breaking news
East Godavari District Latest News
-
వారాహి మాతకు బంగారు హారం
పెదపూడి: జి.మామిడాడలో ప్రసిద్ధి చెందిన వారాహి మాతకు అమెరికాకు చెందిన గూగుల్ సంస్థ డైరెక్టర్ శేష సతీష్, ఆశాకిరణ్ దంపతులు సుమారు రూ.15 లక్షల విలువైన బంగారు హారాన్ని శుక్రవారం సమర్పించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ, వారాహి మాత దయతో తమ కుటుంబానికి మేలు జరిందని, కృతజ్ఞతగా ఈ హారం సమర్పించామని చెప్పారు. తన బంధువు, ఆలయ కమిటీ ప్రతినిధి సబ్బెళ్ళ శ్రీనివాసరెడ్డి (చంటిబాబు) దంపతుల ద్వారా అమ్మవారి విశిష్టతను తెలుసుకున్నానన్నారు. దాత దంపతులకు ప్రధానార్చకులు నారాయణ నంబూద్రి, శుక్లా, రాంబాబు తదితరులు వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందజేసి, సత్కరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్తి భగవాన్రెడ్డి, కోశాధికారి డీఆర్కే రెడ్డి, ద్వారంపూడి వెంకటరెడ్డి (చింతపండు), మండ రాజారెడ్డి, ప్రత్యూష మురళి, యువరాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదు
● వంట గ్యాస్పై నిరంతర పర్యవేక్షణ ● కంట్రోల్ రూమ్ ఏర్పాటు ● జిల్లా పౌర సరఫరాల అధికారి పార్వతి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గృహ అవసరాలు, అత్యవసర సేవలకు ఎల్పీజీ నిరంతరాయంగా సరఫరా అయ్యేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన ఐఓసీఎల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్ సంస్థలతో పాటు ఎల్పీజీ పంపిణీదారులతో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నదని జిల్లా పౌర సరఫరాల అధికారి వి.పార్వతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. జిల్లాలోని 52 ఎల్పీజీ గ్యాస్ పంపిణీదారుల ద్వారా సుమారు 8.67 లక్షల కనెక్షన్లకు గ్యాస్ సరఫరా అవుతోందన్నారు. తూర్పు గోదావరి జిల్లాకు గోకవరం, విశాఖపట్నం, విజయవాడ ప్రాంతాల్లోని ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ల నుంచి గ్యాస్ సరఫరా జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని బాట్లింగ్ ప్లాంట్లు సాధారణంగా పనిచేస్తుండగా, ఎల్పీజీ సిలిండర్ల నిల్వ కూడా తగినంతగా ఉందన్నారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల వల్ల రీఫిల్ బుకింగ్లు తాత్కాలికంగా పెరిగాయనీ, అయినప్పటికీ డెలివరీలు ఫస్ట్ ఈజ్ ఫస్ట్ విధానంలో సాగుతున్నాయన్నారు. దీని వల్ల కొన్ని చోట్ల తాత్కాలిక జాప్యం ఏర్పడినా , సరఫరాలో ఎటువంటి ఇబ్బందీ లేదని తెలిపారు. పారిశ్రామిక, బల్క్ ఎల్పీజీ సరఫరాను మాత్రమే పరిమితం చేయగా, గృహ వినియోగదారులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్, జేసీ ఆదేశాల మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో జిల్లా యంత్రాంగం నిరంతరం సరఫరాను పర్యవేక్షిస్తూ పంపిణీదారులకు సూచనలిస్తున్నారు. కాబట్టి వినియోగదారులకు ఆందోళన అవసరం లేదన్నారు. హెల్ప్లైన్ ఏర్పాటు వినియోగదారుల సమస్యల పరిష్కారానికి జిల్లా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఎల్పీజీ సంబంధిత ఫిర్యాదుల కోసం 8074661259 హెల్ప్లైన్ నంబర్ను సంప్రదించవచ్చన్నారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 225.46 మెట్రిక్ టన్నులు గ్యాస్ (15,742 సిలిండర్లు) అందుబాటులో ఉన్నాయన్నారు. గ్యాస్ బుకింగ్ ప్రత్యామ్నాయ పద్ధతులు వినియోగదారులు ఒకేసారి ఎక్కువగా బుకింగ్లు చేయడం వల్ల కొన్ని చోట్ల కాల్స్ కనెక్ట్ కాకపోవడం వంటి సమస్యలు వస్తున్నందున కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా కూడా గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు. భారత్ గ్యాస్ కోసం వాట్సప్ 1800 22 4344కు హయ్ అని పంపాలి మిస్డ్కాల్: 7710955555 ఐవీఆర్ఎస్: 7715012345 / 7718012345 ఇండేన్ గ్యాస్ కోసం వాట్సప్ 7588888824కు హాయ్ అని పంపాలి మిస్డ్కాల్ : 8454955555 ఐవీఆర్ఎస్ 7718955555 హెచ్పీ గ్యాస్ కోసం వాట్సప్ 9222201122కు ‘ఏజీ’ అని పంపాలి మిస్డ్కాల్: 9493602222 ఐవీఆర్ఎస్ 8888823456 / 9666023456 అలాగే సంబంధిత ఆయిల్ కంపెనీల మొబైల్ యాప్ల ద్వారా కూడా గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చన్నారు. -
జీజీహెచ్ దుస్థితిపై గవర్నర్కు ఫిర్యాదు
కాకినాడ క్రైం: స్థానిక జీజీహెచ్లో వైద్య సేవల దుస్థితిపై ఓ బాధితుడు రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు శుక్రవారం రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రటరీకి చేరుకుంది. కాకినాడ రేచర్లపేటకు చెందిన పొలుమూరి మధుబాబు (52) లిఖితపూర్వకంగా ఈ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ప్రకారం.. ఆయన గుండె సమస్యతో బాధ పడుతున్నారు. గతంలో వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులు నాలుగు స్టెంట్లు వేశారు. ఈ స్థితిలో మధుబాబు ఆయాసం, దగ్గు, ఊపిరాడకపోవడం వంటి ఇబ్బందులకు గురై, గడచిన ఐదు నెలల్లో ఆరుసార్లు కాకినాడ జీజీహెచ్కు వచ్చారు. అక్కడ వార్డులో ఒక్కో మంచానికి ఇద్దరు ముగ్గురు రోగుల్ని ఉంచడం గమనించానని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను అత్యవసర విభాగం నుంచి సాధారణ వార్డుకు తరలించేందుకు రూ.200 డిమాండ్ చేశారని, తన వద్ద డబ్బులు లేవని చెప్తే వార్డు షిఫ్టు పెట్టినప్పటికీ అత్యవసర విభాగంలోనే ఉంచేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. గత్యంతరం లేక ఆయాసంతో నడచి వస్తుంటే అలా వెళ్లకూడదంటూ నర్సులు గదమాయించారని ఆరోపించారు. చివరకు ఎంఎన్ఓకు రూ.200 ఇవ్వక తప్పలేదని, ఆ తర్వాతే తనను స్ట్రెచర్లో వార్డుకు తరలించాడని వివరించాడు. అప్పటికే ఇద్దరు రోగులున్న పడకపై మూడో వ్యక్తిగా తనను వేశారని, ఒకే మంచంపై ముగ్గురేమిటని ప్రశ్నిస్తే ఇక్కడ ఇలాగే ఉంటుందని, నచ్చకపోతే వెళ్లిపోమంటూ దురుసుగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనలానే ఎందరో రోగులు జీజీహెచ్లో మగ్గిపోతున్నారని, ఈ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదుతో పాటు సంబంధిత ఫొటోలను మధుబాబు జత చేశారు. ఆయన గత నెల 7న గవర్నర్కు ఈ ఫిర్యాదు పంపగా, సంబంధిత విభాగాల పరిశీలన అనంతరం శుక్రవారం రాష్ట్ర ప్రిన్సిపాల్ సెక్రటరీకి చేరింది. దీనిపై అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి. -
కర్షకుడిపై కక్ష!
శనివారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2026ఈ రైతు పేరు నీతిపూడి శేఖర్ బాబు. మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం గ్రామస్తుడు. రెండు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నారు. ఎకరానికి సుమారు రూ.30 వేల చొప్పున రెండెకరాలకు రూ.60 వేలు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఇప్పటికే మోంథా తుపాను ప్రభావంతో పంట నష్టపోయారు. ధాన్యాన్ని మద్దతు ధరకు విక్రయించుకోలేని పరిస్థితి. రబీలోనైనా గట్టెక్కుదామంటే.. పెట్టుబడికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. అన్నదాత సుఖీభవ సాయం అందుతుందని ఆశించినా.. పెట్టుబడికి అవకాశం లేక తంటాలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కౌలు రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోందని ఆయన వాపోతున్నారు.సాక్షి, రాజమహేంద్రవరం: పథకం ఏదైనా కోతలు, ఆంక్షలు, నిబంధనలే అజెండాగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉచిత గ్యాస్ కొంత మందికే ఇచ్చి మమ అనిపించింది. తల్లికి వందనంలో నిబంధనలు పెట్టి నిధులు అందకుండా తల్లులకు ద్రోహం చేసింది. తాజాగా కర్షకులకు సైతం అందే పంథా అవలంబిస్తోంది. ‘అన్నదాత సుఖీభవ’ నిధుల విడుదలలో తీరని అన్యాయం చేసింది. పథకంలో భారీ స్థాయిలో కోతలు విధించింది. ఇప్పటికే ఈ ఏడాది సొమ్ము ఎగరగొట్టిన కూటమి సర్కారు.. వైఎస్సార్ సీపీ ఆందోళనలతో ఎట్టకేలకు పథకం అమలు చేస్తోంది. అందులోనూ కోతలు విధించి చేతులు దులుపుకొనేందుకు కుట్ర చేస్తోంది. ఇదీ సంగతి సూపర్ సిక్స్లో భాగంగా ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని వైఎస్సార్ సీపీ, ప్రజల పోరాటాల ఫలితంగా తప్పనిసరి పరిస్థితుల్లో అమలు చేస్తోంది. అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలో కేంద్ర ప్రభుత్వ వాటాగా రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేల చొప్పున ఏడాదికి మొత్తం రూ.20 వేలను మూడు విడతల్లో రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంది. అన్నదాత సుఖీభవ (మూడవ విడత), పీఎం కిసాన్ (2025–26) కార్యక్రమం కింద అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.6 వేలు జమ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ప్రకటించారు. ఈ విడతలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.4 వేలు, కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు అర్హులైన ప్రతి రైతు కుటుంబం బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేశారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు మాత్రం కేంద్రంతో సంబంధం లేకుండా రూ.20 వేలు ఇస్తామన్నారు. ఇప్పుడేమో కేంద్ర నిధులతో కలిపి ఇస్తోంది. పైకి మాత్రం తానే పూర్తి నిధులు ఇస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. జిల్లాలో 1,14,991 రైతుల ఖాతాల్లో రూ.65.08 కోట్లు జమ చేశారు. కౌలు రైతులపై కనికరమేదీ? చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన ‘అన్నదాత సుఖీభవ’ నిధులు కౌలు రైతులకు అందిన దాఖలాలు లేవు. కౌలు రైతులకు సీసీఆర్సీల జారీలో అంతులేని నిర్లక్ష్యం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 1.50 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు సమాచారం. భూ యజమాని సమ్మతితోనే వారికి ఆ కార్డులు జారీ చేస్తారు. 2025–26లో జిల్లా వ్యాప్తంగా 1.10 లక్షల మంది కౌలు రైతులకు కార్డులు మంజూరు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ దాన్ని చేరుకోలేకపోయారు. కార్డులు అందిన రైతులకు సైతం అన్నదాత సుఖీభవ నిధులు అందిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన అన్నదాత సుఖీభవ రూ.6 వేల సాయం ప్రకారం కౌలు రైతులకు సుమారు రూ.66 కోట్లు నష్టపోవాల్సి వస్తోంది. వైఎస్సార్ సీపీ హయాంలో క్రమం తప్పకుండా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో జమ చేశారు. 2019 ఎన్నికల ముందు వైఎస్సార్ సీపీ ఎన్నికల మెనిఫెస్టోలో రైతులకు రూ.12,500 అందజేస్తామని హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పీఎం కిసాన్తో కలిపి రూ.13,500 అందజేశారు. కేవలం రైతులకే కాకుండా కౌలు రైతులకు సైతం అందించింది. దీర్ఘకాలంగా దేవస్థానం భూములు కౌలుకు తీసుకున్న రైతులకు లబ్ధి చేకూరింది. జిల్లా వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలోని నాలుగేళ్లలో 1,33,502 మంది రైతులకు రూ.584.64 కోట్లు అందజేశారు. 18,511 మంది రైతులకు మొండిచేయి వైఎస్సార్ సీపీ ఆందోళనలు, ప్రజల వ్యతిరేకత నేపథ్యంలో ఏడాది తర్వాత పథకం అమలుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం లబ్ధిదారుల్లో భారీగా కోత విధించింది. గతంతో పోలిస్తే.. ప్రస్తుతం 18,511 మందిని ఈ పథకానికి దూరం చేసింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏటా సగటున 1,33,502 మందికి ‘రైతు భరోసా’ నిధులు నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 1,14,991కి కుదించేశారు. వీరు తమకు అందాల్సిన రూ.14.35 కోట్లు నష్టపోయారు. తొలి ఏడాది రూ.160 కోట్లు హుష్కాకి కూటమి ప్రభుత్వం 2024 జూన్ 12వ తేదీన అధికారం చేపట్టింది. ఆ వెంటనే ‘అన్నదాత సుఖీభవ’ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రగల్భాలు పలికింది. తొలి ఏడాది ఇవ్వాల్సిన సొమ్ములు ఎగొట్టింది. జిల్లాలోని రైతులకు కేవలం కేంద్రం విడుదల చేసిన నిధులు రూ.6 వేలు మాత్రమే అందాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.14 వేలను వేయలేదు. ఫలితంగా ఆ ఏడాదికి రైతులు సుమారు రూ.160.98 కోట్లు నష్టపోయారు. ‘అన్నదాత సుఖీభవ’ లబ్ధిదారుల్లో భారీగా కోత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏటా 1.33 లక్షల మందికి లబ్ధి ప్రస్తుతం 1.14 లక్షలకు కుదింపు ఏటా రూ.20 వేలు ఇస్తామన్న సర్కారు ప్రస్తుతం ‘పీఎం కిసాన్’తో కలిపి రూ.6 వేలు ఇస్తున్న వైనం తొలి ఏడాది సొమ్ముల ఎగవేత దగాయే రివాజుగా కూటమి ప్రభుత్వం పాలన -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కోరుకొండ: స్థానిక బూరుగుపూడి సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కోరుకొండ ఎస్సై ఆర్.అంకారావు కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం ఇన్సీసుపేటకు చెందిన బొర్రా ప్రభాకరరావు (59) గోకవరం నుంచి మోటారు సైకిల్పై బయలు దేరారు. ఈ నేపథ్యంలో ఎదురుగా వస్తున్న మోటార్ సైకిలిస్ట్ ఢీకొనడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రభాకరరావు రోజూ గోకవరం, కోరుకొండ మండలాల్లో దుస్తులు అమ్ముతుంటాడు. ఇతనికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. రోజూలానే గురువారం దుస్తులు విక్రయించి తిరిగి రాజమహేంద్రవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయనున్నట్టు ఎస్సై వివరించారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో చిన్నారి మృతి
బాధిత కుటుంబ సభ్యుల ఆరోపణ రాజవొమ్మంగి: మండలంలోని గొబ్బిలమడుగు గ్రామానికి చెందిన మూడు నెలల చిన్నారి కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కాగా ఆ చిన్నారి తల్లిదండ్రులు అనుపమ, నాగేంద్రలు తమ పాప వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మరణించిందని ఆరోపిస్తున్నారు. చిన్నారి ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటే, ఈ నెల 5న మండలానికి దగ్గరలోని ఏలేశ్వరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించామన్నారు. అక్కడి నుంచి ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తరువాత కాకినాడ జీజీహెచ్కు తీసుకు వెళ్లామన్నారు. చిన్నారికి తల్లీ బిడ్డ వార్డులో వెంటిలేటర్పై చికిత్స అందించారని, ఆ తరువాత పాప బాగానే ఉన్నప్పటికీ రక్తం ఎక్కించారని వాపోయారు. మూడు నెలల చంటి బిడ్డకు రక్తం ఎక్కించడం వల్లనే చనిపోయిందని తల్లి అనుపమ కన్నీరు పెట్టుకొంది. మరోవైపు పాపకు శిక్షణ పొందుతున్న జూనియర్ వైద్యులు చికిత్స చేశారని, దీనితో అల్లారు ముద్దుగా చూసుకుంటున్న తమ మొదటి కాన్పు బిడ్డ తమకు కాకుండా తనువు చాలించిందని తల్లిదండ్రులు దుఃఖించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో తమ వంటి ఆదివాసీలకు సకాలంలో, సరైన వైద్యం లభించడం లేదని, దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి కష్టం మరో తల్లికి రాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆంధ్ర వాలీబాల్ టీం కెప్టెన్గా లక్ష్మి రంగంపేట: ఢిల్లీ రాష్ట్రంలోని పీఠంపూర్లో ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకూ జరిగే ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ టోర్నమెంట్కు ఆంధ్రప్రదేశ్ నుంచి కెప్టెన్గా రంగంపేట మండలం జి.దొంతమూరు హైస్కూల్ వ్యాయామ ఉపాధ్యాయురాలు ఇ.లక్ష్మి ఎంపికయ్యారని పాఠశాల హెచ్ఎం కేవీ రమణారావు చెప్పారు. గురువారం ఆయన ఆ హైస్కూల్లో మాట్లాడుతూ మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అనేక టోర్నమెంట్లలో పాల్గొన్న లక్ష్మి ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ టోర్నమెంట్ కెప్టెన్గా వ్యవహరించే అవకాశం రావడం అభినందనీయమని అన్నారు. దేశ వ్యాప్తంగా 28 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని, ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొనే అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వ సివిల్ సర్వీసెస్ అధికారులకు లక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. ఆమెను గ్రామ సర్పంచ్ గోలి రమణ, ఎంపీటీసీ సభ్యుడు జి.వెంకటకృష్ణ, విద్యా కమిటీ చైర్మన్ ఎస్వీఎస్ నారాయణ, మండల విద్యాశాఖ అధికారులు కె.శ్రీనివాసరావు, పి.మధుసూదనరావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. భర్త వేధింపులపై మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు కాకినాడ రూరల్: భర్త వేధింపులపై ఓ కానిస్టేబుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమణయ్యపేట బాపన్నదొర కాలనీలో నివాసం ఉంటున్న వివాహిత, ఎకై ్సజ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న పోలవరపు దేవి ఫిర్యాదు మేరకు ఆమె భర్త సామర్లకోట మండలం పి.వేమవరం గ్రామానికి చెందిన శ్రీపతి మణికంఠపై సర్పవరం పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఎస్సై శ్రీనివాసకుమార్ కథనం ప్రకారం.. గతంలో వివాహమైన దేవి తన భర్త నుంచి విడాకులు తీసుకున్న తరువాత 2021లో మణికంఠను ద్రాక్షారామ ఆలయంలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో భర్త తన మేనకోడలిని వివాహం చేసుకునే ప్రయత్నం చేయగా, అప్పట్లో బాధితురాలి ఫిర్యాదు మేరకు 2024 మార్చి 5న సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశారు. రిమాండ్ అనంతరం బెయిల్పై బయటకు వచ్చాడు. కోర్టులో వాదోపవాదాల అనంతరం ఈ ఏడాది జనవరిలో కేసు కొట్టివేశారు. ఈ నేపథ్యంలో మేనకోడలిని మణికంఠ రెండో వివాహం చేసుకున్నాడని, అతని కుటుంబ సభ్యులు తనను దూషించి, కొట్టి బెదిరింపులకు గురిచేసినట్టు దేవి మరోసారి పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వివరించారు. బాల్య వివాహం అడ్డగింపు పిఠాపురం: స్థానిక కత్తులగూడెంలో నిర్వహించ తలపెట్టిన బాల్య వివాహాన్ని గురువారం అధికారులు అడ్డుకున్నారు. పట్టణానికి చెందిన బాలికకు (14) గుంటూరుకు చెందిన వ్యక్తితో అన్నవరంలో ఈ నెల 14న వివాహం చేసేందుకు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బాల్య వివాహం జరుగుతుందని సమాచారం అందుకున్న ఐసీడీఎస్, బాలల పరిరక్షణ విభాగం అధికారులు బాలిక ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం బాలికను స్థానిక పోలీసుల సహాయంతో కాకినాడలోని బాలల సంరక్షణ గృహానికి తరలించారు. -
చిందేసి.. చికాకు పుట్టించి
కాట్రేనికోన: ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించే జాతరలో కొందరి చిందులు హద్దులు దాటాయి.. భక్తులకు రోత పుట్టించాయి. కాట్రేనికోన మండలం కొత్తపాలెం, మొల్లేటిమొగ గ్రామాల్లో మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాల్లో పోలీసుల సాక్షిగా బుధవారం రాత్రి మద్యం అమ్మకాలు, అశ్లీల నృత్యాలతో యువతను రెచ్చగొట్టారు. ఈ రెండు గ్రామాల్లో మహాలక్ష్మి అమ్మవారి మహోత్సవాల సందర్భంగా మాంసాహారాన్ని వదిలి ప్రజలు అత్యంత పవిత్రంగా పూజలు చేస్తారు. అయితే ఇక్కడ రాత్రి పగలు తేడా లేకుండా గ్రామాల్లో టెంట్లు వేసి మద్యం విక్రయాలు చేపట్టారు. గ్రామంలో జాతర సందర్భంగా స్టేజ్ మీద అమ్మాయిలు అశ్లీల నృత్యాలతో రెచ్చిపోయారు. అయితే రికార్డింగ్ డ్యాన్స్లను అడ్డుకోవాల్సిన పోలీసులు మాత్రం స్టేజ్కు ఎదురుగా ప్రేక్షకుల్లా కూర్చుని వీక్షించడం శోచనీయం. మద్యం అమ్మకాలు లైసెన్సు షాపుల మాదిరిగా చేసినా పోలీసులు, ఎకై ్సజ్ శాఖ సిబ్బంది పట్టించుకోలేదు. ఇటీవల శివరాత్రి సందర్భంగా మగసానితిప్ప, చొల్లంగి తీర్థంలో, తీర ప్రాంతాల్లో అమ్మవారి జాతరలు, చెయ్యేరు ప్రభల తీర్థంలో అశ్లీల రికార్డింగ్ డ్యాన్స్లు నిర్వహించినా ఎవరూ పట్టించుకోలేదు. దీనివెనుక కొందరు నాయకులు ఉండి నడిపిస్తున్నట్లు సమాచారం. జాతరలో అశ్లీల నృత్యాలు -
తారుక్కుపోయేలా..
ఆత్రేయపురం: కోనసీమ జిల్లాలో బొబ్బర్లంక – రావులపాలెం ఆర్అండ్బీ రోడ్డుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రస్తుతం ఈ రహదారి అధ్వానంగా దర్శనమిస్తుంది. సింగిల్ రోడ్డు కావడం, గోతులు పడడం, వాహనాల రద్దీ పెరగడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వెలిచేరు నుంచి బొబ్బర్లంక వరకూ సుమారు ఏడు కిలోమీటర్ల రోడ్డు మరీ దారుణంగా ఉంది. ఇక్కడ ప్రయాణం ఉయ్యాల జంపాలను తలపిస్తోంది. తారు లేక, కంకర రాళ్లు తేలి ఇక్కడ కనిపిస్తోంది. ఈ రోడ్డు నిర్మించి దశాబ్దాలు కావొస్తుంది. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ రోడ్డు ఇటు రావులపాలెం జాతీయ రహదారిని, అటువైపు కాటన్ బ్యారేజీ అవతల నూతన జాతీయ రహదారులను కలుపుతోంది. అంతేకాకుండా ఆర్అండ్బీ శాఖలో రాష్ట్ర రహదారిగా గుర్తింపు పొందినా, అభివృద్ధికి దూరంగా ఉంది. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి లక్షల మంది భక్తులు వేలాది వాహనాల్లో ఇటుగా వస్తుంటారు. అలాగే కాలినడకన చాలామంది వాడపల్లి క్షేత్రానికి వెళ్తుంటారు. ఆ భక్తులకు రోడ్డుపై గోతులు, గొప్పులు, రాళ్లు గుచ్చుకుని రక్తపు గాయాల పాలవుతున్నారు. అయినా రహదారిని గతంలో బిట్లు బిట్లుగా వేయటంతో అతుకులుగా కనిపిస్తోంది. కాగా ఇటీవల చేసిన ప్యాచ్ వర్క్స్తో మరీ అధ్వానంగా ఉంది. గత సంవత్సరం జనవరిలో అతుకులు పూడ్చారు. తిరిగి ఇప్పుడు మళ్లీ చేస్తున్నారు. ఈ మరమ్మతులకు రూ.లక్షలు వృథా అవుతున్నాయి. కానీ రోడ్డు మాత్రం బాగుపడడం లేదు. పూర్తిస్థాయిలో రోడ్డును అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ దారిలోనే రైతుల పయనం ఈ ప్రాంతంలో అరటి తోటలు విస్తారంగా ఉన్నాయి. ఇక్కడి రైతులు అరటి గెలలను సైకిళ్లపై పెట్టుకుని ఇటు రాజమహేంద్రవరం, అటు రావులపాలెంకు వెళ్తుంటారు. రోడ్డు అధ్వానంగా ఉండడంతో సైకిళ్లు మరమ్మతులకు గురవడంతోపాటు లోడు కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నామని రైతులు అంటున్నారు. మండలంలోని మరో జాతీయ రహదారి రాజవరం– పొదలాడ రోడ్డు 13 కిలోమీటర్ల మేర గుంతలతో దర్శనమిస్తుంది. చాలా గ్రామాల ప్రజలు ఈ రోడ్లపై ప్రయాణించాలంటే హడలెత్తిపోతున్నారు. ప్రధానంగా రోడ్లు భవనాల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. రోడ్డుకు పక్కనే మధ్య డెల్టా కాలువ ఉన్నా, మలుపులు, ప్రమాదభరిత ప్రాంతాల్లో ఎక్కడా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి ఈ రహదారిని నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.ఎక్కడికక్కడే అతుకులు, గతుకులు.. తారు లేచి రాళ్లు తేలిన దారిలో ప్రయాణానికి అవస్థలు.. ఏళ్లకాలంగా చోద్యం చూస్తున్న పాలకులు.. వెలసి ఎంతో ప్రాధాన్యం ఉన్న బొబ్బర్లంక – రావులపాలెం రహదారిలో ప్రజలకు తప్పని పాట్లు.. కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి క్షేత్రానికి వెళ్లే ప్రధాన రహదారి అయినా ఎవరూ పట్టించుకోక ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. ఫ అధ్వానంగా బొబ్బర్లంక– రావులపాలెం రోడ్డు ఫ అతుకుల బొంతలా మారిన వైనం ఫ పట్టించుకోని కూటమి ప్రభుత్వం గుంతలు పూడ్చుతాం వెలిచేరు నుంచి బొబ్బర్లలంక వరకూ రోడ్డు అధ్వానంగా ఉన్నమాట వాస్తవమే. ఈ రోడ్డును చివరిసారిగా 2011–12లో నిర్మించారు. ప్రస్తుతం ఈ రోడ్డు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు రావాలి. ప్రస్తుతం గుంతలు పూడ్చేందుకు రూ. 70 లక్షల నిధులు మంజూరయ్యాయి. – జి.రాజేంద్రప్రసాద్, రోడ్లు భవనాల శాఖ డీఈ, కొత్తపేట తరచూ ప్రమాదాలు బొబ్బర్లంక రోడ్డుపై ప్రయాణించాలంటే జనం భయపడిపోతున్నారు. తరచూ వాహన ప్రమాదాలు జరుగుతుండడమే అందుకు కారణం. ఎంతో ప్రాధాన్యం ఉన్న రహదారి అభివృద్ధికి నోచుకోకపోవడం దారుణం. ఈ రాష్ట్ర రహదారిని వెంటనే నాలుగు లైన్ల రహదారిగా నిర్మించాల్సిన ఆవశ్యకత ఉంది. – కనుమూరి శ్రీనురాజు, వైఎస్సార్ సీపీ రైతు నాయకుడు ఏళ్ల తరబడి ఇలానే.. బొబ్బర్లంక రోడ్డు ఏళ్ల తరబడి అధ్వానంగా ఉంది. ఈ ప్రాంత ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. అధికారులు కనీసం మరమ్మతులు కూడా సక్రమంగా చేయించడం లేదు. సుమారు 13 ఏళ్ల నుంచి ఈ రోడ్డు నిర్వహణను మరిచిపోయారు. కూటమి సర్కార్ మాటలు తప్ప చేతలు కానరావడం లేదు. వెంటనే ఈ రహదారి నిర్మించాలి. – సఖినేటివాకుల రాజు, వైఎస్సార్ సీపీ రైతు నాయకుడు, రావులపాలెం -
టిప్పర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం
దేవరపల్లి: గుండుగొలను – కొవ్వూరు జాతీయ రహదారి– 16పై దేవరపల్లి మండలం కృష్ణంపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని గాంధీనగరానికి చెందిన వ్యవసాయ శాఖ విశ్రాంత అసిస్టెంట్ డైరెక్టర్ ఆచంట జగన్నాథరావు (81) దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. గాంధీనగరం నుంచి స్కూటీపై జగన్నాథరావు దేవరపల్లి వచ్చి పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా కృష్ణంపాలెం వద్ద హైవేలో తాడిపూడి కాలువ వంతెనపై వెనుక నుంచి అతివేగంగా టిప్పర్ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో జగన్నాథరావు తీవ్రంగా గాయపడి అక్కడక్కడే మృతి చెందారు. జగన్నాథరావు సోదరుడు సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. మృతుడికి ముగ్గురు కుమారులు ఉండగా, పెద్ద కుమారుడు అమెరికాలో డాక్టర్గా పనిచేస్తుండగా, రెండో కుమారుడు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డారు. మూడో కుమారుడు ఒంగోలులో ఉంటున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఉత్తమ వ్యవసాయ అధికారి, వ్యవసాయ రంగంలో ఆదర్శ రైతుగా జగన్నాథరావు అవార్డులు అందుకున్నారు. ఈ ప్రాంత రైతులకు వ్యవసాయంలో పలు సూచనలు, సలహాలు ఇచ్చేవారు. జగన్నాథరావు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
బాలుడి అపహరణకు యత్నం
ఓ మహిళ కేకలకు పారిపోయిన దుండగులుపి.గన్నవరం: స్థానిక శివాలయం రోడ్డులో గురువారం సాయంత్రం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న రెండో తరగతి విద్యార్థిని మోటారు సైకిల్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అపహరించేందుకు ప్రయత్నించారు. దీనిని గమనించిన ఓ మహిళ కేకలు వేయడంతో ఆ బాలుడిని వదిలి కిడ్నాపర్లు పారిపోయారు. స్థానికుల కథనం ప్రకారం.. స్థానిక పితానివారిపాలేనికి చెందిన దొమ్మేటి రిత్విక్ మణికంఠ శివాలయం ఎదురుగా ఉన్న ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం తన తండ్రి నాగరాజు రిత్విక్ను పాఠశాల వద్ద దించాడు. సాయంత్రం 3.30 గంటలకు పాఠశాల విడిచిపెట్టిన అనంతరం రిత్విక్ ఒంటరిగా నడుచుకుంటూ పితానివారిపాలెంలోని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో వెనుక నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు, ఆ బాలుడిని బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. బాలుడు ఏడవడంతో.. సమీపంలోని ఓ ఇంటి వద్ద ఉన్న మహిళ గమనించి కేకలు వేసింది. దీంతో బాలుడిని వదిలి ఆ ఇద్దరు బైక్పై పరారయ్యారు. అనంతరం ఆ మహిళ ఇతర విద్యార్థుల సాయంతో రిత్విక్ను మరొక మార్గంలో ఇంటికి పంపింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. -
చీడపీడలు ముంచెట్టు
పెరవలి: అంతా బాగుంటే ఆయిల్పామ్ సాగు సిరులు కురిపిస్తోంది.. సస్యరక్షణ చర్యలే ఈ పంటకు శ్రీరామరక్ష అవుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో వరి తరువాత అధిక మొత్తంలో పామాయిల్ సాగే జరుగుతోంది. జిల్లాలో మొత్తం 19,266 హెక్టార్లలో సాగవుతుండగా, 15 వేల హెక్టార్ల నుంచి పంట ఉత్పత్తి అవుతూ ఏడాదికి 76 వేల మెట్రిక్ టన్నుల పామాయిల్ దిగుబడి వస్తోంది. ఏటా ఈ పంటలపై వివిధ తెగుళ్లు, పురుగుల ప్రభావం అధికంగా ఉంటోంది. ఇది దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీని నివారణకు వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కొవ్వూరు ఉద్యాన అధికారి డి.సుధీర్కుమార్ వివరించారు. తెగుళ్లు సోకినప్పుడు రైతులు తీసుకోవాల్సిన చర్యలు, ఎరువుల యాజమాన్యం గురించి ఆయన తెలిపారు. ఆ వివరాలు ఇలా.. కొమ్ము పురుగు కొమ్ము పురుగు ఆయిల్పామ్ మొక్కలను ఆశిస్తే, మొక్కల ఆకులు వీ ఆకారంలో కత్తిరించబడినట్లు ఉంటాయి. ఈ పురుగులు భూమిలో ఏర్పడిన పగుళ్లలో ఉంటాయి. అంతేకాకుండా చెట్టు మొదలు ఉండే పీచులో కూడా ఇవి చేరి పంటకు హాని చేస్తాయి. ఇవి మొవ్వలోకి కూడా ప్రవేశించి మెత్తని పదార్థాన్ని తినేస్తాయి. దీని నివారణకు మొక్కల చుట్టూ చెత్తాచెదారం లేకుండా చూడాలి. ఒకవేళ ఉంటే వీటిపై కార్బరిల్ మందును 10 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొవ్వలో పురుగులు ఉన్నట్లు గుర్తిస్తే, వాటిని తీగతో తీసివేసి అది చేసిన రంధ్రానికి 25 గ్రాముల కార్బరిల్ మందును పది గ్రాముల తడి ఇసుకలో కలిపి మొవ్వలో పెట్టాలి. సంచి పురుగు ఈ పురుగులు శంఖు ఆకారంలో ఉండి ఆకు అడుగు భాగాన చేరతాయి. ఆకులకు రంధ్రాలు చేసి తినేస్తాయి. దీని నివారణకు ఈ పురుగులు సోకిన ఆకులను కత్తిరించి తగులబెట్టాలి. మిగిలిన ఆకుల మీద కార్బరిల్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎరువుల యాజమాన్యం ఆయిల్పామ్ మొక్కలకు సంవత్సరానికి రెండు మోతాదుల్లో ఎరువులు అందించాలి. మొదటి మోతాదు జూన్, జూలై నెలల్లో, రెండో మోతాదు డిసెంబర్, జనవరి నెలల్లోనే మొక్కలకు వేయాలి. మూడేళ్ల వయసు దాటిన ఒక్కో మొక్కకు 2 కిలోల 600 గ్రాముల యూరియా, సింగిల్ పాస్ఫేట్ 3 కిలోల 750 గ్రాములు, పొటాష్ 2 కిలోలు, మెగ్నీషియం సల్ఫేట్ 500 గ్రాములు ఏడాదిలో రెండుసార్లు వేయాలి. ఫ ఆయిల్పామ్ సాగులో సస్యరక్షణ అవసరం ఫ యాజమాన్య పద్ధతులతోనే అధిక దిగుబడులు మొవ్వుకుళ్లు తెగులు ఈ తెగులు ఉధృతి తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఉంటుంది. మొక్క పసుపు రంగులోకి మారి మొవ్వు ఆకులను లాగితే తేలికగా వస్తాయి. మొవ్వ లాగిన మొక్క నుంచి తీవ్ర దుర్గంధం వస్తుంది. దీని నివారణకు ఈ తెగులు సోకిన భాగాన్ని శుభ్రం చేసి లీటరు నీటికి కార్బండిజమ్ ఒక గ్రాము మందు కలిపి తెగులు సోకిన ప్రాంతమంతా పూయాలి. గానోడెర్మా కుళ్లు.. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు కింద వరుసలో ఎండిపోతాయి. తెగులు ఉధృతి అధికంగా ఉంటే మొవ్వలోకి చేరి కాండం మొదలు వద్ద కణజాలాన్ని ఆశించడంతో అక్కడ కుళ్లిపోయి చెట్టు చనిపోతుంది. నివారణకు తెగులు సోకి చనిపోయిన చెట్లను వెంటనే చేను నుంచి తొలగించాలి. తెగులు సోకినట్లు గుర్తించిన వెంటనే ఆ చెట్టు వేరును తీసి ట్రై డీమార్ఫ్ మందును వంద మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి ఆ వేరు ద్వారా ఎక్కించాలి. సేంద్రియ ఎరువులను అధికంగా చెట్టుమొదలులో వేయాలి. కాండం తడి తెగులు ఈ తెగులు సోకిన చెట్ల మొవ్వ అకస్మాత్తుగా ఎండిపోతుంది. మిగిలిన ఆకులు త్వరితగతిన వడలిపోతాయి. మొవ్వ ఆకు వడలిన వెంటనే సస్యరక్షణ చర్యలు ప్రారంభిస్తే చెట్లు కోలుకుంటాయి. ఈ తెగు లు సోకిన చెట్టు మొవ్వను లాగి అందులో కుళ్లిన పదార్థాన్ని తీసి శుభ్రం చేసిన తరువాత కార్బండిజమ్, మోనోక్రోటోపాస్లను కుళ్లిన చోట పై పూతగా వేసి ఆ తరువాత తారును పూసి ఉంచాలి. గెలకుళ్లు.. ఈ తెగులు సోకిన గెలలు కుళ్లిపోవడంతో తెల్లని శిలీంధ్రాలతో కనిపిస్తాయి. ఆ గెలలను వెంటనే నరికివేసి ఆ ప్రాంతంలో కుళ్లిన పదార్థాలను తీసి 0.1 శాతం కార్బండిజమ్ మందుతో శుద్ధిచేయాలి. ఇలా చేయడం వల్ల మిగిలిన గెలలకు ఈ తెగులు వ్యాపించకుండా ఉంటుంది. -
చంద్రబాబు నెయ్యి వ్యాపారాన్ని పెంచుకునేందుకే కల్తీ ప్రచారం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన రాజమహేంద్రవరం రూరల్: చంద్రబాబునాయుడు తన సొంత నెయ్యి వ్యాపారాన్ని పెంచుకునేందుకే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని ప్రచారం చేసి భక్తులను, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డిపైకి నెట్టే ప్రయత్నం చేశారన్నారు. ఇప్పుడు తిరుపతి వేంకటేశ్వరస్వామి దయ వల్ల ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయన్నారు. గతంలో కిలో నెయ్యి రూ.308కి సరఫరా చేస్తే ఇప్పుడు అదే క్వాలిటీ నెయ్యికి రూ.716 చెల్లిస్తున్నారన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన పాలకల్తీ ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకోలేదన్నారు. ప్రస్తుతం పాలతో పాటు అన్ని వస్తువులలోను చంద్రబాబు ప్రభుత్వంలో కల్తీ జరుగుతోందన్నారు. తప్పుచేసిన వారిని తప్పించేవారు ఉండడంతో కల్తీని అరికట్టలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. కమిటీలను త్వరితగతిన పూర్తిచేయండి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న వివిధ కమిటీలను త్వరితగతిన పూర్తిచేయాలని వేణుగోపాలకృష్ణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 17వ తేదీ ఉదయం జిల్లా స్థాయి, మధ్యాహ్నం నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి పార్టీ శ్రేణులందరూ హాజరుకావాలని తెలిపారు. గ్రామాలలోను, డివిజన్లలోను పార్టీ కేడర్ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రూరల్, కడియం మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పులూరి వీరవెంకటసత్యనారాయణ, యాదల సతీష్చంద్ర స్టాలిన్ పాల్గొన్నారు. ఎల్పీజీ గ్యాస్కు కొరత లేదు – జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేవని జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, సంబంధిత అధికారులతో గ్యాస్ నిల్వలు, సరఫరా పరిస్థితులపై ఆయన సమీక్షించారు. ప్రతి గ్యాస్ ఏజెన్సీ తమ వద్ద ఉన్న ప్రస్తుత స్టాక్, నమోదైన బుకింగ్లు, గ్యాస్ సరఫరాకు పట్టే రోజుల వివరాలను వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల కారణంగా కొంతమంది వినియోగదారులు అధికంగా గ్యాస్ బుకింగ్లు చేస్తున్నారని తెలిపారు. అయితే జిల్లాలో గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, వినియోగ దారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రస్తుతం సుమారు 212 మెట్రిక్ టన్నుల గ్యాస్ స్టాక్, 14,829 సిలిండర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో రోజువారీ సగటు వినియోగం సుమారు 11 వేల సిలిండర్లుగా ఉండగా, రీ ఫిల్లింగ్ యూనిట్ల ద్వారా ఎప్పటికప్పుడు సరఫరా జరుగుతోందన్నారు. గృహ వినియోగదారులతో పాటు సంక్షేమ హాస్టళ్లు, ఆసుపత్రులకు గ్యాస్ సరఫరాలో ప్రాధాన్యం ఇవ్వాలని గ్యాస్ ఏజెన్సీలకు సూచించారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో విక్రయించకుండా అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వదంతులను నమ్మవద్దని, జిల్లా అధికారిక మార్గాల ద్వారా విడుదలయ్యే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ప్రజలను కోరారు. గ్యాస్ బుకింగ్ లేదా సరఫరా సంబంధిత సమస్యలు తలెత్తిన పక్షంలో 8074661259 హెల్ప్లైన్ నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. జిల్లా సివిల్ సప్లైస్ అధికారి వి. పార్వతి పాల్గొన్నారు. రుణాలు చెల్లిస్తే వడ్డీ మాఫీ అమలాపురం రూరల్: ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణం పొందిన వారు ఏప్రిల్ 30వ తేదీ లోపు చెల్లిస్తే 2025 డిసెంబర్ 31 వరకు ఉన్న వడ్డీని మాఫీ చేస్తామని కార్యనిర్వహక సంచాలకులు జే.సత్యవతి తెలిపారు. ఈ సదుపాయాన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 66 మంది వినియోగించుకుని రూ.24.55 లక్షల వడ్డీ మాఫీ పొందారన్నారు. -
పోరుబాట.. విలువలకు పీట
సాక్షి, రాజమహేంద్రవరం: విలువలతో కూడిన రాజకీయాలు అంతమైన తరుణంలో విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం చెప్పింది వైఎస్సార్ సీపీ. ప్రజాభ్యుదయమే పరమావధిగా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, సవాళ్లను సోపానాలుగా మలచుకుని ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ.. మహానేత వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఏకై క పార్టీ వైఎస్సార్ సీపీ అని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ, పార్లమెంటరీ ఇన్చార్జిలు పేర్కొన్నారు. రాజకీయాల్లో నైతిక విలువను చాటి చెప్పిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు వెళుతున్నారన్నారు. జగన్ చెప్పాడంటే.. చేస్తాడంతే అంటూ ప్రజల్లో నమ్మకం, విశ్వాసం గడించిన పార్టీగా చరిత్ర సృష్టించిందని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం జిల్లావ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్తలు, పార్లమెంటరీ ఇన్చార్జిలు, పార్టీ శ్రేణులు కేక్ కట్ చేశారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. ప్రజలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. పార్టీ ఆవిర్భావ సంబరాలు అంబరాన్ని అంటాయి. రాజమహేంద్రవరం రూరల్ వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం రూరల్ కార్యాలయంలో మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. తొలుత పార్టీ జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రజా శ్రేయస్సు, సమస్యల పరిష్కారం కోసం మాజీ ముఖ్యమంతి వైఎస్ జగన్ చేస్తున్న పోరాటాలను గుర్తుచేసుకున్నారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్చార్జీ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గొందేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిటీ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని వైఎస్సార్ సీపీ శ్రేణులు పేర్కొన్నాయి. వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆదేశాల మేరకు మార్గాని ఎస్టేట్లోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్చేశారు. ఆవిర్భావ వేడుకల్లో పార్టీ సీఈసీ సభ్యులు, రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్య ప్రకాశరావు, ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం పార్లమెంటరీ సమన్వయ కర్త డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి గుర్రం గౌతమ్, సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకులు వాసంశెట్టి గంగాధరరావు పాల్గొన్నారు. కొవ్వూరు వైఎస్సార్ సీపీ కొవ్వూరు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం వైభవంగా నిర్వహించారు. తలారి, పార్టీ నేతలు పార్టీ జెండా ఆవిష్కరించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం కేక్ కేట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచిపెట్టారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ప్రజల పక్షాన చేస్తున్న పోరాటాలను వివరించారు. అంతేగాక తాళ్లపూడి మండలం పెద్దేవం, అన్నదేవరపేట గ్రామాల్లో ఆవిర్భావ వేడుకలు అంబరాన్ని అంటాయి. నిడదవోలు పట్టణంలోని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి జి శ్రీనివాస్నాయుడు పార్టీ జెండా ఆవిష్కరించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. గోపాలపురం దేవరపల్లి మండలం యర్నగూడెంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనిత ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. కార్యాలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు. కేక్ కట్ చేశారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనపర్తి: వైఎస్సార్ సీపీ 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం అనపర్తిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని దేవీచౌక్ సెంటర్లోని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రానున్న రోజుల్లో పార్టీ విజయదుందుభి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాజానగరం ప్రజల భావోద్వేగాలు, పోరాటాలతో పుట్టిన పార్టీ వైఎస్సార్ సీపీ అని ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. కోరుకొండలో గురువారం వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కోరుకొండలో నిర్వహించిన వేడుకల్లో రాజా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అంబేడ్కర్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ స్ఫూర్తితో దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయని, కొన్ని కాలగర్భం లో కలిసిపోయాయన్నారు. వైఎస్సార్ సీపీ మాత్రం ప్రజల పక్షాన పోరాటాలు కొనసాగిస్తూనే ఉందన్నారు. మండపేట వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని మండపేట నియోజకవర్గంలోని మండపేట పట్టణం, మండపేట రూరల్ మండలంలోని 12 గ్రామాలు, కపిలేశ్వరపురం మండలంలోని 19 గ్రామాలు, రాయవరం మండలంలోని 12 గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో పట్టణంలోని నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆయన మాట్లాడుతూ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుని సామాన్యుల అవసరాలకు అనుగుణంగా పార్టీ మేనిఫెస్టోను రూపొందించారన్నారు. 16 ఏళ్లుగా ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ ప్రజా సమస్యల పరిష్కారంపై నిరంతర పోరాటం జిల్లాలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కేక్ కట్ చేసి జెండా ఆవిష్కరించిన నాయకులు, కార్యకర్తలు -
ల్యాబోదిబో..
