క్రికెట్ క్రీడా సామగ్రి వితరణ
కమ్మర్పల్లి: కమ్మర్పల్లి మండలం బషీరాబాద్లోని గ్రామ యువజన సంఘానికి ఆదివారం సర్పంచ్ బైకాని జమున, ఉప సర్పంచ్ చిలివేరి భూమేశ్వర్ క్రికెట్ క్రీడా సామగ్రిని వితరణ చేశారు. కార్యక్రమంలో ముఖేష్, తిరుపతి, తరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ జమున మహేశ్ మాట్లాడుతూ యువకులకు క్రీడలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. శారీరకంగా ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో యువజన సభ్యులు వంకాయల తిరుపతి, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.


