breaking news
East Godavari District Latest News
-
వైభవంగా గంధోత్సవం
● బషీర్ బీబీ దర్శనానికి పోటెత్తిన భక్తులు ● ప్రత్యేక ప్రార్థనలు ● కిక్కిరిసిన పొన్నాడ కొత్తపల్లి: స్థానిక పొన్నాడ బంగారు పాపమ్మ (బషీర్ బీబీ ఔలియా) ఉర్స్ ఉత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నాడ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసాయి. పోలీసుల భారీ బందోబస్తు నడుమ సుమారు 30 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ ముజావర్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా గంధోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మూలపేటకు చెందిన షెక్మౌలాసాహేబ్ ఇంటి వద్ద నుంచి పెద్ద బొడ్డేపల్లికి చెందిన ఎండీ తాజుద్దీన్బాబా సమర్పించిన గంధాన్ని (సంథల్) ప్రత్యేకంగా అలంకరించిన గుర్రంపై ఉంచి ఫకీర్ మేళాతో మూలపేట నుంచి పొన్నాడ బషీర్బీబీ ఆలయం వరకు ఊరేగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతికి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సాంప్రదాయ ప్రార్థనల అనంతరం భక్తులకు గంధాన్ని పంపిణీ చేశారు. ఉత్సవాల సందర్భంగా మూలపేట నుంచి పొన్నాడ వరకు కాలినడకన వెళ్లేందుకు కూడా వీలులేని పరిస్థితులు నెలకొంది. పలు మార్లు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పిఠాపురం, తుని, కాకినాడల నుంచి వచ్చిన వాహనాలు పొన్నాడ చేరుకోవడానికి ఇబ్బంది పడ్డాయి. ఎస్సై వెంకటేష్ ఆధ్వర్యంలో సుమరు 120 సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. వాహనాలు ఆలయ ప్రాంగణంలోకి వెళ్లకుండా పొన్నాడ, అమరవిల్లి, నాగులపల్లి వద్దె నిలిపివేశారు. గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో భక్తులకు తాగునీరు, పారిశుధ్య నిర్వహణ ఏర్పాట్లు చేశారు. -
కనకదుర్గమ్మకు చీర, సారె
అమలాపురం రూరల్: గాంధీనగర్లో కొలువైన కనకదుర్గమ్మ తల్లి ఆలయ 30వ వార్షికోత్సవం సందర్భంగా మాఘమాసం ఆదివారం భక్తులు అమ్మవారికి చీర, సారె సమర్పించారు. వేలాదిగా మహిళలు సారెను నెత్తిన మోస్తూ ఊరేగింపుగా తీసుకువెళ్లారు. వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రారంభించిన ఊరేగింపు అమ్మవారి ఆలయం వరకు సాగింది. ఆలయ అర్చకుడు రామేశ్వరవరపు రామప్రసాద్ అధ్వర్యంలో అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి సమర్పించిన సారె, ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ తిక్కిరెడ్డి ఆదినారాయణ అధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు ప్రసాదాలు, గాజులు పంపిణీ చేశారు. అనంతరం జరిగిన అన్నసమారాధనలో వేలాది భక్తులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు బ్రాండ్ ‘శ్యామ్’బోట్క్లబ్ (కాకినాడసిటీ): ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు శ్యామ్ ఇనిస్టిట్యూట్ ఒక బ్రాండ్గా నిలిచిందని ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ అన్నారు. పోలీస్ ఉద్యోగాలకే కాకుండా ఏపీపీ ఎస్సీ గ్రూప్– 2 ఉద్యోగాల్లోను శ్యామ్ ఇన్స్టిట్యూట్ విజయం సాధించడం అభినందనీయమన్నారు. స్థానిక శ్యామ్ ఇనిస్టిట్యూట్లో ఆదివారం గ్రూపు–2 విజేతల విజయోత్సవ సభ నిర్వహించారు. ఇనిస్టిట్యూట్ అధినేత గుంటూరి శ్యామ్ ఎంతో నిబద్ధతతో, క్రమ శిక్షణతో ఇనిస్టిట్యూట్ను తీర్చిదిద్దడంతో అనేకమందికి ఉద్యోగాలు అందించే సంస్థగా ఆవిర్భవించిందన్నారు. సంస్థ అధినేత గుంటూరి శ్యామ్, డైరక్టర్ శైలజ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగాలకే పరిమితం కాకుండా గ్రూప్స్ వంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించడంతో తొలి ప్రయత్నంలోనే గ్రూప్– 2 ఫలితాల్లో 94 పోస్టులను తమ విద్యార్థులు సాధించారన్నారు. సంస్థ ప్రారంభించిన 25 ఏళ్లలో 26 వేలకు పైగా ఉద్యోగాలు సాధించామన్నారు. రెండేళ్లుగా 7210 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించామని వివరించారు. గ్రూప్–2 విజేతలు మాట్లాడుతూ శ్యామ్ ఇనిస్టిట్యూట్లో ఉన్నతమైన బోధనతో పాటు మోటివేషన్, భరోసా, ఆత్మస్థైర్యం కల్పించడంతోనే ఈ ఉద్యోగాలు సాధించగలిగామన్నారు. అనంతరం విజేతలతో పాటు వారి తల్లితండ్రులను సత్కరించి జ్ఞాపిక అందించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
షామియానా తొలగించారు
కోటి తులసి పూజ సందర్భంగా వేసిన షామియాను ఆదివారం ఆలయ అధికారులు తొలగించారు. శుక్రవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘కోటి తులసి పూజకు శ్రీకారం’ వార్తలో భక్తుల ఇబ్బందిని ప్రస్తావించిన విషయం తెలిసిందే. 2022లో నిర్వహించిన కోటి తులసి పూజలో కల్యాణ వేదిక ముందు తులసి వనంలో ‘సత్యదేవుడు, అమ్మవారి విగ్రహాలను’ ఉంచడం వల్ల భక్తులు అక్కడ ఫొటోలు దిగేవారు. ఇప్పుడు అటువంటి ఏర్పాటు లేకపోవడంతో వారు అసంతృప్తి వ్యక్తం చేసున్నారు. అలాగే కల్యాణ వేదిక నుంచి విశ్రాంతి మండపం వరకు షామియానా వేయడంతో వేదిక గోపురం కనిపించకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈఓ ఆదేశం మేరకు షామియానాను ఆలయ సిబ్బంది తొలగించారు.కల్యాణ వేదిక ముందు గల విశ్రాంతి మండపంలో తులసి వనం మధ్య సత్యదేవుడు, అమ్మవారి ఉత్సవమూర్తులను సైతం ఏర్పాటు చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడ ఫొటోలు దిగారు. -
మానవత్వం నశించి పశువుల పాకకు నిప్పు
కపిలేశ్వరపురం: వెదురుమూడి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ దళిత నాయకుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ నక్కా సింహాచలానికి చెందిన పశువుల పాకకు శనివారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో పాడి ఆవు మృతి చెందగా మరో పాడి గేదె తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతోంది. పశువులతో పాటు పాకలోని దాణా, వ్యవసాయ సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనపై సింహాచలం అంగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై జి.హరీష్కుమార్, అంగర పశువైద్యాధికారి వీవీ రమణమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేనివారు ఈ అమానుషానికి పాల్పడ్డారని బాధితుడు సింహాచలం అనుమానం వ్యక్తం చేశారు. 2023 జూన్లోనూ తన పశువుల పాకకు ఇలాగే నిప్పు పెట్టారని, అప్పటి ఘటన, నేటి ఘటనల్లో రూ.లక్షల్లో నష్టం వాటిల్లిందన్నారు. గత ఘటన సమయంలో ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేవని సింహాచలం అన్నారు. ఇప్పటికై నా దుండగులను పట్టుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. కాగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, జెడ్పీటీసీ సభ్యుడు పుట్టపూడి అబ్బు ఫోన్లో సింహాచలాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఘటనా స్థలాన్ని ఎంపీపీ జుత్తుక వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ సాకా శ్రీనివాస్, సర్పంచ్ కురుపూడి ఉదయశ్రీ, వైఎస్సార్ సీపీ నాయకులు సూరిబాబు, నల్ల శ్రీను, అర్జునరావు, పాలింగి శ్రీనివాస్, పాలింగి కిశోర్ పరిశీలించారు. ● పాడి ఆవు మృతి, మరో గేదెకు తీవ్ర గాయాలు ● ఆవేదన వ్యక్తం చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకుడు -
కోటి జన్మల ఫలం తులసి పూజ
● రత్నగిరిపై మూడో రోజుకు చేరిన పూజలు ● విశేషంగా హాజరైన భక్తజనం అన్నవరం: మాఘ మాసంలో మహా విష్ణువును తులసి దళాలతో పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. సత్యదేవుని సన్నిధిలో నిర్వహిస్తున్న ‘కోటి తులసి పూజ’ ఆదివారం మూడో రోజుకు చేరుకుంది. వేకువ జామున సుప్రభాత సేవతో ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటలకు పండితులు వార్షిక కల్యాణ వేదికపై ఆశీనులై ఉన్న స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి అనంతరం ప్రసాదాలు నివేదించారు. ఉదయం తొమ్మిది నుంచి 11–30 గంటల వరకు 60 మంది రుత్విక్కులు ఐదు లక్షల తులసి దళాలతో విష్ణుసహస్ర నామాలతో స్వామి వారికి అర్చన చేశారు. అనంతరం నివేదనలు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు రుత్విక్కులు మరో ఐదు లక్షల తులసి దళాలతో స్వామి వారికి పూజలు చేశారు. అనంతరం ప్రసాద నివేదన, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. వేద పండితులు వేదాశీస్సులు అందజేసి పవళింపు సేవతో రెండో రోజు కార్యక్రమాలు ముగించారు. దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, యనమండ్ర శర్మ, చిట్టి శివ, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకులు ఇంద్రగంటి నర్సింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యం, కల్యాణబ్రహ్మ చామర్తి కన్నబాబు, పురోహితులు పాలంకి పట్టాభి, తదితరులు ఈ కార్యక్రమాలు నిర్వహించారు. -
కడియపులంకలో అగ్ని ప్రమాదం
కడియం: మండలంలోని కడియపులంక కొబ్బరితోట కాలనీలో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కె.సత్తిరాజు ఇంట్లోని వాషింగ్ మెషిన్ ఆన్ చేయగా షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి ఈ ప్రమాదం సంభవించిందని చెప్తున్నారు. స్థానికులు అప్రమత్తమై మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ లోపు స్థానిక ఎస్ఐ నాగదుర్గాప్రసాద్ స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకుని అగ్ని మాపక శకటాన్ని పిలిపించగా ఆ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రాణనష్టం జరగక పోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. -
12 దేశవ్యాప్త సమ్మె
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలనే డిమాండుతో కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ నెల 12 నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెలో తామూ పాల్గొంటున్నామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ (ఏపీఎంఎస్ఆర్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.వెంకట్రావు తెలిపారు. సమ్మె పోస్టర్ను కలెక్టరేట్ వద్ద ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాత కార్మిక చట్టాలే అంతంత మాత్రంగా అమలవుతున్న పరిస్థితుల్లో కొత్త లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు మరింతగా అన్యాయం జరుగుతుందని అన్నారు. తమకున్న సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ను కూడా కొత్త లేబర్ కోడ్ ద్వారా రద్దు చేశారని చెప్పారు. రూ.18 వేల జీతం దాటిన వారు కార్మికులే కాదని, వారికి ఎటువంటి చట్టాలూ వర్తించవని పేర్కొన్నారని తెలిపారు. మెడికల్ రిప్స్కు నిర్దిష్ట పని పద్ధతులుండాలని, వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధానాలు అరికట్టాలని కోరుతున్నామన్నారు. యూనియన్ కాకినాడ బ్రాంచి కార్యదర్శి సీహెచ్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, మెడికల్ రిప్స్ నిరంతరం యాజమాన్యాల వేధింపులకు గురవుతూంటారని చెప్పారు. లేబర్ కోడ్ల వల్ల వీరిపై ఒత్తిడి మరింత పెరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త లేబర్ కోడ్లు రద్దు చేయాలని, పని గంటలు పెంచుతూ రాష్ట్ర క్యాబినెట్ చేసిన తీర్మానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, బ్రాంచి అధ్యక్షుడు ఎంఏ స్వామి పాల్గొన్నారు. ఉత్సాహంగా సైక్లాథాన్ కాకినాడ రూరల్: ఓఎన్జీసీ ఆధ్వర్యాన సైక్లాథాన్ ఆదివారం ఉత్సాహంగా సాగింది, సాక్ష్యం కార్యక్రమంలో భాగంగా రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీలోని ఓఎన్జీసీ హెచ్టీపీ కార్యాలయం వద్ద ఈ కార్యక్రమాన్ని అసెట్ మేనేజర్ ప్రబల్సేన్ గుప్తా బెలూన్లు గాలిలోకి విడిచిపెట్టి, జెండా ఊపి ప్రారంభించారు. ఏపీఐఐసీ కాలనీ నుంచి సర్పవరం జంక్షన్ స్పెన్సర్స్ షాపు వరకూ, అక్కడి నుంచి తిరిగి ఓఎన్జీసీ హెచ్టీపీ కార్యాలయం వరకూ సైక్లాథాన్ సాగింది. ఇందులో ఓఎన్జీసీ సిబ్బంది, అధికారులు, మహిళలు, చిన్నారులు, గోదావరి, కాకినాడ సైక్లింగ్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రబల్సేన్ గుప్తా మాట్లాడుతూ, అంతరించిపోతున్న సంప్రదాయ ఇంధన వనరులను సంరక్షించేందుకు ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించుకోవాలని కోరారు. ఈస్ట్రన్ ఆఫ్షోర్ అసెట్ మేనేజర్ రజిత్ మల్హోత్రా, హెచ్ఆర్ సునీల్ కుమార్, మహ్మద్ రఫీ పాల్గొన్నారు. తలుపులమ్మ సన్నిధికి పోటెత్తిన భక్తులు తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువై ఉన్న తలుపులమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు ప్రత్యేక వాహనాల్లో లోవకు తరలివచ్చారు. అమ్మవారిని క్యూలో 15 వేల మంది దర్శించుకున్నారని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాద విక్రయాల ద్వారా రూ.1,80,455, పూజా టికెట్లకు రూ.2,40,090, తలనీలాలకు రూ.10,240, వాహన పూజలకు రూ.8,850, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.52,800, విరాళాలు రూ.48,759 కలిపి మొత్తం రూ.5,41,194 ఆదాయం లభించిందని వివరించారు. -
తోట త్రిమూర్తులుకు వైఎస్ జగన్ పరామర్శ
కపిలేశ్వరపురం: సోదర వియోగంతో బాధ పడుతున్న వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఫోనులో పరామర్శించారు. తోట సోదరుడు సత్యనారాయణ ఇటీవల మృతి చెందారు. ఈ నేపథ్యంలో తోటను జగన్ ఫోనులో ఓదార్చారు. త్రిమూర్తులును ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి కూడా ఫోను ద్వారా పరామర్శించారు. అలాగే, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పలవురు నాయకులు రామచంద్రపురం రూరల్ మండలం వెంకటాయపాలెంలోని త్రిమూర్తులు నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, బీజేపీ నాయకులు యాళ్ళ దొరబాబు, రాచమంద్రపురం, మండపేట నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. -
లెక్క.. పక్కాగా..
రాయవరం: వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన జనాభా లెక్కల సేకరణపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు దృష్టి సారించింది. ఇందులో భాగంగా వచ్చే ఏడాది ఈ ప్రక్రియ చేపట్టేందుకు వీలుగా వివిధ స్థాయిల్లో అధికారులను ఇప్పటికే నియమించారు. జనాభా లెక్కల సేకరణ (సెన్సస్) ప్రక్రియ కొన్ని నెలల పాటు జరగనుంది. ఎందుకంటే.. దేశవ్యాప్తంగా ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడం, కొత్త పథకాల రూపకల్పన వంటి వాటి కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన జనగణన నిర్వహిస్తూంటారు. ఈ ప్రక్రియకు 1872లో నాటి బ్రిటిష్ పాలకుల హయాంలో శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ప్రతి పదేళ్లకోసారి దీనిని నిర్వహించేవారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత 1951 నుంచి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనర్ ఆధ్వర్యాన భారత జనాభా గణాంకాల చట్టం–1948 ప్రకారం జనాభా లెక్కల సేకరణ జరిగేది. చివరిసారి 2011లో జనగణన చేపట్టారు. 2021లో ఈ ప్రక్రియ జరగాల్సి ఉండగా.. ఎన్పీఆర్, సీఏఏ వంటి చట్టాలపై ఆందోళనలు, కరోనా మహమ్మారి వ్యాప్తి వంటి పరిస్థితుల రీత్యా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు పరిస్థితులన్నీ సద్దుమణగడంతో జనాభా లెక్కలను పూర్తి చేసేందుకు కేంద్రం ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో జనగణ ప్రక్రియ చేపట్టేందుకు వివిధ స్థాయిల్లో కార్యనిర్వాహక అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నియమించారు. అధికారుల నియామకం ఇలా.. జిల్లా స్థాయిలో ప్రిన్సిపల్, అడిషనల్ సెన్సస్ అధికారులుగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు వ్యవహరిస్తారు. సబ్ డివిజనల్ సెన్సస్ అధికారిగా సబ్ కలెక్టర్/ఆర్డీవో, చార్జ్ సెన్సస్ అధికారిగా మండల తహసీల్దార్లు, అదనపు చార్జ్ సెన్సస్ అధికారులుగా ఎంపీడీవోలు, అసిస్టెంట్ చార్జ్ సెన్సస్ అధికారులు/సెన్సస్ క్లర్క్ ఇన్చార్జి అధికారులుగా డిప్యూటీ తహసీల్దార్/అంతకంటే తక్కువ స్థాయి అధికారి ఉంటారు. పట్టణ స్థాయిలో.. మున్సిపాలిటీ లేదా నగర పంచాయతీ అధికారులు కూడా చార్జి సెన్సస్ అధికారులుగా వ్యవహరిస్తారు. అదనపు చార్జ్ సెన్సస్ అధికారులుగా టౌన్ ప్లానింగ్ అధికారి/టీపీఎస్/డీఈఈ/ఏఈఈ/మున్సిపల్ రెవెన్యూ అధికారి ఉంటారు. మున్సిపల్ కార్పొరేషన్ స్థాయిలో ప్రిన్సిపల్ సెన్సస్ అధికారిగా కమిషనర్ బాధ్యతలు నిర్వహిస్తారు. సిటీ సెన్సస్ అధికారిగా అదనపు కమిషనర్, చార్జి సెన్సస్ అధికారిగా జోనల్/డిప్యూటీ కమిషనర్/అసిస్టెంట్ సిటీ ప్లానర్ బాధ్యతలు చేపడతారు. టీపీవో/టీపీఎస్/డీఈఈ/ఏఈఈ/ఆర్వో/ఆర్ఐ/ఏపీడీలు అదనపు చార్జి సెన్సస్ అధికారిగా వ్యవహరిస్తారు. టీపీవో/టీపీఎస్/డీఈఈ/ఏఈఈ/ఆర్వో/ఆర్ఐ సహాయక చార్జి సెన్సస్ అధికారిగా నియమిస్తారు. ఫ జనగణనకు చురుకుగా ఏర్పాట్లు ఫ కార్యనిర్వాహక అధికారుల నియామకం ఫ ప్రిన్సిపల్, అడిషనల్ సెన్సస్ అధికారులుగా కలెక్టర్, జేసీ ఫ జిల్లా అధికారిగా డీఆర్ ఫ సబ్ డివిజన్ స్థాయిలో ఆర్డీఓ డిజిటల్ విధానంలో.. ఈసారి జనాభా లెక్కల సేకరణను పూర్తి డిజిటల్ విధానంలో, రెండు దశల్లో నిర్వహిస్తారు. తొలి దశలో వచ్చే ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య గృహాల జాబితా సేకరిస్తారు. రెండో దశలో జనాభా గణన ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తారు. మొబైల్ యాప్ ద్వారా స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఇది దేశంలోనే మొట్టమొదటి డిజిటల్ సెన్సస్ కానుంది. ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు త్వరలో శిక్షణ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుత జిల్లా జనాభా 20.98 లక్షలు జిల్లా జనాభా 2011 లెక్కల ప్రకారం 20,98,276. ఇటీవల జిల్లాలో కొత్తగా మండపేట నియోజకవర్గం కలిసిన అనంతరం జిల్లాలో కుటుంబాల సంఖ్య 5,88,452గా ఉంది. మొత్తం జనాభాలో ఎస్సీ, ఎస్టీలు 20 శాతం, ఓసీ, బీసీలు 80 శాతం ఉన్నారు. తాజా జనగణన అనంతరం జిల్లాలో కుటుంబాల సంఖ్యతో పాటు, జనాభా కూడా పెరిగే అవకాశముంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా మండలం కుటుంబాలు జనాభా తాళ్లపూడి 15,109 52,785 కొవ్వూరు 30,185 1,08,445 చాగల్లు 18,585 64,774 గోపాలపురం 17,624 62,597 నల్లజర్ల 22,942 80,388 దేవరపల్లి 21,841 77,971 నిడదవోలు 31,631 1,14,245 ఉండ్రాజవరం 20,597 76,489 పెరవలి 19,192 70,194 రాజమహేంద్రవరం రూరల్ 44,692 1,66,973 కడియం 25,160 90,499 రాజమహేంద్రవరం అర్బన్ 91,374 3,41,831 గోకవరం 19,224 69,596 రంగంపేట 16,129 57,106 బిక్కవోలు 20,902 70,277 అనపర్తి 21,002 70,859 సీతానగరం 21,046 71,665 కోరుకొండ 22,672 79,553 రాజానగరం 29,004 1,06,085 మండపేట 38,650 1,32,679 కపిలేశ్వరపురం 19,958 66,809 రాయవరం 20,233 66,456 -
పూటుగా తాగి.. తన్నులాట
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో సెక్యూరిటీ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో చెప్పడానికీ సంఘటన నిదర్శనంగా నిలుస్తోంది. రత్నగిరి దిగువన తొలి పావంచా వద్ద స్వామివారి ప్రసాదం కొనుగోలుకు వచ్చిన భక్తులు ఆదివారం క్యూలో ఘర్షణ పడి, దాదాపు పావుగంట పాటు కొట్టుకున్నారు. దీంతో, ప్రసాదం కొనుగోలుకు అక్కడకు వచ్చిన ఇతర భక్తులు భయభ్రాంతులకు గురై, ఏం జరుగుతుందోననే భయంతో పరుగులు తీశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు కానీ, దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది కానీ అక్కడ లేకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఒక్క రోజే కాదు.. ప్రతి ఆదివారం లోవ దేవస్థానానికి వెళ్తున్న భక్తుల్లో కొంత మంది మద్యం తాగి, తిరుగు ప్రయాణంలో అన్నవరంలో ప్రసాదాల కొనుగోలుకు ఆగుతున్నారు. ఈ క్రమంలో వారిలో వారు తరచుగా ఘర్షణకు దిగుతున్నా ఆపేవారే ఉండటం లేదని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. అందుబాటులో ఉండని సిబ్బంది మరోవైపు తొలి పావంచా వద్ద ప్రసాదం కౌంటర్లలోని దేవస్థానం సిబ్బంది మధ్య సమన్వయం కొరవడుతోంది. ఈ నెల 2న తొలి పావంచా వద్ద ప్రసాదాల కొనుగోలుకు వెళ్లిన భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. ప్రసాదం ప్యాకెట్లు ఇచ్చే ఉద్యోగి బయటకు వెళ్లాడని, పావుగంట ఆగాలని అక్కడ ప్రసాదం టికెట్లు విక్రయించే మరో ఉద్యోగి చెప్పాడు. తాము చాలా దూరం వెళ్లాలని, ఇలా ఆలస్యం చేస్తేగని ఆ భక్తులు పక్కనే గెస్ట్ హౌస్లో ఉన్న దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్కు ఫిర్యాదు చేశారు. ఆయన వెంటనే ఆ కౌంటర్ వద్దకు వచ్చి, అక్కడి ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేసి, దగ్గరుండి మరీ ప్రసాదాలు అమ్మించారు. ఆ సమయంలో అక్కడ సెక్యూరిటీ గార్డు కూడా లేడు. పోలీసులను నియమించే అవకాశం లేదు తలుపులమ్మ లోవకు వెళ్లి వచ్చిన కొంత మంది భక్తులు మద్యం తాగి వచ్చి, అన్నవరం వచ్చి ఆ మత్తులో ప్రసాదాల కౌంటర్ల వద్ద ఘర్షణ పడుతున్నారు. వారిని నియంత్రించేలా అక్కడ నియమించడానికి తగినంత మంది పోలీసులు మాకు లేరు. దేవస్థానమే అక్కడ సెక్యూరిటీ గార్డులను నియమించాలని చాలాసార్లు చెప్పాం. అయినప్పటికీ వారు నియమించడం లేదు. ఇప్పటికై నా దేవస్థానం అదివారం నాడు అక్కడ ఇద్దరు సెక్యూరిటీ గార్డులను నియమించాలి. ప్రసాదాల కౌంటర్ వద్ద ఘర్షణ పడిన వారు మాకు ఎటువంటి ఫిర్యాదూ చేయలేదు. – శ్రీహరిబాబు, ఎస్సై, అన్నవరం ఫ సత్యదేవుని తొలి పావంచా ప్రసాదం స్టాల్ వద్ద భక్తుల ఘర్షణ ఫ పావుగంట పాటు కొట్టుకున్న వైనం ఫ భయభ్రాంతులకు గురైన ఇతరులు అంత సెక్యూరిటీ ఉన్నా ప్రయోజనమేదీ! అన్నవరం దేవస్థానంలో వంద మందికి పైగా సెక్యూరిటీ గార్డులు, 38 మంది పోలీసు శాఖకు చెందిన హోం గార్డులు పని చేస్తున్నారు. తొలి పావంచా వద్ద ఒక్క భద్రతా సిబ్బంది మాత్రమే ఉంటున్నారు. కనీసం ఇద్దరు హోంగార్డులు లేదా ఇద్దరు సెక్యూరిటీ గార్డులున్నా ఇలాంటి ఘర్షణలను నివారించే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన సమయంలో ఆ ఒక్కరు కూడా ఉండటం లేదనే విమర్శ ఉంది. -
ఫొటోషూట్కు ఎంతో అనుకూలం
చింతూరు, మారేడుమిల్లిలోని మన్యం ప్రాంతాలు ఫొటోషూట్ల కు ఎంతో అనుకూలంగా ఉన్నా యి. అటవీ ప్రాంతంలో మంచి లొకేషన్లు ఉండడంతో సినిమా, సీరియల్ దర్శకులు ఇక్కడ షూటింగ్లు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మా ఆర్గనైజేషన్ ఆధ్వ ర్యంలో ఇప్పటివరకూ ఇక్కడ తొమ్మిది నేషనల్ లెవల్ ఫొటో వర్క్షాప్లు నిర్వహించాం.–నాగరాజు దేవర, ఖమ్మం ఫొటోఆర్ట్స్ ఆర్గనైజేషన్ నిర్వాహకుడు రిసార్టులకు గిరాకీ పెరిగింది సినిమా, సీరియల్స్ షూటింగులతో పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. పొల్లూరు సమీపంలోని వాటర్ఫాల్స్తో పాటు పుష్ప సినిమా చిత్రీకరించిన ఫోర్బై రిజర్వాయర్, దాని సమీపంలో పవర్ కెనాల్ అక్విడెక్ట్ (వంతెన) ఎంతగానో పాపులర్ అయ్యాయి. ఈ ప్రాంతాలను తిలకించేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తున్నారు. –పంచాడ నాని, రిసార్టు నిర్వాహకుడు, పొల్లూరు -
ఏపీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఏపీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) టి.సీతారామమూర్తి ఆదేశించారు. ఈ మేరకు శనివారం కలెక్టరేట్లో సమన్వ య శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 9 నుంచి 13 వరకూ పరీక్షలు జరుగుతాయని, ఆయా కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. పోలీసు బందోబస్తు, ప్రశ్నపత్రాలు, రవాణా భద్రత, 144 సెక్షన్ అమలు, నిరంతర విద్యు త్ సరఫరా, వైద్య సదుపాయాలు, పరీక్ష కేంద్రాల కు వెళ్లే మార్గాల్లో బస్సుల ఏర్పాటు, కంట్రోల్ రూమ్ నిర్వహణ తదితర అంశాలపై శాఖల వారీగా చర్చించారు. అలాగే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్తో పాటు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని, పరీక్ష ప్రారంభానికి కనీసం గంట ముందే కేంద్రానికి చేరుకోవాలన్నారు. అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): దేశ భవిష్యత్తు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ ఏడాది బడ్జెట్ను రూపొందించినట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు అన్నారు. రాజమహేంద్రవరంలోని ఒక హోటల్లో 2026–27 కేంద్ర బడ్జెట్పై శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన పాల్గొన్నారు. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా 2047 నాటికి భారత్ను సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రైవేట్ పాఠశాలల్లో 2026, 27 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ఉచిత అడ్మిషన్లకు దరఖాస్తులు కోరుతున్నట్లు సమగ్ర శిక్షా జిల్లా అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ఎస్.సుభాషిణి తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. ఆర్థికంగా బలహీన వర్గాలు, వెనుక బడిన వర్గాల పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలన్నారు. మార్చి 10వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుందన్నారు. వివరాలకు మండల విద్యాశాఖ అధికారి, జిల్లా సమగ్ర శిక్షా కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. మూడు డ్రెడ్జింగ్ బోట్లు, 642 టన్నుల ఇసుక సీజ్ రాజమహేంద్రవరం రూరల్: కాతేరు గ్రామ పరిధిలోని డిసిల్టేషన్ ఇసుక రీచ్లో జిల్లా గనులు, భూగర్భశాఖ అధికారి ఆధ్వర్యంలో గనుల శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక రీచ్ ఒడ్డున మూడు డ్రెడ్జింగ్ బోట్లు, వాటి సమీపంలో రెండు ఇసుక గుట్టలు ఉన్నట్లు గుర్తించారు. డ్రెడ్జింగ్ బోట్లలో ఇసుక ఆనవాళ్లు లభించడంతో, అవి గోదావరిలో నియమాలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలలో పాల్గొన్నట్లు నిర్థారించారు. ఈ నేపథ్యంలో ఆ మూడు డ్రెడ్జింగ్ బోట్లను సీజ్ చేసి, వాటిని సంబంధిత ఇరిగేషన్శాఖ అధికారులకు అప్పగించారు. సమీపంలోని 642 టన్నుల ఇసుక గుట్టలను సీజ్ చేశారు. తదుపరి చర్యలు తీసుకునే వరకు స్థానిక రెవెన్యూ అధికారుల సంరక్షణకు అప్పగించారు. కాతేరు డిసిల్టేషన్ ఇసుక రీచ్లో నియమాలకు విరుద్ధంగా డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులను అధికారులు హెచ్చరించారు. తనిఖీల్లో జిల్లా గనులు, భూగర్భ అధికారి డి.ఫణిభూషణ్రెడ్డి, అసిస్టెంట్ జియాలజిస్ట్ జి.విఘ్నేశ్వరుడు తదితరులు పాల్గొన్నారు. ఘనంగా ‘కోటి తులసి పత్రి పూజ’ అన్నవరం: లోక కల్యాణార్థం రత్నగిరి సత్యదేవుని సన్నిధిలో నిర్వహిస్తున్న ‘కోటి తులసి పూజ’ శనివారం రెండో రోజు కు చేరుకుంది. శనివారం తెల్లవారు జామున సుప్రభాత సేవతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం పండితులు స్వా మి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉదయం తొమ్మిది గంటలకు 60 మంది రుత్విక్కులు ఆరు లక్షల తులసి దళాలతో స్వామిని అర్చించారు. 11–30 గంటలకు వేదాశీస్సులు అందచేసి స్వామి, అమ్మవారికి నివేదన సమర్పించారు. -
పుష్కరాలకు ఘాట్ నమూనా సిద్ధం చేయాలి
సీటీఆర్ఐ: రానున్న 2027 మహా గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని, జిల్లాలోని అన్ని ఘాట్లను ఒకే ఆకృతిలో ఉండేలా ఘాట్ నమూనాను సిద్ధం చేయాలని కలెక్టర్ కీర్తి అధికారులను ఆదేశించారు. ఆమె శనివారం ధవళేశ్వరం నుంచి రాజమహేంద్రవరం వరకూ ఉన్న సరస్వతీ ఘాట్, మార్కండేయ ఘాట్, పుష్కర్ ఘాట్ తదితర వాటిని ఎస్పీ డి.నరసింహ కిశోర్, కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనాలతో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పుష్కర పుణ్య స్నానాలకు అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించడమే ప్రథమ లక్ష్యమన్నారు. శివరాత్రి సందర్భంగా చేపడుతున్న ఏర్పాట్లను పుష్కరాలకు తొలి ట్రైల్ రన్గా భావించి, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టాలన్నారు. ముందుగా ఒక మోడల్ ఘాట్ను నిర్మించి, అదే డిజైన్ను మిగిలిన ఘాట్లకు అనుసరించాలని సూచించారు. నగరపాలకసంస్థ, ఇరిగేషన్ శాఖల సమన్వయంతో మోడల్ ఘాట్ నమూనాను తక్షణమే సిద్ధం చేయాలన్నారు. ఎస్పీ డి.నరసింహ కిశోర్ మాట్లాడుతూ ప్రముఖుల సందర్శన సమయంలోనూ సాధారణ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక స్నాన ఘట్టాలు ఏర్పాట్లు చేయాలన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ ఘాట్ల అభివృద్ధిపై ప్రాథమిక కార్యాచరణను వివరించారు. -
వ్యాపారులు చెప్పిందే ధర
మార్కెట్లో ధర ఉన్నా దిగుబడి తగ్గటంతో మాకు పెద్దగా ఉపయోగం లేదు. వ్యాపారులు చెప్పిన ధరకే కాయలను విక్రయిస్తున్నాం. ఎక్కడికై నా తీసుకువెళ్లి అమ్ముదామంటే అక్కడ కూడా తక్కువకే అడుగుతున్నారు. ఎందుకొచ్చిన గొడవ అనుకుని వచ్చింది తీసుకుంటున్నాం. – నందమూరి నారాయణరావు, రైతు, తీపర్రు నిల్వ చేయడం లేదు కొబ్బరికి డిమాండ్ ఏర్పడింది. పండగ సీజన్ ప్రారంభం కావడం, శుభ ముహూర్తాలు రావడం, దిగుబడి తగ్గిపోవడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో సరుకు లేకపోవటంతో ఈ ధరలు ఉన్నాయి. ఇవి ఎంత కాలం ఉంటాయో తెలియదు. అందుకే కాయలను నిల్వలు వేయటం లేదు. వచ్చిన కాయ వచ్చినట్లు మార్కెట్కు తరలిస్తున్నాం. – అడబాల బ్రహ్మయ్య, కొబ్బరి వ్యాపారి, అన్నవరప్పాడు -
‘పుష్ప’తో ఒక్కసారిగా క్రేజ్
మారేడుమిల్లి, చింతూరు మండలాల్లో చిత్రీకరించిన పాన్ ఇండియా సినిమా పుష్ప ద రైజింగ్ విడుదలై సూపర్ హిట్ కావడంతో మన్యం ప్రాంతంపై ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. మారేడుమిల్లి మండలం గుడిస, చింతూరు మండలం ఫోర్ బై ప్రాంతంలో ఈ సినిమా చిత్రీకరణ అధిక శాతం జరిగింది. ఎర్ర చందనం స్మగ్లింగ్ సమయంలో గుడిస ప్రాంతంలోని ఒంపులు తిరిగే ఎర్రటి ఘాట్ రోడ్పై వాహనాలు వెళ్లే దృశ్యాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. చింతూరు మండలం ఫోర్ బై రిజర్వాయర్ వద్ద ఈ సినిమాలోని సామీ, సామీ సాంగ్తో పాటు హీరో, హీ రోయిన్ నడుమ చిత్రీకరించిన కొన్ని కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. దీంతో పాటు పుష్ప–2 సినిమాలోని మరికొన్ని సన్నివేశాలను మారేడుమిల్లి, తులసిపాక సమీపంలోని సోకిలేరువాగు ప్రాంతాల్లో తీశారు. ఈ ప్రాంతాల్లో నిత్యం షూటింగ్లు జరుగుతుండడంతో స్థానిక యువతకు సైతం క్యారెక్టర్ అర్టిస్టులుగా నటించే అవకాశం లభిస్తోంది. -
కొబ్బరి రైతు వెలవిల
● మార్కెట్లో పెరిగిన ధర ● తోటల్లో తగ్గిన దిగుబడి, మరోవైపు దళారుల దందా ● వెయ్యి కాయలకు రూ.21 వేలన్నా రైతుకు అందేది రూ.15 వేలే పెరవలి: సాధారణంగా పంట ఉత్పత్తుల ధర పెరిగితే దాన్ని పండించే రైతులకు లాభాలు వస్తాయి. తద్వారా ఆదాయం పెరిగి కొంత వెనుక వేసుకునే అవకాశం ఉంటుంది. కానీ కొబ్బరి రైతుల పరిస్థితి మరోలా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కొబ్బరి కాయలకు గిట్టుబాటు ధర బాగుంది. కానీ దళారులు, వ్యాపారులు కుమ్మక్కవ్వడం, దిగుబడి తగ్గిపోవడంతో వారికి పెరిగిన మేరకు ఆదాయం రావడం లేదు. కొబ్బరి కాయ లకు మార్కెట్లో మంచి గిట్టుబాటు ధర ఉన్నా.. దళారులు, వ్యాపారస్తులు కలిసి ధరలను తగ్గించి రైతులకు అందకుండా చేస్తున్నారు. వెయ్యి కాయలకు.. ప్రస్తుతం మార్కెట్లో వెయ్యి కొబ్బరి కాయలు నాణ్యతను బట్టి రూ.19 వేల నుంచి రూ.21 వేలు పలుకుతున్నాయి. అయితే దింపు ఖర్చు, మోత, ఒలుపు, రవాణా అంటూ కొందరు రైతులను దోచుకుంటున్నారు. రైతులు కూడా వచ్చిందే మంచి ధర అని సరిపెట్టుకుంటున్నారు. గత మూడు నెలలుగా అంతంత మాత్రంగా ఉన్న కొబ్బరి ధర నేడు పండగలు సీజన్ ప్రారంభం, శుభ ముహూర్తాలు రావడం, దిగుబడి తగ్గడం తదితర కారణాలతో అమాంతం పెరిగింది. అయితే వ్యాపారులు నేరుగా తోట వద్దకే వచ్చి కొబ్బరి దింపు, మోత, రవాణా, ఒలుపు వంటివి అన్ని తామే చూసుకునేలా ఒప్పందం చేసుకుంటున్నారు. దానికి అంగీకరించిన రైతులకు రూ.10 వేల నుంచి రూ.12 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. అదే రైతు దింపు తీసి ఒక్క చోట గుట్టగా పెట్టితే కాయల నాణ్యతను బట్టి రూ.15 వేల నుంచి రూ.17 వేల వరకూ చెల్లిస్తున్నారు. సాగు విస్తీర్ణం పాత ఉభయ గోదావరి జిల్లాలో సుమారు 70 వేల హెక్టార్లలో కొబ్బరి తోటలు ఉండగా, ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో 8,979 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. ఇదే కాకుండా చేల గట్లు, పుంత గట్లు, చెరువు గట్లు, లంక భూముల్లో కూడా కొబ్బరి సాగవుతోంది. పెరవలి మండలం కానూరు, కానూరు అగ్రహారం, నడుపల్లి, తీపర్రు, కాకరపర్రు, ముక్కామ ల, ఖండవల్లిల్లో 400 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దళారీలు, వ్యాపారస్తులు కుమ్మక్కవ్వటంతో పెరిగిన ధరను రైతులకు ఇవ్వడం లేదు. ఎక్కడికు వెళ్లినా అదే రేటు చెప్పడంతో రైతులు కూడా చేసేది లేక అయిన కాడికి అమ్ముకుంటున్నారు. . తగ్గిన దిగుబడులు గతంలో ఒక ఎకరం కొబ్బరి తోట నుంచి సుమారు 1200 నుంచి 1400 కాయల దిగుబడి వచ్చేది. కానీ నేడు దానిలో దాదాపు సగం తగ్గిపోయి 600 నుంచి 700 కాయలు మాత్రమే వస్తోంది. గతంలో వేసవిలో కాయలు తయారైనా, అవ్వకపోయినా నీళ్లు ఆడేవని దీనితో దిగుబడి వచ్చేదని రైతులు చెబుతున్నారు. నేడు శీతల గాలులు, చలి ఎక్కువగా ఉండటంతో కాయ తయారు కావడం ఆలస్యమవుతోందన్నారు. ధర పెరగడానికి కారణాలివే.. కొబ్బరికి మార్కెట్లో ధర పెరగటానికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మన రాష్ట్రంతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లో దిగుబడులు అనూహ్యంగా తగ్గిపోవటంతో ఇక్కడి కొబ్బరికి డిమాండ్ ఏర్పడింది. అదే సమయంలో పండగలు, శుభ ముహూర్తాలు ఉండటం, దిగుబడి తగ్గటంతో ధరలు పెరిగాయి. ప్రస్తుతం మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఇక్కడి నుంచే ఎగుమతి అవుతున్నాయి. అందుకే మన కొబ్బరికి డిమాండ్ వచ్చిందని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఎగుమతులు మూడు నెలల క్రితం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి నిత్యం 400 నుంచి 500 లారీల్లో ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు జరిగేవి. నాడు 150 లారీలకు మించి వెళ్లడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. కొబ్బరి ధరను పెంచేది, తగ్గించేది ఉమ్మడి జిల్లాలో ప్రధానమైన అంబాజీపేట, పాలకొల్లు మార్కెట్లే. చిరు వ్యాపారస్తులందరూ ఈ మార్కెట్లలో నిర్ణయించిన ధరలు ప్రకారమే రైతులకు చెల్లిస్తారు. తీపర్రులో కొబ్బరి కాయలను లెక్కిస్తున్న కూలీలు కలసి రావడం లేదు కొబ్బరికి మార్కెట్లో ధర ఉన్నా మాకు మాత్రం వెయ్యి కాయలకు నాణ్యతను బట్టి రూ.10 వేల నుంచి రూ.12 వేలు చెల్లిస్తున్నారు. ఇదేమిటని అడిగితే ఇష్టం ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు అంటున్నారు. కొబ్బరికి డిమాండ్ ఉన్నా మాకు మాత్రం కలసి రావటం లేదు. – వాకలపూడి గాంధీ, కొబ్బరి రైతు, కానూరు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 29,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,500 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
15 కిలోల గంజాయి పట్టివేత
ఎటపాక: ఆటోలో గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని ఎటపాక పోలీసులు శనివారం పట్టుకున్నారు. సీఐ కన్నపరాజు కథనం ప్రకారం.. ముందస్తు సమాచారం మేరకు ఎస్సై అప్పలరాజు నెల్లిపాక జాతీయ రహదారిపై ఉన్న అటవీ శాఖ చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో భద్రాచలం వైపు వెళ్తున్న ఓ ఆటోను తనిఖీ చేయగా, అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. సంచిలో 15 కిలోల గంజాయి ఉండటంతో ఆటోను, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. అడపా రాకేష్, కణితి సాయిరామ్లు తెలంగాణ రాష్ట్రం సూర్యపేట జిల్లా కోదాడకు ఒడిశా రాష్ట్రం నుంచి ఆటోలో గంజాయి తరలిస్తున్నారు. ఈ ఘటనలో మరో ఇద్దరు పారిపోయారని ఎస్సై తెలిపారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు. -
ఊరెళ్లారని తెలుసుకుని ఉన్నదంతా ఊడ్చేశారు!
దుర్గాడలో భారీ చోరీ పిఠాపురం: ఇంట్లో వారు ఊరెళ్లారని తెలుసుకుని గుర్తుతెలియని వ్యక్తులు, ఆ ఇంటిని కొల్లగొట్టిన సంఘటన గొల్లప్రోలు మండలం దుర్గాడలో శనివారం చోటుచేసుకుంది. భారీగా బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు చోరీకి గురైంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. దుర్గాడకు చెందిన కొండేపూడి సూర్యనారాయణ తన భార్యతో కలసి పూణేలో ఉంటున్న తన కుమారుడి ఇంటికి గత 24న వెళ్లారు. వెళ్లే ముందు తన ఇంటికి తాళాలు వేసి అదే గ్రామంలో నివాసముంటున్న తన అల్లుడు వెలుగుల భాస్కరరావుకు తన ఇంటిని అప్పగించారు. అప్పటి నుంచి ఇంటిని చూస్తున్న భాస్కరరావు రోజూ బయట గేటు తాళాలు తీసి ఇంటి బయట తుడిపించడం, లైట్లు వేయించడం చేస్తున్నారు. శనివారం వచ్చి చూసేసరికి ఇంటి ప్రధాన తలుపులు తీసి ఉండడంతో అనుమానం వచ్చి లోపలకు వెళ్లి చూడగా, దొంగతనం జరిగిందని గ్రహించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. సుమారు 50 గ్రాముల బంగారం, రెండున్నర కిలోల వెండి ఆభరణాలతో పాటు కొంత నగదు పోయినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసును పిఠాపురం సీఐ శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు. -
రేషన్ బియ్యం స్వాధీనం
రాజానగరం: స్థానిక ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఎదురుగా జాతీయ రహదారిపై లారీలో అక్రమంగా రవాణా అవుతున్న 18,140 కిలోల రేషన్ బియ్యాన్ని శనివారం పట్టుకున్నారు. రాజానగరం ఎంఎస్ఓ బాపిరాజు కథనం ప్రకారం.. వివిధ రంగుల్లో ఉన్న 311 ప్లాస్టిక్ సంచులలో ప్యాక్ చేసిన ఈ బియ్యాన్ని గోపాలపురం నుంచి రాజానగరానికి తరలిస్తున్నారు. దీని విలువ రూ. 8,43,510 ఉంటుందని అంచనా. ఈ మేరకు గొల్లప్రోలుకు చెందిన లారీ డ్రైవర్, ఓనర్లు అల్లు శ్రీనివాస్, చోడిశెట్టి మహేష్లపై 6ఏ కేసు నమోదు చేశారు. బియ్యంతో కూడిన లారీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి అనపర్తి: విద్యుదాఘాతానికి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కుతుకులూరు గ్రామంలో జరిగిందని ఎస్సై ఎల్.శ్రీను నాయక్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండపేట మండలం వేములపల్లికి చెందిన కాపా ధర్మయ్య (53) భార్య బోదమ్మతో కలసి నాలుగేళ్లుగా కుతుకులూరులో ఇటుక బట్టీలో పని చేస్తున్నాడు. ఆ బట్టీలోనే వారంతా నివాసం ఉంటున్నారు. శనివారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ధర్మయ్య మూత్ర విసర్జనకు బయటకు వెళ్లాడు. కొంతసేపటి తర్వాత అతని అరుపులు వినిపించడంతో బోదమ్మ వెంటనే అక్కడికి వెళ్లగా, లైటింగ్ అవసరాల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాన్ని చేతితో పట్టుకోవడం వల్ల అతనికి విద్యుత్ షాక్ పడిపోవడం గమనించింది. తక్షణమే అతనిని అనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్టు ధ్రువీకరించారని ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక ఆలమూరు: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కబడ్డీ పోటీలకు కె.ధర్మాజీ ఎంపికయ్యారు. ఈ నెల 7, 8 తేదీల్లో విజయవాడలో క్రీడాకారుల ఎంపిక జరిగింది. ఇందులో భాగంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ధర్మాజీని సెలక్టర్లు ఈ కబడ్డీ పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల 9 నుంచి 14 వరకూ ఛండీగఢ్లో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో ధర్మాజీ పాల్గొనున్నాడు. నాలుగేళ్ల నుంచి వరుసగా కబడ్డీ పోటీలకు ఎంపిక కావడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. -
● ఇంకెన్నాల్.. ఈ పాట్లు
మాచవరం నుంచి చిరతపూడి వెళ్లే ప్రధాన పంట కాలువ చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలు, మందు సీసాలు, పశు కళేబరాలతో నిండిపోయింది. అయినా ప్రభుత్వం, పాలకులు చోద్యం చూస్తున్నారు. వాటిని తొలగించాలని ఇరిగేషన్ అధికారులకు వివరించినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. ఈ వ్యర్థాలతో దుర్వాసన వస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. –అంబాజీపేట ● పొగబెట్టారండోయ్.. రావులపాలెం గౌతమి గోదావరి పాత బ్రిడ్జిపై శనివారం మధ్యాహ్నం నల్లని పొగ కమ్మేసింది. ఇది ఆకాశంలో మేఘంలా రావులపాలెం సెంటర్ వరకూ వ్యాపించింది. హుటాహుటిన పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. బ్రిడ్జి కింద గోదావరిలో పాత ఇసుక ర్యాంపు బాట ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు వ్యర్థాలతో పాటు, తారు లాంటి వ్యర్థాలకు నిప్పంటించారు. దీంతో బ్రిడ్జి అంతా పొగతో నిండిపోయింది. కొత్తపేట అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి వేశారు. –రావులపాలెం ● నిలపడేలా ఎందుకో! నిత్యం అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అజాగ్రత్తగా కారణంగానే ఎందరో ప్రాణాలు పోతున్నాయి. అయినా ఇలా ఆటో వెనుక ఇలా నిలబడి ప్రయాణం చేయడంపై అంతా ముక్కున వేలేసుకున్నారు. చింతూరు – కూనవరం రహదారిలో శనివారం ఓ ఆటోలో నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను ఎక్కించుకున్నారు. వెనుక డోరుపై మహిళలను సైతం నిలబెట్టి తీసుకెళ్లారు. –చింతూరు -
విశాఖపట్నం జూకు పెద్ద పులి
రాజమహేంద్రవరం రూరల్: ఆపరేషన్ టైగర్ విజయవంతమైంది. తూర్పుగోదావరి జిల్లాలో జనావాసాల్లో సంచరిస్తూ, కనిపించిన ఆవులు, దూడలను చంపేస్తూ దాదాపు వారం రోజుల పాటు జిల్లా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన పెద్ద పులి ఎట్టకేలకు శుక్రవారం చిక్కింది. దీంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలోని ఓ పాకలో దాగిన పెద్ద పులిని పూణే నుంచి వచ్చిన రెస్క్యూ బృందం, ఆటవీ శాఖ అధికారుల బృందం పట్టుకుంది. ఆ పులికి శాసీ్త్రయంగా మత్తు మందు ఇవ్వడంతో కొద్దిదూరం వెళ్లి అపస్మారక స్థితికి చేరుకుంది. అనంతరం దాన్ని వెంబడించి అత్యంత జాగ్రత్తగా, బంధించారు. అనంతరం పులిని ప్రత్యేక బోనులో విశాఖపట్నంలోని రెస్క్యూ కేంద్రానికి తరలించారు. పులిని కొద్ది రోజులు పరిశీలించి, దాని ప్రవర్తనను బట్టి అడవిలో విడిచిపెట్టాలా లేక, జూలో ఉంచాలా అన్నది నిర్ణయిస్తామని అటవీరేంజ్ ఆఫీసర్ ఎన్.దావీదురాజు తెలిపారు. పులిని బంధించిన పూణే రెస్క్యూ బృందాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రత్యేకంగా అభినందించారు. అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖల సమన్వయంతో నిర్వహించిన ఈ ఆపరేషన్లో వైజాగ్ జూకు చెందిన వెటర్నరీ డాక్టర్లు ఫణీంద్ర, భాను, రాజమహేంద్రవరం సీసీఎఫ్, అటవీశాఖాధికారి ఎన్.దావీదురాజు బృందం కీలక పాత్ర పోషించారని జిల్లా అటవీ శాఖ అధికారి బి.ప్రభాకరరావు తెలిపారు. -
ఆపదలో అపర సంజీవని
● ఆరోగ్యశ్రీ రద్దుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర ● నెట్వర్క్ ఆస్పత్రులకు బిల్లుల చెల్లింపుల్లో నిర్లక్ష్యం ● జిల్లా వ్యాప్తంగా రూ.250 కోట్లకు పైగా బకాయిలు ● తాజాగా ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’కి సమాలోచనలు ● ఏప్రిల్ నుంచి అమలు చేసేలా సన్నాహాలు ● ప్రశ్నార్థకం కానున్న ఆరోగ్య మిత్రల భవితవ్యం సాక్షి, రాజమహేంద్రవరం: పేదలకు ఆధునిక, కార్పొరేట్ వైద్యం అందజేస్తూ, శస్త్ర చికిత్సలు ఉచితంగా చేసి వారి ఆరోగ్యానికి భరోసా ఇస్తున్న ఆరోగ్యశ్రీ అద్భుత పథకానికి మంగళం పాడేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నట్టు అనిపిస్తోంది. ఈ పథకానికి ఎన్టీఆర్ వైద్యసేవగా పేరు మార్చిన ప్రభుత్వం దానిని కూడా నిలిపివేసేందుకు యోచిస్తోంది. ఆ స్థానంలో యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్దేశ పూర్వకంగానే నెట్వర్క్ ఆస్పత్రులకు అందాల్సిన బకాయిలు చెల్లించకుండా కాలయాపన చేస్తోందా? అంటే అంతేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే జరిగితే నెట్వర్క్ ఆస్పత్రులకు చెల్లించాల్సిన బకాయిలు, వైద్య మిత్రల ఉద్యోగాలు కొనసాగుతాయా..? లేదా..? అన్న ఆందోళన నెలకొంది. ఇదీ సంగతి ఎన్టీఆర్ వైద్యసేవలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 90 ఆస్పత్రులను ప్రభుత్వం ఎంపిక చేసింది. అందులో ప్రైవేటు ఆస్పత్రులు 40, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 5, ప్రైమరీ హెల్త్ సెంటర్లు 28, జీజీహెచ్ 1, ఏరియా ఆస్పత్రి 1, మరో 3 ఎంపిక ప్రక్రియలో ఉన్నాయి. 16 దంత వైద్యశాలల్లో (ఈహెచ్ఎస్) సైతం వైద్య సేవలు అందిస్తున్నాయి. వీటిలో సుమారు 60 మంది వైద్య మిత్రలు 17 ఏళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరోగ్యశ్రీని ఎత్తేస్తారని వినిపిస్తుండడంతో వారి ఉద్యోగ భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. తాజాగా ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) స్థానంలో ఏప్రిల్ నుంచి యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకువచ్చేందుకు ఇప్పటికే సన్నాహాలు ప్రారంభమైనట్లు సమాచారం. ఇందుకు కేవలం రెండు నెలల సమయమే ఉండడంతో వైద్య మిత్రల్లో ఆందోళన నెలకొంది. కొత్త పథకం అమల్లోకి వస్తే 50 శాతానికి పైగా ఉద్యోగాలు ఊడిపోతాయన్న ప్రచారం సాగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా ఆరోగ్యశ్రీ అంటే గుర్తొచ్చేది దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. అందులో సంస్కరణలు తీసుకువచ్చి మరింత మెరుగైన వైద్యాన్ని, మరిన్ని వ్యాధులకు ఆ పథకాన్ని విస్తరించినది మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. వారిద్దరి పేర్లను ప్రజల గుండెల్లోంచి తొలగించాలన్న దుర్బుద్ధితో ఆ పథకాన్ని తొలగించి కొత్త పాలసీ తీసుకువస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు జీవో 162 మాత్రమే విడుదల చేసిన సర్కారు సదరు పాలసీ మార్గదర్శకాలు, స్పష్టమైన ఆదేశాలను గుట్టుగా ఉంచినట్టు తెలుస్తోంది. రూ.2 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్, ఆపై మొత్తానికి బీమా కంపెనీల ద్వారా వైద్యం అందించాలనే ప్రతిపాదనలపై ఇప్పటికే అధికారులకు అవగాహన కల్పించినట్లు తెలిసింది. ఆస్పత్రులలోని సిబ్బంది వివరాలు రిజిస్టర్ చేసినట్లు సమాచారం. అయితే తక్కువ ప్యాకేజీల వల్ల బీమా సంస్థలు ముందుకు రావడం లేదని సమాచారం. నూతన పాలసీపై అయోమయం ఆరోగ్యశ్రీని తొలగిస్తే మెరుగైన వైద్యం అందుతుందా..? లేదా..? అన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. ప్రస్తుతం అమలవుతున్న ఎన్టీఆర్ వైద్య సేవలో ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల మేర హెల్త్ కవరేజీ లభిస్తోంది. ఈ విధానాన్ని బీమాలోకి తీసుకువస్తే.. క్లెయిమ్ల విషయంలో ఏ మేరకు లబ్ధి చేకూరుతుందన్న ప్రశ్నార్ధకమే. రూ.250 కోట్ల బకాయిలు తెల్ల రేషన్కార్డు దారులకు ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ వర్తింపజేస్తోంది. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే క్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆస్పత్రులకు చెల్లించాల్సిన బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా కాలయాపన చేస్తోంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా నెట్వర్క్ ఆస్పత్రులకు సుమారుగా రూ.250 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ బకాయిలు ఆస్పత్రుల యాజమాన్యాలకు గుదిబండగా మారాయి. ఎన్టీఆర్ వైద్యసేవ కేసులంటేనే ఎందుకొచ్చిన అరువు సేవ అని భావిస్తున్నారు. గుండె, చర్మం, ఈఎన్టీ, గ్యాస్ట్రో, జనరల్ మెడిసిన్, సర్జరీ, మూత్రపిండ శస్త్ర చికిత్సలు చేసిన ఆస్పత్రులకు బిల్లులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో జరిగిన వైద్యానికి ఎలాంటి చెల్లింపులూ చేయలేదు. ఈ పరిణామం పేదలకు ఇబ్బందిగా మారింది. ఖరీదైన శస్త్ర చికిత్సలు తాము ఎలా చేయించుకోవాలంటూ నిట్టూరుస్తున్నారు. దీనిపై ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. 5 శాతమే విడుదల జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) నెట్వర్క్ ఆస్పత్రులకు సుమారు రూ.250 కోట్లకు పైగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. అనేక ఆందోళనల నేపథ్యంలో తలొగ్గిన ప్రభుత్వం 5 శాతం నిధులు మాత్రమే విడుదల చేసింది. మిగిలినవి ఎప్పుడు విడుదల చేస్తుందో స్పష్టత ఇవ్వలేదు. 18 నెలల్లో మూడుసార్లు మందులు, సర్జికల్ పరికరాల కొనుగోళ్లు, వైద్యులు, సిబ్బందికి జీతాల చెల్లింపులతో పాటు, ఆస్పత్రుల విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్నామని ఎన్టీఆర్ వైద్యసేవ నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. బకాయిల చెల్లింపు డిమాండ్తో గత ఏప్రిల్లో సమ్మెలోకి వెళ్లాయి. అప్పట్లో సీఎం స్థాయిలో చర్చలు జరిపి బిల్లులు చెల్లిస్తామని హామీ పొందారు. అనంతరం ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంతో మళ్లీ సమ్మెకు దిగారు. మరో సారి ఏకంగా వైద్యమే ఆపేశారు. పథకం నిలిపివేసేందుకు కుట్ర ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసి, ఆ పథకం స్థానంలో ఆయుష్మాన్ భారత్ను తీసుకురావడంపై కూటమి ప్రభుత్వం మక్కువ చూపుతోంది. బీమా పథకం అమలు చేసే యోచనలో ఉంది. ఇందులో వ్యాధుల సంఖ్య 1900 లోపే ఉంటుంది. ప్యాకేజీ సైతం తక్కువగా ఉండడంతో ప్రైవేటు ఆస్పత్రులు ఆయుష్మాన్ భారత్పై ఆసక్తి చూపడం లేదు. ఇదే జరిగితే నయా పైసా చెల్లించకుండా వైద్యం చేయించుకునే పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర భారం పడనుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు (ఫైల్) వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఊపిరి వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక 938 వ్యాధులతో ప్రారంభమైన ఆరోగ్యశ్రీ ప్రస్థానం 3,275 వ్యాధుల వరకు విస్తరించారు. ఇందుకోసం రూ.508,49,95,571 కోట్లు వైద్యం, శస్త్ర చికిత్సల కోసం వెచ్చించగా. 2,48,805 మంది సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. వీటిలో బైలేటరల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్కు రూ.11.97 లక్షలు, అల్లోజెనిక్ బోన్మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్కు (14 ఏళ్లుపైన) రూ.11 లక్షలు, గుండె మార్పిడికి రూ.10.77 లక్షలు వెచ్చించారు. -
కోటి తులసి పూజకు రూ.1.08 లక్షలు
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో నిర్వహిస్తున్న కోటి తులసి పత్రి పూజకు సప్తగిరి హేచరీస్ ఎండీ పెదబాబు శుక్రవారం రూ.1.08 లక్షల విరాళం అందజేశారు. ‘నన్నయ’లో కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి డిప్లొమా, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులలో ప్రవేశానికి ఆసక్తి, అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని వాటి వివరాలు తెలియజేశారు. సర్టిఫికెట్ కోర్సులివీ ఫంక్షనల్ ఇంగ్లిష్, కలినరీ స్కిల్స్, ఫారెన్ లాంగ్వేజెస్ (జపనీస్, ప్రెంచ్, జర్మన్), ఒరియంటల్ పీసీ కల్చరల్, ప్లోరల్ బై ప్రొడక్షన్, ఇంటర్నేషనల్ ఎకానమీ అండ్ ఫైనాన్స్, ఫౌండేషన్స్ ఆఫ్ డేటా సైన్స్, ఇంట్రడక్షన్ టు హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, బేసిక్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, బేసిక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంటేషన్, న్యూట్రిషన్ అండ్ డిటెటిక్స్ అర్హత : పదో తరగతి ఉత్తీర్ణత. కోర్సు వ్యవధి : మూడు నెలలు ఫీజు: విద్యార్థులకు రూ.వెయ్యి, వర్సిటీ సిబ్బందికి రూ.రెండు వేలు, ఇతరులకు రూ.మూడు వేలు డిప్లొమా కోర్సులు ఏఐ అండ్ మిషన్ లెర్నింగ్, మోబైల్ యాప్ డెవలప్మెంట్, సైబర్ సెక్యూరిటీ, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అర్హత : ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. కోర్సు వ్యవధి : ఆరు నెలలు ఫీజు: విద్యార్థులకు రూ.2 వేలు, వర్సిటీ సిబ్బందికి రూ.3 వేలు, ఇతరులకు రూ.4 వేలు. పీజీ డిప్లొమా కోర్సులు ఫంక్షనల్ ఇంగ్లిష్, ఫైన్ ఆర్ట్స్ (మ్యూజిక్, పెయింటింగ్, థియేటర్ ఆర్ట్స్), టూరిజం అండ్ హాస్పిటాలిటీ, క్వాయర్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ (పీజీడీఎం), హాస్పిటల్ మేనేజ్మెంట్, కంప్యూటేషన్ మేథమెటిక్స్, లోకల్ గవర్నమెంట్ ఇన్ ఇండియా, గాంధీయన్ ఐడియాలజీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్రొగ్రామ్, క్వాంటమ్ కంప్యూటింగ్ అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. కోర్సు వ్యవధి : ఒక సంవత్సరం ఫీజు: విద్యార్థులకు రూ.3 వేలు, వర్సిటీ సిబ్బందికి రూ.4 వేలు, ఇతరులకు రూ.5 వేలు అక్రమ మైనింగ్లో తనిఖీలు వాహనాల సీజ్ అనపర్తి: జిల్లాలో గ్రావెల్ అక్రమ తవ్వకాల నియంత్రణలో భాగంగా గనులు, భూగర్భశాఖ అధికారి డి.ఫణిభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం క్షేత్రస్థాయి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బిక్కవోలు మండలం, కాపవరం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 15/1ఏ లో గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని ఈ బృందం తనిఖీ చేసింది. సదరు భూమి గతంలో సీహెచ్ వెంకటేష్ పేరున లీజు మంజూరు కాగా, ప్రస్తుతం కాల పరిమితి ముగిసినట్టు గుర్తించినట్టు ఫణిభూషణ్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఒక పొక్లెయిన్, అక్రమ రవాణాకు వినియోగిస్తున్న మూడు లారీలను సీజ్ బిక్కవోలు పోలీసులకు అప్పగించారు. తనిఖీల్లో అసిస్టెంట్ జియాలజిస్ట్ జి.విఘ్నేశ్వరుడు, రాయల్టీ ఇన్స్పెక్టర్ జ్యోతిర్మయి, టెక్నికల్ అసిస్టెంట్లు శైలజ, మనీష, సర్వేయర్ శ్రీనివాస్, స్థానిక రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
గాండ్రింపు ఆగింది..
చిక్కదు.. దొరకదు.. అన్నట్టుగా తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు వారం రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పులి.. ఎట్టకేలకు పట్టుబడింది. రాయవరం మండలం కూర్మాపురంలోని ఓ పాడుబడిన ఇంట్లో నక్కిన పులిని పట్టుకునేందుకు అటవీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి విశ్వ ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ, అది అక్కడి నుంచి తప్పించుకుని, సాయంత్రానికి సమీపంలోని పశువుల పాకలో నక్కింది. అక్కడి నుంచి అది తప్పించుకోవడానికి వీలు లేకుండా.. ఆ పాక చుట్టూ అధికారులు వల పన్ని, చివరకు ట్రాంక్విలైజర్తో మత్తు మందు ఇచ్చి, బంధించారు. దీంతో, గత నెల 31న సీతానగరం మండలంలో మొదలైన టైగర్ టెర్రర్కు తెర పడింది. – వివరాలు 8లో.. -
పుష్కరాలను సమష్టిగా విజయవంతం చేద్దాం
● రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ ● సన్నద్ధతపై అధికారులతో సమీక్ష సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వచ్చే ఏడాది జూన్ 26న ప్రారంభమయ్యే పుష్కరాలను సమిష్టి కృషితో నిర్వహించి విజయవంతం చేయాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పుష్కర ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఆయన కలెక్టరేట్లో శుక్రవారం సమీక్షించారు. పుష్కరాల నిర్వహణలో పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, దేవదాయ, పర్యాటక, ఇరిగేషన్, విద్యుత్, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. త్వరలోనే రాష్ట్ర స్థాయి అధికారులు, హెచ్వోడీలతో కలిసి పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని తెలిపారు. నవ జనార్దన పారిజాతం (వైష్ణవ క్షేత్రాలు), ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలను అనుసంధానిస్తూ పర్యాటక ప్యాకేజీలు రూపొందించనున్నట్లు తెలిపారు. పాపికొండల పర్యాటకాన్ని కూడా పుష్కరాల పర్యాటక ప్రణాళికలో భాగం చేస్తామని వెల్లడించారు. కోట్లాది మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కుంభమేళా తరహాలో అత్యున్నత ప్రమాణాలతో టెంట్ సిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఏ ఘాట్లో స్నానం చేసినా పుణ్యఫలం సమానమే అన్న విషయంపై భక్తుల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించామన్నారు. కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి అన్ని పనులు ఇప్పటికే ఉన్న బడ్జెట్కు అనుగుణంగా, స్పష్టమైన లక్ష్యాలు, సమ్మతమైన విధానం ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జిల్లా ప్రజాప్రతినిధులు, ఎస్పీ డి.నరసింహ కిశోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా చండీహోమం
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీహోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి పండితులు ప్రత్యేక పూజలు చేసి, చండీహోమం ప్రారంభించారు. పూర్ణాహుతి అనంతరం అమ్మవార్లకు వేదాశీస్సులు, నివేదనలు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. వేద పండితులు అమరేశ్వర ఘనపాఠి, వనదుర్గ ఆలయ అర్చకుడు ప్రయాగ రాంబాబు, వ్రత పురోహితులు దేవులపల్లి ప్రకాష్, కూచుమంచి ప్రసాద్, పరిచారకులు హోమం నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్తో పాటు 30 మంది భక్తులు ఈ హోమంలో పాల్గొన్నారు. సత్యదేవుని ప్రధానాలయంలో అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యం, రత్నగిరి తొలి పావంచా వద్ద కనకదుర్గ అమ్మవారికి పరిచారకుని ఆధ్వర్యంలో పండితులు కుంకుమ పూజలు నిర్వహించారు. -
పన్నులు వసూలైతేనే పురాభివృద్ధి
● మున్సిపల్ ఆర్డీ నాగ నరసింహారావు ● కోనసీమ, తూర్పు గోదావరి జిల్లాల మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష అమలాపురం టౌన్: ప్రజలు పన్నులు నూరుశాతం చెల్లించినపుడే మున్సిపాలిటీలు పురోభివృద్ధి సాధిస్తాయని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ సీహెచ్ నాగ నరసింహరావు అన్నారు. వచ్చే మార్చి నెలాఖరు నాటికి పన్నులను పూర్తి స్థాయిలో చెల్లించి మున్సిపాలిటీల అభివృద్ధికి సహకరించాలని ఆయన ప్రజలను కోరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లోని 6 మున్సిపాలిటీల కమిషనర్లతో వారి పరిధిలో పన్నులు, పనుల స్థితిగతులపై శుక్రవారం సమీక్షించారు. అంతకు ముందు ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆస్తి, తాగునీరు, ఖాళీ స్థలాల పన్నుతో పాటు ప్రకటనల పన్ను, ట్రేడ్ లైసెన్సులు, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్లలో అద్దెలను సకాలంలో చెల్లించాలని కోరారు. రెండు జిల్లాల పరిధిలోని అమలాపురం, రామచంద్రపురం, ముమ్మిడివరం, మండపేట, నిడదవోలు, కొవ్వూరు మున్సిపాలిటీల్లో జనవరి నెలాఖరు నాటికి అమలాపురం మున్సిపాలిటీలో ఆస్తి పన్ను 49.83 శాతం, తాగునీటి పన్ను 46.81 శాతం, నిడదవోలు మున్సిపాలిటీలో 52.83 శాతం, 44.06 శాతం, రామచంద్రపురం మున్సిపాలిటీలో 57.16 శాతం, 10.7 శాతం, మండపేట మున్సిపాలిటీలో 59.83 శాతం, 15.64 శాతం, ముమ్మిడివరం నగర పంచాయతీలో 62.68 శాతం, 7.07 శాతం, కొవ్వూరు మున్సిపాలిటీలో 67.79 శాతం, 33.27 శాతం వసూలైనట్టు తెలిపారు. సమీక్షలో భాగంగా దోమలు, పందులు, కుక్కుల బెడద అంశాలపై చర్చించారు. దాదాపు రూ. 5 కోట్లతో ప్లాస్మా టెక్నాలజీలో పది టన్నుల చెత్తను ప్రాసెసింగ్ చేసే యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. -
మార్కెట్లోకి సుజుకి ఈ–యాక్సిస్ స్కూటర్
రాజమహేంద్రవరం రూరల్: సుజుకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఈ–యాక్సిస్’ను రాజమహేంద్రవరం కంటిపూడి సుజుకి షోరూంలో శుక్రవారం జిల్లా ట్రాన్స్పోర్టు అధికారి ఆర్.సురేష్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సీహెచ్ సంపత్కుమార్లు మార్కెట్లోకి విడుదల చేశారు. కంటిపూడి గ్రూప్ చైర్మన్ కంటిపూడి సర్వారాయుడు మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా లిథియం ఐరన్ పాస్ఫేట్ బ్యాటరీతో ఈ వాహనం విడుదలైందన్నారు. దీనిద్వారా నాలుగు రెట్ల అధిక బ్యాటరీ జీవితం లభించనుందన్నారు. దేశంలోనే తొలిసారిగా 60 శాతం విలువతో బై–బ్యాక్ సౌకర్యం కల్పించడం ప్రత్యేక ఆకర్షణ అని అన్నారు. హయాబూసా, జీఎస్ఎక్స్, వి–స్ట్రోమ్ వంటి అత్యాధునిక మోడళ్లకు టెస్టింగ్ జరిగే జపాన్లో ఈ స్కూటర్ పరీక్షలు జరగడం విశేషమన్నారు. కేవలం ఒక గంట 12 నిమిషాల్లో 0 నుంచి 80 శాతం వరకు చార్జ్ అయ్యే సామర్థ్యం ఉందని సర్వారాయుడు తెలిపారు. కీ–లెస్ సిస్టమ్తో స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ మరియు 4.2 అంగుళాల టీఎఫ్టీ ఎల్సీడీ డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చిందన్నారు. కంటిపూడి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ సత్యనారాయణ మూర్తి (చినబాబు), కె.వినయ్బాబు, ఎం.జగన్, కె.మన్మోహన్రామ్, ఎస్ఎం వెంకటేశ్, నగర ప్రముఖులు, షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. -
పొన్నాడలో ఉరుసు ఉత్సవాలు ప్రారంభం
కొత్తపల్లి: పొన్నాడలో వేంచేసి ఉన్న బషీర్బీబీ (బంగారు పాపమ్మ) ఔలీయా ఉరుసు ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముజావర్లు సంథల్ (గంధం) తీసి అమ్మవారికి పూయడంతో ఉత్సవాలను ప్రారంభించారు. మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశం నలుమూల నుంచి వేలాది మంది భక్తులు ఇప్పటికే పొన్నాడ చేరుకున్నారు. వీరంతా అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాల్లో గుడారాలు ఏర్పాటు చేసుకుని మూడు రోజులూ ఇక్కడే ఉండి ఉత్సవాల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. ఆదివారం సంథల్ (గంధం) ఉత్సవంతో ముగియనున్న ఈ ఉత్సవాల్లో గంధోత్సవం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంటుంది. గంధోత్సవం కోసం స్థానిక ముజావర్లు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కొత్తపల్లి ఎౖస్సై జి.వెంకటేష్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోజూ ఖురాన్ఖాని, వాచ్, మిలాద్షరీఫ్ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. బషీర్బీబీ ముస్లింల దేవతైనప్పటికీ అన్ని మతాలు, కులాలకు చెందిన భక్తులు దర్శించుకోవడం వల్ల ఈ ఉత్సవాన్ని మత సామరస్యానికి చిహ్నంగా చెబుతుంటారు. బషీర్బీబీ దర్గాను స్థానిక సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ తన సొంత నిధులు రూ. 10 లక్షలతో పునర్నిర్మించారు. దీనికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఉరుసు ఉత్సవాల్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తదితరులు పాల్గొన్నారు. -
గ్రావెల్ తవ్వకాలపై విజిలెన్స్ దాడులు
గోకవరం: మండలంలోని సూదికొండ, గంగంపాలెం గ్రామాల పరిధిలో గ్రావెల్ అక్రమ తవ్వకాలపై తూర్పుగోదావరి జిల్లా భూగర్భ, గనుల శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా మైనింగ్ జరుగుతున్నట్టు నిర్ధారించి తవ్వకాలు నిర్వహిస్తున్న రెండు పొక్లెయిన్లను సీజ్ చేశారు. జిల్లాలో అనుమతులు లేకుండా తవ్వకాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి డి.ఫణిభూషణ్రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ జియాలజిస్ట్ జి.విఘ్నేశ్వరుడు, రాయల్టీ ఇన్స్పెక్టర్ జ్యోతిర్మయి, టెక్నికల్ అసిస్టెంట్లు శైలజ, మనీషా, స్థానిక రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
గాండ్రింపు ఆగింది..
ఫ కూర్మాపురంలో చిక్కిన పులి ఫ ఫలించిన ‘ఆపరేషన్ టైగర్’ ఫ విశాఖపట్నం తరలింపు రాయవరం: గాండ్రింపు ఆగింది.. ఎట్టకేలకు పెద్ద పులి చిక్కింది.. వారం రోజుల నుంచి పులి జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.. చివరికి అటవీశాఖ అధికారులు, పోలీసుల కృషి ఫలించింది. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో పులిని అధికారులు బంధించి విశాఖపట్నం జూలాజికల్ పార్క్కు తరలించారు. రాయవరం మండలం కూర్మాపురంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు పొలానికి వెళ్లిన రైతులు పులి అడుగు జాడలను గమనించారు. పొలంలో మందును స్ప్రే చేస్తుండగా గ్రామానికి చెందిన గుంటూరు వనుములు తొలుత చూశారు. ఈ విషయాన్ని ఊళ్లో వారికి చెప్పడంతో, పులి అడుగు జాడల వెంబడి వెళ్తుండగా గుణ్ణం బాబూరావు చెరువు వద్ద గాండ్రింపును రైతులు ముత్యాల శ్రీనివాస్, గుణ్ణం పనసయ్య విన్నారు. ఆ విషయాన్ని వెంటనే అధికారులకు చేరవేశారు. అనంతరం ఆ పులి ఆంజనేయస్వామి గుడి సమీపంలోని పాలచర్ల రాజు ఇంటి ఆవరణలోకి చేరింది. ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 11.30 గంటల ప్రాంతంలో అటవీశాఖ సిబ్బంది, పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. పుణే నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్ ప్రత్యేక వాహనంలో ఉండి పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు ప్రయత్నించింది. అయితే మధ్యాహ్నం 1.50 గంటలకు ఒక్కసారిగా పులి పాలచర్ల రాజు ఇంటి గోడ దూకి అరటి తోటల నుంచి పంట పొలాల మీదుగా గ్రామంలోని కొలగాని సత్తిబాబు పశువుల పాకలోకి చేరింది. అప్పటికే పశువుల పాకలో రెండు గేదెలు, లేగదూడ ఉన్నాయి. వాటిని పులి చంపిందన్న వార్త బయట హల్చల్ చేసింది. అయితే వాటిని ఏమీ చేయకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పశువుల పాక వద్దే ఉండి.. పశువుల పాక నుంచి బయటకు పులి బయటకు వస్తే మత్తు ఇంజెక్షన్ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి పశువుల పాక బయట వేచిచూశారు. పశువుల పాక వద్ద భవనాల పైకి చేరిన రెస్క్యూ టీమ్ సభ్యులు తుపాకీ ద్వారా ఇంజెక్షన్ ఇచ్చేందుకు చూశారు. అప్పటికే చీకటి పడుతుండడంతో ఫ్లడ్ లైట్లు కూడా పెట్టారు. చివరికి సాయంత్రం 6.32 గంటలకు పులి బయటకు వచ్చింది. వెంటనే రెండు వైపులా నుంచి రెస్క్యూ టీమ్ సభ్యులు తుపాకీ ద్వారా ఇంజెక్షన్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఇరువురు ఒకేసారి తుపాకీ ద్వారా ఇంజెక్షన్ చేయగా, ఒకటి పులికి తగిలింది. పశువుల పాకకు 100 మీటర్ల దూరంలో దుర్గమ్మ తల్లి ఆలయం వద్ద పులి రహదారిపై పడిపోయింది. అప్పటికే పులిని అధికారులు, ప్రజలు వెంబడించారు. వెంటనే పులిని బంధించి, ప్రత్యేక వాహనంపై అటవీ శాఖ అధికారులు విశాఖపట్నం జంతు ప్రదర్శన శాలకు తరలించారు. పయనం సాగిందిలా.. తూర్పుగోదావరి జిల్లాలో వారం రోజుల పాటు పులి సంచరించింది. జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిం. ప్రాణనష్టం లేకున్నప్పటికీ, ఆరు పశువులు మాత్రం పులి బారిన పడ్డాయి. ఇదిలా ఉంటే మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యం నుంచి సాగిన పెద్ద పులి ప్రయాణం రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో ముగిసింది. తడోబా అభయారణ్యం నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా ఖమ్మం జిల్లా పాల్వంచకు చేరుకుంది. అక్కడి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం, పోలవరం మీదుగా గత నెల 31న తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం చినకొండేపూడిలోకి ప్రవేశించింది. పులి పాదముద్రలు గుర్తించిన అటవీ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. అక్కడి నుంచి జిల్లాలో కోలమూరు, దివాన్చెరువు మీదుగా రాజానగరం మండలం జి.యర్రంపాలెం నుంచి గురువారం అనపర్తి మండలం పీరా రామచంద్రపురంలో పులి జాడను అధికారులు కనుగొన్నారు. శుక్రవారం ఉదయానికి పులి రాయవరం మండలం కూర్మాపురంలోకి చేరుకోగా, ఇక్కడ అధికారుల పన్నిన వలలో చిక్కింది. భయపడిపోయాం.. మా ఇంటి పరిసరాల్లోనే పులి ఉందన్న వార్తతో చాలా భ యపడ్డాం. మొదట్లో ఆందో ళన చెందాం. అటవీశాఖ, పో లీసులు వచ్చిన తర్వాత కొంత ధైర్యం వచ్చింది. మా ఇంటి వెనుక నుంచే పులి పారిపోవడం చూశాం. గ్రామానికి పులి వస్తుందని అసలు ఊహించలేదు. –చిలుకూరి బుజ్జి, కూర్మాపురం, రాయవరం మండలం ఆపరేషన్ విజయవంతం వారం రోజులుగా పులి సంచారంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కూర్మాపురం చేరుకుందని తెలియగానే, అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని పులిని పట్టుకున్నాం. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ట్రాంక్విలైజేషన్ ప్రక్రియతో ఆపరేషన్ విజయవంతం చేశాం. –బి.విద్య, ఈస్ట్జోన్ డీఎస్పీ, రాజమహేంద్రవరం డివిజన్ పశువులను వదిలేసి.. పశువుల పాకలో పులి సుమారు 4.30 గంటలు ఉంది. అప్పటికే పశువుల పాకలో రెండు గేదెలు, ఒక దూడ ఉన్నాయి. పశువుల పాకలోనే ఉన్నప్పటికీ పులి వాటిపై దాడి చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రజలు పులిని వెంబడించడంతో భయాందోళనకు గురైన పులి పశువులకు హాని తలపెట్టక పోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. -
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
రాజమహేంద్రవరం రూరల్: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు పిలుపునిచ్చారు. శుక్రవారం కాతేరు గ్రామంలో శ్యామలాంబ గుడి వద్ద నుంచి ‘‘ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం’’ అనే నినాదంతో సామాజిక కార్యకర్త గారపాటి వనజ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నుంచి తిరుమలకు మహిళలు చేపట్టిన పాదయాత్రను ఆయన ప్రారంభించారు. తిరుమలరావు మాట్లాడు తూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సామాజిక కార్యకర్త వనజ ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం పేరిట ఎన్నో కార్యక్రమా లు చేస్తున్నారని, అందులో భాగంగానే పాదయాత్రను ప్రారంభించారన్నారు. అనంతరం వనజ మాట్లాడుతూ అన్నదానాలు, వేడుకల్లో స్టీల్ గ్లాస్లు, ప్లేట్లు, అరటి ఆకులు, విస్తరాకులు ఉపయోగించి సకల జీవరాశుల ఆరోగ్యాన్ని, భూమాత ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. వాడిన ప్లాస్టిక్ను పక్కన పెట్టి పొడి చెత్తగా పారిశుధ్య కార్మికులకు అందజేసి పునరుత్పత్తి వినియోగానికి సహకరించాలన్నారు. పాదయాత్ర పొడవునా ఉన్న గ్రామాల్లో ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను వివరిస్తామన్నారు. పాదయాత్రలో గారపాటి వనజ, గారపాటి విజేత, నీరుకొండ అనిత, ముళ్లపూడి శేషకుమారి, ముళ్లపూడి చిట్టి, కాట్రగడ్డ ఉమాదేవి పాల్గొంటున్నారు. ఆ మహిళలను ముఖ్య అతిథులు ఘనంగా సత్కరించారు. వీరు కాతేరులో ఒక్కో మొక్కను నాటారు. నున్న కృష్ణ, గంగిన హనుమంతరావు, గంగిన జాహ్నవి, మద్దిపట్ల రాజు, మద్దిపట్ల చిన్ని, కాతేరు యూత్ సభ్యులు పాల్గొన్నారు. -
పులిని బంధించడంలో ప్రభుత్వం విఫలం
రాజమహేంద్రవరం సిటీ: రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న పెద్ద పులిని బంధించడంలో ప్రభుత్వంతో పాటు అధికారులు విఫలమయ్యారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి శ్రీనివాస చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ధ్వజమెత్తారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోందన్నారు. పులిని పట్టుకుని అటవీ ప్రాంతంలోకి పంపే ప్రయత్నం సక్రమంగా జరగడం లేదని అన్నారు. రాత్రయితే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. రైతులు పొలం పనులకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. యుద్ధ ప్రాతిపదికన పులిని పట్టుకునే ప్రయత్నం చేయాలన్నారు. చనిపోయిన పశువులకు ఎక్స్గ్రేషియా ప్రకటించి యజమానులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు నియోజకవర్గాల్లో పది పశువులను చంపినట్లు రికార్డులు చెబుతున్నాయన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల హడావుడి తప్ప, పులిని బంధించే ప్రయత్నం కనిపించడం లేదని విమర్శించారు. సాంకేతికత పెరిగినా పులి జాడ కనిపెట్టడంలో విఫలం కావడం శోచనీయమని అన్నారు. పులిని పట్టుకునే ప్రయత్నాల్లో రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రద్ధ చూపకపోవడం దారుణమని అన్నారు. ప్రజలు భయాందోళన చెందుతున్నా కనీసం స్పందించక పోవడం సరైన విధానం కాదన్నారు. అనుకోని ప్రమాదం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తక్షణ మే పశువులు కోల్పోయిన పాడి రైతులకు రూ.మూడు లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వా లని డిమాండ్ చేశారు. రానున్న 12 గంటల్లో పెద్ద పులిని పట్టుకునే ప్రయత్నాన్ని అటవీ శాఖాధికారులు ముమ్మరం చేయాలని, లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని వేణు, రాజా హెచ్చరించారు. మాజీ మంత్రి వేణు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా -
13 నెలల తరువాత విధుల్లోకి..
రామచంద్రపురం రూరల్: రామచంద్రపురం మండల విద్యాశాఖ అధికారి మానుపూడి శ్రీనివాస్ గురువారం తిరిగి విధుల్లో చేరారు. ఆ వివరాల్లోకి వెళితే.. మండలంలో 13 నెలల క్రితం జరిగిన సమ్మేటివ్ పరీక్షల్లో పేపర్ లీకై ందన్న కారణంతో (లోకేష్ విద్యా శాఖ మంత్రిగా ఉండటంతో ప్రిస్టేజ్గా తీసుకుని) పేపర్ లీకేజీకి కారణమైన ఉపాధ్యాయుడిని విధుల్లోంచి పూర్తిగా తొలగించారు. ఇందులో ఎంఈఓ శ్రీనివాస్ను కూడా సస్పెండ్ చేశారు. అయితే గత ఏడాది ఏప్రిల్ నెలలోనే ఎంఈఓను విధుల్లోకి తీసుకోవాలని కోర్టు తీర్పు ఇచ్చినప్పుటికీ ఇంతకాలం సాగదీసి ఇప్పుడు విధుల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు మంచి వ్యక్తికి న్యాయం జరిగిందంటూ ఎంఈఓ శ్రీనివాస్ను కలసి అభినందించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షుడు వాడ్రేవు శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోలిశెట్టి వీరవెంకట సత్యానారాయణ మూర్తి, సుదర్శనరెడ్డి, రేఖా రామలక్ష్మి, యూటీఎఫ్ నాయకులు బాపూజీ, రమణమూర్తి, చైతన్యబాబు, శివగణేష్, పీఆర్టీయూ నాయకులు మొంగం అమృతరావు, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎంఈఓగా శ్రీనివాస్ బాధ్యతల స్వీకరణ -
160 కిలోల గంజాయి స్వాధీనం
జగ్గంపేట: gñæ.Mö™èl*¢Æý‡$ Ð]l§ýlª ¿êÈV> VýS…gêÆ‡$$° ´ùÎ-çÜ$Ë$ ÝëÓ«-©¯]l… ^ólçÜ$-MýS$°, ¯]lË$-VýS$ǰ AÆð‡çÜ$t ^ólÔ>Æý‡$. VýS$Æý‡$ÐéÆý‡… ©°Oò³ fVýSY…õ³r çÜÇPÌŒæ M>Æ>Å-ÌS-Ķæ$…ÌZ ò³§éª-ç³#Æý‡… yîlGïܵ }çßæ-ÇÆ>k ÑÌôæMýS-Æý‡Ï™ø Ð]l*sêÏ-yéÆý‡$. gñæ.Mö-™èl*¢-Æý‡$ÌZ° §ýl$Æý‡Y VýS$yìl çÜÒ$-ç³…ÌZ fVýSY…õ³r GOòÜÞ Æý‡çœ¬-¯é£ýl-Æ>Ð]l# B«§ýlÓÆý‡Å…ÌZ ´ùÎ-çÜ$ÌS ™èl°-TË$ ^ólç³-sêtÆý‡$. VýS*yŠæÞ BsZÌZ ™èlÆý‡-Í-çÜ$¢¯]l² 80 ´ëÅMðSrÏÌZ VýS…gêÆ‡$$, òÜÌŒæ¸ù¯Œl, Æý‡*.ÌS„ýS ÝëÓ«-©¯]l… ^ólçÜ$MýS$-¯é²Ð]l$° yîlGïܵ ™ðlÍ-´ëÆý‡$. Òsìæ ÑË$Ð]l Æý‡*.82.48 ÌS„ýSË$ E…r$…§ýl° ^ðl´ëµÆý‡$. JyìlÔ> Æ>[Úët-°MìS ^ðl…¨¯]l çÜ$«§éMýSÆŠ‡ §éÓÆ> D VýS…gêÆ‡$$° çÜ™èlÅ-ÝëÆ‡$$ hÌêÏÌZ Ñ{MýS-Ƈ$$…^ól…§ýl$MýS$ ¡çÜ$MýS$ Ððlâ¶æ$™èl$…-yýlV> ç³r$t-MýS$-¯]l²r$Ï ™ðlÍ-´ëÆý‡$. çÜ™èlÅ-ÝëÆ‡$$ hÌêÏMýS$ ^ðl…¨¯]l Ðól$MýSÌS {ç³M>‹-Ù, Ðól$MýSÌS Ô>ÅÐ]l$ÌS, A¯]l²-Ð]l$Ķæ$Å hÌêÏMýS$ ^ðl…¨¯]l BÐ]l#ÌS }°ÐéçÜ$Ë$, «§ýl°-Ķæ$ÅÌS A…f-Ð]l$ÃOò³ MóSçÜ$ ¯]lÐðl*§ýl$ ^ólÔ>Æý‡$. ïÜI OÐðlB-ÆŠ‡MóS }°-Ðé‹Ü ™èl¨™èl-Æý‡$Ë$ ´ëÌŸY-¯é²Æý‡$. ˘ -
40 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నపత్రం
కాకినాడ క్రైం: స్థానిక రంగరాయ వైద్య కళాశాల (ఆర్ఎంసీ)లో జీఎన్ఎం నర్సింగ్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు విద్యార్థులకు 40 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నపత్రం ఇవ్వడం వివాదాస్పదమైంది. పరీక్షకు గంట ముందే హాజరవ్వాలని విద్యార్థులకు సూచనలు అందగా, అందుకు తగ్గట్లుగానే వందలాది మంది విద్యార్థులు ఉదయం 7 గంటల నుంచే జిల్లా నలుమూలల నుంచి కాకినాడకు వచ్చి పరీక్ష కేంద్రం బయటే పడిగాపులు కాశారు. అయితే వారికి ప్రశ్నపత్రం ఇవ్వడం 40 నిమిషాలు ఆలస్యం అయ్యింది. ఆర్ఎంసీలో ఎగ్జామినేషన్ హాల్–1, 2, డైనింగ్ హాలు, ఆడిటోరియం ఇలా నాలుగు చోట్ల పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 1,801 మంది హాజరు కానున్నారన్న స్పష్టమైన సమాచారం ఉన్నా పరీక్షలు నిర్వహిస్తున్న జీజీహెచ్ బృందం విద్యార్థులను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. కళాశాల ప్రధాన ద్వారం తెరిచింది మొదలు పదుల సంఖ్యలో విద్యార్థులు ఈ హాల్ నుంచి ఆ హాల్కి, ఈ సెంటర్ నుంచి ఆ సెంటర్కి అంటూ పరుగులు పెడుతూనే ఉన్నారు. తమ సీటు ఏదో తెలియక తీవ్ర గందరగోళానికి గురయ్యారు. కళాశాల ఆవరణలో హాల్ టికెట్ ఆధారంగా పరీక్ష గది ఎక్కడో తెలిపే సూచికలు (సైన్ బోర్డులు) ఏవీలేవు. అలా అని మార్గనిర్దేశం చేసే సహాయకులు కూడా లేరు. ఓ వైపు ఉదయం 9 గంటలు గడుస్తుండగా తీవ్ర ఒత్తిడితో ఎందరో విద్యార్థినులు అటు, ఇటు పరుగులు పెట్టడం కనిపించింది. ఇంతటి గందరగోళానికి తమదే తప్పని గుర్తించిన జీజీహెచ్ పరీక్షల నిర్వహణ బృందం విద్యార్థులందరూ తమ సీట్లలో కూర్చునే వరకు వేచి చూసి 40 నిమిషాలు ఆలస్యంగా ప్రశ్నపత్రాన్ని ఇచ్చింది. 12 గంటలకు ముగియాల్సిన పరీక్షను 12.30 వరకూ కొనసాగించారు. కూర్చునే ఏర్పాట్లు, సూచికలు సరిగ్గా లేక పరీక్షకు కొద్ది నిమిషాల ముందు తీవ్ర ఒత్తిడికి గురయ్యామని, సకాలంలో పరీక్ష జరగలేదని, నిర్ణీత వ్యవధిని వినియోగించుకోలేక పోయామని, విలువైన పది నిమిషాల సమయం కోల్పోయామని పరీక్షలు రాసి బయటకు వచ్చిన విద్యార్థులు వాపోయారు. ఈ ఘటనపై రాష్ట్ర డీడీ నర్సింగ్ జ్యోతిని వివరణ కోరగా, బాధ్యులపై చర్యలకు సిఫార్సు చేసి పునరావృతం కాకుండా చూస్తామన్నారు. 327 మంది గైర్హాజరు ఇదిలా ఉంటే జీఎన్ఎం మొదటి సంవత్సర పరీక్షలో 1,801 మందికి గాను 1,474 మంది హాజరయ్యారు. 327 మంది గైర్హాజరయ్యారు. జీఎన్ఎం పరీక్షల ఆరంభంలోనే వివాదం -
‘కూటమి’లో ఇసుక ర్యాంపుల వివాదం
తాళ్లపూడి: కూటమిలోని టీడీపీ, జనసేన మధ్య వర్గ విభేదాలు మరోసారి బయట పడ్డాయి. ఇసుక ర్యాంపుల విషయంలో నాయకుల మధ్య చిచ్చు రేగింది. దీంతో వేగేశ్వరపురం ఇసుక ర్యాంపులో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నారని అధికారులకు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. మండలంలో జరిగే ఇసుక అక్రమాలపై ఇకపై తమ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుందని జనసేన నాయకుడు, ఎంపీటీసీ సభ్యుడు హరిబాబు విలేకరులకు చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉన్నా మండలంలో మాత్రం జనసేనను దూరంగానే ఉంచుతున్నారని, టీడీపీ వర్గీయులు జనసేన వారిపై కేసులు పెడుతున్నారని అన్నారు. ఇసుక ర్యాంపులన్నీ టీడీపీ నాయకులే నిర్వహిస్తున్నారని, తమను చేతకానివారిగా చూస్తున్నారని అన్నారు. ఇసుక ర్యాంపుల్లో జరిగే తప్పులపై అందుకే గళం విప్పామని, ఎన్డీఏలో తాము భాగస్వామ్యమా? కాదా? తెలియకుండా ఉందని ఎంపీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు. -
రేషన్ బియ్యం స్వాధీనం
అంబాజీపేట: పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంబాజీపేట ఎస్సై కె.చిరంజీవి కథనం ప్రకారం.. మామిడికుదురుకు చెందిన గోకవరపు రాఘవ అవినాష్ 82 బస్తాల్లో 2,988 కిలోల రేషన్ బియ్యాన్ని మామిడికుదురు నుంచి ఆలమూరుకు బొలెరో వాహనంలో తరలిస్తున్నారు. ముక్కామల వచ్చేసరికి పోలీసులు దాడి చేసి ఆ వాహనాన్ని పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని తక్కువకు కొనుగోలు చేసి ఆలమూరు పరిసర ప్రాంతాల్లో పనులు చేసే కూలీలకు ఎక్కువ ధరకు విక్రయిస్తారని ఎస్సై తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. బియ్యాన్ని ఎమ్ఎస్ఓ పూర్ణిమ సారధ్యంలో సివిల్ సప్లయిస్ గొడౌన్కు తరలించామన్నారు. త్రుటిలో తప్పిన ప్రమాదంనిడదవోలు: స్థానిక గణేష్చౌక్ సెంటర్లో గురువారం ఓ వృద్ధుడికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. పంగిడి నుంచి విజ్జేశ్వరం వెళ్తున్న క్వారీ లారీ పట్టణంలో గణేష్చౌక్ సెంటర్లో మలుపు తిరుగుతున్న సమయంలో స్కూటీపై వెళుతున్న వృద్ధుడు దుప్పాడ రామారావును ఢీకొంది. ఈ ప్రమాదంలో అతను లారీ కింద పడ్డాడు. లారీ టైర్లు అతనిపై ఎక్కకపోవడంతో స్పల్ప గాయాలతో బయటపడ్డాడు. అతన్ని స్థానికులు బయటకు లాగి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి లారీని స్టేషన్కు తరలించారు. అయితే కేసు నమోదు చేయలేదు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందిన వృద్ధుడి పేరు కూడా పోలీసులకు తెలియకపోవడం చర్చనీయాంశమైంది. పంగిడి, దేవరపల్లి ప్రాంతాల నుంచి క్వారీ లారీలు అడ్డూఅదుపు లేకుండా వేగంగా రాకపోకలు సాగిస్తుండడంతో ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుతున్నాయి. పోలీస్ అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. విద్యార్థి ఆత్మహత్య కొత్తవలస: విజయనగరం జిల్లా కొత్తవలస మండలం విజయనగరం రోడ్డులో ఉన్న డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి ముడికి వికాస్ (16) తీవ్రమైన తలనొప్పిని భరించలేక బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై సీఐ సీహెచ్ షణ్ముఖరావు కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన వికాస్ ఇక్కడి డిఫెన్స్ అకాడమీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్నాడు. కొద్ది నెలలుగా అతను తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నట్లు తండ్రి సుబ్రహ్మణ్యంతో పాటు తోటి విద్యార్థులు తెలిపారు. ఈ క్రమంలో బుధవారం మరోమారు తలనొప్పి రావడంతో కళాశాల సిబ్బంది వికాస్ తండ్రికి ఫోన్లో సమాచారం అందించారు. ఇంటికి పంపించేస్తామని తెలిపారు. ఇప్పుడు బయల్దేరితే ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుందని, మరుసటి రోజు పంపించాలని కళాశాల సిబ్బందిని మృతుడి తండ్రిని కోరాడు. తోటి విద్యార్థులు డ్రిల్ కోసం మైదానంలోకి వెళ్లగా.. హాస్టల్ రూమ్లో ఎవరూ లేని సమయంలో బెడ్షీట్తో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. తోటి విద్యార్థులు రూమ్కు వచ్చి చూసేసరికి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో వెంటనే కళాశాల సిబ్బంది సహాయంతో కిందకు దించి స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. పంట కాలువలో మహిళ మృతదేహం రాయవరం: స్థానిక దుర్గమ్మ తల్లి ఆలయం వద్ద పంట కాలువలో గురువారం సాయంత్రం గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు అక్కడకు వెళ్లి రాయవరం ఎస్సై డి.సురేష్బాబు పరిశీలించారు. ఆ మహిళ వయసు 60 నుంచి 65 ఏళ్లు, ఎత్తు సుమారు 5.2 అడుగులు ఉంటుందని తెలిపారు. ఆ మృతదేహం మహేంద్రవాడ నుంచి రాయవరం వెళ్లే పంట కాలువలో లభించింది. ఆమె ఆచూకీ ఎవరైనా గుర్తిస్తే 94409 04843 నంబరుకు తెలియజేయాలని ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని మండపేట ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. -
పునరుద్ధరించాలి
ఏటా రుణాలు సక్రమంగా చెల్లించడంతో బ్యాంకులు తిరిగి రుణాలివ్వడంతో పాటు, ప్రభుత్వం వడ్డీ రాయితీ కూడా సక్రమంగా అందించేది. కానీ, గత రెండేళ్లుగా రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నా వడ్డీ రాయితీ రావడం లేదు. బ్యాంకు అధికారులు ఒత్తిడి తెస్తూండటంతో మరో గత్యంతరం లేక వడ్డీ కూడా చెల్లిస్తున్నాం. రైతులకు ఉపయోగపడే పథకాల్లో కోతలు పెట్టడం ప్రభుత్వానికి తగదు. – కరక అప్పనాయుడు, రైతు, కేఈ చిన్నయ్యపాలెం,కోటనందూరు మండలం వెంటనే విడుదల చేయాలి ప్రభుత్వం వడ్డీ రాయితీ చెల్లిస్తుందని గత ఏడాది బ్యాంకులకు చెల్లించలేదు. ఇటీవల రుణం కోసం బ్యాంకుకు వెళ్తే ప్రభుత్వం వడ్డీ రాయితీ విడుదల చేయలేదని అక్కడి అధికారులు చెప్పి, గత ఏడాది తీసుకున్న రుణంపై వడ్డీ వసూలు చేశారు. అధికారంలోకి వస్తే రైతును రాజును చేస్తామని గొప్పలు చెప్పడం తప్ప, పథకాలకు నిధులు కేటాయించకుండా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోంది. వెంటనే వడ్డీ రాయితీ బకాయిలు విడుదల చేసి రైతులను ఆదుకోవాలి. – రావుల ప్రసాద్, కూరాడ, కరప మండలం -
‘నన్నయ’లో ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సెల్
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సెల్ని ఏర్పాటు చేశారు. దీనికి డైరెక్టరుగా ఆచార్య పి.సురేష్వర్మ, సభ్యులుగా ఆచార్య వై. శ్రీనివాసరావు, ఆచార్య డి.జ్యోతిర్మయి, ఆచార్య కె.రమణేశ్వరి, ఆచార్య బి.జగన్మోహన్రెడ్డి, డాక్టర్ టి.హైమావతి, ఎస్.లింగారెడ్డి, ఎన్.నాగేంద్రరావును నియమిస్తూ వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ ఆదేశాలు జారీ చేశారు. గురువారం నిర్వహించిన తొలి సమావేశంలో యూనివర్సిటీలో నాణ్యత ప్రమాణాలను పెంచడం ద్వారా ప్రస్తుతం ఉన్న నాక్ బి ప్లస్ గ్రేడ్ లో ఉన్నతిని పొందేందుకు అంతా కృషి చేయాలని వీసీ సూచించారు. జీఎన్ఎం పరీక్షలు ప్రారంభం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రభుత్వ సమగ్ర బోధనాసుపత్రిలో జీఎన్ఎం పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పీవీవీ.సత్యనారాయణ ఆ వివరాలను తెలిపారు. ఈ పరీక్షలు ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జిల్లాలోని సుమారు 20 ప్రైవేటు నర్సింగ్ కాలేజీలకు చెందిన దాదాపు 900 మంది నర్సింగ్ (ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల) విద్యార్థులు హాజరవుతున్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్కు ఎలాంటి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు. మహాలింగేశ్వరస్వామి ఆలయానికి రూ.11 లక్షల విరాళందేవరపల్లి: మండలంలోని గౌరీపట్నంలో స్వయంభుగా వెలసిన గౌరీ సమేత మహాలింగేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి గ్రామానికి చెందిన ఆండ్రు హరిచంద్ర ప్రసాదరావు, పూర్ణదంపతులు రూ.11,11,111 విరాళంగా అందజేశారు. విరాళాన్ని దేవస్థానం ట్రస్టు సభ్యులకు అందజేశారు. గతంలో ఈ విరాళంలో రూ.5 లక్షలు అందజేయగా, మిగిలిన మొత్తాన్ని ఇప్పుడు అందజేసినట్టు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. హరిచంద్ర ప్రసాదరావు దంపతులను ట్రస్ట్ సభ్యులు అభినందించారు. తత్కాల్లో 10వ తరగతి పరీక్ష ఫీజు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఇంకా ఫీజు చెల్లించని విద్యార్థులకు తత్కాల్ స్కీం ద్వారా అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి కే.వాసుదేవరావు గురువారం తెలిపారు. రూ.1,000 ఆలస్య రుసుముతో చెల్లించాలన్నారు. ఆయా స్కూల్స్ హెచ్ఎంలు అపరాధ రుసుముతో ఈ నెల 12వ తేదీలోగా చెల్లించాలన్నారు. పరీక్ష ఫీజు రుసుము తేదీ ఎట్టి పరిస్థితుల్లోను పొడిగించబోమన్నారు. -
బాబు మార్కు కర్కశం
శుక్రవారం శ్రీ 6 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026● అభాగ్యుల అవస్థలు పట్టించుకోని సర్కారు ● కలగానే కొత్త పింఛన్ల మంజూరు ● చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే తీరు ● కొత్త పింఛన్ల ఊసెత్తని సర్కారు ● 18 నెలలుగా తప్పని నిరీక్షణ ● జిల్లావ్యాప్తంగా 40,000కు పైగా ప్రజల దరఖాస్తులు ● గత వైఎస్సార్ సీపీ హయాంలో అర్హత ఉంటే మంజూరు ● జిల్లా వ్యాప్తంగా 2,71,344 పింఛన్లు సాక్షి, రాజమహేంద్రవరం: అభాగ్యులపై చంద్రబాబు ప్రభుత్వం ‘పచ్చ’పాతం చూపుతోంది. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక ఆసరా కల్పించే సామాజిక భద్రత పింఛన్ల మంజూరులోనూ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటుతున్నా.. స్పౌజ్ కోటా (భర్త చనిపోతే భార్యకు) మినహా ఒక్క కొత్త పింఛను మంజూరు చేసిన దాఖలాలు లేవు. మరోవైపు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు పోటెత్తుతున్నాయి. దరఖాస్తులు తీసుకోవడమే తప్ప.. ఎప్పుడు మంజూరు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతి వారం కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమానికి వెళ్లి అర్జీలు ఇవ్వడం.. వెనుదిరిగి రావడం మినహా చేసేది లేక మిన్నకుండిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేలకు పైగా లబ్ధిదారులు తమకు పింఛను మంజూరు చేయాలని ఎంపీడీఓ కార్యాలయాలు, గ్రీవెన్స్లో దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. వీరికి పింఛన్ ఎప్పుడు అందుతుందో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. స్పౌజ్ కోటాలో మాత్రమే మంజూరు వితంతు పింఛను మంజూరులో కూటమి సర్కారు కొత్త తరహా నిబంధనలు అమలు చేస్తోంది. 2023వ సంవత్సరం నవంబర్ నెల తర్వాత చనిపోయిన పింఛన్ లబ్ధిదారుల భార్యలకు మాత్రమే స్పౌజ్ కోటాలో పింఛన్లు అందజేసేందుకు నిర్ణయం తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు ఆరు వేల మందికి మాత్రమే మంజూరు చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే కొత్తగా వితంతు పింఛను కావాలంటూ వచ్చిన దరఖాస్తులు సుమారు ఎనిమిది వేలకు పైగా ఉన్నట్లు అంచనా. ప్రభుత్వ నిర్ణయంతో వీరంతా పింఛనుకు దూరమవుతున్నారు. భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వితంతువులను ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలు విధించి పట్టించుకోకుండా పోవడం ఎంత వరకూ సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని నిబంధన తీసుకురావడంపై మండిపడుతున్నారు. ఇదేం నిబంధనంటూ నిట్టూరుస్తున్నారు. ఇలాగైతే కొత్త పింఛన్లు అందుతాయా.? అన్న మీమాంస ప్రజల్లో నెలకొంది. ప్రధానంగా ఆ వర్గాలే టార్గెట్గా.. పింఛన్ల కోతలో ప్రధానంగా కొన్ని వర్గాలపై దృష్టి పెట్టింది. అనర్హతను గుర్తించే పనిలో డీఆర్డీఏ అధికారులు సర్వే నిర్వహించారు. ఒంటరి మహిళ, డప్పు కళాకారులు, వికలాంగులు, వృద్ధులు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, చర్మకారులు, అభయహస్తం పింఛన్లపై దృష్టి పెట్టి తొలగించారు. దివ్యాంగ పింఛన్లపై హైడ్రామా.. దివ్యాంగులపై చంద్రబాబు సర్కారు నిర్దయగా వ్యవహరించింది. వైకల్య శాతం తగ్గించేసి అనర్హత పేరుతో అడ్డగోలుగా పింఛన్లు తొలగించే ఎత్తుగడ వేసింది. కేవలం మంచానికే పరిమితమైనా.. మానసిక వికలాంగులుగా ఉన్నా.. కనీస కనికరం లేకుండా నోటికాడ కూడును లాగేయాలని చూసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 33,688 మంది దివ్యాంగ కేటగిరిలో ప్రతి నెలా పింఛన్లు పొందుతున్నారు. వారిలో 1,321 మంది వివిధ రకాల హెల్త్ పింఛన్లు (రూ.15 వేలు) తీసుకుంటున్నారు. మిగిలిన 32,367 మంది రూ.6 వేల పింఛను పొందుతున్నారు. పింఛన్ల తొలగింపులో భాగంగా 19,928 మందికి సంబంధించిన వైకల్య శాతం తిరిగి పరిశీలించారు. వారిలో 3,211 మందికి ప్రభుత్వ నిబంధనల మేరకు వైకల్య శాతం లేదని నిర్ధారించారు. వీరిని అనర్హులుగా గుర్తించి పింఛన్లు రద్దు చేసినట్లు ఆయా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నోటీసులు అందించారు. దీనిపై దివ్యాంగులు పెద్ద ఎత్తున పోరాటాలు చేపట్టారు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. వైఎస్సార్ సీపీ నేతలు ఉద్యమాల్లో పాల్గొని ప్రభుత్వ చర్యలను ఖండించారు. ప్రజా వ్యతిరేకతను చూసిన ప్రభుత్వం తొలగించకుండా తాత్కాలికంగా ఆపింది. గత ప్రభుత్వ హయాంలో.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అర్హతే ప్రామాణికంగా కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు. మధ్య వర్తులు, దళారులతో పనిలేకుండా దరఖాస్తు చేసుకున్న వెంటనే అందేవి. ఏటా జనవరి, జూలై నెలల్లో కొత్తవి అందజేసేవారు. రాజకీయాలకు అతీతంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే చాలు మంజూరయ్యేవి. గ్రామ, వార్డు వలంటీర్లు ఇళ్ల వద్దకే వెళ్లి అందజేసేవారు. జిల్లాలో ఇలా... ప్రతి నెలా జిల్లా వ్యాప్తంగా 2,71,344 పింఛన్లు అందజేస్తున్నారు. ఇందుకు ప్రతి నెలా రూ.118 కోట్లు చెల్లిస్తున్నారు. మండలం లబ్ధిదారులు రాజమహేంద్రవరం అర్బన్ 27,814రాజానగరం 15,301దేవరపల్లి 10,776నల్లజర్ల 11,291గోపాలపురం 8,912చాగల్లు 7,130నిడదవోలు 10,190కోరుకొండ 11,992పెరవలి 10,069రాజమహేంద్రవరం రూరల్ 19,745గోకవరం 10,280ఉండ్రాజవరం 10,180సీతానగరం 11,288మండపేట 11,60950 ఏళ్లకే పింఛన్ హామీ ఏమైందో..? తమ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే 50 ఏళ్లకే పింఛను మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు దాటుతున్నా.. ఆ హామీకి నేటికీ అతీగతి లేదు. అసలు ఇస్తారా..? లేదా..? అన్న విషయమై స్పష్టత కరవైంది. జిల్లా వ్యాప్తంగా 50 ఏళ్లు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలు సుమారు 2 లక్షల మంది ఉంటారు. వీరందరూ హామీ అమలు కోసం నిరీక్షిస్తున్నారు. ప్రణాళికాబద్ధంగా.. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అడ్డగోలుగా తొలగించేందుకు కూటమి ప్రభుత్వం సన్నద్ధమైంది. ఇందుకుగాను 50 రోజుల ప్రణాళికను అమలు చేసింది. కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని నమ్మబలుకుతూనే.. ఉన్న వాటిలో అనర్హతల పేరుతో అత్యధికంగా పింఛన్లు తీసివేసేంది. జిల్లా వ్యాప్తంగా 20 వేలకు పైగా పింఛన్లు తొలగించినట్టు సమాచారం. -
మహా శివరాత్రి ఏర్పాట్లపై సమీక్ష
● గుర్తించిన ఘాట్లలో మాత్రమే పుణ్యస్నానాలకు అనుమతి ● కలెక్టర్ కీర్తి ● ఎస్పీ డి నరసింహ కిశోర్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఈ నెల 15న జరిగే మహా శివరాత్రి సందర్భంగా భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా అధికారులు పని చేయాలని కలెక్టర్ కీర్తి అధికారులకు సూచించారు. గురువారం రాజమహేంద్రవరం కలెక్టరేట్లో మహా శివరాత్రి సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ కీర్తి, ఎస్పీ నరసింహ కిశోర్ అధ్యక్షతన సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ముఖ్యంగా రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్ల పరిధిలో గుర్తించిన ప్రధాన ఘాట్లలో మాత్రమే పుణ్యస్నానాలకు అనుమతి ఇవ్వాలన్నారు. అనధికార ఘాట్ల వద్ద భక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని కలెక్టర్ ఆదేశించారు. గతంలో చోటుచేసుకున్న దుర్ఘటనలను దృష్టిలో ఉంచుకుని మునిసిపల్, మండల అధికారులు టామ్టామ్, మైక్ల ద్వారా గ్రామాలు, వార్డుల్లో ఇప్పటి నుంచే విస్త్రత ప్రచారం చేపట్టాలని తెలిపారు. అన్నదానం, సేవా కార్యక్రమాలు నిర్వహించే సంస్థలతో ముందస్తు సమావేశాలు నిర్వహించి స్పష్టమైన మార్గదర్శకాలు అందించాలని సూచించారు. ఘాట్ల నిర్వహణ బాధ్యతలను శాఖల వారీగా స్పష్టంగా కేటాయించారు. మునిసిపల్ శాఖ పారిశుధ్యం, తాగునీరు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, లైటింగ్ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రెవెన్యూ శాఖ ఘాట్ల వద్ద క్రమబద్ధమైన నిర్వహణ, బారికేడింగ్, చెక్పోస్టుల ఏర్పాటు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎస్పీ డి.నరసింహ కిశోర్ మాట్లాడుతూ మహా శివరాత్రి సందర్భంగా అన్ని ఘాట్లు, దేవాలయాలు, రహదారుల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలు, డ్రోన్ పర్యవేక్షణ, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర మానిటరింగ్ చేపడతామని, గ్రామ స్థాయిలో విలేజ్ మానిటరింగ్ టీమ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్ జామ్లు తలెత్తకుండా ముందస్తు ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్, నో పార్కింగ్ జోన్లు, పార్కింగ్ ప్రాంతాల గుర్తింపు, సరైన లైటింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి, రాజమహేంద్రవరం ఇన్చార్జి ఆర్డీవో కె. భాస్కర్రెడ్డి, కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత , డీఎస్పీలు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
ప్రొటోకాల్ విస్మరించి అవమానించారు
కలెక్టర్కు ఫిర్యాదు చేస్తా : మున్సిపల్ చైర్పర్సన్ దుర్గారాణికపిలేశ్వరపురం (మండపేట): మండపేట పట్టణంలో విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవ శిలాఫలకంపై తన పేరుకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రొటోకాల్ను విస్మరించారని, తద్వారా తనను అవమానించారంటూ మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి ఆవేదన వ్యక్తం చేశారు. మండపేటలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ తనకు జరిగిన అవమానాన్ని, స్థానిక పరిస్థితులపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానన్నారు. పట్టణంలోని వాటర్ వర్క్స్ వద్ద నూనతంగా నిర్మించిన 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్ గురువారం రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆవిష్కరించిన శిలాఫలకంలో తన పేరును కింది భాగాన వేశారని, తమ నాయకుడు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పేరును అసలు వేయలేదని చైర్పర్స్న్ ఆవేదన వ్యక్తం చేశారు. 2007లో బిక్కిన కృష్ణార్జున చౌదరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సబ్ స్టేషన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినప్పటికీ మున్సిపల్ కౌన్సిల్లో టీడీపీ ప్రాధాన్యం ఉండటం వల్ల కొన్ని కారణాలు చెప్పి నిర్మాణం అంశాన్ని తిరస్కరించారని గుర్తు చేశారు. ప్రస్తుతం సబ్ స్టేషన్ నిర్మించటాన్ని స్వాగతిస్తున్నానని, కానీ తనతో సహా మరికొందరి ప్రజాప్రతినిధులను తక్కువ చేసేలా శిలాఫలకాన్ని రూపొందించడం సరికాదన్నారు. సబ్ స్టేషన్ స్థలం మున్సిపాలిటీ పరిధిలోనిదని, కౌన్సిల్లో తీర్మానం చేసి అప్పగించామని, రూ.18 లక్షలు సాధారణ నిధులతో స్థలాన్ని లెవెలింగ్ చేసి అప్పగించామన్నారు. మున్సిపల్ కౌన్సిల్ తరఫున సబ్ స్టేషన్ నిర్మాణానికి సహకరించామన్న విషయాన్ని కూడా విస్మరించడం సరికాదన్నారు. టిడ్కో గృహాలు అప్పగింత కార్యక్రమంలో మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ ఆవిష్కరించిన శిలాఫలకాల్లో కూడా తమ కౌన్సిలర్ల పేర్లు వేయకుండా అవమానించారన్నారు. తమను అవమానించే రీతిలో శిలాఫలకం ప్రొటోకాల్కు అనుమతి ఇచ్చిన జిల్లా రెవెన్యూ అధికారిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానన్నారు. ప్రొటోకాల్ విస్మరణ పట్ల ఎమ్మెల్యే జోగేశ్వరరావు తీరు బాధాకరమని చైర్పర్సన్ దుర్గారాణి ఎద్దేవా చేశారు. -
8న మెగా జాబ్ మేళా
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో ఉద్యోగ కల్పన లక్ష్యంగా రాజానగరం నియోజక వర్గంలో ఈ నెల 8వ తేదీ ఆదివారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కీర్తి అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో ఫిబ్రవరి 8న రాజానగరంలో నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. రాజానగరంలో వికాస – స్కిల్ డెవలప్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 60 ఎంఎన్సీల భాగస్వామ్యంతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అభ్యర్థులు ఆదివారం ఉదయం 9 గంటలకు రాజానగరంలోని జెడ్పీ హైస్కూల్కు అవసరమైన సర్టిఫికెట్ల జెరాక్స్లతో హాజరుకావాలని వికాస పీడీ కె.లచ్చారావు కోరారు. కోటసత్తెమ్మ తల్లికి వెండి పళ్లెం సమర్పణ నిడదవోలు రూరల్: మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో కొలువైన కోటసత్తెమ్మ తల్లికి చాగల్లు మండలం కలవలపల్లి వాస్తవ్యులు ఈదర శ్రీనివాసరావు, వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు వీరభద్ర అజయ్కుమార్, దీపిక సుష్మలు బుధవారం 1,212 గ్రాముల వెండి పళ్లెం, 523 గ్రాముల వెండి పాదుకులు అందజేసినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరిసూర్యప్రకాష్ తెలిపారు. అమ్మవారిని దాతల కుటుంబ సభ్యులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ప్రధాన అర్చకుడు అప్పారావు శర్మ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నేడు సత్యదేవుని హుండీల లెక్కింపు అన్నవరం: శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించనున్నారు. దేవస్థానంలో హండీ ఆదాయాన్ని చివరిసారిగా డిసెంబర్ 31న లెక్కించారు. దీంతో 35 రోజులలో భక్తులు సత్యదేవుని హుండీలలో సమర్పించిన కానుకలను గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి లెక్కించనున్నారు. దేవస్థానం సిబ్బంది అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఈఓ త్రినాథరావు ఆదేశించారు. తిరుమల ప్రతిష్టను పాడు చేసింది బాబు సర్కారే వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి అల్లవరం: చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూటమి నేతలు తిరుమల వేంకటేశ్వరుని ప్రతిష్టను దిగజారుస్తూనే ఉన్నారని వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జిన్నూరి రామారావు బుధవారం అన్నారు. మండలం డి.రావులపాలెంలోని ఆయన నివాసంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై కక్ష సాధించేందుకు చంద్రబాబు ప్రభుత్వం స్వామివారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని అబద్ధాన్ని ప్రచారం చేసి తిరుమల ప్రతిష్టకు భంగం కలిగించారన్నారు. లడ్డూలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ నిర్థారించినా చంద్రబాబు, కూటమి నేతలు హిందువుల మనోభావాలతో ఆటలాడుతున్నారని, వారిలో కొంచైమెనా పాశ్చాత్తాపం లేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన పాపాలను, తప్పులను కప్పి పుచ్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వైఎస్సార్ సీపీ నేతలపై దాడులను ప్రోత్సహిస్తున్నారన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి చేసిన వారిని వదిలేసి బాధితుడైన రాంబాబుపై కేసు నమోదు చేయడం అన్యాయమన్నారు. -
