ఘనంగా మల్లయ్య విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం
ధర్పల్లి: మండల కేంద్రంలో కుర్మ యాదవ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మల్లయ్య ఆలయంలో బుధవారం స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా స్వామివారి కల్యాణం, అగ్నిగుండాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
ధర్పల్లి: ధర్పల్లి ఆదర్శ పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆరో తరగతిలో 100 సీట్లు, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అవకాశం ఉందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 28లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.