● ల్యాబ్ టెక్నీషియన్ల దురవస్థ ● ఆదుకోని ప్రభుత్వం ● ఉద్యోగాలు అంతంత మాత్రం ● యాప్లు, హోం సర్వీసుల పేరిట నాణ్యత లేని సేవలు ● నేడు ల్యాబ్ టెక్నీషియన్స్ డే కాకినాడ క్రైం: ప్రభుత్వ సాయం లేదు.. యాప్లు, హోం సర్వీసుల పేరిట నాణ్యత లేని సేవలు.. స్వయం ఉపాధి పొందుదామన్నా దక్కని ప్రోత్సాహం.. కార్పొరేట్ ల్యాబ్లలో అంతంత మాత్రం జీతాలకే ఊడిగం చేయాల్సి రావడం.. పర్యవేక్షణ లోపం.. ఇటువంటి పరిస్థితుల్లో ల్యాబ్ టెక్నీషియన్లు (ఎల్టీ) రోడ్డున పడుతున్నారు. ప్రజారోగ్యాన్ని నిర్ధారించి, వైద్య సేవల్ని నిర్దేశించడంలో వారీ పాత్ర కీలకం. కానీ, ఎల్టీలుగా పట్టాలు పొందిన వారు ప్రభుత్వ ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్లు రాక.. అప్పోసొప్పో చేసి సొంతంగా ల్యాబ్లు పెట్టుకున్న వారు తగినంత సంపాదన లేక తమ భవిత అగమ్యగోచరమైపోయిందని ఆవేదన చెందుతున్నారు. జాతీయ ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా ప్రత్యే కథనం.. ఉద్యోగాలు లేక విలవిల జిల్లావ్యాప్తంగా ఏటా సుమారు 400 మంది ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేస్తున్నారు. వీరు ప్రైవేటు ల్యాబ్లను ఆశ్రయిస్తున్నా వ్యాపారాలు లేవంటూ ఉద్యోగాలు ఇవ్వడానికి ఆయా యాజమాన్యాలు విముఖత చూపుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం ఎండమావిగానే మిగులుతున్న పరిస్థితి. ప్రభుత్వం ఇచ్చేవే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పోస్టులు. అవి కూడా ఏనాటికో ఒక నోటిఫికేషన్. ఓవైపు చదివిన చదువుకు విలువ లేక, పట్టాలు పొందినా ఉద్యోగాలు రాక, సొంత వ్యాపారాలకు అవకాశం లేక, ప్రభుత్వ ఉద్యోగాల ఊసే లేక ఎల్టీల పరిస్థితి కడు దయనీయంగా ఉంటోంది. కుటుంబాలతో సహా రోడ్డున పడే దుస్థితిని ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. గత్యంతరం లేక చాలా మంది బతుకు తెరువు కోసం జొమేటో, బ్లింకిట్, స్విగ్గీ, ర్యాపిడో వంటి వాటిల్లో డెలివరీ బాయ్స్గా, కెప్టెన్లు పని చేస్తూ బతుకు నెట్టుకొస్తున్నారు. సవాల్గా స్వయం ఉపాధి పోనీ స్వయం ఉపాధి పొందాలనే ఉద్దేశంతో ఎవరైనా ల్యాబ్ ఏర్పాటు చేసినా తీవ్ర నష్టాలు తప్పడం లేదు. గతంలో ఓ ల్యాబ్ ద్వారా కనీసం నలుగురు జీవనోపాధి పొంతే పరిస్థితి ఉండేది. ఇప్పుడు కనీసం అద్దె డబ్బులైనా రాని పరిస్థితి. మిషనరీ, రియేజంట్ల ధరలు కూడా ఎక్కువగా ఉండటం వ్యాపారానికి సవాల్గా మారింది. తాజా జీఎస్టీ సవరణలో తగ్గుదల కనిపించినా అది కంటితుడుపు చర్యగానే మిగిలింది. గతంలో ఏదో ఒక ప్రైవేటు ఆసుపత్రికి అనుబంధంగా ల్యాబ్ టెక్నీషియన్ ఒక ల్యాబ్ను నెలకొల్పి బతికేవాడు. ఇప్పుడు పలు ఆసుపత్రుల్లో వైద్యులే సొంతంగా ల్యాబ్లు పెట్టుకోవడం వీరి ఉపాధిని దెబ్బ తీస్తోంది. ఆన్లైన్ సేవల పేరుతో.. వివిధ ఆన్లైన్ యాప్లు కూడా ఎల్టీల జీవనోపాధిని దెబ్బ తీస్తున్నాయి. వీటికి స్థానికంగా ల్యాబ్లేవీ ఉండవు. పార్టనర్ ల్యాబ్స్ పేరిట అనుసంధానమవుతున్నారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అది ఎంతవరకూ నిజమో పర్యవేక్షించేవారెవ్వరూ ఉండరు. వీరు పరీక్షలు చేసే యంత్రాలు, రియేజంట్ల నాణ్యత ఎవ్వరికీ తెలియదు. ఇంటికి వచ్చి నమూనాలు సేకరిస్తారు. డబ్బులు తీసుకుంటారు. తరువాతి రోజు వాట్సాప్కు రిపోర్టు పంపిస్తారు. ఈ మధ్యలో ఏం జరిగిందో, ఎక్కడ పరీక్షించారో ఎవ్వరికీ తెలియవు. అనుమతి లేని ల్యాబ్లు 150 జిల్లాలో అనుమతి లేని ల్యాబ్లు 150 ఉన్నాయి. వీటిని అధికారులు కనీసంగా కూడా పరిశీలిస్తున్న దాఖలాల్లేవు. సాధారణంగా అనుమతులున్న ల్యాబ్ల నుంచి ప్రమాదకర వ్యర్థాలను వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన సేకరిస్తారు. కానీ, అనుమతి పొందకుండా చాటుగా నడుపుతున్న ల్యాబ్లలో మిగిలిన రక్తం, వినియోగించిన సూదులు, ఇతర వస్తువులను ఏం చేస్తున్నారన్నది అంతుచిక్కని ప్రశ్నగా మిగులుతోంది. వీటిని కాలువలు, చెత్తకుప్పల్లో పడేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్న వాదన వినిపిస్తోంది.సమస్యలు పరిష్కరించాలి ఎల్టీల ఉనికే ప్రశ్నార్థకంగా మారిన నేటి తరుణంలో మా సమస్యలు పరిష్కరించి ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకోవాలి. అనుమతులు లేని ల్యాబ్లను వదిలేస్తున్నారు. వీటివలన అనుమతులున్న ల్యాబ్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. ఉపాధి వృద్ధికి మార్గనిర్దేశాలూ లేవు. కులమతాలకు అతీతంగా ఎల్టీలకు సబ్సిడీపై రుణాలు మంజూరు చేసి, వ్యాపార వృద్ధికి తోడ్పడాలి. కనీసం కాంట్రాక్టు పోస్టులైనా ఆటంకం లేకుండా తీయాలి. ఆన్లైన్ ల్యాబ్ల కార్యకలాపాలను కూలంకషంగా పర్యవేక్షించాలి. – వెంకట్ ఎన్నపు, ల్యాబ్ టెక్నీషియన్, కాకినాడ డిస్ట్రిక్ట్ మెడికల్ ల్యాబొరేటరీస్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు -
నేడు వైఎస్సార్ సీపీఆవిర్భావ దినోత్సవం
రాజమహేంద్రవరం రూరల్: వైఎస్సార్ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం జిల్లాలో ఘనంగా నిర్వహించనున్నారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ జరుగుతుంది. పార్టీకి చెందిన ముఖ్యనేతలు పాల్గొనే ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. వైఎస్సార్ సీపీ 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు వేణుగోపాలకృష్ణ తెలిపారు. ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోనన్ని సవాళ్లు, దాడులను వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్ సీపీ ఎదుర్కొందన్నారు. వాటన్నింటినీ ఎదుర్కొంటూనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్ జగన్ అలుపెరగని పోరాటం చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల పాటు సంక్షేమాభివృద్ధికి పథకాలు, విప్లవాత్మక సంస్కరణలతో సుపరిపాలన అందించారన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా ప్రజలను వంచించిందన్నారు. -
భేటీ భేష్... పార్టీకి జోష్
కాకినాడ వేదికగా వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర స్థాయి సమావేశంసాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ వేదికగా బుధవారం జరిగిన వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం సూపర్ సక్సెస్ అవ్వడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది. చంద్రబాబు ప్రభుత్వం నుంచి, పాలకుల నుంచి అనేక అక్రమ పోలీసు కేసులు, వేధింపులు ఎదుర్కొంటున్నా లెక్క చేయకుండా రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ అగ్ర నేతలు మొదలుకుని ద్వితీయ శ్రేణి నేతలు, పార్టీ శ్రేణులు ఉత్తుంగ తరంగాలై కాకినాడ తరలివచ్చారు. సమావేశానికి హాజరయ్యే వారి కోసం కాకినాడ సినిమా రోడ్డులోని సూర్యకళామందిర్లో ఏర్పాటు చేసిన రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద ఉదయం ఎనిమిది గంటలకే పార్టీ నేతలు క్యూ కట్టారు. కార్యవర్గ సమావేశం ఉదయం 9 గంటలకు ప్రారంభమైన అరగంటలోనే సమావేశ మందిరం సూర్యకళామందిర్ పార్టీ నేతలు, శ్రేణులతో నిండిపోయింది. కూర్చునేందుకు వీలులేక వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పార్టీ దళిత నేతలు హాలు బయటే ఉండిపోయారు. సమావేశం ప్రారంభమైన ఉదయం 9 గంటల నుంచి రాత్రి ఏడు గంటలకు ముగిసే వరకు పార్టీ శ్రేణులు శ్రద్ధగా ముఖ్యనేతల ప్రసంగాలను ఆలకించారు. అధికార పార్టీ దౌర్జన్యాలను తూర్పార బట్టిన నేతలు కాకినాడ వేదికగా జరిగిన సమావేశంలో వైఎస్సార్ సీపీకి వెన్నుదన్నుగా నిలుస్తోన్న దళితులపై చంద్రబాబు ప్రభుత్వంలో సాగిస్తున్న వేధింపులు, కక్ష సాధింపు చర్యలు, అక్రమ పోలీసు కేసులు, హత్యలు, అత్యాచారాలపై నేతలు ఉదాహరణలతో సహా కడిగి పారేశారు. మాల, మాదిగలను విడదీసి రాజ్యాధికారానికి దూరం చేసిన చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలని జూపూడి, సుధాకర్బాబు వంటి నేతలు పిలుపు ఇచ్చినప్పుడు పార్టీ ఎస్సీ సెల్ నేతల నుంచి మంచి స్పందన లభించింది. రాజధాని అమరావతిలో భూములు లాగేసుకుని దళితులను వెళ్లగొట్టే కుట్రల దగ్గర నుంచి వైఎస్సార్ సీపీకి వెన్నుదన్నుగా నిలుస్తోన్న దళితులపై దౌర్జన్యాలకు పాల్పడుతోన్న అధికార పార్టీ నేతల తీరును నేతలు తూర్పార బట్టారు. ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టేందుకు గ్రామ, గ్రామాన దళిత వర్గాలకు అవగాహన కల్పించాల్సి అవసరాన్ని పార్టీ నేతలు నూరిపోశారు. జగన్మోహన్రెడ్డి సీఎంగా దళితులకు కల్పించిన ప్రయోజనాలు గణాంకాలతో సహా వివరించిన నేతలు ఆయనను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పిన సందర్భంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన నేతలు జై జగన్, 2029లో జగనే సీఎం అంటూ నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ఇందుకోసం అధికార పార్టీ నుంచి ఎదురయ్యే ఎన్ని కేసులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని, మీ వెంట ఉంటామంటూ నేతలు కొండంత ధైర్యాన్నిచ్చారు. ఇందుకోసం దళితులంతా ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని తెలియజేశారు. అంబేడ్కర్ విగ్రహానికి అవమానాలపై ఆగ్రహం దళితుల జోలికొస్తే ఏం జరుగుతుందో సర్కార్కు తెలిసొచ్చేలా చేస్తామంటూ కార్యవర్గ సమావేశం డిక్లరేషన్లో చంద్రబాబుకు అల్టిమేటమ్ ఇచ్చారు. అమరావతి రాజధానిని కుల రాజధానిగా చేసిన వైనాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా అవగాహన కల్పించే విషయంలో పార్టీ శ్రేణులంతా చొరవ తీసుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా నేతలు తమ ప్రసంగాల్లో సూటిగా తెలియచేశారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో విజయవాడ స్వరాజ్ మైదానంలో జగన్ ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహానికి కూటమి ప్రభుత్వంలో జరుగుతోన్న అవమానాలపై పార్టీ నేతలు ఒకే గొంతుకై నిరసించారు. సంపన్నులకు కాకుండా సామాన్యులైన దళితులకు జగన్మోహన్రెడ్డి కల్పించిన రాజకీయ ప్రాతినిధ్యాన్ని జూపూడి, మేరుగు నాగార్జున్, తాటిపర్తి చంద్రశేఖర్, మొండితోక అరుణ్కుమార్ వంటి నాయకులు వివరించే సందర్భంలో సూర్యకళామందిర్లో పార్టీ శ్రేణులు జై జగన్ నినాదాలు మిన్నంటాయి. సరికొత్త ఉత్తేజం దశాబ్దన్నర కాలం క్రితం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేటలో పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్రెడ్డి పార్టీని ప్రకటించారు. ఈ అపూర్వమైన ఘట్టం ఆవిష్కృతమై 15 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఒక రోజు ముందు కాకినాడలో పార్టీ ఎస్సీ సెల్ సమావేశం జరగడం పార్టీ భవిష్యత్కు శుభసంకేతమంటూ నేతలు చర్చించుకోవడం కనిపించింది. నాడు పార్టీ జెండా, అజెండా ఇదే జిల్లా నుంచి ఆవిష్కృతం కావడాన్ని పార్టీ నేతలు ప్రస్తావించి పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్తేజాన్ని నింపారు. పార్టీ కార్యవర్గ సమావేశం చివర్లో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పేరుతో కొత్తగా ‘జగనన్నకు తోడుగా–రాజన్న రాజ్యం మళ్లీ సాధిద్దాం’, ‘జగనన్న దళిత ఫోర్స్–దళిత జాతి మేలుకో’ అంటూ రూపొందించిన గీతం ఆహూతులైన పార్టీ శ్రేణులను అలరించింది. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్బాబు ఈ గీతాన్ని ఆవిష్కరించినదే తడవుగా పార్టీ శ్రేణులు కేరింతలు కొడుతూ ఊగిపోయారు. శ్రేణులు ఉత్సాహంతో పార్టీ కండువాలతో గీతానికి లయబద్ధంగా నృత్యాలు చేశారు. మొత్తంగా పార్టీ ఎస్సీ సెల్ సమావేశం పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపిన నేతల ప్రసంగాలు కదలి వచ్చిన దళిత లోకం అక్రమాలు, దౌర్జన్యాలపై పోరుబాటే.. 2029లో జగన్ను సీఎం చేయడమే అజెండా వైఎస్సార్ సీపీకి వెన్నుదన్నుగా దళితులు దళితులు వైఎస్సార్ సీపీకి వెన్నెముకగా నిలిచారనే పోలీసులతో అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. దళితులపై దౌర్జన్యాలు పెరిగిపోయాయి. దళిత ఉన్నతాధికారులకూ వేధింపులు తప్పడం లేదు. అబద్ధాలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. దళిత క్రిస్టియన్లను అన్ని విధాలా మోసం చేశారు. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. దళితులంతా కలిసి కట్టుగా ఉంటే రాజ్యాధికారం సాధించవచ్చు. – తలారి వెంకట్రావు, మాజీ ఎమ్మెల్యే, గోపాలపురం జగన్ను సీఎం చేసేందుకు దళితులు శ్రమించాలి గ్రామ గ్రామాన పర్యటించి వైఎస్సార్ సీపీని బలోపేతం చేయడంతో పాటు జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసేందుకు దళితులంతా శ్రమించాలి. మనందరి గోల్ జగన్ను సీఎంను చేయడమే. ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్సీలంటే గౌరవంతో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అదే స్ఫూర్తితో జగన్మోహన్రెడ్డి అంతకు మించి చేసి మెడికల్ కాలేజీలు పెట్టారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తోంది. జగన్ పార్టీ రహితంగా అనేక సంక్షేమ పథకాలు వర్తింపజేశారు. గ్రామాలలో వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్తో దళితులు ఉన్నత చదువులు, ఉద్యోగాలు సాధించారు. – పాముల రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్యే ఇంగ్లిష్ మీడియాన్ని దూరం చేశారు తరతరాలుగా అణచివేతకు గురవుతున్న దళితులను అన్నివిధాలా ఆదుకున్నది వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే. రాష్ట్రంలో ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు పెట్టి దళితులను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఘనత జగన్ది. అదే పేదలకు ఇంగ్లిష్ మీడియాన్ని దూరం చేసింది చంద్రబాబు. వైఎస్సార్ సీపీ హయాంలో హోంమినిస్టర్ తానేటి వనిత చాలా హుందాగా వ్యవహరించేవారు. ప్రస్తుత హోంమినిష్టర్ అనిత తాను సొంతంగా మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు చనిపోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. కూటమి మంత్రుల మాటలు ఆకాశాన్నంటుతున్నాయి. దళితులను చంద్రబాబు ప్రభుత్వం అన్ని రకాలుగా అణగదొక్కుతోంది. – జక్కంపూడి విజయలక్ష్మి, పీఏసీఎస్ సభ్యురాలు ప్రజలను మోసం చేశారు ఒక అబద్ధం అనేకసార్లు చెప్పి ప్రజలను మోసం చేశారు. ఈ ప్రభుత్వం ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా నాయకులు పార్టీలు మారారు తప్ప, ఒక్క కార్యకర్త కూడా పార్టీ మారలేదు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని మట్టి కరిపించి వైఎస్సార్ సీపీ విజయానికి ఎస్సీలందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే ఎస్సీల తలరాతలు మారతాయి. – అంగులూరి లక్ష్మీకుమారి, మాజీ ఎమ్మెల్సీ -
అవయవ దానంపై అవగాహన ర్యాలీ
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ది పీఎంపీ అసోసియేషన్) నగర శాఖ ఆధ్వర్యంలో బుధవారం అవయవ దానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీఎస్పీ ఎస్.భవ్య కిషోర్ జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక సౌత్ జోన్ డీఎస్పీ కార్యాలయం నుంచి ఆజాద్ చౌక్ మీదుగా దేవీచౌక్ వరకూ ప్రదర్శన కొనసాగింది. డీఎస్పీ మాట్లాడుతూ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతడి అవయవాలను దానం చేయడం ద్వారా ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చన్నారు. సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి వీబీటీ రాజు మాట్లాడుతూ ఈ ఏడాది పీఎంపీ అసోసియేషన్ ద్వారా అన్ని మండలాల్లో అవయవదానంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర అధ్యక్షుడు తోరాటి ప్రభాకరరావు, జిల్లా అధ్యక్షుడు బళ్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి.దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని, మండల అధ్యక్షుడు అబ్దుల్ రహ్మాన్ ఖాన్, కార్యదర్శి మట్టా రమేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 31 రూర్బన్ పంచాయతీలు రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో పదివేల మందికి పైగా జనాభా, రూ.కోటికి పైగా ఆదాయం ఉన్న పంచాయతీలను రూర్బన్ పంచాయతీలుగా ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా జిల్లాలోని 31 పంచాయతీలకు గుర్తింపు లభించింది. అలాగే గ్రేడ్ – 1 పంచాయతీలుగా 167, గ్రేడ్ – 2గా 75, గ్రేడ్–3గా 69 పంచాయతీలు ఆమోదం పొందాయి. రూర్బన్ పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీవో స్థాయి అధికారిని కార్యదర్శిగా నియమించనున్నారు. ఏప్రిల్ నెలాఖరులోపు వీటిలో కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ధవళేశ్వరం, రాజవోలు, బొమ్మూరు, హుకుంపేట, పిడింగొయ్యి, శాటిలైట్సిటి, కోలమూరు, కాతేరు, కడియం, వేమగిరి, కడియపులంక, రాజానగరం, దివాన్చెరువు, పాలచర్ల, చెల్లూరు, కేశవరం, ఏడిద, ద్వారపూడి, అనపర్తి, బిక్కవోలు, బలభద్రపురం, చాగల్లు, దేవరపల్లి, గోకవరం, గోపాలపురం, నల్లజర్ల, పోతవరం, ఖండవల్లి, పాలంగి, ఉండ్రాజవరం, వేలివెన్ను రూర్బన్ పంచాయతీలుగా మారాయి. ఏప్రిల్ 25న పాలిసెట్ రాజమహేంద్రవరం రూరల్: పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే పాలిసెట్ను ఏప్రిల్ 25న నిర్వహించనున్నట్లు బొమ్మూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, హెల్ప్లైన్ సెంటర్ జిల్లా కో ఆర్డినేటర్ ఆకుల మురళి అన్నారు. ఆ కళాశాల ఆవరణలో బుధవారం పాలిసెట్ పోస్టర్లను లెక్చరర్లతో కలిసి ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం, పరిసర ప్రాంతాల్లోని 14 కేంద్రాల్లో సుమారు 8 వేల మంది విద్యార్థుల వరకూ పరీక్ష రాయనున్నారన్నారు. ఈ ఏడాది నుంచి నిడదవోలు, తుని ప్రాంతాల్లో కూడా కొత్తగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ పరీక్ష రాసే విద్యార్థులకు తమ కళాశాలలో ఏప్రిల్ 2 నుంచి 23వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. రెండో రోజూ కొనసాగిన ఏసీబీ తనిఖీలు రాజమహేంద్రవరం సిటీ: అవినీతికి అడ్డాగా మారిందనే ఆరోపణల నేపథ్యంలో రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగంలో ఏసీబీ అధికారులు రెండో రోజు బుధవారం తనిఖీలు కొనసాగించారు. డీఎస్పీ కిశోర్ కుమార్, ఇన్స్పెక్టర్లు సతీష్, వాసుకృష్ణ, భాస్కర్, మరో 20 మంది సిబ్బందితో ఉదయం నుంచి రాత్రి వరకూ విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు కీలకమైన డాక్యుమెంట్లతో పాటు టౌన్ ప్లానింగ్ విభాగంలోని అన్ని శాఖలను తమ అధీనంలోకి తీసుకున్నారు. సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్, సర్వేయర్, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ తదితర అధికారులు, సిబ్బందికి చెందిన మొబైల్ ఫోన్లను స్వాఽధీనం చేసుకున్నారు. అవినీతికి ఆస్కారం ఉన్న 20 డాక్యుమెంట్లను గుర్తించినట్టు సమాచారం. -
క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం
వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్బాబుబోట్క్లబ్ (కాకినాడ సిటీ)/కాకినాడ రూరల్: పార్టీ జిల్లా ఎస్సీ సెల్ను గ్రామగ్రామాన బలోపేతం చేయడం ద్వారా రానున్న రోజుల్లో పార్టీకి మంచి భవిష్యత్ ఉంటుందని పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు పిలుపునిచ్చారు. కాకినాడ సూర్యకళామందిర్లో బుధవారం పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు శెట్టిబత్తుల కుమార్రాజా అధ్యక్షనత జరిగిన పార్టీ జిల్లా ఎస్సీ సెల్ సమావేశంలో సుధాకర్బాబు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సమావేశం విజయవంతానికి సహకరించిన పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డిలను వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్బాబు, పార్టీ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు శెట్టిబత్తుల కుమార్రాజా సత్కరించారు. మాజీ ఎంపీ చింతా అనురాధ, పార్టీ జిల్లా మహిళ అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్, పార్టీ గోదావరి జిల్లాల యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ తోట రాంజీ, కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, పార్టీ నేతలు పెదపాటి అమ్మాజీ, కాశి మునికుమారి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు పలివెల సుధాకర్, గుల్లా ఏడుకొండలు, క్రీస్టియన్ మైనార్టీ సెల్ నేత జానీ వెస్లీ పాల్గొన్నారు. -
కల్తీ పాల దుర్ఘటనపై సీబీఐ విచారణ
● మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్ ● బాధితులకు రూ.25 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి రాజమహేంద్రవరం సిటీ: కల్తీ పాల దుర్ఘటనపై నిజాలు నిగ్గు తేలాలంటే సీబీఐ విచారణ జరిపించాలని, ఒక్కొక్క బాధిత కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేయాలని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ డిమాండ్ చేశారు. మంగళవారం రాజమహేంద్రవరంలో బొల్లినేని కిమ్స్ ఆసుపత్రిలో కల్తీపాల ఘటనతో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్సార్ సీపీ సీఈసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావుతో కలసి పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో కూటమి నేతల తీరు ఆకతాయితనంగా ఉందని ఎద్దేవా చేశారు. అమరావతిలో నాటకాలు వేయడానికి టైం ఉంది కానీ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్లకు కల్తీ పాల బాధితుల గురించి పట్టించుకునే సమయం లేదని ధ్వజమెత్తారు. ఈ ఘటనను ప్రభుత్వం యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. బాధితుల శాంపిళ్లు నేషనల్ ఫోరెన్సిక్ లేబొరేటరీకి ఎందుకు పంపలేదో తెలియడం లేదన్నారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని రకాలుగా దర్యాప్తు జరపాలన్నారు. 160 లీటర్ల పాలు తీసుకొస్తే 20 కుటుంబాలు మాత్రమే ఎందుకు ఎఫెక్ట్ అయ్యాయనే విషయంపై స్పష్టత ఇవ్వాలన్నారు. పాలలో యూరియా కలిసిందా, ఫార్మాలిన్ కలిసిందా, గిట్టని వాళ్లు ఏమైనా పురుగుల మందు కలిపారా అన్న విషయాలు ఇప్పటివరకు స్పష్టం కాలేదన్నారు. బాధితుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా తయారైందని, ఈ ఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జగనన్న మిల్క్ ప్రొక్యూర్ మెంట్ యాక్ట్ తీసుకొచ్చారని, ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. చిన్నారులు సైతం మృతువుతో పోరాడుతున్నారు. ల్యాబ్ నుంచి రిపోర్టు రావడానికి వారాలు ఎందుకు పడుతోందో తెలియడం లేదన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వం హైడ్రామా ఆడుతోందన్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత హెరిటేజ్ అడ్వర్టైజ్మెంట్లు విపరీతంగా పెంచిందన్నారు. ఈ ఘటనను కూడా వ్యాపారం కోసం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నింటా కల్తీ రాజ్యమేలుతోందన్నారు. చంద్రబాబు హయాంలో తిరుమల లడ్డూకు సంబంధించి ఘీ ఫ్లేవర్ ఎన్ హ్యాన్సర్స్ కొన్నారు అదీ కల్తీయేనన్నారు. ఈ వ్యవహారంలో బాధితులకు న్యాయం అందించడం కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు. తనిఖీల గురించి ప్రశ్నిస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులు మాకు స్టాఫ్ లేరని చెప్పడం దారుణమన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, నేతలు సప్పా ఆదినారాయణ, కాటం రజనీకాంత్, వాసంశెట్టి గంగాధర్, తిరగాటి దుర్గారావు, రొక్కం త్రినాఽథ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి
తుని: స్థానిక సీతారాంపురంలోని వైఎస్సార్ విగ్రహం సమీపంలో ఉన్న మురుగు కాలువలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సీఐ ఎం.గీతా రామకృష్ణ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. కాలువలో వ్యక్తి మృతదేహం ఉందన్న స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మృతదేహాన్ని బయటకు తీయించి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి సుమారు 45 నుంచి 50 ఏళ్ల వయసు ఉంటుందని, ఒంటిపై మెరూన్ కలర్ పువ్వుల షర్టు, లైట్ కలర్ జీన్ ప్యాంటు ఉన్నాయని, అతడి దగ్గర లభించిన బ్యాగు లో తమలపాకులు కట్ చేసే వేతివేళ్ల పనిముట్లు ఉన్నాయన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు తుని పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. గొండోలు వంతెనను ఢీకొన్న కారు అడ్డతీగల: గొండోలులోని మడేరు వాగుపై ఉన్న వంతెనను మంగళవారం మితిమీరిన వేగంతో వచ్చిన నంబర్ లేని కారు బలంగా ఢీకొట్టింది. రాజవొమ్మంగి నుంచి అడ్డతీగల వైపు వస్తున్న ఈ కారు అదుపు తప్పి, వంతెన గోడను ఢీకొట్టి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయ్యింది. దానిలోని ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దురదృష్టవశాత్తూ కారు కొద్దిగా ముందుకు వెళితే సుమారు 150 అడుగుల లోతులో కాలువలో పడిపోయి ఉండేది. దీనిపై అడ్డతీగల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఏసీబీ దాడుల్లో కీలక పత్రాల స్వాధీనం
● అక్రమ కట్టడాల నేపథ్యంలో నగర పాలక సంస్థలో విస్తృత తనిఖీలు ● సుమారు 12 గంటల పాటు నిర్వహణ రాజమహేంద్రవరం సిటీ: నగర పరిధిలో అడ్డగోలు నిర్మాణాలు, అక్రమ కట్టడాలకు అనుమతులు, పట్టణ ప్రణాళికా విభాగం అవినీతి భాగోతాలపై పలు ఫిర్యాదుల నేపథ్యంలో మంగళవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టి పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీజీ అతుల్ సింగ్, ఏసీబీ డైరెక్టర్ జయలక్ష్మి ఆదేశాల మేరకు డీఎస్సీ కిశోర్కుమార్ ఇన్స్పెక్టర్లు సతీష్, వాసుకృష్ణ, భాస్కర్ మరో 20 మంది సిబ్బందితో ఈ తనిఖీలు చేపట్టారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన తనిఖీలు రాత్రి 8.30 నిముషాల వరకూ విస్తృతంగా తనిఖీ చేపట్టారు. నగరంలో అక్రమ భవన నిర్మాణాలకు సంబంధించిన పలు రికార్డులను అధికారులు పరిశీలించారు. నగరంలో భవన నిర్మాణాలకు ఇచ్చిన అనుమతులు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, దరఖాస్తులు పెండింగ్కు గల కారణాలను అధికారులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. జనవరి నుంచి ఇప్పటి వరకూ ఆన్లైన్లో దరఖాస్తులు ఎన్ని మంజూరు చేశారు. ఎన్ని పెండింగ్లో ఉన్నాయనే విషయాలను పరిశీలించారు. సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి కార్యాలయంలో కంప్యూటర్, వివిధ స్థాయి అధికారుల ఫైల్స్ పరిశీలించి కీలకమైన డాక్యమెంట్స్ను స్వాధీన పరుచుకున్నట్లు సమాచారం. నగరంలో అత్యధిక అక్రమ కట్టడాల నిర్మాణాలు, టౌన్ ప్లానింగ్లోని వివిధ విభాగాల్లో అవినీతి చోటు చేసుకుంటున్నాయని ఫిర్యాదులు వివిధ వేదికల ద్వారా ఏసీబీ దృష్టికి వెళ్లడం, ప్రజల నుంచి, సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు, పలు కథనాలు రావడంతో ఏసీబీ అధికార యంత్రాంగం రంగంలోకి దిగి అవినీతిపై అకస్మిక తనిఖీలు చేపట్టింది. భవన నిర్మాణాల అనుమతుల్లో నిబంధనల అతిక్రమణలు ఉన్నాయా అనే విషయాన్ని సైతం అధికారులు పరిశీలించారు. నిబంధనల ప్రకారం నిర్మాణాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించి చర్యలు చేపట్టనున్నట్లు తెలిసింది. ఈ విషయమై ఏసీబీ డీఎస్పీ కిశోర్కుమార్ను వివరణ కోరగా తనిఖీలు నిర్వహించి వివరాలు ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. -
నిబంధనలకు విరుద్ధంగా బార్ నిర్మాణం
ఫఆపకుంటే ఆందోళన చేపడతాం ఫకాకినాడ నాగమల్లితోట వాసుల ఆందోళన కాకినాడ రూరల్: గుడి, బడి, ఆస్పత్రులకు దగ్గరగా మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లకు అనుమతులు ఇవ్వకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ అవేవీ పట్టించుకోకుండా బార్ నిర్మాణ పనులు చేపడుతున్నారని నాగమల్లితోట కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. నాగమల్లితోట పారిశ్రామిక వాడలో మూతపడిన ఒక యూనిట్ వద్ద పాత భవనాలను కూల్చివేసి అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసేందుకు పనులు చేపడుతున్నారు. బయట బార్ లైసెన్స్తో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో బార్ నిర్వహిస్తే శాంతి భద్రత సమస్యలు తలెత్తుతాయని, ఆకతాయిలు, మద్యం బాబులతో తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఈ మార్గంలోనే రెండు కార్పొరేట్ ఆస్పత్రులున్నాయి. పాఠశాలల సమీపంలో ఉండడంతో ఈ మార్గంలోనే విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇటువంటి ప్రాంతంలో బార్ అండ్ రెస్టారెంట్కు అనుమతులు ఎలా ఇచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గుడి పక్కనే బార్కు అనుమలు ఇవ్వడంపై అధికార పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బార్ నిర్మాణ పనులు ఆపకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. -
ఖేలో ఇండియా ఫుట్బాల్ ఉత్తమ క్రీడాకారుడిగా సమంత్కుమార్
దేవరపల్లి: రాజమహేంద్రవరంలో ఇటీవల జరిగిన ఖేలో ఇండియా ఫుట్బాల్ పోటీల్లో అత్యంత ప్రతిభ చూపిన దేవరపల్లి అంబటి సత్యనారాయణరావు జిల్లా పరిషత్ హైస్కూలు 9వ తరగతి విద్యార్థి కె.సమంత్కుమార్ ఉత్తమ క్రీడాకారుడిగా ఎంపికయ్యాడు. సమంత్కుమార్కు నిర్వాహకులు రూ.35 వేల విలువ గల ఎలక్ట్రికల్ సైకిల్ను బహుమతిగా అందజేసి సత్కరించారు. పోటీల్లో జిల్లా నుంచి 300 మంది క్రీడాకారులు పాల్గొనగా సమంత్కుమార్ ఉత్తమ క్రీడాకారుడిగా ఎంపికై నట్టు పీడీ ఓరుగుంటి రామకృష్ణంరాజు తెలిపారు. జాతీయ విద్యా విధానం అమలుకు కృషి చేయాలి ‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ రాజానగరం: జాతీయ విద్యా విధానం 2020తోపాటు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్గదర్శకాల నిర్మాణాత్మక అమలుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. యూనివర్సిటీ సెమినార్ హాలులో గోదావరి జిల్లాల్లోని అనుబంధ డిగ్రీ కళాశాలల బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్స్, మెంబర్స్తో మంగళవారం సమావేశమయ్యారు. కోర్సుల నిర్మాణం, సిలబస్ పునర్నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అన్ని యూజీ ప్రొగ్రామ్లకు సాధారణ ఫ్రేమ్ వర్కు నియమాలు, ఉత్తీర్ణతా ప్రమాణాలను నియంత్రించే ‘యూనివర్సిటీ కామన్ కోర్ ఫ్రేమ్ వర్కు’ను సృష్టించడం, అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఫ్రేమ్ వర్కు ప్రకారం క్రెడిట్ల నిల్వ, బదిలీ, విముక్తికి సంబంధించి ప్రత్యేక నియమాలను రూపొందించాలని సూచించారు. పరీక్ష నిబంధనల పునర్నిర్మాణం, గ్రేడింగ్, భాషలు, స్కిల్ డెవలప్మెంట్, భారతీయ జ్ఞాన వ్యవస్థలు వంటి సాధారణ పత్రాల పునర్నిర్మాణంపై దృష్టి సారించాలన్నారు. డిగ్రీ కోర్సులకు సంబంధించి సిలబస్ తయారీ, మోడల్ పరీక్షా పత్రాలు వంటి అంశాలపై చర్చించారు. తెలుగు వర్సిటీకి వేటూరి సాహిత్య సంపుటాలు రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరంలోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రముఖ సినీ రచయిత వేటూరి సుందర రామమూర్తి సాహిత్య సంపుటాలను బహూకరించారని ఉపాధ్యక్షుడు ఆచార్య డి.మునిరత్నంనాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రముఖ పాత్రికేయులు, సినీగేయ రచయిత వేటూరి సుందర రామమూర్తి సాహిత్యాన్ని ఆరు సంపుటాలు–ఎనిమిది గ్రంథాలుగా అమెరికాలోని వేటూరి సాహిత్యభిమాన సమితి వారు 2026 జనవరిలో తొలిసారిగా ప్రచురించారన్నారు. దొరకునా ఇటువంటి సేవ(వాల్యూమ్–1), మానసవీణా మధుగీతం(వాల్యూమ్–2), నవమి నాటి వెన్నెల(వాల్యూమ్–3),ఎడారికోయిల(వాల్యూమ్–4), ఝమ్మంది నాదం(వాల్యూమ్–5), ఎరక్కపోయి వచ్చాను (వాల్యూమ్–6) గ్రంథాలతో పాటు గతంలో ప్రచురించిన వేటూరి సుందర రామమూర్తి పుస్తకాలు‘కొమ్మకొమ్మకోసన్నాయి’, ‘రాబిన్హుడ్’,‘జీవనరాగం’‘సిరికాకొలనుచిన్నది’ సంపుటాలను పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విద్యార్థులకు, పరిశోధకులకు అందుబాటులో ఉండేవిధంగా సుందరరామమూర్తి కుమారుడు వేటూరి రవిప్రకాష్ ఆచార్య మునిరత్నంనాయుడుకు మంగళవారం అందజేశారు. రాజమహేంద్రవరం సాహిత్యపీఠంలో డాక్టర్ పొన్నాలీలావతి పర్యవేక్షణలో జయంతి చక్రవర్తి అనే విద్యార్థి వేటూరి సుందరరామమూర్తి పాటలు – సాహిత్యపు విలువలు అనే అంశంపై పీహెచ్డీ కోసం పరిశోధన చేసి పట్టా అందుకోవడం విశేషమని ఆచార్య మునిరత్నంనాయుడు తెలిపారు. -
అరాచకంపై దళిత గళం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దమనకాండ, అరాచకానికి వ్యతిరేకంగా దళితులు గళమెత్తనున్నారు. ఈ దిశగా చేపట్టే ఉద్యమ కార్యాచరణకు కాకినాడ వేదిక కానుంది. స్థానిక సినిమా రోడ్డులోని సూర్య కళా మందిర్లో బుధవారం వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం కార్యవర్గ వర్క్షాప్ (చర్చ) నిర్వహించనున్నారు. చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కిన ఏడాదిన్నర కాలంలో అధికార పార్టీ నేతలు సాగిస్తున్న దాడులు, దౌర్జన్యాలు, దళితులపై అన్యాయంగా ఎడాపెడా పెడుతున్న అక్రమ పోలీసు కేసులు, అత్యాచారాలు, గాడి తప్పిన పాలన, సంక్షేమాన్ని విస్మరించడం, ఎస్సీ వర్గాల అభ్యున్నతి, హక్కుల పరిరక్షణ తదితర అంశాలపై ఈ సందర్భంగా నేతలు చర్చించనున్నారు. పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు శెట్టిబత్తుల కుమార్రాజా అధ్యక్షతన బుధవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు నేతలు దిశానిర్దేశం చేస్తారు. ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పార్టీ ఎస్సీ సెల్ 26 జిల్లాలు, 175 నియోజకవర్గాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. విస్తృత ఏర్పాట్లు సాధారణంగా ఇటువంటి చర్చ, భవిష్యత్ కార్యాచరణ వంటి కీలక కార్యక్రమాలు తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతూంటాయి. దీనికి భిన్నంగా బయట ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. అది కూడా కాకినాడలో ఈ వర్క్షాప్ నిర్వహిస్తూండటంతో విస్తత ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని పార్టీ ముఖ్యులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సుధాకర్బాబు పర్యవేక్షణలో శెట్టిబత్తుల కుమార్రాజా ఆధ్వర్యాన ఉమ్మడి తూర్పు గోదావరి జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, పార్టీ అంగన్వాడీ వర్కర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత తదితరులు వర్క్షాప్ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రం నలుమూలల నుంచీ తరలివచ్చే పార్టీ ఎస్సీ నేతలకు చర్చకు అనువైన రీతిలో సూర్య కళామందిర్లో వేదిక ఏర్పాటు, సౌకర్యాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే, పార్టీ కో ఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఎస్ఈసీ సభ్యుడు బెజవాడ సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్ తదితరులు పర్యవేక్షించారు. పార్టీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లకు ఆహ్వానం పంపించారు. ·˘ నేడు కాకినాడలో వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం వర్క్షాప్ ·˘ భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం ·˘ తరలి రానున్న ముఖ్య నేతలు, శ్రేణులు విజయవంతం చేయండి రాష్ట్ర స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న ఎస్సీ సెల్ వర్క్షాపును విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు కదలి రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆయా జిల్లాల్లో ఎస్సీలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ వర్క్షాప్లో నివేదికలు అందించి, చర్చకు పెట్టనున్నారు. జిల్లాలో తొలిసారి జరుగుతున్న ఈ వర్క్షాపునకు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎస్సీ సెల్ ముఖ్య నేతలు, మండల, గ్రామ విభాగాల అధ్యక్షులు, కమిటీల ప్రతినిధులు తరలి రావాలి. ఉదయం 8 గంటలకు రిజిస్ట్రేషన్తో మొదలై మధ్యాహ్నం 3 గంటల వరకూ వర్క్షాప్ జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు పార్టీ ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశాం. – శెట్టిబత్తుల కుమార్రాజా, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు -
సచివాలయ సిబ్బందికి గాయాలు
వై.రామవరం: మండలంలోని చవిటిదిబ్బలు గ్రామం వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సచివాలయ సిబ్బంది గాయపడ్డారు. వై.రామవరం సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ పొత్తూరి సత్యనారాయణరెడ్డి, పి.యర్రగొండ గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ పల్లాల విజయకుమారి ద్విచక్ర వాహనంపై విధుల నిర్వహణకు వై.రామవరం వైపు వస్తున్నారు. స్థానిక తహసీల్దార్ కారు వెనుక నుంచి వచ్చి ఢీకొనడంతో రోడ్దు మీద పడిపోయి గాయపడ్డారు. అయినా వీరిని పట్టించుకోకుండా కారు వెళ్లిపోయింది. గమనించిన స్థానికులు చవిటిదిబ్బలు పీహెచ్సీకి తరలించగా, ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం వై.రామవరం సీహెచ్సీకు తీసుకువెళ్లారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై ఎస్.పృథ్వీ యాదర్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ప్రమాదానికి కారకుడైన తహసీల్దార్ కారు డ్రైవర్పై చర్యలు తీసుకోవాలంటూ బాధితులతో పాటూ సచివాలయాల సిబ్బంది యూనియన్ నేతలు కోరారు. -
నేలపై కూర్చుంటున్నాం
తరగతి గదులు లేకపోవడంతో నేలపైనే కూర్చుని చదువుకుంటున్నాం. ఎండకు, వానకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. 104 మంది విద్యార్థులకు రెండు వాష్ రూమ్లే ఉన్నాయి. ఏడాదిన్నరగా ఇదే పరిస్థితి. ఒకటో తరగతి నుంచీ ఇక్కడే చదువుతున్నాను. – సీహెచ్ సత్యశ్రీ, 8వ తరగతి వసతులు లేవు పాఠశాలలో కనీస వసతులు లేవు. వాష్ రూమ్లకు రావడం లేదు. తాగునీటి సమస్య కూడా ఉంది. ప్రధానంగా గదులు లేక ఇబ్బంది పడుతున్నాం. 104 మంది విద్యార్థులను మూడు గదుల్లో ఉంచి ఉపాధ్యాయులు పాఠాలు చెపుతున్నారు. – జి.దీప్తి శ్రీవేణి, 8వ తరగతి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం భవనాలు శిథిలావస్థకు చేరడంతో అధికారుల ఆదేశాల మేరకు పైకప్పులను తొలగించాం. కొత్త భవనాల నిర్మాణానికి ఏసీఆర్లో ప్రతిపాదనలు పంపించాం. సమస్య జిల్లా స్థాయి అధికారుల దృష్టిలో ఉంది. తాత్కాలికంగా గ్రామ సచివాలయ భవనంలోకి మార్చడానికి ఏర్పాట్లు చేయగా కొందరుగ్రామస్తులు అడ్డుకోవడంతో ఆగిపోయింది. వచ్చే విద్యాసంవత్సరానికి కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనివాసరావు, మండల విద్యాశాఖ అధికారి, గోపాలపురం -
పల్లెసేవకు ప్రోత్సాహకం
ఫ ఫెలోషిప్ అందించనున్న ఎస్బీఐ ఫ యువతకు మంచి అవకాశం బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): పల్లెల ప్రగతితోనే దేశాభివృద్ధి సాధ్యమనేది జగమెరిగిన సత్యం. యువత భాగస్వామ్యంతో దీన్ని ఆచరణలోకి తేచ్చేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూత్ ఫర్ ఇండియా పేరిట ఫెలోషిప్ అందిస్తోందని ఆ బ్యాంక్ గైగోలుపాడు శాఖ చీఫ్ మేనేజర్ అద్దంకి శివప్రసాద్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. పల్లెసేవకు ముందుకు వచ్చే యువతను ఈ పథకం ద్వారా అన్ని విధాలా ప్రోత్సహించనుంది. దీనికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు. 2026 అక్టోబర్ లోగా ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 13 నెలలు కొనసాగే ఈ కార్యక్రమానికి ఎంపిక పక్రియ వివిధ దశల్లో ఉంటుంది. దరఖాస్తులో ప్రాథమిక వివరాలు అందిస్తే రెండో దశలో ఆన్లైన్ అసైన్మెంట్లో సామాజిక సమస్యలపై వ్యాసాలు రాయడంతో పాటు వాటికి పరిష్కారం చూపే సూచనలు ఇవ్వాలి. తర్వాత వ్యక్తిగత ముఖాముఖి నిర్వహిస్తారు. ఆసక్తి కలవారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూయూత్ఫర్ఇండియా.ఓఆర్జీ అనే ఏప్రిల్ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. గౌరవ వేతనం ఎంపికై న వారికి నెలకు రూ.16 వేల గౌరవ వేతనం అందిస్తారు. ప్రయాణ ఖర్చులకు రూ.2 వేలు, ప్రాజెక్టు సమర్పణకు రూ.వెయ్యి అదనంగా చెల్లిస్తారు. ఫెలోషిప్ను విజయవంతంంగా పూర్తి చేసిన వారికి రీఅడ్డస్ట్మెంట్ అలవెన్స్ రూ.50 వేలు ఇవ్వనున్నారు. ఫెలోషిప్ కాలంలో ఆరోగ్య, వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం ఉంటుంది. ప్రయోజనాలు జాతీయ స్థాయిలో పేరుపొందిన ఎస్బీఐ ఫౌండేషన్, స్వచ్ఛంద సంస్థలతో పనిచేసే అవకాశం లభిస్తుంది. గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, విద్య, గ్రామీణుల జీవనోపాధుల్లో మార్పు తీసుకొచ్చేందుకు సేవారంగంలో ముందుకు వెళ్లాలనుకునే యువతకు ఇదో మంచి వేదికగా చెప్పవచ్చు. ఫెలోషిప్ పూర్తిచేసిన వారికి లభించే ధ్రువీకరణ పత్రాల ద్వారా భవిష్యత్తులో ఉత్తమ అవకాశాలు పొందవచ్చు. -
ఐదు గేదెల సజీవ దహనం
సామర్లకోట: పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు పాడి గేదెలు సజీవ దహనమయ్యాయి. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని ఏలేరు కాలువ గట్టుపై పశువుల కోసం ఉండవిల్లి వెంకన్నబాబు పాక వేసుకున్నాడు. దానిలో రెండు పాలిచ్చే గేదెలు, మూడు చివిడి గేదెలను ఉంచాడు. అయితే మంగళవారం పాక మీదుగా వెళుతున్న విద్యుత్ తీగ తెగి పడి అగ్నిప్రమాదం సంభవించింది. ఆ మంటల్లో ఐదు గేదెలూ కాలిపోయాయి. సమీపంలో వెంకన్నబాబుకు చెందిన గడ్డి మేటుతో పాటు మరో రెండు పాకలు కాలిబూడిద అయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.ఆరు లక్షల నష్టం జరిగి ఉంటుందని అంచనా వేశారు. గ్రామ రెవెన్యూ అధికారులు ప్రమాద వివరాలను తహసీల్దార్ సీహెచ్ వెంకటలక్ష్మికి సమాచారం ఇచ్చారు. బైక్లు ఢీకొని ముగ్గురికి గాయాలు ప్రత్తిపాడు: జాతీయ రహదారిపై ప్రత్తిపాడు పాదాలమ్మ ఆలయం సమీపంలో మంగళవారం ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. చిట్ర లోవరాజు, జోష్ సత్య అప్పలరాజు బైక్పై ఏలేశ్వరం మండలం సిరిపురం వెళుతున్నారు. అలాగే ఏలేశ్వరం మండలం యర్రవరం నుంచి బైక్పై గుమ్ములూరి లచ్చబాబు ప్రత్తిపాడు వస్తున్నాడు. సరిగ్గా పాదాలమ్మ ఆలయం సమీపానికి వచ్చే సరికి ఎదురెదురుగా వీరు ఢీకొన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురికీ స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ప్రాథమిక చికిత్స అందించి, అనంతరం కాకినాడ జీజీహెచ్కు తరలించారు. ఈ మేరకు హెల్త్ సెంటర్ నుంచి స్థానిక పోలీసులకు సమాచారం అందింది. చాగల్లులోమృతదేహం కలకలం! చాగల్లు: చాగల్లు జైపూర్ షుగర్ ఫ్యాక్టరీ యార్డులోని ముళ్ల పొదల్లో మృతదేహాన్ని పూడ్చివేశారనే వార్త మంగళవారం ఉదయం గ్రామంలో హల్చల్ చేసింది. గ్రామంలోని ఉపాధి కూలీలు పని కోసం యార్డు వైపు వెళుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు గోతులో మట్టి వేసి పూడ్చుతున్నట్లు కనిపించింది. దీంతో అక్కడ మృతదేహాన్ని పూడ్చారంటూ వార్త హల్చల్ చేసింది. సమాచారం తెలుసుకున్న ఎస్సై కె.నరేంద్ర తన సిబ్బందితో కలిసి యార్డు వద్దకు చేరుకుని గొయ్యి తవ్వించారు. అందులో చనిపోయిన కుక్క కళేబరం కనిపించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బంగారు ఆభరణాల చోరీ అయినవిల్లి: తొత్తరమూడి పెదపాలెంలోని ఓ ఇంట్లో బంగారు ఆభరణాలను దొంగలు చోరీ చేశారు. అయినవిల్లి ఎస్సై వై.జ్యోతి తెలిపిన వివరాల ప్రకారం.. పెదపాలేనికి చెందిన కుడుపూడి శ్రీనివాసరావు ఈ నెల 7వ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి విశాఖపట్నంలోని బంధువుల వద్దకు వెళ్లాడు. తిరిగి ఈ నెల 10న తన ఇంటికి వచ్చాడు. అయితే ఇంటి వెనుక భాగంలో తలుపులు బద్ధులుకొట్టి ఉండటాన్ని గమనించాడు. లోపలకు వెళ్లిచూడగా గదిలోని బీరువాలో వస్తువులు చిందర వందరగా పడి ఉన్నాయి. బీరువాలో బంగారం చెవి దిద్దులు, ఒక అంజి ఉంగరం, నల్లపూసల లాకెట్, మూడు చిన్న రూపులు కలిపి సుమారు 16 గ్రాముల బంగారం, కొంత నగదు మాయమైనట్టు గుర్తించాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మొండి గోడు వినేదెవ్వరు!
ఫ మొండి గోడల మధ్య విద్యాబోధన ఫ మూడు గదులు, ఎనిమిది తరగతులు ఫ గోపవరం పాఠశాల దుస్థితి ఫ ఏడాదిన్నరగా ఇదే పరిస్థితి దేవరపల్లి: పైకప్పు లేని పాఠశాల భవనం.. కేవలం మూడు తరగతి గదులు.. సుమారు 104 మంది విద్యార్థులకు బోధన.. నమ్మలేని ఈ నిజాన్ని చూడాలంటే గోపాలపురం మండలం గోపవరం ప్రాథమికోన్నత పాఠశాలకు రావాల్సిందే. చంద్రబాబు ప్రభుత్వంలో పాఠశాలల దుస్థితికి ఇది నిదర్శనంగా నిలిచింది. మండల కేంద్రానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ స్కూల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకూ విద్యాబోధన జరుగుతోంది. ఏడాదిన్నరగా.. ఈ పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో సుమారు ఏడాదిన్నర క్రితం అధికారుల ఆదేశాల మేరకు పైకప్పులను తొలగించారు. తొలగించిన శిథిలాలు ఎక్కడక్కడ ఉండిపోవడంతో ఇటీవల పాఠశాల నిర్వహణ నిధుల నుంచి ఉపాధ్యాయులు తొలగించారు. భవనాల పైకప్పులు తొలగించిన, వాటి నిర్మాణం గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. పాఠశాలలో రెండు భవనాలను దాదాపు 30 ఏళ్ల క్రితం నిర్మించారు. ప్రస్తుతం ఇవి బీటలు తీసి, శ్లాబ్లు పెచ్చలూడి ప్రమాదకరంగా మారటంతో, వాటిని తొలగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో భవనాలను పూర్తిగా తొలగించకుండా పైకప్పులను మాత్రమే తీసివేశారు. ఆ మొండి గోడల మధ్య దాదాపు 16 నెలలుగా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఎండలు పెరిగిపోవడంతో మొండి గోడలపై ప్లాస్టిక్ బరకాలు వేసి తరగతులు నిర్వహిస్తున్నారు. రెండే మరుగుదొడ్లు ఈ పాఠశాలలో 104 మంది విద్యార్థులకు రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. వీటినే విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులూ వినియోగిస్తున్నారు. కనీసం నీటి వసతి లేకపోవడంతో అవి అధ్వానంగా మారాయి. బాలుర మరుగుదొడ్డి తలుపు శిథిలమై వేలాడుతోంది. గదులు లేక ఆరు బయట వరండాల్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. బల్లలు లేక విద్యార్థులు నేలపై కూర్చుని చదువుకుంటున్నారు. ఉపాధ్యాయులూ సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంట గది దుస్థితి మధ్యాహ్న భోజనం పథకంలో వంటలు చేయడానికి నిర్మించిన వంటశాల శిథిలావస్థకు చేరుకుంది. వంటశాలకు ఉన్న తలుపు పాడైపోవడంతో ఎలుకలు సంచరిస్తున్నాయని, కూరగాయలు, నిత్యావసరాలను పాడుచేస్తున్నాయని వంట ఏజెన్సీ మహిళలు వాపోతున్నారు. దాదాపు నాలుగేళ్ల క్రితం చేపట్టిన వంట షెడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉంది. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 29,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,500 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 18,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)16,000 – 17,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
లారీ ఢీకొని ఇద్దరు బస్సు డ్రైవర్ల మృతి
ఫ మరో బస్సు క్లీనర్కి తీవ్ర గాయాలు ఫ నార్కట్పల్లిలో రోడ్డు ప్రమాదం నార్కట్పల్లి: హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండల పరిధిలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని ఇద్దరు ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు మృతి చెందగా.. మరో బస్సు క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు. నార్కట్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోజో ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి ఏపీలోని కాకినాడకు బయలుదేరింది. మంగళవారం తెల్లవారుజామున నార్కట్పల్లి మండల పరిధిలోని నల్లగొండ ఎక్స్ రోడ్ ఫ్లైఓవర్ వద్దకు రాగానే.. లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో లారీ, బస్సు స్వల్పంగా ఢీకొన్నాయి. దీంతో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ ఫ్లైఓవర్ పక్కన వాహనాలను ఆపి వాదించుకుంటున్నారు. ఈ క్రమంలో కాకినాడకు వెళుతున్న మరో మోజో ట్రావెల్స్ బస్సు అక్కడికి చేరుకోగా, ఆ బస్సు డ్రైవర్లు పస్తం శ్రీనివాస్ (30), చిట్టకెన బంగారయ్య(45) బస్సును పక్కకు ఆపి అప్పటికే వాదించుకుంటున్న బస్సు, లారీ డ్రైవర్లతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో విజయవాడ వైపు వెళ్తున్న మరో లారీ.. ప్రమాదానికి గురై రోడ్డు పక్కన ఆపిన లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో నలుగురు డ్రైవర్లు రెండు లారీల మధ్య ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు పస్తం శ్రీనివాస్, చిట్టికెన బంగారయ్య అక్కడికక్కడే మృతి చెందగా.. మొదట ప్రమాదానికి గురైన బస్సు క్లీనర్ సురేష్కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నార్కట్పల్లి సీఐ, నార్కట్పల్లి, చిట్యాల ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకుని రెండు లారీలు, బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. శ్రీనివాస్, బంగారయ్య మృతదేహాలను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి, గాయపడిన క్లీనర్ సురేష్ను నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్కట్పల్లి ఎస్ఐ విష్ణుమూర్తి తెలిపారు. మృతుడు శ్రీనివాస్ హైదరాబాద్లోని మెహిదీపట్నం సమీపంలోని గుడిమల్కాపురం వాంబే కాలనీలో నివాసముంటుండగా.. బంగారయ్య స్వస్థలం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జొన్నాడ అని ఎస్ఐ తెలిపారు. -
వివాహిత ఆత్మాహత్యాయత్నం
యానాం: యానాం – ఎదుర్లంక బాలయోగి వారధిపై నుంచి గోదావరిలో దూకి ఓ వివాహిత ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా, స్థానికులు రక్షించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం ద్రాక్షారామకు చెందిన పెట్టా సత్యలక్ష్మి స్థానిక బాలయోగి వారధి వద్దకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆమె అందరూ చూస్తుండగానే గోదావరిలో దూకింది. వెంటనే స్థానికులు గమనించి గోదావరిలో వేటాడుతున్న మత్స్యకారులకు తెలపగా, వారు నావలపై వెళ్లి ఆమెను రక్షించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం యానాం జీజీహెచ్కు తరలించగా, అక్కడి నుంచి ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఎస్సై పునీత్రాజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తాళం వేసిన ఇళ్లే టార్గెట్
అమలాపురం టౌన్: ముందు రెక్కీ నిర్వహిస్తారు.. తాళం వేసిన ఇళ్లను గమనిస్తారు.. రాత్రి పూట ఆ ఇళ్లకు వెళ్లి తాళాలు బద్దలుకొట్టి చోరీలకు పాల్పడతారు. ఇలా ఆలమూరు మండలం పేనికేరు గ్రామంలో గత నెల 14న రాత్రి ఓ ఇంట్లో జరిగిన చోరీపై తీగ లాగితే డొంక కదిలినట్లు ఈ దొంగల ముఠా బండారం బయట పడింది. చోరీలు చేస్తున్న ఆ ముగ్గురూ 22 ఏళ్ల లోపు యువకులే. ఇందులో ఆలమూరు మండలం పెద్ద పళ్ల గ్రామానికి చెందిన కంచెర్ల జార్జ్ బెన్నీ, సన్నపు శ్రీచరణ్, కపిలేశ్వరపురం మండలం తాతపూడి గ్రామానికి చెందిన ఉందుర్తి ఆనంద్కుమార్లను సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 32.40 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై జిల్లా ఎస్పీ రాహుల్ మీనా కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్, సీఐలు, ఎస్సైలతో కలసి అమలాపురంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆ వివరాల ప్రకారం.. ఆలమూరు పోలీస్ స్టేషన్లో తాజాగా జరిగిన రెండు చోరీ కేసుల్లో పైముగ్గురు నిందితులు. కంచెర్ల జార్జిబెన్నీపై గతంలో ఆలమూరు, రావులపాలెం పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు దొంగతనం, గంజాయి కేసులు ఉన్నాయి. ఉందుర్తి ఆనంద్కుమార్పై గతంలో ఆలమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసు ఉంది. ఈ చోరీ కేసులను ఛేదించిన పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్తో పాటు రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్, అమలాపురం సీసీఎస్ సీఐ ఎం.గజేంద్రకుమార్, క్లూస్ టీమ్ సీఐ కె.ప్రవీణ్కుమార్, ఆలమూరు ఎస్సై జి.నరేష్, సీసీఎస్ ఎస్సైలు ఎ.పరదేశి, అయితాబత్తుల బాలకృష్ణ, సీసీఐ ఏఎస్సై రాజు తదితరులను ఎస్పీ ప్రశంసించారు. అనంతరం వారికి నగదు రివార్డులను అందించారు. ఎవరైనా ఇంటికి తాళాలు వేసి వేరే ఊళ్లకు వెళితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు సమాచారం అందించి, లాక్డ్ హౌస్ మోనటరింగ్ సిస్టమ్ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ మీనా విజ్ఞప్తి చేశారు. ఫ చోరీ కేసుల్లో ముగ్గురి అరెస్ట్ ఫ రూ.32.40 లక్షల సొత్తు స్వాధీనం -
కువైట్లో చిక్కుకున్నా.. కాపాడండి
పిఠాపురం: యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ప్రతి క్షణం భయం భయంగా ఉందని, తన తోటివారు ఇళ్లకు వెళ్లిపోయారని, తనను కాపాడండంటూ పిఠాపురం పట్టణానికి చెందిన దాకే కుమారి సోషల్ మీడియా ద్వారా వేడుకుంది. పిఠాపురం రథాలపేటకు చెందిన కుమారి కొన్నేళ్ల కిందట జీవనోపాధి నిమిత్తం కువైట్ వెళ్లింది. అయితే ఇటీవల అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియడం లేదని తనను రక్షించాలని ఆమె వేడుకుంటోంది. తన భార్యను ఎలాగైనా స్వస్థలానికి తీసుకువచ్చే ఏర్పాట్లు చేయాలని ఆమె భర్త దాసు వేడుకుంటున్నాడు. -
పాలాకులు పట్టించుకోక..
అధికారుల పర్యవేక్షణ కరవు లొల్ల లాకులను 20 ఏళ్ల నుంచి పట్టించుకోవడం లేదు. ప్రధానంగా బ్యాంకు కాలువపై ఉన్న లాకులు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇటుగా అధిక బరువు ఉన్న లారీలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఇరిగేషన్ శాఖ పర్యవేక్షణ కరవైంది. ఈ సమస్యను కొత్తపేట ఎమ్మెల్యే బండారు అనేక సార్లు సీఎం దృష్టిలో పెట్టారు. – కరుటూరి నరసింహారావు, అంకంపాలెం, జిల్లా ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ వెంటనే నిర్మించాలి కూటమి ప్రభుత్వం వెంటనే లొల్ల లాకులను నిర్మించాలి. లొల్ల లాకులపై అమలాపురం– బొబ్బర్లంక ఆర్అండ్బీ రహదారి ఉండటం వల్ల భారీ వాహనాలతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ లాకులను పునర్నిర్మించడం వల్ల కోనసీమ ప్రాంత రైతులకు సాగునీరు సజావుగా అందుతుంది. – ముదునూరి రామకృష్ణంరాజు, వైఎస్సార్ సీపీ రైతు నాయకుడు ఆత్రేయపురం: కాటన్ మహాశయుని ఆశల సౌథం ధవళేశ్వరం బ్యారేజీ. ఇక్కడి నుంచే మూడు డెల్టా కాలువల ద్వారా పంట పొలాలకు సాగునీరు చేరుతోంది. ఇందులో మధ్య డెల్టా కాలువ ప్రధానమైంది. బొబ్బర్లంక వద్ద కాటన్ బ్యారేజీ నుంచి వచ్చే నీరు ఈ డెల్టా కాలువ ద్వారా ఆత్రేయపురం మండలంలోని లొల్ల లాకుల మీదుగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పంట పొలాలకు చేరుతోంది. ఇంతటి ప్రధానమైన లొల్ల లాకులు శిథిలస్థితికి చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. మధ్య డెల్టా ప్రధాన కాలువ ద్వారా 2.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు, ఆయా గ్రామాల ప్రజలకు సాగు, తాగునీరు అందుతోంది. లొల్ల లాకులు శిథిలస్థితికి చేరడంతో నీటి పారుదలకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. లొల్ల లాకుల వద్ద మధ్య డెల్టా ప్రధాన కాలువ మూడు కెనాల్స్గా కోనసీమ జిల్లా అంతటికి ప్రధానంగా రాజోలు దీవికి సైతం సాగు, తాగునీరు అందిస్తోంది. లొల్ల లాకుల వద్ద అమలాపురం, గన్నవరం, ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్స్గా విడిపోతాయి. ఈ లాకుల వద్ద ఎటువంటి ప్రమాదం జరిగినా భవిష్యత్తు ఊహించరానిది. రాకపోకలకూ ఆధారమే.. బొబ్బర్లంక ఆర్అండ్బీ రోడ్డుపై ప్రయాణించే అన్ని వాహనాలు లొల్ల లాకుల పైనుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ సరైన రక్షణ చర్యలు లేక లాకుల పైనుంచి కాలువలోకి వాహనాలు దూసుకుపోతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ ఇరుకుగా ఉండడంతో లారీలు వంటి భారీ వాహనాలు మలుపు తిరిగే సమయంలో ఇబ్బంది ఏర్పడుతోంది. ఈ రోడ్డు కోనసీమ తిరుమల వాడపల్లి ఆలయానికి వచ్చే పోయే వాహనాల రద్దీతో నిత్యం రద్దీగా ఉంటోంది. శనివారం అయితే ఇక చెప్పనవసరం లేదు. పైగా ఆత్రేయపురం మండలంలో ఇసుక ర్యాంపులు ఉండడంతో భారీ వాహనాలపై నిరంతరం ఇసుక తరలింపు జరుగుతోంది. ఈ లాకుల మీదుగానే వాహనాలు వెళ్తుండడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. అప్పట్లో సంకల్పించి.. ఇప్పుడు వదిలేసి.. లొల్ల లాకులు శిథిలం కావడంతో రాజోలు దీవికి సాగునీరు సక్రమంగా అందడం లేదు. కాగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి ప్రభుత్వ విప్గా చిర్ల జగ్గిరెడ్డి లొల్ల లాకుల రక్షణకు, ప్రత్యేకంగా అమలాపురం– బొబ్బర్లంక రోడ్డు ప్రయాణానికి అనువుగా ఒక వంతెన నిర్మించాలని భావించారు. అందుకు ప్రతిపాదనలు సైతం పంపి ఆమోదం చేయించారు. కానీ నిర్మాణ పనులు చేపట్టే లోపు ప్రభుత్వం మారడంతో ఆ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతున్నా కనీసం ఈ సమస్యను పట్టించుకోకపోవడం శోచనీయం. ఇప్పటికై నా లొల్ల లాకులను పునర్నినిర్మించాలని రైతులు ముక్తకంఠంతో కోరుతున్నారు. లొల్ల లాకులపై ప్రధాన ఆర్అండ్బీ రోడ్డుశిథిలస్థితిలో ఉన్న లొల్ల లాకులుఅనుమతులు రాగానే పనులు కాటన్ మహాశయుని నిర్మాణ ప్రతిభకు లొల్ల లాకులు అద్దం పడతాయి. 1883లో నిర్మించిన ఈ లాకుల ద్వారా నిర్దేశించిన ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నాం. ఈ లాకులను పునర్నిర్మించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రధానంగా మూడు లాకుల్లో ఒకటైన లొల్ల లాకులు, ముక్తేశ్వరం బ్యాంకు కాలువపై ఉన్న లాకులు పూర్తిగా శిథిలమయ్యాయి. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పనులు చేపడతాం. – ఈవు సూర్యచంద్ర వరప్రసాదరావు, ఏఈ, గోపాలపురం హెడ్వర్క్స్ జల వనరులకు నడక నేర్పిన కట్టడం అది.. పచ్చని సిరులు పండించేందుకు కీలక భూమిక అది.. ఇక్కడి అందాలు ఎన్నో చిత్రాల్లో ప్రత్యేక ఆకర్షణగా మారింది.. అలాంటి కట్టడం శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతోంది.. కూటమి పాలకుల నిర్లక్ష్యానికి చిక్కిశల్యమవుతోంది. ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల పరిస్థితి ఇది. ఎన్నోఏళ్ల చరిత్ర ఉన్న ఈ అపురూప కట్టడం పరిస్థితిని చూసొద్దాం రండి.. ఫ శిథిలస్థితిలో లొల్ల లాకులు ఫ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి కానరాని చర్యలు ఫ ప్రమాదం జరిగితే బాధ్యులెవరు! -
ఉరి వేసుకుని బాలిక ఆత్మహత్య
నిడదవోలు: ఓ బాలిక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం వెలుగుచూసింది. పట్టణ ఎస్సై జగన్మోహన్రావు కథనం ప్రకారం.. తణుకు మండలం వీరభద్రపురం గ్రామానికి చెందిన ఆకుల ప్రసాద్బాబు, శాంత దంపతులకు గొడవల కారణంగా విడిపోయారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వీరిద్దరూ తల్లితో కలసి నిడదవోలు రాయిపేటలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. తణుకులో పెద కుమార్తె ఆకుల నిర్మల పదో తరగతి, రెండో కుమార్తె ఆకుల ఐశ్వర్య (13) తొమ్మిదో తరగతి చదువుతున్నారు. తణుకులో ఎస్సీ హాస్టల్లో ఉంటూ స్కూల్కి వెళ్తున్నారు. అయితే ఈ నెల 7న ఐశ్వర్య జన్మదినం సందర్భంగా నిడదవోలులో ఇంటికి వచ్చింది. తండ్రి ప్రసాద్బాబు చిన కుమార్తె ఐశ్వర్య బర్త్ డే సెలబ్రేషన్కు రూ. 8 వేలు పంపించారు. దీంతో ఐశ్వర్య కుటుంబ సభ్యులతో కలసి ఎంతో ఆనందంగా పుట్టిన రోజును జరుపుకొంది. ఇంతలో ఏం జరిగిందో తెలియదు కానీ, 8న మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ సమయంలో ఐశ్వర్య ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్యహత్య చేసుకుంది. తల్లి శాంత, కుటుంబ సభ్యులు కలసి ఐశ్వర్య మృతదేహాన్ని తమ సొంతూరు వీరభద్రపురానికి తీసుకువెళ్లారు. చిన కుమార్తె మృతి చెందిన సమాచారం తెలుసుకున్న తండ్రి ప్రసాద్బాబు నిడదవోలు వచ్చి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్సై జగన్మోహన్రావు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి తణుకు వెళ్లి విచారణ చేపట్టారు. -
ధాన్యం రైతు దైన్యం
● గత ఖరీఫ్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు ● నేటికీ అందని రవాణా, హమాలీ చార్జీలు ● సుమారు రూ.13 కోట్లకు పైగా బకాయిలు ● మూడు మాసాలైనా అందని నగదు ● కీలక దశలో రబీ పంటల సాగు ● పెట్టుబడులకు తప్పని ఆర్థిక కష్టాలు సాక్షి, రాజమహేంద్రవరం: ఖరీఫ్ రైతులకు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. భారీ వర్షాలు, వరదలు, ప్రకృతి విపత్తులకు అతలాకుతలం అయిన కర్షకులు నేటికీ కోలుకోలేక పోతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో భారీ ఈదురుగాలులు, వర్షాలు కురవడం, వరదల్లో పంట నీట మునగడంతో ధాన్యం పాడైపోయి తీవ్రంగా నష్టపోయారు. నీట మునగగా.. మిగిలిన ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించారు. ధాన్యం కొనుగోళ్లలోనూ ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం బిల్లులు సైతం ఆలస్యంగానే విడుదల చేసింది. తాజాగా మరో అవస్థ తప్పడం లేదు. ఖరీఫ్లో ధాన్యం విక్రయించిన రైతులకు ధాన్యం రవాణా, హమాలీ చార్జీలు, సంచుల బిల్లులు నేటికీ పెండింగ్లోనే ఉన్నాయి. సేకరణ ముగిసి మూడు మాసాలు దాటుతున్నా.. నేటికీ డబ్బు విడుదల చేయకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం రబీ సాగు కీలక దశలో ఉంది. మంచి దిగుబడులు సాధించాలంటే పురుగుమందులు, ఎరువులకు పెట్టుబడి పెట్టాల్సి ఉంది. కానీ చేతిలో సొమ్ము లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తాము ఖర్చు చేసిన రవాణా, హమాలీ చార్జీలైనా అందితే ఆర్థిక ఇబ్బందులు తీరుతాయని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే ఇప్పట్లో విడుదలయ్యే సూచనలు కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖరీఫ్లో వరుస తుపాన్లు, వరదల నుంచి పంటను రక్షించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడ్డారు. జిల్లాలో వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వాతావరణ పరిస్థితులను అధిగమించి మార్కెట్కు తరలించిన పంటకు రావాణా, హమాలీ చార్జీలు చెల్లించకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇలా... ధాన్యం కొనుగోళ్లలో చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరవైంది. కోతలు ప్రారంభించిన వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించకుండా ఆలస్యం చేయడంతో రైతులు తక్కువ ధరకు దళారులకు అమ్ముకుని నష్టపోయారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 79,966 హెక్టార్లలో వరి సాగు చేపట్టారు. సుమారు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందుకుగాను 212 ప్రభుత్వ ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ–పంట నమోదు చేసుకున్న రైతుల నుంచి కొనుగోలు చేస్తామని ప్రకటించారు. గ్రేడ్–ఏ రకం ధాన్యం క్వింటాకు రూ.2,389, సాధారణ రకానికి రూ.2,369గా ధర నిర్ణయించారు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించారు. ధాన్యం కేంద్రాల వారీగా టార్గెట్ పూర్తయిందంటూ చేతులెత్తేశారు. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తీసుకొచ్చి ఇక్కడ కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపించేశారు. వెరసి జిల్లాలో 1.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తక్కువ ధరకు బహిరంగ విపణిలో విక్రయించుకోవాల్సి వచ్చింది. రూ.13 కోట్లకు పైగా పెండింగ్ జిల్లా వ్యాప్తంగా గత ఖరీఫ్ సీజన్లో వరి రైతులకు చెల్లించాల్సిన రవాణా, హమాలీ చార్జీలకు ఇప్పటికీ దిక్కు లేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మూడు నెలల కావస్తున్నా నగదు కోసం నిరీక్షణ తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.13 కోట్లకు పైగా అందాల్సి ఉంది. హమాలీ చార్జీలు రూ.6.50 కోట్లు, ట్రాన్స్పోర్ట్ చార్జీలు రూ.6 కోట్లు, సంచులకు రూ.1.35 కోట్లు విడుదల కావాల్సి ఉంది. క్వింటా ధాన్యానికి హమాలీ చార్జీగా రూ.24, రవాణా చార్జీల నిమిత్తం టన్నుకు రూ.324 చెల్లించాల్సి ఉంది. కానీ వాస్తవంగా ప్రభుత్వం చెల్లించే చార్జీల కన్నా రెట్టింపు స్థాయిలో రైతులకు ఖర్చవుతుంది. వాస్తవ ఖర్చులను పరిగణలోకి తీసుకుని రావాణా, హమాలీ చార్జీలను పెంచాలని రైతులు కోరుతున్నారు. క్షేత్ర స్థాయిలో ఒక క్వింటా ధాన్యాన్ని కూలీలతో పట్టుబట్టించి మిల్లుకు పంపేందుకు రూ.100 వరకు ఖర్చవుతుంటే.. రైతుకు అందుతున్నది రూ.56 మాత్రమే. పెరిగిన ఖర్చుల దృష్ట్యా వీటిని పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రబీ వరి పంట కీలక దశలో ఉండటంతో ఈ సమయంలో ఆ బకాయిలు అందితే పెట్టుబడికి కొంతమేర ఉపయోగంగా ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు. చెల్లింపుల్లో జాప్యంతో రబీ కోసం అప్పులు తెచ్చి పెట్టుబడి పెడుతున్నారు. ప్రభుత్వం స్పందించాలి రైతులకు అందాల్సిన రవాణా, హమాలీ చార్జీలు చెల్లిస్తే రబీసాగుకు పెట్టుబడి సాయంగా ఉంటుంది. మూడు నెలలు గడుస్తున్నా చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వాస్తవ ఖర్చులు పరిగణనలోకి తీసుకుని చార్జీలను పెంచాలి. – పరిమి సోమరాజు, వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి -
కొత్త కోవెలకు.. నవ వసంతం
● సత్యదేవుని నూతన ఆలయానికి 14 ఏళ్లు పూర్తి ● 2011లో నిర్మాణం ప్రారంభం ● 2012 మార్చి 14న కలశ స్థాపన అన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుని నూతనాలయం నేడు నవవసంతంలోకి అడుగు పెడుతోంది. రత్నగిరిపై ఆలయ పునర్నిర్మాణం జరిగి ఫాల్గుణ బహుళ సప్తమి అనగా మంగళవారం నాటికి 14 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. నూతన ఆలయం 15వ వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. గత 15 సంవత్సరాల్లో దేవస్థానంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఏటా భక్తుల సంఖ్యతో పాటు, స్వామివారి ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోంది. 135 సంవత్సరాల చరిత్ర రత్నగిరిపై సత్యదేవుడు 1891లో ఖర నామ సంవత్సరం, శ్రావణ శుద్ధ విదియ నాడు ఆవిర్భవించారు. నాడు అన్నవరం ఓ కుగ్రామం. ఆలయ చరిత్ర ప్రకారం అప్పట్లో రత్నగిరిపై దట్టమైన అడవి ఉండేది. రకరకాల వన్యప్రాణులు ఇక్కడ సంచరించేవి. 1891లో శ్రావణ శుద్ధ విదియ ముందు రోజు రాత్రి అప్పటి గోర్స ఎస్టేట్ జమీందార్ రాజా ఇనుగంటి వేంకట రామారాయణం కలలో సత్యదేవుడు ప్రత్యక్షమై, తాను అన్నవరంలో రత్నగిరిపై వెలిశానని, తనకు ఆలయం కట్టించాలని చెప్పారట. దీంతో, ఆయన అన్నవరం చేరుకుని ఈ విషయం చెప్పారు. ఆ సందర్భంగా అన్నవరానికి చెందిన ప్రముఖుడు ఈరంకి ప్రకాశరావు తనకు కూడా ఇదే రకమైన కల వచ్చిందని చెప్పారట. దీంతో, మరి కొంత మంది గ్రామస్తులతో కలసి వారిద్దరూ వెతకగా.. గ్రామ దేవత నేరేళ్లమ్మ తల్లి ఆలయం పక్కన ఉన్న కొండ మీద అంకుడు చెట్టు కింద సత్యదేవుని విగ్రహం కనిపించిందని చెబుతారు. తొలుత చిన్న పందిరి నిర్మించి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తరువాత చిన్న ఆలయం, మరి కొన్నాళ్లకు రెండంతస్తుల్లో పెద్ద ఆలయాన్ని నిర్మించి, దిగువ అంతస్తులో శ్రీమత్త్రిపాద్విభూతి మహావైకుంఠ నారాయణ యంత్రాన్ని విష్ణు పంచాయతనంతో ప్రతిష్ఠించారు. ఆ ఆలయంలో మధ్యన వీర వేంకట సత్యనారాయణమూర్తి, ఎడమవైపు అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు, కుడివైపున లింగాకారంలో పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చారు. నూతన ఆలయ నిర్మాణం ఇలా.. సత్యదేవుని పాత ఆలయం శిథిలావస్థకు చేరడంతో కొత్త కోవెల నిర్మించాలని నిపుణులు సూచించారు. ఈ మేరకు 2011లో అప్పటి ఈఓ, ప్రస్తుత దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ప్రణాళిక రూపొందించారు. పాత ఆలయం తొలగించే క్రమంలో మూలవిరాట్లను తొలగించకుండా, ఆ మూర్తులపై టేకు చెక్కతో తయారు చేసిన పెద్ద పెట్టెను ఉంచి, దానిపై ఇనుప గడ్డర్లతో రక్షణ ఏర్పాటు చేశారు. అయితే, పాత ఆలయాన్ని తొలగించడానికి వీలు లేదని కొంత మంది హైకోర్టును, ఆ తరువాత సుప్రీంకోర్టును ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది. సుమారు నెల రోజుల వ్యవధిలో పాత ఆలయాన్ని తొలగించారు. నూతన ఆలయ నిర్మాణం సుమారు ఏడాది పాటు కొనసాగింది. తమిళనాడులోని నమ్మక్కల్ గ్రానైట్ క్వారీల నుంచి సేకరించిన శిలలతో పాత ఆలయం మాదిరిగానే రెండంతస్తుల్లో నూతనాలయం నిర్మించారు. ఈ నిర్మాణం జరిగినన్ని రోజులూ సత్యదేవుడు, అమ్మవారు, శంకరుల ఉత్సవమూర్తులను ధ్వజస్తంభం వద్ద బాలాలయంలో ఉంచి పూజలు నిర్వహించారు. కంచి పీఠాధిపతి చేతుల మీదుగా.. నాటి కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు జయేంద్ర సరస్వతి స్వామి చేతుల మీదుగా 2012 మార్చి 14న ఆలయ శిఖరంపై కలశ స్థాపన శాస్త్రోక్తంగా నిర్వహించి, కొత్త కోవెలను ప్రారంభించారు. అప్పటి నుంచీ తిథుల ప్రకారం ఫాల్గుణ బహుళ సప్తమి నాడు నూతన ఆలయ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. నూతన ఆలయం నవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మంగళవారం తెల్లవారుజామున సత్యదేవుడు, అమ్మవారు, పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు స్వామివారికి లక్ష పత్రి పూజ, ప్రత్యేక నివేదనలు నిర్వహిస్తారు. నూతనాలయ నిర్మాణానికి పని చేసిన వైదిక సిబ్బందిని ఈఓ వి.త్రినాథరావు సత్కరిస్తారు. పునర్నిర్మాణ సమాచారం తెలిసేదెలా? సత్యదేవుని ఆలయ పునర్నిర్మాణం సందర్భంగా యంత్రాలయ గోడలపై శిలాశాసనం చెక్కించారు. అందులో నూతనాలయ నిర్మాణ విశేషాలను వివరించారు. అయితే, ఇది భక్తులకు కనిపించే అవకాశం ఉండటం లేదు. ఈ సమాచారంతో తూర్పు రాజగోపురం వద్ద ఫ్లెక్సీ లేదా పెయింటింగ్ ఏర్పాటు చేస్తే అందరూ తిలకించే అవకాశం ఉంటుంది. స్వర్ణ ధ్వజస్తంభం ఇదిలా ఉండగా ఓ దాత సహకారంతో 2024 మే నెలలో సత్యదేవుని ఆలయంలో నూతన ధ్వజస్తంభం కూడా ఏర్పాటు చేశారు. దీనికి అదే సంవత్సరం ఆగస్టులో బంగారు కవచం ఏర్పాటు చేశారు. ఈ బంగారు ధ్వజస్తంభం భక్తులను ఎంతో ఆకట్టుకుంటోంది. -
282 అర్జీల స్వీకరణ
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో 282 అర్జీలు స్వీకరించినట్టు డీఆర్ఓ సీతారామమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అర్జీలు స్వీకరించడం, ఆన్లైన్ విధానాన్ని ఎక్కువగా వినియోగించుకోవడంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ముఖ్యం అన్నారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 45 ఫిర్యాదులు కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 45 ఫిర్యాదులు అందాయి. ఎస్పీ డి.నరసింహాకిశోర్ ఆదేశాల మేరకు నిర్వహించిన పీజీఆర్ఎస్లో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుంచి వివిధ రకాల అర్జీలను స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకుని, సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాది దారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయవలసిందిగా ఉత్తర్వులు ఇచ్చారు. కుటుంబ సమస్యలు, సివిల్, ఛీటింగ్, కొట్లాట కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు. సెంట్రల్ జైలును సందర్శించిన డీఎల్ఎస్ఏ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మీ సోమవారం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు. అక్కడ ఖైదీలకు అందుతున్న ఆహార ప్రమాణాలు, సౌకర్యాలను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడారు. ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా, బెయిల్ పిటిషన్లపై కోర్టులో అప్పీలు వేయాలన్నా ఉచితంగా సేవలు పొందవచ్చని వారికి తెలిపారు. దీనికోసం పారాలీగల్ వలంటీర్ల ద్వారా అర్జీలను అందించాలన్నారు. ముద్దాయిలు, ఖైదీలు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సేవలను వినియోగించుకోవాలన్నారు. సస్పెన్షన్.. సరెండర్.. ‘నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం’పై చర్యలు కాకినాడ క్రైం: రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్లపై వేటు పడింది. సీనియర్ అసిస్టెంట్ ఏకే అమర్కాంత్ నకిలీ పత్రాలతో పూల హేమలత అనే మహిళకు జూనియర్ అసిస్టెంట్గా ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం వేయించిన ఉదంతం వివాదాస్పదమైంది. ఈ విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీనిపై అధికారులు స్పందించారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు అమర్కాంత్ను సరెండర్ చేస్తూ రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కేవీ శివప్రసాద్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. హేమలతపై సస్పెన్షన్ వేటు వేసి, చట్టపరమైన చర్యలు చేపట్టబోతున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. అమర్కాంత్ నిర్వాకాన్ని ఆర్డీ పద్మా శశిధర్కు లిఖితపూర్వకంగా సమర్పించిన ప్రిన్సిపాల్, ఆయనను సరెండర్ చేస్తున్నట్లు నిర్ధారించారు. మోసపూరిత కార్యకలాపాల నేపథ్యంలో తీవ్రత ఆధారంగా కఠిన చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు. దీనిపై ఆర్డీ ఏవిధంగా స్పందిస్తారనే చర్చ సాగుతోంది. 28 నుంచి వాడపల్లి వెంకన్న కల్యాణోత్సవాలు ఆత్రేయపురం : కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాలు ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు వైభవంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ, అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సోమవారం ఆలయ ఆవరణలో జరిగిన సామూహిక అష్టోత్తర పూజలలో పెద్ద సంఖ్యలో దంపతులు, మహిళలు భక్తులు పాల్గొన్నారు. ఆలయానికి హుండీలు, కానుకల రూపంలో రూ.4,10,091 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. -
కొండల్లో చెలమల పరిశీలన
గంగవరం: కొండలు, అటవీ ప్రాంతాల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన చెలమల (స్ప్రింగ్ షెడ్ల)ను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా సౌత్ ఇండియాలో పలు ప్రాంతాలకు మహారాష్ట్ర, పుణే బేస్లో ఆక్వాడాం ఎన్జీలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు కునాల్ సారథ్ ఉపాసనీ సారథ్యంలో శాస్త్రవేత్తలు కుమారి రాజేశ్వరి, సుహాస్ బోస్లే బృందం గంగవరం మండలంలో సోమవారం పర్యటించింది. ఇక్కడి కొండ చెలమలను వారికి ఉపాధి పథకం ఏపీఓ ప్రకాష్ చూపించారు. ఎండపల్లి పంచాయతీ చిన్న అడ్డపల్లి గ్రామంలో బట్టకొండ వాదనలోద్ది ప్రాంతంలోని చెలమలను ఆ బృంద సభ్యులు పరిశీలించారు. అవి ఎక్కడ పుట్టాయి, ఎక్కడకు చేరుకుంటాయనేది అధ్యాయనం చేశారు. అనంతరం వెదుళ్లకొండ వాగు ప్రాంతంలో మరో చెలమను వారు పరిశీలించారు. వీటిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని ఆయన అన్నారు. వీరి వెంట ఉపాధి హామీ అదనపు ప్రోగ్రాం అధికారి ఎంకేఎస్ ప్రకాష్, జూనియర్ ఇంజినీర్ టి.పద్మనాభం, టీఏలు సీహెచ్ రాధాకృష్ణ , కోసూరి సీతాదేవి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆగకుండా.. దొరక్కుండా..
ఫ అధికారులను పరుగులు పెట్టిస్తున్న పెద్ద పులి ఫ హడలెత్తిస్తున్న గిరిజన ప్రజలు రాజవొమ్మంగి/ అడ్డతీగల: అధికారులను పెద్ద పులి ఉరుకులు, పరుగులు పెట్టిస్తోంది. చివరికి ఎవరికీ చిక్కకుండా తిరుగుతోంది. దేవీపట్నం మండలం దేవారంలో 15 రోజుల కిందట ప్రవేశించిన పెద్ద పులి అక్కడి నుంచి అన్ని మండలాల్లో సంచరిస్తూ అందరికీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పులి వరుసగా రంపచోడవరం మండలం పెద్దకొండ, కొమరవరం, గంగవరం మండలం పిడతమామిడి, గోకవరం మండలం ముల్లేరుమల్లారం, ఏలేశ్వరం మండలం పరింతడక గ్రామ సమీపాల్లో సంచరించింది. అక్కడి నుంచి పులి నెమ్మదిగా సోమవారం రాజవొమ్మంగి అటవీక్షేత్ర పరిధిలోని కొత్తూరు, వీరభద్రపురం, బోర్నగూడెం, మర్రిపాలెం గ్రామాల్లోకి ప్రవేశించిందని అధికారులు చెబుతున్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే అడ్డతీగల సబ్ డీఎఫ్ఓ సుబ్బారెడ్డి తమ సిబ్బందితో బోర్నగూడెం పరిసర ప్రాంతాల్లో కాపు కాశారు. ఈ నేపథ్యంలో బోర్నగూడెం, సంజీవనగరం, చెరకుంపాలెం పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశువులను అడవుల్లోకి మేతకు పంపించవద్దని, ప్రజలెవరూ లోతట్టు అటవీ ప్రాంతానికి వెళ్లవద్దని దండోరా వేయించారు. ఇదిలా ఉండగా శ్రీశైలం టైగర్ ప్రాజెక్టుకు చెందిన శిక్షణ పొందిన 50 మందికి పైగా అధికారులు ఈ ప్రాంతంలో పులి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చేపట్టారు. పులిని బంధించేందుకు అవసరమైన బోన్లను సిద్ధంగా ఉంచారు. పులి ఆచూకీ కోసం ఆధునిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం అధికారుల వద్ద ఉన్న వీఎఫ్ఎక్స్ అనే పరికరం ద్వారా పులి మెడలో గల హైఫ్రీక్వెన్సీ రేడియో కాలర్ను (ధర్మల్ డ్రోన్ సిస్టం) ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు. కాగా బోర్నగూడెం వద్ద కాసేపు వీహెచ్ఎఫ్లో సిగ్నల్ కనిపించినప్పటికీ తిరిగి సిగ్నల్స్ కట్ అయ్యిందని ఫారెస్టు అధికారులు తెలిపారు. ఆ తరువాత దాదాపు ఐదు కిలోమీటర్ల రేడియస్లో పులి ఆనవాళ్లు కనిపించ లేదు. కాగా చీకటి పడే వేళకు మండలంలోని మర్రిపాలెం వైపు పులి వెళ్లిందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆ గ్రామాల వైపు యంత్రాంగం కదిలింది. మండలంలోని గడుఓకుర్తి పంచాయతీ, గొబ్బిలమడుగు అడవుల్లోకి వెళ్లే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. స్థానిక రేంజ్ ఆఫీసర్ ఉషారాణి ఎఫ్ఎస్ఓలు, ఎఫ్బీఓలు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే రాత్రి సమయంలో రాజవొమ్మంగి మండలం సంజీవనగరం వద్ద రోడ్డును దాటి వెళ్లినట్లు ప్రజలు చెబుతున్నారు. -
రాత్రిళ్లు గాండ్రిస్తూ..
ఫ ముప్పుతిప్పలు పెడుతున్న పెద్ద పులి ఫ డి.కృష్ణవరం సమీపానే మకాం ఫ పాదముద్రల ఆధారంగా నిర్ధారణ అడ్డతీగల: పులి తన ఉనికిని చాటుతోంది.. రాత్రిళ్లు మూగజీవాలపై విరుచుకుపడుతోంది.. అటవీ సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతోంది. దాని సంచారంతో ఏలేరు పరీవాహక ప్రాంత ప్రజలకు కంటి మీద కునుకు ఉండడం లేదు. అటవీ ప్రాంతానికి చేరువలోనే ఏలేరు వాగు, జలాశయం ఉండడం పులి సంచారానికి అనువుగా ఉందని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి అడ్డతీగల మండలం డి.కృష్ణవరంలో ఆవు, దూడను పులి హతమార్చింది. శనివారం అర్ధరాత్రి వచ్చిన పులి దూడ మాంసాన్ని కొద్ది దూరం తీసుకువెళ్లి ఒక కాలిని తిని, మిగతా భాగాన్ని అలాగే వదిలేసింది. అటవీ అధికారులు ఆదివారం ఉదయాన్నే దూడను తీసుకుపోయిన ప్రాంతంలో గాలించి పులి పాదముద్రలను గుర్తించారు. రాజమహేంద్రవరం గత సీఎఫ్ బీఎన్ఎన్ మూర్తి, ప్రస్తుత సీఎఫ్ శ్రీకంఠనాథరెడ్డి, కాకినాడ డీఎఫ్ఓ రామచంద్రరావు, రంపచోడవరం డీఎఫ్ఓ శివకుమార్ గంగల్, అడ్డతీగల సబ్ డీఎఫ్ఓ సుబ్బారెడ్డి నాగార్జునాసాగర్, శ్రీశైలం ప్రాంతాల నుంచి వచ్చిన రెస్క్యూ టీంతో కలసి ఆయా రేంజ్ల అధికారులు తిమ్మాపురం పరిసర ప్రాంతాల్లో మకాం వేసిన పులి పట్టివేతకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా డి.కృష్ణవరం సమీపాన తిష్టవేసిన పెద్ద పులిని బంధించడానికి అధికారులు మూడు బోన్లను ఏర్పాటు చేశారు. ఆయా బోన్లలో రెస్క్యూ టీంకు చెందిన షూటర్లు ఆదివారం ఒక్కో బోనులో ఒక్కొక్కరు చొప్పున కాపు కాసి ఉన్నారు. అయితే పులి అధికారులు భావించినట్లు కాకుండా మరో దారి నుంచి వచ్చి తిమ్మాపురం – బొంగరాలపాడు మధ్య ఏలేరు వాగును దాటుకుని వీరభద్రపురం రక్షిత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయినట్లు అటవీ అధికారులు తేల్చారు. -
బార్కాస్ అరేబియన్ రెస్టారెంట్పై ఐటీ దాడులు
రాజమహేంద్రవరం సిటీ: హోటల్ వ్యాపార లావాదేవీల్లో డిజిటల్ పేమెంట్స్ రికార్డుల్లో నమోదు చేయడం లేదనే ఆరోపణల నేపథ్యంలో స్థానిక ప్రకాశం నగర్లోని బార్కాస్ అరేబియన్ కిచెన్ రెస్టారెంట్పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆదివారం ఆకస్మికంగా దాడులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ రెస్టారెంట్లపై చేపట్టిన ఆకస్మిక దాడుల్లో భాగంగా ఈ తనిఖీలు చేశారు. దేశవ్యాప్తంగా సుమారు రూ.70 వేల కోట్ల డిజిటల్ పేమెంట్లను ఆదాయంగా చూపకపోవడంతో ఈ దాడులు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ రెస్టారెంట్లో జరిగిన వ్యాపారానికి పన్ను ఎగ్గొట్టినట్లు సమాచారం రావడంతో డిజిటల్ రికార్డులను అధికారులు సేకరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, నెల్లూరు తదితర ప్రాంతాల్లోని ప్రముఖ రెస్టారెంట్లలో ఐటీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. నేడు యథావిధిగా పీజీఆర్ఎస్సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో నేడు యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)తో పాటు, రెవిన్యూ కినిక్ నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ కీర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేశారు. అర్జీదారులు అర్జీల నమోదు, నమోదైన అర్జీల స్థితి తదితర వివరాల కోసం 1100కు నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు. వాట్సప్ నెంబర్ 95523 00009 ద్వారా పౌర సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.ఆయా ప్రాంతాల్లో ఆర్డీవోలు, తహసీల్దార్లు తమ ప్రధాన కార్యాలయాల నుంచి హాజరై ప్రజల అర్జీలను స్వీకరించి పరిష్కార చర్యలు చేపడతారని వెల్లడించారు. -
ఈపీడీసీఎల్ స్టోర్లో భారీ అగ్ని ప్రమాదం
● కాలిపోయిన స్క్రాప్ మీటర్లు ● సిబ్బంది, స్థానికుల సహాయంతో మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరు ఏపీ ఈపీడీసీఎల్ జిల్లా స్టోర్ ఆవరణలో ఆదివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మీటర్ల స్క్రాప్ అగ్నికి ఆహుతైంది. సిబ్బంది, స్థానికులు స్పందించడంతో పాటు, సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేయడంతో భారీ ప్రమాదం తప్పింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యుత్ సబ్స్టేషన్లకు అవసరమైన సామగ్రి ఈ కేంద్రంలో నిల్వచేస్తారు. జిల్లా వ్యాప్తంగా స్టోర్ పరిధిలో తొలగించిన విద్యుత్ మీటర్ల స్క్రాప్ నుంచి ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు వ్యాపించి దట్టమైన పొగలు అలముకున్నాయి. సిబ్బందితో పాటు స్థానిక సమాచారం అందుకుని వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు కృషి చేసినా ఫలించకపోవడంతో స్థానికంగా ఉన్న రెండు శకటాలతో పాటు అనపర్తి, కొవ్వూరు, జేగురుపాడు జీవీకే, ఓఎన్జీసీ రెండు అగ్నిమాపక వాహనాలతో రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. కాగా ఈ ప్రమాదంలో కుప్పగా పోసిన స్క్రాప్ మీటర్లలో సగానికి పైగా కాలిపోగా మిగిలిన వాటిని పొక్లెయిన్తో పక్కకు తొలగించారు. వీటికీ మంటలు వ్యాపించి ఉంటే పక్కనే ఉన్న మంచి మీటర్ల గొడౌన్కు నిప్పు అంటుకుని రూ.కోట్లలో నష్టం జరిగేదని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయం తెలియగానే ఎస్ఈ తిలక్కుమార్, ఈఈ నక్కపల్లి శామ్యూల్, రాష్ట్ర దేవాంగ కార్పొరేషన్ డైరెక్టర్ మత్సేటిప్రసాద్, బొమ్మూరు ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఎస్ఈ తిలక్కుమార్ మాట్లాడుతూ సిబ్బంది స్థానికుల సహకారంతో మంటలను అదుపుచేయగలిగామన్నారు. ఓవర్ లోడ్ వలనే... ట్రాన్స్ ఫార్మర్ ఓవర్లోడ్ వల్ల మంటలు వ్యాపించి కింద ఉన్న తుక్కు అంటుకోవడం వల్ల మంటలు వ్యాపించాయని జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి పి.శ్రీనివాస్ తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురై ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పడంలో సహకరించి అధికారుల మన్ననలు అందుకున్నారు. -
బండబాదుడు
● సామాన్యులపై సిలిండర్ ధరాభారం ● రూ.60 పెంచుతూ కేంద్రం నిర్ణయం ● వాణిజ్య కనెక్షన్పై రూ.114 పెంపు ● 11 నెలల్లో రెండోసారి.. ● ఇప్పటికే నిత్యావసర ధరల సెగ ● తాజా పెంపుతో సర్వత్రా అసహనం ● ప్రజలపై నెలకు రూ.2.34 కోట్ల భారం సాక్షి, రాజమహేంద్రవరం: నిత్యావసర ధరలు, విద్యుత్ చార్జీల పెంపుతో ఇప్పటికే సతమతమవుతున్న ప్రజలపై ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ భారం మోపింది. గృహ అవసరాలకు వినియోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.60 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధర శుక్రవారం రాత్రి నుంచి అమల్లోకి వచ్చినట్టు కంపెనీలు ప్రకటించాయి. ఈ పెంపుతో ప్రస్తుతం రూ.879.50 ఉన్న ధర రూ.939కి చేరింది. ఇది కేవలం సాధారణ వినియోగదారులకే కాకుండా ఉజ్వల పథకం లబ్ధిదారులకు సైతం వర్తింపజేశారు. ఈ పరిణామం సాధారణ, మధ్య తరగతి కుటుంబాల్లో ఆందోళన నింపుతోంది. రూ.1,949గా ఉన్న కమర్షియల్ సిలిండర్ ధర రూ.114 పెరిగి రూ.2,063కు చేరింది. ఇప్పటికే నిత్యావసర ధరలు, విద్యుత్ చార్జీల బాదుడు సాగుతుండగా తాజాగా గ్యాస్ ధర పెంపును సామాన్య ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రోజుకు రూ.7.80 లక్షల భారం జిల్లాలో మొత్తం గ్యాస్ కనెక్షన్లు సుమారు 6,24,265. ఇందులో సాధారణ కనెక్షన్లు 2,25,394, దీపం 1,65,012, సీఎస్ఆర్ 7,229, ఉజ్వల 6,553, 5 కేజీల సిలిండర్ 2,141, కమర్షియల్ 3,405, డబుల్ కనెక్షన్లు 2,14,531 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 3 ప్రధాన కంపెనీలు, 43 ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా చేస్తున్నాయి. గృహ వినియోగదారులకు నిత్యం సుమారు 13 వేల వరకు సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. తాజా పెంపుతో రోజుకు రూ.7.8 లక్షల వరకు వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. నెలకు రూ.2.34 కోట్ల వరకు భారం పడుతోంది. కమర్షియల్ సిలిండర్లపై నెలకు మరో రూ.3,88,170 అదనపు భారం పడుతోంది. ఉజ్వలకూ వర్తింపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాలకు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ఉజ్వల పథకం ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్, స్టౌ మంజూరు చేసింది. అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద జిల్లాలో 41,055 గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు. ప్రస్తుత పెంపు వారికి సైతం వర్తింప చేశారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల లోపు ఉన్న కుటుంబాలకు మంజూరు చేసిన పథకాన్ని సైతం పెంపులో భాగస్వామ్యం చేయడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. సామాన్య, మధ్యతరగతి ప్రజల ఆందోళన ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ యుద్ధంతో నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొనడంతో వంటగ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. కందిపప్పు, మినప్పప్పు, వంట నూనె తదితర ధరలు పెరిగి సామాన్యుడు కొనలేని పరిస్థితి తలెత్తింది. ఇలాంటి తరుణంలో గ్యాస్ రూ.60కి పెరగడంతో మరిన్ని ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నలుగురున్న ఒక మధ్య తరగతి కుటుంబానికి ఒక సిలిండర్ రెండు నెలలు వరకు వినియోగించుకోవచ్చు. అంటే ఏడాదికి ఆరు సిలిండర్లు అవసరం అవుతాయి. ఏడాదికి అదనంగా రూ.360 చెల్లించాల్సి వస్తోంది. 11 నెలల్లో రూ.110 భారం 11 నెలల వ్యవధిలో గ్యాస్ ధర రెండుసార్లు పెరిగింది. గతేడాది ఏప్రిల్లో గృహ వినియోగ సిలిండర్పై రూ.50 పెరిగింది. ప్రస్తుతం మరో రూ.60 పెరిగింది. వాణిజ్య సిలిండర్లపై భారీగా పెంచడంతో హోటల్, రెస్టారెంట్, ఆహార పదార్థాలు తయారు చేసే వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. కనికరించని కూటమి ప్రభుత్వం కేంద్రం గ్యాస్ ధర ఏకంగా రూ.60 పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నా కూటమి ప్రభుత్వం కనీస స్పందన కరువైంది. రాష్ట్ర పరిధిలో నియంత్రించేందుకు ముందుకు రాకపోవడంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర పెంచిన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాగే పెంచుతూ పోతే తమ పరిస్థితి ఏమవ్వాలని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. -
నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం
● కాకినాడలో ఓ మహిళ నిర్వాకం ● కాంట్రాక్టు ఉద్యోగి చనిపోతే భార్యకు రెగ్యులర్ ఉద్యోగం ● కీలకంగా వ్యవహరించిన సీనియర్ అసిస్టెంట్ ● కాకినాడ, ‘తూర్పు’ కలెక్టర్లు సీరియస్ ● మహిళ సస్పెన్షన్ ● అమర్కాంత్ సరెండర్కు ఆదేశాలు కాకినాడ క్రైం: నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం పొందిన ఓ మహిళ పైన, ఆమెకు సహకరించిన ప్రభుత్వ ఉద్యోగిపైన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తీవ్ర చర్యలు తీసుకున్నారు. వివరాలివీ.. కాకినాడకు చెందిన చెరుకూరి (పోల) హేమలత భర్త వినయ్ సంపత్ ఐదేళ్ల క్రితం కోవిడ్తో మృతి చెందాడు. ఆయన కాకినాడలో ప్రభుత్వ కాంట్రాక్టు విధానంలో ల్యాబ్ టెక్నీషియన్గా పని చేసేవాడు. భర్త చనిపోయిన కొద్ది రోజులకు హేమలత డీఎంహెచ్ను ఆశ్రయించింది. తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరింది. అప్పట్లో ఆ కార్యాలయం పీఓడీటీటీ విభాగంలో పని చేస్తూ, డెప్యూటేషన్పై రాజమహేంద్రవరంలోని అర్బన్ ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్కు వెళ్లిన సీనియర్ అసిస్టెంట్ కేశవ అమర్కాంత్ అగస్త్యకు ఈ విషయం తెలిపింది. ఆమె అవసరాన్ని ఆసరాగా తీసుకున్న అమర్కాంత్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. వారి పరిచయం ద్విచక్ర వాహనాలపై కలిసి తిరిగేంత వరకూ వెళ్లింది. అర్జీదారుతో ఎందుకంత ఉన్నతాధికారులు చనువని ప్రశ్నిస్తే తన మేనకోడలని అమర్కాంత్ చెప్పేవాడు. ఈ క్రమంలో అతడు కాకినాడ డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలకు బదిలీ అయ్యాడు. ఆ కళాశాలలో అప్పటికి 10 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇదే అదనుగా అతడు కారుణ్య నియామక కోటాలో హేమలతకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని భావించాడు. నిబంధనల ప్రకారం ఆ నియామకం కేవలం ప్రభుత్వ ఉద్యోగి భాగస్వామికే తప్ప కాంట్రాక్టు ఉద్యోగి భాగస్వామికి వర్తించదు. కలెక్టర్కే బురిడీ... ఈ నేపథ్యంలో అమర్కాంత్ నకిలీ పత్రాలతో హేమలత భర్త సంపత్ది రెగ్యులర్ ఉద్యోగని నమ్మించి ప్రభుత్వ ఖజానా నుంచే జీతాలు అందుకున్నట్లు, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపు కార్డు, ఎస్ఆర్ ఎంట్రీ తయారు చేశాడు. వీటితో అప్పటి కలెక్టర్నే బురిడీ కొట్టించి ఆయన సంతకంతోనే రెండేళ్ల క్రితం హేమలతకు ప్రభుత్వ ఉద్యోగం వేయించాడు. చర్యలకు ఆదేశం ఈ నివేదికను పరిశీలించిన కలెక్టర్ షణ్మోహన్ బాధ్యులిద్దరి పైనా తక్షణ చర్యలకు సిఫారసు చేశారు. విచారణ నివేదికను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ కేవీ శివప్రసాద్కు పంపారు. ఈ నేపథ్యంలో అమర్కాంత్ను ‘తూర్పు’ కలెక్టర్ కీర్తి ప్రభుత్వానికి సరెండర్ చేశారు. మోసపూరితంగా ప్రభుత్వ ఉద్యోగం పొందిన హేమలతను సస్పెండ్ చేసి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సోమవారం చర్యలు చేపట్టనున్నట్లు రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాల అధికారులు తెలిపారు. కలెక్టర్కు ఫిర్యాదుతో వెలుగులోకి.. ఈ విషయం ఎలాగోలా బయటకు పొక్కింది. ఈ నేపథ్యంలో కొందరు నిరుద్యోగులు ఓ సంఘ నాయకుల సాయంతో గత ఏడాది అక్టోబర్లో కలెక్టర్ షణ్మోహన్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు డీఎంహెచ్ఓ నరసింహ నాయక్ త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీ రాజమహేంద్రవరంలో పని చేస్తున్న హేమలతను కాకినాడ పిలిపించి విచారించి అసలు విషయాన్ని గుర్తించింది. ఆమె అందించిన ప్రతి పత్రం నకిలీదేనని, ఇదంతా అమర్కాంత్ ఆడించిన నాటకమని కమిటీ గుర్తించింది. ఇదే విషయాన్ని డీఎంహెచ్ఓ ఆధ్వర్యాన కలెక్టర్కు నివేదించింది. -
వాడపల్లి.. భక్తులతో శోభిల్లి
ఆత్రేయపురం: కోనసీమ తిరుమలగా ఖ్యాతి గాంచిన వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. ఆ క్షేత్రం గోవింద నామస్మరణతో మార్మోగింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాదిమంది భక్తులు ఆలయం వద్ద క్యూ కట్టారు. ఉదయం నుంచి రద్దీ నెలకొంది. ఆలయ అర్చకులు, వేద పండితులు వేకువజామునే స్వామివారికి సుప్రభాతసేవ, తొలి హారతి, నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్య లక్ష్మీహోమం, బాలభోగం తదితర పూజలను చేశారు. అనంతరం స్వామివారిని వివిధ పుష్పాలతో అలకరించారు. స్వామివారి అలంకారంగా నూతన బంగారు మకర తోరణం ఆకట్టుకుంది. ఏడు వారాల నోము ఆచరిస్తున్న భక్తులు తిరు వీధుల్లో ఏడు ప్రదక్షిణలు చేశారు. భక్తలు తులాభారాలు నిర్వహించి కానుకలు సమర్పించారు. సుమారు లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. వేలాది మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, ఆలయ ఈఓ, దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఏర్పాట్లను పర్యవేక్షించగా, కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. భక్తజన సంద్రంలా వెంకన్న ఆలయం -
సుదీర్ఘ పరిశోధనకు పట్టం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఏం చేయాలో తెలియదు. ఆ నొప్పిని నివారించేందుకు ఆ సమయంలో బీపీ తగ్గిపోవాలి. అది వెంటనే జరగాలి. అలా జరగాలంటే దానికి సంబంధించిన మందు వెంటనే నోటిలో బుగ్గకు పెడితే సెకన్లలో ఆ మందు లోపలకు వెళ్లి బీపీ అదుపులోకి వస్తుంది. అటువంటి మందుపై పరిశోధనలు చేసి విజయం సాధించారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం డ్రగ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) డి.నాగమణి. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు జిల్లా వర్తనాపల్లి గ్రామానికి చెందిన నాగమణి సాధారణ ఏపీ రెసిడెన్షియల్ స్కూలు, చోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకున్నారు. ఆమె ప్రతిభకు ఔషధ నియంత్రణ శాఖలో ఉద్యోగం వచ్చింది. డ్రగ్ ఇన్స్పెక్టర్గా పలు జిల్లాల్లో పని చేసి, అంచెలంచెలుగా ఏడీగా ఎదిగారు. నిరంతరం తీవ్ర ఒత్తిడితో కూడిన ఉద్యోగం చేస్తూనే పరిశోధనలపై వైపు దృష్టి సారించారు. 2016లో తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్గా చేరారు. ‘డిజైన్, ఫ్యాబ్రికేషన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ బల్క్ డ్రగ్స్ డెలివరీ సిస్టమ్ ఆఫ్ సెలక్టెడ్ డ్రగ్స్’ అనే అంశంపై యూనివర్సిటీ ఫార్మసీ విభాగం ప్రొఫెసర్ వై.ఇందిరా ముజిజ్ నేతృత్వంలో పరిశోధనలు చేశారు. పరిశోధనల అనంతరం తాను తయారు చేసిన మందును ముందుగా కుందేళ్లపై ప్రయోగించి, పరీక్షించారు. ఆ పరీక్షలు విజయవంతమయ్యార ుు. జనవరి 24న యూనివర్సిటీ కమిటీ సమావేశం నిర్వహించి, ఆమె పరిశోధనలను పరిశీలించి, ఫార్మసీ పీహెచ్డీ ప్రదానం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నాగమణికి యూనివర్సిటీలో శనివారం పీహెచ్డీ ప్రదానం చేశారు. నాగమణి తూర్పు గోదావరితో పాటు కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో చేసిన సేవలకు గాను బెస్ట్ డ్రగ్ ఇన్స్పెక్టర్, బెస్ట్ డ్రగ్స్ ఏడీగా పలుమార్లు అవార్డులు అందుకున్నారు. ఫ హార్ట్ ఎటాక్ వచ్చే ముందు దానిని నివారించే చూయింగ్ టాబ్లెట్ తయారీ ఫ కుందేళ్లపై పరీక్షలు విజయవంతం ఫ డాక్టరేట్ అందుకున్న రాజమహేంద్రవరం డ్రగ్స్ ఏడీ నాగమణి కుటుంబ సహకారంతోనే.. ఫార్మసీలో పీహెచ్డీ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ విషయంలో రాష్ట్రంలోనే ఔషధ నియంత్రణ శాఖ నుంచి ఏకై క మహిళను అయినందుకు సంతోషంగా ఉంది. గుండె నొప్పి సమయంలో వెంటనే ఉపయోగించే విధంగా, తక్షణమే ఉపశమనం కలిగే విధంగా తయారు చేసిన మందు విజయం సాధించింది. ఇది నాకెంతో గర్వకారణం. ఇది నా ఒక్కరి విజయం కాదు. నా వెనుక ఉండి, నన్ను ప్రోత్సహించిన కుటుంబ సభ్యులందరిదీ. – డి.నాగమణి, డ్రగ్స్ ఏడీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా -
15 నుంచి రాష్ట్ర స్థాయి చదరంగం పోటీలు
నల్లజర్ల: మాస్టర్స్ చెస్ అకాడమీ, ఆంధ్ర చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి రాష్ట్ర స్థాయి ఓపెన్ రాపిడ్ చదరంగం పోటీలు జరుగుతాయని టోర్నమెంట్ కమిటీ కన్వీనర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. శనివారం నల్లజర్లలోని కింగ్స్ ఉడ్ స్కూల్లో పోటీలకు సంబంధించిన బ్రోచర్ను జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు ఆవిష్కరించారు. చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ పోటీలకు రాష్ట్రంలోని 20 జిల్లాల నుంచి 300 మంది చెస్ క్రీడాకారులు హాజరవుతారన్నారు. పాల్గొనే క్రీడాకారులు ఏపీచెస్.ఓఆర్జీ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 94408 67370, 89787 82501 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో కింగ్స్ ఉడ్ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ దాపర్తి శివ, సెక్రటరీ, కరస్పాండెంట్ నిఖిలదేవి, ప్రిన్సిపాల్ డాక్టర్ సాయికుమార్, సొసైటీ అధ్యక్షులు రావూరి వెంకటరమణ, మార్ని దుర్గారావు, సవలం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
9న అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ
అమలాపురం రూరల్: భారతీయ వాయుసేన నిర్వహిస్తున్న అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీని సద్వినియోగం చేసుకోవాలని కోనసీమ జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి.హరిశేషు అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థుల కోసం ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీని గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ నెల 9న ఏపీ, తెలంగాణ మహిళా అభ్యర్థులకు, 12న ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులకు, 15న తెలంగాణ పురుష అభ్యర్థులకు జరుగుతాయన్నారు. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు 2005 ఫిబ్రవరి 5 నుంచి 2009 జనవరి మధ్యలో జన్మించి ఉండాలని, ఎత్తు కనీసం 152 సెంటీమీటర్లు, ఏదైనా స్ట్రీమ్లో ఇంటర్, తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత తేదా మూడేళ్ల డిప్లొమా ఇంజినీరింగ్ లేక, రెండేళ్ల ఒకేషనల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలన్నారు. తెలంగాణ పురుష అభ్యర్థులకు ర్యాలీకి ముందస్తు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదని, సర్టిఫికెట్ కాపీలతో నేరుగా హాజరు కావొచ్చన్నారు. అభ్యర్థులు https://agnipathvayu.cdac.in వెబ్సైట్లో చూడాలని, లేకుంటే జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖను సంప్రదించాలని తెలిపారు. కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం ఏలేశ్వరం: ఏలేరు ప్రాజెక్టు నుంచి విశాఖపట్నానికి నీరందిస్తున్న ఎడవ కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం శనివారం లభ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏలేశ్వరం క్వారీ ప్రాంతానికి చెందిన బంగర్తి విజయ్, గిడుతూరి లోవరాజులు శుక్రవారం ఉదయం అడ్డతీగల మండలం గొంటువానిపాలెం క్వారీ పనులకు వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా సిరాయవరం వచ్చేసరికి బైక్ అదుపుతప్పి ఏలేరు ఎడమ కాలువలో పడిపోయారు. స్థానికులు కాలువలో దిగి వెతకగా విజయ్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. లోవరాజు గల్లంతు కాగా, శనివారం ప్రమాద సమీపంలోనే మృతదేహం లభ్యమైంది. లోవరాజుకు భార్య నాగమణితోపాటు కుమారైలు నవ్య, లోవకుమారి ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెండు ఇసుక లారీల సీజ్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అధిక లోడుతో ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీలను అధికారులు శనివారం సీజ్ చేశారు. రూ.1.70 లక్షల జరిమానా విధించారు. జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్ కథనం ప్రకారం.. రాజానగరం హైవే పరిధి, లాలాచెరువు సమీపంలో పరిమితికి మించి ఇసుక లోడ్తో వెళ్తున్న రెండు లారీలను రవాణా అధికారులు పట్టుకున్నారు. సీజ్ చేసిన వాహనాలను అపరాధ రుసుము చెల్లించిన తర్వాత విడుదల చేశామన్నారు. పరిమితికి మించి ఇసుక రవాణా చేయడం వల్ల రహదారులపై ఇసుక పడి ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని, ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో జరిగాయన్నారు. ఇసుక రవాణా చేసే వాహన యజమానులు, డ్రైవర్లు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. -
ఆమె చేయి పడితే కంటి చూపు ఖాయం
నిడదవోలు పట్టణంలో లయన్స్ కంటి ఆసుపత్రిలో పదమూడేళ్లుగా నేత్ర వైద్యురాలిగా పనిచేస్తున్న గొల్లపల్లి భరణి ఎల్లార్ తన కంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ఆమె చేయి వేస్తే కంటి చూపు వస్తుందనే నమ్మకం వృద్ధుల్లో కలిగింది. ఇప్పటి వరకు ఆమె 38,596 కంటి శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు. సుమారు 2 లక్షల మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాల్లో సైతం పాలు పంచుకుంటారు. రోగుల పట్ల ఎంతో ప్రేమగా మాట్లాడుతుంటారు. 1974లో కొవ్వూరులో జన్మించారు. 1999లో విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, పీజీ పూర్తి చేశారు. వృత్తి పట్ల అంకిత భావం, పేదలకు ఉచిత వైద్య సేవలందించడంలో తనదైన ముద్ర వేశారు. గుర్తింపుగా విశ్వగురు వరల్డ్ రికార్డు నుంచి రోనా వారియర్స్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. కంటి వైద్యురాలు గొల్లపల్లి భరణి ఎల్లార్ -
ఈ విజయం.. అంత తేలిగ్గా దక్కలేదు!
నల్లజర్ల: ఐదు సార్లు సివిల్స్ పరీక్షలలో విఫలమైనా కుంగిపోకుండా ..పట్టుదలతో ప్రయత్నించి ఆరో ప్రయత్నంలో యూపీ ఎస్సీలో ర్యాంకు సాధించారు అనంతపల్లికి చెందిన చెజెర్ల అశ్వినికుమార్. ఆయన 256వ ర్యాంకు సాధించారు. గుంటూరుకు చెందిన చెజెర్ల కాళేశ్వరరావు, సరోజనిదేవి కుమారుడు అశ్విని కుమార్. చిన్నపుడే తల్లిదండ్రులు చనిపోవడంతో అనంతపల్లిలో మేనమామ మాయకోటి రాజశేఖర్(అస్సాంరాజు)వద్ద పెరిగారు. గుంటూరులో విద్యాభ్యాసం జరిగింది. విజ్ఙాన్లో బీటెక్లో గోల్డ్మెడల్ సాధించారు. 2021లో ఐఈఎస్లో తొలుత 29వ ర్యాంకు సాధించారు. తర్వాత 2023లో మళ్లీ రాసి 13వ ర్యాంకు సాధించారు. ప్రస్తుతం అశ్వినికుమార్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ బోర్డులో అసిస్టెంట్ డైరెక్టర్ (సీఈఏ)గా న్యూఢిల్లీలో పనిచేస్తున్నారు. ఫలితాలు వెలువడ్డ తర్వాత శనివారం ఉదయం ఇక్కడి వారితో ఆయన ఫోన్లో మాట్లాడారు. 10 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరైతే తనకు 256వ ర్యాంకు రావడం గర్వకారణంగా ఉందన్నారు. నాలుగు సార్లు ప్రిలిమ్స్, మెయిన్స్ దాటి ఇంటర్వ్యూ వరకు వెళ్లి విఫలమైనట్టు చెప్పారు. ఆరోసారి సివిల్స్కు ఎంపికై న వారిని స్ఫూర్తిగా తీసుకొని పట్టుదలతో చదివి సఫలీకృతుడైనట్టు చెప్పారు. అనంతపల్లిలోని మేనమామ, బాబాయ్ వలిగడ్ల నాగమల్లికార్జునరావు, విజయలక్ష్మి ఇళ్ల వద్ద టపాసులు పేల్చి, మిఠాయిలు పంచారు. ‘నన్నయ’లో వాకథాన్ రాజానగరం: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ రాష్ట్ర మహిళా కమిషనర్ ఫ్లాగ్ షిప్ సహకారంతో ‘హానరింగ్ ది వారియర్ విటిమ్’ అనే థీమ్తో ఆదికవి నన్నయ యూనివర్సిటీలో శనివారం వాకథాన్ జరిగింది. ఈ ర్యాలీని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ ప్రారంభించారు. యూనివర్సిటీలో ఎన్ బ్లాక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రధాన గేటు వరకు వెళ్లి అక్కడ నుంచి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వరకు సాగింది. అక్కడ మానవహారంగా ఏర్పడి మహిళా హక్కులు, వాటి పరిరక్షణ, ప్రభుత్వ చట్టాలపై అవగాహన కలిగిస్తూ నినాదాలు చేశారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, ఎడ్యుకేషన్ కళాశాలల విద్యార్థినులు, అధ్యాపకులు పాల్గొన్నారు.పోలీసుల విస్తృత తనిఖీలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా ఆపరేషన్ వజ్ర ప్రహార్ పేరుతో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆ వివరాలను జిల్లా పోలీసు కార్యాలయం శనివారం తెలిపింది. డ్రగ్స్ నివారణే లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా అన్ని సబ్ డివిజన్ల పరిధిలో పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బంది, స్పెషల్ టీమ్లు కలిసి గుర్తించిన హాట్స్పాట్ ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మాదక ద్రవ్యాల వినియోగం జరుగుతున్నాయని అనుమానం ఉన్న ప్రాంతాలు, అద్దె ఇళ్లు, విద్యార్థుల హాస్టళ్లు, నివాసాలు, లాడ్జీలు, ఖాళీ భవనాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో సోదాలు నిర్వహించారు. ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా మొత్తం 155 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఆపరేషన్లో భాగంగా మొత్తం 255 మందిని తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 70 వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. రౌడీ షీట్లు, సస్పెక్ట్ షీట్లు ఉన్నవారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ప్రజలు మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972 కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ● ఆరవ ప్రయత్నంలో కల సాకారం ● సివిల్స్ ఫలితాలలో 256వ ర్యాంకు సాధించిన అశ్వినికుమార్ -
విద్యావ్యాప్తికి ప్రాధాన్యం
జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా రాజమహేంద్రవరం రూరల్: ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం విద్య, ఉపాధి, సామాజిక, సంక్షేమ రంగాల్లో సమర్థమైన చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా అధికారులను ఆదేశించారు. విద్యావ్యాప్తికి ప్రాధాన్యం ఇవ్వాలని, నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేయాలని అన్నారు. శనివారం స్థానిక ఓఎన్జీసీ గోదావరి భవన్ సమావేశ మందిరంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై తూర్పు గోదావరి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. డ్రాప్ అవుట్లు లేకుండా ఆయా వర్గాలకు చెందినవారు చదువుకునేలా చైతన్య పరచడం ముఖ్యం అన్నారు. సంక్షేమ వసతి గృహాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని చైర్మన్ స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖలలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్, సంక్షేమ పథకాల అమలు, అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. జాతీయ ఎస్సీ కమిషన్ కార్యదర్శి జి.శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఎస్సీ వర్గాలకు సంబంధించిన బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై చొరవ తీసుకోవాలని అధికారులను సూచించారు. కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం కోసం పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఎస్పీ డి. నరసింహ కిషోర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు భద్రత కల్పించే విషయంలో పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. జాయింట్ కలెక్టర్ వై.మేఘాస్వరూప్, మునిసిపల్ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్.డి.గయాజుద్దీన్, ఇంచార్జి ఆర్డీవోలు కె.భాస్కర్రెడ్డి, ఎంఆర్ఆర్ ప్రేమ్ కుమార్, ఉమ్మడి తూర్పుగోదావరి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జే సత్యవతి పాల్గొన్నారు. మక్వానాకు స్వల్ప అస్వస్థత జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానాకు స్వల్ప అస్వస్థత కలగడంతో శనివారం డెల్టా ఆసుపత్రిలో చికిత్స అందించామని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. అవసరమైన వైద్య సేవలు అందించిన అనంతరం ఆయనను డిశ్చార్జ్ చేసినట్లు తెలిపారు. -
మానసిక దివ్యాంగులకు పరిచర్యలు
నిడదవోలు మండలంలోని శంఖారాపురం గ్రామ శివారున ఉన్న సహాయ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మానసిక దివ్యాంగుల కేంద్రంలో విశాలాక్షి తన సేవాభావాన్ని చాటుకుంటున్నారు. అన్నెం పున్నెం ఎరుగని అభాగ్యులకు దగ్గర ఉండి పరిచర్యలు చేస్తూ సేవ అనే పదానికి సరైన నిర్వచనం చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి గ్రామానికి చెందిన బలగం విశాలాక్షి పీజీ పూర్తి చేసి, మధ్యప్రదేశ్లోని బోజ్ యూనివర్శిటీలో బీఈ డీ(ఎంఆర్) పూర్తి చేశారు. ప్రస్తుతం మానసిక వికలాంగుల కేంద్రంలో ఆర్గనైజర్, ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న విశాలాక్షి సేవలకు గుర్తిస్తూ 2019లో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శిశుసం క్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ మహిళా సేవా పురస్కారం అందుకున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎన్నో ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు ఆమె సొంతం చేసుకున్నారు. -
పలువురికి స్ఫూర్తిగా..
నిడదవోలు పట్టణానికి చెందిన డాక్టర్ కుంచాల విజయకి చిన్నతనంలోనే బాగా చదువు కోవాలి... నలుగురికి సేవ చెయ్యాలనే ఆలోచన వచ్చింది. సమాజానికి ఏదో చేయాలనే తపన ఉంది. కోట రామకృష్ణారెడ్డి, జాలమ్మ దంపతుల కుమార్తె విజయ. తండ్రికి ఆర్థిక స్థోమత లేకపోయినా ఎంతో పట్టుదలతో బీఎస్సీ చదివారు. ప్రస్తుతం సమిశ్రగూడెం పంచాయతీ ఈవోగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆమె సేవా గుణాన్ని భర్త గ్రహించారు. ఆయన ప్రోత్సాహంతో మనోజ్ఞ చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి, సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. భర్త జీతంలో నెలకు 20 శాతం పేద విద్యార్థులకు కేటాయిస్తూ పలు సేవ కార్యక్రమాలను చేపడుతున్నారు. నిడదవోలులో నివాసముంటున్న శ్రీనివాసరెడ్డి దంపతులు నిడదవోలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ట్రస్టు కార్యక్రమాలు ఇద్దరూ నిర్వహిస్తూ పలు అవార్డులను సైతం సొంతం చేసుకున్నారు. ట్రస్టు చేపడుతున్న సేవలకు గుర్తింపుగా రెండు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులు, ఏపీ స్టేట్ కల్చరల్ అవేర్నెస్ సోసైటీ, ఏపీ బెస్ట్ సిటిజన్ అవార్డు, పొట్టి శ్రీరాములు విశిష్ట సేవా శిరోమణి పురస్కారంతో పాటు అమెరికాలో బర్కెలీ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. -
లింగ సమానత్వంతో మహిళా సాధికారిత
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): లింగ సమానత్వం ద్వారానే మహిళా సాధికారిత సాధ్యమవుతుందని అదనపు జిల్లా న్యాయమూర్తి యం.మాధురి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా శనివారం జిల్లా కోర్టు ఆవరణలో మహిళా సాధికారత, హక్కుల పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబం, సమాజంలో మహిళలు పోషించే పాత్ర అత్యంత ముఖ్యమని, నేడు అన్ని రంగాల్లో మహిళలు విశేషంగా రాణిస్తున్నారన్నారు. అయితే ఇంకా కొన్ని సందర్భాల్లో మహిళలపై వివక్ష కొనసాగుతోందని, ఆ వివక్షను పూర్తిగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ ముఖ్యంగా పురుషులు ముందుకు రావాలన్నారు. మహిళలు, చిన్నారులకు అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా కోర్టు ప్రాంగణంలో అందుబాటులో ఉందన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి మాట్లాడుతూ మహిళలు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్నప్పటికీ ఇంకా అఘాయిత్యాలు కొనసాగుతున్నాయన్నారు. మార్పు ఇంటి నుంచే ప్రారంభం కావాలని, ఆడపిల్లలలో ధైర్యం నింపడంతో పాటు మగపిల్లలకు మహిళలను గౌరవించడం నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన పోటీలలో ఎస్కేఆర్ మహిళా కళాశాల విద్యార్థినులు ప్రతిభ కనబర్చారు. ఆర్ఎంసీ ఎంహెచ్వో వి.వినూత్న, న్యాయాధికారులు, న్యాయవాదులు, మహిళలు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
పెదపూడి: చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై ఎస్.తులసిరామ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. 2016లో రామేశ్వరంలో ఒక మూగ వ్యక్తి అనారోగ్యం, ఆకలితో ఉన్నప్పుడు అదే గ్రామానికి చెందిన కె.రామలింగేశ్వరరావు చేరదీశారు. అప్పటి నుంచి రామలింగేశ్వరరావు ఇంటి వద్ద ఆ వ్యక్తి ఉంటున్నాడు. మృతునికి వివరాలు అవసరమని రామలింగేశ్వరరావు ఇంటి వద్ద పని చేస్తున్న గుండు కామరాజు ఇంటి పేరుపై గుండు శివుడు (30)గా ఆధార్కార్డు తయారు చేయించారు. శివుడికి అప్పుడప్పుడు పిట్స్ వస్తుంటాయి. ఈ నేపథ్యంలో గత నెల 19న శివుడు దుస్తులు ఉతికి మేడపై ఆరబెట్టడానికి వెళుతున్నప్పుడు పిట్స్ వచ్చి పడిపోయాడు. ఆ విషయం రామలింగేశ్వరరావు, కామరాజు తదితరులు కొంత సమయం వరకూ చూడలేదు. అనంతరం చూసిన వారు శివుడ్ని కాకినాడ జీజీహెచ్కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు. -
ప్రగతిలో చెట్టాపట్టాల్
ఫ నిడదవోలు రైల్వే స్టేషన్కు కొత్త హంగులు ఫ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో ఏర్పాటు ఫ నూతనంగా 4, 5 ప్లాట్ఫామ్ల నిర్మాణం ఫ రెండు లిఫ్ట్లు, ఎస్క్లేటర్ల ఏర్పాటు నిడదవోలు: రైల్వే స్టేషన్లో అభివృద్ధి కూత పెట్టింది.. చకచకా కొత్తరూపు దిద్దుకుంది.. కేంద్ర ప్రభుత్వ అమృత్ భారత్ స్టేషన్ పథకంలో సర్వ హంగులతో రెడీ అయ్యింది.. విజయవాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య కీలకమైన జంక్షన్గా పేరొందిన నిడదవోలు రైల్వే స్టేషన్ కొత్తరూపును సంతరించుకుంది. అమృత్ భారత్ పథకానికి దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో తొలి విడతగా 11 రైల్వే స్టేషన్లను ఎంపిక చేశారు. ఇందులో నిడదవోలు ఒకటి. ఈ పథకం కింద రూ.28 కోట్లతో ఈ రైల్వే స్టేషన్లో అధునాతన సౌకర్యాలు కల్పించారు. ఇప్పటికే ఈ పనులను పూర్తి చేశారు. ఇన్నేళ్లలో ఎన్నడూ చూడని అభివృద్ధి పనులు రైల్వే అధికారులు పూర్తి చేయడంతో ప్రయాణికుల అవసరాలు తీరుతున్నారు. ప్రధానంగా వృద్ధులు, చిన్న పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్లాట్ఫామ్లకు చేరుకోవడానికి రెండు లిఫ్ట్లు, ఒక ఎస్క్లేటర్ను నిర్మించారు. చేపట్టిన పనులివీ.. నిడదవోలు రైల్వే స్టేషన్లో ప్రస్తుతం మూడు ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఇందులో 200 మీటర్ల మేర ఫ్లోర్ను గ్రానైట్తో ఆధునీకరించారు. ఒకటో నంబర్ ప్లాట్ఫామ్ను రూ.3.91 కోట్లతో తాడేపల్లిగూడెం వైపు విస్తరించారు. దీనిని 600 మీటర్ల పొడవున కాంక్రీట్, గ్రానైట్తో నిర్మించారు. ప్లాట్ఫామ్ రక్షణ గోడ, ఇతర పనులు చేపట్టారు. ఇదే ప్లాట్ఫామ్లో రూ.3.28 కోట్లతో 600 మీటర్ల పొడవున అధునాతన షెడ్డు నిర్మించారు. రూ.6 కోట్లతో కొత్తగా 4, 5 ప్లాట్ఫామ్లు పూర్తి చేశారు. దీనివల్ల మరిన్ని రైళ్ల రాకపోకలకు వీలు కలుగుతుంది. ప్లాట్ఫామ్ల మధ్య ప్రయాణికుల రాకపోకలకు రెండు లిఫ్ట్లు నిర్మించారు. ఒక ఎస్క్లేటర్ కూడా నిర్మించడంతో ప్రయాణికులు ఎంతో సులువుగా ఇతర ఫ్లాట్ఫామ్లకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం స్టేషన్లో 1, 2, 3 ప్లాట్ఫామ్ల మధ్య ఒకే కాలిబాట వంతెన ఉంది. దీనికి అదనంగా రాజమహేంద్రవరం వైపు ఆక్సిజన్ పార్కు వద్ద రూ. 12 కోట్లతో 45 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఎండ్ టూ ఎండ్ ఫుట్పాత్ ఓవర్ బ్రిడ్జి నిర్మించడంతో అన్ని ప్లాట్ఫామ్లకు ప్రయాణికులు సులువుగా చేరుకుంటున్నారు. ఇదే ప్రాంతంలో రెండు లిఫ్ట్లు, ఒక ఎస్క్లేటర్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. స్టేషన్లో విద్యుద్దీపాల వ్యవస్థను ఆధునీకరించారు. స్టేషన్ మొత్తం రూ.1.90 కోట్లతో అత్యాధునిక మరుగుదొడ్లను నిర్మించారు. ఇక్కడ మహిళలకు 8, పురుషులకు 8, దివ్యాంగులకు 2 చొప్పున మరుగుదొడ్లు నిర్మించారు. ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి విశాలమైన ఏసీ వెయిటింగ్ హాలు, సాధారణ ప్రయాణికులకు విశ్రాంతి వెయిటింగ్ హాలును నిర్మించారు. ప్రయాణికులు సులభంగా గుర్తించేలా రాకపోకల సంకేతాలు, పార్కింగ్ ప్రదేశాల మార్గాలు, వ్యర్థాల నిర్వహణ, భవన నిర్వహణ పనులు చేపట్టారు. రైళ్ల రాకపోకలు తెలుసుకోవడానికి ప్రత్యేక డిస్ప్లే బోర్డును ఏర్పాటు చేశారు. ఎంతో మందికి ఆసరా.. నిడదవోలు రైల్వే జంక్షన్ స్టేషన్ను 1935లో బ్రిటిష్ హయాంలో నిర్మించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏజెన్సీ ముఖద్వారంగా ఉండటంతో జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, కొయ్యలగూడెం, గోపాలపురం, దేవరపల్లి వంటి ప్రాంతాలతో పాటు నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల నుంచి ప్రయాణికులు నిడదవోలు రైల్వే స్టేషన్పైనే ఆధారపడతారు. ఇక్కడి నుంచి నిత్యం వ్యాపారులు, విద్యార్థులు, ఉద్యోగులు వివిధ ప్రాంతాలకు రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. విశాఖపట్నం – విజయవాడ మార్గంలో ఉన్న ఈ రైల్వే జంక్షన్ నుంచి పలు రైళ్లు భీమవరం, నర్సాపురం, గుడివాడ పట్టణాలకు రాకపోకలు సాగిస్తాయి. ప్రతి రోజు ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు 3,800 మంది సుమారు 68 రైళ్లలో ప్రయాణిస్తున్నారు. రోజుకు రూ.1.50 లక్షల ఆదాయం వస్తోంది. ప్రతి రోజూ సుమారు 30 గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. నిడదవోలు పరిసర ప్రాంతాల్లోని వ్యాపార సంస్థలు గూడ్స్ రైళ్ల ద్వారా సరకులు రవాణా చేసుకుంటారు. ప్రధానంగా ఎఫ్సీఐ గోడౌన్లకు ధాన్యం నిల్వలను ఇక్కడి నుంచి తరలిస్తుంటారు. ప్రస్తుతం సి–గ్రేడ్లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ ద్వారా నెలకు సుమారు రూ. కోటి ఆదాయం రైల్వే శాఖకు సమకూరుతోంది. ముఖద్వారం.. ఆకర్షణీయం రైల్వే స్టేషన్ భవనం ముఖద్వారంలో 50 మీటర్ల పొడవున నిర్మించిన ఎలివేషన్ ఆకట్టుకుంటోంది. దీని నిర్మాణంతో స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఎంతో ఆకర్షణీయంగాల ఇది ఉంది. రైల్వే స్టేషన్ ముందు భాగంలో కర్షక కష్టం అద్దం పట్టేలా స్వాగత ద్వారం దాటిన తర్వాత స్టేషన్లోకి అడుగుపెట్టే సమయంలో ప్రయాణికులకు ఆహ్లాదం కలిగే విధంగా ఈ ప్రాంత వ్యవసాయ ప్రాధాన్యం తెలిపేలా రెండు ఎద్దులతో రైతు నాగలి పట్టి పొలం దున్నుతున్నట్టుగా ఏర్పాటు చేసిన విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. -
బంగారు మకర తోరణం సమర్పణ
ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరుని ఆలయంలో స్వామివారికి తణుకుకు చెందిన పుణ్యమూర్తుల రామచంద్రస్వామి, సావిత్రి దంపతులు రూ.60 లక్షల విలువైన బంగారు మకర తోరణాన్ని సమ ర్పించారు. దీనిని ఆలయ ఈఓ, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావుకు అందజేశారు. అనంతరం అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా సంప్రోక్షణ నిర్వహించి స్వామివారికి అలంకరించారు. దాతలకు తీర్థ ప్రసాదాలు, స్వామివారి ఫొటో అందజేశారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, ఉప సర్పంచ్ పోచిరాజు బాబూరావు, సర్పంచ్ సూర్యకుమారి దంపతులు, అయ్యగారి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
డివైడర్ను ఢీకొన్న వ్యాన్
ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు నల్లజర్ల: అతి వేగంగా వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం నగరానికి క్యాటరింగ్కు సంబంధించిన మెటీరియల్ను వ్యాన్లో శుక్రవారం గుడివాడకు చెందిన కొండ్రు శ్రీనివాస్ (51), విజయవాడకు చెందిన శేషాద్రి, డ్రైవర్ కర్రి శివ తీసుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో అతి వేగంగా వెళ్తున్న వ్యాన్ అనంతపల్లి ఎస్వీఆర్ కల్యాణ మండపం వద్ద జాతీయ రహదారిపై డివైడర్ను ఢీకొంది. ఈ సంఘటనలో డ్రైవర్ పక్క సీటులో కూర్చున్న కొండ్రు శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలైన శేషాద్రి, శివలను చికిత్స నిమిత్తం హైవే అంబులెన్స్లో తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన కొండ్రు శ్రీనివాస్ భార్య శైలజ ఉపాధి నిమిత్తం కువైట్లో ఉంటోంది. కుమారుడు కరుణకుమార్, కుమార్తె శ్వేతల బాగోగులు చూసుకుంటూ క్యాటరింగ్ పనులకు వెళ్లి తిరిగి వస్తుంటాడు. ఇదే క్రమంలో రాజమహేంద్రవరం వెళ్తూ మార్గం మధ్యలో చనిపోయాడు. ఎస్సై ఆంజనేయబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాలువలో వ్యక్తి మృతదేహం
రాయవరం: పసలపూడి బస్టాండ్ వద్ద మండపేట ప్రధాన కాలువలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. కాలువ పైభాగం నుంచి మృతదేహం కొట్టుకువచ్చింది. మృతుని వయసు సుమారు 30 నుంచి 35 ఏళ్లు ఉండవచ్చని భావిస్తున్నారు. ఒంటిపై లేత ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు చారల ఫుల్ హ్యాండ్స్ షర్ట్, బ్లూ జీన్ ఫ్యాంట్ ఉంది. మృతుడు 5.8 అడుగుల ఎత్తు ఉన్నాడు. ప్యాంట్ జేబులో సెల్ఫోన్ ఉంది. పొరపాటున కాలువలో పడి మృతి చెందాడా? లేక ఎవరైనా చంపి కాలువలో పడేశారా? అనే విషయం పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. రాయవరం ఎస్సై డి.సురేష్బాబు సిబ్బందితో వెళ్లి మృతదేహానికి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మండపేట సీహెచ్సీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిస్తే 94409 04843 నంబర్కు ఫోన్ చేయాలని ఎస్సై తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మంటలకు కాలిపోయిన బైక్ రాజానగరం: జాతీయ రహదారిపై రాజానగరం గైట్ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. బొమ్మూరు పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం శానిటోరియం ప్రాంతానికి చెందిన అందె అఖిల్ కుమార్ (30) వై–నాట్ షోరూమ్లో పనిచేస్తున్నాడు. అతను తన బైక్పై రాజానగరంలోని బంధువుల ఇంటికి వచ్చి, తిరిగి వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. స్థానిక గైట్ ఇంజినీరింగ్ కళాశాల దాటిన తరువాత అతను ప్రయాణిస్తున్న బైకును వెనుక నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో అతని తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతన్ని ఢీకొన్న వాహనం బైక్ను కొద్దిదూరం ఈడ్చుకుపోయింది. దీంతో రోడ్డు రాపిడికి ట్యాంకులో పెట్రోలు లీకై , మంటలు వ్యాపించి, బైకు పూర్తిగా కాలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న 108 సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నా ప్రయోజనం లేకపోయింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని బొమ్మూరు పోలీసులు తెలిపారు. -
దారిదాపుల్లో మలుపులే!
25 నుంచి వర్జీనియా పొగాకు కొనుగోళ్లు దేవరపల్లి: ప్రస్తుత సంవత్సరంలో రైతులు పండించిన పొగాకు కొనుగోళ్లు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శుక్రవారం గుంటూరులో టుబాకో బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో రైతు సంఘాల ప్రతినిధులు, కొనుగోలు సంస్థలు, బోర్డు అధికాలతో చర్చించి నిర్ణయించారు. రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో ఈ కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్టు రీజనల్ మేనేజరు జె.సుందర కుమార్ తెలిపారు. రీజియన్ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెంలోని రెండు వేలం కేంద్రాల్లో కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 29,132 హెక్టార్లలో సాగు 2025–26 సంవత్సరానికి రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో 12,612 మంది రైతులు 29,132 హెక్టార్లలో పొగాకు పండించారు. 14,417 బ్యారన్లు రిజిస్ట్రేషన్ చేశారు. ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో 47.29 మిలియన్ల కిలోలు, తొర్రేడు ప్రాంతంలో పండిస్తున్న ఎన్బీఎస్ 2.03 మిలియన్ల కిలోలు మొత్తంగా 49.32 మిలియన్ల కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతించింది. అయితే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినందున ఉత్పత్తి పెరుగుతుందని అధికారులు, ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. గత ఏడాది 61.27 మిలియన్ల కిలోల ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇవ్వగా 83.88 మిలియన్ల కిలోలు పండించారు. కిలో సగటు ధర రూ.311, గరిష్ఠ ధర రూ.453 రైతులకు లభించడంతో మంచి లాభాలు వచ్చాయి. ఈ ఏడాది కూడా మార్కెట్ ఆశాజనకంగా ఉంటుందని వారు ఆశిస్తున్నారు.మత్తు వీడక.. ఏజెన్సీలో వివిధ ప్రాంతాలకు అనేక మంది సరదాగా గడిపేందుకు వస్తుంటారు. మధుర స్మృతులను మూటగట్టుకోవాలని భావిస్తుంటారు. ఈ నేపథ్యంలో కొందరు మద్యం తాగుతుంటారు. తర్వాత వేగంగా వెళ్తూ తెలియని మలుపుల్లో ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ మత్తు ఎందరినో తిరిగిరాని లోకాలకు తీసుకెళ్తుంది. దీనిపై పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఎక్కడా మార్పు రావడం లేదు. చివరికి అనర్థాలు జరిగిపోతూనే ఉన్నాయి. కొండ కోనలు.. చూడచక్కని పచ్చని అందాలు.. వాగులు.. ఆపై ఘాట్ రోడ్లు.. ముచ్చట గొలిపే ప్రకృతి సోయగాలు.. వన్యప్రాణులు.. పక్షుల కిలకిలరావాలు.. ఇలా ఆహ్లాదంగా సాగిపోతున్న ఏజెన్సీ ప్రయాణంలో ఓ ‘మలుపు’ జీవితాన్నే మార్చేస్తోంది.. కొందరిని తిరిగి రాని లోకాలకు తీసుకుపోతుంటే, మరికొందరు గాయాలతో బయట పడుతున్నారు.. పర్యాటక అందాలు తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి అనేకమంది తరలి వస్తుంటారు.. అలాంటి వారికి ఇక్కడి రోడ్లపై అవగాహన లేక, ఆపై మద్యం మత్తు, మరోపక్క వేగానికి కళ్లెం లేకపోవడంతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రంపచోడవరం: ప్రకృతి అందాలకు నిలయమైన మన్యంలో రోడ్డు ప్రమాదాలు అనేక మంది ప్రాణాలను హరిస్తున్నాయి. మితిమీరిన వేగం.. ఆపై మలుపులపై అవగాహన లేకపోవడం.. మద్యం మత్తులో ప్రయాణంతో ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. జిల్లాలో రంపచోడవరం, మారేడుమిల్లి అందాలు చూసేందుకు అనేక మంది వచ్చి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రమాదాలను నివారణకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు కూడా నిర్వహిస్తున్నా, ఎక్కడ తగ్గడం లేదు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం వైపున పోక్సుపేట వద్ద ఏజెన్సీ ముఖ ద్వారం ప్రారంభమవుతోంది. గోకవరం – రంపచోడవరం రోడ్డులో అనేక చోట్ల ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఈ ప్రాంతానికి బైక్లపై వచ్చేవారు వేగంగా వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. గోకవరం నుంచి రంపచోడవరం గ్రామానికి 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. పోక్సుపేట దాటిన వెంటనే చిన్నబాపనమ్మ తల్లి గుడి వద్ద ప్రమాదకర మలుపు ఉంది. తరువాత ఏ–1 రిసార్ట్స్ వద్ద మరో మలుపు ఆందోళనకు గురిచేస్తోంది. ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. నరసాపురం దాటిన తరువాత రోడ్డు ఎక్కువ దూరం దిగుడుగా ఉండి ఒక పెద్ద మలుపు ఉంటుంది. సీతపల్లి గుడి తర్వాత ప్రమాదకర మలుపు ఉంది. గతంలో ఇక్కడ అనేక మంది మృత్యువాత పడ్డారు. వేగంగా వచ్చే వాహనదారులు దగ్గర మలుపు కావడంతో కంట్రోల్ చేయలేక ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. ఐ.పోలవరం గ్రామానికి సమీపంలోని పాలకాలవ దగ్గరలో, జాగరంపల్లి జంక్షన్ వద్ద మలుపులు ఉన్నాయి. రంపచోడవరం– గోకవరం రోడ్డులో ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయి. తాజాగా ఏడుగురాళ్లపల్లికి చెందిన ఇద్దరు సచివాలయ ఉద్యోగులు పాలకాలువ సమీపంలో వాహనాన్ని ఢీకొని మృతి చెందారు. ఇదే మలుపులో బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. రంపచోడవరం –మారేడుమిల్లి మార్గంలోనూ మలుపులు హడలెత్తిస్తున్నాయి. రంపచోడవరం అటవీశాఖ చెక్పోస్టు, ఏపీఆర్ కళాశాల వద్ద ప్రమాదకర మలుపు ఉంది. మారేడుమిల్లి రోడ్డులో అనేక చోట్ల టర్నింగ్ పాయింట్లు ఉన్నాయి. గెద్దాడ గ్రామం దాటిన తరువాత సీమగండి వద్ద ఒంపుగా మలుపు ఉంది. ఇక్కడ అనేక ప్రమాదాలు జరిగాయి. సున్నంపాడు – దేవరపల్లి వద్ద కూడా ప్రమాదఘంటికలు మోగుతున్నాయి. మారేడుమిల్లి నుంచి వస్తూ అనేక మంది పర్యాటకులు ప్రమాదాల బారిన పడ్డారు. తాజాగా మారేడుమిల్లి రోడ్డులో దేవరపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో వైటీసీ మేనేజర్ మృతి చెందారు. ఘాట్ రోడ్లలోనూ.. మారేడుమిల్లి – చింతూరు ఘాట్ రోడ్డులో అనేక చోట్ల భద్రతా చర్యలు లేవు. దీంతో వాహనాలు లోయలో ప డి ఎందరో ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉ న్నాయి. పాములేరు నుంచి ప్రారంభమయ్యే ఘాట్ రోడ్డు 22 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోడ్డులో అనేక చోట్ల ప్రమాదకర పరిస్థితులు ఉన్నా పట్టించుకునే నా ఽథుడే లేడు. ఇటీవల ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడి అనేక మంది మృత్యువాత పడ్డారు. గతంలో కర్ణాటకాకు చెందిన యాత్రికుల మినీ బస్సు ఘాట్ రోడ్డు లో పైమలుపు నుంచి అదుపుతప్పి కిందపడి ఏడుగురు వరకూ ప్రాణాలు కోల్పోయారు. ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా కనీస చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. అనేక చోట్ల రక్షణ గోడలు, ఐరన్ గడ్డర్లు ఏర్పాటు చేయాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా ప్రమాదాల నివారణకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.ఫ ప్రమాదాలకు నిలయంగా మన్యం ఫ హడలెత్తిస్తున్న రోడ్డు ప్రమాదాలు ఫ జీవితాలను కుదిపేస్తున్న మలుపులు -
ఇఫ్తార్ విందులో ఎంఏ షరీఫ్
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరు గ్రామంలోని బిలాల్ మసీదులో శుక్రవారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ విందుకు రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ సంక్షేమ సలహాదారు, మాజీ శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్, రాష్ట్ర ఆరోగ్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవి రామ్కిరణ్ పాల్గొన్నారు. షరీఫ్ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రామ్ కిరణ్ మాట్లాడుతూ రంజాన్ మాసం అందరికీ శాంతి, సౌభాగ్యం తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, రాష్ట్ర నూర్బాష్ సాధికార కమిటీ అధ్యక్షుడు షేక్ సుభాన్ తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్యూ జాతీయ ఉపాధ్యక్షుడిగా కిరణ్ కుమార్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పీడీఎస్యూ జాతీ య కమిటీ ఉపాధ్యక్షుడిగా ఎస్.కిరణ్కుమార్ ఎన్నికయ్యా రు. ఆ వివరాలను శుక్రవారం జిల్లా ప్రధాన కార్యదర్శి భానుప్రసాద్ తెలిపా రు. యూనియన్ ప్రథమ జాతీయ మహాసభలు ఈనెల 3, 4 తేదీలలో విజయవాడలోని సింగ్ నగర్ గుజ్జల సరళా దేవి ఫంక్షన్ హాల్లో నిర్వహించారని, ఈ సభల్లో ఎస్.కిరణ్ కుమార్ను జాతీయ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారన్నారు. -
అత్యంత విషమంగా కల్తీపాల బాధితుల పరిస్థితి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కల్తీపాల ఘటనలో స్థానిక ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉంది. రోజురోజుకూ వారి ఆరోగ్యం క్షీణిస్తోంది. ఈ ఘటనలో 21 మందికి 10 మంది మృత్యువాత పడగా, 11 మందికి అత్యవసర వైద్య చికిత్సలు అందిస్తున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్కు సంబంధించిన వివరాల ప్రకారం కిమ్స్ బొల్లినేనిలో నలుగురికి వైద్య చికిత్సలు అందిస్తుండగా వారిలో ఇద్దరికి వెంటిలేటర్, ఇద్దరికి వెంటిలేటర్, డయాలసిస్ పక్రియ కొనసాగుతోంది. రెయిన్బో చిల్డ్రన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురూ వెంటిలేటర్, డయాలసిస్పై ఉన్నారు. డెల్టా ఆసుపత్రిలో ముగ్గురికి వెంటిలేటర్, డయాలసిస్ పక్రియ కొనసాగుతోంది. రవి చైతన్య కిడ్నీ కేర్లో ఒకరికి డయాలసిస్ జరుగుతోంది.టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రాజమహేంద్రవరం సిటీ: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు ఆర్టీసీ పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు బస్సులలో తమ నివాస స్థలం నుంచి పరీక్ష కేంద్రాలకు ఉచితంగా ప్రయాణించవచ్చునని జిల్లా ప్రజా రవాణా అధికారి వైఎస్ఎన్ మూర్తి శుక్రవారం తెలిపారు. ప్రయాణ సమయంలో విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చునన్నారు. ఈ మేరకు సిబ్బందికి ప్రత్యేక సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. టెన్త్ పరీక్షలు సమర్థంగా నిర్వహించాలి రాజమహేంద్రవరం రూరల్: ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలను సమర్థంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి కంది వాసుదేవరావు అధికారులను ఆదేశించారు. స్థానిక ఆల్కాట్తోటలోని సత్య సాయి గురుకులంలో శుక్రవారం జిల్లాలోని ఎంఈఓలు, పాఠశాలల హెచ్ఎంలు తదితర అధికారులతో సమీక్షించారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఆయా కేంద్రాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. కార్యక్రమంలో కార్యాలయ ఏడీ వెంకటరాజు, డీసీఈబీ కార్యదర్శి దేవా అనిత, కొవ్వూరు డివిజన్ ఉప విద్యాశాఖాధికారి బి.దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అతివంచక పాలన!
● మహిళల అణచివేతలో బాబు సర్కార్ విజయం ● ఎన్నికల హామీలు, అభివృద్ధి పనులలో ప్రొటోకాల్లో విస్మరణ ● దుష్ట పానలకు ఎదురొడ్డి చైతన్యంతో.. మానవత్వం చాటుతున్న మహిళాలోకం కపిలేశ్వరపురం: చంద్రబాబు ప్రభుత్వం 20 నెలల పా లన అంతా మహిళలను కష్టపెట్టడం, నష్టాలపాలుజేయడం, అణచివేయడాలతోనే సాగింది. పైగా మహి ళా దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకాలను ప్రారంభిస్తున్నట్టు గొ ప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇచ్చిన హామీలకు అతీగతీ లేదు కానీ ప్రచారాలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన చంద్రబాబు దగా పాలనపై ప్రత్యేక కథనం... ఉమ్మడి జిల్లాలో మహిళా శక్తి ఇలా కాకినాడ జిల్లాలో 7,27,788, తూర్పుగోదావరి 6,39,604, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 5,86,791, పోలవరం జిల్లాలో 95,839 కుటుంబాలను మహిళలు కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 12,152 మందికి పైగా అంగన్వాడీలు, 3,200 మంది ఆశ కార్యకర్తలు ఉన్నారు. 5,33,815 మంది ఉపాధి కూలీల్లో అత్యధికులు మహిళలే ఉన్నారు. 1,144 సచివాలయాల పరిధిలో వేలాది ఉద్యోగుల్లో మహిళలు అ నేక మంది ఉన్నారు. 2,892 మంది వీఓఏలున్నారు. ఉత్పాదక, అనుత్పాదక రంగాల్లో మహిళా శ్రామికులున్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు మూలకు.. వైఎస్ జగన్ తెచ్చిన దిశ యాప్ను కాపీ కొట్టి శక్తి యా ప్ను తీసుకురావడమూ, మహిళా ఓట్ల కోసం నోటికొచ్చిన హామీలు ఊదరగొట్టారు. ఎస్సీ, బీసీ, మైనారిటీ మహిళలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తామన్నారు. కాకినాడ జిల్లాలో 4,920 మందికి, తూర్పుగోదావరి జిల్లాలో 2,904, కోనసీమ జిల్లాలో 3,190 మందికి కుట్టులో శిక్షణ ఇచ్చి ఏడాది కాలంగా కుట్టు మిషన్లు ఇస్తామన్నారు. మహిళా శ్రామికులు ఉండే చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.25 వేల ఆర్థికసాయం, సీ్త్రశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించినప్పటికీ వారికి సౌకర్యవంతమైన ప్ర యాణాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. అదనపు బస్సులు కానీ, సిబ్బంది నియామకాలు కానీ లేక మహిళా ప్రయాణికులు సతమతమవుతున్నారు. ప్రజాప్రతినిధుల హక్కులు కాలరాత ఉమ్మడి జిల్లాలో 1,102 గ్రామ పంచాయతీలుండగా వాటిలో 1070 పంచాయతీలకు 2021 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించగా 50 శాతం పైగా మహిళలే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ఈఏడాది ఏప్రిల్ 2తో సర్పంచ్ల పదవీకాలం ముగియనుంది. 2024 చంద్రబాబు ప్రభుత్వ వచ్చిననాటి నుంచి వారి హక్కులు కాలరాస్తున్నారు. 2025 జూన్ 28న ప్రొటోకాల్ విస్మరించడాన్ని నిరసిస్తూ రామచంద్రపురం కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్లు నిరసన తెలిపారు. వేగాయమ్మపేట, వెంకటాయపాలెం, తాళ్లపొలం సర్పంచ్లపై అక్రమ కేసులను నిరసిస్తూ 2025 జనవరి 4న రామచంద్రపురం మండల సమావేశానికి సర్పంచ్లు నల్లబ్యాడ్జీలతో హాజరయ్యారు. విచ్చలవిడి మద్యం విక్రయాలు మద్యం విక్రయాలు వద్దు బాబూ అని మహిళలు నెత్తీ నోరూ మొత్తుకుంటుంటే చంద్రబాబు ప్రభుత్వం ఆ విక్రయాలను మరింత ప్రోత్సహిస్తోంది. ఈ సర్కార్ వచ్చాక కాకినాడ జిల్లాలో 155 ప్రైవేటు షాపులు, 20 బార్లు, తూర్పుగోదావరి జిల్లాలో 154 షాపులు, 19 బార్లు, కోనసీమ జిల్లాలో 169 షాపులు, 10 బార్లకు అనుమతి ఇచ్చింది. వాటి ప్రారంభించేటపుడు వాటిని తొలగించాలంటూ మహిళలు ధర్నాలు చేశారు. రాజమహేంద్రవరం ఐఎల్టీడీ సెంటర్లో బార్ తొలగించాలంటూ గురువారం మహిళలు ధర్నా చేశారు. ఈ ఏడాది సంక్రాంతి నాలుగు రోజుల్లో కాకినాడ జిల్లాలో రూ.23.23 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో రూ.17.20 కోట్లు, కోనసీమ జిల్లాలో రూ.15.61 కోట్లు మద్యం విక్రయాలు సాగాయి. నేరాలు, ఘోరాల్లో సమిధలుగా.. ఉమ్మడి జిల్లాలో మహిళా సంబంధిత సమస్యలపై 2024లో 783, 2025లో 727 కేసులు నమోదయ్యాయి. పోక్సో కేసులు 2024లో 114, 2025లో 110, సైబర్ సామాజిక మాద్యమాల నేరాలు 2024లో 140, 2025లో 123 కేసులు నమోదయ్యాయి. రాయవరం ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ అయినవిల్లి సంధ్య 2025 ఫిబ్రవరి 26న ప్రేమ వివాహం చేసుకోగా అదే రోజు అర్థరాత్రి వరుడు సూర్య ప్రకాశరావును సంధ్య సోదరులు బండరాయితో కొట్టి కిరాతకంగా చంపేశారు. బాల్య వివాహాలను ప్రభుత్వం కట్టడి చేయలేకపోతుంది. 18 ఏళ్లలోపు గర్భం ధరించిన వారు 2024–25లో తూర్పు గోదావరి జిల్లాలో 337 మంది, కోనసీమ జిల్లాలో 506 మంది ఉండగా, కాకినాడ జిల్లాలో గత 10 పది నెలల కాలంలో 2,331 మంది ఉన్నారు. కూనవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో 24 మంది, ఎటపాక ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిథిలో 12 మంది కిశోర గర్భిణులున్నారు. రాజమహేంద్రవరం పాలకల్తీ ఘటనలో మృతి చెందిన 10 మందిలో ఐదుగురు మహిళలే. వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో ఫిబ్రవరి 28న జరిగిన ఘోర విస్ఫోటంలో 28 మంది మృతిచెందగా వారిలో 10 మందికి పైగా మహిళలున్నారు. పోరుబాటలో మహిళాలోకం కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల హాస్టల్ను కాపాడుకునేందుకు 2025 డిసెంబర్ 31న రాజమహేంద్రవరం కలెక్టర్ బంగ్లా వద్ద, ఫీజు రీయింబర్స్మెంటు బకాయిలు చెల్లించాలంటూ ఫిబ్రవరి 10న కాకినాడ కలెక్టరేట్ వద్ద విద్యార్థినులు నిరసన తెలిపారు. ఈ నెల 2న విజయవాడ అలంకార్ ధర్నా చౌక్లో అంగన్వాడీలు, 5న ఆశా కార్యకర్తలు ఉవ్వెత్తు న పోరాడారు. కాకినాడ కలెక్టరేట్ను ముట్టడించారు. మద్యం దుకాణాలు తొలగించాలంటూ ఈ ఏడాది జనవరి 11న కోటనందూరు మండలం కేఈ చిన్నాయిపాలెంలోనూ, మండపేట పట్టణంలో 2025 మార్చి 13న మహిళలు ధర్నాలు చేశారు. మానవత్వం చాటిన మహిళలెందరో... కాకినాడ అపోలో ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు చెందిన మేడపాటి పద్మజ (44) అవయవాలను ఆమె కుటుంబ సభ్యులు 2025 డిసెంబర్ 30న ముగ్గురుకి దానం చేశారు.అలాగే ఎంతో మంది మహిళలు ఆయా సందర్భాలలో మానవత్వాన్ని చాటుకున్నారు. -
చిక్కదు.. దొరకదు
ఫ పులికొండ వద్ద పులి మకాం! ఫ బంధించేందుకు అధికారుల యత్నం అడ్డతీగల: పులి జాడ అంతు చిక్కకుండా పోతోంది.. అందరినీ పరుగులు తీయిస్తోంది.. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా చివరికి కన్నుగప్పి మయం అవుతోంది.. కొద్ది రోజులుగా మన్యంలో పెద్ద పులి సంచారంతో అందరిలో ఆందోళన రేగుతోంది. జిల్లాలోని ఏలేరు జలాశయం పరివాహక ప్రాంతమైన పులికొండ వద్ద పెద్ద పులి రెండు రోజులుగా మకాం చేసింది. తన ఉనికిపై అటవీ అధికారులను ఆలోచనలో పడేసింది. గంగవరం మండలం ట్యాంకుబీడు ప్రాంతంలో నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాంతాల నుంచి వచ్చిన అటవీ శాఖ రెస్క్యూ టీం సభ్యులు డ్రోన్లు, ట్రాకింగ్ కెమేరాలతో పులి సంచారాన్ని ట్రాకింగ్ చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమేరాలను ముఖ్యమైన చోట్ల అమర్చారు. పులి సంచరిస్తే ఆ దృశ్యాలు, ఈ కెమేరాల్లో నిక్షిప్తమవుయనే ఆలోచనతో వీలైనన్ని ట్రాప్ కెమేరాలను రప్పించి నిర్దేశిత ప్రాంతాల్లో అమర్చారు. మరోవైపు పులిని బంధించేందుకు కొన్ని ఆవులను అటవీ ప్రాంతంలో విడిచి పెట్టినట్లు తెలియవచ్చింది. రాత్రి సమయాల్లో 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం ఆ పెద్ద పులి ప్రయాణిస్తుంది. ఏలేరు జలాశయం బ్యాక్ వాటర్కు చేరువలో ఉన్న పులికొండ తన ఆవాసానికి అనువుగా ఉన్న నేపథ్యంలో పులి ఆ ప్రాంతంలో తిష్ట వేసిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పులి ఎటువైపు వెళ్తుందో తెలియక అధికారులు డోలాయమానంలో ఉన్నారు. ఈ పరిస్థితిలో గంగవరం మండలం ట్యాంక్బీడు, మొల్లేరు, మల్లవరం, రాముల్ధేవపురం, వడ్డిచెరువు, అడ్డతీగల మండలం గడిచిన్నంపాలెం, డి.కృష్ణవరం వంటి ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సూదికొండ అటవీ క్షేత్రం పరిధి నుంచి రాజవొమ్మంగి అటవీ క్షేత్రం పరిధిలోకి పులి ప్రవేశించవచ్చని భావిస్తున్నాయి. దీంతో అడ్డతీగల, రాజవొమ్మంగి అటవీ క్షేత్రాల పరిధిలోని అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. భయం గుప్పిట్లో ప్రజలు గోకవరం: అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో గోకవరం మండలం మల్లవరం వాసులు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. గంగవరం మండలంలో పులి సంచరిస్తుండటంతో తమ గ్రామంలోకి పులి ప్రవేశిస్తుందని ఆందోళన చెందుతున్నారు. మరోపక్క మండలంలో పలు గ్రామాల్లో శుక్రవారం పులి సంచరిస్తుందని పుకార్లు షికార్లు చేయడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చాలామంది ఇళ్లకే పరిమితం అవుతున్నారు. మరోపక్క అటవీశాఖ అధికారులు పులిని బంధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. -
16 నుంచి పదో తరగతి పరీక్షలు
● జిల్లాలో 138 కేంద్రాల్లో నిర్వహణ ● కలెక్టర్ కీర్తి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఈ నెల 16వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నట్టు కలెక్టర్ కీర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ వరకు సాగనున్న ఈ పరీక్షలకు జిల్లాలో 138 కేంద్రాలలో ఏర్పాట్లు చేశామని, ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఒకే సెషన్లో పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో 24,538 మంది ఈ పరీక్షలు రాస్తుండగా, రెగ్యులర్గా 13,322 మంది, ప్రైవేట్గా 11,216 మంది రాస్తున్నారని ఆమె తెలిపారు. వారిలో విద్యార్థులు 12,555 మంది, విద్యార్థినులు 11,983 మంది ఉన్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పోలీస్ శాఖ ద్వారా కట్టుదిట్టమైన బందోబస్తు, స్ట్రాంగ్ రూమ్లకు 24 గంటల భద్రత, ప్రశ్న పత్రాల రవాణాకు ఎస్కార్ట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పరీక్షల సమయంలో ఆయా కేంద్రాల సమీపంలోని జెరాక్సు సెంటర్లను మూసివేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలని తహసీల్దార్లను ఆదేశించామన్నారు. మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు తాగునీరు, ఫర్నిచర్ తదితర వసతులు కల్పించాలన్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆయా రూట్లలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని, వైద్యశాఖ ఫస్ట్ ఎయిడ్ సదుపాయాలు కల్పించాలని, విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని ఆదేశించారు. వాట్సాప్ ద్వారా హాల్ టికెట్లు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 95523 00009 నంబర్కు ‘ఏజీ’ అని మెసేజ్ చేస్తే, తదుపరి అందుబాటులో వచ్చే సేవల్లో ‘విద్యా సేవలు’ ఎంపిక చేసి, ఎస్ఎస్సీ హాల్ టికెట్పై క్లిక్ చేయాలన్నారు. అనంతరం విద్యార్థి అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. హాల్ టికెట్లో వివరాలు సరిచూసుకుని తేడాలు ఉంటే సంబంధిత హెచ్ఎంలకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. పాఠశాలల లాగిన్ ద్వారా కూడా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందన్నారు. -
భారం లేని ఉపాధి ద్వారం!
● పాలిసెట్కు నోటిఫికేషన్ విడుదల ● ’పది’ విద్యార్థులకు చక్కని అవకాశం ● ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష రాయవరం: సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు పొందవచ్చు. పదో తరగతి పరీక్షలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగానే సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు పాలిసెట్–2026 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధ్యాయులు, సాంకేతిక నిపుణులు సూచిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్బీఏ గుర్తింపు పాలిటెక్నిక్ డిప్లమా కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు దరి చేర్చేలా కళాశాలలకు అనుబంధంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరిశ్రమలతో కళాశాలలను అనుసంధానం చేయడం ద్వారా ఏటా కళాశాలల్లో క్యాంపస్ సెలెక్షన్స్ నిర్వహించారు. నైపుణ్యం ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు కూడా దక్కాయి. గత ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్(ఎన్బీఏ) గుర్తింపు లభించింది. భావిజీవితానికి బాటలు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం ద్వారా తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే దానిని పునాదిగా చేసుకుని భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. గ్రామీణ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంజినీరింగ్ వంటి ఉన్నత సాంకేతిక చదువులను అందుకోవాలంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని. అటువంటి వారికి పాలిటెక్నిక్ కోర్సులు చక్కని వేదికలు. పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్ కోర్సు్ోల్ల చేరి విలువైన సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకుని సత్వర ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందే వీలుంటుంది. పాలిసెట్–2026 కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఏప్రిల్ 4వ తేదీన దరఖాస్తుల స్వీకరణకు తుది గడువుగా ప్రకటించారు. పాలిసెట్ ఎంట్రెన్స్ ఇలా.. 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. గణితం 50, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 30 మార్కులకు పరీక్ష ఉంటుంది. పదో తరగతి సిలబస్ ఆధారంగా ఎంట్రెన్స్ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 30న పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.100, ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.400గా నిర్ణయించారు. విద్యార్థులకు ప్రయోజనాలెన్నో.. పాలిటెక్నిక్లో ఏ కోర్సు పూర్తి చేసినా ఉద్యోగం, ఉపాధి సులభంగా దొరుకుతుంది. ఈ కళాశాలల్లో ఇటీవల తరచూ ఉద్యోగ మేళాలను నిర్వహిస్తున్నారు. ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కోర్సు చేయడానికి మూడేళ్లకు కేవలం రూ.13 వేలు అవుతుంది. ఆ తర్వాత ఇంజినీరింగ్ సెకండియర్లో చేరవచ్చు. లేదా ఉద్యోగానికి ప్రయత్నించవచ్చు.లభించే కోర్సులివీ.. పాలిటెక్నిక్ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. పలుచోట్ల ఒక్కో కోర్సులో ఒక్కో బ్రాంచ్కు 60 నుంచి 120 వరకూ సీట్లు అందుబాటులో ఉంటాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఉండగా, జిల్లా వ్యాప్తంగా మరో ఐదు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. జిల్లాలో 1,560 వరకు వివిధ ట్రేడ్స్లో సీట్లు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం, అనపర్తిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలుండగా, కాకినాడ జిల్లాలో కాకినాడలో రెండు, పిఠాపురంలో ఒకటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలున్నాయి. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో దాదాపుగా 17 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలుండగా, దాదాపుగా 4,500 సీట్లు ఉన్నట్లు సమాచారం. ఈ కోర్సు కాల వ్యవధి మూడేళ్లు. ఇందులో భాగంగా ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. విద్యార్థుల నైపుణ్యం పెంపొందించుకునే శిక్షణ సైతం ఇస్తారు. పాలిసెట్ ఎంట్రన్స్ల క్వాలిఫై మార్కులు 35 గా నిర్ణయించారు. కోచింగ్, మెటీరియల్ ఉచితం త్వరితగతిన ఉపాధి పొందేందుకు పాలిటెక్నిక్ చక్కని అవకాశం. ప్రతి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత కోచింగ్తో పాటు, సంబంధిత మెటీరియల్ కూడా ఉచితంగా సరఫరా చేస్తున్నాం. – ఆకుల మురళి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, పాలిసెట్–2026, రాజమహేంద్రవరం హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు పాలిటెక్నిక్ కోర్సులు చేసిన వారికి మంచి అవకాశాలున్నాయి. పాలిసెట్కు సంబంధించిన వివరాల కోసం కళాశాలలో హెల్ప్లైన్ సెంటర్ ఏర్పాటు చేశాం. అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రవేశాలు పొందేలా విస్తృతంగా ప్రచారం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం – జీవీవీఎల్ సత్యనారాయణ, ప్రిన్సిపాల్, ప్రభుత్వ పాలిటెక్నిక్, అనపర్తి -
‘నన్నయ’లో ఖోఖో పోటీలు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఖోఖో వుమెన్ ఇంటర్ కాలేజీయేట్ కం చాంపియన్ షిప్ అండ్ యూనివర్సిటీ టీమ్ సెలెక్షన్స్ గురువారం జరిగాయి. గోదావరి జిల్లాలోని అనుబంధ కాలేజీల నుంచి 16 జట్లు, 240 మంది క్రీడాకారుల మధ్య పోటీ రసవత్తరంగా జరిగింది. ఈ పోటీలో రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల జట్టు ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా ద్వితీయ స్థానంలో గొల్లల మామిడాడలోని డీఆర్ రెడ్డి కళాశాల, తృతీయ స్థానంలో ఏలూరులోని సెయింట్ థెరిసా కళాశాల జట్లు నిలిచాయని రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి తెలిపారు. వీరి నుంచి యూనివర్సిటీ టీమ్ని ఎంపిక చేసి, కర్ణాటకలోని దేవాంగరే యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ పోటీలకు పంపిస్తామన్నారు. ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ పి.విజయనిర్మల, సెక్రటరీ డాక్టర్ ఎంవీవీఎంయూ ఫణీంద్ర, పరిశీలకులు డాక్టర్ ప్రమీలారాణి, సెలెక్షన్ కమిటీ సభ్యులు ధర్మేంద్ర, పట్టాభి పాల్గొన్నారు. ప్రథమ స్థానంలో నిలిచిన రాజమండ్రి ప్రభుత్వ డిగ్రీ కళాశాల -
వివాహిత ఆత్మహత్య
ధవళేశ్వరం: స్థానిక బత్తిన సుబ్బారావు కాలనీకి చెందిన వివాహిత శీలంశెట్టి నాగవర్ష(30) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బత్తిన సుబ్బారావు కాలనీకి చెందిన శీలంశెట్టి శరత్, నాగవర్షకు 14 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. బుధవారం రాత్రి స్నానానికి వెళ్ళిన నాగవర్ష ఎంతకీ తిరిగి రాకపోవడంతో వెళ్ళి చూడగా సీలింగ్కు ఉరివేసుకొని ఉంది. ఉరి వేసుకొని ఉన్న నాగవర్షను భర్త, అటుగా వెళుతున్న మరొక వ్యక్తి కిందకు దించి స్థానిక డాక్టర్ను పిలవగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలు అన్నయ్య బైరిశెట్టి శివరామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ధవళేశ్వరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సీఐ టి.గణేష్ దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం స్వాధీనం తాళ్లపూడి: కొవ్వూరు పట్టణంలోని గోష్పాద క్షేత్రం పక్కన గల రజకులు దుస్తులు ఉతికే రేవులో గోదావరి నది ఒడ్డున మృతదేహాన్ని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సీఐ పి విశ్వం ఘటనా ప్రదేశంలో వివరాలను సేకరించారు. మృతదేహానికి సమీపంలో మోటార్ సైకిల్ ఉండగా దానిపై పి వెంకటేశ్వరరావు అని రాసి ఉందని చెప్పారు. అతని వివరాల కోసం ఇతర సేష్టన్లకు సమాచారం పంపామని తెలిపారు. మృతుడు పొకలి వెంకటేశ్వరావుగా అతనిది కృష్ణా జిల్లా కృటివేణు మండలం సీతనపల్లిగా తెలిసిందని తెలిపారు. అతని బంధువులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. మోసగించిన కేసులో పురోగతి లేక నష్టపోతున్నాం కపిలేశ్వరపురం (మండపేట): మండపేట ఐశ్వర్య నగర్లో కార్యకలాపాలు సాగిస్తున్న గుప్తా చిట్స్ అండ్ ఫైనాన్స్ సంస్థ తమతో డిపాజిట్లు చేయించుకుని మోసగించిందని, ఆ నేపథ్యంలో తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి నాలుగు నెలలు కావస్తున్నా కేసులో పురోగతి లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసులో నిందితులను అదుపులోకి తీసుకోలేదని పోలీసుల తీరును బాధితులు తప్పుబట్టారు. మండపేట పట్టణంలో గురువారం బాధితుడు గ్రంధి సూర్య వెంకట ప్రకాష్రావు విలేకరులకు తన గోడు చెప్పుకున్నారు. చిట్ అండ్ ఫైనాన్స్ సంస్థలో చేసిన డిపాజిట్లు కాలపరిమితి ముగిసిందని, త్వరలో మీ సొమ్ము తిరిగి ఇస్తామని తమ వద్ద నుంచి డిపాజిట్లు బాండ్లను సంస్థ నిర్వాహకులు వాకచర్ల గుప్తా బంధువు చెక్కా సత్యనారాయణ తీసుకెళ్లారన్నారు. తమ సొమ్ము తిరిగి ఇవ్వకపోవడంతో ఫిర్యాదు చేయగా మండపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. కేసు నమోదు చేసి నాలుగు నెలలు అయినప్పటికీ నిందితులను అదుపులోకి తీసుకోలేదన్నారు. 90 రోజుల్లో విచారణ జరిపి నివేదిక సమర్పించాలన్న హైకోర్టు ఉత్తర్వులను కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి బాధితులు సుమారు రూ.ఏడు కోట్లు నష్టపోయారని, ఆ సొమ్మును నిందితులు వేర్వేరు ప్రాంతాలకు తరలించారని ఆరోపించారు. కేసును త్వరితగతిన విచారించి బాధితులకు న్యాయం చేయాలని సూర్య వెంకట ప్రకాష్రావు పోలీసులను కోరారు. -
కోనసీమ స్నోబగులు!
గోదావరి తీరంలో ఆకట్టుకునే మంచు అందాలు వైనతేయ తీరంలో మంచు అందాల నడుమ పడవ ప్రయాణం మామిడికుదురు: వైనతేయ గోదావరి నదీ తీరం పెదపట్నంలంకలో గురువారం ఉదయం మంచు ముసుగులో అద్భుతమైన దృశ్యాలు ఆవిష్కృతమయ్యాయి. మంచు అందాల నడుమ గోదావరి నదిలో పడవపై తిరిగి ఇంటికి వస్తున్న రైతులు, గోదావరి నదీ తీరంలో లంగరు వేసిన పడవలు, వర్షం తరహాలో కురుస్తున్న మంచు అందాల నడుమ పచ్చని కొబ్బరి చెట్లు, పంట పొలాలు, పంట కాలువలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేశాయి. -
నిరాధార ఆరోపణలు తగవు
ఎమ్మెల్సీ సోము వ్యాఖ్యలపై జయలక్ష్మి సొసైటీ చైర్మన్ త్రినాథరావు కాకినాడ రూరల్: వేలాది మంది డిపాజిటర్లతో ముడిపడి ఉన్న జయలక్ష్మి సొసైటీపై శాసనమండలిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు నిరాధార ఆరోపణలు చేయడం తగదని చైర్మన్ గంగిరెడ్డి త్రినాథరావు తెలియజేశారు. సర్పవరం జంక్షన్ వద్ద జయలక్ష్మి సొసైటీ మెయిన్ బ్రాంచ్ వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జయలక్ష్మి ఎంఏఎం కో ఆపరేటివ్ సొసైటీ ప్రస్తుత పాలకవర్గం రూ.7కోట్లు దుర్వినియోగం చేసినట్టు తీవ్రమైన ఆరోపణలను ఎమ్మెల్సీ మండలిలో చేశారన్నారు. పెద్దల సభలో నిజాలు మాట్లాడాలని, జయలక్ష్మి సొసైటీపై చేసిన ఆరోపణలకు సంబంధించి సమాచారం మీరు ఎవరు వద్ద తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారుల సమాచారం తీసుకున్నారా లేదా సొసైటీ ఆఫీసులో సమాచారం తీసుకున్నారా తెలియజేయాలన్నారు. ఇటు వంటి ఆరోపణలు వలన మా మనోభావాలు దెబ్బతిన్నాయని, 20వేల మంది సభ్యులు, డిపాజిట్లరు మనో వేదనకు గురవుతున్నారన్నారు. మీకు తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. జయలక్ష్మి సొసైటీ గత పాలకవర్గం బోర్డు తిప్పేయడంతో కేసులు సీఐడీ వద్ద పెండింగ్లో ఉన్నాయన్నారు. తమ పాలకవర్గం 67మంది సభ్యుల నుంచి వసూలు చేసిన రూ.7.60 కోట్లు ఉన్నాయని, వారి నుంచి మరో రూ.3కోట్లు వరకు రావల్సి ఉందన్నారు. రూ.7కోట్లు సీఐడీ కేసుల వలన సీజ్ చేసిన వాటిలో ఉన్నాయన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, గౌరవ ఎమ్మెల్సీ వీర్రాజుకు తాము వివరాలు అందజేస్తామన్నారు. జయలక్ష్మి కో ఆపరేటివ్ సొసైటీ మెంబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం మా బాధలు గుర్తించి ట్రిబ్యునల్లో కేసులు పరిష్కారం చేసి ముందుగా సొమ్ము చెల్లించాలన్నారు. సొసైటీ పాలక వర్గ వైస్ చైర్మన్ పీవీ రమణమూర్తి, డైరెక్టర్లు గౌరీ శంకరరావు, సీహెచ్. సుబ్బారావు, శరణార్థి రవిశంకర్ పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతున్న జయలక్ష్మి సొసైటీ చైర్మన్ త్రినాథరావు -
92 కేజీల గంజాయి పట్టివేత
పిఠాపురం రూరల్: పిఠాపురం మండలం పి.దొంతమూరు శివారున జగనన్న కాలనీ ఎదురుగా ఉన్న పామాయిల్ తోటలో 92 కేజీల గంజాయిని పట్టుకున్నట్టు పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. గంజాయి ఉందని వచ్చిన సమాచారం మేరకు పిఠాపురం రూరల్ ఎస్సై, సిబ్బంది, పిఠాపురం తహసీల్దార్ గోపాలకృష్ణ, వీఆర్వోల సమక్షంలో పామాయిల్ తోట వద్ద గాలింపు చేపట్టామన్నారు. పామాయిల్ తోటలో ఒక చోట గంజాయి బస్తాలను గుర్తించామని దాని బరువు 92 కేజీలు ఉందన్నారు. ఆ గంజాయిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఏదైనా వాహనంలో తీసుకుని వచ్చి అక్కడ దాచి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. దొరికిన గంజాయిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన తెలిపారు. -
టీడీపీ పతనం ప్రారంభం
● అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ● ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ ● వైఎస్సార్ సీపీ మద్దతుదార్ల ఓట్లు అధికం ● అందుకే ఎన్నిక డిక్లేర్ చేయలేదని విమర్శ రంగంపేట: మండలంలో జరిగిన ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికల నుంచి టీడీపీ పతనం ప్రారంభమైందని వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి అన్నారు. మండలంలోని దొడ్డిగుంట గ్రామంలో గురువారం జరిగిన ఫిషర్మెన్ సొసైటీ ఎన్నికను కోరం ఉన్నప్పటికీ నాటకీయ పరిణామాల నడుమ అధికారులు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో దొడ్డిగుంట గ్రామానికి చేరుకున్న డాక్టర్ సూర్యనారాయణరెడ్డికి ఎన్నిక వాయిదా పడటానికి గల కారణాలను స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దొడ్డిగుంట ఫిషర్మెన్ సొసైటీలో దొడ్డిగుంట, ముకుందవరం, సుభద్రంపేట, వెంకటాపురం గ్రామాలకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారన్నారు. ఈ నాలుగు గ్రామాలకు చెందిన ఓటర్లు ఎన్నికకు హాజరయ్యారని తెలిపారు. కోరం కూడా సరిపోయిందన్నారు. ఎన్నిక నిర్వహించగా టీడీపీకి 64 మంది, వైఎస్సార్ సీపీకి 140 మందికి పైగా మద్దతుదారులు ఉన్నారని వివరించారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ మద్దతుదారులు గెలిచినట్లు ప్రకటించాల్సి ఉండగా.. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుయుక్తుల కారణంగా, శాంతిభద్రతలు లేవని, ఎన్నిక నిర్వహించే ప్రదేశం సరిపోలేదనే సాకులు చెప్పి, అధికారులు ఈ ఎన్నికను వాయిదా వేశారని చెప్పారు. శుక్రవారం తాను దొడ్డిగుంట వస్తానని, దమ్ముంటే ఎమ్మెల్యే కూడా రావాలని, ఇద్దరి సమక్షంలో ఎన్నిక నిర్వహిస్తే ఏ పార్టీ మద్దతుదారులు నెగ్గుతారో తేల్చుకుందామని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి సవాలు విసిరారు. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పతనం ఇక్కడి నుంచే ప్రారంభమైందని అన్నారు. -
టుబాకో బోర్డు ఆర్ఎంగా సురేంద్ర కుమార్
దేవరపల్లి: టుబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజినల్ మేనేజర్(ఆర్ఎం)గా జె.సురేంద్ర కుమార్ నియమితులయ్యారు. జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం నిర్వహణాధికారిగా పని చేస్తున్న ఆయన ఉద్యోగోన్నతి బదిలీపై వచ్చి, బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకూ ఇక్కడ ఆర్ఎంగా పని చేసిన జీఎల్కే ప్రసాద్ను ఒంగోలు రీజియన్కు బదిలీ చేశారు. రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలో దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెంతో పాటు జంగారెడ్డిగూడెంలోని రెండు వేలం కేంద్రాలున్నాయి. అసెంబ్లీ సాక్షిగా యనమల అబద్ధాలు సాక్షి ప్రతినిధి, కాకినాడ: అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు వల్లె వేయడం తుని ఎమ్మెల్యే యనమల దివ్య అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని వైఎస్సార్ సీపీ అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు తొమ్మిది అంశాలపై సమాధానాల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని పక్కదోవ పట్టించే ఉద్దేశంతోనే తుని ఎమ్మెల్యే చంద్రబాబు మాదిరి డైవర్షన్ రాజకీయాలు ఆచరిస్తున్నట్లున్నారని విమర్శించారు. ఈ మేరకు లక్ష్మీ శివకుమారి గురువారం ఒక వీడియో విడుదల చేశారు. ఎమ్మెల్యే అయి రెండేళ్లవుతున్నా తన నియోజకవర్గంలో అంగన్వాడీ భవనాల నిర్మాణం, అనుమతులు ఎలా వస్తాయి, ఎవరిస్తారనే కనీస అవగాహన దివ్యకు లేకపోవడం అన్యాయమన్నారు. ఒక పంచాయతీలో అంగన్వాడీ భవనం మంజూరుకు అక్కడి సర్పంచ్తో పాటు పాలకవర్గం సీడీపీవో ద్వారా జిల్లా కలెక్టర్కు విజ్ఞాపన అందజేయాలని, స్థలం మంజూరు నుంచి పనులు అప్పగించే వరకూ కలెక్టర్దే తుది నిర్ణయమనే విషయాలు తెలియనందువల్లనే దివ్య అసెంబ్లీలో అలా మాట్లాడి ఉంటారని భావిస్తున్నామన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన నాటి తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై లేని పోని రాజకీయ ఆరోపణలు చేయడం సమంజసం కాదని శివకుమారి హితవు పలికారు. నియోజకవర్గంలో నలుగురికి ఉపయోగపడే అంగన్వాడీ భవనాలు నిర్మిస్తే పేరు చిరస్థాయిగా ఉండిపోతుందని అభిలషించే రాజా.. అసంపూర్తి భవనాలతో నిధులు కాజేశారంటూ సత్యదూరమైన ఆరోపణలు చేయడం అవివేకమన్నారు. చిన్నారులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే అంగన్వాడీలకు మంచి చేయాల్సిందిపోయి అసెంబ్లీ సాక్షిగా నిస్సిగ్గుగా మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. వాస్తవాలపై అవగాహన పెంచుకోవాలని దివ్యకు హితవు పలికారు. వైఎస్సార్ సీపీపై లేని పోని ఆరోపణలు చేయడం బాధ్యత అనిపించుకోదని, ఇప్పటికై నా ఆ పద్ధతి మార్చుకోవాలని ఆమె సూచించారు. -
తూర్పు సరిహద్దుకు చేరిన పులి
● మల్లవరం సమీపాన సంచారం ● పులికొండ వద్ద మకాం ● మళ్లీ విశాఖ జూ పార్కుకు తరలించేందుకు యత్నం అడ్డతీగల/గోకవరం: పోలవరం జిల్లాలో గత 15 రోజులుగా సంచరిస్తూ అటవీ శాఖ అధికారులకు చుక్కలు చూపిస్తూ, గిరిజనులను హడలెత్తిస్తున్న పులి తూర్పు గోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతానికి చేరింది. ఇక్కడి ఏలేరు పరీవాహక ప్రాంతంలోని పులికొండ వద్ద మకాం వేసిందని అటవీ అధికారులు నిర్ధారించారు. అడ్డతీగల సబ్ డివిజన్ సూదికొండ అటవీ క్షేత్రం పరిధిలోని మొల్లేరు – తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం మల్లవరం శివారు అటవీ ప్రాంతం వద్ద గంగవరం మండలం ట్యాంకుబీడు వద్ద పులి పాదముద్రలను గురువారం ఉదయం గుర్తించారు. దీంతో, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మల్లవరం శివారు ఏలేరు పరీవాహక ప్రాంతం కావడంతో నీటి కోసం పులి తమ గ్రామానికి వస్తోందని భావిస్తున్నారు. మొల్లేరు, మల్లవరం, భూపతిపాలెం, సూరంపాలెం, వడ్డిచెరువు, రాముల్దేవపురం ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. మరోవైపు మల్లవరం అటవీ ప్రాంతాన్ని ఆనుకుని కొలువైన సింగారమ్మ తీర్థం జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. పులికి ఇదివరకే అమర్చిన జీపీఎస్ ట్రాకర్ ద్వారా దాని కదలికలను ఎప్పటికప్పుడు అటవీ అధికారులు గుర్తిస్తున్నారు. పులి కదలికలను బట్టి ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో మాత్రమే ఎక్కువగా సంచరించే పులి ఎటువైపు వెళ్తుందనే విషయాన్ని ఎవ్వరూ అంచనా వేయలేకపోతున్నారు. సూదికొండ అటవీ క్షేత్రంతో పాటు అడ్డతీగల, రాజవొమ్మంగి, గోకవరం అటవీ క్షేత్రాల సిబ్బంది అప్రమత్తంంగా ఉండాలని రంపచోడవరం డీఎఫ్ఓ శివకుమార్ గంగల్, అడ్డతీగల సబ్ డీఎఫ్ఓ సుబ్బారెడ్డి ఆదేశించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, తమ సూచనలు పాటించాలని ఫోక్స్పేట రేంజర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. పట్టుకునేందుకు యత్నం ఇదిలా ఉండగా, నెల రోజులకు పైగా తూర్పు గోదావరి, పోలవరం జిల్లాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ పులిని మళ్లీ పట్టుకునేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలు ఆరంభించారు. ఈ మేరకు పులిని పట్టుకునేందుకు శ్రీశైలం నుంచి ప్రత్యేకంగా అటవీ సిబ్బందిని రప్పిస్తున్నారు. ఈ పులిని పట్టి, బంధించి తిరిగి విశాఖ జూ పార్కుకు తరలించనున్నట్లు అధికారులుచెబుతున్నారు. -
ఆగని మరణ మృదంగం
● కల్తీ పాల ఘటనలో తాజాగా మరొకరి మృతి ● 10కి పెరిగిన మరణాలు ● విషమంగా మరో 11 మంది పరిస్థితి ● నిజనిర్ధారణలో అంతులేని నిర్లక్ష్యం ● నేటికీ రాని ల్యాబ్ రిపోర్టులు ● రోజుకొకరి మృతితో ఆందోళనలో బాధిత కుటుంబాలు సాక్షి, రాజమహేంద్రవరం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన కల్తీ పాల దుర్ఘటన రాజమహేంద్రవరంలో ఇంకా మరణ మృదంగం మోగిస్తూనే ఉంది. కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురై, నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో రోజుకొకరు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతూండటం.. బాధిత కుటుంబాలను తీరని విషాదంలో ముంచుతోంది. మరోవైపు చికిత్స పొందుతున్న వారి పరిస్థితి సైతం విషమంగానే ఉంది. వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. అయితే, వారి విషయంలో విశాఖపట్నం, హైదరాబాద్ నుంచి వచ్చిన నిపుణులు సైతం ఇప్పటికే చేతులెత్తేశారు. ప్రస్తుతం జరుగుతున్న చికిత్సే కొనసాగించాలంటూ ఉచిత సలహా ఇచ్చి వెనుదిరిగారు. దీనికి తోడు జిల్లాకు చెందిన మంత్రి సైతం బాధితులు కోలుకోవడం కష్టమంటూ ఓ సందర్భంలో అన్నారు. ఈ పరిణామాలు బాధిత కుటుంబాల్లో మరింత ఆందోళన నింపుతోంది. ఇప్పటి వరకూ 10 మంది.. కల్తీ పాలు తాగి 21 మంది ఆస్పత్రుల పాలైన విషయం తెలిసిందే. వీరిలో ఇప్పటికే 9 మంది మృతి చెందగా.. తాజాగా లాలాచెరువుకు చెందిన జి.వెంకటలక్ష్మి (69) స్థానిక కిమ్స్ బొల్లినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. దీంతో, ఈ ఘటనలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. అధికారులు మాత్రం తొమ్మిదిగానే చూపుతున్నారు. గత నాలుగు రోజులుగా వరుసగా ప్రతి రోజూ ఒక్కొక్కరు మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. మరో 11 మంది బాధితులు నాలుగు వేర్వేరు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఏడుగురిని వెంటిలేటర్పై ఉంచి, డయాలసిస్ చేస్తున్నారు. మరో నలుగురికి డయాలసిస్ జరుగుతోంది. వీరి ఆరోగ్య పరిస్థితి గంటగంటకూ ఆందోళనకరంగా మారుతోంది. ఎవరు కోలుకుంటారో వైద్యులకే అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదన్న తలంపుతోనే అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటిలేటర్పై ఉంచి చికిత్స చేస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారని, కొంత మంది వైద్యానికి అసలు స్పందించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో, మృతుల కుంటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఆస్పత్రిలో కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని బాధితుల బంధువులు కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. భిన్న వాదనలు పాల కల్తీపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కూలెంట్లోని ఇథలిన్ గ్లైకాల్ లీకై పాలల్లో కలవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని ప్రజాప్రతినిధులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. అయితే, బాధితుల శరీరాల్లో యూరియా అవశేషాలున్నాయని, మరేదైనా కల్తీ జరిగి ఉండవచ్చన్న వైఎస్సార్ సీపీ శ్రేణుల సందేహంపై అధికారులు స్పందించడం లేదు. కల్తీ ఎలా జరిగిందనే నిజం నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నా పట్టించుకున్న వారే కరువయ్యాడు. ఇదిలా ఉండగా పాలల్లో ఇథలిన్ గ్లైకాల్ కలవడం వల్లనే సమస్య తలెత్తిందని ఎప్పటిలానే అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు చెబుతున్నారు. మరో ల్యాబ్కు పంపిన నమూనాలు పరిశీలించగా.. పాలల్లో డిటర్జెంట్ కలిసినట్లు నివేదిక వచ్చిందని సమాచారం. దీనిని ఎందుకు బహిర్గతం చేయడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిజాలు దాచేందుకు ఇలా చేస్తున్నారా.. లేక విషయం చల్లబడిన అనంతరం నివేదికలు స్పష్టం చేద్దామనే భావనలో ఉన్నారా.. అనే సందేహాలు తలెత్తుతున్నాయి. విచారణ ఏమైందో..? కల్తీకి కారకుడైన పాల వ్యాపారి గణేష్ను పోలీసులు అరెస్టు చేశారు. ఘటన జరిగిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజుల పాటు అతడు పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. అయినప్పటికీ కల్తీ పాలకు సంబంధించిన నిజాలు రాబట్టలేకపోవడమేమిటనే ప్రశ్న తలెత్తుతోంది. పాల వ్యాపారి పోలీసులకు నిజం చెప్పలేదా.. లేక తప్పు ఒప్పుకున్నా పోలీసులు దాస్తున్నారా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు గణేష్ను అత్యంత వేగంగా కోర్టులో ప్రవేశపెట్టి, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు రిమాండ్కు తరలించారు. రెండు రోజుల వ్యవధిలో పోలీసులు రాబట్టిందేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. మృతుల వివరాలు పేరు, వయసు ఆస్పత్రిలో మృతి చేరిన తేదీ చెందిన తేదీ కృష్ణవేణి (76) ఫిబ్రవరి 18 ఫిబ్రవరి 22 టి.రమణి (58) ఫిబ్రవరి 18 ఫిబ్రవరి 23 రాధాకృష్ణమూర్తి (74) ఫిబ్రవరి 17 ఫిబ్రవరి 23 శేషగిరిరావు (72) ఫిబ్రవరి 18 ఫిబ్రవరి 23 బత్తిన మనోహర్ (6) ఫిబ్రవరి 18 ఫిబ్రవరి 24 కె.సత్యనారాయణ (76) ఫిబ్రవరి 17 మార్చి 2 జి.సూర్యారావు ఫిబ్రవరి 17 మార్చి3 ఆర్.సూర్యకుమారి (62) ఫిబ్రవరి 17 మార్చి 4 జి.వెంకటలక్ష్మి (69) ఫిబ్రవరి 17 మార్చి 5 బి.కనకరత్నం ఫిబ్రవరి 18 ఫిబ్రవరి 20వీడని కల్తీ గుట్టు ఈ ‘పాల’కూట విషం ఘటన వెలుగులోకి వచ్చి పక్షం రోజులవుతున్నా అందులో దాగున్న విషం ఏమిటనే గుట్టు వీడటం లేదు. కల్తీ పాలు తాగి పలువురు ఆస్వస్థతకు గురైన సమయంలో అధికారులు హడావుడి చేసి, బాధితుల వద్ద రక్తం, పాల నమూనాలు సేకరించారు. వాటిని పుణేలోని ల్యాబ్కు పంపామని చెప్పారు. ఆ నివేదికలు వస్తే కల్తీ ఎలా జరిగిందో నిగ్గు తేలుస్తామని ప్రకటించారు. కానీ, రోజులు గడుస్తున్నా నేటికీ ఆ ల్యాబ్ నివేదికలు వచ్చిన దాఖలాలు లేవు. దీంతో, కల్తీ ఎలా జరిగిందనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఆ రిపోర్టులు ఐదు నుంచి ఏడు రోజుల్లో వస్తాయని అధికారులు చెబుతూనే ఉన్నారు. నేడు, రేపు అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. గురువారం వస్తాయని భావించారు. కానీ, ఇప్పటి వరకూ వాటి జాడే లేదు. ఈ రిపోర్టులు ఎప్పుడొస్తాయనేది అంతు చిక్కని ప్రశ్నగానే ఉంది. ఆ రిపోర్టులు వస్తేనే పాలల్లో ఏం కల్తీ జరిగింది.. బాధితులపై అంత ప్రభావం చూపడానికి కారణమేమిటి.. ఇథలీన్ గ్లైకాల్ లీకేజీ వల్లనేనా.. లేక యూరియా, డిటర్జెంట్లు కలవడం కారణమా.. బాధితుల అవయవాలు, కిడ్నీలపై అంత ప్రభావం ఎలా చూపిందనే ప్రశ్నలకు జవాబులు లభించే అవకాశాలున్నాయి. -
మాంగల్యం త్వరితనానేనా!
● మాటకలిస్తే చాలు.. పెళ్లి ముహూర్తాలు ● వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలు ● ఆ సమయంలో ఏడాది పాటు పెళ్లిళ్లకు బ్రేక్ ● అందుకే ఇప్పుడు తొందర ● ఈ నెలలో భారీగా వివాహాలు సాక్షి, అమలాపురం: గోదావరిలో పుష్కరుడు ప్రవేశించడానికి ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. ప్రభుత్వం ఆలస్యంగానైనా కళ్లు తెరచి పుష్కర సన్నాహాలకు నెమ్మదిగానైనా సిద్ధమవుతోంది. కానీ ఏడాది ముందుగానే పెళ్లీడుకు వచ్చిన పిల్లలకు పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు హైరానా పడుతున్నారు. పుష్కరాలు జరిగే ఏడాది కాలం పాటు గోదావరి పరీవాహక ప్రాంతాల వాసులు పెళ్లిళ్లకు దూరంగా ఉండటం సంప్రదాయంగా వస్తోంది. ఈ కారణంగానే తమ పిల్లలకు ఈ ఏడాది చివరి నాటికి ఎట్టి పరిస్థితులలోను పెళ్లిళ్లు చేయాలని ఆతృత చూపుతున్నారు. గోదావరి పుష్కరాల సమయంలో నదీ పరీవాహక ప్రాంతంలో ఏడాది పాటు పెళ్లిళ్లు చేయరాదని నమ్మే వారు. పెళ్లికి ఎదిగిన తమ బిడ్డలకు ఈలోగానే సంబంధం కుదిరి పెళ్లి చేయాలని ఆరాటపడుతున్నారు. దీంతో కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలో పెళ్లీడుకు వచ్చిన పిల్లలకు వివాహం చేసేయాలని తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో పెద్ద సంఖ్యలో వివాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చి 8వ తేదీ వరకు పలు వివాహ ముహూర్తాలు ఉన్నా ఇప్పుడు మాట కలిస్తే చాలు ముహూర్తాలు పెట్టేసుకుంటున్నారు. పుష్కరాలకు నెల రోజుల ముందు నుంచి అంత్య పుష్కరాల వరకూ వివాహాలు చేయరు. గోదావరి జిల్లా వాసులలో చనిపోయిన పితృ దేవతలకు పుష్కర సమయంలో రాజమహేంద్రంలోని అఖండ గోదావరి, ధవళేశ్వరం బ్యారేజీ దిగువన సప్త నదీపాయల వద్ద పిండ ప్రదానం, షోడశ మహాదానాలు, దశ దానాలు చేస్తారు. కాబట్టి పరీవాహక ప్రాంతంలో ఏడాదిపాటు శుభకార్యాలు చేయకూడదని నమ్మకం. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో చాలా మంది పెళ్లిళ్లకు దూరంగా ఉంటారు. వచ్చే ఏడాది శూన్యమాసం తర్వాత కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో పాటు మిగిలిన రాయలసీమ జిల్లాలకు ఈ ప్రాంత వాసులు వెళ్లి పెళ్లిళ్లు చేసుకునే అవకాశముంది. అయితే ఇది వ్యయ ప్రయాసలతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఉభయ గోదావరి జిల్లా వాసులు పుష్కరాలకు ముందే పెళ్లిళ్లు చేయాలనుకుంటున్నారు. పుష్కరాల సమయంలో చాలా తక్కువ మంది విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లి పెళ్లిళ్లు చేస్తూంటారు. కానీ ఇది శాస్త్ర విరుద్ధంగా భావించేవారు పుష్కరాల ఏడాది సమయం పెళ్లిళ్లకు దూరంగా ఉంటారు. ఈ నమ్మకం కారణంగానే తమ పిల్లల పెళ్లిళ్ల కోసం బంధువులు, మిత్రులను, మ్యారేజ్ బ్యూరోల వారిని, ఆన్లైన్ వివాహ వేదికల వారిని సంద్రించే వారి సంఖ్య పెరిగిపోతోంది. ముహూర్తాలకు ఇంకా ఏడాది సమయం ఉన్నా ఎందుకై నా మంచిది కుదిరితే చాలు వివాహం చేసేద్దామనే వారు కూడా ఉన్నారు. పుష్కరాల సమయంలో ఏడాది పాటు వివాహాలు చేయడంపై పరస్పర విరుద్ధ వాదనలు, భిన్నాభిప్రాయాలు ఉన్నా.. ఎందుకైనా మంచిదని ఈ ఏడాది పెళ్లిళ్లు చేసేద్దాం అనేవారు ఎక్కువగా ఉన్నారు. ముహూర్తాలు తక్కువే.. ప్రస్తుతం ఈ నెల 5, 6, 7 తేదీల్లో వివాహాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఇదే నెలలో మరికొన్ని ముహూర్తాలు కూడా ఉన్నాయి. మార్చి, ఏప్రిల్తో పాటు మే 18 వరకూ వివాహాలు నిర్వహించేందుకు అనువైన కాలం. మే 19 నుంచి జూన్ 16వ తేదీ వరకూ అధిక జ్యేష్ట మాసం కారణంగా శుభ ముహూర్తాలు లేవు. జూన్ 17 నుంచి జూలై 9 వరకూ తిరిగి ముహూర్తాలుండగా, జూలై 14 నుంచి ఆగస్టు 13 వరకూ గురు మౌఢ్యమి, ఆషాఢ మాసం వస్తున్నాయి. ఆ సమయంలో వివాహాలు చేయరు. కొత్త అల్లుళ్లను అత్తవారిళ్లకు రానివ్వరు. తిరిగి ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 8 వరకూ పెళ్లి ముహూర్తాలుండగా, సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 10 వరకూ భాద్రపద మాసం కారణంగా ముహూర్తాలు లేవు. అక్టోబర్ 11 నుంచి డిసెంబర్ 9 వరకూ ఆశ్వయుజ మాసంలో ముహూర్తాలుండగా, అక్టోబర్ 19 నుంచి 29 వరకూ శుక్ర మౌఢ్యమి కారణంగా వివాహాలు జరగవు. తిరిగి నవంబర్ 10 నుంచి డిసెంబర్ 9 వరకూ కార్తికం, డిసెంబర్ 10 నుంచి వచ్చే ఏడాది జనవరి 7 వరకూ మార్గశిర మాసాల్లో ముహూర్తాలున్నాయి. జనవరి 8 నుంచి ఫిబ్రవరి 6 వరకూ శూన్యమాసం. కాబట్టి పెళ్లిళ్లు చేయరు. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకూ మాఘం, మార్చి 9 నుంచి ఏప్రిల్ 6 వరకూ ఫాల్గుణ మాసాల్లో పెళ్లిళ్లు జరుగుతాయి. వచ్చే ఏడాది ఉగాది తరువాత మే నెల వరకూ ముహూర్తాలున్నాయి. అంటే ఇంచుమించు ఏడాది మీద రెండు నెలల సమయం ఉంది. అయినప్పటికీ తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్లిళ్లకు హడావుడి పడుతున్నారు. -
పొగాకు క్యూరింగ్లో జాగ్రత్తలు అవసరం
దేవరపల్లి: పొగాకు క్యూరింగ్, గ్రేడింగ్ ముమ్మరంగా జరుగుతున్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గోపాలపురం పొగాకు వేలం కేంద్రం నిర్వహణాధికారి బి.శ్రీహరి సూచించారు. పొగాకు సాగులో సస్యరక్షణ, పురుగు మందుల అవశేషాల నియంత్రణ, అన్య పదార్థాల నిర్మూలన, తలలు తుంచడం, పిలకల నివారణపై బుధవారం గోపాలపురంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ పొగాకు రంగులు, నాణ్యత ఆశాజనకంగా ఉందని, బోర్డు నిబంధనలకు లోబడి పంట సాగు చేయాలన్నారు. 150 కిలోలకు మించి బేలు తయారు చేయవద్దని, మండెలను ఎప్పటికప్పుడు పరిశీలించి, మార్పిడి చేసుకోవాలన్నారు. అనంతరం గ్రామంలోని పలువురు రైతుల పొగాకు తోటలు, బ్యారన్ల వద్ద క్యూరింగ్ చేసిన పొగాకును బోర్డు అధికారులు, పలు కొనుగోలు సంస్థల ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు పరిశీలించారు. సమావేశంలో ఐటీసీ లీఫ్ డెవలప్మెంట్ మేనేజర్ బసవరాజు పాటిల్, జీపీఎస్ కంపెనీ ప్రతినిధి రవి, పోలిశెట్టి కంపెనీ ప్రతినిధి శ్రీను, రైతు సంఘం ప్రతినిధులు కూసం రామ్మోహన్రెడ్డి, ముల్లంగి శ్యామ్సుందర్ రెడ్డి, ముల్లంగి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. హత్య కేసులో నిందితుల అరెస్టు సీతానగరం: బొబ్బిల్లంక గ్రామంలోని సుబ్బారావు పేటలో సోమవారం అర్ధరాత్రి జరిగిన మాజీ భార్య, అత్త హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పర్చుతున్నట్లు కోరుకొండ సీఐ ఎస్వీవీఎస్ మూర్తి తెలిపారు. ఆయన బుధవారం సీతానగరం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. హత్యకు పాల్పడిన చోడదాసి సీతారామరాజు (పండు), అతడికి సహకరించిన స్నేహితులు, అదే గ్రామానికి చెందిన చోడదాసి రమేష్ (చిన్న), చిత్రపు అజయ్ కుమార్, కన్నెం సురేష్ (పెద్ద)లను అరెస్ట్ చేశామన్నారు. ఎస్సై డి.రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మర్యాద పూర్వకంగా..