● నాడు రక్ష.. నేడు శిక్ష
● కళశ యాత్రజంతువుల నుంచి మొక్కలను కాపాడేందుకు వేసిన రక్షణ కవచం నేడు శాపంగా మారింది. కిర్లంపూడి వెలుగు కార్యాలయం ఆవరణలో నీడను, స్వచ్ఛమైన గాలి ఇచ్చేందుకు మొక్కలు నాటి వాటికి రక్షణకు ఇనుప చట్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మొక్కలు పెద్దవి కావడంతో నాడు రక్షణ కల్పించిన ఇనుప చట్రాలు మొక్క బెరడులోకి చొచ్చుకుపోతున్నాయి. వీటిని తొలగించకుంటే వాటి మనుగడకే ఇబ్బంది. –కిర్లంపూడి సన్నవిల్లి వద్ద పంట కాలువలో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలు పాతకొట్టాంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో వార్షిక కల్యాణ మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. వేలాది మంది మహిళలు సప్తనదీ పవిత్ర జలాల కలశాలను శిరస్సున ధరించి యాత్ర నిర్వహించారు. అనంతరం ఆ జలాలతో ఆలయాన్ని సంప్రోక్షణ చేశారు. తర్వాత విజయవాడకు చెందిన వేదపండితుడు ఘంటికోట సుబ్రహ్మణ్యశర్మ ఆధ్వర్యంలో సీతారామచంద్ర స్వామివారికి పూజలు, కల్యాణ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త యడ్ల చెల్లారావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. –కోటనందూరుఎటు చూసినా, ప్లాస్టిక్ వ్యర్థాలు జంతు కళేబరాలు చూసి పెంట కాలువ అనుకుంటే పొరపాటే.. ఉప్పలగుప్తం మండలం సన్నవిల్లి గ్రామంలో గొరగొనమూడి, కూనవరం టైల్ ఎండ్ పంట కాలువ దుస్థితి ఇది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగుకు నీరు అందించాల్సిన కాలువ ఇలా అధ్వానంగా తయారైంది. నిండా చెత్తా చెదారం, వ్యర్థాలతో మూసుకుపోయింది. సన్నవిల్లి పంచాయతీ పరిధి దుర్గమ్మ గుడి సమీపంలో ఇలా ఉండడంతో దుర్వాసన భరించలేకపోతున్నామని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. –ఉప్పలగుప్తం -
తావీదు చూపించి.. బంగారంతో ఉడాయించి
రాజవొమ్మంగి: తావీదు ఇస్తాం.. నీ సమస్యలన్నీ తీరిపోతాయని ఇద్దరు నమ్మించి బంగారం దోచుకెళ్లిన ఘటన రాజవొమ్మంగి మండలం కొమరాపురంలో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం... కొమరాపురం గ్రామానికి చెందిన కోసూరి లోవకుమారి రాజవొమ్మంగి వెళ్లేందుకు బయలు దేరింది. ఆ గ్రామంలో ఆటో కోసం ఎదురు చూస్తుంది. ఇంతలో మోటారు సైకిల్పై ఇద్దరు వచ్చి తాము లిఫ్ట్ ఇస్తామని చెప్పి ఎక్కించుకున్నారు. మార్గం మధ్యలో బండి ఆపి ‘నీ కుమార్తెకు ఆరోగ్యం బాగాలేదు, ఇంకా నీవు ఎన్నో కష్టాల్లో ఉన్నావు, తాము ఇచ్చే తావీదు కట్టుకుంటే కష్టాలన్నీ తీరిపోతాయని’ అని నమ్మించారు. ఆమె చేతిలో రాగి రేకు, తావీదు పెట్టి, ఆమె చెవి కమ్మలు తీసుకుని, వాటితో ఆమెకు దిష్టి తీస్తున్నట్లు నటించి అంతలోనే పరారయ్యారు. ఈ పరిణామానికి అవాక్కయిన లోవకుమారి తాను మోసపోయానని గ్రహించింది. దీనిపై జడ్డంగి స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై చినబాబు తెలిపారు. ఇటువంటి మోసాలు జరగకుంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి 12 మందికి గాయాలు శంఖవరం: కత్తిపూడి ఫ్లైవర్ బ్రిడ్జి కింద బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. అన్నవరం పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కత్తిపూడి బస్ కాంప్లెక్స్ సమీపంలో పిఠాపురం నుంచి రౌతులపూడి వెళ్తున్న టిప్పర్ను అన్నవరం నుంచి వస్తున్న ఆటో ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. యు.కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన 15 మంది కూలీలు ప్రత్తిపాడు మండలం ధర్మవరంలోని సరుగుడు తోట నరికేందుకు ఆటోలో వెళ్తున్నారు. కత్తిపూడి బస్ కాంప్లెక్స్ సమీపానికి వచ్చేసరికి మలుపులో టిప్పర్ను ఆటో ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలోని కొత్తపల్లి మండలం శ్రీరామపురానికి చెందిన పితాని కామరాజు (65) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రత్తిపాడు పీహెచ్సీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు తెలిపారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కళాశాల బస్సు అమలాపురం రూరల్: ఓ కళాశాల బస్సుకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. బుధవారం ఉదయం ఉప్పలగుప్తం మండలం నుంచి అమలాపురంలో ఓ కళాశాలకు విద్యార్థులతో బస్సు వెళ్తోంది. సమనస వైన్ షాప్ సమీపంలో ఆ బస్సు అదుపుతప్పి పంట కాలువ వైపు దూసుకుపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది. తీగలు తెగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులంతా క్షేమంగా బయట పడ్డారు. బస్సును నిర్లక్ష్యంగా నడిపినందుకు డ్రైవర్ లైసెన్స్ను, బస్సు పర్మిట్ను మూడు నెలలు సస్పెండ్ చేశామని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. డ్రైవర్ సెల్ఫోన్ మాట్లాడుతూ బస్సును వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలిందని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు త్వరలోనే పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలకు సమావేశాలు నిర్వహిస్తామని డీటీఓ చెప్పారు. -
పెద్దపులిని కూడా ప్రచారానికి వాడుకుంటున్నారు
● మేన్ ఈటర్గా మారితే బాధ్యులెవరు? ● వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా రాజానగరం: ఐదు రోజులుగా పెద్దపులి సంచారంతో ప్రలు వణికిపోతుంటే అధికార పార్టీ పెద్దలు మాత్రం దానిని పట్టుకోవడంలో శ్రద్ధ పెట్టకుండా ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆరోపించారు. రాజమహేంద్రవరం సిటీ, రూరల్, రాజానగరం మండలాలలో ప్రజలు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారని, రైతులు పొలాలకు వెళ్లడం లేదని, మూగ జీవాలు బలైపోతున్నాయని, అయినా ప్రభుత్వం పెద్దపులిని పట్టుకోలేకపోతోందన్నారు. అధికార పార్టీ పెద్దలు మాత్రం ఈ పులి సంచారాన్ని వీడియోలు తీసి, ప్రచారంగా వాడుకోవడం సిగ్గుచేటన్నారు. ఆధునిక సాంకేతికత అందుబాటులో ఉన్న ప్రస్తుత తరుణంలోనూ మీనమేషాలు లెక్కిస్తూ, పెద్దపులి జాడను కనిపెట్టలేని దుర్భర స్థితిలో పాలన ఉండడం విచారకరమన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. గతంలో కాకినాడ జిల్లా మెట్ట ప్రాంతంలో పులి సంచరించినప్పుడు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సూచనల మేరకు అధికారులు వెంటనే చర్యలు తీసుకున్న వైనాన్ని గుర్తు చేశారు. ఇకనైనా అటవీ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం అప్రమత్తమై యుద్ధ ప్రాతిపదికన పెద్దపులిని పట్టుకుని, అటవీ ప్రాంతంలో వదలిపెట్టే చర్యలు తీసుకోవాలన్నారు. -
అట్టహాసంగా హాకీ పోటీలు ప్రారంభం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): స్థానిక జిల్లా క్రీడా మైదానంలో కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొదటి కోకనాడ గోల్డ్ కప్ జాతీయ స్థాయి హాకీ పోటీలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి డీఎస్డీఓ వి.సతీష్ కుమార్, హాకీ మాజీ ఇండియన్ కెప్టెన్, పద్మశ్రీ ధనరాజ్ పిళ్లై, కోచ్ ద్రోణాచార్య అవార్డు గ్రహీత బల్వీర్ సింగ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ప్రీతమ్ శివాజ్, శాప్ డైరెక్టర్లు రవీంద్ర, జగదీశ్వరి, హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణక్యరాజ్, కార్యదర్శి హర్షవర్ధన్, అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి హాజరయ్యారు. శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ కాకినాడ డీఎస్ఏలో వచ్చే ఏడాది హాకీ అంతర్జాతీయ టోర్నీ నిర్వహణకు అవసరమైన సదుపాయాలు, గ్యాలరీ, టాయిలెట్స్, ఫ్లడ్లైట్లు వంటివి ఏర్పాటు చేస్తామన్నారు. ఒలింపియన్ ధనరాజ్ పిళ్లై మాట్లాడుతూ ఈ టోర్నీ వర్థమాన క్రీడాకారులకు స్ఫూర్తిని ఇఽస్తుందన్నారు. కాకినాడకు గతంలో ఒకసారి వచ్చానని, ఇక్కడ టోర్నమెంట్ ఏర్పాట్లు బాగున్నాయన్నారు. టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి రవిచంద్రప్రసాద్ మాట్లాడూ కోకనాడ గోల్డ్ కప్ హాకీ పోటీలకు దేశ వ్యాప్తంగా 24 పురుష, మహిళల జట్లు వచ్చాయన్నారు. ఈ నెల 14 వరకూ టోర్నీ జరుగుతుందన్నారు. జాతీయ జెండాను శాప్ చైర్మన్ రవినాయుడు, హాకీ ఆంఽధ్రప్రదేశ్ జెండాను ధనరాజ్ పిళ్లై, కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ జెండాను క్లబ్ అధ్యక్షుడు బాబ్జి ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు సూరిబాబు, ఇమ్మానుయేల్ రాజు, సురేష్రాజు, పరుశురాం, హరిబాబు, పీఈటీ సంఘ రాష్ట్ర మాజీ అద్యక్షుడు రవిరాజు, పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శి సుధారాణి, డీఎస్ఏ కోచ్లు సమీర్, సురేష్, అప్పలనాయుడు పాల్గొన్నారు. తొలిరోజు నాలుగు మ్యాచ్లు డీఎస్ఏ మైదానంలో ప్రారంభమైన కోకనాడ గోల్డ్ కప్ హాకీ పోటీల్లో భాగంగా తొలిరోజు నాలుగు మ్యాచ్లు జరిగాయి. మహిళల విభాగంలో ఎస్సీఓఈ భోపాల్, హర్యానా మధ్య జరిగిన మ్యాచ్లో హర్యానా జట్టు, ఎన్సీఓఈ సోనిపత్, బిలాయ్ స్టీల్ప్లాంట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఎన్సీఓఈ జట్టు విజయం సాధించాయి. యూనియన్ బ్యాంక్, గ్వాలియర్ ఎంపీ అకాడమీ జట్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. పురుషుల విభాగంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఆర్మీ మధ్య జరిగిన మ్యాచ్లో ఇండియన్ ఆర్మీ జట్టు విజయం సాధించిందని నిర్వాహకులు ప్రకటించారు. -
జాడలు సరే.. పులేది?
రాజమహేంద్రవరం రూరల్: ఐదు రోజులుగా జిల్లాలో పెద్దపులి సంచారం జిల్లా ప్రజలను వణికిస్తోంది. అటవీశాఖ అధికారుల అంచనాలను సైతం తారుమారు చేస్తూ ఇష్టారీతిన సంచరిస్తోంది. దీంతో అధికారులు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ పెద్దపులి చిక్కడం లేదు. మంగళవారం రాత్రి దివాన్చెరువు ఎస్వీపీసీ కల్యాణమండపం వద్ద ప్రత్యక్షమైన పులి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మీదుగా బీజాపురి టౌన్షిప్లోకి వెళ్లింది. బుధవారం ఉదయానికి చూస్తే రఘనాథపురంలో మామిడితోటల్లో నుంచి వెళ్లినట్లు ఉన్న ప్లగ్ మార్కులను అధికారులు గుర్తించారు. అక్కడ ఒక గేదె దూడపై దాడిచేయడంతో అది మృతి చెందింది. అక్కడ నుంచి శాటిలైట్ సిటీ అక్కమ్మతల్లి కొండపైకి వెళ్లినట్లు ప్లగ్మార్క్ల ద్వారా అటవీశాఖ అధికారులు గుర్తించారు. అక్కమ్మతల్లి కొండపై నుంచి కిందకు దిగిందా లేదా వెనుక నుంచి జీడిమామిడి తోటల్లోకి ఏమైన వెళ్లిందా అనే కోణాల్లో అటవీశాఖ అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. ఏది ఏమైనా బుధవారం రాత్రి పెద్దపులిని పట్టుకునేందుకు అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు నేతృత్వంలో జిల్లా అటవీశాఖ అధికారి ప్రభాకరరావు, అటవీ రేంజ్ అధికారి దావీదురాజు, సిబ్బంది అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ సందర్భంగా చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు మాట్లాడుతూ పెద్దపులి శాటిలైట్ సిటీలోని అక్కమ్మతల్లికొండపై ఉన్నట్లు గుర్తించామని, దానిని పట్టుకునేందుకు పూణే నుంచి ఒక బృందంతో పాటు, మొత్తం 12 బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదన్నారు. పోలీసులు, రెవెన్యూ, పంచాయతీ అధికారులు ప్రజలకు పెద్దపులి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారన్నారు. ఈ పులి తడోబా నుంచి ఛత్తీస్గఢ్, తెలంగాణ రాష్ట్రం పాల్వంచ మీదుగా ఏలూరు జిల్లా నుంచి మన జిల్లాలోకి వచ్చిందని ఆయన తెలిపారు. పులిని పట్టుకునేందుకు రాత్రి వేళల్లో ధర్మల్ కెమెరాలను వినియోగించినట్టు తెలిపారు. ఇప్పటికే బోన్లతో పాటు ట్రాప్ కెమెరాలను సైతం ఏర్పాటు చేశామన్నారు. పులి సంచరించిన స్థలాన్ని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సందర్శించి ప్రజలకు సూచనలిచ్చారని తెలిపారు. బొమ్మూరు ఇన్స్పెక్టర్ కాశీ విశ్వనాథం, తహసీల్దార్ బి.శ్రీనివాస్, ఎంపీడీవో ఆర్మ్స్ట్రాంగ్, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శి, ఎస్సైలు, సిబ్బంది అటవీశాఖ అధికారులకు పూర్తి సహకారం అందిస్తున్నారు. అక్కమ్మతల్లి కొండవద్ద పరిశీలిస్తున్న ఫారెస్టు చీఫ్ కన్జర్వేటర్ చలపతిరావు అక్కమ్మతల్లికొండ వద్ద ఏర్పాటు చేసేందుకు తీసుకువచ్చిన బోను ఆందోళన చెందుతున్న రాజమహేంద్రవరం ప్రజలు పాద ముద్రలు తప్ప పులిని పట్టుకోలేకపోతున్న అధికారులు తాజాగా శాటిలైట్ సిటీ అక్కమ్మతల్లి కొండపై ఉన్నట్టు గుర్తింపు పూణే నుంచి నిపుణులతో పాటు 20 బృందాల ఏర్పాటు జనావాసాల్లోకి వెళ్తే పెను ప్రమాదం మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్రాజానగరం/రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలలో ఐదు రోజులుగా ప్రజలను వణికిస్తున్న పెద్దపులి ప్రస్తుతం శాటిలైట్ సిటీకి సమీపంలో ఉన్న అమ్మతల్లి కొండపై ఉందని, అదిగానీ కొండ దిగి జనావాసాలలోకి వెళ్తే పెను ప్రమాదం ఉంటుందని మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే అధికార యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బుధవారం అమ్మ తల్లి గుడి ప్రాంతాన్ని సందర్శించిన ఆయన అక్కడ విధులు నిర్వర్తిస్తున్న అటవీ శాఖ, పోలీసు సిబ్బందితో పెద్దపులి సంచారంపై ఆరా తీశారు. పులి అడుగు జాడలను పరిశీలించారు. ప్రాణ నష్టం వాటిల్లకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అయితే పులిని పట్టుకోవడానికి ఆధునిక పరికరాలు అందుబాటులో లేవని అటవీ శాఖ అధికారులు అనడం విచారకరమన్నారు. -
చితికిన బతుకులు
● లారీ ఢీకొని ఇద్దరు మృతి ● వీధిన పడిన కుటుంబాలు తాళ్లపూడి/ దేవరపల్లి: బతుకులు చితికిపోయాయి.. ఆ కుటుంబాలు పెద్దలను కోల్పోయి వీధిన పడ్డాయి.. లారీ మృత్యువై వెంటాడి అనంత లోకాలకు దూసుకుపోయింది.. కొవ్వూరు– రాజమహేంద్రవరం గామన్ బ్రిడ్జిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవరపల్లి మండలం దుద్దుకూరుకు చెందిన ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. పట్టణ సీఐ విశ్వం, పోలీసుల కథనం ప్రకారం.. దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన వెలగన కోట సత్యనారాయణ (40), తాతపూడి చిన్న సుబ్బారావు (36)లు లోడింగ్ ట్రాక్టర్లపై డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఆ ట్రాక్టర్లు కోరుకొండలో ఉండడంతో డ్యూటీ ఎక్కడానికి ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి బయలు దేరారు. ఈ నేపథ్యంలో వారు కొవ్వూరులోకి గామన్ బ్రిడ్జిపై నుంచి మోటార్ సైకిల్పై వెళ్తున్నారు. ఈ సమయంలో వారి మోటారు సైకిల్ను లారీ ఢీకొంది. వారు లారీ వెనక చక్రాల కింద పడ్డారు. కోట సత్యనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా, చిన సుబ్బారావును ఆసుపత్రి తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడు. మృతుల శరీర భాగాలు నుజ్జునుజ్జు కావడంతో భయానక వాతావరణం నెలకొంది. మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువుల రోదనలతో ఆసుపత్రి వద్ద హృదయవిదారక వాతావరణం నెలకొంది. దుద్దుకూరులో విషాద ఛాయలు ఈ ఘటనతో దుద్దుకూరు గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. అందరితో మంచిగా ఉంటూ, ఆప్యాయతగా పలకరించే కోట సత్యనారాయణ, చిన సుబ్బారావు(40) మృతితో గ్రామస్తులు విషాదంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి బయలు దేరి వెళ్లిన కొద్దిసేపటికే ఇద్దరూ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. చిన సుబ్బారావుకు తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రదీప్, 4వ తరగతి చదువుతున్న కుమార్తె సంజన ఉండగా, కోల సత్యనారాయణకు 15 ఏళ్ల కుమారుడు చైతన్య, 6వ తరగతి చదువుతున్న కుమార్తె మౌనిక ఉన్నారు. పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి వెళ్లారు. ప్రమాదానికి కారణమదేనా! కొద్దిరోజులుగా గామన్ బ్రిడ్జిపై మరమ్మతులు చేస్తున్నారు. ఒకవైపు దారిలోనే ఇరుపక్కల వాహనాలను పంపుతున్నారు. ఇక్కడ సరైన పర్యవేక్షణ లేక తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. బుధవారం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించడానికి కూడా ఇదే కారణమని బాధిత కుటుంబ సభ్యులు వాపోతున్నారు. నిత్యం భారీ వాహనాల సంచారంతో రద్దీగా ఉండే ఈ రోడ్డులో వాహనాల వేగానికి కూడా కళ్లెం లేకపోయింది. ఇప్పటికై నా పోలీసు అధికారులు సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
ఉత్సాహంగా పరుగు పోటీలు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో ఇంటర్ కాలేజియేట్ క్రాస్ కంట్రీ చాంపియన్షిప్ పోటీల్లో భాగంగా బుధవారం 10 కిలోమీటర్ల పరుగు పోటీలు నిర్వహించారు. రాజానగరంలోని సాయిబాబా గుడి నుంచి కానవరం వెళ్లి తిరిగి వచ్చే విధంగా జరిగిన ఈ పోటీలను స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ, రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి ప్రారంభించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని అనుబంధ కళాశాలల నుంచి 40 మంది పురుషులు, 30 మంది మహిళలు హాజరయ్యారు. పురుషుల విభాగంలో నిర్ణీత సమయంలో లక్ష్యాన్ని చేరుకున్న కె.హేమంత్ (రాజమహేంద్రవరం) ప్రథమ స్థానం, జె.సతీష్ (గోపన్నపాలెం) ద్వితీయ, ఇ.సురేష్రెడ్డి (రాజమహేంద్రవరం) తృతీయ స్థానం దక్కించుకున్నారు. వీరితోపాటు కె.మణికంఠ, ఎం.లీలాగణేష్, సీహెచ్ మల్లికార్జునలను యూనివర్సిటీ టీమ్గా ఎంపిక చేశారు. మహర్షి దయానంద యూనివర్సిటీ (రోహ్తక్)లో ఈ నెల 15న జరిగే ఆల్ ఇండియా క్రాస్ కంట్రీ పోటీల్లో వీరు పాల్గొంటారని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుబ్బారావు తెలిపారు. అలాగే మహిళా విభాగంలో బి.అర్చన (భీమవరం) ప్రథమ, టి.సురేఖరత్నం (రాజమహేంద్రవరం), సీహెచ్ అనితలు ద్వితీయ, తృతీయ స్థానాలు పొందారు. యూనివర్సిటీలో టీమ్లో ఈ ముగ్గురితో పాటు కె.కల్యాణి, ఎ.విజయ, టి.ఉదయలక్ష్మి ఎంపికయ్యారు. కర్ణాటక మంగుళూరులోని యూనివర్సిటీలో 27న జరిగే ఆల్ ఇండియా క్రాస్ కంట్రీ పోటీల్లో దీరు పాల్గొంటారని డాక్టర్ సుబ్బారావు తెలిపారు. -
పాదగయ పిలుస్తోంది
● మహా శివరాత్రికి ఏర్పాట్లు ● సిద్ధమవుతున్న పుష్కరిణి ● 13 నుంచి ఉత్సవాలు ఆరంభం పిఠాపురం: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రం భక్తులను రా రమ్మని పిలుస్తోంది.. మహా శివరాత్రి ఉత్సవాలకు ఇప్పటి నుంచే ముస్తాబవుతోంది.. ఈ నెల 13న శివరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. శివరాత్రి మహాత్సవాలను కన్నుల పండువగా నిర్వహించడానికి సర్వం సిద్ధమవుతోంది. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని పాదగయ క్షేత్రాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నారు. ఉత్సవాల ప్రారంభం నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉండడంతో ప్రత్యేక పూజలు అభిషేకాలు, అర్చనలు, కుంకుమ పూజలకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ప్రఖ్యాత శైవ క్షేత్రాల్లో పాదగయ క్షేత్రం ప్రాధాన్యం కలిగి ఉంది. మహా శివరాత్రి పర్వదినాల్లో ఈ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ ఉత్సవాలు పురస్కరించుకుని వారం రోజుల పాటు నిత్యం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ప్రత్యేక లక్షపత్రి పూజలు, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించనున్నారు. త్రిగయా క్షేత్రాల్లో పిఠాపురంలో వేంచేసియున్న పాదగయ క్షేత్రం అత్యంత ప్రాచీన దివ్య శైవ క్షేత్రం. పుణ్యస్నానంతో పునీతం పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానం చేస్తే పునీతం అవుతారని భక్తుల విశ్వాసం. అందుకే ఏటా వేలాది మంది భక్తులు వచ్చి ఈ పుష్కరిణిలో స్నానాలు ఆచరిస్తుంటారు. మహా శివరాత్రి ఉత్సవాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన ఈ పుణ్య స్నానాలకు పుష్కరిణిని సిద్ధం చేస్తున్నారు. ఇటీవల అందులో పాత నీరు తొలగించిన అఽధికారులు పూర్తిగా శుభ్రం చేసి మరమ్మతులు నిర్వహిస్తున్నారు. కొత్త నీటితో నింపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువ మంది భక్తులు ఒకేసారి పుణ్య స్నానాలు ఆచరించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ అధికారులు వివరిస్తున్నారు. 13న కుక్కుటేశ్వరుని కల్యాణం పాదగయ క్షేత్రంలో రాజరాజేశ్వరీ సమేత ఉమా కుక్కుటేశ్వరస్వామివారి దివ్య కల్యాణం ఈ నెల 13న రాత్రి 8.32 గంటలకు నిర్వహించనుండగా, 14న స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు జరుపనున్నారు. 15వ తేదీ మహా శివరాత్రి ఉత్సవం, 16న మధ్యాహ్నం 3 గంటలకు నాకబలి, దండాడింపు, దొంగలదోపు ఉత్సవాలు, స్వామివారి రథోత్సవం, 18న స్వామివారి త్రిశూల స్నానం, తెప్పోత్సవం, శ్రీపుష్పోత్సవం నిర్వహించనున్నారు. ప్రపంచ స్థాయిలో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం పాదగయ క్షేత్రంతో పాటు సకలేశ్వరస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలతో పాటు గొల్లప్రోలు మండలం దుర్గాడలోని ఉమారామలింగేశ్వరస్వామి, గొల్లప్రోలులో ప్రసిద్ధి చెందిన ఉమారామలింగేశ్వరస్వామి, చేబ్రోలులో పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి, తాటిపర్తిలో అపర్ణాసమేత నాగేశ్వరస్వామివారి ఆలయాల్లోనూ ఉత్సవాలు జరుగనున్నాయి. భారీ ఏర్పాట్లు చేస్తున్నాం ఈ ఏడాది మహా శివరాత్రి ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లా కలెక్టర్, ఎస్పీ, దేవదాయ శాఖ ఉన్నతాధికారుల తదితరులు ఇప్పటికే పలు సూచనలు చేశారు. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నాం. వచ్చే భక్తుల సౌకర్యార్థం మౌలిక వసతులపై దృష్టి పెట్టాం. అందరికీ స్వామివారి దర్శనభాగ్యం కల్పిస్తాం. అంతా పుణ్యస్నానాలు ఆచరించే విధంగా పాదగయ పుష్కరిణిని సిద్ధం చేస్తున్నాం. తగిన విధంగా క్యూలైన్లు నిర్మిస్తాం. –కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, పాదగయ ఈఓ, పిఠాపురం -
సైనిక సంక్షేమ నిధికి రూ.5.85 లక్షల విరాళం
సీటీఆర్ఐ: జిల్లా సైనిక సంక్షేమ నిధికి జిల్లాలోని 2 మున్సిపాలిటీలు, ఒక నగర పాలక సంస్థ పరిధిలోని మెప్మా స్వయం సహాయక సంఘాల మహిళలు తమ వంతు రూ.5,85,288 విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కీర్తి చేకూరికి ఆ మొత్తం చెక్కును అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మెప్మా మహిళలు రూ.10 చొప్పున స్వచ్ఛందంగా విరాళం అందించి దేశ రక్షణ కోసం విధులు నిర్వహిస్తున్న సైనికుల సంక్షేమానికి తమ మద్దతు తెలియజేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సైనిక సంక్షేమ నిధికి విశేష సహకారం అందించిన మెప్మా పీడీ టి.కనకరాజు, మెప్మా జిల్లా సమాఖ్య సభ్యులు, సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలను కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు ఎస్.బాల సరస్వతి, జిల్లా సిబ్బంది పి.శ్రీదేవి, ఎంఈ ఫణి కుమార్, ఎస్హెచ్జీ మహిళలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
సైబర్ మోసాల నివారణకు చర్యలు
అమలాపురం రూరల్: ఇటీవల కాలంలో జరుగుతున్న సైబర్ మోసాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ తెలిపారు. అమలాపురం రూరల్ సీఐ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ మీనాతో కలసి బుధవారం ఆయన తనిఖీ చేశారు. అక్కడ ఫొటో ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ఇటీవల కాలంలో సీబీఐ డిజిటల్ అరెస్టుల పేరుతో జరిగే సైబర్ మోసాలు తగ్గినట్లు తెలిపారు. దీనిలో ఓ ముఠాను అరెస్టు చేశామని అన్నారు. ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులను లక్ష్యంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని, వీటిపై బ్యాంకు అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి డిపాజిట్లు విత్ డ్రాల్లో జాగ్రత్తలు పాటించాలని ఆదేశించామని అన్నారు. అయినవిల్లి: వార్షిక తనిఖీల్లో భాగంగా అయినవిల్లి పోలీస్ స్టేషన్లో రికార్డులను ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ పరిశీలించారు. ఇటీవల సంక్రాంతి సంబరాలు, ప్రభల ఉత్సవాలు, అంతర్వేది నరసన్న తీర్థ మహోత్సవాలు ప్రశాంతంగా జరిగే విధంగా పోలీసు బందోబస్తు నిర్వహించారన్నారు. శివరాత్రి మహోత్సవాల్లో వివాదాలకు తావులేకుండా ఇప్పటికే పోలీసు శాఖ అప్రమత్తమైందన్నారు. అభ్యంతరం లేని పోస్టులు మాత్రమే సోషల్ మీడియాలో పెట్టాలన్నారు. ఈ పోస్టుల కారణంగా ఏ వివాదం జరిగినా నిందితులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామన్నారు. -
ఆ మందులను అధికారులు సిఫారసు చేయలేదు
● దెబ్బతిన్న పొగాకు తోటలను పరిశీలించిన అధికారులు ● దుకాణంలో మందుల నిల్వ సీజ్ చేసి నమూనాలు ల్యాబ్కు తరలింపుదేవరపల్లి: గోపాలపురం మండలం వెదుళ్లకుంట, వాదాలకుంట గ్రామాల్లో దెబ్బతిన్న వర్జీనియా పొగాకు తోటలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. తోటలకు వాడిన మందులు, పంట నష్టం గురించి రైతులతో చర్చించారు. ‘దిగుబడి ఆశలు గల్లంతు’ శీర్షికన సాక్షిలో బుధవారం ప్రచురితమైన కథనానికి వ్యవసాయ శాఖ అధికారులు స్పందించారు. కొవ్వూరు డివిజన్ వ్యవసాయ శాఖ అధికారి సీహెచ్ శ్రీనివాస్, మండల వ్యవసాయాధికారి కూచిపూడి ఏసుబాబు రెండు గ్రామాల్లో దెబ్బతిన్న పొగాకు తోటలను పరిశీలించారు. పొగాకు మొక్క పిలక నివారణకు రైతులు వాడిన మందుల వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా డివిజన్ వ్యవసాయాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులు వాడిన మందుల నమూనాలను తీసి ల్యాబ్కు పంపామని, ల్యాబ్ నుంచి రిపోర్టు రావాల్సి ఉందని తెలిపారు. మందుల్లో తేడాలు ఉన్నట్టు నివేదికలో తేలితే డీలర్, ఉత్పత్తి సంస్థపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి రైతులు వాడిన బ్యాచ్కు చెందిన మందుల నిల్వను దుకాణం నుంచి సీజ్ చేసినట్టు ఆయన తెలిపారు. రైతులు వాడినట్టు చెపుతున్న మందులను వ్యవసాయ శాఖ, సీటీఆర్ఐ, ఐటీసీ శాస్త్రవేత్తలు, టుబాకో బోర్డు అధికారులు సిఫారసు చేయలేదన్నారు. రైతులే సొంత నిర్ణయంతో మందులు తెచ్చుకుని వాడారని ఆయన వివరించారు. పిలక నివారణకు వాడకూడని మందులు వాడినందున తోటలు దెబ్బతిన్నట్టు ఆయన తెలిపారు. -
వణికిస్తున్న పెద్ద పులి
ఫ బీజాపురి లేఅవుట్ పరిసరాల్లో ప్రత్యక్షంఫ అంతకు ముందు కోలమూరు, గాడాల, గామన్ బ్రిడ్జి రోడ్డు సమీపంలో సంచారం రాజానగరం/రాజమహేంద్రవరం రూరల్: పెద్ద పులి గడియకో రూటు మార్చుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. రాజమహేంద్రవరం రూరల్ మండల పరిసరాలతో పాటు వాటికి సమీపంలో ఉన్న కోరుకొండ, సీతానగరం మండలాల గ్రామాల్లో ప్రజలు రకరకాల ప్రచారాలతో వణికిపోతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న రాజానగరం మండలం పాలచర్ల వైపు నుంచి ఆటోనగర్ వైపునకు పులి వచ్చిందని కొందరు తెలిపారు. 2024 ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబరు మొదటి వారం వరకు 13 రోజుల పాటు చిరుత పులి సంచారంతో గజగజలాడిన ఈ ప్రాంత వాసులు.. ఇప్పుడు పెద్ద పులి వచ్చిందనే వార్తతో భయపడిపోతున్నారు. ఆటోనగర్ నుంచి దివాన్ చెరువు జీరో పాయింట్ వద్ద ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూలు గోడ దాటుకుని, గామన్ బ్రిడ్జి రోడ్డులోని జీడిమామిడి తోటల్లోకి వెళ్లిపోయిందని కొందరు వ్యక్తులు చెప్పడంతో పాటు వీడియోలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అనంతరం బీజాపురి లేఅవుట్ పరిసరాలకు వెళ్లిపోయిందని సమాచారం. రెండు రోజులుగా.. తొర్రేడు, వెంకటనగరం గ్రామాల్లో రెండు రోజులుగా సంచరించిన పెద్ద పులి కోలమూరు, కోరుకొండ మండలం గాడాల గ్రామాల మధ్యలో తిరిగినట్టు మంగళవారం ఉదయం అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అయితే దాని దాడిలో పశువులు చనిపోయినట్లు ఎటువంటి సమా చారమూ లేదు. కోలమూరు, గాడాల గ్రామాల వ్యవసాయ భూముల్లో పులి తిరిగినట్టు పగ్ మార్కులను జిల్లా అటవీశాఖ అధికారి ప్రభాకరరావు, అటవీ రేంజ్ ఆఫీసర్ దావీదురాజు గుర్తించారు. దీంతో వారితో పాటు రెవెన్యూ, పోలీసు అధికారులు ఆయా ప్రదేశాలలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. పగ్మార్క్ ప్రాంతాల సమీపంలో డ్రోన్లు,బోనులు,ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అప్రమత్తంగా ఉండాలి జిల్లా అటవీశాఖ అధికారి ప్ర భాకరరావు మాట్లాడుతూ గ్రామస్తులు రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. పశువులను ఇళ్ల వద్ద జాగ్రత్తగా ఉంచుకోవాలని, ప్రకాశవంతమైన లైట్లు ఉంచాలని, జంతువును మళ్లించడానికి శబ్దాలు చేయాలన్నా రు. గాడాల నుంచి సుమారు 15 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. -
నేటి నుంచి జాతీయ గోల్డ్కప్ హాకీ పోటీలు
ఫ ఈ నెల 14 వరకూ నిర్వహణ ఫ దేశవ్యాప్తంగా తరలిరానున్న 24 జట్లు ఫ పూర్తయిన ఏర్పాట్లు ఫ టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి రవిచంద్ర నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం నుంచి కాకినాడ డీఎస్ఏ మైదానంలోని యాస్ట్రో టర్ఫ్ హాకీ మైదానంలో నిర్వహించనున్న కోకనాడ గోల్డ్కప్ జాతీయ స్థాయి పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి కె.రవిచంద్ర ప్రసాద్ మంగళవారం ఈ విషయం తెలిపారు. డీఎస్ఏ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హాకీ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్లో 13 పురుషుల జట్లు, 8 మహిళల జట్లు పాల్గొంటున్నాయన్నారు. వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసే క్రీడాకారులకు భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తున్నామని, పోటీలను శాప్ చైర్మన్ రవి నాయుడు ప్రారంభిస్తారని తెలిపారు. చక్కని వేదిక ద్రోణాచార్య అవార్డు గ్రహిత, భారత జట్టు మాజీ కెప్టెన్ ప్రీతిమ్ శివాజ్ మాట్లాడుతూ పూర్వ క్రీడాకారులందరూ కలుసుకోవడానికి ఈ పోటీలు చక్కని వేదిక అన్నారు. టోర్నమెంట్ నిర్వాహకుడు రవిచంద్రను ఆమె అభినందించారు. అడిషనల్ డీఎస్పీ లక్ష్మీపతి మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీలు కాకినాడ వేదికగా జరగడం ఆనందంగా ఉందన్నారు. ఏపీ హాకీ సంఘ సంయుక్త కార్యదర్శి వి.రవి రాజు, డీఎస్డీఓ వి.సతీష్ కుమార్, డీఎస్ఏ హాకీ కోచ్ నాగేంద్ర, కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ప్రతినిధులు బాబ్జీ, వినయ్, సూరిబాబు, హరిబాబు, పరశురాం, ఇండియన్ గోల్ కీపర్ రమ్య, సత్యగౌరి, నాగమణి, ఎస్జీఎఫ్ఐ కార్యదర్శి సుధారాణి తదితరులు పాల్గొన్నారు. -
అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్తపై ఫిర్యాదు
రాజోలు: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజోలుకు చెందిన టీడీపీ కార్యకర్త నార్కెడమిల్లి కనకరాజుపై వైఎస్సార్ సీపీ నాయకులు మంగళవారం రాజోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజోలు నియోజకవర్గంలోని రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కనకరాజు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను నరికివేస్తానంటూ హెచ్చరికలు జారీ చేసిన కనకరాజుపై చర్యలు తీసుకోవాలని రాజోలు సీఐ నరేష్ కుమార్కు విజ్ఞప్తి చేశారు. అనంతరం రాజోలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి పాటి శివకుమార్ మాట్లాడుతూ కూటమి పాలనలో అన్ని వర్గాలపై దాడులు పెరిగిపోయాయని, కూటమి ప్రభుత్వ లోపాలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారింద న్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని పూర్తిగా విస్మరించి రాక్షస పాలన సాగిస్తున్నారని విమర్శించారు. పార్టీ మండల అధ్యక్షుడు కట్టా శ్రీనివాసరావు, సర్పంచ్ రేవు జ్యోతి, గ్రామ శాఖ అధ్యక్షుడు అడబాల జానకిరామ్, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి నేతల నాని, నియోజకవర్గ అధ్యక్షుడు గుర్రం జాషువా, ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొల్లాబత్తుల సతీష్ ,ఎంపీటీసీ చెల్లింగి లక్ష్మీఈశ్వరి, గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి బొడ్డపల్లి ప్రసాద్, కొల్లాబత్తుల శ్రీను, జిల్లెళ్ల వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
పొగాకు రైతుల నడ్డి విరిచిన కేంద్ర బడ్జెట్
ఫ రైతుల మొరను ఆలకించని వైనం ఫ అక్రమ సిగరెట్లను ప్రోత్సహించేలా రూపకల్పన ఫ జీఎస్టీని తక్షణం తగ్గించాలి ఫ వర్జీనియా పొగాకు రైతుల ఆవేదన దేవరపల్లి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తమ నడ్డి విరిచిందని వర్జీనియా పొగాకు రైతులు విమర్శించారు. దేవరపల్లి పొగాకు వేలం కేంద్రం వద్ద మంగళవారం సాయంత్రం రైతు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర బడ్జెట్పై అసంతృప్తి వ్యక్తం చేశారు. పొగాకు ఉత్పత్తులపై 28 శాతం ఉన్న జీఎస్టీని 40 శాతానికి పెంచడం వల్ల పరోక్షంగా పొగాకు రైతులపై ప్రభావం పడుతుందన్నారు. ఎకై ్సజ్ సుంకం, జీఎస్టీ పెంచడం వల్ల విదేశీ (నాన్ టాక్స్బుల్) సిగరెట్లకు మార్కెట్లో డిమాండ్ ఏర్పడి, స్వదేశీ సిగరెట్ల వినియోగం పడిపోతుందన్నారు. పెంచిన జీఎస్టీని తగ్గించాలని ఇటీవల రాజమహేంద్రవరం ఎంపీ పురందేశ్వరి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతు సంఘాల ప్రతినిధుల బృందం ఢిల్లీలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి వినతిపత్రం అందజేశామన్నారు. బడ్జెట్లో రైతులకు న్యాయం జరుగుతుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినప్పటికీ అమలు కాలేదన్నారు. పండించిన పొగాకులో 40 శాతం స్వదేశీ సిగరెట్ల తయారీకి, 60 శాతం ఎగుమతులు జరుగుతున్నాయని, ముడిసరుకు పొగాకుపై పన్ను తగ్గించినప్పటికి రైతులకు ప్రయోజనం లేదన్నారు. జీఎస్టీ పెరగడం వల్ల పొగాకు రైతులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ప్రయోజనం శూన్యం వేలం కేంద్రం రైతు సంఘం అధ్యక్షుడు కరుటూరి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల మొరను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అక్రమ సిగరెట్ల వినియోగం తగ్గించాలంటే స్వదేశీ సిగరెట్లపై జీఎస్టీ తగ్గించాలన్నారు. ముడి సరుకుపై పన్ను తగ్గించడం వల్ల రైతులకు ప్రయోజనం లేదని తెలిపారు. వర్జీనియా పొగాకు ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షుడు కాట్రు సత్యనారాయణ మాట్లాడుతూ జీఎస్టీ పెంచడం వల్ల సిగరెట్ పెట్టైపె రూ.50 నుంచి రూ.100 ధర పెరుగుతుందన్నారు. దీని ప్రభావం పొగాకు ఉత్పత్తి దారులపై తీవ్రంగా ఉంటుందని ఆయన తెలిపారు. రైతు సంఘం ప్రతినిధి యాగంటి సాయిబాబు మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తులపై పెంచిన జీఎస్టీని తక్షణం తగ్గించి రైతులు, రైతు కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో జీఎస్టీ ని ఇన్వాయిస్పై వసూలు చేసేవారని, ఇప్పుడు ఎమ్మార్పీఎస్ ధరపై వసూలు చేస్తున్నా రని ఆయన తెలిపారు. కొత్తగా తీసుకు వచ్చిన పన్ను ల విధానం వల్ల అక్రమ సిగరెట్ల వాటా భారీగా పెరుగుతుందని, ఇప్పటికే పన్ను కట్టని అక్రమ సిగరెట్ల వాటా 26 శాతం ఉన్నట్టు రైతులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతుల గోడును వినిపించుకుని, పెంచిన జీఎస్టీని తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమా వేశంలో రైతు సంఘాల ప్రతినిధులు సుంకవల్లి శ్రీనివాస్, సింహాద్రి ధర్మావతారం, కరుటూరి శ్రీనివాసరావు, ఈలపోలు చిన్ని పాల్గొన్నారు. -
ఆదమరిస్తే అంతా కాలీ
కుళ్లు తెగులు నారుమడి నుంచి ప్రారంభమై.. నాటిన తోటలోనూ ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది. ఆకుల అంచుల నుంచి పసుపు రంగుకు మారి ఈనెలు నల్లబడి కాండం కుళ్లిపోతుంది. ఈ తెగులు అధికంగా ఉంటే పువ్వును కూడా ఆశించి అది కూడా కుళ్లిపోతుంది. నివారణ చర్యలు ఈ తెగులు ఆశించిన తోట పూర్తి అయిన తరువాత మరలా ఇదే పంటను వేయకూడదు. పంట మార్పిడి తప్పని సరిగా చేయాలి. ఈ తెగులు ఆశించనట్లు గుర్తించిన వెంటనే కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి మూడు గ్రాముల చొప్పన కలిపి మొక్క అంతా తడిచేలా పిచికారీ చేయాలి. ఇలా చేయటం వల్ల తెగులును కొంతవరకూ నివారించవచ్చు ఫ కాలీఫ్లవర్ పంటపై తెగుళ్ల దాడి ఫ సస్యరక్షణ చేపట్టకుంటే నష్టమే ఫ రైతులకు అవగాహన కల్పిస్తున్న ఉద్యాన అధికారులు ఫ జిల్లాలో 425 ఎకరాల్లో సాగు పెరవలి: వాతావరణంలో వచ్చిన మార్పులతో కాలీఫ్లవర్ పంటను తెగుళ్లు ఆశిస్తున్నాయి. ఎండ, మంచు ప్రభావంతో తెగుళ్ల ఉధృతి అధికంగా ఉంటోంది. జిల్లాలో కూరగాయలను 2,795 హెక్టార్లలో సాగు చేస్తుండగా వీటిలో కాలీఫ్లవర్ను 425 ఎకరాల్లో పండిస్తున్నారు. ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులతో తెగుళ్ల ఆశించాయి. వీటి నివారణకు వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కొవ్వూరు ఉద్యానవన అధికారి డి.సుధీర్ కుమార్ తెలిపారు. ఈ పంటపై ప్రస్తుతం ఆకుమచ్చ, పచ్చపురుగు, బట్టవింగ్, రైసీనెస్, కొరడా తెగుళ్లుఎక్కువగా ఆశించాయి. ఆకుమచ్చ తెగులు ఈ తెగులు ఆశించిన తోటల ఆకులపై గుండ్రని బూడిద రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా పెద్దవిగా మారతాయి. ఈ తెగులు సాధారణంగా వాతవరణంలో తేమశాతం అధికంగా ఉన్నప్పుడు వ్యాప్తి చెందుతుంది. నివారణ చర్యలు ఈ తెగులు నివారణకు మాంకోజెబ్ మందును లీటరు నీటికి 2.5 గ్రాములు లేదా కాఫర్ ఆక్సీక్లోరైడ్ను లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేస్తే నివారణ అవుతుంది. తెగులు అధికంగా ఉంటే 10 రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడుసార్లు పిచికారీ చేయాలి. రైసీనెస్ ఈ తెగులు వాతావరణంలో వేడి ప్రారంభమైనప్పుడు వ్యాప్తి చెందుతుంది. ఈ తెగులు ఆశిస్తే పువ్వు వదులై, విచ్చుకున్నట్లుగా అయ్యి పువ్వు గుడ్డుపై మాగు వస్తుంది. దీని వల్ల పువ్వు అందవిహీనంగా కనిపించి మార్కెట్లో ధరపడిపోతుంది. దీని నివారణకు పువ్వులకు ఎండ ఎక్కువగా తగల కుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పువ్వు విచ్చుకున్న వెంటనే సరైన సమయంలో పువ్వులను కోసి వేయాలి. బట్టవింగ్ ఈ తెగులు ఆశించిన తోటల్లో పూలు చిన్నవిగా వస్తాయి. నత్రజని తక్కువగా అందించడం వల్ల, లేక ఆలస్యంగా నారు నాటటం వల్ల ఈ ప్రభావం కనిపిస్తుంది. దీనిని అరికట్టాలంటే 21 నుంచి 25 రోజుల వయసు కలిగిన నారును మాత్రమే నాటుకోవాలి, సరైన సమయానికి తగిన మోతాదులో నత్రజని ఎరువు అందించాలి. సరైన సమయంలో నాటుకోవాలి. బ్రౌవింగ్ తెగులు ఈ తెగులు బోరాన్ లోపం వల్ల వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా క్షార నేలల్లో ఈ పంటను వేసినప్పుడు తెగులు వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఈ తెగులు ఆశించిన పువ్వులపై గోధమరంగు మచ్చలు ఏర్పడతాయి. కాండం గుల్లగా మారి నీరుకారుతుంది. దీని నివారణకు ఆఖరి దుక్కులో ఎకరాకు 8 నుంచి 10 కిలోల బోరాక్స్ వేయాలి. లీటర్ నీటిలో 3 గ్రాములు బోరాక్స్ కలిపి పువ్వు గడ్డ ఏర్పడే దశలో పిచికారీ చేయాలి. కొరడా తెగులు ఈ తెగులు వల్ల ఆకులు పసుపుగా మారి, అంచులు తెల్లబడతాయి. తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటే ఆకు మధ్య మాత్రమే పొడవుగా పెరుగుతుంది. ఇలా కొరడా తెగులు ఆశించినట్లు గుర్తించాలి. ఈ తెగులుకు కారణం నత్రజని మోతాదు ఎక్కువైతే మాలిబ్దినం మొక్కకు అందుబాటులో ఉండదు. దీని నివారణకు నత్రజనిని సరైన మోతాదులో అందించాలి. ఎకరాకు 400 గ్రాముల సోడియం లేదా అమ్మోనియం మాలిబ్డేట్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాలీప్లవర్ పువ్వు తెల్లగా ఉండాలంటే పువ్వు ఏర్పడిన దశలో పువ్వు చుట్టూ ఉన్న ఆకులను పువ్వుపై కప్పుతూ సూర్యరశ్మి సోకకుండా దారంతో కానీ రబ్బరు బ్యాండ్ కానీ వేయాలి. 4 నుంచి 5 రోజుల తరువాత పువ్వును కోయాలి. -
జోగి రమేష్కు తానేటి వనిత పరామర్శ
దేవరపల్లి: టీడీపీ రౌడీ మూకల దాడిలో ధ్వంసమైన మాజీ మంత్రి, బీసీ నేత జోగి రమేష్ గృహాన్ని మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు తానేటి వనిత పరిశీలించారు. మంగళవారం కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ను కలిసి ఆమె పరామర్శించారు. జరిగిన ఘటనకు సంబంఽధించిన వీడియో చిత్రాలను జోగి రమేష్ వనితకు చూపించారు. ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం అమలు జరగడంలేదని, నారా లోకేశ్ రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుని టీడీపీ రౌడీ మూకలు దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నాయని ఆమె అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. జోగి రమేష్ ఇంటిపై దాడులు చేసిన టీడీపీ రౌడీ మూకలపై తక్షణం చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్, కుటుంబ సభ్యులను తానేటి వనిత పరామర్శించారు. కూటమి ప్రభుత్వం ఎన్ని దాడులు చేసినా, అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినా భయపడేది లేదని ఆమె పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు ధైర్యంతో ముందుకు వెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు. ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సాలి వేణు, వైఎస్సార్ సీపీ నల్లజర్ల మండల అధ్యక్షుడు వెల్లంకి సుబ్రహ్మణ్యం, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు దాకారపు బంగారమ్మ, పార్టీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కుసులూరి వెంకట సతీష్, యర్నగూడెం సర్పంచ్ బొంతా భరత్బాబు జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
చంద్రబాబు సర్కారుకు హైకోర్టు మొట్టికాయ
భూసేకరణ పరిహారం చెల్లింపునకు ఆదేశాలు రాజానగరం: పేదల కోసం గత ప్రభుత్వం సేకరించిన భూములకు పరిహారాన్ని తక్షణమే చెల్లించాలని హైకోర్టు ఆదేశించడంతో చంద్రబాబు సర్కారు దిగిరాక తప్పలేదు. కోర్డు ఆదేశాల మేరకు ఆయా భూములకు చెల్లించవలసిన రూ.3.14 కోట్లను వెంటనే విడుదల చేసింది. వివరాలిలావున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ‘నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు’ కార్యక్రమంలో భాగంగా 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మండలంలోని వెలుగుబందలో సర్వే నంబరు 51లో 4.70 ఎకరాలను సేకరించారు. అయితే ఆయా భూములకు పరిహారాన్ని చెల్లించే క్రమంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో చెల్లింపులు జరగలేదు. ఎన్నికల అనంతరం ఎవరు అధికారంలోకి వచ్చినా ఆ చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంది. అయితే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయలేదు. సేకరించిన భూములకు పరిహారాన్ని చెల్లిస్తే గత ప్రభుత్వానికి ముఖ్యంగా జగన్మోహన్రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందోననే దురుద్దేశంతో చెల్లింపుల ప్రక్రియను జాప్యం చేస్తూ వచ్చారనే ఆరోపణలున్నాయి. భూములిచ్చిన వారు ఆర్థికంగా తమ అవసరాలు తీర్చుకునే దారిలేక, సర్కారు తీసుకున్న భూములకు పరిహారం అందక అనేక అవస్థలు పడ్డారు. న్యాయం కోరుతూ వారు హైకోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు భూములిచ్చిన రైతుల మొర విన్న కోర్టు తక్షణమే పరిహారాన్ని చెల్లించాలని ఆదేశాలిచ్చింది. కోర్టు నుంచి మొట్టికాయలు తిన్న చంద్రబాబు సర్కారు చేసేదేమీ లేక పరిహారం చెల్లింపులు పూర్తి చేయాలంటూ రెవెన్యూ శాఖకు ఆదేశాలిచ్చింది. ఐదు ఈగల్ టీమ్ల ఏర్పాటు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా వ్యాప్తంగా ఐదు ఈగల్ టీం లను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డి.నరసింహకిశోర్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఈగల్ టీంలతో ముఖాముఖీ జరిగింది. ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొదటిసారిగా సబ్ డివిజన్కి ఈగల్ టీంను ఒక ఇన్చార్జి, ముగ్గురు సిబ్బందితో ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాలు మాదక ద్రవ్యాల రవాణాపై నిఘా కొనసాగిస్తాయన్నారు. మాదక ద్రవ్యాల కేసులు ఉంటే పాస్పోర్ట్, వీసా పొందడంలో, ఉద్యోగ అవకాశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారని అన్నారు. యువత వీటికి దూరంగా ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల కార్యకలాపాలపై సమాచారం ఉంటే డయల్ 112, 1972 నంబర్లకు తెలియజేయాలన్నారు. -
ఉపాధి.. హతవిధీ!
సాక్షి, రాజమహేంద్రవరం: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో శ్రామికులకు పస్తులు తప్పడం లేదు. రోజంతా స్వేదం చిందించినా గొంతులోకి ముద్ద దిగడం లేదు. ఉపాధి హామీ కూలీలకు సుమారు పది నెలలుగా వేతనాలు స్తంభించడంతో లబోదిబోమంటున్నారు. కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. ఉపాధి కూలి డబ్బు ఎప్పుడు చెల్లిస్తారా..? అని నిరీక్షిస్తున్నారు. మెటీరియల్ కాంపొనెంట్ బకాయిలు సైతం విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. అప్పులు చేసి పనులు చేస్తే బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. రూ.33 కోట్ల బకాయిలు వలసలు నియంత్రించి ఉన్న ఊళ్లోనే పని కల్పించేందుకు ఉద్దేశించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లక్ష్యసాధనకు దూరంగా ఉంటోంది. సకాలంలో వేతనాలు మంజూరు చేయకపోవడంతో కూలీలు పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ 20 నుంచి 30 వేల మంది వరకు ఉపాధి పనులకు హాజరవుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.37 కోట్ల విలువైన వివిధ రకాల పనులు చేపట్టారు. కేవలం రూ.3.84 కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది. రూ.33.20 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఒక్కో కూలీకి సగటున రూ.25 వేలకు పైగా వేతనం అందాల్సి ఉంది. ఉపాధి కూలీ డబ్బు వస్తుందని కిరాణా దుకాణాల్లో అప్పులు చేశారు. వాటిని తీర్చుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఇదేమని అధికారులను ప్రశ్నిస్తే త్వరలోనే విడుదలవుతాయని చెబుతున్నారే తప్ప.. ఎప్పుడన్నది కచ్చితంగా చెప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. రోజుకు సగటున రూ.274 కూలి ఉపాధి పథకంలో వ్యక్తి రోజంతా కష్టపడి పనిచేస్తే సగటున రోజుకు రూ.274 వరకు కూలి గిట్టుబాటు అవుతుంది. ఆ డబ్బుతోనే కుటుంబాన్ని పోషించుకోవాలి. సాధారణంగా ఉపాధి పథకంలో ప్రతి వారం కూలి డబ్బు చెల్లించేవారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూలీలకు చెల్లింపు ప్రక్రియ గందరగోళంగా మారింది. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం లేకపోవడంతో బిల్లుల చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ప్రతి వారం కూలి డబ్బు చెల్లిస్తే ఇంట్లో అవసరాలకు సరకులు కొనుగోలు చేసుకుంటారు. జూన్ మాసం నుంచి ఉపాధి వేతనాల చెల్లింపులు ఆగిపోయాయి. ప్రతి రోజూ క్రమం తప్పకుండా పనులకు వెళుతున్నా.. ఒక్క రూపాయి కూడా తమ ఖాతాల్లో జమ కావడం లేదని కూలీలు వాపోతున్నారు. వెరసి ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. నెలల తరబడి డబ్బు ఇవ్వకపోవడంతో కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. విడుదలకాని మెటీరియల్ కాంపొనెంట్ బకాయిలు ఉపాధి హామీ పనుల్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టు పనులు హడావుడిగా చేపట్టారు. మినీ గోకులం, మొక్కల పెంపకం తదితర పనులు చేపట్టారు. ఇందుకుగాను ఇప్పటి వరకు రూ.కోట్లలో వెచ్చించారు. పెండింగ్ బిల్లుల్లో రూ.5 కోట్లకుపైగా మెటీరియల్ కాంపొనెంట్ కింద చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. అప్పులు చేసి మరీ పనులు చేపట్టామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. సకాలంలో బిల్లులు మంజూరు కాకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గగ్గోలు పెడుతున్నారు. బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో కొందరు కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకురావడం లేదు. ప్రధానంగా రహదారుల పనుల్లో ఎక్కువ శాతం బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. కూటమి నేతలకు లబ్ధి చేకూర్చేందుకు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు వేసేశారు. ప్రస్తుతం బిల్లులు అందక ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ఇలా... జిల్లా వ్యాప్తంగా 1.45 లక్షల జాబ్కార్డులు మంజూరు చేశారు. అందులో 2.20 లక్షల మంది కూలీలు నమోదయ్యారు. 1.74 లక్షల మంది పనులను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 864 కుటుంబాలకు వంద రోజుల పని కల్పించారు. మహిళలకు 55.04 శాతం, ఎస్టీలకు 2.03 శాతం, ఎస్సీలకు 36.57 శాతం పనులు చూపారు. ఇప్పటి వరకు 5,271 పనులు పూర్తి చేశారు. అందులో 43.44 శాతం వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ పనులకు ప్రాధాన్యం కల్పించారు. 30 లక్షల పనిదినాలు లక్ష్యం జిల్లా వ్యాప్తంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో 30 లక్షల పనిదినాలు కల్పించాలని డ్వామా అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. బిల్లులు సకాంలో చెల్లించకపోవడంతో పనులకు వచ్చేందుకు కూలీలు ఆసక్తి చూపడం లేదు. గందరగోళంగా వీబీజీ రామ్జీ ఉపాధి పథకంలో కేంద్రం సమూల మార్పులు తీసుకువచ్చింది. మహాత్మాగాంధీ పేరును తొలగించి ‘వీబీజీ రామ్జీ’ అనే పేరు పెట్టింది. నిబంధనలను సైతం మార్పు చేసింది. పథకం అమలు, పనుల కేటాయింపుపై నేటికీ అధికారులకు మార్గదర్శకాలు అందకపోవడంతో పనుల కేటాయింపుపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఏ పనులు కల్పించాలన్న విషయమై అధికారుల్లో మీమాంస నెలకొంది. ఇదిలా ఉంటే.. కొత్త నిబంధనల మేరకు పంచాయత్రాజ్ శాఖ ఆధ్వర్యంలో కొన్ని పనులు కల్పిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలకు అందని వేతనాలు పది నెలలుగా తప్పని పస్తులు జిల్లావ్యాప్తంగా పేరుకుపోయిన బకాయిలు స్వేదం చిందిస్తున్నా కడుపు నిండని దుస్థితి ఎప్పుడు అందుతాయో తెలియక ఆందోళన నేటికీ అందని ‘జీ–రామ్జీ’ మార్గదర్శకాలు 125 రోజుల పనుల కల్పనపై స్పష్టత కరవు జిల్లాలో ఉపాధి పథకం బ్లాకులు : 18 పంచాయతీలు : 300 మంజూరైన జాబ్కార్డులు : 1.45 లక్షలు కూలీలు : 2.20 లక్షల మంది యాక్టివ్ జాబ్కార్డులు : 1.19 లక్షలు పనులు వినియోగించుకుంటున్న కూలీలు : 1.74 లక్షల మంది -
దిగుబడి ఆశలు గల్లంతు
● ఆకులు రాలిపోతున్న వర్జీనియా పొగాకు తోటలు ● క్యూరింగ్ దశలో దెబ్బతిన్న వైనం ● తీవ్రంగా నష్టపోయామంటున్న రైతులు దేవరపల్లి: వర్జీనియా పొగాకు తోటలు ఆశాజనకంగా ఉండడంతో నాణ్యమైన దిగుబడులు వస్తాయని ఆశతో ఉన్న రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. గోపాలపురం, దేవరపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో వర్జీనియా పొగాకు తోటల్లో ఆకులు రాలిపోయి మొక్కలు నల్లబడి ఎండిపోతున్నాయి. ఆకు ముట్టుకుంటే రాలిపోతోంది. గోపాలపురం మండలం వాదాలకుంట, వెదుళ్లకుంట, గోపాలపురం, దేవరపల్లి మండలంలో బందపురం, చిన్నాయగూడెం, సంగాయగూడెం ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. రెలుపులు, క్యూరింగ్లు జరుగుతున్న తరుణంలో తోటలు ఎండిపోతున్నాయి. రైతులకు ఎకరం కౌలుకు రూ.80 వేలు, పెట్టుబడి రూ.2.20 లక్షలు అయింది. పిలక నివారణకు గోపాలపురంలోని ఓ పురుగు మందుల దుకాణం నుంచి మందు తెచ్చి వాడామని, అనంతరం తోటలు దెబ్బతిన్నట్టు కొందరు రైతులు చెబుతున్నారు. 20 సంవత్సరాలుగా ఇదే మందు వాడుతున్నామని, ఎప్పుడూ ఈ విధంగా జరగలేదని రైతులు వివరించారు. సీటీఆర్ఐ సిఫారసు చేసిన చక్కర స్టాప్ మందులో దుకాణం నుంచి తీసుకు వచ్చిన మందు కలిపి పిచికారీ చేశారు. దుకాణం నుంచి 5 లీటర్లు, లీటర్ల టిన్నులు తీసుకు వచ్చి తోటలకు వాడగా 5 లీటర్ల డబ్బాలోని మందు వాడిన తోటలు దెబ్బతిన్నాయి. లీటరు డబ్బాల్లోని మందు వాడిన తోటలు దెబ్బతినలేదు. రెండు గ్రామాల్లో సుమారు 30 మంది రైతులు ఈ విధంగా మందులు వాడి దెబ్బతిన్నారు. దిగుబడులపై ప్రభావం ఆకులు పండిపోయి రాలిపోవడం వల్ల ఆకులు గుల్లబారి లో గ్రేడు శాతం ఎక్కువగా ఉంటుంది. మొక్కకు 22 నుంచి 24 వరకు ఉన్న ఆకులు రాలిపోయి తోటలు మోడుబారిపోతున్నాయి. దీనివల్ల ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి తగ్గుతుంది. సిఫారసు చేసిన మందులే వాడాలి సీటీఆర్ఐ, ఐటీసీ, పొగాకు బోర్డు అధికారులు సిఫారసు చేసిన మందులను మాత్రమే వాడాలి. పిలక నివారణకు చక్కర స్టాంప్ మందును ఈ ఏడాది సిఫారసు చేశాం. దీనిని మాత్రమే రైతులు వాడాలి. ఇతర మందులు వాడితే తోటలు దెబ్బతింటాయని ముందు నుంచి రైతులకు సూచిస్తున్నాం. పొగాకు తోటలకు కలుపు నివారణ మందు వాడరాదు. సొంత ప్రయోగాలు చేస్తే రైతులు నష్టపోతారు. – జీఎల్కే ప్రసాద్, టుబాకో బోర్డు రీజనల్ మేనేజరు, రాజమహేంద్రవరం 10 ఎకరాల్లో మొక్కలు దెబ్బతిన్నాయి నేను 50 ఎకరాల్లో పొగాకు సాగు చేస్తున్నాను. 10 ఎకరాల్లో పిలక నివారణ మందు వాడగా పంట దెబ్బతింది. ఎకరాకు రూ.3 లక్షలు ఖర్చు అయింది. వ్యవసాయాఽధికారి దృష్టికి తీసుకు వెళ్లాం. గ్రామంలో 30 మంది రైతులు నష్టపోయారు. – గద్దే ఈశ్వరుడు, రైతు, వాదాలకుంట, గోపాలపురం మండలం కోలుకోలేని దెబ్బ ఈ ఏడాది పొగాకు రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. రూ.కోట్లలో నష్టం జరిగింది. 10 ఎకరాల్లో మొక్కలు ఆకులు రాలి ఎండిపోయాయి. రాలిపోయిన ఆకులు క్యూరింగ్కు పనికిరావు. వ్యవసాయాధికారులకు చెప్పినా న్యాయం జరగలేదు. – కాకర్ల సతీష్, రైతు, వెదుళ్లకుంట, గోపాలపురం మండలం -
ఎత్తిపోతలపై తమ్ముళ్ల ఎత్తులు!
● టీడీపీ రాజకీయాలకు వేదికగా వేగేశ్వరపురం ఎత్తిపోతల పఽథకం ● రైతు సంఘం నుంచి ప్రత్యేకాధికారి పాలనలోకి.. ● రెండు వర్గాలుగా టీడీపీ నాయకుల పోటీ ● నిధుల కోసమేనా పదవులపై ఆశ? తాళ్లపూడి : రైతు సంఘం నిర్వహణలో 28 సంవత్సరాలుగా ఉన్న వేగేశ్వరపురం ఎత్తిపోతల పథకం టీడీపీ నాయకుల విభేదాల కారణంగా ప్రత్యేకాధికారి పాలనలోకి వెళ్లడంతో రైతులు అయోమయంలో పడ్డారు. ఈ పథకం కూటమి నాయకుల రాజకీయాలకు వేదికగా మారింది. మరోపక్క ఎత్తిపోతలకు వచ్చే నిధుల కోసమే పదవులపై ఎవరికి వారు కన్నేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బకాయిల భారం : పెద్ద రైతులు, నాయకులు నీటి తీరువా కట్టకుండా పెద్ద మొత్తంలో బకాయిలు పెట్టినట్టు సమాచారం. రూ.1.11 కోట్ల వరకు పన్ను బకాయిలున్నాయి. బకాయి దారుల్లో ప్రస్తుతం పదవిని ఆశిస్తున్న టీడీపీ నాయకులు కూడా ఉండడం గమనార్హం. 2017లో పథకం ఆధునికీకరణకు రూ.8.32 కోట్లతో పనులు చేపట్టారు. మళ్లీ ఇప్పుడు రూ.6 కోట్లతో ప్రతిపాదనలు పెట్టిన నేపథ్యంలో టీడీపీలో ఒక వర్గం వారు అధికారం తమ వశం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో వేగేశ్వరపురం, బల్లిపాడు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఇరిగేషన్ అధికారులకు ఒక లేఖ రాశారు. రైతుల నుంచి ఆరోపణలు వచ్చాయని ఎత్తిపోతల పథకం అధ్యక్షుడిని తొలగించి జీవో 41ను అమలు చేయాలని అందులో పేర్కొన్నారు. ఆ మేరకు 31వ తేదీ నుంచి ఈ పథకం ప్రత్యేకాధికారి పాలనలోకి వెళ్లింది. కొన్నాళ్లు ప్రత్యేకాధికారి పాలన కొనసాగాక పార్టీలో తమ పలుకుబడి ఉపయోగించి ఎలాగైనా ఈ పథకం అధ్యక్షుడిగా నియామకం పొందాలని తెలుగు తమ్ముళ్లు ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. స్టేటస్ కో ఎత్తివేత ఎన్నికలు నిర్వహించకుండా 2022లో తమకు నిర్వహణ అవకాశం కల్పించాలని రైతు సంఘం హైకోర్టులో కేసు వేసింది. దీంతో అధ్యక్షుడిగా ఉన్న కై గాల రాంబాబుకు అనుకూలంగా కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. ఇటీవల రాజకీయ ఒత్తిడితో ఆయన కోర్టులో వేసిన పిటిషన్ ఉపసంహరించుకోవడంతో కోర్టు స్టేటస్ కో ఎత్తివేసింది. అయితే ఎత్తిపోతల పథకాన్ని అధికార పార్టీ రాజకీయంలోకి లాగడం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. ఈ పథకం ద్వారా వేగేశ్వరపురం, తిరుగుడుమెట్ట, పెద్దేవం, బల్లిపాడు, కుక్కునూరు, చిడిపి, మలకపల్లి, గ్రామాల్లో 3,400 ఎకరాలకు నీరు అందుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు 41 జీవో ప్రకారం నేను ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించాను. జనవరి 31 నుంచి పథకం నిర్వహణ చూస్తున్నా. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటా. రైతు సంఘం రికార్టులు అప్పగించాల్సి ఉంది. –గురవయ్య, ఏపీఎస్ఐడీసీ ఈఈ, -
220 అర్జీల స్వీకరణ
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ప్రజల నుంచి 220 అర్జీలను ఇన్చార్జి కలెక్టర్ మేఘస్వరూప్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తాము సమర్పించిన అర్జీల యధార్థ స్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్కు ఫోన్ చేయవచ్చన్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రాబేషనరీ) కృష్ణ చైతన్య, జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామమూర్తి, ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 39 ఫిర్యాదులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 39 అర్జీలు వచ్చాయి. ఎస్పీ డి.నరసింహాకిశోర్ అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకుని, సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. సివిల్ కేసులు, కుటుంబ సమస్యలు, ఛీటింగ్, కొట్లాట కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు. -
వేషం కట్టి.. అదరగొట్టి
అనపర్తి: వేషం కట్టారు.. అదరగొట్టారు.. అందరినీ ఆకట్టుకున్నారు.. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖ్యాతి గాంచిన అనపర్తి మండలం కొప్పవరం కర్రివారి సత్తెమ్మ తల్లి సంబరాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాలు గత నెల 31న ప్రారంభమయ్యాయి. చివరి రోజు పెద్ద సంబరంలో గ్రామస్తులు వివిధ రకాల వేషాలు కట్టి భిక్షాటన చేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ ఘట్టంలో చిన్నా, పెద్దా, ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వేషాలు కట్టి జోలె పట్టారు. తెల్లవారుజాము నుంచి ఈ సంబరం ఆద్యంతం సరదాగా సాగింది. ఈ వేడుకలు తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో గ్రామంలో సందడి నెలకొంది. వేలాదిగా వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాన్న ప్రసాద వితరణ జరిగింది. సత్తెమ్మ తల్లిని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంట్ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సబ్బెళ్ల కృష్ణారెడ్డి, రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి నల్లమిల్లి విజయరెడ్డి, ఉప సర్పంచ్ మల్లిడి వీర్రాఘవరెడ్డి, జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు వల్లభశెట్టి రామసతీష్, కుతుకులూరు ఉప సర్పంచ్ సబ్బెళ్ల నాగిరెడ్డి, కొప్పవరం మాజీ సర్పంచ్ తాడి సూరారెడ్డి పాల్గొన్నారు. –ఫొటోలు: గరగ ప్రసాద్, ‘సాక్షి’ ఫొటోగ్రాఫర్ -
ఆగకొండ తవ్వేసి..
● కొండను తవ్వి మట్టి తరలింపు ● అధికార అండతో బరితెగింపు ● రేయింబవళ్లు యథేచ్ఛగా పనులు ● చోద్యం చూస్తున్న అధికారులు ఏలేశ్వరం: ఆగ‘కొండ’ తవ్వేస్తున్నారు.. అధికారం చేతిలో ఉండడంతో ఆపేవారే లేకపోయారు.. వారి అక్రమాలకు కొండలనే కరిగించేస్తున్నారు.. నిబంధనలకు విరుద్ధంగా రేయింబవళ్లు తవ్వుకుపోతున్నారు. పర్యావరణానికి విఘాతం కలిగించేలా, ప్రభుత్వం ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరిస్తున్నా, అధికారులు చోద్యం చూస్తున్నారు. ఏలేశ్వరం మండలం యర్రవరం గ్రామంలోని పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న కొండను కొందరు అక్రమంగా కొల్లకొడుతున్నారు. ఈ గ్రామంలో కొండను ఆనుకుని ఓ రైతు పొలం ఉంది. పొలం కలుపుకొని సర్వే నంబర్ 366లో 42 ఎకరాల కొండ ఉంది. సమీపంలో ఉన్న రైతు కన్ను ఆ కొండపై పడింది. దీంతో స్థానిక అధికార పార్టీ నాయకులను సంప్రదించగా, వారి అండదండలతో ఐదు పొక్లెయినర్లు, సుమారు 50 ట్రాక్టర్లతో కొండను గుల్ల చేస్తున్నారు. రెండు రోజులుగా ఈ పని రాత్రి పగలు అనే తేడా లేకుండా జరిగిపోతోంది. అయినా అధికారులు ఇటుగా రావడం లేదు. కొల్లగొట్టి.. కలిపేసుకుని జాతీయ రహదారిని ఆనుకుని పొలం కావడంతో ఎకరం సుమారు రూ.కోటి పలుకుతుంది. పొలం జాతీయ రహదారికి దిగువన ఉంది. దీంతో కొండ కొల్లగొట్టి చదును చేసి పొలంలో కలుపుకోవడంతో పాటు తవ్వుతున్న మట్టితో పొలాన్ని చదును చేస్తున్నారు. ఇలా ఎకరం రూ.కోటి పైనే పలికే అవకాశం ఉండడంతో పాటు మట్టితో లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇలా సదరు రైతు అధికార నాయకులకు భారీగానే రూ.లక్షల్లో ముట్టజెప్పినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్నా.. యర్రవరం గ్రామంలో కొండపై బుద్ధుని అవశేషాలు ఉన్నాయనే ఉద్దేశంతో గతంలో దీనిని పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుంది. ముందస్తు ప్రణాళికలో భాగంగా రైతు పొలంతో పాటు కొండను రెవెన్యూ, పంచాయతీ, పురావస్తు శాఖ అధికారుల సమక్షంలో సర్వే చేయించారు. తరువాత కొన్ని నెలలకు రికార్డులను మార్పు చేసి, కొండ జారి తమ పొలం ఆక్రమించుకుందని రైతు కొండను తవ్వడం మొదలుపెట్టాడు. ఇంత జరుగుతున్నా తమకేమీ పట్టనట్టు అధికారులు వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రెవెన్యూ ఇన్స్పెక్టర్ పొన్నాలును వివరణ కోరగా తవ్వకాలపై విచారణ జరుపుతున్నామని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపినట్లు తెలిస్తే తగినచర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమ తవ్వకాలు అరికట్టాలి యర్రవరంలోని అక్రమ తవ్వకాలు అరికట్టాలి. పురావస్తు శాఖకు చెందిన కొండను తవ్వుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారులను ప్రశ్నిస్తే తమ పరిధిలో లేదని తప్పించుకుంటున్నారు. మండలంలో అక్రమంగా మట్టి, ఇసుకను తరలించడం షరామామూలుగా మారింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. –దాడిశెట్టి వీరబాబు, జైభైమ్రావ్ భారత్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన
పాయకరావుపేట: పాయకరావుపేట తిరుమల విద్యా సంస్థల ఆవరణలో ఆదివారం 5, 6, 7, 8, 9, 10వ తరగతులు పూర్తి చేస్తున్న విద్యార్థినీ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు జరిగిన అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన లభించిందని ఆ విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి పిల్లలను మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారు చేయాలని, అప్పుడే వారు వృద్ధిలోకి వస్తారని అన్నారు. జేఈఈ (మెయిన్స్), జేఈఈ (ఆడ్వాన్స్డ్), నీట్లలో తరచూ విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం పిల్లలు పుస్తకాల కన్నా మొబైల్తో ఎక్కువ సమయం గడిపితే జరిగే నష్టం గురించి వివరించారు. తిరుమల విద్యా సంస్థల వైస్ చైర్పర్సన్ రష్మీ మాట్లాడుతూ పిల్లలకు తల్లిదండ్రులే రోల్మెడల్గా ఉండాలని, ప్రతి తల్లి తమ పిల్లలను సరైన మార్గంలో పెంచాలన్నారు. పిల్లల చదువుతో పాటు తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలనే దిశగా తమ విద్యా సంస్థ ఆలోచించి హాస్టల్ విద్యార్థులకు రోజూ ఉదయాన్నే యోగా తరగతులు, సాయంత్రం ఆటల్లో తర్ఫీదు ఇస్తున్నామని అన్నారు. ఐఐటీ ధన్బాద్లో చదువుతున్న తిరుమల పూర్వ విద్యార్థి తండ్రి చిన్ని మాష్టార్ మాట్లాడుతూ తిరుమల విద్యా సంస్థలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పిల్లలను చదివిస్తున్నారన్నారు. ఈ సదస్సులో పాయకరావుపేట కాలేజ్ ప్రిన్సిపాల్ కె.విజయ్కుమార్, స్కూల్ ఇన్చార్జ్ ఎం.సునీత తదితరులు పాల్గొన్నారు. -
కుట్ర రాజకీయాలపై ఆగ్రహం
● చంద్రబాబు ప్రభుత్వం, టీడీపీ నేతల వ్యవహార శైలిపై నిరసనలు ● అంబటి అరెస్టుకు నిరసనగా అంబేద్కర్ విగ్రహం వద్ద ● జక్కంపూడి గణేష్ బైఠాయింపు ● తిరుమల లడ్డూ విషయంలో తప్పుడు ప్రచారంపై ● పోలీసులకు ఫిర్యాదు చేసిన తలారి సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం, టీడీపీ నేతలు చేస్తున్న కుట్ర రాజకీయాలపై వైఎస్సార్ సీపీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. టీడీపీ నేతలకు వ్యతిరేకంగా నినదిస్తున్నారు. రెండు రోజులుగా వివిధ పద్ధతుల్లో ఆందోళనలు చేపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ కుట్ర, కక్ష సాధింపు చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబటి అరెస్టుకు నిరసన మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టుకు నిరసనగా వైఎస్సార్ సీపీ యువనేత జక్కంపూడి గణేష్ ఆందోళన చేపట్టారు. సెంట్రల్ జైల్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. అక్కడే బైఠాయించి ధర్నా చేశారు. దీంతో పోలీసులు, వైఎస్సార్ సీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబుకు ఇప్పటికై నా మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు తిరుమల ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని టీడీపీ, కూటమి నేతలు నిరాధార ఆరోపణ చేస్తున్నారు. ఇదే విషయంపై నియోజకవర్గ కేంద్రాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ దుష్ప్రచారానికి ఒడిగట్టారని వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. తిరుమల లడ్డూ కల్తీ విషయంలో టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎండగట్టాలని, నియోజకవర్గ కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని వైఎస్సార్ సీపీ కేంద్రం కార్యాలయం పిలుపు ఇచ్చింది. అందులో భాగంగా తలారి వెంకట్రావు కొవ్వూరు మెయిన్ సెంటర్లో లడ్డూ వివాదంపై టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫ్లెక్లీ తీయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా టీడీపీ నేతలు వ్యవహరించడం దారుణమన్నారు. రాజకీయాలకు వేంకటేశ్వరస్వామిని వాడుకోవడం దిక్కుమాలిన చర్యగా అభివర్ణించారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రమేష్, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
కేంద్ర బడ్జెట్లో వ్యవసాయంపై చిన్నచూపు
కర్నాకుల వీరాంజనేయులు గోకవరం: కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగంపై చిన్నచూపు చూశారని ఆంధ్రప్రదేశ్ రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ బడ్జెట్ వలన కార్పొరేట్లకు తప్ప సామాన్యులకు ఒరిగేదేమీ లేదన్నారు. భారీ డేటా సెంటర్లకు 2047 వరకూ రాయితీలివ్వడం వలన అదానీ, గూగుల్ వంటి సంస్థలకు ఉపయోగం తప్ప సామాన్యులకు ప్రయోజనమేమిటని ప్రశ్నించారు. రవాణా, పారిశ్రామిక రంగాలకు మూలమైన వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చట్టం చేయాలన్న రైతుల డిమాండ్లను ఎక్కడా పట్టించుకోలేదన్నారు. వ్యవసాయ రంగంపై 45 శాతం మంది శ్రామికులు ఆధారపడి జీవిస్తున్నారని, వారికి ఏం చేస్తారో చెప్పలేదని పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల నుంచే దేశానికి ఎక్కువ శాతం ఆదాయం వస్తుందని, కానీ, ఒక్క శాతం సంపద ఉన్న సంపన్నులకు అనుకూలంగానే బడ్జెట్ కేటాయింపులున్నాయని ఆరోపించారు. యువతకు ఉద్యోగ కల్పనపై స్పష్టత లేదన్నారు. మొత్తం దేశాన్ని ప్రైవేట్ పరం చేయడానికి కేటాయింపులున్నాయి తప్ప ప్రజలకు ఆశాజనకంగా ఏమీ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, రాజధానికి నిధులు, విశాఖ ఉక్కు పరిశ్రమ, పోలవరం ప్రాజెక్ట్ల ఊసే లేదని అన్నారు. బడ్జెట్లో రాష్ట్రాలకు, వ్యవసాయం, చిన్న పరిశ్రమల బలోపేతానికి కేటాయింపులు లేవని విమర్శించారు. స్పష్టత లేని, సామాన్యులకు ఉపయోగపడని ఈ బడ్జెట్పై ప్రజలు, ప్రజాస్వామికవాదులు ప్రశ్నించాలని, పోరాడాలని వీరాంజనేయులు పిలుపునిచ్చారు. -
పెద్దపులి జాడ కోసం అన్వేషణ
తొర్రేడు–వెంకటనగరం గ్రామాల మధ్యే సంచరిస్తున్న వైనం రాజమహేంద్రవరం రూరల్: తొర్రేడు గ్రామంలో పెద్దపులి రెండో రోజులుగా జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తొర్రేడు శివారులోని మొక్కజొన్న తోట ప్రాంతంలో మాటు వేసిన పెద్దపులి అక్కడ నుంచి వెంకటనగరం గ్రామంలోని మొక్కజొన్న తోటల్లో నుంచి వెళ్లినట్లు కాలిముద్రలను బట్టి అటవీశాఖ అధికారులు సోమవారం గుర్తించారు. ఈ నేపథ్యంలో జిల్లా అటవీశాఖ అధికారి ప్రభాకరరావు నేతృత్వంలో అటవీరేంజ్ ఆఫీసర్ దావీదు రాజు, సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ అధికారులు ఉదయం నుంచి తొర్రేడు, వెంకటనగరం గ్రామాలలో పులిజాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. తొర్రేడు మొక్కజొన్న తోటలో ఉన్న పెద్దపులి వెంకటనగరం గ్రామం వైపు వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షి చెప్పడంతో అధికారులు ఆ దిశగా వెళ్లి పులి అడుగుజాడలు గుర్తించారు. అక్కడి నుంచి మొక్కజొన్న తోటలు ఉండడంతో పులి అడుగుజాడలు కనిపించలేదు. పులి వచ్చిన మార్గానే వెనక్కి వెళ్లిపోయిందా అనే కోణంలోను అధికారులు అన్వేషిస్తున్నారు. కొంతమంది సీతానగరం మండలం కూనవరం, ముగ్గళ్లలో పెద్దపులి సంచరించిందని తెలపడంతో అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతాలకు వెళ్లి పరిశీలించినప్పటికీ ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. తొర్రేడు గ్రామంలో బోను, ట్రాప్ కెమెరాలను అమర్చారు. పెద్దపులి సంచారంతో తొర్రేడు, వెంకటనగరం గ్రామాలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా అటవీశాఖ అధికారి తొర్రేడు, వెంకటనగరంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అటవీశాఖ అధికారి ప్రభాకరరావు తెలిపారు. రాత్రి వేళ ఒంటరిగా పొలాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పెద్దపులి సమీపంలో టైగర్ రిజర్వ్స్ నుంచి వచ్చి ఉంటుందన్నారు. తల్లి నుంచి విడిపోయే సమయంలో పులులు కొత్త ప్రాంతాలను వెతుక్కుంటాయన్నారు. దానిలో భాగంగా గత నెల 20న ఏలూరు జిల్లాలో ప్రవేశించిందన్నారు. గత నెల 30వ తేదీన గోదావరి నది దాటుకుని చినకొండేపూడి, పెదకొండేపూడి ప్రాంతాల్లో తిరిగిందని చెప్పారు. అక్కడ నుంచి తొర్రేడు గ్రామం చేరుకుని రెండు ఆవులు, ఒక దూడపై దాడి చేయడంతో మృతిచెందాయని తెలిపారు. ఒక దూడను తిన్నటు చెప్పారు. ఆదివారం రాత్రి ఆవులను చంపలేదన్నారు. పులి సాధారణంగా రాత్రి సమయాల్లో ప్రయాణిస్తుందని, మనిషి పులికి ఆహారం కాదని, అది నాలుగు కాళ్ల జంతువులపై దృష్టి పెడుతుందన్నారు. పులిని సురక్షితంగా బంధించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. -
ఆగిన మీటర్ రీడింగ్
● రెండు రోజులుగా నిలిపివేసిన విద్యుత్ మీటర్ రీడర్లు ● ఒకటో తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లినట్లు ప్రకటన ● జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి ● సకాలంలో బిల్లులు తీయకపోవడంతో వినియోగదారుల ఆందోళన ● స్లాబ్ రేట్ పెరిగి బిల్లు అధికంగా వచ్చే అవకాశం ఉందన్న భావన ● ‘తూర్పు’లో 200 మందికి పైగా మీటర్ రీడర్లు సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి రంగంలో సంక్షోభం నెలకొంటోంది. సాఫీగా సాగే వ్యవస్థలను సైతం గందరగోళంలోకి నెట్టేస్తోంది. ఇప్పటికే అనేక వ్యవస్థల నిర్వీర్యానికి ఆజ్యం పోసిన సర్కారు తాజాగా స్పాట్ బిల్లింగ్పై పడింది. విద్యుత్ మీటర్ రీడర్ల సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపకపోవడంతో మీటర్ రీడర్లు సమ్మెబాట పట్టారు. రెండు రోజులుగా విద్యుత్ మీటర్ల నుంచి బిల్లులు తీసే ప్రక్రియ ఆగిపోయింది. ఈ పరిణామం విద్యుత్ వినియోగదారుల్లో ఆందోళన నింపుతోంది. బిల్లులు తీయడం ఆలస్యమైతే.. విద్యుత్ వినియోగంలో స్లాబ్ పెరిగిపోయి బిల్లులు అధికంగా వచ్చే అవకాశం ఉందని వాపోతున్నారు. ఇప్పటికే పెరిగిన కరెంట్ బిల్లులతో ఆర్థికంగా అతలాకుతలం అవుతుంటే.. మరింతగా బిల్లులు పెరిగితే ఎలాగన్న ప్రశ్న తలెత్తుతోంది. జిల్లాలో ఇలా.. జిల్లా వ్యాప్తంగా 7,82,170 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ సంస్థలవి 10,607, ప్రైవేటు కనెక్షన్లు 7,71,563 ఉన్నాయి. ప్రతి నెలా సుమారు 108.85 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగిస్తున్నారు. ఇందుకుగాను ప్రతి నెలా సుమారు రూ.74.41 కోట్ల బిల్లులు ప్రభుత్వానికి, విద్యుత్ శాఖకు చెల్లిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 200 మందికి పైగా మీటర్ రీడర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 11వ తేదీ లోపు మీటర్ రీడింగ్ తీస్తారు. ఒక మీటర్కు రీడింగ్ తీసినందుకు గాను విద్యుత్ శాఖ సంబంధిత కాంట్రాక్టర్ పట్టణ ప్రాంతాల్లో రూ.6.16, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6.36 చొప్పున చెల్లిస్తారు. ఈ మొత్తం సరిపోవడం లేదని కాంట్రాక్టర్లు డిమాండ్ చేయడంతో పట్టణాల్లో రూ.0.26 పైసలు, గ్రామాల్లో రూ.0.75 పెంచారు. రీడింగ్ యంత్రం చార్జీలు, ఫోన్ రీచార్జ్, రీడింగ్ పేపర్ రోల్, మరమ్మతులు, ఈఎస్ఈ, ఈపీఎఫ్ మినహాయింపులు పోగా.. విద్యుత్ మీటర్ రీడర్కు చేతికి ఒక్కో మీటర్కు రూ.3.10 మాత్రమే అందుతుంది. సగటున ఒక్క మీటర్ రీడర్ నెలకు మూడు వేల మీటర్ల వరకు రీడింగ్ తీస్తారు. దీన్ని బట్టి చూస్తే వారి ఆదాయం ప్రతి నెలా కేవలం రూ.10 వేల లోపే ఉంటుంది. ప్రాంతాన్ని, పట్టణాన్ని బట్టి రీడింగ్ సామర్థ్యం మారుతుంది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో సంస్థలో ఏళ్లుగా పనిచేస్తున్న కొందరు సిబ్బందికి ఉపాధి దక్కదు. విద్యుత్ సంస్థనే నమ్ముకుని పనిచేస్తున్న మీటర్ రీడర్ల ఉపాధికి గండిపడుతుంది. వినియోగదారులకు విద్యుత్ రీచార్జ్పై అవగాహన లేకపోతే ఇబ్బందులు తప్పవు. విద్యుత్ చౌర్యం పెరిగే అవకాశం ఉంది. విద్యుత్ లైన్ల నుంచి విద్యుత్ అక్రమంగా వినియోగించుకునే వారి సంఖ్య పెరగనుంది. పొట్టకూటి కోసం పోరుబాట చాలీచాలని వేతనాలతో బతుకుబండి లాగుతున్న విద్యుత్ మీటర్ రీడర్లకు కూటమి ప్రభుత్వం షాక్ ఇవ్వడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోవడంతో ఉద్యమ బాట పట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ గతంలో చలో విజయవాడ నిర్వహించారు. విజయవాడ ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలంటూ గళమెత్తారు. 20 ఏళ్లుగా విద్యుత్ శాఖలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలంటూ నినదించారు. అప్పుడు వ్యతిరేకించి.. ఇప్పుడు సమర్థించి.. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు వ్యతిరేకించిన సీఎం చంద్రబాబునాయుడు ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై వినియోగదారులు, ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యవసాయ బోరు బావుల వద్ద స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండని పిలుపునిచ్చిన చంద్రబాబు, నారా లోకేష్ ప్రస్తుతం వ్యవసాయ కనెక్షన్లకు అమర్చేందుకు సన్నాహాలు ప్రారంభించడంపై రైతుల్లో అగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో విమర్శించిన నోటితోనే స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం మంచి ప్రక్రియ అని చెబుతుండటాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే మరోలా వ్యవహరించడం తగదని హితవు పలుకుతున్నారు. ప్రధాన డిమాండ్లు ఫ స్మార్ట్ మీటర్లు తీసుకువచ్చిన తరుణంలో మీటర్ రీడర్లకు విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. ఫ కనీస వేతనాలు అమలు చేయాలి. ఫ రీడర్ల విద్యార్హతను బట్టి విద్యుత్ శాఖలో టెక్నికల్, నాన్ టెక్నికల్ షిఫ్ట్ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, మిగిలిన వారిని వాచ్మెన్, అటెండర్ పోస్టుల్లో నియమించాలి. ఫ ఎస్క్రో ఖాతాను వెంటనే తెరవాలి. ఫ కాంట్రాక్టర్లు, విద్యుత్ శాఖ అధికారులతో విద్యుత్ మీటర్ రీడర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి. జగన్ హయాంలో సానుకూలం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయనున్న సమయంలో మీటర్ రీడర్లు ఆందోళన చెందారు. దీంతో స్పందించిన అప్పటి సీఎం వైఎస్ జగన్ మీటర్ రీడర్లకు ప్రత్యామ్నాయం కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు. విద్యుత్ శాఖలోనే ఉపాధి కల్పిస్తామని భరోసా కల్పించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం మానేసింది. పట్టించుకోని ప్రభుత్వం తమ డిమాండ్లు పరిష్కరించాలని, స్మార్ట్ మీటర్ల తీసుకొస్తే తాము జీవనోపాధి కోల్పోతామని, తమకు ప్రత్యామ్నాయం కల్పించాలని కోరుతూ మంత్రులు, అధికారులను కలిసి మీటర్ రీడర్లు పరిస్థితి విన్నవించారు. ప్రత్యామ్నాయం చూపుతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, అధికారులు ఇప్పటి వరకు పట్టించుకోకపోవడంతో ఒకటో తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లారు. సోమవారం చర్చలకు రావాలని తెలపడంతో మీటర్ రీడర్ల సంఘం నేతలు విజయవాడ వెళ్లారు. ప్రభుత్వంతో చర్చలు ఫలించిన దాఖలాలు లేవు. దీంతో రీడర్లు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సమ్మెలోకి వెళుతున్నారు. -
నయనానందం.. స్వామివార్ల తెప్పోత్సవం
సఖినేటిపల్లి: అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి, అమ్మవార్ల తెప్పోత్సవం సోమవారం నేత్ర పర్వంగా సాగింది. స్వామివారి కల్యాణ మహోత్సవాల్లో చివరి రోజు ఆలయానికి ఉత్తరం వైపునున్న చెరువులో హంస వాహనంపై శ్రీస్వామి, అమ్మవార్లు విహరించారు. తొలుత సాయంత్రం 5 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పక వాహనంపై అర్చకులు కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. 6 గంటలకు తెప్పోత్సవం నిర్వహించారు. ద్రాక్షారామలో భీమేశ్వరస్వామికి.. రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ క్షేత్రంలో మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామివారికి ఆలయ ప్రాంగణంలోని సప్త గోదావరి నదిలో తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది. విద్యుత్ దీప కాంతుల నడుమ తెప్పోత్సవాన్ని తిలకించిన భక్తులు పులకించిపోయారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన కల్యాణమూర్తులను వేద పండితులు ఆలయం నుంచి తోడ్కొని వచ్చి సప్త గోదావరిలో విద్యుత్ దీపాలంకరణ, పుష్పాలంకృతమైన హంస వాహనంలో ఉంచి ఆస్థాన పూజలు నిర్వహించారు. అనంతరం కల్యాణమూర్తులకు నీరాజన మంత్ర పుష్పాలు సమర్పిస్తుండగా మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామివారు మూడు సార్లు నదిలో జలవిహారం చేశారు. ఆలయ ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
కాస్త దారివ్వండి స్వామీ!
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో రావి చెట్టును సంరక్షించే క్రమంలో అన్నవరం దేవస్థానం అధికారులు తీసుకున్న చర్యలు భక్తులకు ఇబ్బందికరంగా మారాయి. అధికారుల ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, భక్తులకు కలిగే ఇబ్బందులను పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులు ఆలయ తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న రావి చెట్టు వద్ద ఆవు నేతి దీపాలు వెలిగించడం, ఆ దేవతా వృక్షానికి భక్తితో ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీ. ఇక్కడ నేతి దీపాలు విక్రయించేందుకు తాజాగా వేలం నిర్వహించగా ఏడాదికి రూ.1.45 కోట్లకు ఖరారైంది. రావిచెట్టు మొదట్లో భక్తులు దీపాలు వెలిగిస్తూండటంతో ఆ సెగకు చెట్టు చనిపోయే ప్రమాదముందని గత ఏడాది సెప్టెంబర్ 11న ‘అశ్వత్థానికి దీపపు సెగ’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన అధికారులు ఆ చెట్టుకు దీపాల సెగ తగలకుండా కాండానికి రేకు అమర్చారు. ఆ తరువాత వచ్చిన కార్తిక మాసంలో ఎక్కువ మంది మహిళలు రావి చెట్టు వద్ద దీపాలు వెలిగిస్తారు కాబట్టి, వాడపల్లి దేవస్థానం నుంచి 4 అడుగుల ఎత్తున రెండు అరలుగా ఉన్న ఇనుప ర్యాకులు తెచ్చి, చెట్టు చుట్టూ అమర్చారు. మరికొన్ని ర్యాకులను చెట్టు పక్కనే ఖాళీ స్థలంలో ఉంచారు. దీంతో, అప్పట్లో మహిళలు ఎటువంటి ఇబ్బందీ లేకుండా దీపాలు వెలిగించుకున్నారు. కార్తికం తరువాత ఆ ర్యాకులను తిరిగి వాడపల్లి దేవస్థానానికి పంపించేశారు. కొత్త ర్యాకుల తయారీ ఇనుప ర్యాకుల ప్రయోగం సత్ఫలితం ఇవ్వడంతో దేవస్థానమే సొంతంగా అటువంటివి తయారు చేయించింది. వీటిని భీష్మ ఏకాదశి సందర్భంగా గురువారం నుంచి రావి చెట్టు చుట్టూ అమర్చారు. దీంతో, భక్తులు రావి చెట్టు కాండం వద్ద కాకుండా ఆ ర్యాకులపై దీపాలు వెలిగిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. రావి చెట్టుకు ఉత్తరం వైపు 20 చదరపు అడుగుల మేర ఉన్న ఖాళీ స్థలంలో మహిళలు గతంలో నీటితో కడిగి చిన్న ముగ్గు వేసి జ్యోతులు వెలిగించుకునేవారు. వారితో వచ్చిన పురుషులు అక్కడ వేచి ఉండేవారు. ఇప్పుడు ఆ ఖాళీ స్థలం నిండా సుమారు 20 ర్యాకులు పెట్టేశారు. దీని వలన వాటి మీద దీపాలు వెలిగించడం కాదు కదా.. అక్కడకు వెళ్లడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు ఆ ఖాళీ స్ధలానికి ఎదురుగా ఉన్న ప్లాట్ఫామ్పై కొత్తగా రెండు క్యూలు కూడా ఏర్పాటు చేశారు. ఫలితంగా ఆ ప్రాంతమంతా ఇరుకుగా తయారైంది. దీనిపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి బదులు అధికారులు రావిచెట్టు చుట్టూ పెట్టిన ర్యాకులను లాగే ఉంచి, పక్కన ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసిన వాటిలో కొన్నింటిని ఆంగ్ల అక్షరం ‘యు’ ఆకారంలో అమర్చి, మధ్యలో ఖాళీ ఉంచితే అక్కడ కూడా మహిళలు దీపాలు వెలిగించుకునే అవకాశం ఉంటుంది. అధికారులు ఈ విధంగా మార్పులు చేయాలని భక్తులు కోరుతున్నారు. -
రేపటి నుంచి జాతీయ స్థాయి హాకీ పోటీలు
● కాకినాడ వేదికగా నిర్వహణ ● హాజరుకానున్న జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులునాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ క్రీడలకు ప్రసిద్ధి.. ఇప్పటికే జాతీయ స్థాయి హాకీ పోటీలకు నగరం వేదికగా నిలిచింది. ఇప్పుడు ఇక్కడి జిల్లా క్రీడా మైదానంలోని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగిన యాస్ట్రో టర్ఫ్ హాకీ మైదానంలో మరో ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి హాకీ టోర్నీ జరుగనుంది. ఆ వివరాల్లోకి వెళితే... హాకీ ఇండియా సహకారంతో హాకి ఆంధ్రప్రదేశ్ పర్యవేక్షణలో కాకినాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో తొలిసారి కోకనాడ గోల్డ్ కప్ హాకీ పోటీలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్రీడా మైదానంలోని యాస్ట్రో టర్ఫ్ హాకీ మైదానంలో ఈ నెల 4 నుంచి 14 వరకూ ఈ పోటీలు నిర్వహించనున్నారు. పురుషుల విభాగంలో ఇండియన్ రైల్వేస్, ఇండియన్ ఆయిల్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, సెంట్రల్ సెక్రటేరియేట్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ సిండికేట్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ మేజర్ పోర్ట్స్, ఆంధ్రప్రదేశ్, కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ జట్లు పాల్గొంటున్నాయి. మహిళల విభాగంలో ఇండియన్ రైల్వేస్, ఇండియన్ ఆయిల్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, యుకో బ్యాంక్ జట్లు పోటీ పడనున్నాయి. ఈ పోటీలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు హాజరుకానుండడంతో నిర్వాహకులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. హాకీ ఇండియా అఫిలియేటెడ్ అంపైర్లను పోటీల నిర్వహణకు హాకీ ఇండియా పంపనుంది. వివిధ జట్లకు చెందిన క్రీడాకారుల కోసం భోజన, వసతి సదుపాయాలు ఇప్పటికే పూర్తయ్యాయని నిర్వాహకులు తెలిపారు. సాంకేతిక అధికారులు, జిల్లాకు చెందిన హాకీ క్రీడాకారులు, పీఈటీలు టోర్నమెంట్ నిర్వహణలో సేవలు అందించనున్నారు. పోటీల్లో మొదటి బహుమతిగా రూ.3 లక్షలు, రెండో బహుమతిగా రూ.2 లక్షలు, మూడో బహుమతి రూ.లక్ష ఆయా జట్లకు అందిస్తా రు. జాతీయస్థాయి గోల్డ్కప్ హాకీ పోటీలు కాకినా డ ప్రజలకు సుమారు 10 రోజుల పాటు కనువిందు చే యనున్నాయి. పోటీల నిర్వహణకు అనువుగా క్రీ డా మైదానంలోని యాస్ట్రో టర్ఫ్ హాకీ ఫీల్డ్ను తీర్చిదిద్దుతున్నారు. పోటీల ఏర్పాట్లలో హాకీ సంఘ ప్రతినిధు లు రవిరాజు, సూరిబాబు సహకారం అందిస్తున్నారు. -
భక్తజన సాగరం..
● కిటకిటలాడిన అంతర్వేది ● స్వామివారికి చక్రస్నానం ● ఉత్సవాల్లో కమనీయ ఘట్టం సఖినేటిపల్లి: సాగర తీరం భక్తజనంతో ఎగసిపడింది.. ఆ నారసింహుడిని చూసిన ప్రతి మది పులకించింది.. అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనారసింహుని వార్షిక దివ్య తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు స్వామివారి చక్రస్నానం అట్టహాసంగా జరిగింది. ఆదివారం మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని అక్కడి సముద్ర తీరం భక్తిభావంతో ఉప్పొంగింది. ఎటు చూసినా భక్తజనం కనిపించింది. సుదర్శన చక్రం ధరించిన నారసింహస్వామి (సుదర్శన పెరుమాళ్ స్వామి) జలకమాడిన కడలిలోనే భక్తులు స్నానమాచరించి పులకించారు. ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్, స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేదపండితుడు చింతా వెంకటశాస్త్రి ఆధ్వర్యంలో పేరూరు ఉద్దండ పండితులు స్వామిని శిరస్సుపై ఉంచుకుని సముద్ర స్నానం చేయించారు. జల్లు స్నానానికి ఏర్పాట్లు సముద్రంలో స్వామితో పాటు పుణ్యస్నానం చేయలేని భక్తుల సౌకర్యార్థం దేవస్థానం జల్లు స్నానాలను ఏర్పాట్లు చేసింది. స్వామివారి కరుణా కటాక్షాలు కలగజేసేందుకు ఆలయ ఈఓ ఎంకేటీఎన్వీ ప్రసాద్ ఈ చర్యలు తీసుకున్నారు. ఒడ్డున స్వామివారిని ప్రత్యేక అరపపై ఆశీనులు చేసి, పైపు ద్వారా సముద్ర నీటిని స్వామి శిరస్సుపై నుంచి జార విడిచారు. అరప కింద ఏర్పాటు చేసిన క్యూలో భక్తులు ఆ నీటి కింద నుంచి వెళ్లి తడిసి పునీతులయ్యారు. తొలుత ఉదయం 8 గంటలకు ఉత్సవమూర్తులను గరుడ పుష్పక వాహనంపై, పల్లకిలో సుదర్శన చక్రధారుడైన నృసింహస్వామిని ఊరేగిస్తూ మంగళవాయిద్యాలతో తీరానికి అర్చకులు తోడ్కొని వచ్చారు. తీరంలో ఒడ్డున దేవస్థానం ఏర్పాటు చేసిన ప్రత్యేక పందిరిలో వేదికపై స్వామి, అమ్మవార్లను ఆశీనులు గాలించారు. స్వామివారికి పంచామృతాలు, కొబ్బరి నీళ్లతో ప్రధాన అర్చకుడు శ్రీనివాస కిరణ్, స్థానాచార్య రామరంగాచార్యులు, వేద పండింతుడు వెంకటశాస్త్రి, అర్చకులు అభిషేకాలు చేశారు. పేరూరు పండితులు సుదర్శన చక్రధారుడైన స్వామిని శిరస్సుపై ధరించి సముద్ర స్నానం చేయించారు. స్వామితో పాటు భక్తులు, అధికారులు, ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం స్వామిని అర్చకులు ఊరేగింపుగా వసంత మండపానికి తీసుకువెళ్లారు. దద్దోజనం, పానకాలను స్వామివారికి ఆలయ అర్చకులు నైవేద్యంగా పెట్టారు. ఆ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. అనంతరం స్వామిని గరుడ పుష్ప వాహనంపై ఊరేగిస్తూ ఆలయానికి తోడ్కొని వచ్చారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఏఎస్పీ ప్రసాద్, కొత్తపేట డీఎస్పీ ఎస్.మురళీ మోహన్, ఆర్డీవోలు అఖిల, శ్రీకర్, ఎండోమెంట్స్ డీసీ డీఎల్వీ రమేష్ బాబు, చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమారరామ గోపాల రాజాబహద్దూర్, జిల్లా ఎండోమెంట్స్ అధికారి వి.సత్యనారాయణ, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ దెందుకూరి రాంబాబు రాజు, ఎంపీపీ వీరా మల్లిబాబు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటలు అయ్యే సరికి క్యూలైన్లు మరింత రద్దీగా మారాయి. అంగరంగ వైభవం.. వసంతోత్సవంఅంతర్వేదిలో నేడు అంతర్వేది తీర్థమహోత్సవాల్లో తొమ్మిదో రోజు సోమవారం స్థానిక చెరువులో సాయంత్రం 6 గంటలకు హంస వాహనంపై స్వామి, అమ్మవార్లకు తెప్పోత్సవం నిర్వహించనున్నారు. విద్యుద్దీపాల మధ్య, బాణసంచా కాల్పులతో ఈ ఉత్సవం జరుపనున్నారు. సాయంత్రం 5 గంటలకు పుష్పక వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహిప్తారు. చెరువు వద్ద ఆదివారం తెప్పోత్సవం ఏర్పాట్లను జిల్లా ఎండోమెంట్స్ అధికారి వి.సత్యనారాయణ, ఆలయ ఈవో ప్రసాద్ పర్యవేక్షించారు. రాత్రి 8 గంటలకు ఉత్సవరులకు తిరుమంజనాలు, దర్పణసేవ, ధూపసేవ, విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ద్వాదశ తిరువారాధన, శ్రీపుష్పోత్సవం, చెంగోలం విన్నపం, తీర్థగోష్టి, స్వామివారి పవళింపు సేవ అర్చకులు నిర్వహించనున్నారు.రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీగా పేరొందిన ద్రాక్షారామ క్షేత్రంలో మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామివారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా 5వ రోజు ఆదివారం భీమేశ్వరాలయంలో వసంతోత్సవం వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని ఆధ్వర్యంలో ముందుగా వేగాయమ్మపేటలోని ఆస్థాన మండపం నుంచి కల్యాణ మూర్తులైన మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి, క్షేత్ర పాలకులైన లక్ష్మీ సమేత నారాయణస్వామి, చండికా సమేత సూరేశ్వరస్వామివార్లను రథంపై దేవాలయానికి తీసుకుని వచ్చారు. ఆలయంలో వేద పండితులు, ఆలయ అర్చకుల వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య తీర్థపు బిందె, బాలభోగం, అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. ఆనంతరం ఆలయ ప్రాంగణంలో వసంతోత్సవం, నాకబలి, గ్రామోత్సవాలు నిర్వహించిన అనంతరం త్రిశూల స్నానం, చక్రస్నానం కార్యక్రమాలను నిర్వహించారు. నేడు తెప్పోత్సవం భీమేశ్వరస్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం మేలుకొలుపు, సుప్రభాత సేవ, ప్రాతఃకాల అర్చన, తీర్థపు బిందె, బాల భోగం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం భక్తులచే విశేష అభిషేకాలు, మాణిక్యాంబా అమ్మవారికి వివిధ రకాల పుష్పార్చన, కుంకుమార్చన జరుపుతారు. మధ్యాహ్న కాలార్చన, రాజభోగ నివేదన సేవ అనంతరం రాత్రి 6.35 గంటలకు సప్త గోదావరి నదిలో శ్రీస్వామివార్లు, అమ్మవార్లకు కన్నుల పండువగా తెప్పోత్సవం నిర్వహించనున్నారు. -
నిరాశల బడ్జెట్..!
