వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్ విధానంలో నడుస్తున్నాయి. దీంతో ప్రతీ ఒక్కరూ డిజిటల్ చెల్లింపులకు అలవాటుపడ్డారు. పైస్థాయిలోనే కాక కింది స్థాయిలో కూడా నగదు చెల్లింపులు తగ్గిపోతున్నాయి. చాయ్ తాగినా, కూరగాయలు కొనుగోలు చేసినా సరే డిజిటల్ పేమెంట్స్ చేస్తుండడంతో అందరూ వినియోగించాల్సి వస్తోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో చెట్టుకింద కూర్చుని చెప్పులు కుట్టే బల్రాం అనే మోచి తప్పనిసరి పరిస్థితుల్లో డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి


