breaking news
Kamareddy District Latest News
-
శబరిమల యాత్రకు తక్కువ ఖర్చుతో ఆర్టీసీ సౌకర్యం
● కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్ దోమకొండ: శబరిమల యాత్రకు ఆర్టీసీ తక్కువ ఖర్చుతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్ అన్నారు. మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం ఆయన అయ్యప్ప మాలధారణ భక్తులతో మాట్లాడారు. ఆర్టీసీ నుంచి అయ్యప్ప దీక్షలో ఉన్న వారికి అతి తక్కువ ఖర్చుతో ప్రయాణ సదుపాయం కల్పించినట్లు వివరించారు. ఇట్టి అవకాశంను అయ్యప్ప మాలధారణ భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఛార్జీలు టోల్గేట్ రుసుము కూడా కలిసి ఉంటుందని, గురుస్వామి బస్సు బుక్ చేసినచో వారికి ప్రయాణ చార్జీ మినహాయిస్తామన్నారు. ఒకవేళ ఒకటి కన్న ఎక్కువ బస్సులు బుక్ చేసినచో రెండవ దానికి రోజుకు రూ.300 చొప్పన కమీషన్ ఇస్తామన్నారు. సీటింగ్ కెపాసిటీతో పాటుగా ఒక వంటమనిషి, ఇద్దరు మణికంఠ స్వాములు (10 సంవత్సరాల లోపు వారు) ఒక అటెండరును అనుమతిస్తామన్నారు. డిపో అసిస్టెంట్ మేనేజర్ లింగమూర్తి, అయ్యప్ప స్వాములు బావి శరతచంద్రశర్మ, అయ్యప్ప ఆలయ కమిటి ప్రతినిధులు పాలకుర్తి శేఖర్, వెంకటేశం, వినోద్ ఉన్నారు. -
స్వామియే శరణమయ్యప్పా!
● బాన్సువాడ నుంచి 16 సార్లు శబరిమలకు పాదయాత్ర ● కఠిన నియమ, నిష్టలతో దీక్ష ఆచరణ ● రోజు రోజుకు పెరుగుతున్న భక్తి భావంబాన్సువాడ: స్వామియే శరణం అయ్యప్పా.. అంటూ అయ్యప్ప నామస్మరణతో బాన్సువాడ ప్రాంతం మార్మోగిపోతుంది. ఈ ప్రాంతం అయ్యప్ప మాలధారణతో పాటు హనుమాన్, శివమాల, సరస్వతి దీక్ష, వెంకటేశ్వర స్వామి దీక్ష, భవానిమాత ఇలా రకరకాల మాలధారణలకు విశేష ఆదరణ పొందుతుంది. కార్తీక మాసం నుంచి... కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, మద్నూర్, పిట్లం తదితర ప్రాంతాల్లో అయ్యప్ప దీక్షలు చేపడుతున్నారు. కార్తీకమాసం నుంచి శబరిమలైలో జ్యోతి దర్శనంతో పాటు అయ్యప్ప పడి పూజ వరకు స్వాములు మాల ధరించి నల్ల, కాషాపు దుస్తువుల్లో దర్శనమిస్తున్నారు. ప్రతి ఏటా సుమారు జిల్లాలో 4 వేలకు మందికిపైగా అయ్యప్ప మాలలు వేసుకుంటున్నారు. నియమావళిని పాటిస్తూ.. ప్రతీ ఏటా కన్య స్వాముల సంఖ్య పెరుగుతూ ఉంది. అయ్యప్ప మాల కఠినమైంది. ఖర్చుతో కూడుకున్నది. అయినా కూడా మాలధారుల సంఖ్య తగ్గడం లేదు. ఎముకలు కొరికే చలి ఉన్నా లెక్క చేయకుండా నియమావళిని పాటిస్తూ ఏటా కొత్తవారు దీక్ష స్వీకరిస్తున్నారు. ఒక్క బాన్సువాడ సన్నిధానంలోనే కన్య స్వాములు 40 మందికి మించి ఉన్నారు. 41 రోజుల దీక్షల అనంతరం ఇరుముడితో శబరిమల సన్నిధికి చేరుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. కొందరు గురుస్వాములు ఏళ్ల తరబడి మాలలు వేసుకుని శబరిమలకు వెళ్తున్నారు. చాలా మంది స్వాములు పాదయాత్రగా శబరికి చేరుకుంటారు. గురుస్వామి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో.. బాన్సువాడ అయ్యప్ప ఆలయం నుంచి గురుస్వామి గురువినయ్కుమార్ ఆధ్వర్యంలో 16వ సారి పాదయాత్రగా శబరిమలకు తరలివెళ్లారు. కేరళలో ఉన్న శబరిమలకు ప్రతి రోజూ 20 నుంచి 30 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర 43 రోజులు కొనసాగుతుంది. సు మారు 1,600 కిలోమీటర్లు పాదయాత్ర కొనసాగు తుంది. పాదయాత్రలో 39 పడిపూజలు నిర్వహిస్తా రు. ఈ సారి 225 మంది అయ్యప్ప దీక్ష స్వాములు పాదయాత్రగా వెళ్లారు. ప్రతీసారి సుమారుగా 350 మంది వెళ్లేవారు. ప్రతీ ఏటా బాన్సువాడ, బీర్కూర్, బిచ్కుంద, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి స్వాములు పాదయాత్రగా వెళతారు. బాన్సువాడ అ య్యప్ప స్వాములు సోమవారం తెల్లవారుజామున శ బరిమలకు వెళ్లి దర్శనం పూర్తి చేసుకున్నారు. ఈ పాదయాత్ర తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలోని శబరిమల వరకు కొనసాగుతుంది. ఇళ్లల్లో పడి పూజలు దీక్ష స్వీకరించిన స్వాములు తమ తమ ఇళ్లల్లో పడి పూజలు నిర్వహిస్తారు. తమ కుటుంబాలు బాగుండాలని, కోరికలు నేరవేరాలని గురుస్వాముల ఆధ్వర్యంలో ఇళ్లల్లో పడి వెలిగిస్తారు. పడి పూజల్లో తన్మయత్వంలో ఒకటవ మెట్టు శరణపున్నయ్యప్ప స్వామియే పున్నమయ్యప్ప అంటూ మొదటి మెట్టు నుంచి పద్దెనిమిదవ మెట్టు వరకు పడి వెలిగించి పరవశించిపోతారు. పడి వెలుగుల్లో స్వామి దింతనతోం..అయ్యప్ప దింతనతోం అంటూ పేటతూళ్తి ఆడుతారు. ఈ ఘట్టం ప్రతీ ఒక్కరిని రోమాలు నిక్కబోడిచేలా చేసి భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది. సన్నిధానంలో నిత్యాన్నదానం.. అయా మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములు సన్నిధానం ఏర్పాటు చేసుకుంటారు. ఆయా సన్నిధానాల్లో నిత్యాన్నదానం ఏర్పాటు చేస్తారు. దాతల సహకారంతో వేలాది అయ్యప్ప స్వాములు అన్నదానం చేస్తున్నారు. ఉదయం పాలు, పండ్లు, మధ్యాహ్నం భిక్ష (భోజనం), సాయంత్రం అల్పహార వితరణ చేస్తుంటారు.మాలధారణతో భక్తి భావం పెంపొందుతుంది. ప్రతి స్వామి కార్తీకమాసం వచ్చిందంటే మాల వేయాల్సిందే. 26 ఏళ్లుగా అయ్యప్ప మాలధారణ చేస్తూ ధర్మరక్షణకు పాటుపడుతున్నాం. ఎన్ని అడ్డంకులు వచ్చినా మాల వేయకుండా ఉండలేను. ఈ దీక్షతో భక్తి భావం పెరుగుంది. కన్యస్వాముల సంఖ్య ప్రతీ ఏడాది పెరుగుతోంది. – గుడికొండ లింగం, గురుస్వామి, బీర్కూర్అయ్యప్ప దీక్ష స్వీకరణ పూర్వ జన్మ సుకృతం. ఒక్క సారి దీక్ష చేపట్టిన వ్యక్తి తన ఒంట్లో సత్తా ఉన్నంతవరకు శ బరిమలని దర్శించుకుంటూ నే ఉంటాడు. మాలధారణ దీక్ష వేసుకుని 1,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న శబరిమలకు పాదయాత్రగా వెళతాం. ప్రతి రోజూ 20 నుంచి 30 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర కొనసాగుతుంది. – గురువినయ్కుమార్, పాదయాత్ర గురుస్వామి, బాన్సువాడ -
లారీ బోల్తా
మద్నూర్(జుక్కల్): మండలంలోని సలాబత్పూర్ వద్ద జాతీయ రహదారిపై మంగళవారం వేకువజామున పత్తి లారీ బోల్తా పడింది. ఖమ్మం నుంచి మద్నూర్ మీదుగా రాజస్థాన్కు పత్తి బేళ్ల లోడుతో వెళ్తున్న లారీ సలాబత్పూర్ వద్ద ఎదురుగా వస్తున్న మరో లారీని తప్పించబోయి ప్రమాదవశాత్తు బోల్తా పడిందని డ్రైవర్ గోపాల్ మంగళవారం తెలిపారు. లారీ క్లీనర్ లోకేశ్కు గాయాలు కావడంతో స్థానిక దెగ్లూర్ ఆస్పత్రికి తరలించారు. సిరికొండ: మండలంలోని కొండాపూర్ గ్రామ పరిధిలో ఉన్న రవీందర్గౌడ్ రైస్మిల్లులో 11 టన్నుల రేషన్ బియ్యాన్ని మంగళవారం పట్టుకున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు రైస్ మిల్లుపై దాడి చేయగా మూడు వాహనాల్లో తీసుకొచ్చిన బియ్యాన్ని పట్టుకున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఏఎస్వో రవిరాథోడ్ వచ్చి వివరాలు సేకరిస్తున్నారని ఎస్సై తెలిపారు. -
అమ్మకు అక్షరమాల శిక్షణ
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మంగళవారం మండల సమాఖ్య ఆధ్వర్యంలో మద్నూర్, డోంగ్లీ మండలాల్లోని గ్రామ సంఘాల పాలక వర్గ సభ్యులకు, వీవోఏలకు అమ్మకు అక్షర మాలపై కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. చదువురాని సభ్యుల కోసం ఉల్లాస్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని వారు తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో అక్షర వికాసం, చదువగలం, ఆదాయం పెంచుకుందాం, పోషకాహారం, బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయడం, చట్టాన్ని తెలుసుకుందాం తదితర విషయాలపై మహిళ సంఘాల సభ్యులకు శిక్షణ అందించారు. ఏపీఎం జగదీశ్, మండల సమాఖ్య అధ్యక్షులు రేణుక, తదితరులున్నారు. -
సైన్స్ ఎగ్జిబిషన్ స్థలం పరిశీలన
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని పద్మాజీవాడి శివారులోని స్ప్రింగ్ ఫీల్స్ హైస్కూల్లో ఈ నెల 24, 25 తేదీలలో నిర్వహించే జిల్లా స్థాయి ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్ స్థలాన్ని మంగళవారం డీఈవో రాజు పరిశీలించారు. ఎగ్జిబిషన్కు సంబంధించిన స్టాల్ ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎంఈవో యోసెఫ్, జిల్లా సైన్న్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి, కాంప్లెక్స్ హెచ్ఎం విష్ణువర్ధన్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ వీరభద్రప్ప, డైరెక్టర్లు గోపాల్ రెడ్డి, సీఆర్పీ నందు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి టౌన్: జిల్లాకు చెందిన సఫల ఆర్గానిక్ కంపెనీ సీఈవో, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పైడి ఎల్లారెడ్డి జపాన్లో పర్యటించారు. అక్కడ వ్యాపార, వాణిజ్య సంస్థల సీఈవోల సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకున్న అపార అవకాశాలను సమావేశంలో వివరించినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యటించాలని అక్కడి కంపెనీ ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ మేరకు జపాన్లోని అయిచికి రాష్ట్రంలోని అసెంబ్లీలో చైర్మన్ కుర్చీలో పైడి ఎల్లారెడ్డిని కూర్చోబెట్టి గౌరవించారు. భిక్కనూరు: మండల కేంద్రంలోని కల్లు డిపోలలో మంగళవారం అబ్కారీ శాఖాధికారులు కల్లు శాంపిల్స్ను మంగళవారం సేకరించారు. ఈ సందర్భంగా అబ్కారీ శాఖ సీఐ మధుసూదన్రావు మాట్లాడుతూ.. రెగ్యూలర్ తనిఖీల్లో భాగంగా కల్లు శాంపిల్స్ను సేకరించినట్లు తెలిపారు. ఏడాది కాలంగా భిక్కనూరులో 35 కల్లు శాంపిల్స్ సేకరించి అక్రమంగా అనుమతి లేకుండా ఉన్న 15 కల్లు దుకాణాలను సీజ్ చేసి 1,197 లీటర్ల కల్లును పారబోసి ఐదుగురు వ్యక్తులపై కేసులు కూడా నమోదు చేశామన్నారు. ఎస్సై దీపిక, హెడ్కానిస్టేబుల్ మోహినుద్దిన్, కానిస్టేబుల్ బాల్రాజు, స్వాతి తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులపైనే దేశ భవిష్యత్తు
● ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుపెద్దకొడప్గల్(జుక్కల్): విద్యార్థులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకొని తమ ప్రతిభను ప్రదర్శిస్తూ మందుకెళ్లాలన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు టాయిలెట్స్, జూనియర్ కళాశాల ఏర్పాటుకు ఎమ్మెల్యే కృషి చేయాలని కాంగ్రెస్ నేత నాగిరెడ్డి కోరారు. తహసీల్దార్ అనిల్, ఎంఈవో ప్రవీణ్, ఎంపీడీవో అభినవ్ చందర్, కాంగ్రెస్ నాయకులు మోహన్, శామప్ప పటేల్, తదితరులు పాల్గొన్నారు. మోడల్ స్కూల్ తనిఖీ మద్నూర్(జుక్కల్): విద్యార్థులు ఉన్నత శిఖరాల అధిరోహనలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. మండలంలోని మేనూర్ మోడల్ స్కూల్ను సోమవారం రాత్రి ఎమ్మెల్యే తనిఖీ చేశారు. పాఠశాల క్యాంపస్లోని గదులను తిరిగి పరిశీలించారు. పాఠశాలలో ఏవైన సమస్యలు ఉన్నాయా అని ఉపాధ్యాయులు, విద్యార్థులను అడిగి తెలసుకున్నారు. పాఠశాలలో కిచెన్ షెడ్డు, ప్లే గ్రౌండ్ లేదని, అలాగే పలు సమస్యలున్నాయని ప్రిన్స్పాల్ వెంకట నర్సాగౌడ్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యన్నింటిని పరిష్కరిస్తామని విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామని ఎమ్మెల్యే అన్నారు. రోడ్ల మరమ్మతులకు ప్రతిపాదనలు నిజాంసాగర్ (జుక్కల్); ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అధికారులకు సూచించారు. మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, ఆర్ అండ్బీ శాఖాధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు. -
మౌలిక వసతుల పరిశీలన
కామారెడ్డి రూరల్: క్యాసంపల్లి ఉన్నత పాఠశాలలో మౌలిక వసతులను మంగళవారం జిల్లా స్వచ్ఛ పర్యవేక్షణ కమిటీ సభ్యులు నీలం లింగం పరిశీలించారు. పాఠశాలలో ఉన్న పచ్చదనం, పరిశుభ్రత, టాయిలెట్స్, తాగునీరు, కిచెన్ గార్డెన్, ట్రీ ప్లాంటేషన్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం నరసింహారావు, ఉపాధ్యాయులు సదాశివుడు, శ్రీనివాస్, నర్సింలు, నర్సింలు, సవిత, చంద్రశేఖర్, మహేశ్వర్ గౌడ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.కామారెడ్డి అర్బన్: గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు కవి సమ్మేళనం నిర్వహించనున్నట్టు గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ ఎం.చంద్రకాంత్రెడ్డి తెలిపారు. ఆసక్తిగల జిల్లా కవులు– పుస్తక ప్రాముఖ్యతపై కవితలు చదివి వినిపించాలని చైర్మన్ కోరారు. తెరవే జిల్లా అధ్యక్షుడు గఫూర్ శిక్షక్, రచయిత రుద్రంగి రమేష్లు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. తాడ్వాయి(ఎల్లారెడ్డి): అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ఇళ్ల నిర్మాణ పనులు చురుకుగా కొనసాగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జెడ్పీ సీఈవో చందర్ నాయక్ అన్నారు. ఆయన మంగళవారం తాడ్వాయి మండల పరిషత్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఇళ్లు నిర్మించుకోని వారు ఉంటే లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దశల వారీగా ఇళ్లను నిర్మించుకున్న లబ్ధిదారులకు వారి ఖాతాలో డబ్బులు పడేలా చూడాలన్నారు. ఎంపీడీవో సాజీద్అలీ, సీనియర్ అసిస్టెంట్ హన్మాండ్లు, ఎంపీవో సవిత, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక
కామారెడ్డి అర్బన్: జిల్లా కేంద్రంలో ఎస్జీఎఫ్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి అండర్–14 బాల, బాలికలకు బ్యాడ్మింటన్ పోటీలు మంగళవారం నిర్వహించారు. పోటీల్లో 95 మంది క్రీడాకారులు పాల్గొనగా 10 మంది ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అనంతరం విజేతలకు బంగారు, వెండి పతకాలు అందించినట్లు ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి హీరాలాల్ తెలిపారు. బాలికల విభాగంలో సింధుకు బంగారు పతకం, వేదశ్రీ, అక్షర, తేజస్విని, శివ వేదాన్షి వెండి పతకాలు పొందారు. బాలుర విభాగంలో ఎస్కే జిషాన్ అలీ బంగారు పతకం, నెయాన్, విష్ణువర్ధన్గౌడ్, జైప్రీత్, రుద్రాన్ష్రావు వెండి పతకాలు పొందారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అకాడమీ కోచ్ సందీప్గౌడ్, వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీధర్, సంతోష్, సాయిమౌర్య, సుధాకర్రెడ్డి పాల్గొన్నారు. -
ఇంకెన్నాళ్లు వేచి చూడాలి?
● ఉప్పల్వాయి రైల్వే గేట్తో ఇబ్బందులు ● రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ) నిర్మించాలని డిమాండ్రామారెడ్డి (ఎల్లారెడ్డి): ఉప్పల్వాయి రైల్వే గేట్ వద్ద ప్రయాణికులు చాలా ఏళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నారు. రైలు వచ్చినప్పుడు గేట్ పడటం.. పది నుంచి 30 నిమిషాల పాటు వచ్చిపోయేవారు వేచి ఉండడం చాలా ఏళ్ల నుంచి సర్వసాధారణమైపోయింది. రోజుకు సుమారుగా 50 నుంచి 55 వరకు రైళ్లు ఉప్పల్వాయి రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తుంటాయి. గేటు వేసిన ప్రతిసారి ఈ రోడ్డు మార్గంలో ప్రయాణించేవారు తక్కువలో తక్కువగా అరగంట వరకు వేచి ఉండాల్సిందే. మధ్య మధ్యలో ట్రాక్ రిపేర్ల కారణంగా మూడు రోజులు నాలుగు రోజులు పాటు పూర్తిగా గేట్ బంద్ చేస్తారు. దీంతో తిర్మన్పల్లి, మర్కల్, సదాశివనగర్కు ఎన్హెచ్ –44కు కలిపే రోడ్డుకు వెళ్లేవారు కామారెడ్డి మీదుగా వెళుతుంటారు. ఇలా వెళ్లడం వల్ల 20 నుంచి 25 కిలోమీటర్లు అదనపు దూరం అవుతుంది. ఎన్హెచ్–44 కలిపే రోడ్డు.. రామారెడ్డి నుంచి ఉప్పల్వాయి మీదుగా సదాశివనగర్ ఎన్హెచ్–44 రోడ్డును కలిపే మార్గం ఉప్పల్వాయి రైల్వే ట్రాక్పై నుంచి వెళ్లడంతో ఇటు మాచారెడ్డి సిరిసిల్ల వైపు నుంచి వచ్చేవారు భీంగల్ వైపు నుంచి వచ్చేవారు ట్రాక్ బంద్ ఉన్నప్పుడు, గేట్ పడ్డప్పుడు ఆలస్యం అవుతుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్పందించి ఎంపీ సురేష్ షెట్కార్తో మాట్లాడి రైల్వే బ్రిడ్జిని నిర్మించాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. -
అస్మిత అథ్లెటిక్స్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు
కామారెడ్డి అర్బన్: కేంద్ర క్రీడలు, యువజన శాఖ, స్పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో సోమవారం స్థానిక ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించిన అస్మిత(అచీవింగ్ స్పోర్ట్స్ మైల్స్టోన్ బై ఇన్స్పైరింగ్ విమెన్) అథ్లెటిక్స్ లీగ్–2025–26 విజయవంతమైంది. లీగ్లో జిల్లాలోని క్రీడాకారులు పాల్గొని వివిధ అంశాల్లో ప్రతిభ చూపగా వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు ప్రకటించి పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో జాతీయ, రాష్ట్ర పరిశీలకులు స్వాములు, అశ్విని, జిల్లా క్రీడలు, యువజన అధికారి వెంకటేశ్వరగౌడ్, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.జైపాల్రెడ్డి, కేపీ అనిల్కుమార్, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి హీరాలాల్, ప్రతినిధులు నాగరాజు, దత్రాద్రి, శివాగౌడ్, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కరాటేలో ప్రతిభ కామారెడ్డి రూరల్: నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ పట్టణంలో జరిగిన జేకేఏఐ అసోసియేషన్ నిర్వహించిన అంతరాష్ట్ర షోటఖాన్ కరాటే చాంపియన్షిప్–2025 పోటీలలో పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్(చిన్నమల్లారెడ్డి)కి చెందిన 8 మంది విద్యార్థినులు పాల్గొన్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాయిరెడ్డి తెలిపారు. ఈ పోటీల్లో అందే నిత్యశ్రీ, పాస్కంటి నిహారిక గోల్డ్ మెడల్స్, అలాగే అందే రితిక, రావుల హిమబిందు,పెట్టిగాడి మోక్షజ్ఞ, నస్కంటి మేఘవర్ణ సిల్వర్ మెడల్స్, రెడ్డి సహస్ర పరసబోయిన నిత్య మెరిట్ బహుమతిని సాధించినట్లు వెల్లడించారు. వీరిన ప్రధానోపాధ్యాయుడు సాయి రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు. గ్రంథాలయ వారోత్సవాల్లో విద్యార్థులకు పోటీలు కామారెడ్డి అర్బన్: జిల్లా గ్రంథాలయంలో నిర్వహిస్తున్న 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా సోమవారం విద్యార్థులకు పుస్తక పఠనం, అధ్యయనం, ప్రేరణాత్మక నినాదాలు, సృజనాత్మక పుస్తకం తయారీ అంశాలపై పోటీలు నిర్వహించారు. దేవునిపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్, వాగ్దేవి విద్యాలయం, సరస్వతి విద్యామందిర్, వాసవీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. -
బీర్కూర్లో చోరీ
● 4 తులాల బంగారం, వెండి, నగదు అపహరణ బీర్కూర్: మండల కేంద్రంలో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన గాండ్ల సంజీవ్ అనే వ్యక్తి మోస్రా మండలం చింతకుంటలో బంధువుల శుభాకార్యానికి ఈ నెల 15న కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. సోమవారం ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి, రూరల్ సీఐ తిరుపయ్య ఘటన స్థలాన్ని పరిశీలించారు. బీరువాలో ఉన్న 4 తులాల బంగారం, 12 తులాల వెండి, రూ.2 లక్షల నగదు చోరీకి గురైందని బాధితుడు సంజీవ్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అంబం గ్రామంలో.. బోధన్: ఎడపల్లి మండలం అంబం గ్రామానికి చెందిన ఔసలి వెంకటేశం ఇంట్లో సోమవారం చోరీ జరిగినట్లు ఎస్సై ముత్యాల రమ సోమవారం తెలిపారు. వెంకటేశం తన కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం కామారెడ్డికి వెళ్లారు. దుండగులు రాత్రి ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న నాలుగు గ్రాముల బంగారం, 30 తులాల వెండి, రూ.20 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పేకాడుతున్న 9 మంది అరెస్టు నిజామాబాద్ అర్బన్: నగరంలోని ధర్మపురిహిల్స్లో నిర్వహిస్తున్న పేకాట కేంద్రంపై పోలీసులు సోమవారం దాడి చేశారు. పేకాడుతున్న 9 మందిని అరెస్టు చేసి 8 సెల్ఫోన్లు, 8 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బీబీపేట: ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని తీవ్ర గాయాలపాలైన మహిళ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు బీబీపేట ఎస్సై ప్రభాకర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తుజాల్పూర్ గ్రామానికి చెందిన రంగయ్యగారి ప్రేమలత(63) ఈ నెల 5న కార్తీక పౌర్ణమి సందర్భంగా తులసి చెట్టు వద్ద దీపాలు వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు చీర అంటుకొని ప్రేమలత పూర్తిగా మంటల్లో కాలిపోయింది. కుటుంబీకులు చికిత్స నిమిత్తం హైదరాబాద్కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతురాలి బావ సుధాకర్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ముగిసిన ఖోఖో వన్డే టోర్నమెంట్
నిజామాబాద్నాగారం: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా జూనియర్స్ ఖో–ఖో వన్డే టోర్నమెంట్ను సోమ వారం నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో ని ర్వహించారు. జూనియర్ విభాగంలో బాల, బాలికలకు పోటీలు జరిగాయి. బాలుర జట్టులో విన్నర్గా మైనారిటీ గురుకుల చందూర్, రన్నర్గా ధర్మారం బీసీ గురుకుల జట్టు నిలిచాయి. బాలికల జట్టులో విన్నర్గా కేజీబీవీ బాల్కొండ, రన్నర్గా పల్వంచ జెడ్పీ స్కూల్ నిలిచాయి. ప్రథమ, ద్వితీయస్థానంలో నిలిచిన విజేత జట్ల క్రీడాకారులకు బాలురకు ఈ నెల 19 నుంచి 26 వరకు కామారెడ్డి జిల్లాలోని ఉప్పల్వాయి గురుకుల పాఠశాలలో, బాలికలకు నందిపేట్లోని గీత కాన్వెంట్ స్కూల్లో శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం తుది జట్టును ఎంపిక చేసి ఈ నెల 27 నుంచి 30వరకు సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరువులో నిర్వహించే రాష్ట్రస్థాయి టోర్నీలో పాల్గొననున్నారు. అనంతరం విజేత జట్లకు డీవైఎస్వో పవన్కుమార్, ఒలింపిక్ సంఘం జిల్లా కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఖోఖో అసోసియేషన్ చైర్మన్ బిల్లా అనిల్, అధ్యక్షుడు జీవీ భూమారెడ్డి, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అతీకుల్ల, ట్రెజరర్ నోముల మధుసూదన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి, రాము మోహన్రెడ్డి, సెక్రెటరీ సుజాత, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగేశ్వరరావు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి
నిజామాబాద్అర్బన్: గల్ఫ్ పంపిస్తామని చెప్పి 80 మందిని మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు సోమవారం సీపీ సాయి చైతన్యను కలిసి ఫిర్యాదు చేశారు. జిల్లా కేంద్రానికి చెందిన దుండిగెల భూమేశ్, స్వప్న, అర్గుల భోజారాం కలిసి సుమారు 80 మందిని గల్ఫ్ పంపిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు తెలిపారు. రూ. 4 కోట్ల వసూలు చేసి దుబాయికి తీసుకెళ్లి అక్కడ 30 మందిపై మరోసారి క్రెడిట్ కార్డుల నుంచి లోన్లు తీయించుకొని మోసానికి గురి చేశారని పేర్కొన్నారు. అనంతరం ఉపాధి కల్పించకుండా ఇండియాకు తిరిగి పంపించారన్నారు. దుబాయికి వెళ్లేందుకు వారికి ఇచ్చిన డబ్బులు మా పేరుపై తీసుకున్న క్రెడిట్ కార్డ్ లోన్ కలిపి మొత్తం రూ. పది కోట్ల వరకు నష్టపోయినట్లు బాధితులు పేర్కొన్నారు. అధికారులు వెంటనే వీరిపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలన్నారు. దుబాయిలో ఉన్న దుండిగల భూమేశ్పై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి ఇండియాకు రప్పించాలని బాధితులు వినతిపత్రంలో కోరారు. నిజామాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని శివాలయాల్లో భక్తులు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. కార్కీత మాస చివరి సోమవారం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు తరలివచ్చి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉసిరిదీపాలు, పిండి దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. కంఠేశ్వర ఆలయంలో ఆకాశ దీపోత్సవం తర్వాత 11 కోట్ల వత్తులను కాల్చినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. శంభులింగేశ్వరాలయంలో ఆకాశ దీపారాధన, దీపోత్సవం నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. -
రాష్ట్రస్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలకు ఎంపిక
నిజామాబాద్నాగారం: రాష్ట్రస్థాయి అంతర్ పాఠశాలల స్కూల్ ఫెడరేషన్ క్రీడల్లోని రైఫిల్ షూటింగ్ పోటీలకు ఉమ్మడి జిల్లా బృందం ఖరారైనట్లు ఎస్జీఎఫ్ సెక్రెటరీ నాగమణి తెలిపారు. ఈ ఎంపికలు జిల్లా కేంద్రంలోని గన్ ట్రస్ట్ షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీలో సోమవారం నిర్వహించారు. అండర్–14, 17, 19 బాల, బాలికల ఎంపిక పోటీలు జరిగాయి. ఇందులో 10 మీటర్స్ ఓపెన్ సైట్ రైఫిల్ షూటింగ్, పీప్ సైట్ 10మీటర్స్ రైఫిల్ షూటింగ్ పోటీలు నిర్వహించారు. ఎస్జీఎఫ్ సెక్రెటరీ నాగమణి పర్యవేక్షణలో పీడీ ప్రతిభ, కోచ్ ఇంతేకాబ్ అలం, మేనేజర్ ఎస్కే ముజాహిద్ ఎంపిక ప్రక్రియ చేపట్టారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 18 నుంచి 20 వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో వీరు పాల్గొననున్నారు. -
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి
● కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి ● ప్రజావాణికి 101 ఫిర్యాదులునిజామాబాద్అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 101 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, డీపీవో శ్రీనివాస్, హౌసింగ్ పీడీ పవన్కుమార్కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. మహిళా, శిశు, వయో వృద్ధుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన గోడప్రతులను కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్ బీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఎల్లారెడ్డి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి వైపునకు వస్తున్న ఆర్టీసీ బస్సు హాజీపూర్ వద్ద ప్రయాణికులను దించేందుకు నిలవగా లింగంపేట మండలంలోని ముంబోజిపేట గ్రామానికి చెందిన కాశీరాం(32) అనే వ్యక్తి ముంబోజిపేట నుంచి ఎల్లారెడ్డి వైపునకు బైక్పై వస్తుండగా నిలిచి ఉన్న బస్సును వెనుక నుంచి ఢీకొన్నాడు. అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. బైక్పై ఉన్న మరో వ్యక్తికి సైతం గాయాలయ్యాయి. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డివైడర్ను ఢీకొన్న లారీరెంజల్: మండలంలోని సాటాపూర్ సమీపంలో జాతీయ రహదారి డివైడర్ను సోమవారం తెల్లవారుజామున నిజామాబాద్ నుంచి మహారాష్ట్రలోని ధర్మాబాద్కు వెళ్తున్న లారీ ఢీకొన్నది. రహదారి పక్కనే నీటి గుంత ఉంది. లారీ డివైడర్లో ఇరుక్కుని నిలిచిపోవడంతో ప్రమాదం తప్పింది. -
డ్రంకన్ డ్రైవ్ కేసులో ముగ్గురికి జైలు
ఇందల్వాయి: మద్యం సేవించి వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ ముగ్గురికి మెజిస్ట్రేట్ నూర్జహాన్ ఏడు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఇందల్వాయి ఎస్సై సందీప్ సోమవారం తెలిపారు. మండల కేంద్రానికి చెందిన నాయిని సుమన్, సంఘం శ్రీకాంత్, లింగసాయికుమార్ ఇటీవల డ్రంకన్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడ్డారు. వీరిని కోర్టులో హాజరుపర్చగా జడ్జి ఏడు రోజు జైలు శిక్ష విధించారు. అదేవిధంగా మరో ఇద్దరికి రూ. పదివేల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు. ఒకరికి రూ. పదివేల జరిమానారెంజల్: డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ ఒకరికి జడ్జి రూ. పదివేల జరిమానా విధించినట్లు ఎస్సై చంద్రమోహన్ సోమవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన సుద్ద వీరయ్య ఆదివారం మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పట్టుబడ్డాడు. అతన్ని బోధన్ కోర్టులో హాజరుపర్చగా జడ్జి రూ. పదివేల జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు. ధర్పల్లి: మద్యం మత్తులో డయల్100 ను దుర్వినియోగం చేసిన వ్యక్తికి మెజిస్ట్రేట్ ఏడు రోజుల జైలు శిక్షను విధించినట్లు ధర్పల్లి ఎస్సై కళ్యాణి సోమవారం తెలిపారు. మండలంలోని రేకులపల్లి గ్రామానికి చెందిన గుజ్జుల రాజు ఈనెల 15న మద్యం మత్తులో డయల్–100 కు పలుమార్లు ఫోన్ చేసి అధికారుల సమయాన్ని వృథా చేశాడు. రాజుపై కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ అతనికి ఏడు రోజుల జైలు శిక్షను విధించినట్లు ఎస్సై తెలిపారు. బీబీపేట: మండలంలోని ఓ గ్రామంలో కన్న కుమార్తైపె తండ్రి అసభ్యంగా ప్రవర్తించడంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రభాకర్ తెలిపారు. మండలంలోని ఓ గ్రామంలో తన పన్నెండేళ్ల కుమార్తెతో తండ్రి కొన్ని రోజులుగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. తండ్రి బాధను భరించలేని కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిజాంసాగర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పేరిట ఆదివారం అర్ధరాత్రి ఇసుకను అక్రమంగా తరలిస్తు న్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ సోమవారం తెలిపారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట, మాగి గ్రామాలకు చెందిన ట్రాక్టర్ల యజమానులు మంజీరా వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో వెంటనే దాడి చేసి పట్టుకున్నామన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. నస్రుల్లాబాద్: మండలంలోని దుర్కి వద్ద సో మవారం తెల్లవారు జామున పెట్రోలింగ్ పోలీసులు 12 క్వింటాళ్ల 80కిలోల రేషన్ బి య్యం ఉన్న 266 సంచులను పట్టుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డీటీ షరీపొద్దీన్ తెలిపారు. నిందితులు డీసీఎంలో షాద్నగర్ నుంచి ధర్మబాద్కు అక్రమంగా తీసుకెళ్తుండగా పట్టుకున్నామన్నారు. ఎస్సై రాఘవేంద్ర సమక్షంలో పంచనామ నిర్వహించారు. డ్రైవర్ షేక్ అజీ స్, వాహన యజమాని ఎండీ ఇర్ఫాన్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నవీపేట: మండలంలోని ఓ తండాకు చెందిన యువతి అదృశ్యమైనట్లు ఎస్సై తిరుపతి సోమవారం తెలిపారు. యువతి తల్లి బోధన్లో చదువుతున్న కుమారుడి వద్దకు ఆదివారం ఉదయం వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చింది. ఇంట్లో కుమార్తె కనిపించకపోవడంతో పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నేడు బస్టాండ్లో వస్తువుల వేలం
సుభాష్నగర్: టీజీఎస్ ఆర్టీసీ నిజామాబాద్–1 డిపో కార్గో విభాగం ప్రయాణికుల సౌకర్యార్థం కీలక నిర్ణయం తీసుకుంది. మరిచిపోయిన(మిగిలిపోయిన) వస్తువుల వేలం రేట్లపై 30శాతం తగ్గింపు ఇవ్వనున్నట్లు నిజామాబాద్ డిపో–1 మేనేజర్ ఆనంద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవలి కాలంలో ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా, వస్తువుల యజమానులు సులభంగా తమ వస్తువులను తిరిగి పొందే అవకాశం కల్పించడానికి ఈ తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీన నిజామాబాద్ బస్టాండ్ ప్రాంగణంలోని కార్గో ఆఫీస్ వద్ద మధ్యాహ్నం 3 గంటల వరకు వేలం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ అధికారులు కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. -
దుబాయిలో తప్పిపోయిన ఘన్పూర్ వాసి
మాచారెడ్డి: మండలంలోని ఘన్పూర్(ఎం) గ్రామాని కి చెందిన బోయిని శ్యామ్ శివ దుబాయి ఎయిర్ పోర్టులో తప్పిపోయినట్లు ఆయన తండ్రి దేవయ్య తెలిపారు. ఈమేరకు సోమవారం కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ని కరీంనగర్లో గ్రామస్తులతో పాటు కలిసి తమ కుమారుడిని వెతికి స్వగ్రామానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. నాలుగేళ్లుగా దుబాయిలో ఉంటున్న శ్యామ్శివ ఇటీవల గ్రామానికి వచ్చి ఈనెల 9న దుబాయి వెళ్లాడు. అక్కడికెళ్లిన రెండు రోజుల తర్వాత దుబాయిలో ఉండడం ఇష్టం లేదని తండ్రి దేవయ్యతో ఫోన్లో చెప్పాడు. వెంటనే కంపెనీ వారితో మాట్లాడగా ఈనెల 12న కంపెనీ వారు కారులో దుబాయి ఎయిర్ పోర్టులో దింపేసి వెళ్లారని, లగేజీ బోర్డింగ్ అయిన తర్వాత ఇమ్మిగ్రేషన్కు వెళ్లకుండా బయటకు పోయినట్లు ఎయిర్ పోర్టు అధికారులు వివరించారన్నారు. దీంతో ఆందోళనకు గురైన తండ్రి దేవయ్య కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ని కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన మంత్రి అదృశ్యమైన శివను వెతికి గ్రామానికి వచ్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు దేవయ్య తెలిపారు. -
ప్రపంచ సీనియర్ సిటిజన్ దినోత్సవం
బాన్సువాడ : బాన్సువాడ కమ్యూనిటీ మీడియేషన్ కార్యాలయంలో సోమవారం ప్రపంచ సీనియర్ సిటిజన్ దినోత్సవం నిర్వహించారు. సబ్ కలెక్టర్ దగ్గరికి వచ్చిన సీనియర్ సిటిజన్ల కేసులను లీగల్ వాలంటీర్లు పరిష్కరించారు. సీనియర్ సిటిజన్ల కోసం అవగాహన కార్యక్రమాలు చేపడతామని లీగల్ వాలంటీర్లు తెలిపారు. లీగల్ వాలంటీర్లు పుష్పవతి, అయ్యాల సంతోష్, అహ్మద్ హుస్సేన్, రామకృష్ణారెడ్డి, సాయిబాబా తదితరులున్నారు. మద్నూర్(జుక్కల్): విద్యార్థులకు తమ హక్కులపై అవగాహన ఉండాలని సఖి కేంద్రం అధికారి లావణ్య సూచించారు. డోంగ్లీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం జిల్లా మహిళా సాధికారత కేంద్రం, సఖీ కేంద్రం ఆధ్వర్యంలో బేటీ పడావో బేటీ బచావో, బాలల హక్కుల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. సీ్త్ర, పిల్లల సంక్షేమానికి సంబంధించిన వివిధ శాఖల అధికారులు సందర్శించి పలు అంశాలపై అవగాహన కల్పించారు. చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి మోహన్, హెచ్ఎం శ్రీనివాస్, ఉపాధ్యాయులు సునీల్, తదితరులు పాల్గొన్నారు. -
బాధలు భరిస్తేనే బస్టాండ్ వైపు రండి..!
కామారెడ్డి టౌన్ : ఏదైనా ఊరికి వెళ్లాలనుకునే వారు కామారెడ్డి బస్టాండ్కు వచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. బస్టాండ్ ప్రాంగణంలోకి ప్రవేశం మొదలు బయటికి వెళ్లే వరకు అడుగడుగునా సమస్యలే.. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా కామారెడ్డి కొత్త బస్టాండ్ రూపురేఖలు మారడం లేదు. 60 ఏళ్ల క్రితం నిర్మించిన బస్టాండ్ను అభివృద్ధి చేయడంలో విఫలమవుతున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి నుంచి బస్సులో ప్రతిరోజూ సుమారు 80వేల నుంచి లక్ష మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే బస్టాండ్ పరిస్థితి మాత్రం అధ్వానంగా ఉంది. బస్టాండ్ ప్రాంగణంలోని సీసీ రోడ్లు ధ్వంసమై గుంతలు ఏర్పడ్డాయి. బస్సులు చెడిపోవడమే కాకుండా వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు.ఈనెల 2వ తేదీన ఓ మహిళా కానిస్టేబుల్ ద్విచక్ర వాహనంపై బస్టాండ్ లోపలికి వెళ్తూ గుంతలో పడి గాయలపాలైంది. ఏడాదిన్నర కాలంగా ఉచిత మరుగుదొడ్లకు తాళాలు వేసి ఉండగా, మూత్రశాలలు కంపుకొడుతున్నాయి. పే అండ్ యూజ్ మూత్రశాలలు, మరుగుదొడ్ల వద్ద అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్లాట్ఫామ్ర్పాటు చేసిన గడియారం పని చేయడం లేదు. ప్రధానంగా తాగు నీటి సౌకర్యం లేక ప్రయాణికులు గుక్కెడు నీటి కోసం తంటాలు పడుతున్నారు. ఎండకాలంలో సమస్య తీవ్రమవుతోంది. డీఎం కార్యాలయం పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన బస్టాండ్ షెడ్ ముందు సీసీ వేయకపోవడంతో దుమ్ముతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో బస్టాండ్ పైకప్పు ఊరవడంతోపాటు పెచ్చులూడుతున్నాయి. సమస్యల వలయంలో కామారెడ్డి బస్టాండ్ తాగునీటికి కటకట మరుగుదొడ్లకు తాళాలు ప్రాంగణమంతా గుంతలమయం బస్టాండ్లో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారులకు నివేదిస్తా. తాగునీటి కోసం మున్సిపాలిటీ నుంచి కుళా యి కనెక్షన్ తీసుకున్నాం. శా శ్వతంగా తాగునీటి సమస్య ను పరిష్కరిస్తాం. ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందు లు లేకుండా చర్యలు తీసుకుంటాం. – దినేశ్కుమార్, డిపో మేనేజర్, కామారెడ్డి -
ముందస్తు సాగుకు సమాయత్తం
● నిండుకుండల్లా జలాశయాలు ● ఆయకట్టుకు ‘సాగర్’ భరోసానిజాంసాగర్(జుక్కల్) : యాసంగి సీజన్లో ముందస్తు పంటల సాగుకు రైతన్నలు సమాయత్తం అవుతున్నారు. వ్యవసాయబోరుబావుల కింద నారుమళ్లు సిద్ధం చేస్తుండగా చెరువులు, కుంటలు, ప్రధాన కాలువల కింద భూములను దుక్కి చేయిస్తున్నారు. పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు దుకాణాల్లో నిల్వ ఉండటంతో విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టంతో నిండుకుండల్లా ఉన్నాయి. జిల్లాలో 1,515 చెరువులు, కుంటలు ఉండగా.. లక్ష ఎకరాల ఆయకట్టు ఉంది. నెలన్నర రోజుల కిందటి వరకు వర్షాలు విస్తారంగా కురవడంతో ప్రధాన చెరువులతోపాటు కుంటలు యాసంగి పంటల సాగుకు భరోసానిస్తున్నాయి. సాగర్ ఆయకట్టు 1.25 లక్షల ఎకరాలు నిజాంసాగర్ ప్రాజెక్టు కింద ప్రధాన కాలువ ఆయకట్టు పరిధిలో 1.25 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నారు. ఇప్పటికే వర్ని, కోటగిరి, బో ధన్, బీర్కూర్, నసుల్లాబాద్, బాన్సువాడ మండ లాల్లో రైతులు బోరుబావుల కింద నారుమళ్లు సిద్ధం చేశారు. మహ్మద్నగర్, నిజాంసాగర్ మండలాల్లోని మొదటి ఆయకట్టు ప్రాంత రైతులు నారుమళ్లు వే యడం కొంత ఆలస్యమవుతుంది. మొదటి ఆయక ట్టు ప్రాంత రైతాంగానికి ప్రధాన కాలువ ఆధారంగా ఉంది. వానాకాలం సీజన్లో నారుమళ్లు, వరినా ట్లు వేయడంలో ఆలస్యం కావడంతో పంట నూర్పి డి పనులు వెనుకబడ్డాయి. అయితే ప్రధాన కాలువకు నీటి విడుదల చేపట్టకపోవడంతో నారుమళ్లు వేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. వచ్చే నెలలో నీటి విడుదలకు అవకాశం యాసంగి పంటల పంటల సాగు అవసరాల కోసం వచ్చే నెలలో నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటి విడుదల చేపట్టనున్నారు. యాసంగి పంటలకు సాగుకు సంబంధించి నీటిపారుదలశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అయితే వచ్చే నెల మొదటి వారంలో శివ్వం కమిటీ సమావేశం ఏర్పాటు కానుంది. శివ్వం కమిటీ సమావేశం తీర్మనం ఆమోదం మేరకు నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేయనున్నారు. నిజాంసాగర్ ఆయకట్ట కింద 1.25 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు గాను ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీరందిస్తాం. శివ్వం కమిటీ సమావేశం తీర్మానం మేరకు 7 విడతల్లో 12 టీఎంసీల నీటి విడుదల చేపట్టనున్నాం. – శ్రీనివాస్, సీఈ, కామారెడ్డి -
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
● అధికారులకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశం ● ప్రజావాణికి 87 ఫిర్యాదులుకామారెడ్డి క్రైం: ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను పరిశీలించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 87 ఫిర్యాదులు అందాయి. వాటిలో భూ సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, బిల్లుల మంజూరుకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఫిర్యాదులను ఆయా శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించి సమస్యలను పరిష్కరించడం లేదా పరిష్కార మార్గాలు చూపడం చేయాలన్నారు. ఎప్పటికప్పుడు ఫిర్యాదుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ముఖ్యంగా భూభారతి, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తహసీల్దార్లను ఆదేశించారు. అంతేకాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు. అదనపు కలెక్టర్లు విక్టర్, మధు మోహన్, కలెక్టరేట్ పాలనాధికారి మసూర్ అహ్మద్, ఆయా శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
మొదలయ్యేదెన్నడో..
పనులుపనులు మొదలుపెడితేనే..జిల్లాలోని జుక్కల్, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించాలని నిర్ణయించి ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గంలో భవన నిర్మాణపనులకు రూ.200 కోట్ల చొప్పున మంజూరుచేసింది. టెండర్ల ప్రక్రియ ఇటీవల పూర్తికాగా, నూతన స్కూళ్ల ప్రారంభానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. టెండర్ల దశలోనే సమీకృత గురుకులాలు వచ్చే ఏడాది తరగతులు కష్టమే.. నిర్మాణాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో.. -
సోయా రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం
మద్నూర్(జుక్కల్): సోయా కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని జిల్లా క్వాలిటీ ఇన్చార్జి రాములునాయక్ అన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ యార్డులో సోమవారం సోయా కొనుగోళ్లను నాఫెడ్ అధికారులు పునః ప్రారంభించారు. పంట దిగుబడిని పూర్తిగా సేకరిస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని రాములునాయక్ అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సోయాలో క్వాలిటీ కచ్చితంగా ఉండాలని, దీనికి రైతులు సహకరించాలని ఆయన కోరారు. సోయాలో మట్టి పెల్లలు వస్తున్నాయని ఆయన సోయాను పరిశీలించి చెప్పారు. నాణ్యత ప్రకారమే సోయా కొనుగోళ్లు జరుగుతాయని స్పష్టం చేశారు. సొసైటీ, మార్కెట్ కమిటీ అధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కావాలి కామారెడ్డి క్రైం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగస్వాములు కావాలని సెట్రింగ్ శిక్షణ పొందిన వారికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకున్న 32 మందికి సోమవారం కలెక్టరేట్లో సర్టిఫికేట్లను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. శిక్షణ పూర్తి చేసుకున్న వారు యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయం, రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని డీఆర్డీఏ అధికారులకు సూ చించారు. కార్యక్రమంలో డీఆర్డీవో సురేందర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారిగా డోలీసింగ్ కామారెడ్డి క్రైం: జిల్లా మత్స్యశాఖ అధికారిగా డోలీసింగ్ నియమితులయ్యారు. కల్టెరేట్లో ని తన చాంబర్లో సోమవారం ఆయన బా ధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఇదివరకు మత్స్య శాఖ అధికారిగా పనిచేసిన శ్రీపతి హన్మకొండకు బదిలీపై వెళ్లగా, నిజాంసాగర్ మత్స్య విత్తన క్షేత్రం ఇన్చార్జీగా ఉన్న డోలీసింగ్కు బాధ్యతలు అప్పగించారు. దరఖాస్తుల ఆహ్వానం కామారెడ్డి అర్బన్: జిల్లాలోని బీసీ, ఈబీసీ విద్యార్థులు ప్రీమెట్రిక్ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కే.జయరాజ్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న ఒక్కో విద్యార్థికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద రూ.4వేలు మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
పత్తి సేకరణకు బ్రేక్!
● సీసీఐ నిబంధనలను వ్యతిరేకిస్తున్న జిన్నింగ్ మిల్లుల యజమానులు ● నేటి నుంచి కొనుగోళ్లను బంద్ చేస్తున్నట్లు ప్రకటనమద్నూర్లోని సీసీఐ సెంటర్లో పత్తిమద్నూర్(జుక్కల్) : మండలకేంద్రంలోని సీసీఐ కొ నుగోలు కేంద్రంలో పత్తి సేకరణకు బ్రేక్ పడనుంది. సీసీఐ నిబంధనలను వ్యతిరేకిస్తూ పత్తి కొనుగోళ్లను సోమవారం నుంచి నిలిపివేస్తున్నట్లు జిన్నింగ్ మిల్లుల యజమానులు పేర్కొన్నారు. మళ్లీ కొనుగోళ్లను ప్రారంభించే తేదీని ప్రకటించే వరకు పత్తిని తీసుకురావొద్దని రైతులకు సూచిస్తున్నారు. ఇబ్బందుల్లో రైతులు మార్కెట్లో సీసీఐ కొనుగోళ్లు నిలిచిపోతే రైతులపై తీవ్ర ప్రభావం పడనుంది. పత్తి కొనేవారు లేక ధర తగ్గే ప్రమాదం ఉంది. క్వింటాల్కు ప్రస్తుతం రూ. 8100 సీసీఐ చెల్లిస్తుండగా, ప్రైవేట్లో రూ.6500 నుంచి రూ.7000 వరకు ఇస్తున్నారు. దీంతో రైతు లు తీవ్రంగా నష్టపోతున్నారు. జిన్నింగ్ యజమానుల సమస్య పరిష్కారమయ్యేదాకా రైతులు మా ర్కెట్కు పత్తి తీసుకురావద్దని అధికారులు సూచిస్తున్నారు. కొనుగోళ్లు సక్రమంగా జరిగేందుకు రైతు లు, మిల్లర్లకు అనుకూలంగా మార్గదర్శకాలు వస్తేనే సమస్య పరిష్కారం కానుంది. మిల్లర్ల డిమాండ్లు ఇవే.. పత్తి కొనుగోళ్ల నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఏకై క సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులు మద్నూర్లోనే ఉన్నాయి. సీసీఐ విధించిన కొత్త నిబంధనలు రైతులతోపాటు తమకు ఆటంకంగా మారుతున్నాయని మిల్లుల యజమానులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా కపాస్ కిసాన్ యాప్తో స్లాట్ బుకింగ్, ఎకరాకు ఏడు క్వింటాళ్ల పరిమితితోపాటు తేమ కూడా ఎనిమిది శాతానికి తగ్గించారు. ఎల్1, ఎల్2, ఎల్3 పేరిట మిల్లుల్లోనే కొనుగోళ్లు చేపట్టడంపై రైతులు, జిన్నింగ్ మి ల్లుల యజమానులు తమ ఉనికిపై ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. కొన్ని మిల్లుల్లోనే విడతల వారీగా కొనుగోళ్లు చేపట్టడంతో కొనుగోళ్లు ప్రారంభించని మిల్లు యజమానులు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గతంలో అన్ని జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు చేపట్టగా, తాజా నిబంధనలు రైతులు, జిన్నింగ్ యజమానులకు ఇబ్బందిగా మారింది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. -
ఎదురుచూపులు ఎన్నేళ్లు?
● చేయూత పింఛన్ల కోసం మూడేళ్లుగా నిరీక్షిస్తున్న అర్హులు ● ప్రజాపాలనలో వేలాది మంది దరఖాస్తు ● ఇప్పటికీ మంజూరుకాని పెన్షన్దోమకొండ : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న చేయూత పింఛన్ల కోసం అర్హులు ఏళ్లుగా ఎదురుచూపులు చూస్తున్నారు. 2022 ఆగస్టు కంటే ముందు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ పింఛన్ రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2023 డిసెంబరులో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నిర్వహించిన ప్రజాపాలనలో వేలాది మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఇప్పటి వరకు కొత్త పింఛన్లు మంజూరు కాలేదని దరఖాస్తుదారులు పేర్కొంటున్నారు. జిల్లాలో 10వేల మందికి మొండిచేయి.. 2022లో అప్పటి ప్రభుత్వం పింఛన్ అర్హత వయస్సును 65 ఏళ్ల నుంచి 57కి కుదించింది. దీంతో అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లావ్యాప్తంగా అన్ని విభాగాల్లో కలిపి 17 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. అప్పటికే పింఛన్ సైట్లో మరో 10 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. కాగా 17 వేల మందికి పింఛన్లు మంజూరు చేశారు. మిగతా 10 వేల మంది పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. కొనసాగుతున్న స్పౌజ్ పింఛన్లు.. ప్రస్తుతం స్పౌజ్ కేసుల పింఛన్లు మాత్రం కొనసాగుతున్నాయి. భార్యాభర్తల్లో ఎవరైనా ఒకరు చేయూత పింఛన్ పొందుతూ మరణిస్తే ఆ పింఛన్ను భాగస్వామికి బదిలీ చేస్తున్నారు. గత రెండేళ్లుగా ఈ విధానం కొనసాగుతోంది. ఈ విభాగంలో అర్హులు దరఖాస్తు చేసుకుంటే మరుసటి నెలలో పింఛన్ బదిలీ చేస్తున్నారు. ఈవిధంగా జిల్లాలో అన్ని విభాగాల్లో కలిపి మొత్తంగా 5 వేల వరకు పింఛన్లు అందుకుంటున్నారు. ప్రజాపాలన సందర్భంగా నిర్వహించిన గ్రామసభల్లో పింఛన్ల కోసం చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. కా నీ ప్రస్తుతం వెబ్సైట్ ఓపెన్ కావడం లేదు. దీంతో దర ఖాస్తుదారుల వివరాలు నమోదు చేయడానికి అవకాశం లేదు. జిల్లా అధికారులు, ప్రభుత్వం నుంచి ఆదేశాల వస్తేనే, పింఛన్దారుల వివరాలు ఆన్లైన్ లో నమోదు చేసి అధికారులకు అందజేస్తాం. –ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో, దోమకొండవెబ్సైట్ మూసివేత.. 2022 సెప్టెంబరు నుంచి పింఛన్ల దరఖాస్తు వెబ్సైట్ను మూసివేశారు. ఇప్పటి వరకు వెబ్సైట్ తిరిగి ఒపెన్ చేయలేదు. అర్హుల పేర్లు నమోదు చేయాలంటే వెబ్సైట్ పనిచేయాల్సి ఉంటుంది. కాని వెబ్సైట్ మూసివేతతో అధికారులు పింఛన్దార్ల పేర్లను నమోదు చేయడానికి వీలుపడడంలేదు. దీంతో దరఖాస్తులు అధికారులు వద్దే పెండింగ్లో ఉన్నాయి. పాతవారి పేర్లను చూసుకోవడానికి కూడా అవకాశం లేకపోగా, కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి సైతం అవకాశం లేకుండా పోయింది. -
ఆర్టీసీకి బురిడీ..!
ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీని ఓ వ్యక్తి బురిడీ కొట్టించినట్లు తెలుస్తోంది. కొన్నినెలల క్రితం ఆర్టీసీ అధికారులు భిక్కనూరులోని సంస్థకు చెందిన పెట్రోల్ బంక్ను ఓ ప్రయివేట్ వ్యక్తికి లీజ్కు ఇచ్చారు. ఒప్పందం సమయంలో సదరు వ్యక్తి రూ.15 లక్షలు ఆర్టీసీకి డిపాజిట్ చేసినట్లు సమాచారం. ఇటీవల సదరు కాంట్రాక్టర్ హెచ్పీసీఎల్ సంస్థ నుంచి సుమారు రూ.28 లక్షల విలువైన 2 ట్యాంకర్ల ఇంధనాన్ని ఉద్దెర కు తెచ్చి అమ్ముకొని, బంక్ను మూసివేశాడు. కానీ కాంట్రాక్టర్ డబ్బులు కట్టక పోవడంతో ఇంధన సంస్థ ఇంధనాన్ని పంపడం లేదు. దీంతో ఆర్టీసీ అధికారులు బంక్ను తెరవడానికి ఆపసోపాలు పడుతున్నట్లు సమాచారం. భిక్కనూరు : ఆర్టీసీ అధికారు ల అనాలోచిత నిర్ణయాలు ఆ సంస్థకు శాపంగా మారా యి. ఏ ఇబ్బంది లేకుండా నడుస్తున్న పెట్రోల్ బంకును ప్రైవేటు వ్యక్తుల కు అప్పగించి మోసపోయారు. ప్రస్తుతం బంక్ మూతపడటంతో ఆర్టీసీ ఆదాయానికి గండి పడటంతోపాటు, ప్రజలు ఇందనం కో సం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భిక్కనూరు మండల కేంద్రంలో హెచ్పీసీఎల్ కంపెనీతో ఆర్టీసీ ఒ ప్పందం చేసుకొని 2020 సంవత్సరంలో పెట్రోలు బంకును ప్రా రంభించింది. ఆర్టీసీ యాజమాన్యం గత నాలుగు ఏ ళ్లుగా తమ సిబ్బందితో పంపును నిర్వహిస్తోంది. పొదుపు చర్యల్లో భాగంగా ఆర్టీసీ యాజమాన్యం కా స్ట్ ఆఫ్ కంట్రోల్ పేరుతో ఖర్చులు తగ్గించుకోవాల నే ఉద్దేశంతో ఆరు నెలల క్రితం బంక్ను మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తికి లీజ్కు ఇచ్చింది. సదరు వ్యక్తి ఆర్టీసీ యాజమాన్యం వద్ద రూ.15 లక్ష లు డిపాజిట్ చేసి పెట్రోల్ బంకును నిర్వహించా డు. 15రోజుల క్రితం పెట్రోల్ బంకును లీజుకు తీ సుకున్న వ్యక్తి రెండు ట్యాంకర్లు అనగా సుమారు 24వేల లీటర్ల ఇందనాన్ని ఉద్దెరగా హెచ్పీసీఎల్ నుంచి తెప్పించుకుని విక్రయించుకొని, బంక్ను మూసివేశాడు. ఈ రెండు ట్యాంకర్ల ఇంధన విలువ రూ. 28 లక్షల వరకు ఉంటుండగా, ఇంధన సంస్థకు డబ్బులు చెల్లించడం లేదు. లీజుకు తీసుకున్న వ్యక్తి తన డిపాజిట్ సొమ్ము రూ.15 లక్షలు పోను ఇంకా ఆర్టీసీకి దాదాపుగా రూ. 13 లక్షల వరకు బకాయి పడ్డట్లు తెలుస్తోంది. భిక్కనూరు బస్టాండ్ పక్కన ఉన్న పెట్రోల్ పంపు ప్రజలందరికి అందుబాటులో ఉంది. పదిహేను రో జులుగా మూసి ఉంచడం వల్ల పెట్రోలు, డీజిల్కు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. దూర ప్రాంతంలో ఉ న్న పంపులకు వెళ్లాల్సి వస్తోంది. ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి పంపును పున:ప్రారంభించాలి. –కె.రాజు, రామేశ్వర్పల్లి భిక్కనూరు ఆర్టీసీ పెట్రోల్ బంక్ను లీజ్కు ఇచ్చిన అధికారులు రెండు ట్యాంకర్ల ఇంధనాన్ని ఉద్దెరకు తెచ్చి వాడేసిన కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించకపోవడంతో మూతబడిన బంక్నిర్లక్ష్యమే ముంచిందా? హెచ్పీసీఎల్ యాజమాన్యం పెట్రోలు, డీజిల్లను నిర్ణీత ధరకు ఆర్టీసీకి సరఫరా చేస్తుంది. ఆర్టీసీ ఖాతా నుంచే ఇంధన ట్యాంకర్ లావాదేవీలు నడుస్తాయి. అట్టి ఇంధన అమ్మకాలపై కాంట్రాక్టరుకు లీటరుకు ఒక రూపాయి నుంచి రెండు రూపాయల వరకు కమీషన్ ఇస్తున్నట్లు సమాచారం. అలాగే ఆర్టీసీకి సైతం కమీషన్ వస్తుంది. పంపును లీజుకు తీసుకున్న వ్యక్తి డబ్బులు చెల్లిస్తేనే వారు ట్యాంకర్ను బుక్చేసే విధానం ఉంది. కానీ ఆర్టీసీ యాజమాన్యం ట్యాంకర్ బుకింగ్ను కూడా ప్రయివేట్ వారికే అప్పగించినట్లు తెలుస్తోంది. వాస్తవంగా లీజ్కు తీసుకున్న వ్యక్తి ఎన్ని ట్యాంకర్లు బుక్ చేశాడో అన్న విషయాన్ని ఎప్పటికప్పడు ఆర్టీసీ యాజమాన్యం చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, నిర్లక్ష్యంతో సరిగా చూసుకోకపోవడంతో సదరు వ్యక్తి డబ్బులు చెల్లించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం బంక్ మూతపడగా, ఆర్టీసీ అధికారులు తిరిగి పంపును పున:ప్రారంబించేందకు యత్నించారు. కానీ తమకు బకాయిగా ఉన్న రెండు ట్యాంకర్ల డబ్బులను చెల్లిస్తేనే ఇంధనం సరఫరా చేస్తామని హెచ్పీసీఎల్ అధికారులు తెలిపినట్లు సమాచారం. ఈవిషయమై హైదరాబాద్లోని బస్ భవన్ నుంచి అధికారులు వచ్చి వివరాలు సేకరించుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈవిషయమై కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్కుమార్ను ‘సాక్షి’ వివరణ కోరగా ఇది తమ సంస్థ అంతర్గత వ్యవహరమన్నారు. సదరు వ్యక్తిపై విచారణ చేపట్టి, త్వరలో పంపును పున:ప్రారంభిస్తామన్నారు. -
ఖాళీలను భర్తీ చేయరు..
● జిల్లాలోని విద్యుత్ సబ్ స్టేషన్లలో వేధిస్తోన్న ఆపరేటర్ల కొరత ● ఉన్న సిబ్బందిపైనే అదనపు భారం ● పట్టించుకోని పాలకులు, అధికారులు పని భారం తగ్గించరుసదాశివనగర్(ఎల్లారెడ్డి): జిల్లాలోని విద్యుత్ సబ్ స్టేషన్లలో ఆపరేటర్ల కొరత వేధిస్తోంది. అధికారులు మాత్రం ఉన్న సిబ్బందిపైనే అధనపు భారం మోపుతూ పనులను నెట్టుకొస్తున్నారు. దీంతో సిబ్బంది పని భారం పెరగడంతో అనారోగ్యానికి గురవుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 139 సబ్ స్టేషన్లు.. జిల్లా వ్యాప్తంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ సబ్ డివిజన్ల పరిధిలో 139 విద్యుత్ సబ్ స్టేషన్లు ఉన్నాయి. కాగా ఈ సబ్స్టేషన్లలో 556 మంది ఆపరేటర్లు విధులు నిర్వర్తించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం 343 మంది మాత్రమే పని చేస్తున్నారు. మిగతా 213 ఆపరేటర్లు కావల్సి ఉన్నప్పటికీ అధికారులు ఖాళీల భర్తీపై దృష్టిసారించడం లేదు. ఉన్న ఆపరేటర్లతోనే నెట్టుకొస్తున్నారు. ఒక్కో ఆపరేటర్ ప్రతీరోజు 24 గంటలపాటు సబ్ స్టేషన్లలో అరకొరవ వసతుల మధ్య ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతీ సబ్స్టేషన్లలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం నలుగురు ఆపరేటర్లు డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. కానీ ఒక్కరు, లేదా ఇద్దరు మాత్రమే పని చేయాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా చాలా సబ్ స్టేషన్లలో ఆపరేటర్ల కొరత ఉంది. ఉన్న ఆపరేటర్లే ఒ క్కోసారి 24 గంటల పాటు డ్యూటీలు చేయాల్సి వస్తోంది. దీంతో చాలా ఇబ్బందు లు పడాల్సి వస్తోంది. కొన్ని సబ్ స్టేషన్లలో వాచ్మెన్లతోనే ఆపరేటర్ల డ్యూటీలు చేయిస్తున్నారు. వారికి పని భారం పెరిగి అనారోగ్యం బారిన పడుతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికై న దృష్టిసారించి ఆపరేటర్ల సమస్యలను పరిష్కరించాలి. –హరికృష్ణ, జిల్లా ఆర్టిజన్ జేఏసీ చైర్మన్, కామారెడ్డి కనీస వసతులు కరువు.. జిల్లా వ్యాప్తంగా చాలా సబ్ స్టేషన్లలో కనీస వసతులు లేక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి వసతి లేక నీళ్ల కోసం బయటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. చాలా సబ్ స్టేషన్లకు ప్రహరీలు కూడా లేవు. పలు సబ్ స్టేషన్లలో వాచ్మెన్లు లేరు. ఉన్నచోట ఆ వాచ్మెన్లతోనే ఆపరేటర్ల డ్యూటీలు చేయిస్తున్నారు. దీంతో వాచ్మెన్లకు పనిభారం పెరగడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికి పరిష్కారం కావడం లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్ సబ్స్టేషన్లలో ఖాళీగా ఉన్న ఆపరేటర్ల పోస్టులను భర్తీ చేసి పనిభారం తగ్గించాలని ఆపరేటర్లు కోరుతున్నారు. -
డాక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి టౌన్: జిల్లాలోని వైద్య విధాన ప రిషత్ పరిధి ఆస్పత్రులలో ఖాళీగా ఉన్న డా క్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఆస్పత్రుల పర్యవేక్షకురాలు డా క్టర్ విజయలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాన్సువాడ ఏరియా ఆస్పత్రి లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (గైనకాలజిస్టు), అనస్థిషియా, ఎల్లారెడ్డి సీహెచ్సీలో ఇద్దరు గైనకాలజిస్టులు, ఒక అనస్థిషియా, మద్నూ ర్ సీహెచ్సీలో ఒక జీడీఎంవో పోస్టులు ఖా ళీగా ఉన్నాయని తెలిపారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నామని ే పర్కొన్నారు. అర్హత కలిగిన వైద్యులు ఈ నెల 17 నుంచి 20 వ తేదీ వరకు సంబంధిత సర్టిఫికెట్లతో జిల్లా కేంద్రంలోని డీసీహెచ్ ఎస్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 21న ఇంటర్వ్యూ ఉంటుందన్నారు. వైద్య కళాశాలకు బస్సు మంజూరు కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు బస్సు మంజూరైంది. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వాల్యా ఆదివారం నూతన బస్సుకు పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్సు మంజూరుతో కళాశాలలో చదువుతున్న వైద్య విద్యార్థుల రవాణా సమస్య పరిష్కారమైందన్నారు. క్లినికల్ పోస్టింగ్లు, కమ్యూనిటీ హెల్త్ ప్రోగ్రామ్లకు విద్యార్థులు వెళ్లేందుకు ఈ బస్సు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. బస్సు మంజూరుకు కృషిచేసిన మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘చలి’మంటలు బాన్సువాడ రూరల్: జిల్లాలో చలి తీవ్రత పె రుగుతోంది. రోజురోజుకూ కనిష్ట ఉష్ణోగ్రత లు తగ్గుతున్నాయి. దీంతో గ్రామాలు, తండాల్లోని వీఽధి మూలమలుపుల వద్ద ప్రజలు మంటలు వేసి ఉపశమనం పొందుతున్నారు. నేడు రైఫిల్ షూటింగ్ ఎంపికలు నిజామాబాద్ నాగారం: స్కూల్ గేమ్స్ ఫె డరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో సోమవా రం రైఫిల్ షూటింగ్ ఎంపికలు నిర్వహించనున్నట్లు కార్యదర్శి నాగమణి ఒక ప్రకటన లో తెలిపారు. నగరంలోని బోధన్ రోడ్లో ఉ న్న ట్రస్ట్ షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీలో ఉద యం 10 గంటలకు ఎంపికలు ప్రారంభమవుతాయన్నారు. ఉమ్మడి జిల్లా క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. -
లక్కీ డ్రాలో 2.10 గుంటలు
రాజంపేట(కామారెడ్డి) : భూములు ధరలు పడిపో యి మార్కెట్లేని ప్రస్తుత పరిస్థితుల్లో తన భూమిని అమ్మేందుకు ఓ యువ రైతు వినూత్నంగా ఆలోచించాడు. తాను అనుకున్న ధర పొందేందుకు లక్కీ డ్రా మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆర్ధిక ఇబ్బందులు కారణంగా కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బస్వన్నపల్లి గ్రామానికి చెందిన యువ రైతు గడ్డం రాజు తనకున్న రెండు ఎకరాల 10 గుంటల భూమిని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రాంతంలో ఎకరానికి రూ.30 లక్షల ధర పలికేది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోవడంతో మార్కెట్ ధర కన్నా చాలా తక్కువ ధరకు భూమి కొనడానికి వస్తున్నారు. దీంతో రాజు 500 లక్కీ డ్రా టికెట్లను ఒక్కో టికెట్ను రూ.10వేలకు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. మొదటి రోజైన ఆదివారం 30 టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలిపాడు. వచ్చే సంక్రాంతి లోగా డ్రా ప్రక్రియ ముగిస్తానని, టికెట్లు కొనుగోలు చేసిన వారితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నానని తెలిపాడు. డ్రా తీసే రోజు అందుబాటులో లేని సభ్యులు కోసం యూ ట్యాబ్ ద్వారా లైవ్ టెలీకాస్ట్ ఇవ్వనున్నట్లు కరపత్రంలో పేర్కొన్నాడు. ప్రస్తుతం నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అందుకే వ్యవసాయ భూమిని అమ్మాలని నిర్ణయించుకున్నాను. నేరు గా అమ్ముదామంటే మార్కె ట్లో తక్కువకు అడుగుతున్నారు. రియల్ ఎస్టేట్ ప డిపోవడంతో ధరలు లేవంటున్నారు. దీంతో లక్కీ డ్రా విధానాన్ని ఎంచుకున్నా. గిట్టుబాటు అవుతుందని ఆశిస్తున్నా. – గడ్డం రాజు, రైతు, బస్వన్నపల్లి భూమి అమ్మేందుకు యువ రైతు విన్నూత్న ఆలోచన 500 టికెట్లు.. ఒక్కో టికెట్ రూ.10 వేలకు విక్రయం అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్ డ్రా రోజున యూట్యూబ్లో లైవ్ టెలీకాస్ట్ -
‘టీజీఎన్పీడీసీఎల్’లో డిజిటల్ సేవలు
సుభాష్నగర్: వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు అందించడంలో భాగంగా సాంకేతికతను అందిపుచ్చుకొని డిజిటల్ సేవలు అందిస్తున్నామని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ ఆర్ రవీందర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. టీజీఎన్పీడీసీఎల్ యాప్ను రూపొందించామని, 20 ఫీచర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్, ఐ ఫోన్లో ప్లే, యాప్స్టోర్లో టీజీఎన్పీడీసీఎల్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకొని సేవలు పొందాలని ఆయన సూచించారు. నెలవారీ విద్యుత్ బిల్లులను యాప్, టీ వ్యాలెట్, గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి డిజిటల్ ఫ్లాట్పారాల ద్వారా చెల్లించే సదుపాయం కల్పించామని రవీందర్ తెలిపారు. టీజీఎన్పీడీసీఎల్ వెబ్సైట్ ద్వారా కన్జ్యూమర్ గ్రీవెన్స్ పోర్టల్, కొత్త సర్వీస్ కనెక్షన్, సోలార్, హెచ్టీ లైన్ షిఫ్టింగ్, హెచ్టీ కన్జ్యూమర్ పోర్టల్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఆన్లైన్ ఎస్టిమేట్ డిమాండ్ నోటీస్ చార్జీలు, తదితర సర్వీసులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కరెంట్ బిల్లు సమాచారం, బిల్లు చెల్లింపు వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా పంపిస్తున్నామని తెలిపారు. వినియోగదారులకు విద్యుత్ సమస్యలు తలెత్తితే టోల్ ఫ్రీ నెంబర్ 1912ను సంప్రదించాలని ఎస్ఈ రవీందర్ సూచించారు. -
మంజీరా తీరాన వలస జీవాలు
● పక్క జిల్లాల్లో గ్రాసం కొరతతో వలసబాట ● పలు జిల్లాల నుంచి మూగజీవాలతో పెంపకందారుల రాక నిజాంసాగర్(జుక్కల్): మూగజీవాల పోషణ, పశుసంపదపై ఆధారపడిన రైతులు వాటి సంరక్షణ కోసం ఎల్లలు దాటి జీవనం సాగిస్తున్నారు. స్థానికంగా పశుగ్రాసం, తాగునీటి కొరత ఉండటంతో జిల్లాలు దాటి జీవాలతో పాటు జీవన ప్రయాణం చేస్తున్నారు. రాష్ట్రంలోని మహబూబ్నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి వేలాదిగా మూగజీవాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు వలస వస్తున్నాయి. ఆయా జిల్లాల్లో మూగజీవాలకు పశుగ్రాసం కొరత కారణంగా గొర్రెలు, ఆవుల మందలతో రైతులు వలసబాట పట్టారు. గొర్రెల మందలతో పాటు పశువుల మందలు పంట పొలాల్లో సందడి చేస్తున్నాయి. ఒక్క మహబూబ్నగర్ జిల్లా నుంచి దాదాపు లక్ష నుంచి 2 లక్షల వరకు గొర్రెలు వలస వచ్చాయి. అంతేకాకుండా మిగితా జిల్లాల నుంచి వేలాదిగా గొర్రెలు, గోజాతి పశువులతో రైతులు వలస వచ్చారు. పంట నూర్పిళ్లు పూర్తవడంతో.. జిల్లాలోని నిజాంసాగర్,ఎల్లారెడ్డి,నాగిరెడ్డిపేట, బా న్సువాడ,పిట్లం,బిచ్కుంద, బీర్కూర్, నస్రుల్లాబాద్ మండలాల్లోని మంజీరా నది తీర ప్రాంత వ్యవసాయభూముల్లో వలస జీవాలు సందడి చేస్తున్నాయి. ఆయా మండలాల్లో వానాకాలం పంట నూర్పిళ్లు పూర్తవడంతో పశువులతో పాటు గొర్రెలకు పశుగ్రా సం పుష్టిగా లభిస్తోంది. అంతేకాకుండా ఆయా గ్రా మాలు,మండలాల్లోని చెరువులు, కుంటల్లో నీటి ని ల్వలు నిండుకుండలుగా ఉండటం, వాగులు ప్రవహిస్తుండటంతో మూగజీవాలకు తాగునీరు లభిస్తోంది. దీంతో మూగజీవాల పోషణను నమ్ముకున్న రైతులు జీవాలతోపాటు పంటపొలాల్లో మకాం వేస్తున్నారు. గ్రామ శివారు ప్రాంతాల్లోని పంట పొలాల్లో జీవాల మందను పెడుతున్నారు. పంట పొలాల్లో జీవాల సంచారంతో సేంద్రియ ఎరువులు లభిస్తున్నాయి. జీవాల మందలకు అనుగుణంగా పాడి పశువుల పోషకులకు డబ్బులు చెల్లిస్తుండటంతో రైతులకు గ్రాసం లభిస్తోంది. మా ప్రాంతం పంటల్లేక అంతా ఎడారిని తలపిస్తోంది. మూగజీవాలకు పశుగ్రాసం లభించక వాటి సంరక్షణ కోసం వలస వచ్చాం. నిజాంసాగర్ ప్రాజెక్టుతోపాటు చుట్టుపక్క మండలాల్లో గొర్రెలు, పశువులతోపాటు గుడారం వేసుకుంటున్నాం. ఇక్కడ జీవాలకు గ్రాసంతోపాటు మాకు పోషణ కూడా లభిస్తోంది. – సాయికుమార్, సంగారెడ్డి జిల్లామాకక్కడ జీవాలకు మేత దొరకక ఇక్కడికి జీవాలను తీసుకువచ్చాం. గొర్రెలు, మేకలకు గ్రాసంతో పాటు తాగునీటి కొరత ఉంది. మా ఊరి నుంచి నెలన్నర కిందట బయలు దేరినం. ఇక్కడ గొర్రెలు, మేకలకు మేతతో పాటు తాగు నీరు పుష్కలంగా లభిస్తోంది. –కుర్మ మల్లయ్య, పాలమూరు జిల్లా -
మా మంచి పోలీస్ బాస్..
● అర్ధరాత్రి విధుల్లో ఉన్న సిబ్బంది ఇబ్బందులను పరిశీలించిన ఎస్పీ ● సిబ్బందికి టీ, కాఫీ, వాటర్ బాటిళ్ల అందజేతసిబ్బందితో కలిసి టీ తాగుతున్న ఎస్పీ రాజేశ్ చంద్రకామారెడ్డి క్రైం: గజగజ వణికిస్తున్న చలిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఇబ్బందులను ఎస్పీ రాజేశ్ చంద్ర శనివారం అర్ధరాత్రి స్వయంగా పరిశీలించా రు. పట్టణంలోని సిరిసిల్లా రోడ్డు, రామారెడ్డి రోడ్డు, ఎల్లారెడ్డి రోడ్డు, ఇతర ప్రధాన కూడళ్లలో వాహనాల తనిఖీలు, పెట్రోలింగ్ తదితర విధుల్లో ఉన్న సిబ్బంది ప్రాథమిక అవసరాలైన టీ, కాఫీ, వాటర్ బాటిళ్లను తన ఇంటి నుంచి తెప్పించి అందజేశారు. స్వయంగా ఎస్పీ తన ఇంటి నుంచి టీ, కాఫీ, వాట ర్ తెప్పించడం పోలీసు అధికారులు, సిబ్బందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎస్పీ చూపించిన ఆదరాభిమానాలు తమలో నూతన ఉత్తేజాన్ని నింపాయనీ, మా మంచి పోలీస్ బాస్ అంటూ కామారెడ్డి పో లీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పిన్కోడ్ నంబర్తో గ్రామాన్ని ఎలా గుర్తిస్తారు?
మీకు తెలుసా?రామారెడ్డి: భారతదేశంలో పిన్ కోడ్ (పోస్టల్ ఇండెక్స్ నంబర్) ఆధారంగా ఒక గ్రామాన్ని లేదా ప్రాంతాన్ని ఎలా గుర్తిస్తారో తెలుసుకుందాం. పిన్ కోడ్ అనేది ఇండియా పోస్ట్ (భారతీయ తపాలా శాఖ) ఉపయోగించే ఆరు అంకెల సంఖ్య. దీని ముఖ్య ఉద్దేశం తపాలా సేవలను క్రమబద్దీకరించడం. దేశంలో ఒకే పేరు గల ప్రాంతాల మధ్య గందరగోళాన్ని నివారించడం. ● ప్రతి పిన్ కోడ్ను ఒక నిర్ధిష్టమైన పోస్టాఫీసుకు కేటాయిస్తారు. ఈ పోస్టాఫీసు పరిధిలో ఆ చుట్టుపక్కల ఉండే పట్టణాలు, గ్రామాలు, ప్రాంతాలు వస్తాయి. అందువలన ఒక గ్రామం పిన్ కోడ్ తెలిస్తే, ఆ గ్రామం ఏ పోస్టాఫీసు పరిధిలోకి వస్తుందో సులభంగా తెలుసుకోవచ్చు. ● ఆరు అంకెల పిన్ కోడ్ ఒక్కొక్కటి ఒక నిర్ధి ష్ట భౌగోళిక ప్రాంతాన్ని సూచిస్తుంది. ● పిన్ కోడ్ ద్వారా ఒక గ్రామాన్ని పరోక్షంగా గుర్తిస్తారు. ● నిర్ధిష్ట పోస్టాఫీసు పిన్ కోడ్లోని చివరి మూడు అంకెలు ఆ ప్రాంతంలోని ఒక నిర్ధిష్ట డెలివరీ పోస్టాఫీసును సూచిస్తాయి. ● గ్రామ పరిధి ప్రతి పోస్టాఫీసు దాని చుట్టూ ఉన్న అనేక గ్రామాలు, కాలనీలు లేదా చిన్న పట్టణాలకు మెయిల్ డెలివరీ చేస్తుంది. ఈ గ్రామాలన్నీ ఒకే పిన్ కోడ్ పరిధిలోకి వస్తాయి. ● ప్రత్యేకత(యూనిక్ నెస్) ఒకే పిన్ కోడ్లో అనేక గ్రామాలు ఉన్నా ప్రతి గ్రామానికి పోస్టాఫీసు రికార్డుల్లో ప్రత్యేక చిరునామా ఉంటుంది. అయితే, పిన్ కోడ్ అనేది పోస్టాఫీసు స్థానాన్ని బట్టి ప్రత్యేకంగా ఉంటుంది. ● ఆ పోస్టాఫీసు డెలివరీ చేసే అన్ని గ్రామాలు ఆ ప్రత్యేక పిన్ కోడ్ను పంచుకుంటాయి. -
చికిత్స పొందుతూ ఒకరి మృతి
తాడ్వాయి: మండలంలోని దేవాయిపల్లి గ్రామానికి చెందిన మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు శనివారం సాయంత్రం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. ఎస్సై ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. దేవాయిపల్లి గ్రామానికి చెందిన కురుమ సతీశ్(29) ఆర్థిక ఇబ్బందులతో శనివారం ఉదయం పురుగు మందు సేవించి ఆత్మహత్యకు యత్నించాడు. కాగా అపస్మారక స్థితిలో ఉన్న సతీశ్ను కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. ముబారక్నగర్లో మరొకరు.. నిజామాబాద్ రూరల్: మతిస్థిమితం సరిగా లేని ఓ వ్యక్తి మూడు రోజుల క్రితం పురుగులమందు తాగగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు రూరల్ సీఐ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని ముబారక్నగర్ ప్రాంతానికి చెందిన అంబటి గణేశ్(64)కు రెండేళ్లుగా మతిస్థిమితం సరిగా లేదు. మూడు రోజుల క్రితం ఇంట్లో వింతవింతగా ప్రవర్తించి పురుగుల మందు తాగాడు. విషయం గమనించిన కుటుంబీకులు వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.వేల్పూర్: మండలంలోని అక్లూర్ గ్రామానికి చెందిన గంగం అనిందర్రెడ్డి(29) అనే వ్యక్తి ఈనెల 3 నుంచి అదృశ్యమైనట్లు ఎస్సై సంజీవ్ ఆదివారం తెలిపారు. ఈనెల 3న ఆర్మూర్కు బ్యాంకు పని ఉందని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. అతని తండ్రి గంగారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. లింగంపేట: మండలంలోని పర్మళ్ల, లింగంపేట గ్రామ శివారులోని పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్లు ఎస్సై దీపక్కుమార్ ఆదివారం తెలిపారు. లింగంపేట శివారులోని పెద్దవాగు నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ఒక ట్రాక్టర్, పర్మళ్ల శివారులోని పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని పీఎస్కు తరలించామన్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. డిచ్పల్లి: మండలంలోని రాంపూర్ గ్రామంలో ఈనెల 13న జరిగిన పెళ్లి భారత్లో అదే గ్రామానికి చెందిన సుభాష్, నర్సింగ్పూర్ గ్రామానికి చెందిన నల్ల నితీశ్లకు గొడవ జరిగింది. దీనిని మనసులో పెట్టుకొని 14న సాయంత్రం నల్ల నితీష్, సుభాష్కు ఫోన్ చేసి రాంపూర్లోని గురుకుల పాఠశాల వద్దకు రమ్మని పిలిచాడు. దీంతో సుభాష్ తన స్నేహితులైన రాకేశ్, రఘు, సతీశ్లను వెంటబెట్టుకొని వెళ్లాడు. అక్కడ సిద్ధంగా ఉన్న నితీశ్ అతని మిత్రులు నల్ల విఘ్నేశ్, షేక్ సోహైల్, నల్ల సాయివర్ధన్, మహమ్మద్ ఆరిఫ్, నీరడి తరుణ్ కర్రలు, రాడ్లతో సుభాష్తోపాటు అతని స్నేహితులపై దాడి చేసి హత్యా ప్రయత్నం చేశారు. అదే సమయంలో రాంపూర్ గ్రామస్తులు అక్కడికి రావడంతో నితీశ్ అతని స్నేహితులు పారిపోయారు. సుభాష్ తల్లి నవ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డిచ్పల్లి ఎస్సై షరీఫ్ తెలిపారు. ఆదివారం సాయంత్రం దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
ఒకటో టౌన్ ఎస్సై మహేశ్ బదిలీ
నిజామాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని ఒకటో టౌన్ పోలీస్స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న మహేశ్ బదిలీ అయ్యారు. జగిత్యాల జిల్లా ధర్మపురికి బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. నేడు ఎస్సై మహేశ్ రిలీవ్ కానున్నారు. నిజామాబాద్అర్బన్: ఏడాది నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్ కాయిల్స్ చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కమిషనరేట్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సాయిచైతన్య వివరాలు వెల్లడించారు. జిల్లాలోని ఇందల్వాయి, ధర్పల్లి, డిచ్పల్లి, జక్రాన్పల్లి, మెండోరా, ముప్కాల్, మెండోరా, మోపాల్, నవీపేట, వర్ని మండలాల్లో ఈ ముఠా ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని కాపర్ కాయిల్స్ను ఎత్తుకెళ్లిందన్నారు. ముఠాలోని ఏడుగురు సభ్యుల్లో ఐదుగురిని శనివారం ఇందల్వాయి వద్ద పట్టుకొని అరెస్టు చేశామన్నారు. కాపర్ కాయిల్స్ కొనుగోలు చేసిన ముగ్గురిని సైతం అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ ముఠా జిల్లాలోని 101 ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి 40 కిలోల కాపర్ కాయిల్స్ను దొంగిలించారన్నారు. నిందితులు మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా దేశ్ముఖ్పోస్టు గ్రామానికి చెందిన తుంబారె సుధాకర్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రం అమీర్నగర్లోని మర్బీర్శర్మ, ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా బారడిపేటకు చెందిన అలీ మహమ్మద్, ప్రకాశం జిల్లా బండెవెళ్లిగండ్ల గ్రామానికి చెందిన యాడాల వెంకటేశ్వర్లు, మహబూబ్నగర్ జిల్లా పెద్దాపురం గ్రామానికి చెందిన శానపల్లి రవీందర్, మేడ్చల్కు చెందిన అనిల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వలీ, మెదక్ జిల్లాలోని సంకలపల్లి గ్రామానికి చెందిన లింగప్ప, సిద్దిపేట జిల్లా కూరేళ్ల గ్రామానికి చెందిన గాజుల శ్రీశైలం, హైదరాబాద్కు చెందిన మహమ్మద్ హైదర్ అలీగా గుర్తించారు. నిందితుల నుంచి రూ.5.5 లక్షల నగదు, రెండు స్కూటీలు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ రాజావెంకట్రెడ్డి, డిచ్పల్లి సీఐ వినోద్, ఇందల్వాయి, డిచ్పల్లి, జక్రాన్పల్లి ఎస్సైలు సందీప్, షరీఫ్, మహేశ్, పోలీసు సిబ్బంది కిరణ్గౌడ్, ప్రశాంత్, సందీప్, కిశోర్, సుజిత్, నవీన్, సర్ధార్లను సీపీ అభినందించారు. -
భర్తకు తలకొరివి పెట్టిన భార్య
లింగంపేట: గుండెపోటుతో మృతి చెందిన భర్తకు భార్య తలకొరివి పెట్టిన ఘటన లింగంపేట మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. లింగంపేట మండల కేంద్రానికి చెందిన బందరు బాలయ్య(65) ఆదివారం గుండెపోటుతో మృతి చెందాడు. ఉన్న ఒక్క కొడుకు జీవనోపాధి కోసం హైదరాబాద్కు వెళ్లి గతంలో ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు. నాటి నుంచి వీరు ఇద్దరే ఉంటున్నారు. భర్తకు భార్య సత్తెవ్వ తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు చేసిన సంఘటన స్థానికులను కలిచివేసింది. లింగంపేట: మండలంలోని కోమట్పల్లి చౌరస్తాలో అనుమతి లేకుండా మద్యం సిట్టింగ్ నిర్వహిస్తున్న ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దీపక్కుమార్ తెలిపారు. సరిచంద్ అనే వ్యక్తి కొంత కాలంగా బెల్ట్షాప్, మద్యం సిట్టింగ్ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఆదివారం దాడి చేసి సిట్టింగ్ నిర్వహిస్తున్న సరిచంద్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అనుమతి లేకుండా మద్యం సిట్టింగులు నిర్వహిస్తే చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. ఆయన వెంట సిబ్బంది ఉన్నారు. ● రైతు ఖాతా నుంచి రూ. 96 వేలు మాయం బాన్సువాడ: బీర్కూర్ మండలం చించొలి గ్రామానికి చెందిన రైతు శ్రీనివాస్ ఖాతా నుంచి రూ. 96 వేలు సైబర్ మోసం జరిగింది. రైతు శ్రీనివాస్ ధాన్యం విక్రయించడంతో ఈ నెల 13న అతడి బ్యాంకు ఖాతాలో రూ. 1.04 లక్షలు జమ అయ్యాయి. వెంటనే శ్రీనివాస్ ఫోన్కు తన ఆధార్ నంబర్ అప్డేట్ చేసుకోవాలని మెసేజ్ వచ్చింది. ఈ నెల 14న శ్రీనివాస్ ఫోన్కు ఓ లింక్ రావడంతో శ్రీనివాస్ దానిని ఓపెన్ చేయగా గంట వ్యవధిలో రూ.96 వేలు సైబర్ ఖాతాలోకి వెళ్లాయి. శ్రీనివాస్ వెంటనే బీర్కూర్ బ్యాంకుకు వెళ్లి ఆరా తీశాడు. రెండు సార్లు రూ.96 వేలు డ్రా అయినట్లు బ్యాంకు సిబ్బంది చెప్పడంతో వెంటనే పోలీస్స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. -
కరెంట్షాక్తో గేదె మృతి
కామారెడ్డి రూరల్: పొలంలో తెగిపడిన విద్యుత్ తీగలు తగిలి ఓ పాడి గేదె మృతి చెందిన ఘటన కామారెడ్డి మండలం ఇస్రోజివాడి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్యామ్రావు రోజులాగే తన పొలంలో మేత కోసం పాడిగేదెను వదిలాడు. గేదె ఒక్కసారిగా అరవడంతో గమనించిన శ్యామ్రావు గేదెకు విద్యుత్తీగలు తగిలినట్లు గుర్తించి వెంటనే ఓ కర్రసాయంతో తొలగించాడు. అప్పటికే గేదె మృతి చెందింది. ఇంట్లో పిల్లలాగా చూసుకున్నామని, మరో నెల అయితే దూడకు జన్మనిస్తుంటే అని రైతు కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అధికారులు స్పందించి బాధిత రైతుకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. కుక్కల దాడిలో ఐదు గొర్రె పిల్లలు.. మండలంలోని ఇస్రోజివాడి గ్రామంలో కుక్కల దాడిలో చెట్కూరి సాయిలుకు చెందిన ఐదు గొర్రె పిల్లలు మృతిచెందాయి. సాయిలు గొర్రె పిల్లలను కొట్టంలో ఉంచి, గొర్రెలను మేతకు తీసుకెళ్లాడు. ఆదివారం మధ్యాహ్నం వీధి కుక్కలు కొట్టంలో ఉన్న గొర్రె పిల్లలపై ఒక్కసారిగా దాడి చేశాయి. ఇందులో ఐదు గొర్రెపిల్లలు మృతి చెందాడు. అలాగే కొట్టంలో ఉన్న లేగ దూడపై సైతం దాడి చేస్తుండగా పొలానికి వెళ్తున్న కొందరు రైతులు గమనించి కుక్కలను తరిమికొట్టారు. దాడిలో లేగ దూడకు తీవ్ర గాయాలయ్యాయి. రూ.40 వేల నష్టం సంభవించిందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు. -
● అ‘పూర్వ’ సమ్మేళనం
జక్రాన్పల్లి/పెర్కిట్: జక్రాన్పల్లి మండలంలోని పడకల్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన 1998–99 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 26 ఏళ్ల తర్వాత అందరూ ఒకేచోట చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఒకరి యోగక్షేమాలు మరొకరు అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. గురువులను ఆహ్వానించి పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో రమేశ్, శ్రీనివాస్, దయాకర్, లింగం, నరేశ్, పెరుగు రమేశ్, బాదవత్ రమేశ్, గంగాధర్ పాల్గొన్నారు. ఆర్మూర్ మండలం మిర్దాపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివిన 2000–01 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో సౌడ సురేశ్, జంపల జగదీశ్, రవి, నవీన్, లక్ష్మి, పరిమల తదితరులు పాల్గొన్నారు. -
మూడు ఆలయాల్లో చోరీ
మోపాల్: మండలంలోని సిర్పూర్ తండా, గుడి తండాలోని సేవాలాల్ ఆలయాల్లో, నర్సింగ్పల్లిలోని పెద్దమ్మ గుడిలో చోరీ జరిగినట్లు ఎస్ఐ సుస్మిత శనివారం తెలిపారు. గుర్తుతెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి సిర్పూర్ తండాలోని సేవాలాల్ ఆలయం తాళాలు ధ్వంసం చేసి, విగ్రహాలపై ఉన్న తులం బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. అదేవిధంగా నర్సింగ్పల్లిలోని పెద్దమ్మ గుడిలో తులం బంగారు పుస్తెలు, గుడి తండాలోని సేవాలాల్ మహారాజ్ గుడిలో బంగారు ముక్కుపుడక, పుస్తకం, ఇతర బంగారు ఆభరణాలు కలిపి తులం వరకు చోరీకి పాల్పడ్డారు. మరుసటి రోజు స్థానికులు చోరీలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటన స్థలాలను పరిశీలించి, వివరాలు సేకరించారు. మూడు ఆలయాల్లో కలిపి సుమారు మూడు తులాలకుపైగా బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సుస్మిత తెలిపారు. -
మండల ప్రభుత్వ కార్యాలయాలు– అధికారులు
మీకు తెలుసా.. రామారెడ్డి: ఒక మండలంలో సాధారణంగా ఉండే ప్రధాన కార్యాలయాలు, అధికారులు మండల కేంద్రంలోనే ఉంటాయి. ● ఒక మండలంలో ఎంతమంది అధికారులు, సిబ్బంది ఉంటారనేది ఆ మండలం పరిమాణం, జనాభా, ప్రభుత్వ నిర్ణయాలు పని భారాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ● మండలం ప్రధాన పాలనాకేంద్రాలు మండల రెవెన్యూ కార్యాలయం (తహసీల్ కార్యాలయం), మండల ప్రజా పరిషత్ కార్యాలయం (ఎంపీడీవో కార్యాలయం). ● ప్రధానంగా మండల రెవెన్యూ కార్యాలయం, మండల పరిషత్ కార్యాలయాల్లో కలిపి ఒక మండలానికి సంబంధించిన కీలక అధికారులు సిబ్బంది నియమించబడతారు. ● తహసీల్ కార్యాలయం: ఇది రెవెన్యూ పాలన, భూరికార్డులు, పౌర సరఫరాలు, సామాజిక సంక్షేమ పథకాలు (పెన్షన్లు వంటివి), ఎన్నికల నిర్వహణ వంటి అంశాలను చూసుకుంటుంది. అధికారిగా తహసీల్దార్ ఉంటారు. ● డిప్యూటీ తహశీల్దార్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ ) తనిఖీలు, విచారణలు నిర్వహించడంలో తహసీల్దార్కి సహకరిస్తారు. ● జూనియర్ అసిస్టెంట్లు/రికార్డ్ అసిస్టెంట్లు/ఇతర సిబ్బంది. ● గ్రామ స్థాయిలో రెవెన్యూ పనుల కోసం గ్రామ రెవెన్యూ అధికారులు (జీపీవో)లను కాంగ్రెస్ సర్కార్ ఇటివల నియమించింది.. ● ఎంపీడీవో కార్యాలయం: ఇది స్థానిక సంస్థల (పంచాయతీ రాజ్) పాలన, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తుంది. ● మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) ఈయన మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి అధిపతి. మండలంలోని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తారు. ● మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) గ్రామ పంచాయతీల పాలనా వ్యవహారాలలో ఎంపీడీవోకు సహకరిస్తారు. ● వ్యవసాయం, విద్య, వైద్యం ఇతర ముఖ్యమైన విభాగాలకు మండల కార్యాలయాలుంటాయి, ● మండల విద్యాశాఖ కార్యాలయం, మండల విద్యాధికారి ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ● ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ), మండల వైద్య ఆరోగ్య శాఖ అధికారి పర్యవేక్షణలో ఉంటుంది. ● విద్యుత్ ఉప కేంద్రం/ట్రాన్స్కో కార్యాలయం, విద్యుత్ ఇంజినీరింగ్ (ఏఈ) సిబ్బందితో ఉంటుంది. ● వ్యవసాయ శాఖ కార్యాలయం మండల వ్యవసాయాధికారి పరిధిలో ఉంటుంది. ● పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ లేదా సబ్ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తుంది. ● పోస్ట్ ఆఫీస్ (తపాలా కార్యాలయం), సబ్ ట్రెజరీ కార్యాలయం (కొన్ని ముఖ్యమైన మండలాల్లో) ఉంటాయి. -
అక్రమంగా మొరం తవ్వకాలు
కామారెడ్డి రూరల్ : ఎలాంటి అనుమతులు లేకుండా అసైన్డ్ భూముల్లో రాత్రి వేళల్లో అక్రమంగా మొరం తవ్వకాలు జరుపుతున్నారు. శాబ్దిపూర్ శివారులోని గూడెం రోడ్డు పక్కన గల అసైన్డ్ భూమి సర్వే నంబర్–38లో నుంచి రెండేళ్లుగా యథేచ్ఛగా మొరం తరలిస్తున్నారు. ప్రభుత్వ భూములు అమ్మ వద్దు, కొనరాదు అనే నిబంధనలు ఉన్నా వాటిని తుంగలో తొక్కి ఓ నాయకుడు రెండెకరాలు కొనుగోలు చేసి అందులో నుంచి రెండు సంవత్సరాలుగా టిప్పర్లతో మట్టి, మొరం తరలిస్తూ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అధిక లోడ్ టిప్పర్లతో మొరం తరలించడం వల్ల గ్రామంలో వేసిన రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయని పేర్కొన్నారు. మట్టి తరలింపు, భూమి కొనుగోలు, రోడ్ల ధ్వంసం విషయాలపై మైనింగ్, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల సహకారంతోనే ఆ వ్యక్తి రాత్రింబవళ్లు మొరం తరలిస్తున్నాడని ఆరోపించారు. నిత్యం మట్టిని తవ్వుతూ టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద గోతులు ఏర్పడి ప్రమాదకరంగా మారాయన్నారు. ఖనిజ సంపద తరలిపోతున్నా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. మొరం తవ్వకాలు తమ దృష్టికి రాలేదు. శాబ్దిపూర్ శివారులోని సర్వే నెంబర్–38లో గల అసైన్డ్ భూమిలో నుంచి అక్రమంగా మట్టి, మొరం రవాణాను ఉపేక్షించం. మొరం తవ్వుతున్న వాహనాలతో పాటు తరలిస్తున్న టిప్పర్లను సీజ్ చేస్తాం. వెంటనే ఆర్ఐని పంపించి వాహనాలను సీజ్ చేస్తాం. –జనార్దన్, తహసీల్దార్, కామారెడ్డి అసైన్డ్ భూముల్లో తవ్వి రాత్రి వేళల్లో తరలింపు రూ.లక్షలు గడిస్తున్న వ్యాపారులు చోద్యం చూస్తున్న రెవెన్యూ, మైనింగ్ అధికారులు -
విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు
ఖలీల్వాడి: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో శనివారం 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఉదయం పాఠశాల స్థాయి విద్యార్థులకు ‘ఉగ్రవాదం పై భారత్ పోరు‘ అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. పైస్థాయి విద్యార్థులకు మధ్యాహ్నం ‘ప్రజాస్వామ్యం, ఎన్నికలు యువత‘ అనే అంశంపై ఉపన్యాస పోటీ నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ప్రొఫెసర్ కుమారస్వామి, రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ లైబ్రేరియన్ వీర ప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ భుజంగం, లెక్చరర్ రాజేంద్రప్రసాద్ ఉన్నారు. డిప్యూటీ లైబ్రేరియన్ రాజిరెడ్డి, అసిస్టెంట్ లైబ్రేరియన్ తారకం తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు కొనసాగుతుంది. ప్రస్తుతం 9454 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ నుంచి సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 8వేల క్యూసెక్కులు, తాగునీటి అవసరాల కోసం మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 573 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రాజెక్ట్ ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో సమానంగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులుతో నిండుకుండలా ఉంది. 36.35 మెగావాట్ల విద్యుదుత్పత్తి.. ప్రాజెక్ట్ నుంచి ఎస్కెప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 8 వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుండటంతో స్థానిక జల విద్యుదుత్పత్తి కేంద్రంలో నాలుగు టర్బయిన్ల ద్వారా 36.35 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 78.8 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగిందని జెన్కో అధికారులు తెలిపారు. ● 32 మందికి జరిమానా నిజామాబాద్అర్బన్: నగరంలో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా, మద్యం తాగి వాహనాలు నడుపుతూ 40మంది పట్టుబడ్డారు. వారికి శనివారం ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ, ట్రాఫిక్ సీఐ ప్రసాద్ కౌన్సెలింగ్ నిర్వహించి, అనంతరం నగరంలోని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. జడ్జి వారిలో 32 మందికి రూ. 10,000 చొప్పున జరిమానా విధించగా, 8 మందికి వారం రోజుల పాటు జైలుశిక్ష విధించారు. -
నిజాయితీని చాటుకున్న మహిళ
● దొరికిన పర్సు పోలీసులకు అప్పగింత రామారెడ్డి: ఓ మహిళ తనకు దొరికిన పర్సును పోలీస్ స్టేషన్ వెళ్లి పోలీసులకు అప్పగించి, నిజాయితీని చాటింది. వివరాలు ఇలా.. బాన్సువాడలోని మేకల సాయిసురేఖ ఇటీవల మండల కేంద్రంలోని కాలభైరవ స్వామి ఉత్సవాలకు వచ్చింది. శుక్రవారం రాత్రి ఆమె ఎక్కడో పర్సు పోగొట్టుకుంది. ఆ పర్సు కందూరి పెద్దలక్ష్మి అనే మహిళకు దొరికింది. లక్ష్మి పరుల సొమ్ము నాకెందుకని, దొరికిన పర్సును శనివారం పోలీస్స్టేషన్కె వెళ్లి ఎస్సై రాజశేఖర్కు అప్పగించింది. బాధితురాలు పర్సు పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి అదే సమయానికి వెళ్లింది. కానీ అప్పటికే ఆ పర్సు పోలీస్ స్టేషన్కు చేరడంతో ఎస్సై పర్సును, అందులోని రూ.20వేలనగదును బాధిత మహిళ కు అప్పగించారు. నిజాయితీగా పర్సును పోలీసులకు అప్పగించిన పెద్దలక్ష్మిని సన్మానించి అభినందించారు. -
తగ్గుతున్న భూసారం
లింగంపేట(ఎల్లారెడ్డి): రైతులు పండించిన వరి పంట నూర్పిళ్లు చేసిన పది, పదిహేను రోజులకు వరి కొయ్య కాళ్లకు నిప్పు పెట్టి కాల్చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతీ ఏటా ఇలా చేయడం వల్ల చేనులో భూసారం తగ్గిపోయి దిగుబడి తగ్గిపోతోంది. కొయ్యలను కాల్చడం వల్ల భూసారం క్షీణించడం, పొలంలోని సేంద్రియ పదార్థం, పోషకాలు, సూక్ష్మజీవులు, మిత్ర పురుగులు నశించిపోతాయి. రైతులు నష్టపోకుండా ఉండాలంటే నూర్పిళ్లు చేసిన అనంతరం యంత్రం ద్వారా వచ్చిన గడ్డిని కట్టలు కట్టించాలి. రెండు, మూడు రోజుల్లో పొలం కలియదున్నాలి. దాంతో వరి నాట్లు వేసేవరకు భూమి లోపలికి గాలి ప్రవేశించి భూసారం పెరుగుతుంది. వరి కొయ్యలు సైతం మట్టిలో కుళ్లిపోయి సేంద్రీయ ఎరువుగా మారుతుంది. ఇది కలుపు మొక్కలను తగ్గించి, మొక్కల ఆరోగ్యకరమైన పెరుగుదలకు తోడ్పడుతుంది. వరి కొయ్యలను కాల్చకుండా వాటిని భూమిలో కలపడం చాలా శ్రేయస్కరం. నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. పొలంలో కలిపిన కొయ్యలు కుళ్లిపోయి నేలలో సారం పెంచుతుంది. నీటిని నిలుపుకునే సామర్థ్యం పెరుగుతుంది. అలాగే నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తాయి. ప్రతీ ఏటా పంటల మార్పిడి చేయడం వల్ల భూసారం పెంచుకోవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. పంటల మార్పిడితో దిగుబడులు సైతం పెరుగుతాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కలుపు మొక్కలు తగ్గుతాయి.. వరి కొయ్యలు కుళ్లిపోవడం వల్ల కలుపు మొక్కల పెరుగుదల తగ్గుతుంది.నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది.నేల ఆరోగ్యం మెరుగుపడటం వల్ల మొ క్క వేళ్లు ఆరోగ్యంగా పెరిగి, అధిక దిగుబడి వస్తుంది. వరి కొయ్యలు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడతాయి.వరి పొట్టు కార్బన్కు మూలం. ఇది నేల లో నీటిని,పోషకాలను నిలుపుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.వరి పొట్టును మల్చ్గా ఉపయోగించడం వల్ల కలుపు మొక్కల పెరుగుదలను తగ్గిస్తుంది. పెరుగుతున్న వాతావరణ కాలుష్యం.. వరి కొయ్యలు కాల్చినప్పుడు వచ్చే పొగ, బూడిద వాతావరణ కాలుష్యాన్ని పెంచుతోంది. దీనివల్ల రైతులకు శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే పంట దిగుబడి తగ్గుతుంది. కొయ్యలు కాల్చడం వల్ల భూమి పైపొర గట్టిపడి, మట్టిని దున్నడం కష్టమవుతుంది. అలాగే నీరు భూమిలోకి ఇంకే సామర్థ్యం తగ్గిపోతుంది. రైతులు వరి పంటలను నూ ర్పి ళ్లు చేసిన తర్వాత కొయ్యలను కాల్చవద్దు. రైతులకు ‘రై తు నేస్తం’ కార్యక్రమం ద్వారా కొ య్యలు కాల్చవద్దని అవగాహ న కల్పిస్తున్నాం. ఖరీఫ్, యాసంగిలో ఒకే పంట వే యడం వల్ల దిగుబడి తగ్గుతుంది. పంటల మార్పిడి పద్ధతులు పాటిస్తే మేలు. కాలుష్యాన్ని నివారించడానికి కొయ్యలకు నిప్పు పెట్టడం నిలిపివేయాలి. – అనిల్కుమార్, ఏవో, లింగంపేట వరి కొయ్యలను తగులబెట్టడంతో దిగుబడిపై ప్రభావం పెరుగుతున్న కాలుష్యంతో రోగాల బారిన పడుతున్న రైతులు పంటల మార్పిడి అవసరమంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు -
మున్సిఫ్ కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టులో శనివారం ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కోర్టు సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి సుష్మ ప్రత్యేక లోక్ అదాలత్లో రాజీ చేసుకోదగ్గ కేసులను పరిష్కరించినట్లు వారు తెలిపారు. ప్రత్యేక లోక్ అదాలత్లో 164 కేసులను పరిష్కరించినట్లు చెప్పారు. వీటిలో 5 సివిల్, 32 క్రిమినల్, 127 పీటీ కేసులను న్యాయమూర్తి పరిష్కరించినట్లు వారు తెలిపారు. పీటీ, క్రిమినల్ కేసులకు సంబంధించి 2 లక్షల 72 వేల 137 రూపాయలు జరిమానాలు విధించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్రావు, పండరి, నవీద్, సాయిప్రకాష్, శ్రీనివాస్, సతీష్, శ్రీకాంత్ తదితరులున్నారు. కామారెడ్డి అర్బన్: విద్యుత్ వినియోగదారులకు అవసరమైన అన్ని సేవలు టీజీఎన్పీడీసీఎల్ యాప్, వాటాప్స్ నంబర్ 79016 28348 ద్వారా పొందాలని జిల్లా ఎస్ఈ శ్రావణ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. గృహ వినియోగదారులతో పాటు రైతులు, పరిశ్రమలున్న వారు ఎలాంటి సమస్యలున్నా ఇబ్బందులు పడొద్దని, అవసరమైనప్పుడు 1912 నంబర్ కాల్ చేయాలని సూచించారు. ఆర్మూర్: ఆత్మరక్షణ కోసం విద్యార్థులు తైక్వాండో లాంటి క్రీడల్లో శిక్షణ పొందాలని జిల్లా అధ్యక్షుడు ఈరవత్రి రాజశేఖర్ సూచించారు. పట్టణంలోని క్షత్రియ కల్యాణ మండపంలో శనివారం తైక్వాండో పోటీలను నిర్వహించారు. తైక్వాండో గ్రాండ్ మాస్టర్ భోజన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలకు రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పోటీల్లో 108 మంది క్రీడాకారులు పాల్గొనగా బెల్టులు సాధించిన వారికి ముఖ్య అతిథి చేతుల మీదుగా బెల్టులతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. కరాటే కోచ్ రాజు, ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు డిష్ రాంప్రసాద్, కొండి రాంచందర్, టైలర్ వినోద్ పాల్గొన్నారు. సిరికొండ: చిన్న వయస్సులోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణకు ఇటీవల పితృ వియోగం కలిగిన విషయం తెలిసిందే. దీంతో మండలంలోని పాకాల గ్రామంలో ఉన్న పూర్ణను శనివారం రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పరామర్శించారు. పూర్ణ తండ్రి దేవిదాస్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. నాయకులు బాకారం రవి, భాస్కర్రెడ్డి, ఎర్రన్న, నరేష్, తదితరులు ఉన్నారు. -
క్రైం కార్నర్
నవీపేట: మండలంలోని నాళేశ్వర్ శివారులోని ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పడి నీటమునిగి మృతిచెందాడు. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాలు ఇలా.. మాక్లూర్ మండలం ముత్యంపల్లికి చెందిన పెరిగె చిన్నసాయిలు(51) శుక్రవారం నందిపేట మండలం తల్వెదలో జరిగిన ఓ శుభకార్యానికి వెళ్లాడు. అనంతరం అదేరోజు రాత్రి అతడు నాళేశ్వర్లోని బంధువు ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం చిన్నసాయిలు కాలకృత్యాల కోసం బయటకు వెళ్లి, తిరిగి రాలేడు. నాళేశ్వర్ శివారులోని ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్లో చిన్నసాయిలు మృతదేహం కనిపించింది. మృతుడి కుమారుడు సందీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాల్కొండ: మెండోరా మండలం దూదిగాం గ్రామంలో శనివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మెండోరా ఎస్సై సుహాసిని తెలిపిన వివరాలు ఇలా.. దూదిగాం వద్దగల జాతీయ రహదారి 44 సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెంది ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటన స్థలానికి వెళ్లి పరిసరాలను పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉండవచ్చన్నారు. బ్లూ కలర్ షర్ట్, బ్లాక్ కలర్ ప్యాంట్, బెల్ట్ ధరించి ఉన్నాడన్నారు. తెల్లటి గడ్డం ఉందన్నారు. ఆచూకి తెలిసిన వారు మెండోరా పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసుకుని శవాన్ని ఆర్మూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. -
వరి నారుమడిలో యాజమాన్యం
రుద్రూర్: ప్రస్తుతం చలికాలం కావడంతో రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరగడంతో వరి నారుమడి యాజమాన్యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని రుద్రూర్ కృషి విజ్ఞాన కేంద్రం ప్రొగ్రాం కో–అర్డినేటర్ సుప్రజ రైతులకు సూచిస్తున్నారు. చలి ప్రభావం వల్ల వరి నారు ఆకు కొనలు ఎర్రబడడం, ఎండిపోవడం, కొన్నిసార్లు చనిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయన్నారు. ఈ సమస్యలను నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చలి నుంచి రక్షణ: నారుమడిపై కర్రలతో ఊతమిచ్చి సాయంత్రం వేళల్లో పాలిథిన్ లేదా టార్పలిన్ షీట్తో కప్పాలి. మరుసటి రోజు ఉదయాన్నే షీట్ తీసివేయాలి. జింకు లోప లక్షణాల నియంత్రణ: నారు ఆకుల కొనలు ఎండిపోవడం, గోధుమ రంగు మచ్చలు కనిపించడం వంటివి జింకు లోప లక్షణాలు. నివారణకు లీటరు నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి, పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయండి. నీటి యాజమాన్యం: రాత్రి వేళల్లో నారుమడిని నీటితో నింపి చలి ప్రభావాన్ని తగ్గించాలి. తెల్లవారుజామున నీటిని తీసివేసి తాజా నీరు పెట్టాలి. రోగ నిరోధకత కోసం: వరి నారు ఆరోగ్యంగా పెరగడానికి, యూరియా వేస్తున్నప్పుడు ఒక కిలో యూరియాకు 2 గ్రాముల కార్బెండజిమ్, మ్యాంకోజెట్ మిశ్రమ మందు కలిపి వేయాలని వివరించారు. -
వైభవంగా వీరభద్రుడి ఉత్సవాలు
మద్నూర్(జుక్కల్): ఓం నమః శివాయా.. హర హ ర మహాదేవ్.. అంటూ భక్తులు వీరభద్రుడి దండకా ల మధ్య నిప్పు కణికలపై నడిచారు. మూడు రోజులుగా మండల కేంద్రంలో జరుగుతున్న వీరభద్రుడి ఉత్సవాలు శనివారం ముగిశాయి. ఈ సందర్భంగా మండల ప్రజలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన భక్తులు హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి తర్వాత 9వ రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ అర్చకులు సంగాయప్ప స్వామి తెలిపారు. ఆలయంలో భజన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పల్లకీ ఊరేగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది. వీరభద్రుని ఉత్సవాల సందర్భంగా దక్ష యజ్ఞం(అగ్నిగుండం) నిర్వహించారు. ఈ సందర్బంగా భక్తులు నిప్పు కణికలపై నడిచి తమ భక్తిని చాటుకున్నారు. మద్నూర్లో పల్లకీ ఊరేగింపు నిర్వహిస్తున్న భక్తులు , అగ్ని గుండంలో నడుస్తున్న భక్తులు -
తెయూలో ‘మహిళల కథలు –వికాసం, వైవిధ్యం’పై సదస్సు
మోపాల్(నిజామాబాద్రూరల్): తెలంగాణ విశ్వవిద్యాలయంలో శనివారం సాహిత్య అకాడమీ, తెలుగు అధ్యయన శాఖ ఆధ్వర్యంలో ‘తెలంగాణ మహిళల కథలు –వికాసం, విస్తృతి, వైవిధ్యం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. నిర్వాహకులు చంద్రశేఖర రాజు స్వాగతోపన్యాసం చేయగా, తెయూ ఆర్ట్స్ కళాశాల డీన్ కరిమిండ్ల లావణ్య ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం ఆమె రచించిన సాహితీ కిరణాలు (విమర్శన వ్యాసాలు అనే సంపుటి)ను సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యులు ఎస్వీ సత్యనారాయణ ఆవిష్కరించారు. ఈసందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. తెలంగాణ మూలాలు తెలంగి, తెలుగు నుంచి వచ్చాయని తెలిపారు. ప్రముఖ రచయిత్రి, విమర్శకులు ఆచార్య ముదిగంటి సుజాతారెడ్డి. ఆచార్యులు కనకయ్య, లక్ష్మణ చక్రవర్తి, వంగరి త్రివేణి, సంధ్యారాణి, రజిని, వెల్దండి శ్రీధర్, దేవేంద్ర మాట్లాడా రు. తెయూ విద్యార్థులు, తెలుగు భాషోపాధ్యాయులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. -
సిద్ధరామేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు
భిక్కనూరు: కార్తీక మాసం చివరి శనివారం సందర్భంగా దక్షిణకాశీగా పేరొందిన భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ పండితులు సిద్ధగిరిశర్మ, రామగిరి శర్మ, రాజేశ్వరశర్మ, పూజారి సిద్దేశ్ స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, మాతా భువనేశ్వరి దేవికి కుంకుమ పూజలు, గండదీపం, కోడె మొక్కులు, సత్యనారా యణ వ్రతాలను నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీధర్, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ తాటిపాములు లింబాద్రి, డైరెక్టర్లు భక్తులకు సేవలు అందించారు. 17 వరకు రేషన్ బియ్యం పంపిణీ కామారెడ్డి రూరల్: రేషన్ షాపుల ద్వారా న వంబర్ నెలకు సంబంధించిన ఉచిత బి య్యం పంపిణీ ఈ నెల 17 వరకు కొనసాగుతుందని పౌరసరఫరాల శాఖ అధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ముందు గా ఈ నెల 15 చివరి తేదీ అని ప్రకటించినప్పటికీ.. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లను లారీల్లో రైస్ మిల్లులకు తరలించడం కారణంగా రేషన్ షాపులకు బియ్యం సరఫరా ఆ లస్యమైంది. ఈ కారణంగా పంపిణీ పూర్తి స్థాయిలో జరగకపోవడంతో పంపిణీ తేదీని పొడగించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు రేషన్ బియ్యం తీసుకోని వినియోగదారులు ఎవరైనా ఉంటే సంబంధిత రేషన్ షాపుల్లో బియ్యం తీసుకోవాలని పౌరసరఫరాలశాఖ అధికారులు సూచించారు. రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్ మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని సీ సీఐ, ప్రైవేట్ పత్తి కొనుగోళ్లను సోమవారం నుంచి బంద్ చేస్తున్నట్లు జిన్నింగ్ మిల్లుల యజమానులు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ కాటన్మిల్లులు, ట్రే డర్ల వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు ప త్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నామని పేర్కొన్నా రు. జిల్లాలో ఏకై క కొనుగోలు కేంద్రం ఉన్న మద్నూర్కు పత్తి తీసుకురావొద్దని రైతులకు వ్యాపారులు సూచించారు. పత్తి కొనుగోళ్ల లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విధించిన ఎల్1, ఎల్2, ఎల్3 ఆంక్షల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రైతులు సహకరించాలని వారు కోరారు. ఉపాధి కల్పనాధికారిగా కిరణ్కుమార్ కామారెడ్డి క్రైం: జిల్లా ఉపాధి కల్పనాధికారి గా కిరణ్కుమార్ నియమితులయ్యారు. ఇటీవలే గ్రూప్–1 సాధించిన కిరణ్ కామారెడ్డి జిల్లా ఉపాధి కల్పన అధికారిగా నియమితులయ్యారు. శనివారం బాధ్యతలు స్వీకరించి న అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను మ ర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఇదివరకు ఉపాధి కల్పనాధికారిగా ప నిచేసిన రజినీ కిరణ్ ఆదిలాబాద్ జిల్లాకు బ దిలీపై వెళ్లారు. 20 వరకు పీజీ స్పాట్ అడ్మిషన్లు కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఈనెల 20వ తేదీ వరకు పీజీ స్పాట్ అడ్మిషన్లు పొందొచ్చని ప్రిన్సిపాల్ కే విజయకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ ఇంగ్లిష్, తెలుగు, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఎంఎస్డబ్ల్యూ, ఎంకాం, ఎమ్మెస్సీ బొటనీ, ఫారెస్ట్రీ, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఫిషరీస్ కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయని, అన్ని ఒరిజనల్ సర్టిఫికెట్లతో విద్యార్థులు సంప్రదించి వెంటనే సీట్లు పొందవచ్చని తెలిపారు. -
1.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ
● 429 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకాలు ● ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల వేగం పెంచాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్నిజాంసాగర్(జుక్కల్): జిల్లాలోని 429 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 1.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణతోపాటు ధాన్యం తూకాలు, ట్యాబ్ ఎంట్రీపై దృష్టి సారించాలని సూచించారు. మండలంలోని సుల్తాన్నగర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, నిజాంసాగర్, బంజపల్లి, వెల్గనూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ శనివారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధాన్యం దిగుబడులు, పెట్టుబడి ఖ ర్చులు, ధాన్యం విక్రయాలకు కల్పించిన సదుపాయాలను తెలుసుకున్నారు. కలెక్టర వెంట డిప్యూటీ కలెక్టర్ రవితేజ, సివిల్ సప్లయీస్ జిల్లా అధికారి శ్రీ కాంత్, అచ్చంపేట సొసైటీ చైర్మన్ నర్సింహారెడ్డి, ఎంపీడీవో శివకృష్ణ, తహసీల్దార్ భిక్షపతి, వ్యవసాయశాఖ అధికారి అమర్ప్రసాద్, హౌసింగ్ డీఈఈ మొగులయ్య, ఐకేపీ ఏపీ ఎం ప్రసన్నరాణి, ఎస్సై శివకుమార్, సొసైటీ సీఈ వో సంగమేశ్వర్గౌడ్, పంచాయతీ కార్యదర్శి రవిరాథోడ్ ఉన్నారు. ఇసుక తరలింపునకు అనుమతి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా చూసుకోవాలని తహసీల్దార్ భిక్షపతికి కలెక్టర్ సంగ్వాన్ సూచించారు. మంజీర వాగు నుంచి ఇసుక త రలించేందుకు మూడు మండలాలకు అనుమతులు ఇస్తున్నామని తహసీల్దార్ కలెక్టర్కు తెలిపారు. గండిమాసానిపేటలో.. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటి పరిధిలోని గండిమాసానిపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. ధాన్యం కాంటా బస్తాకు 42 కిలోలు తూకం వేసినప్పటికీ రైస్మిల్ యజమానులు లారీకి 10 నుంచి 12 బస్తాల ధాన్యాన్ని తరుగు పేరుతో తీస్తున్నారని, లేదంటే లారీని వెనక్కి పంపుతామని ఇబ్బంది పెడుతున్నా రని రైతులు కలెక్టర్కు తెలిపారు. ఆర్డీవో పార్థసింహారెడ్డి, తహసీల్దార్ ప్రేమ్కుమార్, సొసైటీ చైర్మన్ ఏగుల నర్సింలు, కార్యదర్శి విశ్వనాథం ఉన్నారు. -
