా జు కింద పడిపోయారు. ఆదివారం జరిగిన ఈ ప్ర మాదంలో కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. తో టి కార్మికులు హుటాహుటిన జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు.ప్రమాదం తప్పిందని వైద్యులు వెల్లడించారు.బల్దియా అధికారులకు సమచారం ఇచ్చి నా,ప్రమాదం జరిగి రెండు రోజు గడుస్తున్నా ము న్సిపల్ ఏఈ, అధికారులు కనీసం స్పందించకపోవడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఈ తీరుపై ఆందోళనలకు దిగుతామని మున్సిపల్ కార్మి క సంఘం నాయకులు సోమవారం హెచ్చరించారు. నిజామాబాద్ రూరల్: మండలంలోని కాలూరు చెందిన గంధక్వాడ్ సాయినాథ్ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు రూరల్ ఎస్హెచ్వో శ్రీనివాస్ సోమవారం తెలిపారు. గంధక్వాడ్ మారుతి అతని కుటుంబ సభ్యులు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా, నాయిగావ్ నుంచి వచ్చి కొన్ని సంవత్సరాలుగా రూరల్ మండలంలోని కాలూరులో హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మారుతి కుమారుడు సాయినాథ్ ఈనెల 2న హోటల్కు సంబంధించిన వస్తువులను తీసుకురావడానికి జిల్లాకేంద్రానికి వెళ్లి, తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఎంత వెతికినా అతడి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. దీంతో సాయినాథ్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
తాడ్వాయి : గ్రామాల్లో సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్రావు సూచించారు. మండలంలోని చిట్యాల గ్రామంలో సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సైబర్ నేరగాళ్ల నుంచి వచ్చే మోస పూరిమైన ఫోన్కాల్స్ను నమ్మవద్దన్నారు. ప్రస్తుతం జాబ్ నోటిఫికేషన్ విడుదలయిందని, ఈ నోటిఫికేషన్ను యువకులు వినియోగించుకోవాలని సూచించారు. డ్రగ్స్పై అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామంలో సీసీకెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ద్విచక్రవాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించాలన్నారు. అత్యవసర సమయంలో 112 నంబరుకు డయల్ చేయాలన్నారు. ఎస్ఐ నరేశ్, గ్రామపోలీసు యాదగిరి, సర్పంచ్ రంజిత్రెడ్డి, కానిస్టేబుల్స్, హోంగార్డులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. రాజంపేట కస్తూర్బా పాఠశాలలో.. రాజంపేట(భిక్కనూరు): రాజంపేట కస్తూర్బా పాఠశాలలో సైబర్ మోసాలు, మైనర్ డ్రైవింగ్, మాదక ద్రవ్య నిర్మూలనపై ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసు కళాజాత బృందం సోమవారం అవగాహన కల్పించారు. కళాజాత బృందం ఇన్చార్జి రామంచ తిరుపతి ఆధ్వర్యంలో విద్యార్థులకు పాటల రూపంలో వివరించారు. సోషల్మీడియా వాడకంపై జాగ్రత్తగా ఉండాలన్నారు. కళా బృందం సభ్యులు శేషరావు, ప్రభాకర్, సాయిలు, ఏఎస్సై నర్సింగ్రావు, షీటీం పీసీ సౌజన్య, బూకోట్స్ పీసీలు స్వామిగౌడ్, పూల్సింగ్ తదితరులు పాల్గొన్నారు. నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలం ఆంధ్రనగర్ గ్రామ సమీపంలో ఓ వ్యానులో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా సోమవారం సాయంత్రం నందిపేట పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆంధ్రానగర్లోని ఒక బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. అందులో మొత్తం 57 సంచులలోని 31క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. అట్టి బియ్యానికి ఎటువంటి ఆధారాలు వారివద్ద లేకపోవడంతో వాటిని నందిపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్ ఖలీమ్తోపాటు ఓనర్ మాక్లూర్కు చెందిన ఇమ్రాన్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వినయ్ వెల్లడించారు. -
తొలిఘట్టం పూర్తయ్యింది ‘సర్’!
కామారెడ్డి క్రైం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ మొదటి ఘట్టం జిల్లాలో సోమవారం విజయవంతంగా పూర్తయ్యింది. సర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల ముద్రణ, పంపిణీలను ఇది వరకే 100 శాతం పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం, ఓటర్ల ద్వారా స్వీకరించిన ఫారాలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియను సైతం పూర్తి చేసింది. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 6,96,006 మంది ఓటర్లు ఉండగా, వాటిలో 84,438 ఫారాలను అధికారులు ధృవీకరించకుండా తిరస్కరించారు. మిగిలిన 6,11,568 ఫారాలను ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితా, ఆపై అభ్యంతరాలు స్వీకరించనున్నారు. నియోజకవర్గాల వారీగా.. జిల్లాలో సర్ ప్రక్రియ నియోజకవర్గాల వారీగా ఇలా ఉంది. జుక్కల్ నియోజకవర్గంలో 2,06, 343 మంది ఓటర్లకు ఎన్నికల ఫారాల పంపిణీ చేసి 90.27 శాతం వివరాల డిజిటైజేషన్, ఎల్లారెడ్డి పరిధిలోని 2,28,503 మంది ఓటర్లకు గాను 90.17 శాతం, కామారెడ్డిలో 2,61,160 మంది ఓటర్లకు గాను 83.96 శాతం వివరాల డిజిటైజేషన్ పూర్తయ్యింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా మరణించిన ఓటర్లు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారు, ఇప్పటికే మరోచోట నమోదైన వారు, గైర్హాజరైన ఓటర్లు తదితర వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత వర్గీకరణలను స్పష్టంగా నమోదు చేశారు.జిల్లాలో సర్ విజయవంతంగా పూర్తయ్యింది. మొత్తం 796 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన 6,96,006 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేశాం. సర్ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించిన అనంతరం ప్రతి ఓటరు తమ పేరు, చిరునామా, వయస్సు, ఇతర వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. ఏవైనా తప్పులు ఉన్నా, పేరు లేకపోయినా, ఇతర అభ్యంతరాలున్నా, సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి సవరణలు, అభ్యంతరాలు నమోదు చేసుకోవాలి. ఓటర్ల వివరాల కచ్చితత్వం, పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రక్రయను పూర్తి చేశాం. – ఆశిష్ సంగ్వాన్, కలెక్టర్, కామారెడ్డి 6,11, 568 ఓట్ల డిజిటలైజేషన్ పూర్తి తొలగించదగిన ఓట్లు 84,438 87.87 శాతం డిజిటలైజేషన్ 17న ముసాయిదా ఓటరు జాబితా, ఆపై అభ్యంతరాల స్వీకరణ పారదర్శకంగా పూర్తి చేశామని కలెక్టర్ ప్రకటన -
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ ● కామారెడ్డి, తిప్పాపూర్ పీఏసీఎస్ల ప్రమాణస్వీకారంకామారెడ్డి పీఏసీఎస్ నూతన చైర్మన్, డైరెక్టర్లతో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతిప్పాపూర్ సింగిల్విండో పాలకవర్గంతో..కామారెడ్డి రూరల్/ భిక్కనూరు : రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్అలీ పేర్కొన్నారు. సహకార సంఘాలు కేవలం రాజకీయ పదవులు కాకుండా రైతుల సంక్షేమానికి పనిచేసే వేదికలుగా మారాలని ఆకాంక్షించారు. కామారెడ్డి పీఏసీఎస్ చైర్మన్ గూడెం శ్రీనివాస్రెడ్డి, భిక్కనూర్ మండలం తిప్పాపూర్ పీఏసీఎస్ చైర్మన్ భీంరెడ్డితోపాటు డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం సోమవారం నిర్వహించారు. కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మహమ్మద్ షబ్బీర్అలీ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ అంటే రైతులు.. రైతులు అంటే కాంగ్రెస్ అని ఆయన పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సమయంలో ప్రభుత్వం అండగా నిలిచి, వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. రైతులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని అన్నారు. పాలకవర్గాలు సమన్వయంతో పనిచేసి సొసైటీలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమాల్లో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఇలి యాస్, జిల్లా సహకార శాఖ అధికారి రాంమోహన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డి, డీసీసీ మాజీ చైర్మన్ కైలాస్ శ్రీనివాస్రావు, మండల అధ్యక్షులు రాజాగౌడ్, నరేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, లక్ష్మి, బాల్రాజు, మాజీ ఎంపీపీలు, సర్పంచులు పాల్గొన్నారు. -
నిజాంసాగర్కు తగ్గిన ఇన్ ఫ్లో
నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. సోమవారం సాయంత్రానికి నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం1405 అడుగులు 17.8 టీఎంసీలకు గాను ప్రస్తుతం 1400.55 అడుగుల (11.949 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాల నుంచి 1,358 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. పోచారం ప్రాజెక్టుకు..నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పోచారం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1,472 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వస్తోంది. 100 క్యూసెక్కుల నీరు పోచారం ప్రధాన కాలువలోకి విడుదలవుతుండగా, 1,372 క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లోగా వెళ్తోందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు. కామారెడ్డి టౌన్: మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ యాడారం ప్రియాంక తండ్రి ఇటీవల అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సోమవారం వారి నివాసానికి వెళ్లారు. కౌన్సిలర్ ప్రియాంక, వారి కుటుంబసభ్యులను పరామర్శించి, సానుభూతి తెలిపారు. అధైర్యపడొద్దని, అన్నివేళలా అండగా ఉంటామని మనోధైర్యాన్ని ఇచ్చారు. ఆయన వెంట నాయకులు సంతోష్, పండ్ల ప్రవీణ్ తదితరులు ఉన్నారు. ● కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలోని బృందంలో చోటు కామారెడ్డి టౌన్ : జిల్లాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ పైడి ఎల్లారెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ఈ నెల 24 నుంచి 28 వరకు జపాన్ దేశంలో పర్యటించనున్న ‘ఇండియన్ బిజినెస్ డెలిగేషన్’ బృందంలో ఆయనకు చోటు దక్కింది. ఈ మేరకు భారత పరిశ్రమల సమాఖ్య ఆయనకు అధికారికంగా లేఖను అందించింది. భారత్ – జపాన్ వాణిజ్య బంధం బలోపేతంలో భాగంగా ఇరుదేశాల మధ్య నూతన పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యంపై జపాన్ అగ్రగామి కంపెనీల ప్రతినిధులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు పైడి ఎల్లారెడ్డి ‘సాక్షి’తో తెలిపారు. -
రహదారిద్య్రం!
● జిల్లాకేంద్రంలో ఛిద్రమైన రోడ్లు ● అడుగడుగునా గుంతలు ● నరకం చూస్తున్న వాహనదారులు ● పట్టించుకోని పాలకులుజిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్డు దుస్థితిఅశోక్నగర్ కాలనీ ప్రధాన రోడ్డుపై గుంతలుకామారెడ్డి సాక్షి నెట్వర్క్ : వ్యాపార, వాణిజ్య కేంద్రంగా ఎంతో పేరున్న కామారెడ్డి పట్టణంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. పలుచోట్ల అడుగడుగునా భారీ గుంతలు ఏర్పడడంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. పట్టణంలోని విద్యానగర్ మీదుగా ఉన్న జన్మభూమి రోడ్డు విస్తరణకు నోచుకోవడం లేదు. ఈ మార్గంలో గుంతలు ఇబ్బందిపెడుతున్నాయి. వర్షమొస్తే మురికి నీరు నిలిచి దుర్గంధం వ్యాపిస్తోంది. అశోక్నగర్ రోడ్డుపై ఏర్పడిన గుంతలు వాహనదారులకు చుక్కలు చూపుతున్నాయి. గుంతలను తప్పించే సమయంలో అదుపుతప్పి పడిపోవడమో.. ఎదురుగా వచ్చే వాహనాలను ఢీకొట్టడమో జరుగుతున్నాయి. పంచముఖి హనుమాన్ ఆలయం మీదుగా వెళ్లే అడ్లూరు రోడ్డు.. వర్షాల కారణంగా కోతకు గురయ్యింది. దీనికి తాత్కాలిక మరమ్మతులు కూడా కరువవడంతో వాహనదారులు ప్రమాదాలబారిన పడుతున్నారు. పట్టణంలోని ప్రధాన రోడ్లు సైతం ఛిద్రమయ్యాయి. సిరిసిల్లరోడ్, సుభాష్రోడ్, సైలానీబాబాకాలనీ, నిజాంసాగర్రోడ్, చెరువుకు వెళ్లే రోడ్, పెద్దబజార్, స్టేషన్రోడ్, భవానీరోడ్, కల్కీనగర్, స్నేహపురికాలనీ, వికాస్నగర్, వినాయక్నగర్, రాజీవ్నగర్, వాంబేకాలనీ, టీచర్స్కాలనీ తదితర కాలనీలలోని చాలా ప్రాంతాలలో పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఇప్పటికైనా పాలకులు మేల్కొని అవసరమైన మరమ్మతులు చేపట్టి, ప్రయాణం సాఫీగా సాగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
ఆదివాసి నాయక్పోడ్ దినోత్సవం
నిజాంసాగర్/బాన్సువాడ రూరల్ : మహమ్మద్ నగర్ మండలం బూర్గుల్, తుంకిపల్లి, గాలీపూర్ గ్రామాల్లో ఆదివారం ఆదివాసి నాయక్పోడ్ దినోత్సవాన్ని నాయక్పోడులు ఘనంగా జరుపుకున్నారు. కొమరంభీమ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నాయక్పోడ్ జెండాను ఆవిష్కరించారు. బాన్సువాడ మండలం హన్మాజీపేట్ గ్రామంలో నాయక్పోడ్ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలోని కొమురం భీం విగ్రహం వద్ద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆదివాసి సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయా గ్రామాల సర్పంచులు గజ్జల జీవన్, కుమ్మరిరాములు, కిరణ్, లావణ్య వెంకాగౌడ్, ఆదివాసినాయక్పోడ్ జిల్లా అధ్యక్షుడు మొట్ట పెంటయ్య కాంగ్రెస్ నాయకులు దుబ్బసాయాగౌడ్, భాస్కర్రెడ్డి, ఆదివాసి నాయక్పోడ్లు ఉన్నారు. -
హమ్మయ్య.. గట్టెక్కినట్లే!