వైఎస్సార్ సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా నియమితులైన మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు బుధవారం తాడేపల్లి కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుర్రం గౌతం, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, రాజమమహేంద్రవరం సిటీ ప్రచార విభాగం అధ్యక్షుడు పెద్దిరెడ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. – రాజమహేంద్రవరం సిటీ -
గుదిబండలు
కూలి కూడా రావడం లేదు ప్రస్తుతం సర్వే రాళ్లకు డిమాండ్ బాగా తగ్గిపోయింది. రెండేళ్లుగా మాకు వ్యాపారం సాగడం లేదు. కూలి డబ్బులు కూడా రావడం లేదు. 1.5 అడుగుల రాయి తయారు చేసినందుకు కార్మికుడికి రూ.25 ఇవ్వాలి. మరో వైపు క్వారీలో బండల ఖరీదు పెరిగింది. దీంతో పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి. అమ్మకాలు లేక ఎక్కడ రాళ్లు అక్కడే ఉండిపోయాయి. దుద్దుకూరు సర్వే రాళ్లు నాణ్యతగా ఉండడం వల్ల ఎక్కువగా కొనుగోలు చేస్తారు. గత ప్రభుత్వంలో వ్యాపారం లాభసాటిగా ఉండేది. తయారైన రాళ్లు ఎప్పటికప్పుడు అమ్ముడుపోయేవి. – షేక్ బాజీ, సర్వే రాళ్ల తయారీ దారుడు, దుద్దుకూరు, దేవరపల్లి మండలం సర్వే రాళ్లను తయారు చేస్తున్న కార్మికుడుదేవరపల్లి: పొలాలు, ఇళ్ల స్థలాలను కొనుగోలు చేసినప్పడు అందరికీ టక్కున గుర్తుకు వచ్చేవి సర్వే రాళ్లు. భూమిని కొలతలు కొలిచి, సరిహద్దులను గుర్తించి, అక్కడ ఈ రాళ్లను పాతిపెడతారు. ఇక భూముల అమ్మకాలు, కొనుగోళ్లు జరిగినప్పుడు హద్దులను నిర్ధారించడానికి ఇవి ఎంతో కీలకంగా ఉంటాయి. ఇంతటి ప్రాధాన్యం కలిగిన రాళ్లను తయారు చేసే కార్మికుల జీవితాలు అధ్వానంగా ఉన్నాయి. చంద్రబాబు పాలనలో రియల్ ఎస్టేట్ పడిపోవడంతో రాళ్లకు డిమాండ్ తగ్గిపోయింది. దీంతో అవి కార్మికులకు గుదిబండలుగా మారాయి. కష్టం ఎక్కువే కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంది సర్వే రాళ్ల తయారీ కార్మికుల పరిస్థితి. రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని నల్లరాతి బండలను చెక్కి సర్వే రాళ్లను తయారు చేస్తారు. పొలాలు, ఇళ్ల స్థలాల సరిహద్దుల్లో పాతడానికి నల్లరాతి సర్వే రాళ్లను ఎక్కువగా వినియోగిస్తారు. 1.5 అడుగులు, 2 అడుగులు, 2.5 అడుగులు, 3 అడుగల పొడవైన రాళ్లను సరిహద్దు రాళ్లుగా వినియోగిస్తారు. పొడవును బట్టి రాయి ధర ఉంటుంది. ఒక్కొక్క రాయి రూ. 40 నుంచి 100 పలుకుతుంది. కానీ దాదాపు రెండేళ్లుగా గిరాకీ లేకపోవడంతో ఎక్కడ రాళ్లు అక్కడే పడి ఉన్నాయి. దుద్దుకూరులో తయారీ దేవరపల్లి మండలం దుద్దుకూరులో సర్వే రాళ్లు తయారు చేస్తున్నారు. దాదాపు 50 సంవత్సరాలుగా ఈ పనిపై ఆధారపడి ఎన్నో కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. బందపురం శివారు రంగరాయ కాలనీ వద్ద సర్వే రాళ్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. కొవ్వూరు మండలం దేచర్ల రెవెన్యూ పరిధిలోని ఆర్లమ్మ క్వారీ, లక్ష్మీపురం క్వారీల నుంచి పెద్ద నల్లరాతి బండలను తీసుకు వచ్చి, వాటిని కార్మికులు సర్వే రాళ్లు తయారు చేస్తారు. ఒక లారీ బండలు సుమారు రూ.పది వేలు ఉండగా, వాటితో దాదాపు 500 రాళ్లు తయారు చేస్తారు. రాళ్ల తయారీకి సుమారు రూ.12,500 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం రాళ్ల తయారీ గిట్టుబాటు కాకపోయినా, తాతల నాటి నుంచి వృత్తిగా వస్తున్నందున దీన్నే నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని కార్మికులు చెబుతున్నారు. ఒకప్పుడు సుమారు 100 కుటుంబాలు రాళ్లు తయారు చేస్తూ జీవనం సాగించేవి. వ్యాపారం గిట్టుబాటు కాకపోవడంతో చాలామంది వేరే పనులకు మారిపోయారు. ప్రస్తుతం 20 కుటుంబాలు రాళ్లు తయారు చేసి విక్రయాలు చేస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలకు సరఫరా ఇక్కడ తయారు చేసిన సర్వే రాళ్లను ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి, నర్సీపట్నం, తుని, విజయవాడ, ఖమ్మం ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటే సర్వే రాళ్లుకూ గిరాకీ ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లోని బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు సర్వే రాళ్లను కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం లేకపోవడంతో రాళ్లకు డిమాండ్ తగ్గిందని తయారీదారులు చెబుతున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో లాభాలు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో సర్వే పనులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కువగా జరగడంతో సర్వే రాళ్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఆ సమయంలో వారానికి ఇక్కడ నుంచి సుమారు 3 వేల రాళ్లు సరఫరా చేసేవారు. రాయి ఖరీదు లాభసాటిగా ఉండేది. రూ.150 నుంచి 200 ధరకు అమ్ముడు పోయేవి. అనంతరం రెండేళ్లుగా కొనుగోళ్లు లేక ఎక్కడ రాళ్లు అక్కడే ఉండిపోయాయి. అక్కడక్కడ భూముల రీసర్వే జరగడం, స్థానికంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతున్నందున రాళ్లు కొనుగోలు చాలా తక్కువగా ఉంటోంది. ఫ గిట్టుబాటు కాని సర్వే రాళ్ల తయారీ ఫ కష్టం ఎక్కువ, లాభం తక్కువ ఫ బండలు కొని రాళ్లుగా చెక్కుతున్న కార్మికులు ఫ గుట్టలుగా పేరుకుపోతున్న సరకు ఫ చంద్రబాబు పాలనలో పడిపోయిన రియల్ ఎస్టేట్ ఫ తగ్గిపోయిన సరిహద్దు రాళ్ల వినియోగం -
బాబూ.. అంగన్వాడి చూపుతాం
కపిలేశ్వరపురం/సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అరచేతిలో వైకుంఠాన్ని చూపించి ఓట్లు దండుకునే వైఖరి సీఎం చంద్రబాబుది. 2000 సంవత్సరంలో శ్రామిక మహిళలను గుర్రాలతో తొక్కించిన ఆయన ప్రభుత్వం మరోసారి మహిళలపై విరుచుకుపడింది. ఎన్నికల హామీ అమలు చేయాలన్న డిమాండ్తో ‘చలో విజయవాడ’ చేపట్టిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అంగన్వాడీలను అణచివేసి పలు పోలీసు స్టేషన్ల చుట్టూ తిప్పి వారిని కష్టాలు పెట్టారు. ఉద్యమానికి ఊపిరి ప్రధానంగా వేతనాలు పెంచాలని, ఐసీడీఎస్ను సంస్థాగతంగా బలోపేతం చేయాలన్న డిమాండ్లతో ఆందోళనకు పిలుపునిచ్చిన అంగన్వాడీలను విజయవాడకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. అయినప్పటికీ ఏ మాత్రం వెరవకుండా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి సుమారు ఐదు వేల మంది విజయవాడ ధర్నా చౌక్కు తరలివెళ్లారు. అక్కడి శిబిరంలో పోలీసులు చేపట్టిన దమనకాండలో కాకినాడకు చెందిన యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబీరాణి, మండపేటకు చెందిన కె.కృష్ణవేణితో పాటు అనేక మంది తీవ్ర అణచివేతకు గురయ్యారు. వారిని ప్రతిఘటిస్తున్న అంగన్వాడీలను పోలీసులు పిన్నులతో గుచ్చారు. ఈడ్చుకెళ్తుండగా జి.బేబీరాణి చేయికి తీవ్ర గాయమైంది. ఆమెను ఆసుపత్రికి కాకుండా ఆమెతో పాటు మండపేటకు చెందిన కె.కృష్ణవేణి తదితరులను అమానవీయంగా బస్సుల్లోకి ఎక్కించి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. వేమగిరికి చెందిన అంగన్వాడీ బేబీరాణి, మరి కొందరిని పోలవరం, బుట్టాయిగూడెం ప్రాంతాలకు తరలించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ మొబైల్ను లాక్కున్నారు. ఆమె అప్పటికే తన మొబైల్లో పోలీసుల దురుసు ప్రవర్తనను చిత్రీకరించి సామాజిక మాద్యమాల్లో పోస్ట్ చేయడంతో సమాజానికి చంద్రబాబు ప్రభుత్వ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఉమ్మడి జిల్లా అంతా నిరసనలతో దద్దరిల్లింది. కాకినాడలోని సుందరయ్య భవన్ నుంచి కలెక్టరేట్ వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రవరం, అమలాపురం, రామచంద్రపురం, తదితర ప్రాంతాల్లోనూ, రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం వద్ద మానవహారం, ర్యాలీ, ధర్నాలు నిర్వహించారు. యాప్లతో పని భారం కేంద్ర ప్రభుత్వ యాప్ పోషణ ట్రాకర్లో వివిధ శాఖల వివరాలు నమోదు చేయడం కష్టతరంగా మారుతోంది. నెట్వర్క్ సరిగా లేకపోవడం, సర్వర్లు సరిగా పనిచేయకపోవడం వల్ల ఫేస్ రిజిస్ట్రేషన్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. రోజంతా ఈ యాప్ల నమోదుతోనే సరిపోతుంది. ఇది కాకుండా అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లు చేయవలసి రావడంతో అంగన్వాడీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలు పెంచాలి రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో 400 మంది, రూరల్ పరిధిలో 250 మంది అంగన్వాడీలు ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 3 వేల మంది అంగన్వాడీలు పనిచేస్తున్నారు. తక్షణ ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది.. 2000 మార్చి 30న హైదరాబాద్లో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం గుర్రాలతో తొక్కించింది. బాష్పవాయువు ప్రయోగించారు. ఆ ఉద్యమంలో మండపేట నియోజకవర్గానికి చెందిన అంగన్వాడీ గాయాలపాలైంది. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించే సమయంలోనూ అంగన్వాడీలపై లాఠీ చార్జి చేయించారు. అంగన్వాడీలను బస్సులో తిప్పుతున్న పోలీసులు దగాకోరు హామీలు ఇక చెల్లవు నాడు గుర్రాలతో తొక్కించి.. నేడు పోలీసులతో ఈడ్పించారు మహిళా దినోత్సవానికి ముందు మంచి బహుమతే ఇచ్చారు అంగన్వాడీల అణచివేతపై ఉమ్మడి జిల్లా నాయకుల ఆగ్రహం గెలిస్తే జీతాలు పెంచుతానన్న జగన్ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే అంగన్వాడీల వేతనాలను రూ.11,500కు పెంచారు. తన పాలనాకాలంలో సమ్మె చేసిన అంగన్వాడీల పట్ల ఆయన సానుకూలంగా స్పందించి ఇచ్చిన హామీ మేరకు వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచారు. ఉద్యోగ విరమణ ప్రోత్సాహకాలను రూ.లక్షకు పెంచుతూ జీవో జారీ చేశారు. 2024లో అధికారంలోకి వస్తే 2024 జూన్ నుంచి వేతనాలు పెంచుతానని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే అందలం ఎక్కిస్తామని ప్రలోభ పెట్టిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాకా అంగన్వాడీలపై దమణకాండకు పాల్పడ్డారు. పాశవికంగా దాడి చేయించారు జీతాల పెంపుపై ప్రభుత్వానికి అనేకసార్లు వినతి పత్రాలిచ్చారు. ఫిబ్రవరిలో క్షేత్ర స్థాయిలో రిలే నిరాహార దీక్షలు చేశారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో గత్యంతరం లేక చలో విజయవాడ చేపట్టాం. ప్రభుత్వం పాశవికంగా ప్రవర్తించింది. – కె.కృష్ణవేణి, సీఐటీయూ జిల్లా నాయకురాలు, మండపేట అనేక ప్రాంతాల్లో తిప్పి వదిలారు నిద్రలో ఉన్న మమ్మల్ని బలవంతంగా లాక్కెళ్లి బస్సులో 27 మందిని కుక్కేశారు. తరువాత సత్తెనపల్లి, యాళ్లగడ్డ, చిలకలూరిపేట, నరసరావుపేట పిడుగురాళ్ల, చింతలపూడి తదితర ప్రాంతాల్లో తిప్పారు. ఆకలి వేస్తుందన్న, కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా కూడా బస్సు ఆపలేదు. తిప్పి తిప్పి మరలా సత్తెనపల్లిలో కొంత మందిని, యాళ్లగడ్డలో కొంత మందిని వేర్వేరు ప్రాంతాల్లో దింపేశారు. అక్కడ నుంచి అనేక బస్సులు మారి జిల్లాకి చేరుకున్నాం. – మాణిక్యాంబ, అంగన్వాడీ సంఘం జిల్లా అధ్యక్షురాలు ఇచ్చిన హామీని నెరవేర్చాలి పనిభారం దృష్టిలో పెట్టుకుని వేతనం రూ.26 వేలు చేయాలి. ఎన్నికల ముందు చంద్రబాబు అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. అంగన్వాడీ సెంటర్లను పాఠశాలల్లో విలీనాన్ని నిలుపుదల చేయాలి. అంగన్వాడీ బడ్జెట్ పెంచాలి. మా న్యాయమైన డిమాండ్లను తీర్చాలన్నందుకు మహిళలని చూడకుండా చిత్రహింసలు పెట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే మేము అడుగుతున్నాం. వాటిని నేరవేర్చలేనప్పుడు హామీలు ఇవ్వడం ఎందుకు. – బేబీ రాణి, కార్యదర్శి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా అంగన్వాడీలపై దాడికి దిగుతున్నారు. 2000లో హైదరాబాద్లో గుర్రాలతో తొక్కించారు. విజయవాడలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడిలో అక్రమంగా అరెస్టు చేయించారు. ప్రస్తుత ఉద్యమంలో చర్చలు జరుపుతున్నట్టు నటిస్తూ అర్ధరాత్రి ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి త్వరలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతాం. – జి.బేబీరాణి, అధ్యక్షురాలు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, కాకినాడ -
‘జీఎంఆర్’ పన్ను బకాయి రూ.1.47 కోట్లు
కడియం: వేమగిరిలోని జీఎంఆర్ సంస్థ ఆ గ్రామ పంచాయతీకి రూ.1,47,72,147 పన్ను బకాయి పడింది. పన్ను వసూలుపై ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఎంపీడీవో కె.రమేష్, డిప్యూటీ ఎంపీడీవో ఎన్.శ్రీనివాస్, కార్యదర్శులు రూప్చంద్, ఎ.శ్రీనివాసరావు బుధవారం జీఎంఆర్ సంస్థ ప్రతినిధులను కలిశారు. తక్షణమే పన్ను బకాయిలు చెల్లించాలని కోరారు. లభ్యం కాని రాహుల్ ఆచూకీ అనపర్తి: హోలీ సందర్భంగా అనపర్తిలో కాలువలో స్నానానికి వెళ్లి గల్లంతైన తొమ్మిదేళ్ల కొమరపు రాహుల్ ఆచూకీ లభ్యం కాలేదు. మంగళవారం ఉదయం 10 గంటలకు కాలువలో పడిపోయిన రాహుల్ కోసం పోలీస్, అగ్నిమాపక సిబ్బంది రాత్రి వరకూ గాలించారు. చీకటి పడడంతో గాలింపును నిలిపివేసి, బుధవారం తెల్లవారు జాము నుంచి ప్రారంభించారు. అనపర్తి ఎస్సై ఎల్.శ్రీను నాయక్, ఫైర్ ఆఫీసర్ జీరి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ధవళేశ్వరం నుంచి వచ్చిన గజ ఈతగాళ్లు కాలువలోని చెత్తను తొలగించి అణువణువూ జల్లెడపడుతున్నారు. అలాగే అనపర్తి పోలీసులు డ్రోన్తో కాలువ పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. అయినా బుధవారం సాయంత్రం వరకు బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. గురువారం నీటి లెవెల్ తగ్గించి మళ్లీ వెతుకుతామని ఎస్సై శ్రీను నాయక్ తెలిపారు. దివ్యాంగ క్రీడాకారులకు అభినందనలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): దివ్యాంగ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సమీర్ దివ్య సాహిత్య ట్రస్ట్ నిర్వహణలో ఒడిశాలో ఫిబ్రవరి 21 నుంచి 23 వరకు జరిగిన వీల్చైర్ క్రికెట్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు ద్వితీయ స్థానం సాధించింది. ఈ జట్టులో ఎనిమిది మంది క్రీడాకారులు తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు కావడం విశేషం. ఈ సందర్భంగా కలెక్టర్ కలెక్టర్ కీర్తి ఆ క్రీడాకారులను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ పోటీల్లో పాల్గొని ఉత్తమ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీఓ) శేషగిరి, యోగా కోచ్ నాగేంద్ర, ఫుట్బాల్ కోచ్ నాగరాజు, చెస్ కోచ్ జగన్నాథరావు పాల్గొన్నారు. ఫ సహజ వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ఆహార ధాన్యాలను వినియోగించడం వల్ల కుటుంబ ఆరోగ్యం కాపాడుకోవచ్చని కలెక్టర్ కీర్తి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో అవగాహన – శిక్షణ నిర్వహించారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న రైతు సాధికార సంస్థ సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ ఆ ఉత్పత్తులను అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు, పాఠశాల విద్యార్థులకు, గర్భిణులకు, బాలింతలకు అందిస్తే ఆరోగ్య స్థితి మెరుగుపడుతుందన్నారు. -
టీడీపీ నాయకుడి భార్య ఆత్మహత్య
రాజమహేంద్రవరం రూరల్: హుకుంపేట గణేష్నగర్ జీవీకే సిగ్నేచర్స్ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నెంబర్ 202లో టీడీపీ నేత, ఏపీ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ సంక్షేమ సభ్యుడు తమ్మా రవి భార్య తమ్మా విజయలక్ష్మి(40) సోమవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే అల్లుడి వేధింపులతోనే తన కుమార్తె చనిపోయిందని విజయలక్ష్మి తల్లి, కొత్తపేటకు చెందిన కాసా సూర్యకుమారి మంగళవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాల ప్రకారం.. 2002లో తమ్మా రవితో విజయలక్ష్మికి వివాహమైంది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే విజయలక్ష్మితో తల్లి మాట్లాడటానికి రవి అనుమతించేవాడు కాదు. పైగా కట్నం తీసుకు రావాలని వేధించడంతో పాటు వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. రవి తండ్రి సత్యనారాయణ కూడా మానసికంగా వేధించేవాడు. ఈ కారణాల వల్లే విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని సూర్యకుమారి ఫిర్యాదు చేశారు. బొమ్మూరు ఎస్సై కె.రమేష్ కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫ ఫ్లాట్లో ఉరి వేసుకుని మృతి ఫ అల్లుడి వేధింపులే కారణమని మృతురాలి తల్లి ఫిర్యాదు -
కాలువలో మహిళ మృతదేహం
అనపర్తి: అనపర్తి కొత్తూరు శివారు కై లాస భూమి ఎదురుగా ఉన్న ఎర్ర కాలువలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. వివరాల్లోకి వెళితే.. అనపర్తికి చెందిన పడాల వెంకట రామకృష్ణారెడ్డి తండ్రి ఏడాది క్రితం చనిపోయారు. అప్పటి నుంచీ తల్లి పుష్పవతి (75) శేషయ్య నగర్లోని సొంత ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమె చాలా కాలంగా గర్భాశయ క్యాన్సర్తో బాధపడుతూ కాకినాడ జీజీహెచ్లో మందులు వాడుతున్నారు. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం కనబడకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. కాగా.. ఈ నెల ఒకటిన రామకృష్ణారెడ్డి తన తల్లికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో ఇంటికి వెళ్లి చూడగా కనిపించలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో అనపర్తి కొత్తూరు శివారు కై లాస భూమి ఎదురుగా ఉన్న ఎర్ర కాలువలో ఆమె మృతదేహం ఉన్నట్టు సమాచారం అందింది. -
రంగుల పండగ వేళ తీరని విషాదం
ఫ కాలువలో స్నానానికి దిగిన బాలురు ఫ నీటి ఉధృతికి ఒకరి గల్లంతు అనపర్తి: రంగుల పండగ హోలీని చిన్నారులందరూ సరదాగా జరుపుకొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. అనంతరం ఒంటిపై రంగులను కడుక్కుందామని కాలువలో దిగిన చిన్నారుల్లో ఒక బాలుడు నీటి ఉధృతికి కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బిక్కవోలు మండలం రంగాపురం గ్రామానికి చెందిన కొమరపు దేవా అలియాస్ విజయ కుమార్ పెయింటర్గా పనిచేస్తూ అనపర్తిలో కాపురం ఉంటున్నాడు. ఆయనకు రాహుల్ (9), బన్ను అనే ఇద్దరు కుమారులు, ఒక పాప ఉన్నారు. హోలీని పురస్కరించుకుని మంగళవారం అన్నదమ్ములు, మరో ఇద్దరు బాలురతో కలసి రంగులు చల్లుకున్నారు. అనంతరం ధరణికోట శివాలయం వద్ద ఉన్న కాలువ రేవులో స్నానానికి దిగారు. కాలువలో నీటి ఉధృతికి శేఖర్, రాహుల్ కొట్టుకుపోయారు. శేఖర్ను గుడి దగ్గర ఉన్న సత్తిబాబు అనే వ్యక్తి బయటకు లాగి కాపాడాడు. రాహుల్ నీటిలో కొట్టుకుపోతుండగా అతడి అన్న బన్ను కేకలు వేస్తూ కాలువ గట్టు మీద కొద్ది దూరం పరిగెత్తాడు. విషయం తెలుసుకున్న రాహుల్ తండ్రి దేవ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే కాలువలో నీరు ఉధృతి ఎక్కువగా ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అదనపు ఎస్ఐ దుర్గాప్రసాద్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. రాహుల్ ఆచూకీ కోసం ఎస్ఎఫ్వో జీరి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఫైర్ సిబ్బంది కాలువలో దిగి గాలింపు చేపడుతున్నారు. ఇప్పటి వరకు బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. నీటి ఉధృతి నేపథ్యంలో నీటిపారుదలశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు ఎస్సై ఎల్.శ్రీను నాయక్ తెలిపారు. -
వ్యాన్ ఢీకొని యువకుడి మృతి
ఫ ఆటో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి గాయాలు ఫ బాసవాగు వద్ద ఘటన ఎటపాక: వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఆటోలో వస్తున్న యువకుడు మృతి చెందాడు. 30వ నంబర్ జాతీయ రహదారిపై బాసవాగు వద్ద మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. ఎస్సై అప్పలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరీదేవిపేటకు చెందిన పైల రమేష్, సీత దంపతుల కుమారుడు పైల సాయి (26) విస్సాపురం పంచాయతీ పరిధిలోని బండిరేవు గ్రామంలో బైక్ మెకానిక్ షెడ్డు నడుపుతున్నాడు. రోజూ మాదిరిగానే ఉదయం తన ఇంటి నుంచి ద్విచక్ర వాహనంపై మెకానిక్ షెడ్డుకు వెళ్లాడు. అయితే ద్విచక్ర వాహనాల స్పేర్ పార్టులు, ఇంజిన్ ఆయిల్ కొనుగోలు చేసేందుకు బండిరేవు గ్రామంలోని ఈశ్వర్ ఆటోలో భద్రాచలం వెళ్లాడు. అక్కడ సామగ్రి కొనుగోలు చేసుకుని అదే ఆటోలో మరో ఇద్దరు ప్రయాణికులతో కలిసి బండిరేవు వస్తున్నాడు. ఈ క్రమంలో బాసవాగు సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న టోల్ప్లాజా వద్ద ఇరుకు రహదారిలో చింతూరు నుంచి భద్రాచలం వైపు వస్తున్న వ్యాన్ అతివేగంగా ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న సాయికి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ ఈశ్వర్తో పాటు దుమ్ముగూడెం మండలం గద్దమడుగు గ్రామానికి చెందిన మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. వారిని స్థానికులు 108లో భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు. స్థానికులు ఆ వ్యాన్ డ్రైవర్ను పట్టుకుని ఘటన ప్రాంతానికి వచ్చిన పోలీసులకు అప్పగించారు. సాయి మృతదేహానికి భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో పంచనామా నిర్వహించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబానికి ఆసరాగా ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. -
విజయదుర్గా పీఠంలో పూజలు
రాయవరం: మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో మంగళవారం చంద్రగ్రహణానంతరం సంప్రోక్షణ నిర్వహించారు. భక్తుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేతుగ్రస్త చంద్రగ్రహణ హోమం నిర్వహించారు. పీఠాధిపతి వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం (గాడ్) ఆదేశాల మేరకు పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమైన హోమం సాయంత్రం 6.46 వరకూ కొనసాగింది. అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి గాడ్ మాట్లాడుతూ పీఠంలో భక్తుల సంక్షేమాన్ని ఆశించి ఈ హోమాన్ని నిర్వహించామన్నారు. గ్రహణానంతరం పీఠంలోని అమ్మవారితో పాటు పరివార దేవతలకు సంప్రోక్షణ అనంతరం పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. బుధవారం ఉదయం నుంచి భక్తులకు అమ్మవారి పునఃదర్శనాన్ని, సామూహిక కుంకుమ పూజలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విజయదుర్గా సేవాసమితి ప్రతినిధులు భాస్కర నారాయణ, సత్య వెంకట కామేశ్వరి, బలిజేపల్లి రమ, పెదపాటి సత్య కనకదుర్గ, బుజ్జి, పీఆర్వో బాబీ పాల్గొన్నారు. త్రుటితో తప్పిన పెను ప్రమాదం సఖినేటిపల్లి: టేకిశెట్టిపాలెం సమీపంలో పి.గన్నవరం ప్రధాన పంట కాలువపై ఉన్న బళ్ల వంతెన వద్ద కొబ్బరి దుంగలు లోడుతో వెళుతున్న ట్రాక్టర్ నుంచి దుంగలు జారి పడ్డాయి. ఆ దారిలో వెళుతున్న ప్రయాణికులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. కొబ్బరి దుంగలు అధిక లోడుతో ఓ ట్రాక్టర్ మంగళవారం సఖినేటిలిపల్లి వైపు నుంచి పైవంతెన మీదుగా అప్పనరామునిలంక వైపు వెళుతోంది. ఆ క్రమంలో దుంగలకు కట్టిన తాళ్ల ఒక్కసారిగా తెగిపోయాయి. దీంతో దుంగలు చెల్లాచెదురై ఆకస్మాత్తుగా రోడ్డు మీద పడ్డాయి. అక్కడి నుంచి దొర్లుకుంటూ ప్రధాన రహదారిపైకి చేరాయి. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. -
ఎన్నాళ్లీ మరమ్మత్తులు!
ఫ పూర్తికాని వంతెనల మరమ్మతులు ఫ పట్టించుకోని చంద్రబాబు సర్కార్ ఫ వాహనాల రాకపోకలకు అవస్థలు ఫ ఎగుమతి, దిగుమతులపై తీవ్ర ప్రభావం ఫ కంకర లారీపై రూ.3 వేల అదనపు భారం ఫ కొబ్బరి కాయకు రూ.2 తగ్గించి వ్యాపారుల కొనుగోలు మలికిపురం: గోదావరి పాయలు, సముద్ర తీరంతో కనువిందు చేసే రాజోలు దీవిలో ప్రజల రాకపోకలతో పాటు సరకుల రవాణాకు వంతెనలు ఎంతో కీలకం. బయటకు రావాలన్నా, లోపలకు వెళ్లాలన్నా వీటి మీదగానే ప్రయాణం సాగిస్తారు. అయితే ఈ వంతెనలను కొన్ని రోజులుగా మరమ్మతుల పేరుతో మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దిండి – చించినాడ వంతెన ఎనిమిది నెలలు, పి.గన్నవరం వంతెన రెండు నెలల పాటు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల రవాణాతో పాటు వాణిజ్య పంటల ఎగుమతులకు కష్టం కలుగుతోంది. నెలలు గడుస్తున్నా పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీంతో ఇప్పటికే ప్రజలు రూ.లక్షల అదనపు భారం మోశారు. ఇంకా మోస్తూనే ఉన్నారు. దూరాభారం రాజోలు దీవికి ఐరన్, ఎలక్ట్రికల్ తదితర వస్తువులు విజయవాడ, పాలకొల్లు, తణుకు తదితర ప్రాంతాల నుంచి వస్తాయి. కంకర, ఇనుము, నిత్యావసరాలు, దుస్తులు రాజమహేంద్రవరం, పంగిడి నుంచి దిగుమతి అవుతాయి. ఇవన్నీ రావాలంటే దిండి – చించినాడ, పి.గన్నవరం వంతెనలే దిక్కు. అలాగే ఇసుక రావాలన్నా ఈ రెండు వంతెనలే ఆధారం. ప్రస్తుతం ఈ వంతెనలను మరమ్మతుల పేరుతో నిలిపివేయడంతో పాలకొల్లు నుంచి రావులపాలెం, సిద్ధాంతం వంతెనల మీదుగా అమలాపురం సమీపంలోని పాశర్లపూడి వంతెన నుంచి రావాల్సి వస్తోంది. దీంతో దూరాభారం, లోల్గేట్ ఖర్చు అధికమై తడిసి మోపెడు అవుతుంది. ఇదంతా వినియోగదారులపైనే పడడంతో సాధారణ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇక రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్లు వంతెనలు బాగాయ్యే దాకా పనులు చేయలేమని చేతులెత్తేశారు. ఇప్పటికే గిట్టుబాటు కాక, బిల్లులు రాక సతమతం అవుతున్న తమకు తీవ్ర నష్టం వస్తుందని స్పష్టం చేశారు. రైతుల అవస్థలు వంతెనల మరమ్మతుల ప్రభావం రాజోలు దీవిలో వాణిజ్య పంటలైన కొబ్బరి, సరుగుడు ఎగుమతులపై కూడా పడింది. కొబ్బరి కాయకు రూ.రెండు తగ్గించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ఇదేమంటే వంతెనల వల్ల చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని, గతంలో ఇచ్చిన ధర తమకు గిట్టుబాటు కాదని చెబుతున్నారు. సరుగుడు రైతులదీ ఇదే పరిస్థితి. మూసివేతతో.. దిండి – చించినాడ వంతెన మూసివేత వల్ల అమలాపురం తదితర ప్రాంతాలపై కూడా భారం పడుతోంది. సాధారణంగా పశ్చిమ గోదావరి వైపు నుంచి వచ్చే లారీలు దిండి వంతెన మీదుగా పాశర్లపూడి వంతెన దాటి అమలాపురం వైపు వెళతాయి. ఇక్కడ వంతెన మూసివేతతో ఇవన్నీ సిద్ధాంతం వైపు వెళ్లి, తిరిగి అమలాపురం రావాల్సి వస్తోంది. ప్రధానంగా కొబ్బరి లారీల లోడ్ విషయంలో ఈ ఇబ్బంది కలుగుతోంది. అలాగే పాలకొల్లు – అమలాపురం మధ్య జరిగే వస్తు రవాణాకు కూడా అవస్థలు కలుగుతున్నాయి. ఇక విద్యార్థుల ఇబ్బందులు షరా మమూలే. వంతెనపై అరగంటకు పైగా ఎండ, మంచులలో నడవాల్సి వస్తోంది. ప్రజలపై అదనపు భారం వంతెనలను ఇలా ఒకేసారి మూసివేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వాహనాల రాకపోకలకు అడ్డంకితో పాటు, దిగుమతి చేసుకునే వస్తువులపై పెనుభారం పడుతోంది. సిమెంట్, ఇనుము, ఇసుక, కంకర వంటి నిర్మాణ వస్తువుల దిగుమతి విషయంలో లారీకి సుమారు రూ.3 వేల అదనపు భారం పడుతోంది. – సుందర పండు, గూడపల్లి కొబ్బరి రైతులకు నష్టం వంతెనల మూసివేత భారం రైతులపై పడింది. ముఖ్యంగా కొబ్బరి కాయకు రూ.2 తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఇది చాలా దారుణం. వంతెనల మూసి వేత కారణంగా పాశర్లపూడి వంతెన నుంచి దూరం తిరిగి లారీలు వెళ్లాల్సి రావడమే దీనికి కారణమని చెబుతున్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. – దేశినీడి ఉదయ భాస్కరరావు, రామరాజులంక ఎనిమితి నెలలుగా మరమ్మతులు పూర్తి కాని దిండి – చించినాడ వంతెన ఆలస్యానికి కారణం వివాదమేనా! అధికారులు చెప్పిన ప్రకారం వంతెన మరమ్మతులు పూర్తి అవడానికి మరో రెండు నెలల సమయం పడుతుంది. అలాగే వారు ప్రతిసారీ గడువు పొడిగిస్తున్నారు. చించినాడ వంతెనకు ఎనిమిది నెలలుగా మరమ్మతులు పూర్తి కాలేదు. ప్రస్తుతం వంతెన పిల్లర్లకు అమర్చాల్సిన బేరింగ్ల కొలతలు తీసి ఆర్డర్ ఇచ్చిన కారణంగా అవి వంతెన వద్దకు చేరుస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వంతెన నిర్మించిన సంస్థకూ ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదం కారణంగా ఇలా వాయిదా పడినట్లు తెలుస్తోంది. -
మందలించారని మాయమైంది
ఫ ఇంటి నుంచి వెళ్లి పోయిన బాలిక ఫ ఐదు గంటల్లోనే పోలీసుల గుర్తింపు ఫ తల్లిదండ్రులకు అప్పగింత అనపర్తి: ఇంటి నుంచి అదృశ్యమైన మల్లిడి విహారికారెడ్డి అనే 14 ఏళ్ల బాలికను పోలీసులు క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఫిర్యాదు అందిన ఐదు గంటల్లోనే ఆమెను గుర్తించినట్టు ఎస్సై వి.రవిచంద్ర కుమార్ మంగళవారం విలేకరులకు తెలిపారు. వివరాలు ఇవీ.. బలభద్రపురానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని విహారికారెడ్డి నెల రోజులుగా స్కూల్కు వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటోంది. అలాగే ఎక్కువ సమయం సెల్ఫోన్ చూస్తూ గడుపుతోంది. దీంతో ఆ బాలికను తండ్రి సత్యనారాయణరెడ్డి సోమవారం మందలించాడు. అనంతరం పని మీద రాజమహేంద్రవరం వెళ్లాడు. ఇంటికి తిరిగి వచ్చేసరికీ విహారికారెడ్డి కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో బిక్కవోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో అనపర్తి సీఐ వీఎల్వీకే సుమంత్ సారథ్యంలో రంగంపేట, బిక్కవోలు ఎస్సై లు శివ ప్రసాద్, రవిచంద్ర కుమార్ మూడు టీములుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానం, బలబద్రపురం గ్రామస్తులు ఇచ్చిన సమాచారంపై దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ బాలిక విశాఖపట్నం వెళ్లినట్టు గుర్తించి, అక్కడి నుంచి బిక్కవోలు తీసుకుని వచ్చి మంగళవారం తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. -
గుర్తుకొచ్చింది
కొన్ని ప్రదేశాలు కొండ గుర్తులతో ప్రాచుర్యం పొందుతుంటాయి. వాటిలో రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరులోని చింతచెట్టు సెంటర్ ఒకటి. ఆ ప్రాంతంలో దాదాపు 50 ఏళ్లుగా ఓ చింతచెట్టు ఉండేది. ఆటో, బస్సుల్లో వచ్చిన వారికి అదే కొండగుర్తుగా ఉండేది. ఆర్అండ్బీ రోడ్డు విస్తరణలో భాగంగా 2015 మార్చి 4వ తేదీన ఆ చెట్టును తొలగించారు. అయినా ఇప్పటికీ ఆ సెంటర్ను చింతచెట్టు సెంటర్గానే పిలుస్తారు. ఆ చెట్టును తొలగించినప్పుడు ప్రతి ఒక్కరూ ఎంతో బాధపడ్డారని మాజీ సర్పంచ్ అత్తిలి భీమశంకరం గుర్తు చేసుకున్నారు. – రాజమహేంద్రవరం రూరల్ ఇలా.. రీవర్స్ రఘుదేవపురం ర్యాంపు నుంచి ఇసుక లారీలు మంగళవారం రాజమహేంద్రవరం – సీతానగరం నాలుగు లేన్ల రోడ్డు ఎక్కాయి. అదే రోడ్డులో మైన్స్ డిపార్ట్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో వెంటనే ర్యాంపు నుంచి తిరిగి గోదావరి పరివాహక ప్రాంతంలోకి వెళ్లిపోయాయి. దీంతో సాయంత్రం 4 గంటల నుంచి ఇసుక ఎగుమతులను ర్యాంపు నిర్వాహకులు నిలిపేశారు. ప్రక్కిల్లంక, సీతానగరం రెవెన్యూ లంక భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు పొంది, నిబంధనలను తుంగలో తొక్కి అధిక లోడుతో లారీలపై ఇసుక తరలిస్తున్నారు. బిల్లులు లేకుండా అమ్మకాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో మైన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారని తెలిసి ఇలా వెనక్కి తిప్పేశారు. అనంతరం రాత్రి సమయంలో తరలించారు. – సీతానగరం రఘుదేవపురం ర్యాంపు వద్ద గోదావరి తీరంలోనిలిపిన ఇసుక లారీలు -
ప్రాణాలతో చెలగాటం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: లాభాల వేటలో పడి.. బాణసంచా తయారీ పరిశ్రమల యజమానులు భద్రతను గాలికొదిలేస్తూండటం నిరుపేదల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వారి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. యాజమాన్యాల నిర్లక్ష్యం వల్లనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా ఏటా ఏదో ఒక ప్రాంతంలో బాణసంచా తయారీ కేంద్రాల్లో ఘోర ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఉప్పాడ కొత్తపల్లి మండలం వాకతిప్పలోని బాణసంచా తయారీ కేంద్రంలో 2014లో జరిగిన పేలుడులో దాదాపు 18 మంది మరణించారు. గత ఏడాది అక్టోబర్ 8న రాయవరంలో జరిగిన బాణసంచా విస్ఫోటంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల సామర్లకోట మండలం వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో సంభవించిన భారీ పేలుడులో ఇప్పటి వరకూ 23 మంది మృతి చెందారు. ఈ అన్ని సంఘటనలకూ మానవ తప్పిదాలు, అధికారుల పర్యవేక్షణ లోపాలే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. పక్కా చర్యలేవీ? ఈ ప్రమాదాల్లో బలైపోతున్న వారందరూ నిరుపేదలే. రోజంతా కష్టపడితేనే కానీ కుటుంబం గడవని వారే. ఈ ప్రమాదాల్లో తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు.. భర్తలను, పిల్లలను కోల్పోయి భార్యలు అనాథలుగా మిగులుతున్నారు. కుటుంబాలకు కుటుంబాలే రోడ్డున పడుతున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రభుత్వాధినేతలు హడావుడిగా వచ్చి, ఆర్థిక సాయం చేసి, అధికారులను బాధ్యులను చేసి చేతులు దులుపేసుకుని వెళ్లిపోతున్నారు. అంతే తప్ప ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామ్ కే వాస్తేగానే ఉంటున్నాయి. బాణసంచా తయారీ కేంద్రాల యాజమాన్యాలు పూర్తి భద్రతా చర్యలు పాటించేలా, నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం ఉదాసీనంగా ఉంటున్నా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదు. సర్కారు ఇటువంటి పక్కా చర్యలు తీసుకోనందువల్లనే వేట్లపాలెం విస్ఫోటం సంభవించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరంతర పర్యవేక్షణతో పాటు ప్రతి బాణసంచా తయారీ కేంద్రంలో తరచూ తనిఖీలు నిర్వహిస్తే ఇటువంటి ఘోరాలకు అడ్డుకట్ట వేయవచ్చు. కలత చెందుతూ.. కన్నీరు పెట్టుకుంటూ.. ఏకంగా 20 మంది సజీవ దహనానికి కారణమైన వేట్లపాలెం పేలుడు ఉమ్మడి జిల్లా చరిత్రలోనే అతి పెద్ద విషాద సంఘటన. మరో 11 మంది అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి బయటపడినా.. వారిలో తొమ్మిది మందిని 60 నుంచి 80 శాతం కాలిన గాయాలతో కాకినాడ జీజీహెచ్కు తరలించారు. క్షతగాత్రుల్లో సామర్లకోట కుమ్మర వీధికి చెందిన దర్శిపాటి రాజు, దర్శిపాటి లోవరాజు, వేమగిరి లోవరాజు గడచిన మూడు రోజుల్లో మృతి చెందారు. ఆ కుటుంబాల ఆవేదన వర్ణనాతీతంగా ఉంది. ఈ ముగ్గురి మృతితో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 23కు పెరిగింది. మరణాలు అందుకేనా!?తారాజువ్వల వంటి పేలుడు పదార్థాలు ఆకాశంలోకి వెళ్లాక రంగురంగుల కాంతులు విరజిమ్ముతూ, భారీ శబ్దాలు రావడానికి పలు రసాయనాలు వినియోగిస్తారు. వేట్లపాలెం బాణసంచా కేంద్రంలో వినియోగించిన ముడి సరకుల్లో రసాయనాలు కలిపారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవి శరీర భాగాల్లోకి చొచ్చుకుపోవడం, మందుగుండు ప్రభావంతో శరీరమంతా మంటలు ఒకేసారి అంటుకుపోవడంతో క్షతగాత్రుల శరీరంలో ముఖ్యమైన వ్యవస్థలు దెబ్బ తిన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఫ బర్న్ షాక్ అనే స్థితిలో చర్మం కాలిపోయి, రక్తంలోని ద్రవాలు బయటకు పోతాయి. దీనివలన రక్తపోటు తీవ్రంగా పడిపోతుంది. మెదడు, గుండెకు సరైన రక్తప్రవాహం జరకపోవడంతో ప్రాణాపాయం ఏర్పడుతుంది. ఫ శరీరానికి రక్షణ కవచం చర్మం. అది కాలిపోతే బ్యాక్టీరియా లోపలకు సులభంగా ప్రవేశించి, రక్తంలో ఇన్ఫెక్షన్ (సెప్సిస్) వచ్చి, మరణానికి దారి తీస్తుంది. ఫ వీటితో పాటు క్షతగాత్రులకు శ్వాసకోశ సమస్యలు కూడా త్వరగా వస్తూంటాయి. భారీ విస్ఫోట సమయంలో వెలువడే పొగ, వేడి గాలి పీల్చితే ఊపిరితిత్తులు దెబ్బ తిని శ్వాస తీసుకోవడం కష్టమై, ప్రాణాపాయ పరిస్థితి తలెత్తుతుంది. ఫ కాలి, తీవ్రంగా గాయపడిన వారిలో గుండె, మూత్రపిండాల వంటి ముఖ్య అవయవాల పనితీరుపై ప్రభావం పడుతుంది. వాటి పనితీరు నెమ్మదించడం కూడా మరణానికి కారణమవుతుంది. ఫ తీవ్రమైన నొప్పితో పాటు శరీరంలోని ద్రవాలు తగ్గిపోతూండటం కూడా ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఫ క్షతగాత్రుల శరీరం 50 శాతం కన్నా ఎక్కువ కాలిపోతే ప్రాణాపాయం చాలా ఎక్కువగా ఉంటుంది. వేట్లపాలెం విస్ఫోటంలో జీజీహెచ్కు వచ్చిన తొమ్మిది మంది క్షతగాత్రుల్లో దాదాపు అందరూ 70 శాతం పైగా కాలిపోయిన వారే. ఫ మొదటి స్థాయి కాలిన గాయాలతో పెద్దగా ప్రమాదం ఉండదు. చర్మం పై పొర (ఎపిడెర్మిస్) మాత్రమే దెబ్బ తింటుంది. చర్మం ఎర్రబడి నొప్పి తక్కువగా ఉంటుంది. చర్మంపై నీటి బుడగలు ఏర్పడవు. సూర్యకిరణాల వల్ల చర్మం కాలినప్పుడే ఈ సమస్య ఉంటుంది. ఇది ప్రాణాపాయం కాదు. ఫ రెండో స్థాయి కాలిన గాయాలు కూడా పెద్దగా ప్రమాదకరమైనవి కావు. వీటి వలన చర్మం పై పొరతో పాటు లోపలి పొర (డెర్మిస్) కూడా దెబ్బ తింటుంది. నీటి బుడగలు వచ్చి, నొప్పి ఎక్కువగా ఉంటుంది. చర్మం తడిగా కనిపిస్తుంది. రెండు మూడు వారాల్లో మానిపోతుంది. కొన్నిసార్లు మచ్చలు మాత్రం మిగులుతాయి. ఫ మూడో స్థాయి కాలిన గాయాలతో చర్మం పొరలు మొత్తం నాశనమవుతాయి. లోపలి కండరాలు, నరాలు కూడా దెబ్బ తింటాయి. చర్మం తెలుపు, గోధుమ లేదా నలుపు రంగులోకి మారుతుంది. నరాలు కాలిపోవడంతో నొప్పి ఉండకపోవచ్చు. కానీ, ఇది అత్యంత ప్రమాదకరం. ఒక్కోసారి శస్త్రచికిత్స కూడా అవసరమవుతుంది. ఎక్కువ భాగం కాలిపోతే ప్రాణాపాయం ఎక్కువ. వేట్లపాలెం విస్ఫోటంలో ఈ స్థాయిని మించే క్షతగాత్రుల శరీరాలు కాలిపోయాయి. అందువల్లనే వారి ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని వైద్యులు చెబుతున్నారు. ఫ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న బాణసంచా తయారీ ఫ బలైపోతున్న నిరుపేదలు ఫ సంఘటన జరిగినప్పుడే సర్కారు హడావుడి ఫ ఆ తర్వాత ఉదాసీనత ఫ అందువల్లనే తరచుగా విస్ఫోటాలు -
సబ్ రిజిస్ట్రార్ల ఉద్యోగుల సంఘ కార్యవర్గం ఎన్నిక
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ తూర్పుగోదావరి జిల్లా సబ్ రిజిస్ట్రార్లు, ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని రాజమహేంద్రవరంలో మంగళవారం ఎన్నికల అధికారి కాకినాడ సబ్ రిజిస్ట్రార్ రాయుడు వెంకటరామారావు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ అధ్యక్షుడిగా ఎం.సత్యనారాయణ రాజు, వైస్ ప్రెసిడెంట్గా బీఎస్ఆర్ మూర్తి, జనరల్ సెక్రటరీగా ఎంవివి.కృష్ణ, కోశాధికారిగా పి.అజయ్శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీగా జి.కొండారాజు, లేడీకో ఆప్టెడ్గా పి. శ్రీదేవి, ఎలక్టడ్ మెంబర్స్గా ఎండీ షాజహాన్, బి.వెంకటేశ్వర రావు, ఈ. శివ గణేష్లు ఎన్నికయ్యారు. సబ్ రిజిస్ట్రార్స్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా రాయి రాంబాబు, రాజమహేంద్రవరం జాయింట్ సబ్ రిజిస్ట్రార్, కె.సుందరరావు, కొవ్వూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఎం.రాజబాబు, నిడదవోలు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఎంవివి.త్రినాథరావు, పిడింగొయ్యి జాయింట్ సబ్ రిజిస్ట్రార్లు ఎన్నికయ్యారు. వేట్లపాలెం బాధితులను ఆదుకోవాలి బోట్క్లబ్ (కాకినాడ సిటీ): మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కలెక్టర్ షణ్మోహన్ను కాకినాడలో మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో 23 మంది మృతి చెందడం అత్యంత బాధాకరమని, మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, మృతుల కుటుంబ సభ్యులకు ఉపాధి, పింఛను సదుపాయాలు కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. బాధిత కుటుంబాలకు జిల్లా అధికార యంత్రాంగం అండగా నిలిచి, అవసరమైన అన్ని సహాయ సహకారాలూ అందిస్తుందని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు, డోకుబుర్ర భద్రం మాస్టారు తదితరులు పాల్గొన్నారు. ప్రమాదంలో మారేడుమిల్లి వైటీసీ మేనేజర్ మృతి రంపచోడవరం: మారేడుమిల్లి యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ) మేనేజర్ సుదీష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన సోమ వారం మారేడుమిల్లి నుంచి రంపచోడవరం వస్తుండగా దేవరపల్లి సమీపంలో చెట్టును ఢీకొట్టడంతో కుడి కాలు విరిగిపోయింది. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అత్యవసర వైద్యం కోసం రాజమహేంద్రవరం తరలించగా మంగళవారం మృతి చెందారు. -
కల్తీ పాల ఘటనతో మాకు సంబంధం లేదు
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): రాజమండ్రి పాలు, పెరుగు వర్తక సంఘం 1946లో ఏర్పడి 70 ఏళ్లుగా నిర్విరామంగా పనిచేస్తోందని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సూరంపూడి పనసయ్య, లంక రామకృష్ణ తెలిపారు. స్థానిక టి.నగర్లోని రాజమండ్రి పాలు, పెరుగు వర్తక సంఘం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మిల్క్ డెయిరీలు ఏర్పాటు కాని నాటి నుంచి పాలవర్తకులే ఇంటింటికీ వెళ్లి పాలు పోస్తున్నారన్నారు. ఈ 70 ఏళ్ల కాలంలో ఎన్నడూ పాలకల్తీ ఘటన లాంటివి చోటు చేసుకోలేదన్నారు. ఇటీవల రాజమండ్రిలో పాలకల్తీ ఘటనలో పలువురు మరణించడం, అనేక మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రులలో చికిత్స పొందుతుండటం చాలా బాధాకరమన్నారు. అయితే ఈ ఘటనతో పాలవర్తక సంఘానికి సంబంధం లేదన్నారు. పాలకల్తీ ఘటనతో సంబంధం ఉన్న పాలవ్యాపారి గణేష్ తమ సంఘానికి చెందిన వ్యక్తి కాదన్నారు. తమ సంఘంలో 850 మందికి పైగా వ్యాపారులు ఉన్నారని, నగరానికి 60 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలకు పాలు సరఫరా చేస్తున్నామన్నారు. గణేష్ అనే పాలవ్యాపారి చేసిన తప్పునకు ఆయనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఈ ఘటనను ఆసరాగా తీసుకుని విజయ డెయిరీ అధ్యక్షుడు ప్రైవేట్ పాల వ్యాపారులు కల్తీ చేస్తున్నారని, వారి వద్ద పాలు కొనవద్దని ప్రకటన చేయడం సరికాదన్నారు. పాల వ్యాపారంపై ఎన్నో కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయన్నారు. ఇటువంటి ప్రకటనల వల్ల ఆయా కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. తాము స్వచ్ఛమైన గేదె పాలను సరఫరా చేస్తామని, స్వచ్ఛమైన గేదె పాలను 8 గంటల లోపు వేడి చేయని పక్షంలో విరిగి పోతాయని, అయితే పాలప్యాకెట్ పాలు మాత్రం 36 గంటల వరకు కూడా వేడిచేయకున్నా పాడుకావు అంటే అందులో ఏమి కలుపుతారో ఆలోచించాలన్నారు. విజయ డెయిరీ చైర్మన్ తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు. తాము సంఘం తరఫున కలెక్టర్ను కలిసి, తమ సభ్యులకు గుర్తింపు కార్డులు అందించాల్సిందిగా కోరతామన్నారు. ఆహార పదార్థాలను కల్తీ చేసి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కల్తీ రాయుళ్లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఖాతాదారుల నమ్మకంపైనే తమ వ్యాపారం సాగుతోందన్నారు. సంఘ సభ్యులు వరగోగుల గోవింద్, జగ్గు శ్రీనివాస్, కొత్త గడకరావు, నల్లజర్ల నాగు, నంద్యాల నాగవరప్రసాద్, పాలకుల గాంధీ, గనిశెట్టి రాంబాబు, పూసల వెంకట్రాజు, మన్నె నాగేశ్వరరావు, అడ్డగర్ల ఈశ్వరరావు, పెంటగళ్ళ సుబ్బారావు, అల్లాడ సత్తిబాబు, అద్దేపల్లి నాగరాజు పాల్గొన్నారు. 70 ఏళ్లుగా పాలు, పెరుగు వర్తక సంఘం నడుస్తోంది పాల వ్యాపారి గణేష్ మా సంఘ సభ్యుడు కాదు రాజమండ్రి పాల, పెరుగు వర్తక సంఘం అధ్యక్ష, కార్యదర్శులు -
దైవ దర్శనాలకు గ్రహణం
కేతుగ్రస్త చంద్రగ్రహణం కారణంగా జిల్లాలోని ఆలయాలను మంగళవారం మూసివేశారు. ఉదయం నిత్య కై ంకర్యాలు, దర్శనాల అనంతరం ఆలయాలకు తాళాలు వేశారు. దర్శనాలను నిలిపివేయడంతో నిత్యం భక్తులతో కిటకిటలాడే అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి, తిమ్మరాజుపాలెంలోని కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయాల్లో సందడి తగ్గింది. సంప్రోక్షణ, నిత్య పూజలు నిర్వహించి బుధవారం ఉదయం యథావిధిగా భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. రాయవరం మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో చంద్రగ్రహణ సమయంలో హోమం నిర్వహించారు. – సాక్షి నెట్వర్క్ -
ప్రైవేటుకే ఏటీఎస్ సెంటర్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక (ఏటీఎస్) ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్ మంజూరురైంది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వద్ద కేంద్రాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు రాష్ట్ర రవాణా శాఖ కార్యాలయంలో వాహనాల ఫిట్నెస్ను సర్టిఫై చేసేవారు. ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటే ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం చలానా కట్టించుకుని ఆయా వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చేవారు. ప్రస్తుతం ఈ పనులన్నీ ప్రైవేటు సంస్థకు చెందిన వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్లో జరుగుతున్నాయి. ఈ ప్రైవేటు సంస్థకు అజమాయిషీ ఎవరూ ఉండరు. నేరుగా కేంద్ర ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. దీంతో అడిగేవారు లేక ఇష్టానుసారంగా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికంగా ఏ అధికారికీ తనిఖీ బాధ్యతలు అప్పజెప్పలేదు. ఈ విధానాన్ని వాహన యజమానులు, డ్రైవర్లు, వివిధ పార్టీల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏవైనా ప్రమాదాలు జరిగితే ఎవరిని అడగాలని ప్రశ్నిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు నారా లోకేశ్ నిర్వహించిన యువగళం పాదయాత్ర సాగడంలో కీలకపాత్ర పోషించిన టీడీపీ నేతకు ఫిట్నెస్ సర్టిఫై చేసే అధికారాన్ని సర్కారు కట్టబెట్టేసింది. దీంతో ఓ రాజ్యసభ సభ్యుడి అనుయాయుడైన అతను ఎగిరి గంతేస్తున్నాడు! ● స్కూల్ బస్సులు, లారీలు, ఆటోల వంటి వాటికి ప్రతి రెండేళ్లకోసారి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాలి. ఇది వరకు రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి లోపం ఉంటే సర్టిఫికెట్ జారీని నిలిపివేసేవారు. ఫలితంగా వాహనాల కండీషన్ సక్రమంగా ఉండేది. ప్రస్తుతం ఆ ఆధికారాన్ని ప్రైవేటుకు అప్పగించారు. వీటిపై కనీస పర్యవేక్షణ ఉండటం లేదు. ప్రైవేటు ఏజెన్సీ నిర్వాహకులు ఫిట్నెస్ లేకపోయినా.. మామూళ్లు దండుకుని రైట్ అనేస్తున్నారన్న విమర్శలున్నాయి. ● వాహనం కొనుగోలు చేస్తే ప్రాంతీయ రవాణా శాఖ అధికారి(ఆర్టీఏ) కార్యలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నడిచేది. ప్రస్తుతం అదేమీ నడవడం లేదు. వాహనం కొనుగోలు చేసిన డీలర్ వద్దే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా చేస్తున్నారు. ● డ్రైవింగ్ లైసెన్స్ల జారీని సైతం ప్రైవేటు పరం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తోంది. ● వాహనాల పర్మిట్లు, టూరిస్టు వాహనాల అనుమతులను కార్యాలయ పరిపాలన స్థాయిలో మాన్యువల్గా చేసి జారీ చేసేవారు. వాటిలోకి ఆన్లైన్ సేవలను తీసుకురావడంతో.. రుసుం చెల్లించి కార్యాలయానికి వెళ్లకుండానే అనుమతులు పొందేస్తున్నారు. ఇలా ఒక్కో సేవను ప్రైవేటు పరం చేసి చివరకు ఆర్టీఏ శాఖను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
చెరకు సాగుకు.. పద ముందుకు
ఫ ఇదే అనుకూల సమయం ఫ సస్యరక్షణ చర్యలు అవశ్యం పెరవలి: తియ్యని దిగుబడులను ఇచ్చే చెరకు సాగుకు ఇదే అనుకూలం.. సరైన సమయంలో సాగు చేస్తే సిరుల పంటే. తూర్పు గోదావరి జిల్లాలో 850 హెక్టార్లలో చెరకు పంట వేస్తున్నారు. ఇందులో పెరవలి, నిడదవోలు, ఉండ్రాజవరం, కొవ్వూరు, చాగల్లు, నల్లజర్ల, దేవరపల్లి, ద్వారకాతిరుమల, రాజమహేంద్రవరం రూరల్, కడియం, సీతానగరం మండలాలు ఉన్నాయి. ఈ సాగులో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యల గురించి కొవ్వూరు వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏడీఏ) సీహెచ్ శ్రీనివాసరావు వివరించారు. ఆ వివరాలు ఇలా.. నేలల స్వభావం చెరకు పంటకు నీటి సదుపాయం ఉన్న మెరక భూములు అనుకూలం. ఈ భూముల్లో 25 నుంచి 30 సెంటీమీటర్ల లోతు వరకూ మెత్తని దుక్కు చేయాలి. ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువును వేసి ఆఖరి దుక్కులో కలియ దున్నాలి. చేనును సమాంతరంగా చేయాలి. నాటే సమయం ఉభయ గోదావరి జిల్లాల్లో చెరకు పంటను జూన్ నుంచి జూలై వరకూ, డిసెంబర్ నుంచి మార్చి నెలాఖరు వరకూ నాటుకోవచ్చు. మొదటిసారి పంట వేసే రైతులు చేలో పూర్తిగా నీరు పెట్టి నీరు ఇంకిన 3 రోజుల తరువాత విత్తనం చెరకు గడలను ముక్కలుగా చేసి 2.5 సెంటీమీటర్ల లోతులో నాటుకోవాలి. కార్సీ తోటల రైతులు చేలో ఉన్న చెత్తకు నిప్పుపెట్టి అంటించిన తరువాత నీరు పెట్టాలి. నీటి యాజమాన్యం పంట వేసిన తరువాత ఆరు రోజులకు ఒకసారి 4 నెలల పాటు సాగునీటిని అందించాలి. పక్వానికి వచ్చిన దశలో 3 వారాలకొకసారి నీరు అందించవచ్చు. ఎరువులు ఇలా.. చెరకు తోట వేసిన 45 రోజులు, 90 రోజులు, 120 రోజులకు ఎరువులను వేయాలి. నత్రజని 67 కిలోలు, భాస్వరం 40 కిలోలు, పొటాష్ 48 కిలోలు మూడు సమ భాగాలుగా చేసి వీటిని అందించాలి. వీటితో పాటు నత్రజనిని అందించే జీవన ఎరువులైన అజటోబాక్టర్ ఎకరానికి రెండు కిలోల చొప్పున పశువుల ఎరువుతో కలిపి రెండు దఫాలుగా వేయాలి. నాటిన మూడో రోజు ఒకసారి, 45 రోజులకు మరోసారి వేసుకుంటే నత్రజని ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే ఎకరానికి 4 కిలోలు పాస్ఫా బ్యాక్టీరియాను నాటిన ఆరో రోజున వేసుకుంటే భాస్వరం ఎరువును కూడా తగ్గించుకోవచ్చు. కార్సి తోటల సాగు మొక్కతోటల కన్నా కార్సి తోటలు త్వరగా పక్వానికి వస్తాయి. సాగులో ఖర్చు కూడా తగ్గుతుంది. నీటిని తట్టుకునే గుణం ఈ తోటలకు ఉంటుంది. కార్సి తోటల్లో దుబ్బుల నుంచి మొలకెత్తేటప్పుడు కలుపు నివారణ కోసం మందులను వాడకూడదు. కార్సి తోటలున్న రైతులు చేలో ఉన్న చెత్తను కాల్చడం కానీ లేదా ఆ చెత్తను కుళ్లబెట్టడానికి ట్రై కోడెర్మావిరిడి మందును పేడనీళ్లతో కలిపి చెత్తపై చల్లాలి. దీనితో పాటు 10 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 8 కిలోల యూరియా రెండు కలిపి చెత్తపై చల్లాలి. దీనివల్ల భూమిలో తేమశాతం నిలబడటమే కాకుండా చెత్త బాగా చివికి ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ పంటలపై ఎక్కువగా పీక పురుగు, కాండం తొలిచే పురుగు, పొలుసు పురుగు, తెల్లనల్లి, లద్ది పురుగులు ఆశిస్తాయి. ఈ పురుగులు పంటను ఆశించకుండా చేలల్లో కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకుంటే కొంతవరకు అరికట్టవచ్చు. పంటపై కాటుక తెగులు, ఎర్రకుళ్లు తెగులు, మొవ్వకుళ్లు తెగులు ప్రభావం అధికంగా ఉంటుంది. ఇవి ఆశించినప్పుడు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. -
నిప్పుతో చెలగాఢాం..
