breaking news
Kamareddy District Latest News
-
రాజకీయ కుట్రతోనే నా అరెస్టు
కామారెడ్డి టౌన్: పేలుడు పదార్థాల కేసు వ్యవహారంలో రాజకీయ కుట్రలో భాగంగానే తనను అరెస్టు చేయించారని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డి కీలక వాఖ్యలు చేశారు. గురువారం బెయిల్పై వచ్చిన తర్వాత శుక్రవారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేక ఓ పెద్దమనిషి హస్తంతో అరెస్టు జరిగిందని ఆరోపించారు. ఈనెల 3న జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్స్ లభ్యమైన లింగాపూర్ శివారులోని వెంచర్లో తనకు గజం స్థలం కూడా లేదన్నారు. పేలుడు పదార్థాలకు తనకు సంబంధం లేదన్నారు. ఈ కేసులో విచారణకు పిలిచిన డీఎస్పీ, సీఐకి ఆ వెంచర్కు సంబంధించి 1800 ఎకరాల భూమి పత్రాలను, ప్లాట్ల వివరాలను ఇచ్చానని తెలిపారు. ఈనెల 5వ తేదీన రాత్రి రూరల్ సీఐ వచ్చి ఎస్పీతో మాట్లాడుతారట వెళ్దామని చెప్పి ఓ ప్రైవేట్ వాహనంలో ఎస్పీ కార్యాలయం కాకుండా నేరుగా జాతీయ రహదారికి మళ్లీంచి బాన్సువాడకు అర్ధరాత్రి తీసుకెళ్లి ఆస్పత్రిలో ఆరోగ్య పరీక్షలు చేయించారని తెలిపారు. అక్కడి నుంచి తెల్లవారుజామున నిజామాబాద్ జైలుకు తరలించారని వివరించారు. పోలీసుల వద్దకు తానే స్వయంగా వెళ్తే ఎఫ్ఐఆర్లో మాత్రం తప్పించుకుని తిరుగుతున్నానని, అశోక్నగర్కాలనీ వద్ద ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుకున్నారని పొందుపర్చడం సరికాదన్నారు.అరెస్టులో పోలీసుల తీరుపై డీఐజీకి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారం రాజకీయ కుట్రతోనే జరిగిందని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తనపై ఓ మాజీ కౌన్సిలర్ తప్పుడు ప్రచారం చేసాడని తెలిపారు.తనపై కుట్ర చేసిన ప్రతి ఒక్కరి బండారం సమయం వచ్చినప్పుడు బయటపెడుతానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో నాయకులు రవి, సలీం, పంపరి శ్రీనివాస్, సాయిబాబా, చాట్ల వంశీ తదితరులున్నారు. పోలీసుల తీరుపై డీఐజీకి ఫిర్యాదు చేస్తా పేలుడు పదార్థాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి -
జనాభా పెరుగుదలను నియంత్రించాలి
● డీఎంహెచ్వో చంద్రశేఖర్ కామారెడ్డి టౌన్: జనాభా పెరుగుదలను నియంత్రించాలని డీఎంహెచ్వో చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్కాలనీ పీహెచ్సీలో కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. జనాభా వల్ల కలిగే సమస్యలపై, గర్భధారణ సమయ నిర్ణయం, సురక్షిత ప్రసవం గురించి చేపట్టవలసిన చర్యలు, కుటుంబ నియంత్రణ శాశ్వత, తాత్కాలిక పద్ధతుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని డీఎంహెచ్వో సూచించారు. ఎన్హెచ్ఎం ప్రోగ్రాం ఆఫీసర్ రాధిక, ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ అనురాధ, మెడికల్ ఆఫీసర్ సాయి ఈశ్వరి, చలపతి, రమణ, మమత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు కాయకల్ప అవార్డులు కామారెడ్డి టౌన్ : రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా ప్రభుత్వ ఆస్పత్రులకు కాయకల్ప అవార్డులను ప్రకటించింది. జిల్లాలోని పలు ప్రభుత్వ ఆస్పతులకు అవార్డులు వచ్చాయి. ఏరియా ఆస్పత్రి విభాగంలో బాన్సువాడ ఆస్పత్రికి రాష్ట్ర స్థాయిలో 84.61 మార్కులతో 19వ స్థానంలో నిలిచింది. అవార్డుతో పాటు రూ.లక్ష నగదు దక్కించుకుంది. పీహెచ్సీలలో రాజీవ్నగర్ కాలనీ యూపీహెచ్సీ ఉత్తమ సేవా అవార్డుతో పాటు రూ.13,35,000 దక్కించుకుంది. ఉత్తమ పీహెచ్సీగా లింగంపేట రూ.2 లక్షల నగదు, అలాగే మత్మల్, హన్మాజీపేట్, బీబీపేట, మాచారెడ్డి, దోంగ్ల్లీ, పుల్కల్ పీహెచ్సీలు ప్రంశసా అవార్డులను అందుకోగా ఒక్కో పీహెచ్సీకి రూ. 50 వేల చొప్పున నగదు అవార్డును ప్రకటించారు. ఈ మేరకు డీఎంహెచ్వో చంద్రశేఖర్, డీసీహెచ్ఎస్ విజయలక్ష్మిలు అవార్డు అందుకున్న వైద్యులు, సిబ్బందిని అభినందించారు. ప్రధానమంత్రి జాతీయ శిక్షణ మేళా కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని శ్రావణి ఐటీఐలో ఈ నెల 14న ప్రధాన మంత్రి జాతీ య శిక్షణ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు తమ ఒరిజినల్, జిరాక్స్ ప్రతులతో జిల్లా కేంద్రంలోని కళాశాలలో హాజరుకావాలని వెల్లడించారు. ప్రముఖ కంపెనీలు ఉద్యోగ అవకాశాల కోసం ఈ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
తాటిపల్లి అడవుల్లో పెద్దపులి సంచారం
సిరికొండ: నిజామాబాద్ సిరికొండ అటవీ రేంజ్ పరిధిలోని తాటిపల్లి, జినిగ్యాల బీట్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. తాటిపల్లి శివారులోని మల్లం చె రువు, తాంట్ల కుంటలో చేపలు పట్టేందుకు వెళ్లినవారికి పాద ముద్రలు కనిపించాయి. అనుమానం వ చ్చి సమాచారం ఇచ్చారని రేంజర్ రవీందర్ తెలిపా రు. ఆర్మూర్ ఎఫ్డీవో భవానీశంకర్, రేంజ్ ఆఫీసర్ రవీందర్, యానిమల్ ట్రాకర్స్, ఎన్జీవో వెంకట్, రేంజ్ సిబ్బంది శుక్రవారం ఆయా ప్రాంతాల్లో సంచరించారు. పాదముద్రలను పరిశీలించి మగ పెద్దపులిగా నిర్ధారించారు. గతంలో ఏటీఆర్ ఖానాపూర్ ఏరియా అటవీ ప్రాంతంలో సంచరించిన ఎస్12 పెద్దపులి అని గుర్తించారు. ఐదారు నెలల నుంచి జగిత్యాల జిల్లా కొడిమ్యాల రేంజ్, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రేంజ్ పరిధిలో తిరిగి ఇటువైపు వచ్చినట్లు రేంజర్ తెలిపారు. పెద్దపులి సంచారం నేపథ్యంలో అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న తండాలకు చెందిన గిరిజనులు, మేకల, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రైతులు పొలాల వద్ద కరెంటు తీగలను ఏర్పాటు చేయవద్దని పేర్కొన్నారు. అటవీ అధికారులు, యానిమల్ ట్రాకర్స్ ప్రతిరోజు గస్తీ తిరుగుతూ పులి కదలికలను పసిగడతామని, సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు రేంజర్ వివరించారు. -
పోలీస్ డ్యూటీ మీట్లో జిల్లాకు 11 పతకాలు
● ఎస్పీ రాజేష్ చంద్ర కామారెడ్డి క్రైం: కరీంనగర్లో ఈ నెల 7, 8 తేదీల్లో జరిగిన 2వ జోనల్ పోలీస్ డ్యూటీ మీట్లో జిల్లాకు 11 పతకాలు దక్కినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. పతకాలు సాధించిన పోలీసు అధికారులు, సిబ్బంది జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భవిష్యత్తులో జరిగే రాష్ట్ర, జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లలో కూడా పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. పోలీసు సిబ్బంది తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి డ్యూటీ మీట్ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పతకాలు సాధించిన వారికి రివార్డులను అందజేసి అభినందించారు. ఏఆర్ సీఐలు సంతోష్ కుమార్, నవీన్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిభ చూపిన గాంధారి ఎస్సై.. గాంధారి ఎస్సైగా పని చేస్తున్న ఆంజనేయులు పత కాల వేటలో ముందున్నారు. కేసుల విచారణలో శా సీ్త్రయ వినియోగానికి(లిఫ్టింగ్, ప్యాకింగ్, ఫింగర్ ప్రింట్స్ ఫార్వర్డ్, నేర స్థల ఫొటోగ్రఫీ) సంబంధించిన అంశాల్లో 3 బంగారు, 2 వెండి పతకాలు సా ధించారు. మద్నూర్ ఎస్సై విజయ్ ఫోరెన్సిక్, ఫొ టోగ్రఫీ, ఫింగర్ ప్రింట్ సైన్స్లలో 2 వెండి పతకా లు సాధించారు. బిచ్కుంద రైటర్ లక్ష్మీనారాయణ కు ఉత్తమ దర్యాప్తు(రైటర్) పతకం దక్కింది. కంప్యూటర్పై అవగాహన, విధ్వంసకాల విచ్ఛిన్నంపై తనిఖీలు తదితర అంశాల్లో రాజంపేట కానిస్టేబుల్ చిరంజీవికి కాంస్యం, ఏఆర్ కానిస్టేబుళ్లు రామచంద్రం, ఎల్లారెడ్డిలకు వెండి పతకాలు లభించాయి. -
సన్నం సరే.. దొడ్డు మాటేమిటి?
ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లాలో 3 నెలల సన్నబి య్యం పంపిణీ విజయవంతంగా పూర్తయింది. కానీ రేషన్ షాపుల్లో ముక్కిపోతున్న దొడ్డు బి య్యాన్ని ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారన్న ప్రశ్నకు సివిల్ సప్లయ్ అధికారుల వద్దే సమా ధానం లేదు. జూన్ నెల ఆసాంతం జరిగిన స న్న బియ్యం పంపిణీ కార్యక్రమం జిల్లాలో 93 శాతం పూర్తయింది. జిల్లాలోని 578 రేషన్ దు కాణాలకు 17,711.470 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం మూడు నెలల కోటా కింద విడుదల చేయగా వీటిలో 16,471.667 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేశారు. అయితే రేషన్ దు కాణాలలో పంపిణీ జరగకుండా మిగిలిపోయి న దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం పంపిణీ కంటే ముందే స్వాధీనం చేసుకుంటామన్న సివిల్ సప్లయ్ శాఖ ఇప్పటి వరకు బియ్యం వాపస్ వి షయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రేషన్ దుకాణాల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలు, గోదాముల్లో కలిపి దాదాపు లక్ష మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నట్లు అధి కారుల అంచనా. దీని విలువ దాదాపు రూ. 400 కోట్లపై చిలుకు ఉంటుందని అధికారులే అంటున్నారు. మార్చి నుంచి ఈ నిల్వలు అలా గే ముక్కి పోతున్నాయి. ఎక్కడ నిల్వ చేసుకోవాలి..? జూన్ 1కి ముందున్న దొడ్డు బియ్యం నిల్వలు దుకాణాల్లో అలాగే ఉండటంతో మూడు నెలల సన్న బియ్యం కోటాను ఎక్కడ పెట్టుకోవాలో తెలియక రేషన్ డీలర్లు ఇబ్బంది పడ్డారు. మార్చి నుంచి రేషన్ దుకాణాలు, గోదాముల్లో ఉన్న బియ్యం ప్రస్తుతం గడ్డలు కట్టి పురుగులు పట్టి పనికి రాకుండా తయారైంది. ఈ చెడిపోతున్న బియ్యం కారణంగా సన్న బియ్యానికి కూడా పురుగులు పడుతున్నాయి. గతంలో ఇలాగే కందిపప్పును పంపిణీ చేయగా మిగిలిపోయిన పప్పు సివిల్ సప్లయ్ అధికారులు వెనక్కి తీసుకుంటామని తీవ్ర జాప్యం చేశారు. దుకాణాల్లో మిగిలిపోయిన పప్పు పురుగులు పట్టి దుర్వాసన వస్తుండటంతో దుకాణదారులు బయట పారబోయాల్సి వచ్చింది. చెడిపోయిన పప్పును పారబోసిన కొద్ది రోజులకు అధికారులు మిగిలిపోయిన పప్పు నిల్వలను వెనక్కి తీసుకోవడానికి రావడంతో.. పారబోసిన పప్పును మళ్లీ తేలాక మార్కెట్ నుంచి కందిపప్పును కొని అధికారులకు రేషన్ దుకాణ నిర్వాహకులు అప్పగించారు. ఇప్పుడు కూడా గడ్డలు కట్టి పురుగులు పట్టిన బియ్యాన్ని ఏమి చేయాలో తెలియక మదనపడుతున్నారు. దొడ్డు బియ్యం ఎక్కడ ఉంచాలి? రేషన్ దుకాణాల్లో గడ్డలు కట్టి, పురుగులు పట్టి చెడిపోతున్న దొడ్డు బియ్యం నిల్వలను ఎక్కడ ఉంచాలో అర్థం కావడం లేదు. గతంలో ఇలాగే చెడిపోయిన కందిపప్పును బయట పారబోస్తే అధికారులు మిగిలిపోయిన పప్పును తమకు వెనక్కి ఇవ్వాలని ఆదేశించారు. సొంత ఖర్చుతో కంది పప్పు కొని అధికారులకు అప్పగించాం. ప్రభుత్వం దొడ్డు బియ్యం నిల్వల స్వాధీనం విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలి. – నాగం సురేందర్, జిల్లా రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు ఆదేశాలు రావాల్సి ఉంది .. రేషన్ దుకాణాలు, గోదాముల్లో మార్చి నెల నుంచి నిల్వ ఉన్న దొడ్డు బియ్యాన్ని స్వాధీనం చేసుకునే విషయంలో ప్రభుత్వం నుంచి ఆదేశా లు రావాల్సి ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులు రాగానే దొడ్డు బియ్యాన్ని స్వాధీనం చేసుకుంటాం. – మల్లికార్జున్, జిల్లా పౌర సరఫరాల అధికారి రేషన్ దుకాణాల్లో ముక్కిపోతున్న దొడ్డు బియ్యం నిల్వలు త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్న రేషన్ డీలర్లు -
నేనేమి చేశాను పాపం.. నాకేమిటీ శిక్ష?
● పుట్టిన ఆడ బిడ్డను వదిలి వెళ్లిన గుర్తుతెలియని వ్యక్తులు ● బాల సంరక్షణ కేంద్రానికి తరలింపు బిచ్కుంద(జుక్కల్) : భూమి మీద పడి ఎన్నో గంటలు గడవనే లేదు. ఒళ్లంతా పురిటి రక్తపు మరకలు..బొడ్డు తాడు సరిగ్గా కోయనేలేదు. అమ్మ ఒడిలో ఉండాల్సిన శిశువు, ఎక్కడో బ్రిడ్జి వద్ద పడేసిన అమానుష ఘటన బిచ్కుంద పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసిన ఆ శిశువును చూసి స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. వివరాలు.. బిచ్కుంద– బాన్సువాడ రోడ్డులో శుక్రవారం ఉద యం పెద్దదేవాడ వాగు బ్రిడ్జి వద్ద అప్పుడే జన్మించిన నవజాత శిశువును ఓ గుడ్డలో వదిలేసి వెళ్లిపోయారు. అటు నుంచి వెళ్తున్న వాహనదారులు శిశువు ఏడుపును గమనించి పెద్దదేవాడ గ్రామస్తులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై మోహన్రెడ్డి చేరుకొని శిశువును పుల్కల్ పీహెచ్సీకి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వై ద్యం అందించడానికి బాన్సువా డ ఏరి యా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం ఎస్సై, ఐసీడీఎస్ అధికారులను పిలిపించి కామారెడ్డి బాల రక్షా భవన్ కేంద్రానికి తరలించారు. చికిత్స తర్వాత శిశువు ఆరోగ్యగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
శ్రీ సిద్దరామేశ్వరాలయంలో విచారణ
భిక్కనూరు: దక్షిణ కాశీగా పేరొందిన భిక్కనూరు సిద్దరామేశ్వరాలయంలో పలు అంశాలపై దేవాదాయశాఖ అధికారులు శుక్రవారం విచారణ నిర్వహించారు. విచారణ అధికారిగా నీలకంఠేశ్వరాలయం గ్రేడ్ –1 ఈవో గా పనిచేస్తున్న శ్రీరాం రవీందర్ను దేవాదాయశాఖ ఆర్జేసీ రామకృష్ణరావు నియమించారు. దీంతో ఆయన శుక్రవారం ఆలయానికి వచ్చి విచారణ నిర్వహించారు. ఆలయంలో అటెండర్గా విధులు నిర్వహించిన సత్యనారాయణపై, ఎలక్ట్రిషియన్ గా విధులు నిర్వహించిన బల్యాల లక్ష్మినారాయణపై వచ్చిన అభియోగాలపై విచారణ జరిపారు.ఈనివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని పేర్కొన్నారు. ఈ విచారణలో ఈవో శ్రీధర్తో స్థానికులు పాల్గొన్నారు. విధుల్లో చేరిన విద్యాశాఖ ఏడీ కామారెడ్డి టౌన్: జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా డి. శ్రీనివాస్ శుక్రవారం కలెక్టరేట్లోని డీఈవో కార్యాలయంలో విధుల్లో చేరారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ఆయన్ని నూతనంగా నియమించింది. మొదటి రోజు దేవునిపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన్ని డీఈవో రాజు, ఉపాధ్యాయులు సన్మానించారు. డీఈవోగా బాధ్యతలు అప్పగించే అవకాశం! ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ అధికారిగా ఎస్. రాజు విధులు నిర్వహిస్తున్నారు. అయితే నూతనంగా రెగ్యూలర్ అసిస్టెంట్ డైరెక్టర్గా విధుల్లో చేరిన డి. శ్రీనివాస్ను జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు అప్పగిస్తూ త్వరలో రాష్ట్ర విద్యా శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.నేడు సంస్కార భారతి గురు పూజోత్సవం కామారెడ్డి అర్బన్: సంస్కార భారతి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 10గంటలకు నటరాజ పూజ, గురు పూజోత్సవం నిర్వహించనున్నట్టు సంస్కార భారతి జిల్లా ప్రధాన కార్యదర్శి పాతూరి సత్యప్రసాద్ తెలిపారు.స్థానిక తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భవనంలో నిర్వహించే కార్యక్రమానికి ప్రజలు హాజరై విజయవంతం చేయాలని సత్యప్రసాద్ కోరారు. -
ప్రకృతితోనే మానవ మనుగడ
బాన్సువాడ: ప్రకృతితోనే మానవ మనుడగ సాధ్యమని వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సబ్ కలెక్టర్ కిరణ్మయితో కలిసి మొక్కలు నాటారు. అంతకు ముందు ఆయన విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. 2015 కంటే ముందు రాష్ట్రంలో 21 శాతం చెట్లు ఉంటే తర్వాత కాలంలో 26 శాతానికి చేరిందని, భవిష్యత్లో 33 శాతం వరకు చెట్లు ఉంటేనే మానవ మనుగడ సాధ్యమని అన్నారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో వాటిని సంరక్షించే బాధ్యత అంతే ముఖ్యమన్నారు. పుట్టినప్పటి నుంచి మరణించే వరకు కట్టే అవసరం ఉంటుందని అన్నారు. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం 2 కోట్ల 75 లక్షల ఎకరాలు ఉందని, సరైన సమయంలో వర్షాలు పడాలంటే వాతావరణంలో సమతుల్యం ఉండాలని, అందుకనే రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం నిర్వహిస్తోందని అన్నారు. ఈ ఏడాది 18.02 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలను పంపిణీ చేయాలన్నారు. విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయులు, అధికారులు కూడా మొక్కలు నాటాలని సూచించారు. జిల్లా అటవీశాఖ అధికారిణి సునీత, ఎఫ్ఆర్వో అబీబ్, జిల్లా ఇంటర్ నోడల్ అధికారి సలాం, మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం గంగాధర్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరిరాజు, అధ్యాపకులు, నాయకులున్నారు. విద్యార్థులతో కలిసి ప్రార్థన కళాశాలలో మొక్కలు నాటేందుకు వచ్చిన పోచారం శ్రీనివాస్రెడ్డి విద్యార్థులతో కలిసి ప్రార్థన చేశారు. జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..తాను ఇదే కళాశాలలో చదువుకున్నానని, తరగతితో ఫస్ట్ వచ్చేవాడినని గుర్తు చేశారు. కళాశాలకు వస్తున్నానని తాను పంచె కట్టుకుని రాకుండా ప్యాంటు చొక్కా వేసుకుని వచ్చానని సరదాగా వ్యాఖ్యానించారు.ఏరియా ఆస్పత్రి పనుల పరిశీలనబాన్సువాడ రూరల్: మండల కేంద్రంలోని కొత్తగా నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి భవన నిర్మాణ పనులను శుక్రవారం పోచారం శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు. పాత ఆస్పత్రి భవనం శిఽథిలావస్థకు చేరడంతో దాన్ని తొలగించి రూ.37.50 కోట్లతో నూతన ఆస్పత్రి భవనం నిర్మిస్తున్నారు. పనులు నాణ్యతగా చేయించాలని అధికారులను ఆదేశించారు. నాయకులు అంజిరెడ్డి, కృష్ణారెడ్డి, ఎజాస్, లింగం, హకీమ్, సాయిలుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్రెడ్డి -
డెయిరీ రంగంలో అనేక అవకాశాలు
కామారెడ్డి అర్బన్: డెయిరీ రంగంలో అనేక ఉపాధి అవకాశాలున్నాయని పీవీ నర్సింహరావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ ఎం.జ్ఞానప్రకాష్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి డెయిరీ కళాశాల ‘ఘృత–2025’ వార్షికోత్సవం స్థానిక కళాభారతిలో నిర్వహించగా ప్రిన్సిపాల్ సురేష్ రాథోడ్ అధ్యక్షత వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులుగా హాజరైన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ శరత్చంద్ర, దొడ్ల డెయిరీ సీఈవో బుసిరెడ్డి వెంకట్రెడ్డిలు కళాశాల ప్రత్యేక సావనీర్ ఆవిష్కరించారు. అనంతరం వైస్ చాన్స్లర్ మాట్లాడుతూ.. మారుతున్న సాంకేతికతను వినియోగించుకుని అభివృద్ధి చెందాలన్నారు. కామారెడ్డి డెయిరీ కళాశాల పూర్వ విద్యార్థి, దొడ్ల సీఈవో బుసిరెడ్డి వెంకట్రెడ్డి తన డెయిరీ ద్వారా సామాజిక బాధ్యతగా రూ.4 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. కళాశాలలో పూర్తి సౌకర్యాలు ఏర్పాడిన పిదప డెయిరీ పీజీ కోర్సులు ప్రారంభిస్తామని వైస్ చాన్స్లర్ జ్ఞానప్రకాష్ వెల్లడించారు. దొడ్ల డెయిరీలో దాదాపు 30 మంది కామారెడ్డి డెయిరీ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించినట్టు వెంకట్రెడ్డి అన్నారు. రిజిస్ట్రార్ శరత్చంద్ర మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు డెయిరీ కంపెనీలు విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తు ఉపాధి కల్పిస్తున్నాయన్నారు. కళాశాల పూర్వ విద్యార్థి ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతు..డెయిరీ రంగంలో నెలకు రూ.800లతో జీవితాన్ని ప్రారంభించి ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నానన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు కేఎస్ ఉమాపతి, స్వర్ణలత, పీడీ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. వైస్ చాన్స్లర్ జ్ఞానప్రకాష్ కామారెడ్డి డెయిరీ కళాశాల ’ఘృత–2025’ వార్షికోత్సవం -
యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు రిజర్వేషన్ల కోసం కృషి
● యూత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జక్కడి శివచరణ్రెడ్డి బాన్సువాడ : స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ సభ్యులకు 25 శాతం సీట్లు కేటాయించే విధంగా కృషి చేస్తానని యూత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జక్కడి శివచరణ్రెడ్డి అన్నారు. స్థానిక శ్రీనివాస గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి యూత్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. స్థానిక సంస్ధల ఎన్నికల్లో గ్రూపు రాజకీయాలు పక్కన బెట్టి అందరూ కలిసిమెలిసి పని చేయాలన్నారు. మెజారిటీ స్థానాలను ఏకగ్రీవం చేసుకోవాలి : పోచారం భాస్కర్రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం చేసుకునేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. యూవజన కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్రెడ్డి, జిల్లా ఇంచార్జి అమృత, యువజన నాయకులు కాసుల రోహిత్, పీసీసీ డెలిగేట్ రాజిరెడ్డి, మన్సుర్, శ్రీనివాస్, సర్ధార్, దుర్గం శ్యామం, అజయ్ తదితరులు ఉన్నారు. ఎల్లారెడ్డి ిసీఐగా బాధ్యతలు స్వీకరించిన రాజారెడ్డి ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి సీఐగా రాజారెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మెదక్ సీసీఎస్ లో పనిచేస్తున్న ఆయన బదిలీపై ఎల్లారెడ్డికి వచ్చారు. గతంలో సీఐగా విధులు నిర్వహించిన రవీందర్ నాయక్ ఐజీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని సీఐ రాజారెడ్డి పేర్కొన్నారు. -
బోనాల పండుగకు సర్వం సిద్ధం
● గత 51 ఏళ్లుగా నిరాటంకంగా బోనాల ఉత్సవం ● రేపే దోమకొండలో మహంకాళి బోనాల పండుగ ● 18 చేతులతో ప్రతి చేతిలో ఒక ఆయుధంతో అమ్మవారు దోమకొండ : దోమకొండలోని దేవి ఆలయాన్ని మహంకాళి, చాముండేశ్వరి ఆలయంగా పిలుస్తుంటారు. కాళిక, దుర్గ, చాముండీ మాతల కలయికగా భక్తులకు దర్శనమిచ్చే చాముండేశ్వరి అమ్మవారు కార్యాలను విజయవంతం చేస్తుందని ప్రతీతి. ఆలయ చారిత్రక నేపథ్యం.. దోమకొండ సంస్థానానికి చెందిన కామినేని వంశీయులు ఈ ఆలయాన్ని నిర్మించారు. దాదాపు 1943–1946 మధ్య కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. రాజస్థాన్లోని జైపూర్ నుంచి అమ్మవారి పాలరాతి విగ్రహాన్ని తెప్పించి 1972 అక్టోబర్ 28న ప్రతిష్ఠాపన చేశారు. ఇక్కడి అమ్మవారు రాక్షసులను సంహరిస్తుందనే రూపంలో ఉండి భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారి 18 చేతుల్లో ప్రతి చేతిలో ఒక ఆయుధం కలిగి ఉండటం విశేషం. కోర్కెలు తీర్చే చాముండేశ్వరి అమ్మవారిగా.. బోనాల పండుగ 51 ఏళ్లుగా నిరాంటంకంగా కొనసాగుతోంది. ఏటా ఆషాఢంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం బోనాలు తీస్తారు. ఆదివారం (13న) ఉదయం భవిష్యవాణి, ఘటం ఊరేగింపు, పోతరాజులు జీవాలను గావు పట్టుట, మధ్యాహ్నం 12 గంటల నుంచి బోనాలు ఎత్తుకుని డప్పుచప్పుళ్ల మధ్య ఆలయానికి తీసుకొచ్చి మొక్కులు సమర్పిస్తారు. భక్తులు సమర్పించిన 12 కిలోల వెండితో ఇటీవల అమ్మవారికి మకరతోరణం చేయించారు. మండల కేంద్రంలో దాదాపు 4,250 కుటుంబాలు నివసిస్తుండగా ప్రతి ఇంటి నుంచి బోనం సమర్పిస్తారు. బోనాల పండుగ రోజు బంధువులు, స్నేహితులను పిలుచుకుంటారు. తెలంగాణలోనే రెండో మహంకాళి అమ్మవారి ఆలయంగా ఇక్కడి దేవాలయం పేరుగాంచింది. బోనాల అనంతరం ఆశ్వయుజ మాసం శుక్ల పక్షంలో దసరా దేవి నవరాత్రి ఉత్సవాలను కూడా ప్రతిఏటా ఘనంగా నిర్వహిస్తారు.బీబీపేటలో బోనాలకు ఏర్పాట్లు బీబీపేట : మండల కేంద్రంలోని మహంకాళి అ మ్మవారి బోనాలు ఆదివారం జరగనున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు చేశా రు. పంచాయతీ కార్యదర్శి రమేశ్ ఆధ్వర్యంలో ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. అలాగే గుంతలు ఉన్న ప్రాంతంలో మొరం పోయించడంతో పాటు విద్యుత్ దీపాలను అమర్చారు. -
శ్రీరాముడు ప్రతిష్టించిన బుగ్గ రామలింగేశ్వరుడు
కామారెడ్డి జిల్లా రామా రెడ్డి మండలం మద్దికుంట గ్రామంలోని అటవీ ప్రాంతంలో ఉన్న శివలింగాన్ని స్వయంగా శ్రీరాముడే ప్రతిష్టించి, కొలిచినట్లుగా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ● శ్రీరాములు వనవాసంలో ఉండగా లింగంను ప్రతిష్ఠించి, పూజలు చేశాడు. నాటి శివలింగమే నేడు బుగ్గ రామలింగేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు. ● మాఘ అమావాస్య రోజున ఈ ఆలయం వద్ద పుణ్యస్నానాలను ఆచరించడానికి భక్తులు భారీగా తరలివస్తారు. ● మహా శివరాత్రి పర్వదినం నాడు బుగ్గ రామలింగేశ్వరుడిని లక్ష మందికి పైగా భక్తులు దర్శించుకుంటారు. శివపార్వతుల కల్యాణోత్సవం, రథోత్సవం మర్నాడు అగ్ని గుండాలు నిర్వహిస్తారు. ● బుగ్గ రామలింగేశ్వర ఆలయంలో 2005 నుంచి నేటి వరకు నిత్యాన్నదానం నిరంతరంగా కొనసాగుతుంది. ● గ్రామస్తులందరు కలిసి స్వయంగా రెండు నెలల రేషన్ బియ్యాన్ని అన్నదానానికి విరాళంగా అందజేస్తారు. ● బుగ్గ రామలింగేశ్వర ఆలయ ఆధ్వర్యంలో నిర్వహించే వృద్ధాశ్రమంలో వందమంది వృద్ధులు ఆశ్రయం పొందుతున్నారు. ● 70 ఆవులను ఆలయం ఆధ్వర్యంలో పోషిస్తున్నారు. ● కామారెడ్డి నుంచి నేరుగా బుగ్గ రామలింగేశ్వరుడి ఆలయానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. – రామారెడ్డిమీకు తెలుసా? -
మాంసం దుకాణాలు తొలగించాలని ఆందోళన
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలోని హైస్కూ ల్, ప్రైమరీ పాఠశాల ప్రహరీ గేటు వద్ద ఉన్న చికెన్, మటన్ మాంసం దుకాణాలను తొలగించాలని కోరుతూ శుక్రవారం విద్యార్థులు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ మాంసం దుకాణాల కారణంగా కుక్కలు విద్యార్థులపై దాడి చేస్తున్నాయని పేర్కొన్నారు. వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. కుక్కల భయంతో విద్యార్థులు పాఠశాలకు రాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. చీకటిపడితే పాఠశాల ఆవరణలో మద్యం సేవించి గాజు బాటిళ్లు పగలగొడుతున్నారు. కాళ్లకు గుచ్చుకొని గాయాలు అవుతున్నాయని వాపోయారు. వారం రోజుల్లో మాంసం దుకాణాలు తొలగిస్తామని కమిషనర్ ఖయ్యుం విద్యార్థులకు హామీ ఇచ్చారు. మాంసం దుకాణాదారులకు నోటీసులు జారీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. మాంసం కోసం కేటాయించిన మార్కెట్లో దుకాణాలు పెట్టుకోవాలని అక్కడ మున్సిపల్ నుంచి నీరు, మురికి కాలువలు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని దుకాణదారులకు కమిషనర్ సూచించారు. -
పోలీస్ కావడమే లక్ష్యం
● అరుదైన వ్యాధితో బాధపడుతున్న కార్తికేయ ఆశయం ● రామారెడ్డి భవిత కేంద్రంలో ఘనంగా జన్మదిన వేడుక రామారెడ్డి: తన చిరకాల కోరిక పోలీస్ కావడమేనని ‘మస్కులర్ డిస్ట్రోఫీ’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న కార్తికేయ అనే బాలుడు తెలిపాడు. రామారెడ్డిలోని భవిత కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఫిజియోథెరపీ క్యాంపులో కార్తికేయ జన్మదిన వేడుకను కేంద్రం సిబ్బంది ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఎస్సై లావణ్య ముఖ్య అతిథిగా హాజరుకాగా, బాలుడికి కేక్ తినిపించి, ధైర్యం కల్పించారు. అనంతరం తన జన్మదినం వేళ కార్తికేయ చక్కటి పాటతో అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇసన్నపల్లి గ్రామానికి చెందిన మాస్టర్ కార్తికేయకు మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి సోకగా తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి భవిత కేంద్రంలో విద్యనభ్యసిస్తున్నాడు. ఈ వ్యాధి అరుదుగా వస్తుందని, ఆరేళ్లు నిండిన తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడి కండరాలు పట్టివేసి అనేక రకాలుగా ఇబ్బందులు కల్గిస్తాయని, అయినా కార్తికేయ ధైర్యంగా భవిత సెంటర్లో చదువుతూ పాటలు పాడుతూ ఆనందంగా గడుపుతున్నాడని డాక్టర్ వెంకటస్వామి తెలిపారు. కాంప్లెక్స్ హెచ్ఎం ఆనంద్, సురేష్, గోపాల్, మండల సిఆర్పిలు మహముద్, యుగంధర్, సురేఖ, వెంకట స్వామి పాల్గొన్నారు. -
అత్యవసర సేవలు.. అందని ద్రాక్షే
దోమకొండ: దోమకొండలోని క్లస్టర్ ఆస్పత్రిలో 24 గంటల వైద్య సేవలు లేక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రులు సైతం రాత్రివేళల్లో నిర్వహించకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఆదివారం వైద్యులు రావడం కూడా మానేశారు. రాత్రిళ్లు ఆరోగ్య సమస్య తలెత్తితే, అత్యవసర వైద్య చికిత్స కోసం కామారెడ్డికి వెళ్లాల్సి వస్తోంది. గతంలో ఇక్కడ కు.ని చికిత్సలు నిర్వహించగా జిల్లాలోనే అత్యధికంగా ఇక్కడే శస్త్రచికిత్సలు జరిగి ముందంజలో ఉండేది. ప్రస్తుతం సాధారణ వైద్య సేవలు మాత్రమే అందిస్తున్నారు. 2006లో 30 పడకల ఆస్పత్రిగా ఏర్పాటు... దోమకొండలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో 2006లో రూ.1.96 కోట్లతో 30 పడకల ఆస్పత్రి భవనాన్ని నిర్మించారు. డిప్యూటీ సివిల్ సర్జన్ పోస్టులు నాలుగు ఉండగా..ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 11 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్లకు గాను ఇద్దరు రెగ్యులర్గా ఉండగా, ఆరుగురు కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. ఇద్దరు హెడ్ నర్సులు అవసరం ఉండగా ఒక్కరే విధుల్లో ఉన్నారు. ఆస్పత్రిలో 10 మంది స్టాఫ్ నర్స్ పోస్టులుండగా, 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇద్దరు ఏఎన్ఎంలు, ఒక ఫార్మసిస్ట్ పోస్టు ఖాళీగా ఉంది. డార్క్రూం అసిస్టెంట్ పోస్టులు రెండు ఉండగా, ఒకరు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్నారు. ముగ్గురు ఎంఎన్వో పోస్టులు ఉండగా మూడు ఖాళీగానే ఉన్నాయి. పోస్టులు ఖాళీగా ఉండడంతో ఆస్పత్రిలో సరైన సేవలు అందడం లేదు. దీంతో అత్యవసర కేసులను జిల్లా కేంద్ర ఆస్పత్రికి రిఫర్ చేయాల్సి వస్తోంది. ప్రస్తుతం 50 పడకల ఆస్పత్రిగా మార్చుతూ ఉత్తర్వులు.. దోమకొండలోని క్లస్టర్ ఆస్పత్రి స్థాయిని 50 పడకల ఆస్పత్రిగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 50 పడకల ఆస్పత్రిగా మారితేనైనా వైద్యులు వైద్య సేవలు 24 గంటల పాటు అందుతాయని ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి 24 గంటల పాటు వైద్య సేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. దోమకొండ క్లస్టర్ ఆస్పత్రిలో 24 గంటల వైద్య సేవలు కరువు తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులువైద్యులను భర్తీ చేయాలి దోమకొండలోని 30 పడకల క్లస్టర్ ఆస్పత్రిని 50 పడకల ఆస్పత్రిగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయంలో వైద్యుల సంఖ్య, సిబ్బందిని పెంచి 24 గంటల పాటు వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి షబ్బీర్అలీకి, వైద్య విధాన కమిషనర్కు వినతిపత్రం అందించాము. వారు దానికి సానుకూలంగా స్పందించారు. – తిర్మల్గౌడ్, మాజీ జెడ్పీటీసీ, దోమకొండచర్యలు తీసుకుంటాం ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత ఉంది. ఉన్న సిబ్బందితో పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న వైద్యులతో నెట్టుకొస్తున్నాం. 24 గంటల పాటు వైద్య సేవలు అందాలి. ప్రతిరోజూ మధ్యాహ్నం తర్వాత రాత్రిళ్లు కూడా అందుబాటులో ఉండేలా డ్యూటీ డాక్టర్కు విధులు వేస్తున్నాను. 24 గంటల పాటు వైద్య సేవలు అందేలా చూస్తాను. – వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్, దోమకొండ -
కుటుంబ ప్రయోజన పథకాన్ని వినియోగించుకోవాలి
బాన్సువాడ రూరల్/భిక్కనూరు : జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ఆర్థిక సాయం పొందడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బాన్సువాడ సబ్ కలెక్టర డాక్టర్ కిరణ్మయి అన్నారు. జాతీయ కుటుంబ భద్రత పఽథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ధి చంద్రకాంత్రెడ్డి కోరారు. శుక్రవారం భిక్కనూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు.కుటుంబ పెద్ద మృతి చెందినట్లయితే ప్రభుత్వం రూ.20వేలు ఆర్థికసాయం అందిస్తుందన్నారు. పథకానికి అర్హత పొందాలంటే మృతిని వయస్సు 18 నుంచి 59 ఏళ్ల మద్య ఉండి 12 ఏప్రిల్ 2017 తర్వాత మృతి చెంది ఉండాలన్నారు. -
కుదురుకోని బోర్లు..