వరుణదేవుడు కరుణించి వర్షాలు సమృద్ధిగా కురవడంతో జిల్లాలోని ప్రధాన జలాశయాలు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. వరుణుడిపై భారం వేసి నిజాంసాగర్ ఆయకట్టు కింద ఖరీఫ్ పంటలు సాగు చేసిన రైతుల ముఖాల్లో ఆనందం నెలకొంది. – నిజాంసాగర్(జుక్కల్)ఉమ్మడి జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రా జెక్టు ఆయకట్టు కింద 1.15 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు. జీరో డిస్ట్రీబ్యూటరీ నుంచి అలీసాగర్ రిజర్వాయర్ 49 డిస్ట్రీబ్యూటరీ వరకు అనధికారికంగా 1.5 లక్షల ఎకరాల వరకు ప్రధాన కాలువ ద్వారా విడుదల చేస్తున్న నీటితో పంటలు గట్టెక్కుతున్నాయి. అయితే, ఎల్నినో ప్రభావంతో నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేసే ప్రసక్తి లేదని అధికారులు, ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయినా ఆయకట్టు ప్రాంత రైతులు వరుణుడిపై భారంతో ఆయకట్టు కింద పంటలను సాగు చేశారు. వరినాట్లు పూర్తవుతున్న తరుణంలో వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఆయకట్టు పంటలకు భరోసా కలిగింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు వరద నీటి ప్రవాహం నెలకొన్నాయి. చెరువులు, కుంటలతోపాటు ప్రధాన జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. ఆదుకున్న పోచారం, ఘనపురం ఆనకట్ట ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరద పోటెత్తడంతో జిల్లాలోని పోచారం ప్రాజెక్టు పొంగి పొర్లుతోంది. మెదక్ జిల్లాలోని ఘనపురం ఆనకట్ట పొంగిపొర్లుతుండటంతో మంజీర నదిలో వరద పరవళ్లు తొక్కుతోంది. పోచారం, ఘనపురం ఆనకట్ట ద్వారా వరద నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరుతోంది. దీంతో ప్రా జెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతూ వస్తోంది. గత నెలాఖరు నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 5 టీఎంసీల మేర వరద వచ్చి చేరింది. వరద నీటి చేరికతో నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంత రైతులకు ఖరీఫ్ పంటలు గట్టెక్కుతాయనే భరోసా ఏర్పడింది. నీటి విడుదలకు తీర్మానం ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో 11.182 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటలకు మూడు విడతల్లో 4 టీఎంసీల నీటి విడుదలకు డీఐబీ సమావేశంలో తీర్మానం చేశారు. ఇటీవల నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఉమ్మడి జిల్లా నీటిపారుదల సమావేశంలో ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి సమక్షంలో చేసిన తీర్మాన పత్రాన్ని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఒకటి, రెండు విడుతల్లో 1.2 టీఎంసీల చొప్పున మూడో విడుతలో 1.6 టీఎంసీల మేర నీటి విడుదలకు ప్రతిపాదించినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. అయితే, దీనిపై ఈ నెలాఖరున హైదరాబాద్లో రాష్ట్రస్థాయి సమగ్ర నీటి ప్రణాళిక, నిర్వహణ కమిటీ (స్కీవం) సమావేశంలో నిర్ణయం వెలువడనున్నది. ఖరీఫ్కు ‘సాగర్’ భరోసా కరుణించిన వరుణుడు పంటల సాగుకు ఢోకా లేదు ఆయకట్టుకు మూడు విడుతల్లో 4 టీఎంసీల నీరు -
హైదరాబాద్ కార్పొరేట్ స్కూల్లో దారుణం
● కామారెడ్డి విద్యార్థిపై తోటి విద్యార్థుల దాడి ● తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరికకామారెడ్డి టౌన్ : హైదరాబాద్ దమ్మాయిగూడలోని ఓ కార్పొరేట్ హైస్కూల్లో దారుణం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన పదో తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. వివరాలు.. కామారెడ్డిలోని స్నేహపురి కాలనీకి చెందిన కిరణ్, శోభ దంపతుల కుమారుడు అభిషేక్ దమ్మాయిగూడలోని ఓ కార్పొరేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. పాత కక్షలను మనసులో ఉంచుకొని శనివారం సుమారు 8 నుంచి 12 మంది తోటి విద్యార్థులు గుంపుగా చేరి అభిషేక్పై దాడికి తెగబడ్డారు. కర్రలు, ప్లేట్లతో కొడుతూ బూట్లతో ముఖంపై తొక్కుతూ గాయపరిచారు. కాగా, మెట్లపై నుంచి కింద పడిపోవడంతో అభిషేక్కు గాయాలయ్యాయని పాఠశాల యాజమాన్యం నమ్మించే ప్రయత్నం చేస్తూ అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు తమ కుమారుడిని కామారెడ్డికి తీసుకొచ్చి ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తోటి విద్యార్థులే తనపై దాడి చేశారని అభిషేక్ తెలిపినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు. దాడికి పాల్పడిన విద్యార్థులపై, నిజాన్ని దాచిపెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివారం కామారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
క్రైం కార్నర్
బాన్సువాడ: పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో ఆదివారం ఉదయం జరిగిన కుక్కల దాడిలో సితార అనే చిన్నారికి తీవ్ర గాయలయ్యాయి. రోడ్డు–2లో అమ్మమ్మతో కలిసి చెత్త వేసేందుకు వెళ్లిన సితారపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ ఘటనలో సితార పెదవిపై తీవ్ర గాయలయ్యాయి. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం సితార ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కక్కుల బెడదను నివారించాలని బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. పలు కాలనీల్లో కుక్కలను పట్టి ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇంకా చాలా కుక్కలు పట్టణంలో విహరిస్తూ చిన్నారులపై దాడులు చేస్తూనే ఉన్నాయి. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం బాన్సువాడ: పట్టణంలోని జామా మజీద్ ఎదురుగా ఉన్న కాంప్లెక్స్లో ఆదివారం గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు సీఐ శ్రీధర్ తెలిపారు. మృతుడి వయస్సు 45 ఏళ్ల వరకు ఉంటుందని, సుమారు 5 అడుగుల ఎత్తు, కోల ముఖం, నలుపు రంగు గడ్డం, గోధుమ రంగు ప్యాంటు వేసుకుని ఉన్నాడని అన్నారు. మృతుడు కొంత కాలంగా బాన్సువాడలో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నట్లు స్థానికుల ద్వారా తెలిసిందన్నారు. మృతుడి వివరాలు తెలిసిన 8712686167, 8712666243 నంబర్లను సంప్రదించాలని అన్నారు. -
సహకారం కోసం ఆరాటం!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీసీఎస్) పాలకవర్గాల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం ఆరు నెలల కోసమంటూ నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్, డైరెక్టర్లను నియమిస్తోంది. అధికార పార్టీకి చెందిన నేతలకు ఇది మంచి అవకాశంగా మారింది. జిల్లాలో 55 సహకార సంఘాలు ఉండగా, అన్నిచోట్లా చైర్మన్, డైరెక్టర్ పదవుల కోసం పలువురు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో పలు విండోల పాలకవర్గాల నియామకానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఇందులో కామారెడ్డి, తిప్పాపూర్ విండోలకు లైన్ క్లియర్ అయి నియామకపు ఉత్తర్వులు అందుకున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో కొన్నింటికి ప్రతిపాదనలు పంపారు. బాన్సువాడలో కసరత్తు జరుగుతోంది. ఒక్కో విండో చైర్మన్, 12 మంది డైరెక్టర్లకు అవకాశం ఉంది. చైర్మన్ పదవి కోసం చాలాచోట్ల తీవ్ర పోటీ నెలకొంది. అధికార పార్టీకి చెందిన నేతలు నియోజకవర్గ ముఖ్య నేతలను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని వేడుకుంటున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ సిఫారసు చేసిన వారికి పదవులు దక్కనుండటంతో ఆయా విండోల పరిఽధిలోని కాంగ్రెస్ నాయకులు తమకు అవకాశం ఇవ్వాలంటూ షబ్బీర్అలీ వద్దకు పరుగులు తీస్తున్నారు. కామారెడ్డి విండో చైర్మన్గా షబ్బీర్అలీ అంతరంగికుల్లో ఒకరైన చిందాల(గూడెం) శ్రీనివాస్రెడ్డికి అవకాశం దక్కింది. తిప్పాపూర్ చైర్మన్గా మొన్నటి వరకు భిక్కనూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన తిరుపారి భీంరెడ్డిని నియమించారు. మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, ముత్యంపేట, రామేశ్వర్పల్లి, భిక్కనూరు, రాజంపేట, బస్వాపూర్, అంతంపల్లి తదితర సహకార సంఘాల చైర్మన్ పదవులను చాలా మంది ఆశిస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పలువురు నేతలు ఎమ్మెల్యే మదన్మోహన్ ఆశీర్వాదం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొన్నింటిని ఇప్పటికే ఖరారు చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు సమాచారం. జుక్కల్లో సహకార పదవుల కోసం స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావ్ను కలిశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని ఆయా సొసైటీ చైర్మన్ పదవులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి ఖరారు చేయనున్నారు.విండో చైర్మన్, డైరెక్టర్ పదవులు ఆయా నియోజకవర్గాలకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే/ముఖ్య నేతల ఆశీస్సులు ఉన్నవారికే దక్కనున్నాయి. దీంతో ఆశావహులు తమకు అవకాశం ఇవ్వాలని వారిని కలిసి వేడుకుంటున్నారు. అయితే, దశాబ్దాల కాలంగా పార్టీలో పనిచేస్తున్న వారిలో కొందరు తమకు అవకాశం ఇవ్వకుంటే పార్టీకి గుడ్బై చెప్పే ఆలోచనలో ఉన్నారు. కొన్నిచోట్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్నికల సమయంలో పార్టీలో చేరిన వారికి అవకాశాలు ఇస్తే ఊరుకునేది లేదని కూడా పేర్కొంటున్నారు. విండో చైర్మన్ పదవి ద్వారా రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్న నేతలు ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడడం లేదన్న ప్రచారం జరగుతోంది.మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆరాటపడిన వారు ఎన్నికలు వాయిదాపడుతూ రావడంతో నిరాశ చెందారు. అయితే, ఎన్నికల ప్రక్రియ లేకుండానే నామినేట్ చేస్తుండటంతో సహకార సంఘాల పదవులను పొందాలని కొందరు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్నికల లొల్లి లేకుండా నియమిస్తుండటం చాలా మందిని ఆలోచనల్లో పడేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో విండో చైర్మన్, డైరెక్టర్ పదవులకు డిమాండ్ పెరిగింది. ధాన్యం కొనుగోళ్లు, ఎరువుల విక్రయాలతో విండోలకు ఆదాయం విపరీతంగా పెరిగింది. పాలకవర్గాలకు నాలుగుచేతులా సంపాదించుకునే అవకాశం దొరికింది. దీంతో కొందరు విండో చైర్మన్ పదవుల కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడటం లేదని తెలుస్తోంది. కొన్ని విండోల్లో చైర్మన్ కోసం బేరసారాలు కూడా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆరు నెలల కోసం ఇచ్చినా, విండోల ఎన్నికలు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆరు నెలల చొప్పున పొడిగిస్తారన్న భావనతో చాలామంది విండో పదవులకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చైర్మన్, డైరెక్టర్ పదవులకు ప్రయత్నాలు జిల్లాలో 55 విండోలు.. ఇప్పటికే కొన్నింటికి ప్రతిపాదనలు రెండు విండోలకు పాలకవర్గాలు ఖరారు ముఖ్య నేతల చుట్టూ ఆశావహుల చక్కర్లు -
పాత ఫోన్.. కొత్త మోసం
● వ్యక్తిగత డేటా దుర్వినియోగంతో సైబర్ నేరాలు ● ఆర్థిక మోసాలకు అవకాశం సదాశివనగర్: పాత ఫోన్లకు ప్లాస్టిక్ సామన్లు ఇస్తామంటూ ఊరూరా జరుగుతున్న ఈ వ్యాపారం వెనుక సైబర్ నేరగాళ్ల హస్తం ఉంటోంది. ప్రజలకు చిన్న పాటి ప్లాస్టిక్ సామన్లు ఎరవేసి పాత ఫోన్లను కొత్త నేరాలకు కేటుగాళ్లు వాడుకుంటున్నారు. తక్కువ మొత్తం డబ్బుకు ఆశపడి పాత ఫోన్లను అప్పగించడం చేస్తే నేరాల వలలో చిక్కే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పాత ఫోన్ల కొనుగోలు, విక్రయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల చేతికి.. పల్లెలు, పట్టణాల్లో సేకరించిన పాత ఫోన్లను చాలా వరకు ఝార్ఖండ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్ల అడ్డాలకు వీటిని తరలిస్తారు. మరమత్తులు చేసి నకిలీ పేర్లతో తీసుకున్న సిమ్ కార్డులను అందులో వేసి మోసాలకు పాల్పడుతారు. సైబర్ నేరాల ద్వారా వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని పాత ఫోన్లకు సేకరించిన వారికి కమీషన్గా చెల్లిస్తున్నారు. ఆర్థిక వేఽధింపులకు గురయ్యే ప్రమాదం.. పాడైన ఫోన్లలో సిమ్కార్డు మర్చిపోయినా, డేటాను ఫార్మాట్ చేయకపోయినా ఇబ్బందులు తప్పవు. వ్యక్తిగత చిత్రాలు, వీడియోలు నంబర్లు నేరగాళ్లకు చిక్కితే వారి నుంచి ఆర్థిక వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉంది. పాత ఫోన్లలో బ్యాంకింగ్ యాప్లు, చెల్లింపుల వివరాలు కనిపిస్తే ఆర్థిక పరమైన మోసాలు జరగవచ్చు. ప్రతి ఫోనుకు ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిడీ(ఐఎంఈఐ) నంబరు ఉంటుంది. సైబర్ నేరం జరిగినప్పుడు పోలీసులు ఈ నంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభిస్తారు. పాత ఫోన్ అమ్మిన వ్యక్తిని అపరాధిగా తేలుస్తారు. అసలు నేరం చేసిన వారు తప్పించుకుంటారు. వివరాలు నమోదు చేసుకోవాలి ఎవరైనా వ్యక్తికి, డీలర్కు ఫోన్ విక్రయిస్తే వారి చిరునామా, ఆధార్, వివరాలు సేకరించాలి. ఫోన్ అమ్మినట్లుగా(ఐఎంఈఐ) నంబరు, విక్రయించిన తేదీ, పేర్కొంటు రసీదు పొందాలి. విక్రయించారనే సమాచారం ఉంటే భవిష్యత్తులో ఆ ఫోన్ ద్వారా నేరం జరిగినా పోలీసు దర్యాప్తు నుంచి సురక్షితంగా బయటపడవచ్చు. పాత ఫోన్లను గుడ్డిగా కొనడం, విక్రయించడం చేయొద్దు. అవసరమైతే తప్ప గుర్తుతెలియని వారి నుంచి పాత ఫోన్లను కొనుగోలు చేయొద్దు. గ్రామా ల్లో తిరుగుతూ పాత ఫోన్లను తీసుకుని వస్తువులు ఇచ్చే వారిని నమ్మొద్దు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. – సంతోష్కుమార్, సీఐ, సదాశివనగర్ -
బీసీసీ యూత్ నూతన కమిటీ ఎన్నిక
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని భారత్ క్రికెట్ క్లబ్ యూత్ ఫెడరేషన్ పట్టణ కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జరిగిన ఎన్నికలో గౌరవ అధ్యక్షుడిగా చిటిమెల్లి ప్రేమ్కుమార్, గోనెల జగన్నాథం, అధ్యక్షుడిగా పార్లపల్లి ప్రసాద్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా నారెడ్డి శ్రీనివాస్రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా దుబ్బాక ప్రసాద్, ఉప కార్యదర్శిగా తోట ప్రవీణ్కుమార్, కోశాధికారిగా వెంకటరాజం, సలహాదారులను ఎన్నుకున్నారు. కామారెడ్డి అర్బన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశాలకు సెప్టెంబర్ 9 వరకు గడువు పొడిగించినట్టు కామారెడ్డి అధ్యయన కేంద్రం సమన్వయకర్త సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో ప్రవేశానికి ఇంటర్ సమాన పరీక్ష, పీజీ ప్రవేశానికి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్లో సంప్రదించాలని సూచించారు. తాడ్వాయి: మండలంలోని పల్లెగడ్డా తండా శివారులో నిర్వహించిన క్షుద్ర పూజలు కలకలం రేపాయి. వివరాలిలా ఉన్నాయి. గత 50 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో రుక్మాయి అనే గ్రామం ఉండేదని, ఆ గ్రామ సమీపంలో ఉన్న గడి ప్రాంతంలో గుప్త నిధుల కోసం తరచూ తవ్వకాలు జరుగుతుండేవని ఈ ప్రాంత ప్రజలు చెబుతున్నారు. కొన్ని రోజులుగా ఆ గడి స్థలానికి సంబంధించి భూవివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వచ్చి క్షుద్ర పూజలు చేసినట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. భూవివాదం విషయంలో ఎవరో కావాలనే క్షుద్ర పూజలు చేశారా.. లేదా భయపెట్టడానికి చేసి ఉంటారా అని తండావాసులు చర్చించుకుంటున్నారు. పోలీసు అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
పర్యాటకుల సందడి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పోచారం ప్రాజెక్టు పరిసరాల్లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. సెలవుదినం కావడంతోపాటు ప్రాజెక్టు అలుగు పొంగిపొర్లుతుండడంతో అందాలను తిలకించేందుకు పర్యాటకులు వందల సంఖ్యలో తరలివచ్చారు. కాగా, ప్రాజెక్టు నీటిలోకి పర్యాటకులు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావ్ కూతురి వివాహ విందుకు హాజరయ్యేందుకు ఈ నెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బిచ్కుందకు రానున్నట్టు అధికారవర్గాల ద్వారా తెలిసింది. బిచ్కుంద పట్టణ సమీపంలోని కాందార్పల్లి శివారులో ఏర్పాటు చేసే వివాహ విందుకు సీఎం హాజరుకానున్నారు. తన కుమార్తె వివాహ విందుకు హాజరుకావాలని ఇప్పటికే ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావ్ సీఎంను కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. సీఎం రాక కోసం అధికారులు హెలిపాడ్ను సిద్ధం చేస్తున్నారు. బాన్సువాడ : ప్రభుత్వం సనాతన బోర్డును ఏర్పాటు చేయాలని గుడిమెట్ సద్గురు మహాదేవ స్వామిజీ అన్నారు. పట్టణంలోని రెడ్డి సంఘంలో ఆదివారం నిర్వహించిన సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభలో ఆయన ప్రసంగించారు. హిందువుల్లో ఐక్యత అవసరమని, ప్రభుత్వాలు హిందువులకు అన్యాయం చేస్తున్నాయని అన్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించాలని, ప్రతి ఇంటిలో భగవద్గీత ఆచరణ జరగాలని, యువత సన్మార్గంలో నడవాలని, చెడు వ్యసనాల వైపు వెళ్లవద్దని సూచించారు.మనమంతా ఒకటే భావనతో నిలవాలని వీరధర్మజ స్వామిజీ అన్నారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు నిత్యానందం, హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు సాయికిరణ్, సామాజిక సమరపత ప్రముఖ హరిదాస్ తదితరులు ఉన్నారు. బాన్సువాడ రూరల్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 2000–2015 సంవత్సరాల మధ్య డిగ్రీ ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాసేందుకు వన్టైం చాన్స్ అవకాశం కల్పించిందని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.గంగాధర్ తెలిపారు. ఆగస్టు 31లోపు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు ఉందని పేర్కొన్నారు. 2016–17 సంవత్సరం నాటి డిగ్రీ సిలబస్ ప్రకారం పరీక్షలు ఉంటాయని తెలిపారు. డిగ్రీ పూర్తి చేసుకోవాలనే ఆసక్తి ఉన్న పూర్వ విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కామారెడ్డి టౌన్ : జిల్లాలో కాంగ్రెస్ సేవాదళ్ను మరింత బలోపేతం చేస్తామని నూతన జిల్లా అధ్యక్షుడు గడ్డమీది మహేశ్ తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు. తన నియామకానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర, జిల్లా కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోని మండల, నియోజకవర్గ కమిటీలను నియమించి ఇటీవల గాంధీభవన్లో నియామక పత్రాలు అందజేసినట్లు వెల్లడించారు.నియోజకవర్గ అధ్యక్షుడు మెహర్ బాబా గౌడ్, పట్టణ అధ్యక్షుడు వడ్డే సుదర్శన్, ఆయా మండలాల అధ్యక్షుడు చెట్కూరి ప్రణీత్, గిజ్జువెల్లి మాధవరెడ్డి, మలోత్ మహేశ్,వేణుగోపాల్ చారి, ప్రవీణ్, కాలకుంట్ల రాజు, వడ్ల హరీష్ పాల్గొన్నారు. -
హైవేపై డేంజర్ యూటర్న్..
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో 44వ నంబర్ జాతీయ రహదారి యూటర్న్ ప్రమాదకరంగా మారింది. ప్రభుత్వ జూనియర్ కళాశాల, మోడల్ కళాశాల, పాఠశాలలు జాతీయ రహదారికి ఆనుకొని ఉన్నాయి. రోజూ వెయ్యి మందికి పైగా విద్యార్థులు రోడ్డును దాటుతుంటారు. ఈ నేపథ్యంలో జూనియర్ కళాశాల వద్ద యూటర్న్ను ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి కావడంతో వాహనాలు వేగంగా వెళుతుంటాయి. ఇదే సమయంలో విద్యార్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని యూటర్న్ దాటుతున్నారు. రహదారిపై వాహనాలు అదుపుతప్పితే పెను ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయని తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. యూటర్న్ వద్ద అండర్పాస్ బ్రిడ్జి నిర్మాణం కోసం గతంలో ప్రతిపాదనలు తయారు చేసినా.. నిర్మాణం కలగానే మిగిలింది. ప్రమాదాలు చోటు చేసుకోకముందే అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. -
గిరిజన సంస్కృతికి ప్రతీక తీజ్
● తొమ్మిది రోజుల పాటు నియమ నిష్ఠలతో పూజలు ● పోచారం– రాంపూర్ తండాలో ముగిసిన ఉత్సవాలు బాన్సువాడ రూరల్: గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు తీజ్ పండుగ ప్రతీకగా నిలుస్తోంది. పెళ్లి కాని యువతులు తమకు మంచి భర్త లభించాలని, వర్షాలు కురిసి పాడిపంట బాగుండాలని ఏటా గిరిజన తండాల్లో తొమ్మిదిరోజుల పాటు తీజ్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. తీజ్ను బంజారాల బతుకమ్మగా పిలుస్తారు. శీత్లా భవాని పండుగతో ప్రారంభం.. ఆషాఢమాసంలో తొలకరి విత్తనాలు విత్తిన తర్వాత శీత్లాభవాని పండుగ జరుపుకుంటారు. గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలతో తండా పొలిమేరల్లో ఏర్పాటు చేసిన శీత్లాభవాని అమ్మవార్లకు నైవేద్యం తీసుకెళ్లి భక్తిశ్రద్ధలతో సమర్పిస్తారు. శీత్లా పండుగ అనంతరం తండానాయక్ కారోబార్ ఆశీర్వాదం, అనుమతి తీసుకుని తీజ్ పండుగను ప్రారంభిస్తారు. అందంగా అల్లిన బుట్టల్లో మట్టిని నింపి వాటిలో గోధుమ విత్తనాలు నాటుతారు. బుట్టలన్నీ నాయక్ ఇంటిముందు మంచె ఏర్పాటు చేసి దానిపై ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. తొమ్మిది రోజులకు బుట్టల్లో ఆకుపచ్చని మొలకలు దట్టంగా పెరుగుతాయి. ఇలా పెరగడం గిరిజనులకు శుభంగా భావిస్తారు. తండా పెద్దల ఆశీర్వాదంతో.. తొమ్మిదోరోజు గిరిజనుల ఆరాధ్యదైవం శ్రీసంత్ సేవాలాల్ మహరాజ్కు, మేరమ్మ యాడీ (పార్వతీదేవి), భవాని మాతలకు ప్రత్యేక పూజలు చేస్తారు. బెల్లం, బియ్యంతో వండిన పరమాన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం తండా పెద్దల ఆశీర్వాదం తీసుకుని మొలకలు వచ్చిన బుట్టలను తలపై పెట్టుకుని నృత్యాలు చేస్తూ స్థానిక చెరువులో నిమజ్జనం చేస్తారు. యువతులకు వారి సోదరులు, బంధువులు కానుకలు ఇస్తారు. ప్రముఖుల రాక.. పోచారం–రాంపూర్ తండాల్లో ఆదివారం జరిగిన తీజ్ ముగింపు ఉత్సవాలకు వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి, నాయకులు సురేందర్రెడ్డి, మోహన్నాయక్ హాజరై గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మోరిల్ శ్రీనివాస్రావు, అంజిరెడ్డి, జుబేర్లు శుభాకాంక్షలు తెలిపారు. తండావాసులు ఉన్నారు. -
పేగుబంధంపై ప్రేమతో..