ఫ బాణసంచా తయారీలో నిబంధనలు గాలికి ఫ వరుస ప్రమాదాలతో ఆరని నిప్పు ఫ ప్రమాదకర వృత్తిలో పేద కుటుంబాలు ఫ అవగాహన లేక ప్రాణాలకే ముప్పు పిఠాపురం: మిరుమిట్లు గొలిపే వెలుగులు.. భారీ శబ్దాలతో పేలే టపాసులు కొందరికి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి.. వాటి తయారీలో మాత్రం పేదల బతుకులు ‘కూలి’పోతున్నాయి.. లాభాల్లో మునిగి యజమానులు, పర్యవేక్షణా లోపంతో అధికారులు ఉండడంతో బడుగుల జీవుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.. ఒకప్పుడు బాణసంచా కేవలం దీపావళికి మాత్రమే కాల్చేవారు. రానురానూ ఏ శుభకార్యం, పండగ, జాతర చివరకు అంతిమయాత్రల్లోనూ వాడుతున్నారు. దీనివల్ల టపాసుల తయారీ ఏడాది పొడవునా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా ఫైర్ వర్క్స్లో పేదలు జీవనోపాధి పొందుతూ ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ జీవితాలను మంటల్లోకి నెట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన ఘటనలు చూస్తే పరిస్థితి అర్ధమవుతోంది. కొన్ని నెలల కిందట రాయవరం, ఇటీవల వేట్లపాలెంలో జరిగిన ఘటనల్లో అనేకమంది ప్రాణాలు కోల్పోయి అయినవారికి విషాదాన్ని మిగిల్చారు. ఈ పనిలోకి వెళ్తే తిరిగి వచ్చే వరకూ వారి ప్రాణాలకు రక్షణ ఉండడం లేదు. అయినా అదే వృత్తిని కొనసాగించడం వారి కుటుంబాలకు శాపంగా మారుతోంది. అన్నీ తెలిసినా తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రాణాన్ని ఫణంగా పెట్టి వచ్చే కొద్దిపాటి కూలి డబ్బుల కోసం వెళ్లి విలువైన తమ ప్రాణాలు కోల్పోయి వెనుక ఉన్న కుటుంబానికి ఆసరా లేకుండా చేసుకుంటున్నారు. దీంతో అనేక కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అధికారికంగా 20 బాణసంచా తయారీ కేంద్రాలు ఉండగా, అనధికారికంగా 50కు పైనే ఉన్నట్లు సమాచారం. కడచూపు కరువాయే.. మూడు రోజుల కిందట వేట్లపాలెంలో సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ వద్ద జరిగిన విస్ఫోటం కూలీల కుటుంబాలను కుదిపేసింది. కూలి డబ్బులు తెస్తా.. నీకు సామాన్లు తీసుకొస్తానంటూ కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లిన వారు ఇంటికి రాకుండా పోయారు. కడసారి చూపునకు కూడా వీల్లేకుండా కాలి బూడిదయ్యారు. గుండెలకు హత్తుకుని గుండెలవిసేలా ఏడుద్దామన్నా ఏ శవం ఎవరిదో తెలియని హృదయ విదారకమైన పరిస్థితి. మృతదేహాలను నేరుగా మరుభూమికే తరలించడంతో బంధువులు గుండెలు బాదుకుంటూ రోదిస్తుంటే ఆపడం ఎవరితరం కాలేకపోయ్యింది. ఒకరా ఇద్దరా ఏకంగా 22 మంది చూడటానికి ఆకారం లేదు.. ఎవరో తెలుసుకుందామంటే ముఖాలు కనిపించడం లేదు.. గుర్తు పడదామంటే ఆనవాళ్లు లేవు.. ఈ పరిస్థితుల్లో తెల్లవస్త్రంలో కట్టిచ్చిన మూటలే వారి మృతదేహాలుగా భావించి ఖననం చేసుకోవాల్సిన దుర్భర పరిస్థితి వచ్చింది. తల్లి.. తండ్రి.. భర్త.. భార్య, పిల్లలు ఇలా ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరిని కోల్పోయి పుట్టెడు దుఖఃలో బాధిత కుటుంబాలు ఉన్నాయి. అవగాహనా లోపమే శాపం బాణసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం జరిగితే తొలుత బలైపోతున్నది కార్మికులే. ఇక్కడ పనిచేసే వారిలో 90 శాతం మంది రోజువారీ కూలీలే. అనుభవం ఉన్న కార్మికులకు సైతం బాణసంచాకు ఉపయోగించే ముడిసరకుపై అవగాహన ఉండదు. ఎటువంటి రసాయనాల సమ్మేళనం వల్ల పేలుడు సంభవిస్తుందనే అవగాహన సైతం వారికి లేదు. బాణసంచాలో పెద్ద శబ్దాలు వచ్చేందుకు అమోనియం నైట్రేట్ను అధికంగా వినియోగిస్తున్నారు. ఇది కొద్దిపాటి ఒత్తిడి పెరిగితే పేలే స్వభావం ఉంటుంది. అయితే పనిచేసే వారికి ఈ అవగాహన ఉండదు. బాణసంచా తయారు చేస్తున్నప్పుడు కార్మికులు, కూలీల ఒంటికి రసాయనాలు దట్టంగా పట్టేస్తున్నాయి. కాళ్లు, చేతులు, ముఖం, వేసుకున్న దుస్తులకు రసాయనాలు పట్టడం వల్ల పేలుడు సమయంలో వారు కూడా పూర్తిగా కాలిపోతున్నారు. ఒకవేళ తీవ్ర గాయాలై ప్రాణాలతో బయటపడినా రసాయనాల వల్ల మండిపోయిన శరీరంతో జీవచ్ఛవాలుగా మారిపోతున్నారు. రసాయనాలతో బాణసంచా తయారు చేసేటప్పుడు ప్రతి కార్మికుడి ముఖానికి మాస్క్ తప్పనిసరి ఉండాలి. అయితే ఒక్కచోట కూడా ఈ పద్ధతి అవలంబించట్లేదు. దీనివల్ల కార్మికులు తీవ్ర రోగాల బారిన పడుతున్నారు. పొటాషియం నైట్రేట్, మెగ్నీషియం పౌడర్, సల్ఫర్ రసాయనాలు అధికంగా వాడతారు. ఇవి వాడేటప్పుడు కనీస రక్షణ చర్యలు తీసుకోవాలి. బాణసంచా తయారు కేంద్రాల్లో అన్ని రసాయనాలు కలిపి నూరడం వల్ల పేలుడుకు దారి తీస్తున్నాయి. విడివిడిగా ఫార్ములా తయారు చేయాలి. అవగాహన కల్పించకుండా కూలీలతో పనులు చేయించడం పేలుళ్లకు దారి తీస్తోంది. అగ్ని బారిన పడకుండా ప్రత్యేక వస్త్రాలు వేసుకోవడంతో పాటు తలకు హెల్మెట్ పెట్టుకోవాలి. ముఖానికి మాస్క్ తప్పనిసరి. కానీ ఎక్కడా అది జరగడం లేదు. వరుస ఘటనలు.. కలవరపాట్లు బాణసంచా తయారీ కేంద్రాల్లో వరుసగా చోటు చేసుకుంటున్న ప్రమాదాల్లో అనేక మంది జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతున్నాయి. సాధారణంగా మందుగుండు సామగ్రి అతి తక్కువ పేలుడు పదార్థాలతో మాత్రమే తయారు చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కాల్చే విధంగా, ప్రమాదం జరిగినా ప్రాణనష్టం లేకుండా చేయాలి. కానీ విదేశీ మందుగుండు రాకతో వాటిని పోటీగా చేసుకుని రంగు రంగుల బాణసంచా తయారీతో పాటు శక్తివంతమైన అతి పెద్ద శబ్దాలు వచ్చే పోటాపోటీగా మందుగుండు కొత్త పద్ధతుల్లో తయారీ చేస్తున్నారు. దీంతో వీటి పవర్ మందు పాతర మాదిరిగా తయారవుతోంది. ఎక్కడైనా బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగితే అది మందుగుండు పేలినట్లు కాకుండా మందు పాతర పేలినట్లు విస్ఫోటం సృష్టిస్తుంది. తద్వారా భారీ ప్రాణ నష్టం సంభవిస్తోంది. అధికారులు ‘మామూళ్లు’ తనిఖీలే తప్ప పూర్తిగా దృష్టి సారించకోవడం పెను ప్రమాదాలకు కారణమవుతోంది. -
గ్యాస్ సిలిండర్ల ఆటోను ఢీకొన్న లారీ
ఒకరి మృతిపెరవలి: ఉసులుమర్రు వద్ద గ్యాస్ సిలిండర్ల ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పెరవలి పోలీస్ స్టేషన్ ఏఎస్సై ప్రసాదరావు కథనం ప్రకారం.. నిడదవోలుకు చెందిన అంగర కృష్ణ ధనప్రసాద్ (38) అక్కడి హెచ్పీ గ్యాస్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం గ్యాస్ సిలిండర్లతో ఆటోను కానూరు తీసుకొచ్చి వినియోగదారులకు పంపిణీ చేసి, అనంతరం ఉసులుమర్రు వచ్చారు. అక్కడ సిలిండర్లు దింపి తిరిగి వెళ్తుండగా వెనుక నుంచి లారీ వేగంగా వచ్చి ఆటోను ఢీకొంది. ఈ నేపథ్యంలో ఆటో బోల్తా పడింది. రోడ్డుపై పడిపోయిన ధనప్రసాద్పై గ్యాస్ సిలిండర్లు పడటంతో తీవ్ర గాయాలు అయ్యాయి. అతన్ని హుటాహుటిన నిడదవోలులో ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అతని భార్య సాయి రామతులసి ఆసుపత్రికి వచ్చి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఉదయం వరకూ కళ్లముందే తిరుగాడిన వ్యక్తి సాయంత్రానికి అచేతనంగా మారడంతో బంధువులు కన్నీటి పర్యంతం అయ్యారు. రామతులసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై వివరించారు. యువకుడి దుర్మరణం అమలాపురం టౌన్: స్థానికంగా సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పట్టణ ఎస్సై టి.శ్రీనివాస్ కథనం ప్రకారం.. అల్లవరం మండలం గోడి గ్రామానికి చెందిన రేవు దినేష్కుమార్ (27) బైక్ వెళ్తుండగా, స్థానిక ఎత్తు రోడ్డులోని హెచ్పీ గ్యాస్ గొడౌన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. అమలాపురం నుంచి రాజోలు వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు అతని బైక్ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్పై గ్యాస్ సిలిండర్ పెట్టుకుని రాంగ్ రూట్లో వెళుతున్న దినేష్ కుమార్ ఈ ప్రమాదానికి గురైనట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న దినేష్ కుమార్ కారు డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని భార్య, ఏడేళ్ల లోపు ఇద్దరి పిల్లలతో అమలాపురం పట్టణం నారాయణపేటలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
మార్పు మన నుంచే రావాలి
సదస్సులో చాగంటి కోటేశ్వరరావు రాజమహేంద్రవరం రూరల్: ముందు మన నుంచే మార్పు వస్తే, సమాజం మారుతుందని ప్రవచన వాచస్పతి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. సోమవారం సాయంత్రం రాజమహేంద్రవరంలోని తిరుమల విద్యా సంస్థల ప్రాంగణంలో విద్యార్థుల్లో నైతిక విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించాలనే లక్ష్యంతో నైతిక విద్యా సదస్సు నిర్వహించారు. దీనిని చాగంటి కోటేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనకి మనం కట్టుబాటుతో బతకడం అనేది కేవలం విద్యతో మాత్రమే వస్తుందన్నారు. సెల్ఫోన్ అధిక వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక సామాజిక దుష్ప్రభావాలను వివరించి, సమయాన్ని వృఽథా చేయకుండా పుస్తక పఠనం, క్రీడలు, యోగాభ్యాసం వంటి మంచి అలవాట్లను అలవరచుకోవాలని సూచించారు. నైతిక విలువలు లేని ఏపనైనా విషంతో సమానమని స్పష్టం చేస్తూ, సత్యం, క్రమశిక్షణ, గౌరవం, సేవాభావం వంటి సద్గుణాలు ప్రతి విద్యార్థి జీవితానికి పునాది కావాలని తెలిపారు. పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు చాగంటి కోటేశ్వరరావు సమాధానలిచ్చారు. తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు మాట్లాడుతూ ఈ ప్రవచనాలను విద్యార్థులు పెద్దవారైనా పాటించాలన్నారు. పాఠ్యాంశాల బోధనతో పాటు విలువల విద్యను సమానంగా అందించడం అవసరమని తెలిపారు. విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ఇలాంటి సదస్సులు దోహదపడతాయన్నారు. ఈ సదస్సులో తిరుమల విద్యా సంస్థల డైరెక్టర్ సరోజినీదేవి, వైస్ చైర్పర్సన్ శ్రీరష్మి, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి, దాదాపు 1,200 మంది విద్యార్థులు, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. -
అడ్డు తొలగించుకోవడానికే హత్య
ఫ ప్రియుడితో కలసి భర్తను హతమార్చిన భార్య ఫ అనపర్తిలో ఆసుపత్రి వద్ద నిందితుల అరెస్ట్ రంగంపేట: వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య తన ప్రియుడితో కలసి భర్తనే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. గత నెల 27న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన చిక్కుముడిని పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించిన వివరాలను రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ బి.విద్య సోమవారం రంగంపేట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఆమె కథనం ప్రకారం.. రంగంపేట మండలం పెద్ద దొడ్డిగుంట గ్రామానికి చెందిన బక్క నాగేంద్రకు ఎనిమిదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన బక్క వీరలక్ష్మితో వివాహం జరిగింది. ఆ దంపతులకు ఓ పాప ఉంది. గత కొద్దికాలంగా రంగంపేట మండలం నల్లమిల్లి గ్రామానికి చెందిన తోరాటి శివతో నాగేంద్ర భార్య వీరలక్ష్మి వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఇందులో భాగంగా గత నెల 27న రాత్రి ప్రియుడు శివతో కలసి వీరలక్ష్మి తమ పుట్టింట్లో ఉంది. దీనిని గమనించిన భర్త నాగేంద్ర వారిని నిలదీశాడు. వారిద్దరూ ఆగ్రహానికి గురయ్యి నాగేంద్రపై కత్తితో దాడి చేసి హతమార్చారు. అనంతర తోరాటి శివ పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడగా, బంధువులు అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతున్న శివ, వీరలక్ష్మితో కలసి ఆదివారం పరారు కావడానికి ప్రయత్నించగా, పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు డీఎస్పీ వివరించారు. సమావేశంలో అనపర్తి సీఐ వీఎల్వీకే సుమంత్, రంగంపేట ఎస్సై ఎస్.శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టుకు జాతీయ స్థాయి గుర్తింపు
అల్లవరం: గోదావరి జిల్లాలోని సంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులను సమగ్రంగా విశ్లేషించి, వాటి సామాజిక, సాంస్కృతిక ప్రభావాలను అధ్యయనం చేయడమే లక్ష్యంగా చేసిన పరిశోధన ప్రాజెక్టుకు గాను అల్లవరం మండలం ఓడలరేవు బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయిలో చోటు దక్కింది. ఆ కళాశాలలో అధ్యాపకులుగా పనిచేస్తున్న అయ్యగారి నాగేశ్వరరావు, శ్రీపాద రామకృష్ణ, ఆకుల ప్రవీణ్లు చేసిన ‘గోదావరి జిల్లాల వైదిక వారసత్వంపై విశ్లేషణాత్మక అధ్యయనం’ ప్రాజెక్టుకు గుర్తింపు దక్కింది. ఈ మేరకు భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ సోమవారం ఉత్తర్వులు ఇచ్చిందని బీవీసీ చైర్ పర్సన్ బోనం కనకదుర్గ తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ప్రాజెక్టుల్లో గోదావరి జిల్లాల వైదిక వారసత్వం మేటిగా నిలిచిందన్నారు. ఈ ప్రాజెక్టుతో తమ కళాశాల విద్యా పరిశోధన రంగాల్లో మైలురాయిని అధిగమించిందని ప్రిన్సిపాల్ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఆ అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. పులిని పట్టుకోవాలిరంపచోడవరం: ఆదివాసీలకు జీవనధారమైన పంటలు, పశువులు, మేకలకు పులులు, వన్యప్రాణుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) ఆధ్వర్యాన గిరిజనులు సోమవారం రంపచోడవరంలో ర్యాలీ నిర్వహించారు. పాపికొండలు నేషనల్ పార్కు ఎకో సెన్సిటివ్ జోన్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వెంకట్ మాట్లాడుతూ, మైదాన ప్రాంతానికి వచ్చిన పెద్ద పులిని రూ.కోట్లు ఖర్చు చేసి పట్టుకుని రంపచోడవరం గండి పైన గిరిజనులు నివాసం ఉండే ప్రాంతానికి సమీపంలో అటవీ అధికారులు వదిలి వెళ్లారని అన్నారు. ప్రస్తుతం పులి భయంతో ఎక్కడకూ వెళ్లలేని పరిస్థితిలో గిరిజనులున్నారని తెలిపారు. ఆదివాసీలు జాగ్రత్తగా ఉండాలంటూ గ్రామాల్లోకి వచ్చి చెబుతున్నారని, వన్యప్రాణులను చంపితే కఠినంగా శిక్షిస్తామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అధికారులపై గిరిజనులు తిరుగుబాటు చేయాలని అన్నారు. ఏజెన్సీలో సంచరిస్తున్న పులిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. ఈ సందర్భంగా గిరిజనులనుద్దేశించి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడారు. ఏజెన్సీలో పులి సంచారంపై ఆందోళన చెందవద్దని అన్నారు. అటవీ అధికారులతో మాట్లాడి తగిన చర్యలు చేపడతామన్నారు. పులికి జియో ట్యాగ్ ఉందని, దీని సంచారంపై అటవీ అధికారులకు సమాచారం ఉంటుందని, ఆయా గ్రామాల వారిని అప్రమత్తం చేస్తారని తెలిపారు. పులి సంచారం విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఫ రంపచోడవరంలో గిరిజనుల ర్యాలీ ఫ ఇన్చార్జి కలెక్టర్కు వినతి -
విషాదం కుమ్మరించిన వేళ..
● వేట్లపాలెం పేలుడు మృతుల్లో నలుగురు కుమ్మర వీధి వాసులే ● సంఘటన స్థలంలో ఇద్దరు సజీవదహనం ● చికిత్స పొందుతూ మరో ఇద్దరి మృతి ● నలుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు ● గుండెలు బాదుకుంటూ రోదిస్తున్న కుటుంబ సభ్యులు సామర్లకోట: పట్టణంలోని కుమ్మర వీధిలో విధి పెను విషాదాన్ని కుమ్మరించింది. ఈ ప్రాంతంలో మాదిగ సామాజికవర్గీయులు ఎక్కువగా నివాసం ఉంటారు. అందరూ రోజు కూలి చేసుకుంటూ జీవనం గడుపుతారు. వారికి తెలిసిన విద్య బాణసంచా తయారీయే. ఈ నేపథ్యంలో శనివారం వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో పని చేయడానికి వెళ్లి.. ఈ ప్రాంతానికి చెందిన నలుగురు మృతి చెందారు. సంఘటన స్థలంలో కుమ్మర వీధికి చెందిన దర్శిపాటి నాని, ఏడిద శ్యామ్ కుమార్ సజీవ దహనం కాగా.. అదే ప్రాంతానికి చెందిన దర్శిపాటి లోవరాజు, దర్శిపాటి రాజు కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. మొత్తం కుమ్మర వీధికి చెందిన నలుగురు మృతుల్లో ముగ్గురు దర్శిపాటి కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి దుఃఖానికి అంతే లేకుండా ఉంది. దర్శిపాటి రాజు మృతదేహాన్ని మహాప్రస్థానం వాహనంలో సోమవారం తీసుకు వచ్చిన వెంటనే ఒక్కసారిగా ఆ కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలు బాదుకుంటూ రోదించారు.ఆస్పత్రి నుంచి క్షేమంగా వస్తాడన్నారు బాణసంచా ప్రమాదం జరిగిన వెంటనే నా భర్త గురించి ఆరా తీశాను. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, త్వరలోనే ఇంటికి వస్తాడని బంధువులు, స్థానికులు చెప్పారు. 48 గంటలు గడవక ముందే నా భర్త మృతి వార్త వచ్చింది. ఆయన శవాన్ని సోమవారం అప్పగించారు. చివరి చూపు చూసుకునే అవకాశం కూడా దక్కలేదు. నా ఇద్దరు ఆడ పిల్లలకు ఆధారం లేకుండా పోయింది. మరిది, మామగారితో పాటు నా కుటుంబాన్ని నా భర్తే పోషించే వాడు. నేను ఇంటర్ వరకూ చదువుకున్నాను. కుటుంబ పోషణకు ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలి. – రాజేశ్వరి, దర్శిపాటి రాజు భార్య, సామర్లకోట ఇద్దరు పిల్లలు, మామగారిని పోషించాలి నా భర్త బాణసంచా షాపులో సజీవ దహనమయ్యాడు. అతని తండ్రితో పాటు కుటుంబాన్ని నా భర్త పోషించే వాడు. ఆయన చనిపోవడంతో ఇద్దరు పిల్లలు మానస, అఖిలలను ఏవిధంగా పోషించాలో అర్థం కావడం లేదు. వారిని చదివించుకోవాల్సి ఉంది. కుటుంబాన్ని నడిపే నాథుడు లేకుండా పోయాడు. ఎటువంటి ఆధారం లేకపోవడంతో దిక్కు తోచని స్థితిలో ఉన్నాం. – గంగాభవాని, దర్శిపాటి నాని భార్య, సామర్లకోట -
అవిశ్రాంత సేవకులపైచిన్నచూపు
● పెన్షనర్ల డిమాండ్లు పట్టించుకోని ప్రభుత్వం ● ఒకటో తేదీకి అందని పెన్షన్ సొమ్ము ● గాల్లో కలిసిన ఎన్నికల హామీలు కపిలేశ్వరపురం: ఆసక్తితో చదువుకుని, ఆశతో పోటీ పడి పొందిన ఉద్యోగాన్ని సుమారు 30 ఏళ్ల పాటు నిబద్ధతతో చేస్తారు. ఉద్యోగంలో చేరిన ఆరంభంలో ఆనందంగానే ఉన్నా మధ్యలో పెరిగిన కుటుంబ ఖర్చులతో అప్పులు చేస్తూ అవస్థలు పడుతూంటారు. వయస్సు మీద పడిన తర్వాత ఉద్యోగ విరమణ చేసే సమయానికి శేష జీవితం ఆందోళనకరంగా తలపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మిగిలిన జీవితానికి చుక్కానిలా పెన్షన్ ఆధారమవుతుంది. సకాలంలో పెన్షన్ అందితేనే రోజులు సుఖంగా గడుస్తాయి. కానీ, ఈ అవిశ్రాంత సేవకులను పాలకులు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీకల్లా ఉద్యోగుల జీతాలు, పెన్షన్ చెల్లిస్తామంటూ చంద్రబాబు, పవన్ కల్యాణ్లు 2024 ఎన్నికల ప్రచార సభల్లో ఉపన్యాసాలు ఊదరగొట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 20 నెలలవుతున్నా పెన్షనర్ల సమస్యలపై దృష్టి సారించడం లేదు. ఒకటి రెండు నెలలు తప్ప ఆ తర్వాత నుంచి ప్రతి నెలా వారం తర్వాతే పెన్షన్ చెల్లిస్తున్నారు. అత్యధిక పెన్షనర్లకు రూ.3 వేల లోపే.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో సేవలందించి, రిటైరైన వారు సుమారు 50 వేల మంది ఉన్నారు. వీరిలో అత్యధికులకు రూ.3 వేల లోపు మాత్రమే పెన్షన్ చెల్లిస్తున్నారు. ఉదాహరణకు ఉమ్మడి జిల్లాలో ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగ విరమణ చేసిన వారిలో 1,700 మంది డ్రైవర్లు, కండక్టర్లు, 150 మంది కార్యాలయ ఉద్యోగులు, 1,350 మంది మెకానికల్ విఽభాగానికి చెందిన వారు మొత్తం 3,200 మంది ఉన్నారు. వీరికి నెలకు రూ.2 వేల లోపు మాత్రమే పెన్షన్ ఇస్తున్నారు. ఇంత తక్కువ పెన్షన్ ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు పలుమార్లు నిరసన తెలిపారు. వృత్తి రీత్యా చెల్లిస్తున్న పెన్షన్కు తోడు వృద్ధులకు అందజేసే రూ.4 వేల సామాజిక పింఛను కూడా వర్తింపజేయాలని కోరుతూ ధర్నాలు చేశారు. అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ సదుపాయం కల్పించాలంటూ సీఐటీయూ తదితర కార్మిక సంఘాలు పలుమార్లు ఆందోళనలు నిర్వహించాయి. పోరుబాటలో.. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెన్షనర్లు పలు రూపాల్లో ఉద్యమిస్తున్నారు. గత నెల 9న ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. గత జనవరి 18న ఆలిండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యవర్గ సమావేశం అమలాపురంలో నిర్వహించారు. ఆ సందర్భంగా ఉద్యోగుల వేతన సవరణతో సంబంధం లేకుండా 7వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ సవరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆలిండియా కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఈపీఎఫ్ పెన్షనర్స్ సంఘం ఆధ్వర్యాన ఈపీఎఫ్–95 పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.9 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ గత ఏడాది డిసెంబర్ 9న ఢిల్లీలో సదస్సు నిర్వహించారు. అదే నెల 10న ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. ఆయా కార్యక్రమాలకు ఉమ్మడి జిల్లాలోని పెన్షనర్లు తరలి వెళ్లారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ వ్యాలిడేషన్ బిల్లు–2025ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక పింఛన్ల కోసం.. తూర్పు గోదావరి జిల్లాలో 2,70,496 మందికి రూ.118.61 కోట్ల మేర సామాజిక పెన్షన్లు ఇస్తున్నారు. అవి ఎప్పటి నుంచో ఇస్తున్నవే తప్ప చంద్రబాబు 20 పాలనా కాలంలో కొత్తగా ఒక్క సామాజిక భద్రతా పింఛన్ కూడా మంజూరు చేయలేదు. పైగా పాత పింఛన్లకు సర్వే పేరుతో కోత పెట్టారు. కొత్త పింఛన్ కోసం ఉమ్మడి జిల్లాలో సుమారు 30 వేలు, రాష్ట్రంలో 2.5 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గీయులకు 50 ఏళ్లకే పెన్షన్ మంజూరు చేస్తామన్న హామీని చంద్రబాబు గాలికొదిలేశారు. రూ.3 వేలతో ఎలా బతకాలి? దేశంలో 82 లక్షల మంది పెన్షనర్లున్నారు. వారిలో 36 లక్షల మంది రూ.వెయ్యి లోపు, మరో 36 లక్షల మంది రూ.2 వేల లోపు మాత్రమే పెన్షన్ అందుకుంటున్నారు. కేవలం 10 లక్షల మంది మాత్రమే రూ.3 వేలు పైగా పెన్షన్ పొందుతున్నారు. ఈ రూ.3 వేలతో కుటుంబం గడవడం సాధ్యం కాదు. ధరలు పెంచుతున్న పాలకులు అందుకు అనుగుణంగా పెన్షన్ కూడా పెంచాలి. – సీహెచ్ మోహనరావు, కార్యదర్శి, ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్, ధవళేశ్వరం ఇవీ పెన్షనర్ల డిమాండ్లు ఇన్సూరెన్స్ ఆధారిత హెల్త్ కార్డులు మంజూరు చేయాలి. 5 డీఏలు మంజూరు చేయాలి. 12వ పే కమిషన్ నియమించాలి. 2018 జూలై నుంచి పెండింగ్లో ఉన్న అన్ని రకాల బకాయిలూ వెంటనే చెల్లించాలి. 2024 ఆగస్టు నుంచి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు గ్రాట్యుటీ బకాయిలు చెల్లించాలి. 2020 తర్వాత మరణించిన ఉద్యోగ, ఉపాధ్యాయుల పిల్లలకు కారుణ్య నియామకాలు చేపట్టాలి. పెన్షన్ వ్యాలిడేషన్ బిల్లు–2025 రద్దు చేయాలి. భిక్ష కాదు.. హక్కు పెన్షన్ ఇవ్వడాన్ని పాలకులు వారి గొప్పగా చెబుతూంటారు. వాస్తవానికి పెన్షన్ పొందడం ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కు. సుమారు 30 ఏళ్ల పాటు తమ శ్రమశక్తిని సమాజానికి ధారబోసి.. ఉద్యోగ విరమణానంతరం రోజువారీ జీవితం గడిపేందుకు పెన్షన్ పొందే హక్కు ఓ చారిత్రక నేపథ్యంలో ఉనికిలోకి వచ్చింది. 1889లో పెన్షన్ నామమాత్రంగా ఉండేది. 1920లో బ్రిటిషు కాలంలో రిటైర్డ్ బెనిఫిట్ పెన్షన్ ప్రవేశపెట్టారు. ఢిల్లీ మిలిటరీ అధికారి డీఎస్ నకారా పెన్షన్ కోసం న్యాయపోరాటం చేశారు. పలు పోరాటాల ఫలితంగా 80వ దశకంలో ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్–1980, 1981లో కుటుంబ పెన్షన్ అమలులోకి వచ్చాయి. అంతిమంగా 1982 డిసెంబర్ 17న అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్ పెన్షన్ ఖరారు చేస్తూ తీర్పు చెప్పారు. -
పీజీఆర్ఎస్కు 313 అర్జీలు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 313 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ కీర్తి చేకూరి తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వచ్చిన ప్రతి అర్జీని సమగ్రంగా పరిశీలించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అర్జీలు సమర్పించేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్పై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. రెవెన్యూ క్లినిక్లో 143, మిగిలినవి వివిధ శాఖలకు చెందినవి అర్జీలు వచ్చాయని తెలిపారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 31 ఫిర్యాదులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమానికి 31 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి పోలీసు అధికారులు అర్జీలు స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే నేరుగా సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. 14న జాతీయ లోక్ అదాలత్ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఈ నెల 14న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ గంధం సునీత తెలిపారు. లోక్ అదాలత్ నేపథ్యంలో అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించి, బాధితులకు తగిన పరిహారం అందించే దిశగా జిల్లా కోర్టులో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పెండింగ్లో ఉన్న వివిధ సంస్థల సివిల్, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులను గుర్తించి, ఆ జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందజేయాలని సూచించారు. రాజీ పడదగిన ఇతర కేసులను గుర్తించి, వాటిని త్వరగా పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి పాల్గొన్నారు. నేడు సత్యదేవుని ఆలయం మూసివేత అన్నవరం: చంద్రగ్రహణం కారణంగా అన్నవరం వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయాన్ని మంగళవారం ఉదయం 10 గంటలకు మూసివేయనున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులను ఉదయం 10 గంటల వరకూ మాత్రమే అనుమతిస్తారు. మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 గంటల వరకూ ఏర్పడనున్న చంద్రగ్రహణం కారణంగా సత్యదేవుని వ్రతాలను ఉదయం 9.30 గంటల వరకూ మాత్రమే నిర్వహిస్తారు. వ్రతాలు, ఆయుష్య హోమం, నిత్యకల్యాణం, కేశఖండన టిక్కెట్లు ఉదయం 7 గంటల వరకూ మాత్రమే విక్రయిస్తారు. అలాగే, స్వామివారి ప్రసాదాలు ఉదయం 9.30 గంటల వరకూ మాత్రమే విక్రయిస్తారు. పౌర్ణమి సందర్భంగా వనదుర్గ అమ్మవారికి ప్రత్యంగిర హోమం, సత్యదేవుని జన్మ నక్షత్రం మఖ సందర్భంగా నిర్వహించే ఆయుష్య హోమం, స్వామివారి నిత్య కల్యాణం ఉదయం 9 గంటలకు బదులు ఉదయం 7 గంటలకూ ప్రారంభించి, 9.30 గంటల్లోపు పూర్తి చేస్తారు. గ్రహణానంతరం స్వామివారి ఆలయం, వ్రతమండపాలు, ఆలయ ప్రాంగణాన్ని శుద్ధి చేసి బుధవారం తెల్లవారుజాము నుంచి యథావిదిగా స్వామివారి దర్శనా లు, వ్రతాలు, పూజలు, కల్యాణం, ఆయుష్య హోమం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. నేడే చంద్ర గ్రహణం వీరేశ్వరస్వామి ఆలయం మూసివేత ఐ.పోలవరం: ఫాల్గుణ శుక్ల పౌర్ణమి మంగళవారం చంద్ర గ్రహణం సందర్భంగా రాత్రి జరిగే భక్తుల కల్యాణాలు రద్దు చేసినట్లు మురమళ్ల వీరేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్, ఈఓ వి.సత్యనారాయణ సోమవారం తెలిపారు. దేవస్థానం అనుసరించే పంచాంగం ప్రకారం ఆలయ అర్చకులు, పురోహితుల సూచనల మేరకు ఉదయం జరగాల్సిన అభిషేకాలు, దర్శనాలు, చండీ హోమం తదితర పూజలు జరిపించి ఉదయం 11.30 గంటలకు ఆలయ ద్వారాలు మూసివేస్తామన్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి యథావిధిగా దర్శనాలు, అభిషేకాలు ఉంటాయన్నారు. -
వార్ంతా ఇబ్బందుల్లో...
ఖతార్పై ఇరాన్ దాడి ● గల్ఫ్ దేశాల్లో యుద్ధంతో జిల్లా వాసుల్లో ఆందోళన ● ఉపాధి, ఉద్యోగాలకు వెళ్లిన వందలాది మంది ● ఇంటర్నెట్పై ఆంక్షలతో మాటామంతీ కట్ ● ఆందోళనలో కుటుంబ సభ్యులు సాక్షి, అమలాపురం: సైరన్ మోతలు... దూసుకొస్తున్న క్షిపణులు... గంటకు ఒకసారి వినిపిస్తున్న భారీ పేలుళ్లు.. ఇళ్లు వీడి బయటకు రావద్దని గల్ఫ్ దేశాల్లో ప్రభుత్వ హెచ్చరికలతో అక్కడి వారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఉపాధి.. ఉన్నత ఉద్యోగాల కోసం స్వదేశాన్ని, సొంతవారిని వదులుకుని అరబ్ దేశాల బాట పట్టిన ఎంతోమంది కోనసీమ వాసుల పరిస్థితి ఇది. జరుగుతున్న యుద్ధంతో అక్కడ ఉండలేక భయకంపితులవుతున్నారు. మరోవైపు స్థానికంగా ఉన్నవారు గల్ఫ్, ఇజ్రాయిల్ దేశాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యులు, బంధువుల క్షేమ సమాచారాల కోసం ఆందోళన చెందుతున్నారు. ‘‘ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకు వచ్చినట్టుగా’’ ఉంది ఉపాధి కోసం అరబ్ దేశాలకు వెళ్లిన కోనసీమ వలసదారుల పరిస్థితి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ సంయుక్తంగా దాడి చేయడం, ఇందుకు ప్రతిగా ఇరాన్ దాడికి దిగింది. ఇజ్రాయిల్తో పాటు అమెరికన్ మిలటరీ బేస్ క్యాంప్లు ఉన్న ఖతార్, సౌదీ, కువైట్, యూఏఈపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఎప్పుడు ఏ క్షిపణి వచ్చి పడుతుందోనని.. ఏ బాంబు ఎక్కడ పేలుతుందోనని అనుక్షణం భయపడుతూ అక్కడ ఉన్నవారు కాలం వెళ్లదీస్తున్నారు. బంకర్లలో తలదాచుకుంటున్నారు. జిల్లాలోని రాజోలు దీవిని మినీ గల్ఫ్గా అభివర్ణిస్తారు. ఈ దీవిలోని రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు మండలాల నుంచి వందలాది మంది గల్ఫ్ దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లారు. జిల్లా నుంచి అరబ్ దేశాలతో పాటు ఇజ్రాయిల్కు సుమారు 15 వేల మంది వరకూ వెళ్లారు. వీరిలో సగం మంది కేవలం రాజోలు దీవి నుంచి ఉంటారు. గడిచిన నాలుగైదు దశాబ్దాలుగా రాజోలు దీవి నుంచి అరబ్ దేశాలకు వెళ్తున్నారు. ఒక్కొక్క కుటుంబంలో రెండు మూడు తరాలకు చెందినవారు కూడా ఇక్కడ ఉపాధి కోసం వలస వెళ్లారంటే అతిశయోక్తి కాదు. ఆయా దేశాల్లో అన్స్కిల్డ్ పనులు చేసుకునేవారు 80 శాతం వరకూ ఉండగా, ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ చదువుకుని వృత్తి నైపుణ్యం ఉన్న పనిమంతులు కూడా ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్లేవారిలో ఎక్కువ మంది కువైట్, ఖతార్, సౌదీలలో ఉంటున్నారు. రాజోలు దీవి నుంచే కాకుండా ఉప్పలగుప్తం, అల్లవరం, కాట్రేనికోన, అమలాపురం, రామచంద్రపురం రూరల్ మండలాల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. జీరో క్రైమ్ రేటు, మంచి జీతాలు, ప్రశాంత జీవనం వల్ల చాలా మంది ఈ దేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఇరాన్ యుద్ధం పుణ్యమాని క్షిపణులు, బాంబుల మోతలతో ఆ ప్రాంతం అట్టుడుకుతోంది. నిన్నటి వరకూ నిశ్చింతంగా జీవనం సాగించిన వారి జీవితాల్లో యుద్ధం కల్లోలం రేపుతోంది. సమాచారానికి బ్రేకులు అక్కడున్న తమవారు ఎలా ఉన్నారో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. యుద్ధం నేపథ్యంలో ఇంటర్నెట్, ఫోన్ల వినియోగంపై ఆంక్షలు పెడుతున్నారు. దీంతో స్థానికులకు అక్కడవారి క్షేమ సమాచారాలు పూర్తిగా తెలియడం లేదు. వీడియో కాల్స్కు దొరకడం లేదు. కనీసం ఫోన్లకు కూడా అందుబాటులో లేకపోవడంతో వారు భయపడుతున్నారు. యుద్ధం ముగిసిపోతోందనే ఆశతో గల్ఫ్లో నివాసముంటున్న వారే కాకుండా స్థానికులు కూడా కొండంత ఆశతో ఎదురు చూస్తున్నారు. -
పంచాయతీ స్వీపర్ నిజాయతీ
మామిడికుదురు: పాశర్లపూడిలంక గ్రామ పంచాయతీ స్వీపర్ రాయుడు ప్రసాద్ తనకు దొరికిన రూ.లక్ష విలువైన ఎనిమిది గ్రాముల బంగారు గొలుసును బాధితుడికి ఇచ్చి నిజాయతీ చాటుకున్నారు. పంచాయతీ కార్యదర్శి దాకే సురేష్కు చెందిన బంగారు గొలుసు శనివారం పడిపోయింది. దాని కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది. పంచాయతీ స్వీపర్ ప్రసాద్ ఆదివారం పంచాయతీని తుడుస్తుండగా అతనికి ఆ గొలుసు దొరికింది. దానిని బాధితుడి బంధువుకు అప్పగించి తన నిజాయతీని నిరూపించుకున్నారు. ప్రసాద్ను గ్రామ సర్పంచ్ తెలగారెడ్డి సూర్యప్రకాశరావుతో పాటు గ్రామస్తులు అభినందించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి కొత్తపల్లి: రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఉప్పాడ శివారు సుబ్బంపేటకు చెందిన ఓసిపల్లి దుర్గాప్రసాద్ (17), మాయాపట్నానికి చెందిన ఓసిపల్లి జాన్లు మోటారు సైకిల్పై కోనపాపపేట వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పాడ నుంచి కోనపాపపేట వైపు వెళుతున్న ఆటో పొన్నాడ శివారు శీలంవారిపాలెం బ్రిడ్జి సమీపంలో ఆటో అతి వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో దుర్గాప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన జాన్ను చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సదరన్ ట్రావెల్స్ రిటైల్ బ్రాంచ్ ప్రారంభం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ప్రముఖ ట్రావెల్ సంస్థ సదరన్ ట్రావెల్స్ రాజమహేంద్రవరంలో తన కొత్త రిటైల్ బ్రాంచ్ను ఆదివారం ప్రారంభించింది. నగర, పరిసర ప్రాంతాల ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ట్రావెల్ సేవలను సులభంగా అందించాలనే లక్ష్యంతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. తొలుత ఈ కార్యాలయాన్ని ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఏపీఐసీసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. పలువురు ప్రముఖులు, సినీ తారలు, టూరిజం భాగస్వాములు, కస్టమర్లు హాజరయ్యారు. సదరన్ ట్రావెల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ అలపాటి మాట్లాడుతూ రాజమహేంద్రవరం ప్రజలకు విశ్వసనీయమైన, సౌకర్యవంతమైన సేవలను అందించడమే తమ సంస్థ లక్ష్యమన్నారు. ఈ కొత్త బ్రాంచ్ ద్వారా దేశీయ, అంతర్జాతీయ హాలీడే ప్యాకేజీలను మరింత విస్తృతంగా అందిస్తామన్నారు. ఇప్పటి వరకూ సదరన్ ట్రావెల్స్ 45 లక్షలకు పైగా సంతృప్తి చెందిన కస్టమర్లకు సేవలందిస్తూ, 99 శాతం కస్టమర్ రిటెన్షన్ రేటును సాధించిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రెండు వేలకు పైగా గ్రూప్, కస్టమైజ్డ్ హాలిడే ప్యాకేజీలను అందిస్తుందన్నారు. పర్యాటక మంత్రిత్వ శాఖ నుంచి ఎనిమిది సార్లు ‘నేషనల్ టూరిజం అవార్డు’ను అందుకోవడంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల పర్యాటక శాఖలు, ఇతర ప్రతిష్టాత్మక సంస్థల నుంచి కూడా అనేక పురస్కారాలను అందుకుందన్నారు. సదరన్ గ్రూప్ ఢిల్లీ, జైపూర్, వారణాసి (కాశీ విశ్వనాథ్ కారిడార్), విజయవాడలో హోటళ్లను నిర్వహిస్తూ 225కి పైగా రూమ్ ఇన్వెంటరీ కలిగి ఉందన్నారు. ఇతర వివరాలకు 99495 23236, 95057 26000 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని అన్నారు. -
దేశ భాషలందు తెలుగు లెస్స
● అమ్మ భాషను కాపాడుకుందాం ● రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ● అమలాపురంలో రెండో రోజు తెలుగు మహాసభలు అమలాపురం రూరల్: దేశ భాషలందు తెలుగు లెస్స అని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ అన్నారు. అమలాపురం కిమ్స్ ప్రాంగణంలో గోదావరి గ్లోబల్ యూ నివర్సిటీ, కిమ్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు రెండో రోజు ఆదివా రం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు మహాసభల వేదికపై ప్రసంగించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని గవర్నర్ అన్నారు. వ్యవహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి తెలుగు భాషా వికాసానికి మహత్తర పాత్ర పోషించారని అన్నారు. ముఖ్యంగా వ్యవహారిక తెలుగు ప్రాచుర్యానికి కృషి చేసి, భాషను ప్రజలకు చేరువ చేశారన్నారు. సుమారు 100 మిలియన్ల తెలుగు ప్రజలు వివిధ రాష్ట్రాల్లో ఉన్నారని, వారంతా మన భాష ఉనికిని కాపాడుకోవాలన్నారు. తెలుగు భాషలో తీర్పు చెప్పేవారికి సహనం, చదువు చెప్పేవారికి ఓర్పు ఉండాలని సూచించారు. మహాభారతం సంస్కృత శైలిని ఆదికవి నన్నయ ఆంధ్రీకరించారని అన్నారు. తిక్కన మహాభారతాన్ని కొనసాగించి, సులభమైన భాషలో రచనలు చేసి ప్రజల్లో తెలుగు ప్రాచుర్యం పొందేలా చేశారన్నారు. యర్రాప్రగడ మహాభారతాన్ని పూర్తి చేసి తెలుగు సాహిత్యాన్ని మరింత బలపరిచారన్నారు. మూలాలు మరవద్దు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్వర్మ మాట్లాడుతూ తెలు గు భాషను ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్ అని అంటారని అన్నారు. మన భాష జీవిత విలువలను ప్రతిబింబిస్తుందన్నారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు పిల్లలు మన భాషా మూలాలను మరువరాదన్నారు. భాషను కాపాడడం అంటే కేవలం పాఠ్య పుస్తకాల్లోనే కాదని, దానిని దైనందిన జీవితంలో ఉపయోగించడం, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చేయడం, కొత్త తరాలకు అందించడం కూడా అంతే ముఖ్యమన్నారు. భాషను నేర్పించాలి తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గౌస్ మీరా మొహియుద్దీన్, జస్టిస్ సుద్దాల చలపతిరావు, జస్టిస్ వాకిటి రామకృష్ణారెడ్డి, జస్టిస్ గాడి ప్రవీణ్కుమార్ కుటుంబ సమేతంగా వచ్చి తెలుగు మహాసభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి చలపతిరావు మాట్లాడుతూ తెలుగులో ఉన్న 56 అక్షరాలు నేర్చుకుంటే ఇంగ్లిష్ ఉన్న అక్షరాలు నేర్చుకోవడం ఎంతో సులువు అని అన్నారు. అమ్మ భాషను మరువరాదన్నారు. జస్టిస్ గౌస్ మీరా మొహియుద్దీన్ మాట్లాడుతూ తెలుగు భాషపై ప్రేమతో ఈ మహాసభలో పాల్గొడం ఆనందంగా ఉందన్నారు. చిన్నతనం నుంచే పిల్లలతో పెద్ద బాలశిక్ష చదించి, తెలుగు భాషను బోధించాలన్నారు. న్యాయమూర్తి గాడి ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ మన భాష తల్లి వంటిందని, చిన్నతనం నుంచి పాఠశాలల్లో పిల్లలకు నేర్పించాలన్నారు. మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడాలంటే ప్రాంతీయ భాష అవసరమన్నారు. జస్టిస్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ భావితరాలు మన భాషా సంస్కృతిని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. శృంగేరీ పీఠం పండితుడు విశ్వనాథ గోపాలకృష్ణశర్మ, ప్రముఖ వేదపండితుడు బంగారయ్యశర్మ, హైకోర్టు ఏజీఏ నరసింహశర్మ, ధనంజయ ప్రసంగించగా.. ప్రముఖ కథా రచయిత తనికెళ్ల భరణి, ప్రముఖ దర్శకుడు ఆర్పీ పట్నాయక్ తెలుగు భాషలో పాటలు పడుతూ ఉత్తేజపరిచారు. నిర్బంధ విద్య అవసరం అవనిగడ్డ ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ మాట్లాడుతూ నిర్బంధంగా కన్నడను కర్ణాటకలో బోధిస్తున్నారని, మనకు తెలుగు భాషలో విద్యా బోధన డిగ్రీ స్థాయి వరకూ జరగాలన్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలుగు భాష వైభవం గురించి మాట్లాడారు. డీఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్రెడ్డి ప్రసంగిస్తూ సాంకేతిక యుగంలో తెలుగు వ్యాప్తికి అవకాశాలు ఉన్నాయన్నారు. సభకు అధ్యక్షతన వహించిన చైతన్యరాజు ప్రసంగిస్తూ ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగు మాధ్యమంలో విద్యనభ్యసించిన వారికి ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రాయితీ ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యేలు ఆనందరావు, బండారు సత్యానందరావు, కిమ్స్ ఎండీ రవికిరణ్వర్మ, గైట్ ఎండీ కె.శశి, రిటైర్డ్ డీఏజీ ఏకే ఖాన్, నన్నయ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రసన్నశ్రీ ప్రసంగించారు. సినీ నటుడు చిరంజీవికి ప్రకటించిన జీవన సాఫల్య పురస్కారాన్ని అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి, అలాగే అంతర్జాతీయ క్రీడాకారుడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్కు ప్రకటించిన పురస్కారాన్ని ఆయన తల్లి రంగమణి అందుకున్నారు. సినీ నటుడు సుమన్, బ్యాండ్ మేళం సినిమా హీరో నిఖిల్, హీరోయిన్ శ్రీదేవి పాల్గొన్నారు.పాల్గొన్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు తదితరులుతెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్వర్మను సత్కరిస్తున్న కిమ్స్ చైర్మన్ చైతన్యరాజు -
క్లీనర్ బస్సు నడపడం వల్లే ప్రమాదం
సఖినేటిపల్లి: సఖినేటిపల్లికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు శనివారం అంతర్వేది రాంబాగ్ వద్ద చెట్టును ఢీకొన్న ఘటన జరగడానికి డ్రైవింగ్ అనుభవం లేని క్లీనర్ తప్పిదమే కారణమని జిల్లా రవాణాధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని క్లీనర్కు బస్ స్టీరింగ్ ఇచ్చిన క్రమంలో గేదె అడ్డుగా రావడంతో అదుపుతప్పి రోడ్డు మార్జిన్లోని కొబ్బరి చెట్టును ఢీకొన్నారన్నారు. కాగా రావులపాలెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఓలేటి శ్రీనివాస్ జరిపిన విచారణలో బస్సు కండీషన్ బాగానే ఉందని, క్లీనర్ బస్సు నడపడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని తేలిందన్నారు. ఇదిలా ఉండగా బస్సును సీజ్ చేయడమే కాకుండా డ్రైవర్ లైసెన్స్ మూడు నెలలు, బస్సు పర్మిట్ కూడా ఒక నెల సస్పెండ్ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్నారు. 25 వాహనాల సీజ్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో అక్రమంగా ఇసుక, కంకర, ఇతర చిన్న తరహా ఖనిజాల రవాణాపై గనుల శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి డి.ఫణిభూషణ్రెడ్డి తెలిపారు. శని, ఆదివారాల్లో కడియం మండలం పరిధి, బొమ్మూరు నుంచి వేమగిరి వెళ్లే హైవే మధ్యలో రూట్ చెక్ నిర్వహించామన్నారు. పంగిడి నుంచి వస్తున్న 12 రోడ్ మెటల్ లారీలు, రంగంపేట నుంచి వస్తున్న 8 గ్రావెల్ లారీలు, రాఘవాపురం నుంచి వస్తున్న ఐదు ఆర్టీనరీ ఎర్త్ రవాణా చేస్తున్న లారీలు గుర్తించామని తెలిపారు. వాహనాల డ్రైవర్లు సరైన మైనింగ్ బిల్లులు చూపించక పోవడంతో మొత్తం 25 వాహనాలను స్వాధీనం చేసుకుని, కడియం పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు తెలిపారు. ఈ తనిఖీలో కార్యాలయ అసిస్టెంట్ జియాలజిస్ట్లు జి.విఘ్నేశ్వరుడు, డి.జ్యోతిర్మయి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మనీషా, టెక్నికల్ అసిస్టెంట్ ఎ.శైలజ పాల్గొన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్త కొబ్బరి (క్వింటాల్) 20,000 – 22,500 కొత్త కొబ్బరి (రెండో రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 31,500 గటగట (వెయ్యి) 29,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,500 గటగట (వెయ్యి) 27,000 నీటికాయ పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 16,000 – 17,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి)16,000 – 17,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 కిలో 400 -
ఇంతింతై సాగుతూ..
ఫ కూరగాయల సాగులో గిరిజన మహిళలు ఫ కష్టమైనా ఇష్టపడి వ్యవసాయం ఫ ఇంటి పంటలతో ఆర్థిక ఆదాయం చింతూరు: మహిళామణులు అన్నింటా రాణిస్తున్నారు.. ఏజెన్సీలో అతివలు ఇంటి పంటలను తమ ఆర్థిక ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. తమ ఇంటి పెరట్లో కూరగాయలు, ఆకుకూరలు పండించి వాటిని విక్రయించడం ద్వారా కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. ఏజెన్సీలోని చింతూరు, కూనవరం, వీఆర్పురం, ఎటపాక మండలాల్లో గిరిజన మహిళలు ఇంటి పంటలుగా కూరగాయలు, ఆకుకూరలు ఏడాది పొడవునా పండిస్తున్నారు. సేంద్రియ ఎరువులు, కషాయాలు వినియోగించి పండిస్తున్న ఈ పంటలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటోంది. ఇలా చాలామంది మహిళలు ఇంటి పంటలపై ఆసక్తి చూపుతున్నారు. తాజా కూరగాయలు, ఆకుకూరలు లభ్యమవుతుండడంతో వినియోగదారులు కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంటి పంటల ద్వారా ఒక్కో కుటుంబం ఏడాదికి రూ.లక్ష వరకూ ఆదాయాన్ని సమకూర్చుకుంటుందని అంచనా. పంట పండిస్తున్నారు ఇలా.. ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలాన్ని చదును చేసి దుక్కిదున్ని కూరగాయల సాగుకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. పట్టణ ప్రాంతాల నుంచి వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల విత్తనాలను కొనుగోలు చేసి వాటిని చల్లుతున్నారు. ఇళ్లలోని మోటార్లు, చేతి బోర్ల సాయంతో తడులు పెడుతూ నీటి ఎద్దడి లేకుండా చూసుకుంటున్నారు. రసాయన ఎరువులకు బదులు సేంద్రియ ఎరువులు, పురుగు మందులకు బదులు కషాయాలను వినియోగిస్తున్నారు. ఇంటిల్లపాదీ కలసి సేద్యం చేస్తూ కూరగాయలు, ఆకుకూరలు మంచిగా పండేలా కష్టపడుతున్నారు. పంటను పశువులు పాడు చేయకుండా చుట్టూ కంచె నిర్మిస్తున్నారు. ప్రధానంగా కూరగాయల్లో ఆనప, వంకాయ, బెండ, బీరకాయ, చిక్కుడు, గోరుచిక్కుడు, టమాటా, కాకర, బరబోటి వంటివి పండిస్తున్నారు. ఆకుకూరల్లో తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, మెంతికూర, పుదీనా వంటివి సాగు చేస్తున్నారు. నాలుగు ముంపు మండలాల్లో సుమారు వంద మంది మహిళలు కొన్నేళ్లుగా సుమారు 250 ఎకరాల్లో కూరగాయలను పండిస్తూ ఆర్థిక ఆదాయం పొందుతున్నారు. కుటుంబానికి ఆర్థిక వెసులుబాటు కుటుంబ పోషణ నిమిత్తం కూరగాయల సాగు చేస్తున్నాం. కష్టమైనా ఎంతో ఇష్టంతో కూరగాయలు పండిస్తు న్నాం. ప్రతి రోజూ ఉదయమే వాటిని మండల కేంద్రాలకు తీసుకెళ్లి విక్రయిస్తున్నాం. దీని ద్వారా మా కుటుంబాలకు ఆర్థికంగా వెసులుబాటు లభిస్తోంది. – జయమ్మ, కుమ్మూరు, చింతూరు మండలం ప్రభుత్వం సహకారం అందించాలి కూరగాయల సాగు నిమిత్తం పెట్టుబడి అధికంగా అవుతోంది. అప్పులు చేసి పంట సాగుచేసిన పిదప వచ్చిన ఆదాయంతో అప్పులు తీరుస్తున్నాం. ప్రభుత్వం రాయితీపై విత్తనాలు సరఫరా చేయడంతో పాటు రుణాలు అందిస్తే కూరగాయల సాగులో మరింత ప్రగతి సాధిస్తాం. – రాధాబాయి, చూటూరు, చింతూరు మండలం అతివలు అంతకంతకూ ఎదుగుతున్నారు.. కుటుంబ పోషణకు మేము సైతం అంటూ ముందుకు ‘సాగు’తున్నారు.. పురుషులకే సాధ్యమైన వ్యవసాయంలో తామేమీ తీసిపోమన్నట్టుగా కూరగాయల సాగుపై దృష్టి సారించారు.. ఇళ్ల వద్ద తమ కున్న కొద్దిపాటి భూముల్లో సాగు చేస్తూ ఔరా అనిపించుకుంటున్నారు. ఆకుకూరలు, కూరగాయలు పండిస్తూ, వాటి విక్రయాల ద్వారా ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. గిరి మహిళలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మండల కేంద్రాల్లో విక్రయాలు గిరిజన మహిళలు తాము పండించిన కూరగాయలు, ఆకుకూరలను మండల కేంద్రాలకు తీసుకొచ్చి ప్రధాన కూడళ్లలో విక్రయిస్తున్నారు. కూరగాయలను పోగులుగా, ఆకుకూరలను కట్టలుగా కట్టి పోగు రూ.20కి, కట్ట రూ.5 లేదా రూ.10కి విక్రయిస్తున్నారు. ఉదయమే తాజా కూరగాయలు సరసమైన ధరలకు లభిస్తుండడంతో వినియోగదారులు అధిక శాతం వాటినే కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు ప్రధాన సెంటర్లు, బస్సులు నిలిపే ప్రదేశాల్లో కూరగాయలు, ఆకుకూరలు లభిస్తుండడంతో ఇతర ప్రాంతాలకు చెందిన వాహనదారులతో పాటు ప్రయాణికులు కూడా వాటిని కొనుగోలు చేస్తున్నారు. అప్పటికప్పుడు కోసి తీసుకు రావడం, సేంద్రియ ఎరువులతో పండిస్తుండడంతో ఇవి వండితే రుచికరంగా ఉంటున్నాయని కొనుగోలుదారులు అంటున్నారు. -
కలవర్పాట్లు వద్దు!
● హోలీ వేళ రసాయన రంగులతో అనర్థాలు ● ఆనందంతో పాటు ఆరోగ్యం ముఖ్యం ● జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు ● రేపే హోలీ పర్వదినం రాయవరం: ఆకాశంలోని ఇంద్ర ధనస్సు పుడమిపైకి దూసుకొస్తుంది. కేరింతలతో పులకించే యువతపై మెరవనుంది. ఆ రంగులన్నీ కుప్పలుగా పోశారా అన్నట్లుగా పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా చేసుకునేదే హోళీ పండగ. అయితే రంగుట మాటున కష్టాలున్నట్టు.. రసాయనాలు కలిపిన రంగులు వాడితే ప్రమాదం తప్పదు. సహజ రంగులతో వసంత రుతువుకు స్వాగతం పలకాలని నేత్ర వైద్యులు, పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో యువత హోలీ వేడుకలు నిర్వహించుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరి అని చెబుతున్నారు. వసంత రుతువు ఆగమనానికి చిహ్నంగా.. వసంత రుతువు ఆగమనానికి చిహ్నంగా హోలీ పండగను పేర్కొంటారు. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున హోలీ వేడుకలు జరుపుకొంటారు. ఈ పండగను కాముని పున్నమి, డోలోత్సవం తదితర పేర్లతో పిలిచినా సందడి మాత్రం ఒక్కటే అని చెప్పవచ్చు. ఏటా వసంత మాసంలో హోలీ పర్వదినం వస్తుంది. చలి కాలానికి వీడ్కోలు పలుకుతూ వెచ్చని వేసవికి స్వాగతం పలికే హోలీ పండగతోనే తెలుగు సంవత్సరం ముగుస్తుంది. ఉగాది పర్వదినంతో కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. హోలి దుఃఖాన్ని పారదోలి సుఖశాంతులను కలిగిస్తుందనే నమ్మకం ఉంది. అందుకే రంగులు చల్లుకుని, మిఠాయిలు తింటారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి ● హోలీ సందడిలో పలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. ఈ వేడుకల్లో పాత దుస్తులనే సాధ్యమైనంత వరకూ వాడాలి. చిన్నారులు, యువతను గమనిస్తూ ఉండాలి. రంగులను దుస్తులపైనే చల్లాలి. ● రసాయనిక రంగులతో కళ్లకు హాని కలగకుండా కళ్లద్దాలు ధరించాలి. దంతాలపై రంగులు పడకుండా పళ్లకు డెంటల్ కాప్స్ వేసుకోవాలి. తలకు, శరీరానికి ముందుగానే ఆయిల్ రాసుకుంటే మంచిది. ● రంగులు పూసుకునేటప్పుడు కళ్లు, పెదాలు తప్పనిసరిగా మూసుకోవాలి. జుత్తుపై రంగులు పడకుండా క్యాప్ పెట్టుకోవాలి. దీనివల్ల రంగుల నుంచి వెంట్రుకలను రక్షించుకోవచ్చు. ● హోలి తర్వాత గోరు వెచ్చని నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ సమయంలో కూడా రంగు నీరు కళ్లు, నోట్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ● రంగుల పొడులు కళ్లలో పడితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. రంగులతో మంట, దద్దుర్లు వంటివి వస్తే వెంటనే శరీరాన్ని శుభ్రంగా కడిగి కొబ్బరి నూనెను రాసి చర్మ వైద్య నిపుణులను సంప్రదించాలి. అపశ్రుతులకు తావివ్వరాదు హోలీ పండగను ఆనందోత్సవాల మధ్య అపశ్రుతులకు తావులేకుండా జరుపుకోవాలి. స్నానం కోసం గోదావరి నది, చెరువుల్లోకి దిగరాదు. ముఖ్యంగా చిన్న పిల్లలు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్లో లభించే రంగులు కల్తీగా ఉంటాయి. సహజ సిద్ధమైన రంగులు చల్లుకోవడం మంచిది. సిల్వర్ రంగు, ఇతర ప్రమాదకరమైన రంగులు చల్లుకుంటే చర్మ వ్యాధులు వస్తాయి. కోడిగుడ్లను వాడకుండా దూరంగా ఉండాలి. ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించరాదు. రంగులు శరీరంపై ఉన్నప్పుడు ఎక్కువ సేపు ఎండలో ఉండడం మంచిది కాదు. చల్లని నీటితో శుభ్రం చేయాలి కళ్లలో రంగులు పడితే కళ్లను నలపడం, రుద్దడం చేయకుండా చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఆలస్యం చేయకుండా సమీపంలోని నేత్ర వైద్యున్ని సంప్రదించాలి. హానికర రంగులతో కంటి రెటినా దెబ్బతినే ప్రమాదముంది. కంట్లో ఉండే కంజెక్టినా పొర రసాయనాలకు ప్రభావితం అవుతుంది. – రమ్య, వైద్యురాఉల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రాయవరం -
ఉత్సాహంగా మారథాన్
కాకినాడ రూరల్: ఆమె భద్రత – మన బాధ్యత అనే నినాదంతో కాకినాడలో ఆదివారం మారథాన్ ఉత్సాహంగా జరిగింది. సూర్యారావుపేట వద్ద న్యూ ఎన్టీఆర్ బీచ్ నుంచి జరిగిన అఫెక్స్ కాకినాడ సీపోర్ట్స్ మారథాన్ – 2026 ఎనిమిదో ఎడిషన్ విజయవంతమైంది. పరుగో పరుగో అన్నట్టుగా కాకినాడతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యువతీ, యువకులు వచ్చి పోటీ పడ్డారు. కాకినాడ నుంచి ఉప్పాడ వరకూ ఆఫ్ మారథాన్గా 21.1 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహించారు. తొలుత బీచ్ వద్ద పోటీల్లో పాల్గొనే వారితో వార్మఫ్ నిర్వహించారు. తొలుత మారథాన్ను సీపోర్ట్స్ సీఓఓ మురళీధర్, అఫెక్స్ సీ ప్రోజోన్ ఫుడ్స్ కె.చౌదరి, ఓఎన్జీసీ ఈఈ ప్రభాల్ సేన్ గుప్తా, జీఆర్టీ హోటల్ జీఎం శివకిరణ్, సంకురాత్రి ఫౌండేషన్ జీఎం రమణమూర్తి, రెడ్క్రాస్ చైర్మన్ వైడీ రామారావు తదితరులు ప్రారంభించారు. నాలుగు విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి కాకినాడ రన్నర్స్ ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ డాక్టర్ సుధా కేశవరాజు, ట్రస్టీ, మారథాన్ డైరెక్టర్ ఎన్ఎల్ శ్రీనివాస్ తదితరుల ఆధ్వర్యంలో జ్ఞాపికలను అందజేశారు. -
తాటాకిళ్లు దగ్ధం
శంఖవరం: జి.కొత్తపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో మూడు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. వీఆర్వో సింహాచలం వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బర్ల సింహాచలం, పల్లా నారాయణమ్మ, పెంటపాటి వరలక్ష్మి కుటుంబాలు మూడు తాటాకిళ్లలో పక్కపక్కనే నివాసం ఉంటున్నాయి. వారు నిద్రపోతుండగా విద్యుత్ షార్ట్ షర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో ఆ తాటాకిళ్లు కాలిపోయాయి. నిత్యావసరాలు, నగదు పూర్తిగా కాలిపోయాయి. రూ.2 లక్షల ఆస్తినష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. కట్టుబట్టలతో రోడ్డున పడిన బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సర్పంచ్ ఈగల విజయదుర్గ కోరారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
బీవీసీలో ముగిసిన యువజనోత్సవం అమలాపురం రూరల్: అమలాపురం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి యువజనోత్సవం మయూక–2026 ఘనంగా ముగిసింది. రెండో రోజు శనివారం జరిగిన కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి, సినీ హీరో నిఖిల్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ మేనేజ్మెంట్ విభాగాల్లో వివిధ క్రీడా, సాంస్కృతిక పోటీల్లో విజేతలకు రూ. 5 లక్షల విలువైన నగదు బహుమతులు, ట్రోఫీలను కళాశాల చైర్మన్ బోనం కృష్ణ సతీష్, బీవీసీ అక్షర్ ఇంటర్నేషనల్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ బోనం విజయలకి్ష్మ్ ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో బీవీసీ ఓడలరేవు ప్రథమ స్థానం, కిమ్స్ అమలాపురం జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. బాస్కెట్ బాల్లో సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ ప్రథమ, ఆదిత్య డిగ్రీ కళాశాల ద్వితీయ, త్రోబాల్ మహిళా విభాగంలో బీవీసీ ఓడలరేవు ప్రథమ, బీవీసీ భట్లపాలెం ద్వితీయ స్థానాలు, కోకో మహిళా విభాగంలో సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ప్రథమ, బీవీసీ భట్లపాలెం ద్వితీయ స్థానాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ జేవీసీ రామారావు తెలిపారు. అనంతరం సాంస్కృతిక ప్రదర్శనలో ప్రముఖ గాయకుడు రామ్ మిరియాల బృందం ఆలపించిన పాటలు అలరించాయి. బ్యాండు మేళం సినీ బృందం, హీరోయిన్ శ్రీదేవి, హీరో రోషన్, నిర్మాత కోన వెంకట్, దర్శకుడు సతీష్ పాల్గొని సందడి చేశారు. బీవీసీ గ్రూప్ అధినేత బోనం కనకయ్య, ప్రిన్సిపాల్స్ మహేశ్వర దత్తు, టీవీ జనార్దనరావు, మయూక కన్వీనర్లు కె.శ్రీనివాస్, బీఎస్ఎస్ ఫణిశంకర్, క్రీడా, సాంస్కృతిక విభాగాల కోఆర్డినేటర్లు, వివిధ విభాగాల అధిపతులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జక్కం కృష్ణారావు పాల్గొన్నారు. -
ట్యూనా.. చూడాముచ్చటేనా!