‘పోలవరం’ నిర్వాసితుల ఊసేదీ..? కేంద్రం బడ్జెట్లో ఏపీకి మొండిచెయ్యి చూపింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు నిధులతో అప్పులు ఇస్తారా..? విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించి బడా కార్పొరేట్ వ్యక్తులకు ఊడిగిం చేసే మోడీ బడ్జెట్ ఇది. కోస్టల్ కారిడార్, విశాఖ స్టీల్కు సొంత గనుల కేటాయింపు, కోటిపల్లి రైల్వే లైన్కు నిధులు శూన్యం. 2025–26 బడ్జెట్లో మొత్తం వ్యయం రూ.50,65,345 కోట్లుగా ప్రకటించి.. సవరించిన అంచనాలలో అదే రూ.49,64,842 కోట్లకు తగ్గించింది. ఇప్పుడు మళ్లీ రూ.53,47,315 కోట్లు అంటూ ఘనంగా ప్రకటించారు. ఇది పేద ప్రజలను కాగితాల్లో మోసగించడమే. ఉభయ రాష్ట్రాలకు అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరానికి ఈ బడ్జెట్లో నిధులు తక్కువగా కేటాయించి తీవ్ర అన్యాయం చేశారు. జాతీయ ప్రాజెక్టుకు త్యాగం చేసిన పోలవరం నిర్వాసితులకు నిధులు కేటాయించలేదు. ఎప్పటి నుంచో రైలు వస్తుందని కలలు కంటున్న కోనసీమ వాసులకు తీవ్ర నిరాశ ఎదురైంది. కోటిపల్లి రైల్వే లైనుకు ఒక రూపాయి కూడా విదల్చలేదు. – తాటిపాక మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు నిరాశే వికసిత భారత్–2047 లక్ష్యంగా సాగిన కేంద్ర బడ్జెట్ భారతీయ ఖాదీ, టెక్స్ టైల్, ఫిషరీస్, ఉద్యానవన పంటలకు ప్రోత్సాహకాలతో పాటు క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధ, న్యూక్లియర్ ఎనర్జీ, టూరిజం రంగాల్లో పెట్టుబడులకు మార్గాన్ని వేస్తున్నామని ప్రకటించారు. ప్రతి బడ్జెట్లో లాగా వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల కేటాయింపులు, ప్రోత్సాహకాలు, వాటాలు ఈ బడ్జెట్లో అంతగా కనిపించలేదు. క్యాన్సర్కు సంబంధించి 17 రకాల ఔషధాలపై, 7 రకాల వ్యాధులకు సంబంధించి వాటి మందులకు పన్ను మినహాయింపులు ఊరట కలిగించే విషయం. వివిధ రకాల జంతువుల పరిరక్షణకు బిగ్ క్యాట్ అలయన్స్ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. 16వ ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా వృద్ధి రేటును దృష్టిలో ఉంచుకుని ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దేశీయ మదుపర్లు, రియల్ ఎస్టేట్, పారిశ్రామిక వర్గాల ప్రస్తావన లేకుండా బడ్జెట్ ఉండడం కొన్ని వర్గాల్లో అసంతృప్తి కలిగించింది. – డాక్టర్. ఎంవీ కాళేశ్వరరావు, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు -
నందెపు వెంకట్రావుకు ఘన నివాళి
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం సిటీ మాజీ అధ్యక్షుడు, ది ఫెడరేషన్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ స్టేట్ కన్వీనర్ నందెపు శ్రీనివాస్ తండ్రి వెంకట్రావు ఇటీవల మృతి చెందారు. ఆదివారం స్థానికంగా ఆయన చిత్రపటానికి పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ వెంకట్రావుకు తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రి, జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కోనసీమ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ చైర్మన్ అశోక్ కుమార్జైన్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. -
ఆనందంగా ఉంది
కాకినాడ జిల్లాలో జాతీయ స్థాయి కోకనాడ గోల్డ్ కప్ పోటీలు జరగడం ఆనందంగా ఉంది. ఈ పోటీలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు రావడంతో వర్ధమాన క్రీడాకారులు వారి ఆట చూసి చేర్చుకోవడానికి వీలు ఉంటుంది. భవిష్యత్తులో కాకినాడ నుంచి జాతీయ, అంతార్జతీయ స్థాయి క్రీడాకారులు తయారు కావడానికి ఇదో చక్కని వేదిక. – నాగేంద్ర, డీఎస్ఏ హాకీ కోచ్ అన్ని ఏర్పాట్లూ చేశాం కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో హాకి ఇండియా, హాకీ ఆంధ్రప్రదేశ్ సహకారంతో కాకినాడ డీఎస్ఏ మైదానంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. సుమారు 10 రోజుల పాటు జరిగే పోటీలో పాల్గొనే క్రీడాకారులకు ఏ ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ పోటీలను క్రీడాభిమానులు తిలకించవచ్చు. – రవిచంద్ర, కోకనాడ కోస్టల్ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకుడు -
రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను గృహ నిర్బంధం చేసిన సందర్భంగా ఆయన నివాసం వద్ద వేణు విలేకరులతో మాట్లాడారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక వ్యాఖ్య చేశారు. కానీ అంతకు ముందు మీరు చేసిందమేటని ప్రశ్నించారు . రాంబాబు సంఘటన జరిగిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా మీ మంత్రులు, నాయకులు ఎటువంటి పదజాలంతో రాంబాబుని దూషించారో ప్రజలందరికీ తెలుసున్నారు. అంబటి మీద చట్టాన్ని ప్రయోగించి అరెస్టు చేశారు. మరి అదే చట్టం కూటమి నేతలకు ఎందుకు వర్తించదని ఆయన ప్రశ్నించారు. అంబటి ఇంటిపై దాడి చేసిన వారు, దాడికి ఉసిగొల్పిన వారి పై చర్యలు తీసుకోవాలన్నారు. అధికారం ఉంటే అరెస్టు చేయడమేనా అని నిలదీశారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను బయటకు వెళ్లకుండా గృహ నిర్బంధం చేయడం దారుణమన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను పక్కన పెట్టేశారు. వీటి గురించి ప్రతి పక్షం మాట్లాడకుండా చేయడానికే ఈ కుట్రలు పన్నుతున్నారు. -
నేడు యథావిధిగా పీజీఆర్ఎస్
రెవెన్యూ క్లినిక్లో ఫిర్యాదులు స్వీకరణ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్తో పాటు రెవెన్యూ క్లినిక్ యథావిధిగా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ కీర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేశారు. భూ సమస్యల పరిష్కార వేదికపై ప్రత్యేక దృష్టి సారించినట్టు ఆమె తెలిపారు. ఈ ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్ల రెవెన్యూ డివిజనల్ అధికారులతో పాటు జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దారులు ఉదయం 9.30 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించే రెవెన్యూ క్లినిక్కు ల్యాప్టాప్, కంప్యూటర్ ఆపరేటర్, అవసరమైన రెవెన్యూ రికార్డులతో తప్పని సరిగా హాజరుకావాలని ఆదేశించారు. గోదావరి డెల్టాకు సీలేరు జలాలు మోతుగూడెం: గోదావరి డెల్టాకు లోయర్ సీలేరు కాంప్లెక్స్ డొంకరాయి జలాశయం నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి డెల్టాకు సుమారు 8 వేల క్యూసెక్కుల వరకూ నీటి అవసరం ఉందని ఇరిగేషన్ అధికారులు తెలపడంతో, నీటి విడుదలకు ఏపీ జెన్కో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం నుంచి 28 రోజుల పాటు గోదావరి జిల్లాలకు రబీ అవసరాల నిమిత్తం జలాలు విడుదల చేయనున్నారు. డొంకరాయి డ్యామ్ నుంచి 3,800 క్యూసెక్కులు, పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి అనంతరం 4,200 క్యూసెక్కులు కలిపి మొత్తం 8 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. సుమారు రెండు నెలలు ఐదారు యూనిట్ల అనుసంధాన పనుల వల్ల నీటి విడుదల ఆలస్యం అయ్యిందని అధికారులు తెలిపారు. డొంకరాయి డ్యామ్ నుంచి దిగువలకు నీటిని విడుదల చేయడంతో సీలేరు నది ప్రవాహ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ జెన్కో అధికారులు సూచించారు. ఈ సమాచారాన్ని చింతూరు ఐటీడీఏ, రెవెన్యూ శాఖకు తెలిపామన్నారు. లోవలో భక్తుల సందడి తుని రూరల్: తలుపులమ్మ తల్లిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో ఆదివారం సందడి నెలకొంది. వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు లోవ దేవస్థానానికి ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. క్యూలో 8 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టు డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాలు, పూజా టికెట్లు, తలనీలాలు, వసతి గదుల అద్దెలు, విరాళాల ద్వారా రూ.3,93,652 ఆదాయం లభించిందని వివరించారు. ఏలేరు ఆయకట్టుకు నీటి విడుదల ఏలేశ్వరం: రబీ సాగు అవసరాల కోసం ఏలేరు రిజర్వాయర్ నుంచి ఆయకట్టుకు 1,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా ఆదివారం 83 మీటర్లుగా నమోదైంది. పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలకు గాను నీటి నిల్వలు 17.40 టీఎంసీలు ఉన్నాయి. ఆయకట్టుతో పాటు విశాఖకు 200, పంపా జలాశయానికి 25, తిమ్మరాజు చెరువుకు 20 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. -
ప్రభుత్వం కుట్ర
అంబటి హత్యకు ● మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి ● రంగంపేటలో కాగడాల ప్రదర్శన రంగంపేట: కాపు నేత, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు హత్యకు కూటమి ప్రభుత్వం కుట్ర చేసిందని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. అంబటి అక్రమ అరెస్టుకు నిరసనగా గ్రామంలో ఆదివారం రాత్రి కాగడాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామంలోని దేవిగుడి సెంటర్ నుంచి మెయిన్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ టీడీపీ గూండాలు పక్కా ప్రణాళికలతో అంబటి ఇంటిపై దాడి చేశారని, ఆ సందర్భంగా రాంబాబు దొరికితే చంపేసేవారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన వాగ్దానాలేవీ అమలు చేయలేక పోతున్నారన్నారు. లడ్డూ విషయంలో జంతువుల కొవ్వు లేదని తేలడం, పార్టీ నాయకులు సీఎం చంద్రబాబును నిలదీస్తుండడంతో తట్టుకోలేక అంబటి రాంబాబును అంతం చేయాలనే ఈ దాడులు చేశారన్నారు. గతంలో కూడా పేద ప్రజల పక్షాన పోరాడిన కాపు నాయకులు వంగవీటి మోహన్రంగాను ఏ రకంగా అంతమొందించారో ప్రజలందరికీ తెలుసని, తరువాత ముద్రగడ పద్మనాభాన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారన్నారు. అంబటిని పరామర్శించడానికి వెళుతున్న జక్కంపూడి రాజా, గణేష్లను అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారన్నారు. అంటే వైఎస్సార్ సీపీ నాయకులు బయట తిరుగుతుంటే ప్రభుత్వానికి భయం పట్టుకుందన్నారు. కాపు నేతలను క్రమంగా అడ్డుతొలగించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉందని ఎద్దేవా చేశారు. అలాగే మాజీ మంత్రి, బీసీ నాయకుడు జోగి రమేష్ ఇంటిపై కూడా కూటమి గూండాలు దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. కూటమి ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతున్న వైఎస్సార్ సీపీ నాయకులను లేకుండా చేయడమే రెడ్బుక్ రాజ్యాంగం లక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసినా ప్రజల మద్దతు వైఎస్సార్ సీపీకి ఉందని ప్రజల అండ ఉన్నంత వరకు మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరని సూర్యనారాయణరెడ్డి హెచ్చరించారు.ముకుందవరం–రంగంపేట గ్రామాల మధ్య హైడ్రామా మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టుకు నిరసనగా శాంతియుత కాగడాల నిరసనకు అనపర్తి నుంచి రంగంపేట వస్తున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డిని ముకుందవరం గ్రామం దాటిన తరువాత రంగంపేట, అనపర్తి ఎస్సైలు శివప్రసాద్, శ్రీనునాయక్లు తమ సిబ్బందితో అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో పార్టీ శ్రేణులు, పోలీసుల మధ్య హైడ్రామా నడిచింది. మాజీ ఎమ్మెల్యే కారును పోలీసులు అడ్డగించడంతో శ్రేణులు డాక్టర్ సూర్యనారాయణరెడ్డిని తమ భుజాలపై మోసుకుంటూ రంగంపేట వైపు కొంత దూరం తీసుకువచ్చి అక్కడ నుంచి పోలీసుల నుంచి తప్పించి మోటార్ సైకిల్పై రంగంపేట తీసువచ్చారు. అప్పటికే కాగడాలతో సిద్ధంగా ఉన్న పార్టీ నాయకులు, శ్రేణులు విజయవంతంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్ధాయిలో పాల్గొన్నారు. -
కట్టమూరులో పోలీసులపై దాడి
పెద్దాపురం (సామర్లకోట): పెద్దాపురం మండల పరిధి కట్టమూరు గ్రామంలో శనివారం రాత్రి అసభ్యకర నృత్య ప్రదర్శన జరుగుతుందని సమాచారం మేరకు వెళ్లిన పోలీసులపై ఆకతాయిల మూక దాడి చేసింది.. ఆ వివరాల ప్రకారం.. కట్టమూరులోని జోడిగుళ్ల ఉత్సవాల్లో భాగంగా నాటిక ప్రదర్శన మధ్యలో అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో అక్కడకు పెద్దాపురం సీఐ విజయకుమార్ వెళ్లి ప్రదర్శన నిలుపుదల చేయాలని నిర్వాహకులకు చెప్పారు. దీంతో మద్యం మత్తులో ఉన్న ఆకతాయిలు రెచ్చిపోయి రాళ్లు విసరడంతో సీఐతో పాటు క్రైమ్ హెడ్ కానిస్టేబుళ్లు నాగరాజు, రాధాకృష్ణ గాయపడ్డారు. అయితే హెచ్ కానిస్టేబుళ్లను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను ఎస్సై వి.మౌనిక పరామర్శించారు. పోలీసులపై దాడి చేయడంపై సర్వత్రా విమర్శలకు దారితీస్తుంది.వివాహిత అదృశ్యంనిడదవోలు: ఓ వివాహిత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై డి.రవికుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఉండ్రాజవరం గ్రామానికి చెందిన గాలింకి విజయకుమారికి ఆమె భర్త సాయిబాబాతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 29న పుట్టింటికి వెళ్తానని విజయకుమారి చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే ఆమె పుట్టింటికి వెళ్లకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆమె ఆచూకీ కోసం పలు ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆమె తల్లి కండెల్లి సుగుణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు. -
రోడ్డు ప్రమాదంలో దంత వైద్య విద్యార్థిని మృతి
మరో ముగ్గురికి తీవ్ర గాయాలురాజానగరం/ చాగల్లు: వైద్య విద్య పూర్తయ్యింది.. మరో వారం రోజుల్లో ఇంటికి వస్తానన్న కుమార్తె రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల్లో విషాదం నిండింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. చాగల్లుకు చెందిన జొన్నకూటి లిఖిత (23) రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో డెంటిస్ట్గా బీడీఎస్ పూర్తి చేసింది. ఐదేళ్ల కోర్సు పూర్తి కావడంతో ఈ నెల 7న ఇంటికి వచ్చేస్తున్నానని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారిపై దివాన్చెరువులోని ఐఓసీఎల్ పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో లిఖిత మృతి చెందింది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బొమ్మూరు ఎస్సై మురళీమోహన్ కథనం ప్రకారం.. స్థానిక జీఎస్ఎల్ దంత వైద్య కళాశాలలో ఇంటర్న్షిప్ చేస్తున్న లిఖిత తనతో పాటే ఇంటర్న్షిప్ చేస్తున్న విశాఖపట్నంకు చెందిన వట్టూరి వాత్సల్యసాయి, తునికి చెందిన సమయమంతుల జాహ్నవి రాజేశ్వరి, ఇంజినీరింగ్ చదువుతున్న కిశోర్తో కలసి, అతని కారులో శనివారం రాత్రి స్నేహితుల పుట్టినరోజు వేడుకలకు రాజమహేంద్రవరం వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ముందు భాగంలో ఎడమ వైపు కూర్చున లిఖిత అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన మిగిలిన ముగ్గురిని అటుగా ప్రయాణిస్తున్న వారు 108 అంబులెన్స్లో చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం తరలించారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుజ్జయ్యింది. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని బొమ్మూరు ఎస్సై తెలిపారు. శోకసంద్రంలో చాగల్లు లిఖిత మృతితో చాగల్లులో విషాద చాయలు అలముకున్నాయి. ఆదివారం సాయంత్రం ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, తోటి వైద్య విద్యార్థులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వైద్య విద్య పూర్తి చేసి దంత వైద్యురాలుగా సేవలందించాలనే తల్లిదండ్రుల కోటి ఆశలు తీరకుండానే మృత్యు ఒడికి చేరడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. లిఖిత తండ్రి వీర్రాజు వైద్య ఆరోగ్య శాఖలో డిప్యూటీ పారామెడికల్ అధికారిగా పని చేస్తుండగా, తల్లి మహాలక్ష్మి చాగల్లులో అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వహిస్తుంది. లిఖిత మృతదేహం వద్ద తహసీల్దార్ ఎం.మెరికమ్మ, ఐసీడీఎస్ సీడీపీఓ ఎం.ఆశారోహిణి, ఏఎంసీ చైర్మన్ నాదేండ్ల శ్రీరామ్, స్థానిక నాయకులు నివాళులు అర్పించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఆరిలోవ (విశాఖ) : ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణాపురం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుబ్బల మహేష్ (37) మృతి చెందాడు. అమలాపురానికి చెందిన మహేష్ తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై బీఆర్టీఎస్ రోడ్డులో వెళ్తుండగా, డివైడర్పై ఉన్న పూల మొక్కల కొమ్మలు తలకు తగలడంతో బైక్ అదుపు తప్పి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై మహేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, వెనుక కూర్చున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఆరిలోవ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లిళ్ల పేరుతో ఒంటరి మహిళలకు వల
● వివాహ సంబంధ సైట్ల ద్వారా పరిచయం ● ప్రతిపాదనలు పంపి ఆనక అడ్డంగా దోపిడీ ● ఘరానా మోసగాడిని అరెస్టు చేసిన పోలీసులు ● రూ.75 లక్షల విలువైన బంగారం, రెండు కార్లు స్వాధీనం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఒంటరి మహిళలను, భర్త లేని ఆడవారి వివరాలను తెలుగు మ్యాట్రిమొనీ, షాదీ డాట్ కామ్ల ద్వారా సేకరించి పెళ్లి నాటకమాడి ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వారి నుంచి రూ.లక్షలు దోచుకున్న ఘరానా మోసగాడు పోలీసుల చేతికి చిక్కాడు. అతని బాగోతం బయట పెట్టి, అతని నుంచి రూ.75 లక్షల విలువైన బంగారం, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం సెంట్రల్ జోన్ ఇన్చార్జి డీఎస్పీ వై.శ్రీకాంత్, సీఐ వి.అప్పారావు విలేరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం వడ్డురు గ్రామానికి చెందిన చల్లా నారాయణకృష్ణ తెలుగు మ్యాట్రిమొనీల ద్వారా భర్తలు చనిపోయి, ఒంటరిగా ఉన్న మహిళల ప్రొఫైల్ ఎంచుకునే వాడు. తాను బంగారం వ్యాపారం చేస్తుంటానని వారిని పరిచయం చేసుకునేవాడు. వివాహ ప్రతిపాదన పంపిస్తూ ‘మీ వివరాలను తన తల్లిదండ్రులకు చూపానని, మీరు వారికి నచ్చారని, జాతకాలు చూపించానని, చిన్న దోషం ఉందని, గోదావరి స్నానాలు చేసి పూజ చేస్తే పరిహారం అవుతుంద’ని నమ్మబలికే వాడు. ‘రాజమహేంద్రవరం గోదావరిలో స్నానాలకు వస్తే, మా అమ్మానాన్నలను తీసుకువచ్చి పరిచయం చేస్తాన’ని వారికి చెప్పేవాడు. మీ దగ్గరున్న బంగారు వస్తువులను ధరించి చక్కగా చీర కట్టులో రావాలని, అప్పుడే మా అమ్మ నాన్నకు మీరు నచ్చుతారని చెప్పేవాడు. ఇలా హైదరాబాద్, విశాఖపట్నం, కడప, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాలకు చెందిన మహిళలను రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్, బస్టాండ్లకు రమ్మని చెప్పేవాడు. అక్కడకు వచ్చాకా వారిని కారులో పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్ల వద్దకు తీసుకువెళ్లేవాడు. వారితో స్నానాలు చేయించే ముందు వారు ధరించిన బంగారు వస్తువులను తీసి బ్యాగులో పెట్టుకోమని చెప్పేవాడు. వారు స్నానం చేసి వచ్చిన తర్వాత దుస్తులు మార్చుకునే గదిలోకి పంపిస్తూ, తాను వెళ్లి పూజ సామానులు తీసుకువస్తానని చెప్పి నమ్మించి ఆ ఆభరణాలతో పారిపోయేవాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దోచుకువెళ్లిన బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. ఈ నేరాలకు ఉపయోగించిన రెండు కార్లు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో చిత్తూరు, తిరుపతి, విశాఖపట్నం, నెల్లూరు, కర్ణాటక ప్రాంతాల్లో 8 కేసులు ఉన్నాయి. నిందుతుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యహరించిన సీఐ వి.అప్పారావు, ఎస్సై వై.యేసుబాబు, బి.సురేష్, హెడ్ కానిస్టేబుళ్లు వి.కృష్ణ, ఎన్.వెంకటరామయ్య, ఎస్.చంద్రశేఖర్, కానిస్టేబుళ్లు బి.విజయ్ కుమార్, కె.పవన్ కుమార్, యస్.రామకృష్ణలను ఎస్పీ డి.నరసింహ కిశోర్ అభినందించి రివార్డులు ప్రకటించారు. -
విద్యార్థి ఆత్మహత్యాయత్నం
తాళ్లపూడి: గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని పట్టణ పోలీసులు రక్షించిన ఘటన కొవ్వూరులో చేటుచేసుకుంది. పట్టణ పోలీసులు రక్షించిన సంఘటనలో కొవ్వూరులో చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం వెంకటేశ్వరనగర్, మోరంపూడికి చెందిన 20 ఏళ్ల నరవ విశ్వతేజ శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో కొవ్వూరు వద్ద గోదావరిలో దూకి ఆత్మహత్యా యత్నం చేసినట్టు సీఐ విశ్వం తెలిపారు. బీ టెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడని, ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యకు పాల్పడినట్టు వివరించారు. 112కు సమాచారం రావడంతో వెంటనే స్పందించి స్విమ్మర్లను రప్పించి విశ్వతేజను రక్షించి కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఆయన తెలిపారు. -
‘కొవ్వు’ మాటలపై ఇప్పుడే మంటారు?
కపిలేశ్వరపురం (మండపేట): ప్రపంచ ప్రజలు ఆరాధ్య దైవంగా కొలిచే తిరుమల వేంకటేశ్వరస్వామి పవిత్ర లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనీ, లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతుకొవ్వు కలిసిందంటూ గతంలో కూటమి నేతలు చేసినదంతా దుష్ప్రచారమని తేలిందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. విచారణ అనంతరం నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదంటూ సిట్ విచారణ నివేదికలో వెల్లడించిన నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్లు ఇప్పుడేం చెబుతారని ప్రశ్నించారు. తమ రాజకీయ లబ్ధి కోసం చివరకు దేవుడి వ్యవహారాన్ని కూడా దుష్ప్రచారం చేసిన నేతలుగా చంద్రబాబు, పవన్ కల్యాణ్లు చరిత్రలో నిలుస్తారని ఎమ్మెల్సీ తోట అన్నారు. మండపేటలో వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శనివారం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, మండపేట పట్టణం, రూరల్ కమిటీల కన్వీనర్లు పిల్లి శ్రీనివాస్, అడబాల బాబ్జి, జిల్లా అధికార ప్రతినిధి సిరిపురపు శ్రీనివాస్, సీనియర్ నాయకులు పిల్లా వీరబాబులతో కలిసి ఎమ్మెల్సీ తోట విలేకరులతో మాట్లాడారు. లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కలవలేదని సిట్ విచారణ నివేదిక తేటతెల్లం చేసిందని, గతంలో చేసిన దుష్ప్రచారానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఆరోపణలు చేసిన రోజుల్లోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్లు చేస్తున్నది దుష్ప్రచారమనీ, వారి ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని నిబద్ధతతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరిన విషయాన్ని ఎమ్మెల్సీ తోట గుర్తు చేశారు. రాజకీయాలను హుందాగా ప్రజాకోణంలో చేయాలని, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా దేవుడి వ్యవహారంలో దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. చంద్రబాబు బాటలోనే వేగుళ్ల చంద్రబాబు బాటలోనే ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు నడుస్తున్నారన్నారు. సిట్ విచారణలో జంతు కొవ్వు కలవలేదని తేల్చి చెప్పగా కల్తీ జరిగిందంటూ ఎమ్మెల్యే వేగుళ్ల ప్రెస్మీట్ పెట్టి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కల్తీ జరిగిందని చెబుతున్న ఎమ్మెల్యే సిట్ విచారణ నివేదికను ఎందుకు బహిర్గతం చేయడం లేదని, చర్యలు ఎందుకు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. పైగా సిట్ విచారణపై వైఎస్సార్ సీపీ నేతలు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే వేగుళ్ల అనడం విడ్డూరంగా ఉందన్నారు. తనను అలిపిరి ఘటన నుంచి రక్షించింది శ్రీవారే అని ఒక పక్కన చెబుతూ ఆ శ్రీవారినే రాజకీయాల్లోకి లాగడం ఏపాటి ధర్మమో చంద్రబాబు చెప్పాలన్నారు. పవిత్ర లడ్డూ ప్రసాదాన్ని రాజకీయం చేసిన ఎవరినీ శ్రీ వేంకటేశ్వరస్వామి వదలడని అన్నారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నపై చేస్తున్న ఆరోపణలు ఏమాత్రమూ సరికాదన్నారు. టీటీడీ ఆర్థిక వ్యవహారాలన్నీ బ్యాంక్ ఖాతాల ఆధారంగా జరుగుతాయన్న సంగతిని కూటమి నేతలు గుర్తించాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు ఆలీఖాన్ బాబా, మందపల్లి రవికుమార్, ఎర్రగుంట అయ్యప్ప, జొన్నపల్లి సత్తిబాబు, పోతుల రాంబాబు, పోతుల ప్రసాద్, యరమాటి వెంకన్నబాబు, దాసరి వీర వెంకట లక్ష్మి, వాసిరెడ్డి అర్జున్, కోళ్ళ శ్రీను, తీగిరెడ్డి మహేష్, మరివాడ సూరిబాబు పాల్గొన్నారు. రాజకీయ లబ్ధి కోసం నెయ్యిలో కొవ్వు కలిసిందన్నారు కొవ్వు కలవలేదని సిట్ విచారణ నివేదిక ఇచ్చింది తమ ప్రయోజనాల కోసం దేవుణ్ణి రాజకీయం చేశారు చంద్రబాబు, పవన్ కల్యాణ్లపై ఎమ్మెల్సీ తోట ఫైర్ 0000681473-000001-RJY ADSALES SPO 8.00x10.00 RJY ADSALES SPOT PAYMENT ACCOUNT -
గర్జించిన విద్యాలోకం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కందుకూరి రాజ్యలక్ష్మీ మహిళా కళాశాల హాస్టల్ను రాజకీయ రాబందుల చేతిలోంచి రక్షించాలని, వెంటనే దానిని ప్రభుత్వం స్వాఽఽధీనం చేసుకోవాలని విద్యార్థులు కదం తొక్కారు. కొద్దిరోజులుగా విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు కందుకూరి రాజ్యలక్ష్మీ మహిళా కళాశాల హాస్టల్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆందోళనలు చేస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం కలెక్టర్ బంగ్లా వద్ద వందల మంది విద్యార్థులు బైఠాయించారు. పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దీంతో పోలీసు బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని అక్కడ నుంచి పంపించి వేసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఇద్దరు విద్యార్థులకు, ఎస్ఎఫ్ఐ నాయకులకు గాయాలయ్యాయి. ముందుగా ఉన్నత విద్యా రీజినల్ జాయింట్ డైరెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. ఆర్జేడీ బయటకు వచ్చినా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. అక్కడి నుంచి విద్యార్థులు భారీ ర్యాలీగా కలెక్టర్ క్యాంప్ ఆఫీస్కు చేరుకున్నారు. సమస్యలను రాసి వినతిపత్రం పట్టుకుని రమ్మని, దానిపై చర్చించి సమస్య పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో వారు సాయంత్రం ఆర్డీవో కార్యాలయానికి చేరుకుని ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు. మాజీ ఎంపీ భరత్ మద్దతు కార్యక్రమానికి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ మద్దతు తెలియజేస్తూ విద్యార్థుల సమస్య పరిష్కారం అయ్యే వరకూ వారికి మద్దతుగా ఉంటామని, దీనిపై కోర్టులో కేసు వేస్తామని చెప్పారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్ మాట్లాడుతూ జీవో నంబర్ 42 ప్రకారం కందుకూరి విద్యాసంస్థలు ఐదింటిలో నాలుగు ప్రభుత్వ పరం అయ్యాయన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్నట్టు ప్రతీ విద్యాసంస్థకి జీవోలు వచ్చాయని, అందులో భాగమైన కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల జీవో నెం 28 ప్రకారం స్థర, చర ఆస్తులతో 2022 నుంచి ప్రభుత్వ కళాశాలగా నడుస్తోందన్నారు. హితకారిణి సమాజం చైర్మన్, పాలకమండలి, ఎండోమెంట్ ఈఓ కలిసి కళాశాల ప్రిన్సిపాల్ లేని సమయంలో స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ని దౌర్జన్యంగా లాగేసుకున్నారన్నారు. ఆ సమయంలో ఆర్జేడీ ఉన్నా దానిని ఆపలేదన్నారు. దానిని అడ్డుకున్న విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులపై కేసులు బనాయించారన్నారు. కళాశాల మొత్తం క్యాంపస్ ప్రభుత్వానిదేనని, దీనిలో ఇతర డిపార్ట్మెంట్, హితకారిణి సమాజం ఎందుకు జోక్యం చేసుకుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కందుకూరి రాజ్యలక్ష్మీ వుమెన్స్ కళాశాల హాస్టల్ తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి భారీ ఎత్తున ఆందోళన, ధర్నా చేసిన విద్యార్థులు పోలీసుల తోపులాటలో విద్యార్థులకు, ఎస్ఎఫ్ఐ నాయకులకు గాయాలు -
ఆటో ఢీకొని వ్యక్తి మృతి
కాజులూరు: ద్వారపూడి–యానం రహదారిలో కాజులూరు మండలం కోలంక వద్ద ఆటో ఢీకొని దుగ్గుదుర్రు శివారు పొలమూరుపాడుకు చెందిన వినకోటి కొండబాబు (36) మృతి చెందాడు. స్థానికులు, గొల్లపాలెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొండబాబు తన మోటారుబైక్పై పాల కోసం వెళ్లి తిరిగి వస్తుండగా కోలంక అటుకుల మిల్లు వద్దకు వచ్చేసరికి ద్రాక్షారామ నుంచి యానం వెళుతున్న ఆటో ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటనలో కొండబాబు తలకు బలమైన గాయం కావడంతో అతడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు గమనించి 108 అంబులెన్సుకి సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే కొండబాబు మృతి చెందాడు. మృతదేహాన్ని ఎస్సై ఎం.మోహన్కుమార్ పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కోలంకలో ఆటో డీ కొని మృతి చెందిన వినకోటి కొండబాబు -
పులి సంచరిస్తోంది.. అప్రమత్తం!
● చినకొండేపూడి–పెదకొండేపూడి మధ్య పాదముద్రల గుర్తింపు ● అవి పులివేనని ధ్రువీకరించిన రేంజ్ ఆఫీసర్ దావీద్ రాజు సీతానగరం: మండలంలోని చినకొండేపూడి – పెదకొండేపూడి పంట పొలాల్లో పులి పాద ముద్రలను స్థానికుకులు గుర్తించి శనివారం అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వాటిని పులి పాద ముద్రలేనని ధ్రువీకరించారు. స్థానిక గెడ్డం రామకృష్ణ పంట పొలంలో గుర్తించిన ఆ పాద ముద్రలపై స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏలూరు జిల్లాలో ఇటీవల తిరుగుతున్న పులి ఇక్కడికి వచ్చి ఉండవచ్చని భావించిన రాజమహేంద్రవరం అటవీశాఖ రేంజ్ అధికారి ఎన్.దావీద్ రాజు, అల్లూరి సీతారామరాజు జిల్లా రేంజ్ అధికారి కొండలరావు తమ సిబ్బందితో క్షేత్రస్థాయికి వెళ్లి పాద ముద్రలను పరిశీలించారు. స్థానిక తహసీల్దార్ ఎ.శ్రీనివాస్, ఎస్సై డి.రామ్ కుమార్ అక్కడికి చేరుకుని అటవీశాఖాధికారులో చర్చించారు. అనంతరం అటవీ రేంజ్ అధికారి దావీదురాజు విలేకరులతో మాట్లాడుతూ ఏలూరు జిల్లా పోలవరం దగ్గరలో ఇటుక కోటలో శుక్రవారం రాత్రి పులి రెండు దూడలపై దాడి చేసి హతమార్చిందని, అక్కడ నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకం వైపు వచ్చిందని, కాలువ వద్ద రాళ్లు ఉండటంతో పాద ముద్రలు పడలేదన్నారు. గోదావరి దాటి చినకొండేపూడి వైపు వచ్చిందన్నారు. ఆ పులి పాదముద్రలు, ఇక్కడ పాదముద్రలు ప్లగ్ మార్క్ ఒకటేనని గుర్తించామన్నారు. పులి పెదకొండేపూడి మీదుగా పురుషోత్తపట్నం అడవి వైపు వెళ్తున్నట్టుగా పాద ముద్రలు ఉన్నాయని తెలిపారు. పంట పొలాల్లోను, పెదకొండేపూడి గోశాల వద్ద, అనుమానిత ప్రాంతాల్లో సెన్సార్ ట్రాప్ కెమెరాలు అమర్చామని తెలిపారు. రైతులు ఎక్కడైనా పులి పాదముద్రలు గుర్తిస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రైతులు తమ పొలాలకు ఉదయం 8 గంటల తరువాతే వెళ్లాలని, సాయంత్రం 4 గంటల తరువాత పంట పొలాల్లో ఉండవద్దని హెచ్చరించారు. పశువులను సాధ్యమైనంత వరకు గ్రామాల్లో కట్టుకోవాలని, లైట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాత్రి వేళ బయటకు వెళ్లాల్సి ఉంటే గుంపులుగా వెళ్లాలని సూచించారు. అప్రమత్తంగా ఉండాలి చినకొండేపూడి, పెదకొండేపూడి, చీపురుపల్లి, అచ్చియ్యపాలెం, నాగంపల్లి, పురుషోత్తపట్నం, మండలంలోని గ్రామాల రైతులు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్సై రామ్ కుమార్ హెచ్చరించారు. దీంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
కల్యాణ వీణ.. మోగేటి వేళ..
● మాఘం నుంచి మోగనున్న మంగళ వాయిద్యాలు ● జూన్ వరకు మంచి ముహూర్తాలు ● వివాహ, అనుంబంధ రంగాల వ్యాపారాలకు అనువైన కాలం తాళ్లపూడి: మాఘమాసం ఎప్పడొస్తుందో.. మౌన రాగాలెన్ని నాళ్లో.. అని కూనిరాగాలు తీసే కన్నెపిల్లలకు కలిసొచ్చే కాలం వచ్చేసింది. శ్రీరస్తు.. శుభమస్తు.. అవిఘ్నమస్తు అని కల్యాణ శుభలేఖలు అచ్చు వేయించే మంచి ముహూర్తాలు ముంచుకొచ్చేస్తున్నాయి. సనాతన ధర్మంలో వివాహ వ్యవస్థకు ఎంతో విశిష్ట స్థానం ఉంది. కాలానికి అనుగుణంగా ట్రెండ్ అందుకోకపోతే ఏదో మనం వెనకపడ్డామా అన్న ఫీలింగ్ వధూ వరులిద్దరిలోనూ ఉంటుంది. అన్ని రంగాల్లోను ఆధునిక సాంకేతికతలో మార్పులు వచ్చినట్టే వివాహ వేడుకలలోకీ దూసుకొచ్చేశాయి. ప్రీ వెడ్డింగ్, పోస్టు వెడ్డింగ్ షూట్లు, డ్రోన్ ఫొటోగ్రఫీ, ఏసీ ఫంక్షన్ హాళ్లు, విద్యుత్ సెట్టింగ్లు, భారీ డెకరేషన్లు, రిసెప్షన్లు అన్నింటా పెద్ద మార్పులే చోటుచేసుకున్నాయి. ఇలాంటివి ఎన్నున్నా మామిడి తోరణాలు, తాటాకు పందిళ్లది మాత్రం ప్రత్యేక ఆకర్షణ. మాఘం ఆగమించడంతో పెళ్లి బాజాలు మోగనున్నాయి. జూన్ వరకు మంచి మూర్తాలు ఉండగా, జూలై 22 తరువాత నుంచి నవంబర్ 20 వరకు మళ్లీ ఖాళీ. దీంతో నియోజకవర్గంలో పెళ్లి సందళ్లు మొదలయ్యాయి. నియోజకవర్గంలో 19 వరకు ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. కొవ్వూరులో 7, తాళ్లపూడిలో 8, చాగల్లులో 4 వరకు కల్యాణ మండపాలున్నాయి. జోరుగా వ్యాపారాలు ఈ సీజన్లో వ్యాపారాలు జోరందుకోనున్నాయి. దుస్తులు, బంగారం, ఇతర వస్తువుల కొనుగోళ్లు భారీగా సాగుతాయి. ఏసీ ఫంక్షన్ హాళ్లు, బ్యాండ్ పార్టీలు, పురోహితులు, క్యాటరింగ్, ఫొటోగ్రాఫర్లు, టెంట్, లైటింగ్, డేకరేషన్, ఈవెంట్ ఆర్గనైజర్లు, ఇలా అందరికీ చేతి నిండా పని దొరుకుతుంది. ఒక్కో పెళ్లి, ఫంక్షన్కు రూ.10 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చు కానుంది. ఏసీ కల్యాణ మండపాలపై ఆసక్తి ఇటీవల వివాహాది శుభకార్యాలకు ఏసీ కల్యాణ మండపాలపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. మిరిమిట్లు గొలిపే విద్యుద్దీపాలంకరణలు, వేదికల సెట్టింగులు ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. మారుమూల గ్రామాల్లో సైతం ఈ మండపాలు ఉన్నాయి. పెళ్లికి వారం రోజుల ముందు నుంచే వివిధ రకాల స్వాగత తోరణాలు, కల్యాణ మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఏసీ కళ్యాణ మంపడం అయితే ఖర్చులన్నిటితో కలిపి రూ.80 వేల నుంచి సుమారు రూ. రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నారు. పచ్చి పూల మండపాలకు గిరాకీ నిశ్చయ తాంబూలాల నుంచి చిన్నచిన్న ఫంక్షన్లకు సైతం పచ్చిపూల మండపాలు ఏర్పాటు చేయడం తప్పనిసరైంది. ఒక్క వివాహానికి లైటింగ్, క్లాత్ సెట్టింగ్కు రూ.25 వేలు నుంచి రూ.లక్షకు పైగా ఖర్చవుతుంది. పచ్చిపూల మండపానికి అయితే రూ.25 వేల నుంచి రూ. 1.7 లక్షలకు పైగా వెచ్చిస్తున్నారు. అలాగే ఫ్లెక్సీలు, ఎల్ఈడీ స్క్రీన్లు, పత్రికా ప్రకటనలకు, మ్యుజికల్ నైట్, స్కిట్లు, ఈవెంట్లకు అదనపు వ్యయం తప్పదు. ప్రీ, పోస్టు వెడ్డింగ్ షూట్లు పెళ్లినాటి జ్ఞాపకాలు పది కాలాల పాటు పదిలం చేసుకోవడానికి ఫొటోలు తీయించుకోవడం అనవాతీ. పందిరి రాట మొదలు, అత్తవారింటికి వెళ్లే వరకు ఆ మధుర క్షణాలకు కొదవుండదు. అందుకు డిజిటల్ ఫొటో అల్బమ్ దగ్గర నుంచి వీడియోల వరకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. ఇందుకు డ్రోన్ టెక్నాలజీ, ఎల్ఈడీ స్క్రీన్ల ఏర్పాటు, టీజర్లు, ప్రీ, పోస్టు వెడ్డింగ్ షూట్లు, మెహందీ వంటివి నిర్వహిస్తున్నారు. క్యాటరింగ్ కల్చర్ బంధుజనాలు పది కాలాలు చెప్పుకొనేలా విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు క్యాటరింగ్కు అప్పగిస్తూ భారీ మెనూతో భోజనాలు పెడుతున్నారు. అంతే కాకుండా అతిథులకు స్వాగత సత్కారాలు చేయడానికి కుందనపు బొమ్మల్లాంటి యువతులను సింహ ద్వారాల వద్ద ఏర్పాటు చేస్తున్నారు. 23 మంచి ముహూర్తాలు ఈ మాఘమాసం మొదలు జూలై 11 వరకు పెద్ద ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు. పెళ్లిళ్లతోపాటు గృహప్రవేశాలు, శంకుస్థాపనలు కూడా ఊపందుకున్నాయి. ఐదు నెలల పాటు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో మాఘ, చైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసాల్లో పెళ్లి బాజాలు మోగుతూనే ఉంటాయి. ఫిబ్రవరి: 5, 6, 8, 10, 12, 14, 19, 20, 21, 24, 25, 26 తేదీల్లో, మార్చిలో 3, 4, 7, 8, 9, 11, 12, ఏప్రిల్లో 15, 20, 21, 25, 26 తేదీల్లో, మే నెలలో 1, 3, 5, 6, 7, 8, 13, 14 తేదీల్లో, జూన్లో 21, 22, 23, 24, 25, 26, 27, 29 తేదీల్లో, జూలైలో 1, 6, 7, 11 తేదీల వరకు ఉన్న ముహూర్తాలలో పెళ్లిళ్లు జరగనున్నాయి. -
నిగ్గు తేలినా సిగ్గు వదలరా?