● తల్లిదండ్రుల పాలరాతి విగ్రహాల ఆవిష్కరణ ● చాట్ల నర్సయ్య సాహితీ సేవలు కొనియాడిన రచయితలు, కవులురామారెడ్డి(ఎల్లారెడ్డి): బతికుండగానే తల్లిదండ్రులను వదిలేస్తున్నారు కొందరు... అంత్యక్రియలకు కూడా హాజరుకాకుండా వీడియో కాల్స్లోనే చివరి మజిలీ పూర్తి చేస్తున్నారు మరికొందరు పిల్లలు. అలాంటిది మరణించిన తల్లిదండ్రులను నిత్యం గుర్తు చేసుకు నేలా పాలరాతి విగ్రహాలు చేయించి ఆదివారం ఆవిష్కరించారు. రామారెడ్డి మండలం పోసానిపేటలోని వ్యవసాయ క్షేత్రంలో బహుముఖ ప్రజ్ఞాశాలి చాట్ల న ర్సయ్యగంగామణి విగ్రహాలను కొడుకులు చాట్ల విజ యకృష్ణ, విశ్వ ప్రమోద్, చాట్ల విద్యుల్లత ప్రతిష్టించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ తండ్రి చాట్ల నర్సయ్య చరిత్ర పరిశోధకుడిగా, కళాకారుడిగా, రంగస్థల నటుడిగా, కవిగా, రచయితగా సాహితీ ప్రపంచంలో చెరగని ముద్ర వేశారని గుర్తుచేశారు. అనంతరం తెలంగాణ రచయితల వేదిక (తెరవే) జిల్లా అధ్యక్షుడు గఫూర్ శిక్షక్ మాట్లాడుతూ చాట్ల నర్సయ్య తన పరిశోధనలతో కామారెడ్డి జిల్లా కీర్తి ప్రతిష్టలను నలుదిశలా వ్యాపింపజేశారని గుర్తుచేశారు. ఉత్తమ అధ్యాపకుడిగా ఎంతోమంది శిష్యులను సమాజానికి ఉపయోగపడే మేటి పౌరులుగా తీర్చిదిద్దారని తెలిపారు. కార్యక్రమంలో ప్రముఖ గజల్ కవి సూరారం శంకర్, డాక్టర్ జి.లచ్చయ్య, గంగాప్రసాద్, పీతాంబర్, నాగభూషణం, సుప్పని సత్యనారాయణ, సీహెచ్ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలి
కామారెడ్డి టౌన్ : మాలలకు ఉద్యోగ నియామకాలలో తీవ్ర అన్యాయం చేస్తున్న రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని మాలల కోఆర్డినేషన్ ఫోరం(ఎంసీఎఫ్) రాష్ట్ర నాయకుడు పి. శంకర్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ కళాశాలలో ఎంసీఎఫ్ జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. రోస్టర్ విధానంతో ఉద్యోగ నియామకాలలో మాల సామాజిక వర్గానికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామగ్రామాన ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. ఫోరం రాష్ట్ర నాయకురాలు బండ శకుంతల మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ తదుపరి అమలు చేస్తున్న విధానాలను మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర నాయకుడు తిరుపతయ్య మాట్లాడుతూ.. మాలలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వ్యాపార రంగంలోకీ అడుగుపెట్టాలని సూచించారు. ఎంసీఎఫ్ జిల్లా కన్వీనర్గా ధర్మపురి సమావేశంలో ఎంసీఎఫ్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా కన్వీనర్గా ధర్మపురి ఎన్నికయ్యారు. సభ్యులుగా బుల్లెట్, రమేష్, స్వామి, సుధాకర్, జగన్ , నరసింహులు, రాజలింగం, దాసరి రాజులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు బాబు, నరేందర్, రవితేజ, రాము, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
వాగు దాటాలంటే తెప్పే దిక్కు
నిజాంసాగర్(జుక్కల్): ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సంగితం వాగులో వరద ప్రవహిస్తోంది. మహమ్మద్నగర్ మండలం సింగితం గ్రామ రైతులు, కూలీలు వ్యవసాయ పనులకు వెళ్లాలంటే వాగు దాటాల్సిందే. 15 రోజులుగా వాగులో వరద కొనసాగుతుండగా, వాగు దాటేందుకు తెప్పలను ఆశ్రయిస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాగుకు రెండు వైపులా తాడుకట్టి తెప్పపైన ప్రయాణిస్తున్నారు. వాగుపైన బ్రిడ్జి నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోవడంతోనే తెప్ప కష్టాలు తప్పడం లేదని రైతులు, గ్రామస్తులు వాపోతున్నారు. ప్రభుత్వ పాలకులు, అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
రైలు నుంచి జారిపడిన బాలుడు
● తలకు తీవ్రగాయాలు డిచ్పల్లి: మండలంలోని బీబీపూర్ తండా శివారులో ఆదివారం రైలు నుంచి ప్రమాదవశాత్తు బాలుడు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఏరియా తలాబ్ కట్టకు చెందిన బాలుడు నవీద్ తన కుటుంబసభ్యులతో కలిసి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైలులో నాందేడ్కు బయలుదేరాడు. ఇందల్వాయి స్టేషన్ దాటిన తర్వాత మూత్ర విసర్జన కోసం టాయిలెట్కు వెళ్లి తిరిగి సీటు వద్దకు వస్తుండగా బీబీపూర్ శివారులో ప్రమాదవశాత్తు రైలు బోగీ డోర్ నుంచి కిందికి పడిపోయాడు. గమనించిన తోటి ప్రయాణికులు ఎవరో కింద పడిపోయాడని చెప్పుకోవడం విన్నప్పటికీ నవీద్ కుటుంబసభ్యులు ఇతరులెవరో ఉండవచ్చని భావించారు. ఇంతలోనే రైలు నిజామాబాద్కు రావడం.. నవీద్ కనిపించక పోవడంతో ఆందోళనకు గురైన వారు బీబీపూర్ శివారులో పడిపోయింది నవీద్ అయి ఉండవచ్చని భావించి వెంటనే రైల్వే పోలీసులను ఆశ్రయించారు. రైలు నుంచి కిందపడిన నవీద్ తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించడంతో ఈఎంటీ రవి, పైలట్ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకొని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నవీద్ తలకు దెబ్బ తగిలిన చోట వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. -
విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి
● సీపీ సాయిచైతన్య నిజామాబాద్ రూరల్: విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ దిశగా పయనించాలని సీపీ సాయిచైతన్య అన్నారు. నగరంలోని ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన 130 మంది విద్యార్థులకు ఒకొక్కరికి రూ. పది వేల చొప్పున అందించిన స్కాలర్షిప్లను సీపీ సాయిచైతన్య ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రతిభగల విద్యార్థులను ఉన్నత విద్య వైపు ప్రోత్స హించాలనే ఉద్దేశంతో ఎంఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. జీవితంలో విజయం సాధించాలంటే లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించే వరకు నిరంతరం కష్టపడాలని సూచించారు. -
వామ్మో.. భౌ భౌ..
మద్నూర్(జుక్కల్): మద్నూర్, డోంగ్లీ మండలాల్లోని అన్ని గ్రామాల్లో వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రాత్రి పగలు అనే తేడా లేకుండా నిత్యం రోడ్లు, వీధుల్లో గుంపులుగా తిరుగుతూ ప్రజలపై, పశువుల మందలపై దాడులు చేస్తున్నాయి. ఆరు బయట ఆడుకునే చిన్నారుల కుటుంబ సభ్యులు, రాత్రిపూట వివిధ పనుల నిమిత్తం వచ్చే వాళ్లు కుక్కలను చూసి భయపడుతున్నారు. ద్విచక్ర వాహనాల వెంటపడటంతో వారు ప్రమాదాలకు గురువుతున్నారు. మండలంలోని కోడిచిర గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను, ఒక బాలుడిపై గత మూడు రోజుల క్రితం దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో వారు ఆస్పత్రుల పాలయ్యారు. అలాగే మండలంలోని పెద్ద ఎక్లారలో మేకల గుంపుపై కుక్కలు దాడి చేసి 10 మేక పిల్లలను కోరికి చంపేయడంతో వేలల్లో ఆస్తి నష్టం సంభవించిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. కోళ్లఫారాలు, చికెన్ సెంటర్ల యజమానులు మృతి చెందిన కోళ్లను, వాటి వ్యర్థాలను రోడ్ల వెంబడి ఎక్కడపడితే అక్కడ పడేయడంతో వీధి కుక్కలు వాటిని తింటున్నాయి. వ్యర్థాలను రోడ్ల మీద పడేయడంతో వీధి కుక్కల సంచారం ఎక్కువైంది. గుంపులుగా తిండి కోసం వాటికి అవే ఘర్షణలు పడటంతో పాటు రోడ్లపై నడుచుకుంటూ వెళ్లే ప్రజల మీద దాడికి పాల్పడుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి వీధి కుక్కలను బెడదను అరికట్టి, వాటి దాడుల నుంచి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. కోడిచిరలో మూడు రోజుల కింద నలుగురిపై కుక్కలు దాడి చేశాయి. రాత్రి సమయంలో వీధి కుక్కలు వాహనాల వెంట పడుతున్నాయి. కుక్కల సంచారం ఎక్కువగా ఉండటంతో పిల్లలను బయటకు పంపాలంటే భయమేస్తుంది. –రామ్పటేల్, కోడిచిర మా ఊర్లో గత మూడు రోజుల క్రితం కుక్కలు మేకల మందపై దాడి చేసి పది మేక పిల్లలను చంపేశాయి. గ్రామంలో వీధి కుక్కల బెడదను నివారించాలి. ఆరు బయట చిన్న పిల్లలు ఆటలు ఆడుకునే సమయంలో వీధి కుక్కలు పిల్లలపై దాడి చేస్తాయోమోనని ఆందోళనగా ఉంది. –శ్రీకాంత్, పెద్ద ఎక్లార ఉమ్మడి మద్నూర్ మండలంలో స్వైరవిహారం చేస్తున్న కుక్కలు కోడిచిరలో పలువురు, పెద్ద ఎక్లారలో మేకల గుంపుపై దాడి వీధికుక్కల నుంచి రక్షణ కల్పించాలని వినతి -
బురదలో దిగబడిన ఆర్టీసీ బస్సు
కామారెడ్డి రూరల్: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ శివారులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బురదలోకి కూరుకుపోయింది. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి పాత బస్టాండ్ నుంచి శనివారం ఉదయం బయలుదేరిన ఆర్టీసీ బస్సు రెడ్డిపేటకు వెళ్తోంది. ఈ క్రమంలో బస్సుకు ఎదురుగా వాహనాలు రావడంతో అడ్లూర్ గ్రామ సమీపంలో డ్రైవర్ బస్సును రోడ్డు నుంచి కిందికి దించాడు. ఈ క్రమంలో భారీ వర్షంతో రహదారి పక్కన ఉన్న రోడ్డు బురదగా మారి అందులో కూరుకుపోయింది. ఆగిపోయిన బస్సును డ్రైవర్ వేగం పెంచడంతో బస్సు మొరాయించి సైడ్కు ఒరిగిపోయి ప్రమాదకరంగా మారింది. బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ బస్సును పక్కకు నిలిపి ప్రయాణికులను కిందికి దించాడు. విషయం తెలిసిన స్థానికులు, పోలీసులు, ఆర్టీసీ అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
బాన్సువాడ రూరల్: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బాన్సువాడ పట్టణం టీచర్స్ కాలనీలో చోటు చేసుకుంది. సీఐ తుల శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. కాలనీకి చెందిన అంబిల్పూర్ రజిని(34) కొంత కాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. పలు ఆస్పత్రుల్లో చూయించినా నయం కాలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతురాలికి భర్త బాలరాజు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిజాంసాగర్: మహమ్మద్నగర్ మండలం తెల్గాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి దనుల ఎల్లయ్య నివాసపు రెక్కుల షెడ్డుకు షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ప్రమాదంలో ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫ్రిజ్, టీవీ, ఫ్యాన్లు, బల్బులు కాలిబూడిద అయ్యా యి. బాధిత కుటుంబానికి రూ. లక్ష వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు సర్పంచ్ వెల్లుట్ల మేఘన నగేశ్ తెలిపారు. -
పోచారానికి పోటెత్తిన వరద
● శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం ● త్వరలో కౌలాస్ గేట్లు ఎత్తే అవకాశంనాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పోచారం ప్రాజెక్టుకు శనివారం వరద తాకిడి మళ్లీ పెరిగింది. ఎగువ ప్రాంతంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. శుక్రవారం రాత్రి ప్రాజెక్టులోకి సుమారు 1500 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా శనివారం ఉదయం నాటికి 5,983 క్యూసెక్కులకు పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ నుంచి ప్రధాన కాలువలోకి 50 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, ప్రాజెక్ట్ అలుగు పైనుంచి పొంగిపొర్లుతూ 5,933 క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లోగా వెళుతోందని ఇరిగేషన్ ఏఈ అక్షయ్ కుమార్ తెలిపారు నిండిన కౌలాస్.. నిజాంసాగర్(జుక్కల్): జుక్కల్ మండలంలోని కౌలాస్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలతోపాటు సంగారెడ్డి జిల్లాలోని కంగ్టి మండల పరిధిలో కురుస్తున్న వర్షాలకు వరద వచ్చి చేరుతోంది. శనివారం సాయంత్రానికి కౌలాస్ ప్రాజెక్టులోకి 765 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు 1.237 టీఎంసీలకు గాను ప్రస్తుతం 457.20 మీటర్లు 1.049 టీఎంసీలకు చేరింది. జూలై 29 నుంచి కౌలాస్ ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో ప్రారంభం కాగా, 11 రోజుల్లో జలాశయంలోకి 0.610 టీఎంసీల నీరు చేరింది. కౌలాస్ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో లోతట్టు ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘సాగర్’లోకి 9,283 క్యూసెక్కులు.. ఉమ్మడి జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టులోకి శనివారం సాయంత్రం 9,283 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతోపాటు పోచారం ప్రాజెక్టు ద్వారా 4,800 క్యూసెక్కులు, ఘనపురం ఆనకట్ట ద్వారా 1,500 క్యూసెక్కుల చొప్పున ఇన్ఫ్లో వస్తోందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగుల (17.8 టీఎంసీలు)కు గాను ప్రస్తుతం 1399.88 అడుగుల (11.182 టీఎంసీల) నీరుంది. -
జోరుగా వరి నాట్లు
మాచారెడ్డి: ఎల్నినో ప్రభావంతో వర్షాలు పడవ ని ఒకవైపు, మరోవైపు వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ వరి వేయకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు అవగాహన కల్పించారు. రైతులు మొండి ధైర్యంతో ఎట్లయితే అట్లయితది అనుకుంటూ వరి నారు పోశారు.దుక్కులు దున్నారు.ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ పోటా పోటీగా నాట్లు వేయడం మొదలు పెట్టారు.మొత్తం మండలంలో గతేడాది 15వేల ఎకరాల్లో వరి సాగు చేసిన రైతులు ఇప్పటి వరకు 10 వేల ఎకరాల్లో వరి నాటు వేసినట్లు మండల వ్యవసాయాధికారి పవన్ కుమార్ తెలిపారు. 15 రోజుల్లో లక్ష్యాన్ని చేరుకుంటారని వివరించారు. -
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడిగా కుశాల్
కామారెడ్డి అర్బన్: పీఆర్టీయూ టీఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా అల్లాపూర్ కుశాల్, పుట్ట శ్రీనివాస్రెడ్డి ఏకగ్రీ వంగా ఎన్నికయ్యారు. శనివారం సాయంత్రం లింగాపూర్ బృందావన్ ఫంక్షన్హాల్లో పీఆర్టీయూ ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్నిక కావడంపై రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి భీక్షంగౌడ్తోపాటు ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి అభినందించారు. పూర్తి కార్యవర్గాన్ని త్వరలోనే ప్రకటిస్తామని అధ్యక్షుడు కుషాల్ తెలిపారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేతతాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని కన్కల్ గ్రామంలో ఇద్దరు బాధితులకు మంజూరైన రూ.54,000 సీఎంఆర్ఎఫ్ చెక్కులను శనివా రం కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఎమ్మె ల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు బాధితు ల ఇంటికి వెళ్లి చెక్కులు అందజేశామని నాయ కులు పేర్కొన్నారు.నాయకులు భూపతిరెడ్డి, రాజలింగం, గఫూర్, ప్రతాపరెడ్డి, పెంటురెడ్డి, వెంకటేష్, స్వామి, వెంకట్రెడ్డి, సిద్దిరాములు, కమలాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: హనుమకొండలో నిర్వహించిన 5వ జాతీయ జావెలిన్ దినోత్సవం, కిడ్స్ మీట్, 12వ రాష్ట్ర యూత్ చాంపియన్షిప్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటినట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్రెడ్డి, అనిల్కుమార్లు తెలిపారు. అండర్–6 విభాగం 150 మీటర్ల పరుగులో కే.అంబిక బంగారు పతకం, అండర్–12 విభాగం బ్యాక్త్రోలో జి.ఆధ్యత్రినయా, మహిళా విభాగం జావెలిన్త్రో లో ఎం.అమృత రజత పతకం సాధించినట్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పేర్కొన్నారు. విజేతలను జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్గౌడ్, అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. బాన్సువాడ రూరల్: బాన్సువాడ తాడ్కోల్ గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో కొందరు మద్యం సేవిస్తుండటంతో పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో నివారణ చర్యలు తీసుకున్నారు. ఇక నుంచి ప్రకృతి వనంలో మద్యం సేవించినా, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వ్యక్తులను గుర్తించి రూ.5వేలు జరిమానా విధిస్తామని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో గ్రామస్తులు, ప్రత్యేకించి కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. -
గంజాయి విక్రయానికి యత్నించిన ఇద్దరి అరెస్టు
● నిందితుల్లో ఒకరు మైనర్ ● 2.402 కిలోల ఎండు గంజాయి స్వాధీనం గాంధారి(ఎల్లారెడ్డి): గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఓ వ్యక్తితోపాటు బాలుడిని శనివారం అరెస్టు చేసి 2.4 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్ తెలిపారు. పక్కా సమాచారం మేరకు గాంధారి మండల కేంద్రం నుంచి చద్మల్ వెళ్లే రహదారిలో అయ్యప్ప ఆలయం వద్ద ఇన్చార్జి ఎస్సై నరేశ్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. అదే సమయంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న నాగ్లూర్ తండాకు చెందిన మాథుర్సింగ్(55), ఓ బాలుడిని తనిఖీ చేయగా ఎండు గంజాయి లభించింది. అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా గంజాయిని తండా నుంచి రవాణా చేసి మండల కేంద్రంతోపాటు కామారెడ్డి పట్టణంలోని బస్టాండ్, రైల్వేస్టేషన్ పరిసరాల్లో విక్రయించి మిగిలిన ప్యాకెట్లను హైదరాబాద్కు తరలించి విక్రయించాలని పథకం వేసుకున్నట్లు తెలిపారు. మాథుర్ సింగ్ను రిమాండ్ తరలించి, బాలుడిని జువైనెల్ కోర్టులో హాజరు పరచనున్నట్లు సీఐ తెలిపారు. గంజాయి రవాణాను అడ్డుకోవడంలో చాకచక్యంగా పనిచేసిన సీఐ సంతోష్ కుమార్, ఎస్సైలు నరేశ్, పుష్పరాజ్, ఏఎస్సై ప్రకాశ్, సిబ్బంది సంజయ్, వీర ప్రసాద్, బంటిలాలును ఎస్పీ రాజేశ్చంద్ర అభినందించినట్లు తెలిపారు. -
క్రైం కార్నర్
గాంధారి: అనారోగ్య కారణాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఓ యువకుడు చికిత్స పొందుతూ చెందినట్లు ఏఎస్సై ప్రకాశ్ శనివారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గాంధారి మండలం తిప్పారం గ్రామానికి చెందిన సోలంకి శంకర్రావు(32) అనే యువకుడు అనారోగ్య కారణాలతో జీవితంపై విరక్తి చెంది నెల 5న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబీకులు సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తండ్రి బాపురావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. బావిలో పడి వృద్ధుడు ..భిక్కనూరు: ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘ టన రాజంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తోటి సిద్ధయ్య (83) అనే వృద్ధుడు ఈ నెల 6న ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలే దు. కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. స్థానిక శివాలయం వద్ద ఉన్న పాడుబడ్డ బావిలో మృతదేహం ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు తెలిపారు. మృతుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అంతర్రాష్ట్ర ఎకై ్సజ్ చెక్పోస్ట్ వద్ద తనిఖీలు
మద్నూర్(జుక్కల్): పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి మద్యం, మత్తు పదార్థాలు రవాణా కాకుండా ఎకై ్సజ్ శాఖ శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. జిల్లా ఎకై ్సజ్ ఈఎస్ ముకుందరెడ్డి ఆదేశాల మేరకు బిచ్కుంద ఎకై ్సజ్ ఎస్సై నాగేశ్ సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. మండలంలోని సలాబత్పూర్ అంతర్రాష్ట్ర ఎకై ్సజ్ చెక్పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించి నమూనాలను సేకరించారు. దాబా హోటళ్లు, రైస్మిల్లులు, గోదాముల్లో తనిఖీలు చేశారు. తనిఖీల్లో ఎకై ్సజ్ సిబ్బంది దేవీసింగ్, వెంకటేశ్, రమేశ్ తదితరులున్నారు. కల్తీ కల్లు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తాం లింగంపేట/బాన్సువాడ రూరల్/మాచారెడ్డి : కల్తీ కల్లు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని ఎల్లారెడ్డి ఎకై ్సజ్ సీఐ షాకీర్ అహ్మద్ హెచ్చరించారు. శనివారం ఆయన లింగంపేట మండలం రాంపూర్, జల్దిపల్లి, కొండాపూర్ గ్రామాల్లోని కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని నాలుగు కల్లు దుకాణాల నుంచి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ల్యాబ్కు పంపించనున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాలు సరఫరా చేసినా, సేవించినా చట్టరీత్యా చర్యలు తప్పవని బాన్సువాడ ఎకై ్సజ్ సీఐ దిలీప్ అన్నారు. శుక్రవారం ఆయన బాన్సువాడలో పలు వాహనాలు, పాడుబడ్డ భవనాలు, గంజాయి సేవించే అనుమానిత ప్రదేశాల్లో సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు.మాచారెడ్డి మండలం నడిమి తండా, మైసమ్మ చెరువు, గజ్యానాయక్ తండా, కాకుల గుట్ట తండాలతో పాటు పాల్వంచ మండలం ఎలుపుగొండ తండాలపై ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాలుగు లీటర్ల నాటు సారా, పులియబెట్టిన పానకాన్ని స్వాధీనం చేసుకొని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎకై ్సజ్ సీఐ సంపత్ కృష్ణారావు మాట్లాడుతూ...ప్రజల ఆరోగ్యాలను నాశనం చేసే నాటు సారాను తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. ఈదాడుల్లో ఎస్సై శ్రీనివాసరావు, సిబ్బంది ఉన్నారు. కల్తీ కల్లు, అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు దోమకొండ: కల్తీకల్లు అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దోమకొండ ఇంచార్జి ఎకై ్సజ్ సీఐ సుందర్సింగ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కల్తీ కల్లు, అక్రమ మద్యం, గంజాయి వంటి నిషేదిత మత్తు పదార్థాల రవాణా, వినియోగం చర్యలు తీసుకుంటామన్నారు. -
పాముకాటుతో ఒకరి మృతి
నిజాంసాగర్: మహమ్మద్నగర్ మండలం గున్కుల్ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 1న పాము కాటుకు గురైన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం వేకువజామున మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గున్కుల్ గ్రామానికి చెందిన చాకలి సాయిలు(35) రోజు మాదిరిగానే భార్య, పిల్లలతో కలిసి నిద్రించాడు. ఈ నెల 1న ఇంట్లో నిద్రించిన సమయంలో అర్ధరాత్రి వేళ సాయిలు చేతికి పాము నాలుగైదు సార్లు కాటు వేసింది. తన పక్కనే నిద్రిస్తున్న కుమారుడికి పాముతాకడంతో నిద్రలేచాడు. అప్పటికే తన పక్కనే ఉన్న పామును చూసిన కుమారుడు తండ్రిని నిద్రలేపాడు. సాయిలు నిద్రలేచి కర్రతో పామును చంపేసి ఊరి చివరన పారేశాడు. ఇంటికొచ్చిన కొద్దిసేపటికి సాయిలు చేతికి పాము కాట్లు ఉండటాన్ని గమనించి కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు వెంటనే చికిత్స నిమిత్తం బాన్సువాడ ఆస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితికి చేరుకున్న సాయిలుకి ఆస్పత్రిలో వెంటిలేటర్పై వైద్యులు చికిత్స అందించారు. అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించడం.. చికిత్సకు సహకరించకపోవడంతో శుక్రవారం రాత్రి సాయిలును కుటుంబీకులు ఇంటికి తీసుకొచ్చారు. శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబం కావడం.. ఇంటి పెద్ద దిక్కును పాముకాటేసి విధి వంచించడంతో మృతుడి భార్య మంజుల, కుమార్తె మానస, కుమారుడు అంజి బోరున విలపించారు. సాయిలు అంత్యక్రియలకు గ్రామస్తులు చందాల రూపంలో డబ్బులు విరాళంగా అందజేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
అంతర్ జిల్లా బైక్ దొంగల ముఠా అరెస్టు
సదాశివనగర్: సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో వివిధ ప్రాంతాల్లో పార్క్ చేసిన అంతర్ జిల్లా బైక్ దొంగల ముఠాను శనివారం మండలంలోని పద్మాజివాడి చౌరస్తా వద్ద అరెస్టు చేసినట్లు సీఐ సంతోష్కుమార్, ఎస్సై పుష్పరాజ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన హన్మంత్ రాజు అనే వ్యక్తి తన బైక్ను గత నెల 24న రాత్రి ఇంటి ఎదుట పార్క్ చేయగా మరుసటి రోజు కనిపించకుండా పోయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ రెండు పోలీస్ ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి దర్యాప్తును ప్రారంభించారు. పద్మాజీవాడి చౌరస్తా వద్ద పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని గమనించి తప్పించుకునేందుకు యత్నించిన ఐదుగురు నిందితులను పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితులు పార్క్ చేసిన బైక్లను దొంగతనాలకు పాల్పడినట్లు నేరం ఒప్పుకున్నారు. నిందితులు ఇమ్రాన్, అద్నా ఖాన్ పార్కింగ్ చేసిన బైక్లను గుర్తించి దొంగిలించేవారు. వాటిని జుబేర్, అయాన్, సచిన్లకు విక్రయించేవారు. వీరు ప్లేట్ నంబర్లను మార్చి వినియోగించేవారు. అందులో భాగంగానే దొంగిలించిన్ ఓ బైక్ను హైదరాబాద్లో విక్రయించేందుకు నిందితులు తీసుకెళ్తుండగా పోలీసులు పద్మాజీవాడి చౌరస్తా వద్ద పట్టుకున్నారు. నిందితుల నుంచి దొంగిలించిన నాలుగు బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన డీఎస్పీ శ్రీనివాస్ రావు, సీఐ సంతోష్కుమార్, ఎస్సైలు పుష్పరాజ్, సిద్ధిఖీ, సిబ్బంది అజహర్, ఫరూక్, ఏఆర్పీసీ శంకర్, సీసీఎస్ బృందం సభ్యులు రవి, గణపతిలను ఎస్పీ అభినందించారు. -
‘ఫుడ్ టెక్నాలజీ’ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
రుద్రూర్: మండలంలోని ఆహార శాస్త్ర సాంకేతిక విజ్ఞాన కళాశాల (కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ)లో 2026–27 విద్యా సంవత్సరానికి బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సులో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల వర్గాలు శనివారం ఒక ప్రకటనలో తెలిపాయి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో కొనసాగుతున్న కళాశాలలో 82 మంది విద్యార్థులకు నాలుగేళ్ల బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. ప్రవేశాలకు సంబంధించిన వివరాలు పీజేటీఏయూ అధికారిక వెబ్సైట్లో తెలుసుకొవచ్చని సూచించారు. 2015లో ప్రారంభమైన కోర్సు ఆహార రంగంలో పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా నాణ్యమైన సాంకేతిక విద్యను అందించాలనే లక్ష్యంతో 2015లో ఫుడ్ టెక్నాలజీ కోర్సును ప్రారంభించారు. న్యూఢిల్లీలోని ఐసీఏఆర్ నుంచి కళాశాలకు ‘ఏ’ గ్రేడ్ గుర్తింపు లభించింది. మారుతున్న ఆహార పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కోర్సు పాఠ్యప్రణాళికను రూపొందించారు. కళాశాలలో ఆధునిక ప్రయోగశాలలు, మౌలిక వసతులు అందుబాటులో ఉండటంతో విద్యార్థులకు సైద్ధాంతిక పరిజ్ఞానంతోపాటు ఆచరణాత్మక నైపుణ్యాలు అందుతున్నాయి. విద్యార్థుల వృత్తిపరమైన ఎదుగుదలతోపాటు వ్యక్తిత్వ వికాసం, టీమ్ వర్క్, కమ్యూనికేషనన్ నైపుణ్యాలను పెంపొందించేలా విద్యాబోధన కొనసాగుతోంది. ఇప్పటికే కోర్సు పూర్తి చేసిన పలువురు విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు సాధించారు. మరికొందరు జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సులు అభ్యసిస్తున్నారు. మెగా జాబ్ మేళాల ద్వారా పలువురు ఫుడ్ టెక్నాలజీ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్ పొందారు. అర్హతలు ఇవీ.. ఇంటర్మీడియెట్లో ఎంపీసీ లేదా బైపీసీ పూర్తి చేసి ఎప్సెట్లో అర్హత సాధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని కళాశాల అసోసియేట్ డీన్ కె వెంకట్రెడ్డి తెలిపారు. ప్రవేశాలు మెరిట్ ఆధారంగానే ఉంటాయని పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర ప్రత్యేక వర్గాలకు చెందిన విద్యార్థులకు నిబంధనల మేరకు కోటా ఉంటుందని తెలిపారు. ఈ నెల 11వ తేదీలోగా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రుద్రూర్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో 82 సీట్లు ఎప్సెట్ అర్హత తప్పని సరి.. మెరిట్ ఆధారంగా ప్రవేశాలు రైతులు, వ్యవసాయ కార్మికుల పిల్లలకు ప్రత్యేక కోటా -
బురద నీటిలో పద్మాసనం
● బల్దియా కౌన్సిలర్ వినూత్న నిరసన ● రోడ్డుమీద వర్షపునీరు నిలుస్తున్నా పాలకులు పట్టించుకోకపోవడంతో..కామారెడ్డి టౌన్: సమస్య పరిష్కారం కోసం కామారెడ్డి బల్దియా కౌన్సిలర్ వినూత్న నిరసన తెలిపారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి పోలీస్స్టేషన్ ఎదుట భారీగా నీరు నిలిచి రాకపోకలు స్తంభిస్తున్నాయి. కొద్దిపాటి వానకే మోకాలు లోతు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని గతంలో మున్సిపల్ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో, విసిగివేసారిన 46వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీనారాయణ పోరుబాట పట్టారు. శనివారం ఉదయం పోలీస్ స్టేషన్ ఎదుట నిలిచిన వర్షపు నీటిలో పద్మాసనం వేసి బైఠాయించారు. కౌన్సిలర్ నిరసనను చూసి అటుగా వెళ్లే వాహనదారులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వర్షపు నీరు నిలువకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కౌన్సిలర్ డిమాండ్ చేశారు. లేదంటే బురదలోనే నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. -
రైతాంగ ప్రయోజనాలను కాపాడుదాం
నిజామాబాద్ అర్బన్ / కామారెడ్డి : నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రైతాంగ ప్రయోజనాలను కాపాడడమే పరమావధి గా అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేద్దామని శాసనసభ్యులు సూచించారు. నిజామాబాద్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శనివా రం ఇన్చార్జి కలెక్టర్ భవేశ్ మిశ్రా అధ్యక్షతన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎ మ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిజామాబాద్ రూరల్, అర్బన్, ఆర్మూర్ ఎమ్మెల్యేలు డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేశ్ రెడ్డి హాజరుకాగా, కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ వర్చువల్ విధా నం ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఎస్సారెస్పీ, నిజాంసాగర్, పోచారం, కౌలాస్నాలా తదితర జలాశయాలలో నీటి నిల్వల స్థితిగతులు, ఆయకట్టుకు సాగు నీటిని అందించే వెసులుబాటు, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక తదితర అంశాలపై చర్చించారు. ఆరుతడిపై అవగాహన కల్పించాలి యాసంగిలో నిర్వహించాల్సిన సమావేశాన్ని ఎల్ని నో ప్రభావంతో ఖరీఫ్ సీజన్లోనే ఏర్పాటు చేసిన ట్లు ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి గుర్తుచేశారు. మున్ముందు వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలున్నందున వరి నాటేసిన రైతులు నష్టపోకుండా అధికారులు చొరవ చూపాలన్నారు. ఇంకా పంట వేసుకోని రైతులు ఆరుతడి పంటలు, కూరగాయలు, ఆయిల్ పామ్ సాగు చేసేలా అవగాహన కల్పించాలని వ్యవసాయ, ఉద్యానవన, నీటిపారుదల, రెవెన్యూ తదితర శాఖల అధికారులకు సూచించారు. తుపాను ప్రభావంతో ఇప్పటి వరకు కొంతవరకు వర్షాలు కురిసినప్పటికీ, ఎల్నినో ప్రభావంతో ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని నిజామాబాద్ ఇన్చార్జి కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద నిజామాబాద్ జిల్లాలో లక్షా 15 వేల ఆయకట్టు ఉందని, జలాశయంలో ప్రస్తుతం 10.78 టీఎంసీల నీరు నిలువ ఉన్నందున మూడు నుంచి నాలుగు తడులు అందించేందుకు అవకాశం ఉందన్నారు. విస్తృతంగా జలసిరి.. నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల తాగునీటి అవసరాలకు ఉపయోగపడుతున్న సింగూర్ రిజర్వాయర్కు మరమ్మతులు చేపడుతున్న నేపథ్యంలో సామర్థ్యం మేరకు నీటిని నిలువ ఉంచే పరిస్థితి లేదని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ప్రస్తుతం నిలువ ఉన్న 4.140 టీఎంసీల నీటిని తాగునీటి సరఫరాకే వినియోగించాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ నీరు 60 నుంచి 90 రోజులకే సరిపోతుందని, ఈ నేపథ్యంలో వర్షాలు కురిస్తే మరో 4 టీఎంసీల వరకు వరద జలాలను సింగూర్లో నిలువ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇలా చేస్తే మూడు జిల్లాలకు వచ్చే ఐదారు నెలల వరకు తాగునీటి సరఫరాకు ఇబ్బంది ఉండదని సూచించారు. భూగర్భ జలాలు గణనీయంగా వృద్ధి చెందేలా జిల్లాలో జలసిరి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నామని తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని కౌలాస్నాలా, పోచారం ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటిమట్టాన్ని సంతరించుకున్నాయని, నిర్దేశిత ఆయకట్టుకు సాగు నీటిని అందించవచ్చని స్పష్టం చేశారు. ఆరుతడి పంటలు, ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించాలి నీటిపారుదల సలహా మండలి సమావేశంలో ప్రభుత్వ సలహాదారు పోచారం, ఎమ్మెల్యేలు వర్చువల్గా పాల్గొన్న కలెక్టర్ సంగ్వాన్ -
‘ముప్పు’తిప్పలు తప్పేదెప్పుడు?