లోతైన సముద్ర జలాల్లో లభ్యమయ్యే ట్యూనా చేపల వేటకు కాకినాడ ప్రసిద్ధి. ఇక్కడ మత్స్యకారులు వలలతో పాటు గాలం కమ్మెల ద్వారా ఈ చేపలను వేటాడతారు. ప్రస్తుతం గాలం ద్వారా ఎల్లోపిన్ రకం ట్యూనా చేపలు లభ్యమవుతుండడంతో వాటిని కాకినాడలో విక్రయిస్తున్నారు. కుంభాభిషేకం వద్ద వీటి ధర కిలో రూ.130 వరకూ పలుకుతోంది. శనివారం విక్రయం కోసం మత్స్యకారులు ఇలా ఉంచారు. ఈ చేపలకు విదేశాల్లో మంచి కిరాకీ ఉంది. –కాకినాడ రూరల్ అపురూపం అమ్మా.. మురమళ్లలో భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామివారి ఆలయంలో మాణిక్యాంబ అమ్మవారిని వివిధ రకాల పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు. శివరాత్రి నుంచి మొదలై ఉగాది వరకూ ఇక్కడ జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం పండ్లతో అమ్మవారిని అలంకరించారు. పుచ్చకాయలు, స్వీట్కార్న్ మొక్కజొన్న, ద్రాక్ష, కమలా ఫలాలతో అలంకరణ విశేషంగా ఆకర్షించింది. –ఐ.పోలవరం ఆనబకాదు మారేడు పోతవరంలో పిచ్చుకల సత్తిబాబు (సత్యనారాయణ) వ్యవసాయ క్షేత్రంలో మారేడు చెట్టుకు కాసిన కాయలు అబ్బురపరుస్తున్నాయి. వీటిని ఆ గ్రామానికి చెందిన యేలేటి రాజశేఖర్ తీసుకువచ్చారు. సాధారణంగా మారేడు చెట్టుకు చిన్నసైజు కాయలు కాయడం చూస్తుంటాం. కానీ ఆనపకాయ సైజులో ఐదు కిలోల నుంచి తొమ్మిది కిలోల వరకూ ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. –నల్లజర్ల పోతవరంలో కాసిన మారేడు కాయలు ఇదేందిరొయ్యే పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్ కేంద్రంగా సముద్రంపై వేటకు వెళ్లిన మత్స్యకారుల కు శనివారం మత్స్య సంపద తో పాటు రెండు మెగా రొయ్యలు చిక్కాయి. అర కేజీ చొప్పున బరువున్న ఈ రొయ్యలు వేలం పాటలో ఓ వ్యక్తి రూ.2 వేలకు చేజిక్కించుకున్నాడు. కాగా ఒడ్డుకు వచ్చే వరకూ ఇవి బతికి ఉండడం కష్టమని, బతికి ఉంటే ఈ రకం రొయ్యలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందని మత్స్యకారులు అన్నారు. –సఖినేటిపల్లి పండ్లతో మాణిక్యాంబ అమ్మవారికి అలంకరణ -
బడ్జెట్ అధికమైనా తప్పదు
ఏ శుభకార్యమైనా ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఏసీ కల్యాణ మండపాల్లోనే నిర్వహిస్తున్నాం. ఇటీవల మా మనమరాలి ఓణీ ఫంక్షన్ను ఏసీ కల్యాణ మండపంలోనే నిర్వహించాం. ఒకప్పటి పరిస్థితికి, నేటి పరిస్థితికి చాలా మార్పు వచ్చింది. ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా శుభకార్యాలు చేయాల్సిందే. –ద్విభాష్యం విజయప్రభాకర్, విశ్రాంత ఉద్యోగి, రాజమహేంద్రవరం ఇళ్ల వద్ద నిర్వహించే పరిస్థితి లేదు ఏ కార్యక్రమమైనా ఇళ్ల వద్ద నిర్వహించే పరిస్థితి లేదు. చిన్న, మధ్య తరగతి కుటుంబాలు కూడా ఆర్థిక పరిస్థితిని వెరవకుండా ఏసీ కల్యాణ మండపాల్లోనే నిర్వహిస్తున్నారు. నాన్ ఏసీ అయితే ఏసీ కా దా.. అంటూ వచ్చిన వారు పెదవి విరుస్తున్నారు. –కొప్పిశెట్టి శ్రీనివాస్, వ్యాపారి, రాజమహేంద్రవరం డిమాండ్ ఎక్కువగానే ఉంది గ్రామీణ ప్రాంతాల్లో కూడా కల్యాణ మండపాలకు డిమాండ్ అధికంగానే ఉంది. రైస్ మిల్లును కల్యాణ మండపంగా మార్చాం. ముహూర్తాల సమయంలో డిమాండ్ మరింత అధికంగా ఉంటుంది. రెండు, మూడు నెలల ముందుగానే కల్యాణ మండపాన్ని బుక్ చేసుకుంటున్నారు. –మూర్తినీడి వెంకటరాజు, కల్యాణ మండపం నిర్వాహకుడు, రాయవరం -
మృత్యుపంజా
బాణసంచా...ఆరని జ్వాలలు.. వరుస విషాదాలువేట్లపాలెం బాణసంచా కేంద్రంలో ఎగసిపడుతున్న మంటలు, దట్టమైన పొగలుసాక్షి ప్రతినిధి, కాకినాడ/సామర్లకోట/పిఠాపురం: సామర్లకోట మండలం వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం సంభవించిన భారీ విస్పోటంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఉలికిపాటుకు గురైంది. ప్రజలను తీవ్ర విషాదంలో నింపింది. ఈ దుర్ఘటనలో 20 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయా యి. మరో 11 మంది క్షతగాత్రులై ఆస్పత్రుల్లో ప్రాణాపాయంలో కొట్టుమిట్టాడుతున్నారు. మృతులందరూ రోజు కూలిపై ఆధారపడి కుటుంబాలను నెట్టుకొస్తున్న వారే కావడం విషాదం. ఈ సంఘటన రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద విస్ఫోటం కావడమే కాకుండా.. మృతుల సంఖ్య రెండు పదులకు చేరుకోవడంతో అందరినీ కలచివేస్తోంది. బాధిత కుటుంబాల ఆవేదన బాణసంచా పేలుడులో 20 మంది నిరుపేదలైన కూలీలు మృతి చెందడంతో వేట్లపాలెం, గూడపర్తి, పెద్దాపురం, సామర్లకోట, మేడపాడు తదితర గ్రామాల్లో విషాదం నెలకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా కాలిన గాయాలతో కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితిపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గత ఏడాది అక్టోబర్ 8న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాయవరంలో జరిగిన సంఘటనలో 10 మంది మృత్యువాత పడ్డారు. నాటి దుర్ఘటనకు శ్రీగణపతి గ్రాండ్ ఫైర్వర్క్స్ యాజమాన్యం సరైన ముందస్తు భద్రతా చర్యలు తీసుకోకపోవడమే కారణమని తేల్చారు. ఆ దుర్ఘటనకు కొనసాగింపా అన్నట్టుగా.. ఇప్పుడు వేట్లపాలెంలో పెను విషాదం చోటు చేసుకుంది. బతుకులు బుగ్గి బాణసంచా తయారీ కేంద్రాలు ప్రజల గుండెలపై కుంపటిగా మారాయి. ఈ కేంద్రాల్లో పని చేస్తున్న నిరుపేదల బతుకులు బుగ్గిపాలవుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో గడచిన రెండేళ్ల కాలంలో జరిగిన రెండు విషాదకర సంఘటనలు జిల్లా ప్రజలను కలచివేశాయి. రెక్కాడితే గాని డొక్కాడని దినసరి కూలీలే ఈ ప్రమాదాలకు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రమాదం సంభవించినప్పుడు అధికారులు హడావుడి చేసి, ఆనక చేతులు దులుపేసుకోవడమే కొంప ముంచుతోందనే వాదన వినిపిస్తోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం, నిబంధనలు కఠినతరం చేయగలిగితే ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కావడానికి ఆస్కారం ఉండేది కాదంటున్నారు. నిబంధనలు కఠినతరం చేయాలి నిబంధనలు కఠినతరం చేయడం, నిరంతరం పర్యవేక్షించడం ద్వారానే బాణసంచా తయారీ కేంద్రాల్లో ప్రమాదాల నివారించడం సాధ్యమవుతుంది. పెను ప్రమాదం జరిగిన ఒకటి రెండు రోజులు అగ్నిమాపక అధికారులు హడావుడి చేయడం.. ఆనక గాలికొదిలేయడం పరిపాటి. జనం కూడా ఆ రెండు రోజులూ గుర్తుంచుకుని జాగ్రత్త పడి ఆనక మరచిపోతున్నారు. తాజాగా జరిగిన వేట్లపాలెం సంఘటనలోనూ ఇలానే జరుగుతుందని స్థానికులు అనుమానిస్తున్నారు. అప్పుడే కళ్లు తెరచి ఉంటే.. సాంకేతిక అంశాల ఆధారంగా ఇటువంటి దుర్ఘటనల కు కారణాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఐదు నెలల క్రితం రాయవరంలో బాణసంచా దుర్ఘటన జరిగినప్పుడే కళ్లు తెరచి ఉంటే ఇప్పుడు వేట్లపాలెం ప్రమాదం చోటుచేసుకునేదే కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ‘ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డ’ సామెత చందంగా క్షతగాత్రుల పరామర్శకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. సంఘటన జరిగినప్పుడు చేస్తున్న హడావుడి ఆ తరువాత వీసమెత్తు కూడా కనిపించడం లేదు. క్షేత్ర స్థాయిలో లోపాలను గుర్తించి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మృతదేహాలను తరలిస్తున్న అగ్నిమాపక సిబ్బందిమృతదేహాలను ఒకచోటకు చేరుస్తున్న స్థానికులు, ఫైర్ సిబ్బంది చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు వారి పరిస్థితి విషమంకాకినాడ క్రైం: సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడిన తొమ్మిది మంది క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్కు తరలించారు. సప్పా సత్య వెంకటలక్ష్మి (వేట్లపాలెం దుర్గానగర్), చిటికెల లక్ష్మి (కొత్తపేట రామాలయం వీధి), కాలేటి శ్రీను, దర్శిపర్తి రాజు, వేమగిరి లోవరాజు, వేమగిరి దావీదు, దర్శిపాటి లోవరాజు, పల్లపాటి వీర శ్రీను (సామర్లకోట కుమ్మరి వీధి), మోర్తా శ్రీను (పెద్దాపురం) క్షతగాత్రుల్లో ఉన్నారు. శరీరాలు నూరు శాతం కాలిపోవడంతో వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వీరిని అత్యవసర విభాగంలోని ఎంఎల్సీ, ట్రామా కేర్ వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. గుండెలవిసేలా క్షతగాత్రుల కుటుంబీకులు రోదించిన తీరు ఆస్పత్రిలోని వారిని కలచివేసింది. క్షతగాత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి, వారికందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆయన వెంట మంత్రులు కందుల దుర్గేష్, హోం మంత్రి వంగలపూడి అనిత, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్బాబు, ఎంఎల్ఏలు నానాజీ, వెంకటేశ్వరరావు తదితరులున్నారు. అప్పటికప్పుడు ముస్తాబు వేట్లపాలెం బాణసంచా ప్రమాద బాధితులకు చికిత్స అందిస్తున్న కాకినాడ జీజీహెచ్లో వైద్య సేవల తీరు అస్తవ్యస్తంగా ఉంటోందనడానికి శనివారం నాటి పరిస్థితే ప్రత్యక్ష ఉదాహరణ. ఊహించని ఘటన కావడంతో ఆసుపత్రి అధికారులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. ఏం చేయాలో తోచని గందరగోళంలో ఉక్కిరిబిక్కిరి అ య్యారు. మీడియా తాకిడి, నాయకుల హడావుడి మొదలవడంతో ఎంఎల్సీ వార్డును అప్పటికప్పుడు ముస్తాబు చేసేశారు. పచ్చటి డిస్పోజబుల్ బెడ్షీట్లు పరిచేసి సిబ్బంది, యాప్రాన్లు, యూనిఫాంఽ ధరించి వైద్యులు హడావుడి పడ్డారు. తిరగని ఫ్యాన్లను తిప్పేందుకు, వెలగని లైట్లు వెలిగేంచేందుకు ఎలక్ట్రీషియన్ల తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఎంఎల్సీ వార్డు సహా ఎమర్జెన్సీ ఆరు బయట అప్పటికప్పుడు పది లైట్లు బిగించారు.న్యాయం చేయాలి సామర్లకోట: వేట్లపాలెం బాణసంచా పేలుడు మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా డిమాండ్ చేశారు. వేట్లపాలెంలో పేలుడు జరిగిన బాణసంచా తయారీ కేంద్రాన్ని ఆయన శనివారం పరిశీలించారు. పెద్ద సంఖ్యలో కార్మికులతో పని చేయిస్తూంటే.. ఎంత పెద్ద మొత్తంలో బాణసంచా తయారు చేస్తున్నారో గుర్తించాల్సిన బాధ్యత అధికారులపై లేదా అని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రమాద స్థలాన్ని పరిశీలించి, ఆయనకు వివరాలు తెలియజేస్తామని చెప్పారు. ఈ మేరకు జగన్ రెండు రోజుల్లో వేట్లపాలెంలో పర్యటించి, మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను పరామర్శిస్తారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు, ఎంపీపీ బొబ్బరాడ సత్తిబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్లు ఉబా జాన్మోజెస్, నెక్కంటి సాయిప్రసాద్, పార్టీ నాయకులు బంగారు కృష్ణ, నిడదవోలు సురేష్ చౌదరి, వల్లూరి భద్రరావు తదితరులు పాల్గొన్నారు. ● గతేడాది రాయవరంలో బాణసంచా పేలుడు ● ఇప్పుడు వేట్లపాలెంలో మరోసారి ● వరుస ఘటనలతో భయాందోళన రాయవరం: బాణసంచా కాల్చినప్పుడు విరబూసే వెలుగులు ఆకాశాన్ని కమ్ముకుంటాయి. కానీ అదే బాణసంచాను తయారు చేసే కార్మికుల కుటుంబాల్లో చీకట్లు అలముకుంటున్నాయి. పొట్టకూటి కోసం కూలికి వెళ్లిన కార్మికుల బతుకులు ముగిసిపోతున్నాయి. జువ్వల కాంతుల వెనుక అంధకార విషాదం దాగుంటోంది. ఉమ్మడి జిల్లాలో ఇటీవల వరసగా జరుగుతున్న ఈ ఘటనలు భయాందోళన కలిగిస్తున్నాయి. గతేడాది అక్టోబరు 8న రాయవరంలోని గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్లో జరిగిన దుర్ఘటనను మరువక ముందే ఫిబ్రవరి 28న సామర్లకోట మండలం వేట్లపాలెంలో సంభవించిన బాణసంచా పేలుడు భయాందోళనను కలిగించింది. మానని గాయం రాయవరంలో బాణసంచా తయారు చేస్తుండగా గతేడాది అక్టోబర్ 8వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పేలుడు సంభవించింది. ఆ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తితో సహా నలుగురు మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు ఇద్దరు చనిపోయారు. అనంతరం రోజుల వ్యవధిలో మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా.. మొత్తం 10 మంది మృతి చెందిన విషయం పాఠకులకు విదితమే. నాటి ఘటన తాలూకు గాయం ఇంకా మానక ముందే రాయవరం గ్రామానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేట్లపాలెంలో ఇటువంటి ఘటనే చోటు చేసుకోవడంతో బాణాసంచా తయారీ వెనుక ఉన్న భయంకర పరిస్థితిని మరోసారి గుర్తుకు చేసింది. మరుభూమి నాడు రాయవరంలో ప్రమాదం జరిగిన ఘటనా స్థలిని చూస్తే యుద్ధం తర్వాత మరుభూమిని తలపించింది. ఘటనా స్థలం అంతా బూడిదగా మారి అందులో మృతదేహాలు గుర్తు పట్టలేని స్థితికి చేరాయి. చేతికి ఉన్న గాజులు, కాళ్లకు ఉన్న మట్టెల ఆధారంగా మాత్రమే పురుషులు, సీ్త్రలుగా గుర్తించారంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒంటిపై ఉన్న ఆభరణాలు, చేతికి ఉన్న ఉంగరాల ఆధారంగా యజమాని ఆచూకీ కనుగొన్నారు. అసలు ఇంత పెద్ద ఎత్తున బాణాసంచా తయారు చేస్తున్నప్పుడు ప్రతి రోజూ ఎవరెవరు పనిచేస్తున్నారన్న విషయాన్ని అధికారులు తెలుసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేసింది. ప్రమాదం జరిగిన తర్వాత 7.30 గంటల వరకు పూర్తిగా మృతదేహాలను గుర్తించలేక పోయారు. ప్రాణాలు తోడేస్తున్న మందుగుండు తయారీ కేంద్రాలు నాలుగు నెలల్లో రెండు భారీ విషాద సంఘటనలు పేదల బతుకులు బుగ్గిపాలవుతున్నా పట్టించుకోని సర్కారు కొరవడిన అధికారుల పర్యవేక్షణ గతేడాది రాయవరంలో 10 మంది మృత్యువాత ఇప్పుడు వేట్లపాలెంలో 20 మంది సజీవ దహనం హృదయ విదారకంగా.. దీపావళి, దసరా, సంక్రాంతి వంటి పండగలతో పాటు పెళ్లిళ్లు, పుట్టినరోజు వేడుకలు, చివరకు శవయాత్రల్లో సైతం వేట్లపాలెం బాణసంచా కొనుగోలుకే మొగ్గు చూపే అభిమానులు తాజా విషాద సంఘటనతో హతాశులయ్యారు. ప్రమాదం సంభవించిన సమయంలో ఘటనా స్థలిలో పరిస్థితులపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన మృతుల ఫొటోలు, వీడియోలు హృదయ విదారకంగా ఉండటం చూసిన సామాన్యుల కళ్లు చెమ్మగిల్లాయి. పేలుడు ధాటికి మృతదేహాలు ఛిద్రమై తునాతునకలై తలో పక్కగా ఎగిరిపడ్డాయి. సంఘటన స్థలానికి చేరుకున్న మృతుల బంధువులు తమవారు బతికున్నారో చనిపోయారో తెలియక తమవారు బతికుండేలా చూడు దేవుడా అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఒకపక్క అధికారులు, సిబ్బంది మృతదేహాల భాగాలను పోగు చేస్తూంటే.. అందులో తమ వారెవరైనా ఉన్నారా అంటూ వెతుక్కోవాల్సిన దయనీయ పరిస్థితి అక్కడ నెలకొంది. బాణసంచా తయారీ పనికి వెళ్లిన వారి బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని తమ వారి జాడ కోసం కాలువలు, చెట్లు, పుట్టలు, పొలాల్లో వెతుక్కుంటూ కనిపించారు. సంఘటన స్థలానికి దూరంగా ఉన్న కాలువల్లోనూ మృతదేహాల భాగాలు దొరకడంతో ఆ చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లోనూ అధికారులు గాలింపు చేపట్టారు.ఒక్కసారిగా పిడుగు పడినట్లు భారీ విస్ఫోటం.. పెద్ద ఎత్తున ఎగసిపడిన మంటలు.. వ్యాపించిన దట్టమైన పొగ.. ఘటనా స్థలం నుంచి ఐదు కిలోమీటర్ల మేర వినిపించిన భారీ శబ్దాలు.. తునాతునకలైన శ్రామికుల దేహాలు.. ఇవీ సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించిన బాణసంచా తయారీ కేంద్రం వద్ద నెలకొన్న భయానక పరిస్థితులు. ఆనందోత్సవాలకు మరిన్ని కాంతుల్ని అద్దే ఆ నిరుపేద శ్రామికుల జీవితాలు క్షణాల్లో బూడిదకుప్పగా మారిపోయాయి. వేడుకల వేళ వెలుగులు విరజిమ్మే బాణసంచా తయారీయే వారి జీవితాల్లో చీకట్లు నింపేసింది. మృత్యుపంజా విసిరింది. వేయి నాల్కలు చాచిన అగ్నికీలల్లో కొందరు సజీవ దహనమైపోయారు. మరికొందరు కాలిన గాయాలతో ఆర్తనాదాలు చేస్తూ ప్రాణాలు విడిచారు. ఇంకొందరు ఆస్పత్రుల్లో కన్ను మూశారు. చంద్రబాబు వైఫల్యం చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యంతోనే ఉమ్మడి జిల్లాలోని బాణసంచా తయారీ కేంద్రాల్లో వరుసగా దుర్ఘటనలు జరుగుతున్నాయి. గతేడాది అక్టోబర్ 8న రాయవరంలోని గణపతి గ్రాండ్ ఫైర్వర్క్స్లో జరిగిన మందుగుండు సామగ్రి పేలుడు ఘటన నుంచి ప్రభుత్వం ఎలాంటి గుణపాఠాన్ని నేర్చుకోలేదు. ఆ ఘటనను తీవ్రంగా పరిగణించి తగిన చర్యలు తీసుకుని ఉంటే నేడు ఈ దుర్ఘటన పునరావృతం అయ్యేది కాదు. రాయవరం ఘటనపై వేసిన కమిషన్ దర్యాప్తు మాటలకే పరిమితం కావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. – తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ భద్రతను విస్మరించిన ప్రభుత్వం చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి అన్ని రంగాల్లో వైఫల్యం చెందారు. ఆయన వైఫల్యాలే ప్రజల పాలిట శాపాలుగా మారాయి. బాణసంచా తయారీలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించకుండా అనుమతులు ఇవ్వడంతో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వేట్లపాలెం ఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి. ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. ప్రజల భద్రతను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. – బొమ్మి ఇజ్రాయిల్, ఎమ్మెల్సీ రూ.కోటి పరిహారం ప్రకటించాలి బాణసంచా పేలుడులో అమాయక కూలీలు ప్రాణాలు కోల్పోవడం చాలా విచారకరం. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలి. వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలి. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి. బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు పెంచాలి. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. – చింతా అనురాధ, మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ రూ.కోటి పరిహారం ఇవ్వాలి వేట్లపాలెం బాణసంచా మృతులు ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున గాయపడిన వారికి రూ.50 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలి. లేబర్ కోడ్ల పేరుతో అధికారుల తనిఖీలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పులు చేయడం వల్లనే బాణసంచా పరిశ్రమల యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తరచుగా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ ప్రమాదానికి కారణమైన యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఘటన జరిగిన తర్వాత స్పందించడం కంటే, ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలి. – దువ్వా శేషుబాబ్జీ, చెక్కల రాజ్కుమార్, సీఐటీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు -
చెట్టును ఢీకొన్న స్కూల్ బస్సు
సఖినేటిపల్లి: ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో విద్యార్థులు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆ వివరాల ప్రకారం.. అంతర్వేది రాంబాగ్ వద్ద శనివారం సఖినేటిపల్లికి చెందిన ఓ స్కూల్ బస్సు ప్రధాన రహదారి మార్జిన్లో కొబ్బరి చెట్టును ఢీకొంది. ఆ సమయంలో బస్సులో 8 మంది విద్యార్థులు ఉండగా, స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సును డ్రైవర్ కాకుండా క్లీనర్ డ్రైవ్ చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. గాయాలైన విద్యార్థులను సమీప ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. -
నూరేళ్లూ చల్లగా ఉండాలని..
ఫ చల్లని వివాహ వేదికలకు క్రేజ్ ఫ ఏసీ కల్యాణ మండపాలకే ప్రాధాన్యం ఫ ఖర్చుకు వెనుకాడని పెళ్లి బృందాలు రాయవరం: ఆకాశమంత పందిరి.. భూదేవంత అరుగు.. ఒకప్పుడు గోదావరి జిల్లాల్లో పెళ్లిళ్లంటే ఇలానే మాట్లాడే వారు. ఫలానా వారి తోటలో కొబ్బరాకులు, పూలంటూ పురమాయించేవారు. ఇంటి వద్దే చలువ పందిళ్లు, మండపాల ఏర్పాటుతో ఐదు రోజుల పాటు చేసే పెళ్లిని పది కాలాల పాటు చెప్పుకొనేవారు. మళ్లీ ఇప్పుడు ఆ రోజులను గుర్తు చేస్తూనే.. హంగూ ఆర్భాటాలు, అంగరంగ వైభోగాలతో దక్షిణాది సంప్రదాయానికి ఉత్తరాది మెరుగులు అద్ది, ఖర్చుకు వెనుకాడకుండా జరిపిస్తున్నారు. ముఖ్యంగా ఏ శుభకార్యం చేయాలన్నా ముందుగా ఏసీ కల్యాణ మండపాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జాబితా తయారీలో వధూవరులు పెళ్లి ఎక్కడ చేసుకోవాలి? ఏ మండపంలో చేయాలి.. మెనూ ఏంటనేది వధూవరులే ఓ పెద్ద జాబితా తయారు చేసుకుంటున్నారు. జీవితకాలం గుర్తుండి పోయేలా వివాహాన్ని చేసుకోవాలని ఆశించే వధూవరులు పెళ్లికి వచ్చే స్నేహితులు, కుటుంబ సభ్యుల రాకను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక ఏసీ కల్యాణ మండపంలోనే చేసుకోవాలని భావిస్తున్నారు. వాటి అద్దె, లంచ్, డిన్నర్, అలంకరణకు కనీసం రూ.10 నుంచి రూ.15 లక్షల వరకు చేస్తున్నారని రాయవరం గ్రామానికి కల్యాణ మండపం నిర్వాహకుడొకరు చెప్పారు. ముందుగానే బుకింగ్ వివాహం నిశ్చయమైన వెంటనే ముందుగా పెళ్లి ఎక్కడ చేయాలనే దానిపై అధికంగా చర్చించుకుంటున్నారు. ఆలయాల వద్ద కాకుంటే కల్యాణ మండపాలకే ప్రాధాన్యం ఇస్తూ.. వెంటనే మండపాల బుకింగ్ చేస్తున్నారు. రెండు, మూడు నెలల ముందుగా మండపం బుక్ చేసుకోకుంటే దొరకని పరిస్థితి ఉంది. విదేశాల్లో ఉండే సాఫ్ట్వేర్ ఇంజినీర్లు అద్దె రెట్టింపు ఇస్తామని ఫోన్లు చేసి అడుగుతున్నారని మండపాల నిర్వాహకులు చెబుతున్నారు. పల్లెల్లో సైతం.. వాతావరణంలో వస్తున్న మార్పులు.. ఇప్పుడు కాకుంటే ఎప్పుడంటూ వివాహ వేడుకలకు ఇస్తున్న ప్రాధాన్యం నేపథ్యంలో పల్లెల్లో సైతం కల్యాణ మండపాల నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరు కొత్త భవనాలను నిర్మిస్తుంటే.. మరికొందరు పాత భవనాలను కల్యాణ మండపాలుగా మార్చేస్తున్నారు. ఏ చిన్న శుభ కార్యం చేయాలనుకున్నా.. సమావేశాలు నిర్వహించాలనుకున్నా.. ఏసీ కల్యాణ మండపాలకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. వివాహ ఆహ్వాన పత్రికల్లో సైతం ఏసీ కల్యాణ మండపం అనే విషయాన్ని స్పష్టంగా పేర్కొంటున్నారు. వచ్చిన బంధువులు, స్నేహితులు అధిక సమయం ఉండాలంటే ఏసీ కల్యాణ మండపాలే ఉండాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు ఉన్న కల్యాణ మండపాల్ని ఏసీ కల్యాణ మండపాలుగా మార్చేస్తున్నారు. ఆర్భాటానికే ప్రాధాన్యం ఓ కల్యాణ మండపంలో ఓ వ్యాపారి తన కుమారుడికి ఇటీవల పెళ్లి జరిపించారు. సుమారు 10 రకాల స్వీట్లు, నాలుగైదు రకాల స్పెషల్ రైస్, ఆకుపై 20 రకాల కూరలు (పొడులు, పచ్చళ్లతో కలిపి) ఉండాలని చెప్పారు. 2 వేల మందికి ఆర్డర్ ఇచ్చారు. ప్లేటు రూ.500 అయ్యిందని కల్యాణ మండపం నిర్వాహకుడు చెప్పారు. ఒక్క భోజనాలకే ఖర్చు రూ.10 లక్షలు అయ్యిందని చెప్పుకొనే విధంగా చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో పెద్ద, చిన్న కలిపి 200 వరకూ కల్యాణ మండపాలున్నాయి. అతి పెద్ద ఏసీ మండపమైతే అద్దె రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలు ఉంటోంది. భోజనాలకు మెనూను బట్టి ఆకుపై వేసిన రకాలను బట్టి రూ.300 నుంచి 450 వరకూ పడుతుంది. ఇక కల్యాణ మండపంలో పచ్చిపూల మండపం ఏర్పాటుకు బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ తదితర నగరాల నుంచి నుంచి తీసుకొచ్చిన పూలకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకూ ఖర్చు చేస్తున్నారు. విద్యుద్దీపాలంకరణకు మరో రూ.లక్షన్నర వరకూ పెడుతున్నారు. ఇవి కాకుండా బాజాభజంత్రీలకు ఖర్చులు అదనం. -
దాడి.. ఆపై దోపిడీ
అంబాజీపేట: ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలిపై దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసుతో గుర్తుతెలియని వ్యక్తి పరారయ్యాడు. అంబాజీపేట ఎస్సై చిరంజీవి కథనం ప్రకారం.. మాచవరం గ్రామానికి చెందిన ర్యాలి సత్యనారాయణ ఇంట్లో అతని అత్తయ్య దేవగుప్తపు లక్ష్మి నివాసం ఉంటున్నారు. శనివారం తెల్లవారు జామున ఇంటి ఆవరణలో ఉన్న బాత్రూమ్కి వెళ్లి వస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె తలపై గాయపరిచాడు. అనంతరం లక్ష్మి మెడలో ఉన్న 9 గ్రాముల బంగారు గొలుసుతో పరారయ్యాడు. సమీపంలో నివాసముంటున్న అతని అల్లుడు సత్యనారాయణకు జరిగిన సంఘటనను లక్ష్మి వివరించింది. దాంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలాన్ని పి.గన్నవరం సీఐ ఆర్.భీమరాజు, ఎస్సై కె.చిరంజీవిలు పరిశీలించారు. లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
చంద్రబాబు పాలనలో కల్తీ ప్రదేశ్గా మారిన రాష్ట్రం
సీటీఆర్ఐ: రాష్ట్రాన్ని కల్తీ ప్రదేశ్గా చంద్రబాబు ప్రభుత్వం మార్చుతోందని వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రెవరెండ్ విజయ సారథి అన్నారు. ఆయన శనివారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎవరైనా బతకడం కోసం పాలు, నీరు తాగుతారన్నారు. కానీ రాష్ట్రంలో ఆ రెండూ ప్రాణాంతకం అవుతున్నాయన్నారు. అన్నీ కల్తీమయంగా మారుతున్నా రాష్ట్ర మంత్రులు క్రికెట్ ఆడుకుంటూ గడుపుతున్నారన్నారు. చంద్రబాబు పాలనలో డయేరియా, ఫుడ్ పాయిజన్ ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయన్నారు. రాష్ట్రంలో కుప్పకూలిన ప్రజారోగ్య వ్యవస్థకు ఆ ఘటనలు అద్దం పడుతున్నాయన్నారు. పరిపాలనపై చంద్రబాబు పూర్తిగా తన పట్టు కోల్పోగా, మిగిలిన వారంతా ప్రతిపక్షంపై బురద చల్లడం, నిత్యం అసత్య ప్రచారం చేయడంతో పాటు, రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసే పనిలో నిమగ్నమయ్యారన్నారు. నిందితుల ఇళ్లలో ఏసీబీ అధికారుల సోదాలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఏసీబీ అధికారులు శనివారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. జనవరి 29, 30 తేదీల్లో కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అఽధికారులు సోదాలు నిర్వహించి ఎస్ఆర్వో ఇప్పిలి లక్ష్మి, సీనియర్ అసిస్టెంట్ మనం వీర వెంకట కృష్ణ, ఆఫీస్ సబార్డినేట్ కొమ్మన వీరబాబులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుల ఇళ్లపై దాడులు చేసి పలు ఆధారాలు, ఆభరణాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్వో ఇప్పిలి లక్ష్మికి సంబంధించి కాకినాడలో ఫ్లాట్, జీ ప్లస్ వన్ భవనం డాక్యుమెంట్లు, 46 గ్రాముల బంగారం, రూ.10 లక్షలు విలువ చేసే గృహోపకరణాలు, వీరబాబు ఇంటిలో కొన్ని బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై దర్యాప్తు కొనసాగుతుందని, అవినీతిపై టోల్ ప్రీ నెంబర్ 1064 కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ అధికారులు తెలిపారు. కులాంతర వివాహమే హత్యకు కారణం కపిలేశ్వరపురం (మండపేట): మండపేట మండలం ద్వారపూడి గ్రామ శివారు వేములపల్లిలో ఈ నెల 26 అర్ధరాత్రి జరిగిన పోలిపల్లి వీర వెంకట సూర్య ప్రకాశరావు హత్యకు ఆయన కులాంతర వివాహం చేసుకోవడమే ప్రధాన కారణంగా ప్రాథమిక విచారణలో తేలిందని రాజమహేంద్రవరం ఈస్ట్ డివిజన్ డీఎస్పీ బి.విద్య తెలిపారు. హత్య తాలూకు వివరాలను వివరాలను శనివారం మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లో శనివారం ఆమె వెల్లడించారు. వేములపల్లికి చెందిన వస్త్ర వ్యాపారి సూర్యప్రకాశరావు, జెడ్.మేడపాడుకు చెందిన ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ అయినవిల్లి సంధ్య ఈ నెల 26న అన్నవరంలో ప్రేమ వివాహం చేసుకున్న విషయం విధితమే. కులాంతర వివాహం చేసుకోవడాన్ని సహించలేని సంధ్య సోదరులు అయినవిల్లి చంద్రపాల్, అయినవిల్లి గిరిబాబు ఒక పథకం ప్రకారమే వరుడు సూర్యప్రకాశరావును బండరాయితో కొట్టి హతమార్చారన్నారు. నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించినట్టు తెలిపారు. కేసు విచారణలో చొరవతో కృషి చేసిన సీఐ పి.దొరరాజు, ఎస్సై కిశోర్లను డీఎస్పీ విద్య అభినందించారు. ఆన్లైన్లో రవాణా శాఖ సేవలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలోని వాహన వినియోగదారులందరికీ రవాణాశాఖ సేవలన్నీ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని జిల్లా రవాణాధికారి ఆర్.సురేష్ తెలిపారు. ఆయన శనివారం మాట్లాడుతూ సారతిపరివాహన్ అనే వెబ్సైట్ ద్వారా డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించిన సేవలు, వాహనాల రిజిస్ట్రేషన్, టాక్స్, ఇతర సేవలు పొందవచ్చన్నారు. ప్రజలు నేరుగా ఆన్లైన్లో లేదా ప్రభుత్వం గుర్తింపు పొందిన మీ సేవ, ఈ సేవ, కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రవాణాశాఖ సేవలకు ఎటువంటి దళారులను సంప్రదించొద్దని సూచించారు. కాగా.. జిల్లాలోని కొందరు వాహన డీలర్లు కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల సందర్భంలో ప్రభుత్వం నిర్ణయించిన రుసుము కంటే ఎక్కువ వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. అటువంటి అక్రమ వసూళ్లపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటి పరిస్థితి ఏర్పడితే వాహనదారులు సంబంధిత రశీదులతో జిల్లా రవాణాధికారి మొబైల్ నెంబర్ 92816 07020ను సంప్రదించాలన్నారు. -
రోడ్డుపై పడిన రియాక్టర్
ఫ జనం లేని సమయంలో ఘటన ఫ కెమికల్స్ లేకపోవడంతో తప్పిన ముప్పు తుని: అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలోని డెక్కన్ కెమికల్ పరిశ్రమకు చెందిన రెండు రియాక్టర్లను ట్రాలీపై తరలిస్తుండగా ఒకటి రోడ్డుపై జారిపడిన సంఘటన శనివారం తుని రాజా రాజబాబు మున్సిపల్ పార్కు సెంటర్లో చోటు చేసుకుంది. మధ్యాహ్నం కావడంతో వాహన రాకపోకలు లేని సమయంలో జరగడం వల్ల ప్రమాదం తప్పిందని లేకపోతే విషాదం జరిగేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న తుని పట్టణ ఎస్సై పాపారావు సంఘటన స్థలానికి చేరుకుని రియాక్టర్ను రోడ్డుపై నుంచి జేసీబీ సహాయంతో తొలగించి ట్రాలీపైకి ఎక్కించారు. మందుల తయారీకి రియాక్టర్లను వినియోగిస్తుంటారు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే పేలిపోయే ప్రమాదం ఉంది. డెక్కన్ కెమికల్స్ పరిశ్రమలో వినియోగించిన ఖాళీ రియాక్టర్లను వేరే ప్రాంతానికి తరలిస్తున్న సమయంలో జరగడం వల్ల పెను ప్రమాదం తప్పింది. కెమికల్స్ ఉంటే రియాక్టర్ పేలిపోయే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. ఇలాంటివి తరలించేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని, ఇప్పుడు ఇందుకు భిన్నంగా ట్రాలీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ప్రమాదం జరిగిందని ఎస్సై పాపారావు తెలిపారు. -
జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక
రాజోలు: ఇంజినీరింగ్ ఇంటర్ యూనివర్సిటీ జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు రాజోలుకు చెందిన గెద్దాడ తేజోమయి హేమ శ్రీదేవి అర్హత సాధించినట్లు కోచ్ రాయుడు మణికుమార్ శనివారం తెలిపారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న తేజోమయి ఈ నెల 27న కాకినాడ జేఎన్టీయూలో జరిగిన తైక్వాండో పోటీల ఎంపికలో అర్హత సాధించిందన్నారు. మార్చి 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ ఒడిశాలోని ఫకీర్మోహన్ యూనివర్సిటీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు హాజరవుతుందన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో జేఎన్టీయూకే యూనివర్సిటీ తరఫున తైక్వాండో పోటీల్లో పాల్గొనే అవకాశం సాధించిన తేజోమయిని మణికుమార్ అభినందించారు. -
గళమెత్తుతూ.. కదం తొక్కుతూ..
● అంగన్వాడీల సమరభేరి ● ఉద్యోగ భద్రత కల్పించాలి ● కనీస వేతనాలు రూ.26 వేలకు పెంచాలి ● హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి ● యాప్ల భారం తగ్గించాలి ● డిమాండ్ల సాధనకు పోరుబాట ● మార్చి 2న మహాధర్నా దిశగా అడుగులు సాక్షి, రాజమహేంద్రవరం: అధికారం దక్కించుకునేందుకు అరచేతిలో వైకుంఠం చూపించి.. తీరా గద్దెనెక్కాక తమను నిలువునా వంచిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై అంగన్వాడీలు సమరభేరి మోగించారు. ఇప్పటికే వివిధ స్థాయిల్లో దశల వారీ ఆందోళనలు చేపట్టి, గళమెత్తి తమ సమస్యలు వినిపించినా ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో.. ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి కొనసాగింపుగా వచ్చే నెల 2న విజయవాడలో మహాధర్నా నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేంత వరకూ తగ్గేదే లేదని స్పష్టం చేస్తున్నారు. బాలలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య రక్షణకు క్షేత్ర స్థాయిలో అంగన్వాడీ సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, పసి పిల్లలు, గర్భిణులు, బాలింతల సంరక్షణ, పౌష్టికాహారం పంపిణీ వంటి కార్యక్రమాల నిర్వహణలో కీలక భూమిక పోషిస్తున్నారు. అంగన్వాడీ విధులకు తోడు ప్రభుత్వం వీరిపై ఇతర భారాలు సైతం మోపుతోంది. గ్రామ స్థాయిలో బూత్ లెవెల్ అధికారులుగా ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ పనులు సైతం వీరికి అప్పగిస్తోంది. ఇంతగా శ్రమిస్తున్న తమపై చంద్రబాబు ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు దిగుతోందని, కనీస గౌరవం ఇవ్వడం లేదని, ఇతర పనులు అంటగట్టి వేధిస్తోందని అంగన్వాడీ సిబ్బంది ఆరోపిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు అంగన్వాడీలకు అనేక హామీలిచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత షరా మామూలుగానే వాటిని తుంగలో తొక్కారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు సమరభేరి మోగిస్తున్నారు. కనీస వేతనాలేవీ.. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యాన జిల్లావ్యాప్తంగా 8 ఐసీడీఎస్ ప్రాజెక్టులు, 1,798 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 24,879 మంది చిన్నారులకు ప్రాథమిక విద్యతో పాటు పోషకాహారం అందిస్తున్నారు. మొత్తం 43,259 మంది పిల్లలు, 16,926 మంది గర్భిణులు, బాలింతలకు సమగ్ర పోషణ సేవలు అందజేస్తున్నారు. జిల్లాలో సుమారు 3 వేల మంది అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఉన్నారు. చాకిరీ ఎక్కువ.. జీతం తక్కువ అన్న చందంగా తమ పరిస్థితి తయారైందని వారు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో విధులు నిర్వహించే అంగన్వాడీ, ఆశా కార్యకర్తల వంటి వారికి కనీస వేతనం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదు. పనిభారం పెరిగిందిలా.. కనీస వేతనం ఇవ్వకపోగా.. రోజువారీ విధులకు తోడు వివిధ యాప్ల పేరిట తమపై పని భారం పెంచుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ యాప్ పోషణ ట్రాకర్లో డైలీ అటెండెన్స్ ఇవ్వాలి. వీహెచ్ఎన్డీ యాప్లో పిల్లల బరువులు, రిజిస్ట్రేషన్లు, హౌస్ విజిట్లు, హెల్త్ చెకప్లు, టేక్ హోమ్ రేషన్ వివరాలు నమోదు చేయాలి. దీని కోసం లబ్ధిదారుల ఫేస్ రిజిస్ట్రేషన్ (ముఖ ఆధారిత నమోదు) తీసుకోవాల్సి ఉంటుంది. ఇవే కాకుండా బాల సంజీవని యాప్, ఏడబ్ల్యూసీ డైలీ ట్రాకర్ వంటి యాప్లలో వివరాల నమోదు కష్టతరంగా మారుతోంది. నెట్వర్క్ సరిగ్గా లేకపోవడం, సర్వర్లు సక్రమంగా పని చేయక పోవడంతో ఫేస్ రిజిస్ట్రేషన్ చాలా ఇబ్బందికరంగా మారుతోంది.పనిభారం తగ్గించాలి అంగన్వాడీ సిబ్బందికి పనిభారం పెరిగిపోయింది. రోజంతా యాప్లతోనే కుస్తీ పట్టాల్సి వస్తోంది. ఒక్కోసారి నెట్వర్క్ పని చేయకపోవడం, సర్వర్ బిజీగా ఉండటంతో ఆ రోజు పని మర్నాడు చేయాల్సి వస్తోంది. అన్నింటినీ కలిపి ఒక్క యాప్గా చేస్తే పనిభారం తగ్గుతుంది. ఉద్యోగ భద్రత కల్పించాలి. – మాణిక్యాంబ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు హామీలు నెరవేర్చాలి సార్వత్రిక ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి. పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని కనీస వేతనాన్ని రూ.26 వేలకు పెంచాలి. పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాల విలీనాన్ని నిలుపు చేయాలి. మా డిమాండ్లను వెంటనే నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా ధర్నాకు దిగనున్నాం. – బేబీరాణి, కార్యదర్శి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఇవీ డిమాండ్లు అంగన్వాడీ వ్యవస్థ అవసరాలకు తగినట్లుగా ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ముఖ్యంగా వారి జీతాల విషయంలో న్యాయస్థానాలు ఎన్ని ఆదేశాలు జారీ చేసినా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం తమకిస్తున్న రూ.10 వేల వేతనం ఏ మూలకూ చాలడం లేదని అంగన్వాడీ సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. రోజువారీ కూలి పనులకు వెళ్లినా నెలకు రూ.15 వేలు లభిస్తాయని, అటువంటిది గొడ్డు చాకిరీ చేస్తున్నా రూ.10 వేలు మాత్రమే ఇస్తున్నారని వాపోతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతున్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి. గ్రాట్యుటీ అమలుకు మార్గదర్శకాలు రూపొందించాలి. ప్రభుత్వ ఉపాధ్యాయుల మాదిరిగానే వేసవి సెలవులివ్వాలి. అంగన్వాడీలు మరణిస్తే ప్రభుత్వం నుంచి వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి బెనిఫిట్స్ అందడం లేదు. వారికి రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. -
బీవీసీలో కెవ్వు కేక..
అమలాపురం రూరల్: మయూక 2026 జాతీయ స్థాయి యువజనోత్సవాల ప్రారంభంతో భట్లపాలెం బీవీసీ కళాశాలలో సందడి నెలకొంది. కుర్రకారు ఆటపాటలతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా కేరింతలు కొట్టి హోరెత్తించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చి విద్యార్థుల జోష్తో కెవ్వు కేకలా కనిపించింది. అలాగే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తొలిరోజు పోటీలను డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ బోనం సతీష్ మాట్లాడుతూ విద్యతో పాటు యువజనోత్సవాలతో విద్యార్థులకు నూతన ఉత్సాహం వస్తుందన్నారు. వివిధ క్రీడా, సాంస్కృతిక పోటీలను బీవీసీ అక్షర్ ఇంటర్నేషనల్ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ బోనం విజయలక్ష్మి పర్యవేక్షించారు. ఈ పోటీలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరొందిన రిఫరీలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి డాక్టర్ నైనా జైస్వాల్ ప్రత్యేక అతిథిగా హాజరై ప్రసంగించారు. క్రీడా పోటీలు విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తాయని అన్నారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు దృఢ సంకల్పంతో సాగితే విజయం వరిస్తుందని ఉద్బోధించారు. విద్య నేర్పిన గురువును ఎన్నడూ మర్చిపోవద్దు.. ధనం వచ్చాక స్నేహం మర్చిపోవద్దు.. భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోవద్దు.. గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోవద్దు.. అవసరం తీరాక సహాయపడిన నేస్తాన్ని మరిచిపోవద్దని విద్యార్థులను ఉద్దేశించి ఆమె చేసిన ప్రసంగం ఆలోచింపజేసింది. అనంతరం పలు రకాల బైక్ల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బీవీసీ విద్యా సంస్థల అధినేత బోనం కనకయ్య, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జేవీజీ రామారావు, మయూక కన్వీనర్లు డాక్టర్ కె.శ్రీనివాస్, బీఎస్ఎస్ ఫణిశంకర్, క్రీడా, సాంస్కృతిక విభాగాల కోఆర్డినేటర్లు, వివిధ విభాగాల అధిపతులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జక్కం కృష్ణారావు పాల్గొన్నారు. -
రేపు అపెక్స్–కేఎస్పీఎల్ మారథాన్
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ‘ఆమె భద్రత–మన బాధ్యత’ అనే నినాదంతో అపెక్స్–కాకినాడ సీపోర్ట్స్ (కేఎస్పీఎల్) మారథాన్–2026 నిర్వహిస్తున్నట్లు కాకినాడ రన్నర్స్ ట్రస్టు ఫౌండర్ ట్రస్టీ డాక్టర్ సుధా కేశవరాజు తెలిపారు. ఎన్టీఆర్ బీచ్ నుంచి ఉప్పాడ వరకూ 4 కేటగిరీల్లో ఈ మారథాన్ రన్ జరుగుతుందన్నారు. ఈ రన్కు సంబంధించిన మెడల్స్, టీ–షర్ట్స్ ఆవిష్కరణ, కార్యక్రమ నిర్వహణ సన్నాహక సమావేశం స్థానిక జీఆర్టీ గ్రాండ్ హెూటల్లో గురువారం జరిగింది. ఈ సందర్భంగా సుధా కేశవరాజు మాట్లాడుతూ, ఆదివారం ఉదయం 5.30 గంటలకు మారథాన్ రన్ ప్రారంభమవుతుందని తెలిపారు. తొలుత 21.1 కిలోమీటర్ల పరిధికి, 6 గంటలకు 10 కిలోమీటర్లకు ఆఫ్ మారథాన్, 6.30 గంటలకు 5 కిలోమీటర్లకు మారథాన్, అదే సమయానికి 3 కిలోమీటర్ల ఫన్ రన్ నిర్వహిస్తున్నామని వివరించారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి దాదాపు 1,500 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పారు. మారథాన్ రన్లో పాల్గొనే వారి కోసం, హైడ్రేషన్, వైద్య సహాయం, రెడ్క్రాస్ వలంటీర్ల సహకారంతో పాటు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని ఆమె వెల్లడించారు. మారథాన్ రేస్ డైరెక్టర్, కాకినాడ రన్నర్స్ ట్రస్టీ కమాండెంట్ ఎన్ఎల్ శ్రీనివాస్ మాట్లాడుతూ, మారథాన్ రన్ను 50 ఏళ్లలోపు ఓపెన్ కేటగిరీలోను, 50 ఏళ్లు పైబడిన వారికి వెటరన్ కేటగిరీలోను నిర్వహిస్తామన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి బహుమతులు కూడా అందజేస్తామని చెప్పారు. ఈ మారధాన్ ఎనిమిదోసారి ఇక్కడ జరుగుతోందని తెలిపారు. కార్యక్రమంలో కేఎస్పీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మెర్ల మురళీధర్, అపెక్స్ సంస్థ ప్రతినిధి మాధవి, సంకురాత్రి ఫౌండేషన్ రమణమూర్తి, జీఆర్టీ గ్రాండ్ జీఎం రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
విజ్ఞానంతో ముడిపడి
గతమెంతో ఘనం గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం విద్యలో సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకూ అమలు చేశారు. మూడో తరగతి నుంచే టోఫెల్ క్లాసులు నిర్వహించడంతో పాటు 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు అందజేశారు. కోనసీమ జిల్లాలో 2022–23లో 4,561 మంది విద్యార్థులు, 2,478 మంది ఉపాధ్యాయులకు, 2023–24లో 13,340 మంది విద్యార్థులకు ట్యాబ్లను ఇచ్చారు. 2022–23లో 191 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 264 స్మార్ట్ టీవీలు, 142 ఉన్నత పాఠశాలలకు 951 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఇచ్చారు. 2023–24లో 517 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 558 స్మార్ట్ టీవీలు, 197 ఉన్నత పాఠశాలలకు 873 ఇంటరాక్టివ్ ఫ్లాట్ప్యానల్స్ అందజేశారు. ఫ ఉమ్మడి జిల్లాలో విస్తారంగా సైన్స్ ప్రచార సేవా సంస్థలు ఫ చంద్రయాన్–3 విజయంలో వల్లూరివాసి సహకారం ఫ నేడు జాతీయ సైన్స్ దినోత్సవం కపిలేశ్వరపురం: శాస్త్ర విజ్ఞానం.. అదో అద్భుతం. మానవాళికి మార్గదర్శకం.. ఆధునిక కాలమంతా సాంకేతికమయం.. ప్రయోగాలు, పరిశోధనలే కాదు సామాన్యుడి రోజువారీ జీవితం సైన్స్తో ముడిపడింది. మానవాళి అభ్యున్నతికి అది ఎంతగానో దోహదపడుతోంది. గతకాలపు అజ్ఞానాన్ని వీడి ఆధునిక మానవ అవసరాలు ప్రాతిపదికగా సైన్స్ దినదినాభివృద్ధి చెందుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విస్తారంగా సాంకేతిక విద్యా సంస్థలు, సైన్స్ ప్రచార సేవా సంస్థలు నడుస్తున్నాయి. ఫిబ్రవరి 28 జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. శాస్త్ర సాంకేతిక ఉద్యమంలో తూర్పుగోదావరి జిల్లాకు మంచి పేరు ఉంది. ఇక్కడి నుంచి ఎందరో శాస్త్రవేత్తలు పేరు ప్రఖ్యాతలు సాధించారు. కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఇండియన్ ఎలక్ట్రో ఆప్టికల్ ఇంజినీర్ వేగుళ్ల కోటేశ్వరరావు సైన్స్ అభ్యున్నతికి విశేష కృషి చేశారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత సైతం ఇస్రో సంస్థ ఆయన సూచనలు, సలహాలను స్వీకరించింది. వల్లూరులో పాఠశాల విద్య, మండపేటలో ఇంటర్మీడియట్, కాకినాడ జేఎన్టీయూకేలో ఇంజినీరింగ్, బెంగళూరులో పీహెచ్డీ చేశారు. ఇస్రోలో చేరి శాసీ్త్రయ ప్రయోగాల్లో తనదైన శైలిలో సేవలందించారు. బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో 1978–83 మధ్యకాలంలో ఇంజినీర్గా పనిచేశారు. 2023 జూలై 14న భారత చంద్రయాన్– 3 అంతరిక్ష ప్రయోగంలో శాస్త్రవేత్తల బృందానికి కోటేశ్వరరావు సూచనలు, సలహాలు ఇస్తూ విజయవంతానికి కృషి చేశారు. సైన్స్ ప్రచార సేవా సంస్థలు ఇలా.. మానవుల్లో విజ్ఞాన వికాసాన్ని పెంచేందుకు పలువురు మేథావులు 1988 ఫిబ్రవరి 28న స్థాపించిన జనవిజ్ఞాన వేదిక ఉమ్మడి జిల్లాలో సైన్స్ ప్రచారానికి కృషి చేస్తోంది. విద్యార్థి చెకుముఖి పేరుతో 1990 డిసెంబర్ నుంచి సైన్స్ మాస పత్రికను, 2010 నుంచి చెకుముఖి సైన్స్ సంబరాలను నిర్వహిస్తోంది. కాకినాడ జేఎన్టీయూ వేదికగా 2025 డిసెంబర్ 21 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్ర స్థాయి సంబరాలు నిర్వహించి శాస్త్రవేత్తలతో విద్యార్థులను మమేకం చేసింది. రాష్ట్రం నలుమూలల నుంచి 54 బృందాలుగా 162 మంది విద్యార్థులు, 150 మంది తల్లిదండ్రులు సంబరాలకు హాజరయ్యారు. ఫ రామచంద్రపురానికి చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు కె.కృష్ణసాయి ప్రజల్లో మూఢ విశ్వాసాలను తొలగించడం, పాఠశాల స్థాయి విద్యార్థుల్లో సైన్స్ బీజాలు నాటడం లక్ష్యంగా రేవతి సైన్స్ ఫౌండేషన్ను నిర్వహిస్తున్నారు. ఫ కపిలేశ్వరపురం మండలం అంగరకు చెందిన వాకా దివ్యశేఖర్ భూమి కదలికలపై పరిశోధన చేసి శాసీ్త్రయ విజ్ఞానాన్ని సమాజానికి పంచారు. ముంబయి ఐఐటీలో శాటిలైట్ రాడార్ చిత్రాలను ఉపయోగించి పరిశోధనను చేశారు. భూకంపాల్లో వచ్చే భూకదలికలు, భూగర్భ జలాల అతి వినియోగం వల్ల భూమి కుంగిపోవడమనే అంశాలపై పలు పరిశోధనా పత్రాలను పబ్లిష్ చేశారు. విస్తరిస్తున్న‘కూటమి’ చంద్రబాబు ప్రభుత్వం శాసీ్త్రయ విద్యను విస్మరిస్తోంది. ఈ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.34,875 కోట్లు మాత్రమే కేటాయించింది. రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం విద్యకు కేటాయించాలన్న ప్రజా సంఘాల డిమాండ్ను ప్రభుత్వం విస్మరించింది. ఫలితంగా ఇబ్బంది ఎదురవుతోంది విజ్ఞానంతో మూఢ నమ్మకాలు దూరం సమాజం అభివృద్ధి పథాన నడవాలంటే సైన్స్ ప్రచారమే ఏకై క మార్గం. సైన్స్ సంగతులను వివరించడం ద్వారా పెరిగే విజ్ఞానం వల్ల ప్రజల్లో ఉన్న మూఢ నమ్మకాలు తొలగిపోతాయి. ఆ దిశగా జిల్లాలో ప్రచారం చేస్తున్నాం. సైన్స్ అభివృద్ధికి పాటుపడుతున్నాం. –శ్రీకృష్ణసాయి, రేవతి ఫౌండేషన్ అధ్యక్షుడు, రామచంద్రపురం జాతీయ సైన్స్ దినోత్సవం నేపథ్యం నోబెల్ పురస్కార గ్రహీత, భౌతిక శాస్త్రవేత్త చంద్రశేఖర వెంకట్రామన్ (సీవీ రామన్) కాంతిపై ‘రామన్ ఎఫెక్ట్’ కనుగొన్న రోజు 1928 ఫిబ్రవరి 28. ఆ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకొంటున్నాం. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని కలిగించాలన్నది జాతీయ సైన్స్ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. -
పుష్కరాలకు రైల్వే శాఖ సిద్ధం కావాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాలకు రైల్వే శాఖ ఇప్పటి నుంచే అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. పుష్కరాలకు రైల్వే శాఖ ఏర్పాటు చేస్తున్న మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలు తదితర అంశాలపై తన క్యాంపు కార్యాలయంలో ఆమె శుక్రవారం విస్తృతంగా సమీక్షించారు. సాధారణ యాత్రికులకు సౌకర్యాలు, పుష్కర్ నగర ఏర్పాట్లు, టికెట్ల జారీ విధానం, యాత్రికుల రాకపోకల నిర్వహణ, విభాగాల వారీ సమన్వయం వంటి కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. 2003, 2015 పుష్కరాల సందర్భంగా వచ్చిన భక్తుల సంఖ్య, వివిధ మార్గాల ద్వారా రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్ పరిధిలో నడిపిన రైళ్ల వివరాలను పరిశీలించారు. వచ్చే పుష్కరాలకు రైళ్లలో ప్రతి రోజూ సగటున 5.50 లక్షల మంది యాత్రికులు వస్తారనే అంచనాతో అదనపు రైళ్ల ప్రతిపాదనలు, అవసరమైన ఏర్పాట్లపై ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సీసీ కెమెరాల ఏర్పాటు, నిఘా వ్యవస్థ బలోపేతం, సాధారణ టికెట్ల జారీకి అదనపు బుకింగ్ కౌంటర్ల ఏర్పాటు, అదనపు సిబ్బంది నియామకం, తాగునీరు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనపై విభాగాల వారీగా అధికారులు వివరాలు సమర్పించారు. విజయవాడ జోన్ రైల్వే సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ షణ్ముఖ వడివేల్ ఎస్ గత పుష్కరాల గణాంకాలను వివరించారు. 2003లో 13 రోజుల వ్యవధిలో మొత్తం 20.29 లక్షల మంది, 2015లో 15 రోజుల్లో 39.31 లక్షల మంది రైళ్ల ద్వారా రాకపోకలు సాగించారన్నారు. వచ్చే పుష్కరాలకు 12 రోజుల వ్యవధిలో సుమారు 64 లక్షల మంది రాకపోకలు సాగించవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. ముఖ్యంగా రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు రైల్వే స్టేషన్ల వద్ద రద్దీ అధికంగా ఉండే అవకాశముంటుందని చెప్పారు. అదనపు ప్రత్యేక రైళ్లు నడపడం, ప్లాట్ఫామ్ల విస్తరణ, ప్రయాణికుల మార్గదర్శక సూచికల ఏర్పాటు, రైల్వే స్టేషన్లలో భద్రతా ఏర్పాట్లు, అత్యవసర సేవల సమన్వయం వంటి అంశాలపై కార్యాచరణ ప్రణాళికను వివరించారు. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ మాట్లాడుతూ, భద్రతా వ్యవస్థీకరణపై చర్చించారు. రైల్వే స్టేషన్లు, పుష్కర్ ఘాట్లు, ముఖ్య కూడళ్ల వద్ద అదనపు పోలీసు బలగాల మోహరింపు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, ప్రత్యేక నియంత్రణ గదుల ఏర్పాటు, టికెట్ కౌంటర్ల వద్ద రద్దీ నియంత్రణకు చర్యలు చేపడతామని తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. -
నమో భగవతే నారసింహాయ
● కన్నుల పండువగా కోరుకొండ లక్ష్మీనరసింహుని కల్యాణోత్సవం ● వైభవంగా రథోత్సవం ● వేలాదిగా తరలి వచ్చిన భక్తజనం మధురపూడి: నమో భగవతే నారసింహాయ.. అంటూ కోరుకొండ లక్ష్మీనరసింహస్వామిని భక్తజనం కొలిచింది. స్వామివారి వార్షిక కల్యాణోత్సవాల సందర్భంగా శుక్రవారం కోరుకొండలో ఆధ్యాత్మిక కెరటం ఎగసిపడింది. గోవింద నామస్మరణ గ్రామమంతటా ప్రతిధ్వనించింది. బుగ్గన చుక్క.. పట్టు వస్త్రాలతో సర్వాలంకాలర భూషితులైన స్వామివారి పరిణయ మహోత్సవాన్ని కన్నులారా తిలకించిన భక్తులు ఆనందంతో పులకించిపోయారు. కోలాహలంగా రథోత్సవం స్వామివారి కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే కోరుకొండకు తరలివచ్చారు. పలువురు భక్తులు ఉదయమే స్వామివారి కోనేటిలో పుణ్యస్నానమాచరించారు. అక్కడి నుంచి కొండపై స్వయంభువుగా కొలువుదీరిన స్వామి వారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి, పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 1.54 గంటలకు అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల ఘోష నడుమ స్వామి, అమ్మవార్లను రథంపై వేంచేయించారు. అనంతరం రథోత్సవం ప్రారంభమైంది. కొండ వద్ద ప్రారంభమైన రథోత్సవం దేవస్థానం రోడ్డు, రెడ్డి పంతులు సత్రం, పాత సంత మార్కెట్, వడ్డీలపేట, మత్స్యకారులవాడ, సాయిబాబా గుడి, అంకాలమ్మవారి గుడి, శివాలయం మీదుగా సాగింది. గరగ నృత్యాలు, బ్యాండ్మేళాలు, కోలాటం, తీన్మార్, శక్తి వేషధారణలు, కేరళ చండా వాయిద్యాలతో రథోత్సవం ఆద్యంతం కోలాహలంగా జరిగింది. దారి పొడవునా భక్తులు రథం పైకి అరటి పండ్లు వేస్తూ భక్తితో స్వామికి మొక్కారు. సాయంత్రం 5.40 గంటలకు రథోత్సవం తిరిగి ఆలయానికి చేరింది. అనంతరం, మేళతాళాలతో స్వామి, అమ్మవార్లను ఆలయంలోకి తీసుకుని వెళ్లారు. రథోత్సవంలో వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. దీంతో, రాజమహేంద్రవరం – గోకవరం మార్గంలో వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. రథంపై కొలువుదీరిన స్వామివారిన వైఎస్సార్ సిపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దర్శించుకున్నారు. అంతకు ముందు కొండపై కొలువుదీరిన స్వామి వారిని కూడా ఆయన దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి, అదనపు ఎస్పీ చెంచురెడ్డి, నార్త్ జోన్ డీఎస్పీ రామకృష్ణ, సీఐ మూర్తి, ఎస్సై ఎస్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 250 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అంగరంగ వైభవంగా... శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక కల్యాణోత్సవం రాత్రి 9 గంటలకు కన్నుల పండువగా నిర్వహించారు. తొలుత వధూవరులకు శాస్త్రోక్తంగా మంగళస్నానాలు నిర్వహించారు. అనంతరం, దేవస్థానం కల్యాణ మండపంలో వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం వేద పండితులు పాణింగపల్లి పవన్కుమార్ ఆచార్యులు కల్యాణ క్రతువు నిర్వహించారు, దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త ఎస్పీ రంగరాజ భట్టర్, అర్చకుల పర్యవేక్షణలో కల్యాణోత్సవం కమనీయంగా జరిగింది. రెడ్డి పంతులు సత్రంలో అన్నసమారాధన స్వామివారి కల్యాణోత్సవాల సందర్భంగా స్థానిక విరియాల రెడ్డిపంతులు సత్రంలో ఐదు రోజుల పాటు నిర్వహించే అన్న సమారాధన శుక్రవారం ప్రారంభమైంది. అన్నవరం దేవస్థానం ఈఓ వి.త్రినాథరావు, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఈదర సుబ్బారావు, సత్రం ఈఓ లక్ష్మీకుమార్, కోరుకొండ సర్పంచ్ లక్ష్మీ సరోజ తదితరులు అన్నసమారాధనను పర్యవేక్షించారు.రథోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రథోత్సవంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు -
జీఎన్ఎం పరీక్షల్లో అవకతవకలపై విచారణ పూర్తి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక జీజీహెచ్లో నిర్వహించిన జీఎన్ఎం నర్సింగ్ పరీక్షల్లో జరిగిన అవినీతిపై నిజాలు నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన త్రిసభ్య కమిటీ శుక్రవారం విచారణ చేపట్టింది. కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, ఆర్ఎంసీ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ మునిరత్నమ్మ, అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్ల ఆధ్వర్యాన రాజమహేంద్రవరం జీజీహెచ్లోని నర్సింగ్ సూపరింటెండెంట్ చాంబర్లో 44 మందిని విచారించారు. వీరందరికీ 25 ప్రశ్నలు ఇచ్చారు. లంచాలు వసూలు చేసి కాపీయింగ్ నిర్వహించడంలో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకినాడ జీజీహెచ్ నర్సింగ్ స్కూల్ ట్యూటర్ సుజాత, ఒంగోలు నర్సింగ్ స్కూల్ ట్యూటర్ మాధవీలతలకు 50 ప్రశ్నలతో పత్రాలు ఇవ్వడంతో పాటు పత్రికల్లో వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పరీక్షలు అయిన తర్వాత కూడా సుజాత పలు నర్సింగ్ స్కూళ్లకు ఫోన్లు చేసి డబ్బులు తీసుకున్నారనే విషయాన్ని గుర్తించారు. విచారణకు ముందు నిజాలు నిగ్గు తేల్చేందుకు కమిటీ బృందం ప్రైవేటు నర్సింగ్ స్కూళ్ల నుంచి వివరణలు సేకరించింది. ఆయా ప్రిన్సిపాళ్లతో మాట్లాడి, డబ్బు చెల్లించిన ఆధారాలు సేకరించారు. అలాగే, ఆయా పాఠశాలల యాజమాన్యాల నుంచి సుజాత బృందం పరీక్షల కాలమంతా ఆహారం, వసతి ఏర్పాటు వరకూ ప్రయోజనాలు పొందారని కమిటీ గుర్తించింది. థియరీ పరీక్షలతో పాటు అంతకు ముందు నిర్వహించిన ప్రాక్టికల్ పరీక్షల్లో అవినీతికి పాల్పడ్డారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఓఎస్డీలు సుజాత, మాధవీలతలతో పాటు పలువురు అధికారులను కూడా లోతుగా విచారించారు. ప్రతి ఒక్కరి నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకున్నారు. ఉదయం 11 గంటలకు మొదలైన విచారణ రాత్రి 7 గంటల వరకూ సాగింది. ఇద్దరు స్టాఫ్ నర్సులు సహా మరో ఇద్దరు నాలుగో తరగతి ఉద్యోగులు వివిధ కారణాలతో ఈ విచారణకు హాజరు కాలేదు. పరీక్షల నిర్వహణకు ఏమాత్రం సంబంధం లేని పలువురు ఉద్యోగుల్ని విచారించడం వివాదానికి దారి తీసింది. విచారణ నివేదికను రాష్ట్ర వైద్య విద్య సంచాలకులకు సమర్పిస్తామని కమిటీ చైర్పర్సన్ డాక్టర్ లావణ్య కుమారి తెలిపారు. అంతకు ముందు విచారణలో భాగంగా పరీక్షలు నిర్వహించిన హాళ్లతో పాటు నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాళ్లతో రహస్య సమావేశం నిర్వహించిన ప్రాంగణాన్ని కూడా పరిశీలించారు. -
బ్రెయిలీ నాణేల సేకరణలో అవార్డు
అమలాపురం టౌన్: అమలాపురానికి చెందిన అంధురాలు, వాకర్స్ జోన్ చైర్పర్సన్ పుత్సా రాజేశ్వరి నాణేల సేకరణలో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ –2026 సొంతం చేసుకున్నారు. లూయిస్ బ్రెయిలీ నాణేల సేకరణలో ఈ అవార్డుకు అర్హత సాధించారు. ప్రపంచ వ్యాప్తంగా బెల్జియం, బ్రెజిల్, ఈక్వెడార్, ఐల్ ఆఫ్ మ్యాన్, ఇటలీ, పోలెండ్, థాయ్లాండ్, అమెరికా దేశాలతో పాటు మన దేశానికి సంబంధించి 2009లో బ్రెయిలీ ముఖ చిత్రంలో విడుదలైన రూ.2, రూ.100తో పాటు మొత్తం పది దేశాలకు చెందిన 14 నాణేలను సేకరించడం ద్వారా ఆమె ఈ రికార్డు పొందారు. రాజేశ్వరి అవార్డు సాధించడం పట్ల వాకర్స్ జిల్లా గవర్నర్ తోలేటి సూర్యనారాయణ, సంస్కార భారతి జిల్లా అధ్యక్షురాలు శ్రీగిరి పద్మావతి, నాణేల సేకరణకర్తలు నడంపల్లి రామరాజు, ఇవటూరి రవి సుబ్రహ్మణ్యం, పి.వెంకటనారాయణ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. తనకు వచ్చిన లిమ్కా బుక్ ఆఫ్ అవార్డును చూపుస్తున్న రాజేశ్వరి -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
నిడదవోలు: రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామానికి చెందిన పెదపాటి సాయికిరణ్ (20) తాడేపల్లిగూడెంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. రోజూ కళాశాల బస్సులో వెళ్లే సాయికిరణ్ శుక్రవారం నిర్వహించిన కళాశాల ఫెస్ట్కు ఇంటి నుంచి స్నేహితులతో కలసి బైక్పై వెళ్లాడు. అది పూర్తయిన తర్వాత ఇంటికి తిరిగి బైక్పై బయలుదేరాడు. ఈ క్రమంలో నిడదవోలు బసివిరెడ్డిపేటలో ఆర్ఓబీ నిర్మాణంలో భాగంగా భారీ వాహనాలు రాకుండా అధికారులు రోడ్డుకు అడ్డంగా మట్టి దిబ్బలను ఏర్పాటు చేసి, వాహనాల రాకపోకలను నిలువరిస్తున్నారు. అయితే ద్విచక్ర వాహనాలు మాత్రం రాకపోకలు సాగిస్తున్నాయి. భారీ వాహనాలు రాకుండా బట్టి దిబ్బలు వేయడం, రాత్రి సమయంలో చీకటిగా ఉండటంతో విద్యార్థి సాయికిరణ్ మట్టి దిబ్బలను దాటించే క్రమంలో అదుపుతప్పి బైక్పై నుంచి కిందపడి అక్కడికక్కడే మరణించాడు. మార్కొండపాడు గ్రామానికి చెందిన పెదపాటి శ్రీనివాస్, ఇంద్ర దంపతులకు ఇద్దరు కుమారులలో పెద్ద కుమారుడు సాయికిరణ్. కాగా రెండో కుమారుడు బాలు ఇంటర్ వరకు చదివి తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. పెదపాటి శ్రీనివాస్ చేపల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ పెద్ద కుమారుడు సాయికిరణ్ను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. విషయం తెలుసుకున్న సాయికిరణ్ సోదరుడు బాలు, స్నేహితులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. అన్నా లేరా.. అమ్మ తిడుతుందిరా.. వెళ్లిపోదాం అంటూ విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పట్టణ ఎస్సై జగన్మోహన్రావు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. -
అన్నదాన పథకానికి విరాళాలు
ఆత్రేయపురం: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి గాంచిన వాడపల్లి శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో అన్నదాన పథకానికి పలువురు వివరాలు సమర్పించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్కు చెందిన నడింపల్లి కృష్ణ సూర్యవర్మ, కుటుంబ సభ్యులు రూ.లక్ష, ఈతకోటకు చెందిన కలిదిండి సాయిమణికంఠ, వెంకట కాశి హర్షిత్వర్మ రూ.50 వేలు, విశాఖపట్నం పెందుర్తి వాస్తవ్యులు మహాదేవ్ కార్తికేయ కుటుంబ సభ్యులు రూ.30 వేలు విరాళాలు అందించారు. దాతలకు స్వామివారి పటాలను అధికారులు, పాలకవర్గ సభ్యులు అందించారు. కల్తీ పాలను గుర్తించడంపై అవగాహనఅమలాపురం టౌన్: పాలు కల్తీ అయ్యాయో లేదో ఇంట్లోనే తెలుసుకోవడానికి సులభమైన కొన్ని పరీక్షలను అమలాపురం పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకుడు (ఏడీఏ) డాక్టర్ ఎల్.విజయరెడ్డి వివరించారు. స్థానిక పద్మినీ పేట ప్రాంతంలోని వీరన్న డైరీ వద్ద పాడి రైతులకు శుక్రవారం అవగాహన కల్పించారు. నీటి శాతం, స్టార్చ్, యూరియా, డిటర్జెంట్ వంటి కల్తీలను సులభంగా పరీక్షించవచ్చని సూచించారు. తాజా పాలు తెల్లగా, చిక్కగా ఉండి ఎక్కువ సేపు నిల్వ ఉంటే ఆ పాలు మంచివని నిర్ధారించవచ్చన్నారు. ఇంట్లోనే పాలు నాణ్యతను పరీక్షించే విధానాలను ఆయన ఆయా పరికరాలతో ప్రయోగాల ద్వారా ప్రత్యక్షంగా చూపించారు. వాటర్, షేక్ టెస్ట్లు తదితర విధానాలను వివరించారు. తాజా పాలు మంచి సువాసన కలిగి ఉంటాయని, రసాయనాల వాసన రావని తెలిపారు. పాలు మరిగించినప్పుడు ఆ పాలు కల్తీ స్వభావం బయట పడుతుందన్నారు. సింథటిక్ పాలను మరిగించినప్పుడు నురగ వచ్చి మీగడ ఏర్పదని విజయరెడ్డి వివరించారు. -
ఎడాపెడా.. దేవడా!