సాక్షి, రాజమహేంద్రవరం: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన దుష్ప్రచారం పటాపంచలైంది. చంద్రబాబు, కూటమి నేతల చేసిన ఆరోపణల్లో నిజం లేదని, లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ తేల్చేసింది. స్వార్థ రాజకీయాలకు చివరకు తిరుమల వేంకటేశ్వర స్వామిని సైతం వాడుకున్న చంద్రబాబు, పవన్కళ్యాణ్, కూటమి నేతలకు మంచిబుద్ధి ప్రసాదించాలని, కూటమి నేతల అపచారం పోవాలని.. వైఎస్సార్ సీపీ పాప ప్రక్షాళన పూజలు చేపట్టింది. పార్టీ ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి లడ్డూ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాలకు నిరసనగా జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, పార్టీ శ్రేణులు, ప్రజలు వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో పాప ప్రక్షాళన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం పాపం మీద పాపం చేస్తూ తిరుమల క్షేత్రానికి కళంకం తీసుకువస్తోందని నేతలు అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలని జిల్లావ్యాప్తంగా భక్తులు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం సిటీ తిరుమల ప్రసాదానికి చంద్రబాబు ఘోర అపచారం చేశారని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. పవిత్ర తిరుమల ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకోవడం దారుణమన్నారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో పాప పరిహార పూజలు నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వర స్వామికి చంద్రబాబు చేసిన ఘోర అపచారం కారణంగా రాష్ట్రానికి, ప్రజలకు ఎలాంటి నష్టం కష్టం రాకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ పాప పరిహార పూజలు చేశామని భరత్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో దేశంలోనే ప్రముఖమైన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఏ ల్యాబ్లు చేసిన పరీక్షల్లో చంద్రబాబు ఆరోపించినట్టుగా ఎలాంటి జంతువుల కొవ్వు గాని, గొడ్డు కొవ్వు గాని, పంది కొవ్వు గాని తిరుమల ప్రసాదంలో వాడే నెయ్యిలో లేదని తేలిపోవడం అందరికీ చాలా సంతోషాన్ని, భక్తులకు ఊరటను ఇచ్చిందన్నారు. రాజమహేంద్రవరం రూరల్ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల ప్రసాదానికి చంద్రబాబునాయుడు ఘోర అపచారం చేశారని, ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని చంద్రబాబునాయుడు తప్పులు చేస్తున్నారన్నారు. పవిత్ర తిరుమల తిరుపతి ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకోవడం దారుణమన్నారు. చంద్రబాబు నాయుడు కుట్రల కారణంగా కలిగిన అపచారాల వల్ల రాష్ట్ర ప్రజలకు ఎలాంటి కష్టం– నష్టం కలుగకుండా పాప పరిహార పూజలు నిర్వహించినట్లు వేణు వెల్లడించారు. అనపర్తి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందంటూ చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ అండ్ కో చేసిన ప్రచారం పూర్తిగా అబద్ధమని కోర్టుకు సమర్పించిన చార్జ్షీట్తో స్పష్టమైందని అనపర్తి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం కోట్లాది హిందూ భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనపర్తిలోని పోతారెడ్డి రామాలయం ప్రాంగణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పరిహార పూజలు నిర్వహించారు. కొవ్వూరు తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని వేదికగా చేసుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కూటమి నేతలు చేస్తున్న కుట్రలు దారుణమని వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. స్థానిక శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో పాప ప్రక్షాళన పూజలు నిర్వహించారు. ఆలయం బయట చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబుకు, పవన్కళ్యాణ్కు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరారు. రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు కోట్లాది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారన్నారు. దుర్మార్గపు కుట్రను తిరుమల వెంకన్న స్వామే కూల్చేశారన్నారు. నిజాలు తెలిసినప్పటికీ ఇంకా అసత్య ప్రచారం చేయడం దారుణమన్నారు. రాజానగరం తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ చెప్పినా.. చంద్రబాబు, కూటమి నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించాలని వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. పాప ప్రక్షాళన పూజల్లో భాగంగా రాజానగరంలోని రావులచెరువు గట్టున ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ శ్రేణులు కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిడదవోలు తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కూటమి నేతలు చేసిన నీచమైన విష ప్రచారం పూర్తిగా అసత్యమని తేలింది. అయినా అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను గాయపరుస్తున్న టీడీపీ నేతల వైఖరిగా నిరసనగా నిడదవోలు పట్టణంలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోపాలపురం తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేసిన కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ గోపాలపురంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవరపల్లి, గోపాలపురం, నల్లజర్ల మండలాల పారీ అధ్యక్షులు, నేతలు బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. అనపర్తిలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజల అనంతరం నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డిరాజానగరంలో కొబ్బరి కాయలు కొడుతున్న వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు విజయలక్ష్మి తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సీబీఐ నిర్ధారణ అయినా టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారంపై వైఎస్సార్ సీపీ ఆగ్రహం వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో పాప ప్రక్షాళన పూజలు జిల్లావ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో నిర్వహించిన పార్టీ శ్రేణులు -
ఘనంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామి అధ్యయనోత్సవాలు
గజవాహనంపై స్వామి గ్రామోత్సవం కోరుకొండ: శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి అధ్యయనోత్సవాలు 3వ రోజు శనివారం ఘనంగా జరిగాయి. స్వామివారి దత్తత దేవస్థానమైన అన్నవరం శ్రీవీరవెంకట సత్యనారాయణస్వామి ఆలయం, వ్యవస్థాపక ధర్మకర్త పరాశర రంగరాజ భట్టర్ ఆధ్వర్యంలో ఈ అధ్యయన ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 29వ తేదీన ప్రారంభమయిన ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారికి గజవాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ప్రతీరోజు ఉదయం 9–30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహిస్తున్న దర్శనాల్లో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఉత్సవాలకు సుధూర ప్రాంతాల నుంచీ భక్తులు హాజరవుతున్నారు. గ్రూప్–1 ఫలితాల్లో శ్రీరమణి సత్తా స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్గా ఎంపిక నిడదవోలు రూరల్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో నిడదవోలు మండలం డి.ముప్పవరం గ్రామానికి చెందిన ద్రోణంరాజు శ్రీరమణి సత్తా చాటారు. స్టేట్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ పోస్టుకు ఎంపికయ్యారు. తండ్రి నరసింహారావు ప్రైవేటు చార్టర్డ్ అకౌంటెంట్గా పనిచేయగా, తల్లి సుధ గృహిణి. శ్రీరమణీ నిడదవోలులోని ఒక ప్రైవేటు పాఠశాలలో ఇంటర్ చదివి, ఎంఏ పొలిటికల్ సైన్స్ పూర్తిచేశారు. శ్రీరమణి యూపీఎస్సీ పరీక్షలో సత్తా చాటి సివిల్స్ సాధించడమే తన లక్ష్యంగా కృషిచేస్తానని శనివారం తెలిపారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలు నాలుగుసార్లు హాజరుకాగా అర్హత సాధించలేదని, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గ్రూప్–1 పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడంతో ఎంతో ఆనందంగా ఉందని శ్రీరమణి చెప్పారు. తమ గ్రామానికి చెందిన యువతి శ్రీరమణి గ్రూప్–1 ఉద్యోగం సాధించడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అభినందించిన గ్రామస్తులు శ్రీరమణి డి.ముప్పవరం గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చిందని సర్పంచ్ నాగిరెడ్డి నాగదేవి గ్రామస్తులు కొనియాడారు. -
కొనసాగిన ఏసీబీ తనిఖీలు
కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండో రోజూ పరిశీలన కడియం: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండో రోజు శుక్రవారం కూడా ఏసీబీ తనిఖీలు కొనసాగాయి. ఏసీబీ డీఎస్పీ ఎం.కిశోర్కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఈ తనిఖీలు నిర్వహించారు. గురువారం సబ్ రిజిస్ట్రార్ ఎప్పిలి లక్ష్మి టేబుల్లో రూ.79 వేలు, సమీపంలోని డాక్యుమెంట్ రైటర్ల వద్ద రూ. 1,03,210 స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. రాత్రి 8.30 గంటలకు వచ్చిన ఏసీబీ అధికారులు కార్యాలయాన్ని తమ అదుపులోకి తీసుకుని పొద్దుపోయే వరకూ తనిఖీ చేశారు. తిరిగి శుక్రవారం ఉదయం రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీతో సహా, జిల్లా సిబ్బంది కార్యాలయానికి వచ్చి గత కొన్ని రోజులుగా రిజిస్టర్ అయిన డాక్యుమెంట్లను పరిశీలించారు. త్వరలో డీఆర్గా పదోన్నతి పొందనున్న ఎప్పిలి లక్ష్మిపై ఏసీబీ తనిఖీలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. రూ.2.62 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి కడియం సబ్ రిజిస్ట్రార్ (ఎస్ఆర్ఓ) ఎప్పిలి లక్ష్మి కారణంగా రూ. 2.62 కోట్లకు పైగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ కిశోర్కుమార్ తెలిపారు. శుక్రవారం కూడా రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో తమ సిబ్బందితో కలసి తనిఖీలు కొనసాగించామని అన్నారు. తక్కువ వాల్యూతో డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయడం కారణంగా ప్రభుత్వానికి రూ.2.62 కోట్ల నష్టం వచ్చిందని ఈ తనిఖీల్లో గుర్తించామని ఆయన తెలిపారు. అలాగే జనవరి 28, 29వ తేదీల్లో మొత్తం 144 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేయగా, ఇందులో 107 డాక్యుమెంట్లు సంబంధిత కక్షిదారులకు ఇవ్వకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎస్ఆర్ఓ దగ్గరే ఉంచుకున్నారన్నారు. 2025లో మొత్తం 911 డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా, వీటికి సపోర్టింగ్ డాక్యుమెంట్లు సక్రమంగా లేవన్నారు. గతంలో ఆమె పనిచేసిన చోట్ల కూడా తక్కువ విలువ కారణంగా ప్రభుత్వానికి రూ.95 లక్షల నష్టం కలిగించినట్లు కూడా తమ విచారణలో వెల్లడైందని డీఎస్పీ వెల్లడించారు. ఇంకా విచారణ కొనసాగుతోందని, పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలియజేస్తామన్నారు. కాగా శుక్రవారం రిజిస్ట్రేషన్లను నిలిపివేశారు. లేఖర్ల నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేసుకున్నారు. అలాగే రెండు రోజులుగా జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించిన కక్షిదారులను కూడా పిలిపించి, వారి నుంచి కూడా ఏసీబీ అధికారులు వివరాలు ఆరా తీశారు. కాగా కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీల విషయం తెలుసుకుని పలువురు బాధితులు అక్కడికి చేరుకుని తమ ఫిర్యాదులను అధికారులకు వివరించడం గమనార్హం. -
అరటి.. అధరహో
లారీపై అరటి గెలలను ఎగుమతి చేస్తున్న కూలీలు ● దండిగా పెరిగిన అరటి ధర ● గతంలో 10 టన్నులు రూ.60 వేల నుంచి రూ.90 వేలు ● నేడు రూ.1.70 లక్షలకు చేరిక ● ఇతర రాష్ట్రాల్లో తగ్గిన ఉత్పత్తి ● మన అరటికి ఒక్కసారిగా డిమాండు ● ఫలితంగా దాదాపు రెట్టింపైన రేటు పెరవలి: ప్రభుత్వం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా.. మార్కెట్ పరిస్థితులు అనుకూలించడంతో అరటి ధరల ఒక్కసారిగా భారీగా పెరిగాయి. దీంతో, నష్టాల ఊబి నుంచి బయట పడే పరిస్థితులు నెలకొంటున్నాయని అరటి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మోంథా తదితర తుపాన్ల ధాటికి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అరటి తోటలకు భారీగా నష్టం వాటిల్లింది. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం నుంచి నయాపైసా పరిహారం అందలేదు. అదే సమయంలో మరోవైపు మార్కెట్లో ధరల గణనీయంగా పతనమవడంతో అరటి రైతులు విలవిలలాడిపోయారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అరటి ధరలు పతనమైనప్పుడు.. రైతుల నుంచి అరటిని గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి, దేశంలోని ఇతర ప్రాంతాల్లోని మార్కెట్లకు ముఖ్యంగా ఢిల్లీ వంటి చోట్లకు ప్రత్యేక రైళ్లలో ఎగుమతులు చేశారు. తద్వారా రైతులను ఆదుకున్నారు. చంద్రబాబు సర్కారు హయాంలో ధరలు పడిపోయినప్పటికీ ఆదుకున్న దాఖలాలే లేవు. ఫలితంగా రైతులు ఏడాది కాలంగా తీవ్ర నష్టాలు చవి చూశారు. ఇతర రాష్ట్రాల డిమాండుతో.. ఇటువంటి పరిస్థితుల్లో కొన్నాళ్లుగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అరటి దిగుబడి గణనీయంగా పడిపోయింది. ముఖ్యంగా తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ తదితర రాష్ట్రాల్లో తుపాన్ల ప్రభావంతో అరటి తోటలు దెబ్బ తిని, దిగుబడి లేకుండా పోయింది. ఇది కాస్తా మన రైతులకు కలసి వచ్చి, నెల రోజులుగా ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం జిల్లా నుంచి ఆయా రాష్ట్రాలకు ప్రతి రోజూ 60 లారీల వరకూ అరటి ఎగుమతులు జరుగుతున్నాయి. ఫలితంగా డిమాండ్ రావటంతో అరటి ధరలు ఒక్కసారిగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో, అరటి రైతుకు కాస్త ఊరట లభించింది. జిల్లాలో అన్ని రకాలు కలిపి 7,500 హెక్టార్లలో సుమారు 8 వేల మంది రైతులు అరటి సాగు చేస్తున్నారు. ముఖ్యంగా పెరవలి, నిడదవోలు, ఉండ్రాజవరం, నల్లజర్ల, చాగల్లు, కొవ్వూరు, దేవరపల్లి, గోపాలపురం, తాళ్లపూడి, సీతానగరం, రాజానగరం, అనపర్తి మండలాల్లో అరటి సాగు అధికంగా ఉంది. ప్రస్తుతం 4 వేల హెక్టార్లలో తోటల నుంచి దిగుబడి వస్తోంది. కానీ, ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు పెరగటంతో గెల ఏమాత్రం పక్వానికి వచ్చినా రైతులు వెంటనే వాటిని కోసి, మార్కెట్కు తరలిస్తున్నారు. ధరలు పెరిగాయిలా.. మార్కెట్లో అరటి ధరలు గత ఏడాది జూన్ నుంచి పతనమవుతూ వచ్చాయి. నిన్న మొన్నటి వరకూ 10 టన్నుల లారీ కర్పూర రకం అరటికి రూ.60 వేల నుంచి రూ.90 వేల వరకూ మాత్రమే ధర పలికేది. అటువంటిది ఇప్పుడు డిమాండ్ పెరగడంతో ఆ ధర ఏకంగా రూ.1.70 లక్షలకు పెరిగింది. దీంతో, రైతులు గత నష్టాలు పూడ్చుకునే పరిస్థితి వచ్చిందని రైతులు ఆనందిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ వ్యాపారులు తోటల వైపు తొంగి చూసేవారే కాదు. అటువంటిది ఇప్పుడు డిమాండు పెరగడంతో వారు నేరుగా తోటల వద్దకు వచ్చి, రైతులకు అడ్వాన్సులు ఇచ్చి మరీ కొనుగోలు చేస్తున్నారు. చక్కెరకేళీ గెల రూ.300, ఎర్ర చక్కెరకేళీ గెల రూ.500కు కొనుగోలు చేస్తున్నారు. సైకిల్ లోడ్ (6 గెలలు) కర్పూర రకం అయితే నాణ్యతను బట్టి రూ.1,500 నుంచి రూ.1,800, చక్కెరకేళీ రూ.2 వేల నుంచి రూ.2,400, ఎర్ర చక్కెరకేళీ రూ.2,500 నుంచి రూ.3 వేల వరకూ పలుకుతున్నాయి. కూలీలకు ఖుషీ జిల్లాలో అరటి తోటలను నమ్ముకుని కూలీలు, వెదురు వేసేవారు, గెలలకు ఆకులు చుట్టేవారు, గెలలు కోసే కూలీలు, వ్యాపారులు సుమారు 30 వేల మంది ఉన్నారు. గతంలో ధరలు లేక వీరందరూ సరైన ఉపాధి లభించక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ధరలు పెరగటంతో రోజుకు రూ.500 నుంచి రూ.1,500 వరకూ వస్తోందని కూలీలు చెబుతున్నారు. లారీలో అరటి గెలల ఎగుమతినష్టాలు పూడ్చుకోగలమని ఆశ ఏడాది కాలంగా అరటి ధరలు పతనమవడంతో తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నాం. ఇప్పుడు మార్కెట్లో ధర పెరగడంతో గత నష్టాలు పూడ్చుకునే పరిస్థితి ఏర్పడింది. తుపాను సమయంలో ప్రభుత్వం ఎటువంటి సహాయమూ చేయలేదు. – యాతం మల్లికార్జునరావు, అరటి రైతు, అన్నవరప్పాడు అడ్వాన్సులు ఇచ్చి మరీ.. నిన్న మొన్నటి వరకూ తోటలు కొనేవారే లేరు. అటువంటిది నేడు వ్యాపారులే నేరుగా తోటల వద్దకు వచ్చి అడ్వాన్సులు ఇచ్చి మరీ కొనుగోలు చేస్తున్నారు. నిన్నటి వరకూ కర్పూర రకం గెల రూ.60కి కొన్నవారు నేడు రూ.150కి కొనుగోలు చేస్తున్నారు. – కాపకా పాపారావు, అరటి రైతు, కాకరపర్రు గత నెల నుంచి పెరుగుదల గత డిసెంబర్ నుంచి అరటి ధరలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ధరలు బాగానే ఉన్నాయి. వ్యాపారులు తోటలు కొనుగోలు చేస్తున్నారు. – సంఖు ప్రభాకరరావు, అరటి రైతు, మల్లేశ్వరం -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
సామర్లకోట: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. గురువారం రాత్రి సమయంలో తన స్నేహితుడి మోటారు సైకిల్పై వెనుక కూర్చుని వస్తున్న సామర్లకోట బలుసులపేటకు చెందిన పోతుల ఆకాష్ (21) ప్రమాదవశాత్తూ కింద పడ్డాడు. గుమెళ్ల భాస్కరరావు ఆస్పత్రి వద్ద ఉన్న డ్రైనులో పడిపోవడంతో బలమైన గాయాలు అయ్యాయి. అతన్ని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. దాంతో బలుసులపేటలో విషాదం నెలకొంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అసంఘటిత కార్మికులకు జీవితాంతం పెన్షన్
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అసంఘటిత రంగ కార్మికులు, చిన్న వ్యాపారులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత, స్థిర ఆదాయం, కుటుంబ రక్షణ, గౌరవప్రదమైన జీవితం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రెండు జాతీయ పెన్షన్ పథకాలను అమలు చేస్తోందని కార్మిక శాఖ జిల్లా ఉప కమిషనర్ బీఎస్ఎం వలీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్ధన్, ప్రధాన్ మంత్రి లఘు వ్యాపారి మాన్ధన్ అనే ఈ రెండు పథకాల కింద అర్హులైన వారికి 60 సంవత్సరాలు నిండిన తర్వాత జీవితాంతం ప్రతి నెలా రూ.3 వేల ప్రభుత్వ హామీతో కూడిన పెన్షన్ అందిస్తారన్నారు. అసంఘటిత రంగ కార్మికులు, వీధి వ్యాపారులు, రిక్షా, భవన నిర్మాణ, వ్యవసాయ, బీడీ, ఇటుక బట్టీ, హ్యాండ్లూమ్, గృహ కార్మికులు, చేతివృత్తిదారులు తదితర అసంఘటిత రంగంలోని వారు ఈ పథకానికి అర్హులని వివరించారు. 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు, నెలవారీ ఆదాయం రూ.15 వేల లోపు ఉండాలన్నారు. వయస్సును బట్టి నెలకు రూ.55 నుంచి రూ.200 వరకూ లబ్ధిదారు చెల్లించే చందాకు సమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా చెల్లిస్తుందన్నారు. లబ్ధిదారు మరణించిన పక్షంలో భార్య లేదా భర్తకు నెలకు రూ.1,500 కుటుంబ పెన్షన్ అందిస్తారని తెలిపారు. భార్యాభర్తలిద్దరూ అర్హులైతే నెలకు రూ.6 వేల ద్వంద్వ పెన్షన్ పొందే అవకాశం ఉందన్నారు. చిన్న దుకాణదారులు, చిల్లర వ్యాపారులు, హోటల్ యజమానులు, మిల్లుల యజమానులు, వర్క్షాప్ యజమానులు, కమిషన్ ఏజెంట్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, స్వయం ఉపాధిదారులు ఈ పథకానికి అర్హులన్నారు. 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు, వార్షిక టర్నోవర్ రూ.1.5 కోట్లలోపు ఉండాలన్నారు. ఆదాయపు పన్ను చెల్లించని వారు దీనికి అర్హులని తెలిపారు. ఈ పథకంలో కూడా నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు మాత్రమే చందా చెల్లించాల్సి ఉంటుందని, సమాన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుందని పేర్కొన్నారు. అర్హులైన వారు సమీపంలోని కార్మిక శాఖ కార్యాలయం, మీ–సేవా కేంద్రంలో ఆధార్ ఆధారితంగా సులభంగా నమోదు చేసుకోవచ్చని వలీ తెలిపారు. -
సంగీతం కోర్సులకు మే నెలలో వార్షిక పరీక్షలు
రాజమహేంద్రవరం రూరల్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యాన సంగీతం కోర్సులకు మే 21, 22 తేదీల్లో వార్షిక పరీక్షలు జరుగుతాయని వైస్ చాన్సలర్ ఆచార్య మునిరత్నం నాయుడు వెల్లడించారు. జూలైలో ఫలితాలు వెల్లడిస్తామన్నారు. కళాశాలల్లో చదివే రెగ్యులర్ విద్యార్థులు రూ.1,000, ప్రైవేటు విద్యార్థులు రూ.3 వేల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫిబ్రవరి 2 నుంచి 28వ తేదీ వరకూ ఎలాంటి అపరాధ రుసుం లేకుండా, మార్చి 1 నుంచి 10వ తేదీ వరకూ రూ.200 అపరాధ రుసుంతో ఫీజు చెల్లించవచ్చని వివరించారు. ఏపీ సంగీత శాఖ ఆధీనంలోని రాజమహేంద్రవరం, విజయనగరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు ప్రభుత్వ సంగీత కళాశాలలను రాజమహేంద్రవరంలోని తెలుగు యూనివర్సిటీ పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. తమ ఆధీనంలోని కూచిపూడితో కలిపితే యూనివర్సిటీ ఆధీనంలోకి ఏడు కళాశాలలు వచ్చినట్లవుతుందన్నారు. టీటీడీ ఆధీనంలోని కళాశాల కూడా తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోకి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని మునిరత్నం నాయుడు వెల్లడించారు. రెవెన్యూ సేవల్లో సంతృప్తి పెంచాలి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రెవెన్యూ సేవల్లో ప్రజలు సంతృప్తిని పెంచడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఇన్చార్జి కలెక్టర్ మేఘస్వరూప్ అన్నారు. కలెక్టరేట్ నుంచి వెబినార్ ద్వారా ఆర్ఓఆర్, రీ సర్వే, పీజీఆర్ఎస్పై అధికారులతో శుక్రవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రెవెన్యూ సంబంధిత అంశాల్లో దరఖాస్తుదారులకు సహేతుకమైన, సమయోచిత పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా మ్యుటేషన్ దరఖాస్తులను నిర్దేశిత కాలపరిమితిలో పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో సంబంధిత అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాలని సూచించారు. రీ సర్వే సహాయ సంచాలకుడు బి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, జిల్లాలోని 10 మండలాల్లోని 10 వేల ఎకరాల్లో రీ సర్వే జరుగుతోందని తెలిపారు. ప్రతి బృందం రోజుకు 25 ఎకరాలు రీ సర్వే చేయాలన్నది లక్ష్యమన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి టి.సీతారామమూర్తి, కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎకై ్సజ్ ఎస్సైగా శ్రీకాంత్ ఎంపిక ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): రంజీ ట్రోఫీ క్రికెటర్గా ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కొరిపల్లి శ్రీకాంత్ ఏపీ గ్రూప్–2 పరీక్షల్లో ప్రతిభ చూపి, ప్రొహిబిషన్, ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. స్థానిక ఉల్లితోటకు చెందిన ఆయన హైదరాబాద్లో బీటెక్ (సివిల్), చైన్నె ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఎంబీఏ (మార్కెటింగ్ – ఫైనాన్స్) పూర్తి చేశారు. రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల్లో ఆడారు. రాష్ట్ర స్థాయి జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించారు. 2018లో క్రికెట్కు పూర్తి స్థాయి విరామం ఇచ్చి, పోటీ పరీక్షలపై దృష్టి సారించారు. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఒకసారి, ఏపీ గ్రూప్–1 మెయిన్స్ రెండుసార్లు, తెలంగాణ గ్రూప్–1 మెయిన్స్ ఒకసారి ఉత్తీర్ణులయ్యారు. ప్రస్తుతం ఎకై ్సజ్ ఎస్సైగా ఎంపికయ్యారు. విష సర్పాల కలకలం ప్రత్తిపాడు: స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎదుట వీధిలోని ఖాళీ స్థలంలో రెండు పాములు కలకలం రేపాయి. ముత్యాల రాంబాబుకు చెందిన స్థలం ఇరవై ఏళ్లుగా ఖాళీగా ఉండడంతో పిచ్చి మొక్కలు పెరిగి విష సర్పాలకు ఆవాసంగా మారింది. తొలుత 15 అడుగుల రక్తపింజరి మొక్కల నడుమ తిరుగాడుతూ కనిపించింది. తరువాత మరో చిన్న పాము రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో స్థానికులే జేసీబీతో ఖాళీ స్థలంలో మొక్కలు తొలగించి చిన్న పామును చంపేశారు. పెద్దపాము సమీప పొలాల్లోకి వెళ్లిపోయింది. -
వేషం కట్టు... జోలె పట్టు
అనపర్తి: రాష్ట్రంలోనే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం సత్తెమ్మ తల్లి జాతరకు ప్రత్యేకత ఉంది. ఉత్సవాలు శనివారం నుంచి మూడు రోజులు జరగనున్నాయి. ఇక్కడో వింత ఆచారం ఉంది. ఎంతటి వారైనా వేషం కట్టి, జోలె పట్టి అమ్మవారికి మొక్కు తీర్చుకోవడం అనాదిగా వస్తోంది. సుమారు రెండొందల ఏళ్ల నుంచి ఈ జాతరను నిర్వహిస్తున్నట్లు పెద్దలు చెబుతున్నారు. కర్రి వారి ఆడపడుచుగా పేరొందిన అమ్మవారికి ప్రతి రెండేళ్లకోసారి జాతర జరుగుతోంది. ఈ నెల 31వ తేదీ శనివారం నుంచి ప్రారంభమయ్యే జాతర వచ్చే నెల 2వ తేదీ వరకూ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్తులంతా ఇప్పటికే సొంతూరికి చేరుకున్నారు. కొప్పవరంలో మూడు రోజులపాటు జాతర మహోత్సవాలు జరుగుతాయి. తొలిరోజు శనివారం కత్తిరి కుండ నెత్తిన ధరిస్తే సంతానం లేని మహిళలకు సంతానం కలుగుతుందని నమ్మకం. దీనికోసం చాలామంది మహిళలు వస్తుంటారు. రెండో రోజు ఆదివారం గ్రామ దేవత సత్తెమ్మ తల్లిని నాగదేవతగా ఉందని పుట్టలో పాలు పోసి పూజిస్తారు. అనంతరం గ్రామ దేవత సత్తెమ్మ తల్లిని భక్తితో కొలిచే పూజారులను ఆలయంలోకి ప్రవేశించకుండా భక్తులు అడ్డుకుని బెత్తంతో కొట్టించుకుని మొక్కు తీర్చుకుంటారు. వచ్చే నెల 2న చివరి రోజు సామాన్యుడైనా, కుబేరుడైనా సరే మొక్కు తీర్చాలంటే జోలె పట్టి భిక్షాటన చేయాల్సిందే. పిల్లలు లేని దంపతులు, వ్యాపార అభివృద్ధి కోసం వ్యాపారులు, పంటలు బాగా పండాలని రైతులు అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం ఇక్కడి ఆచారం. రకరకాల వేషధారణలతో మొక్కులు తీర్చుకునే భక్తులు, ఈ జాతరను వీక్షించడానికి తరలివచ్చే ప్రజలతో కొప్పవరం గ్రామం అంతా మూడు రోజులూ సందడితో నిండిపోతుంది. భిక్షాటన చేసి.. అమ్మవారి జాతరలో చివరి రోజు కీలకమైంది. తారతమ్యాలు లేకుండా రకరకాల వేషధారణలతో భిక్షాటన చేసి వచ్చే నగదు, బియ్యాన్ని అమ్మవారికి సమర్పించుకుని మొక్కు తీర్చుకుంటారు. ఈ జాతరలో ప్రముఖ సినిమా వేషధారణలు చూపర్లను ఆకట్టుకుంటాయి. అనేక మంది ప్రముఖులు, రాజకీయ నేతలు వచ్చి వేడుకలను తిలకిస్తుంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా.. కర్రి వారి ఆడపడుచుగా పూజలందుకుంటున్న కొప్పవరం సత్తెమ్మ తల్లి జాతర రెండేళ్లకు ఒకసారి నిర్వహిస్తున్నాం. దేశంలో ఎక్కడాలేని విధంగా మనుషులంతా ఒక్కటే అనే భావన కలిగే విధంగా ఎంతటి వారైనా భిక్షాటన చేసి మొక్కు తీర్చుకునే సంప్రదాయం కొప్పవరం సత్తెమ్మ అమ్మవారి ఆలయం వద్దే కనిపిస్తుంది. –కర్రి బులిమోహనరెడ్డి, ఆలయ కమిటీ సభ్యుడు, కొప్పవరం రెండేళ్లకు ఒకసారి.. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి కొప్పవరం సత్తెమ్మ తల్లి. అమ్మవారి జాతర మహోత్సవాలకు వృత్తి, వ్యాపారాల రీత్యా సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన గ్రామస్తులు సైతం రెండేళ్లకు ఒకసారి వస్తుంటారు. అమ్మవారి సంబరాలకు తప్పనిసరిగా వచ్చి వేషధారణ చేసి భిక్షాటన చేసి మొక్కు తీర్చుకుంటాం. –గొలుగూరి దుర్గారెడ్డి, భక్తుడు, కొప్పవరం పంచె కట్టి.. ముసలివాడిగా కర్ర చేతబట్టి.. పోలీస్లా లాఠీ ఎక్కుపెట్టి.. షిర్డీసాయిలా వేషం కట్టి.. ఇలా ఒకటేమిటి వివిధ వేషధారణతో ఆ ఊరిలో సందడే సందడి. కుబేరులైనా, సామాన్యులైనా ఇలా వేషం కట్టి.. జోలె పట్టడం ఇక్కడ సంప్రదాయం. రెండేళ్లకు ఒకసారి జరిగే కొప్పవరం సత్తెమ్మ తల్లి జాతరలో అమ్మవారికి భక్తులు ఇలా మొక్కు తీర్చుకుంటారు. ఇందులో భాగంగా ముందుగా వివిధ వేషధారణతో భిక్షాటన చేయడం ఆచారంగా వస్తోంది. శనివారం నుంచి ఈ జాతర జరగనుంది. ఆ విశేషాలు తెలుసుకుందాం రండి. ఫ కొప్పవరం సత్తెమ్మ జాతరలో వింత ఆచారం ఫ మొక్కు చెల్లించడానికి విచిత్ర వేషధారణతో భిక్షాటన ఫనేటి నుంచి వచ్చే నెల 2 వరకూ సంబరాలు -
రీచ్ల నిర్వాహకుల మధ్య ముదిరిన వివాదం
● ర్యాంపులోకి లారీలు వెళ్లకుండా అడ్డగింపు ● నిలిచిన ఇసుక ఎగుమతులు ● పరస్పరం కేసులుసీతానగరం: రీచ్ల నిర్వాహకుల మధ్య కొద్ది రోజులుగా జరుగుతున్న వివాదం ముదరడంతో ఇసుక ఎగుమతులు నిలిచిపోయాయి. దీనికి సంబంధించిన వివరాలివీ.. తాళ్లపూడి మండలం ప్రక్కిలంక రెవెన్యూ లంక భూముల్లో ఇసుక రీచ్లను ఐదుగురు దక్కించుకున్నారు. వీరి మధ్య బాటల్లో రాకపోకలపై వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 25న రీచ్లో బ్లాక్–4 నిర్వాహకుడైన వడ్డీ శ్రీనివాసరావు బాటకు అడ్డంగా గాడి తవ్వి, ఇసుక మేటలు అడ్డం పెట్టారు. దీంతో బ్లాక్–1 నిర్వాహకుడైన బర్ల బాబూరావు ర్యాంపులోకి లారీలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో, ర్యాంపులోకి లారీలు వెళ్లకుండా బాబూరావు తన కారును అడ్డంగా పెట్టారు. ఈ నేపథ్యంలో అదే రోజు రాత్రి తాను ఇంటికి వెళ్తూండగా.. రఘుదేవపురం పుంత సమీపంలోని శ్మశాన వాటిక వద్ద బండారు రమేష్ నాయుడు, బాబు చౌదరి, గోగినేని నితిన్ చౌదరి, వడ్డీ శ్రీనివాస చౌదరి, కాండ్రు విశ్వనాథ్ చౌదరి, చిట్టూరి రాము చౌదరి, చిట్టూరి సాయి చౌదరిలు కారు అడ్డంగా పెట్టి, తనను అసభ్య పదజాలంతో దూషించారని, మారణాయుధాలు పట్టుకుని చంపుతామంటూ బెది రించారని బాబూరావు ఈ నెల 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా అదే రోజు రాత్రి బ్లాక్–4 రీచ్ నిర్వాహకుడు వడ్డీ శ్రీనివాసరావు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటలకు లారీలు వెళ్లకుండా బాబూరావు కారు అడ్డంగా పెట్టారని, దానిని అడ్డం తీయాలని తనతో పాటు సత్యం బాలాజీ, గోగినేని నితిన్ చౌదరి, ఖండవల్లి శోభనబాబు వెళ్లి అడిగామన్నారు. దీంతో, కారు అడ్డం తీసేది లేదని, తనకు రాజకీయ పలుకుబడి ఉందని, తమ అంతు చూస్తానని, చంపుతానని బాబూరావు బెదిరించాడని వారు ఫిర్యాదు చేశారు. దీనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇసుక కోసం ర్యాంపు వద్దకు చేరుకున్న లారీలు ఈ వివాదం నేపథ్యంలో పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. ఎస్సై డి.రామ్ కు మార్ ఆయా ర్యాంపుల నిర్వాహకులతో చర్చలు జరి పారు. ఇరు వర్గాల వారు సర్వే చేయించుకున్న అనంతరం బాటలు వేసుకోవాలని సూచించారు. దీంతో, లారీలు యథావిధిగా ర్యాంపులోకి తరలివెళ్లాయి. తాళ్ల పూడి తహసీల్దార్, సర్వేయర్, ఆర్ఐలు గురువారం సాయంత్రం భూములను పరిశీలించారు. సరిహద్దులు నిర్ధారించకుండానే వెను తిరిగారు. సర్వే పూర్తయ్యేంత వరకూ లారీలు వెళ్లకుండా పొక్లెయిన్ అడ్డంగా పెట్టి, బాబూరావు శుక్రవారం ఆ దారిని బంద్ చేశారు. దీంతో ఇసుక ఎగుమతులు నిలిచిపోయాయి. -
అవినీతి ఫెస్టివల్
● సంక్రాంతి సంబరాల పేరుతో ‘కూటమి’ దోపిడీ ● ఎస్.యానాంలో సాగిన అక్రమాలు ● వెలుగులోకి తెచ్చిన ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ● ఎంత ఖర్చు చేశారో చెప్పాలని ఎమ్మెల్యేకు సవాల్ ● తాజాగా మాజీ సీఎం జగన్కు ఇజ్రాయిల్ ఫిర్యాదు సాక్షి, అమలాపురం: సంక్రాంతి సంబరాల ముసుగు లో అధికార పార్టీ నేతల దందాపై రేగిన అలజడి ఆగలేదు.. ఎస్.యానాం బీచ్ ఫెస్టివల్లో అక్రమాలు జరిగాయని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ పేల్చిన బాంబు అధికార పార్టీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.. ఎమ్మెల్సీ ఆధారాలతో కూడిన ఆరోపణలు చేస్తే వాటికి సమాధానం చెప్పాల్సింది పోయి టీడీపీ, జనసేన నాయకులు ఎదురుదాడికి దిగడం విస్మయానికి గురి చేస్తుంది. ఈ విషయంలో ఇజ్రాయిల్ మాత్రం వెనకడుగు వేయడంలేదు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి తాజాగా ఫిర్యాదు చేశారు. పండగ ముందు సంక్రాంతి సంబరాల పేరుతో జిల్లాలో అధికార పార్టీ నేతలు సాగించిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. కీలక నేతలతో పాటు స్థానిక కార్యకర్తల వరకూ దోపిడీ నిర్విఘ్నంగా కొనసాగించారు. పేరుకు ప్రభుత్వం సంక్రాంతి సంబరాలు అంటూ ప్రచారం చేసినా వీటి ముసుగులో కోడి పందేలు, గుండాటలు, లోనా బయటా వంటి జూదాలు నిర్వహించారు. పండగ ముందే వీటిని ‘సాక్షి’ వరుస కథనాలతో వెలుగులోకి తెచ్చినా పోలీసులు, అధికారులు మౌనంగా ఉండిపోయారు. ఇదే అదునుగా అధికార పార్టీ నాయకులు చెలరేగిపోయారు. ముఖ్యంగా ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో ‘ఆంధ్రా గోవా కోకో బీచ్’ సంక్రాంతి సంబరాల పేరుతో జరిగిన నిర్మాణాలపై విమర్శలు వెల్లువెత్తాయి. నిర్మాణాల వారీగా అవినీతిపై.. బీచ్ ఫెస్టివల్ పేరుతో అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ మీడియా సమావేశంలో నేరుగా ఆరోపించారు. అక్కడ జరిగిన అవినీతి ఇదే నంటూ నిర్మాణాల వారీగా ఆయన మీడియా ముందు బయట పెట్టారు. నియోజకవర్గంలో పలు సమస్యలు ఉండగా, చమురు సంస్థలు ఇచ్చే కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటీ ఫండ్ (సీఎస్ఆర్) నిధులతో బీచ్ ఫెస్టివల్కు సంబంధించి నిర్మాణాలు చేపట్టడంపై ఘాటైన విమర్శలకు దిగారు. ఈ విషయంలో ఆనందరావుకు అన్నివిధాలా సహకరించారని ఆయా శాఖల అధికారులు, వారి కుటుంబ సభ్యుల పేర్లతో సహా బయటపెట్టారు. ఒక కీలక ఉద్యోగి కుటుంబ సభ్యుడే కాంట్రాక్టర్ అవతారం ఎత్తడం, అమలాపురం రూరల్ మండలం జనసేనకు చెందిన కీలక నాయకుడు సీఆర్జెడ్ పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు చేయడం, అదే మట్టితో బీచ్ లెవెలింగ్, బీచ్కు వెళ్లేందుకు వేసిన రోడ్లకు వినియోగించడం వంటి వా టిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మట్టి కోసం స్థానికంగా ఉన్న మడ అడవులను ధ్వంసం చేయడం, తీరంలో సముద్ర ఇసుక పెద్ద ఎత్తున తవ్వడం వంటి విషయాలను వెలుగులోకి తెచ్చారు. ఈ ఖర్చులపై ఆనందరావు వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు. తీవ్ర విమర్శలకు దారితీసి.. ఇదిలా ఉండగా, బీచ్ ఫెస్టివల్కు రూ.కోట్లు ఖర్చు చేయడం సామాన్యుల్లో సైతం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నియోజకవర్గంలో పలు సమస్యలు ఉన్నా బీచ్ అభివృద్ధి పేరుతో రూ.కోట్ల దుబారా చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎస్.యానాం బీచ్లో చేపట్టిన నిర్మాణాలు కూడా వృథాగా మారనున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ షెడ్డు, ఇతర నిర్మాణాలు కేవలం సంబరాల సమయంలో తప్ప ఇతర సందర్భాలలో నిరుపయోగమేనని స్థానికులు పెదవి విరుస్తున్నారు. బీచ్లో విద్యుత్ దీపాల అలంకరణ ఎస్.యానాం బీచ్లో సంబరాల కోసం నిర్మించిన భారీ షెడ్డు నోరుమెదపక.. డిమాండ్కు అంగీకరించక ఇప్పటి వరకూ అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు నోరుమెదపలేదు. శ్వేతపత్రం డిమాండ్కు అంగీకరించలేదు. ప్రధానంగా సీఎస్ఆర్, వీబీ–జీ రామ్జీ (ఎంజీఎన్ఆర్జీఎస్) నిధులు రూ.కోట్లు ఖర్చు చేయడం, వీటికి సంబంధించి ఎంత నిధులు కేటాయించారు? ఎంత ఖర్చు పెట్టారు? వంటి వాటిపై అధికారులు సైతం కిమ్మనకుండా ఉండిపోయారు. కానీ టీడీపీ, జనసేనలకు చెందిన నియోజకవర్గ చోటామోటా నాయకులు మాత్రం ఇజ్రాయిల్పై ఎదురుదాడికి దిగారు. ఆయన మాత్రం వెనకడుగు వేయలేదు. ఈ విషయాన్ని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎస్.యానాం బీచ్లో జరిగిన అవినీతి అక్రమాలను వివరించారు. దీనిపై తాను చేస్తున్న పోరాటానికి పార్టీ మద్దతు ఉంటోందని జగన్ హామీ ఇచ్చారని ఇజ్రాయిల్ చెప్పారు. ఎంత ఖర్చు చేశారో చెప్పండి ఎస్.యానాం బీచ్ ఫెస్టివల్లో అభివృద్ధి పనుల్లో అవకతవకాలు జరిగాయి. ఏ నిధులు ఎంత ఖర్చు పెట్టారు? సంబరాలకు వేసిన స్టాల్స్ వద్ద నుంచి, బయట వ్యక్తుల నుంచి వసూలు చేసిస సొమ్ము ఎంత? ఖర్చు ఎంత? అనేది శ్వేతపత్రం విడుదల చేయాలి. దీనిపై ఇప్పటి వరకూ ఎమ్మెల్యే ఆనందరావు ఎందుకు స్పందించలేదు. కానీ నాపై టీడీపీ నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు. తప్పు చేయకపోతే శ్వేతపత్రం ఇవ్వడానికి ఇబ్బంది ఏముంది. ఇదే విషయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించాను. అవినీతిపై నిగ్గు తేల్చేందుకు పార్టీ నాయకులతో నిజ నిర్ధారణ కమిటీ వేస్తామని ఆయన తెలిపారు. – బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్సీ -
కదలివచ్చిన జనార్దన రథ చక్రాలు
ధవళేశ్వరం: భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా ధవళేశ్వరం గ్రామంలో రథోత్సవం చూసిన కనులదే భాగ్యం అన్నట్లు సాగింది. నవ జనార్దనుల్లో ప్రథముడైన ధవళగిరి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ జనార్దనస్వామివారి రథోత్సవం, కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం రథ సంప్రోక్షణ, మధ్యాహ్నం 3.45 గంటలకు రథోత్సవం, అనంతరం ధ్వజారోహణ, అంకురార్పణ, వాస్తుపూజ, రాత్రి స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు స్థానిక రామపాద క్షేత్రంలో పుణ్యస్నానాలు ఆచరించి జనార్దన స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ భవ్య కిషోర్ ఆధ్వర్యంలో సీఐ టి.గణేష్, ఎస్సై హరిబాబు భారీ బందోబస్తు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ దాసరి చిన్నరమణ, పాలకమండలి సభ్యులు, కార్యనిర్వాహణాధికారి జోగి వెంకటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. -
తాళ్లుక్కుమని..
తాళ్లరేవు: భారీ తాళ్ల తయారీకి తాళ్లరేవు ప్రసిద్ధి చెందింది. మునుపెన్నడూ లేని విధంగా 60 మంది కార్మికులు వారం రోజుల పాటు శ్రమించి తయారు చేసిన తాడు అందరినీ ఆకట్టుకుంటుంది. దీనిని అనంతపురం జిల్లా కదిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి రథోత్సవంలో వినియోగించనున్నారు. తొలుత కొబ్బరి పీచుతో చిన్నపాటి తాళ్లను తయారు చేసి వాటిని నాలుగు తాళ్లుగా పేనారు. అనంతరం ఆ నాలుగింటినీ కలుపుతూ ప్రత్యేక యంత్రం ద్వారా అత్యంత చాకచక్యంగా 30 అంగుళాల చుట్టుకొలత, 400 అడుగుల పొడవు కలిగిన భారీ తాడును రూపొందించారు. సుమారు రూ.7 లక్షలతో తయారు చేసిన దీని బరువు సుమారు 2 టన్నులు పైనే. రోజుకు 60 మంది కార్మికులు వారం రోజులపాటు అత్యంత భక్తిశ్రద్ధలతో, గోవింద నామస్మరణతో ఈ తాడును తయారు చేసినట్లు తాళ్ల వ్యాపారి సామా సూర్యప్రకాష్ తెలిపారు. కదిరి దేవస్థానానికి తాడు తయారు చేయడం ఇది నాలుగో సారి అని అన్నారు. మార్చి 10న జరిగే స్వామివారి రథోత్సవంలో ఈ తాడును వినియోగిస్తారని తెలిపారు. అదేవిధంగా మంగళగిరి, ద్రాక్షారామ, పుట్టకొండ, ముంగండ తదితర గ్రామాల్లోని ఆలయాలకు తాళ్లు తయారు చేసి ఇస్తుంటామని వివరించారు. తమ పూర్వీకుల నుంచి రథం తాళ్లను తయారు చేస్తున్నట్లు రథం తాళ్ల తయారీలో నిష్ణాతుడైన మందపల్లి గోవిందు తెలిపారు. సూర్యప్రకాష్ నేతృత్వంలో ఎనిమిది మేస్త్రిల పర్యవేక్షణలో అనేక మంది కార్మికులతో ఈ తాడును తయారు చేశామని చెప్పారు. పూర్తయిన తాడును ప్రత్యేక వాహనంలో ఉంచి కదిరి దేవస్థానానికి తరలించారు.ఫ ఆకట్టుకున్న భారీ కొబ్బరి తాడు ఫ 30 అంగుళాల మందం, 400 అడుగుల పొడవు ఫ వారం రోజులు శ్రమించి తయారీ -
అంగరంగ వైభవం.. ఆదిత్యుని కల్యాణం
పెదపూడి: ఆదిత్యుని కల్యాణం.. అంగరంగ వైభవంగా జరిగింది.. జి.మామిడాడ ఆధ్యాత్మిక చింతనతో మురిసిపోయింది.. దేశంలోనే ఏకై క వైష్ణవ సూర్య దేవాలయంగా జి.మామిడాడ గ్రామంలోని సూర్యదేవాలయం ప్రసిద్ధి గాంచింది. భీష్మ ఏకాదశి సందర్భంగా రాత్రి ఉష, ఛాయ, పద్మిని, సౌంజ్ఞ సమేత సూర్యనారాయణమూర్తి స్వామివారి కల్యాణం ఘనంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొవ్వూరి శ్రీనివాసా బాలకృష్ణారెడ్డి దేవదాయ శాఖ తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. ఆలయ ప్రధాన ఆర్చకుడు రేజేటి వెంకటనరసింహాచార్యులు ఆధ్వర్యంలో 15 మంది పండితులు వైష్ణవ సంప్రదాయం ప్రకారం స్వామివారి కల్యాణం నిర్వహించారు. రాత్రి 8.30 గంటలకు కల్యాణం రమణీయంగా జరిగింది. ఆలయ ఈఓ పాటి సత్యనారాయణ, ఉత్సవ కమిటీ ప్రతినిధుల పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. తెల్లవారు జామున 3.30 గంటల నుంచే స్వామివారిని మేల్కోలిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం 11.30 గంటలకు ఆలయంలోని ఉత్సవ మూర్తులను ఆలయం బయట ఉన్న రథం వద్దకు పల్లకిలో తీసుకొచ్చారు. అనంతరం ఉత్సవ మూర్తులను రథంలో ఆశీనులు గావించారు. తర్వాత రథోత్సవాన్ని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ట్రస్ట్బోర్డు చైర్మన్ కొవ్వూరి శ్రీనివాసా బాలకృష్ణారెడ్డి, ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రారంభించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక ఎస్సై ఎస్.తులసీరామ్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
ఏకాదశి వేళ.. ఆధ్యాత్మిక హేల
భీష్మ ఏకాదశి వేళ ఆలయాలకు ఉత్సవ శోభ వచ్చింది.. ఊరూవాడా ఆధ్యాత్మికతను నింపింది.. ఉమ్మడి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి, జి.మామిడాడ సూర్యనారాయణమూర్తి దేవస్థానాలు, పుట్టకొండ, ధవళేశ్వరం తదితర ఆలయాల వద్ద రథోత్సవాలతో భక్తజన కోలాహలం నెలకొంది. అలాగే రత్నగిరి కిక్కిరిసింది. ఇక్కడ విశేష సంఖ్యలో వ్రతాలు జరిగాయి. అన్నవరం: భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా గురువారం రత్నగిరి సత్యదేవుని సన్నిధికి భక్తులు పోటెత్తారు. సుమారు 70 వేల మంది రావడంతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు కిక్కిరిశాయి. సాయంత్రం వరకూ రద్దీ కొనసాగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని సత్యదేవుని ఆలయాన్ని వేకువజామున ఒంటి గంటకు తెరిచి సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతించారు. తెల్లవారు జామున రెండు గంటల నుంచి స్వామివారి వ్రతాలను ప్రారంభించారు. స్వామివారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. రద్దీ నేపథ్యంలో స్వామివారి అంతరాలయ దర్శనం మధ్యాహ్నం వరకూ నిలిపివేశారు. వ్రత మండపాలు నిండిపోవడంతో స్వామివారి నిత్య కల్యాణ మండపంలో కూడా వ్రతాలు నిర్వహించారు. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్త గోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. భక్తులకు సర్క్యూలర్ మండపంలో ఉదయం ఆరు గంటల నుంచి పులిహోర, దద్దోజనం, మధ్యాహ్నం నుంచి కదంబం పంపిణీ చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వేండ్ర త్రినాథరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ ఒక్కరోజే దేవస్థానానికి రూ.70 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు వారు తెలిపారు. స్వామివారి వ్రతాలు 7,377 జరగ్గా, వ్రతాల ద్వారా సుమారు రూ. 30 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుని గోధుమ నూక ప్రసాదం ద్వారా సుమారు రూ.18 లక్షలు వచ్చింది. మిగిలిన విభాగాల ద్వారా రూ. 22 లక్షల ఆదాయం వచ్చిందని వారు వివరించారు. ఆకర్షణీయంగా పుష్పాలంకరణ భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా సత్యదేవుని ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఇది భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారికి ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు దాత వీర్ల రాంబాబు దంపతులు అందజేసిన లక్ష చామంతులతో పుష్పార్చన జరిగింది. ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు భక్తులకు ఇబ్బంది కలుగకుండా చేసిన ఏర్పాట్లు సత్ఫలితాలిచ్చాయి. ప్రధానంగా పశ్చిమ రాజగోపురం వద్ద ఏర్పాటు చేసిన కంపార్ట్మెంట్లతో భక్తుల నియంత్రణ సాధ్యపడింది. బుధవారం రాత్రి నుంచి వ్రతాల టిక్కెట్లు విక్రయించి గురువారం వేకువజాము నుంచి వ్రతాలు ప్రారంభించడంతో రద్దీ తగ్గింది. కాగా, సత్యదేవుని సన్నిధికి విచ్చేసిన చిన్నారులకు పాలు, బిస్కెట్లు పంపిణీని ఈఓ త్రినాథరావు పంపిణీ చేశారు. సుమారు 200 మంది చిన్నారులకు వీటిని అందజేశారు. అయితే రూ.200 టిక్కెట్తో అంతరాలయ దర్శనానికి అనుమతించకపోవడంతో భక్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ ప్రముఖ ఆలయాలు కిటకిట ఫ పలుచోట్ల రథోత్సవాలు ఫ రత్నగిరికి పోటెత్తిన భక్తులు -
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
కడియం: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం రాత్రి 8.45 గంటల సమయంలో రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ ఎం.కిశోర్కుమార్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్లు, సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సబ్ రిజిస్ట్రార్ ఎప్పిలి లక్ష్మి గదిలో ఉన్న చాంబర్లో రూ.79 వేలు లభించింది. అలాగే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది చాంబర్లలో రూ.1,03,210ను ఏసీబీ అధికారులు గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మొత్తంగా లభించిన రూ.1,82,210 నగదు లెక్క తేలనిదిగా గుర్తించారు. నిషేధిత ఆస్తుల రిజిస్ట్రేషన్ చేశారా, తక్కువ ధరకు వాల్యుయేషన్ చేశారా, అనధికార రిజిస్ట్రేషన్ చేశారా అనే విషయాలపై తనిఖీలు చేస్తున్నామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఈ విషయాలపై తదుపరి విచారణ చేపడతామన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు ఎవరైనా లంచాలు కోసం డిమాండ్ చేస్తే టోల్ ప్రీ నంబర్ 1064, ఏసీబీ డీఎస్పీ 94404 46160 ఫోన్ నంబరుకు తెలియజేయాలని కిశోర్కుమార్ తెలిపారు. లక్ష్మి గతంలో కాకినాడ, ప్రత్తిపాడు, కాకినాడ చిట్ రిజిస్ట్రార్, అమలాపురం, పెద్దాపురంలో సబ్–రిజిస్ట్రార్ (గ్రేడ్–2)గా పనిచేశారు. సబ్–రిజిస్ట్రార్ (గ్రేడ్–1)గా పదోన్నతి పొందిన తర్వాత, ఆమె సామర్లకోటలో పనిచేసి, అక్టోబర్ 2024 నుంచి కడియంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
పుట్టకొండ.. భక్తులే నిండా..
పెదపూడి: పుట్టకొండ గ్రామంలో లక్ష్మీనరసింహ స్వామివారి రథోత్సవం ఘనంగా జరిగింది. దీనిని ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ పీఏ అనంతాచార్యులు, గ్రామ ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రారంభించారు. స్వామివారిని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆయన సతీమణి ఆదిలక్ష్మి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఉదయం నిత్యహోమం, సంప్రదాయార్చన, 12 గంటలకు ధ్వజారోహణం, బలిహరణ నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు రథోత్సవం జరిగింది. రాత్రి 10 గంటలకు గరుడ, పుష్పక వాహన సేవ చేశారు. శుక్రవారం తెల్లవారు జామున 4 గంటలకు స్వామివారి కల్యాణం జరిగింది. భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉగ్ర నరసింహ స్వామివారికి ప్రధాన అర్చకుడు పి.గోపాలాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి వడ్డాది సత్యనారాయణ, సర్పంచ్ వల్లు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
స్వామీ ఈ తేరుగ దయ చూసితివా!