● అధ్వానంగా వృద్ధాశ్రమానికి వెళ్లే దారి ● బురదలో ఇరుక్కుపోయిన నీటి వాహనాలు ● నీళ్లు లేక ఇబ్బందిపడ్డ వృద్ధులుకామారెడ్డి టౌన్ : వయసు మళ్లిన వృద్ధుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారతాయనడానికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఓల్డ్ ఏజ్ హోం పరిస్థితులే ప్రత్యక్ష నిదర్శనం. ఒకవైపు నడవలేని రోడ్లు.. మరోవైపు తాగునీరు లేక అవస్థలు పడుతున్న వృద్ధుల వేదన చూసేవారి కళ్లు చమ్మగిల్లక తప్పదు. హోంకు వెళ్లే రహదారి బురదమయంగా మారడంతో నడవలేని పరిస్థితి నెలకొంది. తీవ్ర అస్వస్థతకు గురైన ఓ వృద్ధురాలిని శనివారం ఆస్పత్రికి తరలించేందుకు వాహనాలు రాలేకపోయాయి. దీంతో చేసేది లేక సిబ్బంది ఆమెను కుర్చీలో కూర్చోబెట్టుకుని, ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని బురద బాటలోనే ప్రధాన రహదారి వరకు మోసుకెళ్లాల్సి వచ్చింది. దీంతో అత్యవసర పరిస్థితి వస్తే వృద్ధుల ప్రాణాలు గాల్లో కలవాల్సిందేనా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వృద్ధాశ్రమాన్ని తీవ్ర నీటి కొరత వేధిస్తోంది. బురదమయంగా మారిన దారిలో మినరల్ వాటర్ సరఫరా చేసే ఆటో, నీటి ట్యాంకర్ రాలేకపోతున్నాయి. బురద బాటలో దిగబడుతున్నాయి. శనివారం వాటర్ ట్యాంకర్తోపాటు మినరల్ వాటర్ ఆటో బురదలో ఇరుక్కుపోయాయి. నీటి సరఫరా లేకపోవడంతో హోం ముందున్న ఖాళీ స్థలంలో నిలిచిన వర్షపు నీటిలోనే వృద్ధులు తిన్న కంచాలు కడుక్కుంటున్న దృశ్యాలు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పట్టాయి. ఈ సమస్యలన్నీ ఒక్క శనివారం రోజునే దర్శనమిచ్చాయి. ఇప్పటికై నా హోంకు వెళ్లే దారిని బాగు చేయాలని పలువురు కోరుతున్నారు. వృద్ధాశ్రమానికి వెళ్లే దారి నరకప్రాయంగా ఉందని మున్సిపల్, ఉన్నతాధికారులకు వి న్నవించినా పట్టించుకోవడం లేదు. మొరం పోయించండని మొర పెట్టుకుంటున్నా పెడచెవిన పెడుతున్నారు. వర్షపు నీటిలో పల్లాలు శుభ్రం చేసుకుంటున్నారు. నేనే నీటిని తెప్పించాను. – సురోజు వనిత, 15వ వార్డు కౌన్సిలర్ -
విద్యుత్నగర్లో భారీ చోరీ
● 16 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.90 వేలు అపహరణ కామారెడ్డి క్రైం: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి విద్యుత్నగర్ కాలనీలో శనివారం భారీ చోరీ ఘటన వెలుగు చూసింది. గాంధారికి చెందిన పబ్బ సురేశ్ విద్యుత్ శాఖలో లైన్ ఇన్స్పెక్టర్గా, అతని భార్య లావణ్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తూ కామారెడ్డిలో నివాసం ఉంటున్నారు. శాఖాపరమైన శిక్షణకు హాజరయ్యేందుకు సురేశ్ మూడు రోజుల క్రితం వరంగల్ వెళ్లా డు. దీంతో అతని భార్యాపిల్లలు సమీప బంధువుల ఇంట్లో ఉన్నారు. శనివారం ఇంటికి వచ్చి చూసేసరికి దొంగలు పడినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంట్లో దాచిన 16 తులాల బంగారం, 30 తులా ల వెండి, రూ.90 వేలు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టా రు. సీసీఎస్, క్లూస్టీం బృందాలు ఆధారా లు సేకరించారు. కాలభైరవుడి సేవలో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి రామారెడ్డి (ఎల్లారెడ్డి) : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్రెడ్డి, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్రెడ్డి శనివారం రామారెడ్డి కాలభైరవుడిని దర్శించుకున్నారు. కామారెడ్డి నుంచి ఆలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. ఆలయానికి మొదటిసారి వచ్చిన ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డికి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ వెంట పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు దామోదర్రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, లింగపురం బాల్రాజ్, బాలకిషన్, శ్రీనివాస్, సతీశ్ తదితరులు ఉన్నారు. 200 సెల్ఫోన్ల రికవరీ ● ఎస్పీ రాజేశ్చంద్ర కామారెడ్డి క్రైం: జిల్లాలో 20 రోజులుగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో బాధితులు పోగొట్టుకున్న, చోరీకి గురైన 200 సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. వాటి విలువ దాదాపు రూ.32 లక్షలు ఉంటుందన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మ్తొతం రూ.1.59 కోట్ల విలువైన 994 సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు. ఫోన్ల రికవరీలో ప్రతి భ కనబరిచిన బృందం సభ్యులను ఎస్పీ అభినందించారు. మళ్లీ దంచికొట్టిన వాన సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. అత్యధికంగా కామారెడ్డి పట్టణంలో 77.8 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డయ్యింది. సదాశివనగర్లో 68.5 మి.మీ.లు, ఎల్పు గొండలో 50 మి. మీ.లు, గాంధారిలో 46.5, బీబీపేటలో 46.3, దోమకొండలో 41.3 తాడ్వాయిలో 38.5, లచ్చాపేటలో 36.8, హసన్పల్లిలో 35.5, ఇసాయిపేటలో 34.8, పిట్లంలో 33.8, బొమ్మన్దేవ్పల్లిలో 32.8, సర్వాపూర్ లో 30.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. -
ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఎల్నినోను ఎదిరించిన వరుణుడు ప్రకృతిని పులకింపజేశాడు. జిల్లా అంతటా సాధారణానికి మించి కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలే కాదు ప్రాజెక్టులకూ జలకళ వచ్చింది. ఇప్పటికే వందలాది చెరువులు అలుగులు పారుతున్నాయి. పోచారం ప్రాజెక్టు, సింగీతం రిజర్వాయర్, కల్యాణి ప్రాజెక్టులకు భారీ వరద రావడంతో అలుగెత్తాయి. నిజాంసాగర్ ప్రాజెక్టుకూ వరద వస్తోంది. దీంతో జిల్లా అంతటా ఖరీఫ్ సాగు పనులు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే జిల్లాలో 5.05 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో 2.70 లక్షల ఎకరాల్లో వరి ఉంది. ఈసారి ఎల్నినో ప్రభావం ఉంటుందని, వరి వేయొద్దని ప్రభుత్వం విస్తృత ప్రచారం నిర్వహించింది. అయితే, జిల్లాలో ఆలస్యంగానైనా కురిసిన భారీ వర్షాలతో రైతులు వరినాట్లు వేస్తూనే ఉన్నారు. 3 లక్షల ఎకరాలు దాటొచ్చని భావిస్తున్నారు. కాగా, జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో అడవి పచ్చబడింది. అడవుల్లో వాగులు ప్రవహిస్తుండటంతో వన్యప్రాణుల దాహార్తి సమస్య తీరింది. రాజంపేట మండలం కొండాపూర్ అడవిలో పారుతున్న వాగు జలపాతాన్ని తలపిస్తోంది. వారం రోజులుగా పరవళ్లు తొక్కుతోంది. ఎత్తుగా ఉన్న రాళ్లపై నుంచి పడుతుండటంతో ఆకట్టుకుంటోంది. తాడ్వాయి మండలం సంతాయిపేట అటవీ ప్రాంతంలో ఉన్న భీమేశ్వర వాగు పొంగి ప్రవహిస్తోంది. ఇక్కడ చెక్డ్యాం పైనుంచి, తర్వాత ఎత్తయిన బండలపై నుంచి వాగు పారుతుండటంతో జలపాతంలా కనబడుతోంది. పోచారం ప్రాజెక్టు నాలుగైదు రోజులుగా ఉప్పొంగుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం 10 టీఎంసీలు దాటింది. నాలుగైదు భారీ వర్షాలు కురిస్తే ప్రాజెక్టు నిండుతుందని భావిస్తున్నారు. అటవీ ప్రాంతంలో ఉన్న సింగీతం రిజర్వాయర్ నుంచి పారుతున్న నీరు ఆకట్టుకుంటోంది. పాల్వంచ వాగు, లొట్టివాగు, ఎడ్లకట్టవాగు, లెండి వాగు, పెద్దవాగు..ఇలా వాగులన్నీ పారుతుండడంతో అంతటా జలకళ సంతరించుకుంది. ఇదే సమయంలో ఖరీఫ్ పంటలతో ఎటు చూసినా పచ్చదనమే కనబడుతోంది. అబ్బురపరుస్తున్న అటవీ అందాలు కరుణించిన వరుణుడు.. పరుగులు తీస్తున్న వాగులు అలుగులు పోస్తున్న చెరువులు, ప్రాజెక్టులు పచ్చదనం పరచుకున్న పొలాలు -
‘విండో’లకు పాలక వర్గాలు
● కామారెడ్డికి శ్రీనివాస్రెడ్డి, తిప్పాపూర్కు భీంరెడ్డి ● 12 మంది చొప్పున డైరెక్టర్లు..సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలో రెండు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పాలక వర్గాలను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కామారెడ్డి విండో చైర్మన్గా చిందాల(గూడెం) శ్రీనివాస్రెడ్డి, డైరెక్టర్లుగా చింతల లక్ష్మీనర్సింలు, కన్కంటి చిన్నసాయిలు, గోవూరి నర్సింహారెడ్డి, జెగ్గ లింగం, తెడ్డు ప్రమీల, నీలం లక్ష్మి, బొంబోతుల కుమార్గౌడ్, హన్మాండ్ల రాజు, కృష్ణాజీగారి ఆనంద్రావ్, పెద్ద పొతన్నగారి రాజేశ్, మామిండ్ల హనుమాండ్లు, లంబాడి రమేశ్లను నియమించారు. భిక్కనూరు మండలం తిప్పాపూర్ విండో చైర్మన్గా తిరుపారి భీంరెడ్డి, డైరెక్టర్లుగా కుంట సుధాకర్రెడ్డి, చంద్రయ్యగారి వరలక్ష్మి, రంగా రవీందర్గౌడ్, మంద రమేశ్, ఉరడి కొమురయ్య, బోయిని యాదగిరి, కొండ మాసయ్య, బర్కం శ్యామల, కోటిగల్ల మధుసూదన్, గంపల వినయ్సాగర్, ఎరుకల కనకవ్వ, బోయిని కోటయ్యలను నియమించారు. ఆరు నెలల పదవీ కాలం లేదా ఎన్నికలు జరిగే వరకు వీరు పదవుల్లో కొనసాగనున్నారు. కాగా నామినేటెడ్ పద్ధతిన నియమించిన పాలక వర్గంలో వైస్ చైర్మన్ పోస్ట్ లేదు. -
‘ఉన్నత స్థాయికి ఎదగాలి’
లింగంపేట: విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థానానికి చేరుకోవాలని జడ్జి సుష్మ సూచించారు. శుక్రవారం ఆమె లింగంపేట కేజీబీవీని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలన్నారు. టీచర్లు అంకిత భావంతో పనిచేసి విద్యార్థుల ఉన్నతికి కృషిచేయాలన్నారు. అనంతరం తరగతి గదులను, పాఠశాలలోని కిచెన్ గది, స్టోర్ రూమ్, పడుకునే గదులను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఆమె వెంట ఎస్సై దీపక్కుమార్, ప్రత్యేకాధికారి వాసంతి, సిబ్బంది ఉన్నారు. -
వినూత్న ప్రాజెక్ట్లను రూపొందించాలి
కామారెడ్డి రూరల్: సమాజానికి ఉపయోగపడే వినూత్న ప్రాజెక్ట్లను రూపొందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విద్యార్థులకు సూచించారు. గర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఎకో సైన్స్ ప్రాజెక్ట్ నమూనా ప్రత్యేక వర్క్షాష్ నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానంతో పర్యావరణ పరిరక్షణకు సమర్థవంతమైన పరిష్కారాలను అభివృద్ధి చేయాలని, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో మల్లికార్జున్, జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి, అటల్ టింకరింగ్ ల్యాబ్ ఇన్చార్జి బాలగంగాధర్, సోహం రోబోటిక్స్ ప్రతినిధులు, భౌతిక, జీవశాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
శిథిలం.. ప్రమాదకరం!
● భారీ వర్షాలకు కూలుతున్న ఇళ్లు ● పాత నిర్మాణాల తొలగింపుపై దృష్టి సారించని బల్దియా ● భయాందోళనల్లో ప్రజలు● వారం రోజుల క్రితం బాన్సువాడ బల్దియా పరిధిలోని ఇస్లాంపురా కాలనీలోని ఓ పురాతన ఇల్లు కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ● ఇటీవల కురిసిన వర్షాలకు జండాగల్లీలో ఓ పాత ఇల్లు మట్టి గోడలు కూలాయి. ● గతేడాది తాడ్కోల్ రోడ్డులోగల ఓ దుకాణ సముదాయ భవనం కూలడంతో కార్మికుడికి తీవ్ర గాయమైంది. ఈ ఘటనలో ఓ బైక్ ధ్వంసం అయ్యింది.బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని పాత భవనాలు శిథిలావస్థకు చేరాయి. వర్షాలకు తడిసి కూలిపోతున్నా బల్దియా అధికారులు మేల్కోవడం లేదు. భారీ వర్షాలు కురిస్తే ఏ సమయంలో ఏ ఇల్లు కూలుతుందోనని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. బాన్సువాడ తాడ్కోల్ చౌరస్తా, పాత బాన్సువాడలో పలు కాలనీలు, ఇస్లాంపురా, గౌలీగూడ, పొచమ్మ గల్లీ, జండాగల్లీ, కోటగల్లీ తదితర ప్రాంతాల్లో పాత భవనాలున్నాయి. వాటిని అధికారులు పరిశీలించి ఒక వేళ ప్రమాదం పొంచి ఉందని భావిస్తే సంబంధిత భవన యజమానులకు నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. పది రోజులలోగా ఆ నోటీసుపై స్పందించకపోతే చివరి నోటీసు జారీ చేసి మరో మూడు రోజుల తర్వాత శిథిలమైన నిర్మాణాలను తొలగించాలి. కానీ శిథిలావస్థకు చేరిన పాత భవనాలను గుర్తించడంలో బల్దియా టౌన్ప్లానింగ్, ఇంజినీరింగ్ సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారన్న విమర్శలున్నాయి. గతంలో మోటారు వైండింగ్ షాప్లో పెచ్చులూడి పడిన ఘటనలో అక్కడ పనిచేస్తున్న వ్యక్తి తలకు తీవ్ర గాయమైంది. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటున్నాయి. పట్టించుకోని అధికారులు.. బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న భవనాలు, వాటి స్థితిగతులు, వాటి జీవిత కాలం ఎన్నేళ్లు అనే అంశాలను టౌన్ప్లానింగ్ విభాగం ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలో శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర పురపాలక ఉన్నతాధికారులు గతంలో ఆదేశాలు జారీ చేసినా సంబంధిత అధికారులు స్పందించడం లేదు. భారీ వర్షాలు కురిస్తే శిథిలావస్థకు చేరిన భవనాలు కూలిపోయి ప్రమాదాలబారిన పడే అవకాశాలున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి క్షేత్ర స్థాయిలో పరిశీలించి, శిథిలావస్థకు చేరిన భవనాలపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.బాన్సువాడ బల్దియా పరిధిలో ఇప్పటివరకు 22 పురాతన ఇళ్లను గుర్తించి, వాటి యజమానులకు నోటీసులు జారీ చేశాం. వారు ఇళ్లను నేలమట్టం చేసుకోవాలి. లేదంటే మున్సిపల్ ఆధ్వర్యంలో కూల్చివేస్తాం. – గంగాధర్, మున్సిపల్ కమిషనర్, బాన్సువాడ -
ఈసారీ నిరాశే!
నిజాంసాగర్ ప్రాజెక్టు హెడ్స్లూయిస్ వద్ద 1954లో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు. ఇంగ్లండ్లో తయారైన మూడు టర్బయిన్లు తీసుకొచ్చి బిగించారు. 1954 ఫిబ్రవరి 23న తొలి యూనిట్ను, 1955 నవంబర్ 28న రెండో యూనిట్ను, తర్వాత కొంతకాలానికే మూడో యూనిట్ను ప్రారంభించారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు అప్పట్లో రూ. 2.27 కోట్లు ఖర్చు చేశారు. ఒక్కో టర్బయిన్ ద్వారా ఐదు మెగావాట్ల చొప్పున రోజుకు 15 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేలా దీనిని నిర్మించారు. 1974 ప్రాంతంలో మూడో టర్బయిన్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దానిని పక్కన పెట్టేశారు. అప్పటినుంచి రెండు టర్బయిన్ల ద్వారా మాత్రమే కరెంటు ఉత్పత్తి అవుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి పంటలకు విడుదల చేసే నీటి ఆధారంగా ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. నీరు పుష్కలంగా ఉండడం, హెడ్ స్లూయిస్ ద్వారా నీటిని విడుదల చేసినన్ని రోజులు జల విద్యుత్ ఉత్పత్తికి మంచి అవకాశాలు ఉంటాయి. రూ.10.76 కోట్ల నిధులు.. నిజాంసాగర్ జల విద్యుత్ కేంద్రం పునరుద్ధరణ, ఆధునికీకరణ (ఆర్ఎండ్ఎం) ప్రాజెక్టుకు 2017లో రూ.10.76 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో కేంద్ర ప్రభుత్వం గ్రాంటుగా 50 శాతం అంటే రూ.5.36 కోట్లు, అలాగే 50 శాతం టీజెన్కో భరించాల్సి ఉంటుంది. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం గురించి ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణకు చెందిన పలువురు ఎంపీలు ప్రస్తావించగా.. కేంద్ర పునరుత్పాదన, ఇంధన శాఖ మంత్రి లోక్సభలో ప్రాజెక్టు వివరాలు వెల్లడించారు. ఆధునికీకరణ పనుల పూర్తికి గడువును 2027 నవంబర్ 10 వరకు పొడగించినట్లు తెలిపారు.జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పునరుద్ధరణ, ఆధునికీకరణ పనులు పూర్తయితేనే విద్యుత్ ఉత్పత్తి మొదలవుతుంది. రెండు యూనిట్లలో ఒక యూనిట్ పనులు జరుగుతున్నాయని, అవి రెండు, మూడు నెలల్లో పూర్తవుతాయని జెన్కో డీఈ రవి కుమార్ తెలిపారు. ఒకటి పూర్తయిన తర్వాత రెండో యూనిట్ పనులు చేపడతామని పేర్కొన్నారు. అయితే నత్తనడకన సాగుతుండడంతో పొడిగించిన గడువులోగా పనులు పూర్తవడం అసాధ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నత్తనడకన నిజాంసాగర్ జల విద్యుదుత్పత్తి కేంద్రం ఆధునికీకరణ నాలుగేళ్లయినా పూర్తి కాని పనులు గడువు పొడిగించిన సర్కారు.. వచ్చే ఏడాదైనా ఉత్పత్తి ప్రారంభమయ్యేనా? -
పంట మార్పిడిని ప్రోత్సహించాలి
కామారెడ్డి టౌన్ : రైతులకు అవగాహన కల్పించి, పంట మార్పిడి విధానాన్ని ప్రోత్సహించాలని మంత్రులు సూచించారు. శుక్రవారం పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎకై ్సజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, వన మహోత్సవం, స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, వ్యవసాయం తదితర అంశాలపై సమీక్షించారు. తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు చేపట్టిన పంట కుంటల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వివరాలను రైతులకు తెలియజేసేందుకు గ్రామీణ స్థాయిలో ’ఇరిగేషన్ అడ్వైజరీ’ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వన మహోత్సవం లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆగస్టు 15న చేపట్టే నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఇరిగేషన్ అడ్వైజరీ సమావేశాలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి నీరజ్, అదనపు కలెక్టర్లు విక్టర్, గిరి, డీఆర్వో పాండు, జెడ్పీ సీఈవో చందర్ నాయక్, డీఆర్డీవో దామోదర్రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, డీఈవో మల్లికార్జున్, జిల్లా వ్యవసాయాధికారి రామ్మోహన్, ఉద్యాన శాఖ అధికారి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.కామారెడ్డి టౌన్: డిస్ట్రిక్ట్ సెన్సస్ హ్యాండ్బుక్ (డీసీహెచ్బీ) తయారీలో భాగంగా క్షేత్రస్థాయి సమాచార సేకరణలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ (డీసీవో) డైరెక్టర్ భారతి హోలికేరి సూచించారు. శుక్రవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. డిస్ట్రిక్ట్ సెన్సస్ హ్యాండ్బుక్ ప్రభుత్వ శాఖలు, ప్రణాళికా రూపకర్తలు, పరిశోధకులకు జిల్లా స్థాయి సమగ్ర వివరాలను అందించే విలువైన ఆధార గ్రంథమన్నారు. జిల్లా అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ పాలసీల రూపకల్పనకు ఈ సమాచారం ఎంతో కీలకమని తెలిపారు. ఈనెల 10 నుంచి సెప్టెంబర్ 8 వరకు నిర్వహించనున్న డీసీహెచ్బీ ఫీల్డ్ వర్క్ను అధికారులు సీరియస్గా తీసుకోవాలని ఆదేశించారు. వీసీలో జిల్లానుంచి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్, డిప్యూటీ కలెక్టర్ రవితేజ, అధికారులు పాల్గొన్నారు. వనమహోత్సవ లక్ష్యాలను పూర్తి చేయాలి వీసీలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు -
పోలీస్ సేవల్లో పారదర్శకత ఉండాలి
●ఎస్పీ రాజేశ్ చంద్ర ●రిసెప్షన్ వర్టికల్ సిబ్బందితో సమీక్ష కామారెడ్డి టౌన్: ప్రజలకు పోలీస్ శాఖ అందించే సేవల్లో వేగం, పారదర్శకత ప్రధానంగా ఉండాలని ఎస్పీ రాజేశ్చంద్ర అన్నారు. పోలీస్ స్టేషన్లలో బాధితులు ఇచ్చే ప్రతి పిటిషన్పై తక్షణమే స్పందించి, ఎలాంటి ఆలస్యం లేకుండా క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్స్ సిస్టం(సీసీటీఎన్ఎస్) పోర్టల్లో నమోదు చేసి వెంటనే రశీదు అందించాలన్నారు. పట్టణంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం రిసెప్షన్ వర్టికల్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలతో సిబ్బంది మర్యాదపూర్వకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. బాధితులకు తొలి పరిచయ వేదిక రిసెప్షన్ వర్టికలేనని, అందుకే ప్రతీ సిబ్బంది సానుకూల ధృక్పథంతో సేవలందించాలని తెలిపారు. సైబర్ నేరాల బారినపడిన బాధితుల ఫిర్యాదులను వెంటనే స్వీకరించి, తగిన మార్గదర్శకత్వం అందించాలన్నారు. అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, సదాశివనగర్ సీఐ సంతోష్ కుమార్, రిసెప్షన్ వర్టికల్ సిబ్బంది పాల్గొన్నారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారు సంజీవులు అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో పలు గ్రామాలకు చెందిన ఏడుగురు బాధితులకు మంజూరైన రూ. 5 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను నాయకులు పంపిణీ చేశారు. నాయకులు షౌకత్అలీ, వెంకట్రెడ్డి, మేకల రాజు, రంజిత్రెడ్డి, సుధాకర్రావు, గైని రాజలింగం, రాజీవ్కుమార్, రాజేశ్వర్రెడ్డి, భీరయ్య, తదితరులు పాల్గొన్నారు. -
అనాథ పిల్లలపై వాత్సల్యం
● తల్లిదండ్రుల సంరక్షణకు దూరమైన పిల్లలకు రక్షణ, పునరావాసం ● ప్రభుత్వ పథకంతో భరోసా ఎల్లారెడ్డిరూరల్: తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను ఆదుకోవాలనే ఉద్దేశంతో మిషన్ వాత్సల్య పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. అనాథ పిల్లల చదువు, పోషణ కోసం ఆర్థికసాయం అందిస్తోంది. వీరికి 18 ఏళ్లు వచ్చేంత వరకు ప్రతీ నెలా రూ.4 వేల ఆర్ధిక సాయం ప్రభుత్వం అందిస్తుంది. ప్రతీ ఆరు నెలలకు ఒకసారి వీటిని నేరుగా బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. ప్రతీ ఏడాది అకౌంట్లోకి రూ.48 వేలు ప్రతీ నెలా రూ.4 వేల చొప్పున ఇవ్వనుండగా.. వీటిని ఆరు నెలలకు ఒకసారి రూ.24 వేల చొప్పున అకౌంట్లలో జమ చేస్తారు. ఏడాదికి రూ.48 వేలు అందుతాయి. వీటిని పిల్లల పోషణ, చదువులకు ఉపయోగించుకోవచ్చు. సీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం అధికారులను, అంగన్వాడీ కార్యకర్త, పర్యవేక్షకురాలు, సీడీపీవోను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పిల్లల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, సంరక్షకుల ఆధార్, రేషన్కార్డు కాపీలు, బ్యాంక్ పాస్ బుక్తో పాటు అవసరమైన పత్రాలు అందించాల్సి ఉంటుంది. 2019లో ప్రారంభం భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ఈ పథకం 2019లో ప్రారంభమైంది. అనాథలు, నిరాశ్రయులు, సంరక్షణ అవసరమైన పిల్లలకు రక్షణ, విద్య, పోషణ, పునరావాసం అందించడం దీని లక్ష్యం. కొవిడ్ 19 కారణంగా తల్లిదండ్రులు లేదా చట్టబద్ధ సంరక్షకులను కోల్పోయిన పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్య పథకాన్ని ప్రారంభించింది. కామారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు తల్లిదండ్రులు లేని 169 మంది మిషన్ వాత్సల్య పథకం ద్వారా ప్రతి నెలా రూ. నాలుగు వేల స్కాలర్షిప్ పొందుతున్నారు. వీరికి 18 ఏళ్లు వచ్చే వరకు ఈ స్కాలర్ షిప్ ప్రభుత్వం వారి ఖాతాల్లో జమచేస్తుంది. తల్లిదండ్రులు లేని అనాథలు మిషన్ వాత్సల్య పథకానికి జిల్లా కేంద్రంలోని ఐసీడీఎస్ కేంద్రంలో దరఖాస్తులు చేసుకోవాలి. వీరికి ప్రభుత్వం ద్వారా నెలకు రూ. 4వేల స్కాలర్ షిప్ అందిస్తుంది. చిన్నారుల వయస్సు 18 ఏళ్లు వచ్చేంత వరకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు. – ప్రసన్న, జిల్లా సంక్షేమ అధికారిణి, కామారెడ్డి -
స్పందించిన పోచారం.. విద్యార్థుల సమస్య పరిష్కారం
బాన్సువాడ : కళాశాలకు బస్సు సౌకర్యం లేక ఇబ్బందిపడుతున్న విద్యార్థుల సమస్యపై ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి స్పందించారు. దీంతో సమస్య పరిష్కారమైంది. వివరాలిలా ఉన్నాయి. పోచారం శ్రీనివాస్రెడ్డి బాన్సువాడ నుంచి తిమ్మాపూర్ వెంకటేశ్వర ఆలయానికి వెళ్తూ మార్గమధ్యలో బీర్కూర్ మండలం కిష్టాపూర్ బస్టాండ్ వద్ద వేచి ఉన్న విద్యార్థులను చూసి ఆగారు. వారితో మాట్లాడగా.. ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలకు డైరెక్ట్ బస్సు సౌకర్యం లేకపోవడంతో బాన్సువాడకు వెళ్లి అక్కడి నుంచి మరో బస్సు ఎక్కి కళాశాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. సమయానికి బస్సులు లేకపోవడంతో తరగతులకు ఆలస్యంగా వెళ్తున్నామని వివరించారు. దీంతో పోచారం వెంటనే బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్తో ఫోన్లో మాట్లాడారు. రోజూ బాన్సువాడ నుంచి బీర్కూర్, తిమ్మాపూర్, బొమ్మన్దేవ్పల్లి చౌరస్తా, దుర్కి మీదుగా ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల వరకు ప్రత్యేక బస్సు నడపాలని సూచించారు. తమ సమస్యపై వెంటనే స్పందించి, తక్షణ పరిష్కరం చూపిన పోచారం శ్రీనివాస్రెడ్డికి విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. నిజాంసాగర్: నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు గడువును ఈనెల 10 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ రాంబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 11, 12 తేదీల్లో దరఖాస్తు పత్రాల్లో తప్పుల సవరణకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కామారెడ్డి అర్బన్: జిల్లా కేంద్రంలో శుక్రవారం జిల్లా స్థాయి యోగాసన చాంపియన్ షిప్ పోటీలు నిర్వహించారు. పోటీలలో 220 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. యోగా ట్రెడిషనల్, ఆర్టిస్టిక్, రిథమిక్ విభాగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఉమారాణి, యోగాసన అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, కార్యదర్శి రఘుకుమార్, యోగాచార్యులు అంజయ్య, జిల్లా యువజన క్రీడల అధికారి వెంకటేశ్వర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షిప్తం..
పాఠశాల తనిఖీ సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని ధర్మారావ్పేట్ ఉన్నత పాఠశాలను శుక్రవారం సర్పంచ్ షేక్ ఉమర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం ప్రార్థన సమయానికి పాఠశాలలో 13 మంది ఉపాధ్యాయులకు గాను ముగ్గురు ఉపాధ్యాయులు మా త్రమే హాజరు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఉపాధ్యాయుడు ప్రార్థన సమయానికి హాజరు కావాలని సూచించారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. దివ్యాంగులు స్వయం ఉపాధి పొందాలి మాచారెడ్డి: దివ్యాంగులు స్వయం ఉపాధిని పొందుతూ సమాజంలో గౌరవంగా జీవించాలనేదే ప్రభుత్వ ధ్యేయమని ఏపీడీ విజయ లక్ష్మీ అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలో సెర్ప్, రెడ్డి ల్యాబ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివ్యంగులకు స్వయం ఉపాధికి సంబందించిన రివాల్వింగ్ ఫండ్ అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ ప్రతి ఒక్క దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం రూ. 25వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. డీపీఎం శ్రీనివాస్, రవీందర్, రెడ్డి ల్యాబ్స్ సిబ్బంది, సీసీ, లబ్ధిదారులు ఉన్నారు. 30వ సారి రక్తదానం ఎల్లారెడ్డిరూరల్: పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెంకటరమణ బీబీపేటలో రక్తదాశిబిరంలో శుక్రవారం 30వ సారి రక్తదానం చేశాడు. వెంకటరమణతో పాటు అతడి ఇద్దరు కుమారులు మూడు నెలలకొక సారి రక్తదానం చేయడం గొప్పవిషయమని శిబిరానికి హాజరైన జిల్లా సివిల్ కోర్టు న్యాయమూర్తి నాగరాణి అన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్గుప్తా తదితరులు హాజరయ్యారు. అనంతరం అతడికి రక్తదాన పత్రాన్ని అందించారు. నేడు పీఆర్టీయూ సర్వసభ్య సమావేశం, ఎన్నికలు కామారెడ్డి అర్బన్: పీఆర్టీయూ టీఎస్ కామారెడ్డి జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం, నూతన కార్యవర్గం ఎన్నికను శనివారం లింగాపూర్ బృందావన్ గార్డెన్లో నిర్వహించనున్నట్టు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అల్లాపూర్ కుశాల్, పుట్ట శ్రీనివాస్రెడ్డి లు ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్రెడ్డి, యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దామోదర్రెడ్డి, భిక్షంగౌడ్ తదితరులు హాజరు కానున్నట్టు, జిల్లాలోని పీఆర్టీయూ ప్రాథమిక సభ్యులందరు హాజరు కావాలని కోరారు. -
వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి
బాన్సువాడ రూరల్/కామారెడ్డి టౌన్/తాడ్వాయి/పిట్లం: వర్షాకాలంలో సీజనల్గా సంభవించే వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హన్మాజీపేట్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డా. ప్రసన్నమీన అన్నారు. శుక్రవారం బోర్లంక్యాంపు తండా గ్రామ పంచాయతీలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని 46, 47వ వార్డుల పరిధిలోని బీసీ హాస్టల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చందనప్రియ వార్డు కాలనీవాసులకు వైద్య పరీక్షలు చేపట్టారు. తాడ్వాయి మండలం బ్రహ్మాజివాడి గ్రామంలో ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఈశిబిరంలో 200మందికి వైద్య పరీక్షలు చేసి మాత్రలు పంపిణీ చేశారు. పిట్లం ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిబిరంలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. దివ్యాంగులకు ఫిజియోథెరపీ పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో దివ్యాంగులకు ఫిజియోథెరపీ నిర్వహించారు.వైద్యురాలు సారిక కేంద్రంలోని దివ్యాంగులకు పరీక్షలు నిర్వహించారు. ఐఈఆర్పీ కమల్ కిషోర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
పెండింగ్ డీఏలను విడుదల చేయాలి
ఎల్లారెడ్డిరూరల్/బాన్సువాడ రూరల్/కామారెడ్డి అర్బన్: ఉద్యోగులకు చెల్లించాల్సిన ఆరు పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అనిల్కుమార్ అన్నారు. శుక్రవారం మత్తమాల జెడ్పీ పాఠశాలలో నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులతో కలిసి నిరసన తెలిపారు. బోర్లం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ యూనియన్ కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యాల సంతోష్ ఉపాధ్యాయులతో కలిసి నల్లరిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పిలుపు మేరకు కామారెడ్డి పట్టణంలోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఎన్సీ ప్రభాకర్, ప్రతినిధులు కిషోర్కుమార్, దానయ్య, వంశీధర్ తదితరులున్నారు. -
మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దు
బాన్సువాడ రూరల్: మండలంలోని శ్రీరాం నారా యణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీకళాశాలలో శుక్రవా రం ఈశ్వరీయ బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ‘నషాముక్త్ భారత్’ నిర్వహించారు. కళాశాల యాంటీ డ్రగ్ కమిటీ భాగస్వామ్యంతో జరిగిన ఈకార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు మాట్లాడు తూ విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని, బంగారు భవిష్యత్ను రూపొందించుకోవాలన్నారు. అనంతరం ప్రిన్సిపల్ డా. గంగాధర్ విద్యార్థులతో నషాముక్త్ ప్రతిజ్ఞ చేయించారు.యాంటీ డ్రగ్ కమిటీ సమన్వయకర్త భగవాన్రెడ్డి, ఐక్యూ ఏసీ వినయ్కుమార్, అటానమీ కోఆర్డినేటర్ విఠల్, కృష్ణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఉద్యోగంలో రాణించాలంటే ఆత్మవిశ్వాసం, వృత్తి నైపుణ్యాలు మెరుగుపర్చుకోవాలని డిగ్రీకళాశాల ప్రిన్సిపల్ డా. గంగాధర్ అన్నారు. శుక్రవారం లాంచ్ గర్ల్స్ అనే ఎన్జీవో సహకారంతో కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రిసోర్స్ పర్సన్ దివ్య విద్యార్థినులకు లాంచ్ గర్ల్స్ కార్యక్రమ దశలను వివరించారు. విమెన్ ఎంపర్మెంట్ సమన్వయకర్త రఫియా యాస్మీన్, ఐక్యు అకాడమిక్ కోఆర్డినేటర్ వినయ్కుమార్, ఎన్సీసీసీటీవో కృష్ణ, అధ్యాపకులు రేఖ, పద్మ, అనిత, విజయ, నిశాత్భాను, ఆఫ్రీన్, విద్యార్థులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
● రెండు బైకులను ఢీకొట్టి.. ● అతివేగంగా వెళ్లి కల్వర్టును ఢీకొని మంటల్లో దగ్ధం ● నలుగురికి తీవ్ర గాయాలు నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలంలో ఓ కారు గురువారం రాత్రి బీభత్సం సృషించింది. రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన అనంతరం కల్వర్టును ఢీ కొనడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. నందిపేట మండల కేంద్రానికి చెందిన అక్తర్ హుస్సేన్, ఆయన భార్య అంజుమ్ సుల్తానా ఒక బైక్పై, ర హీమ్, ఆయన భార్య సమీనా మరోబైక్పై గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో నందిపేట నుంచి ఆర్మూర్కు వెళ్తుండగా విజయనగర్ సమీపంలో ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టింది. దీంతో బైక్లపై ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గా యాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్తర్ హుస్సేన్ ముప్కాల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. రెండు బైక్లను ఢీకొట్టి అతివేగంగా వెళ్లిన కారు చింరాజ్పల్లి శివారు వి ద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో గుత్ప కాలువ కల్వ ర్టును ఢీకొట్టింది. అనంతరం కారులో మంటలు చెలరేగడంతో స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. కారులో ప్ర యాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది. కారు నడిపిన వ్యక్తిని చౌడమ్మ కొండూర్ గ్రామానికి చెందిన దొంతుల గంగాధర్గా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు. -
ఎల్లారెడ్డి అభివృద్ధికి సహకరించండి
● సీఎంను కోరిన ఎమ్మెల్యే మదన్మోహన్రావుఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే మదన్మోహన్రావు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కోరారు. శుక్రవారం ఆయన సీఎం నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి, సమస్యలను విన్నవించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 22వ ప్యాకేజీ పనులకు వెంటనే పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని, ఎల్లారెడ్డిలో ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. బాన్సువాడ –ఉప్పల్వాయి ప్రధాన రహదారిపై సర్వాపూర్ –మొండిసడక్ మధ్య, గాంధారి –తిమ్మాపూర్ మధ్య హైలెవల్ బ్రిడ్జీలను మంజూరు చేయాలని కోరారు. గాంధారి మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని, లింగంపేట, సదాశివనగర్, రామారెడ్డి, గాంధారి మండలాల్లో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణాలకు నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. తన ప్రతిపాదనలను సీఎం సానుకూలంగా పరిశీలించి, నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన అన్ని పనులకు నిధులు విడుదల చేసి, దశలవారీగా అమలు చేస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. -
కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్
ఎల్లారెడ్డి: మండలంలోని వెల్లుట్ల గ్రామంలో కల్తీకల్లు విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ రాజారెడ్డి శుక్రవారం తెలిపారు. వెలుట్ల గ్రామంలో కల్తీ కల్లు విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు ఈగల్ టీం బృందం దాడులు నిర్వహించగా కల్తీ కల్లు విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు. తనిఖీల్లో దుకాణంలో ఉన్న కల్లు విక్రయిస్తున్న సాతెల్లి నాగేశ్వర్ గౌడ్ ను, అదుపులోకి తీసుకోగా వినియోగదారులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన 60 కల్లు సీసాలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ప్రాథమిక విచారణలో కల్లులో అల్ప్రాజోలామ్ మత్తు పదార్థాన్ని కలిపి విక్రయిస్తున్నట్లు వెల్లడైందన్నారు. అదే సమయంలో దుకాణంలో కల్లు సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులకు నిర్వహించిన ప్రాథమిక డ్రగ్ టెస్టులో బెంజోడయాజైపెన్ పాజిటివ్గా తేలిందన్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో సైతం పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందన్నారు. అనంతరం కల్లు విక్రయదారుడితో పాటు లైసెన్స్ హోల్డర్ మాస గౌడ్ ను సైతం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. ఎస్సై–2 సుబ్రహ్మణ్య చారి, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. -
ప్రభుత్వ హాస్టళ్లను వినియోగించుకోవాలి