స్కూల్ బస్సు కిందపడి క్లీనర్ మృతి
నిజామాబాద్అర్బన్: నగరంలోని అర్సపల్లిలో శనివారం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు కిందపడి క్లీనర్ మృతి చెందాడు. ఆరో టౌన్ పోలీసులు తెలిపిన వి వరాల ప్రకారం... నిజామాబాద్ మండలం ధర్మారం(ఎం) గ్రామానికి చెందిన కిషన్(45) జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాల బస్సు క్లీనర్గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం విద్యార్థులను తీ సుకువచ్చేందుకు పాఠశాల బస్సు అర్సపల్లి వెళ్లింది. ఆటోస్టాండ్ వద్ద బస్సు వెనక్కి తీసుకునే క్రమంలో వెనకాలే ఉన్న కిషన్ బస్సును చూసుకోలేకపోయాడు. డ్రైవర్ సైతం గమనించకపోవడంతో బస్సు కిషన్ ఢీ కొట్టింది. వెనుక టైర్ కిషన్ తల పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రాజీ మార్గమే రాజమార్గం
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ ● లోక్ అదాలత్లో 409 కేసుల పరిష్కారంకామారెడ్డి టౌన్ : రాజీ మార్గమే రాజమార్గమని న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీఆర్ఆర్ వరప్రసాద్ అన్నారు. జిల్లా కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. కక్షిదారులు రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కారం చేసుకోవచ్చని, ఇందుకోసం లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇరు పక్షాలకు న్యాయం జరుగుతుందని, బాధితులకు నష్టపరిహారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి నాగరాణి, జూనియర్ సివిల్ జడ్జి దీక్ష, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, న్యాయవాదులు శంకర్రెడ్డి, సలీం, సిద్ధిరాములు, మురళి, వేణుప్రసాద్, శ్రవణ్గౌడ్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆరు ప్రత్యేక బెంచీలు.. జిల్లా వ్యాప్తంగా ఆరు ప్రత్యేక లోక్ అదాలత్ బెంచీలను ఏర్పాటు చేసి 409 కేసులను పరిష్కరించారు. ఇందులో పోలీస్ కేసులు 385, ఎన్ఐ యాక్ట్ కేసులు రెండు, ఇతర కేసులు 22 ఉన్నాయి. -
రైతు రత్న దరఖాస్తు గడువు పొడిగింపు
పాల్గొన్న బీసీ కులాల నాయకులు, కార్యకర్తలుకామారెడ్డి క్రైం: తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ సహకారంతో ఎంపిక చేయనున్న రైతు రత్న అవార్డుల దరఖాస్తు గడువును ఈ నెల 18 నుంచి 20వ తేదీకి పొడిగించినట్లు అసోసియేషన్ ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సుస్థిర, సమీకృత, వి నూత్న వ్యవసాయం, ఉద్యాన పంటల సాగు, సేంద్రియ, స్నేహపూర్వక వ్యవసాయానికి విశి ష్ట సేవలందించిన రైతులు, మహిళా రైతులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికై న వారిని హైదరాబాద్లోని హార్ట్ఫుల్నెస్ సెంటర్లో డిసెంబర్ 3 నుంచి 5 వరకు జరిగే మహాకిసాన్ మేళాలో భాగంగా అవార్డులతో సత్కరించనున్నామన్నారు. ఆసక్తి కలిగిన రైతులు మండల వ్యవసాయాధికారులను సంప్రదించి ఈ నెల 20వ తేదీ వరకు తమ దరఖాస్తులను అందజేయాలని సూచించారు. -
ఇంటర్లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి) : ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేస్తున్నామని జిల్లా ఇంట ర్ విద్యాధికారి(డీఐఈవో) షేక్సలాం అన్నారు. నాగిరెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళా శాలలోని అధ్యాపకుల, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ప్రిపరేషన్లో భా గంగా ఏవైనా సందేహాలోస్తే అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకోవాలని విద్యార్థులకు ఆయన సూ చించారు. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి కళాశాలకు, అధ్యాపకులకు మంచిపేరును తీసుకురావాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యే క దృష్టి సారించి పరీక్షలకు సన్నద్ధం చేయాలని అధ్యాపకులకు ఆదేశించారు. ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళ ల్లో విద్యార్థులకు స్టడీ అవర్స్ కొనసాగిస్తున్నామని అన్నారు. ఆయనవెంట కళాశాల అధ్యాపకులు ఉన్నారు. -
భద్రత లోపాలు ఉండొద్దు
● టీజీఆర్టీసీ సీసీఈ కవితసుభాష్నగర్: బస్టాండ్లో ప్రయాణికుల సౌకర్యాలు, భద్రత, పరిశుభ్రతకు ఎలాంటి లోపాలు ఉండొద్దని టీజీఆర్టీసీ కార్పొరేట్ చీఫ్ ఇంజినీర్ (సీసీఈ) కవిత సూచించారు. జిల్లాకేంద్రంలోని బస్టాండ్, ఆర్ఎం కార్యాలయంలో ఉన్న భవనాల ను ఆమె శనివారం తనిఖీ చేశారు. భవనాల గోడ లు, పైకప్పులు, డ్రెయినేజీ వ్యవస్థ, ప్రయాణికుల విశ్రాంతి గదులు, టికెట్ కౌంటర్లు తదితర ముఖ్య విభాగాలను ఆమె స్వయంగా పరిశీలించారు. భవ నం పాడైపోయిన చోట్ల వెంటనే పనులు ప్రారంభించేందుకు సంబంధిత విభాగానికి ఆదేశాలు జారీచేశారు. బస్టాండ్లో మరమ్మతులు, అత్యవసరంగా చేయాల్సిన ప్రాంతాలను గుర్తించాలన్నారు. ఆమె వెంట నిజామాబాద్ రీజినల్ మేనేజర్ జ్యోత్స్న, డిప్యూటీ రీజినల్ మేనేజర్ మధుసూదన్, డిపో మేనేజర్లు, కార్యాలయ సిబ్బంది, ఇంజినీరింగ్ వి భాగం అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. -
బీసీ రిజర్వేషన్లు సాధించుకుందాం
● రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య ● హాజరైన బీసీ సంఘాల నేతలు ● జిల్లా కేంద్రంలో బీసీ ఆక్రోశ సభకామారెడ్డి టౌన్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యే వరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమించాలని రిజర్వేషన్ల సాధన సమితి చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని సత్యగార్డెన్లో శనివారం నిర్వహించిన బీసీ ఆక్రోశ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బీసీ రిజర్వేషన్స్ను 9వ షెడ్యూల్లో పెట్టకుండా అడ్డుకుంటున్న బీజేపీపై, బీసీలపై నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న బీఆర్ఎస్పై, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీల అమలు కోసం కాంగ్రెస్పై అన్ని వర్గాలు పోరాటాలకు సిద్ధం కావాలని అన్నారు. ఆ మూడు పార్టీలు స్వార్థ రాజకీయాలు, ఓట్ల కోసం బీసీలను మోసం చేశాయని విమర్శించారు. తమిళనాడులో చట్టబద్ధంగా బీసీలకు 69శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని తెలంగాణలో 56శాతం ఉన్న బీసీలకు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆర్టికల్ 30, 31బీ ప్రకారం ఉభయ సభల్లో బిల్ను పాస్ చేసి, గవర్నర్ ఆమోదం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే, రాజ్యాంగం 9 షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్, రాజ్యసభ, రాష్ట్రపతి ఆమోదం తెలిపితే బీసీలకు చట్టప్రకారం 42శాతం రిజర్వేషన్లు అమలు చేయొచ్చని అన్నారు. బీజేపీ ఊసరవెల్లిలా రంగులు మారుస్తోందని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేల బిడ్డలతో సమానంగా పేద, మధ్యతరగతి బిడ్డలకు విద్య, వైద్యం అందినప్పుడే దేశం, రాష్ట్రాలు అభివృద్ధి చెందినట్లన్నారు. అనంతరం రాబోయే అన్ని ఎన్నికల్లో బీసీ, బహుజన అభ్యర్థులకు ఓట్లు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. బీసీలను మోసం చేయొద్దు రాష్ట్ర అధ్యక్షుడు చిరంజీవులు మాట్లాడుతూ.. బీసీల రిజర్వేషన్ల అమలును బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. ఉసరవెల్లిలా రాజకీయాల కోసం బీసీలను మోసం చేయొద్దని కోరారు. వైస్ చైర్మన్ విశారదన్ మహారాజ్ మాట్లాడుతూ.. బీసీలకు న్యాయం జరిగేలా రాష్ట్రంలో దళితులు, అన్ని వర్గాలు మద్దతు తెలుపుతున్నాయన్నారు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయపార్టీలు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. సభలో వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగౌని బాలరాజ్గౌడ్, సినిమా డైరెక్టర్ ఎన్ శంకర్, నాయకులు, మర్కంటి భీమన్న, బాలార్జున్గౌడ్, సిద్ధిరాములు, పుట్ట మల్లికార్జున్, రమేశ్బాబు, వేణుగోపాల్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పుస్తక పఠనం ప్రతిరోజు చేయాలి
కామారెడ్డి అర్బన్ : విద్యార్థులు, యువత ప్ర తిరోజు గ్రంథాలయానికి వచ్చి పుస్తకపఠనం చేయాలని, దీంతో అనుకున్న లక్ష్యాలను చే రుకోవచ్చని అడిషనల్ కలెక్టర్ మధుమోహన్, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి అన్నారు. ప ట్టణంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శు క్రవారం జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ను వారు ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమానికి సంస్థ జిల్లా చైర్మన్ మద్ధి చంద్రకాంత్ రెడ్డి అధ్యక్షత వహించారు. వారం రోజుల పా టు వివిధ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చైర్మన్ చంద్రకాంత్రెడ్డి ప్రకటించా రు. జిల్లా గ్రంథాలయ సంస్థకు స్థానిక వ్యాపా రి బాలాజీ రేడియో హౌస యాజమాని మహిపాల్ రోహిత్ జైన్ రూ.50 వేల విలువైన అహుజా సౌండ్ సిస్టంను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాతను చైర్మన్ చంద్రకాంత్రెడ్డి సన్మానించి జ్ఞాపికను అందజేశారు. సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు. -
ఎస్సెస్సీలో వందశాతం ఉత్తీర్ణత సాధిస్తాం
● విద్యార్థులకు ప్రత్యేక తరగతులు ● డీఈవో రాజు నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఈయేడు జరుగనున్న పదోతరగతి(ఎస్సెస్సీ) వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధిస్తామని డీఈవో రాజు అన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్పేట మోడల్స్కూల్లో శుక్రవారం జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీఈవో మాట్లాడుతూ.. ప్రస్తుత సంవత్సరం పదోతరగతి పరీక్షలకు ఇప్పటివరకు 12,126మంది విద్యార్థులు ఫీజు చెల్లించారన్నారు. కాగా పరీక్షఫీజు చెల్లింపు కోసం ఈనెల 13 వరకు గడువు విధించగా తాజాగా ఫీజు చెల్లింపు తేదీని ఈనెల 20 వరకు పొడిగించినట్లు తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ కోసం జిల్లావ్యాప్తంగా 64 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. గతయేడు పదోతరగతి పరీక్షల్లో జిల్లా విద్యార్థులు 96శాతం ఉత్తీర్ణత సాధించారని, ఈయేడు వందశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేస్తామన్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్నిపాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులకు సాయంత్రంవేళ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఆదర్శ బడుల్లో అడ్మిషన్లకు పోటీ జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో చక్కని బోధన జరుగుతుందని, ఎన్ని గురుకులాలు వెలిసినా ఆదర్శ పాఠశాలల్లో అడ్మిషన్లకు పోటీ తగ్గడంలేదని డీఈవో రాజు అన్నారు. గోపాల్పేట ఆదర్శ పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. నాగిరెడ్డిపేట మండలంలోని ఆదర్శపాఠశాలలో విద్యార్థులను సి.వి.రామన్, శకుంతలదేవి, అబ్దుల్కలాం, రవీంద్రనాథ్ ఠాగూర్ హౌస్లుగా విభజించడం చాలా బాగుందన్నారు. అనంతరం గత దసరా సెలవుల్లో వృత్తివిద్య కోర్సులకు సంబంధించి ఇంటర్న్షిప్ పూర్తి చేసుకున్న 22మంది విద్యార్థులకు సర్టిఫికేట్లను అందజేశారు. బాలల దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు తోటివిద్యార్థులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ లక్ష్మి, ప్రిన్సిపాల్ రాంప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ జ్యోత్స్న, హెచ్ఎం వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు భద్రతపై అవగాహన అవసరం
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● జిల్లాకేంద్రంలో ‘కిడ్స్ విత్ ఖాకీ, సేఫ్ కామారెడ్డి’ కార్యక్రమాల నిర్వహణ కామారెడ్డి క్రైం: ప్రతి ఒక్కరిరు రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో శుక్రవారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు శాఖ ఆధ్వర్యంలో పాఠశాలల విద్యార్థులతో కలిసి కిడ్స్ విత్ ఖాకీ, సేఫ్ కామారెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా మద్యం తాగి వాహనాలు నడపడంతో ఓ కుటుంబం ఏవిధంగా సర్వం కోల్పోతుందో, అమాయకులు సైతం ఎలా ప్రాణాలు కోల్పోతున్నారో నాటిక ప్రదర్శన ద్వారా విద్యార్థులు కళ్లకు కట్టినట్లు వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం సేఫ్ కామారెడ్డి పోస్టర్లలను కలెక్టర్, ఎస్పీ రాజేష్ చంద్రలు ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. డీపీవోను సందర్శించిన విద్యార్థులు జిల్లా పోలీస్ కార్యాలయం సందర్శనలో భాగంగా విద్యార్థులకు ఫింగర్ ప్రింట్, స్పెషల్ బ్రాంచ్, క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వంటి విభాగాల పనితీరుపై సిబ్బంది సమగ్ర అవగాహన కల్పించారు. సైబర్ క్రైౖమ్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. షీటీం, భరోసా కేంద్రం, పోలీస్ కంట్రోల్ రూం పనితీరు, సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లను తెలియజేశారు. డాగ్ స్క్వాడ్ సహాయంతో గంజాయి, పేలుడు పదార్థాలు వంటి వాటితోపాటు పల అంశాలను ప్రత్యక్షంగా చూపించారు. అనంతరం విద్యార్థులకు జ్ఞాపికలను అందజేశారు. అదనపు ఎస్పీ నర్సింహరెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్యరెడ్డి, డీఎస్పీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా నెహ్రూ జయంతి కామారెడ్డి క్రైం: పట్టణంలోని జిల్లా పోలీసు కా ర్యాలయంలో శుక్రవారం దేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా నెహ్రూ చిత్రపటానికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. -
ఎన్పీఏను తగ్గించడమే ప్రధాన లక్ష్యం
● ఎన్డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్ రెడ్డిసుభాష్నగర్ : రాబోయే రికవరీ సీజన్లో అన్ని వి ధాలుగా ప్రయత్నించి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఎన్పీఏను తగ్గించడమే ప్రధాన లక్ష్యంతో పాలకవర్గం, ఉద్యోగులు ముందుకెళ్తున్నారని ఎన్డీసీసీ బీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి పేర్కొన్నారు. ఎన్డీసీ సీబీ బ్యాంకు వ్యాపార కార్యకలాపాలు రూ.2,500 కోట్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా జిల్లాకేంద్రంలోని ప్రధాన కార్యాలయంలో ఆయన కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తంచేశారు. ఈ మైలురాయి చేరుకోవడంలో సహకరించిన సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బ్యాంకు మేనేజర్ల తో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చైర్మన్ మా ట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకు రూ.3,000 కోట్ల వ్యాపార కార్యకలాపాలకు చేరుకోవాలని సూచించారు. ఈ మైలురాయి ప్రతి ఉద్యోగి కి గుర్తుండిపోయేలా జ్ఞాపికలను అందజేస్తామని తె లిపారు. ఇటీవల ప్రవేశపెట్టిన కామధేను డిపాజిట్ ను విరివిగా ప్రచారం చేసి డిపాజిట్లు తీసుకురావా లని పేర్కొన్నారు. బ్యాంకులో ఉన్న అన్ని స్థాయిల ఉద్యోగులు తనకు తానుగా లక్ష్యాలను నిర్దేశించుకొని చేరుకోవాలని సూచించారు. రూ.2,500 కోట్ల మైలురాయి చేరుకోవడంలో ప్రత్యేక భూమిక పో షించి, నిరంతరం సమీక్షిస్తూ క్షేత్రస్థాయిలో విలువైన సూచనలు, బ్యాంకు పటిష్టతకు తీసుకుంటున్న చర్యలకు సీఈవో, ఉన్నతాధికారులకు ప్రత్యేక ధన్య వాదాలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి, డైరెక్టర్లు లింగయ్య, ఆనంద్, సీఈవో నాగభూషణం వందే, ఉన్నతాధికారులు, 63 శాఖల మేనేజర్లు పాల్గొన్నారు. -
సీఎంఆర్ఎఫ్ చెక్కును చింపేసిన సీడీసీ చైర్మన్
● సోదరి చికిత్స కోసం రూ.32 లక్షలు ఖర్చు పెట్టిన ఇర్షాదుద్దీన్ ● సీఎంఆర్ఎఫ్ కింద రూ.60 వేలే రావడంతో మనస్తాపం సదాశివనగర్ (ఎల్లారెడ్డి): అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన సీడీసీ చైర్మన్ ఇర్షాదుద్దీన్ ప్రభుత్వం నుంచి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును చింపివేసిన ఘటన శుక్రవారం జరిగింది. ఇర్షాద్ సోదరి నేహా బేగం 2024లో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో నేహాబేగంకు వైద్యం చేయించేందుకు రూ.32లక్షలు ఖర్చుపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. సోదరి చికిత్స కోసం అప్పులు తీసుకొచ్చి ఖర్చు పెట్టానని పేర్కొన్నారు. సీఎంఆర్ఎఫ్ కింద కనీసం 30 లేదా 40 శాతం వరకు డబ్బులు వస్తాయేమోనని ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లు తెలిపారు. చివరకు కేవలం రూ.60 వేలు రావడంతో మనస్థాపంతో చెక్కును చింపి వేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంజూరైన రూ.60వేలను ఏ అప్పుల వారికి చెల్లించాలి అని ఆవేదన చెందారు. పార్టీ కోసం కష్టపడిన నాకే ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదని పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కామారెడ్డి అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో (యూడైస్ కోడ్ ఉన్న పాఠశాలలు) 5 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ విద్యార్థుల నుంచి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఈ–పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని, అనంతరం వాటిని ఆయా పాఠశాలల హెడ్మాస్టర్లకు అందజేయాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేయడానికి కుల ధ్రువీకరణ, ఆదాయ, విద్యార్థి బ్యాంక్ పాస్బుక్, బోనఫైడ్, పాస్సైజ్ ఫో టో అవసరం అవుతాయని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు కామారెడ్డి టౌన్: వచ్చే ఏడాది మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు డీఈవో రాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు ఈనెల 20లోపు ఎలాంటి అపరాద రుసుం లేకుండా రూ. 125 పరీక్ష ఫీజును చెల్లించాలన్నారు. రూ.50 అపరాధ రుసుంతో 29 వరకు చెల్లించవచ్చన్నారు. రూ. 200 అపరాధ రుసుముతో డిసెంబర్ 11 వరకు, రూ. 500 అపరాధ రుసుముతో డిసెంబర్ 29వరకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని పదో తరగతి విద్యా ర్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈవో అన్నారు. 17న వాహనాల వేలం కామారెడ్డి అర్బన్: ఎకై ్సజ్ కేసుల్లో పట్టుబడిన పలు వాహనాలను వేలం వేయనున్నట్లు కామారెడ్డి ఎకై ్సజ్ సీఐ సీహెచ్ సంపత్కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ శివారులోని నర్సన్నపల్లి వద్ద గల తమ కార్యాలయంలో ఈనెల 17న ఉదయం 11గంటలకు వాహనాలను వేలం వేయనున్నట్టు పేర్కొన్నారు. వేలంలో పాల్గొనే ఆసక్తిగల వారు ముందుగా రూ.5వేలు చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. వేలంపాట వాహనం ధరపై 18శాతం జీఎస్టీ ఉంటుదని గమనించాలని సీఐ వివరించారు. -
చట్టాలపై అవగాహన
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం న్యాయచైతన్య సదస్సు నిర్వహించారు. మున్సిఫ్ కోర్టు న్యా యమూర్తి సుష్మ విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల హక్కుల గు రించి వివరించారు. సీఐ రాజారెడ్డి, బార్ అసో సియేషన్ అధ్యక్షుడు గోపాల్రావు, న్యాయవాదులు సాయిప్రకాష్, పండరి, సతీష్, నవీద్ తదితరులున్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మొక్కజొన్న కొనుగోళ్ల ను డిసెంబర్ 10 కల్లా పూర్తి చేయాలని మా ర్క్ఫెడ్ మేనేజర్ శశిధర్ రెడ్డి సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో విండో ఆధ్వర్యంలో చేపడుతున్న మొక్కజొన్న కొనుగోళ్లను ఆయన ప రిశీలించారు. మొక్కజొన్నలో తేమ శాతం పరిశీలించిన తర్వాతనే తూకం వేయాలన్నారు. తూ కం చేసిన బస్తాలను వెంటనే తరలించాలన్నారు. విండో చైర్మన్ కమలాకర్ రావు, సీఈవో విఘ్నేశ్ గౌడ్, ఏవో ప్రజాపతి, రైతులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: అంతర్జాతీయ సీనియర్ సిటిజన్స్ వారోత్సవాల సందర్భంగా జిల్లా సీనియర్ సిటిజన్స్ ఫోరం భవనంలో శుక్రవారం సాయంత్రం క్యారం పోటీలను జిల్లా అధ్యక్షుడు పున్న రాజేశ్వర్ ప్రారంభించారు. వారోత్సవాల్లో భాగంగా సీనియర్ సిటిజన్లకు వివిధ పోటీలు, కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఫోరం ప్రతినిధులు పీవీ నర్సింహం, మోహన్రెడ్డి, పురుషోత్తం, అంతిరెడ్డి, బాపురావు, రామచంద్రం, భద్రప్ప తదితరులు పాల్గొన్నారు. -
సీసీ రోడ్డుకు నిధులు కేటాయించాలి
బీబీపేట: మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయం నుంచి సొసైటీ, ప్రభుత్వాసుపత్రి, తహసీల్ కార్యాలయం వరకు సీసీ రోడ్డుకు నిధులు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డిని సొసైటీ డైరెక్టర్లు వినతి పత్రం అందజేశారు. కార్యాలయాలకు వెళ్లడానికి ఇబ్బందిగా ఉందని, లారీల్లో ధాన్యం, యూరియా తరలించడానికి సైతం ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొన్నారు. అలాగే తాగునీటికి సైతం ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. బోరుబావి తవ్వించాల్సిందిగా కోరారు. ఎమ్మెల్యే సాను కూలంగా స్పందించినట్లు వారు తెలిపారు. సొసై టీ వైస్ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, నరేందర్, శ్రీనివాస్, మల్లేశం, కిషన్రావు తదితరులు ఉన్నారు. -
తలసేమియా బాధితుల కోసం రక్తదానం చేయండి
కామారెడ్డి అర్బన్: తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులు తమ బంగారు బాల్యాన్ని కోల్పోడం విచారకరమని, వారిని కాపాడుకోవడానికి ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుందని, బాధ్యతగా యువత ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని పట్టణ సీఐ నరహరి కోరారు. బాలల దినోత్సవం సందర్భంగా తలసేమియా వ్యాధిపై అవగాహన కోసం శుక్రవారం కరపత్రాలను ఆవిష్కరించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 250 మంది చిన్నారులు తలసేమియా వ్యాధితో బాధపడుతున్నారని కామారెడ్డి రక్తదాతల సమూహం వ్యవస్థాపకులు, రెడ్క్రాస్ సొసైటీ జిల్లా సమన్వయకర్త బాలు తెలిపారు. రక్తదాతల సమూహం అధ్యక్షుడు జమీల్ అహ్మద్, గౌరవ అధ్యక్షుడు వేదప్రకాష్, ప్రతినిధులు చంద్రశేఖర్, గంప ప్రసాద్, వెంకటరమణ, పి.అనిల్ తదితరులు పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): అక్కంపల్లిలో మంగలి ఈశ్వరమ్మ నూతనంగా నిర్మించిన ఇంటిని శుక్రవారం ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి పరిశీలించారు. ఈశ్వరమ్మ ఇంటిపై ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన తీరుపై గురువారం పలు దినపత్రికలలో ప్రచురితమైన కథనాలకు ఆయన స్పందించారు. ఈ మేరకు ఆయన అక్కంపల్లికి చేరుకొని నూతనంగా నిర్మించిన ఇంటిని పరిశీలించారు. ఇంటినిర్మాణం చేపట్టిన తీరును ఈశ్వరమ్మను అడిగి ఆయన తెలుసుకున్నారు. పూర్తి నివేదికను రూపొందించి ఉన్నతాధికారులకు పంపనున్నట్లు ఆర్డీవో తెలిపారు. నాగిరెడ్డిపేట తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీవో లలితకుమారి, ఆర్ఐ మహ్మద్, పంచాయతీ కార్యదర్శి కిష్టయ్య తదితరులున్నారు. -
ఇంటర్ బోర్డు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
ఆర్మూర్టౌన్: ఇంటర్ బోర్డు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జిల్లా ఇంటర్ విద్యాధికారి తిరుమలపుడి రవికుమార్ అన్నారు. ఆర్మూర్లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, గిరిజన బాలుర జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ బాలుర జూనియర్ కళాశాల, చీమన్పల్లి గిరిజన బాలికల జూనియర్ కళాశాలను ఆయన శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటర్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతి అధ్యాపకుడు విద్యార్థుల శ్రేయస్సు కోసం పని చేయాలన్నారు. విద్యార్థులు అధ్యాపకులు బోధిస్తున్న పాఠాలను శ్రద్ధగా విని ప్రయోజకులుగా మారాలన్నారు. ఆయన వెంట ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు ఉన్నారు. -
చదువుతోనే సమాజంలో గుర్తింపు
● కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిభిక్కనూరు: చదువుతోనే సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో డీప్ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో పాఠశాలకు ఆయన 5 కంప్యూటర్లను అందజేయించారు. ఈ సందర్బంగా కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కేవీఆర్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచే క్రమశిక్షణతో మెలిగి ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకు సాగితే వారి భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుందన్నారు. ఎంఈవో రాజగంగారెడ్డి, హెచ్ఎం ప్రసూనదేవి, ఎన్సీసీసీ ప్రథమశ్రేణి అధికారి జి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చేప పిల్లల పంపిణీ బీబీపేట: ప్రభుత్వం మంజూరు చేసిన వంద శాతం రాయితీతో కూడిన చేప పిల్లలను శుక్రవారం ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి బీబీపేట పెద్ద చెరువులో విడుదల చేశారు. మత్స్య శాఖ సంఘం సభ్యులు పాల్గొన్నారు. సంఘాల అభివృద్ధికి కృషి చేస్తా రాజంపేట: మండలంలో సంఘాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు.పొందూర్తిలో శుక్రవారం మాల కుల సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు కల్యాణ మండపం నిర్మాణానికి భూమి పూజ చేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు సంపత్రెడ్డి,ప్రధాన కార్యదర్శి నరేందర్రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు గంగారెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడు సతీష్రెడ్డి పాల్గొన్నారు. -
కాలువలో పడి వృద్ధురాలి మృతి
నందిపేట్: మండల కేంద్రంలోని పలుగుట్ట సమీపంలోని నిజాంసాగర్ కాలువలో పడి కై రి గంగామణి (68) అనే వృద్ధురాలు మృతి చెందింది. నందిపేట్ ఎస్సై శ్యాంరాజ్ తెలిపిన వివరాల ప్రకా రం.. జిల్లా కేంద్రంలోని బోర్గాం(పి) శాస్త్రినగర్కు చెందిన కై రి గంగామణి గత 45 ఏళ్ల క్రితం ఆలూర్ మండల కేంద్రానికి చెందిన కృష్ణగౌడ్తో విడాకులు తీసుకుంది. నాటి నుంచి శాస్త్రినగర్లో ఉంటున్న తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ప్రతి నెల నందిపేటలోని పలుగుట్ట పుణ్య క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్లేది. ఈ నెల 5న పలుగుట్టకు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి తిరిగి రాలేదు. శుక్రవారం ఉదయం నిజాంసాగర్ కాలువలో మృతదేహం ఉందన్న స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. వారు మృతురాలి వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతురాలు కాలకృత్యాలకు వచ్చి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి తమ్ముడు గంగాధర్గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
డ్రంకన్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు
బోధన్టౌన్: డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ ఇద్దరికి బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేషతల్పసాయి జైలు శిక్షను విధించినట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ శుక్రవారం తెలిపారు. ఇటీవల పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా పట్టణానికి చెందిన లక్ష్మీనారాయణ, బోర్గాం గ్రామానికి చెందిన పోశెట్టి మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వీరిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చగా పోశెట్టికి మూడు రోజుల, లక్ష్మీనారాయణకు ఏడు రోజుల జైలు శిక్షను విధించారని సీఐ తెలిపారు.రావుట్లవాసికి ఏడు రోజులు.. ధర్పల్లి: డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ ఓ వ్యక్తికి మెజిస్ట్రేట్ ఏడు రోజుల జైలు శిక్షను విధించినట్లు ధర్పల్లి ఎస్సై కల్యాణి శుక్రవారం తెలిపారు. మండల కేంద్రంలో ఈనెల 12న నిర్వహించిన వాహనాల తనిఖీల్లో మద్యం సేవించి పట్టుబడ్డ సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన వ్యక్తిని కోర్టులో హాజరుపర్చామన్నారు. మెజిస్ట్రేట్ అతనికి ఏడు రోజుల జైలు శిక్షను విధించినట్లు ఎస్సై తెలిపారు. ఆర్మూర్లో నలుగురికి జరిమానా ఆర్మూర్టౌన్: మద్యం సేవించి వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డ నలుగురికి ఆర్మూర్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ జరిమానా విధించినట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలో శుక్రవారం రాత్రి చేపట్టిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో నలుగురు వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. జడ్జి వీరికి రూ. పదివేల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్హెచ్వో తెలిపారు.బాల్కొండలో ఇద్దరికి.. బాల్కొండ: డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ ఇద్దరికి ఆర్మూర్ కోర్టు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గట్టు గంగాధర్ రూ. పదివేల చొప్పున జరిమానా విధించినట్లు బాల్కొండ ఎస్సై శైలేందర్ శుక్రవారం తెలిపారు. బాల్కొండ పీఎస్ పరిధికి చెందిన పెంటు నర్సయ్య, దినేశ్ ఇటీవల మద్యం మత్తులో పట్టుబడడంతో వారిని కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై పేర్కొన్నారు. జడ్జి వీరికి రూ. పదివేల చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. వాహనదారులు మద్యం మత్తు సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మోపాల్: మండలంలోని సిర్పూర్ గ్రామంలో జంగం గణేశ్ నివాసంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్లు ఏఎస్సై కే పరమేశ్వర్ శుక్రవారం తెలిపారు. ఏఎస్సై కథనం ప్రకారం.. గణేశ్ గ్రామంలో పూజారిగా చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇంట్లో చార్జింగ్ పెట్టిన ల్యాప్టాప్ వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రమాదంలో రెండు బెడ్లు, ఫర్నీచర్, ల్యాప్టాప్, వ్యక్తిగత డాక్యుమెంట్లు, ఏసీ, దుస్తులు, పూర్తిగా కాలి బూడిదయ్యాయి. సుమారు రూ.2.56లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. స్థానికుల సహకారంతో మంటలను నియంత్రించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. భిక్కనూరు: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడు ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన భిక్కనూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన తిరుమల రాజయ్య(75)కు ఐదు నెలల క్రితం కాలుకు గాయమైంది. పలు ఆస్పత్రుల్లో చూయించినా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
శభాష్ పోలీసన్న
రుద్రూర్: మండల కేంద్రంలో వాహనంలో ఫిట్స్ వచ్చి బాధపడుతున్న ఓ వ్యక్తిని వాహనాల తనిఖీ చేపడుతున్న పోలీసులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం సాయంత్రం రుద్రూర్ ఎస్సై సాయన్న ఆధ్వర్యంలో పోలీసులు మండల కేంద్రంలో వాహనాల తనిఖీ చేపడుతున్న సమయంలో ఆగి ఉన్న ఓ లారీలో డ్రైవర్ ఫిట్స్తో ఇబ్బంది పడుతున్నట్టు ఎస్సై గుర్తించారు. వెంటనే 108 వాహనాన్ని రప్పించి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఫిట్స్ వచ్చిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించేలా కృషి చేసిన ఎస్సై తీరును పలువురు అభినందించారు. శభాష్ పోలీస్ అన్న అంటూ పలువురు అభినందనలు తెలిపారు. -
ప్లాస్టిక్ దుష్పరిణామాలపై అవగాహన
కామారెడ్డి అర్బన్: పర్యావరణ మార్పులు, ప్లాస్టిక్ వినియోగం– దుష్పరిణామాలు, ప్ర త్యామ్నాయాలు, దాని ప్రభావం, డెయిరీ రంగంపై వాటి ప్రభావం, రైతులు, డెయిరీ వి ద్యార్థులు తెలుసుకోవాల్సిన అంశాలపై శుక్రవారం కామారెడ్డి డెయిరీ టెక్నాలజీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేషనల్ యూత్ ఎన్విరాన్మెంట్ కన్సార్టియం సమన్వయకర్త మణిదీప్ వివిధ అంశాలపై వివరించారు. పేపర్ బ్యాగుల తయారీ విధా నం ప్రదర్శించారు. కళాశాల అసోసియేట్ డీన్ సురేష్ రాథోడ్, అధ్యాపకులు స్వర్ణలత, ఉమా పతి, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. బాలల చట్టాలపై అవగాహన ఉండాలి భిక్కనూరు: బాలల సంరక్షణ, హక్కులు, చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి అన్నారు. మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం బాలల చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నాయయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నపిల్లలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించేవిధంగా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చిన్నారులు ఎలాంటి ఇబ్బందులు ఎదురైన తల్లిదండ్రులకు బంధువులకు తెలియజేయాలన్నారు. విద్యార్థులు చదువుతోపాటు సమాజసేవ దేశ ప్రగతికి కృషిచేయాలన్నారు. అనంతరం పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని వారు పరిశీలించారు. ఎంఈవో రాజ్గంగారెడ్డి, ఆర్ఐ బాలయ్య తదితరులు పాల్గొన్నారు. భిక్కనూరు: ఎంఎస్ ఆఫ్తమాలజీలో రాష్ట్రస్థాయి రెండో ర్యాంకును భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన ఎస్పీ సంకీర్తన సాధించారు. సంకీర్తన హైదరాబాద్లోని మల్లారెడ్డి మెడికల్ కళాశాలలో ఎంఎస్ ఆప్తమాలజీ చదువుతోంది. గురువారం వెలువడిన ఎంఎస్ ఆప్తమాలాజీ పీజీ ఫలితాల్లో ఆమె రెండో ర్యాంకు సాధించింది. -
విద్యుత్షాక్తో ఒకరి మృతి
ఆర్మూర్టౌన్: ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్బోర్డులో ఓ ఇంటినిర్మాణ పనులు చేస్తున్న ఓ వ్యక్తికి విద్యుత్షాక్ తగలడంతో మృతి చెందాడు. ఆర్మూర్ ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన పాలిత కుమార్ లహరి(35) రెండేళ్ల క్రితం ఆర్మూర్కు వచ్చి మేసీ్త్ర పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం రాత్రి హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ ఇంటి నిర్మాణ పనులు చేస్తున్న అతనికి భవనంపై ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో కిందపడిపోయాడు. వెంటనే స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
మాక్లూర్లో భారీ చోరీ
● రెండు కిలోల వెండి, అర్ధతులం బంగారం, రూ. 2.50 లక్షల నగదు అపహరణ మాక్లూర్: మండల కేంద్రంలో శుక్రవారం వేకువ జామున భారీ చోరీ జరిగింది. ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గూండ్ల పెద్దన్న కొత్త ఇల్లును నిర్మించుకున్నాడు. కొత్త ఇంట్లోనే నివాసం ఉంటున్న అతను పాత ఇంట్లోని వస్తువులు ఇంకా కొత్త ఇంటికి చేర్చలేదు. గురువారం రాత్రి 8 వరకు పాత ఇంట్లోనే ఉన్న అతను తిరిగి కొత్త ఇంటికి వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంటి తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న అద్ద తులం బంగారం, రూ. 2లక్షల50వేల నగదు, 2 కిలోల వెండి చోరీకి గురైందని పెద్దన్న తెలిపారు. చోరీ విషయం తెలుసుకున్న నార్త్ జోన్ సీఐ శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకొని పరీశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
చికిత్స కేంద్రం ఏర్పాటు
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని రామారెడ్డి రోడ్డులో ఉదయ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యసన చికిత్స కేంద్రం ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ ఇన్చార్జి బోడ రాజు తెలిపారు. శుక్రవారం పట్టణ సీఐ నరహరిని మర్యాదపూర్వకంగా కలిసారు. కేంద్రం కరపత్రాన్ని అందజేశారు. డ్రగ్స్, ఆల్కహాల్ వ్యసనాల బారినపడిన వ్యక్తులకు ఈ చికిత్స కేంద్రంలో చేర్పించి మానసిక వైద్యులతో ఉచితంగా చికిత్స చేయిస్తున్నట్లు తెలిపారు. అలాగే బాధితుల కుటుంబ సభ్యులకు కౌన్సిల్ నిర్వహిస్తున్నట్లు సీఐకి తెలిపారు. బాధితులు ఉంటే కేంద్రానికి పంపించాలని కోరారు. -
కదిలిన రథం..వెలిగిన అగ్నిగుండం
రామారెడ్డి: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇసన్నపల్లి (రామారెడ్డి) కాలభైరవుడి జన్మదిన వేడుకలు గురువారం నిర్వహించిన రథోత్సవం, అగ్నిగుండాలతో(దక్షయజ్ఞం) ముగిశాయి. గురువారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రారంభమైన రథోత్సవం ఇసన్నపల్లి, రామారెడ్డి గ్రామాలలో కొనసాగింది. యువకులు రథాన్ని లాగడానికి భారీగా తరలివచ్చారు. కాలభైరవుని నామస్మరణతో రెండు గ్రామాలు మారుమోగాయి. మహిళలు మంగళహారతులతో కాలభైరవుడికి స్వాగతం పలికి కానుకలు సమర్పించారు. రథం ఆలయ ప్రాంగణానికి చేరుకోగానే వేడుకల్లో ముఖ్యమైన అగ్ని గుండాలను (దక్షయజ్ఞం) వీరశైవ మహేశ్వరులు ప్రారంభించారు. అగ్నిగుండాలు ముగిసిన అనంతరం ఆలయంలో దండకాలు వేశారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. పోలీసులు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు దాతల సాయంతో అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో ప్రభుగుప్తా తెలిపారు. స్వామివారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రూ.80 లక్షలు మంజూరు చేయించానని, రానున్న కాలంలో రూ.10 కోట్లతో అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. తాను రామారెడ్డి గ్రామంలో పుట్టి పెరిగానని తన చిన్న తనంలో కాలభైరవుడి కొబ్బరి కాయల ప్రసాదం తిని కాలభైరవుడి ఆశ్వీర్వాదంతోనే ఈ స్థాయికి వచ్చనని అన్నారు. వైభవంగా కొనసాగిన రథోత్సవం అగ్నిగుండాలకు తరలివచ్చిన భక్తులు ముగిసిన కాలభైరవుడి జన్మదిన వేడుకలు రూ.10కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తానన్న ఎమ్మెల్యే -