సాక్షి, అమలాపురం/ సఖినేటిపల్లి: దేవదేవుడు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. కల్యాణం అనంతరం తన సోదరి గుర్రాలక్కకు చీరా, సారె పెట్టేందుకు స్వామివారు సతీ సమేతంగా రథంపై తోడ్కొని వెళ్లడం అనవాయితీగా వస్తోంది. కల్యాణ మహోత్సవాల్లో భాగంగా గురువారం ఏకాదశి (భీష్మ ఏకాదశి) పర్వదినాన మాఢవీధుల్లో నిర్వహించిన రథయాత్ర అపూర్వ ఘట్టంగా నిలిచింది. మధ్యాహ్న సమయంలో సంప్రదాయ బద్ధంగా సాగిన ఈ రథోత్సవానికి వేలాది మంది భక్తులు వెల్లువలా తరలి రావడంతో పూరీ జగన్నాథుని రథయాత్రను తలపించింది. అంతకుముందు గురువారం తెల్లవారుజామున స్వామివారి కల్యాణం ముగియడంతో వేలాది మంది భక్తులు సముద్ర తీరంలో పుణ్యస్నానాలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. భక్తజన సంద్రంలో సాగిన తేరు అంతర్వేది లక్ష్మీ నరసింస్వామివారి రథోత్సవం భక్తుల గోవిందనామ స్మరణల మధ్య మధ్యాహ్నం 2–05 గంటలకు ప్రారంభమయింది. మంగళ వాయిద్యాలతో, అర్చకుల వేదమంత్రాలతో నూతన వధూవరులైన స్వామి, అమ్మవార్లను ఆలయం నుంచి పల్లకీలో రథం వద్దకు తోడ్కొని వచ్చారు. భక్తవరదుడు అంతర్వేది నరసింహస్వామివారు, అమ్మవార్లు రథంపై కొలువుదీరగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, వేలాది మంది భక్తులు రథాన్ని లాగారు. భక్తులు రథానికి అరటి గెలలు, గుమ్మడికాయలు కట్టించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మెరకవీధి నుంచి ప్రారంభమైన రథయాత్ర పల్లపువీధి మీదుగా పదహారు కాళ్ల మండపం వద్దకు చేరుకుంది. మార్గ మధ్యంలో గుర్రాలక్కకు స్వామి తరఫున చీరె, సారె ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో స్థానాచార్య వింజమూరి రామ రంగాచార్యులు, వేద పండితుడు చింతా వేంకటశాస్త్రి, అర్చకులు అందజేశారు. పరవళ్లు తొక్కిన ఆధ్యాత్మికత ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి వచ్చిన అసంఖ్యాకమైన భక్తుల గోవింద నామస్మరణలు, నరసింహస్వామికి జై అనే నినాదాల మధ్య ఈ రథయాత్ర నయన మనోహరంగా సాగింది. రథయాత్రను చూసేందుకు... రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. అంతర్వేది వీథులు భక్తులతో కిటకిటలాడాయి. బుధవారం అర్ధరాత్రి కనువిందు చేసిన స్వామివారి కల్యాణం, గురువారం మధ్యాహ్నం గ్రామ వీథులను వైకుంఠ పథాలుగా మార్చిన రథోత్సవం, ఆ రెండు పర్వాలకు నడుమ భీష్మ ఏకాదశి వేకువ జామున సాగర స్నానం, అనంతరం ఆలయంలో స్వామి దర్శనం. ఇన్ని ఘట్టాలతో భక్తజన హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయి. ఒకవైపు వశిష్ట తీరంలో నదీ పరవళ్లు.. తీరంలో ఎగిసిపడుతున్న సముద్ర కెరటాలతో సమానంగా అంతర్వేది క్షేత్రంలో ఆధ్యాత్మికత పరవళ్లు తొక్కింది. ఆలయ చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమార రామ గోపాల రాజా బహదూర్, ముఖ్య అతిథిగా రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కొబ్బరి కాయలు కొట్టి రథయాత్రకు శ్రీకారం చుట్టారు. డీఆర్వో కొత్తా మాధవి, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, ఎండోమెంట్స్ డీసీ రమేష్ బాబు, జిల్లా ఎండోమెంట్స్ అధికారి వి.సత్యనారాయణ, ఆలయ ఈవో ఎం.కె.వి.టి.ఎన్.వి. ప్రసాద్, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ దెందుకూరి రాంబాబు రాజు, ఎంపీపీ వీరా మల్లిబాబు పాల్గొన్నారు. దర్శనానికి బారులు తీరిన భక్తులు భీష్మ ఏకాదశి పర్వదినాన సాగర స్నానం చేసేందుకు వచ్చిన భక్తులతో తీరం జనసంద్రమైంది. పుణ్యస్నానాలు ఆచరించిన తరువాత భక్తులు ఆలయం వద్ద క్యూలో బారులుతీరి స్వామి వారిని దర్శించుకున్నారు. తీరంలో తలనీలాలు సమర్పించారు. సముద్ర స్నానాల చేసే ప్రాంతంలో ప్రమాదాల నివారణకు పోలీసులు గట్టి నిఘా పెట్టారు. అంతర్వేది తీర్థం కొనసాగుతోంది. అంతర్వేదిలో నేడు ఉత్సవాల్లో భాగంగా ఆరవరోజు శుక్రవారం ఉదయం మూడు నుంచి ఆరు గంటల వరకు సుప్రభాత సేవ, శ్రీస్వామివారి తిరువారాధన, బాలభోగం, వార్షిక అభిషేకాలు, అనంతరం సాధారణ, ప్రత్యేక దర్శనాలు. సాయంత్రం నాలుగు గంటలకు గజ వాహనంపై, రాత్రి ఎనిమిది గంటలకు పొన్న వాహనంపై శ్రీస్వామి గ్రామోత్సవం అర్చకులు నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 నుంచి ఏడు గంటలకు వరకు శ్రీస్వామివారి సన్నిధిని శుద్ధి చేసేందుకు దర్శనాలను నిలిపివేయనున్నారు.భీష్మ ఏకాదశి రోజు నుంచి ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి తిధి నాడు విరమణ చేసే అర్చకులు స్వామికి అన్నదర్శనం చేయడం సంప్రదాయం. ఇందులో భాగంగా పొలమూరు సత్రం నిర్వాహకులతో అన్నపర్వత మహానివేదన చేస్తారు. రాత్రి ఏడు గంటలకు అన్న పర్వత మహానివేదన అనంతరం స్వామివారి దర్శనాలు మొదలవుతాయి. రథంపై కొలువైన స్వామి, అమ్మవారురథోత్సవంలో పాల్గొన్న భక్తులుశంఖం పూరిస్తున్న జంగమ దొర నేత్రపర్వంగా లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం మధ్యాహ్నం 2.05 గంటలకు ప్రారంభం పోటెత్తిన భక్త జనం సోదరి గుర్రాలక్కకు చీర, సారె సమర్పణ తెల్లవారు జామున సముద్ర స్నానాలు -
ప్రాక్టికల్ పరీక్షలకు వేళాయె
● ఫిబ్రవరి 1 నుంచి ఇంటర్ జనరల్ విద్యార్థులకు ● ఉమ్మడి జిల్లాలో 248 కేంద్రాలు ● 43,787 మంది విద్యార్థులు సన్నద్ధం ● కార్పొరేట్ కళాశాలల్లో సన్నద్ధత తీసికట్టు ● ప్రభుత్వ కళాశాలల్లో పరికరాలు మృగ్యం కపిలేశ్వరపురం: ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ఓ గొప్ప అనుభూతి. రెండేళ్ల పాటు చదువుకున్న పాఠ్యాంశాలకు ప్రయోగ రూపం ఇస్తూ తమ అవగాహన స్థాయిని పరీక్షించుకునేందుకు దోహదపడతాయి. విద్యార్థి తీసుకున్న గ్రూపు ఆధారంగా రెండు నుంచి నాలుగు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ కథనం... ఉమ్మడి జిల్లాలో ఇలా.. ఫిబ్రవరి 10వ తేదీ వరకూ జనరల్ సెకండ్ ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు కొనసాగుతాయి. తూర్పుగోదావరి జిల్లాలో 82 కేంద్రాల్లో 17,488 మంది, కాకినాడ జిల్లాలో 97 కేంద్రాల్లో 15,712 మంది, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 51 కేంద్రాల్లో 8,900 మంది, పోలవరం జిల్లాలో 18 కేంద్రాల్లో 1,687 మంది, ఉమ్మడి జిల్లా మొత్తంలో 248 కేంద్రాల్లో 43,787 మంది పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇప్పటికే ఈ నెల 27న పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఫిబ్రవరి 10 వరకూ అవి కొనసాగుతాయి. తూర్పుగోదావరి జిల్లాలో 1,682 మంది విద్యార్థులు, కాకినాడ జిల్లాలో 2,509 మంది, కోనసీమ జిల్లాలో 4,250 మంది, పోలవరం జిల్లాలో 706 మంది మొత్తం 9,147 మంది విద్యార్థులు ఒకేషనల్ ప్రాక్టికల్స్ చేస్తున్నారు. ఒకేషనల్ విద్యార్థులకు 50 మార్కులకు, జనరల్ విద్యార్థులకు 30 మార్కులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాక్టికల్ మార్కులు మొత్తం మార్కుల్లో కలవనున్న నేపథ్యంలో ప్రాధాన్యం ఉంది. ప్రాక్టికల్ పరీక్షల నిర్వాహక అధికారులకు ఈ నెల 24న రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడలలో సన్నాహక సమావేశం నిర్వహించారు. హాల్ టికెట్ కోసం హైరానా పడొద్దు పరీక్షా కేంద్రానికి చేరుకున్న ప్రతి విద్యార్థిని ప్రయోగ పరీక్షకు అనుమతించాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశించారు. హాల్ టికెట్ సకాలంలో దగ్గర లేకపోయినా పరీక్షకు అనుమతించాల్సి ఉంది. ప్రిన్సిపాల్ లాగిన్లో కానీ మనమిత్ర వాట్సాప్ నంబర్ 95523 00009 కు హాయ్ అంటూ మెస్సేజ్ పంపడం ద్వారా ఎడ్యుకేషనల్ సర్వీసులను సెర్చ్ చేస్తూ హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా హెచ్టీటీపీఎస్://బీఐఈ.ఏపీ.జీఓవీ.ఇన్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్పై ప్రిన్సిపాల్ సంతకం, స్టాంప్ లేకపోయినా పరీక్షకు అనుమతించాల్సి ఉంది. నిర్వహణలో నియమ నిబంధనలు ఇలా.. ప్రాక్టికల్ గదిలో విద్యార్థుల సంఖ్యను బట్టి ఒకటి లేదా రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు ప్రయోగం చేసేందుకు అవసరమైన పరికరాలు, రసాయనాలు పరీక్షా కేంద్రంలో ఉన్నది లేని కేంద్రానికి కేటాయించిన సంబంధిత అధ్యాపకుడు ముందు రోజు వెళ్లి పరిశీలించుకోవాల్సి ఉంటుంది. పరీక్ష రోజు ఉదయం సెషన్ కేంద్రం 7.30 గంటలకు నిర్ధేశించిన మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీ ఆధారంగా ప్రశ్నా పత్రాన్ని డౌన్లోడ్ చేస్తారు. మధ్యాహ్నం సెషన్లో 12.30కి డౌన్లోడ్ చేస్తారు. విద్యార్థులు పరీక్ష రాయడమూ, చేసిన ప్రయోగాన్ని పరిశీలించడమూ, మార్కులు వేయడమూ, వాటిని ఆన్లైన్లో పోస్ట్ చేయడమూ అంతా సీసీ కెమెరాల ముందే చేయాల్సి ఉంది. పరీక్షా కేంద్రంలో సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు జిల్లా కేంద్రంలోని కమిటీ సభ్యులు సిద్ధంగా ఉంటారు. కార్పొరేట్ కళాశాలలు ప్రాక్టికల్స్ నాణ్యతలో తీసికట్టు.. సహజంగా కార్పొరేట్ కళాశాలల్లో ప్రాక్టికల్స్కు సంబంధించి ల్యాబ్ అవర్స్ కేటాయించరన్న వాదన ఉంది. థియరీ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రాక్టికల్ పరీక్షల్లో కార్పొరేట్ కళాశాలల విద్యార్థులు ఒత్తిడికి లోనయ్యే అవకాశాలుంటాయని విద్యార్థి సంఘాల నేతలు అంటున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో ల్యాబ్ పరికరాలు తగినన్ని సంఖ్యలో ఉండకపోవడంతో విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయడంలో వెనుకబాటులో ఉంటారనేది నాయకుల విమర్శ. నిబంధనల మేరకు నిర్వహణ ఇంటర్మీడియట్ విద్యార్థుల ప్రాక్టికల్ పరీక్షలకు ప్రాధాన్యం ఉంది. వాటి నిర్వహణకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లు చేశాం. ప్రభుత్వ అనుబంధ శాఖల సహకారంతో శాసీ్త్రయంగా పరీక్షలను నిర్వహిస్తున్నాం. కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ తరగతిని నిర్వహించి అవగాహన కల్పించాం. సాంకేతిక సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం. – ఐ శారద, ఆర్ఐఓ, రాజమహేంద్రవరం -
ఫ అన్నకూటోత్సవం
దుళ్లలోని భూ సమేత వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం పులిహోర ప్రసాదంతో స్వామివారి చిత్రపటాన్ని రూపొందించి అన్నకూటోత్సవం జరిపారు. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు కార్యక్రమాల్లో స్వామికి తెల్లవారుజామునే సుప్రభాత సేవతో ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. అనంతరం అన్నకూటోత్సవం జరిగింది. రాత్రి 7 గంటలకు సింహ వాహనంపై గ్రామంలోని ప్రధాన వీధుల్లో స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం, మంగళ వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆలయ అర్చకులు పెద్దింటి లక్ష్మణాచార్యులు పర్యవేక్షణలో పెద్ద ఎత్తున భక్తులు ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. – కడియంపులిహోరతో రూపొందించిన వేంకటేశ్వరస్వామి చిత్రం -
పంట కాలువలోకి స్కూల్ బస్సు
● స్టీరింగ్ ఫెయిల్ అయ్యి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న వైనం ● 23 మంది విద్యార్థులకు తప్పిన ముప్పు సఖినేటిపల్లి: మండలం టేకిశెట్టిపాలెంలో మలికిపురంలోని ఒక ప్రైవేటు పాఠశాల బస్సు విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. 23 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు స్టీరింగ్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న హెచ్టీ విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. స్తంభం విరిగి బస్పై ఒరిగి తీగలు వేలాడాయి. కేవలం అంగుళం దూరంలో తీగలు వేలాడుతుండగా విద్యార్థులను బస్సు నుంచి దింపేశారు. అంతర్వేది ఉత్సవాల వల్ల పూర్తి నీటిమట్టంతో ప్రవహిస్తున్న పి.గన్నవరం ప్రధా న పంటకాలువ కూడా పక్కనే ఉంది. బస్ కాలువలో పడిపోయినా పెను ప్రమాదం సంభింవించేది. అలాగే బస్సుకు 11 కేవీ హెచ్టీ విద్యుత్ తీగలు తగిలినా పెను ప్రాణ నష్టం సంభవించేంది. కారణాలు ఏమైనప్పటికీ స్టీరింగ్ ఫెయిల్ అని డ్రైవర్ అంటున్నాడు. సఖినేటిపల్లి పోలీస్లు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పాఠశాల వద్దకు వెళ్లి ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావును సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాజోలు ఎమ్మెల్యే దేవ వర ప్రసాద్ సంఘటనపై స్పందించి ఆర్టీఏ అధికారులను ఫోన్ చేశారు. జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించా రు. డ్రైవర్ను విచారించారు. డ్రైవర్ లైసెన్సు మూడేళ్ల పాటు సస్పెండ్ చేశారు. అలాగే బస్ పర్మిట్ను కూడా మూడేళ్ల పాటు సస్పెండ్ చేశారు. విద్యార్థుల సంఖ్యలకు అనుగుణంగానే బస్లు ఏర్పాటు చేసుకోవాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. -
అన్నదానానికి పెంకుటిల్లు విరాళం
భర్త, సంతానం లేకపోవడంతో దానం చేసిన భక్తురాలు రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయ అన్నదాన ట్రస్ట్కు ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన దాత చిలకమర్రి వైజయంతి తనకు చెందిన 104 చదరపు గజాల పెంకుటిల్లును తన తదనంతరం అన్నదాన ట్రస్ట్కు చెందేలా వీలునామా రాశారు. ఈ మేరకు ఆలయ ఈఓ, దేవదాయ శాఖ సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవానికి బుధవారం ఆ పత్రాలను అందజేశారు. 75 ఏళ్ల వయస్సు కలిగిన తనకు సంతానం లేకపోవడం, భర్త చిలకమర్రి సత్య సారధి ఇప్పటికే మృతి చెందడంతో స్వామివారి సేవకు తన ఇల్లు ఉపయోగపడాలని విల్లు రాసి ఇచ్చినట్టు ఆమె పేర్కొన్నారు. ఈఓ ఆమెకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపిక ఇచ్చి అభినందించారు. స్వీట్ హోమ్లో అగ్నిప్రమాదం కొత్తపేట: మండల పరిధిలోని మందపల్లి వంతెన సమీపంలో బొబ్బట్లు స్వీట్స్ దుకాణం ‘దుర్గా గణేష్ స్వీట్ హోమ్’ శాఖలో అర్ధరాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం తెల్లవారు జామున సుమారు రాత్రి 2 గంటల సమయంలో సంభవించిన ప్రమాదాన్ని ఆ సమీప రహదారిపై ప్రయాణించే వారు గమనించి సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే షాపులోని వస్తువులు, షోకేసులు, సిటింగ్ టేబుళ్లు, కుర్చీలు, ఎన్నో రకాల స్వీట్స్ అగ్నికి ఆహుతై దుకాణం పూర్తిగా దగ్ధమైంది. దుకాణ యజమానులు తెలిపిన వివరాల మేరకు ఈ ప్రమాదంలో సుమారు రూ.6 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. అగ్నిమాపక అధికారి పి.శ్రీనివాస్ సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. దానితో మంటలు పక్కన ఉన్న దుకాణాలకు వ్యాపించకుండా నివారించగలిగారు. -
రత్నగిరిపై భక్తుల కిటకిట
అన్నవరం: రత్నగిరి వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం బుధవారం భక్తులతో కిటకిటలాడింది. గురువారం భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి దర్శనానికి బుధవారం రాత్రి నుంచే భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. సుమారు లక్ష మంది వస్తారన్న అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం, విశ్రాంతి మండపాలు కిటకిటలాడాయి. రాత్రి 8–30 గంటల సమయానికి దేవస్థానానికి సుమారు పది వేల భక్తులు మంది వచ్చారు. చాలా మంది భక్తులకు సత్రాలలో గదులు లభ్యం కాక ఆలయ ప్రాంగణంలోని విశ్రాంతి మండపాలలో, షెడ్లలో విశ్రమించారు. కొంతమంది రామాలయం పక్కన గల విశ్రాంతి షెడ్డులో విశ్రమించారు. తెల్లవారుజాము నుంచీ వ్రతాలు కాగా గురువారం వేకువ జాము నుంచే సత్యదేవుని వ్రతాలు, దర్శనాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాత్రి ఒంటి గంట నుంచి వ్రతాల నిర్వహణ, స్వామివారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. స్వామివారి వ్రతం టిక్కెట్లు బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచే విక్రయించడం ప్రారంభించారు. దేవస్థానంలోని అన్ని చోట్ల షామియానాలు, భక్తుల కోసం తాగునీటి ఏర్పాట్లు చేశారు. భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఆలయం, మహారాజ గోపురాలు, ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అలంకరించారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వేండ్ర త్రినాథరావు దేవస్థానంలో పర్యటిస్తూ ఏర్పాట్లు పర్యవేక్షించారు. సత్యదేవుని దర్శించిన 30 వేల మంది కాగా బుధవారం 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించి పూజలు చేశారు. స్వామివారి దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. స్వామివారి వ్రతాలు 1,500 జరిగాయి. అనంతరం భక్తులు గోశాలలో సప్త గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టుకు ప్రదక్షిణ చేసి జ్యోతులు వెలిగించారు. సుమారు రూ.25 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.● నేడు భీష్మ ఏకాదశి సందర్భంగా ముందుగానే భారీగా రాక ● శోభాయమానంగా రత్నగిరి అలంకరణ ● సత్రాలు ఖాళీ లేక ఆలయ ప్రాంగణంలోనే విశ్రాంతి -
డీఆర్డీఏ సెర్ప్ పీడీగా నగేష్
రాజమహేంద్రవరం రూరల్: జిల్లా డీఆర్డీఏ సెర్ప్ ప్రాజెక్టు డైరెక్టర్గా బి.నగేష్ బుధవారం బొమ్మూరు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. రాజమహేంద్రవరం రామదాసు కో ఆపరేటివ్ ట్రైనింగ్ సెంటర్ ఫ్యాకల్టీగా విధులు నిర్వహిస్తున్న ఆయనను ప్రభుత్వం డీఆర్డీఏ సెర్ప్ ఇన్చార్జి పీడీగా నియమించింది. ఇప్పటి వరకూ ఆ స్థానంలో పనిచేసిన ఎన్వీవీఎస్ మూర్తిని ఏపీ టూరిజం రీజినల్ డైరెక్టర్గా, ఏపీటీడీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా డిప్యూటేషన్పై నియమించారు. నగేష్ గతంలో జిల్లా పరిషత్ సీఈవోగా, జిల్లా పంచాయతీ అధికారిగా, జిల్లా సహకార అధికారిగా విధులు నిర్వహించారు. ముందుగా ఆయన జిల్లా ఇన్చార్జి కలెక్టర్ వై.మేఘ స్వరూప్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. భక్తిశ్రద్ధలతో గంధోత్సవం రాయవరం: పసలపూడిలోని నాగూర్ బాబా దర్గాలో బుధవారం గంధోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దర్గా నిర్వాహకుడు ఖాదర్ వలీ బాబా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం మూడు గంటలకు ముస్లింలు గంధపు బిందెలతో గ్రామోత్సవం చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ముస్లింలు దర్గాలో ప్రార్థనలు జరిపారు. నాగూర్బాబాను కీర్తిస్తూ ఆలపించిన గజల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నేడు జనార్దనస్వామి కల్యాణం ధవళేశ్వరం: గ్రామంలోని ధవళగిరిపై కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ జనార్దనస్వామి వారి కల్యాణం గురువారం రాత్రి 8.30 గంటలకు జరగనుంది. అంతకముందు తెల్లవారుజామున 3 గంటలకు విశేష అర్చనలు, ఉదయం 11.45 గంటలకు రథ సంప్రోక్షణ చేస్తారు. స్వామివారి రథోత్సవాన్ని మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రారంభించనున్నారు. రథం వీధి నుంచి స్థానిక పోలీస్స్టేషన్ సెంటర్ వరకు ఈ కార్యక్రమం సాగుతుంది. ఫిబ్రవరి 2వ తేది వరకు స్వామివారి కల్యాణో త్సవాలు నిర్వహిస్తారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం పాలకమండలి చైర్మన్ దాసరి చిన్న రమణ, ఆలయ కార్యనిర్వాహణాధికారి జోగి వెంకటేశ్వరరావు తెలిపారు. వాడపల్లిలో సీల్డ్ టెండర్లు కొత్తపేట: వాడపల్లి వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో షామియానా ఏర్పాటు, వివిధ దుకాణాల నిర్వహణకు బుధవారం సీల్డ్ టెండర్లు నిర్వహించారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రాంగణంలో షామియానాలు ఏర్పాటు చేసే హక్కుకు, అలాగే శ్రీనివాస ప్రాంగణంలో రెండు తాత్కాలిక షాపులకు (మూడేళ్ల కాలపరిమితి), లడ్డూ బాక్సులు సరఫరా చేసే హక్కుకు ఈ టెండర్లు నిర్వహించారు. లడ్డూ బాక్సులకు సంబంధించి ఒకటిని రూ.3.98కి సరఫరా చేయడానికి ముందుకు వచ్చిన విజయవాడకు చెందిన మణికంఠ ఏజెన్సీకి ఖరారు చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు తమ్మన సాయి ప్రసాద్, శిష్టా సూర్య కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.రూ.కోటితో అభివృద్ధి పనులు అన్నవరం: శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో రూ.కోటి వ్యయంతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాలని దేవస్థానం పాలకమండలి తీర్మానించింది. దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త, చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన ఏకసభ్య పాలకమండలి సమావేశం బుధవారం నిర్వహించారు. ఈఓ వేండ్ర త్రినాథరావు, ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కొండ దిగువన మొదటి ఘాట్ రోడ్ నుంచి రత్నగిరికి నిర్మించిన రెండో మెట్ల దారి ప్రారంభంలో ఆర్చి నిర్మించేందుకు, మెట్లకు ఇరువైపులా పిట్టగోడ, భక్తులు కూర్చునేందుకు వీలుగా ఫ్లాట్ఫారమ్ల నిర్మాణానికి రూ.40 లక్షల అంచనాతో టెండర్లు పిలిచారు. విశాఖపట్నానికి చెందిన సంతోష్ ఇంజినీరింగ్ వర్క్స్ 27.27 శాతం తక్కువకు టెండర్ దాఖలు చేసింది. ఆ సంస్థకు పనులు అప్పగించాలని నిర్ణయించారు. -
వీడని చిక్కుముడులు
మండపేట నియోజకవర్గ స్వరూపమిదీ.. నియోజకవర్గ కేంద్రం మండపేట మండలాలు మండపేట, కపిలేశ్వరపురం, రాయవరం గ్రామాలు 43 మున్సిపాలిటీ మండపేట (30 వార్డులు) జనాభా 2,65,944 కుటుంబాలు 98,423 ఓటర్లు 2,20,418 పురుషులు 1,07,175 మహిళలు 1,13,237 ఇతరులు 6 పోలీస్ సర్కిళ్లు మండపేట పట్టణం, మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లు మండపేట పట్టణం, ద్వారపూడి, అంగర, రాయవరం మండపేట విలీనంతో ‘తూర్పు’ ముఖచిత్రం జిల్లా కేంద్రం రాజమహేంద్రవరం జనాభా 20,98,276 ఓటర్లు 15,31,161 నియోజకవర్గాలు 8 అటవీ ప్రాంతం 89.9 చదరపు కిలోమీటర్లు రెవెన్యూ డివిజన్లు 2 (రాజమహేంద్రవరం, కొవ్వూరు) మండలాలు 22 (రాజమహేంద్రవరం డివిజన్ 13, కొవ్వూరు డివిజన్ 9) మున్సిపల్ కార్పొరేషన్ 1 (రాజమహేంద్రవరం) మున్సిపాలిటీలు 3 (కొవ్వూరు, నిడదవోలు, మండపేట) గ్రామ పంచాయతీలు 343 ఫ ‘తూర్పు’లో ఇటీవల మండపేట విలీనం ఫ నేటికీ శాఖల మధ్య కానరాని సమన్వయం ఫ ఆర్డీఓ కార్యాలయానికి పెరిగిన దూరంఫ రామచంద్రపురం, ఆలమూరు కార్యాలయాలు ప్రశ్నార్థకం ఫ విద్య, వైద్యం తదితర శాఖలు ఇప్పటికీ కోనసీమలోనే.. కపిలేశ్వరపురం: పాలనాపరమైన నిర్ణయాలు ప్రజల మేలుకోరి ఉండాలి. అలా కానప్పుడు ఫలితాలు లోపభూయిష్టంగా మారుతాయి. మండపేట, కపిలేశ్వరపురం, రాయవరం మండలాల పాలన, రెవెన్యూ వ్యవహారాలను కోనసీమ నుంచి తూర్పు గోదావరి జిల్లా పరిధిలోకి ప్రభుత్వం తీసుకుని వచ్చింది. అయితే, ఈ క్రమంలో అనేక చిక్కుముడులను ప్రభుత్వం ఇప్పటికీ పరిష్కరించలేదు. దీంతో, కొత్త జిల్లాలోకి మారినా మండపేట ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సమస్యలెన్నో.. కోనసీమ జిల్లాలో ఉన్నప్పుడు మండపేటకు ఆర్డీఓ కార్యాలయం 12 కిలోమీటర్ల దూరంలోని రామచంద్రపురంలో ఉండేది. ‘తూర్పు’లో విలీనం కావడంతో రాజమహేంద్రవరంలోని ఆర్డీఓ కార్యాలయానికి 25 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. కోనసీమలో జిల్లాలో ఉన్నప్పుడు కపిలేశ్వరపురం మండలం అద్దంకివారిలంక గ్రామ ప్రజలు 18 కిలోమీటర్లు ప్రయాణంతో అమలాపురంలోని కలెక్టరేట్కు చేరుకునేవారు. ‘తూర్పు’లో విలీనం కావడంతో ఇప్పుడు రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్కు వెళ్లాలంటే సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. కేదారిలంక గ్రామస్తులు సైతం దూరాభారంతో సతమతమవుతున్నారు. మండపేట నియోజకవర్గ పరిధిలో విద్య, వైద్య, ఆరోగ్య శాఖలు ఇప్పటికీ కోనసీమ జిల్లాలోనే కొనసాగుతున్నాయి. పోలీస్, రెవెన్యూ తదితర శాఖలు మాత్రం ‘తూర్పు’ పరిధిలో చేరాయి. దీంతో, ఆయా శాఖల ఉద్యోగుల్లో గందరగోళం నెలకొంది. గణతంత్ర దినోత్సవం నాడు కొందరు ఉద్యోగులు రాజమహేంద్రవరంలో, మరికొందరు అమలాపురంలో అవార్డులు అందుకున్నారు. ఈ నియోజకవర్గం కోనసీమ జిల్లాలో ఉన్నప్పుడు ఆ జిల్లా ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వులు అమలుకు నోచుకోవడంలేదు. కేశవరం పీహెచ్సీ వైద్యాధికారి సీహెచ్ రమ్యశ్రీ సిబ్బందిని వేధిస్తున్నారంటూ అందిన ఫిర్యాదుపై కోనసీమ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఆమెను ద్వారపూడి పీహెచ్సీకి బదిలీ చేశారు. జిల్లా మార్పు తర్వాత ఆ ఉత్తర్వులు బుట్టదాఖలయ్యాయి. దీంతో, ఆమె ఇప్పటికీ కేశవరంలోనే కొనసాగుతున్నారు. మండపేట ‘తూర్పు’లో విలీనం కావడంతో రామచంద్రపురంలోని ఆర్డీఓ కార్యాలయం నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఆ డివిజన్లో రామచంద్రపురం, కె.గంగవరం మండలాలు మాత్రమే ఉన్నాయి. ఈ రెండు మండలాల కోసం ఆ రెవెన్యూ డివిజన్ను కొనసాగించడం విచిత్రం. ఈ పరిస్థితుల్లో దీని మనుగడ ఎప్పటికై నా ప్రశ్నార్థకమే అవుతుందన్న వాదన ఉంది. మరోవైపు కోనసీమ జిల్లా పరిధి ఆలమూరులోని ప్రభుత్వ కార్యాలయాల విషయంలో సైతం గందరగోళం నెలకొంది. ప్రస్తుతం మండపేట, కపిలేశ్వరపురం మండలాల న్యాయపరమైన అంశాల విచారణ ఆలమూరులోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు, జేఎఫ్సీఎం కోర్టుల పరిధిలో జరుగుతోంది. ఈ రెండు మండలాలు ఇప్పుడు రామచంద్రపురం నుంచి రాజమహేంద్రవం తూర్పు జోన్ డీఎస్పీ పరిధిలోకి వెళ్లాయి. కపిలేశ్వరపురం మండల పరిధి రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం ఆలమూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్నాయి. జిల్లా మార్పుతో రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిని కూడా మార్చే చాన్స్ ఉంటుంది. అప్పుడు ఆలమూరు రిజిస్ట్రేషన్ కార్యాలయం పరిధి పరిమితమైపోతుంది. మండపేట, కపిలేశ్వరపురం మండలాల వ్యవసాయ శాఖ కార్యకలాపాలు ఆలమూరు సహాయ సంచాలకుడి (ఏడీఏ) పరిధిలో ఉన్నాయి. సబ్ ట్రెజరీ, ఎకై ్సజ్ కార్యాలయాల పరిస్థితి సైతం ఇలానే ఉంది. వీటి పరిధిపై స్పష్టత లేకపోవడం, పాలనా పరంగా ఒక జిల్లాలో.. శాఖల పరంగా మరో జిల్లాలో కొనసాగుతూండటంపై సర్వత్రా గందరగోళం నెలకొంది. ఉమ్మడి జిల్లా నేపథ్యమిదీ.. పూర్వపు అవిభక్త ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా 1925 ఏప్రిల్ 15న జీఓ 502 ద్వారా ఏర్పాటైంది. ఆ జిల్లాలో 1,103 గ్రామాలుండేవి. ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అక్కడక్కడ ప్రజల ఆకాంక్షల మేరకు కొన్ని మండలాలను వారు కోరుకున్న జిల్లాల్లోనే ఉంచింది. ఈ మేరకు 2022 ఏప్రిల్ 4న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాను నాలుగు జిల్లాలుగా విభజించారు. ఆ విధంగా అమలాపురం కేంద్రంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏర్పాటైంది. రామచంద్రపురం రెవెన్యూ డివిజన్లోని మండపేట నియోజకవర్గం ఈ కొత్త జిల్లా పరిధిలోకి వెళ్లింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత మండపేటకు జిల్లా కేంద్రం అమలాపురం దూరాభారమనే పేరుతో మండపేట, కపిలేశ్వరపురం, రాయవరం మండలాలను తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేయాలనే వాదనను మండపేటలో కొందరు తెర పైకి తెచ్చారు. అదే సమయంలో కోనసీమ జిల్లా నుంచి మండపేటను విడదీయ వద్దంటూ గత డిసెంబర్ 1న అమలాపురం కలెక్టరేట్ వద్ద చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యాన వ్యాపారులు నిరసన తెలిపారు. కారణాలేవైనప్పటికీ గత డిసెంబర్ 31 నుంచి కోనసీమ జిల్లా నుంచి మండపేట విడివడి ‘తూర్పు’లో విలీనమైంది. -
గ్రూప్–2 ఫలితాలలో ‘శ్యామ్’ సంచలనం
బోట్క్లబ్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం విడుదల చేసిన గ్రూప్–2 ఫలితాల్లో కాకినాడ శ్యామ్ ఇనిస్టిట్యూట్ తమ మొదటి ప్రయత్నంలో సంచలన విజయాలతో విజయకేతనాన్ని ఎగురవేసిందని సంస్థ చైర్మన్ శ్యామ్ తెలిపారు. 89 మంది తమ సంస్థ విద్యార్థులు డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, ఎకై ్సజ్ సబ్–ఇన్స్పెక్టర్ తదితర అత్యున్నత స్థాయి ఉద్యోగాలు సాధించారన్నారు. 2025 డీఎస్సీ ఫలితాలలో కూడా మొదటి ప్రయత్నంలోనే 712 ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించడం, ఏపీ టెట్–2026 ఫలితాలలో అత్యధిక మార్కులతో 186 మంది క్వాలిఫై కావడం, ఇప్పుడు విడుదలైన గ్రూప్–2 ఫలితాలలో ఇన్ని విజయాలు సాధించడానికి ప్రధాన కారణం తమ సంస్థలో నిబద్ధత, క్రమశిక్షణతో కూడిన శిక్షణ, ప్రామాణికమైన స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్లేనని ఆయన తెలిపారు. ఇంతటి అద్భుతమైన ఫలితాలను సాధించడంలో సహకరించిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు, అధ్యాపక, అధ్యాపకేతర బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ గ్రూప్–2, డీఎస్సీ, సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు నూతన బ్యాచ్లు ఫిబ్రవరి 12న ప్రారంభం కానున్నాయని, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని రాబోయే నోటిఫికేషన్లలో విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు. -
కూటమి పాలనలో మహిళలపై వేధింపులు
● జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ను సస్పెండ్ చేయాలి ● మాజీ హోం మంత్రి తానేటి వనిత దేవరపల్లి: కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళలపై వేధింపులు పెరిగాయని, జనసేన రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ వ్యవహారమే దీనికి నిదర్శనమని మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత అన్నారు. నల్లజర్లలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రైల్వేకోడూరు మహిళను శారీరకంగా, మానసికంగా వేధించిన ఎమ్మెల్యే శ్రీధర్ను జనసేన నుంచి తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయన్నారు. ఇన్ని జరుగుతున్నా సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని వాపోయారు. రైల్వే కోడూరుకు చెందిన బాధిత మహిళ ఎన్నో కష్టాలను తట్టుకుని, ఇబ్బందులను ఓర్చుకుని, బెదిరింపులను దాటుకుని.. తనకు జరిగిన అన్యాయాన్ని వీడియో రూపంలో విడుదల చేసిందన్నారు. కానీ ఇంత వరకూ హోంమంత్రి స్పందించకపోవడం దారుణమన్నారు. స్పందించని పవన్ లైంగిక దాడులకు పాల్పడితే తాట తీస్తామని చెబుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్పై ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని తానేటి వనిత ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. ఓ వివాహితను దారుణంగా వేధించి, దౌర్జన్యానికి తెగబడడం బాధాకరమన్నారు. పవన్ కల్యాణ్ వెంటనే ఆయన పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు చేస్తున్న ఇబ్బందికరమైన సంఘటనలను ఖండించి, ఎవరైతే జనసేన నాయకుల వల్ల ఇబ్బంది పడ్డారో వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జగనన్న ప్రభుత్వంలో మహిళలకు అన్ని విధాలా రక్షణ లభించిందన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు పడుతున్న ఇబ్బందులపై ఆ పార్టీల నాయకులు స్పందించడం లేదన్నారు. మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ ఓ ప్రభుత్వ ఉద్యోగి మహిళని వేధించగా ఆమె బయటకు వచ్చి చెప్పిందన్నారు. కానీ సతీష్పై చర్యలు తీసుకోకపోగా, బాధిత మహిళపైనే కేసు పెట్టడం విచిత్రమన్నారు. -
అనాలోచిత చర్యతో అనంత లోకాలకు..
● డివైడర్ గడ్డర్ తలకు తగిలి ఇంటర్ విద్యార్థి మృతి ● బస్సు నుంచి తల బయటకు పెట్టడంతో ఘటన ముమ్మిడివరం: ఆర్టీసీ బస్సులో కళాశాలకు వెళ్తున్న ఒక విద్యార్థి కిటికి నుంచి తల బయటకు పెట్టడంతో అన్నంపల్లి టోల్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన డివైడర్ ఐరన్ గడ్డర్ తగిలి మృతి చెందాడు. ముమ్మిడివరం మండలం అన్నంపల్లి శివారు లక్ష్మీదేవిలంకకు చెందిన సోంపల్లి వెంకట రవీంద్ర (16) అమలాపురంలో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రోజు ఆర్టీసీ బస్సులో అమలాపురం వెళ్లి వస్తుంటాడు. యథావిధిగా బుధవారం కాలేజికి వెళ్లడానికి లక్ష్మీదేవి లంకలో బస్సు ఎక్కిన రవీంద్ర అన్నంపల్లి టోల్ గేటు వద్ద తల బయటకు పెట్టడంతో టోల్ గేటు వద్ద ఏర్పాటు చేసిన డివైడర్ ఐరన్ గడ్డర్ ఢీకొని తలకు తీవ్రమైన గాయమైంది. దీంతో రవీంద్రను 108 అంబులెన్స్లో అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సోంపల్లి శ్రీనివాసరావు, వరలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు కాగా రవీంద్ర రెండో కుమారుడు. ప్రయోజకుడవుతాడనుకున్న కొడుకు ఇక లేడన్న నిజాన్ని ఆ దంపతులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొడుకు అకస్మిక మృతితో ఆకుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మెరిట్ స్టుడెంట్గా.. : తాను చదువుతున్న కళాశాలలో రవీంద్ర టాపర్. గతేడాది పదో తరగతి పరీక్షలలో ముమ్మిడివరం మండలం గాడిలంక జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతూ పదో తరగతి పరీక్షలలో 576 మార్కులు సాధించి టాపర్గా నిలిచాడు. మండల స్థాయిలో తృతీయ స్థానం సాధించి డీఈఓ షేక్ సలీబాషాచే అభినందనులు అందుకున్నాడు. రవీంద్ర అకస్మిక మృతితో గ్రామంలోను కళాశాలలోను విషాదఛాయలు అలుముకున్నాయి. -
మంచుతో మామిఢీ
● తెగుళ్లపై జాగ్రత్తలు అవసరం ● సస్యరక్షణతో అధిక దిగుబడి రాయవరం/ప్రత్తిపాడు: మామిడి ఇప్పుడిప్పుడే పూత దశకు చేరుకుంటోంది. పూత పిందెగా మారి తేనే రైతులకు లాభం. ప్రస్తుతం కురుస్తున్న మంచు, చలితో తెగుళ్లు విజృంభించే అవకాశం ఉంది. ముఖ్యంగా మంచుకు పూత మాడిపోయే అవకాశం ఉంది. తేనె మంచు పురుగు, ఆకు జల్లెడ గూడు పురుగు, పచ్చ పురుగు, పక్షికన్ను మచ్చ, బూడిద తెగుళ్లు వంటివి ఆశించే అవకాశం ఉంటుంది. తగిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే దిగుబడి బాగుంటుందని అధికారులు వివరిస్తున్నారు. తేనె మంచు పురుగు మేంగో హోపర్గా పిలిచే తేనెమంచు తల్లి పురుగులు, పిల్ల పురుగులు గుంపులుగా చేరి లేత ఆకులు, పూతకాడలు, పూలు, లేతపిందెల రసాన్ని పీల్చేస్తాయి. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు పూత ఎక్కువగా ఉన్న దశలోనే తేనె మంచుపురుగు ఆశిస్తుంది. ఈ పురుగులు విసర్జించిన తేనెలాంటి తియ్యని పదార్థం వల్ల మచ్చతెగులు, పూతకాడలపై, కాయలపై, ఆకులపై నల్లని మసి ఏర్పడుతుంది. ఈ తెగులు నివారణకు తోటలో నాలుగు నుంచి ఐదు అడుగుల ఎత్తులో ఆయిల్ పూసిన పసుపురంగు బోర్డులను ఏర్పాటు చేయాలి. ఎకరానికి నాలుగు నుంచి ఐదు ఏర్పాటు చేయాలి. పువ్వుమొగ్గ దశలో లీటరు నీటికి డైక్లోరోవాస్ (డీడీవీపీ) 0.5 మిల్లీలీటర్ల మందును లేదా మూడు గ్రాముల కార్బరిల్ లీటరు నీటికి కలిపి చెట్టు బెరడు, మూలలు తడిసేలా పిచికారీ చేయాలి. దీనివల్ల మొగ్గ తొలిచే గొంగళి పురుగును కూడా నివారించవచ్చు. పచ్చిపూత దశలో 1.5 మిల్లీ లీటర్ల నుంచి రెండు మిల్లీలీటర్ల మోనో క్రోటోఫాస్ లేదా రెండు మిల్లీలీటర్ల డైమిథోయేట్, లేదా రెండు మిల్లీలీటర్ల మిథైల్ డెమటా లేదా 0.25 మిల్లీ లీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఒక చెట్టుకు 10 నుంచి 15 లీటర్ల మందు ద్రావణాన్ని పిచికారీ చేయాలి. పిందె దశ (నల్లపూత)లో లీటరు నీటికి ఒక మిల్లీ లీటరు పాస్పోమిడా లేదా రెండు మిల్లీలీటర్లు మిథైల్ డెమటాన్, రెండు మిల్లీ లీటర్ల డైమిథియేట్ లేదా ఒక గ్రాము అసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. తామర పురుగులు రెండు మిల్లీమీటర్ల పొడవు, జాలరు వంటి రెక్కలు కలిగి ఉండే తామర పురుగులు పూత, కాయ దశల్లో ఆశిస్తాయి. వీటి నివారణకు పాస్పోమిడా ఒక మిల్లీ లీటరు, పిప్రోనిల్ రెండు మిల్లీ లీటర్లు, ఎసిఫేట్ ఒక గ్రాము మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పైన సూచించిన మందులతో పాటు మూడు మిల్లీ లీటరు వేపనూనె లేదా ఐదు శాతం వేప కషాయం కలిపి పిచికారీ చేస్తే ఫలితాలు బాగుంటాయి. పూతచుట్టు పురుగు ఈ పురుగులు పూత గుత్తుల్ని గూడుగా ఏర్పరుచుకుని పూతను తింటుంటాయి. పూతకాడల్ని తొలుచుకుని తినడంతో పూత ఒడిలిపోయి పూతరాలి పోతుంది. దీని నివారణకు డైక్లోరోవాస్ (డీడీవీపీ) 0.5 మిల్లీ లీటర్లు మందును లేదా మూడు గ్రాములు కార్బరిల్ లీటరు నీటికి కలిపి చెట్టు బెరడు, మూలలు తడిసేలా పిచికారీ చేయాలి. టెంకపురుగు కాయలు గోళీ సైజులో ఉన్నప్పుడు కాయ పైభాగాన్ని గోకి గుడ్లు పెడుతుంది. పిల్ల పురుగులు కాయను తొలుచుకుని పోయి లేత టెంకపప్పును తింటాయి. కాయ ఎదిగే దశలో రంధ్రం మూసుకుపోతుంది. పిల్లపురుగు తల్లిపురుగుగా మారినప్పుడు అది విసర్జించే పదార్థాలను కండలోనికి తీసుకుని రావడం వలన కాయ కుళ్లి నాణ్యత కోల్పోతుంది. దీని నివారణకు లీటరు నీటికి ఒక మిల్లీ లీటర్ల పెంథియాన్, మూడు గ్రాములు కార్బరిల్, రెండు మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ 15 రోజులకు ఒకసారి రెండు సార్లు చొప్పున పిచికారీ చేయాలి. బూడిద తెగులు పొడి, చల్లని, మబ్బు వాతావరణంలో బూడిదతెగులు సోకడానికి అవకాశం ఉంది. లేత ఆకులు, పువ్వు, పువ్వుకాడలు, పిందెలపై తెల్లటి బూజు ఏర్పడుతుంది. దీనివల్ల పూలు, పిందెలు రాలిపోతాయి. దీని నివారణకు ఎక్సాకోనజాల్ రెండు మిల్లీ లీటర్లు, ప్రొపికొనజోల్ ఒక మిల్లీ లీటరు మందును లీటరు నీటికి కలిపి పూతంతా తడిసేలా పిచికారి చేయాలి. డైనోకాప్ లేదా ట్రైడామార్క్ ఒక మిల్లీ లీటరు మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ, పూతమాడు తెగులు వర్షాలు, పొగమంచు అధికంగా ఉంటే ఆకుమచ్చ, పూతమాడు తెగుళ్లు ఆశిస్తాయి. ఈ తెగులు వేళ్లు మినహా చెట్టంతా ఆశిస్తుంది. ఆకులపై గోధుమరంగు మచ్చలు ఏర్పడి క్రమంగా కలిసి పోయి ఆకులు త్వరగా పండి రాలిపోతాయి. పూత నుంచి మొగ్గ బయటకు వచ్చే సమయంలో మూడు గ్రాముల కోపరాక్సిక్లోరైడ్ లేదా పచ్చిపూతపై ఒక గ్రాము కార్బండిజమ్ లేదా ఒక గ్రాము థయోఫేనేట్మిథైల్, పిందె దశలో 2.5 గ్రాముల మేంకోజబ్ అనే మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. ఆకు జల్లెడ గూడ పురుగు ఈ పురుగు పూతదశలో పూతను, మొగ్గలను ఆశించి తర్వాత గుత్తులను గూడుగా ఏర్పరుస్తుంది. రసాన్ని పీల్చి నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు క్వినాల్ ఫాస్ 25 ఈసీ 2 మిల్లీ లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రత్తిపాడు నియోజకవర్గంలో.. గత ఏడాది 6,605 ఎకరాల్లో మామిడి తోటలు సాగయ్యాయి. నష్టాలను చవిచూసిన రైతులు ఈ ఏడాది వెయ్యి ఎకరాల మేర ఇతర పంటల వైపు మళ్లారు. ప్రస్తుతం కొబ్బరి మామిడి, బంగినపల్లి, రసాలు, పండూరు మామిడి, పాపారావు కోవ, కలెక్టరు, సువర్ణరేఖ, ఇమాటీలు వంటి జాతి రకాలతో పాటు దేశవాళీ రకాల మామిడి తోటలను పెంచుతున్నారు. ప్రత్తిపాడు మండలంలో 1,975 ఎకరాల్లో, శంఖవరంలో 2,305, రౌతులపూడిలో 1,155, ఏలేశ్వరంలో 167 ఎకరాల్లో మామిడి తోటలను పెంచుతున్నారు. ఇంకా పూత రాని తోటల్లో....ఇంకా పూత రాని తోటల్లో 13–0–45 పది గ్రాములు, 3 గ్రాముల సల్ఫర్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే పూత వచ్చే అవకాశం ఉంటుంది. పూత వచ్చిన తోటల్లో పూత నిలబడడానికి, కాయ రాలడాన్ని వివారించేందుకు ఫ్లానోఫిక్స్ 0.2 మిల్లీ లీటర్ల నీటికి కలిపి పిందె దశలో, మళ్లీ పిందె గోళీ సైజులో ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. 3 గ్రాముల సూక్ష్మ పోషకాలు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తోటలో కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. – కె.దివ్యశ్రీ, ఉద్యానశాఖాధికారి, ప్రత్తిపాడు జిల్లాలో 30 వేల ఎకరాలలో సాగు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారుగా 30 వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. ప్రధానంగా బంగినపల్లి, కలెక్టరు, పెద్దరసం, చెరకురసం, కొత్తపల్లి కొబ్బరి, రాయల్ స్పెషల్, సువర్ణరేఖ వంటి రకాలు పండుతున్నాయి. ఏజెన్సీ, మెట్ట ప్రాంతాలతో పాటు కోనసీమ ప్రాంతంలో కూడా మామిడి పంట అధికంగా ఉంది. – పి.అనూష, రామచంద్రపురం డివిజన్ ఉద్యాన శాఖాధికారి -
పరిణయ శోభ
● వైభవంగా అంతర్వేది నరసన్న కల్యాణం ● జనసంద్రమైన ఆలయ ప్రాంగణం ● మార్మోగిన జైలక్ష్మీ నరసింహ నామస్మరణ ● నేత్రపర్వంగా వేడుక సాక్షి, అమలాపురం/ సఖినేటిపల్లి: పరమ పావనమైన వశిష్ఠ, సముద్ర సంగమ ప్రాంతంలో ఆధ్యాత్మికత పరవళ్లు తొక్కింది. ఆది దేవుని కల్యాణంతో శోభాయమానంగా మారింది. గోవింద నామస్మరణలు, జై లక్ష్మీనరసింహస్వామి అంటూ వేలాది గొంతులు స్మరించగా, ఆ ప్రాంతం శ్రవణానందకరంగా మారింది. అంతర్వేది పుణ్యక్షేత్రంలో జగదానందకారకుడు, ఆదిదేవుడు లక్ష్మీ నృసింహుని కల్యాణం బుధవారం అర్ధరాత్రి నయనానందకరంగా సాగింది. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి భక్తులు వెల్లువలా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది. నేత్రపర్వం ఆది దేవుడు అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి తిరు కల్యాణ మహోత్సవం నేత్ర పర్వంగా సాగింది. నృసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను వేదిక మీద ఉంచి సుమారు నాలుగు గంటల పాటు నిర్వహించిన వివాహ వేడుకను వేలాది మంది భక్తులు ప్రత్యక్షంగానూ, లక్షల మంది భక్తులు టీవీలలో ప్రసారం ద్వారా తిలకించారు. స్వామివారి కల్యాణం బుధవారం రాత్రి 1.56 (గురువారం తెల్లవారు జామున) గంటలకు రోహిణి నక్షత్రయుక్త వృశ్చిక లగ్న పుష్కరాంశంలో కనుల వైకుంఠంగా సాగింది. నృసింహుని కల్యాణంతో పరమ పవిత్ర వశిష్ఠ తీరం పులకించింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, రంగురంగుల పువ్వులతో శోభాయమానంగా తయారు చేసిన కల్యాణ వేదిక, పట్టు వస్త్రాలు, బంగారం, వజ్రాలతో తయారు చేసిన ఆభరణాలను ధరించిన స్వామివారు, అమ్మవార్లు సప్త వర్ణాలతో వెలిగిపోయారు. కల్యాణ మండపం చుట్టూ భారీ పందిళ్లు విద్యుద్దీపకాంతులతో మెరిసిపోయాయి. ఎదురు సన్నాహంతో.. నరసింహస్వామివారి కల్యాణతంతు బుధవారం రాత్రి 10 గంటలకు ఎదురు సన్నాహంతో ప్రారంభమైంది. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన రాజా కలిదిండి కుమార రామ గోపాల రాజా బహదూర్ శ్రీవారి తరఫున, అర్చక స్వాములు అమ్మవారి తరఫున వివాహ కర్తలుగా వ్యవహరించారు. వైఖానస ఆగమానుసారం ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేదపండితుడు చింతా వెంకటశాస్త్రి పర్యవేక్షణలో అర్చక బృందం సంప్రదాయబద్ధంగా కల్యాణాన్ని నిర్వహించారు. ఆభరణాలతో అలంకరణ ముహూర్తానికి జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని స్వామివారి శిరసుపై ప్రధాన అర్చకుడు కిరణ్, అమ్మవార్లు శ్రీదేవి, భూదేవి శిరసులపై సహాయ అర్చకులు ఉంచారు. ఎప్పటిలాగానే శఠారి, వైరుముడి, సూర్య పతకం, చిన్ని కిరీటం, వెండి కిరీటం, సాదా కిరీటం, కంటె, పచ్చలు, కెంపులు, వజ్రాలతో పొదిగిన కిరీటం, హంస పతకం, నవరత్నాలు పొదిగిన హారం, పగడాల దండ, తొమ్మిది ఈస్ట్ ఇండియా మోహాళీలు, 12 రకాల నానుతాడులు, చిన్ని లక్ష్మీ కాసుల పేర్లతో వారిని అలంకరించారు. వీటితోపాటు అంతర్వేదికరకు చెందిన దివంగత డాక్టర్ పోతురాజు సూర్య వెంకట సత్యనారాయణ సమర్పించిన అభరణాలను సైతం అలంకరించారు. ఆనవాయితీ ప్రకారం టీటీడీ దేవస్థానం శ్రీస్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించింది. రాష్ట్రం నలుమూల నుంచి సుమారు లక్ష మంది భక్తులు తరలివచ్చారు. నేడు రథోత్సవం అంతర్వేదిలో స్వామివారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా గురువారం మధ్యాహ్నం 2.05 గంటలకు స్వామివారి రథోత్సవం జరగనుంది. నూతన దంపతులుగా శ్రీస్వామి, అమ్మవార్లు రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. కల్యాణ వేదికపై లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లకు పూజలు చేస్తున్న అర్చకులు -
చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు
● జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ను అరెస్టు చేయాలి ● వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధి బాలమునికుమారి ముమ్మిడివరం: చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని, జనసేన ఎమ్మెల్యే కీచక పర్వంపై కూటమి నాయకులు ఏం సమాధానం చెబుతారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధి ఎస్ఈసీ సభ్యురాలు కాశి బాలమునికుమారి ప్రశ్నించారు. బుధవారం ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదనడానికి ఆ పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వమే ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. ప్రజా ప్రతినిధులే మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే రాష్ట్రాన్ని ఎవరు కాపాడతారని, ప్రజలు ఇంకెవరికి ఫిర్యాదు చేయాలని ప్రశ్నించారు. అరవ శ్రీధర్ వంటి వ్యక్తులు అసెంబ్లీలో కూర్చోవడానికి అనర్హులని, ఇది రాష్ట్రానికే సిగ్గు చేటన్నారు. మహిళా ఉద్యోగిని ఏడాదిన్నగా వేధించడం మానవత్వానికి మచ్చగా మిగిలిపోతుందన్నారు. భర్తకు విడాకులు ఇవ్వాలని బెదిరించడం మూడేళ్ల చిన్నారిని చంపుతామనడం అత్యంత దారుణమన్నారు. వాట్సప్ చాట్లు, వీడియో కాల్స్ వంటి ఆధారాలు ఉన్నా ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం సాగుతోందనడానికి ఇది తార్కాణంగా నిలిచిందన్నారు. ఆడవాళ్ల జోలికి వస్తే తాట తీస్తానన్న పవన్ కల్యాణ్ ఏం చేస్తున్నారని మునికుమారి ప్రశ్నించారు. ఎమ్మెల్యే శ్రీధర్పై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. భాధితురాలికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ పోటాడుతుందని ఆమె హెచ్చరించారు. -
గ్రేటర్ ఫ్లెమింగోల కనువిందు
తాళ్లరేవు: కోరంగి పంచాయతీ పరిధిలోని హోప్ ఐలాండ్ దీవిలో గ్రేటర్ ఫ్లెమింగోలు సందడి చేశాయి. సుమారు 70 ఫ్లెమింగోల గుంపు కనువిందు చేసింది. కోరింగా వన్యప్రాణి అభయారణ్యంలో యేటా జనవరిలో పక్షుల గణన చేపడతారు. ఈ నెల 6,7,8 తేదీలలో నిర్వహించిన పక్షుల గణనలో ఫ్లెమింగోల జాడ కనిపించలేదు. అయితే మంగళవారం హోప్ ఐలాండ్ దీవిలో 65 నుంచి 70 ఫ్లెమింగోలు మందను కనుగొన్నట్లు ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ తెలిపారు. గత ఏడాది కేవలం ఒక్క ఫ్లెమింగో మాత్రమే కనిపించిందని, ఈ ఏడాది ఈ స్థాయిలో ఫ్లెమింగోలు రావడం శుభపరిణామన్నారు. కోరింగా అభయారణ్యంలోని చిత్తడి నేలలు వలస పక్షుల రాకకు అనుకూల వాతావరణంలో ఉన్నట్లు తెలియజేశారు. ఇలా ఉండగా ఈ ఏడాది (2026) కోరింగా వన్యప్రాణి అభయారణ్యంలో నిర్వహించిన పక్షుల గణనలో 44,298 పక్షులను గుర్తించామన్నారు. గత ఏడాది(2025) 39,724 పక్షులను గుర్తించగా, 2024లో 43,131 పక్షులను గుర్తించామని వరప్రసాద్ తెలిపారు. -
మైనారిటీలపై పథకం ప్రకారం దాడులు
జగ్గంపేట: చంద్రబాబు ప్రభుత్వంలో మైనారిటీలకు రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో ఓ పథకం ప్రకారం మత విద్వేషాలు రగిలిస్తూ, మైనారిటీలపై దాడులకు పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్వెస్లీ ఆరోపించారు. జగ్గంపేటలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనారిటీలపై దాడుల్లో ప్రపంచంలోనే భారతదేశం ప్రథమ స్థానంలో ఉందని, దీనికి ప్రధాన కారణం చంద్రబాబు పాలనలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని విమర్శించారు. న్యాయ వ్యవస్థను సైతం కూటమి నేతలు ధిక్కరించే దారుణ పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇసుక, ల్యాండ్, మైనింగ్ మాఫియాలతో చేతులు కలిపి దోచుకు తింటున్నారని, దీంతో పరిపాలన గాడి తప్పిందని, నియంతృత్వ, కార్పొరేట్ వ్యవస్థ రాజ్యమేలుతోందని అన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీల రూపంలో సంఘ వ్యతిరేక శక్తులు మైనారిటీలు, క్రైస్తవులపై దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. దీని వెనుక ఓ మంత్రి పాత్ర ప్రముఖంగా కనిపిస్తోందని జాన్వెస్లీ ఆరోపించారు. గతంలో ఆయన శాఖ ద్వారా రాష్ట్రంలో అనుమతులున్న చర్చిలు ఎన్ని, లేనివి ఎన్ననే సమాచారం సేకరించారని, దీనిపై క్రైస్తవులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో తాత్కాలికంగా మౌనం వహించారని చెప్పారు. కానీ, ఒక పథకం ప్రకారం రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో దాడులు జరుగుతున్నాయన్నారు. గొల్లప్రోలు, సత్యసాయి, అనంతపురం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, విశాఖ జిల్లా భీమిలిల్లో చర్చిలు, క్రైస్తవ మత సంఘాలు, ప్రభువును నమ్ముకున్న వారిపై జరిగిన దాడులే దీనికి నిదర్శనమని ఆరోపించారు. ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలు అమలు చేయలేక, చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించి, ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధిని తాము చేసినట్లు చెప్పుకొంటూ క్రెడిట్ చోరీ చేస్తున్నారని, భోగాపురం ఎయిర్పోర్టు, అదానీ డేటా సెంటర్లే దీనికి ఉదాహరణగా నిలుస్తాయని జాన్వెస్లీ అన్నారు. విలేకర్ల సమావేశంలో క్రిస్టియన్ మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.జాన్వెస్లీ, కార్యదర్శి మోర్తా శ్రావణ్ కుమార్, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల అధ్యక్షులు జడాల జాషువా గిరి, విజయ సారథి, నేతలు గుడాల శాంతిప్రసాద్, ఐ.షాలెమ్. టి.తిమోతి, పలువురు క్రిస్టియన్ సంఘ నేతలు పాల్గొన్నారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జాన్వెస్లీ -
తల్లిదండ్రుల విశ్వాసాన్ని చూరగొన్న భాష్యం
సిల్వర్ జూబ్లీలో వక్తలు రాజమహేంద్రవరం రూరల్: విద్యా సంస్థలను స్థాపించి 25 సంవత్సరాలు విజయవంతంగా నడిపించడం, ఇంతమంది తల్లిదండ్రుల విశ్వాసాన్ని చూరగొనడం గొప్ప విషయమని జీఎస్ఎల్ హెల్త్ కేర్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మెంటర్, సర్జన్ డాక్టర్ గన్ని భాస్కరరావు అన్నారు. మంగళవారం వి.ఎల్.పురంలోని మార్గాని ఎస్టేట్స్లో భాష్యం 25 విద్యా వసంతాలు పేరిట జరిగిన రజతోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భాస్కరరావు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ భాష్యం తన శాఖలను విస్తరించుకోవడం అభినందనీయమన్నారు. భాష్యం పూర్వ విద్యార్థి, ప్రముఖ చలనచిత్ర దర్శకుడు బాబీ మాట్లాడుతూ భాష్యంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. భాష్యం విద్యాసంస్థలను ముందుకు నడిపించడంలో మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్ విజయవంతుడు అవుతాడు అనడంలో సందేహం లేదన్నారు. భాష్యం పూర్వ విద్యార్థి, ప్రముఖ వైద్యురాలు ప్లాస్టిక్ రీ కనస్ట్రక్టివ్ సర్జన్ డాక్టర్ సీహెచ్.దుర్గ సౌగంధి మాట్లాడుతూ 25 సంవత్సరాలు ఒక సంస్థను నడపడం సవాల్తో కూడిందన్నారు. చైర్మన్ రామకృష్ణ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో రజతోత్సవం మర్చిపోలేని జ్ఞాపకం అన్నారు. వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యను అందించేందుకు భాష్యం విద్యాసంస్థలు నడుం బిగించాయన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ భాష్యం సాకేత్ రామ్ మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు ఉన్నతమైన విద్యను అందించేందుకు భాష్యం ఇంటర్నేషనల్ స్కూల్స్ను స్థాపించామన్నారు. భాష్యం విద్యాసంస్థల ముఖ్య సలహాదారు మైఖేల్ రాజ్, ఉభయగోదావరి జిల్లాల జెడ్ ఈ ఓ లు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఫ్రిజ్ పేలి మెడికల్ షాపు దగ్ధం
అల్లవరం: ఫ్రిజ్ పేలడంతో షాపు దగ్ధమైన ఘటన బోడసకుర్రు మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. షాపు యజమాని కొక్కిరమెట్టి గోపాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం ఆయన భోజనం చేయడానికి షాపు క్లోజ్ చేసి కోడూరుపాడులోని ఇంటికి వెళ్లారు. భోజనం చేయడానికి రెడీ అవుతున్న సమయంలో బోడసకుర్రు నుంచి ఫోన్ వచ్చింది. షాపులో నుంచి పొగ, శబ్దాలు వస్తున్నాయని తెలిపారు. దీంతో హూటాహూటీన షాపు వద్దకు వెళ్లే సరికి షాపులో మంటలు చెలరేగుతున్నాయి. స్థానికుల సాయంతో షాపు షట్టర్ ఓపెన్ చేసి చేసే సరికి ఫ్రిజ్ పేలిపోయి మంటలు వ్యాపించాయని బాధితుడు తెలిపారు. సుమారు రూ.3 లక్షల వరకు నష్టం జరిగిందని చెప్పారు. -
ప్రత్యక్ష దేవుడి పెళ్లికి వెళ్లొద్దాం రండి!