● ఒర్రెలు, వాగులు పారలేదు ● చెరువుల్లో చుక్క నీరు చేరలేదు ● భూగర్భ జలం వృద్ధి చెందలేదు ● అయోమయంలో అన్నదాతవరుణుడు కరుణిస్తేనే.. మైదానాన్ని తలపిస్తున్న నిజాంసాగర్ మండలంలోని వడ్డేపల్లి చెరువుసాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కార్తెలు కరిగిపోతున్నా జల్లులే తప్ప జడివానలు కురవలేదు. రోహిణీ కార్తెలోనే తొలకరి జల్లులు కురవడంతో రైతులు ఎంతో సంతోషించారు. ముందస్తు వర్షాలతో కాలం అనుకూలిస్తుందని ఆశించారు. మగశిర, ఆరుద్ర కార్తెలు అనుకూలించలేదు. ఇప్పటి వరకు ఏ ఒక్క చెరువులోకి చుక్క నీరు వచ్చి చేరలేదు. కనీసం ఒర్రెలలో నీరు నిలిచేంత వాన కూడా కురవలేదు. రికార్డుల ప్రకారం జిల్లాలో ఈ రోజు వరకు సాధారణ వర్షపాతం 219.7 మిల్లీ మీటర్లు కాగా 216.1 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే జిల్లాలోని పెద్దకొడప్గల్, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, మహమ్మద్నగర్, నిజాంసాగర్ మండలాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. 14 మండలాల్లో సాధారణం, ఐదు మండలాల్లో కొంచెం ఎక్కువ కురిసింది. అయితే ఎక్కడ కూడా వాగులు పొంగి ప్రవహించేంతగా కురవలేదు. జిల్లాలో చిన్నాపెద్ద అన్నీ కలిపి 2,056 చెరువులు, కుంటలున్నాయి. చెరువుల కింద 96 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నెలన్నర కాలంగా భారీ వర్షాలు కురవకపోవడంతో కుంటలు, చెరువులన్నీ చుక్క నీరు లేక వెలవెలబోతున్నాయి. 5.11 లక్షల ఎకరాల్లో సాగు అంచనా.. వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పంటలు కలిపి 5.11 లక్షల ఎకరాలలో సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కాగా ఇప్పటివరకు 2.47 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. రెండున్నర లక్షల ఎకరాల్లో వరి సాగవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు వరి 67 వేల ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. వర్షాలు లేకపోవడం వల్లే వరి నాట్లు ఆలస్యమవుతున్నాయి. సోయా పంట 77,124 ఎకరాల్లో, మక్క పంట 43,651 ఎకరాలు, జొన్న 23,214 ఎకరాలు, పత్తి 30,958 ఎకరాల్లో సాగయ్యాయి.ఈ ఏడాది ఎప్పుడూ లేనిది మే నెలలోనే భారీ వర్షం కురియడంతో రైతులు సంతోషించారు. నీటికి కొదవ ఉండదని భావించి అంతా పంటలు వేసుకున్నారు. తర్వాత వరుణుడు ముఖం చాటేయడంతో రైతులు సాగుపై ఆందోళన చెందుతున్నారు. చెరువులు, కుంటల్లో కూడా నీరు అడుగంటిపోయి మైదానాలను తలపిస్తున్నాయి. కమ్ముకువస్తున్న మేఘాలను చూసి వరుణుడు కరుణిస్తాడని ఆశ పడడమే తప్ప ఒకటైనా భారీ వర్షం కురవలేదు. దీంతో వానాకాలం సాగుపై నీలినీడలు అలుముకున్నాయి. అదను దాటిపోతుందేమోనని రైతులు భయపడుతున్నారు. వానాకాలం సీజన్లో భారీ వర్షాలు లేకపోవడంతో బోర్లు ఇప్పటికీ కుదురుకోలేదు. చాలా చోట్ల రైతులు నారుమడులు పోసినా నాట్లు వేయడానికి సరిపడా నీరు అందడం లేదని చెబుతున్నారు. చాలా చోట్ల వేసవిలో ఎత్తిపోయిన బోర్లలో ఇప్పటికీ ఊటలు పెరగలేదు. నిజాంసాగర్ ఆయకట్టు కింద నాట్లు వేశారు. పోచారం ప్రాజెక్ట్లోకి నీరు వచ్చి చేరితేగానీ నాట్లు వేసే పరిస్థితి లేదు. భారీ వర్షాలు లేకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ముఖ్యంగా వరి సాగు చేయాలంటే నీరు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. ఈ కార్తెలోనైనా వరుణుడు కరుణిస్తే సాగు ముందుకు నడుస్తుందని అంటున్నారు. ఆరుతడి పంటలకు కొంత అనుకూలంగా ఉంది. వరి నాట్లు వేయడానికి అదను దాటుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. -
ఇంకుడు గుంతలో పడి బాలుడి మృతి
సిరికొండ: మండలంలోని కొండాపూర్ గ్రామంలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు ఇంకుడు గుంతలో పడి మృతి చెందినట్లు ఎస్సై రామకృష్ణ శుక్రవారం తెలిపారు. వివరాలు ఇలా.. మోపాల్ మండలం కులాస్పూర్ గ్రామానికి చెందిన కొత్త కుమ్మరి రాణి కొన్ని రోజులుగా కొండాపూర్లోని తన తల్లిగారింటి వద్ద ఉంటోంది. ఈక్రమంలో రాణి కొడుకు రిత్విక్(3) ఇంటి ముందర చిన్న సైకిల్పై ఆడుకుంటుండగా, ఇంటి పక్కన గల కోటగిరి నారాయణగౌడ్ ఇంటి వద్ద ఉన్న ఇంకుడు గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయాడు. చాలా సేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించి బాలుడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం సిరికొండకు అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బాలుడు మృతిచెందినట్లు నిర్ధారించారు. బాలుడి తల్లి రాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
డ్రంకెన్డ్రైవ్లో నలుగురికి జైలు
ఖలీల్వాడి: నగరంలో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా 11 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వారికి గురువారం ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం నగరంలోని కోర్టులో సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. జడ్జి వారిలో ఏడుగురికి రూ. 11500 జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన నలుగురిలో ఒకరికి ఒకరోజు, ఇద్దరికి రెండు రోజులు, ఒకరికి మూడు రోజులు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. న్యూసెన్స్ కేసులో ఒకరికి.. ఖలీల్వాడి: నగరంలోని రైల్వేస్టేషన్ వద్ద బుధవారం రాత్రి మద్యం అతిగా తాగి న్యూసెనన్స్ చేసిన ఒకరికి జిల్లా కోర్టు ఏడు రోజుల జైలుశిక్ష విధించినట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. వివరాలు ఇలా.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన షేక్ ఫిరోజ్ అనే వ్యక్తి మద్యం అతిగా తాగి నగరంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించాడు. వెంటనే అతడిని పోలీసులు అరెస్టు చేసి, గురువారం స్పెషల్ సెకండ్ క్లాస్ జడ్జి నూర్జహాన్ ఎదుట హాజరుపర్చారు. జడ్జి అతడికి ఏడు రోజుల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం అతడిని జిల్లా జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. తల్లిని హతమార్చిన కొడుకు ● పింఛన్ డబ్బుల కోసం ఘాతుకం వర్ని: పింఛన్ డబ్బుల కోసం తల్లిని కొడుకు హతమార్చిన ఘటన మండలంలోని జలాల్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. జలాల్పూర్ గ్రామానికి చెందిన మక్కపల్లి సాయిలుకు గతంలోనే వివాహం జరుగగా భార్య అతడిని వదిలి, పుట్టింటికి వెళ్లిపోయింది. ఇంట్లో సాయిలు అతడి తల్లి సాయవ్వ(60) ఉంటున్నారు. మద్యానికి బానిసైన సాయిలు తరచూ డబ్బుల కోసం తల్లిని వేధించేవాడు. తల్లికి ఈనెల పింఛన్ డబ్బులు రావడంతో వాటిని తనకు ఇవ్వాలని సాయిలు గురువారం మధ్యాహ్నం ఘర్షణకు దిగాడు. తల్లి ససేమిరా అనడంతో అతడు బండరాయిని తీసుకొని తల్లిపై కొట్టగా తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు గమనించి ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేయగా, నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు ఎస్సై మహేష్ వెల్లడించారు. బస్వాపూర్లో ఒకరి ఆత్మహత్య భిక్కనూరు: మండలంలోని బస్వాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు భిక్కనూరు ఎస్సై దత్తు గురువారం తెలిపారు. బస్వాపూర్ గ్రామానికి చెందిన కందూరి లింగం(55) గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై, తరచు భార్య, పిల్లలతో గొడవపడేవాడు. బుధవారం రాత్రి అతడు అతిగా మద్యం తాగి, ఇంటికి వచ్చి బోజనం చేసి పడుకున్నాడు. కుటుంబీకులు గురువారం ఉదయం లేచిచూడగా అతడు ఇంటి వెనుక ఉన్న స్లాబ్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. పొదుపు డబ్బులు స్వాహా! నిజాంసాగర్(జుక్కల్): మండలంలోని ఒడ్డేపల్లి గ్రామ బీపీఎం నిఖిత పొదుపు డబ్బులను ఖాతాల్లో జమ చేయకుండా స్వాహా చేసినట్లు తెలిసింది. సదరు బీపీఎం మూడు నెలల పాటు సెలవుపై వెళ్లడంతో ఇటీవల ఇన్చార్జి బీపీఎంగా శశికాంత్ పోస్టాఫీస్కు వచ్చాడు. అయితే ప్రతి నెలా ఆర్డీ డబ్బులు బీపీఎం నిఖితకు ఇవ్వడంతో ఖాతాబుక్కుల్లో వారికి రాసి ఇచ్చింది. డబ్బులు జమ చేసేందుకు ప్రజలు పోస్టాఫీస్కు రావడంతో ఇన్చార్జి బీపీఎం ఆన్లైన్లో తనిఖీ చేయగా తేడాలు కన్పించాయి. ప్రతి నెలా డబ్బులు కట్టినట్లు బుక్కుల్లో రాసి ఉన్నా ఆన్లైన్ నమోదు చేయకుండా స్వాహా చేసిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. డబ్బుల కోసం స్థానికులు ఎస్పీఎం, బీపీఎం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. -
ఎల్లారెడ్డి ఆర్డీవోగా పార్థసింహారెడ్డి
ఎల్లారెడి:్డ ఎల్లారెడ్డి ఆర్డీవోగా పార్థసింహారెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైద్రాబాద్ సెక్రటేరియట్లో డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న పార్థసింహారెడ్డి ఎల్లారెడ్డికి ఆర్డీవోగా బదిలీపై వచ్చి ఛార్జి తీసుకున్నారు. గత నెలలో ఆర్డీవోగా విధులు నిర్వర్తించిన మన్నె ప్రభాకర్ పదవీ విరమణ పొందడంతో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి కొద్ది రోజులు ఆర్డీవోగా వ్యవహరించగా గత నెల 24న కామారెడ్డి ఆర్డీవోకు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు.బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవోలు బాన్సువాడ రూరల్: బాన్సువాడ ఎంపీడీవోగా ఆనంద్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. మెదక్ జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఆనంద్కు ఇన్ఛార్జి ఎంపీడీవో ముజాహిద్ బాధ్యతలు అప్పగించారు. పిట్లంలో రఘు.. పిట్లం(జుక్కల్): స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీడీవోగా రఘు బాధ్యతలు స్వీకరించారు. పిట్లం ఎంపీడీవోగా పనిచేసిన కమలాకర్ బదిలీపై రెంజల్కు వెళ్లగా, ఆయన స్థానంలో మెదక్ నుంచి బదిలీపై రఘు పిట్లంకు వచ్చారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది నూతన ఎంపీడీవో రఘుకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ మండల అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. రాజంపేటలో బాలకృష్ణ.. రాజంపేట: రాజంపేట మండల ఎంపీడీవోగా ఎ.బాలకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇది వరకు ధర్పల్లి మండలంలో ఎంపీడీవోగా విధులు నిర్వహించిన బాలకృష్ణ బదిలీపై రాజంపేట మండలానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎంపీవో రామకృష్ణ, మండల పరిషత్ సిబ్బంది శాలువాతో సత్కరించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై గురువారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్సై జగదీశ్ మాట్లాడుతూ...ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న చలాన్లను చెల్లించాలని సూచించారు. హెల్మెట్ లేని వాహనదారులకు జరిమానాలు విధించారు. -
ఆత్మకూర్ హైస్కూల్ సందర్శన
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఆత్మకూర్ హైస్కూల్ను గురువారం ఎంఈవో భాస్కర్రెడ్డి సందర్శించారు. పాఠశాలలో నెలకొన్న పాముల బెడదపై ‘సాక్షి’ దినపత్రికలో గురువారం ‘పాఠశాలలో పాముల బెడద..!’అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. పాఠశాలను పరిశీలించారు. తరగతి గదులను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పాఠశాల చుట్టూ ప్రహరీ లేకపోవడం వల్ల పాములు, తేళ్లతోపాటు ఇతర కీటకాలు ప్రవేశిస్తున్నాయని ఉపాధ్యాయులు ఎంఈవోతో పేర్కొన్నారు. ప్రహరీతోపాటు అదనపు గదుల నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా చూడాలని వారు కోరారు. తప్పులు లేకుండా ఓటరు జాబితా రూపొందించాలి మద్నూర్(జుక్కల్) : ఓటరు జాబితాను బీఎల్వోలు తప్పులు లేకుండా రూపొందించాలని ఈఆర్వో, అదనపు కలెక్టర్ చందర్ అన్నారు. డోంగ్లీలో గురు వారం బీఎల్వోలు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో బీఎల్వోల పాత్ర కీలకమని, బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్ర మంలో తహసీల్దార్ ముజీబ్, డీటీ శివరామకృష్ణ, ఆర్ఐ సాయిబాబా పాల్గొన్నారు. -
ఘనంగా శబరి మాత పాదుకా పూజ మహోత్సవం
తాడ్వాయి(ఎల్లారెడ్డి) : మండల కేంద్రంలోని కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారి పక్కన గల శబరి మాత ఆశ్రమంలో గురువారం పాదుకా పూజ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గురుపౌర్ణమి సందర్భంగా ఉదయం వందలాది భక్తుల మధ్య ధ్వజారోహణ కార్యక్రమంతో ఉత్సవాలను ప్రారంభించారు. వేద పండితులు పాదుకా మహోత్సవ కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. అనంతరం మహాత్ములు ఉపన్యాసాలు, ప్రవచనాలు చేశారు. భజన కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు భారీగా తరలివచ్చారు. అన్నదానం చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఆర్మూర్ బస్టాండ్లో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
ఆర్మూర్టౌన్: నిజామాబాద్–2 డిపోకు చెందిన షేక్ హిమాం పాషా (52) అనే డ్రైవర్ ఆర్మూర్ బస్టాండ్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. వివరాలు ఇలా.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతానికి చెందిన షేక్హిమాం పాషాను ఖమ్మం జిల్లా నుంచి నిజామాబాద్కు ఆరు నెలల కోసం డిప్యుటేషన్పై బదిలీ చేశారు. ఆయనతో పాటు నిమాజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు మొత్తం 63 మంది ఉద్యోగులను ఆరు నెలల కోసం డిప్యుటేషన్పై బదిలీ చేశారు. కానీ తాను వచ్చి మూడు సంవత్సరాలు గడిచినా ఇప్పటి వరకు తిరిగి స్వస్థలాలకు పంపలేదని, ఈ విషయంలో ఎలాంటి న్యాయం జరగకపోవడంతో నిరాశ చెందానన్నాడు. సెలవులు కూడా ఇవ్వడం లేదని, ఉన్నతాధికారులను పలుమార్లు కలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. దీంతో మనస్తాపం చెందిన అతడు కరీంనగర్ నుంచి నిజామాబాద్ వస్తున్న సమయంలో ఆర్మూర్ బస్టాండ్లో తన బస్సును నిలిపి, ఎలుకల మందు తాగాడు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆర్మూర్ డిపో అధికారులకు మరింత సమాచారం కోసం ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేరు. డిప్యుటేషన్ బాధలే కారణం! -
మత్స్యకారులు లక్షాధికారులు కావాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): మత్య్సకారులు లక్షాధికారులు కావడానికి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ మాజీ చైర్మన్ పిట్టల రవీందర్ ముదిరాజ్ అన్నారు. గురువారం ఆయన మండల కేంద్రంలోని రైతు వేదికలో మాట్లాడారు. చేపలు పట్టే హక్కు ముదిరాజ్లు, బెస్తవారికి మాత్రమే ఉందన్నారు. రాష్ట్రంలో 6,000 మత్స్య సంఘాల్లో 4,500 మత్య్స సంఘాలు ముదిరాజ్లవే కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ముదిరాజ్లు హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. సభ్యత్వం లేని గ్రామాల్లో సభ్యత్వం సాధించుకోవాలన్నారు. మత్య్సకారులు మరింత అభివృద్ధి సాధించాలంటే నేడు ఆవిష్కరించిన పుస్తకం చదవాలన్నారు. ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షుడు బట్టు విఠల్, డాక్టర్ నిజ్జన రమేశ్ ముదిరాజ్, రాష్ట్ర బీసీ సంఘం కార్యదర్శి సాయిబాబా, మండల అధ్యక్షుడు సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్
కామారెడ్డి క్రైం: ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని తీసుకువచ్చి యువతకు విక్రయించే ఓ వ్యక్తిని కామారెడ్డి ఎకై ్సజ్ పోలీసులు గురువారం పట్టుకున్నారు. వివరాలు ఇలా.. హైదరాబాద్కు చెందిన అహ్మద్ బిన్ అసద్ అనే వ్యక్తి కొంత కాలంగా కామారెడ్డిలో నివాసం ఉంటున్నాడు. అతడు గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తుంటాడని సమాచారం రావడంతో పోలీసులు నిఘా పెట్టారు. గురువారం సాయంత్రం పట్టణ సమీపంలోని నర్సన్నపల్లి రైల్వే గేటు వద్ద అతడిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 550 గ్రాముల గంజాయి పట్టుబడింది. నిందితుడిని అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్ సీఐ సుందల్ సింగ్ తెలిపారు. కేసు నమోదు చేశామన్నారు. -
నికాల్పూర్కు మరో పేరు లక్ష్మీనారాయణపురం
మీకు తెలుసా? మండలంలో ముంపు గ్రామమైన నికాల్పూర్కు లక్ష్మీనారాయణపురం అనే మరో పేరు కూడా ఉంది. మరికొందరు జంగంపల్లి అని కూడా పిలిచేవారట. ●● సుమారు 155 ఏళ్ల క్రితం పంటలకు, పశువులకు నీటి కొరత ఉందనే కారణంతో లక్ష్మీనారాయణపురం గ్రామస్తులందరూ గోదావరి ఒడ్డున నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. కొన్నేళ్లకు భూములు ముంపునకు గురికావడంతో ఎత్తయిన ప్రాంతానికి వచ్చి ఇళ్లను నిర్మించుకున్నారు. ● ఇలా పలుమార్లు వారి భూములు ముంపునకు గురికావడంతో ప్రతిసారి వారు వేరే ఎత్తయిన ప్రాంతానికి వచ్చి నివాసాలను ఏర్పాటుచేసుకున్నారు. ● మూడుసార్లు గ్రామస్తులు ఆయా ప్రాంతాల నుంచి వెళ్లిపోవడంతోనే లక్ష్మీనారాయణపురం గ్రామానికి నికాల్పూర్ అనే పేరు వచ్చినట్లు ఊరి పెద్దలు చెప్తున్నారు. నికాల్ అంటే హిందీలో వెళ్లిపోవడం అని అర్థం. ● ప్రస్తుతం గ్రామంలో 534 నివాస గృహాలు, 1200 ఎకరాల సాగుభూమి ఉంది. ● నికాల్పూర్ మొదటి గ్రామ సర్పంచ్గా ఆనంద్రావు 1969లో పని చేశారు. ● గ్రామంలో జంగం చెరువు, ఊర చెరువు, కొత్తకుంట అనే మూడు చెరువులు ఉన్నాయి. పాత గ్రామంలో ఓ కాలనీకి వేంకటేశ్వర పల్లె అనే పేరు ఉండేది. దానికి గుర్తుగా గ్రామస్తులు ఇటీవల ఊరి నడిబొడ్డున వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించుకున్నారు. ● పాత గ్రామంలోని హనుమాన్ ఆలయం ప్రతీ ఏటా వర్షాకాలంలో ముంపునకు గురై వేసవిలో తేలుతుంది. అప్పుడు ఊరంతా వెళ్లి పూజలు నిర్వహిస్తారు. – డొంకేశ్వర్(ఆర్మూర్)సమాచారం..ఆర్మూర్: భారతదేశంలో నేరస్తులకు శిక్షలు విధించడానికి, నేరస్తుల విచారణ కోసం బ్రిటీష్ కాలంలో రూపొందించబడిన చట్టాలే 2024 వరకు కొనసాగాయి. శిక్షలు విధించడానికి 1860లో ఐపీసీ(ఇండియన్ పీనల్ కోడ్), 1973లో సీఆర్పీసీ(క్రిమినల్ ప్రొసీజర్ కోడ్), 1872లో ఐఈఏ(ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్)లను రూపొందించారు. ● ఈ చట్టాలను సవరిస్తూ 2023 డిసెంబర్ 25న కేంద్ర ప్రభుత్వం నూతన చట్టం చేసింది. ● ఐపీసీని బీఎన్ఎస్ (భారతీయ న్యాయ సంహిత)గా, సీఆర్పీసీని బీఎన్ఎస్ఎస్ ( భారతీయ నాగరిక్ సురక్షా సంహిత)గా సవరించింది. అలాగే ఐఈఏని బీఎస్ఏ(భారతీయ సాక్ష్య అధినియం)గా మారుస్తూ 2024 జూలై 1నుంచి అమలులోకి తీసుకొచ్చారు. ● ప్రస్తుతం పోలీస్స్టేషన్లలో నమోదు చేయబడ్డ వివిధ కేసులపై నూతన చట్టం ఆధారంగా కోర్టుల్లో విచారణ చేపట్టి సాక్ష్యాల ఆధారంగా న్యాయమూర్తులు నేరస్తులకు శిక్షలను ఖరారు చేస్తున్నారు. ● ఐపీసీలో 511 సెక్షన్లు ఉండగా బీఎన్ఎస్లో 358 సెక్షన్లకు కుదించారు. ● సీఆర్పీసీలో 484 సెక్షన్లు ఉండగా బీఎన్ఎస్ఎస్లో 531 సెక్షన్లకు పెంచారు. ● ఐఈఏలో 167 సెక్షన్లు ఉండగా బీఎస్ఏలో 170 సెక్షన్లకు పెంచారు. -
బాధ్యతల స్వీకరణ
● మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా వాల్య.. ● జీజీహెచ్ సూపరింటెండెంట్గా వెంకటేశ్వర్లు కామారెడ్డి టౌన్: కామారెడ్డి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా డాక్టర్ బి వా ల్య, జీజీహెచ్ సూపరింటెండెంట్ గా డాక్టర్ పెరుగు వెంకటేశ్వర్లు గురువారం బాధ్యతలు స్వీకరించారు. మెడికల్ కళాశాల ఆయా విభాగాల హెచ్వోడీలు, ప్రొఫెసర్లు, వైద్యులు, ఉద్యోగులు వాల్యకు స్వాగతం ప లికి సన్మానించారు. అలాగే జీజీహెచ్ సూపరింటెండెంట్కు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది స్వాగతం పలికి సన్మానించారు. స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలి బాన్సువాడ రూరల్ : త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి బీజేపీ సత్తాచాటాలని ఆ పార్టీ రా ష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. తాడ్కోల్లోని రెడ్డి సంఘంలో బీ జేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు అ ధ్యక్షతన బాన్సువాడ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని గురువారం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ల క్ష్యంగా పనిచేయాలని నాయకులకు సూచనలు చేశారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తు న్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ఈ సందర్బంగా పార్టీలో చేరిన తా డ్కోల్ మాజీ సర్పంచ్ సాయిలు, బీరుగొండ, రాములు, రమేశ్కు కాషాయ కండువా లు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాయకు లు పోశెట్టి, లక్ష్మీనారాయణ, దొరబాబు, శంకర్గౌడ్, కోనాల గంగారెడ్డి, శ్రీనివాస్, వివిధ మండలాల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎంపీడీవోలకు పోస్టింగ్లు సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఎన్నికలకు ముందు నిజామాబాద్, మెదక్ జిల్లాలకు బదిలీ అయిన ఎంపీడీవోలు ఐదుగురిని కామారెడ్డి జిల్లాకు కేటాయించగా వారికి మండలాల్లో పోస్టింగులు ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లిలో పనిచేసిన బాలకృష్ణకు రాజంపేట, మెదక్ జిల్లా హవేలీఘన్పూర్ నుంచి వ చ్చిన రవీశ్వర్గౌడ్కు పెద్ద కొడప్గల్, శివ్వంపేట నుంచి వచ్చిన నాగేశ్వర్కు రామారెడ్డి, మెదక్ నుంచి వచ్చిన రఘుకు పిట్లం, చిలిపి చేడ్ నుంచి వచ్చిన ఆనంద్కు బాన్సువాడ మండలాలకు పోస్టింగ్లు ఇచ్చారు. బాధిత కుటుంబాలకు పరామర్శ భిక్కనూరు: మండలంలోని పెద్దమల్లారెడ్డి, కాచాపూర్ గ్రామాలకు చెందిన పలువురిని బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు గంప శశాంక్ గురువారం పరామర్శించారు. పెద్దమల్లారెడ్డిలో బీఆర్ఎస్ కార్యకర్తలు దాచుపల్లి భూమయ్య, మన్నే ప్రమీల, పెద్దోళ్ల దుబ్బవ్వ, కాచాపూర్ గ్రామానికి చెందిన సంతోష్రెడ్డి ఇటీవలి కాలంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గంప శశాంక్ బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చరు. ఆయన వెంట మాజీ ఎంపీటీసీ కోడూరి సాయాగౌడ్, నాయకులు ఈర స్వామి, వడ్ల బ్రహ్మచారి, వడ్ల శ్రీనివాస్, డాక్టర్ శ్రీనివాస్, పెద్దోళ్ల అనిల్, ధన్రాజు, స్వామి తదితరులు ఉన్నారు. క్రీడా అకాడమీలో ప్రవేశాలకు ఎంపికలు కామారెడ్డి అర్బన్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ కొత్తగా ఏ ర్పాటు చేసిన హాకీ, అథ్లెటిక్స్ క్రీడా అకాడమీలలోబాలురు, బాలికల ప్రవేశాలకు ఈ నెల 15, 16 తేదీల్లో హైదరాబా ద్లో ఎంపిక లు నిర్వహించనున్నారని జిల్లా యువజన, క్రీడల అధికారి కేఎస్ జగన్నాథన్ ఒక ప్రకటనలో తెలిపారు. 12 నుంచి 16 ఏళ్ల లోపు క్రీడాకారులు వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
ప్రాథమికంలో మెరుగు‘బడి’
నిజామాబాద్అర్బన్: విద్యావ్యవస్థలో మార్పు మొ దలైంది. బోధనాభ్యసన ప్రక్రియలో సత్ఫలితా లు వస్తున్నాయి. రెండేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న తొలిమెట్టు(ఎఫ్ఎల్ఎన్), లిప్(లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం) కార్యక్రమాలతో విద్యార్థులకు గుణాత్మక విద్య అందుతూ అభ్యసన ఫలితాలు మెరుగవుతున్నాయి. ఇటీవల కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన ఫరక్ రాష్ట్రీయ, సర్వేక్షణ(న్యాస్) సర్వే నివేదికలో ఉమ్మడి జిల్లా మెరుగైన స్థానంలో ఉంది. సర్వే ఇలా.. ఉమ్మడి జిల్లాలో దాదాపు 180 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 2024 డిసెంబర్ 4న న్యాస్, ఎన్సీఈఆర్టీ సంయుక్తంగా రాష్ట్రీయ సర్వేక్షణ్–ఫరఖ్ సర్వేను నిర్వహించాయి. ఫలితాలను ఉదిత్, ఉదయ్, ఉన్నత్, ఉద్భవ్ అనే నాలుగు కేటగిరీలుగా వర్గీకరించి కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది. 25 శాతం కంటే తక్కువ అభ్యసన స్థాయిలను కలిగి ఉంటే ఉద్భవ్గా, 25–50 మధ్య ఉంటే ఉన్నతిగా, 50–75 మధ్య ఫలితాలను ఉదయ్, ఆపైన ఫలితాలు వస్తే ఉదిత్గా ప్రకటించారు. కేంద్రం విడుదల చేసిన ఈ ఫలితాలలో ఉమ్మడి జిల్లా ఆశాజనక స్థానం సాధించింది. ● 3వ తరగతి ఫలితాలలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా 9వ, నిజామాబాద్ 18వ స్థానాన్ని సాధించాయి. గత న్యాస్ సర్వే కంటే పది స్థానాలు మెరుగుపడినాయి. అలాగే ప్రైవేట్ బడుల కంటే ప్రభుత్వ బడులలో అభ్యసన సామర్థ్యాలు పెరిగినాయి. 6వ తరగతిలో భాష, గణితంలో ఉన్నతి, ఉద్భవ్ స్థాయిలో ఉండగా, సామర్థ్యాల పరంగా వెనుకబడ్డాయి. 9వ తరగతిలో అభ్యసన ఫలితాలు మెరుగయ్యాయి. తరగతులవారీగా అభ్యసన స్థాయి శాతం ఉన్నతంలో వెనుకడుగు జాతీయ సాధన సర్వేలో ఆశాజనక ఫలితాలు గత సర్వే ఫలితాల కంటే మెరుగు ఎఫ్ఎల్ఎన్, ఎల్ఐపీ కార్యక్రమాలతో సత్ఫలితాలు ప్రభుత్వ బడులు బలోపేతం 2022 ఆగస్టు 15 నుంచి ప్రవేశపెట్టిన తొలిమెట్టు, లిప్ కార్యక్రమాలతో ప్రభుత్వ బడులలో అభ్యసన ఫలితాలు మెరుగయ్యాయి. అలాగే డీఎస్సీ–2024, డీఎస్సీ–2008 ద్వారా జిల్లాలో నూతనంగా నియామకమైన 650 ఉపాధ్యాయులతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమై విద్యార్థులకు గుణాత్మక విద్య అందిస్తున్నాయి. కనీస అభ్యసన సామర్థ్యాలను సాధించడంతోపాటు తరగతి గది అభ్యసన ఫలితాలను సాధించేందుకు గత విద్యాసంవత్సరం నుంచి పంపిణీ చేసిన వర్క్బుక్లు దోహదపడ్డాయి. ఉపాధ్యాయుల కృషితోనే.. ఇటీవల వెలువడిన జాతీయ సాధన సర్వేలో మంచి ఫలితాలు రావడం శుభ పరిణామం. ఉపాధ్యాయుల కృషితోనే ఇది సాధ్యమైంది. ప్రాథమిక స్థాయిలో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు సాధిస్తాం. – అంకం నరేశ్, పీఆర్టీయూ జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు -
ఆనంద సందర్భాలను బాలసదనంలో గడపాలి
కామారెడ్డి క్రైం : పుట్టినరోజు, పండగలు ఏవైనా ఆనంద సందర్భాలను బాలసదనం చిన్నారులతో కలిసి నిర్వహించుకోవాలని, వారిలో సంతోషాన్ని నింపాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలసదన్ను కలెక్టర్ గురువారం సందర్శించి వసతులను పరిశీలించారు. పిల్లలతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. బాగా చదువుకుని భవిష్యత్లో ఉన్నత స్థానంలో నిలవాలని చిన్నారులకు సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాల సదనం చిన్నారులకు దుప్పట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం పిల్లలకు దుప్పట్లను అందజేశారు. నూతన భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, డీసీపీవో స్రవంతి, సూపరింటెండెంట్ సంగమేశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు. -
వేతనం లేని ఉపాధి
ఎల్లారెడ్డిరూరల్: ఉపాఽధిహామీ కూలీలకు ఉపాధి క ల్పించే సిబ్బంది వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మూడు నెలలుగా వేతనాలు అందకపో వడంతో కుటుంబాల పోషణ భారంగా మారిందని ఉపాధిహామీ టెక్నికల్ అసిస్టెంట్లు(టీఏలు), ఫీల్డ్ అసిస్టెంట్లు (ఎఫ్ఏలు) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 2,50,423 జాబ్కార్డులు ఉండగా వీటి పరిధిలో 4,76,500 మంది కూలీలు ఉన్నారు. వీరిలో గత జూన్ వరకు రోజుకు సగటున 42 వేల మంది కూలీలు పనులు చేశారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు 85,284 మంది కూలీలు 10 లక్షల 92 వేల పని దినాలను పూర్తి చేశారు. వీరితో జిల్లాలో 65 మంది టీఏలు, 325 మంది ఎఫ్ఏలు పనులను గుర్తించి పనులను చేయించారు. అయితే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబందించిన వేతనాలు రాక పోవడంతో ఇబ్బందులు పడుతున్నామని టీఏలు, ఎఫ్ఏలు ఆవేదన చెందుతున్నారు. వీరితోపాటు జిల్లాలో 14 మంది ఏపీవోలు, 9 మంది ఈసీలు, 48 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 22 మంది అటెండర్లు ఉన్నారు. వీరికి సైతం గత రెండు నెలల నుంచి వేతనాలు అందలేదు. అధికారులు స్పందించి సిబ్బంది వేతనాలు అందేలా చర్యలను తీసుకోవాలని వారు కోరుతున్నారు. టీఏలు, ఎఫ్ఏలకు మూడు నెలలుగా అందని జీతాలు ఏపీవో, సీవో సిబ్బందికి రెండు నెలలుగా.. ఇబ్బందులు పడుతున్న సిబ్బంది -
జిల్లా జనాభా
1991లో మొత్తం 7,64,241 పురుషులు 3,81,924 మహిళలు 3,82,3172001లో మొత్తం 8,79,373 పురుషులు 4,38,634 మహిళలు 4,40,7392011లో మొత్తం 9,74,227 పురుషులు 4,79,192 మహిళలు 4,95,035సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : చదువులు ఖరీదైపోవడం ఏడాదికేడాది అన్నింటి ధరలు పెరిగిపోయి కుటుంబ పోషణ భారంగా మారిన పరిస్థితుల్లో సంతానానికి పరిమితులు విధించుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది పిల్లల్ని కంటే వారికి మంచి చదువు ఇవ్వలేమనే భావన పెరిగింది. దీంతో పరిమిత సంతానమే ముద్దనే అభిప్రాయం అన్ని వర్గాల్లోనూ ఏర్పడింది. దీంతో చాలా మంది సంతానం అంటే.. ఒక్కరే చాలని అంటున్నారు. కాదూ కూడదంటే ఇద్దరితో ఆపేద్దామనే భావన మెజారిటీ ప్రజల్లో ఉంది. చదువుకున్న వారే కాకుండా సామాన్య ప్రజలు కూడా చిన్న కుటుంబానికే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా జనాభా పెరుగుదల శాతం ఏడాదికేడాది తగ్గిపోతోంది. కుటుంబాల సంఖ్య పెరిగినా, జనాభా పెరుగుదల మాత్రం ఆ స్థాయిలో కనబడడం లేదు. కామారెడ్డి జిల్లాలో 2001 జనాభా గణాంకాల ప్రకారం జనాభా వృద్ది 15 శాతం ఉంటే, 2011 కి వచ్చేసరికి జనాభా వృద్ది 8.8 శాతానికి పడిపోయింది. 2021లో చేపట్టాల్సిన జనాభా గణన కరోనా కారణంగా నిలిచిపోయింది. అయితే ప్రభుత్వ అంచనాల ప్రకారం గడచిన పద్నాలుగేళ్ల కాలంలో జనాభా వృద్ధి 7.5 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు.● 2021లో జనగణన చేపట్టలేదు. అయితే అంచనాల ప్రకారం 2025లో జిల్లా జనాభా 10,54,520 ఉంటుందని, ఇందులో పురుషులు 5,18,702, మహిళలు 5,35,818 మంది ఉంటారని అంచనా వేస్తున్నారు.ఒక్కరు లేదా ఇద్దరు చాలు ఆర్థికంగా ఉన్న వారు ఎంత మంది పిల్లలు ఉన్నా ఇబ్బందులు ఉండకపోవచ్చు. కా నీ సామాన్య ప్రజలు ఎవరై నా సరే ఒక్కరు, లేదంటే ఇ ద్దరు సంతానం ఉండడమే మంచిది. పిల్లల చదువుల నుంచి వారి భవిష్యత్ను తీర్చిదిద్దేందుకు అవసరమైన ఆర్థిక పరిస్థితులు అందరికీ ఉండవు. ఒకరు లేదా ఇద్దరు పిల్లలు ఉంటేనే మేలు. – ధన్రాజ్ – ప్రత్యూష, ఎల్లారెడ్డి ఉమ్మడి కుటుంబాలు అవసరం తక్కువ మంది సంతానంతో కుటుంబాలు చిన్నగా మారిపోతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు ఉన్నపుడు అందరికీ అన్ని విషయాలపై అవగాహన ఉండేది. పాత రోజుల్లో ఒక్కో కుటుంబంలో నలుగురైదుగురు సంతానం ఉండేది. ఇప్పుడు అన్నీ చిన్న కుటుంబాలే అయ్యాయి. దీంతో ఎవరికీ ఏమీ తెలియడం లేదు. – సంతోష్కుమార్, ఎల్లారెడ్డి -
డెంగీకి వ్యాక్సిన్ లేదు.. నివారణ ఒక్కటే మార్గం
బాన్సువాడ రూరల్: వర్షాకాలంలో సాధారణంగా విజృంభించే డెంగీకి వ్యాక్సిన్ అందుబాటులో లేద ని, నివారణ ఒక్కటే మార్గమని బాన్సువాడ సబ్ క లెక్టర్ డాక్టర్ కిరణ్మయి అన్నారు. సీజనల్ వ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా మండల పరిషత్ కార్యా లయంలో గురువారం డివిజన్లోని ఆయాశాఖల మండల అధికారులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. మురికి నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీ సుకోవాలని, నిల్వ ఉన్న నీటిలో ఆయిల్బాల్స్ వే యాలని సూచించారు. డ్రెనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తూ, చెత్తసేకరణ సమర్థవంతంగా అ మలు చేయాలన్నారు. తాగునీటి ట్యాంకులు శు భ్రం చేయిస్తూ బ్లీచింగ్ పౌడర్తో క్లోరినేషన్ చేయాలన్నారు. దోమలు వృద్ధి చెందకుండా ఫాగింగ్ చే యించాలన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, పరిసరాల పరిశుభ్రతకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి శుక్రవారం ‘ఫ్రైడే డ్రైడే’ ని ర్వహించా లని అధికారులకు సూచించారు. అనంత రం డివిజన్లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పురోగతిపై డివిజన్లోని అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలతో సమీక్షాసమావేశం నిర్వహించారు. డి ప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ విద్య, డీఎల్పీవో సత్యనారాయణరెడ్డి, ఆయా మండలాల వైద్యాధికారు లు, ఎంపీడీవోలు, ఎంఈవో, ఎంపీవోలు పాల్గొన్నారు. -
‘ఉపాధి’లో పారదర్శకత కోసం విజిలెన్స్ కమిటీలు
బిచ్కుంద(జుక్కల్): ఉపాధిహామీ పనుల్లో అక్రమాలకు చోటు లేకుండా పారదర్శకంగా చేపట్టేందుకు విజిలెన్స్ కమిటీలు వేస్తున్నామని, ప్రతి నెలా పనులను కమిటీ తనిఖీ చేస్తుందని ఈజీఎస్ రాష్ట్ర డైరెక్టర్ నిర్మల, పీడీ సురేందర్ అన్నారు. బిచ్కుంద మండల పరిషత్ కార్యాలయంలో 2024–25 ఈజీఎస్ పనుల సామాజిక తనిఖీ ప్రజావేదికను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ.. మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో రూ.2 కోట్ల 35 లక్షల విలువైన పనులకు అధికారులు సోషల్ ఆడిట్ నిర్వహించారన్నారు. ఈజీఎస్ పనులు పర్యవేక్షణ కోసం త్వరలోనే ప్రభుత్వం విజిలెన్ కమిటీలు ఏర్పాటు చేయనుందని, అక్రమాలకు పాల్పడితే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో చేపట్టిన కొన్ని పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, మస్టర్లలో తప్పులున్నాయని సోషల్ ఆడిట్ అధికారులు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన సిబ్బంది నుంచి డబ్బులు రికవరీ చేస్తామని పీడీ స్పష్టం చేశారు. క్వాలిటీ కంట్రోల అధికారులు రాఘవన్, విప్లవకుమార్, ఎంపీడీవో గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
రౌడీషీటర్ గ్యాంగ్ అరెస్ట్
ఖలీల్వాడి: నగరంలో కత్తులతో బెదిరించి నగదు వసూలు చేస్తున్న ఓ రౌడీషీటర్ గ్యాంగ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. జిల్లా కేంద్రానికి చెందిన బర్సాత్ అమీర్ అనే రౌడీషీటర్ తన సభ్యులతో కలిసి గత నెల 7న ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న షేక్ షారుక్ అనే వ్యక్తి నుంచి డబ్బులు ఇవ్వాలంటు కత్తులతో బెదిరించి దాడి చేసి రూ. 400 నగదును లాక్కున్నారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు రౌడీషీటర్ బర్సాత్ అమీర్తో పాటు సభ్యులు మహమ్మద్ షేక్ హసీమ్, ముద్దస్సిర్, షేక్ సుల్తాన్పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పర్చి రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో పేర్కొన్నారు. -
కళాశాల సరే.. భవనమేది.?
బాన్సువాడ: గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలతో సతమతమవుతుంది. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ప్రభుత్వ కళాశాలకు సొంత భవనం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో 2021లో ప్రభుత్వం జూనియర్ కళాశాలను మంజూరు చేసింది. కళాశాల ప్రారంభమైన నాటి నుంచి స్థానిక ఉన్నత పాఠశాలలోనే కళాశాల నిర్వహణ కొనసాగుతోంది. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, డీటీఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కళాశాలలో ముగ్గురు రెగ్యులర్ అధ్యాపకులు ఉండగా ఏడుగురు ఔట్సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. బీర్కూర్ మండల కేంద్రంతో పాటు దామరంచ, నస్రుల్లాబాద్ మండలంలోని మీర్జాపూర్లో మూడు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. పదో తరగతి పూర్తయిన విద్యార్థులు ఇంటర్ కోసం బాన్సువాడ, బోధన్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ బీర్కూర్కు ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజురు కావడంతో ఆయా ప్రాంతాల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కానీ కళాశాలకు సొంత భవనం లేకపోవడంతో ఉన్నత పాఠశాలలో ఉన్న గదుల్లో తరగతుల నిర్వహణ కొనసాగుతుండడంతో విద్యార్థులు ఈ కళాశాలలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. చుట్టు పక్కల గ్రామాలకు చెందిన విద్యార్థులు కళాశాలకు రావాలంటే బీర్కూర్కు బస్సు సౌకర్యం లేదు. మిర్జాపూర్, తిమ్మాపూర్ గ్రామాలకు చెందిన విద్యార్థులు కళాశాలలో చేరాలని ఉన్నా బీర్కూర్కు బస్సు సౌకర్యం లేక బాన్సువాడకు వెళ్తున్నారు. బరంగెడ్గి, బైరాపూర్, సంబపూర్ గ్రామాల్లో ఉండే విద్యార్థులు చాలా మంది బీర్కూర్కు రావాలని ఉన్నా సరైన సమయంలో బస్సు సౌకర్యం లేక బాన్సువాడ, బోధన్కు వెళ్తున్నారు. పలుమార్లు ఇక్కడి అధ్యాపకులు, నాయకులు ఆర్టీసీ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు. కళాశాలకు సొంత భవనం నిర్మాణం చేపట్టి, బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. నాలుగేళ్లుగా ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్వహణ బస్సు సౌకర్యం లేక కళాశాలలో చేరేందుకు ఆసక్తి చూపని విద్యార్థులు బీర్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు పక్కా భవనం నిర్మించాలని విద్యార్థుల వేడుకోలు ఆర్టీసీ అధికారులకు విన్నవించాం బీర్కూర్ చుట్టు పక్కల గ్రామాల నుంచి విద్యార్థులు వస్తున్నారు. కానీ బస్సు సౌకర్యం లేక చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు ఆర్టీసీ అధికారులకు విన్నవించాం. మిర్జాపూర్, తిమ్మాపూర్ గ్రామాల నుంచి సుమారు 20 మంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది. కానీ బస్సు సమస్యతో కళాశాలలో చేరడం లేదు. అధికారులు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి. –మోహన్రెడ్డి, ఇన్చార్జి ప్రిన్సిపల్, బీర్కూర్ -
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురి అరెస్టు
● 1.435 కిలోల ఎండు గంజాయి పట్టివేత ఖలీల్వాడి: నగరంలోని పలు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని అర్సపల్లి, ఎల్లమ్మగుట్ట, అసద్ బాలానగర్ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి దాడి చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ పేర్కొన్నారు. ఈ దాడిలో నిందితులు షేక్ పర్వేజ్, కసిలేరు మాధవ్, నజయా బేగంల నుంచి 1.435 కిలోల ఎండు గంజాయితో పాటు రెండు సెల్ ఫోన్లు, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దాడిలో ఎకై ్సజ్ కానిస్టేబుళ్లు రాజు, నారాయణ రెడ్డి, కానిస్టేబుళ్లు భోజన్న, షమీన్, శివ, సాయి, విష్ణు, అవినాష్ట మంజుల తదితరులు ఉన్నారు. -
వ్యాధుల నియంత్రణకు ప్రచారం కల్పించాలి
బాన్సువాడ రూరల్: సీజనల్ వ్యాధుల నియంత్రణకు వైద్య, ఆరోగ్య శాఖతో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయి సూచించారు. బుధవారం ఆమె తన కార్యాలయంలో జాతీయ కీటక జనిత రోగ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా డెంగీ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. దోమలు వృద్ధి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. కరపత్రాల ముద్రణకు సహకరించిన ఇన్సూరెన్స్ చీఫ్ అడ్వైజర్ భాగ్యవతి, బాన్సువాడ డిప్యూటీ డీఎంహెచ్వో విద్య, సీహెచ్వో దయానంద్, డాక్టర్ సమీఉల్లా, ఫార్మసిస్టు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
చెత్త రీసైక్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి
నిజామాబాద్ సిటీ: డంపింగ్ యార్డులో చెత్త రీసైక్లింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని ఏజెన్సీ నిర్వాహకులకు మున్సిపల్ కమిషనర్ దిలీప్కుమార్ సూచించారు. నగర శివారులోని నాగారం డంపింగ్ యార్డును కమిషనర్ బుధవారం పరిశీలించారు. సిబ్బందితో పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. తడి, పొడిచెత్తను వేర్వేరుగా డంపింగ్ చే యాలని ఆదేశించారు. దుర్వాసన రాకుండా చ ర్యలు తీసుకోవాలని ఎస్సై ప్రభుదాస్కు సూచించా రు. తడిచెత్తతో సేంద్రియ ఎరువుల తయారీ ప్రక్రి య వేగవంతం చేయాలని, ప్యాకెట్లలో నింపి ఎరువులు సిద్ధం చేసి బయటి వ్యక్తులకు విక్రయించాలన్నారు. ఆయా జోన్ కార్యాలయాల వద్ద సేంద్రియ ఎరువుల బ్యాగ్లు అందుబాటులో ఉంచాలన్నారు. నేరాల నియంత్రణకు కృషి చేయాలి కమ్మర్పల్లి: గ్రామాల్లో నేరాల నియంత్రణకు పోలీసులు కృషి చేయాలని ఆర్మూర్ ఏసీపీ జె వెంకటేశ్వరరెడ్డి అన్నారు. బుధవారం కమ్మర్పల్లి పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీఎస్లోని రికార్డులు, కేసు డైరీలు, నిత్య కార్యకలాపాల నమోదులను పరిశీలించారు. నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ప్రజలతో సౌమ్యంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం నిర్వహించిన పరేడ్లో పాల్గొన్నారు. భీమ్గల్ సీఐ పి సత్యనారాయణ, ఎస్సై జి అనిల్రెడ్డి ఉన్నారు. -
కార్మికులు కలిసి కట్టుగా పోరాటం చేయాలి
సాక్షి నెట్వర్క్:జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన దేశవ్యాప్త సమ్మె విజయవంతమైంది. వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం స్థానిక అధికారులకు వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కార్మికులు కలిసికట్టుగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. నాలుగు లేబర్ కోడ్ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ఎనిమిది గంటల పని దినాలను అమలు చేయాలన్నారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. -
పాఠశాలలో పాముల బెడద..!
కామారెడ్డి: నాగిరెడ్డిపేట మండలంలోని ఆత్మకూర్ హైస్కూల్లో కొన్నిరోజులుగా పాముల బెడద నెలకొంది. పాఠశాల చుట్టూ ప్రహరీ లేకపోవడం, చుట్టూ పంటపొలాలు ఉండడంతో తరుచూ పాఠశాలలోకి పాములు వస్తున్నాయి. దీనికితోడు పాఠశాలకు సంబంధించి శిథిలావస్థలో ఉన్న తరగతి గదుల తలుపులు, కిటికీలలో నుంచి పాములు లోనికి ప్రవేశిస్తున్నాయి. గత మంగళవారం సైతం పాఠశాలలోని ఓ తరగతి గది తలుపు వద్ద పాము కుబుసం ఉండడంతో అనుమానంతో ఉపాధ్యాయులు తలుపు వద్దనున్న చెక్కల మధ్య పరిశీలించి చూడగా రెండు పాములు దర్శనమిచ్చాయి. దీంతో భయాందోళన చెందిన ఉపాధ్యాయులు కర్రలతో రెండుపాములను కొట్టి చంపారు. ఒకవైపు విద్యార్థులకు సరిపడా తరగతిగదులు లేకపోవడంతోపాటు శిథిలావస్థకు చేరిన గదుల్లో దర్శనమిస్తున్న పాములతో అటు ఉపాధ్యాయులతోపాటు ఇటు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి పాఠశాల ఆవరణలో ఉన్న శిథిలమైన తరగతి గదులను కూల్చేసి నూతన గదుల నిర్మాణానికి కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. భయాందోళనలో ఉపాధ్యాయులు, విద్యార్థులు -
ఎత్తిపోతలకు మళ్లీ తాళం
● భారంగా పథకం నిర్వహణ ● పేరుకుపోయిన రైతుల పన్ను బకాయిలు ● ప్రధాన పంప్హౌస్లో ప్యానెల్ బోర్డు సామగ్రి చోరి ● ఆయకట్టు రైతుల్లో ఆందోళన బోధన్: సాలూర గ్రామ శివారులోని మంజీర నది పై నిర్మించిన ఎత్తిపోతల పథకానికి మళ్లీ తాళం ప డింది. ఏడాదిన్నర క్రితం దుండగులు ఈ పథకానికి సంబంధించిన కరెంట్ ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి తీగలు, ఆయిల్ను అపహరించారు. దీంతో పంప్హౌస్కు తాళం వేశారు. స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చొరవతో రూ.10 లక్షలు మంజూరు చే యించి ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేపట్టడంతో పథకం వినియోగంలోకి వచ్చింది. ఈ ఏడాది వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందు ఎత్తిపో తల పథకం ప్రధాన పంప్హౌస్లో కరెంట్ మో టార్ల ప్యానెల్ బోర్డు అపహరణకు గురైంది. దీంతో లిఫ్ట్కు మళ్లీ తాళం పడింది. నిర్వహణ కమిటీ వద్ద డబ్బులు లేకపోవడంతో మరమ్మతులో జాప్యం జరుగుతోంది. దీంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. 2009లో పథకం ప్రారంభం ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎత్తిపోతల పథకానికి రూ.3.80 కోట్లు మంజూరు చేశారు. పనులు పూర్తిచేసి 2009లో పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 1600 ఎకరాలను స్థిరీకరించారు. వర్షాధార మెట్ట భూములు సస్యశ్యామలమయ్యాయి. ఈ పథకాన్ని రైతులు ఐక్యతతో సద్వినియోగం చేసుకోవడంలో సఫలమై లబ్ధిపొందారు. సిబ్బంది వేతనాలు, ఇతర ఖర్చుల కోసం రైతులు మాగాణి ఎకరానికి రూ.800, మెట్ట ఎకరానికి రూ.600 చొప్పున పథకం కమిటీకి చెల్లిస్తారు. రైతులు చెల్లించాల్సిన పన్ను బకాయిలు పేరుకుపోయాయి. దిగువకు మంజీర జలాలు ఏటా వర్షాకాలం ప్రారంభంలో మంజీర నదిలో వరద నీరు చేరగానే లిఫ్ట్ మోటార్లు ప్రారంభించి గ్రామ శివారులోని చెరువులను నింపుతారు. ఈసారి నెల క్రితమే మంజీరలో వరద నీరు చేరినా మోటార్లు సిద్ధంగా లేకపోవడంతో దిగువకు కదలిపోతున్నాయి. ప్రస్తుతం గ్రామ శివారులోని ఏడు చెరువుల్లో నీళ్లు అడుగంటాయి. చెరువుల కింద కరెంట్ బోరుబావులున్న రైతులు మాత్రమే వరినాట్లు వేస్తున్నారు. ఎత్తిపోతల పథకం కింద ఉన్న వందలాది ఎకరాల వర్షాధార మెట్ట భూముల్లో ప్రధానంగా సోయా మొలకెత్తింది. ఈ విషయమై సంఘం చైర్మన్ అల్లె జనార్దన్ దృష్టికి తీసుకెళ్లగా రైతుల సహకారంతో పథకం ప్రారంభానికి అన్నివిధాలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. -
కుస్తాపూర్ నంది పోచంపాడ్లో ప్రతిష్ఠాపన
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లో ముంపునకు గురైన కుస్తాపూర్ రామలింగేశ్వర స్వామి ఆలయం నుంచి నందిని తీసుకొచ్చి పోచంపాడ్ శివాలయంలో ప్రతిష్ఠించారు. ● పోచంపాడ్లో గోదావరి తీరాన కుస్తాపూర్ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని 1969వ సంవత్సరంలో పునఃనిర్మాణం చేపట్టారు. ● శ్రీరాముడు వనవాస కాలంలో కుస్తాపూర్ వద్ద బ్రహ్మ హత్య పాపం పోయేందుకు పూజలు చేసినట్లు చరిత్ర చెబుతోంది. ● కుస్తాపూర్ వద్ద శ్రీరాముడు ప్రతిష్ఠించిన శివలింగంగా ప్రసిద్ధి చెందింది. ● నాడు ఆలయం ముంపునకు గురి కావడంతో పోచంపాడ్ వద్ద తిరిగి పునఃనిర్మించారు. కాగా కుస్తాపూర్ నుంచి నందిని మాత్రమే తీసుకొచ్చి నూతన ఆలయంలో ప్రతిష్ఠించినట్లు గ్రామ పెద్దలు పేర్కొంటున్నారు. ● శ్రీరాముడు ఇసుకతో చేసిన శివలింగం ముంపునకు గురైన కుస్తాపూర్ ఆలయంలోనే ఉంది. ● ఎస్సారెస్పీ నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చెరువలో ఉన్నప్పుడు ఆలయం బయల్పడుతుంది. అప్పుడు అక్కడ కూడా భక్తులు పూజలు చేస్తారు. మీకు తెలుసా? -
యూరియా కొరత లేకుండా చూడాలి
కామారెడ్డి: యూరియా కొరత లేకుండా చూడాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు పైడి విఠల్ రెడ్డి అన్నారు. బుధవారం సదాశివనగర్ రైతు వేదిక భవనంలో మండల స్థాయి భారతీయ కిసాన్ సంఘ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రబీ సీజన్లో పండించిన సన్న వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన రైతు రుణమాఫీ రూ. 2 లక్షలు వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. అనంతరం తిర్మన్పల్లి గ్రామానికి చెందిన మార నారాయణరెడ్డిని నూతన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. సంఘం మండల అధ్యక్షుడు కొప్పుల నర్సారెడ్డి, మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి, తదితరులు పాల్గొన్నారు. కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలి రాజంపేట: మహిళా సంఘాలు దివ్యాంగ కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలని అదనపు డీఆర్డీవో విజయలక్ష్మి అన్నారు. రాజంపేట మహిళా సమాఖ్య భవనంలో నిర్వహించిన ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గ్రామాలలో ఆదాయాభివృద్ధి కార్యక్రమంలో బ్యాంకు రుణాలు, సీ్త్రనిధి, గ్రామ సంఘం రుణాల రికవరీలో రాజంపేట మండల మహిళా సంఘం మొదటి స్థానంలో ఉండటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే కొత్తగా మహిళా సంఘాలు దివ్యాంగ కిశోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమాఖ్య అధ్యక్షులు లక్ష్మి, ఏపీఎం సాయిలు, సీసీ శ్రీనివాస్, వీవోఏలు పాల్గొన్నారు. ఆలయాలకు నూతన కార్యవర్గం ఏర్పాటు నిజామాబాద్ రూరల్: నగరంలోని జెండాబాలాజీ, శంభులింగేశ్వరాలయం, హమాల్వాడి సాయిబాబా ఆలయాలకు నూతన పాలకవర్గం ఏర్పాటు చేస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా మంగళవారం రాత్రి జెండా బాలాజీ ఆలయానికి డైరెక్టర్లుగా ప్రమోద్కుమార్, నర్సింగ్రావు, కిరణ్కుమార్, వేముల దేవిదాస్, లక్ష్మణ్, విజయ, రాజ్కుమార్లు, హమాల్వాడి సాయిబాబా ఆలయానికి డైరెక్టర్లుగా గంగాకిషన్, శ్రీరాంశ్రీనివాస్, పవన్కుమార్, శివలింగం, శాంతాబాయి నియామకం అయ్యారు. శంభులింగేశ్వరాలయానికి డైరెక్టర్లుగా బి మధు, కిశోర్, సంతోష్కుమార్, కమలకిశోర్, మామిడిశేఖర్, రమేశ్, రేఖలను నియమించినట్లు జిల్లా ఎండోమెంట్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. -
సార్వత్రిక సమ్మె విజయవంతం
కామారెడ్డి టౌన్: జిల్లాలో బుధవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మె విజయవంతమైందని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు పాలడుగు సుధాకర్ పేర్కొన్నారు. సమ్మె నేపథ్యంలో జిల్లాకేంద్రంలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఆయా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. మున్సిపల్ కార్యాలయం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికలోకం ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నాలుగు లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్, ఏఐటీయూసీ నేతలు దశరథ్, బాల్రాజ్, ఆయా సంఘాల నాయకులు నర్సింలు, రాజనర్సు, వెంకట్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
ఎల్లారెడ్డిరూరల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఇంటెలిజెన్స్ ఎస్పీ రంజన్ రతన్ సూచించారు. బుధవారం ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1980–82 బ్యాచ్కు చెందిన ఇంటర్ పూర్వ విద్యార్థులు ఇదే కళాశాలలో గతేడాది టాపర్లుగా నిలిచిన మహాలక్ష్మి, నందినీలకు రూ. 10 వేల చొప్పున ప్రోత్సాహక బహుమతిని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సైతం ఇదే కళాశాలలో ఇంటర్ చదివానన్నారు. చదువుతో పాటు క్రీడలలో రాణించడం వల్లే ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. వచ్చే ఏడాది ఇంటర్ టాపర్లకు రూ. 25 వేల ప్రోత్సాహకాన్ని అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపల్ విశాల, లెక్చరర్లు రామచంద్రరావు, రమేష్, పూర్వ విద్యార్థులు ఆంజనేయులు, మూర్తి పాల్గొన్నారు. -
పాఠశాల పునఃప్రారంభం
సదాశివనగర్: దగ్గి గ్రామంలో మూతపడ్డ ప్రాథమిక పాఠశాలను బుధవారం డీఈవో రాజు పునఃప్రారంభించారు. గతంలో విద్యార్థులు లేకపోవడంతో ఈ పాఠశాలను మూసివేశారు. స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు విష్ణువర్ధన్రెడ్డి గ్రామస్తులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో కల్పిస్తున్న వసతులు, సౌకర్యాలను వివరించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని కోరారు. దీంతో ఈ ఏడాది పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బుధవారం పాఠశాలను పునఃప్రారంభించారు. కార్యక్రమంలో సీఆర్పీ నందురావు, ఉపాద్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. కొత్త సబ్స్టేషన్లతో మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా కామారెడ్డి అర్బన్: కొత్త సబ్స్టేషన్లతో మరింత నాణ్యమైన విద్యుత్ అందుతుందని ఎస్ఈ శ్రావణ్కుమార్ పేర్కొన్నారు. వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికి కామారెడ్డి సర్కిల్ పరిధిలో నాలుగు సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చిట్యాల, మహ్మద్నగర్ సబ్స్టేషన్ల పనులు ముమ్మరంగా కొనసాగుతుండగా, బోర్గాం, కామారెడ్డి ఇండోర్ సబ్ స్టేషన్లకు టెండర్లు పిలిచామని పేర్కొన్నారు. కొత్త సబ్స్టేషన్లలో స్కాడా అనుసంధానం వంటి ఆధునిక సాంకేతికను వినియోగిస్తున్నామని వివరించారు. దీని ద్వారా రియల్ టైం ఫీడర్ మానిటర్ చేయగలమని పేర్కొన్నారు. బోనాల పండుగకు ఆహ్వానం దోమకొండ: మండల కేంద్రంలోని చాముండేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు బుధవారం జిల్లాకేంద్రానికి వెళ్లి ఎస్పీ రాజేశ్ చంద్ర, ఏఎస్పీ చైతన్యరెడ్డిలను కలిశారు. ఆదివారం నిర్వహించే బోనాల పండుగకు హాజరు కావాలని కోరుతూ ఆహ్వాన పత్రికలను అందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి, అర్చకుడు శరత్ చంద్ర, బీజేపీ మండల అధ్యక్షుడు మద్దూరి భూపాల్రెడ్డి పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ తనిఖీ మాచారెడ్డి: మాచారెడ్డి పోలీస్ స్టేషన్ను బుధవారం కామారెడ్డి అసిస్టెంట్ ఎస్పీ చైతన్యరెడ్డి తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పోలీస్ సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట కామారెడ్డి రూరల్ సీఐ రామన్, ఎస్సై అనిల్ ఉన్నారు. పోలీస్ స్టేషన్లో పనిచేసి పదోన్నతిపై వెళ్తున్న కానిస్టేబుళ్లు రామారావు, స్వామిలను ఎస్సై అనిల్ సన్మానించారు. -
ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం
కామారెడ్డి టౌన్: ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవా న్ని బుధవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు విద్యార్థులతో కలిసి పట్టణంలో ర్యాలీ తీశారు. కొత్త బస్టాండ్ వద్ద పరిషత్ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ రోహిత్, నాయకులు నరేష్, స్వామి, వెంకటస్వామి, రాహుల్, విద్యార్థులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలో ఏబీవీపీ ఆవిర్భా వ వేడుకలను జరిపారు. అంబేడ్కర్ చౌరస్తా ప్రాంతంలో భరతమాత చిత్రపటానికి పూల మాలలు వేసి వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఏబీవీపీ కృషి చేస్తోందన్నారు. నేతలు మహేష్, వినోద్, తులసి, దేవేందర్, రాజేష్, కాశి పాల్గొన్నారు. -
హత్య!
వారానికోపిట్లం మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన జిన్నా లక్ష్మి (50) ఈనెల 3న హత్యకు గురైంది. అప్పుగా తీసుకున్న డబ్బులు ఇవ్వాలని అడిగిన లక్ష్మిని.. ఆమె అల్లుడు కమ్మకత్తితో దాడి చేసి చంపాడు. ఈ కేసులో అల్లుడు బాలరాజును పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. ఈ ఏడాది జనవరి 19న రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన పొక్కిలి రవి (41) అనే వ్యక్తి ఇంట్లోనే హత్యకు గురయ్యాడు. భూ వివాదంలో సొంత అన్న సుఫారీ ఇచ్చి హత్య చేయించినట్టు పోలీసులు తేల్చారు. ఈ కేసులో అన్న కిష్టయ్య, అన్న కొడుకుతో పాటు మరో ముగ్గురు జైలు పాలయ్యారు. గతనెల 5న పిట్లం మండలం చిన్నకొడప్గల్ పంచాయతీ కార్యదర్శి ధరావత్ కృష్ణ (28) హత్యకు గురయ్యాడు. కేసును పరిశోధించిన పోలీసులు.. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే దారుణం జరిగిందని తేల్చారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశారు. మే 24న లింగంపేట మండలం అయ్యపల్లి తండాకు చెందిన దేవసోత్ ఫకీరా (46) హత్యకు గురయ్యాడు. కుటుంబంలో పెళ్లి విషయంలో తలెత్తిన గొడవల నేపథ్యంలో ఫకీరాను ఆయన కొడుకు ప్రకాశ్ గొడ్డలితో తలపై కొట్టడంతో చనిపోయాడు. కొన్నాళ్ల క్రితం పిట్లం మండల కేంద్రానికి చెందిన సాబేరా బేగం(60)ను ఆమె కొడుకు షాదుల్ రోకలిదుడ్డుతో తలపై కొట్టడంతో తీవ్ర గాయాలపాలై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. గతంలో షాదుల్ తన సోదరుడిని హతమార్చాడు. ఆ కేసులో ఫిర్యాదుదారైన తల్లితో కేసు రాజీ కోసం వచ్చి హతమార్చాడు. ఆర్థిక లావాదేవీలు, వివాహేతర సంబంధాలకు తోడు కుటుంబ కలహాలు హత్యలకు పురిగొల్పుతున్నాయి. ఆగ్రహాన్ని నియంత్రించుకోలేని మనిషి మృగంలా మారుతున్నాడు. మద్యం మత్తు ఆపై కోపోద్రేకంతో విచక్షణ కోల్పోయి హత్యలకు పాల్పడుతున్నాడు. జిల్లాలో వారానికో హత్య కేసు నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి● జిల్లాలో పెరుగుతున్న నేర సంస్కృతి ● మద్యం మత్తు, క్షణికావేశంతో దారుణాలు ● ఆస్తి తగాదాలు, వివాహేతర సంబంధాలతోనే ఎక్కువ నేరాలు ● ఆందోళన కలిగిస్తున్న ఘటనలు -
అసంపూర్తిగా సమీకృత మార్కెట్
ఎల్లారెడ్డి: పట్టణ ప్రాంతాలైన కార్పోరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో నిత్యావసరాలైన కూరగాయలు, మాంసం ఉత్పత్తులు, పండ్లు ఒకేచోట లభించేందుకు గత ప్రభుత్వం సమీకృత మార్కెట్ల(ఇంటిగ్రేటెడ్ మార్కెట్)ను మంజూరు చేసింది. జిల్లాలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణం కోసం కామారెడ్డికి రూ. 4 కోట్లు, ఎల్లారెడ్డి, బాన్సువాడలకు రూ. 2 కోట్ల చొప్పున మంజూరు చేశారు. ఈ పనులకు 2021–22 ఆర్థిక సంవత్సరంలో టెండర్లు పూర్తి చేశారు. 2022 లో టెండర్లు పొందిన కాంట్రాక్టర్లు అగ్రిమెంట్లు పూర్తి చేసుకుని నిర్మాణ పనులను ప్రారంభించారు. అగ్రిమెంట్లు చేసుకున్న కామారెడ్డి, బాన్సువాడ కాంట్రాక్టర్లకు టెండర్ మొత్తంలో సగభాగాన్ని అడ్వాన్స్గా ఇచ్చారు. అయితే ఎల్లారెడ్డిలో మార్కెట్ నిర్మాణం కోసం కేటాయించిన స్థలంలో డీఎస్పీ, నీటిపారుదల, ఆర్అండ్బీ కార్యాలయాలు ఉండడంతో వాటిని ఖాళీ చేయడానికి చాలా కాలం పట్టింది. 2022లో అగ్రిమెంట్ చేసుకున్నా మార్కెట్ నిర్మాణానికి కేటాయించిన స్థలంలో కార్యాలయాలను కూల్చివేసి స్థలం అప్పగించే ప్రక్రియ 2023 డిసెంబర్కు కానీ సాధ్యం కాలేదు. నిర్మాణ పనులు చేపట్టడంలో సుదీర్ఘ జాప్యం జరగడంతో ఎల్లారెడ్డి కాంట్రాక్టర్కు అడ్వాన్స్ అందలేదు. అయినా బిల్లులు వస్తాయన్న ఆశతో సొంత డబ్బులతో పనులు చేశారు. గతేడాది ఆగస్టు వరకు 80 శాతం పనులు పూర్తయ్యాయి. బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ పనులు ఆపేశారు. చేసిన పనులకు ఇప్పటివరకు నయా పైనా బిల్లు రాలేదని కాంట్రాక్టర్ వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ. 1.60 కోట్ల బిల్లులు రావాల్సి ఉందన్నారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని కోరుతున్నా పట్టించుకునేవారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు త్వరగా పూర్తి చేయించాలని ప్రజలు కోరుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాని పనులు బిల్లులు రాకపోవడంతో చేతులెత్తేసిన కాంట్రాక్టర్త్వరలో నిధులు.. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు రావాల్సిన బకాయిలను చెల్లించడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఏ మార్కెట్లో ఎంత వరకు పనులు జరగాయన్న విషయమై ప్రభుత్వం నివేదికలు సేకరిస్తోంది. త్వరలోనే నిధులు మంజూరు చేసే అవకాశాలున్నాయి. – మహేశ్కుమార్, ఎల్లారెడ్డి మున్సిపల్ కమిషనర్ -
పంటకు లేదు ‘ధీమా’!
కామారెడ్డి క్రైం: అధిక వర్షాలు, వరదలు, అకాల వర్షాలు, వడగండ్లు.. ఇలా ప్రకృతి వైపరీత్యాలతో ఏటా పంటలకు నష్టం వాటిల్లుతూనే ఉంది. దీంతో అన్నదాతలు నష్టపోతున్నారు. పంటలకు బీమా లేకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. జిల్లాలో 3.28 లక్షల మంది రైతులున్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో మొత్తం 5.24 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ప్రధాన పంటగా వరి 3 లక్షలకుపైగా ఎకరాలలో సాగు కానుంది. ఇప్పటివరకు 1.50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు వేశారు. ఇందులో 32,552 ఎకరాల్లో మక్క, 51,802 ఎకరాల్లో సోయా, 17,713 ఎకరాల్లో పత్తి, 6,965 ఎకరాల్లో కంది, దాదాపు 35 వేల ఎకరాల్లో వరి వేశారు. 2017–18 వరకు రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలులో ఉంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలును నిలిపివేసింది. దీంతో ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయిన రైతులకు బీమా అందకుండాపోయింది. 2023 డిసెంబర్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గతేడాది ఫసల్ బీమా పథకాన్ని ప్రారంభించేందుకు చర్చలు జరిపింది. బీమా కంపనీలతో సంప్రదింపుల ప్రక్రియ ముందుకు సాగలేదు. ఈసారి కూడా ఇప్పటికీ ప్రభుత్వం నుంచి పంటల బీమా విషయంలో ఎలాంటి ప్రకటన లేకపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది మార్చిలో కురిసిన అకాల వర్షాలతో జిల్లాలో 18,212 మంది రైతులకు సంబంధించిన 10,328 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం రూ. 16 కోట్ల పరిహారం విడుదల చేసింది. పంటల బీమా పథకాన్ని అమలు చేస్తే రైతులకు మరింత మేలు జరిగేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వెంటనే పంటల బీమా పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. బీమా పథకాన్ని విస్మరించిన ప్రభుత్వం అకాల వర్షాలు, వరదలతో ఏటా దెబ్బతింటున్న పంటలు నష్టపోతున్న రైతన్నలుసమాచారం లేదు.. పంట నష్టం జరిగిన ప్రతిసారి క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తున్నాం. నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తున్నాం. బీమా పథకాన్ని అమలు చేయడంపై ఇప్పటివరకై తే మాకు ఎలాంటి సమాచారం రాలేదు. దానిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుంది. – తిరుమల ప్రసాద్, డీఏవో, కామారెడ్డి -
జై అమర్నాథ్..
అమర్నాథ్ యాత్రలో ఇందూరు జిల్లా బృందంసాక్షి ప్రతినిధి, నిజామాబాద్: భూతల స్వర్గంగా పేరుపొందిన కళ్మీర్లోని పహల్గామ్లో మన పర్యాటకులపై దాయాది దేశం ఉగ్రమూకలు దాడికి పాల్పడితే భారత ప్రభుత్వం, సైన్యం స్పందించిన తీరుపై యావత్ దేశం గర్వంతో ఉప్పొంగింది. భారత ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మద్దతుగా నిలిచారు. పహల్గామ్ మారణహోమం తమను ఏమాత్రం భయపెట్టలేదని ప్రపంచానికి చాటిచెబుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు తరువాత పర్యాటక రంగ అభివృద్ధితో ఆర్థికంగా స్వావలంబన సాధిస్తున్న కశ్మీర్లో ఆధ్యాత్మిక, సాధారణ పర్యాటకానికి దన్నుగా నిలబడుతున్నారు. ఇందూరు జిల్లా వాసులు సైతం కశ్మీర్ పర్యటకు వెళ్తున్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా నుంచి అమర్నాథ్ యాత్ర, కశ్మీర్ యాత్ర కోసం ఇప్పటి వరకు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి నుంచి 124 మంది మెడికల్ సర్టిఫికెట్లు తీసుకున్నారు. ఇంకా మరికొందరు ఈ సర్టిఫికెట్లు తీసుకునే పనిలో ఉన్నారు. జిల్లా నుంచి పలువురు బృందాలుగా వెళుతున్నారు. మరోవైపు సిద్ధిపేటకు చెందిన అమర్నాథ్ సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో యాత్ర మార్గంలో అన్నదానం చేస్తున్నారు. ఈ అమర్నాథ్ సేవాసమితిలో నిజామాబాద్ జిల్లా వాసులు సభ్యులుగా ఉన్నారు. సైన్యం మీద అపారమైన నమ్మకంతో కశ్మీర్ యాత్రకు జిల్లా వాసులు మంచులింగాన్ని దర్శించుకున్న యాత్రికులు పహల్గామ్ ఘటనతో బెదిరేది లేదంటున్న శివయ్య భక్తులు -
మంత్రి ఆదేశాలను అమలు చేయాలి
కామారెడ్డి టౌన్: జుక్కల్లో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇచ్చిన ఆదేశాల అమలుపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ఆయా అంశాలను పక్షం రోజుల్లో కార్యాచరణలోకి తీసుకురావాలన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం జిల్లాలో అదనంగా అవసరమైన సబ్ స్టేషన్ల మంజూరు కోసం ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాలని ఎస్ఈ శ్రావణ్కుమార్ను ఆదేశించారు. జుక్కల్ నియోజకవర్గంలో ఎక్కడ తాగునీటి సమస్య రాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈకి సూచించారు. జుక్కల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను వంద పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేసేందుకు, ట్రామాకేర్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డీసీహెచ్ఎస్ విజయలక్ష్మిని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అటవీ భూములలో 159 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఆర్వోఎఫ్ఆర్ చట్టాల ప్రకారం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్నాయక్కు సూచించారు. పెద్దకొడప్గల్, పిట్లం మండలాలలో అధికారులు జొన్న పంట వివరాలను వాస్తవానికి విరుద్ధంగా నమోదు చేశారని, తద్వారా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతాయని ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. దీనిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీఏవో తిరుమల ప్రసాద్ను ఆదేశించారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి నిఖిత, రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, డీఎంహెచ్వో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.పాఠశాల తనిఖీకామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు యూనిఫాంలు పంపిణి చేశారు. పాఠశాలలోని ప్రతి విద్యార్థి అమ్మ పేరు మీద ఒక మొక్కను నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో రాజు, మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సబ్స్టేషన్లు, ట్రామాకేర్ సెంటర్ కోసం ప్రతిపాదనలు పంపండి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
వైద్య కళాశాల ప్రిన్సిపల్గా వాల్యా
కామారెడ్డి టౌన్: కామారెడ్డి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్గా బి.వాల్యా నియమితులయ్యారు. ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) సూపరింటెండెంట్గా పెరుగు వెంకటేశ్వర్లును నియమించారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్(డీఎంఈ), రాష్ట్ర హెల్త్ సెక్రెటరీ క్రిస్టీనా జెడ్ చోంగ్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ వాల్యా గాంధీ మెడికల్ కళాశాలలో ఆర్థోపెడిక్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. డాక్టర్ వెంకటేశ్వర్లు మహేశ్వరం మెడికల్ కళాశాలలో జనరల్ సర్జన్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. వారికి ప్రభుత్వం ప్రమోషన్ కల్పించి, కామారెడ్డికి బదిలీ చేసింది. ఇప్పటి వరకు కళాశాల ప్రిన్సిపల్గా డాక్టర్ శివప్రసాద్, జీజీహెచ్ సూపరింటెండెంట్గా ఫరీదా ఇన్చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రారంభం నుంచి ఇన్చార్జీల పాలనే.. కామారెడ్డి మెడికల్ కళాశాల, జీజీహెచ్లు ప్రారంభం అయిన నాటి నుంచి ఇన్చార్జీల పాలనే కొనసాగింది. జీజీహెచ్ ఇన్చార్జీల పాలనలో నిధుల దుర్వినియోగం ఆరోపణలు వచ్చాయి. వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సమయపాలన పాటించడం లేదన్న ఆరోపణలున్నాయి. పూర్తి స్థాయి ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ వస్తుండడంతో వైద్యశాల, జీజీహెచ్లలో సమస్యలు పరిష్కారం అవుతాయని, పాలన గాడిలో పడుతుందని భావిస్తున్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్గా వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం -
బలగాలు గైడ్ చేస్తున్నాయి
అమర్నాథ్ యాత్రలో భారత సైనికులు చక్కగా గైడ్ చేస్తున్నారు. మర్యాద పూర్వకంగా, స్నేహ పూర్వకంగా వ్యవహరిస్తున్నారు. ఇబ్బందులేమైనా ఉంటే అడుగుతున్నారు. కశ్మీర్లో చాలా చోట్ల రోడ్లు, వంతెనల నిర్మాణాలు తుది దశకు వచ్చాయి. టన్నెల్స్ సైతం ప్రారంభమయ్యాయి. తెలుగు వారు చాలామంది ఉన్నారు. మేము పదిమంది బృందంగా నిజామాబాద్ నుంచి వెళ్లాం. శ్రీనగర్లో దాల్ సరస్సు చాలా బాగుంది. వంతెనలు, రోడ్లు పూర్తి అయితే మరింత తక్కువ సమయంలో యాత్ర పూర్తి చేయొచ్చు. – వడ్డి జనార్దన్ రెడ్డి, వరలక్ష్మి, నవీపేట -
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
కామారెడ్డి టౌన్: పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి పేర్కొన్నారు. మురికి కాలువల ఆక్రమణలను సీరియస్గా తీసుకుంటామన్నారు. పట్టణంలో పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నామని, వర్షాకాలంలో పట్టణవాసులు ఇబ్బందులకు గురికాకుండా రోడ్లపై గుంతల మరమ్మతులకు నిధులు కేటాయించామని పేర్కొన్నారు. కామారెడ్డి బల్దియా పరిధిలోని సమస్యలపై ‘సాక్షి’ వరుసగా కథనాలను ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ‘సాక్షి’ మున్సిపల్ కమిషనర్ను ఇంటర్వ్యూ చేసింది. పట్టణంలోని ప్రధాన సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చిన ‘సాక్షి’కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంటర్వ్యూ వివరాలు.. రోడ్ల మరమ్మతులకు నిధులు.. పట్టణంలోని ప్రధాన రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు కలెక్టర్ అనుమతితో రూ. 10 లక్షలు కేటాయిస్తున్నాం. ప నులను రెండు రోజు ల్లో ప్రారంభిస్తాం. అ శోక్నగర్ ప్రధాన రో డ్డు నిర్మాణానికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తాం. వీధి దీపాల కోసం.. వీధి దీపాల నిర్వహణ కాంట్రాక్టర్ నుంచి సమస్య ఉంది. కాంట్రాక్టర్కు రూ. 4 కోట్ల బకాయిలుంటే ఇటీవల రూ. కోటి చెల్లించాం. వీధి దీపాల కొనుగోలుకు అత్యవసరంగా రూ. 10 లక్షలను కలెక్టర్ ఆదేశాలతో కేటాయించాం. అత్యవసరం అయిన చోట ముందుగా లైట్లను బిగిస్తాం. విద్యుత్ బిల్లులు నెలకు రూ. 40 లక్షలు వస్తుండడంతో బల్దియాకు ఆర్థిక భారమవుతోంది. నీటి సమస్య లేకుండా చూస్తున్నాం పట్టణంలో వేసవి సీజన్లో ప్రణాళికబద్ధంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి సమస్యను అధిగమించాం. ప్రస్తుతం నీటి సమస్య రెండు మూడు కాలనీలలో మాత్రమే ఉంది. అమృత్జల్ పథకంలో రూ. 93 కోట్లతో చేపట్టిన పనులు పూర్తయితే సమస్య తీరనుంది.2 లక్షల మొక్కలు నాటుతాంవన మహోత్సవంలో భాగంగా పట్టణంలో 2 లక్షల మొక్కలను నాటాలన్నది లక్ష్యం. ప్రతి ఇంటికి మొక్కలను సరఫరా చేస్తాం. మున్సిపల్ ఖాళీ స్థలాలు, ప్రకృతి వనాలు, రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటుతాం. సీజనల్ వ్యాధుల నివారణ కోసం మురికి కాలువలు, గుంతల్లో ఆయిల్ బాల్స్ వేయిస్తాం. వార్డులలో ఫాగింగ్ చేస్తున్నాం. ప్రైవేట్ ఓపెన్ స్థలాల శుభ్రత కోసం యజమానులకు నోటీసులను జారీ చేస్తాం. మున్సిపల్ ఓపెన్ స్థలాల పరిరక్షణ కోసం ఎల్ఆర్ఎస్ నిధులు నుంచి హెచ్చరిక బోర్డులు, కంచెలను ఏర్పాటు చేస్తాం.ఆక్రమణలను తొలగిస్తాం..పట్టణంలో మురికి కాలువలపై స్లాబ్ వేయడం, ఆక్రమణలు చేయడాన్ని సీరియస్గా తీసుకున్నాం. ‘సాక్షి’లో కథనం వచ్చిన మరుసటి రోజే టౌన్ప్లానింగ్ అధికారులతో దీనిపై సమీక్షించా. కాలువలపై స్లాబ్లను కూల్చివేయడానికి నూతన బ్రేకర్ను కొనుగోలు చేసాం. కార్మికుడు శుభ్రం చేయకుండా వీలులేకుండా ఉన్న మురికి కాలువలపై ఆక్రమణలను తొలగిస్తాం. వ్యాపారులు, ఇంటి యజమానులు ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకుని సహకరించాలి.సానిటేషన్ పనులను పర్యవేక్షిస్తున్నాం..పట్టణంలో జనాభా నిష్పత్తి కంటే పారిశుద్ధ్య కార్మికులు ఎక్కువగానే ఉన్నారు. నిత్యం కొందరు గైర్హాజరవుతుండడంతో సమస్య ఏర్పడుతోంది. అయినా అన్ని వార్డులో పారిశుద్ధ్య సమస్యలు రాకుండా పనులు చేయిస్తున్నాం. అక్కడక్కడ పక్కా డ్రెయినేజీలు లేకపోవడంతో కాస్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి. త్వరలో టెండర్లు నిర్వహించి మురికి కాలువలు, రోడ్ల నిర్మాణాలు చేపడతాం. ఇంటింటా చెత్త సేకరణ చేసే ఆటోలు, చెత్తను డంపింగ్ చేసే ఆటోల మరమ్మతులు, సర్వీసింగ్ కోసం డీఆర్సీ వద్ద ప్రత్యేక షెడ్డు వేశాం. చెడిపోయిన తక్షణమే వాహనాలకు మరమ్మతులు చేయిస్తాం. డంపింగ్ యార్డు వద్ద వర్మికంపోస్టు పనులు ప్రారంభం కాగానే తడి–పొడి చెత్త వేర్వేరుగా సేకరిస్తాం. వార్డుల్లో సానిటేషన్ సమస్యలుంటే నేరుగా నాకు ఫోన్ చేసినా స్పందిస్తా. భారీ కాలువలలోంచి పూడిక తీసేందుకు రూ. 5 లక్షలు కేటాయించాం. వంద రోజుల ప్రత్యేక కార్యక్రమంలో ఈ పనులను పూర్తి చేస్తాం.నోటీసులిస్తాం పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నాం రోడ్లపై గుంతల మరమ్మతులకు నిధులు కేటాయించాం డ్రెయినేజీలపై ఆక్రమణలను సీరియస్గా తీసుకుంటాం పట్టణ సమస్యలను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’కి ధన్యవాదాలు ‘సాక్షి ’ ఇంటర్వ్యూలో కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డిసెల్లార్లను వాహనాల పార్కింగ్కు వినియోగించుకోవాలి. వాటిలో దుకాణాలను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. పట్టణంలో వాహనాల పార్కింగ్ సమస్యను అధిగమించాలంటే యజమానులూ సహకరించాలి. నిజాంసాగర్ చౌరస్తాలో జంక్షన్ విస్తరణ ఆటంకాల సమస్య కొలిక్కి వచ్చింది. త్వరలో పనులు చేపడుతాం. -
అమర్నాథ్ యాత్రను ఎప్పటికీ మరిచిపోలేము
అమర్నాథ్ యాత్రలో భాగంగా కశ్మీర్లో వైష్ణోదేవి ఆలయాన్ని కూడా దర్శించుకున్నాం. పహల్గామ్ దాడి తరువాత భారత ప్రజలు భయపడకుండా అమర్నాథ్ యాత్రకు తరలివస్తున్నారు. భారత ప్రభుత్వం, భారత సైన్యం మీద ఉన్న అపార విశ్వాసానికి ఇది నిదర్శనం. యాత్ర కోసం భారత ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు, కల్పించిన భద్రత అత్యద్భుతంగా ఉన్నాయి. అమర్నాథ్ యాత్ర పొడవునా సైన్యం అడుగడుగునా పహారా కాస్తోంది. దీంతో ఏమాత్రం భయం లేకుండా ప్రశాంతంగా యాత్ర చేయొచ్చు. భయం అనేదే లేకుండా యాత్ర చేమొచ్చు. కశ్మీర్ అందాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రకృతి అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రకృతి కూడా ప్రస్తుతం పూర్తి అనుకూలంగా ఉంది. జూలై, ఆగస్టులో సందర్శిస్తే అద్భుతంగా ఉంటుంది. అమర్నాఽథ్ యాత్రలో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు ఉచితంగా అందిస్తున్నారు. దక్షిణ భారత, తెలుగు లంగర్లు చాలా ఉన్నాయి. – కరుటూరి పాపారావు, వెంకట సుబ్బలక్ష్మి, జైతాపూర్ -
బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యాలను పూర్తి చేయాలి
కామారెడ్డి అర్బన్: మహిళా సంఘాలకు సంబంధించిన బ్యాంకు లింకేజీ రుణాల లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. మంగళవారం కామారెడ్డిలో నిర్వహించిన మండల ఇందిర మహిళా శక్తి ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హతగల మహిళలందరిని మహిళా సంఘాల్లో సభ్యులుగా చేర్పించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ చందర్, డీఆర్డీవో సురేందర్, డీఏవో తిరుమల ప్రసాద్, డీపీఏం(ఫైన్సాన్స్) రాజయ్య, ఎంపీడీవో ఎఫ్సిబా, ఏపీఎం మోహిజ్, సీసీలు విశ్వనాథం, అంజగౌడ్, స్వరూప, సంజీవులు తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ ఫలితాలపై ప్రత్యేక దృష్టి
కామారెడ్డి టౌన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. లెక్చరర్ల కొరత లేకుండా చూశామని, అడ్మిషన్లపైనా దృష్టి సారించామని పేర్కొన్నారు. ఇంటర్ ప్రవేశాల గడువు ఈనెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రవేశాలపెంపు, ఫలితాల మెరుగుదలకు తీసుకుంటున్న చర్యలపై ‘సాక్షి’ ఆయనను ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలు.. 6 వేల అడ్మిషన్లు లక్ష్యం.. ఈ విద్యాసంవత్సరంలో 6 వేల అడ్మిషన్ల లక్ష్యంతో సాగుతున్నాం. ఇందుకోసం లెక్చరర్లు ప్రచారం నిర్వహిస్తున్నారు. గత విద్యాసంవత్సరంలో ఎస్సెస్సీ పూర్తి చేసిన ప్రతి విద్యార్థిని కలిశారు. దీంతో ఇప్పటికే జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 50 శాతం ప్రవేశాలు జరిగాయి. మిగిలిన లక్ష్యాన్ని త్వరలోనే పూర్తి చేస్తాం. ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత చదువుతో పాటు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. అర్హులైన, అనుభవజ్జులైన అధ్యాపకులున్నారు. అర్హులకు స్కాలర్షిప్ కూడా వస్తుంది. ప్రవేశాలకు ఈనెల 31 వరకు గడువుంది. విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లోనే చేరాలి. లెక్చరర్ల కొరత లేదు.. జిల్లాలో 242 మంది రెగ్యులర్ లెక్చరర్లతో పాటు 58 మంది గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు. విద్యార్థులకు సరిపడా పాఠ్యపుస్తకాలు ఇప్పటికే అన్ని కళాశాలలకు చేరాయి. మధ్యాహ్న భోజనం పథకం గురించి ఇంకా ప్రభుత్వంనుంచి ఎలాంటి ఆదేశాలు రాలేవు. ● ప్రభుత్వం సర్కారు కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, అవసరమైన మరమ్మతులు, భవనాల నిర్మాణం కోసం రూ. 3.28 కోట్లు మంజూరు చేసింది. ఆయా పనులను త్వరలో ప్రారంభిస్తాం. ఈ నిధులలో కళాశాలు అభివృద్ధి కానున్నాయి. అలాగే విద్యార్థులకు క్రీడల కోసం ప్రతి కళాశాలకు రూ. 10 వేల చొప్పున నిధులు వచ్చాయి.ఫీజుల విషయంలో..ప్రణాళికబద్ధంగా..గత విద్యాసంవత్సరంలో ఇంటర్ ఫలితాలు నిరాశకు గురి చేశాయి. ఈ నేపథ్యంలో ఈసారి మంచి ఫలితాలను సాధించేందుకు ప్రణాళికబద్ధంగా సాగుతున్నాం. ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు సేకరిస్తున్నాం. తరచూ వారితో సమావేశాలు నిర్వహించి, ప్రగతిని తెలుసుకుంటాం. అలాగే పది మంది విద్యార్థుల బాధ్యతను ఒక లెక్చరర్కు అప్పగించి వారిపై దృష్టిపెడతాం. ప్రతినెల ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి, మార్కులు తక్కువ వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తాం. ఈసారి విద్యార్థులకు ఏప్సెట్, జేఈఈ, ఐఐటీ కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్ల పెంపునకు కృషి రూ. 3.28 కోట్లతో కళాశాలల అభివృద్ధికి చర్యలు ‘సాక్షి’ ఇంటర్వ్యూలో జిల్లా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాంప్రైవేట్ కళాశాలల్లో ట్యూషన్ ఫీజు రూపేణ ప్రథమ సంవత్సరానికి రూ. 1,760, ద్వితీయ సంవత్సరానికి రూ. 1,940 ఫీజు మాత్రమే వసూలు చేయాలి. వసతి, ఇతర సదుపాయాలు, ఆయా శిక్షణల కోసం కాలేజ్ డెవలప్మెంట్ కమిటీ తీర్మానం మేరకు ఫీజులు వసూలు చేస్తే ఆ అంశం మా పరిధిలోకి రాదు. అనుమతులు ఒకచోట తీసుకుని, మరోచోట తరగతులు, కోచింగ్లు నిర్వహిస్తున్నట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ఈసారి జిల్లాలోని 20 కళాశాలల్లో అన్ని తరగతి గదుల్లో సీసీ కెమరాలను ఏర్పాటు చేశాం. వాటి సాయంతో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులే తరగతులను మానిటరింగ్ చేస్తారు. జిల్లా కేంద్రం నుంచి నేను కూడా పర్యవేక్షిస్తా. -
జుక్కల్ అభివృద్ధి.. నా బాధ్యత
నిజాంసాగర్/బిచ్కుంద: వెనకబడిన ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను తాను తీసుకుంటున్నానని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క సహకారంతో రెండుమూడేళ్లలో నియోజకవర్గ రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. సోమవారం ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. నిజాంసాగర్ మండలం నర్సింగ్రావ్పల్లి చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. జుక్కల్ మండలం కేంరాజ్ కల్లాలి వద్ద నాందేడ్ – సంగారెడ్డి జాతీయ రహదారి పక్కన మంత్రి మొక్కలు నాటి వన మహోత్సవానికి శ్రీకారం చుట్టారు. పిట్లం, బిచ్కుంద మండలాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొన్నారు. బిచ్కుంద – డోంగ్లీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం బిచ్కుందలోని బండాయప్ప ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పదేళ్ల పాటు అధికారం అనుభవించిన ఈ ప్రాంత మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రస్తుత ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఉత్సాహంగా పనిచేస్తున్నారన్నారు. బిచ్కుంద –కుర్లా వరకు రోడ్డు నిర్మాణానికి రూ. 13.2 కోట్లు మంజూరు చేశామన్నారు. శాంతాపూర్ నుంచి దడ్గి వరకు రోడ్డుకు రూ. 20 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. మేనూర్ నుంచి డోంగ్లీ వరకు రోడ్డుకు రూ. 7.5 కోట్లు, అన్నాసాగర్ నుంచి జుక్కల్ రోడ్డుకు రూ. 10 కోట్లు, జుక్కల్ నుంచి మద్నూర్ వరకు రూ. 10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. బిచ్కుంద, పిట్లం, జుక్కల్, డోంగ్లీ మండలాల్లో 6 విద్యుత్ సబ్స్టేషన్లను మంజూరు చేయిస్తానన్నారు. బిచ్కుంద, పిట్లం మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయిస్తానన్నారు. త్వరలోనే జుక్కల్కు ముఖ్యమంత్రిని తీసుకువస్తానన్నారు. హైలెవల్ బ్రిడ్జి ప్రారంభంపిట్లం: తిమ్మనగర్ శివారులోని నల్లవాగుపై రూ. 4.86 కోట్లతో నిర్మించిన హై లెవల్ బ్రిడ్జిని సోమవారం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రారంభించారు. పిట్లం మండలానికి విచ్చేసిన మంత్రికి అధికారులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంత్రి స్థానిక నాయకులతో మాట్లాడారు.గత ప్రభుత్వం అన్యాయం చేసింది..గత ప్రభుత్వం జుక్కల్ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా అన్యాయం చేసిందని జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఆరోపించారు. నియోజకవర్గానికి అవసరమైన రోడ్లు, ప్రాజెక్టులు, సబ్స్టేషన్లు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. లెండి ప్రాజెక్టుతోపాటు నాగమడుగు ఎత్తిపోతల పథకాలకు నిధులు కేటాయించి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో నారాయణ్ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్రెడ్డి, సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్రెడ్డి, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్ చంద్ర, సబ్ కలెక్టర్ కిరణ్మయి, జాయింట్ కలెక్టర్ విక్టర్, డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్రావు, కాంగ్రెస్ నాయకులు విఠల్రెడ్డి, మనోజ్ పటేల్, మల్లికార్జున్, భాస్కర్రెడ్డి, రవీందర్రెడ్డి, రమేశ్ దేశాయ్, మల్లికార్జునప్ప షెట్కార్, వెంకట్రెడ్డి, నాగ్నాథ్ పటేల్, నాగ్నాథ్, షేక్ అజీం లాలా, గంగాధర్, రవి పటేల్, సాహిల్ షెట్కార్ తదితరులు పాల్గొన్నారు. రెండుమూడేళ్లలో రూపురేఖలు మారుస్తా ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం -
‘ఆత్మ’కు ఏమయ్యింది!?
ఎల్లారెడ్డి: వ్యవసాయ రంగంలో సమగ్రాభివృద్ధి సాధించేందుకు, రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి చైతన్యవంతులను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ(ఆత్మ) పథకం నిర్వీర్యమవుతోంది. నిధులు లేకపోవడంతో ఆత్మ కార్యక్రమాలు ఎక్కడా కనిపించడం లేదు. పథకం ఇలా.. ఈ పథకం అమలు కోసం ఏడీఏ పరిధిని ఒక బ్లాక్గా నిర్ణయించారు. ప్రతి బ్లాక్కు ఒక చైర్మన్ ఉండేవారు. జిల్లా కమిటీలో జిల్లా చైర్మన్ను అనుసంధానంగా డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉండగా, బ్లాక్ చైర్మన్కు అనుసంధానంగా ఏడీఏ ఉన్నారు. ఏడీఏ పరిధిలోని రైతులకు పలు అంశాలలో అవగాహన కల్పించేందుకు బ్లాక్ లెవల్ ఫార్మర్స్ అడ్వయిజరీ కమిటీలను ఏర్పాటు చేసేవారు. రైతులకు ఆధునిక వ్యవసాయ పరిజ్ఞానాన్ని కల్పించేందుకు క్షేత్ర స్థాయి ప్రదర్శనలు, సదస్సులు, పొలం బడులు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తున్న రైతుల వ్యవసాయ క్షేత్రాల వద్దకు పర్యటనలు నిర్వహించేవారు. ఈ కార్యక్రమాల వల్ల తెలుసుకున్న అంశాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడేవి. ఈ పథకంకోసం కేంద్ర ప్రభుత్వం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం వాటా నిధులను కేటాయించేవి. అయితే దశాబ్ద కాలంగా నిధులు మంజూరు కాకపోవడంతో రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. మూస పద్ధతుల్లోనే సాగు.. అన్నదాతలకు ఉపయోగపడని పథకం నిధులు కేటాయించి మనుగడలోకి తేవాలని కోరుతున్న రైతులుజిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 5 లక్షలకు పైచిలుకు ఎకరాలలో పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో మూడు లక్షలకుపైగా ఎకరాలలో వరి పంటే సాగవనుంది. అది కూడా మూస పద్ధతుల్లోనే.. చాలావరకు రైతులకు అవగాహనలేక ఆధునిక సాగు పద్ధతులు అవలంబించడం లేదు. ఆత్మ పథకం క్రియాశీలకంగా అమలై ఉండి ఉంటే రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన ఏర్పడే అవకాశాలుండేవి. పాడి, కోళ్ల, గొర్రెల పెంపకంపైనా అవగాహన పెరిగేది. దీంతో వ్యవసాయం లాభదాయకంగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వాలు స్పందించి ఆత్మలాంటి కార్యక్రమాలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు.ప్రభుత్వానికి నివేదించాం.. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించే ఆత్మ పథకం నిధులు లేక ఉపయోగపడడం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. త్వరలో ఈ పథకాన్ని పునర్ వ్యవస్థీకరించనున్నారు. – తిరుమల ప్రసాద్, డీఏవో -
జిల్లా సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు
నిజాంసాగర్: జిల్లా సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. సోమవారం జుక్కల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ లైన్ సమస్యలు, సాగు నీటి ప్రాజెక్టులు, వైద్య ఆరోగ్య సేవలు, వ్యవసాయం, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, మిషన్ భగీరథ, అటవీ భూముల ఆక్రమణ, మహిళా సంఘాలకు రుణాలు వంటి అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా అదనపు సబ్స్టేషన్లు నిర్మించాలన్నారు. నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ కాల్వల నిర్మాణ పనులు, అవసరమైన భూ సేకరణ పనుల పరిపాలన అనుమతులు మంజూరు చేయాలన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలపై నివేదిక అందించాలని ఆదేశించారు. పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి అవసరమైన ప్రతిపాదనలను ఈనెల 9 నాటికి అందిస్తే తదుపరి క్యాబినెట్ సమావేశంలో ఆమోదించేలా చూస్తానన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో వంద పడకల ఆస్పత్రి, ట్రామా కేర్సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డీఎంఎఫ్టీ నిధులను ఆస్పత్రిలో అవసరమైన వైద్య పరికరాల కొనుగోలు, పాఠశాలలో మౌలిక వస్తువుల కల్పనకు వినియోగించాలని కలెక్టర్కు సూచించారు. వంద పడకల ఆస్పత్రికి ప్రతిపాదనలు పంపండి సమీక్ష సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
‘జర్నలిస్టు కుటుంబానికి అండగా ఉంటాం’
పిట్లం(జుక్కల్): జర్నలిస్ట్ జీడిపల్లి దత్తురెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి హామీ ఇచ్చారు. మద్దెలచెర్వు గ్రామానికి చెందిన దత్తురెడ్డి(37) ఇటీవల గుండెపోటుతో మరణించారు. సోమవారం మద్దెలచెర్వు గ్రామానికి మంత్రి కోమటిరెడ్డి వెళ్లి దత్తురెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నల్లగొండలో సుధీర్ఘకాలం పని చేసిన దత్తురెడ్డి జిల్లా అభివృద్ధికి తన కథనాల ద్వారా ఎంతో సహకారం అందించారని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా దత్తురెడ్డి భార్య ప్రియాంకకు ఔట్ సోర్సింగ్ ద్వారా ఇద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు రూ.4 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్యేలు లక్ష్మీకాంతారావు, పట్లోళ్ల సంజీవరెడ్డి తదితరులు ఉన్నారు. అలాగే దత్తురెడ్డి కుటుంబ సభ్యులను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. రూ. 3 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. -
ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి
కామారెడ్డి క్రైం: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను, ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 107 ఫిర్యాదులు వచ్చాయి. భూ సమస్యలు, పోడు పట్టాలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరులకు సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు సమస్యలను పరిష్కరించడం గానీ, పరిష్కార మార్గాలు చూపడం గానీ చేయాలన్నారు. ఆర్డీవో వీణ, కలెక్టరేట్ పాలనాధికారి మసూర్ అహ్మద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.వీధి దీపాలను ఏర్పాటు చేయండి భిక్కనూరు: మండలం కేంద్రంలోని కుమ్మర్గల్లీ ప్రాంతంలో వీధి దీపాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆర్టీఐ జిల్లా ప్రతినిది గంగళ్ల రవీందర్ సోమవారం భిక్కనూరు తహసీల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ సునీతకు వినతిపత్రం అందించారు. వీధి దీపాల విషయమై జీపీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మురికి నీటితో అవస్థలు ఇళ్ల మధ్య మురికి నీరు నిల్వ ఉండటంతో అవస్థలు పడుతున్నామని గాంధారిలోని 2వ వార్డు ప్రజలు తెలిపారు. సోమవారం వారు కలెక్టరేట్కు విచ్చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాలనీ చివర్లో మురికి కాలువ నిండిపోయి ప్రవాహం నిలిచిపోయిందన్నా రు. దీంతో కాలనీలోని ఖాళీ స్థలాల్లోకి మురికి కాలువల నీరు చేరుతుందని తెలిపారు. గ్రామ పంచాయితీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజావాణిలో విన్నవించారు. పోడు పట్టాలకు రుణాలు ఇవ్వాలి పోడు పట్టాలకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో పోడు సాగుదారులు సోమవారం కలెక్టరేట్కు తరలివచ్చారు. సీపీఎం జిల్లా నాయకులు మోతీరాం, వెంకట్ రెడ్డిలు మాట్లాడుతూ.. జిల్లాలో 12 వేల మంది పోడు సాగుదారులు ఉన్నారని తెలిపారు. జిల్లాలోని బ్యాంకర్లు పోడు పట్టాలకు రుణాలు ఇవ్వడం లేదన్నారు. పోడు రైతులు తమ పంట పెట్టుబడుల కోసం ప్రైవేటుగా అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. ఇతర జిల్లాలలో పోడు పట్టాలకు ఇచ్చిన మాదిరిగానే మన జిల్లాలో కూడా రుణాలు ఇప్పించాలని ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. అంతే కాకుండా గాంధారి మండలం మాతు సంగెం గ్రామంలోని కొందరు పెద్ద మనుషులు రైతులను బెదిరించి ఆ భూమి నుంచి వెళ్లగొడుతున్నారని ఆరోపించారు. సమస్యను పరిష్కరించి రైతులకు పట్టాలు ఇప్పించాలని ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్ ప్రజావాణికి 107 వినతులు -
● నాట్లేసి నిరసన
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని అశోక్నగర్ కాలనీ ప్రధాన రోడ్డు అధ్వానంగా మారింది. రోడ్డు దెబ్బతినడంతో పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో నూతన రోడ్డు వేయాలని, కనీసం మరమ్మతులైనా చేయాలని కాలనీవాసులు కోరుతున్నా అధికారులనుంచి స్పందన లేదు. ఈ నేపథ్యంలో సోమవారం కాలనీవాసులు రోడ్డుపైన ఏర్పడివన గుంతల్లో వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోడ్డు దెబ్బతిని ఏడాదిన్నర గడిచినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. గుంతల దారిలో ప్రయాణించడం కష్టంగా ఉందన్నారు. రోడ్డు సమస్యపై మున్సిపల్ అధికారులతోపాటు కలెక్టర్కు విన్నవించినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. రోడ్డు వేసి, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ అర్కల ప్రభాకర్ యాదవ్, కాలనీవాసులు జగదీష్ యాదవ్, శ్రీనివాస్, గంగారాం యాదవ్, దినే ష్రెడ్డి, నరేందర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఫీజు బకాయిలు విడుదల చేయాలని ధర్నా
కామారెడ్డి టౌన్: ఫీజు బకాయిలు విడుదల చేయాలని కోరుతూ జిల్లా కేంద్రంలో ని కలెక్టరేట్ ముందు పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహాయ కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో పేద, మద్యతర గతి విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. విద్యార్థులు కలెక్టరేట్లోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పలువురిని అనుమతి ఇవ్వడంతో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. నాయకులు రాందాస్, సాయికుమార్, శ్రీకాంత్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు. 9న ఓరియంటేషన్ ప్రోగ్రాం కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 9న ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్టు ప్రిన్సిపల్ కే.విజయ్కుమార్ తెలిపారు. డిగ్రీలో చేరిన కొత్త విద్యార్థులందరు తప్పనిసరిగా కార్యక్రమానికి హాజరైతే కళాశాల, అధ్యాపకులు, బోధన పద్ధతులు, పరీక్షలు పాటు అనేక ముఖ్య విషయాలు అర్థమవుతాయని ఆయన పేర్కొన్నారు. -
రుద్రూర్కు ఆ పేరు ఎలా వచ్చిందంటే..
రుద్రూర్: కాకతీయుల కాలంలో రాణీ రుద్రమదేవి వంశీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించినందున గ్రామానికి రుద్రూర్గా పేరు వచ్చింది. ● రాణీ రుద్రమదేవికి సంబంధించిన సైనిక స్థావరం రుద్రూర్లో ఉండేదని గ్రామపెద్దలు చెబుతున్నారు. ● గ్రామానికి మూడు వైపుల బురుజులు (గడి)లు, ఒక వైపు చెరువు ఉంది. కాల క్రమేణ రెండు అంతరించిపోగా రాతితో నిర్మించిన ప్రధాన ద్వారం చెక్కు చెదరకుండా ఉంది. ● గ్రామం మధ్యలో రాతితో కట్టిన పెద్ద పురాతన కోట (బురుజు) ఉంది. ఇందులో కాకతీయుల సైనిక స్థావరం ఉండేది. ఇక్కడి నుంచి సొరంగ మార్గం (బావి) రుద్రూర్ వ్యవసాయ పరిశోధన కేంద్రం వరకు ఉన్నట్టు గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ● కాకతీయుల కాలంలో రాతితో నిర్మించిన రాజరాజేశ్వర ఆలయం ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది. మీకు తెలుసా? -
పురుగుల అన్నం మాకొద్దు
ఎల్లారెడ్డి: అన్నంలో పురుగులు వస్తున్నాయని, ఎలా తినాలంటూ ఎల్లారెడ్డి గిరిజన బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈసందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ.. పాఠశాలలో మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని అన్నంలో, జావాలో, శనగలలో పురుగులు వస్తున్నాయన్నారు. ఇంటర్ విద్యార్థులకు బాటనీ లెక్చరర్ లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ప్రేమ్కుమార్ ఘటన స్థలానికి చేరుకుని విద్యార్థినులతో మాట్లాడారు. వారిని సముదాయించి, పాఠశాలకు తీసుకువెళ్లారు. విషయం కలెక్టర్కు తెలియడంతో వెంటనే అడిషనల్ కలెక్టర్ విక్టర్ను విచారణకు పంపారు. ఆయన విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని బంజారా సంఘం నాయకులు అడిషనల్ కలెక్టర్కు విన్నవించారు. ఆర్సీవో గంగారం, ఎంఈవో రాజులు, మున్సిపల్ కమీషనర్ మహేష్కుమార్ తదితరులున్నారు. దాడి ఘటనలో ఇద్దరి అరెస్టు భిక్కనూరు: మండలంలోని ఇసన్నపల్లి గ్రామంలో ఇటీవల భూతగాదాల కారణంగా వడ్ల పెద్ద అంజయ్యపై దాడిచేసిన ఇద్దరిని అరెస్టుచేసి రిమాండ్కు పంపినట్లు భిక్కనూరు ఎస్సై అంజనేయులు సోమవారం తెలిపారు. అంజయ్యపై దాడి చేసి గాయపరిచిన వడ్ల స్వామితోపాటు ఆయన కుమారుడైన వడ్ల సత్యంను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్సై వివరించారు. ● మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలి ● గిరిజన గురుకుల విద్యార్థినుల డిమాండ్ ● ఎల్లారెడ్డి రహదారిపై రాస్తారోకో -
అసంపూర్తిగా అండర్బ్రిడ్జి నిర్మాణం
● బ్రిడ్జిలోకి చేరుతున్న మురికి నీరు ● ఇబ్బంది పడుతున్న వాహనదారులు ● నిర్మాణ పనులు త్వరితగతిన చేపట్టాలని స్థానికుల వినతిరాజంపేట: మండలంలోని తలమడ్ల గ్రామ పరిధిలోని రైల్వే అండర్ బ్రిడ్జి పనులు అసంపూర్తిగా ఉండటంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించి సుమారు రెండున్నర సంత్సరాలు కావస్తున్నా పనులు నత్తనడకనే కొనసాగుతున్నాయి. అండర్ బ్రిడ్జి పరిధిలోని గ్రామ డ్రైనేజీ తొలగిపోవడంతో మురికి నీరంతా బ్రిడ్జిలోకి చేరి వాహనదారులకు ఇబ్బందకరంగా మారింది. మరో వైపు మిషన్ భగీరథ పైపు లైన్ పనులు కొనగసాగుతుండటంతో వాహనదారులకు మరింత ఇబ్బందికరంగా మారింది. అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే.. కాంట్రాక్టర్, స్థానిక గ్రామ పంచాయతీ అధికారుల మధ్య సమన్వయ లోపంతోనే ఈ ఇబ్బంది తలెత్తిందని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం సమీపించడంతో నిత్యం నీరు ప్రవహిస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. -
ప్రజావాణితో సమస్యల పరిష్కారం
సదాశివనగర్(ఎల్లారెడ్డి): ప్రజావాణితోనే సమస్యలను పరిష్కరించుకోవడానికి ఆస్కారం ఉంటుందని ఎంపీడీవో సంతోష్ కుమార్ సూచించారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. ఎంపీవో సురేందర్ రెడ్డి, సీహెచ్వో నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరాలతో జాగ్రత్త! భిక్కనూరు: సైబర్ నేరాలపై జాగ్రత్త వహించా లని భిక్కనూరు ఎస్సై అంజనేయులు సూచించారు. సోమవారం భిక్కనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ప్రజా కళాజాత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సైబర్ నేరాల బారిన పడితే 1930కు.. అత్యవసర సమయంలో 100 నంబర్కు డయల్ చేయాలని సూచించారు. యూట్యూ బ్, ఇస్ట్రాగామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా యాప్లతో జాగ్రత్తగా ఉండాలని సూచించా రు. ఇన్చార్జి ప్రిన్సిపాల్ వి. శ్రీనివాస్, పోలీస్ కళాబృందం ఇన్చార్జి, హెడ్కానిస్టేబుల్ రామంచ తిరుపతి, శేషారావులు పాల్గొన్నారు. ముగిసిన మొహర్రం ఉత్సవాలుసాక్షి నెట్వర్క్:మత సామరస్యానికి ప్రతీకగా పల్లెల్లో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పీర్ల పండుగ ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. నెలవంక కనిపించగానే ఆశీర్ఖానాల్లో కొలువుదీరిన పీర్లను ఆయా గ్రామాల మొల్లాలు, ఫకీర్లు, దూదేకుల కులస్తులు ఒక్కోరోజు ఒక్కోపీరును బంగారు, వెండి ఆభరణాలు, మల్లెపూలు, రంగురంగుల దట్టీలతో అందంగా అలంకరించి ఊరేగించారు. సోమవారం మొహర్రం ముగింపు ఉత్సవాల సందర్భంగా అన్ని పీర్లను బాజాభజంత్రీల నడుమ ఊరేగించగా ప్రజలు మొ క్కులు చెల్లించుకున్నారు. ఒడిబియ్యం పోసి సారెలు సమర్పించారు. వర్షంలోనూ అసయ్దూలా, మజ్నూ ఆటపాటలతో భక్తులు ఆకట్టుకున్నారు. సాయంత్రం పీర్లను స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేశారు. పలుచోట్ల ప్రత్యేకంగా పాలతో చేసిన షర్బత్ను పంపిణీ చేశారు. -
12న తెరవే ‘పాటకు సలామ్’ కార్యశాల
కామారెడ్డి అర్బన్: తెలంగాణ రచయితల వేదిక(తెరవే) ఆధ్వర్యంలో ఈ నెల 12న యువ గాయని గాయకులను ప్రోత్సహించే ఉద్దేశంతో ‘పాటకు సలామ్’ కార్యశాల కార్యక్రమాన్ని స్థానిక కర్షక్ బీఎడ్ కళాశాలలో ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించనున్నట్టు తెరవే జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గఫూర్ శిక్షక్, అల్లి మోహన్రాజ్లు తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో తెరవే ప్రతినిధులు మట్లాడారు. పాల్గొన్న యువ గాయకులందరికి ప్రశంసాపత్రాలు, మొదటి ముగ్గురు విజేతలకు బహుమతులుంటాయని వారు పేర్కొన్నా రు. ఆసక్తిగల వారు 98490 62038 నంబర్కు తమ వివరాలతో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. తెరవే ప్రతినిధులు కాసర్ల రామచంద్రం, యెంబరి లింగం, వై.గంగాప్రసాద్ పాల్గొన్నారు. పెండింగ్ చలాన్ల వసూలు లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని పెద్దవాగు వద్ద సోమవారం వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న చలాన్లు వసూలు చేసినట్లు ఎస్సై దీపక్ కుమార్ తెలిపారు. అలాగే పలువురికి జరిమానాలు విధించినట్లు తెలిపారు. కానిస్టేబుల్ కనకయ్య, శ్రీనివాస్, రాజు, లక్ష్మణ్, రవి, మదన్తో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు. -
క్రైం కార్నర్
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు ● భర్త మృతి, భార్యకు గాయాలు బోధన్టౌన్(బోధన్): ఎడపల్లి మండలం దూపల్లి గేట్ సమీపంలోని బోధన్–నిజామాబాద్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై ముత్యాల రమ తెలిపిన వివరాలు ఇలా.. రెంజల్ మండలం బాగెపల్లి గ్రామానికి చెందిన దంపతులు వాద్యాల రాములు(54), ఇంద్ర కలిసి సోమవారం ద్విచక్ర వాహనం (టీవీఎస్ చాంప్)పై నిజామాబాద్ నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. దూపల్లి గేట్ వద్ద వారు రోడ్డు దాటుతుండగా బోధన్ నుంచి నిజామాబాద్కు వెళ్తున్న కారు వారిని వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో భర్త వాద్యాల రాములు అక్కడికక్కడే మృతి చెందగా భార్య ఇంద్రకు గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి ఇంద్రను నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దుబాయ్లో పెద్దవాల్గోట్ వాసి .. సిరికొండ: మండలంలోని వాల్గోట్ గ్రామానికి చెందిన వడియాల రవీందర్ (38) ఈ నెల 4న గల్ఫ్ దేశమైన దుబాయిలో గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి భార్య లావణ్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. బతుకు దెరువు కోసం కొద్ది సంవత్సరాలుగా రవీందర్ దుబాయ్కి వెళ్తున్నాడు. సెలవుపై ఏడాది క్రితం ఇంటికి వచ్చి, వెళ్లాడు. రోజూలాగే డ్యూటీకి వెళ్లివచ్చి రూమ్కు విశ్రాంతి తీసుకుంటున్న రవీందర్ ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే తోటి స్నేహితులు హాస్పిటల్కు తరలించే లోపే మృతి చెందాడు. ప్రభుత్వం స్పందించి మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించాలని కుటుంబీకులు, గ్రామస్తులు కోరుతున్నారు. -
‘మహిళలు మరింతగా అభివృద్ధి చెందాలి’
కామారెడ్డి అర్బన్: జిల్లాలో మహిళా సంఘాలు ప్రభుత్వం ఇస్తున్న సహకారంలో మరింతగా ఆర్థికావృద్ధి చెందాలని అదనపు కలెక్టర్ చందర్ నాయక్ సూచించారు. సోమవారం శ్రీలక్ష్మి నర్సింహ జిల్లా మహిళా సమాఖ్య, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థల ఆధ్వర్యంలో కామారెడ్డి మండల సమాఖ్య భవనంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో చందర్ నాయక్ మాట్లాడుతూ మహిళలు పాడి పశువులు, పెరటి కోళ్ల పెంపకం, పాల ఉత్పత్తుల తయారీ, మహిళా శక్తి క్యాంటిన్లు, సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గతేడాది జిల్లాలో కొత్తగా 8,800 మంది సభ్యులుగా చేరారన్నారు. స్కూల్ యూనిఫాంలు కుట్టడం, కొనుగోలు కేంద్రాలను నిర్వహించడం ద్వారా రూ.3 కోట్ల ఆదాయం వచ్చిందని జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు పుష్ప తెలిపారు. 2025–26 ప్రణాళికలో భాగంగా పెట్రోలు బంక్లు, గోదాములు, రైస్ మిల్లులు, ఆర్టీసీ బస్సుల నిర్వహణ ద్వారా ఆదాయం పొందాలని డీఆర్డీవో సురేందర్ సూచించారు. రూ. 5 కోట్లతో చేపట్టిన జిల్లా సమాఖ్య భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. దివ్యాంగ, వృద్ధ, కిషోర మహిళా సంఘాలు ఏర్పాటు చేయాలని, మహిళలకు రక్త పరీక్షలు, ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. కార్యక్రమంలో అడిషనల్ డీఆర్డీవో విజయలక్ష్మి, సమాఖ్య జిల్లా కార్యదర్శి రాజమణి, కోశాధికారి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
మొక్కలు నాటి సంరక్షించాలి
దోమకొండ: మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని దోమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శంకర్ అన్నారు. సోమవారం కళాశాల ఆవరణలో ప్లాంటేషన్ డే కార్యక్రమం నిర్వహించి మొక్కలను నాటారు. ఎంపీడీవో ప్రవీన్కుమార్, ఏపీవో రజని, పంచాయితీ కార్యదర్శి యాదగిరిగౌడ్, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. అమ్మ పేరు మీద ఒక మొక్క బీబీపేట: వన మహోత్సవంలో భాగంగా సోమవారం ఉప్పర్పల్లిలో ఎంపీడీవో పూర్ణచంద్రోదయ కుమార్ చేతుల మీదుగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాటుదాం ఒక మొక్క అమ్మ పేరు మీద అనే పేరుతో ప్రభుత్వం మొక్కలు నాటాలని పిలుపునిచ్చిందని.. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పేర్కొన్నారు. సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని అటవీ ప్రాంతంలో నాటిన మొక్కలను సోమవారం ఎంపీడీవో సంతోష్కుమార్ పరిశీలించారు. ఎంపీవో సురేందర్ రెడ్డి, పంచాయితీ కార్యదర్శి ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): అచ్చాయపల్లిలో సోమవా రం వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామశివారులోని చెరువుకట్టపై ఎకై ్సజ్శాఖ ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటారు. పంచాయతీ కార్యదర్శి వెంకటరాజు, ఎకై ్సజ్ అధికారులు స్రవంతి, లావణ్య, రజిత, రవి, సంజీవ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలి తాడ్వాయి(ఎల్లారెడ్డి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీవో సయ్యద్ సాజీద్అలీ అన్నారు. తాడ్వాయి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఫీల్డు అసిస్టెంటులు, గ్రామ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మండలంలో 60 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా ఉందన్నారు. రెండు రోజుల్లో లక్ష్యాన్ని 100 శాతం పూర్తి చేయాలని సూచించారు. నర్సరీలలో అన్ని రకాల మొక్కలు అందుబాటులో ఉంచాలన్నారు. ఎంపీవో సవిత, ఏపీవో కృష్ణగౌడ్, తదితరులుపాల్గొన్నారు. -
అందరు ఉన్నా.. అనాథలా మృతి
జక్రాన్పల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ యువకుడు వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నా కుటుంబసభ్యులకు సమాచారం లేకపోవడంతో అనాథలా మృతిచెందాడు. మృతుడి కుటుంబీకులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని అర్గుల్ గ్రామానికి చెందిన కొరబోయిన అశోక్(32) మేసీ్త్ర పని చేస్తుండేవాడు. అతడు కొన్నేళ్ల క్రితమే లింగంపేట్ మండలం నుంచి అర్గుల్ గ్రామానికి కుటుంబంతో వలస వచ్చి, జీవనం కొనసాగిస్తున్నాడు. గత నెల 28న రాత్రి అతడు జక్రాన్పల్లిలో స్నేహితుడిని కలిసి వస్తానని బైక్పై ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంతకీ తిరిగిరాకపోవడంతో మరుసటి రోజు తండ్రి ప్రభురాజ్యం జక్రాన్పల్లి పోలీస్స్టేషన్లో మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేశాడు. జిల్లాకేంద్ర ఆస్పత్రిలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందగా ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతుడు అశోక్గా గుర్తించి, ప్రభురాజ్యంకు సమాచారం ఇచ్చారు. వెంటనే అతడు ఆస్పత్రికి చేరుకొని మృతిచెందినది తన కుమారుడే అని బోరున విలపించారు. బైక్ను ఠాణాకు తరలించారు.. విచారణ మరిచారు.. ఆస్పత్రిలో వారం రోజులుగా ఎవరూ లేని అనాథలా చికిత్స పొందుతున్న అశోక్ మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. 28న రాత్రి జక్రాన్పల్లి సర్వీసు రోడ్డులో ఒక యువకుడు బైక్ అదుపుతప్పి కిందపడిపోగా చికిత్స నిమిత్తం జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు అంబులెన్స్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మరుసటి రోజు పోలీసులు బైక్ను ఠాణాకు తరలించారు. అయితే ఆ ఘటనలో గాయపడ్డవారు ఎవరు? అని పోలీసులు వివరాలు సేకరించడంలో నిర్లక్ష్యం వహించినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టినట్లయితే అతడు ప్రాణాలతో ఉండేవాడని అర్గుల్కు చెందిన ఓ మాజీ ప్రతినిధి పేర్కొన్నారు. అశోక్ను ఆస్పత్రిలో చేర్చినప్పటికీ అతనికి సంబందించిన వ్యక్తులు లేకపోవడం వల్ల వైద్యులు సైతం వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించినట్లు అనుమానం వ్యక్తం చేశారు. స్వల్ప గాయాలైన వ్యక్తి మరణించడంపై అనుమానంగా ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ విషయమై ‘సాక్షి’ జక్రాన్పల్లి ఎస్సైను వివరణ కోరేందుకు యత్నించగా ఫోన్ లిప్ట్ చేయలేదు. గతనెల 28న రోడ్డు ప్రమాదంలో గాయపడిన అశోక్ ఆస్పత్రిలో చేర్పించి పోలీసులకు సమాచారమిచ్చిన అంబులెన్స్ సిబ్బంది తమ కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేసిన తండ్రి దర్యాప్తు చేయడంలో పోలీసుల నిర్లక్ష్యం చికిత్స పొందుతూ మృతి -
మలేషియాలో వలస కార్మికుల సదస్సు
మోర్తాడ్(బాల్కొండ): అంతర్జాతీయ వలసలపై మలేషియాలోని కౌలాలంపూర్లో ఈనెల 4వ తేదీన ప్రారంభమైన మూడు రోజుల సదస్సు ఆదివారం ముగిసింది. బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సదస్సును నిర్వహించింది. భారత్తో పాటు ఇండోనేషియా, ఫిలిప్పీన్, బంగ్లాదేశ్, నేపాల్, ఖతార్, బహ్రెయిన్, క్రోయేసియా, మలేషియా తదితర దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సదస్సులో తెలంగాణ నుంచి ఖతర్కు వలస వెళ్లి అక్కడ తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సుందరగిరి శంకర్గౌడ్, గల్ఫ్ రిటర్నీ, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సైండ్ల రాజారెడ్డి పాల్గొన్నారు. ఈ సదస్సులో ‘గల్ఫ్ సంక్షేమ బోర్డు’పై చర్చించినట్లు వారు ‘సాక్షి’తో తెలిపారు. వలస కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలతో పాటు గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు జరిగితేనే సౌకర్యాలు మెరుగవుతాయనే అభిప్రాయాన్ని సదస్సులో పాల్గొన్నవారు వ్యక్తం చేశారన్నారు. వలస కార్మికులకు వివిధ దేశాల చట్టాలపై అవగాహన కల్పించడం, ఆయా దేశాలలో పాటించాల్సిన నియమ నిబంధనల గురించి వివరించడం, తద్వారా వాణిజ్యాభివృద్ధికి పాటుపడాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశామని తెలిపారు. గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా, వలస కార్మికుల పిల్లలకు గురుకుల విద్యా సంస్థలలో ప్రత్యేక ప్రవేశాలకు అనుమతి, ప్రవాసీ ప్రజావాణి నిర్వహణ అంశాలను సదస్సులో వివరించామన్నారు. దీనిపై సదస్సులో పాల్గొన్నవారు హర్షం వ్యక్తం చేశారన్నారు. ‘గల్ఫ్ సంక్షేమ బోర్డు’పై చర్చ -
గ్రామ పంచాయతీకి బాడీ ఫ్రీజర్ వితరణ
లింగంపేట(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు గ్రామ పంచాయతీకి బాడీ ఫ్రీజర్ను ఆదివారం వితరణ చేశారు. బాలుర పాఠశాలలో 1998–99 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు గత మే నెలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి తమ వంతుగా సహాయం చేయాలని రూ. 50 వేలు విలువ గల బాడీ ఫ్రీజర్ను వితరణ చేశారు. అలాగే పాఠశాలకు రూ.10 వేల విలువ గల సౌండ్ సిస్టంను అందజేశారు. పూర్వ విద్యార్థులు శ్రీకాంత్, సాయిలు, కృష్ణమూర్తి, మహేష్, శ్రీధర్, స్వామి, నరేందర్, సత్యనారాయణగౌడ్, జీపీ కార్యదర్శి శ్రవణ్కుమార్ పాల్గొన్నారు. మైనారిటీ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించండిబాన్సువాడ రూరల్: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు, నాణ్యమైన విద్యకోసం మైనారిటీ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని ఎల్లారెడ్డిలోని మైనార్టీ పాఠశాల ఉపాధ్యాయులు బాలమణి, నవీన్ కుమార్, శేఖర్, శివప్రసాద్లు కోరారు. ఆదివారం బాన్సువాడ పట్టణంలోని ఇస్లాంపుర, డబుల్బెడ్రూం కాలనీ, సంగమేశ్వరకాలనీల్లో పాఠశాలలో అడ్మిషన్ల కోసం ప్రచారం చేపట్టారు. ఇంగ్లిష్ మీడియంలో బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులు, యూనిఫాం, కాస్మోటిక్చార్జీలు, పౌష్టికాహారంతో కూడిన భోజన వసతి సౌకర్యాలు ఉన్నాయన్నారు. ముస్లిం విద్యార్థులకు ఉర్దూ, అరబ్బీ, నమాజ్ సౌకర్యం ఉంటుందన్నారు. పరిమిత సంఖ్యలో సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆసక్తి గల వారు ఎల్లారెడ్డిలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో సంప్రదించాలన్నారు. కాయిన్ మింగిన బాలుడు లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన బందెల తన్వీర్ అనే రెండేళ్ల బాలుడు శనివారం సాయంత్రం ఆడుకుంటూ రెండు రూపాయల కాయిన్ మింగాడు. బాలుడికి ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో వెంటనే తల్లిదండ్రులు గమనించి లింగంపేటలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఎక్స్రేలో రెండు రూపాయల కాయిన్ గొంతులో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు కామారెడ్డిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆక్కడ వైద్యులు ఆధునిక పరికరాల సహయంతో గొంతులో ఇరుక్కున్న కాయిన్ బయటకు తీశారు. దాంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. -
ప్రారంభమైన అర్ధచాతుర్మాస్య ఉత్సవాలు
కామారెడ్డి అర్బన్: స్థానిక సిరిసిల్లరోడ్డులోని గీతా మందిరం 43వ అర్ధ చాతుర్మాస్య మహావ్రత ఉత్సవాలు తొలిఏకాదశి సందర్భంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉదయం ఉత్సవాల ప్రారంభ సూచికగా గీతా మందిరం అధ్యక్షుడు పాత అశోక్ కాషాయజెండాను ఎగురవేశారు. ఈ నెల 9వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో ధరానంద భారతి స్వామీజీ ఓంకార గాయత్రి వేద జ్ఞానప్రవచనాలు చేస్తారని అధ్యక్షుడు అశోక్ తెలిపారు. గీతా మంది రం ప్రతినిధులు అర్వపల్లి రమేష్, పార్శి లక్ష్మిపతి, దోమకొండ కృష్ణమూర్తి, అర్చకులు పాల్గొన్నారు. -
ఆశల మొలకలు
బిచ్కుంద(జుక్కల్): ఖరీఫ్ సాగుకు మృగశిరకార్తె ప్రారంభంలో కురిసిన వర్షాలకు కొందరు విత్తనాలు విత్తారు. 20 రోజుల పాటు వర్షాల జాడ లేకపోవడంతో ఆందోళన చెందారు. విత్తనాలు విత్తడంలో వెనబడ్డ రైతులు తర్వాత కురిసిన వానలతో ఎన్నో ఆశతో విత్తనాలు విత్తారు. ప్రస్తుతం మొలకలు రావడంతో రైతులు ముఖాల్లో ఆనందం కనపడుతోంది. వారి ఆశలు చిగురిస్తున్నాయి. రైతులు ప్రతి ఏటా పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, అతివృష్టి, అనావృష్టితో ప్రతి ఏటా నష్టాల పాలవుతున్నారు. ఈ ఖరీఫ్లోనైనా పంటలు బాగాపండి అప్పుల నుంచి బయట పడతామని ఖరీఫ్ సాగుపై రైతులు ఎంతో ఆశలు పెట్టుకున్నారు. విత్తిన సోయా, కంది, పత్తి, పెసర విత్తనాలు పూర్తి స్థాయిలో మొలకెత్తడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది కొందరు రైతులకు సోయా మొలకలు 50 శాతం వరకు రాకపోవడంతో తిరిగి రెండు మూడు సార్లు విత్తారు. ఈ సారి మొలకలు 80 శాతం రావడంతో ఆశించినంత దిగుబడి వస్తుందని రైతులు అంచనా వేస్తున్నారు. సోయా, కంది, మినుము, పెసర పంటలకు సరిపడినంత వర్షం పడుతుండటంతో పంటలకు ఢోకాలేదని రైతులు అంటున్నారు. మండలంలో 9 వేలు ఎకరాలలో సోయా, 1,500 ఎకరాలలో కంది, 300 ఎకరాలలో పెసర, మినుము పంటలు సాగు చేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనాలు వేస్తున్నారు. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
మద్నూర్(జుక్కల్): అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పట్టుకున్నట్లు ఆ ర్ఐ సాయిబాబా ఆదివారం తెలిపారు. పొతంగాల్ మంజీరానది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తుండగా లింబూర్ గ్రామం వద్ద శనివారం రాత్రి ట్రాక్టర్ను పట్టుకున్నామని అన్నారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. పశువులను తరలిస్తున్న వాహనం.. రుద్రూర్: పశువులను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని శనివారం రా త్రి రుద్రూర్ మండల కేంద్రంలో పట్టుకున్నట్టు ఎస్సై సాయన్న తెలిపా రు. రాజీవ్ నగర్ కాలనీ వద్ద బొలెరో వాహనాన్ని పట్టుకొని అందులో ఉన్న ఎనిమిది ఎద్దులను స్థానిక గోశాలకు తరలించామన్నారు. వాహన యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ మృతి బోధన్: ఎడపల్లి మండలం జానకంపేట్ రైల్వే స్టేషన్ పరిధిలోని రైల్వే పట్టాలపై ఓ గుర్తుతెలియని మహిళను గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో మృతిచెందింది. ఆదివారం ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు నిజామాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ హరికృష్ణకు తెలుపగా, ఆయన నిజామాబాద్ రైల్వే పోలీస్స్టేషన్కు సమాచారం అందించారు. వెంటనే రైల్వే పోలీస్స్టేషన్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని పరిశీలించారు. గుర్తుతెలియని రైలు రాకను గుర్తించకుండా గుర్తుతెలియని మహిళ పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగినట్లు వారు పేర్కొన్నారు. మృతురాలిని గుర్తించేందుకు ఆమె వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. మృతురాలి వయస్సు సుమారు యాభై ఏళ్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలిని గుర్తించిన వారు నిజామాబాద్ రైల్వే పోలీస్స్టేషన్ ఎస్సై సాయిరెడ్డి, 8712658591, 9493451642 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మాన్యాపూర్లో ఒకరి ఆత్మహత్య బిచ్కుంద(జుక్కల్): మండలంలోని మాన్యాపూర్ గ్రామ శివారులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మోహన్రెడ్డి తెలిపిన వివరాలు ఇలా.. మాన్యాపూర్ గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్ (35) కుటుంబంలో గతకొన్ని రోజులు గొడవలు జరుగుతున్నాయి. దీంతో అతడు జీవితంపై విరక్తి చెంది శనివారం రాత్రి గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బాధిత కుటుంబానికి చేయూత నస్రుల్లాబాద్: నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ బుచ్చయ్య రెండు నెలల క్రితం ఓ ప్రమాదంలో మృతిచెందాడు. దీంతో బాధిత కుటుంబానికి ఆదివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కానిస్టేబుల్ 2004బ్యాచ్ సభ్యులు .3లక్షలు అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తమ బ్యాచ్కు చెందిన బుచ్చయ్య ఆకస్మిక మరణం తీరని లోటు అన్నారు. కానిస్టేబుల్లు నాయిని గంగారాం, నర్సింగ్, సురేష్, రాజశేఖర్, నరేష్, సాయిలు, శైలేష్, నేతా స్వప్న, ఇంద్ర, అనిల్ పాల్గొన్నారు. మేకల మందపై చిరుత దాడినవీపేట: మండలంలోని మిట్టిపూర్ శివారులో ఆదివారం సాయంత్రం మేక ల మందపై చిరుత దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామానికి చెందిన మేకల కాపరి భీమన్న గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మేకలను మేపేందుకు వెళ్లాడు. సాయంత్రం తిరిగి వెళ్తుండగా మందపై చిరుతపులి దాడి చేసింది. ఒక మేకపై దాడి చేసి, మళ్లీ చెట్ల పొదల్లోకి వెళ్లింది. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేసినట్లు బాధితులు తెలిపారు. -
విచ్చలవిడిగా గడ్డిమందు వాడకం