సుదర్శన్రెడ్డికి సన్మానం
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమితులై తొలిసారి నిజామాబాద్కు వచ్చిన బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్రెడ్డిని టీపీసీసీ అధికార ప్రతినిధి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నా యకుడు ఏబీ శ్రీనివాస్(చిన్నా) గురువారం సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కృష్ణార్జునుల మాదిరిగా రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ కృషి చేస్తున్నారన్నారు. వారికి తోడు అపరచాణక్యుడిగా పేరు న్న సుదర్శన్రెడ్డి జిల్లా, రాష్ట్ర అభివృద్ధిలో తన చాతుర్యం చూపిస్తారన్నారు. కార్యక్రమంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ముజాహిద్ అలంఖాన్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి అర్బన్: హైదరాబాద్కు చెందిన ఎక్సిటెల్ కంపెనీలో ఉద్యోగాల భర్తీకోసం శనివారం ఉదయం 10.30గంటలకు కలెక్టరేట్లో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధికల్పనాధికారి ఎం రజనికిరణ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు కనీసం ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్ చదివి ఉండి 30 ఏళ్లలోపు వారై ఉండాలని, ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట రెండుసెట్ల బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్, ఫొటోలు తీసుకురావాలని, వివరాలకు 63000 57052, 76719 74009 నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఎంపికై న వారికి అర్హతల ఆధారంగా నెలకు రూ.13వేల నుంచి రూ.31 వేల వరకు వేతనం ఉంటుందని, హైదరాబాద్లో పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కామారెడ్డి టౌన్: ప్రసిద్ధిగాంచిన యాదగిరిగు ట్ట, స్వర్ణగిరి పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బ స్సులను నడుపనున్నట్లు కామారెడ్డి డిపో మేనేజర్ దినేశ్కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కామారెడ్డి బస్సు డిపో నుంచి ప్రతి ఆదివారం ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తున్నా మని పేర్కొన్నారు. ఉదయం 6.30 గంటలకు బయలుదేరనున్న బస్సు దోమకొండ, బీబీపేట, దుబ్బాక, సిద్దిపేట మీదుగా యాదగిరి గు ట్టకు చేరుతుందని, యాదగిరిగుట్ట నుంచి మ ధ్యాహ్నం ఒంటి గంటకు బయల్దేరి స్వర్ణగిరికి 1.30 గంటలకు చేరుకుని అక్కడి నుంచి 3.00 గంటలకు కామారెడ్డికి బయలు దేరుతుందని వివరించారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కామారెడ్డి క్రైం: జిల్లాలో గుర్తించిన 16 గ్రా మాల్లో భూముల రీ సర్వే కోసం గెజిట్ నోటి ఫికేషన్ విడుదల చేసినట్లు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపా రు. భిక్కనూర్ మండలం ఇసన్నపల్లి, బస్వా పూర్, డోంగ్లీ మండలం ఇల్దేగావ్, ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్, గాంధారి మండ లం సీతాయిపల్లి, చెన్నాపూర్, బిచ్కుంద మండలం హస్గుల్, మద్నూర్ మండలం సో మూర్, మహ్మద్నగర్ మండలం కోనంపల్లి, తెల్లాపూర్, నార్సాపూర్, వెంగలంపల్లి, జు క్కల్ మండలం సావర్గావ్, పెద్దకొడప్ల్ మండలం పోచారం, పాల్వంచ మండలం దేవన్పల్లి, బీబీపేట మండలం తుజాల్పూర్ గ్రామాల్లో భూముల రీసర్వే చేయనున్నట్లు వివరించారు. ఆయా భూముల పట్టాదారు లు అధికారులు సమాచారం ఇచ్చినప్పుడు నిర్దేశించిన సమయంలో సర్వేకు హాజరుకావాలని కోరారు. -
ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు
బాన్సువాడ : ఆదాయానికి, ఖర్చులకు తేడా ఉండడంతో బాన్సువాడ మున్సిపాలిటీ ఆర్థిక వ్యవహారాల్లో ‘సర్దుబాటు’ తలనొప్పిగా మారింది. ఏడాదికి రూ. 7.80 కోట్ల ఖర్చు ఉండగా, ఆదాయం మాత్రం రూ. 6.50 కోట్ల లోపే ఉంటోంది. మున్సిపాలిటీ పరిధి లోని 19 వార్డుల్లో మొత్తం 10,383 వేల పైగానే భవనాలు ఉండగా ఏడాదికి రూ.6.50 కోట్లు ఆస్తి పన్ను ద్వారా సమకూరుతున్నాయి. నల్లా కనెక్షన్లు 4,300 ఉంటే బిల్లులు మాత్రం రూ.11 లక్షల నుంచి రూ.14 లక్షల వరకు వసూలవుతున్నాయి. ఆస్తి పన్ను, నల్లా బిల్లులు కలుపుకుంటే మొత్తం రూ.6.50 కోట్ల రాబడి వస్తోంది. అయితే డబ్బులు నేరుగా సీడీఎంఏ ఖాతా లో జమవుతుండగా ఐదారు నెలలకోసారి మున్సిపాలిటీలకు ప్రభుత్వం పంపుతోంది. కానీ మున్సిపాలిటీలో అన్ని ఖర్చులకు ఏడాదికి దాదాపు రూ.7.80 కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారు. 158 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతోపాటు వివిధ పనుల కోసం మొత్తం 158 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారు. మున్సిపాలిటీ సాధారణ నిధుల నుంచి వీరికి వేతనాల కింద ప్రతి నెల రూ.20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. వాహనాల డీజిల్కు ఏడాదికి రూ.2 లక్షలు, పంప్హౌస్, వీధి దీపాలు, పవర్ బోర్స్, ఆఫీస్ కరెంట్ బిల్లు నెలకు రూ.8 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు వస్తుంది. పైపులైన్ల నిర్వహణ, లీకేజీలకు మరమ్మతులకు రూ.2 లక్షలు, వాహనాల నిర్వహణ ఖర్చు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఉంటుంది.పట్టణంలో ఏర్పాటవుతున్న వ్యాపారాలన్నింటిని ఎప్పటికప్పుడు అసెస్మెంట్ చేయడం ద్వారా మున్సిపాలిటీ ఆదాయ వనరులు పెంచుకునే అవకాశం ఉంటుంది. కానీ అధికారులు మధ్య సిబ్బంది మధ్య సమన్వయలోపంతోపాటు రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగా ఆస్తి పన్నును పెంచుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. ఆదాయ వనరులను అందిపుచ్చుకోవాలని సీడీఎంఏ అధికారులు చెబుతున్నా ఆ దిశగా మున్సిపల్ యంత్రాంగం అడుగులు వేయడం లేదు. అస్తి పన్ను, నల్లాబిల్లులు ద్వారా ఆదాయం దాదాపు రూ.10 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉన్నా..ఆ దిశగా దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.విద్యుత్ బిల్లులు, కార్మికుల వేతనాలు, వాహనాల సంఖ్య పెరగడంతో డీజిల్ ఖర్చులు కూడా పెరిగిపోయాయి. మున్సిపాలిటీకి పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఆదాయ వనరులు కూడా పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీహరి రాజు, కమిషనర్ బాన్సువాడ మున్సిపాలిటీకి సరిపోని ఆదాయం ఖర్చు రూ.7.80 కోట్లు.. ఆదాయం రూ.6.50 కోట్లు నెలనెలా జమకాని భవనాల అనుమతుల సొమ్ము మున్సిపల్ సిబ్బందికి తప్పని సర్దుబాటు ఇక్కట్లు ప్రభుత్వం కార్మికులకు వేతనాలు ఇస్తేనే ఆర్థిక భారం తప్పే అవకాశం -
సలహాదారే కాదు.. జిల్లాకు మంత్రి!
నిజామాబాద్అర్బన్/సుభాష్నగర్ : బోధన్ ఎమ్మె ల్యే సుదర్శన్రెడ్డి ప్రభుత్వ సలహాదారుడే కాదు.. జిల్లాకు మంత్రి కూడా అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నా రు. ప్రభుత్వ సలహాదారులుగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా పాత కలెక్టరేట్ మైదానంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం సన్మాన సభను ఏర్పాటు చేశారు. మహేశ్కుమార్గౌడ్ మాట్లాడుతూ సీనియర్ నాయకుడైన సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలోనే తామంతా పనిచేస్తామన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల తీసుకురావడంలో ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా జిల్లా కు 20, 21, 22 ప్యాకేజీ తీసుకురావడంతో ఆయన ప్రధానపాత్ర పోషించారన్నారు. ఆరు మాసాలు ప్ర భుత్వం ఉంటే కెనాల్లు, ప్యాకేజీలు పూర్తయ్యేవని, ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టులను అటకెక్కించా రని విమర్శించారు. జిల్లాకు 35 ఏళ్ల కల అయిన ఇంజినీరింగ్ కళాశాలను తమ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు మంజూరు చేశామన్నారు. టెంపుల్ కారిడార్లో భాగంగా ధర్మపురి, కొండగట్టు, వేము లవాడ, లింబాద్రి గుట్ట, బాసర వరకు కొత్త రోడ్డు నిర్మాణానికి రూ.370 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. లింబాద్రి గుట్ట, ఆర్మూర్ సిద్ధుల గుట్టలో టూరిజం గెస్ట్హౌస్లు నిర్మిస్తామని, లింబాద్రి గుట్ట గెస్ట్హౌస్ కోసం రూ.4 కోట్లు గురువారమే మంజూ రు చేస్తూ జీవో వచ్చిందన్నారు. కాంగ్రెస్ అభివృద్ధి పార్టీ అని, సంక్షేమం ఇచ్చే పార్టీ అని పేర్కొన్నారు. ప్రజాసంక్షేమాన్ని విస్మరించారు బీఆర్ఎస్ నాయకులు ప్రజా సంక్షేమాన్ని మరిచి దోచుకున్నారని ప్రభుత్వ సలహాదారులు పొద్దుటూ రి సుదర్శన్రెడ్డి విమర్శించారు. జిల్లాకు అవసరమైన పనులు చేపట్టకుండా బీఆర్ఎస్ నాయకులే లబ్ధిపొందారని ఆరోపించారు. దొంగ ఓట్లతో అధి కారంలోకి వచ్చారని, గత కాంగ్రెస్ ప్రభుత్వ హ యాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. అభివృద్ధిని విస్మరించిన దద్దమ్మలు ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరుకు పంటకు ప్రత్యామ్నాయంగా బోధన్ ప్రాంతంలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. రైతులు కూడా పామాయిల్ పంటను పండించాలని సూచించారు. సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలోనే పని చేస్తాం.. దేవుడి పేరుతో బీజేపీ నాయకులు ఓట్లు అడుగుతున్నారు.. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ -
పెట్రోలింగ్ టెన్షన్
శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రతి క్షణం పని చేసే పోలీసులు కొన్ని సందర్భాల్లో తమ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవాల్సి వస్తోంది. పని ఒత్తిడిని జయిస్తున్న ఖాకీలు కొన్ని నైట్ పెట్రోలింగ్ వంటి డ్యూటీ అంటేనే ఒకింత ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి కారణం వెన్నాడుతున్న యాక్సిడెంట్ ఘటనలే. నైట్ పెట్రోలింగ్ అంటేనే టెన్షన్ పడుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి● ఖాకీలను వెన్నాడుతున్న యాక్సిడెంట్లు ● ఎనిమిది నెలల్లో మూడు ఘటనలు ● ఒకరి మృతి.. నలుగురికి గాయాలునేరాల నియంత్రణ కోసం చేపట్టే నైట్ పెట్రోలింగ్ పోలీసులకు సవాల్గా మారుతోంది. దీనికి కారణంగా వరుసగా చోటు చేసుకుంటున్న యాక్సిడెంట్లే. రాత్రి పెట్రోలింగ్ సమయంలో పోలీసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. డ్యూటీలో ఉన్నపుడు, డ్యూటీకి వెళ్లే సమయంలో, తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇటీవల జిల్లాలో జరిగిన ఘటనల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా, నలుగురు గాయాలపాలయ్యారు. బుధవారం వేకువజామున 44వ నంబరు జాతీయ రహదారిపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు తమ వాహనాన్ని యూటర్న్ తీసుకునే క్రమంలో వేగంగా వచ్చిన లారీ వెనక నుంచి ఢీకొట్టడంతో కారులో ఉన్న కానిస్టేబుల్ సైదయ్య, డ్రైవర్ స్వామిరెడ్డి గాయపడ్డారు. సైదయ్యకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. మార్చి 20వ తేదీన గాంధారి మండల కేంద్రంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, వేగంగా వచ్చిన కారు ఢీకొన్న ఘటనలో కానిస్టేబుల్ వడ్ల రవికుమార్ దుర్మరణం చెందాడు. మరో కానిస్టేబుల్ సుభాష్ తృటిలో తప్పించుకున్నాడు. ఈ నెల 11న మాచారెడ్డి మండలం చుక్కాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ సుభాష్రెడ్డికి గాయాలయ్యాయి. వరుస సంఘటనలతో పోలీసు సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. పట్టణాలతోపాటు మండలాల్లోనూ పోలీసులకు నైట్ డ్యూటీలు తప్పనిసరిగా ఉంటాయి. నైట్ పెట్రోలింగ్ లేకుంటే నేరస్తులు రెచ్చిపోతారు. అందుకే అన్ని ప్రాంతాల్లో రాత్రి పెట్రోలింగ్ తప్పనిసరిగా నిర్వహిస్తారు. నైట్ పెట్రోలింగ్ సమయంలో ఎటువైపు నుంచి ఏ వాహనం వచ్చి ఢీకొంటుందో తెలియని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అప్రమత్తంగా ఉంటేనే.. రాత్రి వేళల్లో నేరాలు ఎక్కువగా జరిగే అవకాశాలున్న నేపథ్యంలో పెట్రోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాల్సిందే. ముఖ్యంగా ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలు చేయడం, దారి దోపిడీలు, హత్యలు, దాడులు.. ఇలా ఎన్నో నేరాలు చీకట్లోనే జరుగుతాయి. అలాగే నిషేధిత మత్తు పదార్థాల అక్రమ రవాణా కూడా రాత్రుల్లోనే జరుగుతుంది. అందుకే నైట్ పెట్రోలింగ్లో ఉండే సిబ్బంది నిద్ర ముంచుకొచ్చినా సరే డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఉన్నతాధికారులు పెట్రోలింగ్ను పర్యవేక్షించేందుకు స్వయంగా రంగంలోకి దిగుతారు. ఏదేని పరిస్థితుల్లో డ్యూటీని పక్కన పెట్టేసి నిద్రపోతున్నా, నిర్లక్ష్యం చేసినా చర్యలు తీసుకుంటారు. దీంతో డ్యూటీలో ఉన్న వారు తప్పనిసరిగా పనిచేయాల్సిందే.రాత్రిపూట పెట్రోలింగ్ డ్యూటీలో ఉన్న పో లీసులు చలికాలంలో అవసరమైన రక్షణ చర్యలు తీసుకుని విధులు నిర్వహించాల్సిందే. అలా వర్షం దంచికొడుతున్నా సరే రెయిన్ కోట్లు ధరించి డ్యూటీ చేయాలి. వాన, చలిని పక్కన పెట్టేసి బాధ్యతలు నిర్వహించాలని అధికారులు ఇచ్చే ఆదేశాలను పాటించాలి. ఒక్కోసారి రాత్రుల్లో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిందంటే ఫోన్ రాగానే పరుగులు పెట్టాలి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడం, వాహనాలు రోడ్డుపై జామ్ అయితే ట్రాఫిక్ క్లియర్ చేయడం, వాహనాలు ఒకదానికొకటి గుద్దుకుని ఇరుక్కుపోయినపుడు తక్షణ చర్యలు తీసుకోవడంపై దూకుడుగా పనిచేయాల్సి ఉంటుంది. అయితే డ్యూటీలో ఉన్న సమయంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. -
ధాన్యం తూకం వేగవంతం చేయాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): ధాన్యం తూకాన్ని వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మండలంలోని ఎల్లారం గ్రామాన్ని కలెక్టర్ గురువారం సందర్శించారు. ముందుగా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. సేకరించిన ధాన్యం వివరాలు ట్యాబ్లో నమోదవుతున్నాయా, డబ్బులు రైతుల ఖాతాల్లో జమచేస్తున్నారా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హమాలీలతో మాట్లాడిన కలెక్టర్.. వెంటవెంటనే ధాన్యం తూకం చేస్తూ లారీల్లో లోడ్ చేయాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. దశల వారీగా బిల్లులు అందుతున్నాయా అని ఆరా తీశారు. ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి సమస్యలున్నా అధికారులకు వివరించాలని సూచించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన తర్వాత సామూహిక గృహప్రవేశాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ వెంట డీఆర్డీవో సురేందర్, హౌజింగ్ ఎంపీడీవో నరేశ్, ఎంపీవో మల్హారి, డీఈ సుభాష్, ఏఈలు రజినీకాంత్, సతీశ్, సృజన్కుమార్, యూసుఫ్, ఆయా శాఖల అధికారులు ఉన్నారు. -
ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
గాంధారి: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జెడ్పీ సీఈవో చందర్ నాయక్ అధికారులకు సూచించారు. గురువారం ఆయన మండలంలో పర్యటించారు. ముందుగా పల్లెలమడుగు తండాలో రెండు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మార్కింగ్ వేయించారు. గాంధారిలో ఓ లబ్ధిదారుని ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు పోయించారు. అనంతరం మండల కార్యాలయంలో ఐకేపీ, ఉపాధిహామీ సిబ్బంది, అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణ పనులను నిత్యం పర్యవేక్షించాలన్నారు. ఇప్పటి వరకు ప్రారంభం కాని పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఎంపీడీవో రాజేశ్వర్, ఏపీఎం ప్రసన్నకుమార్, ఆయాగ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఐకేపీ, ఉపాధిహామీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సోయా రైతులను ఇబ్బందులు పెట్టొద్దు
బిచ్కుంద(జుక్కల్): వర్షాల కారణంగా కొంత మేర సోయా పంట దెబ్బతిన్నదని, రెండు, మూడు శాతం నాణ్యత లోపించినప్పటికీ రైతులను ఇబ్బందులు పెట్టకుండా పంట దిగుబడిని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అధికారులకు సూచించారు. ఎన్సీసీఎఫ్, మార్క్ఫెడ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గురువారం బిచ్కుంద మార్కెట్ యార్డులో సోయాను పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని, మార్క్ఫెడ్ నిబంధనల్లో కొంత వెసులుబాటు కల్పించి దెబ్బతిన్న సోయాను కూడా కొనుగోలు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. రైతులు ఆందోళన చెందొద్దన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీఎఫ్ రాష్ట్ర అధికారి రవిచంద్ర, వినయ్ మహనామ, సర్వేయర్ మహేశ్, మార్క్ఫెడ్ ఎండీ శశిధర్రెడ్డి, చందు, సొసైటీ చైర్మన్ బాలాజీ, ఏవో అమర్ప్రసాద్, సంఘం కార్యదర్శి శ్రావణ్, రైతులు పాల్గొన్నారు. -
రెవెన్యూ దరఖాస్తులను పరిష్కరించాలి
అదనపు కలెక్టర్ విక్టర్ భిక్కనూరు: రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ అన్నారు. ఆయన గురువారం భిక్కనూరు తహసీల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కార పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను వెంటనే జారీచేయాలన్నారు.ఆయన వెంట తహశీల్దార్ సునీత, ఆర్ఐ బాలయ్యలు ఉన్నారు. అలాగే మండల కేంద్రంలోని ఏఎంసీ యార్డును, నూతనంగా నిర్మించనున్న షాపింగ్ కాంప్టెక్స్ స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట జిల్లా మార్కెటింగ్ అధికారి ర మ్య, విండో చైర్మన్ గంగళ్ల భూమయ్య, వైస్ చైర్మన్ రాజిరెడ్డి, సీఈవో రాజు, తదితరులు పాల్గొన్నారు. -
గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపిస్తా
ఎమ్మెల్యే మదన్మోహన్ రావు తాడ్వాయి(ఎల్లారెడ్డి): ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందేలా తన వంతు కృషి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు అన్నారు. ఆయన గురువారం తాడ్వాయి మండల కేంద్రంతో పాటు కృష్ణాజీవాడి, బ్రాహ్మణపల్లి, సోమారం, నందివాడ గ్రామాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. తాడ్వాయిలో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లు నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారురాలైన మెట్టు లావణ్య, ఆమె భర్త టీకయ్యలకు నూతన వస్ట్రాలు అందించి మిఠాయిలను తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఇళ్లు నిర్మించుకునే నిరుపేదల కల నెరవేరిందన్నారు. అత్యధికంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇందిరిమ్మ ఇళ్లను మంజూరు చేశామని, తాడ్వాయి మండల కేంద్రంలో 55 ఇండ్లు మంజూరు చేయగా.. అందులో 38 ఇండ్లు వివిధఽ నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. అలాగే కల్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. బ్రాహ్మణపల్లి, తాడ్వాయిలో అంగన్వాడీ భవన నిర్మాణాలకు భూమి పూజ చేశారు. పార్టీ మండల అధ్యక్షుడు వెంకట్రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, ఎంపీడీవో సాజీద్అలీ, నాయకులు షౌకత్అలీ, శివాజీ, రాజీవ్ కుమార్, ఆకిటి వెంకట్రాంరెడ్డి, మహేందర్రెడ్డి, అఖిల్రావు, తదితరులు పాల్గొన్నారు. సహకార బ్యాంకు భవనం ప్రారంభంఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో సహకార బ్యాంకు భవనాన్ని ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గురువారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సహకార బ్యాంకుల ద్వారా అన్ని రకాల రుణాలు రైతులు పొందవచ్చని అన్నారు. డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, ఆర్డీవో పార్థసింహారెడ్డి, తహసీల్దార్ ప్రేమ్కుమార్, మున్సిపల్ కమిషనర్ మహేష్కుమార్, తదితరులు ఉన్నారు. -
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కామారెడ్డి క్రైం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు సూచించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కో ఆపరేటీవ్ మేనేజ్మెంట్, నేషనల్ కో ఆపరేటీవ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని అమృత గ్రాండ్ హోటల్లో ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంస్థల వ్యాపార వైవిధ్యీకరణ, సామర్థ్య నిర్మాణ శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పథకాలను రైతులు, సహకార సంస్థలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మేనేజ్మెంట్ ఖర్చుల నిధులను సైతం ఉపయోగించుకుంటూ రైతు ఉత్పత్తిదారుల సంస్థల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఐసీఎం, ఎన్సీడీసీ ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. అంగన్వాడీ సూపర్వైజర్లు తనిఖీలు పెంచాలి అంగన్వాడీ సూపర్వైజర్లు తమ పరిధిలోని కేంద్రాల్లో తనిఖీల సంఖ్యను పెంచాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం ఏర్పాటు చేసిన సమీక్షాసమావేశంలో మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో అసంపూర్తిగా ఉన్న భవనాలు, మరుగుదొడ్లు, విద్యుత్, తాగునీటి వసతులను త్వరితగతిన పూర్తి చేయించాలన్నారు. మూడు నెలలో కాలంలో తనిఖీల సంఖ్య తక్కువగా ఉన్న సూపర్వైజర్లు వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అంగన్వాడీ చిన్నారుల ఆధార్ నమోదుకు ప్రత్యేక క్యాంప్లను ఏర్పాటు చేయాలని ఈడీఎం ప్రవీణ్కు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రంలో వృద్దాశ్రమం ప్రారంభోత్పవానికి సంబంధించిన ఏర్పాట్లు, అక్కడకు వెళ్లే రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారిణి ప్రమీల, సీడీపీవోలు, అంగన్వాడీ సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
న్యాయం లభిస్తేనే చట్టంపై విశ్వాసం
కామారెడ్డి క్రైం: బాధితులకు న్యాయం జరిగితేనే వారికి చట్టంపై విశ్వాసం పెరుగుతుందని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం స్టేషన్ రైటర్లు, సర్కిల్, డీఎస్పీ కార్యాలయాల రైటర్లతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎఫ్ఐఆర్ నుంచి చార్జిషీట్ వరకు అన్ని వివరాలు స్పష్టంగా, సమగ్రంగా, తప్పులు లేకుండా నమోదు చేయడం ప్రతి రైటర్ బాధ్యత అని అన్నారు. కేసుల దర్యాప్తు, విచారణ, పరిశోధనలో నాణ్యతాప్రమాణాలు పాటించడం అత్యంత కీలకమన్నారు. సాక్షుల, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు ప్రతి కేసులో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. నేరస్తులకు అనుకూలంగా ఇచ్చే స్టేట్మెంట్లు విచారణ నాణ్యతను దెబ్బతీస్తాయన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, అధికారులు, జిల్లాలోని అన్ని పీఎస్ల రైటర్లు పాల్గొన్నారు. వేల్పూర్: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని డీఈవో అశోక్ సిబ్బందికి సూచించారు. మండలంలోని పచ్చలనడ్కుడ హైస్కూలును గురువారం ఆయన తనిఖీ చేశారు. విద్యార్థులకు వండుతున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వంట పాత్రలను చాలా శుభ్రం చేసి వండాలని నిర్వాహకులకు సూచించారు. విద్యార్థులకు నిర్వహిస్తున్న డిజిటల్ తరగతుల గురించి హెచ్ఎం రమేశ్కుమార్ను అడిగి తెలుసుకున్నారు. పదోతరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతుల నిర్వహణపై ఆరాతీశారు. పాఠశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్: సారంగాపూర్లోని తెలంగాణ విశ్వవిద్యాలయం బీఈడీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిగ రవీందర్కు ‘హిందుస్థాన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సాధించాడని అధ్యాపక సిబ్బంది గురువారం తెలిపారు. ‘కోవిడ్–2019 కాలంలో అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వేబినార్లు, కాన్ఫరెన్స్లు ఈ–క్విజ్ పోటీలలో రవీందర్ పాల్గొని, 140 ఈ–సర్టిఫికెట్లను పొందారు. అభ్యసనం– విద్యా శ్రేష్టత’కు వారు చేసిన అంకిత భావానికి గుర్తింపుగా హిందుస్థాన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించింది. ఈసందర్భంగా ఆయనకు ప్రిన్సిపాల్ సాయిలు, అధ్యాపక సిబ్బంది అభినందనలు తెలిపారు. -
సోయాలో తేమ 12 శాతం లోపు ఉండాలి
మద్నూర్(జుక్కల్): క్వాలిటీ లేదని సోయాను కొనుగోలు కేంద్రంలో తిరస్కరిస్తున్నారని తెలిసిందని నేషనల్ కో ఆపరేటీవ్ కన్జ్యుమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర మేనేజర్ రవిచంద్ర అన్నారు. మండల కేంద్రంలోని యార్డులో కొనసాగుతున్న సోయా కొనుగోలు కేంద్రాన్ని గురువారం రాష్ట్ర బృందం అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో సోయాను విక్రయించాలంటే తేమ శాతం 12 లోపు ఉండాలని, అలాగే మట్టి 2 శాతం కన్నా ఎక్కువ ఉండొద్దని అన్నారు. కానీ అధిక వర్షాలతో సోయాలో 8 శాతం మట్టి ఉండటంతో సోయా రిజెక్ట్ అవుతోందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సోయా పంటను ఎలా అమ్ముకోవాలని, బయటి మార్కెట్లో క్వింటాల్కు రూ.వెయ్యి నష్టపోతామని రైతులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మట్టి శాతం ఎక్కువ ఉన్నందుకు రెండు కిలోల సోయా అదనంగా ఇస్తామని ప్రభుత్వ కొనుగోలు సెంటర్లో తీసుకోవాలని రైతులు కోరారు. అలాగే వేలిముద్రల సందర్భంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు అధికారులకు తెలుపగా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో నేష్నల్ కో ఆపరేటీవ్ కన్జ్యుమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు దువ్వ వినయ్, మహేశ్, అధికారులు ఉన్నారు. -
నిలిచిన తరగతి గదుల నిర్మాణం
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో ప్రభుత్వం కోటి 60 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసింది. దీంతో జీప్లస్ వన్ పద్ధతిలో 8 తరగతి గదుల నిర్మాణ పనులు ప్రారంభించారు. పనులు ఉన్నపళంగా నిలిచిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం 1957లో నిర్మించారు. పాఠశాలలో 6వ తరగతి నుంచి 10 వరకు 109 మంది విద్యార్థులు, 10 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ప్రభుత్వ మన ఊరు మన బడి పథకం కింద కోటి 60 లక్షల రూపాయల నిధులను మంజూరు చేసింది. భవనం స్లాబ్ పనులు పూర్తి కాగా.. డైనింగ్ హాల్ నిర్మాణం కేవలం పిల్లర్లకు మాత్రమే పరిమితమైంది. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో శిథిలావస్థకు చేరిన భవనంలో తరగతులు నిర్వహించవద్దని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంలో తరగతులు నిర్వహించాలని పాఠశాల ప్రిన్సిపల్కు సూచించారు. దీంతో జూనియర్ కళాశాల భవనంలో తరగతులు నిర్వహించారు. వర్షాలు తగ్గిన తర్వాత శిథిలావస్థకు చేరిన భవనంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అర్ధంతరంగా నిలిచి పోయిన తరగతి గదుల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల గదులలోనే చదువులు భారీ వర్షాలు కురిసిన సమయంలో జూనియర్ కళాశాల భవనంలో తరగతుల నిర్వహణ ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు -
కళాశాల తనిఖీ
పిట్లం(జుక్కల్): స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం జిల్లా నోడల్ అధికారి షేక్ సలామ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. అధ్యాపకులు, విద్యార్థులకు పలు సలహాలు,సూచ నలు ఇచ్చారు. కామారెడ్డి అర్బన్: జిల్లా పోలీసు కార్యాలయం ప్రజా సంబంధాల అధికారి(పీఆర్వో) జి. రాములు ఉత్తమ ప్రతిభ చూపినందుకు డీజీపీ శివధర్రెడ్డి చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. హైదరాబాద్ పోలీసు శిక్షణ సంస్థలో పోలీసు పీఆర్వోల మూడు రోజుల శిక్షణ బుధవారం ముగిసిన సందర్భంగా డీజీ పీ నుంచి రాములు ఉత్తమ ప్రశంసా పత్రం అందుకున్నారు.గురువారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర.. పీఆర్వో రాములును అభినందించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను ప్రజాసేవలో, సోషల్మీడియా, కమ్యూనికేషన్ వ్యవస్థలో వినియోగించాలని ఎస్పీ ఆకాంక్షించారు. కామారెడ్డి టౌన్: నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కామారెడ్డి జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఆటో బోల్తా పడి విద్యార్థులు గాయపడిన ఘటనలో ఉద్యోగులను బాధ్యులుగా చేస్తూ తొలగించడం సరికాదన్నారు. భిక్కనూరు: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 15న నిర్వహిస్తున్న బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేయాలని బీసీ సంఘం ప్రతినిధి పెరుక నరేష్ కోరారు. గురువారం రామేశ్వర్పల్లిలో సభ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. నేతలు వినోద్గౌడ్, కుడిక్యాల రవి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
డ్రంకన్డ్రైవ్ కేసులో పలువురికి జైలుశిక్ష బోధన్టౌన్(బోధన్): పట్టణంలో ఇటీవల పోలీసులు డ్రంకన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా, సాలూర మండలం ఖాజాపూర్ గ్రామానికి చెందిన చింతల సాయిలు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. గురువారం అతడిని బోధన్ కోర్టులో హాజరుపర్చగా, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్పసాయి 3 రోజుల జైలుశిక్ష, రూ. 2 వేల జరిమాన విధించినట్లు పట్టణ సీఐ వెంకటనారాయణ తెలిపారు. వర్ని: మండలంలో ఇటీవల పోలీసులు డ్రంకన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా, రుద్రూర్ మండలం అంబం గ్రామానికి చెందిన ఇసుక లక్ష్మణ్ మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. గురువారం అతడిని బోధన్ కోర్టులో హాజరుపర్చగా, జడ్జి 2రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై మహేష్ వెల్లడించారు. వేల్పూర్: వేల్పూర్ క్రాస్రోడ్డు వద్ద బుధవారం పోలీసులు డ్రంకన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా భీమ్గల్ ప్రాంతానికి చెందిన ఇద్దరు, వేల్పూర్కు చెందిన ఒకరు మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. వారిని గురువారం ఆర్మూర్ కోర్టులో హాజరుపర్చగా, జడ్జి ఒక్కొక్కరికి రూ. 10వేల చొప్పున రూ.30వేల జరిమానా విధించినట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు. నిజామాబాద్ అర్బన్: నగరంలో ట్రాఫిక్ పోలీసులు ఇటీవల డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా పలువురు మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారిని గురువారం నిజామాబాద్ కోర్టులో హాజరుపర్చగా, జడ్జి 8 మందికి జైలుశిక్ష, 13 మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్అలీ తెలిపారు. 13 మందికి రూ.10వేల చొప్పున జరిమానా విధించగా, ఐదుగురికి ఏడు రోజుల జైలు శిక్ష, ఒకరికి ఐదు రోజులు, మరొకరికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు వివరించారు. వాహనం నడిపిన మైనర్లకు.. నిజామాబాద్ అర్బన్: నగరంలో ఇటీవల పలువురు మైనర్లు వాహనాలు నడుపుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారిని గురువారం నిజామాబాద్ కోర్టులో హాజరుపర్చగా, జడ్జి వారితో ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రధాన రోడ్లపై ప్రచారం చేయించాలని తీర్పు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. బాలికపై అత్యాచారం: నిందితుడిపై పోక్సో కేసు నమోదు నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారం చేయగా, పోక్సో కేసు నమోదు చేసినట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్గౌడ్ తెలిపారు. సదరు గ్రామానికి చెందిన బాలికను నిందితుడు నాలుగునెలల క్రితం మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకోవడంతోపాటు పలుమార్లు అత్యాచారం చేశాడన్నారు. విషయం ఎవరికై నా చెబితే చంపేస్తానని బెదిరించడంతో సదరు బాలిక కుటుంబసభ్యులకు చెప్పలేకపోయింది. ఇటీవల బాలిక తరుచూ వాంతులు చేసుకోవడంతో కుటుంబసభ్యులు ఆమెను మెదక్లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి బాలిక మూడునెలల గర్భం దాల్చినట్లు తెలిపారు. వెంటనే కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిపై పోక్సో కేసునమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
పంజా విసురుతున్న చలి
● గాంధారిలో 10.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు ● జిల్లా అంతటా పెరిగిన చలితీవ్రతసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చలితీవ్రత పెరిగింది. జిల్లా అంతటా చలి పెరిగి జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు చలితీవ్రత పెరిగి మరింత ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి పూట గడపదాటలేని పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం గాంధారిలో 10.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నస్రుల్లాబాద్ మండలం బొమ్మన్దేవ్పల్లిలో 11 డిగ్రీలు, పాల్వంచ మండలం ఎల్పుగొండ, బీబీపేట మండల కేంద్రాల్లో 11.1, నస్రుల్లాబాద్, మాచారెడ్డి మండలం లచ్చాపేటలో 11.2, రామారెడ్డి, గాంధారి మండలం రామలక్ష్మణ్పల్లిలో 11.4, సర్వాపూర్లో 11.5, డోంగ్లీలో 11.6, మద్నూర్ మండలం మేనూర్లో 11.8, పాల్వంచ మండలం ఇసాయిపేట, జుక్కల్లో 11.9, బీర్కూర్లో 12, భిక్కనూరులో 12.4, బిచ్కుంద మండలం పుల్కల్లో 12.5, బిచ్కుంద, లింగంపేట, హసన్పల్లిలో 12.6, దోమకొండలో 12.7, నాగిరెడ్డిపేట, మహ్మద్నగర్లో 12.9, బాన్సువాడ మండలం కొల్లూరులో 13.3, కామారెడ్డి మండలం పాతరాజంపేటలో 13.5, పిట్లంలో 13.7, సదాశివనగర్లో 13.8, మద్నూర్ మండలం సోమూర్లో 14.5, రాజంపేట మండలం ఆర్గోండ, పెద్ద కొడప్గల్లో 15.2, తాడ్వాయిలో 16.4, కామారెడ్డి కలెక్టరేట్లో 16.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
నిధుల మంజూరుకు ప్రతిపాదనలు
బాన్సువాడ రూరల్: తిర్మలాపూర్ శివారులో నిజాంసాగర్ ప్రధాన కాలువ డిస్ట్రీబ్యూటరీ కెనాల్– 9 వద్ద ఇటీవల కురిసిన వర్షాలకు కట్టకు బుంగ పడింది. దీంతో అప్పటికప్పుడు అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేయించారు. అయినా ప్రధాన కాలువకు నీరు వదిలినప్పుడల్లా లీకేజీ అవుతుండటంతో శాశ్వత మరమ్మతులు చేయించాలని అధికారులు నిర్ణయించారు. దీనిలో భాగంగా గురువారం నీటిపారుదలశాఖ ఎస్ఈ దక్షిణామూర్తి, ఈఈ రాజశేఖర్, డీఈఈ శ్రీచంద్ తదితరులు ప్రధాన కాలువను పరిశీలించారు. ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి మంజూరు రాగానే శాశ్వత మరమ్మతులు చేయిస్తామన్నారు. ఏఈలు నితిన్, గజానంద్, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డి తదితరులున్నారు. -
పేకాటపై పోలీస్ ఫోకస్
● స్థావరాల నిర్వాహకులపై దృష్టి ● పెరుగుతున్న కేసుల సంఖ్యకామారెడ్డి క్రైం: ‘పేకాట’ సరదాగా మొదలయ్యి ఎంతో మందికి వ్యసనంగా మారుతోంది. పేకాట ఆడే ఒక్కరి కారణంగా కుటుంబం ఆర్థికంగా సర్వం కోల్పోతూ వీధిన పడుతోంది. ఈ నేపథ్యంలో పేకాట నియంత్రణపై జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. స్థావరాల నిర్వాహకులపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇటీవల జిల్లా వ్యాప్తంగా పేకాట కేసుల సంఖ్య పెరిగింది. అడ్డాలు మారుస్తూ.. జిల్లా కేంద్రంతోపాటు ఎల్లారెడ్డి, నిజాంసాగర్, మద్నూర్, జుక్కల్, బాన్సువాడ, బీర్కూర్, గాంధారి, సదాశివనగర్, భిక్కనూరు తదితర ప్రాంతాలు పేకాటకు పెట్టింది పేరు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా నిత్యం పేకాట జోరుగా సాగుతోంది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఎప్పటికప్పుడు అడ్డాలు మారుస్తూ జూదస్థావరాలు నిర్వహిస్తుంటారు. గతంలో జరిపిన దాడుల్లో ప్రజాప్రతినిధులు సైతం పట్టుబడ్డారు. అయితే, జిల్లాలో నిఘా ఉందనే కారణంతో కొందరు మహారాష్ట్రలోని పేకాట క్లబ్లకు వెళ్లి రావడం గమనార్హం. జిల్లాలో కేసులు.. జిల్లా పోలీసుశాఖ పరిధిలో 3 సబ్ డివిజన్లు, 6 సర్కిళ్లు ఉండగా.. వాటి పరిధిలో 23 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. 2023లో 155, 2024లో 207, 2025 ఆగస్టు వరకు 102 పేకాట కేసులు నమోదయ్యాయి.పేకాటతో వల్ల తలెత్తే అనర్థాలు, జిల్లాలో పరిస్థితిని గుర్తించిన ఎస్పీ రాజేశ్చంద్ర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక పోలీసులతోపాటు టాస్క్ఫోర్స్ బృందాలు సైతం పేకాటపై నిఘా కొనసాగిస్తున్నాయి. పేకాట ఆడేవారి కన్నా ముందు నిర్వాహకులను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టారు. నెల రోజుల క్రితం పిట్లం పోలీస్స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై జరిపిన దాడుల్లో రూ.3.60 లక్షలు పట్టుకోవడంతోపాటు నిర్వాహకుడిని జైలుకు పంపారు.జూదం కారణంగా అనేక కుటుంబాలు ఆర్థికంగా నలిగిపోతున్నాయి. పేకాట నియంత్రణకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా పెట్టాం. పేకాట ఆడినా, ఆడించినా సహించేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. – రాజేశ్చంద్ర, ఎస్పీ, కామారెడ్డి -
కాలినడకన బడికి!
ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల తండాకు చెందిన ఒకటి, రెండో తరగతి చదివే ఐదారేళ్ల వయస్సున్న పిల్లలు రోజూ మూడు కిలోమీటర్ల దూరాన ఉన్న వెల్లుట్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. మార్గమధ్యలో అడవి జంతువులు, కోతుల నుంచి తమల్ని తాము కాపాడుకునేందుకు పిల్లలు కర్రలు పట్టుకుని వెళ్తుంటారు. వీరికి ఇప్పటి వరకు ఎలాంటి రవాణా భత్యం రావడం లేదు. ఈ ఏడాది ప్రతిపాదించిన దాంట్లో కూడా లేకపోవడం గమనార్హం.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : విద్యార్థులు ఉన్న చోట బడి ఉండదు.. బడి ఉన్న చోట పంతుళ్లుండరు. ముఖ్యంగా మారుమూల గ్రామాలు, తండాల్లో బడులు లేక, బడులు ఉన్నా టీచర్లు లేక చదువు కోసం విద్యార్థులు పొరుగూళ్లకు వెళ్లాల్సి వస్తోంది. రవాణా సౌకర్యం లేకపోవడంతో వేలాది మంది పిల్లలు కాలినడకన స్కూళ్లకు వెళ్తున్నారు. రెండు మూడు కిలోమీటర్ల నుంచి ఐదారు కిలోమీటర్లు కూడా నడిచి వెళ్లే వారున్నారు. మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో విద్యార్థులు తక్కువగా ఉన్నారనే కారణంతో గడిచిని పదేళ్లలో యాభైకి పైగా పాఠశాలలు మూతబడ్డాయి. కొన్ని చోట్ల విద్యార్థులు ఉన్నా టీచర్లు లేక మొక్కు‘బడి’గా నడుస్తున్నాయి. దీంతో మారుమూల గ్రామాలు, తండాలకు చెందిన పిల్లలు చదువు కోసం పొరుగూళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. రవాణా భత్యం కొందరికే.. అందుబాటులో బడులు లేని విద్యార్థులు పొరుగూళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వం సర్వశిక్షా అభియాన్తోపాటు పీఎం శ్రీ నిధుల నుంచి రవాణా భత్యం ఇస్తుంటారు. అయితే రకరకాల నిబంధనలతో చాలా మంది విద్యార్థులకు భత్యం అందడం లేదు. 2024–25 విద్యాసంవత్సరంలో జిల్లాలో 1,056 మంది విద్యార్థులకు రూ.6 వేల చొప్పున భత్యం మంజూరైంది. ఈ విద్యాసంవత్సరం 59 స్కూళ్లకు చెందిన 1,565 మంది విద్యార్థులకు రవాణా భత్యం అందించాలని ప్రతిపాదనలు పంపించారు.ప్రాథమిక పాఠశాలలు 702 విద్యార్థులు 30,045 ప్రాథమికోన్నత పాఠశాలలు 124 విద్యార్థులు 8,819 ఉన్నత పాఠశాలలు 191 విద్యార్థులు 32,109 అందుబాటులో స్కూళ్లు లేక పొరుగూళ్లకు బస్సులు లేకపోవడంతో నడిచి వెళ్లాల్సిందే కొందరికే అందుతున్న రవాణా భత్యం సౌకర్యం కల్పించడమే పరిష్కారం -
బూత్స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలి
కామారెడ్డి క్రైం: బూత్స్థాయి ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. పార్టీల ప్రతినిధులతో బుధవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో సహకారం అందించాలన్నారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలన్నారు. తప్పులు లేకుండా ఓటరు జాబితా సవరణ చేపట్టాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, అధికారులు పాల్గొన్నారు. మినీ రైస్మిల్తో ఆర్థిక లాభం.. కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన మినీ రైస్మిల్ పనితీరును కలెక్టర్ సంగ్వాన్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఇలాంటి యూనిట్ లను ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు, మహిళా సంఘాల సభ్యులకు లాభదాయకంగా ఉంటుందన్నారు. ఈ యూనిట్లను పరిశ్రమల మాదిరిగా ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సింగిల్ ఫేజ్ కరెంట్తో నడిచే ఈ మినీ రైస్మిల్ గంటకు 250 కిలోల వడ్లను బియ్యంగా చేసి ఇస్తుందని తెలిపారు. పనులను వేగవంతం చేయాలి కామారెడ్డి టౌన్: వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో కొనసాగుతున్న పనులను బుధవారం ఆయన పరిశీలించారు. కళాశాల భవనం, బాలికల హాస్టల్, బాలుర హాస్టల్, డైనింగ్ హాల్ భవనాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పనుల పురోగతిపై, వైద్య కళాశాలకు అవసరమైన మంచి నీటి వసతిపై మిషన్ భగీరథ, మున్సిపల్ అధికారులతో మాట్లాడారు. వచ్చే ఏడాది మార్చిలోగా నాణ్యతతో కూడిన నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్అండ్బీ ఈఈ మోహన్, మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, ఆయా శాఖల అధికారులు ఉన్నారు. -
పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన లారీ
● కానిస్టేబుల్, హోంగార్డుకు గాయాలుకామారెడ్డి క్రైం: పెట్రో లింగ్ నిర్వహిస్తూ జాతీ య రహదారిపై యూ టర్న్ తీసుకుంటున్న పోలీసు వాహనాన్ని అతివేంగా వచ్చిన గు ర్తు తెలియని లారీ ఢీకొనడంతో ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యా యి. వివరాలు ఇలా ఉన్నాయి.. బుధవారం జిల్లా కేంద్రానికి సమీపంలోని క్యాసంపల్లి వద్ద హైవే పెట్రోలింగ్ కారు (ఇన్నోవా) యూటర్న్ తీసుకోబోయింది. అదే సమయంలో వేగంగా హైదరాబాద్ వైపు నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సదయ్య, హోంగార్డు స్వామిరెడ్డికి గాయాలయ్యాయి. వారిని వెంటనే జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. సదయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు హైదరాబాద్కు రిఫర్ చేశారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లారీని ఇందల్వాయి టోల్గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. -
పాఠశాల భవన పునర్నిర్మాణానికి రూ.కోటి విరాళం
దోమకొండ: మండల కేంద్రంలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవన పునర్నిర్మాణానికి గ్రామానికి చెందిన పబ్బ విజయ్కుమార్ రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ మేరకు బుధవారం పాఠశాల హెచ్ఎం రాధాలక్ష్మికి బాండ్ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను చదువుకున్న పాఠశాలను తన సొంత నిధులతో పునర్నిర్మిస్తానని, భవనానికి తన తల్లిదండ్రులు పబ్బ రుక్మమ్మ, బలరామయ్య పేర్లు పెట్టాలని కోరారు. భవన నిర్మాణ పనులను కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా, అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో తానే చేపడతానని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పన్యాల బాపురెడ్డి, శ్రీనివాస్శర్మ, నాయకులు పున్న లక్ష్మణ్, గుడూరి నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి క్రైం: సేకరించిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేసి మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని నర్సన్నపల్లి కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగొద్దని, లోడింగ్, అన్లోడింగ్ వెంట వెంటనే జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత మండలస్థాయి అధికారులు క్రమం తప్పకుండా నిత్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ–గ్రేడ్ ధాన్యం క్వింటాల్కు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369 మద్దతు ధర చెల్లించడంతోపాటు సన్న రకానికి అదనంగా క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ అందిస్తోందని తెలిపారు. కలెక్టర్ వెంట సివిల్ సప్లయీస్ అధికారులు, సిబ్బంది ఉన్నారు. గాంధారి(ఎల్లారెడ్డి): కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు నాణ్యతను పాటించాలని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ శశిధర్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోయాబీన్, మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఇప్పటి వరకు ఎంత కొనుగోలు చేశారు.. మార్కెట్లో ఎన్ని క్వింటాళ్ల కాంటా చేయాల్సి ఉంది తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత విషయంలో రాజీపడొద్దని సిబ్బందిని ఆదేశించారు. ఆయన వెంట మార్క్ఫెడ్ పర్యవేక్షకులు చందు, సింగిల్ విండో సీఈవో సాయిలు, ఏఈవో నిఖిత తదితరులు ఉన్నారు. -
దళారులకు ‘తుపాను’ మేలు
● మధ్యవర్తులకు కలిసొచ్చిన తుపాను ● తప్పని పరిస్థితుల్లో దళారులకు ధాన్యాన్ని విక్రయిస్తున్న రైతులుసదాశివనగర్(ఎల్లారెడ్డి): రైతులను ఆగం చేసిన తుపాను దళారులకు మేలు చేసింది! చేతికొచ్చిన పంటను నూర్పిడి చేసే దశలో కురిసిన వర్షాలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మరోవైపు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయిద్దామంటే అధికారులు ఇప్పటికీ కనీస వసతులు కల్పించకపోవడంతో రైతులు అయోమయస్థితిలో పడుతున్నారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం, ప్రారంభమైన కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు లేకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. కొందరు రైతులు వరి, మొక్కజొన్న, సోయా తదితర పంటలను దళారులకే విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన దళారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాల్ మొక్కజొన్నకు రూ.2400 ధర ప్రకటించగా దళారులు రూ.1600 నుంచి రూ.1900 చెల్లిస్తున్నారు. సోయాకు మార్కెట్ ధర రూ.5,328 ఉండగా దళారులు రూ.4 వేల నుంచి రూ.4,300 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.చేతికొచ్చిన మొక్కజొ న్న, వరి, సోయా పంటలు అ కాల వర్షాలతో తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తోంది. ధాన్యం ఆరబెట్టుకోవడానికి స్థలాలు లేక రోడ్లమీద పోస్తున్నాం. కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో ధాన్యాన్ని తీసుకోకపోవడంతో దళారులకే అమ్ముకోవాల్సి వస్తోంది. – రాజిరెడ్డి, తిర్మన్పల్లి, సదాశివనగర్ -
బంగారు భైరవుడికి డోలోత్సవం
● వైభవంగా కొనసాగుతున్న కాలబైరవుడి జన్మదినోత్సవాలు ● నేడు రథోత్సవం.. అగ్నిగుండాలురామారెడ్డి: దేశంలో ప్రముఖ పుణ్యాక్షేత్రంగా పేరుగాంచిన ఇస న్నపల్లి(రామారెడ్డి) కాలభైరవుడి జన్మదిన వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేడుకల్లో ముఖ్యమైన ఘట్టమైన డోలారోహ ణం (తోట్లె) బుధవా రం రోజున ఘనంగా నిర్వహించారు. కాలభైరవ నామస్మరణ, లాలి పాటలతో డోలోత్సవం సాగింది. మూడు రోజులపాటు కొనసాగిన సంతతదారాభిషేకం బుధ వారం ఉదయం 6 గంటలకు ముగిసింది. మ ధ్యాహ్నం ఒంటి గంట నుంచి సింధూర పూజ లు నిర్వహించి మధ్యాహ్నం 3 గంటలకు కాలభైరవుడికి నైవేద్యం సమర్పించారు. స్వామివారి బంగారు విగ్రహాన్ని తొట్లెలో వేసి లాలిపాటలు పాడారు. ఆలయ పరిసరాలు కాలభైరవ నామస్మరణతో మారుమోగాయి. ఆలయాన్ని పూలమాలలతో విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. గురువారం రాత్రి 3గంటల నుంచి రథోత్సవం ప్రారంభం కానుంది. స్వామివారి ఉ త్సవ విగ్రహాన్ని ఇసన్నపల్లి(రామారెడ్డి) గ్రామా లలో రథంపై ఊరేగించిన అనంతరం ఆలయానికి రథం చేరుకోగానే వీరశైవ మహేశ్వరులతో అగ్నిగుండాలు (దక్షయజ్ఞం) ప్రారంభమవుతుంది. రథోత్సవం, అగ్నిగుండాలకు రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్వామి సేవలో ప్రముఖులు కాలభైరవుడి డోలారోహణం కార్యక్రమానికి నిజామాబాడ్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర, ఏఎస్పీ చైతన్యరెడ్డి హాజరయ్యారు. ఆలయ ఈవో ప్రభుగుప్తా, అర్చకులు శ్రీనివాస శర్మ, వంశీకృష్ణ శర్మ, సురేందర్ తదితరులు పాల్గొన్నారు. -
జీపీవోలు అందుబాటులో ఉండాలి
ఎల్లారెడ్డి: జీపీవోలు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని తహసీల్దార్ ప్రేమ్కుమార్ సూచించారు. బుధవారం తహసీల్ కార్యాలయంలో జీపీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జీపీవోలు వారికి కేటాయించిన రెవెన్యూ గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలకు కావాల్సిన ధ్రువపత్రాలను సకాలంలో అందించాలని సూచించారు. కార్యక్రమంలో గిర్దావార్ శ్రీనివాస్, జీపీవోలు తదితరులు పాల్గొన్నారు. తాడ్వాయి: జిల్లా కేంద్రంలో ఈనెల 15వ తేదీన నిర్వహించే బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ తాడ్వాయి మండల కన్వీనర్ గడ్డం బాబు సాయికుమార్ బుధవారం కోరారు. 40 శాతం బీసీ రిజర్వేషన్ సాధనకు అందరూ పోరాటం చేయాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన ఉద్యోగులు, రాజకీయ నాయకులు, విద్యావంతులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని అశోక్నగర్ కాలనీలో అనుమతి లేకుండా చెట్లను నరికివేసిన వ్యక్తికి ఫారెస్ట్ అధికారులు రూ. 30,530 జరిమానాను బుధవారం విధించారు. తమ ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన ఫారెస్టు అధికారులకు బీఆర్ఎస్ నాయకులు అభినందనలు తెలిపారు. నాయకులు కుంబార రవియాద్, భాను, కృష్ణయాదవ్, చంద్రకాంత్, సాయి, సమీర్, సాయి తదితరులు ఉన్నారు. నాగిరెడ్డిపేట: మండలంలోని తాండూర్లో ఉన్న మల్లికార్జునస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. వేదపండితులు ఆలయం వద్ద రుద్రహోమం చేపట్టారు. అనంతరం మల్లన్న స్వామి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. రాజంపేట: మండల పంచాయతీ అధికారిగా ఎండీ జబీర్ ఇమాముద్దీన్ హైమద్, కార్యాలయ పర్యవేక్షకుడిగా జనార్దన్రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించినట్లు మండల అభివృద్ధి అధికారి బాలకృష్ణ తెలిపారు. వీరికి కార్యాలయ సిబ్బంది, మండల పంచాయతీ కార్యదర్శులు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. -
అప్పులు తీర్చేందుకు చోరీకి యత్నం
కామారెడ్డి క్రైం: ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి ఓ యువకుడు అప్పులు చేయగా, వాటిని తీర్చడానికి చోరీకి యత్నించాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. జిల్లాకేంద్రంలో చోటుచేసుకున్న ఘటన వివరాలను బుధవారం కామారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి వెల్లడించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా రవింగర్కోటకు చెందిన దుయ్యవార్ రోహిత్ మారుతి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. ఇటీవల అతడు నీట్లో ర్యాంకు సాధించి వెటర్నరీ సీటు సంపాదించాడు. కానీ ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి రూ.60వేల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చడం కోసం దొంగతనాలు, దోపిడీలబాట పట్టాడు. ఈక్రమంలో కామరెడ్డిలోని వివేకానంద కాలనీలో మంగళవారం సాయంత్రం కొండా లలిత అనే వృద్ధురాలు తన ఇంట్లో ఒంటరిగా ఉండగా అతడు ఆమె వద్దకు వెళ్లి మంచి నీళ్లు కావాలని అడిగాడు. ఆమె నీళ్లు తేవడానికి ఇంట్లోకి వెళ్తుండగా వెనుక నుంచి దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. అతడు కాలనీలో పరిగెడుతుండగా అటుగా వచ్చిన ఎన్సీసీ క్యాడెట్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకుని చుట్టుపక్కల సీసీ కెమెరాలు పరిశీలిస్తూనే గాలింపు చర్యలు చేపట్టారు. ఓచోట నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అప్పులు తీర్చడం కోసం చోరీకి యత్నించినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నామనన్నారు. పట్టణ ఎస్హెచ్వో నరహరి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. కామారెడ్డిలో వృద్ధురాలి మెడలో నుంచి బంగారు చైన్ను లాక్కెళ్లిన యువకుడు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించిన పోలీసులు వివరాలు వెల్లడించిన ఏఎస్పీ చైతన్య రెడ్డి -
అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం
మద్నూర్: సోయా పంట కొనుగోలులో అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డోంగ్లి, మద్నూర్ మండల కేంద్రాల్లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నాఫెడ్, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం సోయా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. మద్దతు ధరతో సోయా పంట కొనుగోలు చేయాలని సహకార సంఘాలకు ప్రభుత్వం సూచించింది. అలాగే రైతులకు ఇబ్బందులు కలుగకుండా సోయా కొనుగోలు చేయాలని స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సైతం సిబ్బందిని ఆదేశించారు. కానీ సోయా పంట కొనుగోలు చేసే అధికారులు బుధవారం రైతులు మార్కెట్ యార్డులో ఉంచిన సోయాను పరిశీలించి పంట బాగాలేదని చాలా మంది రైతుల సోయాను రిజెక్ట్ చేశారు. సోయా పంటకు చెన్ని చేసి పంటను తీసుకోవాలని ఇలా రిజక్ట్ చేస్తే ఎలా అని రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రంలో పంట తీసుకోకుంటే బయటి మార్కెట్లో పంటను విక్రయిస్తే క్వింటాలుకు రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సోయాలో మట్టి బాగా ఉండడంతోనే రిజక్ట్ చేశామని కొనుగోలు చేసే అధికారులు, సిబ్బంది తెలిపారు. -
ఇంటర్లో మంచి ఫలితాలు సాధించాలి
● ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ షేక్సలాంఎల్లారెడ్డి: మోడల్ కళాశాల విద్యార్థులు ఇంటర్లో మంచి ఫలితాలు సాధించాలని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ ఆఫీసర్ షేక్ సలాం అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి మోడల్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. కళాశాలలోని అడ్మిషన్ రిజిస్టర్ను తనిఖీ చేసి విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ప్రిన్సిపాల్ గాంధీ, అధ్యాపకులు జహంగీర్, రాజశేఖర్, ప్రియదర్శిని, లక్ష్మణ్ సింగ్ తదితరులు ఉన్నారు. లింగంపేటలో.. లింగంపేట: ఇంటర్ వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా ఇంటర్ విద్యా నోడల్ అధికారి షేక్ సలామ్ సూచించారు. లింగంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న అర్ధవార్షిక పరీక్షలను తనిఖీ చేశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అధ్యాపకులకు సూచించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ నరేందర్, అధ్యాపకులు నాగు, దుర్గయ్య, శివ, రాజు, హైమద్, ధర్సింగ్, సంధ్యారాణి, శ్రీలత, స్వామిగౌడ్, ఆనంద్రెడ్డి తదితరులు ఉన్నారు. -
క్రైం కార్నర్
స్వదేశానికి చేరిన మృతదేహం లింగంపేట(ఎల్లారెడ్డి): దుబాయ్లో నెలరోజుల క్రితం మృతిచెందిన ఓ వ్యక్తి మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. వివరాలు ఇలా.. మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన మన్నె సంగమేశ్వర్(39) ఉపాధి నిమిత్తం గతేడాది దుబాయ్ దేశానికి వెళ్లాడు. గత నెల 11న అక్కడ పనులు చేస్తున్న చోట ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు కుటుంబ సభ్యులకు సమాచారం అందగా, వారు దుబాయ్లోని భారత సేవా సమితి సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం వారు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి షార్జా నుంచి హైదరాబాదుకు సంగమేశ్వర్ మృతదేహాన్ని తరలించే ఏర్పాట్లు చేశారు. మృతుడికి తల్లిదండ్రులు పోచవ్వ, ఎల్లయ్య, భార్య సరిత, ఇద్దరు కుమారులు కార్తీక్, కౌశిక్ ఉన్నారు. రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత మద్నూర్(జుక్కల్): మంజీరా నది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండ అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకోని సీజ్ చేసినట్లు డోంగ్లీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిబాబా బుధవారం తెలిపారు. పోతంగల్ మంజీరా శివారులోని కోడిచెర్ల నుంచి రెండు ఇసుక ట్రాక్టర్లు డోంగ్లీ గుండా వెళ్తుండగా పట్టుకొని, డోంగ్లీ తహసీల్దార్ కార్యాలయానికి తరలించి సీజ్ చేశామని తెలిపారు. పిట్లం మండలంలో.. పిట్లం(జుక్కల్): బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామం నుంచి మంగళవారం రాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పిట్లం శివాజీ చౌక్ వద్ద పట్టుకున్నట్లు ఎస్సై వెంకట్రావ్ తెలిపారు. మండల పోలీస్ స్టేషన్ బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. -
ఎస్జీఎఫ్ క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ
బాన్సువాడ రూరల్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడల్లో మండలంలోని తెలంగాణ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబర్చారని పీఈటీ సుప్రిత బుధవారం తెలిపారు. రన్నింగ్ పోటీల్లో శ్రీనందిని, సౌజన్య, వాణి బహుమతులు సాధించారన్నారు. శ్రీనందిని, సౌజన్య రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. అలాగే అండర్–14 విభాగంలో 200మీటర్ల పరుగు పందెంతో పాటు లాంగ్జంప్లో జి. సాత్విక జిల్లాస్థాయిలో రెండు బంగారు పతకాలు అందుకుని రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్కు ఎంపికై ందన్నారు. ప్రతిభ చాటిన విద్యార్థినులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. మోపాల్(నిజామాబాద్రూరల్): తెలంగాణ యూనివర్సిటీని అక్రమాలకు అడ్డాగా మార్చొద్దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి విజ్ఞప్తిచేశారు. ఈమేరకు బుధవారం తెలంగాణ యూనివర్సిటీలో వీసీ యాదగిరి రావును ఆయన మర్యాదపూర్వకంగా కలిసి, మాట్లాడారు. తెయూలో 2012 లో జరిగిన నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో వివిధ పత్రికల్లో వస్తున్న కథనాల గురించి వీసీతో చర్చించారు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎంపీ అర్వింద్ ధర్మపురి కృషి చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం రూ.20కోట్ల నిధులు మంజూరు చేసిందని గుర్తుచేశారు.మండల అధ్యక్షుడు చంద్రకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్రెడ్డి, నాయకులు శ్యామ్రావు, సురేష్, శ్రీనివాస్ గౌడ్,పరుశరాం, లక్ష్మీనారాయణ, పృథ్వీ, సమీర్, వినోద్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఫోర్జరీ సంతకాలతో రుణం
సదాశివ నగర్(ఎల్లారెడ్డి): తనకు తెలియకుండా రుణం తీసుకున్నారని ఆరోపిస్తూ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన స్నేహ మహిళా సంఘం సభ్యురాలు షెకెల్లి త్రివేణి అనే మహిళ బుధవారం మహిళా సంఘం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. సంఘ సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి వీవోఏ వరలక్ష్మి, ఐకెపీ సీసీ లింగం కలిసి బ్యాంకులో రూ.15 లక్షల రుణం తీసుకున్నారని త్రివేణి ఆరోపించారు. దీనిపై డీఆర్డీవో, కలెక్టర్కు సైతం ఫిర్యాదు చేశానన్నారు. సంతకాలు ఫోర్జరీ చేసి రుణం తీసుకున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని త్రివేణి డిమాండ్ చేశారు. -
ఇంటి బిల్లు ఇప్పించమని ప్రార్థన..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): తాను నూతనంగా నిర్మించుకున్న ఇంటికి ఇందిరమ్మ ఇంటి బిల్లులను అందించాలని కోరుతూ చేస్తూ నాగిరెడ్డిపేట మండలంలోని అక్కంపల్లిలో మంగలి ఈశ్వరమ్మ అనే వితంతు బుధవారం తన ఇంటిపై ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని తెలిసిన వెంటనే తాను బేస్మెంట్ నిర్మాణం చేపట్టానని, ఆ తరువాత తర్వాత పంచాయతీ కార్యదర్శితోపాటు ఇతరులు వచ్చి బేస్మెంట్ పక్కన ఉన్న ఖాళీస్థలంలో మార్కింగ్ ఇచ్చి మంజూరుపత్రం అందజేశారని తెలిపింది. నూతనంగా నిర్మించిన బేస్మెంట్ పైనే మార్కింగ్ ఇవ్వాలని తాను కోరినప్పటికీ అధికారులు పక్కనే ఉన్న తన సోదరులకు సంబంధించిన ఖాళీస్థలంలో మార్కింగ్ ఇచ్చారని ఆమె వాపోయింది. తన ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో అప్పటికే నిర్మించుకున్న బేస్మెంట్పై, ఇందిరమ్మ ఇంటి నిర్మాణ కొలతల ప్రకారమే పనులు చేపట్టానని తెలిపింది. ఇంటినిర్మాణం కోసం తాను సుమారు రూ.7లక్షల వరకు అప్పు చేశానని, భర్తను కోల్పో యి ఒంటరి మహిళగా ఉన్న తనకు ఇందిరమ్మ ఇంటి బిల్లులను అందించి ఆదుకోవాలని ప్రజాప్రతినిధులను, అధికారులను ఆమె కోరుతోంది. నిబంధనలకు వ్యతిరేకంగా ఇంటి.. గ్రామంలోని మంగలి ఈశ్వరమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైన మాట వాస్తవమేనని పంచాయతీ కార్యదర్శి కిష్టయ్య తెలిపారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా మార్కింగ్ ఇచ్చిన స్థలంలో కాకుండా పక్కనే ఉన్న స్థలంలో ఇదివరకు నిర్మించిన బేస్మెంట్పై ఈశ్వరమ్మ ఇంటినిర్మాణం చేపట్టారన్నారు. దీంతో ఆమెకు ఇందిరమ్మ ఇంటిబిల్లులు చెల్లించే అవకాశం లేదని పంచాయతీ కార్యదర్శి స్పష్టం చేశారు. -
నేషనల్ కబడ్డీ క్యాంప్నకు ఎంపిక
నిజామాబాద్ నాగారం: జిల్లాకు చెందిన ఐదుగురు కబడ్డీ క్రీడాకారులు జాతీయస్థాయి కబడ్డీ క్యాంప్కు ఎంపికయినట్లు నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆంద్యాల లింగయ్య, గంగాధర్ రెడ్డి బుధవారం తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో బాలికల విభాగంలో గౌతమీ, స్నేహ, శిరీష, బాలుర విభాగంలో శ్రీనివాస్, ప్రమోద్ పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చారు. దీంతో వారు జాతీయస్థాయి క్యాంప్కు ఎంపికయ్యారు. ఈనెల 12 నుంచి బాచుపల్లిలో నిర్వహించనున్న జాతీయ స్థాయి కబడ్డీ క్యాంప్లో వారు పాల్గొననున్నట్లు తెలిపారు. -
రుణం లేదు.. పరికరాలూ లేవు
● ఫలితమివ్వని పీఎం విశ్వకర్మ పథకం ● రుణం, పరికరాలు అందించాలని లబ్ధిదారుల వినతి ఎల్లారెడ్డి: కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల వృత్తి నైపుణ్యాలు, జీవన ప్రమాణాలు మెరుగు పర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం క్షేత్ర స్థాయిలో అనుకున్న ఆశయాలను సాధించడం లేదు. ఈ పథకం కింద కుల వృత్తులైన స్వర్ణకార, వడ్రంగి, మేసిన్, మత్స్యకార, మంగలి, రజక, కంసాలి, టైల్స్ వేయడం, దర్జీ లాంటి కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి వారి వృత్తుల్లో మరింత నైపుణ్యం పెంచుకునేందుకు శిక్షణ ఇచ్చి, వారి వృత్తికి ఉపయోగపడే రూ. 15 వేల విలువగల మెరుగైన పరికరాలను అందించాలి. వారి వృత్తి వ్యాపారాల అభివృద్ధికి వ్యక్తిగత పూచీకత్తుపై రూ. లక్ష రుణాన్ని అందించాల్సి ఉంటుంది. గతంలో ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు వారి రంగాల్లో నిపుణులైన ప్రైవేట్ సంస్థల ద్వారా శిక్షణ ఇచ్చేరే తప్ప సగానికి పైగా దరఖాస్తుదారులకు రుణాలు అందలేదు. అలాగే రుణాలు అందిన వారిలో చాలా మందికి ఈ పథకం కింద ఇవ్వాల్సిన వృత్తి పరికరాలు లభించలేదు. కామారెడ్డి జిల్లాలో విశ్వకర్మ పథకం కింద గతేడాది 4,711 మందికి శిక్షణ ఇవ్వగా 1,927 మందికి రూ. లక్ష రూపాయల రుణం లభించింది. రుణం లభించిన వారిలో 1,394 మంది లబ్ధిదారులకు వారి కుల వృత్తుల పరికరాలు లభించాయి. మిగితా వారికి కేవలం శిక్షణ మాత్రమే లభించింది. ఈ పథకం కింద ఇస్తామన్న రూ. లక్ష రుణం, వృత్తి పరికరాలు ఎప్పుడు ఇస్తారన్న ప్రశ్నకు ఏ అధికారి సరైన వివరణ ఇవ్వడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. -
ట్రాన్స్ఫార్మర్ చోరీ