● ఎమ్మెల్యే దేవ వరప్రసాద్పై సొంత పార్టీ జనసేన నేతల తిరుగుబాటు ● సామాజిక మాధ్యమాల వేదికగా విమర్శల వెల్లువ ● కొత్తగా సామాజిక వర్గాల వారీగా చీలిక ● అదే బాటలో టీడీపీ క్యాడర్ ● ఎమ్మెల్యేపై పార్టీ పెద్దలకు ఫిర్యాదు సాక్షి, అమలాపురం: రాజోలు కూటమిలో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. జనసేన శాసనసభ్యుడు దేవ వరప్రసాద్పై అటు సొంత పార్టీకి చెందిన జనసేన, మిత్రపక్షమైన టీడీపీ వర్గాలు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం.. సామాజిక మాధ్యమాల వేదికగా బురద జల్లుతుండడంతో దేవ వరప్రసాద్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాజోలులో గడిచిన రెండు ఎన్నికల్లో జనసేన విజయం సాధించింది. ఇదే ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇక్కడ ఒక మోస్తరు నాయకుడు కూడా చిన్నచిన్న విషయాలను పార్టీ పెద్దల వద్ద పంచాయితీలు పెట్టడంతో స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఉక్కబోతకు గురవుతున్నారు. తామే వరప్రసాద్ను నియోకజకవర్గానికి పరిచయం చేశామని, తాము లేకుంటే ఆయనకు ఇక్కడ స్థానమే లేదంటూ వీడియోలు పోస్టు చేస్తున్నారు. జనసేన పార్టీలో ఉన్న గ్రూపుల నాయకులతో స్వయంగా పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడినా ఫలితం లేదు. ఆయన రాజోలు పర్యటన తరువాత ఇక్కడ విభేదాలు తార స్థాయికి చేరడం గమనార్హం. కలిసి పనిచేయాలని పవన్ చెప్పిన తరువాత అసంతృప్తి జ్వాలలు మరింతగా ఎగసిపడుతున్నాయి. ఎమ్మెల్యే వరప్రసాద్పై జనసేనలో రెండు,మూడు వర్గాలు బహిరంగంగా తిరుగుబాటు చేస్తున్నాయి. పార్టీలోను, నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడిస్తూ పార్టీని బజారును పడేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే మౌన ముద్ర దాల్చుతుండడం పార్టీలో మిగిలినవారికి మింగుడు పడడం లేదు. అధిష్టాన పెద్దలు కూడా ఆయా వర్గాలను ప్రోత్సహించడం, తాను ఎన్నిసార్లు అధిష్టానం వద్ద ఫిర్యాదు చేసినా పెద్దలు సర్దుబాటు చేయకపోవడంతో ఎమ్మెల్యే చేసేది ఏమీ లేక మిన్నకుండా పోయారని వినికిడి. ఇదిలా ఉండగా ఇటీవల పార్టీకి చెందిన ఎన్ఆర్ఐ నాయకుడు యెనముల వెంకట పతిరాజు సామాజిక మాధ్యమం వేదికగా ఎమ్మెల్యేపై పరుష పదజాలంతో వీడియో పెట్టడం వివాదం సామాజిక వర్గాల మధ్య పోరుకు దారితీసింది. దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యేను కించపరచడంపై వారు మండిపడుతున్నారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు పట్టుపడుతుండడంతో రాజోలు రాజకీయం కొత్త మలుపు తిరిగింది. జనసేనతోపాటు టీడీపీకి చెందిన దళిత వర్గానికి చెందిన నాయకులు సామాజిక మాధ్యమాలలో మండిపడుతున్నారు. టీడీపీకి చెందిన గెడ్డం సింహ, చాగంటి స్వామి వంటి నేతలు మాట్లాడుతూ దళిత ఎమ్మెల్యే కాబట్టే ఇలా వ్యక్తగత దూషణకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. జనసేనకు చెందిన దళిత నాయకులు జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విరుచుకు పడ్డారు. జనసేన అసంతృప్తి నాయకునిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మలికిపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీడీపీలో సైతం అసంతృప్తి సెగలు రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్పై కూటమి పార్టీకి చెందిన నియోజకవర్గ టీడీపీ నాయకులు సైతం బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో తమను కలుపుకుని వెళ్లడం లేదని, ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వద్ద తమ అక్రోశాన్ని వెళ్లగక్కారు. దీనితో పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా గొల్లపల్లి అమూల్యను నియమించారు. ఈ నియామకం ఆ పార్టీలో కొత్త విభేదాలకు, గ్రూపులకు దారి తీసింది. ఇదే సమయంలో అమూల్య, ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ల మధ్య కూడా కొత్త వివాదాలు ఏర్పడ్డాయి. నియోజకవర్గ కార్యక్రమాలలో తమను పట్టించుకోవడం లేదని ఆమూల్య ఆరోపిస్తున్నారు. దీనిపై ఇటీవల అమలాపురంలో రాజోలు టీడీపీ కీలక నాయకులు సమావేశమై పార్టీ పెద్దలకు ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇటు జనసేన, అటు టీడీపీ వర్గాలుగా వీడిపోయి రాజోలు కేంద్రంగా ఎమ్మెల్యే దేవ వరప్రసాద్పై విమర్శలకు దిగుతున్నారు. -
వైద్యుల మల్లగుల్లాలు
● విషమంగా కల్తీపాల బాఽధితుల పరిస్థితి ● విరుగుడు ఇంజెక్షన్లు ఎంత డోసు ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్న వైనం ● ఆ ఎనిమిది మంది గురించి రెండు రోజులు ఆగితేనే కానీ ఏమీ చెప్పలేమంటున్న డాక్టర్లు ● పాల వ్యాపారి గణేష్ను విచారించేందుకు పోలీసుల సిద్ధం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురై రాజమహేంద్రవరం ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న 15 మందిలో 8 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సూర్యకుమారి అనే బాధితురాలికి బుధవారం అర్ధరాత్రి గుండె సమస్య రావడంతో వైద్యులు ఆందోళన చెందారు. సకాలంలో స్పందించి ఆమెకు సీపీఆర్ చేసి అత్యవసర మందులు అందించడంతో తిరిగి కోలుకుంది. విషమంగా ఉన్న ఎనిమిది మంది పరిస్థితి మరో రెండు రోజులు దాటితే కానీ చెప్పలేమని వైద్యులు అంటున్నారు. రెయిన్బో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న ముగ్గురు చిన్నారుల్లోనూ ఒకరి పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. కిడ్నీలు విఫలమైన ఇద్దరికి డెల్టా ఆసుపత్రిలో డయాలసిస్ జరుగుతోంది. బొల్లినేని ఆసుపత్రిలో ఎనిమిది మందిలో ఐదుగురు వెంటిలేటర్, డయాలసిస్ మీద ఉండగా, మరో ముగ్గురికి డయాలసిస్ జరుగుతోంది. ఫోమోఫైజోల్ ఇంజెక్షన్లపై తర్జన భర్జన బాధితులకు మెరుగైన వైద్యం అందించే దిశగా ముంబై నుంచి రప్పించిన ఫోమోఫైజోల్ ఇంజెక్షన్లు ఏ విధంగా, ఎంత డోసు ఇవ్వాలనే దానిపై వైద్య బృందం మల్లగుల్లాలు పడుతోంది. ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రవిరాజు కిమ్స్ ఆసుపత్రికి వచ్చి అక్కడ వైద్య బృందంతో ఇంజెక్షన్ల డోసులపై చర్చించారు. వీటిని బాఽధితులకు శుక్రవారం నుంచి అందించనున్నట్టు సమాచారం. ఈ ఇంజెక్షన్లు వ్యాధి ప్రాథమిక దశలో ఉన్న వారికి మెరుగ్గా, కిడ్నీ ఫెయిల్ అయి డయాలసిస్ జరుగుతున్న వారికి అంతంత మాత్రంగా ఫలితాలు ఇస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అదీ ప్రిడ్జి లీకేజీ వల్ల పాలలో ఇథనాల్ గ్లైకాన్ కలిస్తేనే ఈ ఇంజెక్షన్లు పనిచేస్తాయి. వేరే ఏ రసాయనాలు కలిసినా ఈ ఇంజెక్షన్లు పనిచేయవు. పాలలో ఏ విధంగా కల్తీ జరిగిందో తెలియడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులు రావడానికి మరో మూడు రోజులు సమయం పట్టవచ్చు. దీంతో బాధితులకు రికవరీ డోసు ఇవ్వడంలో ఆలస్యం అవుతోంది. ఇంజెక్షన్ల వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏమీ రావని నిర్ధారణ అయ్యాక, రిపోర్టుతో పనిలేకుండా వాటిని బాఽఽధితులకు అందించేందుకు డాక్టర్లు సిద్ధమయ్యారు. విషమంగా ఉన్న 8 మందికి అత్యవసర వైద్యం అందిస్తున్నా, ఇంజెక్షన్లు ఇస్తే కానీ వారు ఎంతమేరకు కోలుకుంటారనేది అంచనా వేయలేమని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఘటన జరిగి 11 రోజులు కావడం, బాధితుల పరిస్థితి రోజురోజుకీ క్షీణిస్తుండడంతో వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆ కుటుంబాలను ఆదుకోవాలని, మరింత మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జైలులో ఉన్న గణేష్ను విచారించనున్న పోలీసులు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న పాల వ్యాపారి గణేష్ను మరోసారి సమగ్రంగా విచారించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. న్యాయస్ధానం నుంచి అనుమతి వచ్చిన వెంటనే అతనిని అదుపులోకి తీసుకుని ఘటన వివరాలపై నివేదిక తయారు చేయనున్నారు. ఇథనాల్ గ్లైకాన్ లీకయి పాలు కలుషితం అవడంతో పాటు, పాలల్లో కలిపిన రసాయనాల కారణంగా మరింత విషతుల్యమయ్యాయా, లేక ఇథనాల్ లీకేజీ వల్లే జరిగిందా అన్నది గణేష్ నిర్ధారించాల్సి వుంది. అతని వాంగ్మూలంతో.. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చే రిపోర్టులు సరిచూసుకుని ఎంతమేరకు నిజం చెప్పాడన్నది నిర్ధారణ చేసుకుంటారు. ఈ ఘటనపై గణేష్ తల్లి అనుమానం వ్యక్తం చేస్తోంది. తాము కూడా అదే పాలు తాగామని, తమకు ప్రమాదం జరగలేదని ఆమె అంటోంది. నా కుమారుడంటే గిట్టని వారు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చునని చెబుతోంది. కల్తీ పాల వినియోగదారుల ఆరోగ్యంపై ఆరా పాల వ్యాపారి గణేష్ సరఫరా చేసిన పాల వినియోగదారుల చిట్టా ఆధారంగా 110 కుటుంబాల ఆరోగ్య పరిస్థితిపై వైద్యాధికారులు ఆరా తీస్తున్నారు. మరో వారం రోజుల పాటు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది కల్తీ పాల వినియోగదారుల ఆరోగ్య స్థితిని రికార్డు చేస్తారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు మినహా గణేష్ వద్ద పాలు తీసుకున్న వారి శరీరంలో ఎటువంటి మార్పులు కనిపించలేదు. -
కంటైనర్, కారు ఢీ
శంఖవరం: కత్తిపూడి జాతీయ రహదారిపై కంటైనర్, కారు ఢీకొన్నాయి. అన్నవరం పోలీసుల కథనం ప్రకారం.. సీతంపేట సమీపంలో కంటైనర్, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. అయితే ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. అనంతరం ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు, అన్నవరం ఎస్సై శ్రీహరిబాబు ఆ వాహనాలను తనిఖీ చేశారు. బాలికపై అత్యాచారయత్నం రాజానగరం: తండ్రి వయసులో ఉన్న ఓ వ్యక్తి కామంతో అభం శుభం తెలియని బాలికపై అత్యాచార యత్నానికి పాల్పడి, కటకటాల పాలయ్యాడు. రాజానగరం మండలం కలవచర్ల గ్రామంలో ఈ దారుణం జరిగింది. స్థానిక ఎస్సై మురళీకృష్ణ గురువారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. కలవచర్లలోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలిక ఆరోగ్యం బాగోలేదని బుధవారం స్కూల్కు వెళ్లలేదు. ఆమెను ఇంట్లో ఒంటరిగా వదిలి, తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లారు. అదే అదునుగా భావించి, పొరుగింట్లో ఉంటున్న 42 ఏళ్ల కొల్లి విష్ణు ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. తలుపులు వేసి, ఆ బాలికపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో, బాలిక భయంతో గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో కూలి పనులు ముగించుకుని వచ్చిన ఆ బాలిక తల్లితో పాటు, ఇరుగుపొరుగు రావడంతో నిందితుడు పరారయ్యాడు. విష్ణు ఇద్దరు పిల్లల తండ్రి కూడా. అతడిని అరెస్టు చేసి, పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, గురువారం రిమాండ్కు తరలించామని ఎస్సై తెలిపారు. మాస్ కాపీయింగ్ ఆరోపణపై నేడు విచారణ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కాకినాడ జీజీహెచ్లో ఈ నెల 5 నుంచి 13 వరకూ నిర్వహించిన జీఎన్ఎం పరీక్షల్లో లంచాలు, మాస్ కాపీయింగ్ జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం విచారణ జరగనుంది. దీనిపై ‘సాక్షి’ దినపత్రికలో ఈ నెల 12న ‘నాడి కాదు..నోటు పడితే నర్సింగ్’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం కదిలింది. ఇందులో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు ఓఎస్డీలు సహా మరికొంత మందిని విచారించేందుకు కమిటీని నియమించింది. కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి, ఆర్ఎంసీ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ మునిరత్నమ్మ, అడ్మినిస్ట్రేటర్ శ్రీధర్లతో కూడిన త్రిసభ్య కమిటీని ఇందుకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బృందం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో విచారణ చేపట్టనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. రూ.లక్షల మొత్తం చేతులు మారాయన్న ఆరోపణలు, ఓఎస్డీలు పరీక్షల వేళ ప్రైవేటు నర్సింగ్ స్కూల్ ప్రిన్సిపాళ్లతో రహస్య సమావేశాలు నిర్వహించడం, తమకు అనుకూలమైన విద్యార్థులతో తలుపులు మూసి మరీ కాపీయింగ్ నిర్వహించారని సహ విద్యార్థులే ఆరోపించడం, కీలక అధికారికి ఇప్పటికే స్థానచలనం కల్పించిన నేపథ్యంలో తాజా విచారణ అత్యంత కీలకం కానుంది. -
కోరుకొండ తీర్థం ప్రారంభం
● దేవుని కోనేరు నుంచి పుట్టమన్ను సేకరణ ● ఏర్పాట్లను పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు కోరుకొండ: కోరుకొండలో కొలువుదీరిన శ్రీలక్ష్మీనరసింహస్వామి తీర్థం గురువారం ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం నుంచి వైఖానస ఆగమ పండితుల ఆధ్వర్యంలో స్థానిక అర్చకస్వాములు స్వామివారి కోనేరు వద్ద నుంచి పుట్టమన్నును ఆలయానికి తీసుకొచ్చారు. అంకురార్పణ, ధ్వజారోహణం, నిత్య గ్రామ బలిహరణ, సేవాకాలం నిర్వహించారు. కొండపైన, కింద ఆలయాల్లో ఆరగింపు, జయగంట కార్యక్రమాలు జరిగాయి. తీర్థం సందర్భంగా కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రథోత్సవం సాగే ప్రాంతాలను అదనపు ఎస్పీ చెంచురెడ్డి, డీఎస్పీ రామ కృష్ణ పరిశీలించారు. స్వామి మాలధారణ నారసింహుని ఉత్సవాల సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు మాలధారణ చేశా రు. వీరంతా స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణ మండపంలో తొమ్మిది రోజులుగా దీక్షలు నిర్వహించా రు. శుక్రవారం స్వామివారి రథోత్సవం, రాత్రి కల్యా ణం అనంతరం, శనివారం దీక్ష విరమించనున్నారు. నేటి నుంచి విశిష్టాద్వైత సభలు స్వామివారి ఉత్సవాలను పురస్కరించుకొని స్థానిక రంగనాథస్వామి దేవాలయంలో ఎస్పీ నరసింహరాజభట్టర్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి విశిష్టాద్వైత సభలు నిర్వహించనున్నారు. దీనికి భద్రాచలం, సింహాచలం నుంచి పండితులు హాజరవుతారు. వీరంతా స్వామి ఔన్నత్యాన్ని తెలియజేస్తారు. పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేవస్థానం అనువంశిక ధర్మకర్త యస్.పి.రంగరాజ భట్టర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో అన్నవరం దేవస్థానం అధికారులు, అర్చక స్వాములు, కోరుకొండ ఎస్సై ఎస్.శ్రీనివాసు పాల్గొన్నారు. -
కొవ్వూరు ఇన్చార్జి ఆర్డీవోగా రాజారమేష్
తాళ్లపూడి: కొవ్వూరు ఇన్చార్జి ఆర్డీవోగా ఎం.రాజారమేష్ ప్రేమ్కుమార్ను గురువారం నియమించారు. ఆయన ప్రస్తుతం గెయిల్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆర్డీవో రాణి సుస్మిత బదిలీ కావడంతో ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో గురువారం బాధ్యతలు స్వీకరించారు. ల్యాబ్ రిపోర్టు వచ్చాక పరిస్థితిపై స్పష్టత కల్తీ పాల బాధితులు ఆరోగ్యంపై కలెక్టర్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో చికిత్స పొందుతున్న కల్తీ పాల బాధితుల వాస్తవ పరిస్థితిపై ల్యాబ్ రిపోర్టులు వచ్చిన తర్వాత స్పష్టత వస్తుందని కలెక్టర్ కీర్తి చేకూరి చెప్పారు. అమరావతి నుంచి సీఎం చంద్రబాబు గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. వరలక్ష్మి మిల్క్ డైరీ, నరసాపురం గ్రామం, కోరుకోండ మండలం నుంచి పాల సరఫరా నిలిపివేశామన్నారు. క్షేత్ర స్థాయిలో 9 వైద్య బృందాలు 110 గృహాలను సందర్శించి 315 రక్త నమూనాలను సేకరించామన్నారు. 14 సర్వైవల్ బృందాల ద్వారా 957 కుటుంబాలను ప్రతిరోజూ స్క్రీనింగ్ చేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఎస్పీ డి నరసింహ కిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. డ్రగ్ కంట్రోల్ కార్యాలయాల వద్ద ధర్నాలు రేపు ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): ప్రభుత్వ ఆసుపత్రులలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు సదుపాయాలు కల్పించాలని, డ్రగ్ కంట్రోల్ విభాగంలో అవినీతిని అరికట్టాలని కోరుతూ శనివారం బల్క్ డ్రగ్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడుతున్నామని సీపీఐ రాష్ట్ర వర్గ సభ్యులు తాటిపాక మధు పేర్కొన్నారు. గురువారం స్థానిక సీపీఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నకిలీ మందులు తయారీ కంపెనీలకు కోట్ల రూపాయలు ఆదాయం తెచ్చిపెడితే వీటిని మింగిన రోగులకు మాత్రం ఎక్కడా లేని కష్టాలు వచ్చిపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నకిలీ మందుల తయారీ వెనుక ఒక పెద్ద మెడికల్ మాఫియా ఉందన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం పోరాటడానికి మార్చి ఒకటి నుంచి 15వ తేదీ వరకు గడప గడపకూ సీపీఐ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పార్టీ జిల్లా కార్యదర్శి రేఖ భాస్కరావు, సహాయ కార్యదర్శి కె.రాంబాబు నగర కార్యదర్శి వి కొండలరావు పాల్గొన్నారు. నామినల్ రోల్లో సవరణలకు అవకాశం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదో తరగతి (ఎస్ఎస్సీ) మార్చి 2026 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల వివరాల్లో (నామినల్ రోల్స్ ) తప్పులు సరిదిద్దుకోవడానికి పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించిందని జిల్లా విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు గురువారం తెలిపారు. శనివారం వరకు సవరణలు చేసుకోవచ్చన్నారు. విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో దొర్లిన తప్పులను సరిదిద్దుకోవచ్చన్నారు. ఆధార్ తో ధృవీకరించిన వివరాలను మాత్రమే యూ డైస్ ప్లస్ పోర్టల్లో అప్డేట్ చేయాలన్నారు. ఈ మూడు రోజుల్లో రికార్డులు ఇంకా సరిపోలని వారికి మార్చి చివరి వారం, ఏప్రిల్ మొదటి వారంలో వివరాలు సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. జనగణనపై శిక్షణ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో 2027 జనాభా గణన నిర్వహణకు సంబంధించి అధికారులకు మూడు రోజులపాటు ప్రత్యేక శిక్షణ నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ అన్నారు. గురువారం కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించి పలు అంశాలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 27, 28, మార్చి 1 తేదీలలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో ఈ శిక్షణ జరగనుందని వెల్లడించారు. జనాభా గణనను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్న నేపథ్యంలో, సంబంధిత అధికారులకు డిజిటల్ అప్లికేషన్లపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. 2027 జనాభా గణనను రెండు దశల్లో చేపడతామని తెలిపారు. -
దౌర్జన్యంగా గుడిసెల పీకివేత
● రక్షణ కల్పించాలంటూ వలస కూలీల వినతి ● ఫిర్యాదు చేసి ఐదు రోజులైనా పట్టించుకోని పోలీసులు నల్లజర్ల: పోరంబోకు భూమిలో తాము వేసుకున్న తాత్కాలిక గుడిసెలను పీకేశారని, తమకు రక్షణ కల్పించాలంటూ వలస కూలీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి ఐదురోజులైనా పోలీసులు పట్టించుకోవడం లేదని వీరంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అంబరుపేట గ్రామానికి చెందిన 30 మంది వలస కార్మికులు వర్జీనియా పొగాకు (బ్యారను) రెల్చే పనుల కోసం నల్లజర్ల మండలం పోతవరం వచ్చారు. ఏటా మాదిరాగానే బహిరంగ ప్రదేశంలో తాటాకులతో చిన్న చిన్న గుడిసెలు వేసుకొని పగలు పనులకు వెళ్లి రాత్రిళ్ళు ఇక్కడ పడుకుంటారు. ఈ పనులన్నీ నాలుగు మాసాలలో ముగుస్తాయి. అపుడు వీరు తమ స్వగ్రామాలకు వెళ్లిపోతారు. గత నెల 19న వచ్చిన వీరు గ్రామంలో ఏలేటి శ్రీను పొలంపక్క గుడిసెలు వేసుకుని ఉన్నారు. ఈ నెల 14న అదే గ్రామానికి చెందిన రైతులు అట్టూరి సత్యనారాయణ, అట్టూరి వంశీ మగ కూలీలు పొలం పనులకు వెళ్లిన సమయంలో వారి తాత్కాలిక గుడిసెలు పీకేశారు. వండు కున్న ఆహార పదార్థాలను చిందర వందర చేసి నేలపై పడేశారు. గుడిశెలు ఇక్కడ తీయకపోతే మిమ్మల్ని కూడ పెట్రోలు పోసి తగులబెడతామని హెచ్చరించి వెళ్లిపోయారు. అయ్యా మేం పర్మినెంట్గా ఇక్కడ ఉండిపోమని, పనులు పూర్తయ్యాక ఖాళీ చేసి వెళ్లిపోతామని చెప్పినా వినకుండా మమ్మల్ని కులం పేరుతో దూషించారని బాధిత మహిళలు మొగులూరి చిట్టెమ్మమొగులూరి నాగలక్ష్మి,శ్రావణి తదితరులు వాపోయారు. ఒకపక్క రైతుల దగ్గర అడ్వాన్సులు తీసుకున్నాం పనులు పూర్తి చేసిపోతామన్నా వినలేదని చెప్పారు. ఇప్పటికే చాలామంది కూలీలు తమ ఊళ్లకు వెళ్లిపోయారని చెప్పారు. మిగిలిన తమపై ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో తెలియక భయంతో ఉన్నామని, తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఈ నెల 22న నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా తమకు ఇంతవరకు న్యాయం జరగలేదని, కనీసం ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేయలేదని వాపోయారు. వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యుడు చిడిపి చింతయ్య బాధిత కుటుంబాలను పరామర్శించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై ఎస్సై ఆంజనేయబాబును ‘సాక్షి’ వివరణ కోరగా సమస్యను పెద్దల సమక్షంలో పరిష్కరించుకోవాలని సూచించినట్టు చెప్పారు. -
అర్తమూరు మాజీ సర్పంచ్ భూలక్ష్మి మృతి
కపిలేశ్వరపురం (మండపేట): మండపేట మండలం అర్తమూరు గ్రామ మాజీ సర్పంచ్ పడాల భూలక్ష్మి (61) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతూ మరణించారు. 2001–06 మధ్య ఆమె సర్పంచ్గా పనిచేసి గ్రామానికి విశేష సేవలందించారు. ఆమెకు భర్త పడాల సుబ్బారెడ్డి, కుమారుడు భాస్కరరెడ్డి, కుమార్తె సత్యశ్రీ ఉన్నారు. భర్త పడాల సుబ్బారెడ్డి ప్రాంతీయ కోళ్ల రైతుల సంఘం అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడుకు భూలక్ష్మి సోదరి. అర్తమూరులో భూలక్ష్మి పార్థివదేహాన్ని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, పలువురు రాజకీయ, వ్యాపార, నియోజకవర్గ ప్రముఖులు సందర్శించారు. పడాల సుబ్బారెడ్డిని పరామర్శించారు. -
నిమ్మండి.. దిగులేనండి
దేవరపల్లి: నిమ్మ పంట దిగుబడి పులుపెక్కింది.. ఈ ఏడాది దారుణంగా పడిపోయింది.. కాయలు లేక తోటలు కళావిహీనంగా మారి, రైతన్నలకు కష్టం తెచ్చింది.. ధర బాగున్నా, దిగుబడి లేకుండా పోయింది.. ఎకరాకు 2.5 టన్నులు రావాల్సి ఉండగా, టన్ను కాయలూ కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో పెట్టిన పెట్టుబడి, కౌలు సొమ్ము వచ్చేట్టు కనిపించడం లేదు. ధర బాగున్నా దిగుబడులు తగ్గడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలోని ఎర్రనేలల్లో నిమ్మకాయల తోటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు.కొవ్వూరు డివిజన్ దేవరపల్లి, గోపాలపురం, చాగల్లు, తాళ్లపూడి, పెరవలి, నిడదవోలు మండలాల్లో సుమారు 2,200 ఎకరాల్లో నిమ్మ తోటలు సాగవుతున్నాయి. దేవరపల్లి మండలం యాదవోలు, చిన్నాయగూడెం, కొత్తగూడెం గ్రామాల్లో ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. ఈ మండలంలో సుమారు 800 ఎకరాలు ఉంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో పూత రాగా, ఫిబ్రవరి నెల నుంచి దిగుబడి వస్తుంది. జనవరి, ఫిబ్రవరిలో వచ్చిన పూతతో ఏప్రిల్ నుంచి జూన్ వరకూ దిగుబడి ఉంటుంది. ఈ ఐదు నెలలు నిమ్మకాయలకు మార్కెట్లో డిమాండ్ ఉంటోంది. వేసవిలో పండిన కాయలకు గిరాకీ ఉండి గిట్టుబాటు ధర లభిస్తోంది. వర్షాకాలంలో పండిన కాయలకు డిమాండ్ ఉండదు. వర్షాకాలంలో పూత శీతాకాలంలో కాపుఉంటోంది. అయితే నిమ్మకాయల వినియోగం తక్కువగా ఉండడంతో కొనుగోళ్లు అంతంత మాత్రంగా ఉంటాయి. కిలో రూ. 8 నుంచి రూ.10 పలుకుతాయి. అయినా కొనుగోలు చేసే నాధుడు కనిపించక రైతులు చెట్ల కిందే వదిలేస్తారు. ప్రస్తుతం కిలో రూ.80మార్కెట్లో నిమ్మకాయల ధర ఆశాజనకంగా ఉంది. మొన్నటి వరకూ కిలో కాయలు రూ. 8 నుంచి రూ.10 పలికగా, ప్రస్తుతం రూ.80 నుంచి రూ.90కు చేరింది. ఎండల తీవ్రత పెరగడంతో పాటు తోటలు కాపులు లేక దిగుబడులు తగ్గడంతో మార్కెట్లో ధర పెరిగింది. గత ఏడాది ఫిబ్రవరిలో కిలో రూ. 40 ఉంది. అయినప్పటికీ వేసవి పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో గిట్టుబాటు అయ్యింది. కిలో కాయలు రూ. 35 నుంచి రూ.50 నిలకడగా కొనసాగడంతో పెట్టుబడి పోను రైతులు నాలుగు డబ్బులు మిగిలాయి. ఈ ఏడాది వేసవి సీజన్లో మార్కెట్లో ధర రూ.120 దాటవచ్చని రైతులు అభిప్రాయపడుతున్నారు. కౌలు రైతులకు తప్పని నష్టంనిమ్మ సాగు చేస్తున్న రైతుల్లో ఎక్కువ మంది కౌలు దారులున్నారు. వీరి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్కొక్కరు 5 నుంచి 10 ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. ఎకరం కౌలు రూ. 90 వేల నుంచి రూ. లక్ష వరకు ఉండగా, పెట్టుబడి మరో రూ. 25 వేలు అవుతుంది. నిమ్మతోటకు ఏడాది పొడవునా పెట్టుబడి పెట్టాల్సి ఉంది. ఎక్కువగా సేంద్రియ ఎరువులను వేయాలి. ప్రస్తుత పరిస్థితిలో దిగుబడులు లేక కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.యాదవోలు మార్కెట్లో విక్రయాలుయాదవోలు మార్కెట్లో రైతులు పంటను అమ్ముకుని సొమ్ము చేసుకుంటారు. ప్రస్తుతం మార్కెట్కు రోజుకు 20 నుంచి 25 టన్నుల కాయలు వస్తున్నాయి. కాపులు బాగుంటే రోజుకు 60 నుంచి 70 టన్నుల విక్రయాలు జరుగుతాయి. దేవరపల్లి మండల పరిసర గ్రామాల నుంచి పంటను రైతులు యాదవోలు మార్కెట్కు తీసుకువస్తారు. ఏలూరు తర్వాత పెద్ద మార్కట్ యాదవోలు. ఇక్కడ మార్కెట్లో కొనుగోలు చేసిన కాయలను ఒడిశా, కోల్కతా, విశాఖ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. కలుపు మందుల ఎఫెక్ట్ నిమ్మ తోటలకు విచ్చలవిడిగా కలుపు మందు పిచికారీ చేస్తున్నారు. దీని ప్రభావం మొక్కలపై పడి దెబ్బతింటున్నాయి. తోటలు నిగనిగలాడడంలేదని, ఎర్రబడి కొమ్మలు ఎండిపోతున్నట్టు రైతులు తెలిపారు. కలుపు మందులతో పాటు క్రిమిసంహారక మందుల వాడకం ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు. గతంలో కాయలు గుత్తులుగా ఉండేదని, చెట్టుకు 100 కిలోల కాయల దిగుబడి వచ్చేవని రైతులు తెలిపారు. ఎకరాకు ఏడాదికి 40 క్వింటాళ్లు దిగుబడి వచ్చేవని అన్నారు. పెట్టుబడి కూడా రాదునిమ్మ ధర బాగుంది. అయితే దిగుబడి లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక తోటలు కాపులు కాయలేదు. ఎకరాకు 3 టన్నుల కాయలు దిగుబడి రావాల్సి ఉండగా, టన్ను కూడా లేవు. పెట్టుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 100 కిలోల కాయలు కోయడానికి రూ. 2,200 ఖర్చు అవుతుంది. వేసవి పంటలపై ఆశలు పెట్టుకుంటాం. ఈ సారి ఆశాజనకంగా లేదు. – గడా రాంబాబు, నిమ్మ రైతు, చిన్నాయగూడెం, దేవరపల్లి మండలంవేసవి పంటపైనే ఆశలువేసవి పంటపై ఆశలు పెట్టుకున్నాం. ప్రస్తుతం దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం యాదవోలు మార్కెట్లో కిలో కాయలు రూ. 80 పలుకుతున్నాయి. డిసెంబర్, జనవరిలో కిలో ధర రూ. 8 ఉంది. ఈ నెలలో ధర పెరిగింది. ధర ఉన్నప్పటికీ దిగుబడులు లేవు. నిమ్మ రైతుల్లో ఎక్కువ మంది కౌలు దారులు ఉన్నారు. వారంతా ఇబ్బంది పడుతున్నారు.– లకంసాని శ్రీనివాసరావు, నిమ్మరైతు, చిన్నాయగూడెం, దేవరపల్లి మండలం -
క్షణికావేశానికి పసికందు బలి
జగ్గంపేట: ఆ చిన్నారి ఏం చేసిందో.. అమ్మా నాన్న అనడం కూడా రాని ఆ పసి ప్రాయాన్ని కన్న తండ్రే కడతేర్చాడు.. క్షణికావేశంలో కన్న బంధాన్నే మరిచాడు.. మద్యం మత్తులో తీసుకున్న నిర్ణయంతో ఓ చిన్నారి ప్రాణాలను హరించాడు. ఈ సంఘటన అందరి హృదయాలను కలిచివేసింది. జగ్గంపేటలో గురువారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. స్థానికులు, జగ్గంపేట ఎస్సై రఘునాథరావు కథనం ప్రకారం.. జగ్గంపేట టీచర్స్ కాలనీలో ఓడిబోయిన మణికంఠ (23), అతని భార్య ఓడిబోయిన సాయి (25) నివాసం ఉంటున్నారు. వీరిది కులాంతర వివాహం. అయితే సాయికి గతంలోనే వివాహం జరగడం ఆరేళ్ల కూతురు ఉండగా, భర్తతో విడిపోయింది. అనంతరం మణికంఠతో పరిచయం ఏర్పడి వివాహం చేసుకుంది. వీరికి ఆడపిల్ల ఉంది. ఆ పాపకు 11 నెలలు. అయితే భర్త తరచూ మద్యం తాగడం, సంపాదన గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా తిరగడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సాయి రెండు రోజుల క్రితం స్థానిక గోకవరం రోడ్డులోని పుట్టింటికి వెళ్లిపోయింది. గురువారం సాయంత్రం మద్యం తాగి అత్తవారింటికి వెళ్లిన మణికంఠ భార్యతో ఘర్షణకు దిగాడు. దీంతో అత్తింటివారు చివాట్లు పెట్టి, నీ కూతురిని తీసుకుని వెళ్లి పోషించుకో అని అనడంతో మద్యం మత్తులో ఉన్న మణికంఠ 11 నెలల చిన్నారితో సహా అక్కడి నుంచి మోటారు సైకిల్పై వచ్చేశాడు. మత్తు దిగిన తరువాత తిరిగి వస్తాడని భావిస్తున్న భార్య, అత్తకు పిడుగులాంటి వార్త తెలిసింది.మోటారు సైకిల్తో సహా కాలువలోకి..11 నెలల తన కూతురుతో సహా ఆవేశంగా బయలు దేరిన మణికంఠ, నేరుగా జగ్గంపేట నుంచి గుర్రంపాలెం వెళ్లే రహదారిలో ఉన్న పోలవరం కాలువలోకి మోటారు సైకిల్తో సహా దూసుకుపోయాడు. అయితే పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ప్రమాదాన్ని గుర్తించి తక్షణం కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉంది. మణికంఠను కాపాడి గట్టుపైకి తీసుకువచ్చారు. పోలవరం కాలువకు సమీపంలో ఉన్న వివేకానంద విద్యా సంస్థల అధినేత, రాష్ట్ర వైఎస్సార్ సీపీ నేత ఒమ్మి రఘురామ్కు సమాచారం తెలియడంతో తక్షణం ఆయన సంఘటన స్థలానికి చేరుకుని తన కారులో చిన్నారిని, మణికంఠను జగ్గంపేట సీహెచ్సీకి తీసుకువెళ్లారు. అయితే డాక్టర్లు పరీక్షించి చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.బోరున విలపించిన కుటుంబ సభ్యులుఆవేశంగా వెళుతుంటే కొద్ది సేపటికి తిరిగి వస్తాడని భావించానని, కానీ కూతురి ప్రాణాలు తీస్తాడని అనుకోలేదని తల్లి సాయి, ఆమె కుటుంబ సభ్యులు బోరున విలపించారు. స్థానికులు ఆగ్రహంతో మణికంఠకు దేహశుద్ధి చేశా రు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘు నాథరావు తెలిపారు. -
పాము కాటుకు చిన్నారి మృతి
నల్లజర్ల: పాము కాటుకు గురై ఓ చిన్నారి మృతి చెందింది. ఆ వివరాల ప్రకారం.. అనంతపల్లిలో చోడవరం రహదారి పక్కన నివాసం ఉంటున్న తీగల ప్రకాష్, ధనలక్ష్మి దంపతుల కుమార్తె వన్సిక (3) బుధవారం సాయంత్రం ఆరుబయట మూత్ర విసర్జనకు వచ్చింది. పక్కనే చెత్తలో ఉన్న తాచుపాము ఆమెను కాటేసింది. జరిగిన సంఘటన తల్లికి చెప్పి ఆ బాలిక కుప్పకూలిపోయింది. వెంటనే ఆ బాలికను చికిత్స నిమిత్తం నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్టు సమీప బంధువులు తెలిపారు. ఆ బాలిక తండ్రి ప్రకాష్ ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. కుమార్తె మరణ వార్త విని స్వస్థలానికి తిరిగి వస్తున్నారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహిస్తారు.గీత కార్మికుడి మృతిచాగల్లు: పాము కాటుకు గురై ఓ కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. చాగల్లుకు చెందిన దొంగ వెంకటేశ్వరరావు (51) గీత కార్మికుడు. నెలటూరు గ్రామ పరిధిలోని రుద్రబోయిన బుల్లిరాజుకు చెందిన పొలంలో తాటిచెట్ల వద్దకు వెళ్లి కల్లు తీయడానికి వెళ్తుండగా విష సర్పం కాటేసింది. అతన్ని వెంటనే బంధువులు చికిత్స నిమిత్తం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా, మార్గం మధ్యలోనే మృతి చెందారు. మృతుడి అతని భార్య దొంగ పద్మ ఫిర్యాదు మేరకు ఎస్సై కె.నరేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
పీపీ.. పీపీపై కూపీ
తాళ్లపూడి: ఉగాది నాటికి అంటే 15 రోజుల్లో పోశియ్య ఇంటి పనులు పూర్తి చేసి అప్పగిస్తామని జిల్లా హౌసింగ్ పీడీ నాతి బుజ్జి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మలకపల్లికి వచ్చిన సమయంలో చర్మకారుడు సమండ్ర పోశియ్య(పోశిబాబు)కు ఇచ్చిన హామీ నెరవేరలేదని వివరిస్తూ ‘పీపీ.. పీపీ.. ఢాంఢాం’ అనే శీర్షికన సాక్షిలో గురువారం ప్రచురితమైన కథనానికి జిల్లా అధికారులు తక్షణం స్పందించారు. పోశియ్య ఇల్లు బాగు చేయించడంతో పాటు, చెప్పుల కొట్టు పెట్టుకోవడానికి సాయమందిస్తామని అప్పట్లో సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ నెరవేరలేదనే పోశియ్య ఆవేదనకు సాక్షి అక్షర రూపమిచ్చింది. దీంతో గురువారం హౌసింగ్ పీడీ నాతి బుజ్జి, కొవ్వూరు హౌసింగ్ ఈఈ వేణుగోపాలరావు, ఇతర శాఖల అధికారులు పోశియ్య ఇంటిని పరిశీలించారు. పోశియ్యను అడిగి ఇప్పటి వరకు చేసిన పనులు, ఇంకా ఏం చేయాలన్న వివరాలు తెలుసుకున్నారు. తన పరిస్థితిని గమనించి ముఖ్యమంత్రి అన్ని పనులు చేయించి పెడతానని చెప్పారని పోశియ్య అన్నారు. మిగిలిన పనులు పూర్తి చేయాలని కోరారు. అయితే గ్రామంలో కొట్టు పెట్టుకోవడానికి ఇప్పటి వరకు స్థలం చూపించలేదని తెలిపారు. సరకులు, బడ్డీ కొట్టు సిద్ధంగా ఉందని చెప్పారు. జిల్లా హౌసింగ్ పీడీ బుజ్జి మాట్లాడుతూ ఇప్పటి వరకు పోశియ్య ఇంటికి ప్లాస్టింగ్, ఇంటి ఎలివేషన్, కబోర్డులు, బాత్రూం నిర్మాణం తదితర పనులు చేశామన్నారు. ఫ్లోరింగ్కు టైల్స్, కిచెన్లో కిటికి, ఇంటి వద్ద పరిసరాల లెవలింగ్, బాత్రూంకు ప్లాస్టింగ్, పైకప్పు వంటి పనులు కలెక్టర్ ఆదేశాల మేరకు ఉగాది నాటికి పూర్తి చేస్తామన్నారు. ఇప్పటి వరకు రూ.2.60 లక్షలు ఖర్చు చేశామని, మరో రూ.20 వేలు ఉపాధి హమీ ద్వారా ఖాతాలో వేశామన్నారు. మిగిలిన పనులు పూర్తి చేయడానికి మరో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షలు వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని తెలిపారు. చెప్పులు దుకాణం పెట్టుకోవడానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.లక్ష చెక్కు ఇచ్చామని తెలిపారు. ఇప్పటికే పోశియ్య సరకులు, కొట్టు కొనుగోలు చేశారని, కొట్టు పెట్టుకోవడానికి రెవెన్యూ అధికారులు స్థలం గుర్తిస్తారని తెలిపారు. హౌసింగ్, డీఆర్డీఏ డ్వామా, రెవెన్యూ అధికారులు కలిసి పనిచేస్తారని పీడీ తెలిపారు. మొత్తంగా రూ.5 లక్షల లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఇన్చార్జి ఏఈ దాదాసాహెబ్, వర్క్ ఇన్స్పెక్టర్ సుధాకర్ పాల్గొన్నారు. ‘సాక్షి’ కథనానికి తక్షణ స్పందన చర్మకారుడు పోశియ్యతో మాట్లాడిన హౌసింగ్ పీడీ, ఇతర అధికారులు ఉగాది నాటికి ఇంటి పనులు పూర్తిచేసి ఇస్తామని ప్రకటన -
కల్తీ పాల ఘటనకు చంద్రబాబే బాధ్యత తీసుకోవాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కల్తీ పాల వల్ల రాజమహేంద్రవరంలో జనం మృతి చెందిన ఘటనకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబే తీసుకోవాలని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఆయన బుధవారం రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం, అధికారుల అసమర్థత, నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందన్నారు. పాల కేంద్రాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేయాలన్నారు. కానీ సంవత్సరాల తరబడి తనిఖీలు చేపట్టకపోవడం వల్ల ఈ మరణాలు సంభవించాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు సరిగ్గా పనిచేయడం లేదన్నారు. ఈ ఘటనకు సంబంధించిన అధికారులను ఈ పాటికే సస్పెండ్ చేయాలన్నారు. పుష్కరాల సమయంలో చంద్రబాబు అతి ప్రచారం వల్ల 29 మంది చనిపోయారన్నారు. ఇటీవల సింహాచలం, తిరుమల, శ్రీకాకులం వంటి పుణ్యక్షేత్రాలలో భక్తులు చనిపోయారన్నారు. ఇటువంటి వరస ఘటనలు చూస్తూ ఉంటే చంద్రబాబు సైకో మైండ్ సెట్ అర్థమవుతుందన్నారు. ప్రవీణ్ పగడాలది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే పాస్టర్ ప్రవీణ్ పగడాలది ముమ్మాటికీ ప్రభుత్వాలు చేసిన హత్యేనని హర్షకుమార్ అన్నారు. ప్రవీణ్ను ఎవరు హత్యచేశారో, ఎందుకు చేశారో కూడా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు తెలుసునన్నారు. ఒక పాస్టర్ తాగుతూ వచ్చి ప్రమాదంలో మరణిస్తే, దానిపై మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు పలుమార్లు వ్యాఖ్యానించడం కోర్టును ప్రభావితం చేయడమేనన్నారు. ప్రవీణ్ కేసు కోర్టులో నడుస్తుండగా సీఎం ఎలా ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించారు. ప్రవీణ్ పగడాల పోస్టుమార్టం రిపోర్టు చూస్తే ఆయన హత్యకు గురయ్యారని తెలిసిపోతుందన్నారు. ప్రవీణ్ పగడాల మరణించి 11 నెలలు గడచినా కోర్టులో ఎందుకు ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయలేదని ప్రశ్నించారు. -
ఉప్పొంగి.. ఉజ్వలమై..
ఆశాజనకంగా వర్షాలు ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా కురవడంతో లోయర్ సీలేరు జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరకుని కళకళలాడుతున్నాయి. మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రం లక్ష్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి చేసింది. సీలేరు, డొంకరాయి, పొల్లూరు జలవిద్యుత్ కేంద్రాలు మార్చి నాటికి లక్ష్యానికి చేరుకున్నాయి. 5, 6 యూనిట్లు అనుసంధానం పనుల వల్ల లక్ష్యానికి మించి జలవిద్యుత్ ఉత్పత్తి జరగలేదు. – కేవీ రాజారావు, చీఫ్ ఇంజినీర్, పొల్లూరు లక్ష్యానికి దగ్గరలో.. ఏపీ జెన్కో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది రేయింబవళ్లు శ్రమించి జల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఏడాది పొడవునా కష్టపడుతున్నారు. ఈ ఏడాది కూడా లక్ష్యాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది. – బాలకృష్ణ, డీఈ, ఏపీ జెన్కో పొల్లూరు పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం మోతుగూడెం: సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని జల విద్యుత్ కేంద్రాలు మూడేళ్లుగా రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. మాచ్ఖండ్, అప్పర్ సీలేరు, డొంకరాయి, పొల్లూరు, లక్ష్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి సాధిస్తూ ఇటు జెన్కోకు, రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుస్తున్నాయి. ఈ ప్రాజెక్టులు కట్టి సుమారు 50 ఏళ్లు దాటుతున్నా, పూర్తిస్థాయిలో ఆధునీకరించకపోవడంతో ఇంజినీర్లు, కార్మికుల సమష్టి కృషితో విద్యుత్ ఉత్పత్తి రికార్డు స్థాయిలో సాగుతోంది. గత మూడేళ్లుగా ఉభయ గోదావరి జిల్లాలకు లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందిస్తున్నాయి. చవకగా జల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఇటు రైతులకు గృహ అవసరాలకు వెలుగులు నింపుతున్నాయి. మూడేళ్లుగా వర్షాలు సరిపడినంత పడడంతో రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండి విద్యుత్ ఉత్పత్తి బాగుంది. మూడేళ్లుగా రబీ సీజన్కు సుమారు 250 టీఎంసీల వరకు నీరు అందించాయి. ఏటా సీలేరు జల విద్యుత్ కేంద్రాలకు లక్ష్యాలు విధిస్తున్నప్పటికీ అంతకు మించే ఉత్పత్తి చేస్తుండడం విశేషం. ఈ నేపథ్యంలో ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తి చేసే జల విద్యుత్ కేంద్రాలుగా ఇవి రికార్డు సాధించాయి. సాగర్, శ్రీశైలం మన రాష్ట్రానికి ఉన్నప్పటికీ ఏడాది పొడవునా విద్యుత్ ఉత్పత్తి చేసే పరిస్థితి లేదు. ఈ నాలుగు కేంద్రాల నుంచి సుమారు 975 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండడం విశేషం. ఏపీ జెన్కో సంస్థకు ధర్మల్ కేంద్రాలు ఉన్నప్పటికీ ఒక యూనిట్ ఉత్పత్తి చేయడానికి సుమారు రూ.7 వరకు ఖర్చు అవుతుండగా జల విద్యుత్ కేంద్రాల్లో యూనిట్కు రూ.3 ఖర్చు అవుతుంది. ఈ నాలుగు జల విద్యుత్ కేంద్రాలు పీక్ లోడ్ అవర్స్ లో జల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ భారీగా ఆదాయం సమకూరుస్తున్నాయి. ప్రస్తుతం ఒడిస్సా ఆంధ్ర ఉమ్మడి జలాశయాలు అయినా జోలాపుట్, బలిమెల జలాశయాల్లో ఆంధ్ర వాటాగా సుమారు 60 టీఎంసీల వరకు వస్తుండగా ఆ నీరు గుంటవాడ, డొంకరాయి జలాశయాలకు వస్తాయి. ప్రస్తుతం వాటిలో సుమారు 14 టీఎంసీల వరకు నిల్వ ఉన్నట్లు జెన్కో అధికారులు తెలిపారు. ఈ వేసవిలో కూడా రిజర్వాయర్లలో నీటిమట్టాలు ఆశాజనకం ఉండడంతో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అయినట్టు వారు తెలిపారు. ఒక్క మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రమే ఈ ఏడాది లక్ష్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి చేసినట్టు వారు అధికారులు తెలిపారు. సీలేరు, డొంకరాయి, పొల్లూరు జల విద్యుత్ కేంద్రాలు మార్చి నాటికి లక్ష్యానికి చేరుకుంటాయని తెలిపారు. ఈ మూడు కేంద్రాలు సైతం ఈ ఏడాది లక్ష్యానికి చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ, పొల్లూరు రెండో దశలో కొత్తగా నిర్మిస్తున్న 5, 6 యూనిట్ల అనుసంధాన పనులు సాగుతుండడంతో సుమారు మూడు నెలల పాటు జల విద్యుదుత్పత్తికి అంతరాయం కలిగింది. లేకుంటే ఈ మూడు ప్రాజెక్టులూ లక్ష్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి చేసేవి. అంతే కాకుండా రెండో దశ నిర్మాణంలో భాగంగా పొల్లూరు జల విద్యుత్ కేంద్రం వద్ద కొత్తగా నిర్మిస్తున్న ఐదు ఆరు యూనిట్లు నిర్మాణం పూర్తయితే మరో 230 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి అందుబాటులోకి రానుంది. దీంతో సీలేరు కాంప్లెక్స్ ఉత్పత్తి సామర్థ్యం మొత్తం 1205 మెగావాట్లతో రాష్ట్రంలోనే అతి పెద్ద జల విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రంగా రూపొందనుంది. ఈ కొత్త యూనిట్లు మరో ఏడాదిలో పూర్తికానున్నాయి. జల విద్యుత్ కేంద్రాల్లో మూడేళ్ల విద్యుత్ ఉత్పత్తి మిలియన్ యూనిట్లలో.. జల విద్యుత్ కేంద్రం 2023–24 2024–25 2025–26 లక్ష్యం – ఉత్పత్తి లక్ష్యం – ఉత్పత్తి లక్ష్యం – ఉత్పత్తి మాచ్ఖండ్ 626 535.576 630 554.698 657 747.52 అప్పర్ సీలేరు 470 485 477 495.7 477 388 పొల్లూరు 1084 1090 1095 1120.63 1084 944 డొంకరాయి 99 105.732 95 105.224 95.94 84.612 సీలేరు కాంప్లెక్స్ పరిధిలో రికార్డు స్థాయిలో జలవిద్యుత్ నాలుగు విద్యుత్ కేంద్రాల నుంచి 975 మెగావాట్ల ఉత్పత్తి ప్రాజెక్టులు నిర్మించి 50 ఏళ్లు అయినప్పటికీ ఆధునీకరణ అంతంతే ఘనతంతా అధికారులు, సిబ్బందిదే మూడేళ్లుగా లక్ష్యానికి మించి ఉత్పత్తి ఉభయ గోదావరి జిల్లాలకు సమృద్ధిగా తాగు, సాగునీరు చౌక ధరలకు విద్యుత్ సరఫరా -
H½-ïÜyîl çœ#yŠæ MøÆý‡$tMýS$ ˘ రూ.11 వేల జరిమానా
అమలాపురం టౌన్: అమలాపురంలోని ఏబీసీడీ ఫుడ్ కోర్టు (హోటల్)లో నిల్వ మాంసంతో ఆహారం పెట్టారంటూ వచ్చిన ఆరోపణలపై మున్సిపల్ కమిషనర్ వి.నిర్మల్ కుమార్ బుధవారం ఆ హోటల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీనిపై ఒక వినియోగదారుడు మంగళవారం రాత్రి మున్సిపాలిటీ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. ఆ హోటల్ను తొలుత మున్సిపల్ ఇన్విరాల్మెంట్ ఏఈ వెంకటేష్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి, సిబ్బంది తనిఖీ చేశారు. లోపల పలు విభాగాల్లో అపరిశుభ్రత ఉందని పేర్కొంటూ హోటల్ యాజమాన్యానికి రూ.వెయ్యి జరిమానా విధించారు. అనంతరం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రామయ్యతో మున్సిపల్ కమిషనర్ నిర్మల్కుమార్ ఫోన్లో మాట్లాడారు. రాజమహేంద్రవరంలో జరిగిన పాలు కల్తీ ఘటన నేపథ్యంలో కోనసీమ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ రామయ్య అక్కడే విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ రంగంలోకి దిగి ఏబీసీడీ ఫుడ్ కోర్టును స్వయంగా తనిఖీ చేశారు. ఫుడ్ కోర్టులో అపరిశుభ్రత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఫుడ్ కోర్టులో నూనెను రీయూజ్డ్ చేస్తున్నారని, మాంసాన్ని ఫ్రిజ్ల్లో ఉంచి వాడుతున్నారని, మసాలా దినుసుల ప్యాకెట్లపై ఎఫ్ఎస్ఎస్ఐ ముద్ర లేదని గుర్తించారు. ఈ తప్పిదాలపై అధ్యయనం చేసిన కమిషనర్.. హోటల్ యాజమాన్యానికి రూ.10 వేలు జరిమానా విధించారు. ఫుడ్ సేఫ్టీ అధికారి రామయ్య తనిఖీ అమలాపురంలోని ఏబీసీడీ ఫుడ్ కోర్టు హోటల్ను జిల్లా ఫుడ్ సేఫ్టీ అదికారి వై.రామయ్య బుధవారం రాత్రి తనిఖీ చేశారు. అక్కడి మాంసాహార పదార్థాల శాంపిల్స్ సేకరించారు. వాటిని హౌదరాబాద్లోని స్టేట్ ఫుడ్ ల్యాబ్కు పంపిస్తున్నట్లు తెలిపారు.