ఎల్లారెడ్డిరూరల్: ప్రభుత్వం నిషేధించిన గడ్డిమందును వాడుతూ ప్రజలను అనారోగ్యాల బారిన పడేలా చేస్తున్నారు. పంటలు పండించే ప్రాంతాలలో ప్రభుత్వం గ్లైఫోసెట్ మందును నిషేధించినప్పటికి అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఫర్టిలైజర్ దుకాణాదారులు విచ్చలవిడిగా గడ్డిమందును విక్రయిస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నారు. గ్లైఫోసెట్ గడ్డిమందు వాడకం వల్ల మానవుడి నాడీవ్యవస్థపై ప్రభావం చూపడంతో పాటు పర్యావరణానికి హాని కలిగిస్తున్నదన్న కారణంతో ప్రభుత్వం ఆ మందును నిషేధించింది. అధికారుల తనిఖీలు లేకపోవడంతోనే నిషేధిత గడ్డిమందు అమ్మకాలు జరుగుతున్నాయి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి రుద్రూర్: సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్సై సాయన్న సూచించారు. రుద్రూర్ మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ...సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని పేర్కొన్నారు. గ్రామాల్లో గుర్తు తెలియని వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. -
ఊరి పేరులో భాగమైన రథాలు
మండల కేంద్రమైన రామారెడ్డిని పూర్వకాలం నుంచే రథాల రామారెడ్డిగా పిలిస్తున్నారు. దోమకొండ సంస్థనాధీశులు రామిరెడ్డి, గ్రామంలోని రామాలయం పేరుమీదుగా గ్రామానికి రామారెడ్డి అనే పేరు వచ్చింది.●● రామారెడ్డి గ్రామంలోని సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఒక రథం, రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఒక రథం పూర్వకాలం నుంచే ఉన్నాయి. అలాగే ఇసన్నపల్లి(రామారెడ్డి) కాళభైరవుడి ఆలయంలో ఒక రథం ఉంది. ● ఊర్లో ఇన్ని రథాలు ఉండటంతో గ్రామం పేరు రథాల రామారెడ్డిగా ఎన్నో ఏళ్ల నుంచి వాడుకలో ఉంది. ● ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజు సీతారామచంద్రస్వామి, రాజరాజేశ్వర స్వామి వార్లకు రథోత్సవం నిర్వహిస్తారు. ● ప్రతి యేటా కార్తీక బహుళ పంచమి నుంచి కార్తీక బహుళ నవమి వరకు జరిగే కాలభైరవుడి జన్మదినోత్సవాల్లో స్వామివారికి రథోత్సవం నిర్వహిస్తారు. ● సీతారామచంద్రస్వామి, రాజరాజేశ్వర స్వామి రథాలను 1992 వరకు కట్టెలతో తయారుచేసి, ఉత్సవాలు ముగిసిన తర్వాత విప్పి వేసేవారు. ● 1995లో గ్రామస్తులు ఇనుప రథాలను తయారు చేయించారు. – రామారెడ్డినిందితుల అరెస్టు.. నిబంధనలుఖలీల్వాడి: వివిధ కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(బీఎన్ఎస్ఎస్) చట్టం ప్రకారం నడుచుకోవాలి. క్రిమినల్ కేసుల్లో మహిళలు, వృద్ధుల అరెస్ట్, విచారణ చేసేటప్పుడు చట్టాలకు లోబడి వ్యవహరించాలి. ● మూడేళ్ల జైలు శిక్ష ఉన్న నేరాల కింద నమోదైన కేసుల్లో 60ఏళ్లు పైబడిన వారు నిందితులుగా ఉంటే వారిని అరెస్ట్ చేయడానికి ఏసీపీ, పైస్థాయి అధికారుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ● నేరాల్లో మహిళలు నిందితులైతే, వారిని సూర్యోదయం తర్వాత లేదా సూర్యాస్తమయం లోపు అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ● రాత్రివేళల్లో అయితే నిందితురాలు ఉన్న ప్రాంతంలో జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లేదా, కేసు నమోదు చేసిన ప్రాంతంలోని మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చి, వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. నిందితురాలి వెంట మహిళ పోలీసులను ఉంచాలి.సమాచారంమీకు తెలుసా? -
తాళం వేసిన మూడిళ్లలో చోరీ
మోపాల్(నిజామాబాద్రూరల్): మండలంలోని న ర్సింగ్పల్లిలో తాళం వేసిఉన్న మూడిళ్లల్లో గుర్తుతెలి యని దుండగులు శనివారం అర్ధరాత్రి చోరీకి పాల్ప డ్డారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలు ఇ లా.. గ్రామంలోని గన్నారం మోహన్ తన ఇంటికి తాళం వేసి డాబాపైన కుటుంబ సభ్యులతో కలిసి ని ద్రించాడు. అర్ధరాత్రి వేళ దుండగుడు తాళం పగుల గొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. బెడ్రూంలోని బీరువా తాళం పగులగొట్టి అందులో ఉన్న 11 తులాల వర కు బంగారం, బంగారు నగలు, రూ.10వేల వరకు నగదును దోచుకెళ్లాడు. అనంతరం దుబ్బాక గంగామణి ఇంటి తాళాలు పగులగొట్టి రూ.25వేల నగదు ను ఎత్తుకెళ్లాడు. అదేవిధంగా అరుగు చిన్నయ్య ఇంటి తాళాలు ధ్వంసం చేసినప్పటికీ విలువైన వస్తువులు లేకపోవడంతో చోరీకి పాల్పడలేదు. ఆయా ఇ ళ్ల కుటుంబసభ్యులు ఆదివారం ఉదయం లేచి చూ సేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గ మనించి, పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్టీం బృందం ఘటనాస్థలానికి చేరుకుని వేలిముద్రలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై సుస్మిత కేసు నమోదు చేసుకున్నారు. కాగా దుండగుడు ఒక్కడే వచ్చి మూడిళ్లలో చోరీ చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. మంకీ క్యాంప్, చేతులకు గ్లౌజులు ధరించి ఉన్నాడని, త్వరలోనే దొంగను పట్టుకుంటామని ఎస్సై తెలిపారు. సుమారు 11 తులాల బంగారం, రూ.35వేల నగదు అపహరణ -
చినుకు పడితే చిత్తడే
దోమకొండ: మండలంలోని ముత్యంపేట–దోమకొండ దారి చినుకు పడితే చిత్తడిగా మారుతుంది. చిన్నపాటి వర్షాలకే రోడ్డు బురదమయంగా మారుతుంది. దీంతో రోడ్డుపై ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి బీటీ రోడ్డుగా మార్చాలని ఆ మార్గంలో ప్రయాణించే వారు కోరుతున్నారు. అలాగే చిన్నపాటి వర్షానికే ముత్యంపేటలోని బీటీ రోడ్డు బాగా దెబ్బతిన్నది. అధ్వానంగా తాడ్వాయి– దేవాయిపల్లి తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల నుంచి దేవాయిపల్లి వెళ్లే రోడ్డు అధ్వానంగా తయారైంది. రోడ్డు వెంట కిలోమీటరుకు 10 లోతు గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. రాత్రి వేళలో ఈ రోడ్డుపై వెళ్లాలంటే వాహదారులు భయపడుతున్నారు. కనీసం ప్యాచ్ వర్క్ అయినా చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
బాల్యంపై ‘బ్యాగు’ భారం
నందిపేట్(ఆర్మూర్): పసి వయసులోనే చిన్నారులు లేత భుజాలపై బండెడు పుస్తకాలు మోస్తూ కుంగిపోతున్నారు. ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు డజన్ల కొద్ది పుస్తకాలు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నాయి. దీంతో పిల్లలు పుస్తకాల బరువు మోయక తప్పడం లేదు. తరగతులు పెరిగే కొద్ది విద్యార్థుల బ్యాగు బరువు సైతం పెరుగుతుంది. సాధారణంగా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఒకటో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఒక పలక, ఒక నోట్ పుస్తకం ఉంటాయి. కానీ.. ప్రస్తుతం ఎల్కేజీ, యూకేజీ స్థాయిలోనే వారితో 20 పాఠ్య, నోట్ పుస్తకాలు మోయిస్తున్నారు. పిల్లల బరువులో పది శాతానికి మించిన బరువు వేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వం సైతం పుస్తకాల బరువుకు సంబంధించి నిబంధనలు తీసుకొచ్చినా వాటిని అమలు చేస్తున్న దాఖలాలు ఏ పాఠశాలలోనూ కనిపించడం లేదు. 2017లో జీవో జారీ విద్యార్థుల వీపుపై బండెడు బరువును తగ్గించడానికి 2017లో ప్రభుత్వం 22 జీవోను జారీ చేసింది. ఎన్సీఈఆర్టీ ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన పుస్తకాలే ప్రయివేటు పాఠశాలలో వినియోగించాలి. హోంవర్కు పేరిట ట్యూషన్లు, స్పెషల్ క్లాసులు నిర్వహించొద్దు. ఆట పాటలతో చదువు సాగించాలి. విద్యార్థులకు వాటర్ బాటిల్ బరువు లేకుండా పాఠశాలలోనే తాగునీటిని అందించాలి. ఐదో తరగతి వరకు హోంవర్కు ఉండకూడదని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. అయినా విద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో జిల్లాలోని ప్రయివేటు పాఠశాలలో జీవో అమలుకు నోచుకోవడం లేదు.శారీరక ఎదుగుదలపై ప్రభావంతరగతుల వారీగా బరువు ఇలా..తరగతులు బరువు (కిలోల్లో) 1–2 1.5 3–5 2–3 6–7 4 8,9 4.5 10 5 నర్సరీ నుంచే పుస్తకాల మోత బరువు మోయలేకపోతున్న చిన్నారులు ప్రయివేటు పాఠశాలల్లో అమలుకాని జీవో 22 విద్యాశాఖ పర్యవేక్షణ కరువువిద్యార్థులు అధిక భారం మోస్తున్నందున వారి శారీరక ఎదుగుదలపై ప్రభావం పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 1,171 ఉండగా, ప్రయివేటు పాఠశాలలు 475 వరకు ఉన్నాయి. ఒకప్పుడు ఆరు సబ్జెక్టులకు ఆరు నోట్బుక్సుతోపాటు ఒక రఫ్ నోట్బుక్ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు సబ్జెక్టుకు ఒక రఫ్ బుక్తోపాటు గైడ్లు, డ్రాయింగ్, రికార్డులు, డైరీలు, ఇతర బుక్లు కలుపుకొని కిలోల కొద్ది పుస్తకాలను బ్యాగులో మోసుకెళ్లాల్సి వస్తుంది. రోజుకు 10 కోలోల బరువు కంటే ఎక్కువగానే చిన్నారులు తమ భుజాలపై మోస్తూ ఒకటి, రెండు అంతస్తుల భవనాల్లోని తరగతి గదులకు వెళుతున్నారు. దీంతో చాలా మంది పిల్లలు వెన్ను నొప్పి, జాయింట్ పెయిన్స్ బారినపడుతున్నారు.చదువుపై శ్రద్ధ పెట్టలేరు.. అధిక బరువు మోస్తున్న కారణంగా పిల్లలు మానసిక ఆందోళన గురవుతారు. త్వరగా అలసిపోయి చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతారు. నడుము, వెన్ను, కండరాల నొప్పులు వచ్చే ఆస్కారం ఉంటుంది. వయసుకు తగిన బరువును మాత్రమే చిన్నారులతో మోయించాలి. – ప్రవీణ్, వైద్యాధికారి, నందిపేట -
అనుమతి తీసుకోకుండానే..
అధికార పార్టీ నేతపై కేసు.. కామారెడ్డి క్రైం: అక్రమంగా పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను నిల్వ ఉంచిన కేసులో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డిని పోలీసులు శనివారం అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేపీఆర్ కాలనీలో ఇంటి నిర్మాణం కోసం బండరాళ్లు పగుల గొట్టడానికి స్థలం యజమాని శ్రీధర్ పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులతో ఒప్పందం చేసుకున్నాడు. వారంతా కలిసి ఈనెల 4న జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, ఇతర సామగ్రితో బండరాళ్లు పేల్చడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే చుట్టుపక్కన వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్పందించి, వారిని అరెస్ట్ చేశారు. బాంబ్స్క్వాడ్ సాయంతో పేలుడు పదార్థాలను పేల్చేశారు. లింగాపూర్ వద్దనున్న శ్రీవారి వెంచర్లో నిల్వ చేసిన 1,564 జిలెటిన్ స్టిక్స్, 41 డిటోనేటర్లు, 16 బెండల్స్ కార్డెక్స్ వైరు(4300 మీటర్లు), బ్యాటరీ, చెక్మీటర్ ఇతర సామగ్రిని స్వాదీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాలు నిల్వ చేసిన గది పట్టణానికి చెందిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ భర్త, టీపీసీసీ రాష్ట్ర ప్రధన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డి, అతడి సోదరుడు గడ్డం సురేందర్రెడ్డిలది. ఈ కేసులో వారిద్దరితోపాటు మరో ఇద్దరిని నిందితులుగా చేర్చారు. శనివారం అర్ధరాత్రి గడ్డం చంద్రశేఖర్రెడ్డిని అరెస్టు చేసి నిజామాబాద్ జైలుకు తరలించారు. అయన సోదరుడు సురేందర్రెడ్డి పరారీలో ఉన్నారు. అధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరెస్టు కావడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.● జిల్లాలో విచ్చలవిడిగా జిలెటిన్ స్టిక్స్ వినియోగం ● ఇష్టారాజ్యంగా బండరాళ్ల పేల్చివేతలు ● పట్టించుకోని అధికారులు సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : నక్సలైట్ల ప్రాబల్యం ఉన్న కాలంలో పేలుడు ప దార్థాలపై గట్టి నిఘా ఉండేది. ఎక్కడై నా బండరాళ్ల పేల్చివేతలకు జిలెటిన్ స్టి క్స్ వాడుతున్నారని తెలిస్తే చాలు పోలీ సులు దాడులు చేసి నిందితులను కటకటాల వెనక్కి పంపించేవారు. జిలెటిన్ స్టిక్స్ ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయన్న దా నిపైనా కూపీ లాగేవారు. పేలుడు పదార్థాలు న క్సల్స్ చేతుల్లోకి ఏమైనా వెళ్లాయేమో చెక్ చేసేవా రు. తర్వాతి కాలంలో పేలుడు పదార్థాలపై పోలీసు ల నిఘా కరువైంది. విచ్చలవిడిగా జిలెటిన్ స్టిక్స్ వినియోగిస్తున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. లెక్కే లేదు.. బండరాళ్లను పేల్చే కంప్రెషర్లకు సంబంధించి పోలీసులు నిఘా ఉంచాలి. కంప్రెషర్లకు ఎక్కడి నుంచి జిలెటిన్ స్టిక్స్ వస్తున్నాయన్న దానికి లెక్కలుండాలి. అనుమతులు తీసుకున్న తర్వాతే వాటిని వాడాలి. కానీ ఎక్కడా అనుమతులు లేకుండానే విచ్చలవిడి గా వాడుతుండడం విస్మయం కలిగిస్తోంది. ఎక్కడెక్కడి నుంచో కంప్రెషర్లను తీసుకువచ్చి పేలుస్తున్నా రు. కంకర క్వారీలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ బండరాళ్లను పేల్చడానికి జి లెటిన్ స్టిక్స్ వినియోగిస్తున్నారు. పట్టణాలు, గ్రా మాలు, మండల కేంద్రాలలో వెలుస్తున్న వెంచర్లలో బండరాళ్లు ఉంటే వాటిని తొలగించేందుకు కంప్రెష ర్లను వాడుతున్నారు. అలాగే రోడ్ల విస్తరణ పనుల్లో కూడా అడ్డుగా బండరాళ్లు వస్తే కంప్రెషర్లను వాడి పేలుస్తున్నారు. పంట చేలల్లో పెద్దపెద్ద బండరాళ్లు, గుట్టలు ఉంటే వాటిని తొలగించేందుకు పేలుడు పదార్థాలను వినియోగిస్తున్నారు. పోలీసు శాఖ నిఘా లేకపోవడంతో జిలెటిన్ స్టిక్స్ వినియోగంపై అడ్డూ అదుపులేకుండా పోయింది. ఇప్పటికైనా పో లీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి పేలుడు ప దార్థాల అక్రమ వినియోగానికి అడ్డుకట్ట వేయాల ని ప్రజలు కోరుతున్నారు. ప్రజలు సమాచారం ఇస్తేనే.. జిల్లా కేంద్ర నడిబొడ్డున ఎలాంటి అనుమతులు లే కుండా బండరాళ్లు పేల్చడానికి జిలెటిన్ స్టిక్స్ వాడుతున్నారని ఈనెల 4న స్థానికులు జిల్లా పోలీసు ఉ న్నతాధికారికి సమాచారం ఇచ్చారు. దీంతో స్థానిక పోలీసులు అప్రమత్తమై పేలుడు పదార్థాలు వాడిన ముగ్గురు వ్యక్తులతో పాటు స్థల యజమానిని అరె స్టు చేశారు. ఈ దాడిలో పెద్ద ఎత్తున పేలుడు పదా ర్థాలు స్థలంలో లభించాయి. కాగా జిల్లా కేంద్రంలోనే బండరాళ్ల పేల్చివేతలకు దర్జాగా జిలెటిన్ స్టిక్స్ వాడుతున్నా పోలీసుల నిఘాకు చిక్కకపోవడం గమనార్హం.జిల్లాలో పేలుడు పదార్థాలను విచ్చలవిడిగా వి నియోగిస్తున్నారు. ముఖ్యంగా కంకర క్వారీలలో అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున బండరాళ్లను పేలుస్తున్నారు. జిల్లావ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కంకర క్వారీలలో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారు. అనుమతులు తీసుకోకుండానే బండలు పేలుస్తున్నా పోలీసులు అటువైపు వెళ్లడం లేదన్న ఆరోపణలున్నాయి. కొన్నిచోట్ల పేలుళ్లతో సమీపంలోని గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. కొన్నిచోట్ల పేలుళ్లకు ఇళ్ల గోడలకు పగుళ్లు వస్తున్నాయి. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. రోడ్ల నిర్మాణానికి సంబంధించి భారీ మొత్తంలో కంకర అవసరం అవుతుండడంతో కంకర క్వారీలకు గిరాకీ ఉంది. అటు జాతీయ రహదారుల నిర్మాణం, ఇటు ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణాలు, అలాగే ఇళ్ల నిర్మాణాలకు ఎక్కువ మొత్తంలో కంకర అవసరం అవుతోంది. దీంతో పెద్ద మొత్తంలో రాళ్లను పేలుస్తున్నారు. -
నేడు బిచ్కుందకు మంత్రి కోమటిరెడ్డి రాక
బిచ్కుంద: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోమవారం బిచ్కుందలో పర్యటించనున్నారు. జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. బిచ్కుంద మండలంలోని ఖద్గాం నుంచి డోంగ్లీ వరకు రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి గోపన్పల్లి చౌరస్తా వద్ద శిలాఫలకం ఏర్పాటు చేశారు. మంత్రి పర్యటన రూట్ను ఆదివారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు. ఆమె తహసీల్దార్ వేణుగోపాల్, ఆర్అండ్బీ అధికారులతో మాట్లాడి పర్యటన ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మంత్రి వస్తున్నారని.. బిచ్కుంద: మండల కేంద్రంలో సోమవారం ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ అధికారులు స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చారు. మండల కేంద్రంతోపాటు బాన్సువాడ మార్గంలో రోడ్డు దెబ్బతింది. చాలాచోట్ల పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఇన్నాళ్లూ పట్టించుకోని అధికారులు.. ఆర్అండ్బీ శాఖ మంత్రి వస్తుండడంతో మరమ్మతులు చేయించారు. అయితే తారు పోయకుండా కంకర వేసి చేతులు దులుపుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. కేవలం కంకర పోసి వదిలేయడంతో ఆ దారిలో ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రయథ్లాన్ పోటీల్లో జిల్లాకు వెండి పతకం కామారెడ్డి అర్బన్: హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ ట్రయథ్లాన్ పోటీల్లో జిల్లా క్రీడాకారిణి సత్తాచాటింది. అండర్–10 విభాగంలో బి.ధనశ్రీ స్టాండింగ్ బ్రాడ్ జంప్లో ద్వితీయ స్థానం పొంది వెండి పతకం సాధించింది. ఈ విషయాన్ని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్రెడ్డి, అనిల్కుమార్ తెలిపారు. ‘దళితుడి ఇంటిని కూల్చేయడం సరికాదు’ ఎల్లారెడ్డి: సామాన్య దళితుడి ఇంటిని కూల్చివేయడం సరికాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిన్నరాజులు, మాజీ ఎంపీ బీబీ పాటిల్ పేర్కొన్నారు. మల్కాపూర్లో ఇటీవల అక్రమ నిర్మాణమని పేర్కొంటూ బీజేపీ మండల అధ్యక్షుడు నర్సింలు ఇంటిని కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆదివారం బీజేపీ నేతలు ఆ నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే నిర్మాణాన్ని కూల్చివేయించారని ఆరోపించారు. అలాంటివారికి రానున్న రోజులలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. అనంతరం నర్సింలుకు బీబీ పాటిల్ లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అరుణతార, నేతలు బాణాల లక్ష్మారెడ్డి, నక్క గంగాధర్, బాలకిషన్, సతీష్, రాజేష్, దేవేందర్, రామలు తదితరులు పాల్గొన్నారు. 10న పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం బాన్సువాడ : బాన్సువాడ నుంచి బీదర్ నర్సింహస్వామి ఆలయానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కల్పించినట్లు డిపో మేనేజర్ సరితాదేవి తెలిపారు. ఈనెల 10న ఉదయం 6 గంటలకు బాన్సువాడ బస్టాండ్ నుంచి బస్సు బయలుదేరుతుందని, జరాసంగంలోని మహాదేవుడి ఆలయంతోపాటు బీదర్ నర్సింహస్వామి ఆలయాల వద్ద ఆగుతుందని పేర్కొన్నారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 12 గంటలకు బాన్సువాడకు చేరుకుంటుందని తెలిపారు. టికెట్ ధర పెద్దలకు రూ. 1,300, పిల్లలకు రూ. 650 అని, పూర్తి వివరాలకు 90634 08477 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
మోస్తరు వర్షానికే మోకాల్లోతు నీరు..
అయ్యప్ప ఆలయానికి వెళ్లే దారిలో నిలిచిన వర్షపు నీరు బాన్సువాడ : చినుకు పడితే చాలు పట్టణ రోడ్లు కుంటల్లా మారుతున్నాయి. అంతర్గత డ్రైయినేజీ లు అస్తవ్యస్తంగా మారడంతో మోస్తరు వర్షానికే రోడ్లపైకి మోకాల్లోతు నీళ్లు చేరుతున్నాయి. బా న్సువాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయం రో డ్డు, అంబేడ్కర్ చౌరస్తా నుంచి పాత బాన్సువాడ కు వెళ్లే దారి, బేతాళస్వామి ఆలయం వద్ద, సా యికృపానగర్ కాలనీ, వాసవీకాలనీ, సంగమేశ్వ ర కాలనీ మూడో రోడ్డులో చివరి వీధి, చైతన్య కా లనీల్లో మోకాల్లోతు నీరు నిలుస్తోంది. రహదారులపై నీరు ఖాళీ అయిన తర్వాత బురద మేటలు తిష్టవేస్తున్నాయి. గతంలో రోడ్లపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు నిండిపోవడంతో వాహనాల రాకపోకలతో అవి మరింత పెద్దవిగా మారుతు న్నాయి. నీరున్నప్పుడు ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. మురుగు నీరు రోడ్లపై పారుతుండడంతో పాదచారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి రోడ్లపై నీరు నిలవకుండా డ్రెయినేజీలను బాగు చేయించాల ని ప్రజలు కోరుతున్నారు. బాన్సువాడలో కుంటల్లా మారుతున్న రహదారులు అవస్థలు పడుతున్న వాహనదారులు -
పేలుడు పదార్థాలతో సంబంధం లేదు
కామారెడ్డి టౌన్: శ్రీవారి వెంచర్లో నిల్వ చేసిన పేలుడు పదార్థాలతో తన భర్త చంద్రశేఖర్రెడ్డి కి ఎలాంటి సంబంధం లేదని మున్సిపల్ మా జీ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ తెలిపారు. ఆ దివారం తన నివాసంలో విలేకరులతో మా ట్లాడారు. శ్రీవారి వెంచర్లో తమకు గుంట భూమి కూడా లేదన్నారు. కేపీఆర్ కాలనీలో దొ రికిన పేలుడు పదార్థాలకు, శ్రీవారి వెంచర్కు ముడి పెడుతున్నారని ఆరోపించారు. అ వెంచర్ను గతంలోనే వేరే వారికి అప్పజెప్పామన్నా రు. నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి అరెస్టు చే సి జైలుకు తరలించడం సరికాదన్నారు. ఈ కే సులో తాము చట్ట ప్రకారం ముందుకు వెళ్తామన్నారు. సమావేశంలో నాయకులు కృష్ణమూర్తి, రవి, జూలూరి సుధాకర్, గడ్డమీది రాణి, సలీం తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధులకు పింఛన్ కట్!
బాన్సువాడ : జిల్లాలో పలువురు వృద్ధులకు చే యూత పింఛన్లు నిలిచిపోయాయి. దీంతో బాధితు లు లబోదిబోమంటున్నారు. గత నెలలో డబ్బులు తక్కువ వచ్చాయంటూ రెండు రోజులపాటే పింఛ న్లు పంపిణీ చేశారు. దీంతో చాలా మంది పింఛన్లు కోల్పోయి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగు తున్నారు. జిల్లాలో ప్రతి నెలా 1,61,808 మంది వి విధ రకాల పింఛన్దారులకు రూ.3,61,60,828 పంపిణీ చేస్తున్నారు. ఏప్రిల్ నెలలో 10 రోజులపా టు పంపిణీ చేసిన పింఛన్లు, మే నెలలో ఆరు రోజు లు మాత్రమే అందజేశారు. పోస్టాఫీసుకు వచ్చే పింఛన్దారులు చాలా మంది వరుసలో నిలబడలేక వచ్చే నెలలో తీసుకుందామనుకునే వారు వందల్లో ఉన్నారు. ఒక్క బాన్సువాడ మున్సిపాలిటీలోనే 3,343 మందికి వివిధ రకాల పింఛన్లు ఉన్నాయి. అయితే పోస్టాఫీసులో విధులు నిర్వహించే ఒకే ఉద్యోగి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. జూన్ చివరి వారంలో విడుదలైన పింఛన్లు రెండు రోజులు మాత్రమే పంపిణీ చేయడంతో చాలా మందికి డబ్బులు అందలేదు. అదే సమయంలో చాలా మంది పింఛన్లు కట్ అయ్యాయని సిబ్బంది చెప్పడంతో వృద్ధులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీంతో సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. రెండు రోజులే పంపిణీ చేయడంతో ‘చేయూత’ కోల్పోయిన వైనం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న బాధితులు డబ్బులు రాలేవంటూ చేతులు దులుపుకుంటున్న అధికారులు -
మోడల్ స్కూల్ విద్యార్థినులకు అస్వస్థత
రుద్రూర్: మండలంలోని అంబం(ఆర్) శివారులోగల ఆదర్శ కళాశాల (మోడల్ స్కూల్/కళాశాల)లో పలువురు విద్యార్థినులు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వారంతా రాత్రివేళ ఒక్కసారిగా వాంతులు చేసుకుంటూ అస్వస్థతకు గురికావడంతో కేర్ టేకర్ సుజాత రుద్రూర్ పీహెచ్సీ సమాచారం అందించారు. మండల వైద్యాధికారిణి అయేషా సిద్ధికా, ఆరోగ్య సిబ్బంది హాస్టల్కు చేరుకుని ప్రథమ చికిత్స నిర్వహించారు. సుమారు 95మంది విద్యార్థినులు కడుపునొప్పితో ఇబ్బంది పడ్డారు. తీవ్ర అస్వస్థతతకు గురైన 8మంది విద్యార్థినులను వర్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. శనివారం సాయంత్రం నలుగురిని డిశ్చార్జ్ చేసినట్టు వైద్యాధికారిణి వెల్లడించారు. ఆరోగ్య సిబ్బంది ఇచ్చిన ఐరన్ మాత్రలను తినకముందు వేసుకోవడం వల్ల అస్వస్థత గురైనట్లు ఆమె వివరించారు. -
కనిపించని డ్రెయినేజీలు
కామారెడ్డి టౌన్ : చిన్నపాటి వర్షం కురిస్తే కామారెడ్డి పట్టణంలోని రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. భారీ వర్షాలు కురిస్తే రాకపో కలు నిలిచిపోయిన ఘటనలు ఉన్నాయి. దీని కి కారణం పట్టణంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా ఉన్న మురికి కాలువలను ఆక్రమణలకు గురి కావడమే.. పలు ప్రాంతాల్లో అస లు నాలాల జాడ కనిపించడం లేదు. కొన్ని చోట్ల ఇళ్ల యజమానులు డ్రెయినేజీలపై స్లాబ్ లు వే సుకోగా.. మరికొన్ని చోట్ల వ్యాపారులు నాలాలను కబ్జా చేసి వ్యాపారాలు సాగిస్తు న్నారు. వర్షపు, మురుగునీరు ప్రవహించేందు కు దారి లేకుండాపోయింది. బల్దియా పారిశుద్ధ్య కార్మికులు కాలువలను శుభ్రం చేద్దామ న్నా చేసే పరిస్థితి లేదు. దీంతో డ్రెయినేజీలు వ్యర్థాలు, పూడికతో నిండిపోవడంతో మురు గు నీరు ముందుకు ప్రవహించడం లేదు. డ్రెయినేజీలను దాటి శాశ్వత నిర్మాణాలు చేపట్టినా అడిగేవారు లేకుండా పోయారు. బల్దియా అధికారుల పర్యవేక్షణ కరువైంది. ఎక్కడ చూసినా.. కొత్తబస్టాండ్ నుంచి మున్సిపల్కార్యాలయం, నిజాంసాగర్ చౌరస్తా నుంచి హౌజింగ్బోర్డు వైపు వరకు ఇరువైపులా పూర్తిగా వ్యాపార సముదాయాలు, దుకాణాలు ఉన్నాయి. ఈ రోడ్ల వెంబడి మురికి కాలువల ఆనవాళ్లు లేకుండా స్లాబులు వేసి వాటిపై వ్యాపారాలు సాగిస్తున్నారు. నిజాంసాగర్ చౌరస్తా నుంచి దేవునిపల్లి వరకు ఇరు వైపులా ఇదే పరిస్థితి. ఇక స్టేషన్రోడ్, సిరిసిల్ల రోడ్, సుభాష్రోడ్, మాయాబజార్, నాజ్ టాకీస్రోడ్, గంజ్రోడ్, వీక్లీ మార్కెట్రోడ్, జన్మభూమిరోడ్, ఆర్కే లాడ్జ్ రోడ్, అశోక్నగర్ కాలనీ, పాత బస్టాండ్ నుంచి అడ్లూర్ రోడ్ తదితర ప్రాంతాల్లో డ్రెయినేజీల ఆనవాళ్లు కనిపించడం లేదు. వానాకాలంలో అటువైపు వెళ్లలేం.. మురికి కాలువల ఆక్రమణలు, వాటిపై స్లాబ్ లు వేయడంతో విద్యానగర్కాలనీ, నిజాంసాగర్ చౌరస్తా, పోలీస్ స్టేషన్ ముందు, పాత బస్టాండ్, సిరిసిల్లారోడ్, దేవునిపల్లిరోడ్, రామారెడ్డిరోడ్, అడ్లూర్రోడ్ తదితర ప్రధాన రహదారులపై రోడ్లు వర్షాకాలంలో జలమయమవుతున్నాయి. వాహనదారులు, పాదచారులు అటువైపు వెళ్లలేని పరిస్థితి ఉంది. యథేచ్ఛగా ఆక్రమణలు.. వాటిపై నిర్మాణాలు జిల్లా కేంద్రంలో నాలాలపై పర్యవేక్షణ కరువు వానాకాలంలో రోడ్లను ముంచెత్తుతున్న వరద నీరు పట్టించుకోని బల్దియా అధికారులు చర్యలు చేపడుతాం.. పట్టణంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా మురికి కాలువలపై ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలిగించాలి. కాలువలపై స్లాబ్లు వేసుకుంటే తీసివేయాలి. మున్సిపల్ కార్మికులు డ్రెయినేజీలను శుభ్రం చేసేలా ఉండాలి. లేకుంటే ఇళ్ల యజమానులపై చర్యలు తీసుకుంటాం. మురికి కాలువలపై ఆక్రమణలను తొలగింపు చర్యలు చేపడతాం. – రాజేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి -
భూభారతి దరఖాస్తులు త్వరగా పూర్తి చేయాలి
పెద్దకొడప్గల్(జుక్కల్): రెవెన్యూ సదస్సుల్లో రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను నెలరోజులలోపు పరిష్కరించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సిబ్బందిని ఆదేశించారు. శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి.. రెవెన్యూ దరఖాస్తులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. మండలంలో జరిగిన రెవెన్యూ సదస్సులో 499 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా వాటిలో 152 మందికి నోటీసులు అందజేశామని, మిగిలిన వాటీలో చాలావరకు అటవీశాఖకు చెందిన దరఖాస్తులే వచ్చాయని తెలిపారు. నూతనంగా మండలంలో విలీనమైన బాబుల్ గావ్ గ్రామస్తులు రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావడం లేదని సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందించారు. సమస్యను ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కరిస్తామని గ్రామస్తులకు హమీ ఇచ్చారు. మండల కేంద్రంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి, లబ్ధిదారులతో సబ్కలెక్టర్ మాట్లాడారు. కార్యక్రమంలో తహసీల్దార్ దశరథ్, నాయబ్ తహసీల్దార్ రవికాంత్,ఆర్ఐ అంజయ్య రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. కేవీ కోసం స్థల పరిశీలన మద్నూర్: మండల కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటకు అధికారులు ఎంపిక చేసిన స్థలాన్ని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, కేంద్రీయ విద్యాలయ రాష్ట్ర కమిషనర్ మంజూనాథ్ శనివారం పరిశీలించారు. మద్నూర్లో కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించేందుకు తాత్కాలిక భవనంతోపాటు శాశ్వత భవన నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపిస్తున్నామన్నారు. వారివెంట డీఈవో రాజు, తహసీల్దార్ ముజీబ్, మండల రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఉన్నారు. -
ఎస్సీ, ఎస్టీల సమస్యలను పరిష్కరించాలి
కామారెడ్డి క్రైం: గ్రామాల్లో ‘సివిల్ రైట్స్ డే’ కార్య క్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఎస్సీ, ఎ స్టీల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సూచించారు. శని వారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయనకు కలెక్టర్ ఆ శిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేశ్చంద్ర, అధికారులు పు ష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ పాల్గొన్నారు. జిల్లా అధికారులతో కలిసి ఎస్సీ, ఎస్టీ భూములు, అట్రాసిటీ కేసులపై కమిషన్ సభ్యులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా వెంకట య్య మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల కోసం ఉన్న చ ట్టాలు, సంక్షేమ కార్యక్రమాలపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ కేసులను ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతినెల చివరి వారంలో సివిల్ రై ట్స్డే ను, ప్రతి మూడు నెలలకోసారి డీవీఎంసీ స మావేశాన్ని నిర్వహించి సమస్యలను పరిష్కరించా లన్నారు. డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమి టీని ఏర్పాటు చేయడంతోపాటు జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ భవన నిర్మాణానికి 30 గుంటల స్థలాన్ని కేటాయించినందుకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ను ప్రత్యేకంగా అభినందించారు. సమావేశానికి హాజరై న పలువురు జిల్లా వాసులు తమకు సంబంధించిన కేసులు, సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. కమిషన్ సభ్యులు నీలాదేవి, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, ఏఎస్పీ చైతన్యరెడ్డి, అధికారులు ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. చట్టాలపై అవగాహన కల్పించాలి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య -
నేటి ర్యాలీని జయప్రదం చేయాలి
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండల కేంద్రం నుంచి పిట్లం వరకు చేపట్టిన ద్విచక్రవాహన ర్యాలీని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జయప్రదం చేయాలని పార్టీ అధ్యక్షుడు రవీందర్రెడ్డి అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పుట్టిన రోజును పురస్కరించుకొని ర్యాలీ, అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. నాయకులు లోక్యానాయక్, రమేష్యాదవ్, తోట. రాజు, సాయాగౌడ్, శంకర్ తదితరులున్నారు. వాహనాల తనిఖీ పెద్దకొడప్గల్(జుక్కల్): మండలంలోని అంజనీ చౌరస్తా జాతీయ రహదారి 161పై శనివారం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్సై అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు. పార్థి గ్యాంగ్పై పీడీ యాక్టు నమోదు కామారెడ్డి క్రైం: తరచుగా దారి దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్న పార్థి దొంగల ముఠాపై కామారెడ్డి పోలీసులు పీడీ యాక్టు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు శనివారం జారీ చేసినట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. మహారాష్ట్రలోని వార్ధా జిల్లాకు చెందిన చోండా అలియాస్ కూలీ పవార్, జాకీ గుజ్జియా భోంస్లే, హరీష్ పవార్ అలియాస్ హర్ష, అనురాగ్ రత్నప్ప భోంస్లే పార్థి తెగకు చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులు. ఈ ముఠా కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలోగల జాతీయ రహదారుల వెంబడి 9చోట్ల దారిదోపిడీలు, దొంగతనాలకు పాల్పడ్డారు. మారణాయుధాలతో రోడ్ల వెంబడి ఆగి ఉన్న వాహనాలను, అందులోని వ్యక్తులను టార్గెట్ చేస్తూ నేరాలకు పాల్పడుతుండేవారు. దీంతో శాంతి భద్రతల దృష్ట్యా వారిపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కామారెడ్డి రూరల్ సీఐ రామన్ శనివారం నిజామాబాద్ సెంట్రల్ జైలుకు వెళ్లి అక్కడి జైలు అధికారులకు పీడీ యాక్ట్ ఉత్తర్వులు అందజేశారు. -
పదోన్నతులు బాధ్యతను పెంచుతాయి
కామారెడ్డి క్రైం: పదోన్నతులు బాధ్యతను పెంచుతాయని ఎస్పీ రాజేశ్ చంద్ర అన్నారు. పదోన్నతి పొందిన అధికారులు రెట్టింపు ఉత్సాహంతో విధులు నిర్వహిస్తూ నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. జిల్లా లోని ఆయా పోలీస్ స్టేషన్ లలో విధులు నిర్వహిస్తున్న 13 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. వారందరూ శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేశ్ చంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి పదోన్నతి చిహ్నాలను ఎస్పీ అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సీనియారిటీ ప్రకారం అందరికీ ప్రమోషన్ లభిస్తుందన్నారు. విల్లింగ్ స్టేషన్లు, సీనియారిటీ, దంపతుల సేవలు, ఆరోగ్య పరిస్థితులు, సర్వీస్ రికార్డులు తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని బదిలీలు జరుపుతామన్నారు. పదోన్నతి పొందిన అధికారుల వివరాలు.. కానిస్టేబుళ్లుగా పని చేస్తున్న రామేశ్వర్ రెడ్డి (లింగంపేట్) మధుకర్ (ఎల్లారెడ్డి), దేవేందర్ (లింగంపేట్), బిఎం.రాజు (దేవునిపల్లి), సిహెచ్. సాయిలు (బిచ్కుంద), జి. రాజు కుమార్ (బిచ్కుంద) ప్రిన్స్ బాబు (వీఆర్), అనిల్ కుమార్ (రాజంపేట), రామారావు (మాచారెడ్డి), సీహెచ్ స్వామి (మాచారెడ్డి), సీహెచ్ శ్రీనివాస్ (నాగిరెడ్డిపేట్), సీహెచ్ మహేందర్ (వీఆర్) సంజీవులు (దేవునిపల్లి) లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించినట్లు ఎస్పీ తెలిపారు. నిజాయితీగా ప్రజలకు సేవలు అందించాలి ఎస్పీ రాజేశ్ చంద్ర -
క్రైం కార్నర్
రెండు లారీలు ఢీ: ఒకరి మృతి ● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కామారెడ్డి క్రైం: జిల్లా కేంద్రం సమీపంలో రెండు లారీలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. జిల్లా కేంద్రానికి సమీపంలోని జాతీయ రహదారిపైగల రామారెడ్డి బ్రిడ్జి వద్ద శుక్రవారం రాత్రి ఓ లారీ సర్వీస్ రోడ్డులోకి వెళ్లి రివర్స్ తీసుకుంటుండగా నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మరో లారీ వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్కు చెందిన ఓంకారం పార్తీ (33) అక్కడికక్కడే మృతి చెందాడు. అఖిలేష్, మహేష్ అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. గాయపడిన వారిని జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.ట్రాక్టర్ కింద పడి యువకుడు.. నందిపేట్/డొంకేశ్వర్: పొలం దమ్ము చేస్తుండగా కేజ్వీల్స్ ట్రాక్టర్ కింద పడి ఓ యువకుడు మృతి చెందిన ఘటన నందిపేట్ మండలం శాపూర్ శివారులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. డొంకేశ్వర్ మండలం తొండాకూర్ గ్రామానికి చెందిన అవుట్ల నరేశ్(36) వ్యవసాయ పనులు చేస్తుంటాడు. ఈ నెల 4న సాయంత్రం అతడు శాపూర్ శివారులోని అల్లూరి ప్రదీప్ రెడ్డికి చెందిన పొలాన్ని దమ్ము చేయడానికి వెళ్లాడు. ఈక్రమంలో ట్రాక్టర్ అదుపుతప్పి పొలంలో ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్పై ఉన్న నరేశ్ బురదలో పడిపోగా కేజ్వీల్ అతని పైనుంచి వెళ్లింది. వెంటనే స్థానికులు గమనించి వచ్చి చూసేసరికి నరేశ్ మృతిచెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నరేశ్ భార్య పుష్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసున్నామని ఏఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. చికిత్స పొందుతూ ఒకరు.. ఖలీల్వాడి: నగరంలో ఇటీవల ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. నగరంలోని పూలాంగ్కు చెందిన మల్లెపూల సందీప్(36), రవికుమార్ కలిసి కార్పెంట్ షాపు నిర్వహించగా నష్టాలు రావడంతో అప్పులపాలయ్యారు. ఆర్థిక ఇబ్బందులు కలగడంతో సందీప్ మనస్తాపం చెంది శుక్రవారం సాయంత్రం చెదల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అతడు భార్యకు సమాచారం అందించడంతో వెంటనే కుటుంబసభ్యులు అతడిని గుర్తించి, చికిత్స నిమిత్తం ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. -
అమ్మాబాపు.. ఎట్లున్నరే..