కామారెడ్డి టౌన్: జిల్లాకేంద్రంలోని సిరిసిల్లా రోడ్ త్రిశక్తి ఆలయం వెనకాల ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. అందులోని కాపర్ కాయిల్స్, ఆయిల్ను దొంగలించారు. మరుసటి రోజు ఏఈ మనోరంజన్ ట్రాన్స్ఫార్మర్ను పరిశీలించి, పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రూ. 80వేలకు పైగా నష్టం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. పాన్షాపులో .. నవీపేట: మండల కేంద్రంలోని వైన్షాపు సమీపంలోగల పాన్షాపులో గుర్తుతెలియని దుండగులు మంగళవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. మరుసటి రోజు ఉదయం షాపు నిర్వాహకుడు చోరీని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. షాపు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు రూ.8500 నగదుతో పాటు రూ. 10వేల విలువైన సామగ్రిని ఎత్తుకెళ్లారు. ఈమేరకు బాధితుడు ముజాహిద్ అలీఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
యూడైస్లో విద్యార్థుల వివరాలను నమోదు చేయాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ● దర్యాపూర్లో ప్రభుత్వ పాఠశాల, భవితకేంద్రం తనిఖీ నవీపేట: యూడైస్ యాప్లో విద్యార్థుల పూర్తి వివరాలను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మండల కేంద్రంలోని దర్యాపూర్ ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. యూడైస్ యాప్లో విద్యార్థుల వివరాలు నమోదు కాకపోవడంపై పాఠశాల హెచ్ఎం హన్మంత్రావ్పై అసహనం వ్యక్తం చేశారు. జనన ధ్రువీకరణ పత్రాలు లేని విద్యార్థులకు వెంటనే మంజూరు చేయాలని తహసీల్దార్ వెంకట రమణకు సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలను ముఖ గుర్తింపు విధానంతో నమోదు చేయాలన్నా రు. అనంతరం భవితభవిత కేంద్రాన్ని తనిఖీ చేసి, ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల వివరాలను తెలుసుకున్నారు. కొనసాగుతున్న భవిత ప్రత్యేక కేంద్రం పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భవిత కేంద్రాల పనితీరు, మరమ్మతులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తానన్నారు. డీఈవో అశోక్, ఎంపీడీవో నాగనాథ్, తహసీల్దార్ వెంకట రమణ తదితరులు ఉన్నారు. -
ధాన్యాన్ని నిబంధనల మేరకు ఆరబెట్టాలి
గాంధారి(ఎల్లారెడ్డి): రైతులు ధాన్యాన్ని నిబంధనల మేరకు ఆరబెట్టాలని డీఆర్డీవో సురేందర్ సూచించారు. మంగళవారం ఆయన మండలంలో పర్యటించారు. మేడిపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ఏపీఎం ప్రసన్న కుమార్, రైతులున్నారు. తూకం వేగవంతం చేయాలి లింగంపేట(ఎల్లారెడ్డి): కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేగవంతం చేయాలని డీఆర్డీవో సురేందర్ సూచించారు. మంగళవారం ఆయన లింగంపేట మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాల్లో తూకం పరిశీలించారు. అనంతరం ఆయన రైతులతో మాట్లాడారు. ఐకేపీ డీపీఎం సాయిలు, ఏపీఎం వినోద్కుమార్, సీసీ గంగ రాజం, తదితరులు ఉన్నారు. -
‘రైతు నేస్తం’ సద్వినియోగం చేసుకోవాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి మోహన్రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పంటల సాగు, ఎరువుల యాజమాన్యం, చీడ పీడల నివారణ తదితర విషయాలపై శాస్త్రవేత్తలు రైతులకు సూచనలు, సలహాలు, జాగ్రత్తల గురించి వివరించారు. అలాగే మామిడి తోటలు పూత దశలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచించారు. ఏడీఏ లక్ష్మీప్రసన్న, మండల వ్యవసాయాధికారి అనిల్కుమార్, ఏవో సంతోష్, ఏఈవో రాకేశ్, రైతులు పాల్గొన్నారు. -
‘మత్స్య పరిశ్రమను విద్యార్థులు వృత్తిగా స్వీకరించాలి’
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఫిషరీస్, జువాలజీ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఆక్వేరియం చేప పిల్లల విక్రయాన్ని మంగళవారం ప్రిన్సిపల్ కె.విజయకుమార్ ప్రారంభించారు. విద్యార్థులు మత్స్య పరిశ్రమలను వృత్తిగా స్వీకరించేందుకు ముందు వరుసలో ఉండాలని, వాణిజ్యపరంగా ఎన్నో అవకాశాలుంటాయన్నారు. సమన్వయకర్తలు విశ్వప్రసాద్, జయప్రకాష్, సుధాకర్, అధ్యాపకులు దినకర్, ఫిషరీస్ విభాగం అధిపతి తిరుమల మల్సూర్, రాములు, జి.శ్రీనివాస్రావు, పవన్ కుమార్, మానస తదితరులు పాల్గొన్నారు. -
డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ పలువురికి జైలు
డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ పలువురికి జడ్జిలు జైలు శిక్షతో పాటు జరిమానాలను విధించినట్లు ఎస్సైలు తెలిపారు. ఏర్గట్ల పీఎస్ పరిధిలో ఒకరికి నూతన చట్టం ప్రకారం రూ. పదివేల జరిమానాను విధించారు. రుద్రూరు: డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ ఓ వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్షతోపాటు రూ. రెండు వేల జరిమానాను బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్పసాయి విధించినట్లు కోటగిరి ఎస్సై సునీల్ మంగళవారం తెలిపారు. రెండు రోజుల క్రితం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నాయిగావ్ గ్రామానికి చెందిన పవర్ దానాజీ మద్యం సేవించి కోటగిరిలో వాహనం నడుపుతుండగా పట్టుకొని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు పేర్కొన్నారు. జడ్జి అతనికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ. రెండు వేల జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు. సిరికొండలో నలుగురికి నాలుగు రోజులు.. సిరికొండ: సిరికొండ పీఎస్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ నలుగురికి న్యాయమూర్తి నాలుగు రోజుల జైలు శిక్ష విధించారని ఎస్సై రామకృష్ణ తెలిపారు. సిరికొండ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు, పెద్దవాల్గోట్కు చెందిన ఒకరు, సిరికొండ చెందిన మరొకరిని కోర్టులో హాజరుపర్చగా వారికి న్యాయమూర్తి నాలుగు రోజుల జైలు శిక్ష విధించారని ఎస్సై తెలిపారు.బీబీపూర్ వాసికి నాలుగు రోజులు.. మోపాల్: డిచ్పల్లి పీఎస్ పరిధిలో నాగ్పూర్ గేట్ వద్ద ఈనెల 9న మద్యం సేవించి వాహనం నడిపిన బీబీపూర్కు చెందిన రాథోడ్ జై సింగ్కు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు. ఎవరైనా మద్యం సేవించి వాహనం నడిపిస్తే జైలు శిక్ష తప్పదని ఎస్సై హెచ్చరించారు. జక్రాన్పల్లిలో ఇద్దరికి రెండు రోజులు.. జక్రాన్పల్లి: మద్యం తాగి బైక్ నడిపిన ఇద్దరు వ్యక్తులకు ఆర్మూర్ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి గట్టు గంగాధర్ రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు జక్రాన్పల్లి ఎస్సై మహేశ్ తెలిపారు. నూతన మోటర్ వెహికిల్ చట్టం ప్రకారం మొదటి సారి డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడితే రూ. పది వేల జరిమానా ఉంటుందని అన్నారు. నవీపేటలో ఇద్దరికి నాలుగు రోజులు.. నవీపేట: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన ఇద్దరికి నిజామాబాద్ జడ్జి మంగళవారం జైలు శిక్ష విఽధించినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. నవీపేట శివారులో ఇటీవల నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్లో నవీపేటకు చెందిన మోహన్, కమలాపూర్కు చెందిన ముల్కల అఖిలేష్ మద్యం సేవించి వాహనం నడిపారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు పంపగా జడ్జి ఇద్దరికి నాలుగు రోజుల జైలు శిక్షను విధించినట్లు పేర్కొన్నారు. మూడు, నాలుగో టౌన్ల పరిధిలో.. నిజామాబాద్ అర్బన్: నగరంలోని మూడో టౌన్ పీఎస్ పరిధిలోని పట్టుబడిన శివకుమార్కు నాలుగు రోజుల జైలు శిక్ష, నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన అశ్విన్, సాయికిరణ్కు నాలుగు రోజుల జైలు శిక్షను విధించినట్లు ఎస్సైలు తెలిపారు. అదే విధంగా మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ ఏనుగంటి అవినాయక్ గౌడుకు రెండు రోజుల జైలు శిక్ష, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్టుబడ్డ కిషన్ గౌడ్, శివాజీ సుమ కాంత్కు జడ్జి రెండు రోజుల జైలు శిక్షను విధించినట్లు ఎస్సైలు పేర్కొన్నారు. ఇందల్వాయి: డ్రంకన్ డ్రైవ్లోపట్టుబడ్డ ఇద్దరికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ జైలు శిక్షను విధించినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఇందల్వాయి మండలం మెగ్యానాయక్ తండాకు చెందిన కాట్రోత్ రవికి ఏడు రోజులు, పాట తండాకు చెందిన లావుడ్య నర్సయ్యకు నాలుగు రోజుల జైలు శిక్షను విధించినట్లు పేర్కొన్నారు.మోపాల్: మోపాల్ పీఎస్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన ముగ్గురికి స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్సై జాడె సుస్మిత తెలిపారు. డిచ్పల్లి మండలం ఆరెపల్లికి చెందిన చిట్టి నారాయణకు రెండు రోజులు, కులాస్పూర్కు చెందిన బూస భానుచందర్కు మూడు రోజులు, బైరాపూర్కు చెందిన కెతావత్ మహా పాతలాల్కు ఏడు రోజుల జైలు శిక్షను విధించారని అన్నారు.మోర్తాడ్: డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ ఓ వ్యక్తికి నూతన వాహన చట్టం ప్రకారం రూ. పది వేల జరిమానాను ఆర్మూర్ జడ్జి గట్టు గంగాధర్ విధించినట్లు ఏర్గట్ల ఎస్సై పడాల రాజేశ్వర్ తెలిపారు. ఏర్గట్ల పీఎస్ పరిధిలో సోమవారం సాయంత్రం నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం కోజన్కొత్తూర్ గ్రామానికి చెందిన నాని అనే వ్యక్తి మద్యం సేవించి ఏర్గట్లలో వాహనం నడుపుతుండగా పట్టుకొని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. జడ్జి అతనికి రూ. పదివేల జరిమానా విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
తెలంగాణ వైతాళికులు విశ్వనాథ శాస్త్రి
కామారెడ్డి అర్బన్: తెలంగాణ వైతాళికులు, జ్ఞాననిధి, సదాచారులు శాస్త్రుల విశ్వనాథశాస్త్రి(శివ్వంపేట) శత జయంతి ఉత్సవాన్ని మంగళవారం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో సంకష్టహర గణపతి ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్థలతో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేదపండితులు గణేష పూజతో పాటు విశ్వనాథశాస్త్రికి పుష్పాంజలి సమర్పించారు. నృత్యప్రదర్శనలు చేశారు. శ్రీమల్లికార్జున శివారాధ్యపీఠం పండితులు కాచాపురం నందీశ్వరశర్మ, బెజుగామ రామమూర్తి దంపతులను ఘనంగా సన్మానించారు. కామారెడ్డి అర్బన్: కాంగ్రెస్ పార్టీ ఉత్తుత్తి బీసీ బిల్లు పెట్టి ప్రజలు మోసం చేయాలని చూస్తుందని బీసీ ఆక్రోశ సభ రాష్ట్ర అధ్యక్షుడు, విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు, వైస్ చైర్మన్ విశారదన్ మహరాజ్ అన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 42శాతం రిజర్వేషన్ అమలు కోసం నవంబర్ 15న కామారెడ్డి సత్యగార్డెన్లో నిర్వహించే బీసీ ఆక్రోశ సభకు బీసీలందరు తరలిరావాలని వారు పిలుపు నిచ్చారు. పట్టణంలోని స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో మంగళవారం వారు వివిధ కులాల నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్లో తమిళనాడు తరహా రిజర్వేషన్ల బిల్లు కోసం కార్యాచరణ ప్రారంభించి శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో ఆక్రోశ సభ ఆహ్వాన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ చైర్మన్లుగా మర్కంటి భూమన్న, క్యాతం సిద్ధిరాములు, బాలార్జున్గౌడ్ ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా వెంకట్, వేణుగోపాల్గౌడ్, పుట్ట మల్లికార్జున్, రమేష్బాబు, జీవీఎం విఠల్, లక్ష్మణ్, అరవింద్, భువనేశ్వర్, రాజు, సిరిగాద నర్సయ్య, పి.అంజయ్య, నాగభూషణం, సబ్బని కృష్ణహరి, డి.రాజయ్య, ధర్మపురి పాల్గొన్నారు. -
‘న్యుమోనియా’ను నివారిద్దాం..!
● జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు● నేడు ప్రపంచ న్యుమోనియా నివారణ దినం నిజామాబాద్నాగారం: బ్యాక్టీరియా, వైరస్ల కారణంగా ఊపిరితిత్తుల్లోని గాలి సంచులు చీము, ద్రవాలతో నిండిపోయి శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. దీనినే న్యుమోనియా అంటారు. ఇది ఒక్కోసారి ప్రాణాంతకంగా మారొచ్చు. బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే న్యుమోనియా ఇతరులకు సైతం వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఏటా అనేక మంది న్యుమోనియా బారిన పడుతూ ఇబ్బందులు పడుతున్నారు. నేడు నిర్వహించే న్యుమోనియో దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. జిల్లా వ్యాప్తంగా ఇలా.. న్యుమోనియా వ్యాధి బాధితులు నిజామాబాద్ జిల్లాలో నిత్యం పెరుగుతూనే ఉన్నారు. బ్యాక్టీరియాతో వచ్చే న్యుమోనియా బాధితులు జిల్లాలో వారానికి సుమారు 200 మంది ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు సంబంధిత వైద్యాధికారులు చెబుతున్నారు. మరోవైపు చలికాలంలో అధికంగా వచ్చే వైరల్ న్యుమోనియాతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిత్యం 40 నుంచి 50 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వైరల్ న్యుమోనియాకు మందులు వాడితో వారం రోజుల్లో తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాధి రావడానికి కారణాలు.. గాలి పీల్చేటప్పుడు బ్యాక్టీరియాలు, వైరస్లు శరీరంలోకి ప్రవేశించి, తెల్లరక్త కణాలను నిర్వీర్యం చేస్తాయి. దీంతో శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలు, వృద్ధులు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. పిల్లల్లో ఆర్ఎస్వీ, వృద్ధుల్లో ఇన్ఫ్లుయెంజా వైరస్వల్ల ఇది సోకుతుంది. పౌష్టికాహారం తీసుకోని వారి కి, మద్యపానం, పొగతాగడం, మధుమేహం, ఎ యిడ్స్, గుండె, ఊపిరితిత్తులు, మూత్రనపిండాల సమస్యలు, క్యాన్సర్తో బాధపడే వారు న్యుమోనియా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటా యని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలకు చిన్నతనంలో ఇచ్చే బీసీజీ వంటి టీకాలతో పాటు న్యు మోనియా రాకుండా టీకాలు అందిస్తే దీనిని నివారించవచ్చు. పిల్లలకు ఆరు నెలల వరకు తల్లి పాలు పట్టించడం వల్ల వారిలో రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధి బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.న్యుమోనియపై కచ్చితంగా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ప్రమాదం. ప్రతి సంవత్సరం నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ యూనిట్లో న్యూమోనియా దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, ఉచిత శ్వాసకోశ పరీక్షలు, వైద్య సలహాలు అందిస్తున్నాం. – డాక్టర్ ప్రశాంత్, శ్వాసకోశ వ్యాధుల నిపుణులు, మెడికవర్ హాస్పిటల్దీర్ఘకాలిక రోగులతో బాధపడేవారు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గుండె, షుగర్, బీపీ, కిడ్నీ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. వృద్ధులు కచ్చితంగా న్యుమోనియపై అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఏటా 10 శాతం మంది న్యుమోనియాతో మరిణిస్తున్నారు. – వీవీరావు, జీజీహెచ్ పల్మనాలజిస్ట్, హెచ్వోడీ -
అటవీ భూమిని చదును చేసిన గిరిజనులు
● పది మందిపై కేసు నమోదు ఇందల్వాయి: ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని గన్నారం బీట్ మెగ్యా నాయక్ తండాలో అటవీ శాఖ అధికారులు నాటిన మొక్కలను ధ్వంసం చేసి భూమి చదును చేసిన పదిమంది గిరిజనులపై కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఆర్వో రవిమోహన్ బట్ తెలిపారు. అనుమతులు లేకుండా అడవులను ధ్వంసం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ● ఒక రోజు జైలు శిక్ష విధించిన కోర్టు కామారెడ్డి క్రైం: మద్యం మత్తులో డయల్–100కు పలుమార్లు ఫోన్ చేసి విసిగించిన యువకుడికి కామారెడ్డి కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన షేక్ అమీర్ అనే యువకుడు మంగళవారం తనకు ఎలాంటి అత్యవసరం లేకపోయినా డయల్–100 కు పదే పదే ఫోన్ చేశాడు. దీంతో పోలీసులు అతడికి వైద్యపరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరిచారు. ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి చంద్రశేఖర్ నిందితుడికి రూ.వెయ్యి జరిమానా, ఒక రోజు జైలు శిక్ష విధించింది. పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని పట్టణ ఎస్హెచ్వో నరహరి తెలిపారు. నవీపేట: మండలంలోని జన్నెపల్లి గ్రామానికి చెందిన నీరడి శ్రీను(42) అదృశ్యమైనట్లు ఎస్సై తిరుపతి మంగళవారం తెలిపారు. ఉపాధి నిమిత్తం దుబాయి నుంచి వచ్చిన శ్రీను కొన్ని రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. ఇంట్లో గొడవలు జరగడంతో గత నెల 26న బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ తెలియరాలేదు. శ్రీను భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బీబీపేట: మద్యానికి బానిసైన ఓ యువకుడు గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బీబీపేట మండలం తుజాల్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రభాకర్ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోడ సునీల్(30) కొన్ని రోజులుగా ఎలాంటి పనులు చేయకుండా తిరుగుతూ మద్యం తాగేవాడు. దీంతో దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. సోమవారం సాయంత్రం వీరి మధ్య మరోసారి గొడవ కావడంతో సునీల్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. కుటుంబీకులు అతని కోసం వెతుకుతుండగా మల్కాపూర్ గ్రామ శివారులో గడ్డిమందు తాగి కిందపడిపోయి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వారు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బోధన్: రెండ్రోజుల్లో పెళ్లి జరుగనుండగా పెళ్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగు చూసింది. వివరా లు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని మంగల్ పహాడ్ గ్రామానికి చెందిన చేపూరి నారాగౌడ్కు ముగ్గురు కుమారులు. చిన్న కొడుకు ప్రతా ప్ గౌడ్ (31) ఇంటి వద్ద వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు. ప్రతాప్ గౌడ్ కు ఇటీవల పెళ్లి కుదిరింది. ఈ నెల 13న పెళ్లి జరగాల్సి ఉంది. అయితే సోమవారం నుంచి ప్రతాప్ గౌడ్ కనిపించకుండా పోయాడు. కుటుంబీకులు వెతికినా ఆచూకి లభించలేదు. మంగళవారం స్థానికులకు గ్రామ శివారులోని గుట్ట ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఉన్న స్థితిలో ప్రతాప్ గౌడ్ మృత దేహం కనిపించింది. దీంతో కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పెళ్లి కొడుకు ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. -
సోయా పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలి
మద్నూర్(జుక్కల్): సోయా పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోమవారం పంట కొనుగోళ్లు షురు చేస్తామని చేయకపోగా మంగళవారం నాఫెడ్ అధికారులు పంటను పరిశీలించి కొనుగోళ్లను ప్రారంభించారు. కానీ చాలా మంది రైతుల సోయా పంట నాణ్యత లేదని, పంట రంగు మారిందని, మట్టి ఎక్కువగా ఉందని, తేమ శాతం రావడం లేదని నాఫెడ్ అధికారులు చెప్పగా రైతులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట బాగున్నా, ఎందుకు అడ్డంకులు చెబుతున్నారని వారు ప్రశ్నించారు. పంట కొనుగోలులో ఆలస్యం జరుగుతుండటంతోపాటు అధికారులు కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతులందరి సోయా పంటను కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పెద్దకొడప్గల్(జుక్కల్): విద్యుత్ వైర్లను ఇళ్లపై నుంచి తొలగించాలని గాంధీనగర్ కాలనీవాసులు డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో ఉదయం 6 గంటల సమయంలో 11కేవీ విద్యుత్ వైర్లు తెగి పలువురి ఇళ్లపై పడడంతో కాలనీవాసులు భయందోళనకు గురయ్యాయారు. దీంతో కాలనీవాసులు ఇళ్లపై నుంచి వైర్లను వెంటనే తొలగించాలని కోరారు. వైర్లను ఇళ్లపై నుంచి తొలగించే వరకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వకూడదన్నారు. అనంతరం గాంధీ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో మధ్యాహ్నం 3 గంటల వరకు మండల కేంద్రంలో విద్యుత్ సరఫరాలో అంతరాయమేర్పడింది. ఉదయం నుంచి విద్యుత్ లేకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలకు, వ్యాపారులకు ఇబ్బందిగా మారింది. -
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం
● జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుబిచ్కుంద(జుక్కల్): జుక్కల్ నియోజకవర్గంలోని ఏకైక మున్సిపాలిటీ బిచ్కుందని, దీనిని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. సెంట్రల్ లైటింగ్, రోడ్డు వెడల్పు పనులలో నాణ్యతా ప్రమాణాలు, పనులు సజావుగా జరగడం, పట్టణ అభివృద్ధిపై అఖిల పక్షం నాయకులు, ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పనులపై అవగాహన లేని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వారిని పట్టించుకోవద్దని కోరారు. ప్రతిపక్ష నాయకులు రాజకీయం పక్కన పెట్టి అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో ముందుకు వెళ్లి ఎవరికీ నష్టం జరగకుండా వేగంగా రోడ్డు పనులు చేయాలని సూచించారు. రోడ్డుపై దుమ్ము వస్తుందని వ్యాపారులు, ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా నీళ్లతో క్యూరింగ్ చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. అనంతరం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఆర్అండ్బీ ఈఈ మోహన్, డీఈ వినోద్, మున్సిపల్ కమిషనర్ ఖయ్యుం, వివిధ శాఖల అధికారులు, నేతలు పాల్గొన్నారు. -
శుభ్రమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలి
బాన్సువాడ రూరల్: రైతులు శుభ్రమైన ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోనాపూర్ క్లస్టర్ ఏఈవో జ్ఞానేశ్వర్ అన్నారు. మంగళవారం ఆయన సొసైటీ కార్యదర్శి సురేందర్రావు, సెంటర్ ఇన్చార్జి సాదఖ్ తదితరులతో కలిసి ధాన్యం కుప్పలను పరిశీలించారు. 17శాతం లోపు తేమ ఉండేలా ధాన్యం ఆరబెట్టాలని, తాళ్ళు, రంగుమారిన గింజలు లేకుండా చూడాలన్నారు. పొతంగల్ కలాన్లో ధాన్యం కాంటాల ప్రారంభం గాంధారి(ఎల్లారెడ్డి): రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సింగిల్ విండో చైర్మన్ సాయికుమార్ అన్నారు. మంగళవారం పోతంగల్ కలాన్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటాలను ప్రారంభించారు. విండో డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు. -
క్రీడల్లో గెలుపోటములు సహజం
● ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్బాన్సువాడ: క్రీడల్లో గెలుపోటములు సహజమని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ అన్నారు. ఉమ్మడి జిల్లా స్థాయి మహిళ, పురుషుల విభాగాల వాలీబాల్ టోర్నమెంట్ బాన్సువాడలో నిర్వహించా రు. మంగళవారం నిర్వహించిన టోర్నమెంట్ ము గింపు కార్యక్రమానికి హాజరైన కాసుల బాల్రాజ్ మాట్లాడుతూ.. క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి క్రీడలు దోహదపడతా యని అన్నారు. బాన్సువాడలో జిల్లా స్థాయి క్రీడలే కాకుండా రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించేందుకు కృషి చేస్తామని అన్నారు. పోటీల్లో ఉమ్మడి జిల్లా స్థా యి వాలీబాల్ టోర్నమెంట్ విజేత జట్టుగా బాన్సు వాడ నిలిచింది. మహిళల విభాగంలో బాన్సువాడ–మగ్గిడి జట్లు హోరాహోరీ సాగింది. పోటీల్లో బాన్సువాడ జట్టు విజయం సాధించింది. పురుషుల విభాగంలో బాన్సువాడ–తాడ్వాయి జట్టు త లపడగా బాన్సువాడ జట్టు విజయం సాధించింది. విజయం సాధించిన జట్లకు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్రాజ్ కప్లతో పాటు మెడల్స్ అందజేశారు. అలాగే విజయం సాధించిన క్రీడాకారులకు వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి ఫోన్లో అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు కృష్ణారెడ్డి, ఎజాస్, ఖలేక్, నార్ల సురేశ్, రవీందర్, వాహబ్, గౌస్, దావుద్, జిల్లా వాలీబాల్ అసో సియేషన్ ప్రతినిధులు మల్లేశ్గౌడ్, రవీందర్రెడ్డి, కామారెడ్డి డీవైఎస్వో రంగాగౌడ్, నిజామాబాద్ డీ వైఎస్వో నవీన్, పీడీలు తదితరులు పాల్గొన్నారు. -
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి
● ధాన్యం కొనుగోలు కేంద్రాలను సజావుగా నడిపించాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తాడ్వాయి(ఎల్లారెడ్డి)/కామారెడ్డి క్రైం : ధాన్యం కొ నుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, కేంద్రాలను సజావుగా నడిపించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కామారెడ్డి మండలం ఇస్రోజివాడిలోని వరి కొనుగోలు కేంద్రాన్ని, తాడ్వాయి, కృష్ణాజీవాడి శివారులో ఉన్న మక్క, వరి కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా రైతులతో క లెక్టర్ ముఖాముఖిగా మాట్లాడి, సమస్యలను తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతుల సూచనలు సేకరించి పంటల కొనుగోలు ప్రక్రియను పా రదర్శకంగా సమయ పాలనతో కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షణ చేయాలని, రైతులకు డబ్బు చెల్లింపులు సకాలంలో జరిగే లా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మొత్తం 427 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 11,196 మంది రైతుల నుండి 1,23,993 మెట్రిక్ ట న్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. అందు లో 59,162 మెట్రిక్ టన్నులు దొడ్డురకం, 64,831 మెట్రిక్ టన్నులు సన్నరకం ఉన్నట్లు వెల్లడించారు. రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.145 కోట్లు జమ చేశామన్నారు. తాడ్వాయి మండలంలోని కొనుగో లు కేంద్రం వద్ద ఒక రైతు తన కొడుకుతో కలసి ఉండడాన్ని కలెక్టర్ గమనించారు. ఆ బాలుడు పాఠశా లకు ఎందుకు వెళ్లలేదని ఆరా తీశారు. పిల్లలను ప్ర తిరోజు పాఠశాలకు పంపడం తల్లిదండ్రుల బాధ్య త అని వారికి సూచించారు. అదనపు కలెక్టర్ విక్టర్, డిప్యూటి ట్రెయినీ కలెక్టర్ రవితేజ, సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్, డీసీవో రామ్మోహన్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీవో సాజీద్అలీ, ఎంపీవో సవిత తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న జన్మదినోత్సవాలు
● నేడు కాలభైరవుడి డోలారోహణం ● సాయంత్రం బండ్ల ఊరేగింపురామారెడ్డి (ఎల్లారెడ్డి): మండలంలోని కాలభైరవుడి ఆలయంలో స్వామివారి జన్మదినోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మూడరోజు సంతత ధారాభిషేకం కొనసాగింది. ఆలయానికి భక్తులు ఉదయం నుంచే భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. నేడు (బుధవారం) ఉదయం ఆరు గంటలకు సంతతధారాభిషేకం పరిసమాప్తి అవుతుంది. అనంతరం మధ్యాహ్నం డోలారోహణం (తొట్లే) నిర్వహించనున్నారు. స్వామివారి కిలో బంగారు విగ్రహాన్ని పోలీస్ బందోబస్తు మధ్య ఆలయానికి తీసుకొచ్చి తొట్లలో వేసి డోలారోహణం నిర్వహిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు బండ్ల ఊరేగింపు ఉంటుంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రామారెడ్డి ఎస్సై రాజశేఖర్ తెలిపారు. -
గాయాలెన్నో..
● జిల్లాలోని పలుచోట్ల ఛిద్రమైన రోడ్లు, దెబ్బతిన్న వంతెనలు ● నెలలు గడుస్తున్నా మరమ్మతులు కరువు ● అవస్థలు పడుతున్న ప్రజలు వర్షం చేసినఈయేడు వానాకాలంలో భారీ వర్షాలతో జిల్లాకు అపార నష్టం జరిగింది. ధ్వంసమైన రోడ్లు, దెబ్బతిన్న వంతెనలు మానని గాయాలుగా జిల్లాను వెంటాడుతున్నాయి. నెలలు గడుస్తున్నా వర్షం చేసిన గాయాల నుంచి ఇంకా కోలుకోవడం లేదు. రహదారులకు సంబంధిత అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : వానాకాలంలో భారీ వ ర్షాలతో రోడ్లు, వంతెనలు ఎన్నో దెబ్బతిన్నాయి. జి ల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రధాన రహదారులతోపాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడం, కోతకు గురవడంతో రాక పోకలకు ఇబ్బందికరంగా మారింది. పట్టణాల్లోనూ అనేక రోడ్లు కోతకు గురయ్యాయి. ముఖ్యంగా కా మారెడ్డి జిల్లా కేంద్రంలో చాలా రోడ్లు దెబ్బతిన్నా యి. కానీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల తాత్కాలిక మరమ్మతులు చేశారు. ఇంకాచాలా చోట్ల అలాగే వదిలేశారు. మరమ్మతులకు సుమారు రూ.170 కోట్లు.. ఆగస్టు చివరి మాసంలో కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. జిల్లాలోని వివిధ మండలాల్లో మూడు రోజు ల్లో 50 సెం.మీ.ల నుంచి 70 సెం.మీ. వర్షపాతం న మోదైంది. దీంతో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నా యి. నెలలు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జిల్లాలో రోడ్లు భవనాల శాఖ (ఆర్అండ్బీ)కి సంబందించి 65 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతినగా, 48 కల్వర్టులు పాడయ్యాయి. వీటికి తాత్కాలి క మరమ్మతుల కోసం రూ. 5.50 కోట్లు, పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయడానికి రూ.120 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అప్పట్లో అంచ నాలు వేశారు. అలాగే పంచాయతీరాజ్శాఖ పరిధి లో 122 రోడ్లు, కల్వర్టులు దెబ్బతినగా వాటికి తా త్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు రూ.8కోట్లు అ వసరం అవుతాయని పంచాయతీరాజ్ శాఖ అధికారులు నివేదికలు రూపొందించారు. పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టేందుకు రూ.37.50 కోట్లు అవసరమని అంచనాలు తయారు చేశారు. భారీ మొ త్తంలో నష్టం జరిగినప్పటికీ ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతులకు తప్ప, పూర్తిస్థాయి మరమ్మతులకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. కాగా కొన్ని చోట్ల తాత్కాలిక పనులు చేపట్టారు. అవి కూడా ఇ బ్బందికరంగానే ఉన్నాయి. రాకపోకలకు ఇబ్బందులుభారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు నెలలు గడిచి నా మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు రాకపోకలకు నానా ఇబ్బందులు ఎదుర్కోవా ల్సి వస్తోంది. జిల్లాలోని రామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, బీబీపేట, దోమకొండ, భిక్కనూరు, కామారెడ్డి, తాడ్వాయి, రాజంపేట, లింగంపేట, ఎల్లారెడ్డి, గాంధారి తదితర మండలాల్లో ఎ క్కువగా రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. అ యితే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ఇబ్బందులు తొలగించాల్సి ఉండగా.. రోడ్లు, భవనా ల శాఖతోపాటు పంచాయతీరాజ్ శాఖ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. కొన్ని ప నులు చేపట్టి, మిగతా వాటిని అలాగే వదిలేశా రు. నిధుల సమస్య వల్లే పనులు ముందుకు క దలడం లేదని సమాచారం.ఎమ్మెల్యేలు చొరవ చూపితేనే.. జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, వంతెనల మరమ్మతులకు అవసరమైన నిధులు సాధించేందుకు ఎమ్మెల్యేలు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. నిధుల సమస్యతో మరమ్మతులకు నోచుకోక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యేలు స్పందించి జిల్లాకు నిధులు తీసుకురావడానికి ప్రయత్నించాలని పలువురు కోరుతున్నారు. -
జిల్లాకేంద్రంలో విస్త ృత తనిఖీలు
కామారెడ్డి క్రైం: ఢిల్లీ బాంబు పేలుళ్ల నేపథ్యంలో రా ష్ట్ర పోలీసు శాఖ సూచనల మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈసందర్భంగా మంగళవారం సాయంత్రం కామారెడ్డిలో పోలీసుల సిబ్బంది ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అదనపు ఎ స్పీ నరసింహరెడ్డి ఆధ్వర్యంలో పలువురు సీఐలు, ఎస్సైలతో కూడిన 60 మంది సభ్యులు గల బృందా లు పట్టణంలోని కొత్త బస్టాండ్, రైల్వే స్టేషన్, ప్రధా న కూడళ్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో విస్తృతంగా త నిఖీలు చేపట్టారు. ప్రయాణికులు బ్యాగులు, పార్సిళ్లను క్షుణంగా పరిశీలించారు. అనుమానిత వ్యక్తు లు కానీ, వస్తువులు కాని కనబడితే తమకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. తనిఖీ ల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలున్నాయి. -
పంట కోత పనులు 60 శాతం పూర్తి
● డీఏవో మోహన్రెడ్డి ● మాల్తుమ్మెద విత్తనక్షేత్రంలో ధాన్యం వేలం నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): జిల్లాలో వానాకాలం పంటలకు సంబంధించి 60శాతం కోత పనులు పూర్తయ్యాయని డీఏవో(జిల్లా వ్యవసాయాధికారి) మోహన్రెడ్డి తెలిపారు. మండలంలోని మాల్తుమ్మెద విత్తనోత్పత్తిక్షేత్రంలో మంగళవారం జరిగిన ధాన్యం వేలంపాట నిర్వహణలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈయేడు వానాకాలం పంటలకు సంబంధించి మొత్తం 6లక్షల మెట్రిక్టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారని, ఇప్పటివరకు లక్షా23వేల992మెట్రిక్టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ఇటీవల సంభవించిన వదరల కారణంగా జిల్లాలో జరిగిన 26,429ఎకరాల పంటనష్టానికి సంబంధించి పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదించామన్నారు. కాగా మండలంలోని మాల్తుమ్మెద విత్తనక్షేత్రంలో ఈ యేడు యాసంగిలో 30ఎకరాలలో వరి, 20ఎకరాలలో జనుము, నస్రుల్లాబాద్ మండలంలోని బొప్పాస్పల్లి విత్తనక్షేత్రంలో 110ఎకరాలలో వరి, 10ఎకరాలలో జనుము పంటలను సాగు చేస్తారని ఆయన వివరించారు. అనంతరం మండలకేంద్రంలోని వ్యవసాయశాఖ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. నాగిరెడ్డిపేట శివారులో గల ఆయిల్పామ్ పంటను పరిశీలించారు. మాల్తుమ్మెద విత్తనక్షేత్రంలో 2021వానాకాలం, యాసంగి సీజన్లలో సాగుచేసిన పంటలకు సంబంధించిన 770.50క్వింటాళ్ల ధాన్యాన్ని వేలం వేశారు. వేలంపాటలో నలుగురు వ్యాపారులు పా ల్గొనగా మండలంలోని తాండూర్కు చెందిన ఆగమయ్య అనే వ్యాపారి క్వింటాల్కు రూ. 1,910 చొప్పున పాడి ధాన్యాన్ని దక్కించుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ సీడ్స్ ఆర్ఎం రఘు, డీఏవో కార్యాలయ ఏడీఏ లక్ష్మిప్రసన్న, టెక్నికల్ ఏవో సంతోష్, విత్తనక్షేత్ర ఏడీఏ ఇంద్రసేన్, ఎల్లారెడ్డి ఏఎంసీ సీనియర్ అసిస్టెంట్ శశికాంత్, ఏఈవో శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
పత్తి అమ్మడానికి అవస్థలు
● సీసీఐ కొత్త నిబంధనలతో తంటాలు పడుతున్న అన్నదాతలు ● ఎకరానికి 7క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామంటున్న అధికారులుమద్నూర్(జుక్కల్) : పత్తి అమ్మడానికి సీసీఐ అధికారులు నిబంధనల పేరుతో అవస్థలు పెడుతున్నా రని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎ న్నడు లేనంతగా పత్తిని అమ్ముకోవడానికి నిబంధ నలు పెట్టినట్లు వారు వాపోతున్నారు. ఎకరాకు 13 క్వింటాళ్లకు బదులుగా 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు చెబుతు న్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన యాప్లోనే ప త్తి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించడంతో చా లా మంది రైతుల వద్ద ఆండ్రాయిడ్ ఫోన్లు లేక కష్టా లు పడుతున్నారు. అలాగే పత్తికి తేమ శాతం 8కి మించకుడదని అధికారులు చెప్పడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు 54,357 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. కొనుగోలు కేంద్రాలు మాత్రం ఉమ్మడి నిజామాబాద్, కామా రెడ్డి జిల్లాలో కేవలం మద్నూర్లోనే కొనసాగుతున్నాయి. ఈక్రమంలో పత్తిని అమ్మడానికి ఉమ్మడి జిల్లా రైతులు మద్నూర్కు తీసుకువస్తున్నారు. కానీ అధికారులు మాత్రం తేమ శాతం సరిగ్గా లేదని, పత్తి పంట నల్లగా మారిందని ఇలా అనేక కారణాలు చూపుతూ పత్తిని తీసుకొచ్చిన రైతులను తిప్పి పంపిస్తున్నారని వారు ఆందోళన చెందుతున్నారు. పంట కొనుగోళ్లకు ఒకవైపు అధికారులు కొర్రీలు పెడుతుండగా, మరోవైపు కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి రైతులు తెచ్చిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని పలువురు కోరుతున్నారు. -
వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
బాన్సువాడ: ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని ఇంటర్మీడియట్ బోర్డు డిప్యూటీ సెక్రెటరీ పద్మ అన్నా రు. బాన్సువాడ ప్రభుత్వ బాలికల జూనియ ర్ కళాశాలను మంగళవారం ఆమె సందర్శించారు. కళాశాలలో వసతులు, సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం డిప్యూ టీ సెక్రెటరీని కళాశాల అధ్యాపకులు సన్మానించారు. ప్రిన్సిపల్ అసద్ ఫారుఖ్ సిబ్బంది ఉన్నారు. విధుల్లో ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలి పిట్లం(జుక్కల్) : పోలీసు సిబ్బంది విధుల్లో ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజేష్చంద్ర అన్నారు. పిట్లం పోలీస్ స్టేషన్ ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందితో మాట్లాడి, వారి పనితీరును స్వయంగా పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల అ వసరాలకు అనుగుణంగా పనిచే యడం ప్ర తి పోలీస్ సిబ్బంది బాధ్యత అని అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం జ రగకూడదని సూచించారు. సిబ్బంది ఏవైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వాటిని పైఅధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి, సీఐ తిరుపతయ్య, ిఎస్సై వెంకట్రావ్ పాల్గొన్నారు. మిల్లర్ల దోపిడీని అరికట్టాలి బీబీపేట: రైస్మిల్లర్లు తరుగు పేరిట చేస్తున్న దోపిడీని అరికట్టాలని రైతులు డిమాండ్ చే శారు. ఈమేరకు మండల కేంద్రంలోని ప్ర ధాన చౌరస్తాలో మంగళవారం మండలంలో ని ఉప్పర్పల్లి రైతులు ట్రాక్టర్లలో ధాన్యాన్ని తీసుకువచ్చి ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. లారీలో తూ కం వేసి పంపించిన వడ్లను ముత్యంపేట నందిని రైస్మిల్ తరుగు పేరిటి 30 బ్యాగు లు కట్ చేస్తామని లేదంటే లారీని తిరిగి పంపిస్తామని రైస్మిల్ యజమాని తెలిపారన్నా రు. దీంతో విసుగుచెంది బీబీపేటకు వచ్చి ధర్నాకు దిగామన్నారు. గంటపాటు రోడ్డుపై బైఠాయించగా ఎస్సై ప్రభాకర్ అక్కడకు చే రుకొని రైతులను సముదాయించారు. రైస్మిల్ యజమానితో మాట్లాడుతానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. -
ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి
● జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ● క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహణనిజాంసాగర్ (జుక్కల్): ప్రజా సమస్యల పరిష్కా రం దిశగా అధికారులు తమవంతు కృషి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. జుక్కల్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. గ్రామాల వారీగా వచ్చిన సమస్యలను తెలుసుకొని ఆయా శాఖల అధికారుల దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. జుక్కల్లో పోస్ట్ఆఫీస్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని సామాజికవేత్త తమ్మేవార్ అజయ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యేను ఆయన సన్మానించారు. -
ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా
కమ్మర్పల్లి: భీమ్గల్ మండలం కుప్కాల్ ఒర్రెల నుంచి కమ్మర్పల్లికి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తాపడిన ఘటన కమ్మర్పల్లి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని హాసకొత్తూర్లో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏ, భీమ్గల్ వైపు నుంచి ఇసుక ట్రాక్టర్ వస్తుండడాన్ని గమనించి అనుమానంతో తనిఖీ చేశాడు. అనుమతి పత్రాలు లేకపోవడంతో ఆర్ఐ శరత్కుమార్కు ఫోన్లో సమాచారం అందించారు. ఆర్ఐ ఆదేశాలతో వీఆర్ఏ ట్రాక్టర్ను పోలీస్స్టేషన్కు తరలించేందుకు ప్రయత్నించగా, డ్రైవర్ వేగంగా నడపడంతో కమ్మర్పల్లి శివారులోని బీడీ కంపెనీ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాక్టర్తోపాటు ఇసుకను పోలీస్స్టేషన్కు తరలించారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ యజమాని వేముల భాస్కర్, డ్రైవర్ పల్లపు సాయికుమార్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కాలనీలో సమస్యలు పరిష్కరించాలి
కాలనీలో ఎన్నో రోజులుగా నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీవాసులు సోమవారం కలెక్టరేట్కు తరలివచ్చారు. వారు మాట్లాడుతూ.. కాలనీలోని డబుల్ బెడ్రూం ఇండ్లకు నీరందించేందుకు గతంలో రోడ్లు తవ్వి పైప్లైన్ వేశారని తెలిపారు. ఇప్పటికీ కాలనీకి తాగు నీరు రాలేదన్నారు. మురికి కాలువలు సక్రమంగా లేక మురికంతా రోడ్లపై పారుతోందన్నారు. మురికి నీరు రోడ్లపైకి రావడంతో గుంతలు ఏర్పడి రోడ్లు అధ్వానంగా మారాయన్నారు. ఇకనైనా స్పందించి సమస్యలను పరిష్కరించాలని ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు. -
ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ● ప్రజావాణికి 80 వినతులుకామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 80 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూసమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు, బిల్లుల మంజూరులకు సంబంధించినవి ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించి సమస్యలను పరిష్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. ఫిర్యాదులను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. పెండింగ్ లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. బాన్సువాడ సబ్కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, ఆర్డీవో వీణ, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, ఏవో మసూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. లింగంపేటలో అధికారుల డుమ్మా..! లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో ప్రతీ సోమవారం ఏర్పాటు చేసే ప్రజావాణి కార్యక్రమానికి సోమవారం పలు శాఖల అధికారులు గైర్హాజరయ్యారు. మండలంలోని అన్ని శాఖల అధికారులు ప్రజావాణిలో పాల్గొనాల్సి ఉండగా కేవలం రెండు శాఖల అధికారులు మాత్రమే హాజరుకావడం విశేషం. కార్యక్రమానికి తహసీల్దార్ సురేష్, ఎంపీడీవో నరేష్, ఎంపీవో మలహరి మాత్రమే హాజరయ్యారు. అన్ని శాఖల అధికారులు హాజరయ్యేవిధంగా చూడాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
కొనుగోలు కేంద్రాల తనిఖీ
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పోచారం, మాల్తుమ్మెద, తాండూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం స్పెషల్ టాస్క్ఫోర్స్ ఓఎస్డీ శ్రీధర్రెడ్డి, డీఎస్పీ శేఖర్రెడ్డి ఇతర అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ప్రధానంగా పోచారంలో గ్రామ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో గత శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఖాళీ గన్నీ సంచుల దగ్ధం ఘటనను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా గన్నీ సంచులు దగ్ధమైన తీరుపై వారు వివరాలను సేకరించారు. గన్నీ సంచుల దగ్ధంపై వారు అనుమానం వ్యక్తం చేస్తూ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్గౌడ్కు సూచించారు. అనంతరం మండలంలోని మాల్తుమ్మెద, తాండూర్ గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను వారు పరిశీలించారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులతో మాట్లాడారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం వివరాలను స్థానిక సిబ్బందిని అడిగి వారు తెలుసుకున్నారు. రైతులు వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అసిస్టెంట్ సివిల్ సప్లయ్ అధికారి సుదర్శన్రెడ్డి, ఎస్సై శ్రీనివాస్, ఎన్ఫోర్స్మెంట్ డీటీ సురేష్, ఎస్సై భార్గవ్గౌడ్, ఏపీఎం రాంనారాయణగౌడ్, గ్రామసంఘం అధ్యక్షులు లక్ష్మి, సీసీ నారాయణ తదితరులున్నారు. -
దీపంతో అగ్ని ప్రమాదం
బాల్కొండ: ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో బొంత రాజేందర్కు చెందిన ఇంట్లో సోమవారం ఉదయం దేవుళ్ల ఫొటో ముందు దీపం వెలిగించారు. కొన్ని గంటల తర్వాత ఇంట్లో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల వారు అప్రమత్తమై నీటితో చల్లార్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబసభ్యులు కోరారు. నవీపేట : మండలంలోని నాళేశ్వర్ గ్రామానికి చెందిన ఆలూరు అక్షయ్ (18) సోమవారం చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. రోజులాగే గోదావరి నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన అక్షయ్ కాళ్లకు వల చిక్కుకోవడంతో నీట మునిగి మృతి చెందాడు. నది ఒడ్డున చెప్పులు, బట్టలు ఉండడంతో తల్లి సుమలత అనుమానం వచ్చి నదిలో వెతికారు. సాయంత్రం అక్షయ్ మృతదేహం లభించింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. ఆర్మూర్టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో జమీర్ ఆర్డర్ మెస్లో జమీర్ అనే వ్యక్తి డబ్బులు తీసుకొని పేకాట ఆడిస్తున్నాడన్న సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. పేకాడుతున్న ఆరుగురిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.14,460 నగదు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్హెచ్వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. వర్ని: మోస్రా మండలం గోవూరు గ్రామానికి చెందిన ప్రశాంత్ (33) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వర్ని ఎస్సై మహేశ్ తెలిపారు. భార్య పుట్టింటికి వెళ్లి తిరిగి రావడం లేదని మనస్తాపంతో ప్రశాంత్ ఈనెల 6న పురుగుల మందు సేవించాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాల్కొండ: మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద సోమవారం సాయంత్రం ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. దీంతో కార్లలో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ నుంచి ప్రాజెక్ట్ సందర్శనకు వచ్చిన పర్యాటకుల వాహనాలు ఒకే రోడ్డుపై ఎదురెదురుగా వేగంగా రావడంతో అదుపుతప్పి ఢీకొన్నాయి. పలువురికి స్వల్పగాయాలు కావడంతో నిర్మల్లోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. వేల్పూర్: మండలంలోని లక్కోర మాజీ సర్పంచ్ వంశీకృష్ణపై ఆదివారం రాత్రి గ్రామానికి చెందిన నాగం రాజేశ్, నాగం నర్సయ్యలు కత్తితో దాడి చేసినట్లు ఎస్సై సంజీవ్ తెలిపారు. దాడిలో వంశీకృష్ణకు కడుపు పైభాగంలో, చేతులకు గాయాలు కాగా గ్రామస్తులు ఆర్మూర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారని పేర్కొన్నారు. గ్రామంలో రోడ్డుపై వంశీకృష్ణకు, రాజేశ్, నర్సయ్య ఎదురుపడగా మాటామాట పెరిగి దాడికి దారితీసినట్లు తెలుస్తోంది. వంశీకృష్ణ భార్య సౌందర్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మద్యం సేవించి వాహనాలు నడుపొద్దు
● డ్రంకెన్ డ్రైవ్లో పలువురికి జైలు, జరిమానా విధింపుకామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు నడుపొద్దని పట్టణ ఎస్హెచ్వో నరహరి సూచించారు. జిల్లా కేంద్రంలో రెండు రోజులుగా నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్లో 24 మంది పట్టుబడినట్లు తెలిపారు. కోర్టుకు హాజరుపరుచగా బాలక్రిష్ణ, తిరుపతి రెడ్డి అనే ఇద్దరికి ఒక రోజు జైలు శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా, మిగితా 22 మందికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించినట్లు వెల్లడించారు. డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వాహనదారులకు సోమవారం టౌన్ పీఎస్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్సై మహేశ్, సిబ్బంది పాల్గొన్నారు. తాడ్వాయిలో ఇద్దరికి జైలు.. తాడ్వాయి(ఎల్లారెడ్డి): డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష పడినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. సోమవారం తాడ్వాయి పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టు నిర్వహించారు. కన్కల్ గ్రామానికి చెందిన ఏలేటి బాలురెడ్డి, సంగోజివాడికి చెందిన దుడ్డెల ప్రవీన్ అతిగా మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి కామారెడ్డిలోని కోర్టులో హాజరుపరచగా ద్వితీయశ్రేణి న్యాయమూర్తి చంద్రశేఖర్ వారికి ఒక రోజు జైలు శిక్ష , రూ.1000 చొప్పున జరిమాన విధించారు. -
ద్విచక్రవాహనం పైనుంచి పడి మహిళ మృతి
సదాశివనగర్: మండలంలోని దగ్గి గ్రామ శివారు 44 జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. స్థానికుల సమాచారం మేరకు.. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గౌరారం గ్రామానికి చెందిన కనకంటి సావిత్రి (45), భర్త సాయిరెడ్డితో కలిసి పని నిమిత్తం ద్విచక్ర వాహనంపై కామారెడ్డికి వెళ్లారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో దగ్గి చివర్లోకి రాగానే వాహనంపై ఉన్న మహిళ రోడ్డుపై పడడంతో తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా సావిత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సదాశివనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రుద్రూర్: పోతంగల్ మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం స్థానికులు ఇసుక టిప్పర్లను అడ్డుకున్నారు. అక్రమ ఇసుక తరలింపును నిలిపివేయాలని నినాదాలు చేశారు. అనుమతి కన్నా రెట్టింపు సంఖ్యలో ఇసుక తరలిస్తున్నారని మండిపడ్డారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక అవసరమైతే ట్రాక్టర్ల ద్వారా తరలించేందుకు అనుమతించాలన్నారు. అధికారుల ఉదాసీనతతో అక్రమార్కులు విచ్చలవిడిగా ఇసుక తరలిస్తున్నారని వాహనాలను అడ్డుకున్నారు. పెద్ద టిప్పర్ల ద్వారా ఇసుక తరలించడంతో వ్యవసాయ భూములు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ రవాణాను అడ్డుకున్న వారిపై ఇసుక మాఫీయా బెదిరింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న కోటగిరి ఎస్సై సునీల్తో వాగ్వాదానికి దిగారు. అధికారులు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. -
రేషన్బియ్యం పట్టివేత
బాల్కొండ: మెండోరా మండలం బుస్సాపూర్లోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 46 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సోమవారం పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఎస్సై సుహాసిని తెలిపిన వివరాల ప్రకారం.. బుస్సాపూర్ కేంద్రంగా బాల్కొండకు చెందిన వినీష్, నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన సుపీయన్లు ఓ ఇంట్లో రేషన్ బియ్యం దాచి అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో దాడి చేసి రేషన్బియ్యం పట్టుకున్నామన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. బోధన్లో 28 క్వింటాళ్లు.. బోధన్: ఎడపల్లి మండల కేంద్రం శివారులో రేషన్బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న ఆటో గూడ్స్ వాహనాన్ని సోమవారం సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు. ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ ఇచ్చిన సమాచారం మేరకు నిఘా పెట్టి అక్రమంగా తరలిస్తున్న రేషన్బియ్యం వాహనాన్ని పట్టుకున్నట్లు సివిల్ సప్లయ్ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మహేశ్ కుమార్, పవన్కుమార్ తెలిపారు. వాహనంలో 28 క్వింటాళ్ల 60 కిలోల బియ్యం ఉన్నట్లు వెల్లడించారు. వాహనం, బియ్యం స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పేర్కొన్నారు. డ్రైవర్ మహ్మద్ మదినితోపాటు మరో వ్యక్తి షేక్ ఆఫ్పాన్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. రేషన్ బియ్యాన్ని మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు డ్రైవర్ చెప్పాడని పేర్కొన్నారు. ఇద్దరి రిమాండ్ ఆర్మూర్టౌన్: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని సోమవారం రిమాండ్కు తరలించినట్లు పట్టణ ఎస్హెచ్వో సత్యనారాయణ తెలిపారు. పట్టణానికి చెందిన పద్మ రంజిత్, వేల్పూర్కు చెందిన రేషన్డీలర్ మేకల పాపన్న ఈ నెల 7న రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరిని సోమవారం ఆర్మూర్ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు ఎస్హెచ్వో తెలిపారు. -
రెండు గ్రామాల మధ్య ఇసుక పంచాయతీ
నిజాంసాగర్(జుక్కల్): మంజీరా నదిలో ఇసుక దిబ్బ లు ఇరు గ్రామాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ఇసుక తరలింపు కోసం మంజీరా నదిలో సోమవారం మాగి గ్రామస్తులు పైపులు ఏర్పాటు చేసి మట్టి, మొరంతో రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అచ్చంపేట గ్రామస్తులు, యువకులు ఇసుక దిబ్బల వద్దకు చేరుకొని పైపులైన్ పనులను అడ్డుకున్నారు. మంజీరా నది పరివాహక ప్రాంతంలోని ఇసుక దిబ్బలు ఉన్న ప్రదేశం తమదంటే, తమదంటూ ఇరు గ్రామాల రైతులు, ట్రాక్టర్లు యజమానులు వాదులాడుకున్నారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు మంజీరా నది వద్దకు చేరుకున్నారు. పైపులైన్ పనులను ఆపాలని మాగి గ్రామస్తులకు సూచించారు. ఇసుక కోసం రోడ్డు మార్గం.. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటిని మంజీరా నదిలోకి విడుదల చేశారు. మంజీరా నదిలో వరద నీటి ప్రవాహం కారణంగా ఇసుక దిబ్బలు పేరుకున్నాయి. మంజీరా నదిలో కుప్పలు, తెప్పలుగా ఉన్న ఇసుక దిబ్బల కోసం చుట్ట ప్రక్క గ్రామాల ట్రాక్టర్లున్న యజమానులు, రైతులు పోటీ పడుతున్నారు. అయితే మంజీరా నదిలో ఉన్న ఇసుక నిల్వలను ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరిట ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. అచ్చంపేట, ఆరేడ్, ఆరేపల్లి, పెద్ద ఆరేపల్లి, బ్రాహ్మణపల్లి, మాగి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక అనుమతులు తీసుకుంటున్నారు. ఆయా గ్రామాల నుంచి పట్టణాలకు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి
● వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డిబాన్సువాడ: క్రీడాకారులు జాతీయ స్థాయిలోనే కా కుండా అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి ఆకాంక్షించారు. సోమవారం బాన్సువాడ మినీ స్టేడియంలో ఉ మ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారుల కోసం బా న్సువాడలో మినీ స్టేడియం నిర్మించామని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్న ని ర్వాహకులు పంతులు నరే ష్ను అభినందించారు. కా ర్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం గంగా ధర్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కుశాల్, నాయ కులు పోచారం సురేందర్రెడ్డి, కృష్ణారెడ్డి, ఎజాస్, ఖలేక్, నార్ల సురేష్, నార్ల రవీందర్, మధుసూదన్రెడ్డి, హకీం, లింగం, ఉప్పరి లింగం, సాయిబాబా, పసుపుల సాయిలు, అఫ్రోజ్, గౌస్, వాహబ్, బాబా, టోర్నమెంట్ నిర్వాహకులు పంతులు నరేష్, పీఈటీలు సురేందర్, అనీల్, రవి తదితరులున్నారు. అందెశ్రీకి నివాళులు.. ప్రముఖ గాయకులు అందెశ్రీ మృతికి సంతాపంగా సోమవారం వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. అందెశ్రీ ఆలపించిన జయజయయే తెలంగాణ గేయాన్ని విద్యార్థులకు వినించారు. ఆయన పాడిన గేయాలు తెలంగాణ చరిత్రలో నిలిచిపోతాయని పోచారం అన్నారు. -
ఎంఎల్హెచ్పీ పోస్టులకు దరఖాస్తులు
నిజామాబాద్నాగారం: జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలో కాంట్రాక్టు పద్ధతిలో 17 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ (ఎంఎల్హెచ్పీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్వో రాజశ్రీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 10 నుంచి 14 వరకు నూతన కలెక్టరేట్ కార్యాలయంలోని డీఎంహెచ్వో ఆఫీసులో ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలు nizamabad.telangana.gov.in వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.సిరికొండ: మండలంలోని గడ్కోల్ గ్రామంలో తాటి చెట్టు పైనుంచి పడి గీతకార్మికుడు తాళ్లపల్లి నర్సాగౌడ్(58) సోమవారం మృతి చెందినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. కల్లు తీయడానికి నర్సాగౌడ్ చెట్టు వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో భార్య సరోజన ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తకపోవడంతో కుటుంబసభ్యులకు, తోటి గీత కార్మికులకు సమాచారం ఇచ్చింది. తాటివనంలో వెతకగా ఒక చెట్టు వద్ద మృతి చెంది ఉన్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ● కాపర్ ఆయిల్ చోరీ పెద్దకొడప్గల్(జుక్కల్): మండల కేంద్రంతోపాటు శివారు గ్రామ శివారులోని రెండు ట్రాన్స్ఫార్మర్లను దుండగులు ధ్వంసం చేశారు. రైతులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆదివారం రాత్రి శివాపూర్ గ్రామ శివారులో చావునితండాకు చెందిన సహరి బాయ్, పెద్దకొడప్గల్ గ్రామానికి చెందిన ఆట్కరి హన్మంత్ రావుకు చెందిన ట్రాన్స్ఫార్మర్లలోని ఆపర్ ఆయిల్ను దుండగులు చోరీ చేశారు. పంచాయతీ కార్యదర్శి శివాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. -
కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
● రైతులకు ఇబ్బందులు కలగనీయొద్దు ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్కామారెడ్డి క్రైం : కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం తగదని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో కొనుగోలు కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు జారీ చేశారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టెర్ ఆశిష్ సంగ్వాన్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఏమైనా ఇబ్బందులు, సమస్యలు ఉన్నట్లయితే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన 08468 –220051 టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు గడువులోగా పూర్తయ్యేలా చూడాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, డీసీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో సురేందర్, డీఏవో మోహన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోదాం పరిశీలన కామారెడ్డి క్రైం: కలెక్టరేట్కు సమీపంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సోమవారం సందర్శించారు. రికార్డులు, తీసుకుంటున్న భద్రత చర్యలు, సీసీ కెమెరాల నిఘా తదితర అంశాలను పరిశీలించారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, డిప్యూటీ తహసీల్దార్లు రవి, అనిల్, సిబ్బంది పాల్గొన్నారు. -
మెడికల్ దందా!
● దేవునిపల్లికి చెందిన నరేందర్కు జ్వరంతోపాటు ఒళ్లు నొప్పులు రావడంతో ఓ మెడికల్ షాప్కు వెళ్లి సమస్య చెప్పాడు. దుకాణం నిర్వాహకుడు కొన్ని రకాల మందులు ఇచ్చి ఎలా వాడాలో సూచించాడు. డాక్టర్ ప్రిిస్క్రప్షన్ ఏదీ లేకుండానే మెడికల్ షాప్లో ఇచ్చిన ఆ మందులను మూడు రోజులపాటు వాడినా జ్వరం తగ్గకపోవడంతో నరేందర్ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ పరీక్షలు నిర్వహించి, రక్తంలో ఇన్ఫెక్షన్ ఉండడంతో ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందించారు. ● కామారెడ్డిలోని అయ్యప్పనగర్కు చెందిన సురేశ్.. తన తల్లికి వైద్యుడు రాసిచ్చిన మందులను తీసుకోవడానికి ఓ మెడికల్ షాప్కు వెళ్లాడు. మెడికల్ షాప్ నిర్వాహకుడు బ్రాండెడ్కు బదులు జనరిక్ మందులు ఇచ్చి.. అసలు ధర వసూలు చేశాడు. దీనిని గమనించిన సురేశ్ దుకాణం నిర్వాహకుడితో వాగ్వాదానికి దిగాడు. మందులు వాపస్ ఇచ్చి వేరే షాప్లో తీసుకున్నాడు. కామారెడ్డి టౌన్ : మెడికల్ దందాకు కేరాఫ్గా కామారెడ్డి పేరుగాంచింది. హైదరాబాద్ తర్వాత ఇక్కడే మెడికల్ ఏజెన్సీలు ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో 600లకుపైగా మెడికల్ దుకాణాలు రిజిస్ట్రర్ అయి ఉన్నాయి. అనధికారికంగా నడుస్తున్నవి మరో ఐదారు వందల వరకు ఉంటాయి. ఏదైనా మెడికల్ షాప్లోనో ఆస్పత్రిలోనో కొంతకాలం పనిచేసినవారు బీఫార్మసీ సర్టిఫికెట్ను అద్దెకు తీసుకుని దుకాణం తెరుస్తున్నారు. చాలాచోట్ల ఫార్మసిస్ట్లే ఉండడం లేదు. దుకాణం నిర్వాహకులే మందులు అమ్ముతున్నారు. జనరిక్ మందు.. బ్రాండెడ్ రేటు.. అర్హతలు లేకున్నా మందుల దుకాణం నిర్వహిస్తున్నవారు ఎక్కువగా జనరిక్ మందులనే అంటగడుతున్నట్లు తెలుస్తోంది. అదీ పూర్తి ధరకు అమ్ముతున్నారు. వైద్యులు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్(మందుల చీటి) చూసి మాత్రమే మందులు ఇవ్వాల్సి ఉండగా.. ఈ నిబంధనను ఎవరూ పట్టించుకోవడం లేదు. రోగి చెప్పిన లక్షణాల ఆధారంగా యాంటీబయాటిక్స్తోపాటు రెండుమూడు రకాల మందులు ఇచ్చి పంపిస్తున్నారు. చాలా మెడికల్ షాప్లలో ఇష్టారాజ్యంగా మందులు విక్రయిస్తున్నారు. మందులకు సంబంధించిన బిల్లులు సైతం ఇవ్వడం లేదు. అలాగే రికార్డులను సైతం నిర్వహించడం లేదు. సమయం దొరికినప్పుడు తీరిగ్గా కూర్చుని ఒకేసారి బిల్లులు తయారు చేసుకుంటున్నారని, తనిఖీల సమయంలో వాటిని చూపిస్తూ తప్పించుకుంటున్నారని తెలుస్తోంది. జిల్లాలో రెగ్యులర్గా మెడికల్ దుకాణాలను తనిఖీ చేస్తున్నా. మెడికల్ షాప్లలో ఫార్మసిస్టులు మాత్రమే మందులు విక్రయించాలి. బిల్లులు, రికార్డులు తప్పనిసరిగా నిర్వహించాలి. ఫార్మసిస్టు లేకున్నా, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించినా చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే లైసెన్స్ రద్దు చేస్తాం. – రాజిరెడ్డి, డ్రగ్ ఇన్స్పెక్టర్, కామారెడ్డి తనిఖీలు లేక.. ఔషధ నియంత్రణ శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఒక్కరే ఉన్నారు. దీంతో జిల్లాలో మెడికల్ షాప్లపై తనిఖీలు కరువయ్యాయి. అప్పుడప్పుడు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారన్న విమర్శలున్నాయి. తనిఖీల సమాచారం ముందే లీకవుతుండడంతో దుకాణాల నిర్వాహకులు ఆ సమయంలో ఫార్మసిస్టులను అందుబాటులో ఉంచుతున్నారు. దాడుల సమయంలో కొందరు షాప్లను మూసి ఉంచుతున్నారు.జిల్లాలో మెడికల్ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఎలాంటి అర్హతలు లేకున్నా సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుని దుకాణాలను నిర్వహిస్తున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకున్నా మందులు అమ్ముతున్నారు. జనరిక్ మందులను సైతం పూర్తి ధరకు అంటగడుతూ దోచుకుంటున్నారు. అర్హత లేకున్నా అద్దె సర్టిఫికెట్లతో నిర్వహణ షాపుల్లో కనిపించని ఫార్మసిస్టులు జనరిక్ మందులనూ ఎమ్మార్పీకే అంటగడుతున్న వైనం డాక్టర్ చీటీ లేకున్నా అమ్మకాలు చర్యలు తీసుకోని అధికారులు -
17న ఖేలో ఇండియా అథ్లెటిక్స్ పోటీలు
కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈనెల 17న అస్మిత ఖేలో ఇండియా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ లీగ్ పోటీలు నిర్వహించనున్నారు. అండర్–14, 16 బాలికల విభాగంలో ఈ పోటీలు జరగనున్నాయి. బాలికలను క్రీడారంగంలో ప్రో త్సహించడం, వచ్చే ఒలింపిక్స్ కోసం సన్న ద్ధం చేయడానికి కేంద్ర క్రీడ, యువజన శాఖ సంకల్పం మేరకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అ ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్రెడ్డి, అ నిల్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల బాలికలు బోనఫైడ్ సర్టిఫికెట్తోపాటు క్రీడా దుస్తులు ధరించి ఈనెల 17న ఉద యం 8 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియాని కి రావాలని సూచించారు. లాంగ్జంప్, హై జంప్, షార్ట్పుట్, డిస్క్త్రో, జావెలిన్త్రో అంశాలలో పోటీలుంటాయని తెలిపారు. కలెక్టర్ను కలిసిన మార్క్ఫెడ్ డీఎం కామారెడ్డి క్రైం: మార్క్ఫెడ్ డీఎం శశిధర్రెడ్డి సోమవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ను కలిసి మొక్కను అందజేశారు. ఆయన గతంలో మార్క్ఫెడ్ రాష్ట్ర కార్యాలయంలో పనిచేశారు. ఇటీవలే కామారెడ్డి జిల్లా మేనేజర్గా బాధ్యతలు స్వీకరించారు. విదేశీ పర్యటన ముగించుకుని సోమవారం కలెక్టరేట్కు వచ్చిన కలెక్టర్ను ఆయన మర్యాదపూర్వకగా కలిశారు. ఇక్కడ పనిచేసిన మార్క్ఫెడ్ డీఎం మహేష్ నిర్మల్ జిల్లాకు బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే. బాధ్యతల స్వీకరణలింగంపేట: మండల వైద్యాధికారి హిమబిందు సోమవారం ఎల్లారెడ్డి డివిజన్ ఉప వైద్యాధికారిగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తనకు అప్పగించిన అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. అనంతరం వైద్య సిబ్బంది ఆమెను సన్మానించా రు. సీహెచ్వో రమేశ్, పర్యవేక్షకులు ఫరీదా, సిబ్బంది చంద్రకళ, యాదగిరి, ఫార్మసిస్టు ప్రదీప్, ల్యాబ్ టెక్నిషియన్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు. టీఎన్జీవోస్ సభ్యత్వం.. కామారెడ్డి అర్బన్: జిల్లా ట్రెజరీ, ఉద్యానవన శాఖల ఉద్యోగులు సోమవారం తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం సభ్యత్వం స్వీకరించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరాల వెంకట్రెడ్డి, ముల్క నాగరాజు, ప్రతినిధులు దేవరాజు, రాజేశ్వర్, అనుదీప్రెడ్డి, స్వప్న, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
అసలే అక్రమం.. ఆపై రాజకీయం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రోస్టర్ పాటించకుండా అడ్డదారిలో నియామకమైన తెలంగాణ వర్సిటీ అధ్యాపకులు.. క్యాంపస్లో కొత్త రాజకీయాలకు తెరతీశారు. 2014లో కేసు కోర్టులో ఉన్న సమయంలోనే ఉద్యోగంలో నియామకమయ్యేటప్పుడు కోర్టు తీర్పునకు కట్టుబడతామని సదరు అధ్యాపకులు రాసిచ్చారు. తీరా ఇప్పుడు హైకోర్టు ఆ నియామకాలను రద్దు చేసినప్పటికీ తమను ఎవరూ ఏంచేయలేరన్నట్లుగా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. కోర్టు తీర్పును ధిక్కరిస్తూ వర్సిటీకి వస్తున్న ఆ 45 మంది అధ్యాపకులు తాజాగా మరో నీచ రాజకీయానికి బీజం వేశారు. ఎన్ఎస్యూఐ పేరిట తమకు అనుకూలంగా వర్సిటీలో ఆందోళన చేయించారు. ఇలా చేసిన కొద్ది సేపటికే దానిని ఖండిస్తూ ఎన్ఎస్యూఐ నుంచి ప్రకటన రావడం గమనార్హం. ఎన్ఎస్యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్ ఈ ప్రకటన విడుదల చేశారు. ఎన్ఎస్యూఐ ఉపాధ్యక్షుడిగా చెప్పుకుంటున్న నవీన్కు యూనియన్తో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. గతంలో తెలంగాణ వర్సిటీ ఎన్ఎస్యూఐ కమిటీలో పనిచేసినవారెవరూ ప్రస్తుతం అందుబాటులో లేనందున కొత్త కమిటీని నియమించలేదన్నారు. 2012 నోటిఫికేషన్ మీద హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఆయా అధ్యాపకుల పోస్టులను క్రమబద్ధీకరించాలంటూ చేసిన ఆందోళనకు ఎన్ఎస్యూఐకి సంబంధం లేదని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్కుమార్రెడ్డి ప్రభు త్వం ఉన్న సమయంలో అప్పటి తెయూ వీసీ అక్బ ర్ అలీఖాన్ చేసిన అక్రమ నియామకాలపై ఆ ప్రభు త్వం రెండు కమిటీలు వేసింది. ఈ నియామకాలు నిబంధనలకు విరుద్ధంగా చేసినట్లు రెండు కమిటీ లూ నివేదికలు ఇవ్వగా తరువాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం సదరు నివేదికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టింది. ఈ అధ్యాపకుల నియామకాలను, వీళ్లకు ప్రమోషన్లు ఇచ్చే విషయమై పాలకమండలి ప్రతిసారి తిరస్కరిస్తూ వ చ్చింది. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చింది. హైకోర్టు ఈ నియామకాలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును అమలు చేసే విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సదరు అధ్యాపకులు కీలక నేతలను బదనాం చేసే పనిలో బిజీగా ఉండడం విశేషం. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కొందరు బ్యూరోక్రాట్లు ఈ అక్రమాన్ని సక్రమం చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తుండడం గమనార్హం.కోర్టు తీర్పును ధిక్కరిస్తున్న అక్రమ అధ్యాపకులు అధికార పార్టీ నాయకుల ప్రతిష్టనూ దెబ్బతీసే పని చేస్తుండడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పేర్లను కూడా వాడుతున్నారు. అధికార పార్టీ అండ తమకుందంటూ వర్సిటీలో విభజన రాజకీయాలు చేస్తున్నారు. విద్యార్థి సంఘాలను భ్రష్టు పట్టించేందుకు కుయుక్తులు పన్నిన ఈ అధ్యాపకులు ఏకంగా ప్రభుత్వంలో, అధికార పార్టీలో కీలకంగా ఉన్న నేతనూ బదనాం చేస్తుండడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తగినవిధంగా ముందుకు వెళ్లేందుకు వీసీ యాదగిరిరావు సంసిద్ధం అవుతున్నప్పటికీ రిజిస్ట్రార్ యాదగిరి మాత్రం కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడుతున్నట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అడుగడుగునా అడ్డదారులు వెతుకుతున్న అక్రమ అధ్యాపకులు హైకోర్టు తీర్పు నేపథ్యంలో విద్యార్థి సంఘాలను భ్రష్టు పట్టించే యత్నం అధికార పార్టీ నేతలనూ బదనాం చేస్తున్న వైనం ఎన్ఎస్యూఐ పేరిట ఆందోళన చేయించడంతో.. ఖండిస్తూ ఆ సంస్థ ప్రకటన -
భూసేకరణను వేగవంతం చేయాలి
● రైతులకు త్వరగా పరిహారం చెల్లించాలి ● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి క్రైం: జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. రహదారుల భూసేకరణ పనులపై సోమవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మెదక్ నుంచి ఎల్లారెడ్డి మార్గంలో జరుగుతున్న జాతీయ రహదారి (ఎన్హెచ్–765డీ) ప్రాజెక్టుకు సంబంధించి రైతులకు నష్ట పరిహారం త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్లారెడ్డి నుంచి రుద్రూర్ వరకు చేపట్టాల్సిన రహదారి పనులకు గాను భూ సేకరణను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, ఎల్లారెడ్డి ఆర్డీఓ పార్థసింహా రెడ్డి, సంబంధిత శాఖల ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
సోయా కొనుగోళ్లలో కొర్రీలు
● కొత్తగా బయోమెట్రిక్ విధానం అమలు ● ఎకరానికి 7.50 క్వింటాళ్లు మాత్రమే సేకరణ ● ఆందోళనలో రైతులుబిచ్కుంద : ఆరుగాలం శ్రమించే రైతన్నలు.. దున్నకాలనుంచి పండించిన పంటను అమ్ముకునే వరకు అనేక పాట్లు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాలలో నిబంధనలతోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది సోయా కొనుగోళ్లలో మార్క్ఫెడ్ కొత్తగా బయోమెట్రిక్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. గతంలో పట్టాదారు ఆధార్ కార్డును తీసుకునివచ్చి కుటుంబ సభ్యులెవరైనా పంటను విక్రయించడానికి అవకాశం ఉండేది. కానీ నూతన విధానం ప్రకారం పాస్బుక్లో పేరున్న రైతు తప్పనిసరిగా కొనుగోలు కేంద్రానికి వచ్చి వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. అలాగే క్రాప్ బుకింగ్ సమయంలో సోయా పంటను పండిస్తున్నట్లు వివరాలు ఇస్తేనే పంటను అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయించాల్సిందే. మిగతా పంటను ఏం చేయాలి? కొనుగోలు కేంద్రాలలో ఎకరానికి 7.5 క్వింటాళ్ల సోయాలను మాత్రమే కొనుగోలు చేయనున్నారు. అధిక వర్షాలు కురిసే ప్రాంతాలలో ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. నీరు నిలువ ఉండని సారవంతమైన భూములలో ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల పంట పండుతుంది. కానీ కొనుగోలు కేంద్రాలలో 7.5 క్వింటాళ్ల పంటను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో మిగతా పంటను ఏం చేయాలో పాలుపోవడం లేదని రైతులు పేర్కొంటున్నారు. పండిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దళారులను చెక్ పెట్టేందుకే బయోమెట్రిక్! సోయా కొనుగోళ్లలో దళారులకు చెక్ పెట్టేందుకే బయోమెట్రిక్ విధానం అమలులోకి తీసుకు వచ్చినట్లు మార్క్ఫెడ్ అధికారులు పేర్కొంటున్నారు. పాత పద్ధతిలో దళారులు ఎక్కడి నుంచో సోయాలను తీసుకునివచ్చి రైతు పేరుతో విక్రయించి లబ్ధిపొందుతున్నారని గుర్తించిన ప్రభుత్వం.. బయోమెట్రిక్ విధానాన్ని తీసుకొచ్చిందని పేర్కొంటున్నారు. కొత్త విధానంతో పట్టాదారు మాత్రమే కొనుగోలు కేంద్రంలో పంటను అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు. అయితే వృద్ధులు, మహిళా రైతులు, అనారోగ్యంతో ఉన్న వారు కొనుగోలు కేంద్రం వరకు వచ్చే పరిస్థితి ఉండదని, వారు పంటను ఎలా విక్రయించుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎకరానికి ఆరునుంచి పది క్వింటాళ్ల వరకు సోయా పంట పండుతుంది. కానీ కొనుగోలు కేంద్రాలలో 7.5 క్వింటాళ్లు మాత్రమే తీసుకుంటాం అంటున్నారు. మిగిలిన సోయాలను ఎక్కడ అమ్ముకోవాలి. పండిన పంటను పూర్తిగా కొనుగోలు చేయాలి. – యాదవరావు, రైతు ఫత్లాపూర్ -
కాలభైరవుడికి లక్షదీపార్చన
రెండో రోజు కొనసాగిన సంతతధారాభిషేకం ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తున్న భక్తులురామారెడ్డి : దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం ఇసన్నపల్లి(రామారెడ్డి)లో వెలసిన శ్రీకాలభైరవుడి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 72 గంటల సంతతధారాభిషేకం సోమవారం రెండోరోజూ కొనసాగింది. సాయంత్రం 6 గంటలకు లక్ష దీపార్చన ప్రారంభమైంది. ఆలయ అర్చకుడు శ్రీనివాసశర్మ, ఈవో ప్రభుగుప్తా తదితరులు కార్యక్రమాన్ని ప్రారంభించారు. భైరవ నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు.