భిక్కనూరు: విద్యార్థులు ప్రభుత్వ హాస్టళ్లను వినియోగించుకోవాలని జిల్లా బీసీ సంక్షేమాధికారి నరసయ్య అన్నారు. శుక్రవారం ఆయన భిక్కనూరు ప్రభుత్వ హాస్టల్లో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.ప్రతి విద్యార్థికి హా స్టల్లో పౌష్టికాహరంతో పాటు దుప్పట్లు పుస్తకాలు స్టేషనరిని అందజేస్తామన్నారు. కార్యక్రమంలో హస్టల్వార్డెన్ పవన్కుమార్, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భిక్కనూరు: అంతర్జాతీయ క్యాడెట్ క్లాస్ ప్రపంచ సెయిలింగ్ 2026 చాంపియన్ షిప్ పోటిల్లో భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన బాలిక రిశ్విత రజత పతకాన్ని శుక్రవారం సాధించింది. 31 జూలై నుంచి ఆగస్టు ఏడు వరకు ఇటలీలోని ట్రేంటో ప్రావిన్స్లోని టోర్పోలే సుల్గార్ద ప్రాంతంలోని గార్దా సరస్సుపై నిర్వహించిన ప్రపంచ సెయిలింగ్ చాంపియన్షిప్లో రిశ్విత అద్భుత ప్రతిభ కనబరిచి రజత పతకం సాధించింది.రిశ్వితను పలువురు అభినందించారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఫర్టిలైజర్ సేల్స్ యాప్ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏడీఏ సుధామాధురి సూచించారు. శుక్రవారం మండలంలోని కుప్రియాల్ గ్రామంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. డీఏపీ, ఇతర కాంప్లెక్స్ ఎరువులు అన్ని ఒకే యాప్లో బుక్ చేసుకోవడానికి వీలు కల్పించినట్లు తెలిపారు.సర్పంచ్ రాజమణి, ఉప సర్పంచ్ అన్వేష్ గౌడ్, ఏఈవో కల్యాణి, రాజశేఖర్, రైతులు పాల్గొన్నారు. బాన్సువాడ రూరల్: ఆయిల్పామ్ సాగుకు ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ అని కోనాపూర్ క్లస్టర్ ఏఈవో జ్ఞానేశ్వర్ అన్నారు. శుక్రవారం ఆయన క్షేత్రపర్యటనలో భాగంగా సంగోజీపేట్ గ్రామ రైతులకు అవగాహన కల్పించారు. ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తూ వాటికి సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. వరిపంటలో మోగి పురుగు నివారణకు మోనోక్రోటోపోస్ లేదంటే క్లోరో ఫైరీపాస్ మందు పిచికారి చేయాలన్నారు.సర్పంచ్ మంద సంగమేశ్వర్, గ్రామస్తులు ఆకుల చిన్న నారాయణ, జక్క సాయిరాం, ఆరె సాయిరాం, బాలరాజు, గణపతి పాల్గొన్నారు. దోమకొండ: రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు దోమకొండ మండల కేంద్రానికి చెందిన ముత్యంగౌడ్ ఎంపికయ్యారు. ఈ మేరకు కామారెడ్డిలో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో సీనియర్ విభాగంలో ఆయన మూడవ స్థానంలో నిలిచినట్లు జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు రాంరెడ్డి తెలిపారు. దోమకొండ యోగా అసోసియేషన్ సభ్యులు ముత్యంగౌడ్ను అభినందించారు. -
పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధుల నివారణ
కామారెడ్డి టౌన్ : పరిసరాల పరిశుభ్రతతోనే సీజనల్ వ్యాధుల నివారణ సాధ్యమవుతుందని మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు. జిల్లా కేంద్రంలోని 32వ వార్డులో శుక్రవారం నిర్వహించిన ’ఫ్రై డే–డ్రైడే’ కార్యక్రమంలో ఆమె పాల్గొని వీధుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్తూ పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ. నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందన్నారు. మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, కౌన్సిలర్ గ్యార అఖిల, ఏఈ వేణు ప్రసాద్, ఆర్వో గోపాల్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రశాంత్, నాయకులు సత్యం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంటిలో నీటిని నిలువ ఉంచరాదు ఎల్లారెడ్డి: ఇంటి పరిసరాలలో, ఇంటిలో నీటిని నిలువ ఉంచరాదని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ భాగ్యవతి అన్నారు. శుక్రవారం 7వ వార్డులో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. కాలనీలోని పలువురికి అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు.ఇంటి పరిసరాలను సైతం పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎల్లారెడ్డిలో ఫాగింగ్ ఎల్లారెడ్డి: పట్టణంలో దోమలు వృద్ధి చెందకుండా అన్ని కాలనీలలో మున్సిపల్ సిబ్బంది శుక్రవారం రాత్రి ఫాగింగ్ చేశారు. దోమల నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ తెలిపారు. విదేశీ కలుపు మొక్కల నిర్మూలన సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంతో పాటు ధర్మారావ్పేట్, కుప్రియాల్ గ్రామాల్లో శుక్రవారం ఈకో ఫాన్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సే వా సంస్థ సహకారంతో విదేశీ ఆక్రమణ కలుపు మొ క్కల నిర్మూలన కార్యక్రమంపై అవగాహన కల్పించారు. గ్రామ పరిసరాల్లో పెరిగిన విదేశీ ఆక్రమణ కలుపు మొక్కలను గ్రామస్తులు పారా లీగల్ వలంటీర్లు, ఈకో ఫాన్ సొసైటీ సభ్యులు తొలగించారు. ఈ కార్యక్రమంలో ఈకో పాన్ సొసైటీ ప్రతినిధులు మెట్టు సాయి సంపత్, తలారి విక్రమ్, జిల్లా న్యాయ సేవా సంస్థ పారా లీగల్ వాలంటీర్లు అబ్దుల్ లతీప్, స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
పోచారం నీటి విడుదల
నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్టునుంచి శుక్రవారం నీటి విడుదలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రాజెక్ట్ గేట్లను పైకెత్తి ప్రధాన కాలువలోకి నీటిని వదిలారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఎస్ఈ యశస్వి మాట్లాడుతూ ఖరీఫ్ పంటల సాగు కోసం నాలుగు విడతల్లో ఆయకట్టుకు నీరందిస్తామన్నారు. వరుసగా 15 రోజులపాటు నీటిని విడుదల చేస్తామని, తర్వాతి 10 రోజులు నిలిపివేస్తామని పేర్కొన్నారు. ఇలా నాలుగు విడతల్లో నీటిని విడుదల చేస్తామన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రాజెక్టులో నీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ప్రాజెక్టు అభివృద్ధికి రూ. 5.18 కోట్లు.. పోచారం ప్రాజెక్టు ప్రధాన కాలువ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇటీవల రూ. 5.18 కోట్ల నిధులను మంజూరు చేసిందని ఇరిగేషన్ ఎస్ఈ యశస్వి తెలిపారు. ప్రాజెక్ట్ నుంచి నీటిని విడుదల చేసిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టు కుడివైపు గల వంతెన వద్ద రిటెయినింగ్ వాల్ నిర్మాణానికి రూ. 1.24 కోట్లు, ప్రాజెక్ట్ అలుగుపై మైనర్ రిపేర్ల కోసం రూ.2.34 కోట్లు మంజూరయ్యాయన్నారు. దీంతోపాటు ఎల్లారెడ్డి మండలంలోని అడ్విలింగాల వద్ద పోచారం ప్రధాన కాలువ సైడ్ వాల్స్ నిర్మాణానికి రూ.1.60 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభమయ్యేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఏఎంసీ చైర్పర్సన్ రజితరెడ్డి, ఇరిగేషన్ డీఈఈ కిష్టయ్య, ఏఈ అక్షయ్ కుమార్, తాండూర్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మురళీమోహన్ గౌడ్, పోచారం, నాగిరెడ్డిపేట సర్పంచులు సంజీవరావు, వెంకట్, నాయకులు రాంచందర్రెడ్డి, వెంకట్రాంరెడ్డి, విక్రాంత్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, కిష్టయ్య, కిరణ్ కుమార్, శ్రీరాంగౌడ్, సురేందర్ గౌడ్, సాయాగౌడ్, మహేష్రెడ్డి, కిషన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీబీపేటలో రక్తదాన శిబిరం
● తలసేమియా బాధితుల కోసం 98 యూనిట్ల రక్తం సేకరణ బీబీపేట: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం శుక్రవారం మండల కేంద్రంలోని వాసవి క్లబ్, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవీఎఫ్), కామారెడ్డి రక్తదాతల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి జిల్లా సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి నాగరాణి, ఐవీఎఫ్ జాతీయ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాలు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. చిన్నారుల ప్రాణాల కోసం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. రక్తదాతలకు ప్రశంసపత్రాలను అందజేశారు. వైస్ గవర్నర్ బాశెట్టి నాగేశ్వర్, ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, సర్పంచ్ ఉప్పల సాద్విక సాయి, వాసవి క్లబ్ అధ్యక్షుడు మురికి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి, శ్రీ నివాస్, నాగభూషణం, యాదగిరి, జమీల్ అహ్మద్, డాక్టర్ అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ వారియర్స్
● డిజిటల్ మోసాలకు గురైన బాధితులపై ప్రత్యేక శ్రద్ధ ● జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఏర్పాటుఎల్లారెడ్డిరూరల్: డిజిటల్ మోసాలకు గురైన బాధితులకు సైబర్వారియర్స్ అండగా నిలుస్తున్నారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారికి సైబర్ కంప్లయిట్ టోల్ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయించి, తర్వాత పనులన్ని పూర్తి చేయిస్తూ వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. 22 పోలీస్స్టేషన్లలో ... జిల్లాలో కామారెడ్డి రూరల్, బాన్సువాడ రూరల్, ఎల్లారెడ్డి, బిచ్కుంద, భిక్కనూర్, సదాశివనగర్లలో ఆరు పోలీస్ సర్కిల్స్ ఉన్నాయి. వీటి పరిధిలో 22 పోలీస్స్టేషన్లు ఉన్నాయి. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కానిస్టేబుల్ను సైబర్ వారియర్గా ఎంపిక చేశారు. సైబర్ నేరాలకు సంబంధించిన కేసులపై వీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బాధితులకు సహకారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నారు. కేసు పర్యవేక్షణ సీఐల పరిధిలోనే.. సైబర్ బాధితుల కేసులను ఆయా సర్కిల్ పరిధిలోని సీఐలు పర్యవేక్షిస్తారు. సైబర్ వారియర్స్కు వీరు సలహాలు అందించి డబ్బులు రికవరి అయ్యేలా చూస్తారు. దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయని బాధితులతో పాటు పోలీసులు తెలిపారు.సైబర్ వారియర్స్తో మంచి ఫలితాలు వస్తున్నాయి. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ వారియర్స్ విధులు నిర్వహిస్తున్నారు. వీరికి పోలీస్ శాఖ ప్రత్యేక శిక్షణను ఇవ్వడంతో పాటు ప్రజలు సైబర్ మోసాలకు గురి కాకుండా అవగాహన కల్పిస్తారు. సైబర్ మోసానికి గురైన వారు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేసేందుకు రాగానే ముందు బాధితులతో 1930 నంబరుకు ఫిర్యాదు చేయించడం జరుగుతుంది. బాధితులు పోగొట్టుకున్న డబ్బులు రికవరీ అయ్యేందుకు వీరు తోడ్పాటును అందిస్తున్నారు. – రాజారెడ్డి, సీఐ, ఎల్లారెడ్డిపోలీస్ సిబ్బందికి టెక్నికల్ నాలెడ్జి ట్రైనింగ్ ను పోలీస్ ఉన్నతాధికారులు అందిస్తున్నారు. వీరు ప్రతి గ్రామంలో సైబర్ నేరాలపై జరిగే మోసాలను ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ప్రతి నెలలో 8 కార్యక్రమాలను వీరు నిర్వహించాల్సి ఉంటుంది. సైబర్ నేరస్తులు మాట్లాడే విధానం వారి ఉచ్చులో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తారు. బాధితులు సైబర్ మోసానికి గురైన తీరును తెలుసుకుని వారి బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేయించేందుకు సహకరిస్తారు. దీంతో బాధితులు పొగొట్టుకున్న డబ్బు సైబర్ నేరస్తుల ఖాతాకు వెళ్లకుండా తగిన చర్యలను తీసుకుంటారు. -
బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో నిర్వహించే బోనాల ఉత్సవాలకు రావాలని కోరుతూ ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్, ముత్యాల పోచమ్మ ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పద్మ శ్రీకాంత్, ఆలయ కమిటీ సభ్యులు గురువారం ఎమ్మెల్యే మదన్మోహన్రావుకు ఆహ్వాన పత్రికను అందించారు. ఈనెల 9న ఎల్లారెడ్డిలో నిర్వహించే ముత్యాల పోచమ్మ అమ్మవారి బోనాల పండుగకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నాయకులు వినోద్, తిరుపతి, విద్యాసాగర్, పప్పు వెంకటేశం, ప్యాలాల రాములు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుర్మ సాయిబాబా తదితరులున్నారు. హైమాస్ట్ లైట్ల ప్రారంభం ఎల్లారెడ్డిరూరల్: పట్టణంలోని 1వ వార్డు పరిధిలోని ఎర్రమన్ను కుచ్చ కాలనీలో హైమాస్ట్ లైట్లను మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ప్రారంభించారు. కాలనీలో హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను ఆయన ప్రారంభించారు. వైస్చైర్ పర్సన్ మత్తమాల భాగ్యవతి, కౌన్సిలర్ గాయత్రి, కాంగ్రెస్ నాయకులు తమ్మల శ్యాం, విద్యాసాగర్ తదితరులున్నారు. ఇంటిని మరిపించేలా వసతి గృహాలు ఎల్లారెడ్డి: ఇంటిని తలపించేలా ప్రభుత్వ వసతి గృహాలు ఉన్నాయని మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ అన్నారు. గురువారం పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో చిన్నారులకు ప్లేట్లు, గ్లాసులు, నోటు బుక్కులు తదితర వస్తువులను పంపిణీ చేశారు. వైస్ చైర్ పర్సన్ మత్తమాల భాగ్యవతి, కౌన్సిలర్ గఫార్, వార్డెన్ శారద తదితరులు పాల్గొన్నారు. మద్నూర్(జుక్కల్): విద్యుత్ సమస్యలను ఎప్పటికప్పుడు ట్రాన్స్కో సిబ్బంది పరిష్కరించాలని బాన్సువాడ ట్రాన్స్కో డీఈ వినోద్ తెలిపారు. మండల కేంద్రంలోని సబ్స్టేషన్లో గురువారం విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. బిచ్కుంద, మద్నూర్, మేనూర్, జుక్కల్ మండలాల పరిధిలో విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను విన్నవించారు. కొత్త విద్యుత్ స్తంభాలు కావాలని, వ్యవసాయ పొలాల్లో పెండింగ్లో ఉన్న విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని వినియోగదారులు కోరారు. కొత్త అగ్రికల్చర్ కనెక్షన్కు రూ. 9,200 చెల్లించాలని, చెల్లించిన వారికి త్వరలో కనెక్షన్ ఇస్తామని డీఈ వినోద్ పేర్కొన్నారు. ట్రాన్స్కో అధికారులు, సిబ్బంది, వినియోగదారులున్నారు. బాన్సువాడ రూరల్: కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతామని యువజన కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మధుసూదన్రెడ్డి(చిన్నా) అన్నారు. గురువారం బాన్సువాడలో ఆయన స్టిక్కర్ల ప్రచార కార్యక్రమం చేపట్టి మాట్లాడారు. నీట్ పేపర్ లీక్ ఘటనను నిరసిస్తూ ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనను కేంద్ర ప్రభుత్వం అణచివేయడానికి అనైతిక చర్యలకు పాల్పడిందని విమర్శించారు. ఘటనకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.యూత్కాంగ్రెస్ బాన్సువాడ నియోజకవర్గ అధ్యక్షులు సయ్యద్ మన్సూర్, తాడ్కోల్ సర్పంచ్ అందె రమేష్, షోయబ్, గౌస్, ప్రశాంత్, లక్ష్మాగౌడ్, సంతోష్రెడ్డి, అరాఫత్, నవీద్ తదితరులు పాల్గొన్నారు. -
లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని రైతువేదిక భవనం వద్ద గురువారం 78 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు నల్ల మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్పంచ్లు వంకాయల శిరీష, సుబ్బారావు, గణేశ్నాయక్, శ్రీనివాస్ గౌడ్, తహసీల్దార్ సత్యనారాయణ, ఉప సర్పంచ్ ప్రవీణ్కుమార్, పట్టణాధ్యక్షుడు జగ్గ బాల్రాజు, వార్డు సభ్యులు ఆస మంజుల, రాజయ్య, భైరయ్య, నాయకులు ఆస రాజు, దేవరెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
మినీ రేషన్ దుకాణాలు ప్రారంభం
పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని మండంలోని తలాబ్ తండా,టికారం తండా, బేగంపూర్ గ్రామల్లో గురువారం నూతన మినీ చౌకధర(రేషన్) దుకాణాలు ప్రారంభమయ్యాయి. జూలై 7న ‘ప్రజా పంపిణీ అవస్థ’ అనే శీర్షికన కథనం ప్రచురితమైంది.ఈ కథనంపై ఉన్నతాధికారులు, స్థానిక తహసీల్దార్ స్పందించి మినీ రేషన్ షాపుల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశారు. తమ గ్రామాలకు చేరువలోనే రేషన్ దుకాణాలు అందుబాటులోకి రావడంతో ప్రజల హర్షం వ్యక్తం చేశారు. తహసీల్దార్ రాజశేఖర్కు తమ సమస్యను వెలుగుతోకి తెచ్చిన సాక్షి దినపత్రికకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. -
క్రైం కార్నర్
కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్ తాడ్వాయి(ఎల్లారెడ్డి): కల్తీ కల్లు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సదాశివనగర్ సీఐ సంతోష్కుమార్ తెలిపారు. తాడ్వాయి పోలీసు స్టేషన్లో గురువారం ఆయన వివరాలు వెల్లడించారు. ఈనెల 5న పోలీస్ స్టేషన్ పరిధిలోని కరడ్పల్లిలో ఓ కల్లు దుకాణంపై ఎస్సై నరేష్ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కల్లు విక్రేత సీతూరి గౌండ్ల పోచగౌడ్ (50)ను అదుపులోకి తీసుకుని దుకాణాన్ని పరిశీలించగా, వినియోగదారులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన 60 కల్లు సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో కల్లులో అల్ప్రాజోలామ్ అనే నిషేదిత పదార్థాన్ని కలిపి విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. అదే సమయంలో దుకాణంలో కల్లు సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులకు నిర్వహించిన ప్రాథమిక డ్రగ్ టెస్టులో బెంజోడయాజైపెన్ పాజిటివ్గా తేలింది. అనంతరం వారికి ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో కూడా పాజిటివ్ వచ్చిందన్నారు. దీంతో కల్లు దుకాణ నిర్వాహకుడు కొండాపురం స్వామిగౌడ్ (36)ను గురువారం అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ కేసులో 60 కల్లు సీసాలు, రెండు మొబైల్ ఫోన్లతో పాటు ఇతర ఆధారాలను స్వాధీనం చేసుకొని నిందితులను కోర్టులో హాజరుపరుస్తామన్నారు. కల్లు దుకాణం నిర్వాహకుడిపై కేసు ఎల్లారెడ్డిరూరల్: మండలంలోని వెల్లుట్ల గ్రామంలోగల కల్లు దుకాణం నిర్వాహకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై–2 సుబ్రహ్మణ్యచారి గురువారం తెలిపారు. వెల్లుట్ల గ్రామానికి చెందిన సాతెల్లి నాగేశ్వర్గౌడ్ కల్లు దుకాణంలో నిషేధిత మత్తు పదార్థాలు కల్లులో కలిపి విక్రయిస్తున్నాడన్న సమాచారం రావడంతో ఈగల్ టీంతో కలిసి పోలీసులు దాడులు నిర్వహించారు. కల్లులో నిషేధిత మత్తు పదార్థాలు కలపడంతో నాగేశ్వర్గౌడ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఒకరిపై పీడీ యాక్టు.. కామారెడ్డి క్రైం: బెదిరింపులు, బలవంతపు వసూళ్లు, దోపిడీలకు పాల్పడుతున్న ఓ రౌడీషీటర్పై పీడీ యాక్టు నమోదు చేస్తూ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా.. సదాశివనగర్ మండలం వజ్జేపల్లి గ్రామానికి చెందిన కాట్యాడ బాపూరావు అనే వ్యక్తి గతంలో పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల దేవునిపల్లి పీఎస్లో మరో దోపిడీ కేసు, గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దోపిడీ, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించిన రెండు కేసుల్లోనూ అతడు కీలక నిందితుడు. ప్రజలను బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం, జర్నలిస్టు పేరుతో భయాందోళనలు సృష్టించడం, దోపిడీలకు పాల్పడటం లాంటి చర్యలతో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగించినందుకు గాను అతడిపై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర ఒక ప్రకటనలో తె లిపారు. ప్రస్తుతం నిందితుడు నిజామాబాద్ సెంట్రల్ జై లులో రిమాండ్లో ఉన్నాడు. అక్కడకు వెళ్లి రూరల్ సీఐ శ్రీధర్ గౌడ్ నిందితుడికి ఉత్తర్వులను అందజేశారు. -