పెదపూడి: దేశంలోనే ఏకై క వైష్ణవ సంప్రదాయ సూర్య దేవాలయంగా ప్రసిద్ధి చెందిన మండలంలోని జి.మామిడాడ సూర్యనారాయణమూర్తి కల్యాణ మహోత్సావానికి అంతా సిద్ధమైంది. స్వామి వారి దివ్య కల్యాణ మహోత్సవాన్ని పరమహంస పరివ్రాజకాచార్య, వేదమార్గ ప్రతిష్ఠాపనాచార్య, ఉభయ వేదాంత ప్రవర్తకాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళ శాసనాలతో భీష్మ ఏకాదశి గురువారం వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు ఈఓ పాటి సత్యనారాయణ, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త, ట్రస్ట్బోర్డు చైర్మన్ కొవ్వూరి శ్రీనివాస బాలకృష్ణారెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు సమాయత్తమవుతున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలల్లో హాజరయ్యే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. భారీగా బాణసంచా సిద్ధం చేశారు. కల్యాణం రోజున జరిగే కార్యక్రమాలు ఈ నెల 25న రథసప్తమి రోజున ప్రారంభమైన స్వామివారి కల్యాణ మహోత్సవాలు ఫిబ్రవరి 2తో ముగుస్తాయి. స్వామి కల్యాణ మహోత్సవం సందర్భంగా గురువారం ఉదయం 5 గంటలకు నిత్యోపాసన, విశేష హోమం, బలిహరణ, 8 గంటలకు ధ్వజారోహణ, 9 గంటలకు మార్కెట్ సెంటర్లో భారీ అన్న సమారాధన, మధ్యాహ్నం 1.00 గంటకు శ్రీవారి రథోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు స్వామి కల్యాణం ప్రారంభమవుతుంది. ఆలయ చరిత్ర.. ప్రత్యేకత ఈ ఆలయ నిర్మాణం వెనుక శతాబ్దం చరిత్రతో పాటు కొవ్వూరి వంశీయుల దాతృత్వం దాగి వుంది. ఆలయంలో 1902 జూన్ 18న విగ్రహ ప్రతిష్ఠ శ్రీ వైష్ణవ సంప్రదాయ రీతిలో చేశారు. దేశంలో కోణార్క్, అనంతనాగ్, గయ, రాష్ట్రంలో ఆరసవల్లి సూర్యదేవాలయాలు ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రమే వైష్ణవ సంప్రదాయంలో పూజలు చేస్తారు. నాలుగు అంతస్తులతో శిలా కావ్యాలను ఆలయంలో నిర్మించారు. అహోబల సంస్థానంలో కొవ్యూరి భూమంచిరెడ్డి వంశీయులు దండనాయకులుగా, మహానాయకులుగా ఉండేవారు. మహమ్మదీయుల దండయాత్రలతో ప్రాబల్యం కోల్పోయిన ఈ వంశీయులు ఉభయ గోదావరి జిల్లాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కొవ్యూరి బసివిరెడ్డి వ్యాపారంలో అభివృద్ధి సాధించి భూములు, సిరి సంపదలు కూడగట్టారు. గృహ, వస్త్ర, అన్నదానాలతో పాటు బావులు తవ్వించారు. వనాలు పెంచారు. దేవాలయాల నిర్మాణాలను చేపట్టారు. ఈయన సేవలను కొనియాడుతూ 1897 బ్రిటిష్ మహారాణి ప్రశంసాపత్రం పంపించారు. ఈయన దాతృత్వానికి కుతుకులూరు, కాకినాడ, గొల్లల మామిడాడ, గండ్రేడు, నిడదవోలు తదితర ప్రాంతాల్లోని బసివిరెడ్డి పేటలే తార్కాణం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాల్లో అనేక బావులు తవ్వించారు. నిత్యాన్నదానం చేస్తున్న సామర్లకోట బసివిరెడ్డి సత్రం ఈయన చలవతోనే నడుస్తోంది. అన్నవరం తర్వాత గొల్లల మామిడాడ సూర్యనారాయణమూర్తి దేవాలయంలోనే ఎక్కువ సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. ఉత్సవాలు ఇలా.. 30వ తేదీ ఉదయం, సాయంత్రం నిత్యార్చన, నిత్యహోమాలు, బలిహరణ 31న సాయంత్రం 4 గంటలకు సదస్యం, స్వామివారి గరుడ వాహన తిరువీధి ఉత్సవం 1వ తేదీ ఉదయం 7 గంటలకు పవిత్ర తుల్యభాగనదీ తీరాన స్వామి వారి చక్రస్నానం, ఆలయంలో మహా పూర్ణాహుతి 2వ తేదీ రాత్రి 7 గంటలకు అద్దాల శయన మందిరంలో ఉయ్యాలసేవ, శ్రీపుష్పయాగ మహోత్సవం రేపు జరిగే సూర్యనారాయణమూర్తి కల్యాణానికి అంతా సిద్ధం భారీ ఏర్పాట్లు చేసిన జి.మామిడాడ ఆలయ ఉత్సవ కమిటీ రాష్ట్రం నలుమూలల నుంచి వేలల్లో హాజరుకానున్న భక్తులు -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఎటపాక: ఆటో అదుపు తప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అడిషనల్ ఎస్సై రాధాకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం కూనవరం మండల కేంద్రానికి చెందిన మచ్చా నాగేశ్వరరావు(27) వరసకు తన అన్న కూతురు లావణ్యను తన కొత్త బైక్పై ఎక్కించుకుని తెలంగాణలోని వెంకటాపురం నుంచి కూనవరం వస్తున్నాడు. ఈ క్రమంలో కూనవరం నుంచి ఆరుగురు ప్రయాణికులతో పల్లూరుకు చెందిన షేక్రహీమ్ తన ఆటోలో భద్రాచలం వెళుతున్నాడు. ఆ సమయంలో ఎటపాక మండలం బూట్టాయిగూడెం శివాలయం సమీపంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆటో అదుపు తప్పడంతో జరిగిన ఈ ప్రమాదంలో బైక్ నుజు నుజ్జు కాగా నాగేశ్వరరావుకు తల, సున్నితమైన భాగాలలో బలమైన గాయాలయ్యాయి. లావణ్యకు కాలు విరగగా ఆటోలోని ప్రయాణికులు, డ్రైవర్కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో భద్రాచలం తరలిస్తుండగా మార్గమధ్యలో నాగేశ్వరరావు మరణించాడు. మృతుడి తండ్రి గతంలో మరణించగా తల్లికి ఆసరాగా ఉన్న అవివాహిత కుమారుడు కూడా మరణించటంతో తల్లి చిట్టెమ్మ రోదన అక్కడ ఉన్నవారిని కలచి వేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉత్తమ నాటికగా అసత్యం
● ముగిసిన ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలు ● ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా ‘అమ్మ చెక్కిన బొమ్మ’ సామర్లకోట: పెద్దాపురం మండలం చంద్రమాంపల్లి గ్రామంలో మూడు రోజుల పాటు నిర్వహించిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు ముగిశాయి. ఉత్తమ నాటికగా విశాఖపట్నం, చైతన్య కళా స్రవంతి ప్రదర్శించిన ‘అసత్యం’ ఎంపిక అయింది. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా గోవాడ క్రియేషన్స్, హైదరాబాద్ వారి ‘అమ్మ చెక్కిన బొమ్మ’ నిలిచింది. తృతీయ ప్రదర్శనగా అభినయ ఆర్ట్సు గుంటూరు వారి ‘ఇది అతని సంతకం’ ఎంపిక అయింది. ‘గేమ్’ నాటిక జ్యూరీ బహుమతిని అందుకుంది. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు విశ్రాంత చీఫ్ మేనేజరు గోపి కాశీవిశ్వనాథ్, విశ్వకవి విద్యాసంస్థల వారి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఉత్తమ దర్శకునిగా అసత్యం నాటిక దర్శకుడు బాలాజీ నాయక్, ఉత్తమ రచయితగా (అమ్మ చెక్కిన బొమ్మ) జ్యోతిరాజ్ బీసెట్ బహుమతులు అందుకున్నారు. ఉత్తమ నటుడిగా ఇది అతని సంతకం నాటికలో కృష్ణమూర్తి పాత్రధారి రవీంద్రరెడ్డి, ఉత్తమ నటిగా అమ్మ చెక్కిన బొమ్మ నాటికలో అనసూయ పాత్ర ధారి జ్యోతిరాజ్ నిలిచారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా కె.శాంతారావు, బీఎస్ ఆర్ స్వామి, ఘంటా ముత్యాలనాయుడు వ్యవహరించారు. చంద్రమాంపల్లి గ్రామానికి చెందిన కళాభిమానులు స్నేహా ఆర్ట్స్ నాటక పరిషత్తు ఏర్పాటు చేసి ఏడు సంవత్సరాలుగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయి నాటిక పోటీలు నిర్వహిస్తున్నారు. పరిషత్తు అధ్యక్షుడు గొందేసి రాజా, గౌరవ సలహాదారు కొత్తెం స్వామినాథన్, గౌరవ అధ్యక్షుడు గోగులపాటి సీతారామస్వామి, కార్యదర్శి యిందన బ్రహ్మానందం, ఉపాధ్యక్షుడు దేవాడ పాపేశ్వరరావు, సహాయ కార్యదర్శి మంతిన సత్తిబాబు, కోశాధికారి మానేపలి రవీంద్ర, కార్యవర్గ సభ్యులు కేదారి నాగేశ్వరరావు, గొందేసి సత్యానందం, వెన్నా సత్యనారాయణ, నూకలమంతి నానాజీ, ప్రజానాట్యమండలి కళాకారులు డి సత్యనారాయణ, మహాపాతిన రాంబాబు, రామిశెట్టి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
సోనోవిజన్ లక్కీ డ్రా విజేతలు వీరే
రాజమహేంద్రవరం సిటీ: సోనోవిజన్ కొనుగోలుదారులకు రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా లక్కీడ్రాను రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా తీసి విజేతలకు అందించే కార్యక్రమం మంగళవారం రాజమహేంద్రవరం సోనో విజన్ షోరూంలో నిర్వహించినట్టు సోనోవిజన్ మేనేజింగ్ పార్టనర్ పి. భాస్కరమూర్తి తెలిపారు. ఈ లక్కీ డ్రాలో మారుతీ ఆల్టో కారు, ఎల్ఈడీ టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషీన్ బహుమతులుగా అందించామన్నారు. రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్, వి.టి. కాలేజ్ రోడ్, సోనోవిజన్ షోరూంలో లక్కీడ్రా నిర్వహిచినట్లు తెలిపారు. లక్కీ డ్రాలో మారుతీ ఆల్టో కారును రాజమహేంద్రవరం ఆర్యాపురానికి చెందిన ఎన్.సాయికుమార్, ఎల్ఈడీ టీవీని రాజమహేంద్రవరం వీవర్స్ కాలనీకి చెందిన జి. శారదాదేవి, రిఫ్రిజిరేటర్ను బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామానికి చెందిన ఆర్.రాజా, వాషింగ్ మెషీన్ను రాజానగరం మండలం కానవరం గ్రామానికి చెందిన ఎం.ఆంజనేయులు గెలుపొందారని భాస్కరమూర్తి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అందరికన్న తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్ అందించే అతి పెద్ద ఎలక్ట్రానిక్ చైన్ స్టోర్ సోనోవిజన్లో అన్ని పెద్ద కంపెనీల నుంచి ఎల్.ఇ.డి, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషీన్లు, ఎ.సి, మొబైల్స్, ల్యాప్టాప్స్ ఇంకా కిచెన్ అప్లయెన్సెస్ ఎక్కువ డిస్కౌంట్లో అందిస్తున్నామన్నారు. అంతేకాకుండా రూ.30,000 వరకు క్యాష్ బ్యాక్, 22.5 శాతం వరకు లభించే క్యాష్ బ్యాక్ ఈ రిపబ్లిక్ డే సేల్ ప్రత్యేకత అని తెలిపారు. -
నేత్రపర్వంగా గ్రామోత్సవాలు
సఖినేటిపల్లి: అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామివారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం సాయంత్రం 4 గంటలకు హనుమద్వాహనం, రాత్రి 8 గంటలకు సింహవాహనంపై గ్రామోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. వాహనాలపై కొలువుదీరిన స్వామి మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన మిచ్చారు. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 5–30 నుంచి 7 గంటల వరకూ స్వామివారి తిరువారాధన, ఆర్జిత అభిషేకం, బాలభోగం అర్చకులు నిర్వహించారు. తదనంతరం సాధారణ, ప్రత్యేక దర్శనాలకు భక్తులను అనుమతించారు. అంతర్వేదిలో నేడు ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం సాయంత్రం 4 గంటలకు పంచముఖ ఆంజనేయస్వామి వాహనంపైన, రాత్రి 8 గంటలకు కంచు గరుడ వాహనంపైన గ్రామోత్సవాలు నిర్వహిస్తారు. రాత్రి 1–56 గంటలకు రోహిణీ నక్షత్రయుక్త వృశ్చిక లగ్న పుష్కరాంశంలో స్వామివారి తిరు కల్యాణం కన్నుల పండువగా అర్చకులు, వేద పండితులు నిర్వహించనున్నారు. స్వామి సన్నిధిలో ఏలూరు రేంజ్ ఐజీ అంతర్వేది లక్ష్మీనరసింహస్వామికి మంగళవారం ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజల అనంతరం అర్చకులు ఆశీర్వచనాలు పలికారు. స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదాలను ఐజీకి అందజేశారు. కల్యాణ మహోత్సవాలకు వచ్చే భక్తులకు కల్పించే సౌకర్యాలను, ఉత్సవ ఏర్పాట్లను ఐజీ, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీన్వీ ప్రసాద్తో ఆలయంలో సమీక్షించారు. కల్యాణం, రథోత్సవం, పౌర్ణమి స్నానాలకు భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలను ఐజీ, ఎస్పీ రాహుల్మీనా, డీఎస్పీ సుంకర మురళీమోహన్లతో చర్చించారు. -
జాతీయ స్థాయి బీచ్ వాలీబాల్కు ఎంపిక
చాగల్లు: జాతీయ స్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు ఊనగట్ల జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు ఎంపికయ్యారు. ప్రధానోపాధ్యాయుడు ఎన్వీ రమణ మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. తమ పాఠశాలలో పంతకాని లాస్య (తొమ్మిదో తరగతి), కంచర్ల హనీ (ఏడో తరగతి) అండర్–14 బాలికల విభాగంలో జాతీయ స్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారని వివరించారు. వీరు బుధవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకూ కోల్కతాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థినులను, వారికి శిక్షణ ఇచ్చిన వ్యాయామోపాధ్యాయుడు కొయ్య గంగాధరరావును అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నందిగం శ్రీనివాసరావు, ఎస్ఎంసీ చైర్మన్ కామన శివ, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. -
భూ బాదుడు
సాక్షి, రాజమహేంద్రవరం: చంద్రబాబు ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ బాదుడే.. బాదుడు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే విద్యుత్ చార్జీలు పెంచి, ప్రజల నెత్తిన భారం మోపిన సర్కారు.. ఇప్పుడు భూముల ధరలు మరోసారి పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొత్త చార్జీల అమలుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర రిజిస్ట్రేషన్స్, స్టాంపుల శాఖ కమిషనర్ గత నెలలోనే ఉత్తర్వులు ఇచ్చారు. దీని ప్రకారం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న భూముల మార్కెట్ విలువలను సవరించనున్నారు. దీనిపై ప్రజలు తమ సలహాలు, అభ్యంతరాలు తెలపాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో కోరారు. సవరణలు ఇలా.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ధరల సవరణ ప్రక్రియను ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా చేపడతారు. సదరు భూముల విలువలను రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ అధికారులు సమన్వయంతో చర్చించి నిర్ణయిస్తారు. సవరించిన విలువలకు రివిజన్ కమిటీ ఆమోద ముద్ర వేస్తుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి కాగా.. ఈ నెల 25 నుంచి సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నోటీసు బోర్డులో ప్రతిపాదిత ధరల వివరాలు పొందుపరిచారు. వీటిపై గురువారం వరకూ ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. తుది ధరలకు 31వ తేదీన ఆమోదం తెలుపుతారు. రివిజన్ కమిటీ గ్రీన్సిగ్నల్ ఇచ్చిన వెంటనే పెంచిన ధరలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ చేసింది. రిజిస్ట్రేషన్లు మరింత భారం జిల్లావ్యాప్తంగా 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. వీటిల్లో ప్రతి రోజూ 500 నుంచి 1,000 రిజిస్ట్రేషన్లు జరుగుతూంటాయి. ప్రతి రోజూ సుమారు రూ.3 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. ఏ ప్రాంతాల్లో ఎంత మేరకు ధరలు పెంచారనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల్లో ఆయా భూములకున్న విలువల ప్రకారం రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచనున్నారు. కక్షిదారులు సాధారణంగా బయటి మార్కెట్లో భూములను అధిక ధరలకే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. అయినప్పటికీ ప్రభుత్వం ఆ ధరలను పరిగణనలోకి తీసుకోదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల మేరకు కక్షిదారులు చలానా రూపంలో ఫీజులు చెల్లించిన తర్వాతే రిజిస్ట్రేషన్లు చేస్తారు. ఇప్పటికే బయట భూముల ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు అధికంగా ఉండటంతో భూములు కొనాలనుకున్న వారు వెనకడుగు వేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం మరోసారి భూముల ధరలు పెంచడంతో రిజిస్ట్రేషన్ చార్జీలు సామాన్యులకు మోయలేని భారంగా మారనున్నాయి. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో కూరుకుపోగా.. ప్రస్తుతం ప్రభుత్వం భూముల ధరలు పెంచుతూండటంతో మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కోనుంది. నివాస స్థలాలపై సైతం.. కమర్షియల్ స్థలాలే కాకుండా నివాస స్థలాలపై సైతం భారం మోపేందుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. దీనివలన రాజమహేంద్రవరం నగరంతో పాటు దివాన్ చెరువు, లాలాచెరువు, హౌసింగ్ బోర్డ్ కాలనీ, మోరంపూడి జంక్షన్ తదితర ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా పెరగనున్నాయి. దీనికి తోడు ఆర్సీసీ భవనాలు, మట్టి మిద్దెలు, రేకుల షెడ్లు, సెల్లార్, సినిమా హాళ్లు, పరిశ్రమలు, పూరిళ్లు తదితర నిర్మాణాల విలువలను సైతం పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం చదరపు అడుగుకు 10 నుంచి 30 శాతం వరకూ వీటి మార్కెట్ విలువ పెంచనున్నారు. ఫలితంగా సామాన్యులు సెంటు భూమి కూడా కొనలేని పరిస్థితి ఏర్పడనుంది. ఫ కోరుకొండ మండలం గాడాల గ్రామంలో ప్రస్తుతం గజం రూ.8 వేల నుంచి రూ.16 వేలు పలుకుతోంది. 10 శాతం పెంచితే.. రూ.800 నుంచి రూ.1,600 వరకూ పెరిగి, గజం భూమి ధర గరిష్టంగా రూ.17,600కు చేరుతుంది. ఫ రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరులో ప్రస్తుతం గజం భూమి విలువ రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకూ ఉంది. దీనికి 10 శాతం కలిపితే రూ.1,500 పెరుగుతుంది. దీంతో గజం విలువ రూ.17 వేలకు చేరుతుంది. ఫ భూమి విలువలో 1.5 శాతం రిజిస్ట్రేషన్ చార్జీల కింద చెల్లించాల్సి ఉంటుంది. పెంచనున్న ధరల ప్రకారం రిజిస్ట్రేషన్ చార్జీలు కూడా పెరుగుతాయి. రాజమహేంద్రవరంలో ఆయా ప్రాంతాలను బట్టి 3 నుంచి 8 శాతం వరకూ పెరుగుదల ఉంటుంది. రియల్ రంగంలో కలకలం ప్రభుత్వ నిర్ణయం రియల్ ఎస్టేట్ రంగంలో కలకలం రేపుతోంది. ఇప్పటికే ఒకసారి భూముల ధరలు పెంచారని, ఇప్పుడు మరోసారి పెంచుతూండటంతో వ్యాపారం కుదేలవుతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ముడి సరకుల ధరలు పెరగడంతో నిర్మాణ రంగం సైతం ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో క్రెడాయ్ రాష్ట్ర కమిటీ ప్రతినిధులు ఇప్పటికే ఆర్థిక మంత్రిని సంప్రదించారని, ధరల పెంపుపై పునరాలోచించాలని విన్నవించారని సమాచారం. 10 నుంచి 30 శాతం వరకూ పెంపు జిల్లాలో భూముల విలువ పెంపుపై ఇప్పటికే జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్లతో జాయింట్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. గ్రోత్ సెంటర్ల ఆధారంగానే రిజిస్ట్రేషన్ విలువలు పెంచాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు. సగటున 10 నుంచి 30 శాతం వరకూ పెంపుదల చేపట్టాలని ఆదేశించారు. దీనికి అనుగుణంగా జిల్లాలో భూముల ధరలు పెంచేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఫ రివిజన్ ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు ఫ సలహాలు, సూచనలకు రేపటి వరకూ అవకాశం ఫ 31న తుది నిర్ణయం ఫ 1 నుంచి పెంచిన ధరలు అమల్లోకి.. ఫ 10 నుంచి 30 శాతం పెరగనున్న వైనం ఫ భారీగా పెరగనున్న రిజిస్ట్రేషన్ చార్జీలు ఫ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రెండోసారి పెంపు -
రత్నగిరిపై విస్తృత ఏర్పాట్లు
అన్నవరం: భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి నాడు సత్యదేవుని దర్శనానికి వేలాదిగా భక్తులు వచ్చే అవకాశమున్నందున రత్నగిరి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ, దేవస్థానం అధికారుల సమావేశంలో నిర్ణయించారు. ఈ రెండు రోజులతో పాటు మాఘమాసంలో వివిధ పర్వదినాల్లో వచ్చే భక్తుల సౌకార్యర్థం చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రకాష్ సదన్లోని ట్రస్ట్ బోర్డు సమావేశ హాలులో పెద్దాపురం ఆర్డీఓ శ్రీరమణి అధ్యక్షతన మంగళవారం సమావేశం నిర్వహించారు. అన్నవరం దేవస్థానం తరఫున చేస్తున్న ఏర్పాట్లను ఈఓ వి.త్రినాథరావు వివరించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, విద్యుత్, ఏపీఎస్ ఆర్టీసీ, అగ్నిమాపక శాఖల అధికారులు కూడా సహకారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఇవీ నిర్ణయాలు.. ● ఈ నెల 29న భీష్మ ఏకాదశి, ఫిబ్రవరి 1న మాఘ పౌర్ణమి, 15వ తేదీన మహాశివరాత్రితో పాటు మాఘ మాసంలో వచ్చే శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో సత్యదేవుని సన్నిధికి వేలాదిగా భక్తులు రానున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఏర్పాట్లు చేయాలి. ● భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి పర్వదినాల్లో ముందు రోజు సాయంత్రం నుంచే వేలాదిగా భక్తులు రత్నగిరికి వస్తారు. దీనికి తగినట్లుగా చర్యలు చేపట్టాలి. ● ఈ రెండు రోజుల్లో అర్ధరాత్రి 12.30 గంటల నుంచే సత్యదేవుని వ్రతాల నిర్వహణ ప్రారంభించాలి. వేకువజామున ఒంటి గంట నుంచే స్వామివారి దర్శనానికి అనుమతించాలి. ● క్యూలో భక్తులకు మంచినీరు, చిన్నారులకు పాలు, బిస్కెట్లు అందజేయాలి. స్వచ్ఛంద సేవా కార్యకర్తల సహకారంతో పలుచోట్ల క్యాన్ల ద్వారా మంచినీరు అందించాలి. ● ప్రసాదాల విక్రయాలకు అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలి. ప్రసాదాలపై ఎలుకలు పరుగులు పెడుతున్న వీడియోలు ఇటీవల వైరల్ అయినందున అటువంటి వాటికి ఆస్కారం లేకుండా అన్ని కౌంటర్లలో తగు చర్యలు తీసుకోవాలి. ● ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చర్యలు చేపట్టాలి. భారీ వాహనాలను కొండ దిగువన హైస్కూల్ మైదానంలో నిలుపు చేయాలి. కార్లు, ఇతర చిన్న వాహనాలను మాత్రమే రత్నగిరికి అనుమతించాలి. ఈ కార్లను సత్యగిరిపై హరిహర సదన్ ఆవరణలో, సత్యగిరి రోడ్డు పక్కన పార్కింగ్ ప్రదేశంలో, ప్రకాష్ సదన్ సత్రం వద్ద నిలుపు చేయాలి. ● రత్నగిరి, సత్యగిరి మధ్య భక్తుల కోసం ఉచిత బస్సులు నడపాలి. గతంలో మాదిరిగా టాటా మ్యాజిక్ వాహనాలను కూడా ఇందుకు ఉపయోగించాలి. ● కార్తిక మాసంలో మాదిరిగానే కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసి, భక్తులను విడతల వారీగా స్వామివారి దర్శనానికి పంపించాలి. ● భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమి నాడు ఉదయం 8 గంటల నుంచి సర్కులర్ మండపం వద్ద భక్తులకు దధ్యోదనం, పులిహోర పంపిణీ చేయాలి. ● భక్తులందరికీ వసతి గదులు లభించే అవకాశం లేనందున డార్మెట్రీలు, విశ్రాంతి మండపాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలి. మూఢం కారణంగా ప్రస్తుతం వివాహాలు లేనందున సత్యగిరిపై విష్ణుసదన్ హాళ్లలో కూడా భక్తుల వసతికి చర్యలు తీసుకోవాలి. ● దేవస్థానంలో పలుచోట్ల అదనపు టాయిలెట్లు సిద్ధం చేయాలి. ● జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, దేవస్థానం ఉచిత వైద్యశాల సిబ్బంది సహకారంతో దేవస్థానంలో మూడుచోట్ల వైద్య శిబిరాలు నిర్వహించాలి. ● దివ్యాంగుల కోసం వై జంక్షన్ నుంచి పశ్చిమ రాజగోపురం వరకూ బ్యాటరీ కార్లు నడపాలి. ● కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం నుంచి అన్నవరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలి. ఫ భీష్మ ఏకాదశి, మాఘ పౌర్ణమికి వేలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఫ అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారుల నిర్ణయం -
కమనీయం భీమనాథుని కల్యాణం
రామచంద్రపురం రూరల్: మానవుల కల్యాణం మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా అని వారి జీవన సాఫల్యం కోసం చేస్తుంటారు. దేవుని కల్యాణం మాంగల్యం తంతునానేన లోక రక్షణ హేతునా అని లోక కల్యాణం కోసం ప్రతీ సంవత్సరం వార్షికంగా నిర్వహిస్తారు. పంచారామాలలో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాల్లో 12 వ శక్తి పీఠంగా భాసిల్లుతున్న భూకై లాసం ద్రాక్షారామంలో విశ్వావసు నామ సంవత్సరం మాఘ శుద్ధ ఏకాదశి అయిన బుధవారం ఒకే వేదికపై ఎక్కడా లేని విధంగా ముగ్గురు దేవతా మూర్తులు శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వరస్వామివారు, శ్రీ చండికా సమేత శ్రీ సూర్యేశ్వరస్వామివారు, శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నారాయణస్వామివార్ల కల్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. నేటి నుంచి కల్యాణ మహోత్సవాలు : ముగ్గురు దేవుళ్లకు ఒకే రోజు దివ్య కల్యాణం నేటి నుంచి ఫిబ్రవరి 3 శుక్రవారం వరకు పాంచాహ్నిక దీక్షగా మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వరస్వా మి, శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నారాయణస్వామి, శ్రీ చండికా సమేత శ్రీ సూర్యేశ్వరస్వామి వార్లకు ధ్వజారో హణ, దివ్య కల్యాణ మహోత్సవాలు, రాత్రి రోహిణీ నక్షత్రయుక్త సింహలగ్నమందు రాత్రి 10.17 గంటలకు ముగ్గురు దేవుళ్ల దివ్య కల్యాణ మహోత్సవాలు దేవస్థానం బ్రహ్మ దేవులపల్లి ఫణిరామకృష్ణ, అర్చకస్వాములు నిర్వహించనున్నారు. కార్యక్రమ వివరాలు : 28న లక్ష రుద్రాక్ష పూజ, నంది వాహనంపై స్వామివార్ల గ్రామోత్సవం, రాత్రి 10.17 గంటలకు స్వామివార్ల దివ్య కల్యాణ మహోత్సవాలు, 29న గరుడవాహనంపై స్వామివార్ల నగరోత్సవం. 30న నగరోత్సవం, సాయంత్రం శ్రీ స్వామివార్ల సదస్యం. తదుపరి పండిత సత్కారం, రాత్రి సర్వ వాహ నాలపై శ్రీ స్వామివార్ల నగరోత్సవం. 31న ఉదయం నగరోత్సవం, మధ్యాహ్నం రథోత్సవం, సాయంత్రం వేగాయమ్మపేటలో ఆస్థాన పూజ. ఫిబ్రవరి 1న ఉదయం వసంతోత్సవం, నాకబలి, గ్రామోత్సవం అనంతరం త్రిశూల స్నానం, చక్ర స్నానం, రాత్రి సర్ప వాహనాలపై స్వామివార్ల నగరోత్సవం, చోరోత్సవం, కవాట బంధనం. 2న జల విహారం. 3న పుష్పోత్సవం -
కార్మిక వ్యతిరేక విధానాలను ఆమోదించడం దుర్మార్గం
రాయవరం: కార్మికులకు నష్టాన్ని కలిగించే కేంద్ర విధానాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించకుండా అసెంబ్లీలో ఆమోదించడం దుర్మార్గ చర్యగా తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ కార్మిక సంఘ నాయకుడు రాగుల రాఘువులు, ఐఎఫ్టీయూ రాష్ట్ర కోశాధికారి గుబ్బల ఆదినారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని చెల్లూరు పంచాయతీలో సోమవారం కార్మిక సమస్యలపై మాట్లాడేందుకు వచ్చిన సందర్భంగా వారు మాట్లాడారు. కార్మికులకు రక్షణగా ఉన్న 26 చట్టాలను రద్దు చేసి, యాజమాన్యాలకు అనుకూలంగా లేబర్ కోడ్లను మార్చి పోరాడి సాధించుకున్న 8గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ 10 గంటల భారాన్ని కార్మికుల మీద రుద్దుతున్నారన్నారు. లేబర్ కోడ్ల రద్దు కోరుతూ ఫిబ్రవరి 12న దేశ వ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు వేతనాలు మొదటి వారంలో ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న అరియర్స్ చెల్లించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య డిమాండ్ చేసింది. కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు జొన్నకూటి రవికుమార్, లంక రాంబాబు పాల్గొన్నారు. భీష్మ ఏకాదశి ఏర్పాట్లపై నేడు సమీక్ష అన్నవరం: ఈ నెల 29న భీష్మ ఏకాదశి, ఫిబ్రవరి ఒకటో తేదీన మాఘ పౌర్ణమి, మాఘ మాసంలో ఇతర పర్వదినాల సందర్భంగా సత్యదేవుని ఆలయానికి వేలాదిగా భక్తులు వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహిస్తున్నారు. -
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
ఆర్ట్స్ కాలేజీలో జరిగిన గణతంత్ర దినోత్సవంలో జాతీయ జెండా ఎగురవేస్తున్న ఇన్చార్జి కలెక్టర్ మేఘస్వరూప్గగనపు వీఽధిలో జాతీయ పతాక రెపరెపలు ప్రగతికి పునరంకితం● ఇన్చార్జి కలెక్టర్ మేఘస్వరూప్ ● ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం ● ఆర్ట్స్ కళాశాలలో జాతీయ పతాకం ఆవిష్కరణ ● అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ● ప్రభుత్వ సంక్షేమ పథకాల తీరును వివరిస్తూ శకటాల ప్రదర్శన ● ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన ఏపీఈపీడీసీఎల్, డీఆర్డీఏ – మెప్మా, వ్యవసాయ – హార్టికల్చర్ శకటాలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వాములైన ఇతర ప్రముఖులను స్మరించుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తితో జిల్లా ప్రగతికి పునరంకితం అవుదామని ఇన్చార్జి కలెక్టర్ మేఘస్వరూప్ అన్నారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆర్ట్స్ కాలేజీ సభా ప్రాంగణానికి చేరుకున్న ఎస్పీ డి.నరసింహ కిశోర్ పోలీసు దళాల గౌరవ వందనం సమర్పించారు. పరేడ్ కమాండర్ జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పి. సంజీవ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరేడ్ను పరిశీలించి, గౌరవ వందనం స్వీకరించారు. ఇన్చార్జి కలెక్టర్ మేఘస్వరూప్ మాట్లాడుతూ అఖండ గోదావరి కుడి, ఎడమ కాలువలు పూడిక తీతకు రూ.270 కోట్లు మంజూరు చేశామని, కాటన్ బ్యారేజీ మరమ్మతులకు రూ.150 కోట్లతో పనులు టెండర్ దశలో ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో రాజమహేంద్రవరంలో వీఎల్ పురం వద్ద రూ.13.76 కోట్ల వ్యయంతో ఇండోర్ స్టేడియం పనులు చేపడుతున్నట్టు తెలిపారు. ఎస్పీ నరసింహ కిశోర్ మాట్లాడుతూ ఈరోజు దేశం సర్వసత్తాక, సార్వభౌమత్వ దేశంగా మారిన రోజున్నారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. శకటాల ప్రదర్శన వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తీరును వివరిస్తూ నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. శకటాల ప్రదర్శనలో ప్రథమ బహుమతి ఏపీఈపీడీసీఎల్కు దక్కగా, రెండవ బహుమతి డీఆర్డీఏ–మెప్మా శాఖకు, మూడవ బహుమతి వ్యవసాయం–ఉద్యాన శాఖల శకటాలకు లభించింది. క న్సొలేషన్ బహుమతుల్లో నాలుగవ స్థానం పాఠశాల విద్య–సర్వశిక్షా అ భియాన్, ఐదవ స్థానం రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్, ఆరవ స్థానం పౌర సరఫరాల శాఖలకు దక్కాయి స్వాతంత్య్ర సమరయోధులు, వారి వారసులకు సత్కారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్య్ర సమరయోధులు, వారి వారసులను ఇన్చార్జి కలెక్టర్ మేఘస్వరూప్, ఎస్పీ నరసింహ కిశోర్ సత్కరించారు. స్వాతంత్య్ర సమర యోధురాలు నేరంటి చంద్రమ్మ (భర్త రామారాయుడు) వారసులు మారి రామతులసి (కుమార్తె), నెక్కంటి ఆదినారాయణ, బలరామకృష్ణ, వెంకటేశ్వరరావు, స్వాతంత్య్ర సమర యోధులు ఏబీ నాగేశ్వరరావు కుమారుడు కృష్ణవర్మ, స్వాతంత్య్ర సమర యోధులు క్రొవ్విడి లింగరాజు మనుమలు భాస్కరరావు, సుబ్రహ్మణ్యం, స్వాతంత్య్ర సమరయోధులు కందుల వీర రాఘవస్వామి మనుమలు బాబురాయుడులను సత్కరించారు.మొదటి బహుమతి పొందిన ఏపీ ఈపీడీసీఎల్ శకటం రెండో బహుమతి డీఆర్డీఏ –మెప్మా శకటం మూడో బహుమతి సాధించిన వ్యవసాయం – ఉద్యాన శాఖ శకటం -
140 మంది కన్యలకు పాదుకా పూజలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్కు ఎదురుగా ఉన్న ప్రణవనాద నిలయం వద్ద శ్రీగౌతమ అక్షయ పాత్ర సంస్థ ఆధ్వర్యంలో 140 మంది కన్యలకు సామూహికంగా పాదుకా పూజలు సోమవారం జరిగాయి. ఈ నెల 17వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకూ ప్రణవనాద నిలయం వద్ద జరుగుతున్న శ్రీశ్యామలాదేవి షోడశ రాత్రి అఖండ హోమ, పూజా మహోత్సవాల్లో భాగంగా కన్యలకు ఈ పాదుకా పూజలు జరిగాయి. రాజమహేంద్రవరానికి చెందిన వేము వెంకట శివకుమార్ మంత్రోచ్ఛారణ నడుమ పూజలు చేయించారు. కన్యలను వారి తల్లులు రాజ మాతంగి స్వరూపంగా భావించి దేవతార్చన, విశేష పూజలు చేశారు. వచ్చే నెల 2వ తేదీ రాత్రి 8 గంటలకు మహా పూర్ణాహుతితో శ్యామలాదేవి షోడశ రాత్రి అఖండ హోమ, పూజా మహోత్సవాలు ముగుస్తాయని మహోత్సవాల గురువు పోతురాజు రామకృష్ణారావు తెలిపారు. అక్షయ పాత్ర వ్యవస్థాపకురాలు నాగ కనకదుర్గ పర్యవేక్షణలో పాదుకా పూజలు జరిగాయి. ఈ సందర్భంగా లింగోలు విస్సు, సలాది సాయిరామ్, కేవీ మావుళ్లయ్య, చాగంటి ప్రసాద్, అరిగెల బుజ్జి, నూకల కుమారి తదితరులు భక్తులకు సేవలు అందించారు. -
‘భాష్యం’ ఎదుగుదలలో తల్లిదండ్రులు కీలకం
కంబాలచెరువు: ‘భాష్యం’ ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర కీలమైందని ఆ విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ అన్నారు. సోమవారం స్థానిక జేకే గార్డెన్స్లో భాష్యం రజతోత్సవ వేడుకల్లో 2001–02 విద్యా సంవత్సరం మొదటి బ్యాచ్ విద్యార్థుల తల్లిదండ్రులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో భాష్యం విద్యా సంస్థలను స్థాపించి 25 వసంతాలు పూర్తి చేసుకుని, రజతోత్సవాన్ని జరుపుకోవడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. తమపై నమ్మకంతో పిల్లలను భాష్యంలో చేర్పించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక దానవాయిపేటలో మొదటి బ్రాంచ్ను ప్రారంభించామన్నారు. ఎంత ఎదిగినా మూలాలను మర్చిపోకూడదన్న విలువలను అనుసరించి ఈ విజయానికి కారకులైన తల్లిదండ్రులను సన్మానించుకోవడం బాధ్యతగా భావిస్తున్నానన్నారు. భాష్యం విద్యాసంస్థల వైస్ చైర్మన్ భాష్యం హనుమంతరావు మాట్లాడుతూ తొలినాళ్లలో తమకు వెన్నుదన్నుగా నిలిచిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, అకడమిక్ కోర్ టీమ్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. సభకు భాష్యం విద్యా సంస్థల ముఖ్య సలహాదారు మైఖేల్ రాజ్ అధ్యక్షత వహించారు. ఉభయగోదావరి జిల్లాల జెడ్ఈఓలు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. గవర్నర్ను కలసిన డాక్టర్ దశరథ రామారెడ్డి రాజమహేంద్రవరం సిటీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని లోక్భవన్లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దశరథ రామారెడ్డి, సింధు తేతలి దంపతులు కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. -
అగ్గి.. కష్టం బుగ్గి
● మురమండలో పాక దగ్ధం ● కన్నీరుమున్నీరైన వలస కూలీలు కడియం: కూలీల కష్టం బుగ్గి అయ్యింది.. కడియం మండలం మురమండ శివారులోని పొలం వద్ద తాటాకు పాక పూర్తిగా కాలిపోయింది. అందులో వలస కూలీలు దాచుకున్న దాదాపు రూ.నాలుగు లక్షలు, వారి దుస్తులు, వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం గున్నంపూడి గ్రామానికి చెందిన 12 కుటుంబాలకు సంబంధించిన 21 మంది రెండు నెలల క్రితం మురమండ గ్రామానికి వ్యవసాయ పనుల నిమిత్తం వచ్చారు. అదే గ్రామానికి చెందిన అంకం సత్తిపండుకు చెందిన పొలంలోని పాకలో నివాసం ఉంటున్నారు. వీరంతా వ్యవసాయ పనులు పూర్తి చేసుకుని, కూలి డబ్బులు పోగుచేసుకుని తమ గ్రామానికి వెళ్లిపోతారు. ఒకటి రెండు రోజుల్లో ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతుల నుంచి రావాల్సిన కూలి డబ్బులను పోగు చేసుకుని వారు నివాసం ఉండే పాకలోని పెట్టెలో భద్రపరుచుకుని, ఎప్పటిలాగే సోమవారం కూడా పనులకు వెళ్లిపోయారు. అయితే ఉన్నట్టుండి సదరు పాకకు నిప్పు అంటుకోవడంతో కూలీలు దాచుకున్న డబ్బుతో పాటు, వారి దుస్తులు, రెండు మోటారు సైకిళ్లతో సహా మొత్తం కాలిబూడదైంది. స్థానికులు అనపర్తి అగ్ని మాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో వారొచ్చి మంటలను పూర్తిగా అదుపు చేశారు. పనులకు వెళ్లిన కూలీలు ప్రమాద విషయం తెలిసి ఘటనా స్థలానికి వచ్చి తమ కష్టార్జితం బుగ్జిపాలు కావడంతో కన్నీరు మున్నీరయ్యారు. -
అంబేడ్కర్ను విస్మరించిన చంద్రబాబు సర్కారు
మాజీ ఎంపీ భరత్రామ్ ఆగ్రహం రాజమహేంద్రవరం సిటీ: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను చంద్రబాబు సర్కారు పూర్తిగా విస్మరిస్తుందని వైఎస్సార్ సీసీ జాతీయ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ విమర్శించారు. రాజమహేంద్రవరం క్వారీ సెంటర్లో గణతంత్ర దినోత్సవ రోజున అంబేడ్కర్ విగ్రహాన్ని కనీసం శుభ్రం చేసే చర్యలు చేపట్టలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వారీ సెంటర్లో మాజీ సీఎం జగన్ పాలనలో పార్లమెంట్ నమూనాతో అంబేడ్కర్ విగ్రహం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించామని, కానీ ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో కనీసం శుభ్రపరచకుండా అవమాన పరుస్తోందని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ శ్రేణులతో కలసి ఆ విగ్రహాన్ని శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా అధికార యంత్రాంగం అంతా స్థానికంగా నివాసం ఉంటుందని, అదేవిధంగా ఆరుగురు ప్రజాప్రతినిధులు కూటమి ప్రభుత్వం తరఫున ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. కనీసం వీరికి పట్టింపు లేకుండా పోయిందన్నారు. అంతటి ముఖ్య కట్టడాన్ని శుభ్రం చేయకుండా దయనీయ స్థితిలో వదిలేయడం వెనుక యంత్రాంగం నిర్లక్ష్యం అర్థం అవుతుందన్నారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సిటీ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
జటావల్లభుల శత వసంత మహోత్సవం
నిడదవోలు: స్థానిక లయన్స్ ఆడిటోరియంలో నిడదవోలు అర్చన ఆధ్యాత్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం బ్రహ్మశ్రీ జటావల్లభుల జగన్నాథం శత వసంత మహోత్సవ సమర్చన సభను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన సమన్వయ సరస్వతి సామవేదం షణ్ముఖశర్మ మాట్లాడుతూ జగన్నాథం ఇంత వయసులో కూడా నిరంతరం హైందవ ధర్మ, ఇతిహాసాలను అధ్యయనం చేస్తూ, ప్రవచనాలు చెప్పడం నిజంగా భగవత్ సంకల్పమన్నారు. ఆధ్యాత్మికతను ప్రతి ఒక్కరూ అందుకోవాలన్నారు. జగన్నాథం రచనలు, సాహిత్యాన్ని ప్రతి ఒక్కరూ అధ్యయనం చేసి, సనాతన హైందవ ధర్మ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. అనంతరం జటావల్లభుల జగన్నాథాన్ని సామవేదం షణ్ముఖశర్మ సత్కరించారు. కార్యక్రమంలో భాగవత విరించి డాక్టర్ టీవీ నారాయణరావు, మధుర భారతి మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి, పద్య కళాతపస్వి డాక్టర్ ధూళిపాళ మహాదేవమని, సహస్రవధాన భాస్కరకోట వెంకట లక్ష్మీనరసింహం, అర్చన ఆధ్యాత్మిక ప్రచార వేదిక కన్వీనర్ ఐఎస్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. జాహ్నవి కుటుంబానికి పరామర్శ పి.గన్నవరం: మండలంలోని జి.పెదపూడి ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఇటీవల జింక బొమ్మపై నుంచి పడి రెండో తరగతి విద్యార్థిని దివి జాహ్నవి మృతి చెందిన నేపథ్యంలో, ఆమె కుటుంబాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు సోమవారం పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులు సుజాత, దుర్గావరప్రసాద్, కుటుంబ సభ్యులను వేణుగోపాలరావు ఓదార్చారు. పరామర్శించిన వారిలో సర్పంచ్ దంగేటి అన్నవరం, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు అడ్డగళ్ల వెంకట సాయిరామ్, కుసుమ సుబ్బారావు, అడ్డగళ్ల శ్రీను తదితరులు ఉన్నారు. -
భారీ సిగరెట్ల డంప్ స్వాధీనం
● విజిలెన్స్ అధికారుల దాడి ● రూ.2 కోట్ల విలువైన సరకుగా గుర్తింపు కాకినాడ రూరల్: విజిలెన్స్ అధికారుల దాడిలో భారీ సిగరెట్ల డంప్ పట్టుబడింది. దీని విలువ రూ. 2 కోట్ల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాకినాడ రూరల్ మండలం తూరంగిలోని ఓ ఇంట్లో వీటిని అక్రమంగా నిల్వ ఉంచగా, దాడి చేసి పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. తూరంగి పరిధిలోని జనావాసాలు తక్కువగా ఉండే ఓ లేవుట్లో ఓ ఇంటిని పచ్చిగోళ్ల అప్పారావు అద్దెకు తీసుకున్నాడు. అక్కడ నాన్ బ్రాండెడ్, నాన్ డ్యూటీ పెయిడ్ సిగరెట్లను అక్రమంగా నిల్వ ఉంచాడు. విశ్వసనీయ సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు ఆ ఇంటిపై దాడి చేయగా, 311 బాక్స్ల్లో 3.70 లక్షల సిగరెట్టు ప్యాకెట్లను గుర్తించారు. వీటిపై రూ.40, రూ.60, రూ.100గా ధరలు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అప్పారావు అదుపులోకి తీసుకుని సిగరెట్లు ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి తీసుకు వచ్చారో, ఎవరికి అమ్ముతారనే అంశాలపై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. వీటిని ఒడిశా ప్రాంతం నుంచి తీసుకు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ దాడిలో విజిలెన్స్ అధికారులతో పాటు రెవెన్యూ, ఇంద్రపాలెం పోలీసులు ఉన్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ తాతారావు మాట్లాడుతూ తూరంగిలోని ఒక ఇంట్లో అక్రమంగా అన్ బ్రాండెడ్ సిగరెట్లు ఉన్నట్టు సమాచారం మేరకు తమ సీఐ మురళీకృష్ణ, మధుబాబు, ఏఓ, డీసీటీఓ సిబ్బందితో పాటు రెవెన్యూ, ఇతర శాఖ సహకారంతో దాడి చేశామన్నారు. ఈ దాడిలో చేసి నాన్ బ్రాండెడ్ సిగరెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ సుమారు రూ.1.70 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు ఉంటుందని, ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. వీటిని ఇంద్రపాలెం పోలీసులకు అప్పగించామన్నారు. -
విద్యుత్ లైన్పై పడిన కొబ్బరి చెట్టు
సఖినేటిపల్లి: అంతర్వేదికి వెళ్లే ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ఉయ్యూరివారి మెరక ఆర్అండ్బీ రోడ్డులో సోమవారం పెను ప్రమాదం తప్పింది. ఈ రోడ్డులోని శంకరయ్య రైస్ మిల్లుల వద్ద ఒక కొబ్బరి చెట్టు ఒక్కసారిగా హెచ్టీ విద్యుత్ తీగలపై పడింది. తీగలు తెగి తారు రోడ్డుపై పడ్డాయి. విద్యుత్ తీవ్రతకు తారు రోడ్డుపై సైతం మంటలు వచ్చాయి. ఆ సమయంలో అక్కడ ఎక్కడ ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఆ శాఖ ఏఈ ప్రసాద్ ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడ చేరుకుని విద్యుత్ సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. -
నారసింహాయ.. దుష్టసంహారాయ
● అంతర్వేదిలో అట్టహాసంగా కల్యాణోత్సవాలు ● రెండో రోజు హంస, శేష వాహనాలపై సేవ ● స్వామివారికి విశేష పూజలు సఖినేటిపల్లి: నారసింహాయ.. నమో భగవతాయ అంటూ ఆ లక్ష్మీనృసింహుడిని భక్తజనం కొలిచింది.. అంతర్వేదిలో స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం భక్తులతో క్షేత్రం కిక్కిరిసింది.. ఆ స్వామిని చూసిన ప్రతి మది మురిసింది.. స్వామివారికి సాయంత్రం 4 గంటలకు హంస వాహనంపై, రాత్రి 8 గంటలకు శేష వాహనంపై గ్రామోత్సవాలను అట్టహాసంగా జరిపారు. ఆలయ ప్రధాన అర్చకుడు పాణింగిపల్లి శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో స్థానాచార్య వింజమూరి రామరంగాచార్యులు, వేద పండితుడు చింతా వెంకటశాస్త్రి, అర్చక స్వాములు సాయంత్రం 6.30 గంటల నుంచి విశేష పూజలు చేశారు. తొలుత స్వామివారి సన్నిధిలో వైఖానస ఆగమానుసారం, శ్రీవైష్ణవ సంప్రదాయ ప్రకారం విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, వాస్తుపూజ, వాస్తు హోమం, గరుత్మంతుని హోమం, అంకురార్పణ, ధూపసేవ, ధ్వజారోహణ, గరుత్మంతుని చిత్రపటం ఆవిష్కరణ వంటి విశేష కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. సోమవారం నుంచి పౌర్ణమి వరకూ ఉత్సవాల నిర్వహణకు అర్చకులు ఏడు రోజుల పాటు విష్ణు దీక్ష తీసుకున్నారు. ఏటా ఈ దీక్ష చేపట్టడం వారికి ఆనవాయితీగా వస్తోంది. అర్చకులకు దీక్షా వస్త్రాలను జిల్లా దేవదాయ శాఖ అధికారి వి.సత్యనారాయణ, ఆలయ ఈఓ ఎంకేటీఎన్వీ ప్రసాద్, చైర్మన్, ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ రాజా కలిదిండి కుమార రామగోపాలరాజా బహుద్దూర్, ఉత్సవ సేవా కమిటీ చైర్మన్ దెందుకూరి రాంబాబురాజు అందజేశారు. స్వామివారి దీక్ష తీసుకున్న అర్చకులు భక్తిశ్రద్ధలతో అంకురార్పణ, ధ్వజారోహణ నిర్వహించారు. నవ ధాన్యాలను పుట్ట మట్టిపై చల్లి, సర్వ దేవతలను ఆవాహనం చేసి, ఏడు రోజుల పాటు అర్చనలకు శ్రీకారం చుట్టారు. ఈ నవధాన్యాల నుంచి మొక్కలు ఎంత ఏపుగా ఎదిగితే అంతమేర గ్రామాలు పాడి పంటలతో సుభిక్షంగా ఉంటాయని పురాణ ప్రతీక. ధ్వజారోహణ విశిష్టత ఇది స్వామివారి కల్యాణ మహోత్సవాలకు సకల దేవతలకు గరుత్మంతుని ద్వారా ఆహ్వానం పలుకుతూ ధ్వజస్తంభంపై ధ్వజపటం ఎగురవేయడమే ధ్వజారోహణ అని ప్రధాన అర్చకుడు శ్రీనివాస కిరణ్ తెలిపారు. కల్యాణ మహోత్సవాలకు దుష్టశక్తుల వల్ల ఎటువంటి అవరోధాలు లేకుండా ఉండేందుకు కూడా ధ్వజారోహణ చేస్తామని వివరించారు. ధ్వజస్తంభానికి మామిడి ఆకులు, దర్భలను కట్టి, గరుత్మంతుని చిత్రం గీసిన వస్త్రాన్ని అర్చకులు ఎగురవేశారు. అంతర్వేదిలో నారసింహునికి హంస వాహనంపై గ్రామోత్సవం గరుత్మంతుడికి పూజలు చేస్తున్న అర్చకులు కల్యాణోత్సవాల్లో నేడు అంతర్వేదిలో కల్యాణోత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం సాయంత్రం 4 గంటలకు హనుమద్వాహనం, రాత్రి 8 గంటలకు సింహ వాహనంపై స్వామివారి గ్రామోత్సవాలు ఉంటాయి. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, 5.30 గంటల నుంచి 7 గంటల వరకూ స్వామివారి తిరువారాధన, ఆర్జీత అభిషేకం, బాలభోగం, సాధారణ, ప్రత్యేక దర్శనాలు జరుగుతాయి. వీటితో పాటు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకూ నారసింహ సుదర్శన హోమం నిర్వహిస్తారు. -
భాస్కరం... ప్రణమామ్యహం
● ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రథసప్తమి వేడుకలు ● కిక్కిరిసిన ప్రముఖ ఆలయాలుపెదపూడి: రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన పెదపూడి మండలం జి.మామిడాడ గ్రామంలోని సూర్యనారాయణమూర్తి స్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. సూర్యభగవానుడి పుట్టిన రోజైన రథసప్తమి పర్వదినం సందర్భంగా రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, చైర్మన్ కొవ్వూరి శ్రీనివాసు బాలకృష్ణారెడ్డి తదితరులు ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. దూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. తొలుత సూర్యభగవానుడి దేవేరులైన ఉష, పద్మిని, ఛాయ, సౌంజ్ఞ ఉత్సవమూర్తులను ఆలయం బయట ఉంచిన రథంలో ఆశీనులు గావించారు. అనంతరం అర్చకుల మంత్రోచ్ఛరణల నడుమ రథోత్సవాన్ని ప్రారంభించారు. సూర్యనారాయణ నామస్మరణతో ఆలయ ఉత్సవ కమిటీ, గ్రామ యూత్, భక్తులు ఉత్సాహంగా రథాన్ని ముందుకు లాగారు. స్వామివారిని వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే, కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి దర్శించుకున్నారు. కొంత సేపు ప్రత్యేక పూజల్లో కూర్చున్నారు. వారికి వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. ఉత్సవమూర్తుల పల్లకిని చంద్రశేఖర్రెడ్డి, జగ్గిరెడ్డి కొంతసేపు భుజంపై పెట్టుకుని మోశారు. ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ దేశంలో వైష్ణవ సంప్రదాయం గల ఆలయంగా ప్రసిద్ధి గాంచిందన్నారు. సుమారు 124 సంవత్సరాల చరిత్ర గల సూర్యదేవాలయంగా పేరొందిందన్నారు. ప్రతి ఏటా స్వామివారి ఉత్సవాలు వైభవంగా నిర్వహించడం అభినందనీయమని ఉత్సవ కమిటీని అభినందించారు. వారికి ఆలయ కమిటీ, వైఎస్సార్ సీపీ శ్రేణులు, స్థానిక యువనేత చింతా దొరబాబు ఆధ్వర్యంలో తీన్మార్ డప్పులు, భారీ బాణసంచాతో స్వాగతం పలికారు. ఆలయ ఈఓ పాటి సత్యనారాయణ భక్తులకు ఏర్పాట్లు చేశారు.ఆ దివాకరుడిని ఊరూవాడా కొలిచింది.. సూర్య భగవానుడి జన్మ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ముఖ్య ఆలయాలకు భక్తజనం పోటెత్తింది.. రథ సప్తమి సందర్భంగా జి.మామిడాడలో రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. వాడపల్లిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
1 నుంచి మార్కెట్ విలువల పెంపు
అభ్యంతరాలకు 29 వరకు గడువు ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో భూముల మార్కెట్ విలువలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీ చేసిందని జిల్లా రిజిస్ట్రార్ ఎస్. సత్యనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పెంపు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో భూముల మార్కెట్ విలువల పెంపుపై శనివారం కలెక్టరేట్లో మార్కెట్ విలువల పెంపుదల కమిటీ అధికారులతో ఇన్చార్జి కలెక్టర్ వై.మేఘ స్వరూప్ అధ్యక్షతన సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. పెంచనున్న మార్కెట్ విలువల జాబితాను రిజిస్ట్రేషన్.ఏపీ.జిఓవి.ఇన్ వెబ్సైట్లోను, సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నోటీస్ బోర్డుల్లోను ప్రదర్శించనున్నట్లు తెలిపారు. ప్రజలు తమ అభ్యంతరాలను ఈ నెల 29వ తేదీ లోపు సంబంధిత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో తెలియజేయాల్సిందిగా జిల్లా రిజిస్ట్రార్ కోరారు. డాక్టర్ రవికిరణ్కు అంతర్జాతీయ గౌరవం సీతానగరం: మండలంలోని పురుషోత్తపట్టణానికి చెందిన డాక్టర్ రవికిరణ్ కాజకు అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. రసాయన శాస్త్రంలో ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన ‘ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ సభ్యుడిగా ఆయన ఎంపికయ్యారు. రసాయన శాస్త్రంలో నిరంతర కృషి, అద్భుతమైన పరిశోధనలు చేసిన వారికి లండన్లోని రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఈ గౌరవాన్ని ప్రదానం చేస్తుంది. డాక్టర్ రవికిరణ్ ప్రస్తుతం యూఎస్ ఫార్మకోపియాలో సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. ఔషధాల నాణ్యతను పెంపొందించడంలో, కాంప్లెక్స్ ప్రొడక్ట్స్ కోసం గ్లోబల్ స్టాండర్ట్స్ను రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ వేదికలపై యూఎస్ ఫార్మకోపియా తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఔషధ రంగ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. 29 నుంచి అధ్యయనోత్సవాలు కోరుకొండ: స్థానిక స్వయంభు లక్ష్మీనరసింహస్వామి వారి అధ్యయనోత్సవాలు 29వ తేదీ నుంచి ఫిబ్రవరి ఆరో తేదీ వరకూ నిర్వహించనున్నట్టు ఆలయ ధర్మకర్త పరాశర రంగరాజ భట్టర్ తెలిపారు. 29న సాయంత్రం 6 గంటలకు గరుడ వాహన సేవ, రాత్రి కొండపైన తిరుప్పల్లాండు, తొళక్కం ప్రారంభం కానున్నాయి. ఉదయం నుంచి స్వామి వారికి సేవాకాలం నిర్వహించనున్నారు. 30న శ్రీ, భూ సమేత అనంతపద్మనాభస్వామి వారు ఆంజనేయ వాహనంపై ఊరేగనున్నారు. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో శ్రీరంగనాథస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతాయి. అలాగే ఫిబ్రవరి 5, 6 తేదీల్లో అనంత పద్మనాభస్వామి వారికి అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. -
దూకుతూ.. దౌడు తీస్తూ..
● ఉత్కంఠ భరితంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు ● సీనియర్, జూనియర్ విజేతగా గుమ్మిలేరుసామర్లకోట: స్థానిక ఉండూరు రైల్వే గేటు ఎన్ఎఫ్సీఎల్ రోడ్డులో యార్లగడ్డ వెంకట సుబ్బారావు మెమోరియల్ రాష్ట్ర స్థాయి ఎడ్ల పరుగు పోటీలు ఆదివారం ఉత్కంఠభరితంగా సాగాయి. భీమేశ్వర రైతు కమిటీ ఆధ్వర్యాన సీనియర్, జూనియర్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి సీనియర్ విభాగంలో 7 జతలు, జూనియర్ విభాగంలో 38 జతల ఎడ్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. స్వల్ప వ్యవధిలోనే విజేతలను నిర్ణయించడంతో ప్రేక్షకులు, రైతుల్లో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ జరిగిన ఈ పోటీలను చుర్రుమంటున్న ఎండలో సైతం జనం ఆసక్తిగా వీక్షించారు. ● సీనియర్ విభాగంలో నిర్ణీత దూరాన్ని కోరా తేజ చౌదరి (కోనసీమ జిల్లా గుమ్మిలేరు) ఎడ్లు 5 నిమిషాల 39 సెకెండ్ల 69 పాయింట్లలో అధిగమించి ప్రథమ బహుమతి గెలుచుకున్నాయి. అదే గ్రామానికి చెందిన కోరా సత్యవేణి ఎడ్లు 5 నిమిషాల 42 సెకెండ్ల 16 పాయింట్లతో ద్వితీయ, సామర్లకోటకు చెందిన వల్లూరి సత్యేంద్ర కుమార్ ఎడ్లు 5 నిమిషాల 46 సెకెండ్ల 22 పాయింట్లతో తృతీయ స్థానాల్లో నిలిచాయి. సీనియర్ విభాగంలో మొదట దౌడు తీయడానికి సిద్ధమైన మలిరెడ్డి అన్నపూర్ణ ఎడ్లు జనం కేకలతో బెదిరిపోయి పొలంలోకి పరుగు తీశాయి. అయినప్పటికీ తిరిగి రోడ్డు మీదకు వచ్చి, నిర్ణీత దూరాన్ని 6 నిమిషాల 27 సెకండ్లలో అధిగమించాయి. విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.25 వేలు, ద్వితీయ బహుమతి రూ.20 వేలు, తృతీయ బహుమతి రూ.15 వేల నగదుతో పాటు మెమెంటోలను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అందజేశారు. ● జూనియర్ విభాగంలో కోరా సత్యవతి (గుమ్మిలేరు) ఎడ్లు ప్రథమ, బవిరిశెట్టి మణి (వన్నెపూడి) ద్వితీయ, పండూరు శ్రీను (సామర్లకోట) తృతీయ, మలిరెడ్డి అన్నపూర్ణ (మేడపాడు) నాలుగు, వేగుళ్ల కృష్ణమాధవి (మండపేట) ఎడ్లు ఐదో స్థానాలను గెలుచుకున్నాయి. ప్రథమ విజేతకు రూ.20 వేలు, ద్వితీయ బహుమతి రూ.15 వేలు, తృతీయ బహుమతి రూ.10 వేలు, నాలుగో స్థానానికి రూ.8 వేలు, ఐదో స్థానంలో నిలిచిన వారికి రూ.6 వేల నగదుతో పాటు మెమెంటోలను జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ తుమ్మల బాబు అందజేశారు. అలాగే, దేశవాళీ ఎడ్ల అందాల పోటీల్లో కూడా మూడు బహుమతులు అందించారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా చేకూరి రామకృష్ణ, కొండపల్లి శ్రీనివాస్, కంటే ఫణికుమార్ వ్యవహరించారు. కార్యక్రమంలో పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, నిర్వాహకులు కంటే జగదీష్ మోహన్రావు, వల్లూరి దొరబాబు, బిక్కిన రంగనాయకులు, వుండవిల్లి వీర వెంకట రామరాజు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు గోలి వెంకట అప్పారావు చౌదరి, యార్లగడ్డ చిన్ని, కౌన్సిలర్ బలుసు వాసు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ అడబాల కుమారస్వామి, నిమ్మకాయల రంగనాగ్ తదితరులు పాల్గొన్నారు.