ఎల్లారెడ్డి: హలో.. అమ్మాబాపు ఎట్లున్నరే.. అంటూ గురుకుల విద్యార్థులు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఫోన్లో మాట్లాడారు. ‘ఫోన్ మిత్ర‘ కార్యక్రమంలో భాగంగా గురుకుల విద్యార్థులకు ఫో న్ సౌకర్యం శనివారం నుంచి అందుబాటు లోకి వచ్చింది. హాస్టల్ విద్యార్థుల కోసం వి ద్యాశాఖ ‘ఫోన్ మిత్ర’ కార్యక్రమానికి శ్రీకా రం చుట్టింది. నలుగురు హాస్టల్ విద్యార్థులకు కలిపి ఒక స్మార్ట్ కార్డు ఇచ్చి వారి తల్లిదండ్రుల, సంరక్షకుల నంబర్లు ఫీడ్ చేశారు. ఈ కార్డు ద్వారా విద్యార్థి తమ కుటుంబసభ్యులతో ప్రతి రోజు 25 నిమిషాలపాటు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఫోన్లో 5 నంబర్ డయల్ చేస్తే గురుకుల సొసైటీ కార్యదర్శికి వెళ్తుంది. హాస్టళ్లు, పాఠశాలల్లో తాము ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులు ఫోన్లో వివరించవచ్చు. ఎల్లారెడ్డి గురుకులంలో 8 ఫోన్లను వేసవి సెలవులల్లో ఏర్పాటు చేసినా శనివారం వాటికి కనెక్షన్ ఇచ్చారు. ‘ఫోన్ మిత్ర’కు అపూర్వ స్పందన గురుకుల పాఠశాలల్లో ప్రారంభం -
సంక్షిప్తం
దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలి దోమకొండ: తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శనివారం దోమకొండ దేశాయి బీడీ కంపెనీ మేనేజర్కు సమ్మె నోటీసును అందజేసినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధిరాములు తెలిపారు. బహుజన వామపక్ష కార్మిక సంఘాల భాగస్వామ్య కార్మిక సంఘాలు జేఏసీల ఆధ్వర్యంలో జూలై 9న జరిగే జాతీయ సమ్మె జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నాగారపు ఎల్లయ్య, ప్రతినిధులు శంకర్,మారుతి,నర్సింలు, తదితరులు పాల్గొన్నారు, గిరిజన మండల కార్యవర్గం ఎన్నిక లింగంపేట(ఎల్లారెడ్డి): లింగంపేట మండల ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నట్లు కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాథోడ్ సురేందర్ తెలిపారు. మండల కేంద్రంలోని బంజారా సేవా సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా జాదవ్ దేవీదాస్, గౌరవ అధ్యక్షుడి మెగావత్ గోపాల్, ఉపాధ్యక్షులు మాలోత్ భద్రు, మాలోత్ భీమా, దేవసోత్ దేవిసింగ్, ప్రధాన కార్యదర్శి దేవసోత్ సర్వన్, సహయ కార్యదర్శులుగా బదావత్ నౌషా, బదావత బలరాం, రమావత్ విజయ్, రమావత్ పాండు, కోశాధికారి బానోత్ మోతీరాంలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బనావత్ శ్రీనివాస్, మోతీసింగ్, ఆయా తండాలకు చెందిన గిరిజనులు పాల్గొన్నారు. విఠలేశ్వరాలయంలో ఏకాదశి ఉత్సవాలు ప్రారంభం ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి విఠలేశ్వరుడి ఆలయంలో శనివారం ఆషాఢ ఏకాదశి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల ఉత్సవాలలో భాగంగా విఠలేశ్వరుడు, రుక్మిణి పాండురంగనికి ప్రత్యేకంగా అభిషేకాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉత్సవాల్లో భాగంగా స్వామి వారికి భక్తులు కాకడ హారతి, పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త నాగభూషణం, ప్రణయ్కుమార్ శర్మ తదితరులున్నారు. ముస్తాబైన బైరాపూర్ విఠలేశ్వర ఆలయం బాన్సువాడ : తొలి ఏకాదశి పురస్కరించుకుని రుక్మిణి విఠలేశ్వర ఆలయాలు ముస్తాబయ్యాయి. బీర్కూర్ మండలం బైరాపూర్ రుక్మిణి విఠలేశ్వర మందిరానికి శనివారం నుంచే భక్తుల తాకిడి ప్రారంభమైంది. ఆలయ కమిటి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ధర్మకర్త ద్రోణవల్లి సతీష్ తెలిపారు. -
గ్రామ కంఠం అంటే..
బాల్కొండ: గ్రామ కంఠం అనేది ఒక గ్రామంలో నివాసాల కోసం కేటాయించిన భూమిని తెలియజేస్తుంది. గ్రామంలోని ఉమ్మడి స్థలం. ఈ స్థలంలో ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించబడుతాయి. ● గ్రామ కంఠం భూమిని వారసత్వంగా అనుభవించాల్సిందే తప్ప ఇతరులకు అమ్మడం, లేదా బదలయించడం కుదరదు. ● భూమిలో నివసించే ప్రజలకు ఆ భూమిపై పూర్తి హక్కులు ఉండవు. కాని వారు దానిని అనుభవించవచ్చు. ●గ్రామ కంఠం భూమిని ప్రభుత్వం అవసరమై తే స్వాధీనం చేసుకుంటుంది. లేదా ఇతర అవసరాలకు ఉపయోగించుకుంటుంది. ●గ్రామ కంఠం భూములను రెవెన్యూ శాఖ నిర్వహిస్తుంది. అవసరమైన పత్రాలను జారీ చేస్తుంది.మీకు తెలుసా? -
నిషేధిత ప్లాస్టిక్ విక్రయిస్తే దుకాణాలను సీజ్ చేస్తాం
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలో వ్యాపారులు నిషేధిత ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులను విక్రయించినా, వినియోగించినా దుకాణాలను సీజ్ చేస్తామని మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రంలో కొత్తబస్టాండ్, సుభాష్రోడ్, సిరిసిల్లారోడ్లలో వ్యాపారదుకాణాలు, హోటళ్లను తనిఖీ చేశారు. పలు దుకాణాల్లో నిషేధిత కవర్లు వినియోగించడంతో యజమానులకు జరిమానాలు విధించారు. విక్రయిస్తున్న కవర్లు, క్యారీబ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సానిటరీ ఎస్ఐ పర్వేజ్, జవాన్లు పాల్గొన్నారు. బీసీలకు యూపీఎస్సీ లాంగ్టర్మ్ ఉచిత కోచింగ్ కామారెడ్డి అర్బన్: యూపీఎస్సీ సివిల్స్కు ఉచిత లాంగ్ టర్మ్ (ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్) కోచింగ్ కోసం అర్హులై బీసీ అభ్యర్థుల నుంచి ఈనెల 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా బీసీ అభివృద్ధి అధికారి బి.స్రవంతి ఒక ప్రకటనలో తెలిపారు. దరఖా స్తు చేసిన వారికి ఈనెల 12న ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందని, ఎంపికై న వారికి 25 నుంచి వచ్చే సంవత్సరం ఏప్రిల్ 30 వరకు హైదరాబాద్లోని సైదాబాద్ లక్ష్మినగర్లోని బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. నమ్మించి మోసం చేసిన యువకుడిపై కేసు మోపాల్: మండలంలోని ముదక్పల్లికి చెందిన ఓ మహిళను మోసం చేసిన అస్మత్ ఖాన్ అనే యువ కుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై యాదగిరి గౌడ్ శనివారం తెలిపారు. అస్మత్ ఖాన్, గ్రామానికి చెందిన సదరు యువతి గత కొంతకాలంగా ప్రే మించుకుంటున్నారు. అతడు పెళ్లి చేసుకుంటానని తెలపడంతో శారీరకంగా దగ్గరయ్యారు. చివరకు ఆమె గర్భం దాల్చడంతో మాటమార్చాడు. దీంతో బాధిత మహిళ తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
భర్తపై భార్య దాడి
● చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి బోధన్రూరల్: భర్తపై భార్య దాడి చేయగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన బోధన్ మండలంలో చోటుచేసుకుంది. బోధన్ రూరల్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని మినార్పల్లి గ్రామానికి చెందిన దారావత్ దేశ్య నాయక్ (57) కొంతకాలంగా వ్యసనాలకు బానిసై ఎలాంటి పని చేయకుండా జులాయిగా తిరిగేవాడు. ఈ విషయంలో అతడి భార్య సాలు బాయి, కొడుకు వసంత్ల మధ్య తరచూ గొడవలు వస్తుండేవి. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం దేశ్యనాయక్పై భార్య సాలు బాయి బలమైన ఇనుప రాడుతో దాడికి పాల్పడింది. ఈ ఘటనలో దేశ్య నాయక్ తీవ్రంగా గాయపడగా స్థానికులు, కొడుకు అతడిని చికిత్స నిమిత్తం బోధన్ జిల్లా ఆస్పత్రి తరలించగా, రాత్రి చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి అన్న కొడుకు గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. హత్యలో మృతుడి భార్యతోపాటు కొడుకు హస్తం కూడ ఉండొచ్చని ఫిర్యాదులో పేర్కొనగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మచ్చేందర్ రెడ్డి శనివారం తెలిపారు. -
స్పెషల్ డ్రైవ్లో 130 సెల్ఫోన్ల రికవరీ
కామారెడ్డి క్రైం: స్పెషల్ డ్రైవ్ ద్వారా 15 రోజుల వ్యవధిలో జిల్లాలో 130 సెల్ఫోన్లను రికవరీ చేసినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఆయన వివరాలు వెల్లడించారు. పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్ఫోన్లను రికవరీ చేశామని, వాటి విలువ సుమారు రూ.17లక్షలు ఉంటుందని తెలిపారు. సెల్ఫోన్లు చోరీకి గురైనా, పోగొట్టుకున్నా ఆందోళనకు గురికావొద్దని, సీఈఐఆర్ విధానంలో రికవరీ చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సెల్ఫోన్ల రికవరీలో రాష్ట్రం లోని కమిషనరేట్లను మినహాయిస్తే కామారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. సెల్ఫోన్ పోగొట్టుకున్న వారు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతోపాటు భద్రతా కారణాల దృష్ట్యా వెంటనే సిమ్కార్డును బ్లాక్ చేయించాలని సూచించారు. ఆలస్యం చేస్తే వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలిగే అవకాశం ఉంటుందన్నారు. సెల్ఫోన్ల రికవరీలో ప్రతిభ కనబర్చిన బృందం సభ్యులను ఎస్పీ అభినందించారు. రికవరీ అయిన ఫోన్ల వివరాలను బాధితులకు తెలుపుతామని, జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఆర్ఎస్సై బాల్రాజు (87126 86114)ను సంప్రదించి తీపసుకువెళ్లాలని ఎస్పీ సూచించారు. -
ఆదర్శం.. చిన్నకొడప్గల్ సొసైటీ
పిట్లం(జుక్కల్): దీర్ఘకాలిక రుణాల వసూళ్లలో 2024–25 సంవత్సరంలో చిన్నకొడప్గల్ సొసైటీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రథమస్థానంలో నిలిచింది. దీర్ఘకాలిక రుణాల వసూళ్లలో సొసైటీ 45 శాతం రుణాలు వసూళ్లు చేసింది. నిజామాబాద్ లోని ఎన్డీసీసీ సెంట్రల్ బ్యాంక్లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో అధికారులు చిన్నకొడప్గల్ సొసైటీ కార్యదర్శి హన్మాండ్లును ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. చిన్నకొడప్గల్ సహకార సంఘం పరిధిలో 8 గ్రామాలు ఉన్నాయి.సహకార సంఘంలో మొత్తం 4,300 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు.ఇందులో 3,476 మంది రైతులకు సభ్యత్వం ఉండగా,ఇందులో 3, 195 మంది రైతులు స్వల్పకాలిక, 281 మంది రైతు లు దీర్ఘ కాలిక రుణాలు తీసుకున్నారు. దీర్ఘకాలికరుణాలు తీసుకున్న రైతులకు రుణం వడ్డీలో 40 శాతం రాయితీ వస్తుందని బ్యాంక్ సిబ్బంది ద్వా రా,మహజన సభలలో సొసైటీ సిబ్బంది అవగాహన కల్పించడంతో రైతులు రుణాలు చెల్లించడాని కి ముందుకు వచ్చారు.సొసైటీ పరిధిలో 281 మంది రైతులకు రూ.8 కోట్ల దీర్ఘ కాలిక రుణాలు తీసుకున్నారు. ఇందులో 2024– 25 సంవత్సరంలో 180 మంది రైతుల వద్ద నుంచి రూ. 3 కోట్ల 80 ల క్షల రుణాలు వసూళ్లు చేసి ఉమ్మడి నిజామాబాద్ జి ల్లాలో ఆదర్శంగా నిలిచింది. సొసైటీ సిబ్బంది రైతులకు సకాలంలో పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు అందిస్తున్నారు. సి బ్బంది రుణగ్రహీతలకు అవగాహన కల్పించి సమయానికి అప్పులు చెల్లించేలా కృషి చేస్తున్నారు. దీర్ఘకాలిక రుణాల వసూళ్లలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రథమ స్థానం అప్పులు చెల్లించేలా అవగాహన కల్పిస్తున్న సొసైటీ సిబ్బంది రైతులకు అవగాహన కల్పించాం రుణాల వసూళ్ల కోసం జిల్లా అధికారులు, బ్యాంక్ అధికారుల సహాయంతో సంఘం పరిధిలోని గ్రామాలలో రుణాలు చెల్లిస్తే వడ్డీలో 40 శాతం రాయితీ వస్తుందని రైతులకు అవగాహన కల్పించాం. రుణాల రికవరీలో సహకరించిన సిబ్బందికి, జిల్లా అధికారులకు కృత్ఞతలు. – హన్మాండ్లు, సొసైటీ కార్యదర్శి, చిన్నకొడప్గల్ కర్షక మిత్ర రుణాలు ఇప్పించాం దీర్ఘ కాలిక రుణాల వసూళ్లలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సొసైటీ మొదటి స్థానంలో నిలవడంతో సంతోషంగా ఉంది. దీర్ఘ కాలిక రుణాలు తీసుకున్న రైతుల ఇళ్లకు స్వయంగా వెళ్లి రుణాలు చెల్లించాలని అవగాహ కల్పించా. సంఘంలోని 20 మందికి కర్షక మిత్ర రుణాలు ఇప్పించా. – నాగిరెడ్డి, సొసైటీ చైర్మన్, చిన్నకొడప్గల్ -
స్పీడ్ బ్రేకర్లతో దెబ్బతిన్న బస్సు
మాచారెడ్డి: మండల కేంద్రంలోని బస్టాండ్లోకి వెళ్లే రోడ్డుపై ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్ల కారణంగా ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. వివరాలు ఇలా.. కరీంనగర్ నుంచి కామారెడ్డికి శనివారం ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సు బయలుదేరింది. మార్గమధ్యలో మాచారెడ్డి బస్టాండ్లోకి వెళ్తుండగా రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్ల మూలంగా బస్సు అదుపుతప్పింది. దీంతో బస్సు లగేజీ బాక్సుల డోర్లు ఊడి కిందపడ్డాయి. అలాగే పలువురు ప్రయాణికులకు స్వల్పంగా గాయలైనట్టు స్థానికులు తెలిపారు. గతంలో కూడా రెండుసార్లు ఇదే స్పీడ్ బ్రేకర్ల వద్ద ప్రమాదాలు జరిగి పలువురు గాయపడ్డారు. ఆర్టీసీ అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్ల ఎత్తు తగ్గించాలని పలువురు కోరుతున్నారు. -
విఠల విఠల
స్వామికి ఇంట్లోనే ఆలయంమద్నూర్ మండల కేంద్రానికి చెందిన వట్నల్వార్ కృష్ణ, రుక్మిణీ దంపతులు పండరీపూర్ విఠలేశ్వరుని భక్తులు. ఏడాది క్రితం నూతన ఇంటిని నిర్మించుకున్న సమయంలో ఇంట్లో విఠలేశ్వరునికి గుడి కట్టించుకున్నారు. మూడు అడుగుల ఎత్తుతో ఉన్న విఠలేశ్వర స్వామి విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లోని గుడిలో ప్రతిష్టించారు. నిత్యం స్వామివారికి వస్త్రాలంకరణసేవ, నైవేద్యం, అర్చనలు చేస్తారు. తొలి ఏకాదశి రోజున పె ద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. పండరిపూర్ ఆలయంలో కొనసాగే పూజావిధానా న్నే తన ఇంట్లోని ఆలయంలో పాటిస్తారు. ● పాండురంగని దర్శనం కోసం పండరీపూర్కు.. ● జిల్లా నుంచి ‘దిండి’ పాదయాత్ర ● తొలిఏకాదశి రోజున దర్శనంతో పులకించనున్న భక్తులుఉత్తమ సొసైటీగా ఉత్తునూర్ సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని ఉ త్తునూర్ సొసైటీ ఉత్తమ సొసైటీగా ఎంపికై ంది. గత పది సంవత్సరాల నుంచి దీర్ఘకాలిక రుణాలు రూ.3 కోట్ల 5 లక్షలు వసూలయ్యా యి. విండో చైర్మన్ కాట్మండి ప్రభాకర్రావు, సీఈవో నహీంను గ్రామస్తులు, రైతులు అభినందించారు. 2024–2025 ఆర్థిక సంవ్సరంలో కామారెడ్డి జిల్లాలో ఐదో స్థానంలో ఉన్న ట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా విండో చైర్మన్ ప్రభాకర్రావు మాట్లాడుతూ.. సొసైటీల ద్వారా రైతులు పొందిన రుణాలు సకాలంలో తిరిగి చెల్లించి రైతు సహకార సంఘాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాంచందర్రావు, నిట్టూరి వెంకట్ రావు, డీకే రావు, శి వాజీరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా సాహిత్యం ఎంతో గొప్పది కామారెడ్డి అర్బన్ : కామారెడ్డి జిల్లా సాహి త్యం ఎంతో గొప్పదని, సాహితీవేత్తల కృషి అభినందనీయమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్రెడ్డి అన్నారు. తె లంగాణ రచయితల వేదిక (తెరవే) జిల్లా అ ధ్యక్షుడు గఫూర్ శిక్షక్, ప్రతినిధులు శనివా రం చంద్రకాత్రెడ్డిని సన్మానించి తెరవే జిల్లా కవులు, రచయితల పుస్తకాలను గ్రంథాలయానికి అందజేశారు. ఈ సందర్భంగా చైర్మ న్ మాట్లాడుతూ.. జిల్లా సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలకు గ్రంథాలయాల్లో ప్ర త్యేక చోటు కల్పించనున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో తెరవే ప్రతినిధులు మంద పీ తాంబర్, బి నాగభూషణం, కాసర్ల రామ చంద్రం, కౌడి రవీందర్, తిరుపతిరావు, గా యని సంధ్య, బానోత్ సురేశ్, లక్కీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పట్టణ అభివృద్ధికి సహకరించాలి కామారెడ్డి టౌన్: పట్టణ అభివృద్ధికి పట్టణ ప్రజలు సహకరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్నాయక్ అన్నారు. మున్సిపల్ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి పట్టణంలో శనివారం చేపట్టిన పారిశుద్ధ్య పనులను ఆయన పర్యవేక్షించారు. ప్రజలు, వ్యాపారులు చెత్త ను రోడ్లపై, మురికి కాలువల్లో వేయకుండా చెత్తసేకరణ ఆటోలకు ఇవ్వాలని కోరారు. సకాలంలో ఆస్తి, కులాయి పన్ను చెల్లించాలన్నారు. శానిటేషన్, తాగునీరు, తదితర సమస్యలుంటే నేరుగా మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే పరిష్కరిస్తామన్నారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి, శానిటరీ ఎస్సై ఫర్వేజ్, జవాన్లు ఉన్నారు. ● దశాబ్దాలుగా వెళ్తున్న భక్తులు ఎందరో.. ● అక్కడికి వెళ్లలేనివారు జిల్లాలోని బైరాపూర్ గుడికి..సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉన్న కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లో విఠలేశ్వరుడిని వేలాది కుటుంబాలు పూజిస్తాయి. వారంతా ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున విఠలేశ్వరుడిని దర్శించుకుంటారు. మహారాష్ట్రలోని పండరీపూర్లో కొలువైన విఠలేశ్వరుడు, రుక్మిణీదేవి ఆలయానికి వేలాది మంది భక్తులు తరలివెళ్తారు. ఉమ్మడి జిల్లాలోని మద్నూర్, జుక్కల్, డోంగ్లీ, పెద్ద కొడప్గల్, నిజాంసాగర్, బిచ్కుంద, బాన్సువాడ, బీర్కూర్, నస్రుల్లాబాద్, గాంధారి, కోటగిరి, రుద్రూ ర్, వర్ని, పొతంగల్, బోధన్ తదితర మండలాల నుంచి ఏటా తొలి ఏకాదశికి పక్షం రోజుల ముందుగానే వేలాది మంది ‘దిండి’పేరుతో పాదయాత్రగా బయలుదేరి వెళ్తా రు. 320 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లి దర్శనం చేసుకుంటారు. వేలాది మంది రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్లి తొలి ఏకా దశి రోజు పండరీపూర్కు చేరుకుని స్వామిని దర్శించుకుంటారు. దారి పొడవునా స్థానికులు ‘దిండి’గా వెళ్తున్న భక్తులకు భోజన సౌకర్యం కల్పిస్తారు. మరికొందరు వాహనాల్లో వెళ్తారు. పండరీపూర్కు పాదయాత్రగా వెళ్తున్న భక్తులు హిప్పర్గ నుంచి పాదయాత్రగా బైరాపూర్ విఠలేశ్వర ఆలయానికి వెళ్తున్న భక్తులుఇరవై ఏళ్లుగా వెళ్తున్నా.. ఇరవై ఏళ్లుగా ప్రతి ఏడాది పండరిపూర్ కు పాదయాత్రగా వె ళ్తున్నా. విఠలేశ్వరుని అనుగ్రహంతో శక్తి ఉన్నన్ని రోజులు ఏటా తొలి ఏకాదశికి చేరుకునేలా పాదయాత్రగా వెళ్లి వస్తూనే ఉంటా. వేలాది మంది మా ప్రాంతం వాళ్లు పండరిపూర్కు వస్తారు. – కొనింటి విఠల్, బిచ్కుందవిఠలేశ్వరుడి అనుగ్రహంతోనే.. ప్రతి ఏడాది పండరిపూర్లోని విఠలేశ్వరుడిని దర్శించుకుంటా. కొన్నేళ్లుగా విఠలేశ్వర స్వామి వద్దకు వెళ్లి రావడం జరుగుతోంది. మాకు విఠలేశ్వరుడే అన్నీ. స్వామిని నమ్ముకున్నోళ్లకు ఏలోటు ఉండదు. అంతా స్వామిదయ. ఇరవై ఐదేళ్లుగా వెళ్తున్నా. – సంగాయప్ప స్వామి, మద్నూర్ దైవచింతనలో ఉంటాం విఠలేశ్వరుడిని నమ్ముకున్నం. నిత్యం దైవ చింతనలో ఉంటాం. పదిహేనేళ్లుగా క్రమం తప్పకుండా పండరిపూర్కు వెళ్లి దర్శనం చేసుకుని వస్తున్నాను. అంతా స్వామి నడిపిస్తున్నాడు. చేతనైనన్ని రోజులు వెళ్లి వస్తూనే ఉంటా. – వెంకట్ మహారాజ్, మద్నూర్ నాలుగు దశాబ్దాలుగా వెళ్తున్నా నేను సుమారు 41 ఏళ్లుగా పండరిపూర్కు వెళ్తున్నాను. విఠలేశ్వరుడి అనుగ్రహంతో ఇప్పటికీ క్రమం తప్పకుండా వెళ్లి వస్తున్నాను. అంతా స్వామి దయ. ప్రతి ఏడాది వెళ్లి వస్తాను. నాతోపాటు మా ఊరి వాళ్లు చాలా మంది వస్తారు. – దార్పల్ సాయిలు, బిచ్కుంద న్యూస్రీల్బైరాపూర్లో విఠలేశ్వరుడు నస్రుల్లాబాద్ మండలం బైరాపూర్లో కొలువైన విఠలేశ్వరస్వామి ఆలయానికి కూడా తొలి ఏకాదశి రోజున వేలాది మంది భక్తులు తరలివస్తారు. పండరిపూర్కు వెళ్లలేని వాళ్లంతా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. దర్శనానికి వచ్చిన భక్తులకు స్థానిక ఆలయ నిర్వాహకులు అన్నదానం చేస్తారు. బైరాపూర్ ఆలయానికి కూడా వేలాది మంది భక్తులు తరలివస్తున్నారు. తొలి ఏకాదశి రోజున బైరాపూర్ ఆలయం జనంతో కిక్కిరిస్తోంది. పుండరీకుడు తన తల్లిదండ్రులకు చేస్తున్న సేవను చూస్తూ ముగ్ధుడైన ఆ మహావిష్ణువు (పాండురంగడు) రెండు చేతులు నడుముకు పెట్టుకుని ఇటుకపై అలానే నిల్చుండిపోయాడు. విఠోబ.. విఠలేశ్వరుడు.. పాండురంగడు ఏ పేరుతో పిలిచినా స్వామి పలుకుతాడని భక్తుల నమ్మకం. ఆ నమ్మకమే ప్రతి ఏడాది భక్తులను పండరీపురానికి నడిపిస్తోంది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా జిల్లా నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ‘దిండి’గా తరలివెళ్లారు. -
పార్కింగ్కు చోటేది?
● కొంచెం స్థలం కూడా వదలకుండా నిర్మాణాలు ● సెల్లార్లలోనూ దుకాణాల ఏర్పాటు ● రోడ్లపైనే వాహనాలను నిలపాల్సిన పరిస్థితి ● ఇబ్బందిపడుతున్న వాహనదారులు, పాదచారులు ● పట్టించుకోని అధికారులుకామారెడ్డి టౌన్ : నాలుగు జిల్లాల కూడలి అయిన కామారెడ్డి పట్టణం రోజురోజుకు విస్తరిస్తోంది. జిల్లా కేంద్రం అయ్యాక రాకపోకలు మరింత పెరిగాయి. అయితే వాహనాలను నిలిపేందుకు స్థలం లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. రోడ్లపైనే వాహనాలను నిలపాల్సి వస్తోంది. నిబంధనలప్రకారం బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేప్పుడు సెల్లార్ను పార్కింగ్కోసం వదలాల్సి ఉంటుంది. కానీ సెల్లార్లను నిర్మించినా.. వాటిలోనూ దుకాణాలను ఏర్పాటు చేశారు. కొందరు డ్రెయినేజీలు, రోడ్లను ఆనుకొని నిర్మాణాలు చేపట్టారు. ఫలితంగా జిల్లా కేంద్రంలో ప్రధాన రోడ్లతో పాటు వ్యాపార సముదాయాల ఏరియాల్లో పార్కింగ్ స్థలాలు లేక వాహనాలను రోడ్లపైనే నిలపాల్సి వస్తోంది. దీంతో ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. రద్దీ సమయాల్లో ఆయా రోడ్లపై నడవడం కూడా ఇబ్బందిగా ఉంటోంది. ఏళ్లుగా ఈ సమస్య ఉన్నా బల్దియా అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అనుమతులు ఒకలా.. నిర్మాణం మరోలా.. జిల్లా కేంద్రంలో 25 వేల వరకు గృహాలున్నాయి. ప్రధాన రోడ్లపై వ్యాపార దుకాణాలు 5,500 లకుపైగా ఉన్నాయి. సెల్లార్లతో కూడిన భవనాలు 50 కిపైగా ఉంటాయి. కొన్ని సెల్లార్లలో వ్యాపార దుకాణాలను నిర్మించుకుని యజమానులు యథేచ్ఛగా అద్దెలకు ఇచ్చుకున్నారు. చాలా భవనాలు సెట్ బ్యాక్ లేకుండా రోడ్లు, మురికి కాలువలపైనే నిర్మించారు. వీరంతా మున్సిపాలిటీ అనుమతుల ఒకలాగా ప్లానింగ్ తీసుకుని, నిర్మాణాలు మాత్రం మరొకలా చేపట్టారు. ఓపెన్ స్థలాలలో ఏర్పాట్లు చేస్తే.. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యే చోట మున్సిపాలిటీకి సంబంధించిన ఓపెన్ స్థలాలున్నాయి. వీటిలో వాహనాలను నిలిపేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే సుభాష్రోడ్, మాయాబజార్, వీక్లీమార్కెట్రోడ్, నాజ్టాకీస్ రోడ్ల పార్కింగ్ సమస్య తీర్చేందుకు గాంధీగంజ్లో, పొట్టిశ్రీరాములు విగ్రహం పక్కన, గంజ్ ప్రభుత్వ స్కూల్ ముందు, లయన్స్ క్లబ్ సమీపంలోని మున్సిపల్ స్థలాలను పార్కింగ్ కోసం వినియోగించుకుంటే ట్రాఫిక్ సమస్య కొంత తీరే అవకాశాలున్నాయి. చర్యలు తీసుకుంటాం పట్టణంలోని ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు అనుమతి లేని సెల్లార్ల యజమానులకు, రోడ్లపై ఆక్రమణదారులకు నోటీసులను జారీ చేస్తాం. వ్యాపార, వాణిజ్య దుకాణాల వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసుకోవాలని వాటి నిర్వాహకులకు సూచిస్తాం. పోలీసు శాఖ సమస్వయంతో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం. వాహనదారులు సైతం ప్రధాన రోడ్లు, చౌరస్తాలలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలు అలా నిలపకూడదు. – రాజేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డి అంతటా ట్రాఫికర్..జిల్లా కేంద్రంలో ప్రధాన రోడ్లు, కూడళ్లతో పా టు, గల్లీల్లోనూ పార్కింగ్ సమస్య నెలకొంది. సుభాష్రోడ్, మాయాబజార్, నాజ్టాకీస్రోడ్, సిరిసిల్లరోడ్, వీక్లీమార్కెట్రోడ్, స్టేషన్రోడ్, పోలీస్స్టేషన్రోడ్, నిజాంసాగర్చౌరస్తా, జాతీ య రహదారి, కొత్తబస్టాండ్, దేవునిపల్లిరోడ్, జన్మభూమిరోడ్, అశోక్నగర్ కాలనీ, పాతబస్టాండ్, అడ్లూర్రోడ్లలో పార్కింగ్ సమస్య తీ వ్రంగా ఉంది. కొత్తబస్టాండ్, నిజాంసాగర్ చౌర స్తా ముందు హోటళ్లు, బార్లు, వ్యాపార దుకాణాల ముందు పార్కింగ్ స్థలం లేక రోడ్లపైనే వాహనాలను నిలుపుతున్నారు. అలాగే పాతబస్టాండ్, సిరిసిల్లరోడ్లో బ్యాంకుల ముందు కూడా రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. గల్లీల లో కూడా డ్రెయినేజీ వరకు నిర్మాణాలతో పా ర్కింగ్కు సమస్యలు ఏర్పడుతున్నాయి. -
ఆయిల్పాం సాగుతో అధిక లాభాలు
గాంధారి : ఆయిల్పాం సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయ శాఖాధికారి తిరుమల ప్రసాద్, జిల్లా ఉద్యాన అధికారి జ్యోతి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో శుక్రవారం జిల్లాలోని వ్యవసాయ శాఖాధికారులు, రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రైతులకు ఆయిల్పాం తోటలు, ఉద్యానవన పంటలపై అవగాహన కల్పించారు. ఆయిల్పాం మొక్కలను ప్రభుత్వం రాయితీపై సరఫరా చేస్తుందన్నారు. ఇందులో అంతర పంటలతో అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి ఏడీఏలు అపర్ణ, సుధా మాధురి, మండల ఏవో రాజలింగం తదితరులు పాల్గొన్నారు. గురుకుల పాఠశాల తనిఖీ నస్రుల్లాబాద్: మండల కేంద్రంలోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలను శుక్రవారం డీఈవో రాజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ గతేడాది పదో తరగతి, ఇంటర్లలో ఉత్తీర్ణత శాతం బాగుందన్నారు. పాఠశాల నిర్వహణ, మెనూ అందించిన తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ప్రిన్సిపల్ మాధవరావు, సిబ్బంది చరణ్ కుమార్ ఉన్నారు. నేడు ఎస్సీ, ఎస్టీ కమిషన్ బృందం రాక కామారెడ్డి అర్బన్: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఐదుగురు సభ్యుల బృందం శనివారం జిల్లాకు రానుంది. ఈ విషయాన్ని జిల్లా ఎస్సీ కులాల అభివృద్ధి అధికారి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించే ఎస్సీ, ఎస్టీ పీడన నిరోధక చట్టం(పీసీఆర్ యాక్ట్), అట్టడుగు వర్గాలపై దాడులను నిరోధించే ప్రత్యేక చట్టం (పీవోఏ యాక్ట్), ల్యాండ్, సర్వీస్ విషయాలపై ఆయన సమీక్షిస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశానికి బాధితులు హాజరవ్వాలని తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గంగారాం, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల బాబు వేరొక ప్రకటనలో కోరారు. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా వినతి పత్రాలు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. -
పేలుడు పదార్థాల కలకలం
కామారెడ్డి క్రైం : పెద్ద ఎత్తున పేలుడు పదార్థాల నిల్వలు బయటపడడం జిల్లా కేంద్రంలో కలకలం సృష్టించింది. ఓ ఇంటి నిర్మాణం కోసం బండరాళ్ల బ్లాస్టింగ్కు ఈ సామగ్రిని వినియోగిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు పట్టుకున్నారు. జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ చైతన్యరెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని పీఎంహెచ్ కాలనీలో నివాసం ఉంటున్న చింతల శ్రీధర్కు కేపీఆర్ కాలనీలో ఓ ప్లా టు ఉంది. దాంట్లో ఇంటి నిర్మాణం కోసం పనులు ప్రారంభించాడు. గుంతలు తీయగా వచ్చిన బండరాళ్లను పేల్చివేసి తొలగించడానికి బొంత సంపత్, లక్ష్మీనారాయణ, రాజులతో రూ.50 వేలకు ఒప్పందం చేసుకున్నాడు. ఎలాంటి అనుమతులు లేకుండా, అక్రమ పద్ధతిలో సేకరించిన జిలెటిన్ స్టిక్స్, డి టోనేటర్లు, కార్డెక్స్ వైరు, బ్యాటరీలతో బండరాళ్లను పేల్చడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు దీనిని గమనించి భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ ఎస్హెచ్వో నరహరి, సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా మరోచోట పెద్దమొత్తంలో పేలుడు పదార్థాలు నిల్వ చేసిన విషయం బయటపడింది. పట్టణానికి సమీపంలోని లింగాపూర్ శివారులో ఇటీవలే వెలసిన శ్రీవారి వెంచర్లోని రేకుల షెడ్డులో 1,564 జిలెటిన్ స్టిక్స్, 41 డిటోనేటర్లు, 16 బెండల్స్(సుమారు 4,300 మీటర్లు) కార్డెక్స్ వైరు, బ్యాటరీ, ఒక చెక్ మీటర్, ఇతర సామగ్రిని అక్రమంగా నిల్వ చే సినట్లు గుర్తించారు. వాటన్నింటినీ స్వాధీనం చేసు కున్నారు. శంకర్, స్వామి అనే వ్యక్తుల ద్వారా పేలు డు పదార్థాలను తెప్పించినట్లు విచారణలో తేలింది. ప్రస్తుతానికి చింతల శ్రీధర్, సంపత్, లక్ష్మీ నారాయణ, రాజులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ చైతన్యరెడ్డి తెలిపారు. విచారణ కొనసాగుతుందన్నారు. విచారణలో చాకచక్యం గా వ్యవహరించిన ఎస్హెచ్వో నరహరి, ఎస్సై శ్రీ రాం, కానిస్టేబుళ్లు నరేష్, విశ్వనాథ్, అనిల్, విజయ్ గౌడ్, వినయ్, సంపత్, నర్సారెడ్డిలను అభినందించారు.వెంచర్లో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలుజిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్ల పేల్చివేత..కేపీఆర్ కాలనీలోని శ్రీధర్ ప్లాట్లో బండరాళ్లను పేల్చేందుకు పేలుడు పదార్థాలను సిద్ధం చేసి ఉంచినట్లు గుర్తించిన పోలీసులు.. బాంబ్ స్క్వాడ్ బృందాన్ని రప్పించారు. శుక్రవారం సాయంత్రం కాలనీలో ప్రజల రాకపోకలను నిలిపివేసి ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లకుండా వాటిపై మట్టి కుప్పలు పోయించి, జాగ్రత్తలు తీసుకుంటూ పేల్చివేశారు. జిల్లాకేంద్రంలో 1,564 జిలెటిన్ స్టిక్స్, 41 డిటోనేటర్లు స్వాధీనం 16 బెండళ్ల కార్డెక్స్ వైరు, ఇతర సామగ్రి సైతం.. రాళ్ల బ్లాస్టింగ్కు ఉపయోగిస్తుండగా పోలీసులకు సమాచారం నలుగురిపై కేసు నమోదు, నిందితుల రిమాండ్ -
రోశయ్య సేవలు మరువలేనివి
కామారెడ్డి క్రైం: దివంగత ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సేవలు మరువలేనివని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. రోశయ్య జయంతిని కలెక్టరేట్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్గా రోశయ్య అందించిన సేవలు విలువైనవని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సాయిరెడ్డి, వెంకట్ రెడ్డి, ఆర్యవైశ్య ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో.. జిల్లా పోలీసు కార్యాలయంలో రోశయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. ఏఎస్పీ నరసింహా రెడ్డి, అధికారులు రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
పూడికతీతకు మోక్షం
● పోచారం ప్రధానకాలువలో పనులకు రూ.40 లక్షల నిధులు మంజూరు ● పూర్తయిన టెండర్ ప్రక్రియనాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాల వరప్రదాయినిగా పేరొందిన పోచారం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధానకాలువలో పూడికతీత, పొదల తొలగింపుతోపాటు కాలువకు ఇరువైపులా ఉన్న ముళ్ల చెట్లు, పొదల తొలగింపునకు మోక్షం లభించనుంది. చాలాకాలంగా ప్రధాన కాలువలో పెరిగిన చెట్లతోపాటు పూడిక వల్ల నీటి ప్రవాహానికి ఆటంకం కలిగి చివరి ఆయకట్టుకు నీరు చేరేందుకు ఎన్నో ఇబ్బందులు కలిగేవి. దట్టంగా పెరిగిన చెట్లతోపాటు పూడికను, కాలువకు ఇరువైపులా పెరిగిన ముళ్లపొదలను తొలగించాలని స్థానిక నీటిపారుదలశాఖ అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో అధికారులు ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ కింద రూ.40 లక్షల నిధులను మంజూరు చేశారు. పనులకు సంబంధించి ఇటీవల అధికారులు టెండర్ ప్రక్రియను పూర్తిచేశారు. త్వరలోనే కాలువలో పూడికతీత పనులు చేపట్టనున్నారు. నిధుల మంజూరులో ఆలస్యం.. పోచారం ప్రధాన కాలువలో పూడికతీత, చెట్ల తొలగింపు పనులకు నిధుల మంజూరులో ఆలస్యమయింది. ఇటీవల రబీ పంటలసాగు పూర్తయ్యేనాటికి నిధులు మంజూరై, టెండర్ ప్రక్రియ పూర్తయ్యుంటే వేసవిలో కాలువ మరమ్మతు పనులు చేపట్టేందుకు వీలుగా ఉండేది. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమవడంతోపాటు ప్రాజెక్టు నిండితే వానాకాలం పంటల సాగుకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. దీనివల్ల కాలువ మరమ్మతు పనులకు ఆటంకం కలుగనుంది. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.నీరందేలా చేయాలి పోచారం ప్రాజెక్టు నుంచి విడుదల చేసిన నీరు చివరి ఆయకట్టుకు అందడంలేదు. ప్రధానకాలువలో దట్టంగా పెరిగిన చెట్లతోపాటు పూడిక వల్ల నీరు చివరి ఆయకట్టు వరకు చేరడానికి చాలా సమయం పడుతోంది. ప్రధానకాలువలో పెరిగిన చెట్లను, పూడికను తీసేస్తే నీరు సకాలంలో చేరుతుంది. కాలువలో పెరిగిన చెట్లకొమ్మలను తొలగించడంపై అధికారులు దృష్టి సారించాలి. – పట్లోళ్ల భాగయ్య, రైతు, ఆజామాబాద్, ఎల్లారెడ్డిచాలా ఇబ్బందవుతుంది పోచారం గ్రామశివారులో ప్రధానకాలువ పక్కన ఉన్న నా పొలానికి వెళ్లాలంటే కాలువ కట్ట వెంట పోవాలి. కాలువ కట్టకు ఇరువైపులా దట్టంగా తుమ్మ చెట్లు పెరిగాయి. పొలానికి వెళ్తుంటే చెట్ల కొమ్మలు కళ్లకు తగులుతున్నాయి. వాటిని తొలగించాలని అధికారులకు విన్నవించాం. నిధులు మంజూరయ్యాయని తెలిసింది. అధికారులు స్పందించి చెట్లకొమ్మలను తొలగించాలి. – రాజు, రైతు, పోచారం, నాగిరెడ్డిపేట -
అత్తను హత్యచేసిన అల్లుడి అరెస్టు
పిట్లం(జుక్కల్): మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో అత్తను హత్య చేసిన అల్లుడిని అరెస్టు చేసి, రిమాండుకు తరలించినట్లు బాన్సువాడ సీఐ రాజేష్ తెలిపారు. బాన్సువాడ రూరల్ సీఐ కార్యాలయంలో శుక్రవారం ఆయన వివరాలు వెల్లడించారు. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన జిన్నా లక్ష్మీ (50) మూడేళ్ల క్రితం అల్లుడైన జిన్న బాగరాజుకు రూ.లక్ష అప్పుగా ఇచ్చింది. డబ్బులు ఇవ్వమని అల్లుడిని ఎన్నిసార్లు అడిగిన ఇవ్వలేడు. ఇటీవల బాగరాజు తను పండించిన జొన్నలను విక్రయించగా వచ్చిన డబ్బులను అత్త అకౌంట్లో వేయించాడు. ఆ డబ్బుల కోసం అతడు అత్తను అడిగాడు. తనకు ఇవ్వాల్సిన బాకీ కింద ఆ డబ్బులు జమచేసుకుంటానని అత్త అతడికి తెలిపింది. దీంతో పగ పెంచుకున్న బాగరాజు తన అత్తను చంపాలని పథకం పన్ని గురువారం మధ్యాహ్నం ఆమైపె కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు రాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన రోజే నిందితుడు తన బైక్పై హత్యకు ఉపయోగించిన కమ్మ కత్తితో పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోయాడు. నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్కు పంపించినట్లు పోలీసులు తెలిపారు. -
రామారెడ్డిని రక్షించే అష్ట భైరవులు
మీకు తెలుసా? రామారెడ్డి గ్రామా న్ని పురాతన కాలం నుంచి ఊరు చుట్టూ ఉన్న అష్ట భైరవులు రక్షిస్తుంటారని గ్రామస్తుల ప్రగాడ విశ్వాసం. అష్ట భైరవు లు స్వయంభుగా వెలియగా, కాలక్రమేణ రెండు విగ్రహాలు మాత్రమే పూజలందుకుంటున్నాయి. ● గ్రామంలోని 12ఫీట్ల దిగంబర కాలభైరవుడి విగ్రహానికి ఆలయంతోపాటు నిత్య పూజలందుకుంటుండగా, మరో విగ్రహం కాశిపల్లి కా లభైరవుడిగా పూజలు అందుకుంటున్నాడు. మిగతా విగ్రహాలు కనుమరుగయ్యాయి. ● దేశంలోని కాశీ, కాశ్మీర్, ఉజ్జయిని వంటి ప్రాంతాల్లో అక్కడక్కడ కాలభైరవుడి ఆలయాలు ఉన్నా, ప్రత్యేకంగా ఆలయం ఉన్నది మాత్రం ఇక్కడే. ● స్వామివారికి వైశాఖమాసంలో విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు. ● ప్రతి యేటా కార్తీక బహుళ పంచమి నుంచి నవమి వరకు కాలభైరవుడి జన్మదిన ఉత్సవాలు నిర్వహిస్తారు. ● గతంలో కరువు కాటకాలు వచ్చినప్పుడు గ్రామస్తులందరూ కాలభైరవుడి భయంకర విగ్రహానికి ఆవు పేడ పూసి కానరాకుండా చేయడంతో రెండు మూడు రోజులకే సమస్యలన్నీ పరిష్కారం అయ్యేవి. ● గ్రామాన్ని కాలభైరవుడు రక్షిస్తుండటంతో ప్రజలు భక్తితో పూజలు నిర్వహిస్తూ, అభివృద్ధిలోకి తెచ్చారు. ● స్వామివారికి వామాచార, దక్షిణాచార పద్ధతుల్లో పూజలు నిర్వహిస్తారు. ● ఈ ఆలయం 1978 నుంచి దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఉంది. – రామారెడ్డిఅత్యవసరంలో డయల్ 112 ఖలీల్వాడి: రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర సేవలన్నింటి కోసం డయల్ 112ను అమలులోకి తీసుకువచ్చింది. డయల్ 100, 108, 101 స్థానంలో 112 సేవలను రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉంటాయి. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి ఈ సేవలను ఆపరేట్ చేస్తారు. సెల్ఫోన్ లేదా ఫోన్ నుంచి 112కు కాల్ చేస్తే పోలీస్, ఫైర్ర్, మెడికల్, చిల్డ్రన్, ఉమెన్, రోడ్డు ప్రమాదాలకు సంబంధించి అత్యవసర సేవలను ఈ ఒక్క నంబర్ ద్వారా సంప్రదించవచ్చు.సమాచారం -
మల్కాపూర్లో ఉద్రిక్తత
● అక్రమ ఇంటి నిర్మాణాన్ని తొలగించిన అధికారులు ● ఆత్మహత్యకు యత్నించిన కుటుంబీకులుఎల్లారెడ్డి: మండలంలోని మల్కాపూర్ గ్రామంలో ఇంటి నిర్మాణం కూల్చివేతతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన పెద్దెడ్ల నర్సింలు (బీజేపీ మండల అధ్యక్షుడు) ప్రభుత్వ స్థలంలో రెండు గజాల, ఆరు అంగులాల స్థలం ఆక్రమించి ఇంటి నిర్మాణం చేపట్టినట్లు ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదు వచ్చింది. దీంతో సదరు ఇంటి యజమానికి నిర్మాణం నిలిపివేయాలని పలుమార్లు నోటీసులు ఇచ్చారు. అయినా ఇంటి నిర్మాణం చేపట్టడంతో డీఎల్పీవో సురేందర్ శుక్రవారం పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయించారు. అంతకుముందు కూల్చివేతకు వచ్చిన అధికారులను ఇంటి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. కుటుంబసభ్యులు అశోక్, రాకేష్, కృష్ణలు ఒంటిపై పెట్రోలు పోసుకోవడంతో పోలీసులు స్పందించి వారిపై నీరు పోసి, ఎల్లారెడ్డి పోలీస్స్టేషన్కు తరలించారు. గ్రామంలోకి ఎవరు రాకుండా డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ రవీందర్నాయక్, ఎస్సై మహేష్లు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధితుడు నర్సింలు మాట్లాడుతూ.. రాజకీయ కక్షతోనే ఇంటి నిర్మాణం కూల్చివేయించారని ఆరోపించారు. తాను ఎలాంటి అక్రమ నిర్మాణం చేయలేదని తన సొంత స్థలంలోనే నిర్మించుకున్నట్లు తెలిపారు. -
ప్రమాదవశాత్తు కంటైనర్ దగ్ధం