సంక్షిప్తం
కారోబార్లకు ప్రత్యేక హోదాపై మంత్రి హామీ కామారెడ్డి అర్బన్: గ్రామ పంచాయతీల్లో కొన్నేళ్లుగా సేవలు అందిస్తున్న కారోబార్లకు ప్రత్యేక హోదా ఇవ్వడానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అనసూయ హామీ ఇచ్చిందని కారోబార్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.దుర్గాగౌడ్, పిల్లి యాదగిరిలు తెలిపారు. గురువారం అసోసియేషన్ ఆధ్వర్యంలో సచివాలయంలో మంత్రిని కారోబార్లు కలిసి మాట్లాడారు. జీవో 51 నుంచి మినహాయింపు అంశంపై కమిషనర్తో మంత్రి చర్చించినట్టు వారు పేర్కొన్నారు. ప్రతినిధులు ప్రభాకర్, నామల శంకర్ తదితరులున్నారు. వ్యవసాయశాఖ మంత్రిని కలిసిన భిక్కనూరు నేతలు భిక్కనూరు: రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును భిక్కనూరు మండల కాంగ్రెస్ నేతలు గురువారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, గ్రంథాలయసంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి, పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్రెడ్డి, కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు బీంరెడ్డి నేత గూడెం శ్రీనివాస్రెడ్డిలు ఉన్నారు. వివాహ ఆహ్వానపత్రిక అందజేత మాచారెడ్డి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మాచారెడ్డి మాజీ జెడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి కూతురు వివాహ ఆహ్వాన పత్రికను మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్తో కలిసి గురువారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో అందజేశారు. వారి వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్, నాయకులు అంజీ నాయక్,బాల్ చంద్రం,రాజాగౌడ్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. నాగిరెడ్డిపేట హౌసింగ్ ఏఈగా స్వర్ణలత నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట మండల హౌసింగ్ ఏఈగా స్వర్ణలత నియమించబడ్డారు. నాగిరెడ్డిపేట మండలం హౌసింగ్ ఇన్చార్జి ఏఈగా రాజంపేట మండల హౌసింగ్ ఏఈ మహేశ్ వ్యవహరించారు. ఏఈ మహశ్కు కామారెడ్డి హౌసింగ్ డీఈఈ ఇన్చార్జి బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు గాంధారి హౌసింగ్ ఏఈ స్వర్ణలతను నాగిరెడ్డిపేట మండలానికి బదిలీ చేశారు. సీసీ రోడ్డు పనులు ప్రారంభం దోమకొండ: మండల కేంద్రంలోని దుర్గమ్మ గుడి నుంచి సంఘమేశ్వ్ర్ రోడ్డు పానాది వరకు గురువారం సీసీ రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ ఐరేని నర్సయ్య ప్రారంభించారు. ఆదివారం దుర్గమ్మ ఆలయానికి పెద్ద ఎత్తున బోనాలు ఉంటాయని, జీపీ నిధులు రూ.2 లక్షలతో సీసీ రోడ్డు పనులు చేపట్టినట్లు వివరించారు. ఉపసర్పంచ్ శ్రీనివాస్, వార్డుసభ్యులు, తదితరులున్నారు. ఫెర్టిలైజర్ యాప్తో రైతులకు ఇబ్బందులు రాజంపేట (భిక్కనూరు): ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్ యాప్తో రైతులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని రాజంపేట మాజీ ఎంపీటీసీ సభ్యుడు విండో వైస్ చైర్మన్ అంద్యాల రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఆయన రాజంపేటలో విలేకరులతో మాట్లాడుతూ సర్వర్ లోపాలు సాంకేతిక సమస్యలతో రైతులు సకాలంలో సేవలను పొందలేకపోతున్నారన్నారు. ఇస్కాన్ జిల్లా స్థాయి వ్యాసరచన, ఫొటో,వీడియోగ్రఫీ పోటీలు కామారెడ్డి అర్బన్: శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకుని ఇస్కాన్ కామారెడ్డి కేంద్రం ఆధ్వర్యం లో ఈనెల 15న విద్యార్థులకు జిల్లాస్థాయి వ్యాసరచన, ఫొటో, వీడియోగ్రఫీ, హరేకృష్ణ, చాలెంజ్ టెస్ట్లు నిర్వహించనున్నట్టు ఇస్కాన్ కామారెడ్డి కేంద్రం ప్రతినిధి వెంకటదాస్ ప్రభు ఒక ప్రకటనలో తెలిపారు. ఏఐతో ప్రయోజనాలు, దుష్ప్రయోజనాలు అంశంపై వ్యాసరచన (ఇంటర్,డిగ్రీ, పీజీ విద్యార్థులకు), ఆధునిక యువతకు ఆధ్యాత్మిక జీవనం అవశ్యకత అంశంపై తక్కువ నిడివిగల జన్మాష్టమి వీడియోలు రూపొందించుట, జన్మాష్టమి షార్ట్స్ (అన్ని వయస్సుల వారికి) తదితర పోటీలుంటాయన్నారు. అలాగే చిన్న పిల్లలకు కలరింగ్, డ్రాయింగ్, బొమ్మలు, వ్యాసరచన, ఆధ్యాత్మిక దుస్తుల ప్రదర్శన పోటీలుంటాయన్నారు. విజేతల కు సెప్టెంబర్ 4న నిర్వహించే కార్యక్రమంలో నగదు పురస్కారాలు అంద జేస్తామన్నారు. వివరాలకు 99129 16108 నంబర్లకు సంప్రదించాలని సూచించారు. టాస్క్ ఆధ్వర్యంలో విజేతలకు బహుమతులు కామారెడ్డి అర్బన్: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం (టాస్క్) ఆధ్వర్యంలో కామారెడ్డి కర్షక్ బీఎడ్ కళాశాలలో గురువారం జయశంకర్ సార్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం‘జయశంకర్ సార్ వారసత్వం–నేటి తరం బాధ్యత’ అంశంపై వి ద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు టాస్క్ జిల్లా కన్వీనర్ నీల బాలు బహుమతులు అందజేశారు. ప్రతినిధులు చంద్రశేఖర్, సుధాకర్, వెంకటేశ్వర్లు, నరేందర్గౌడ్, అధ్యాపకులు విజయరామరాజు, దేవేందర్,కిషన్, భీమాగౌడ్, ప్రశాంత్ తదితరులున్నారు. కామా రెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆచార్య జయశంకర్ జయంతితో పాటు లాంచ్ గర్ల్స్ ఫౌండేషన్ ఉపాధి నైపుణ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఫౌండేషన్ సమన్వయకర్త దివ్య కెరీయర్ ప్రణాళిక, ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం అంశాలపై అవగాహన కల్పించారు. కాంగ్రెస్ హయాంలోనే కాచాపూర్ విండో విలీనం భిక్కనూరు : మండలంలోని కాచాపూర్ సింగిల్ విండోను బస్వాపూర్ విండోలో 2005లో కాంగ్రెస్ హయాంలోనే విలీనం చేశారని బస్వాపూర్ విండో చైర్మన్ మద్ది స్వామి అన్నారు. గురువారం బస్వాపూర్ సింగిల్విండో కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్ 2023 మే5న ఈ విలీనంను రద్దు చేసి తిరిగి కాచాపూర్ విండో ను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ను కోరాడన్నారు.దీంతో ప్రభుత్వం 2023 జూన్ 8న బస్వాపూర్ సింగిల్విండో నుంచి కాచాపూర్ విండోను వేరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసిందన్నారు. ఈ ఉత్తర్వులను అప్పటి జిల్లా సహకారశాఖాధికారి అమలు చేయలేదన్నారు. ఉపసర్పంచ్ కార్తిక్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు బుర్రిగోపాల్, కర్నల మల్లేషం, మల్లారెడ్డి, ఉదయశర్మ, భిక్షపతి, సిద్దరాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోడిచిర కార్యదర్శిపై ఫిర్యాదు మద్నూర్: కోడిచిర గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పంచాయతీకి చెందిన నిధులు సొంతం కోసం వాడుకుంటు నిధులు దు ర్వినియోగం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గ్రామస్తులు కలెక్టర్, పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేసి వారం రోజులు గడుస్తున్న విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు. గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించాలి బీబీపేట: మాందాపూర్ గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ గురువారం సర్పంచ్ హరీష్ యాదవ్ అధ్వర్యంలో గురువారం ప్రభుత్వ సలహాదారు మహ్మద్ ఆలీ షబ్బీర్ మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామంలో సీసీ రోడ్లు, పలు అభివృద్ధి పనులపై వినతిపత్రం ఇచ్చారు. ఉప సర్పంచ్ సంతోష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాకేష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, వార్డు సభ్యులు లింగారెడ్డి, నక్క రవీందర్, శ్రీకాంత్ రెడ్డి, నర్సింలు, మాధవరెడ్డి, బాబు, రాజు తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం నిజాంసాగర్/లింగంపేట/భిక్కనూరు/ఎల్లారెడ్డి/బాన్సువాడ రూరల్: తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరమని తల్లిపాలకు తగిన ప్రాముఖ్యత ఇవ్వాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజేశ్వరి పేర్కొన్నారు. గురువారం నిజాంసాగర్ మండలం ఒడ్డేపల్లి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లి పాల వారోత్సవాల కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సర్పంచ్ బొజ్జ అంజయ్య, అంగన్వాడి టీచర్లు శోభ, విజయలక్ష్మి, స్వరూప,రేఖ తదితరులు ఉన్నారు. లింగంపేట పీహెచ్సీలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో వైద్యురాలు హిమబిందు, భిక్కనూరు అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో సర్పంచ్ బల్యాల రేఖ సుదర్శన్ మాట్లాడారు. ఎల్లారెడ్డిలో బాలింతలకు తల్లి పాల ప్రాముఖ్యతను అంగన్వాడీ టీచర్లు వివరించారు. బాన్సువాడ మండలం తాడ్కోల్ లో సూపర్వైజర్ సౌభాగ్య, సర్పంచ్ అందె రమేశ్ మాట్లాడారు. కరపత్రాల పంపిణీ పిట్లం(జుక్కల్): మండల కేంద్రంలో హిందూ ధర్మ జాగృతి సభ్యులు గురువారం హిందూ ధర్మ జాగృతి మహాసభకు ఆహ్వాన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహాదేవ స్వామీజీ మాట్లాడుతూ ఆదివారం బాన్సువాడలో ఈమహాసభ జరుగుతుందన్నారు. గురుకులంలో సమస్యలు పరిష్కరించాలి కామారెడ్డి టౌన్ : భిక్కనూరు గురుకుల రెసిడెన్షియల్ బాయ్స్ హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. ఈమేరకు గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో ఆఫీస్ ఇన్చార్జికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు సరైన బాత్రూమ్ వసతులు లేక, నిరంతరం కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జహీరాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి, మెదక్ జిల్లా అధ్యక్షుడు గరుగుల శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు సల్లూరి శ్రీనివాస్, కామారెడ్డి జిల్లా కో–కన్వీనర్ కొత్తపల్లి సాయిలు తదితరులు పాల్గొన్నారు. -
మైనర్లు వాహనాలు నడుపొద్దు
ఎల్లారెడ్డి : మైనర్లు వాహనాలు నడిపితే వారితో పాటు తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని ఎల్లారెడ్డి సీఐ రాజారెడ్డి అన్నారు. గురువారం ఎల్లారెడ్డిలో వాహనాలు నడుపుతున్న మైనర్లకు ఆయన కౌన్సిలింగ్ చేశారు. సీఐ మాట్లాడుతూ మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వవొద్దని సూచించారు. స్పెషల్ డ్రైవ్ లో పట్టుబడిన మైనర్లకు మొదటి విడత తప్పుగా భావించి వదిలి పెడుతున్నామన్నారు. మైనర్లు వాహనాలు నడుపొద్దని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై 2 సుబ్రహ్మణ్యచారి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వ్యసన రహిత సమాజమే లక్ష్యం
కామారెడ్డి అర్బన్: నషా ముక్త్ భారత్ ఉద్యమంలో భాగంగా ప్రతి ఒక్కరూ కనీసం ఐదుగురిని మత్తుకు దూరంగా ఉండేలా చైతన్యం చేయాలని ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం కామారెడ్డి ఇన్చార్జి జయదీది అన్నారు. మిషన్ స్పందన్ జాతీయ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తరపున గురువారం కామారెడ్డి జెడ్పీహెచ్ఎస్లో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించడంతో పాటు అవగాహన కల్పించారు. జిల్లా వైద్యాధికారి వెంకట్, బ్రహ్మకుమారీలు అనిల్, మీనాక్షి, సుజాత, సమత, జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. భిక్కనూరులో.. భిక్కనూరు: వ్యసన రహిత సమాజ నిర్మాణమే ప్రజాపిత బ్రహ్మకుమారీ సంస్థ (ఓంశాంతి) లక్ష్యమని బ్రహ్మకుమారీలు జయదీది, గంగాలతలు అన్నారు. గురువారం భిక్కనూరు మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్పాఠశాలలు, సాంఘిక సంక్షేమ గురకుల పాఠశాల, కళాశాలలో వ్యసనాలకు దూరంగా ఉంటామని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. వ్యసనరహిత సమాజం సర్టిఫికెట్లను పాఠశాలలకు అందజేశారు. ప్రిన్సిపాల్ రఘు, ఓంశాంతి ప్రతినిధులు శనిశెట్టి రాజలింగం, గుంటుకు రాజు,కొడిప్యాక అంజనేయులు, తదితరులున్నారు. -
ప్రజావాణి మండలాల్లోనే వింటారు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ప్రభుత్వం మార్పులు తీసుకువస్తోంది. దూర ప్రాంతాల ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో వ్యయప్రయాసాలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో గత మే 4న రెవెన్యూ డివిజన్ స్థాయిలో ప్రజావాణి నిర్వహణకు ఆదేశాలు జారీచేసింది. దాన్ని మరింత విస్తరించే క్రమంలో మండల స్థాయి ప్రజావాణి నిర్వహణకు ఈ నెల 4న జీవో విడుదల చేసింది. స్థానికంగా ఉన్న మండల పరిషత్ కార్యాలయంలో ప్రజలు అధికారులకు తమ సమస్యలు చెప్పుకుంటే సరిపోతుంది. ప్రతీ సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజావాణి నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహణ నోడల్ అధికారిగా ఎంపీడీవో వ్యవహరిస్తారు. జూమ్ ద్వారా పర్యవేక్షించనున్న కలెక్టర్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రతీ సోమవారం ప్రజావాణిలో ఆయా మండలాల అఽధికారులతో జూమ్ ద్వారా మాట్లాడేవారు. కలెక్టరేట్కు వచ్చే ప్రజా సమస్యలపై అధికారులకు గైడ్ చేసేవారు. గత సోమవారం ఓ రైతు సమస్యను జూమ్ కాల్ ద్వారా మాట్లాడి పరిష్కరించారు. ఇప్పుడు అన్ని మండలాల్లో ప్రజావాణి నిర్వహించనున్న నేపథ్యంలో మండల అధికారులంతా అందులో పాల్గొంటారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ జూమ్, వీడియో ద్వారా మండల స్థాయి ప్రజావాణిని పర్యవేక్షించనున్నారు.ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి అప్పటికప్పుడే పరిష్కరించాలి. అలాగే ప్రతీ దరఖాస్తును ప్రజావాణి పోర్టల్లో నమోదు చేసి, దరఖాస్తుదారుడికి రశీదు ఇవ్వాల్సి ఉంటుంది. మండల స్థాయిలో పరిష్కారమయ్యే అన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడంతో ప్రజలు జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి 120 నుంచి 150 వరకు దరఖాస్తులు వస్తున్నాయి.మండల స్థాయి ప్రజావాణికి 23 శాఖల అధికారులు హాజరుకావాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో), తహసీల్దార్, పంచాయతీ, వ్యవసాయ, హార్టికల్చర్, మత్స్యశాఖ, పశుసంవర్ధక, విద్యాశాఖ, వైద్య, మహిళా శిశు సంక్షేమ శాఖ, సాంఘిక సంక్షేమ, గిరిజన, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులతోపాటు డిప్యూటీ తహసీల్దార్, మండల గృహ నిర్మాణ అధికారి/అసిస్టెంట్ ఇంజినీర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ, ఆర్అండ్బీ డీఈ/ఏఈ, ఇరిగేషన్ ఏఈ, గ్రౌండ్ వాటర్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్/బీట్ ఆఫీసర్, విద్యుత్ ఏఈ, మున్సిపల్ కమిషనర్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రతీ సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహణకు ఏర్పాట్లు నోడల్ అధికారిగా ఎంపీడీవో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం -
ఈవీఎం గోదాం తనిఖీ
కామారెడ్డి క్రైం: సాధారణ తనిఖీల్లో భాగంగా కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం సందర్శించారు. గోదాంలోని రికార్డులు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో గిరి, తహసీల్దార్ హిమబిందు, సూపరింటెండెంట్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డిలో ఈనెల 24న మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు మదన్మోహన్రావు ట్రస్టు ప్రతినిధులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మేళా ఉంటుందని పేర్కొన్నారు. 5 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్ గ్రా మంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను పారదర్శకంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ విక్టర్ ఆదేశించారు. గురువారం ఆయన భిక్కనూరు మండలం బస్వాపూర్లో జరుగుతున్న గ్రామ భూముల సర్వే పనులను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్వాపూర్ గ్రామానికి సంబంధించి రికార్డులు లేనందున ప్రభుత్వం రీ సర్వే కార్యక్రమంను చేపట్టిందన్నారు. సర్వే పూర్తయిన తర్వాత రైతులకు వారి భూములకు సంబంధించిన సర్వే పత్రాలను అందజేస్తామన్నారు. తహసీల్దార్ సునీత ,బస్వాపూర్, సర్పంచ్ తుడుం పద్మ, సర్వేయర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ● ఇంటర్ నోడల్ అధికారి సలాం బాన్సువాడ : ప్రభుత్వ జూనియర్ కళాశాల ల్లో బోధించే అధ్యాపకులు నిరంతరం బో ధనా నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని జిల్లా నోడల్ అధికారి సలాం సూచించారు. బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో గురువారం జిల్లా స్థాయి ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం స్పెల్–1 కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివా ళులర్పించి, కళాశాల ప్రాంగణంలో మొక్క లు నాటారు. అనంతరం ఆయన మాట్లా డుతూ మారుతున్న విద్యా విధానాలకు అ నుగుణంగా అధ్యాపకులు సృజనాత్మకతను పెంపొందించుకోవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల డెవలప్మెంట్ కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాస్, విఠల్రెడ్డి, కళాశాల ప్రిన్సి పాళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఫారుక్, ప్రిన్సిపాళ్లు యఖీనొద్దీన్, విజయలక్ష్మి, నారాయణ, యాదా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లా కేంద్రంలో రెండు రోజుల విరామం తర్వాత గురువారం రాత్రి ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. గతేడాది ఆగస్టు చివరి వారంలో కుండపోత వానతో పట్టణం అతలాకుతలమైన విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం అర్ధరాత్రి అతి భారీ వర్షం కురిసింది. గురువారం మళ్లీ వర్షంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎల్లారెడ్డి రూరల్: ఎల్లారెడ్డి ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రెండో విడత అడ్మిషన్ల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రోపానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 6 నుంచి 15వ తేదీలోగా ఆన్లైన్లో నచ్చిన కోర్సును ఎంపిక చేసు కొని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


