ఈ నిర్ణయం సరికాదు
ఎంతో చరిత్ర కలిగిన ఏయూ దూరవిద్య కేంద్రం ద్వారా జిల్లాలో లక్షలాది మంది పట్టభద్రులయ్యారు. వీరిలో ఎంతో మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. స్టడీ సెంటర్కు సంబంధించిన అన్ని సేవలనూ ఆన్లైన్లో ఉంచి, ఈ కేంద్రాలను మూసివేయాలనేది సరైన నిర్ణయం కాదు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలి.
– ఎం.గంగా సూరిబాబు,
ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి
ఉద్యమిస్తాం
ఫీజు, అడ్మిషన్ల వంటివన్నీ ఏయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని, ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు ఏర్పాటు చేసి సమాచారం అందిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ, స్టడీ సెంటర్లు మూసివేతతో ఆవిధంగా సమాచారం ఇచ్చేవారుండరు. హెల్ప్లైన్ నంబర్లు పని చేయవు. ఏదైనా సమస్య వస్తే విశాఖపట్నంలోని వర్సిటీకి వెళ్లాలి. ఆన్లైన్ విధానం చూస్తూంటే ప్రైవేటు సంస్థల వైపు మొగ్గు చూపేలా ఉంది. స్టడీ సెంటర్లను తిరిగి కొనసాగించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. లేని పక్షంలో ఉద్యమిస్తాం.
– పెంకే రవితేజ,
విద్యార్థి జేఏసీ రాష్ట్ర నాయకుడు
ఈ నిర్ణయం సరికాదు