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని దగ్గి గ్రామ శివారులోగల 44వ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఓ కంటైనర్ ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైంది. నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపునకు వెళ్తున్న కంటైనర్ దగ్గి శివారులోకి రాగానే వాహనం నుంచి మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపాడు. లారీలో ఉన్న వివిధ రకాల పార్సిళ్లు, కొరియర్ వస్తువులు దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న సదాశివనగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. ఒకరి రిమాండ్ లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని పర్మళ్ల గ్రామానికి చెందిన లెగ్గల రాజు అనే వ్యక్తిని రిమాండుకు తరలించినట్లు ఎస్సై వెంకట్రావు శుక్రవారం తెలిపారు. లింగంపేటకు చెందిన చాకలి రాకేష్ను ఏప్రిల్ 14న రాత్రి సమయంలో రాజు చంపడానికి ఇనుప రాడ్తో దాడి చేసి గాయపరిచాడన్నారు. ఈ ఘటనపై రాకేష్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా రాజును గురువారం రాత్రి అరెస్టు చేసి, రిమాండుకు తరలించినట్లు తెలిపారు. గంజాయి విక్రేత పట్టివేత ఖలీల్వాడి: నగర శివారులోని దుబ్బ బైపాస్ రోడ్డులో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎకై ్సజ్ ఎన్ఫోర్స్ మెంట్ సీఐ వెంకటేష్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎకై ్సజ్ఎన్ఫోర్స్మెంట్ బృందం శుక్రవారం సాయంత్రం బైపాస్ రోడ్డులో నిఘా ఉంచగా, రెంజల్ మండలం నీలా గ్రామానికి చెందిన పుల్లె లక్ష్మీనర్సింహ గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. అతని వద్ద నుంచి 250 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎస్సై నర్సింహచారీ, హెడ్ కానిస్టేబుళ్లు భూమన్న, రాజన్న, కానిస్టేబుళ్లు భోజన్న, విష్ణు, అవినాష్, సాయి కుమార్, రాంబచ్చన్ ఉన్నారు. డ్రంకెన్డ్రైవ్ కేసులో ఒకరికి జైలుబోధన్: పట్టణంలో ఇటీవల పోలీసులు డ్రంకెన్డ్రైవ్ తనిఖీలు నిర్వహించగా రాకాసీపేటకు చెందిన అర్షద్ మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి శుక్రవారం బోధన్ కోర్టులో హాజరుపర్చారు. జడ్జి శేషతల్ప సాయి అతడికి రెండు రోజుల జైలు శిక్ష విధించారని టౌన్ సీఐ వెంకట నారాయణ తెలిపారు. చెరువులో పడి ఒకరి మృతి బోధన్: ఎడపల్లి మండలం ధర్మారం గ్రామ శివారులోని సిద్ధ చెరువులో ఓ వ్యక్తి చెరువులో పడి మృతిచెందినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి శుక్రవారం తెలిపారు. ధర్మారం గ్రామానికి చెందిన మేకల ప్రశాంత్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. అక్రమ నిర్మాణం తొలగింపుబీబీపేట: మండల కేంద్రంలోని స్థానిక వారాంతపు సంత వద్ద అక్రమంగా నిర్మించిన దుకాణం డబ్బాను శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్ తొలగించారు. గ్రామ పంచాయతీకి ఎలాంటి సమాచారం అందించకుండా రాత్రి వేళలో నిర్మించడంతో ఉదయాన్నే అధికారులు తొలగించారు. నిర్మించిన వారిని పిలిపించి మందలించారు. -
పురుగు మందుల దుకాణాల తనిఖీ
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని పురుగు మందుల దుకాణాలను గాంధారి ఏవో రాజలింగం, ఎల్లారెడ్డి ఏవో నదీమ్, ఎస్సై ఆంజనేయులతో కలిసి శుక్రవారం తనిఖీ చేశారు. పురుగు మందుల దుకాణాలపై పర్యవేక్షణ కరువు శీర్షికతో సాక్షిలో శుక్రవారం కథనం ప్రచురితమైంది. స్పందించిన వ్యవసాయశాఖాధికారులు పోలీసులతో కలిసి తనిఖీలు చేసి దుకాణాల్లో విక్రయించే మందులు, రికార్డులు పరిశీలించారు. సెంట్రల్ లైటింగ్ పనులను వెంటనే ప్రారంభించాలి పిట్లం(జుక్కల్): నిలిచిపోయిన సెంట్రల్ లైటింగ్ పనులను వెంటనే ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే అరుణతార డిమాండ్ చేశారు. రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించి మధ్యలో వదిలేయడంతో ఆమె నాయకులతో కలిసి శుక్రవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ధర్నా చేశారు. అనంతరం అరుణతార మాట్లాడుతూ.. రోడ్లను అస్తవ్యస్తంగా తవ్వేసి పనులు ప్రారంభించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. దీంతో ప్రజలు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నాయకలు అశోక్ రాజ్, రవి చంద్ర, మండల పార్టీ అధ్యక్షులు గుండా సాయిరెడ్డి, మాజీ అధ్యక్షుడు అభినయ్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి దేవేందర్, ఉపాధ్యక్షులు సాయి గొండ, తదితరులు పాల్గొన్నారు. -
ఎరువుల కొరత లేకుండా చూడాలి
కామారెడ్డి క్రైం: ఎరువులు, విత్తనాల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కల్తీ విత్తనాలు, ఎరువులను విక్రయించే దుకాణాలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఖరీఫ్లో రైతులకు పంపిణీ చేయడానికి ఇప్పటికే జిల్లాకు 25 వేల మెట్రిక్ టన్నుల యూరియాను సొసైటీల ద్వారా రైతులకు పంపిణీ చేశామన్నారు. మరో 8 వేల మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఇంకా ఎంత అవసరం ఉంటుందో నివేదిక అందించాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ బృందాలు ఎరువులు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేయాలన్నారు. జిల్లాకు నిర్దేశించిన 2,500 ఎకరాలలో పామాయిల్ తోటల పెంపకానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండలానికి 200 ఎకరాలను టార్గెట్గా నిర్దేశించుకుని తోటల పెంపకం లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, డీఏవో తిరుమల ప్రసాద్, ఏఎస్పీ నర్సింహారెడ్డి, ఉద్యాన శాఖ అధికారి జ్యోతి, ఏడీఏలు పాల్గొన్నారు. అధిక ధరలకు విక్రయిస్తే కేసులు పెట్టండి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ -
టీచర్గా మారిన కలెక్టర్
రాజంపేట: కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ టీచర్గా మారి తలమడ్ల పాఠశాలలోని విద్యార్థులకు పాఠాలు బోధించారు. మండలంలోని తలమడ్ల, ఆరేపల్లి గ్రామాలలో ఆయన శుక్రవారం పర్యటించారు. తలమడ్ల జెడ్పీహెచ్ఎస్, మండల ప్రజా పరిషత్ ప్రైమరీ స్కూల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. తలమడ్ల ప్రభుత్వ పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారికి గణిత సమస్యలను పరిష్కరించేందుకు పలు సూచనలిచ్చారు. 9, 7వ తరగతి గదులలో విద్యార్థులతో ఇంగ్లీష్ రీడింగ్ చేయించారు. అనంతరం ప్రైమరీ స్కూల్ , జెడ్పీ స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రైమరీ స్కూల్ కిచెన్ షెడ్ సరిగా లేకపోవడంతో రూ.50 వేలు మంజూరు చేస్తూ మరమ్మతులు చేయించాలని ప్రైమరీ స్కూల్ హెచ్ఎం రమేష్ కుమార్ను ఆదేశించారు. అనంతరం ఆరేపల్లిలో రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులపై చర్చించారు. సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని స్థానిక తహసీల్దార్ జానకిని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు ఐకేపీ ద్వారా ఇచ్చే రుణాల గురించి అవగాహన కల్పించాలని ఎంపీడీవో రఘురాంను ఆదేశించారు. ఆర్డీవో జ్యోతి, ఎంఈవో పూర్ణచందర్, తదితరులు పాల్గొన్నారు. -
అనుమతి లేని పాఠశాల సీజ్
బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలో గల మార్కెట్ రోడ్డులో శ్రీ చైతన్య పేరుతో నడుస్తున్న పాఠశాలను ఎంఈవో నాగేశ్వరావు సీజ్ చేశారు. శుక్రవారం లంబాడి స్టూడెంట్ ఆర్గనైజేషన్, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దీనితో ఎంఈవో పాఠశాల అనుమతి పత్రాలను తనిఖీ చేసి చూడగా ఎటువంటి అనుమతులు లేకపోవడంతో సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ.. అనుమతులు లేని పాఠశాలలో విద్యార్థులను చేర్పించవద్దని సూచించారు. నేతలు రాథోడ్ జీవన్, వంశీ నాయక్ ఉన్నారు. అటవీభూములను ఆక్రమిస్తే కఠిన చర్యలునాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట పరిధిలోని అటవీ భూములను కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్థానిక ఎఫ్ఆర్వో వాసుదేవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమంగా అటవీ భూమిలోకి ప్రవేశించి చెట్లను, వాటి కొమ్మలను నరికినా, అటవీ భూమిని చదునుచేసినా, దున్నినా, అడవిలో దారులు ఏర్పాటు చేసినా, అటవీభూముల సరిహద్దులను చెరిపేసినా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతోపాటు అటవీభూముల నుంచి ఇసుక, మొరం, రాళ్లు తరలించినా, వన్యప్రాణులను వేటాడినా కేసులు నమోదు చేస్తామన్నారు. ఉపయోగించిన జేసీబీ, ట్రాక్టర్, లారీ, ఆటో, బైక్ వంటి వాహనాలను సైతం సీజ్ చేస్తామని చెప్పారు. -
కొబ్బరి కొండెక్కింది!
బొండం నుంచి నూనె వరకు.. ● భారీగా పెరిగిన ధరలుభిక్కనూరు : ఆషాఢ మాసం అయినప్పటికీ కొబ్బరి కాయల ధరలు కొండెక్కాయి. పక్షం రోజుల్లోనే 20 శాతం పెరిగాయి. పదిహేను రోజుల క్రితం ఒ క్కో ఎండు కొబ్బరికాయ ధర రూ. 25 ఉండేది. ప్రస్తుతం రూ. 30కి చేరింది. కొబ్బరి బొండం కూడా రూ. 50 నుంచి రూ. 80 వరకు వి క్రయిస్తున్నారు. కుడుకల ధరల కూ రెక్కలొ చ్చాయి. పక్షం రో జుల్లోనే కిలో కుడుకల ధర రూ. 280 నుంచి రూ. 400లకు చేర డం గమనార్హం. కొబ్బరి నూనె ధర కూడా పెరిగింది. 175 ఎంఎల్ కొబ్బరి నూనె ధర గతంలో రూ. 70 ఉండగా ప్రస్తుతం రూ. 125 కు విక్రయిస్తున్నారు. కొబ్బరి ధరలు ఇలా భారీగా పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పంట తక్కువగా ఉండడంతోనే ధరలు పెరుగుతు న్నాయని వ్యాపారులంటున్నారు. -
బల్దియాలో దారిద్య్రం!
అశోక్నగర్ కాలనీలో గుంతలలో నిలిచిన వర్షపు నీరుజిల్లాకేంద్రంలోని అన్ని రోడ్లపైనా భారీ గుంతలు ఏర్పడ్డాయి. అశోక్నగర్ కాలనీ ప్రధాన రోడ్డుగుండా వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. పలుచోట్ల వర్షంతో బురదమయంగా మారింది. గుంతలనిండా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు. ఈ రోడ్డు దుస్థితిపై ఇటీవల స్థానికులు అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదు. దీంతో స్థానికులే మట్టిని పోసి గుంతలను పూడ్చారు. కొత్తబస్టాండ్ నుంచి రైల్వే గేట్ వరకు రోడ్డు పరిస్థితి కూడా దారుణంగా ఉంది. విద్యానగర్కాలనీలో సాయిబాబా ఆలయం పక్కన చౌరస్తాలో పెద్ద గుంత ఏర్పడి నెలలు గడుస్తున్నా పూడ్చేవారు లేరు. జన్మభూమిరోడ్లో అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. సైలానీబాబా కాలనీ, రామారెడ్డి చౌరస్తా నుంచి రాజీవ్నగర్కాలనీ వరకు, పాతబస్టాండ్ నుంచి పంచముఖి హనుమాన్ కాలనీ, అడ్లూర్ వరకు, పెద్దబజార్, భవానీరోడ్, వీక్లీ మార్కెట్రోడ్, గోపాలస్వామిరోడ్, భవానీనగర్, సుభాష్రోడ్, సిరిసిల్లరోడ్, గాంధీనగర్ లాంటి ప్రధాన రోడ్లపైనా భారీగా గుంతలున్నాయి. ప్రధాన రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే ఇక అంతర్గత రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రోడ్ల పరిస్థితిపై మున్సిపల్ అధికారులతో పాటు ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేస్తున్నా ఫలితం లేదని పట్టణవాసులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, మరమ్మతులు చేయించి గుంతల చింత తీర్చాలని కోరుతున్నారు.మరమ్మతులు చేయిస్తాం బల్దియాలో నిధులు లేక నూతన రోడ్ల పనులకు టెండర్లు నిర్వహించడం లేదు. అయితే పట్టణంలో ఎక్కువగా గుంతలున్న రోడ్లను గుర్తించి మరమ్మతులు చేయిస్తాం. అశోక్నగర్ కాలనీలో నూతన రోడ్డు వేయడానికి కృషి చేస్తాం. ఇంజినీరింగ్ అధికారులతో చర్చించి అన్ని కాలనీలలో రోడ్లపై గుంతలను పూడ్చివేయిస్తాం. – రాజేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డికామారెడ్డి బల్దియా పరిధిలోని అంతర్గత రోడ్లతోపాటు ప్రధాన రోడ్లూ అధ్వానంగా మారాయి. అడుగడుగునా గుంతలు దర్శనమిస్తున్నాయి. వర్షాకాలం కావడంతో వరద నీరు చేరి మరింత ప్రమాదకరంగా మారాయి. ఎక్కడ గుంత ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాలకు గురి అవుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. – కామారెడ్డి టౌన్ కామారెడ్డి పట్టణంలో ఛిద్రమైన రోడ్లు వర్షపు నీటితో ప్రమాదకరంగా మారిన గుంతలు ఇబ్బందిపడుతున్న ప్రజలు పట్టించుకోని అధికారులు -
ఏళ్ల నాటి సమస్య తీరేనా?
కామారెడ్డి క్రైం: రైతుల భూ సమస్యలు ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీంతో చాలా మంది రైతులు సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘ధరణి’ స్థానంలో ‘భూభారతి’ని తీసుకువచ్చింది. ఇటీవలే అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు సైతం నిర్వహించి రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. జిల్లా వ్యాప్తంగా గత నెల ప్రారంభం నుంచి 20 వ తేదీ వరకు నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో మొత్తం 32,592 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో దాదాపు 32,015 దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశారు. పరిష్కారాల కోసం దాదాపు 13,338 మందికి నోటీసులు జారీ చేశారు. అసైన్మెంట్ భూముల క్రయ, విక్రయాలకు సంబంధించిన రికార్డుల అప్డేషన్ కోసం 7,932, సాదాబైనామా కోసం 3,452 దరఖాస్తులు వచ్చాయి. పీవోటీపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. సాదాబైనామాలకు సంబంధించిన అంశం హైకోర్టు పరిశీలనలో ఉంది. దీంతో ఈ రెండు రకాల దరఖాస్తులకు ఇప్పట్లో పరిష్కారాలు లభించే అవకాశాలు లేవు. కొందరు కోర్టులో కేసు నడుస్తున్నా రెవెన్యూ సదస్సులలో దరఖాస్తులు ఇచ్చారు. మరోవైపు వచ్చిన దరఖాస్తుల్లో పరిష్కరించలేనివి మొత్తం ఎన్ని ఉంటాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. పరిష్కారాలు అంతంత మాత్రమే.. రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై అన్ని గ్రామాల్లోనూ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ ప్రారంభించారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 1,078 దరఖాస్తులను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఇవి కాకుండా పైలట్ ప్రాజెక్ట్ కింద లింగంపేట మండలంలో చేపట్టిన భూభారతి సదస్సుల్లో 4,225 దరఖాస్తులు వచ్చాయి. రెండు నెలలు గడుస్తున్నా వాటిలో ఇంకా వెయ్యి సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. దీంతో భూసమస్యల పరిష్కారం వంద శాతం పూర్తి కావాలంటే ఇంకా ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి డిజిటల్ పాస్పుస్తకాల్లో పేరు, అడ్రస్, భూమి రకం, విస్తీర్ణం, సర్వే నంబర్ తప్పులు, ఆన్లైన్లో రికార్డులు లాంటి చిన్నచిన్న సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వేల సంఖ్యలో దరఖాస్తులు తహసీల్దార్, ఆర్డీవో, జిల్లా అధికారుల లాగిన్లలో పెండింగ్లో ఉన్నాయి. అధికార యంత్రాంగం చొరవ తీసుకొని వేగవంతంగా పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలు ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతులు రెవెన్యూ సదస్సులలో 32,592 దరఖాస్తులు ‘భూభారతి’తోనూ తొలగని ఇబ్బందులుపరిష్కరించాలి నాకు గ్రామ శివారులో 2 ఎకరాల పట్టా భూమి ఉంది. ధరణిలో ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. 2019 నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. ఇప్పటికీ పరిష్కారం దొరకలేదు. రెవెన్యూ సదస్సులో దరఖాస్తు చేసి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా పరిష్కారం కాలేదు. – కుంట ఎల్లయ్య, రైతు, బాయంపల్లి, లింగంపేట మండలంఇంకెంత టైం పడుతుందో.. నాకు గ్రామ శివారులో 2 ఎకరాల భూమి ఉంది. ధరణి వచ్చిన తర్వాత డిజిటల్ పాసుపుస్తకం వచ్చింది. కానీ, ఆన్లైన్లో నా భూమి చూపించడం లేదు. మొన్న జరిగిన రెవెన్యూ సదస్సులలో దరఖాస్తు చేసిన. అధికారులు విచారణ జరిపి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇంకా ఎంత సమయం పడుతుందో తెలియడం లేదు. – కుమ్మరి బాల్రాజు, రైతు, భవానీపేట్, లింగంపేట మండలం -
ఆర్మూర్లో జూనియర్ కళాశాల సీజ్
ఆర్మూర్: నిబంధనలకు విరుద్ధంగా ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో ఉన్న ఓ భవనంలో కొనసాగుతున్న క్షత్రియ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యాధికారి (డీఐఈవో) రవికుమార్ గురువారం సీజ్ చేశారు. విద్యార్థులను ఇళ్లకు పంపించి యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ఆ భవనంలో కళాశాలను నిర్వహణకు మూడేళ్ల క్రితం ఇంటర్మీడియట్ బోర్డు అనుమతులను నిరాకరించింది. దీంతో క్షత్రియ జూనియర్ కళాశాల యాజమాన్యం ఆర్మూర్ మండలం చేపూర్ శివారులోని క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో కళాశాల నిర్వహణకు అనుమతులు తీ సుకున్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలో ప్రమాదకరంగా ఉన్న భవనంలోనే తరగతులను ని ర్వహిస్తూ వస్తున్నారు. సుమారు 500 మంది బాలబా లికలు ఇదే భవనంలోని పై అంతస్తుల్లో హాస్టల్లో ఉంటుండగా, మరో 300 మంది విద్యార్థులు డే స్కాలర్స్గా చదువుకుంటున్నారు. మరో ప్రైవేట్ కళా శాల యజమాని క్షత్రియ జూనియర్ కళాశాలపై అధికారులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు విలేకరుల సమావేశం నిర్వహించి నిబంధనల ను అతిక్రమించిన తీరును వివరించారు. స్పందించిన అధికారులు కళాశాలను సందర్శించి సీజ్ చేసి దిద్దుబా టు చర్యలు చేపట్టారు. అడ్మిషన్ తీసుకున్న సుమారు 800 మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఏం చేయాలో పాలుపోక అయోమయానికి గురవుతున్నారు. మూడేళ్లకు పైగా నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలో జూనియర్ కళాశాలను నిర్వహిస్తున్నా తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరించిన అధికారుల తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అనుమతులు ఒకచోట.. నిర్వహణ మరోచోట అయోమయంలో 800 మంది విద్యార్థులు -
ముహూర్తమెప్పుడో?
తెయూ(డిచ్పల్లి): తెలంగాణ యూనివర్సిటీ మెయి న్ క్యాంపస్లో బాలికల నూతన హాస్టల్ నిర్మాణ పనులకు ముహూర్తం కుదరడం లేదు. నూతన గర్ల్స్ హాస్టల్ నిర్మాణం కోసం రూ.7కోట్ల రూసా నిధులు అందుబాటులో ఉన్నా, నిర్మాణ పనులకు మోక్షం లభించడం లేదు. తెయూ మెయిన్ క్యాంపస్లో బాలురకు రెండు హాస్టల్స్ ఉండగా, బాలికలకు మాత్రం ఒకే హాస్టల్ ఉంది. బాలుర రెండు హాస్టల్స్లో కలిపి 447 మంది ఉండగా, బాలికలకు ఉన్న ఒక్క హాస్టల్లోనే 440 మంది బాలికలు ఉంటున్నారు. దీంతో బాలికలు ఒకే గదిలో 6నుంచి 8మంది ఉండాల్సి రావడంతో బాలికలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 2022లో యూజీసీ ఆదేశం వర్సిటీ క్యాంపస్లో బాలురు, బాలికలకు సరిపడా నూతన హాస్టల్స్ నిర్మించాలని యూజీసీ 2022 నవంబర్లో ఆదేశాలు జారీ చేసింది. రెండున్నరేళ్లు కావొస్తున్నా హాస్టల్ నిర్మాణానికి ఇప్పటికీ అడుగు ముందుకు పడటం లేదు. గత విద్యాసంవత్సరం మేలో తెలంగాణ యూనివర్సిటీకి రూ.8.60 కోట్ల రూసా నిధులు మంజూరయ్యాయి. ఇందులో రూ.7కోట్లు నూతన బాలికల హాస్టల్ నిర్మాణానికి, ఫుట్పాత్ నిర్మాణానికి రూ.కోటి, కంప్యూటర్ సైన్స్ కాలేజీ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.60 లక్షలు వెచ్చించాల్సి ఉంది. టెండర్ పూర్తయినప్పటికీ సదరు కాంట్రాక్టర్ టీఎస్ఈడబ్య్లూఐడీసీ (తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ ఉమెన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్)తో అగ్రిమెంట్ చేసుకోక పోవడంతో నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇప్పటికై నా వర్సిటీ వీసీ, ఉన్నతాధికారులు స్పందించి హాస్టల్ నిర్మాణం వెంటనే చేపట్టాలని విద్యార్థినులు కోరుతున్నారు. తెయూలో బాలికల నూతన హాస్టల్ భవనానికి రూ.7 కోట్లు మంజూరు పూర్తయిన టెండర్ ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభం కాని పనులు త్వరలో పనులను ప్రారంభించేందుకు కృషి తెయూలో బాలికల నూతన హాస్టల్ భవన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీ టీఎస్ఈడబ్ల్యూఐడీసీతో కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంది. కానీ అగ్రిమెంట్ కాకపోవడంతో నిర్మాణ పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతోంది. ఈ విషయమై సదరు కాంట్రాక్టర్తో వీసీ యాదగిరిరావు మాట్లాడారు. వీలైనంత త్వరగా హాస్టల్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తున్నాం. – యాదగిరి, రిజిస్ట్రార్, తెలంగాణ యూనివర్సిటీ -
పారిశుద్ధ్య పరిరక్షణకు చర్యలు
కామారెడ్డి టౌన్: పట్టణంలో పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక చర్యలు చేపడతామని మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి తెలిపారు. ‘సాక్షి’లో గురువారం ప్రచురితమైన ‘పురం.. స్వచ్ఛతకు దూరం’ కథనంపై ఆయన స్పందించారు. పట్టణంలో పారిశుద్ధ్య పనుల తీరుపై సానిటరీ ఇన్స్పెక్టర్, జవాన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పనులను పరిశీలించారు. టీచర్స్కాలనీ, రాజీవ్నగర్, సైలానీబాబా తదితర కాలనీలలో మురికి కాలువలు, రోడ్లను శుభ్రం చేయించారు. రోడ్ల పక్కన పేరకుపోయిన చెత్త కుప్పలను డపింగ్ యార్డుకు తరలించారు. మురికి కాలువలు లేని చోట నూతన సీసీ డ్రెయినేజీల నిర్మాణానికి కృషి చేస్తామని కమిషనర్ తెలిపారు. మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి -
‘బడికి అండగా నిలుస్తా’
రామారెడ్డి: చిన్నతనంలో తాను చదివిన రామారెడ్డి సర్కార్ బడి అభివృద్ధికి అన్ని విధాలుగా అండగా నిలుస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు పేర్కొన్నారు. గురువారం రామారెడ్డి, గోకుల్ తండా, గిద్ద గ్రామాలలో పర్యటించారు. రామారెడ్డి ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. తను చిన్నతనంలో ఇదే మైదానంలో ఆడుకున్నానని, ఇక్కడే చదువుకున్నానని గుర్తు చేసుకున్నారు. రామారెడ్డి సర్కారు బడికి కావలసిన అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లను వెంటనే నిర్మిస్తానన్నారు. అనంతరం రామారెడ్డి మైదానంలో విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. నిర్మాణంలో ఆగిపోయిన గంగమ్మ వాగు బ్రిడ్జిని పరిశీలించి పనులు ప్రారంభించేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లక్ష్మాగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్, నాయకులు అరవింద్ గౌడ్, బీపేట నర్సింలు, అంబానీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఖలీల్వాడి: నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు నాలుగో టౌన్ పోలీసులు తెలిపారు. గత నెల 25న నగరంలోని బింగి ఫంక్షన్ హాల్ సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో పడిఉండగా, పోలీసులు గుర్తించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలో గురువారం అతడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి వయస్సు సుమారు 55 నుంచి 60ఏళ్ల లోపు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి ఒంటిపై తెలుపు రంగు షర్ట్, లుంగీ ధరించినట్లు పేర్కొన్నారు. మృతుడి వివరాలు ఎవరికై నా తెలిసినచో నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్లో గాని, 87126 59840, 87126 59719ను సంప్రదించాలన్నారు. చికిత్సపొందుతూ ఒకరు.. నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఆత్మహత్యకు యత్నించిన ఓ బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. నాగిరెడ్డిపేట మండలంలోని తాండూర్ గ్రామానికి చెందిన బైండ్ల అనిల్కుమార్(16) అనే బాలుడు కొంతకాలంగా కల్లుకు బానిసయ్యాడు. ఈక్రమంలో బుధవారం గ్రామశివారులోకి వెళ్లి గడ్డిమందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనమేరకు మెరుగైన వైద్యం కోసం అతడిని ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి తరలించారు. కాగా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ గురువారం అతడు మృతిచెందాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్చార్జి ఎస్హెచ్వో మనోహర్రావు తెలిపారు. -
మృత్యువులోనూ వీడని స్నేహం
నిజాంసాగర్: ముగ్గురు స్నేహితులు ఒక బైక్పై కలిసి వెళ్లగా, ఘోర రోడ్డు ప్రమాదంలో మృత్యువాతచెందారు. పెద్దకొడప్గల్ మండలం జగన్నాథ్పల్లి వద్ద గల సంగారెడ్డి–నాందేడ్ 161 జాతీయ రహదారిపై జరిగిన ఘటన వివరాలు ఇలా.. జుక్కల్ మండలం మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన పోనుగంటి వెంకటి(22), మంగళి గణేశ్(18), బిచ్కుందకు చెందిన దొడ్లవార్ నవీన్(24) ముగ్గురు స్నేహితులు. గణేశ్ మూడు నెలల కిందట పల్సర్ బైక్ కొనుగోలు చేశాడు. బుధవారం సాయంత్రం వారు ముగ్గురు కలిసి బైక్పై పిట్లంకు వెళ్లారు. రాత్రి వేళ ముగ్గురు స్నేహితులు బైక్పై నాందేడ్–సంగారెడ్డి జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా.. అప్పటికే రోడ్డు ప్రమాదానికి గురై, నిలిచి ఉన్న కంటెయినర్ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో ముగ్గురి తలలు పగిలి తీవ్ర రక్తస్రావం జరుగగా, ఇద్దరు ఘటన స్థలంలో మృతిచెందారు. ఒకరు మార్గమధ్యలో మృతి చెందారు. సమాచారం అందుకున్న జాతీయరహదారి సిబ్బంది,పోలీసులు మృతదేహాలను అంబులెన్స్ లో బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జుక్కల్ మండలం మహమ్మదబాద్ గ్రామానికి చెందిన పొనుగంటి సాయవ్వ–గంగారాం దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్నకుమారు డైన వెంకటి ఇంటర్ వరకు విద్యను అభ్యసించాడు. తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లో చేదోడు, వాదో డుగా ఉన్నాడు. అలాగే అదే గ్రామానికి చెందిన మంగళి హన్మండ్లు–లక్ష్మీబాయి దంపతుల పెద్ద కుమారుడు గణేశ్ నిజామాబాద్లో ఇంటర్ చదువుతున్నాడు. బిచ్కుంద పట్టణానికి చెందిన దొడ్లవార్ నాందేవ్–శోభ దంపతుల కుమారుడు నవీన్. వీరు ముగ్గురు స్నేహితులు కాగా, చేతికొచ్చిన కుమారులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితుల మృతి మూడు కుటుంబాల్లో తీరని విషాదం -
అత్తను హతమార్చిన అల్లుడు
పిట్లం(జుక్కల్): రూ.1లక్ష కోసం అత్తను అల్లుడు హతమార్చిన ఘటన పిట్లం మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి(43)కి భర్త, కుమారుడు, కూతురు స్వప్న ఉన్నారు. స్వప్నకు అదే గ్రామానికి చెందిన బాగరాజుతో ఏడేళ్ల క్రితం వివాహం అయింది. ఈక్రమంలో లక్ష్మి కొన్ని నెలల క్రితం అల్లుడు అయిన బాగరాజుకు లక్ష రూపాయలను ఇచ్చింది. బాగరాజు ఇటీవల సాగు చేసిన జొన్న పంటను తన పేరుపై కొద్దిగా, అత్త లక్ష్మి పేరున కొద్దిగా విక్రయించాడు. దీంతో ఇద్దరి బ్యాంకు ఖాతాలలో జొన్నలు విక్రయించిన డబ్బులు పడ్డాయి. దీంతో లక్ష్మి అల్లుడికి గతంలో ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వమని అడిగింది. ఈ విషయంపై గురువారం ఉదయం ఇద్దరి మధ్య గొడవ జరుగగా, గ్రామస్తులు సర్ది చెప్పారు. అనంతరం లక్ష్మి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండటానికి వెళ్లి, మధ్యాహ్నం ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యలో ఆమెను బాగరాజు అడ్డగించి కమ్మకత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలు కావడంతో లక్ష్మి అక్కడిక్కడే మృతి చెందింది. బాగరాజు తన అత్తను చంపేశాను పోలీసులకు లొంగిపోతున్న అని గ్రామ మాజీ సర్పంచ్కు సమాచారం ఇచ్చాడు. వెంటనే మాజీ సర్పంచ్, గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకొని చూడగా ఆమె అప్పటికే మృతి చెందడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. బాన్సువాడ డీఎస్పీ విఠల్రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతురాలి కుమారుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇచ్చిన రూ.లక్ష తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఘాతుకం -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న రోడ్డు రోలర్
నస్రుల్లాబాద్: మండలంలో కొద్దిరోజులుగా 765 డి జాతీయ రహదారి పనులు కొనసాగుతున్నాయి. ఈక్రమంలో గురువారం దుర్కి గ్రామ ప్రధాన రహదారిపై రోడ్డు రోలర్తో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం విరిగిపోయింది. విద్యుత్ తీగలు తెగిపడకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఒకవేళ విద్యుత్ తీగలు తెగి వాహనంపై పడినా.. లేదా రోడ్డుపై వెళుతున్న వాహనదారులపై పడిన ప్రాణాపాయం జరిగేదని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్తంభం విరిగినా కూడా తృటిలో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులు కొత్త స్తంభం వేయించి సరిచేసి ఇస్తానని అధికారులు తెలపడంతో గ్రామానికి ప్రత్యమ్నాయం మార్గం ద్వారా విద్యుత్ సరఫరా చేశారు. స్తంభం విరిగినా వైర్లు తెగకపోవడంతో తప్పిన ప్రమాదం -
ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి చేరుకోవాలి
రాజంపేట: ప్రతి విద్యార్థిని బాగా చదివి జీవితంలో ఉన్నత స్థాఽయికి చేరుకోవాలని మహిళా సాధికారత సిబ్బంది సౌందర్య అన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారత కేంద్రం, సఖి కేంద్రం రాజంపేట బాలికల ఉన్నత, ప్రాథమిక పాఠశాలలో గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా సాధికారత సిబ్బంది సౌందర్య మాట్లాడుతూ.. బేటీ బచావో బేటీ పడావో అనే విధానంలో ప్రతి ఆడపిల్ల చదువుకొని స్వతహా గా తనకు తాను నిర్ణయాలు తీసుకునే దశకి వెళ్లాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ హెల్ప్ లైన్ నంబర్స్ 1098, 100, 1930 ,181లపై అవగాహన ఉండాలన్నారు. హెచ్ఎం విజయలక్ష్మి, సఖి సెంటర్ సిబ్బంది లావణ్య పాల్గొన్నారు. -
కలుపు నివారణకు మందులు పిచికారీ చేయాలి
మద్నూర్: సోయా పంటలో గడ్డి జాతి కలుపు నివారణకు రైతులు రసాయన మందులు పిచి కారీ చేయాలని ఏవో రాజు అన్నారు. గురు వారం ఆయన వాడి, ఫతేపూర్, మద్నూర్ తదితర గ్రామాల్లో సాగవుతున్న సోయా పంటల ను పరిశీలించి పలు సూచనలు చేశారు. గడ్డిజాతి కలుపు నివారణకు క్విజాలాఫాఫ్ ఈథైల్ 40 ఎంఎల్ లేదంటే ప్రాపాకై ్వజాపాప్ 250ఎంఎల్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు. వెడల్పాటి ఆకు ఉన్నట్లయితే ఇమజిత్పైర్ 400 ఎంల్ పిచికారీ చేయాలన్నారు.అలాగే గడ్డిజాతి,వెడల్పాటి ఆ కు ఉన్నట్లయితే క్విజాలోపాప్ పిఈథైల్,ఇమా జిత్పైర్ 200 ఎంల్ మందును ఉదయం పూట గాలి వర్షం లేని సమయంలో భూమిలో తేమ ఉన్న సమయంలో పిచికారీ చేయాలన్నారు. హెల్మెట్ లేకుండా నడిపితే వాహనాలు సీజ్ చేస్తాం నిజాంసాగర్(జుక్కల్): హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనాలు నడిపితే సీజ్ చేస్తామని పెద్దకొడప్గల్ ఎస్సై మహేందర్ వాహనదారులకు హెచ్చరించారు. గురువారం పెద్దకొడప్గల్ మండలంలోని అంజనీ చౌరస్తా జాతీయ రహదారి–161పై వాహనాల తనిఖీ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఎస్సై మహేందర్ మాట్లాడుతూ.. రోడ్డుపై వాహనాల సంఖ్య పెరుగుతుందని,మద్యం తాగి,అతివేగంగా వాహనా లు నడపడం వల్ల ప్రమాదాలు సంభవిస్తు న్నాయని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ వాడకం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, లైసెన్స్ లేకుండా నడుపుతున్నట్లు తెలిస్తే వాహనాలు సీజ్ చేయడమే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. పెండింగ్ చలాన్లు వసూలు లింగంపేట(ఎల్లారెడ్డి): ముస్తాపూర్లో గురువారం ఎస్సై వెంకట్రావు సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న చలాన్లు రూ.92 వేలు వసూలు చేసినట్లు ఎస్సై తెలిపారు. అలాగే ఒక డ్రంకెన్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. 300 వాహనాలు తనిఖీ చేసి సరైన ధ్రువపత్రాలు, హెల్మెట్ ధరించని 25 మందికి జరిమానాలు విధించినట్లు తెలిపారు. కృష్ణాజీవాడీలో అదనపు కలెక్టర్ పర్యటన తాడ్వాయి(ఎల్లారెడ్డి): కృష్ణాజీవాడీలో గురువారం అదనపు కలెక్టర్ చందర్ నాయక్ పర్యటించారు. మూడు రోజుల క్రితం గ్రామ కార్యదర్శి చంద్రకళ ప్రజల నుంచి ఇంటి పన్నులతో పాటు మిషన్ భగీరథ బిల్లులను వసూల్ చేశారు. దీంతో గ్రామస్తులు కొన్ని సంవత్సరాల నుంచి మిషన్ భగీరథ బిల్లలను చెల్లించలేదని, ఇప్పుడు ఎందుకు వసూల్ చేస్తున్నారని కార్యదర్శిని అడుగడమే కాకుండా పై అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై అదనపుకలెక్టర్ చందర్ నాయక్ గ్రామానికి వచ్చి విచారణ చేపట్టారు. గ్రామకార్యదర్శులు, మిషన్ భగీరథ అధికారులు, గ్రామప్రజలు చెప్పిన విషయాలను అదనపు కలెక్టర్ విన్నారు. ఈ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తానన్నారు. అప్పటి వరకు మిషన్ భగీరథకు బిల్లులను వసూల్ చేయవద్దని అధికారులకు సూచించారు. డీపీవో మురళీ, ఎంపీడీవో సయ్యద్ సాజీద్అలీ, ఏఈలు ప్రశాంత్, శిరీష, ఎంపీవో సవిత, గ్రామకార్యదర్శులు చంద్రకళ, బాలు, రాజు తదితరులు పాల్గొన్నారు. -
చాముండేశ్వరి ఆలయ బోనాల ఆహ్వాన పత్రిక అందజేత
దోమకొండ: దోమకొండలోని మహంకాళి ఆలయంలో ఈనెల 13న జరిగే మహంకాళి బోనాల పండుగకు రావాలని కోరుతూ గురువారం దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయరామారావును కలిసి ఆహ్వాన పత్రిక అందజేసినట్లు ఆలయ అర్చకులు భావి శరత్చంద్రశర్మ తెలిపారు. ఆయన వెంట ఆలయ ఈవో ప్రభు ఉన్నారు. సొసైటీ సీఈవోకు సన్మానంలింగంపేట(ఎల్లారెడ్డి): శెట్పల్లిసంగారెడ్డి సొసైటీ సీఈవో శ్రీనివాస్ను ఉమ్మడి జిల్లా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముఖ్య కార్యనిర్వహణ అధికారి నాగభూషణం ఘనంగా సన్మానించారు. సొసైటీ పరిధిలోని రైతులకు దీర్ఘకాలిక రుణాలు రూ.7 కోట్లు అందజేశారు. ఇచ్చిన రుణాల రికవరీ 2023–24 సంవత్సరంలో రూ. 2 కోట్లు ఉండగా.. 2024–25లో రూ. 2.50 కోట్లు దీర్ఘకాలిక రుణాలు వసూలు చేసి జిల్లాలో 10వ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. మారుమూల గ్రామం శెట్పల్లిసంగారెడ్డి సొసైటీలో రుణాల రికవరీ చేయడంతో పాటు రైతులకు సొసైటీ నుంచి అందిస్తున్న సేవలను గుర్తించి గురువారం నిజామాబాదులోని సొసైటీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఈవో శ్రీనివాస్ను ఘనంగా సన్మానించారు. డీసీవో శ్రీనివాస్రావు, జనరల్ మేనేజర్ అన్నపూర్ణ, సొసైటీల కార్యదర్శులు పాల్గొన్నారు. ఉద్యోగిపై దాడి సరికాదు బిచ్కుంద(జుక్కల్): మహబూబ్నగర్ మార్కెట్ కమిటీ కార్యదర్శి భాస్కర్పై ఏఎంసీ వైస్ చైర్మన్ దాడి సరికాదని టీఎన్జీవో కామారెడ్డి జిల్లా ఫోరం అధ్యక్షుడు రాజ్కుమార్ అన్నారు. బిచ్కుంద ఏఎంసీ కార్యాలయంలో గురువారం ఆయన సిబ్బందితో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బందిపై దాడి చేస్తే పాలక వర్గానికే అవమానంగా ఉంటుందన్నారు. సిబ్బంది రవికిరణ్, లాలయ్య, సందీప్, సతీష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. పిట్లంలో.. పిట్లం(జుక్కల్): పిట్లం ఏఎంసీ కార్యాలయం వద్ద సిబ్బంది గురువారం లంచ్ టైంలో నల్ల బ్యాడ్జిలు ధరించి నిరనస చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఏఎంసీ కార్యదర్శి భాస్కర్పై దాడి చేసిన వైస్ చైర్మన్ని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. -
మందుల దుకాణాలపై పర్యవేక్షణ కరువు
గాంధారి(ఎల్లారెడ్డి): మండలంలో ఎరువులు, పురుగు మందుల దుకాణాలపై వ్యవసాయా శాఖాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారు. పురుగు మందులను అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను దోచుకుంటున్నారని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు ఆరోపిస్తున్నారు. కలుపు మొక్కల నివారణకు వాడే ఒకే కంపెనీకి చెందిన లాడీస్ అనే మందును వ్యాపారులు వేర్వేరు ధరలకు విక్రయిస్తున్నారు. మండల పరిధిలోని చిన్న పోతంగల్ గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు లాడీస్ మందును వేర్వేరు దుకాణాల్లో కొనుగోలు చేసి రసీదులు తీసుకున్నారు. రసీదులు చూసిన రైతులు ధరలో తేడా ఉండడంతో అవాక్కయ్యారు. ఓ దుకాణంలో లాడీస్ మందు లీటరుకు రూ.1,600 చొప్పున రెండు లీటర్లు కొనుగోలు చేశాడు. అదే మందును మరో దుకాణంలో లీటరుకు రూ.1,350 చొప్పున కొనుగోలు చేశాడు. ధరలో తేడాను గమనించిన రైతులు గురువారం భారతీయ కిసాన్ సంఘ్ నాయకుడు శంకర్ రావు దృష్టికి తీసుకువచ్చారు. శంకర్రావు బాధిత రైతులతో పాటు మరికొందరి రైతులతో కలిసి అధిక ధరకు విక్రయించిన దుకాణానికి వెళ్లి యజమానిని ప్రశ్నించారు. ఒకే మందుకు ఇంత తేడా ఎలా ఉంటుందని రైతులను ఎందుకు దోచుకుంటున్నారని ప్రశ్నించారు. ఆ మందును రూ.1,600 కే విక్రయిస్తామని లేదంటే తాము నష్టపోతామని తెలిపారు. మరో దుకాణంలో రూ.1,350 కే విక్రయించాడు కదా ఆయన ఎందుకు నష్టపోడని ప్రశ్నించారు. లేదు మేవు ఎమ్మార్పీ ధక కంటే తక్కువకే విక్రయించాం.. ఆ మందు ఎమ్మార్పీ ధర రూ.2,200 ఉంటుందని సమాధానం ఇచ్చినట్లు భారతీయ కిసాన్సంఘ్ నాయకులు తెలిపారు. పురుగు మందులు ఉత్పత్తి చేసే కంపెనీలు ఎమ్మార్పీ ధరలను అధికంగా అచ్చు వేసి వ్యాపారులకు రైతులను దోచుకునే అవకాశం కల్పిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం ఈ విషయంపై విచారణ చేసి ఎమ్మార్పీ ధరలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరికి నచ్చిన ధరలకు వారు విక్రయిస్తూ రైతులను దోచుకుంటున్న వ్యాపారులు కంపెనీల అచ్చు వేసి ఇష్టం వచ్చిన ఎమ్మార్పీ ధరలతో దోచుకునే అవకాశం -
రోడ్లపై కేజ్వీల్స్తో నడిపితే రూ.25 వేల జరిమానా
భిక్కనూరు: ప్రభుత్వం రూ.కోట్లు వెచ్చించి బీటీ రోడ్లను నిర్మింపజేస్తుంటే కొందరు ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు కేజ్వీల్స్ వాహనాలను నడిపిస్తూ రోడ్లను నాశనం చేయడం తగదంటూ భిక్కనూరు మండలం తిప్పాపూర్ గ్రామస్తులు హెచ్చరించారు. గురువారం వీడీసీ అధ్యక్షుడు కొండ సిద్దరాములు ఆధ్వర్యంలో సమావేశమైన గ్రామస్తులు కేజీవీల్స్తో ఎవరైనా ట్రాక్టర్ను రోడ్డుపై నడిపితే రూ.25 వేల జరిమానా విధించాలని తీర్మానించారు. ట్రాక్టర్ కేజ్వీల్స్తో రోడ్డుపై నడిపించినట్టు సరైన రుజువులతో నిరూపిస్తే వారికి రూ.2 వేల నగదు బహుమతి అందించాలని తీర్మానించారు. నేతలు హరిశ్చంద్రారెడ్డి, భీంరెడ్డి, కుంట లింగారెడ్డి, రంగారెడ్డి, శ్రీనివాస్, రాజు, రాజయ్య, ధర్మయ్య, రవి, నర్సయ్య, భూమాగౌడ్, సిద్దరాములు, సంజీవ్, శ్రీకాంత్, కుమార్, తదితరులు పాల్గొన్నారు. సమావేశమైన గ్రామస్తులు -
ఎకరానికి ఎంత భూమి..
మీకు తెలుసా? బాల్కొండ: వ్యవసాయ భూములను ఎకరాల్లో(బిగాల్లో) రైతులు తెలుపుతుంటారు. ఎకరానికి ఎంత భూమి అనే విషయాన్ని కింద తెలుసుకుందాం.. ● 40 గుంటలకు ఎకరం అవుతుంది. ● రెండు గుంటలకు ఇసా భూమి అవుతుంది ● 20 ఇసాలకు ఎకరం అవుతుంది ● ఎకరానికి 4840 గజాలు అవుతుంది. ● ఎకరానికి 100 సెంట్లు.. గుంటకు 2.5 సెంట్లు ● గుంటకు 121 గజాలు ● ఒక సెంటు భూమికి 48.4 గజాలు ● ఇంటి నిర్మాణాల స్థలాలను ప్లాట్లు అంటారు. ప్లాట్లను గజాల చొప్పున కొనుగోలు చేస్తారు. -
డంపింగ్యార్డులున్నా.. నిరుపయోగమే
మద్నూర్(జుక్కల్): ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించి వంద శాతం పారిశుధ్యం సాధించాలన్న లక్ష్యం నెరవేరేలా లేదు. గ్రామాల్లో సేకరించిన చెత్తను ఆరు బయట, ప్రధాన రహదార్ల పక్కన పడేయటంతో డంపింగ్ యార్డులు ఉన్నా లేనట్టుగా ఉన్నాయి. అదే విధంగా పడేసిన చెత్తకు నిప్పు పెడుతుండడంతో దుర్గంధం వెదజల్లుతుండడంతో పాటు పొగతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇలా రోడ్ల పక్కన చెత్తను వేస్తూ నిప్పుపెడుతూ ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడంలేదు. పలు గ్రామాల్లో చెత్త నిర్వహణ ఇంకా చెత్తగా మారింది. సర్పంచుల పదవీకాలం పూర్తయి ఏడాదిన్నర దాటినా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల ప్రజాప్రతినిధులు లేక పారిశుధ్య పనులను పట్టించుకునే వారు కరువయ్యారు. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించినప్పటికి గ్రామాలపై వారి పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పొగతో తప్పని తిప్పలు వర్మి కంపోస్ట్ షెడ్లలో చెత్తను వేరు చేయడం, ఎరువులు తయారు చేయడం వంటి పనులు చేపట్టడం లేదు. పంచాయతీల్లో సేకరించిన చెత్తతో పాటు ప్లాస్టిక్ వస్తువులు, తదితర వ్యర్థాలను అన్నింటినీ ఆరుబయటే తగలబెడుతున్నారు. వచ్చే పొగతో వాహనదారులు, పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. కుళ్లిన వ్యర్థాలతో వచ్చే వాసనను భరించలేకపోతున్నామని స్థానికులు వాపోతున్నారు. నీరుగారుతున్న లక్ష్యం పల్లెలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పంచాయతీల ఆదాయాన్ని పెంచాలన్న లక్ష్యంతో ఒక్కోదానికి రూ.2.50 లక్షల చొప్పున ఏర్పాటు చేసిన వర్మి కంపోస్ట్ సెగ్రిగేషన్ షెడ్లు ఉమ్మడి మండలంలో నిరుపయోగంగా మారాయి. సేకరించిన చెత్తను సెగ్రిగేషన్ షెడ్లలో వేరు చేసి ఎరువు తయారు చేసి అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించగా అవకాశాలున్నప్పటికీ వాటిని వినియోగించకపోవడంతో ప్రభుత్వానికి వీటి ద్వారా వచ్చే ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. ఎరువుల తయారీకి సంబంధించి వ్యవసాయ, పంచాయతీ శాఖాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అవి నిరాదరణకు గురై లక్ష్యం నీరుగారిపోతోంది. ఎక్కడ పడితే అక్కడే చెత్త వేస్తున్న ప్రజలు స్పష్టంగా ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లోపం మరుగున పడిన కంపోస్ట్ ఎరువు తయారీ పట్టించుకోని అధికారులు వినియోగంలోకి తీసుకురావాలి రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన డంపింగ్, వర్మి కంపోస్టు షెడ్లు నిరుపయోగంగా ఉంటున్నాయి. చెత్త వేసేందుకు షెడ్లు నిర్మించినప్పటికీ వాటిని వినియోగంలోకి తీసుకురాకుండా నిర్లక్ష్యంగా వదిలేయడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. – రవీందర్, మద్నూర్ నిప్పు పెట్టకుండా చూడాలి చెత్తను రోడ్ల పక్కన వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. రోడ్ల పక్కన చెత్త వేయడంతో అది కుళ్లి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో ఆయా మార్గాల గుండా వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. –పండరి, హండెకేలూర్ -
పోగొట్టుకున్న సెల్ఫోన్ అప్పగింత
కామారెడ్డి టౌన్: కామారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు జూబ్లీ బస్ స్టేషన్కు వెళ్లింది. అక్కడ పెద్ద ఎత్తున ప్రయాణికులు ఎక్కారు. బస్సులో ఒక సెల్ఫోన్ కింద పడిపోవడంతో ప్రయాణికులు కండక్టర్కు అప్పగించారు. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఫోన్ ఎవరిదని ప్రశించినా ఎవరు సమాధానం చెప్పలేరు. దీంతో సెల్ఫోన్ కండక్టర్ వద్దనే ఉంచుకున్నారు. బస్సు మేడ్చల్ ప్రాంతానికి రాగానే ఒక మహిళ లేచి తన ఫోను కనిపించడం లేదని గట్టిగా అరిచింది. దీంతో కండక్టర్ ఆమెను పిలిచి సెల్ ఫోన్ తన వద్ద ఉందని చెప్పి ఆమెకు సెల్ ఫోన్ను అప్పగించారు. -
పురం.. ‘స్వచ్ఛ’తకు దూరం
డ్రైవర్స్ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల పక్కన మురికి కాలువకామారెడ్డి మున్సిపాలిటీలో 25 వేలకుపైగా గృహాలున్నాయి. పట్టణ జనాభా లక్ష దాటింది. పట్టణం శరవేగంగా విస్తరిస్తోంది. అయితే అభివృద్ధి మాత్రం అంతంత మాత్రంగానే జరుగుతోంది. పారిశుద్ధ్య నిర్వహణలో లోపాలతో పట్టణం చెత్త కుప్పలా కనిపిస్తోంది. శివారు కాలనీలతోపాటు గోదాంరోడ్, రాజీవ్నగర్, ఇందిరానగర్, డ్రైవర్స్కాలనీ, డబుల్బెడ్రూం, టీచర్స్కాలనీ, గాంధీనగర్, బతుకమ్మకుంట, రుక్మిణికుంట, శ్రీరాంనగర్కాలనీ, వికాస్నగర్, గొల్లవాడ, కిష్టమ్మగుడి, పెద్ద కాలనీ, వీక్లీమార్కెట్, అయ్యప్పనగర్, హరిజనవాడ, గ్రీన్ సిటీ తదితర కాలనీలలో కూడళ్లు, ఖాళీ స్థలాలలో చెత్త పడేస్తుండడంతో అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తోంది. ఓపెన్ స్థలాలైతే డంపింగ్ యార్డులుగా మారాయి. పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. డ్రెయినేజీ సమస్య.. పట్టణంలో చాలా కాలనీలలో ఇంకా పక్కా సీసీ డ్రెయినేజేలు లేవు. రోడ్లపైనే మురుగు నీరు పారుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువలు లేకపోవడంతో వర్షాకాలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. డ్రెయినేజీలు ఉన్న చోట కూడా సమస్యలున్నాయి. కొన్నిచోట్ల నెలల తరబడి డ్రెయినేజీలను శుభ్రం చేయడం లేదు. దీంతో మురుగు నిండి రోడ్లపైకి వస్తోంది. వర్షాకాలం కావడంతో మురికి నీటి ప్రవాహం ఎక్కువై రోడ్లపైకి వస్తుండడంతో కాలనీలు కంపు కొడుతున్నాయి. దోమలతోపాటు కుక్కలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రధాన రోడ్ల శుభ్రత పైనే అధికారులు దృష్టి సారించడంతో కాలనీలు ‘స్వచ్ఛ’తకు దూరమయ్యాయి. ‘తడి–పొడి’.. అంతా భ్రమ బల్దియా సానిటేషన్ విభాగంలో 19 ఆటోలు, 5 ట్రాక్టర్లు ఉన్నాయి. పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికి వెళ్లి తడి పొడి చెత్త వేర్వేరుగా సేకరించాల్సి ఉంటుంది. కానీ పట్టణంలో ఈ విధానం ఎక్కడా అమలు కావడం లేదు. తడి, పొడి చెత్తను కలిపే సేకరిస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు, బయోవేస్టేజ్, మాంసపు వర్థాలు, వంటింటి తడి చెత్త వ్యర్థాలు ఇలా అన్నీ కలిపి సేకరిస్తున్నారు. తడి, పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించడంతో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. డంపింగ్ యార్డు వద్ద కూడా తడి పొడి చెత్తను వేరు చేయడం లేదు.ఏళ్లుగా ఇదే పరిస్థితి.. మా ఇళ్ల పక్కన మురికి కాలువ అధ్వానంగా ఉంది. రోడ్లపైకి మురుగు నీరు వస్తోంది. దీంతో దోమలు, ఈగలు విపరీతంగా ఉంటున్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు తరచూ జ్వరాల బారిన పడుతున్నారు. డ్రెయినేజీ నిర్మించాలి. – ఎండీ. మక్బూల్, టీచర్స్ కాలనీవాసిశుభ్రం చేయడం లేదు రోడ్లను నెలల తరబడి శుభ్రం చేయడం లేదు. మురికి కాలువలను సైతం శుభ్రం చేయకపోవడంతో కంపు కొడుతున్నాయి. పిచ్చి మొక్కలు పెరిగి విషప్రాణులు సంచరిస్తున్నాయి. మోరీల్లోంచి చెత్తను తీసి రోడ్లపై వేస్తారు. వారం రోజులైనా తీయరు. – నర్సింలు, వీక్లీ మార్కెట్వాసిస్పెషల్ డ్రైవ్ చేపడతాం.. అన్ని వార్డులను నిత్యం పర్యవేక్షిస్తున్నాం. ఎక్కడైనా సానిటేషన్ సమస్యలుంటే ప్రజలు నేరుగా మాకు ఫిర్యాదు చేయాలి. తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం. త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సానిటేషన్ సమస్యలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఆయా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాం. – రాజేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్, కామారెడ్డిముక్కు మూసుకుంటున్నాం సిరిసిల్ల రోడ్లో ఉన్న మురికి కాలువల్లో మాంసం వ్యర్థాలు పడేస్తున్నారు. దీంతో దుర్గధం వ్యాపిస్తోంది. ముక్కు మూసుకుని వెళ్లాల్సి న పరిస్థితులు ఉన్నాయి. అధికారులు స్పందించి మురికి కాలువల్లో మాసం వ్యర్థాలు వేయకుండా చర్యలు తీసుకోవాలి. – మల్లేశ్, సిరిసిల్ల రోడ్వాసి బల్దియాలో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తం తడి, పొడి.. కలిపే సేకరణ పలు కాలనీలలో కానరాని పక్కా డ్రైయినేజీలు పూడుకుపోయిన మోరీలు.. రోడ్లపైకి మురుగు పరుగు కొరవడిన అధికారుల పర్యవేక్షణ -
స్వగ్రామానికి చేరిన మృతదేహం
కమ్మర్పల్లి: ఒమన్ దేశంలో ఆత్మహత్యకు పాల్పడిన కమ్మర్పల్లి మండలం హాసకొత్తూర్ గ్రామానికి చెందిన జుంబరాత్ అన్వేశ్(27) మృతదేహం బుధవారం రాత్రి స్వగ్రామానికి చేరుకుంది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. 15 రోజుల క్రితం అన్వేశ్ ఆత్మహత్యకు పాల్పడగా, మృతదేహం తీసుకురావడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, కాంగ్రెస్ నేత సునీల్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వారు గల్ఫ్ కన్వీనర్ భీమ్రెడ్డితో మాట్లాడి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు తెలిపారు. ఎంబసీ అధికారులతో మాట్లాడి మృతదేహం స్వగ్రామానికి రావడానికి కృషి చేశారు. -
పౌష్టికాహారాన్ని అందించాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి క్రైం: చిన్నారులు, గర్భిణులకు పౌష్టికాహారాన్ని మాత్రమే అందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మహిళ, శిశు అభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్లో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. పౌష్టికాహార లోపం గల పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నా రు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా అంగన్వాడీ కేంద్రాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలందరూ తప్పనిసరిగా వచ్చేలా పర్యవేక్షించాలని సీడీపీవోలు, సూపర్వైజర్లను ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న అంగన్వాడీ భవనాల నిర్మాణం, మరుగుదొడ్లు, తాగునీటి వసతులు, విద్యుత్ తదితర పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజినీరింగ్ శాఖల అధికారులను ఆదేశించారు. స్ధానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్ నాయక్, డీఎంహెచ్వో చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇందిరా సౌరగిరి జల వికాసం.. పోడు పట్టాలున్న గిరిజన రైతులకు లాభసాటి వ్యవసాయం జరిగేలా ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం ఎంతగానో తోడ్పడుతుందని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్లో ఇందిర సౌర గిరి జల వికాసం పథకంపై ఏర్పాటు చేసిన స మావేశంలో మాట్లాడారు. ఈ పథకం ద్వారా పోడు పట్టాలు పొందిన లబ్ధిదారులకు బోరు మోటర్, సోలార్ పంప్సెట్లు మంజూరు చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. లబ్ధిదారులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోడానికి ఎంపీడీవో కార్యాలయాల్లో సంప్రదించాలన్నారు. డీఎఫ్వో నిఖిత, అదనపు కలెక్టర్ చందర్ నాయక్, ఆర్డీవో వీణ, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి సతీష్ యాదవ్, డీఆర్డీవో సురేందర్, డీపీవో మురళి, డీఏవో తిరుమల ప్రసాద్, ఉద్యానవన అధికారిణి జ్యోతి, డీటీవో శ్రీనివాస్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
పహాణి అంటే..?
పహాణి అంటే భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డుల ముఖ్యమైన పత్రం. దీనిని అడంగళ్ అని కూడా అంటారు. ● పహాణిలో భూమి యజమాని, సాగు చేస్తున్న వారి పేరు, సర్వే నంబర్, ఖాతా నంబర్, భూమి యొక్క విస్తీర్ణం, కొలతలు ఉంటాయి. ● భూమికి నీటి సదుపాయం(బావి, కాలువ, చెరువు), నేల రకం(సారవంతమైన, రాతి నేల) అనే స్వభావం పేర్కొనబడి ఉంటుంది. ● పహాణిలో భూమిలో సాగు చేస్తున్న పంటల వివరాలు, ఇతర ముఖ్యమైన సమాచారం ఉంటుంది. ● పహాణి భూమి యజమానికి చట్టపరమైన హక్కులను కల్పిస్తుంది. భూమి కొనుగోలు, అమ్మకం లేదా బదిలీ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. ● భూమికి సంబంధించిన వివాదాలను పరిష్కరించే సమయంలో ఉపయోగ పడుతుంది. ● బ్యాంకు నుంచి పంట రుణం, ఇతర రుణాలు తీసుకోడానికి, ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోడానికి పహాణి ఉపయోగ పడుతుంది. – బాల్కొండమీకు తెలుసా? -
కనుల పండువగా రథయాత్ర
కామారెడ్డి అర్బన్: అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం శ్రీజగన్నాథ రథయాత్రను కనుల పండువగా నిర్వహించారు. విద్యానగర్ సాయిబాబా ఆలయం చౌరస్తా వద్ద రథయాత్ర ప్రారంభమైంది. పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా సిరిసిల్ల రోడ్డులోని శ్రీకన్యకా పరమేశ్వరి ఆలయం వరకు రథయాత్ర సాగింది. వడోదర ఇస్కాన్ ప్రతినిధులు వాసుగోష్ ప్రభు, వెంకటదాసు ప్రభు, పట్టణ ఎస్హెచ్వో నరహరి, వీహెచ్పీ ప్రతినిధులు, భక్తులు భారీ సంఖ్యలో రథయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరేకృష్ణ, జై జగన్నాథ నామస్మరణతో పుర వీధులు మారుమోగాయి. నవీపేటకు చెందిన చందు సాయన్న చిందు కళాకారుల బృందం దేవతామూర్తుల వేషధారణతో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. -
ఇందిరమ్మ ఇళ్లను త్వరగా నిర్మించుకోవాలి
కామారెడ్డి క్రైం: ఇందిరమ్మ ఇళ్లను త్వరగా ని ర్మించుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ లబ్ధిదారులకు సూచించారు. బుధవారం కామరెడ్డి మున్సిపల్ పరిధిలోని టేక్రియాల్లో ఇద్దరు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్లను అందజేశారు. ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..నిరుపేదలు సైతం గౌరవంగా సొంత ఇంటిలో నివసించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని అన్నారు. మున్సిపల్ కమిషనర్ రాజేందర్, హౌసింగ్ పీడీ విజయ్ పాల్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
ఫిలిప్పీన్స్లో వైద్య విద్యార్థి మృతి
మద్నూర్(జుక్కల్): కుర్లా గ్రామానికి చెందిన వడ్ల యోగేశ్(23) బుధవారం ఫిలిప్పీన్స్ దేశంలో గుండెపోటుతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. పుట్టిన రోజు నాడే యోగేశ్ మృతి చెందడంతో ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుర్లా గ్రామంలో ఆర్ఎంపీగా వైద్య సేవలు అందిస్తున్న రాజేందర్కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. రెండో కూమారుడు యోగేశ్ ఫిలిప్పీన్స్ దేశంలో ఎంబీబీఎస్ నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు. యోగేశ్ పది రోజుల క్రితమే కుర్లాకు వచ్చి వెళ్లాడు. బుధవారం ఫిలిప్పీన్స్లో కళాశాలకు వెళ్దామని బయలుదేరే సమయంలో యోగేశ్కు ఛాతీలో నొప్పి వచ్చిందని తండ్రికి తెలపగా దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లాలని ఆయన సూచించారు. స్నేహితులు సాయంతో ఆస్పత్రికి వెళ్తుండగా మెట్లు దిగే క్రమంలో కుప్పకూలిపోయాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు పేర్కొన్నారు. యోగేశ్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. గుండెపోటుతో అకాల మరణం పుట్టిన రోజు నాడే మృతి.. కన్నీరుమున్నీరైన కుటుంబీకులు -
పసుపు రైతులకు క్షమాపణలు చెప్పాలి
సుభాష్నగర్: పసుపు బోర్డు ఏర్పాటు కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్, 18 నెలలుగా కాంగ్రెస్ పసుపు రైతులకు ఏం చేయలేదని, వెంటనే వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశాంత్రెడ్డి వేల్పూర్లో పుట్టి పదేళ్లు అధికారంలో ఉండి కూడా పసుపు రైతులకు ఏం చేయలేదని విమర్శించారు. జీవన్రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడంలేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. పసుపు రైతులు నామినేషన్ వేసి ఓడించిన విషయాన్ని కవిత మర్చిపోయిందా అని ప్రశ్నించారు. 18 నెలలు గడిచినా సుదర్శన్రెడ్డికి లెటర్ ప్యాడ్ లేదని, మరో ఎమ్మెల్యే భూపతిరెడ్డికి క్యాంపు కార్యాలయం లేదని ఎద్దేవా చేశారు. పసుపు బోర్డుతో ప్రయోజనాలేంటో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వివరించారని, పక్కనే ఉన్న భూపతిరెడ్డికి అర్థం కాలేదా అని ప్రశ్నించారు. బోర్డుకు శాశ్వత కార్యాలయం కోసం జెడ్పీ ఆవరణలో 2 ఎకరాల స్థలం కావాలని కలెక్టర్కు లేఖ రాశామన్నారు. పసుపు బోర్డు క్రెడిట్ అర్వింద్కే దక్కుతుందని, విమర్శలు చేసే వారికి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు న్యాలం రాజు, నాగోళ్ల లక్ష్మీనారాయణ, మాస్టర్ శంకర్, గంగోనె సంతోష్, అనంత్రెడ్డి, నారాయణ యాదవ్, బద్దం కిషన్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు. బోర్డు ఏర్పాటుతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల అక్కసు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ పటేల్ కులాచారి -
రోడ్డు ప్రమాదంలో మెదక్ జిల్లా వాసి మృతి
క్రైం కార్నర్భిక్కనూరు: మండల కేంద్రంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మెదక్ జిల్లా అక్కన్నపేటకు చెందిన ఒకరు మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. అక్కన్నపేటకు చెందిన కొత్తిన్న లక్ష్మీనారాయణ(54) జంగంపల్లి గ్రామశివారులోని విజయ సాయి ల్యాబొరెటరీలో ఫిట్టర్గా పనిచేస్తూ అదే గ్రామంలో అద్దెకు ఉంటున్నాడు. బుధవారం వ్యక్తిగత పనుల నిమిత్తం అక్కన్నపేట గ్రామానికి బైక్పై ఉదయం వెళ్లి మధ్యాహ్నం తిరిగి జంగంపల్లికి వస్తున్నాడు. భిక్కనూరు చర్చి సమీపంలో జాతీయ రహదారిపై వెనుక నుంచి కంటైనర్ ఢీకొట్టడంతో లక్ష్మీనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కామారెడ్డి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య యాదమ్మ ఫిర్యాదు మేరుకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
‘సహకారం’తో రైతులు, కార్మికులకు ప్రయోజనం
సుభాష్నగర్: సహకార వ్యవస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా రైతులు, కార్మికులు, వ్యాపారులు లాభపడుతున్నారని ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ కో ఆపరేటీవ్ అలయెన్స్ (ఐసీఏ) ఆధ్వర్యంలో లండన్లోని మాంచెస్టర్ నగరంలో కో ఆపరేటీవ్ యాక్టివిటీస్ అనే అంశంపై బుధవారం సదస్సు నిర్వహించారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో ఆపరేటీవ్ బ్యాంక్స్ లిమిటెడ్ (ఎన్ఏఎఫ్ఎస్సీఓబీ) తరఫున కుంట రమేశ్రెడ్డి సదస్సుకు హాజరై ప్రసంగించారు. యూఎన్వో 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సహకార సంస్థలు రైతులకు అనేక రకాల సేవలు అందిస్తున్నాయని, గ్రామీణ వ్యవస్థకు మూలాధారంగా ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సహకార బ్యాంకుల ద్వారా రైతులకు అందిస్తున్న సౌకర్యాలను రమేశ్రెడ్డి వివరించారు. -
మంచి పథకం.. మరుగున పడింది
ఎల్లారెడ్డి: పదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన జాతీయ కుటుంబ ప్రయోజన పథకం(ఎన్ఎఫ్బీఎస్) గురించి ఇప్పటికీ ఎవరికీ అవగాహన లేకపోవడం విడ్డూరం. అకస్మాత్తుగా ఇంటి పెద్ద లేదా కుటుంబ ముఖ్య సంపాదన పరుడు మరణిస్తే ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకమే ఈ ఎన్ఎఫ్బీఎస్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం గురించి రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో కొన్నేళ్లుగా ఈ పథకం మరుగున పడింది. ఇంటి పెద్ద మరణించిన దారిద్య్రరేఖకు దిగువన కుటుంబాలకు ఎంతో కొంత ఆర్థిక సహాయం అందజేసే ఈ పథకం గురించి కొన్నేళ్లుగా అవగాహన కల్పించే వారు లేకుండా పోయారు. కామారెడ్డి జిల్లా ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు నామమాత్రంగా మాత్రమే ఈ పథకానికి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. 2015 నుంచి ఇప్పటివరకు 19 దరఖాస్తులు మాత్రమే రావడం గమనర్హం. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబంలోని 18–60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ముఖ్య సంపాదనపరుడు(పురుషుడు లేదా సీ్త్ర) అకస్మాతుగా మరణిస్తే ఆ కుటుంబానికి ఈ పథకం కింద రూ.20 వేల ఆర్థిక సహాయం అందుతుంది. ఇందుకు మరణించిన వ్యక్తి మరణ ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం (ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్) కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ కాపీలను జతచేసి మీ–సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దరఖాస్తును అధికారులు పరిశీలించి అర్హులైన కుటుంబానికి రూ. 20 వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తారు. మరణించిన వ్యక్తి కుటుంబంలోని వితంతు భార్యకు గాని, అవివాహిత కుమార్తెలకు గాని ఈ మొత్తాన్ని అందజేస్తారు. ఆపద్బంధు పథకం కింద కాని, ఆమ్ ఆద్మీ బీమా యోజన కింద గాని లబ్ధిపొందిన వారు ఈ పథకానికి అనర్హులని అధికారులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ఎన్నో పథకాల గురించి నిత్యం ప్రచారం చేసే అధికార గణం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఎంతో కొంత సహాయపడే ఈ పథకం గురించి కొన్నేళ్లుగా ఊసే ఎత్తడం లేదు. పేదలకు ఎంతో కొంత ఉపయోగపడే ఈ పథకం గురించి జిల్లాలో ప్రచారం చేసేందుకు అదనపు కలెక్టర్ విక్టర్ మండల స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ పథకం కింద అర్హులైన బాధిత కుటుంబాలు దరఖాస్తులు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఎన్ఎఫ్బీఎస్ గురించి అవగాహన కరువు ఆర్థిక సాయానికి దూరంగా నిరుపేదలు ఏళ్ల తరబడి ఉనికే లేని పథకం అవగాహన కల్పిస్తున్నాం ఎన్ఎఫ్బీఎస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు పూర్తి చర్యలు తీసుకుంటున్నాము. వితంతు పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకున్న మహిళలతో, రైతు బీమా పథకం కింద లబ్ధిపొందిన కుటుంబాల సభ్యులతో మాట్లాడి ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేలా మండల స్థాయి అధికారులకు ఆదేశించాం. అవగాహన లోపం కారణంగా పేదలకు ఈ పథకం దూరమైంది. పూర్తిస్థాయి ప్రచారంతో ఈ పథకం ప్రజల్లోకి వెళ్లేలా కృషి చేస్తున్నాం. – విక్టర్, అదనపు కలెక్టర్ -
రెవెన్యూ దరఖాస్తుల పరిశీలన
మద్నూర్(జుక్కల్): డోంగ్లీ తహసీల్ కార్యాలయాన్ని బుధవారం అదనపు కలెక్టర్ విక్టర్ సందర్శించి భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. దరఖాస్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని ఆయన అన్నారు. కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ మోడల్ ఇంటి నిర్మాణాన్ని పరిశీలించి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. డోంగ్లీలో మొత్తం 98 దరఖాస్తులు వచ్చాయని అధికారులు అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఆర్ఐ సాయిబాబా, సిబ్బంది ఉన్నారు. -
‘ఇందిరమ్మ’కు ధరాఘాతం
● జిల్లాకు 11,489 ఇళ్లు మంజూరు ● 5,246 ఇళ్లకు మార్కింగ్ పూర్తి ● స్లాబ్ లెవల్కు చేరింది 17 ఇళ్లే.. ● రూఫ్ లెవల్కు 69.. ● బేస్మెంట్ లెవల్లో మరో 449 నిర్మాణాలు.. ● పెరిగిన స్టీల్, సిమెంట్, ఇసుక ధరలతో ముందుకు రాని లబ్ధిదారులుసదాశివనగర్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి ధరాఘాతం తగిలింది. పెరిగిన స్టీల్, సిమెంట్, ఇసుక ధరల కారణంగా ఇళ్ల నిర్మాణానికి చాలా మంది లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. దీంతో జిల్లాలో నిర్మాణాలు వేగం పుంజుకోవడం లేదు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకువచ్చింది. ఇంటి స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ పథకంలో ఇళ్లను మంజూరు చేస్తోంది. తొలి విడతలో జిల్లాకు 11,489 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 5,246 గృహాలకు మార్కింగ్ పూర్తయ్యింది. ఇప్పటివరకు 17 ఇళ్లు మాత్రమే స్లాబ్ లెవల్కు చేరాయి. 69 గృహాలు రూఫ్ లెవల్లో ఉండగా 449 నిర్మాణాలు బేస్మెంట్ లెవల్లో ఉన్నాయి. మిగతావాటి పనులు ముందుకు సాగడం లేదు. అప్పుల పాలవుతున్న నిర్మాణదారులు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు వివిధ దశలలో బిల్లులు చెల్లిస్తుంది. బేస్మెంట్ వరకు నిర్మాణం పూర్తయితే లక్ష రూపాయలు ఇస్తుంది. రూఫ్ లెవల్ వరకు పూర్తయితే రూ. 1.25 లక్షలు, స్లాబ్ వేస్తే రూ. 1.75 లక్షలు, రంగులు వేసిన తర్వాత మిగిలిన లక్ష రూపాయలు అందిస్తుంది. అయితే పెరిగిన ధరలతో ఇంటి నిర్మాణ వ్యయం కూడా గణనీయంగా పెరుగుతోంది. దీంతో నిర్మాణదారులు ఇబ్బందిపడుతున్నారు. మరోవైపు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ముందుగా డబ్బులు ఇవ్వకపోవడంతో అప్పులు తేవాల్సి వస్తోంది. ఇది వారికి మరింత భారంగా మారుతోంది. దీంతో చాలా మంది ఇళ్ల నిర్మాణానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది.ధరలు ౖపైపెకి...ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఐరన్ ధరలు గణనీయంగా పెరిగాయి. గతేడాది అక్టోబర్లో సిమెంట్ బస్తా ధర రూ. 250 నుంచి రూ. 300 వరకు ఉండగా.. ప్రస్తుతం రూ. 330 నుంచి రూ. 360కి విక్రయిస్తున్నారు. ట్రాక్టర్ ఇసుక ధర రూ. 2 వేలనుంచి రూ. 3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇటుక, స్టీల్, కలప ధరలూ గణనీయంగా పెరిగాయి. విపరీతంగా ధరలు పెరిగాయి ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యిందని మురిసినం. ఇంటి నిర్మాణం చేపట్టినం. సి మెంట్, ఇసుక, సలాక ధర లు మస్తు పెరిగినయి. ఒక సలాక కోసమే రూ. లక్ష అ యినయి. సిమెంట్ కూడా మస్తు పెరిగింది. ఇబ్బందిగా ఉంది. – సాకలి సాయిలు, లబ్ధిదారు, ధర్మారావ్పేట్ప్రోత్సహిస్తున్నాం.. మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హులను గుర్తించాం. కొన్నిచోట్ల పనులు ప్రారంభించాం. ఇప్పటికీ ఇంకా మార్కింగ్ చేసే కార్యక్రమం కొనసాగుతోంది. ఇల్లు మంజూరైనవారు నిర్మాణాలు చేపట్టుకునేలా ప్రోత్సహిస్తున్నాం. పనులు ప్రారంభించిన వారికి నిబంధనల ప్రకారం బిల్లులు మంజూరు చేస్తున్నాం. – విజయపాల్రెడ్డి, హౌసింగ్ పీడీ, కామారెడ్డి