East Godavari District Latest News
-
కళ్లు తెరవకుండానే.. కన్నుమూసిన పసికందు
ఫ వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆందోళన ఫ ఇద్దరు నర్సుల సస్పెన్షన్ తాళ్లరేవు: కళ్లు కూడా తెరవకుండానే ఆ పసికందుకు నూరేళ్లు నిండిపోయాయి.. గర్భిణిని వైద్యులు, సిబ్బంది సక్రమంగా పట్టించుకోక పోవడంతో బిడ్డ పురిట్లోనే చనిపోయినట్లు బంధువులు ఆందోళనకు దిగారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పెదబొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన చెక్కా మాధురికి పురిటి నొప్పులు రావడంతో భర్త రాము తాళ్లరేవు సామాజిక ఆస్పత్రిలో చేర్చారు. తల్లీ, బిడ్డ క్షేమంగా వస్తారని ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు బిడ్డ మృతి చెందాడన్న వార్తను జీర్ణించుకోలేకపోయారు. శనివారం తెల్లవారు జామున 5.40 గంటలకు మాధురికి పురిటి నొప్పులు వచ్చినప్పటికీ డ్యూటీలో ఉన్న వైద్యురాలు డి.స్నేహలత గాని, నర్సులు ఇందిర, శైలజ గాని పట్టించుకోకపోవడంతో స్వీపర్ అనంత డెలివరీ చేసినట్లు చెబుతున్నారు. అయితే బిడ్డ నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో వైద్యులు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. అయితే అప్పటికే పసికందు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకుని, వైద్యురాలు స్నేహలత నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మృతి చెందిందని ఆమెను సస్పెండ్ చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వీరికి పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు మద్దతు పలికారు. ఆరు గంటలపాటు ఆందోళన కాకినాడ – యానం రహదారిపై ఆందోళనకారులు బైఠాయించి ధర్నా చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్, నైట్ డ్యూటీ డాక్టర్ స్నేహలతపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీంతో ఆ రహదారిలో సుమారు 6 గంటలపాటు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఈ విషయం తెలుసుకున్న కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. జనం అధిక సంఖ్యలో రావడంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్నేహలతను సస్పెన్షన్ చేసేవరకూ ఆందోళన విరమించేది లేదని చెప్పడంతో కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణకు సమాచారం ఇచ్చారు. పెదపూడి ఎస్సై తులసీరామ్, ఇంద్రపాలెం ఎస్సై వీరబాబుతోపాటు, ఏపీఎస్పీ బలగాలను రప్పించారు. ఇలాఉండగా అధికార పార్టీ నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, నడింపల్లి వినోద్, వాడ్రేవు వీరబాబు, ధూళిపూడి బాబి, జక్కల ప్రసాద్ తదితరులు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకు సమాచారం ఇవ్వడంతో ఆయన వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్ స్పందించి కాకినాడ ఆర్డీఓ ఎస్.మల్లిబాబు, ముగ్గురు వైద్యులు వినోద్కుమార్, సుజాత, సతీష్లతోకూడిన బృందంతో విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి డ్యూటీలో ఉన్న నర్సులు ఇందిర, శైలజలను సస్పెన్షన్ చేస్తున్నట్లు ఆర్డీఓ మల్లిబాబు ప్రకటించారు. అయితే వైద్యురాలు స్నేహలతపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు పట్టుబట్టడంతో ఆమైపె చర్యలు తీసుకోవడం తమ పరిధిలో లేదని, జరిగిన ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేసినట్లు తెలిపారు. -
నీట్ ఫలితాల్లో తిరుమల ప్రభంజనం
రాజమహేంద్రవరం రూరల్: కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా నిర్వహించిన మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్లో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఆ విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. ఓపెన్ కేటగిరీలో డి.కార్తీక్ రామ్కిరీటికి ఏపీ ఫస్ట్ ర్యాంకుతో పాటు ఆలిండియా 19వ ర్యాంకు సాధించాడన్నారు. వివిధ కేటగిరీల్లో కె.ఈప్సిత్ కశ్యప్ 12వ ర్యాంకు, డి.కార్తీక్రామ్ కిరిటీ 18వ ర్యాంకు, టి.సాహితి 32వ ర్యాంకు, కేవీవీ నాగసాయిపవన్ 154వ ర్యాంకు, ఎం.సూర్యసంతోష్రెడ్డి 880వ ర్యాంకు, ఎల్.అభిషేక్ 888 ర్యాంకు, టి.రామచంద్రన్ 1,145వ ర్యాంకు, ఎల్.వర్షిత్ 1,237వ ర్యాంకు, పి.ప్రశంస 1,851వ ర్యాంకు, కె.విన్షిత 1,909వ ర్యాంకును కై వసం చేసుకున్నారన్నారు. వెయ్యిలోపు ఆరుగురు, ఐదు వేల లోపు 35 మంది, 10 వేల లోపు 71 మంది, 20 వేల లోపు 138 మంది, 30 వేల లోపు 189 మంది ర్యాంకులు సాధించారని, 250 మందికి పైగా విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తారని ఆయన తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను నున్న తిరుమలరావు, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపల్ వి.శ్రీహరిలు అభినందించారు. -
యోగాకు 7.66 లక్షల మంది నమోదు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లావ్యాప్తంగా 4,889 ప్రాంతాల్లో యోగా సాధనకు 7.66 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. వివిధ శాఖల ఆధ్వర్యాన జిల్లావ్యాప్తంగా శనివారం యోగా ట్రయల్ రన్ నిర్వహించారు. నగరంలో 45 వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని జాయింట్ కలెక్టర్, యోగాంధ్ర నోడల్ అధికారి ఎస్.చిన్నరాముడు తెలిపారు. రాజమహేంద్రవం ఆర్ట్స్ కళాశాల వద్ద పర్యాటక, సాంస్కృతిక శాఖ, సరస్వతీ ఘాట్ వద్ద ఉద్యానవన శాఖ, పుష్కర ఘాట్ వద్ద మత్స్య శాఖ, సుబ్రహ్మణ్య మైదానంలో పోలీస్, సైనిక్ సంక్షేమ శాఖ, ఏకేసీ కాలేజీ రోడ్డులో వైద్య, ఆరోగ్య శాఖ, లాలాచెరువు బీటీ రోడ్డు సమీపాన సూర్య నమస్కారాల విగ్రహాల వద్ద, క్వారీ మార్కెట్, శివాలయం ఎదురుగా జిల్లా క్రీడా అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన యోగా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీనివాసా... శ్రీపురుషోత్తమా... ఫ వాడపల్లికి పోటెత్తిన భక్తజన సంద్రం ఫ ఒక్కరోజే రూ.60.16 లక్షల ఆదాయం కొత్తపేట: శ్రీనివాసా.. శ్రీపురుషోత్తమా.. శ్రీవేంకటేశా.. గోవిందా అంటూ వాడపల్లి క్షేత్రంలో భక్తులు తన్మయత్వం చెందారు. స్వామివారిని చూసిన భక్తజనం ఆనందంతో ఉప్పొంగింది.. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి క్షేత్రం శనివారం అశేష భక్తజనంతో కిక్కిరిసింది. రాష్ట్రం నలుమూలల నుంచీ భక్తులు వాడపల్లి బాట పట్టారు. దేవదాయ– ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంతశ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు ఉదయం సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజాదికాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. వేంకటేశ్వర సహిత ఐశ్వర్యలక్ష్మీ హోమం నిర్వహించారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు ఏడు ప్రదక్షిణలు చేశారు. కోరిన కోర్కెలు తీరిన అనేకమంది స్వామివారిని దర్శించుకునేందుకు కాలినడకన తరలివచ్చారు. వేలాది మంది భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. వేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో వేంచేసిన అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించారు. మాఢ వీధులు, ఆలయ ప్రాంగణంలో మజ్జిగ పంపిణీ చేశారు. వేలాది గా తరలివచ్చిన భక్తుల విశిష్ట దర్శనం, ప్రత్యేక దర్శనం, వేదాశీర్వచనం, ఆన్లైన్, నిత్య, శాశ్వత అన్నదానం విరాళాలు, లడ్డూ విక్రయం తదితర రూపాల్లో ఈ ఒక్కరోజు సాయంత్రం 4.30 గంటల వరకూ దేవస్థానానికి రూ.60.16 లక్షల ఆదాయం వచ్చిందని ఈఓ చక్రధరరావు తెలిపారు. ధర్మపథం కార్యక్రమంలో భాగంగా రాత్రి వివిధ ప్రాంతాలకు చెందిన నృత్య కళాకారుల బృందం కూచిపూడి నృత్య ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. -
ఆ ప్రోత్సాహం.. ఆమె ప్రగతికి దోహదం
కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామానికి చెందిన ఎస్బీఐ చీఫ్ అసోసియేట్ యానాల సాయికృష్ణ, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు అచ్చియ్యమ్మల ఏకై క కుమార్తె యానాల శుభశ్రీవల్లి ఆత్రేయి. చిరునవ్వుల ఈ చిన్నారికి చదువంటే ప్రాణం. ఆమె ఆసక్తిని గమనించిన నాన్న తగిన విధంగా ప్రోత్సహించారు. ఆత్రేయికి చిన్నతనంలో ఆశించిన మార్కులు వచ్చేవి కాదు. దీంతో నిరుత్సాహపడేది. తక్కువ మార్కులు వచ్చాయన్న విషయాన్ని నాన్న సాయికృష్ణ పెద్దగా పట్టించుకునేవారు కాదు. చదువును ప్రేమించే మనస్తత్వం తన చిన్నారికి ఉందా లేదా అన్నదే గమనించేవారు. నిరుత్సాహంతో ఉన్న ఆమెకు జీవితంలో ఒడిదొడుకులు ఎలా వస్తాయో, ఎలా ఎదుర్కోవాలో తెలియజెప్పేవారు. మార్కుల ఆధారంగా జీవితాన్ని తూకం వేసుకోవద్దని అనేవారు. లక్ష్యం కోసం చేసే ప్రయత్నం స్థాయిని మరింత పెంచుకోమని ప్రోత్సహించేవారు. మూడేళ్ల ఆయన మాటలు ఫలితంగా ప్రేరణ పొందిన ఆత్రేయి ఇక వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేని స్థాయిలో ముందుకు దూసుకుపోయింది. రోజూ చదువుకునే క్రమంలో శారీరక, మానసిక సమస్యలను అమ్మ అచ్చియ్యమ్మ తీర్చి లక్ష్యం వైపు అడుగులు వేసేందుకు తోడ్పాటునిచ్చారు. ఇటీవల విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఆత్రేయి 296వ ర్యాంక్ను సాధించింది. ఫిబ్రవరిలో విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో 99.98 స్కోర్తో ప్రతిభ కనబర్చింది. ఏపీఈపీసెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్లో 91వ ర్యాంక్ సాధించింది. ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ సీటు దక్కింది. అనంతరం సివిల్స్లో ఐఏఎస్ చదవాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు ఆత్రేయి తెలిపింది. -
శ్రీషిర్డీసాయి విజయకేతనం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): నీట్ ఫలితాల్లో శ్రీషిర్డీ సాయి జూనియర్ కళాశాల విద్యార్థులు వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఆ విద్యా సంస్థల డైరెక్టర్ టి.శ్రీవిద్య తెలిపారు. తమ దీకా్ష్య్ మెడికల్ అకాడమీలో శిక్షణ పొందుతున్న బి.సంజన ఆల్ ఇండియా 227వ ర్యాంకు, కె.పావన్ తనయ్ 308వ ర్యాంకును కై వసం చేసుకున్నారన్నారు. 2 వేల లోపు ర్యాంకులు ఐదుగురు, ఐదు వేల లోపు 8 మంది, పది వేల లోపు 15 మంది ర్యాంకులు సాధించినట్లు శ్రీవిద్య వివరించారు. విద్యా సంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ మాట్లాడుతూ హాజరైన మొత్తం విద్యార్థుల్లో 20 శాతం మంది ఎమ్బీబీఎస్ సీట్లు సాధించగలరన్నారు. ఏటా తమ విద్యార్థులు నీట్, జేఈఈ వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధిస్తున్నారంటూ హర్షం వ్యక్తం చేశారు. విజేతలైన విద్యార్థులను, అందుకు కృషి చేసిన అధ్యాపక బృందాన్ని చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, దీక్ష్యా అకాడమీ డీన్ పి.నరసింహారావు అభినందించారు. -
నాన్నా... నీ మనసే వెన్న
ఫాదర్స్ డే రోజునే ఉద్యోగంలోకి.. కపిలేశ్వరపురం మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన పాలచర్ల అమ్మిరాజు స్థానిక వ్యవసాయ సహకార సంఘంలో చిరుద్యోగి. తన భార్య సునీతతో కలసి తన ఇద్దరు పిల్లలను ప్రణాళికాబద్ధంగా చదివించారు. రోజూ న్యూస్ పేపర్లో ప్రచురితమైన విజయం సాధించిన వారి కథనాలను పిల్లలతో చదివించేవారు. అంచెలంచెలుగా పిల్లలు ఎదుగుతూ పెద్ద ప్యాకేజీలతో గూగుల్లో ఉద్యోగులయ్యారు. పెద్ద కుమారుడు శ్రీవినోద్ ఎంసెట్లో 289వ ర్యాంకు, గేట్లో 240వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. ఐఐటీ చైన్నెలో ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి, అక్కడే క్యాంపస్ ప్లేస్మెంట్లో సామ్సంగ్ రీసెర్చ్ బెంగళూరుకు ఎంపికై రెండేళ్లపాటు రూ.22 లక్షల ఏడాది ప్యాకేజీలో ఉద్యోగం చేశాడు. 2023 సెప్టెంబర్లో గూగుల్ సంస్థలో రూ.50 లక్షల ప్యాకేజీకి ఎంపికై ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు శ్రీసత్యనవీన్ జేఈ మెయిన్స్లో 1924వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. మ్యాథ్స్, ఫిజిక్స్లలో 100కి 100 మార్కులు రావడం అతని ప్రత్యేకత. మెయిన్స్ ఆధారంగా ఎన్ఐటీ వరంగల్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. అక్కడే క్యాంపస్ ప్లేసమెంట్లో గూగుల్కి ఎంపికై రూ. 44 లక్షల ఏడాది ప్యాకేజీకి ఎంపికయ్యాడు. తండ్రి ప్రోత్సాహంతో ఉన్నత స్థితికి చేరుకున్న శ్రీసత్యనవీన్ ఫాదర్స్ డే రోజునే గూగుల్లో ఉద్యోగంలో చేరుతుండటం విశేషం. తాము ఇలా స్థిరపడడానికి తన తండ్రి బాటలు వేశారని ఆ కుమారులు అంటున్నారు. ఫ నడిపించే దైవం ఆయనే ఫ కుటుంబానికి వెలుగునిచ్చే సారథి ఫ నేడు ఫాదర్స్ డే కపిలేశ్వరపురం/ బిక్కవోలు: వారధి లేకుండా నదిని దాటలేం... సారథి లేకుండా రథం నడపలేం.. ప్రతి కుటుంబానికి ఆ వారధి, సారథి నాన్నే. పిల్లలు తప్పటడుగులు వేసే వయసు నుంచి వారి వేలు పట్టుకుని నడక నేర్పి లోకాన్ని చూపే ప్రతి అడుగులోనూ నీడలా ఉండే దైవం నాన్న. అలాంటి నాన్న కన్నీటి కష్టాన్ని కనురెప్పల మాటున దాచుకుంటాడు. తాను చిరిగిన చొక్కా అయినా వేసుకోవడానికి ఇష్టం పడతాడు కానీ తన పిల్లలకు మంచి దుస్తులు కొని ఇవ్వాలని ఆరాటపడుతుంటాడు. గుండెల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేసి తన పిల్లలను ఉన్నత స్థాయికి చేర్చే త్యాగశీలుడు. మాట కాస్తా కటువుగా ఉన్నా మనసు వెన్నే.. శనివారం అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం సందర్భంగా, చిన్నారులు, నేటి యువతకు తమ తండ్రి పట్ల ఉండే అనుబంధం గురించి సాక్షి ప్రత్యేక కథనం ఇది. -
నీట్లో ఆదిత్య పభంజనం
బాలాజీచెరువు (కాకినాడ): నీట్–2025 ఫలితాల్లో 625/720 మార్కులతో వి.సాయి భవ్య హర్షిణి ఆలిండియా 227వ ర్యాంకును సాధించారని ఆదిత్య విద్యాసంస్థల సెక్రటరీ ఏకేన దీపక్రెడ్డి తెలిపారు. ఎన్టీఏ ప్రకటించిన నీట్ ఫలితాల్లో దగ్గుమాటి శ్రవణ్ కార్తికేయ ఆలిండియా 109వ ర్యాంకు, వీరంరెడ్డి సాయిభవ్య హర్షిణి ఆలిండియా 227వ ర్యాంకు, దంగేటి శ్రీనివాస రిషిత్ ఆలిండియా 890వ ర్యాంకులను సాధించారని అన్నారు. ఆలిండియా నీట్ ఫలితాల్లో 550 మార్కులు పైన 12 మంది విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించడంతో ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో శ్రీఆదిత్యశ్రీను అగ్రగామిగా నిలిచిందని ఆ విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా విజేతలను ఆదిత్య విద్యాసంస్థల సెక్రటరీ దీపక్రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. నీట్ లాంగ్టర్మ్ కోచింగ్కు అడ్మిషన్లు విశాఖపట్నం ఆదిత్య గంగరాజునగర్, మారికవలసలో ప్రారంభించారని తెలిపారు. ఆదిత్య విద్యాసంస్థల హాస్టల్ డైరెక్టర్ ఎ.లక్ష్మీరాజ్యం, డైరెక్టర్ శృతి, డైరెక్టర్ సుగుణ, ప్రిన్సిపాల్స్ జె.మొయిన, పి.సత్యనారాయణ రెడ్డి, కోఆర్డినేటర్ కె.లక్ష్మీకుమార్, అకడమిక్ డైరెక్టర్ ఎస్వీ రాఘవరెడ్డి, ఎస్పీ గంగిరెడ్డి, ఐఐటీ క్యాంపస్ వైస్ ప్రిన్సిపాల్ ఎం.ఫణీంద్ర, ఆదిత్య నిర్వహణలో గల ఇతర కేంద్రాల్లో ప్రిన్సిపాల్స్ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, ఉత్తమ శిక్షణ అందించిన అధ్యాపకవర్గాన్ని అభినందించారు. -
నీట్గా మెరిశారు
రాజమహేంద్రవరం రూరల్: వైద్య విద్యా కోర్సులలో ప్రవేశానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్ష నీట్లో జిల్లాకు చెందిన విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ఎంబీబీఎస్ చదివి అనంతరం న్యూరాలజీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ సర్జన్, స్కల్ సర్జన్ తదితర స్పెషలైజేషన్ అంశాల్లో పీజీ చేసి, వైద్యసేవలందిస్తామని ఈ సందర్భంగా పలువురు విజేతలు చెప్పారు. పేరు: డి.కార్తీక్రామ్ కిరీటి, రాజమహేంద్రవరం ర్యాంకు: 19 (ఓపెన్ కేటగిరీ), 18 (ఈడబ్ల్యూఎస్) తండ్రి: డాక్టర్ డీఎస్ అరుణ్ కుమార్, ఈఎన్టీ స్పెషలిస్ట్ తల్లి: లత, గృహిణి లక్ష్యం: కార్డియాలజిస్ట్, స్కల్ సర్జన్ ............................................................... పేరు: కె.ఈప్సిత్ కశ్యప్, రాజమహేంద్రవరం ర్యాంకు: 198 (ఓపెన్ కేటగిరీ),12 (ఈడబ్ల్యూఎస్) తండ్రి: సారథి కశ్యప్ (లేటు) తల్లి: గాయత్రి, టీచర్ లక్ష్యం: ఆర్థోపెడీషియన్, న్యూరోసర్జన్ పేరు: కేవీవీ నాగసాయి పవన్, రాజమహేంద్రవరం ర్యాంకు: 587 (ఓపెన్ కేటగిరీ), 154 (ఓబీసీ) తండ్రి: రామకృష్ణ, బిల్డర్ తల్లి: లక్ష్మీరూప, గృహిణి లక్ష్యం: జనరల్ సర్జన్, రేడియాలజిస్ట్ ............................................................... పేరు: టి.సాహితి, రాజమహేంద్రవరం ర్యాంకు: 1209 (ఓపెన్ కేటగిరీ), 32 (ఎస్సీ) తండ్రి: టీవీఆర్ రాజు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ తల్లి: నాగమణి, స్కూల్ అసిస్టెంట్ లక్ష్యం: కార్డియాలజిస్ట్ ............................................................... పేరు: ఎం.సూర్య సంతోష్రెడ్డి, పందలపాక ర్యాంకు: 1518 (ఓపెన్ కేటగిరీ), 880 (ఈడబ్ల్యూఎస్) తండ్రి: డాక్టర్ మల్లిడి కృష్ణారెడ్డి, వైద్యుడు తల్లి: సంధ్యాదేవి, కెమిస్ట్ లక్ష్యం: జనరల్ సర్జన్, గ్రామీణ ప్రజలకు వైద్యసేవలు -
మాకు మంచి స్నేహితుడు
నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నేనన్నా, మా తమ్మడు శ్రీను అన్నా నాన్నకు ఎంతో ఇష్టం. నాకు ఏమి కావాలన్నా నాన్న కొనిస్తారు. మా నాన్నా సప్పా సత్యనారాయణ మాకు మంచి స్నేహితుడు. మేము ఎప్పుడూ సరదాగా స్నేహితుడిలా ప్రతి విషయాన్ని చర్చించుకుంటాం. స్నేహితుడిలా ఉంటూ మా భవిష్యత్ సలహాలు అందించారు. –తండ్రి సత్యనారాయణతో సప్పా నాగేశ్వరరావు, కొంకుదురు ఎంతో ప్రేమగా చూస్తారు.. సాధారణంగా తల్లి దగ్గరకన్నా ఆడపిల్లలకు తండ్రి దగ్గరే చనువెక్కువగా ఉంటుందంటారు. నా విషయంలోనూ అది పూర్తిగా నిజమైంది. మా నాన్న గొలుగూరి నాగిరెడ్డి చిన్నప్పటి నుంచి నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. నాకు పెళ్లయి కూతురు ఉన్నప్పటికీ ఏ విషయమైనా మా నాన్నతోనే పంచుకుంటాను. –తండ్రి గొలుగూరి నాగిరెడ్డితో పడాల దేవి, పొలమూరు -
22న ద్విశత కవి సమ్మేళనం
సఖినేటిపల్లి: కాకినాడలో ఈ నెల 22న శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో గోదావరి కవితా పండగ కాన్సెఫ్ట్లో జాతీయ స్థాయి ద్విశత కవి సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు వేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ అన్నారు. శనివారం సఖినేటిపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ పీఆర్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించనున్న పై ద్విశత కవి సమ్మేళనంలో ఢిల్లీ, ఒడిశా, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి రెండు వందల మందికి పైగా కవులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇటీవల పర్యావరణంపై ప్లాస్టిక్ భూతం అనే అంశంపై నిర్వహించిన కవితా పోటీల్లో విజేతలకు బహుమతులు గోదావరి కవితా పండుగలో అందజేస్తామని కూడా ఆయన తెలిపారు. చెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి మామిడికుదురు: నగరం గ్రామంలోని తాడివారిమెరకకు చెందిన తాడి అశోక్కుమార్ (35) శుక్రవారం కొబ్బరి చెట్టుపై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా, మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేశామని నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ శనివారం తెలిపారు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. పెయింటర్గా పని చేసే అశోక్కుమార్ పిల్లలకు అనారోగ్యంగా ఉండడంతో బొండం కోసం చెట్టెక్కి పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడన్నారు. అశోక్కుమార్ మృతితో అతని భార్య నాగమణి, 15 ఏళ్ల కుమార్తె స్వప్న, 13 ఏళ్ల కుమారుడు సంతోష్ కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
మొదటి గురువులా..
ప్రతి ఒక్కరూ మంచి విలువలతో జీవించాలి. అలాంటి విలువలను మొదటి గురువులా చెప్పేది, నేర్పిందేది నాన్న మాత్రమే. మా నాన్న గొర్రిపోటి సత్యనారాయణ కష్టం గురించి తెలియకుండా పెంచారు. నేను నాన్న అయిన తరువాత మా నాన్న కష్టం నాకు తెలిసింది. మా అబ్బాయికి కూడా అదే విలువలు నేర్పిస్తున్నాను. తండ్రి ఒక్క రోజు ఉంటే సరిపోదు. ప్రతి రోజూ పిల్లల వెంట ఉండి సన్మార్గంలో నడిపించాలి. –తండ్రి సత్యనారాయణతో గొర్రిపోటి నాగేశ్వరరావు, పందలపాక ఆయనే కొండంత ధైర్యం ఏ సమస్య, కష్టం వచ్చినా నాన్న ఉన్నాడనే ధైర్యం ఉంటుంది. నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. నేను, మా తమ్ముడు మణికంఠ కమల్ ఉన్నత స్థాయి చేరుకోవాలని మా నాన్న బండారు రాము కలలుకంటున్నారు. మాకు కొద్దిగా నలతగా ఉంటే తట్టుకోలేరు. ఆరోగ్యం బాగయ్యే వరకూ ఎంతో తపిస్తారు. తప్పకుండా నాన్న కోరిక నెరవేర్చేందుకు నా వంతు శ్రమిస్తా. ఆయనే మాకు ఆదర్శం. –తండ్రి బండారు రాముతో సంధ్య అఖిలదేవి, మణికంఠ కమల్, కొప్పవరం -
తల్లికి వంచన
సాక్షి, రాజమహేంద్రవరం: తల్లికి వందనం పేరుతో కూటమి ప్రభుత్వం అర్హత ఉన్న అనేక కుటుంబాలకు ద్రోహం చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ పథకం కింద ఇంట్లో చదువుకునే ప్రతి విద్యార్థికీ ఎటువంటి నిబంధనలూ లేకుండా రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి పెద్దలు చెప్పారు. ‘నీకు రూ.15 వేలు.. నీకు రూ.15 వేలు’ అంటూ గొప్పగా ప్రచారం చేశారు. తీరా అమలు చేయాల్సి వచ్చేసరికి కూటమి సర్కారు అనేక నిబంధనలతో ఆంక్షలు పెట్టింది. దీనిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 1,88,226 మంది విద్యార్థులున్నారు. వీరిలో 1,23,779 మందిని అర్హులుగా గుర్తించి వారి తల్లుల ఖాతాల్లో రూ.240 కోట్లు జమ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. వారి లెక్కల ప్రకారమే 64,447 మందికి మొండిచేయి చూపారు. ఇదిలా ఉండగా జిల్లాలో సుమారు 2.80 లక్షల మంది విద్యార్థులున్నట్లు సమాచారం. దీనిని బట్టి చూస్తే ఎంత మంది విద్యార్థులు ఈ పథకానికి దూరమయ్యారో అర్థం చేసుకోవచ్చు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా 1.62 లక్షల మంది విద్యార్థులకు ఒక్క అమ్మ ఒడి పథకం ద్వారానే రూ.243 కోట్లు జమ చేసేవారు. ఇలా నాలుగేళ్ల పాటు నిరంతరాయంగా అందించారు. ఇది కాకుండా ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు జగనన్న విద్యా, వసతి దీవెనల పేరుతో ఫీజు రీయింబర్స్మెంట్ అందజేశారు. ఇవీ నిబంధనలు ● ఒకే ఇంట్లో ఫీజు రీయింబర్స్మెంట్ పొందితే ఆ ఇంట్లో ఇతరులకు తల్లికి వందనం డబ్బులు ఇవ్వరు. ● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఉపకార వేతనాలు పొందే వారికి ఈ పథకం వర్తించదు. ● బియ్యం కార్డు లేకపోతే పథకం రాదు. ● కుటుంబం నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు మించితే పథకం వర్తించదు. ● మాగాణి మూడెకరాలు, మెట్ట భూమి 10 ఎకరాలు మించకూడదు. ● పట్టణాల్లో వెయ్యి చదరపు అడుగుల స్థలం ఉన్నా, నాలుగు చక్రాల సొంత వాహనం ఉన్నా పథకం వర్తించదు. ● ప్రతి కుటుంబానికీ ఏడాది విద్యుత్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని నెలకు 300 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించి ఉంటే పథకం వర్తింపజేయరు. ● ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్ పొందుతున్న వారికి పథకం వర్తించదు. ఈ ఆంక్షలతో జిల్లాలో వేలాది మంది తల్లికి వందనం పథకానికి దూరమయ్యారు. వీరు కూడా దూరం సీబీఎస్ఈతో పాటు వివిధ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లు తల్లికి వందనం జాబితాలో కనుమరుగయ్యాయి. గత విద్యా సంవత్సరంలో టెన్త్, సీనియర్ ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఈ డబ్బులు ఇవ్వలేదు. టెన్త్ పూర్తి చేసిన విద్యార్థులు ప్రస్తుతం ఇంటర్, పాలిటెక్నిక్ వంటి కోర్సుల్లో చేరితేనే వారికి లబ్ధి కలుగుతుంది. సీనియర్ ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులను అనర్హుల్ని చేశారు. నాడు తప్పు.. నేడు ఒప్పా? ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో రూ.13 వేలు మాత్రమే జమ చేసింది. మిగిలిన రూ.2 వేలు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి మినహాయించినట్లు తెలిపింది. ఈ నిధులు జిల్లా కలెక్టర్ ఆధీనంలో ఉంచే విధంగా జీఓలో పేర్కొంది. ఇదే పని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేస్తే నాడు కూటమి నేతలు బురద జల్లారు. ఇలా చేయడం నాడు తప్పని చెప్పినప్పుడు ఇప్పుడు ఎలా ఒప్పవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.తల్లికి వందనం డబ్బులు రాని అంబేద్కర్ కుటుంబ సభ్యులు తల్లికి వందనం పథకానికి ని‘బంధనాలు’ ఆదాయం, విద్యుత్ వినియోగం పేరిట అనర్హత వేటు జిల్లాలో 64,447 వేల మంది పరిస్థితి అగమ్యగోచరం అర్హత ఉన్నా వేటు నిడదవోలు మండలానికి చెందిన వడల రత్నకుమారి, అంబేద్కర్ దంపతుల పిల్లలు రిషిత (8వ తరగతి), వెంకట్ రిషి (6వ తరగతి) ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ఈ కుటుంబం ఎస్సీ కేటగిరీ కింద విద్యుత్ వినియోగిస్తోంది. నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే ఎస్సీలకు ఉచిత విద్యు త్ నాలుగేళ్లుగా అమలవుతోంది. దీంతో, వీరు 300 యూనిట్ల విద్యుత్ బిల్లు వినియో గం ఆంక్షల పరిధిలోకి రారు. అయినప్పటికీ ఈ కుటుంబం 300 యూనిట్ల విద్యుత్ వాడినట్లు చూపించి, తల్లికి వందనం పథకానికి అనర్హులుగా పేర్కొన్నారు. దీంతో ఇద్దరు పిల్లలకూ నయాపైసా కూడా జమ కాలేదు. దీని పై ఆ కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు. ఈ కుటుంబమే కాదు.. జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. -
నేత్రపర్వం.. నృత్యాభినయం
● 9 గంటల పాటు పోటీ పడిన కళాకారులు ● కొనసాగుతున్న అంతర్జాతీయ సంగీత ఫెస్ట్ ● గోదారి తీరాన రికార్డుల జడి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వంద మయూరాలు పురి విప్పి ఒక్కచోట చేరి నర్తించినట్టు.. రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రం సంగీత నృత్యానంద లహరిలో ఓలలాడింది. సప్త స్వరాల సమ్మేళనంతో వీనుల విందైన గళ మాధుర్యం.. అద్భుత ఆహార్యంతో చూపులు తిప్పుకోలేనంత నేత్రపర్వంగా సాగిన కళాకారుల లాస్య విన్యాసం.. ప్రేక్షకులను, కళాభిమానులను మంత్రముగ్ధుల్ని చేసింది. అంతర్జాతీయ సంగీత ఫెస్ట్–2025లో భాగంగా శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం ఆధ్వర్యాన రెండో రోజు కళాసమ్మేళన్ వైభవంగా కొనసాగింది. నెమలిక నేర్పిన నడకలివీ అన్నట్టుగా.. నృత్య కళాకారులు.. సుస్వర గాత్రంతో గాయకులు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు. ఈ సంగీత, నృత్య సంగ్రామంలో ఇరువురూ సమ ఉజ్జీలుగా నిలిచి ప్రేక్షకుల మనసుల్ని దోచారు. 9 గంటల 9 నిమిషాల 9 సెకన్లు గురువాష్టకంతో పాటు మీనాక్షీ పంచరత్నంలోని శ్లోకాలకు తొమ్మిది మంది గాత్రదానం చేశారు. వారి స్వరాలాపనకు అనుగుణంగా 125 మంది నృత్యకారిణులు పదజతులు కలిపారు. మొత్తం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల తొమ్మిది సెకన్ల పాటు నిర్విరామంగా సాగిన ఈ అపూర్వ సంగీత, నృత్య సమ్మేళనం అనేక ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ పినాకిల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ దక్కించుకుంది. మరికొన్ని రికార్డులు కూడా పరిశీలనలో ఉన్నాయి. రెండో రోజు కళా సమ్మేళన్ను విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి ఉదయం ప్రారంభించారు. తొలుత అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికుల ఆత్మశాంతికి కళాకారులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. సాయంత్రం రుక్మిణీ కల్యాణం నృత్య రూపకం అనంతరం కేరళ సంప్రదాయ నృత్యం మోహినీ అట్టంను చిన్నారులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న కళాకారులకు గుంటూరు తాళ్లపాలెంలోని శ్రీ శివక్షేత్రం పీఠాధిపతులు శివస్వామీజీ సర్టిఫికెట్లు, మెడల్స్ అందించారు. సెట్రాజ్ సీఈఓ కాశీ విశ్వనాథ్, రోషన్ గుప్తా, చందన్ చౌబే, కుషాల్ భట్టాచార్య (కోల్కతా), కృష్ణభగవాన్, పోతిన శ్రీనివాస్ తదితరులను సత్కరించారు. -
ఘనంగా చండీ హోమం
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీ హోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పండితులు చండీ హోమం ప్రారంభించారు. పూర్ణాహుతి అనంతరం అమ్మవారికి వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ప్రసాదాలు నివేదించారు. తరువాత వాటిని భక్తులకు పంపిణీ చేశారు. చండీహోమంలో 30 మంది భక్తులు రూ.750 టికెట్టుతో పాల్గొన్నారు. వేద పండితులు వేదుల సూర్యనారాయణ, వనదుర్గ ఆలయ అర్చకుడు కోట వంశీ, పరిచారకుడు వేణు, వ్రత పురోహితులు చెల్లపిళ్ల ప్రసాద్, కూచుమంచి ప్రసాద్ తదితరులు హోమం నిర్వహించారు. ప్రధానాలయంలో సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి ఆధ్వర్యాన, తొలి పావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారికి అర్చకుడు చిట్టెం హరగోపాల్ ఆధ్వర్యాన పండితులు కుంకుమ పూజలు నిర్వహించారు. వాడపల్లి వెంకన్న అన్నదాన భవనానికి విరాళాలు కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో వకుళమాత అన్నప్రసాద భవనం నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా అమలాపురానికి చెందిన వరదా శశికుమార్, సూర్య నాగ వెంకట అమృత దంపతులు రూ.1,01,116, విజయవాడకు చెందిన పచ్చిపులుసు రామకృష్ణ, లీలా శ్రీనిర్మలాకుమారి దంపతులు రూ.51,116, కాకినాడ రూరల్ కరప గ్రామానికి చెందిన గొర్రెల సాయి వెంకట వంశీ, వారి కుటుంబ సభ్యులు రూ 50,116 చొప్పున విరాళాలుగా సమర్పించారు. వారికి స్వామివారి చిత్రపటాన్ని ఈఓ నల్లం సూర్యచక్రధరరావు, సిబ్బంది అందజేశారు. -
పోతవరంలో నేడు గంగానమ్మ జాతర
దేవరపల్లి: నల్లజర్ల మండలం పోతవరం గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి జాతర శనివారం నిర్వహిస్తున్నారు. గత నెల 29న ప్రారంభమైన ఈ మహోత్సవాలు ఆదివారం నైవేద్యాలతో ముగుస్తాయి. సుమారు 39 ఏళ్ల తర్వాత జరుగుతున్న అమ్మవారి జాతరకు గ్రామస్తులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే బంధువులు, ఆడపడుచులతో గ్రామం సందడిగా మారింది. విద్యుద్దీప కాంతులతో గ్రామం కొత్త కాంతులు అద్దుకుంది. గ్రామ ప్రధాన రహదారి, కూడళ్లలో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో మహిళలు అమ్మవారి కలశాలతో గ్రామోత్సవం నిర్వహించి, గంగానమ్మ తల్లికి మంగళ స్నానం చేయించారు. అమ్మవారికి పూజలు నిర్వహించారు. శనివారం రాత్రి బలిచేట కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఖైదీలకు ఉచిత న్యాయ సహాయంకంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి శుక్రవారం మహిళా జైలును సందర్శించారు. ఆహార ప్రమాణాలు, ఇతర సదుపాయాలను పరిశీలించారు. మహిళా ఖైదీలతో మాట్లాడారు. వారి తరఫున ఉచితంగా వాదించేందుకు, బెయిల్ పిటిషన్లపై కోర్టులో అప్పీలు వేయాలన్నా, న్యాయవాదులు కావాలన్నా, మరే ఇతర న్యాయ సహాయం కావాలన్నా డీఎల్ఎస్ఏ సహకరిస్తుందని తెలిపారు. న్యాయ సహాయం అవసరమైన వారు సంస్థ నియమించిన పారా లీగల్ వలంటీర్ల ద్వారా అర్జీలు అందించాలని సూచించారు. యోగాంధ్ర మాక్ డ్రిల్ విజయవంతం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు అన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యాన స్థానిక ఏకేసీ కాలేజీ వద్ద హ్యాపీ స్ట్రీట్లో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జేసీ, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, ఆశా వర్కర్లు సుమారు 1,500 మంది యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా చిన్నరాముడు మాట్లాడుతూ, ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో మరింత మంది పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. 20న హుండీల లెక్కింపు సఖినేటిపల్లి: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానంలో ఈ నెల 20వ తేదీన హుండీల ఆదాయం లెక్కించనున్నారు. దీనికి ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ యంకేటీఎన్వీ ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎండోమెంట్స్ అధికారుల సమక్షంలో ఆలయ ప్రధాన హుండీలతో పాటు, గుర్రాలక్క అమ్మవారి ఆలయ హుండీని ఆ రోజు తెరిచి, ఆదాయం లెక్కింపు చేపడతామన్నారు. 22న శాంతి కల్యాణం జ్యేష్ఠ బహుళ ద్వాదశి సందర్భంగా ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు లక్ష్మీనరసింహస్వామి వారి శాంతి కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ తెలిపారు. ఇందులో పాల్గొనదలచిన భక్తులు దేవస్థానం వెబ్సైట్ ద్వారాను, ఆలయం వద్ద గల కౌంటర్లో ముందస్తుగా కల్యాణం టికెట్లు తీసుకోవచ్చునని ఆయన పేర్కొన్నారు. -
కోనసీమలో పెట్రో ఎనర్జీ యూనివర్సిటీ నెలకొల్పాలి
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు డిమాండ్ అమలాపురం టౌన్: చమురు, సహజ వాయు వనరులు అధికంగా ఉన్న కోనసీమలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రో ఎనర్జీ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు డిమాండ్ చేశారు. అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. పదేళ్ల కిందట పెట్రో ఎనర్జీ యూనివర్సిటీ కోసం అనకాపల్లి జిల్లాలో 200 ఎకరాల స్థల సేకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రూ.వెయ్యి కోట్లతో నెలకొల్పనున్న ఈ యూనివర్సిటీని రాష్ట్రంలో స్థాపించేందుకు సన్నాహాలు జరుగుతుండగా అది ఉత్తరప్రదేశ్కు తరలిపోయిందని తెలిపారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంతో ఈ యూనివర్సిటీ రాష్ట్రానికి రాకుండా పోయిందని, ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి కోనసీమలో స్థాపించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేజీ బేసిన్ పరిధిలో పలు చమురు సంస్థలు 49 ఏళ్లుగా రూ.వేల కోట్ల విలువైన సంపదను, ఆదాయాన్ని దోచుకుపోతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక ప్రజలకు న్యాయబద్ధమైన రాయల్టీ ఇవ్వకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) పేరుతో అరకొర నిధులు ఇస్తున్నాయని ఆరోపించారు. ఇటీవల కాలంలో గౌరవ ఉన్నత న్యాయస్థానాలు కూడా కేజీ బేసిన్కు తగిన రాయల్టీ ఇవ్వాలని ఆదేశించిన విషయాన్ని ఎమ్మెల్సీ గుర్తు చేశారు. చైన్నెలో ఉన్న చమురు, సహజ వాయువుల రీజినల్ ఎంప్లాయిమెంట్ కార్యాలయాన్ని కోనసీమ జిల్లాకు తరలించాలని డిమాండ్ చేశారు. విశాఖలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీని స్థాపించాలని, గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, లీగల్ సెల్ మాజీ అధ్యక్షుడు కుడుపూడి త్రినాథ్ పాల్గొన్నారు. -
ఏదీ.. అనుగృహం!
● కూటమి ఏడాది పాలనలో ముందుకు కదలని గృహ నిర్మాణం ● పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం ఇస్తామని ఎన్నికల్లో హామీలు ● ఏడాదైనా నెరవేరని వాగ్దానం ● జగనన్న కాలనీలపై నిర్లక్ష్యం నిడదవోలు మండలం సమిశ్రగూడెంలో నిర్మాణంలో ఉన్న ఇళ్లు (ఫైల్) సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వ హయాంలో పేదల సొంతింటి కల నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. గృహ నిర్మాణానికి లక్ష్యాలు నిర్దేశించిన ప్రభుత్వం.. వాటి సాధన దిశగా మాత్రం అడుగులు వేయడం లేదు. ‘మన ఇల్లు.. మన గౌరవం’ పేరుతో అవగాహన సదస్సులు పెడుతూ కొద్ది రోజులు హంగామా చేసిన ప్రభుత్వం ప్రస్తుతం వాటి గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గృహ నిర్మాణాలపై అంతులేని నిర్లక్ష్యం చోటు చేసుకుంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా.. 6,087 ఇళ్లు మాత్రమే నిర్మించారు. అది కూడా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైనవే ఎక్కువ శాతం కావడం గమనార్హం. రాజానగరంలో 183, రాజమహేంద్రవరం అర్బన్లో 2,382, కొవ్వూరు అర్బన్లో 214 ఇళ్లు పూర్తయినట్లు సమాచారం. మిగిలిన మండలాల్లో పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. ఏడాది 10,749 గృహాలు లక్ష్యం ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం ఇళ్ల నిర్మాణాలపై గతంలో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. అధికార యంత్రాంగం ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించింది. ఈ మేరకు హౌసింగ్, ప్రత్యేక అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టి, ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు కృషి చేయాలి. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వంద రోజుల ప్రణాళికలో భాగంగా గత ఏడాది డిసెంబర్ నెలాఖరుకు 4,875 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా 331 మాత్రమే పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో 10,749 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకూ 6,087 మాత్రమే పూర్తి చేశారు. మిగిలిన వాటి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అడ్రస్ లేని 2.0 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 2.0 అమలు చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమలు చేస్తున్న వాటి కంటే ఎక్కువగా లబ్ధి చేకూరుస్తామని చెప్పారు. పట్టణాల్లో రెండు, గ్రామాల్లో మూడు సెంట్ల చొప్పున పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. గృహ నిర్మాణానికి నిధులు సైతం పెంచుతామన్నారు. కానీ, ఇప్పటి వరకూ ఈ హామీలేవీ అమలుకు నోచుకోలేదు. దీనిపై కూటమి నేతలు నోరు మెదపడం లేదు. గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలంటే ఇంజినీరింగ్ అసిస్టెంట్ల పాత్ర కీలకం. ఇందులో భాగంగానే గత ప్రభుత్వం వారికి అత్యంత ప్రాధాన్యం కల్పించింది. లే అవుట్లలో పర్యటించడం, లబ్ధిదారులతో పనుల పర్యవేక్షణ, బిల్లుల చెల్లింపునకు వెబ్సైట్లో గృహాల పురోగతి నమోదు చేయడం వంటి పనులు వీరి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, హౌసింగ్ అధికారులు, ప్రత్యేక అధికారులు సమన్వయంతో కృషి చేస్తేనే కానీ ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలు సాకారం కావు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఇంజినీరింగ్ అసిస్టెంట్లను ప్రభుత్వం మొక్కుబడి సమావేశాలకు మాత్రమే పరిమితం చేస్తూండటంపై లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పీఎంఏవైపై గందరగోళం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద పేదలు నిర్మించుకుంటున్న ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం రూ.1.80 లక్షల ఆర్థిక సహాయం అందిస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లకు వచ్చే ఏడాది మార్చి తర్వాత కేంద్రం ఒక్క పైసా కూడా ఇవ్వదు. జిల్లా అధికార యంత్రాంగానికి పంపిన ఆదేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం స్పష్టంగా పేర్కొంది. అయినప్పటికీ నిధులను సద్వినియోగం చేసుకునేలా హౌసింగ్ అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పించడం లేదు. దీంతో ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. మండలాల వారీగా గృహ నిర్మాణాల లక్ష్యం, సాధించిన వివరాలు మండలం గృహ సాధించింది నిర్మాణ లక్ష్యం అనపర్తి 1,210 161 బిక్కవోలు 999 202 గోకవరం 178 133 కడియం 262 109 కోరుకొండ 239 168 రాజమహేంద్రవరం రూరల్ 251 108 రాజానగరం 214 183 రంగంపేట 158 128 సీతానగరం 145 89 చాగల్లు 203 135 దేవరపల్లి 742 483 గోపాలపురం 587 347 నల్లజర్ల 511 407 నిడదవోలు 305 218 తాళ్లపూడి 343 151 ఉండ్రాజవరం 187 125 నిడదవోలు అర్బన్ 285 214 వైఎస్సార్ సీపీ పాలనలో... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ‘నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా జిల్లావ్యాప్తంగా 431 లే అవుట్లలో 65,075 ఇళ్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాల్లో 47,053 ఇళ్లు, ప్రైవేటు స్థలాల్లో 18,022 ఇళ్ల నిర్మాణాలకు నాంది పలికారు. ఇళ్ల నిర్మాణం యుద్ధప్రాతిపదికన ప్రారంభమైంది. నిరంతరాయంగా సాగింది. సకాలంలో బిల్లులు రావడంతో లబ్ధిదారులు త్వరితగతిన పనులు చేపట్టారు. ఇప్పటి వరకూ 25,316 ఇళ్లు అన్ని హంగులతో పూర్తయ్యాయి. గృహ ప్రవేశాలు సైతం జరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మిగిలిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. -
పారిశుధ్య నిర్వహణకు రీ టెండర్లు
● దేవదాయ శాఖ నోటిఫికేషన్ ● దాఖలుకు 26 వరకూ గడువు ● వచ్చే నెల మొదటి వారంలో ఖరారయ్యే చాన్స్ అన్నవరం: సత్యదేవుని సన్నిధి సహా రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో పారిశుధ్య నిర్వహణకు దేవదాయ శాఖ సెంట్రలైజ్డ్ ఈ–ప్రొక్యూర్ రీ టెండర్ నోటిఫికేషన్ను శుక్రవారం విడుదల చేసింది. శానిటరీ మెటీరియల్ సహా పారిశుధ్య పనులు, వివిధ సత్రాల్లో హౌస్ కీపింగ్, రోడ్లు, టాయిలెట్స్ క్లీనింగ్, ఫెసిలిటీ మేనేజ్మెంట్, ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణాల నిర్వహణ తదితర పనుల నిర్వహణకు ఈ టెండర్ పిలిచారు. గత ఏప్రిల్లో పిలిచిన టెండర్ నోటిఫికేషన్పై టెండర్దారులు అనేక సందేహాలు వ్యక్తం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం దానిని రద్దు చేసింది. కొన్ని మార్పులతో తాజాగా కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. కొటేషన్ల దాఖలుకు జూన్ 26 చివరి తేదీగా నిర్ణయించారు. అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే నెల మొదటి వారంలో టెండర్లు ఖరారు చేస్తారు. కాంట్రాక్ట్ దక్కించుకున్న సంస్థ అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గ గుడి, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో రెండేళ్ల కాలపరిమితితో ఆగస్టు 1 నుంచి పారిశుధ్య పనులు ప్రారంభిస్తుంది. నెలల తరబడి జాప్యం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏ దేవస్థానానికి ఆ దేవస్థానంలో శానిటేషన్ టెండర్లు పిలిచి ఖరారు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని ప్రముఖ దేవస్థానాలకు ఒకే టెండర్ పిలవాలని గత ఏడాది ఆగస్టు 27న నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ, దీని అమలులో దాదాపు పది నెలలు ఆలస్యం చేశారు. గత ఏడాది నవంబర్ వరకూ అన్నవరం దేవస్థానంలో హైదరాబాద్కు చెందిన కేఎల్టీఎస్ సంస్ధ శానిటేషన్ విధులు నిర్వహించేది. ఆ సంస్థ కాంట్రాక్ట్ గత నవంబరుతో ముగిసింది. ఆ గడువుకు నెల రోజులు ముందే గత అక్టోబర్లో టెండర్ ప్రకటన విడుదల కావాల్సి ఉంది. అయితే, టెండర్లు పిలవడం ఆలస్యమవడంతో దేవస్థానం కోరిక మేరకు గత ఫిబ్రవరి నెలాఖరు వరకూ ఆ సంస్ధ సిబ్బంది విధులు నిర్వహించారు. మార్చి 1 నుంచి ఎటువంటి టెండరూ పిలవకుండా గుంటూరుకు చెందిన కనకదుర్గా శానిటరీ సర్వీసెస్కు తాత్కాలికంగా అప్పగించారు. శానిటరీ మెటీరియల్ మాత్రం దేవస్థానమే అందిస్తోంది. రూ.80 లక్షలకు పెరిగే అవకాశం దేవస్థానంలో గతంలో పారిశుధ్య పనులు నిర్వహించిన కేఎల్టీఎస్ సంస్ధకు నెలకు రూ.49 లక్షలకు టెండర్ ఖరారైంది. అనంతరం తాత్కాలిక వచ్చిన కనకదుర్గా ఏజెన్సీకి నెలకు రూ.59 లక్షలు జీతాలు, మరో రూ.12 లక్షలు మెటీరియల్కు కలిపి మొత్తం రూ.71 లక్షలు చెల్లిస్తున్నారు. తాజాగా అన్ని దేవస్థానాలకు కలిపి పిలిచిన సెంట్రలైజ్డ్ టెండర్లో పారిశుధ్య పనుల్లో అత్యాధునిక యంత్రాలు ఉపయోగించాలనే షరతు విధించారు. అలాగే, శానిటరీ సిబ్బందికి లేబర్ యాక్ట్ ప్రకారం జీతాలు చెల్లించాలని, వారాంతపు సెలవుల్లో సిబ్బంది రిలీవర్లుగా మరి కొంత మందిని నియమించాలని షరతు పెట్టారు. అలాగే, ఏసీలు, విద్యుత్ ఉపకరణాల నిర్వహణ కూడా కలిపారు. ఇవన్నీ కలిపితే అన్నవరం దేవస్థానంలో నెలకు రూ.80 లక్షల వరకూ ఆయా సంస్ధలు కోట్ చేసే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. -
ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న బీఎస్ఎఫ్ ఆర్ఎస్సైకి సన్మానం
కాకినాడ రూరల్: ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న బీఎస్ఎఫ్ ఆర్ఎస్సై ఆర్.దేవానందంను కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ ఎం.నాగేంద్రరావు, సిబ్బందితో కలిసి సన్మానించారు. ఏపీఎస్పీలో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న దేవానందం అల్లుడి ఇంటికి రావడంతో విషయం తెలుసుకున్న కమాండెంట్ నాగేంద్రరావు పిలిపించి సన్మించారు. దేశానికి సేవ చసిన మహనీయుడిని సత్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు. బీఎస్ఎఫ్ ఆర్ఎస్సై దేవానందం మాట్లాడుతూ బీఎస్ఎఫ్లో 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నానని, ఆపరేషన్ సిందూర్లో తన వంతు పాత్ర పోషించినందుకు గర్వంగా ఉందన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ ఎస్.దేవానందరావు, అసిస్టెంట్ కమాండెంట్స్ మోహన్రావు, చంద్రశేఖరరావు, రాము పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై ఆటోను ఢీకొన్న లారీ
● 11 మందికి తీవ్ర గాయాలు ● రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు దేవరపల్లి: జాతీయ రహదారిపై గుండుగొలను–కొవ్వూరు మధ్య శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం రాజమహేంద్రవరంలోని సీతంపేటకు చెందిన 11 మంది ఆటోలో శుక్రవారం తెల్లవారు జామున విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం కోసం బయలుదేరారు. దేవరపల్లి మండలం కృష్ణంపాలెం వద్ద ముందు వెళుతున్న ఆటోను వెనుక నుంచి వస్తున్న లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆటోలోని 11 మంది తీవ్రంగా గాయపడగా, హైవే అంబులెన్స్లో గోపాలపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడ నుంచి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. క్షతగాత్రుల వివరాలు తెలియవలసి ఉంది. గాయపడిన వారిలో పలువురు మహిళలు ఉన్నారు. -
సముద్రంలో గల్లంతైన బాలుడి మృతి
కాకినాడ రూరల్: కాకినాడ – ఉప్పాడ బీచ్ రోడ్డులో రూరల్ మండల పరిధిలో నేమాం రాళ్ల బీచ్ వద్ద గురువారం సాయంత్రం స్థానం కోసం దిగి గల్లంతైన జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన బాలుడు సముద్రాల పార్దు(17) మృతి చెందాడు. తిమ్మాపురం పోలీసుల వివరాలు ప్రకారం పార్ధు, అతని స్నేహితులు నిడదవోలుకు చెందిన నారపురెడ్డి దుర్గాప్రసాద్, జంగారెడ్డిగూడెం మండలం ఎ.పోలవరం మండలానికి చెందిన కేతామోహన్ కలిసి బైక్పై గురువారం సాయంత్రం కాకినాడ బీచ్కు వచ్చారు. స్టోన్ బీచ్ వద్ద సాయంత్రం 4.30గంటల సమయంలో పార్ధు, దుర్గా ప్రసాద్ స్నానం చేస్తుండగా మోహన్ ఫొటోలు తీశాడు. ఆ సమయంలో పార్థు బలమైన అలలకు కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. దుర్గాప్రసాద్ ఫిర్యాదు మేరకు తిమ్మాపురం పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టగా శుక్రవారం ఉదయం 11గంటలకు ఘటన స్థలం సమీపంలోనే బాలుడి మృతదేహం లభ్యమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై గణేష్కుమార్ తెలిపారు. -
రక్తం పంచి..ఆయువు పెంచి..
● ఆపదలో ఆదుకుంటున్న పలువురు ● నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం రాయవరం: రక్తదానం మహోన్నతం. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తదానం చేసి ఆదుకున్న వారు ప్రాణ బంధువులే. ఏ బంధం లేకున్నా మానవీయ కోణంలో స్పందించే తీరు ఐక్యతను చాటుతుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారికి, శస్త్ర చికిత్స అవసరమైన వారికి రక్తదానం చేసి ఆదుకున్న వారు ఆప్తులకు మించిన వారుగా చెప్పవచ్చు. రక్తం అవసరం ఉందనే విషయం వాట్సాప్, వివిధ రకాల సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని యువత స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. జూన్ 14న ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. అన్ని దానాల్లోకెల్లా మిన్న అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని అంటారు. కాని నేడు అదే మాటను అన్ని దానాల్లోకల్లా రక్తదానం మిన్న అని చెప్పుకోవాల్సి వస్తుంది. అన్నదానం చేస్తే ఒక్క పూట కడుపు నిండుతుంది. కాని రక్తదానం చేస్తే..ఒక ప్రాణం నిలబడుతుంది. ఒకప్పుడు రక్తదానం చేస్తే నీరసించి పోతారని, పాడైపోతారనే అపోహలు ప్రజల్లో ఉండేవి. శాస్త్ర, సాంకేతిక రంగాలు ఎంతగా అభివృద్ధి చెందినా కృత్రిమ రక్తాన్ని తయారు చేయలేక పోయారు. రక్తాన్ని కేవలం దానం చేయడం ద్వారా మాత్రమే సేకరించగలుగుతున్నారు. రక్తం అందుబాటులో లేక పలువురు ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటున్నారు. రక్తం లభ్యమైన సందర్భాల్లో కొందరు ప్రాణాపాయం నుంచి బయట పడిన సందర్భాలు ఉన్నాయి. రక్తదాతలలకు అవగాహన మరింత కల్పించాల్సిన అవసరం ఉంది. రక్తదానంపై ఎటువంటి అపోహలు పెట్టుకోరాదు. మన శరీరంలో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది. రక్తదాన సమయంలో కేవలం 350మిల్లీలీటర్ల రక్తాన్ని మాత్రమే తీసుకుంటారు. అందువల్ల ఎటువంటి హాని కలగదు. రక్తదానం చేస్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయన్నది కేవలం అపోహ మాత్రమే. రక్తదానానికి ఒక గంట సమయం మాత్రమే పడుతుంది. రక్తదానం చేస్తే హిమోగ్లోబిన్ శాతం పడిపోతుందనేది కూడా అపోహే అంటున్నారు వైద్యులు. రక్తదానానికి అర్హతలు ● 18 నుంచి 60 ఏళ్ల లోపు సీ్త్ర, పురుషులు ఎవరైనా రక్తాన్ని దానం చేయవచ్చు. ● మూడు నెలల వ్యవధితో రక్తదానం చేయవచ్చు. ● రక్తదానం చేయడానికి 12గంటల ముందు తర్వాత ఆల్కహాల్ తీసుకోరాదు. ● రక్తదానం చేసే వారు 45 కేజీల పైబడి బరువును కలిగి ఉండాలి. ● సీ్త్రలు రుతుక్రమం సమయంలో, గర్భం ధరించినప్పటి నుంచి బిడ్డకు పాలివ్వడం ఆపేంత వరకు రక్తదానం చేయరాదు. ● రక్తంలో హిమోగ్లోబిన్ కనీసం 12.5 గ్రాములకు తక్కువ కాకుండా ఉండాలి. రక్తంలో ఏం ఉంటాయి? రక్తంలో 55శాతం ప్లాస్మా, 45శాతం సెల్స్ ఉంటాయి. ప్లాస్మాలో 91శాతం నీరు, 8శాతం ఆర్గానిక్ మాలిక్యూల్స్, ఒక శాతం ఇనర్గానిక్ మాలిక్యూల్స్ ఉంటాయి. సెల్స్లో తెల్ల రక్తకణాలు, ఎర్ర రక్తకణాలు, ప్లేట్లెట్స్ ఉంటాయి. ఒక మైక్రో లీటరు రక్తంలో 5.6 మిలియన్ల ఎర్ర రక్తకణాలు ఉంటాయి. ఒక మైక్రో లీటరు రక్తంలో 11వేల వరకు తెల్ల రక్తకణాలు ఉంటాయి. ఇవి ఆక్సిజన్ సరఫరాకు తోడ్పడతాయి. తెల్ల రక్తకణాలు శరీరంలో ఉండి రోగకారక క్రిములపై దాడి చేసి రక్షణ కల్పిస్తాయి. 1.5 నుంచి 4.5 లక్షల ప్లేట్లెట్స్ కణాలు రక్తం గడ్డకట్టడానికి సహకరిస్తాయి. జిల్లాలో పరిస్థితి ఇదీ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం, రాజోలులో బ్లడ్ బ్యాంకులున్నాయి. కొత్తపేట, పి.గన్నవరం, మండపేట, ఆలమూరు, కపిలేశ్వరపురం, ముమ్మిడివరం, అల్లవరం, టి.కొత్తపల్లి పీహెచ్సీల్లో బ్లడ్ స్టోరేజ్ సెంటర్లు ఉన్నాయి. ఏడాదికి వలంటీర్ బ్లడ్ డోనర్స్ నుంచి 18వేల యూనిట్ల రక్తాన్ని జిల్లావ్యాప్తంగా సేకరిస్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మే 31 వరకు 1,093 ప్రసవాలు జరగ్గా 706 సిజేరియన్స్ నిర్వహించారు. వందల సఖ్యంలో మేజర్, మైనర్ శస్త్ర చికిత్సలు చేశారు. ప్రసవాలు, ప్రమాదాలు, అత్యవసర శస్త్ర చికిత్సలు సమయంలో రక్తాన్ని వినియోగిస్తున్నారు. అరుదైన బ్లడ్ గ్రూప్ల డోనర్స్ వివరాలను జిల్లా రక్తనిధి కేంద్రం సిబ్బంది సేకరించి, ఆ వివరాలను రిజిస్టర్లో నమోదు చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో వీరి ద్వారా రక్తాన్ని సేకరిస్తున్నారు. జిల్లాలో రక్త కొరత లేదని డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఫర్ హాస్పిటల్ సర్వీసెస్ డాక్టర్ కె.కార్తీక్ తెలిపారు. కళాశాలల్లో విద్యార్థులు, పోలీసు సిబ్బంది, రాజకీయ సంస్థలకు చెందినవారికి రక్తదానంపై అవగాహన కల్పిస్తున్నారు. 23 ఏళ్లుగా రక్తదానం చేస్తున్నా.. 2002 నుంచి రక్తదానం చేస్తూ ఇతరులను ప్రోత్సహిస్తున్నాను. ప్రస్తుతం తూర్పుగోదావరి వలంటరీ బ్లడ్ అండ్ ఐ డోనర్స్ క్లబ్ పేరుతో రక్తదానం చేస్తున్నాం. ఈ క్లబ్లో రోజువారీ కూలీలతో పాటు ఆటోడ్రైవర్లు, పలు వృత్తుల్లో కొనసాగుతున్న 1,500 మంది సభ్యులుగా ఉన్నారు. మా సంస్థ ద్వారా ఇప్పటి వరకు 38 బ్లడ్ క్యాంపుల ద్వారా రక్తాన్ని సేకరించి, రోటరీ, రెడ్క్రాస్ వంటి సంస్థలకు అందజేశాం. – వెలగల ఫణికష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా వలంటరీ బ్లడ్అండ్ఐ బ్యాంక్ చైర్మన్, రాయవరం ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని ప్రోత్సహించడం వలన ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడినవారవుతారు. ప్రతి నెలా స్వచ్ఛంధ సంస్థల నుంచి, దాతల నుంచి రక్తాన్ని సేకరించి భద్రపరుస్తాం. అత్యవసర సమయాల్లో అవసరమైన వారికి అందిస్తున్నాం. – డాక్టర్ పి.అన్నపూర్ణ, సివిల్ అసిస్టెంట్ సర్జన్ (పెథాలజీ), ఏరియా ఆస్పత్రి, అమలాపురం అరుదైన బ్లడ్ గ్రూపులు కొందరు అరుదైన బ్లడ్ గ్రూపులు కలిగి ఉంటారు. అటువంటి వారికి రక్తం అవసరమైన సందర్భంలో అదే గ్రూపు రక్తం ఇవ్వాల్సి ఉంటుంది. ఏ, ఏబీ, బీ, ఓ నెగిటివ్ గ్రూపులు అరుదైన గ్రూపులు. ఇటువంటి గ్రూపులకు చెందిన వ్యక్తులు ప్రమాదాలకు గురైనప్పుడు అరుదైన బ్లడ్ గ్రూపుల వారి నుంచి సేకరించిన రక్తాన్నే అందజేయాల్సి ఉంటుంది. అనర్హులు ఎవరంటే... సాధారణంగా రక్తదానం శ్వాసకోశ వ్యాధులున్న వారు, క్యాన్సర్, గుండెజబ్బులు, బరువు తగ్గడం, డయాబెటిక్, హెపటైటిస్, ఆస్తమా, ఎపిలెప్సీ, కాలేయ వ్యాధులు, ఎండోక్రైన్ సమస్యలు, ఎయిడ్స్ లక్షణాలు కలిగిన వారు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు రక్తదానం చేయరాదు. మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాధులకు చికిత్స పొందిన వారు శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారు, రక్తదానం పొందినవారు కనీసం ఏడాది వరకు రక్తదానం చేయడానికి వీలులేదు. దగ్గు, జలుబు, జ్వరం వంటి అస్వస్థత కలిగిన వారు, ఏదైనా చికిత్సలో భాగంగా మందులు వాడుతున్న వారు ఆ విషయాల్ని వైద్యులకు చెబితే వారు ఎప్పటి వరకు రక్తదానం చేయరాదన్న విషయాన్ని చెబుతారు. రోగుల సేవలో తరిస్తూ.. కొత్తపేట: అంబాజీపేట మండలం చిరతపూడి గ్రామానికి చెందిన ఆకుల శ్రీనివాస్ 15 ఏళ్ల ప్రాయం నుంచీ సైకిల్పై మొక్కలు వ్యాపారం చేసేవాడు. ఒకసారి కడియపులంక నుంచి మొక్కలు తెచ్చుకుంటుండగా రావులపాలెం వద్ద లారీ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. రక్తస్రావమై ఇబ్బంది పడ్డాడు. కొంత కాలానికి కోలుకుని బతికి బయటపడ్డాడు. తరువాత నుంచి కొత్తపేటలో స్వామి వివేకానంద యోగాశ్రమం, హనుమాన్ వ్యాయామ కళాశాల నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచీ తాను స్వయంగా 24 సార్లు రక్తదానం చేయగా, తన సంస్థల స్టూడెంట్స్, దాతల సహకారంతో రక్తదానం చేయిస్తున్నారు. రక్తం అవసరమైన రోగుల బంధువులు రక్తం కోసం సంప్రదించినప్పుడు సాధ్యం కాదు అనే మాట రాకుండా రక్తం ఇప్పిస్తున్నారు. ఇతర జిల్లాలకు సైతం తీసుకువెళ్లి... స్థానికులకే కాక స్థానికేతర ప్రాంతాలకు, ఇతర జిల్లాలకు సైతం రక్తదాతలను తీసుకువెళ్లి రక్తదానం చేయిస్తున్నారు. కోనసీమ జిల్లాలోని అమలాపురం బ్లడ్ బ్యాంకుల ద్వారా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగులకు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాలకు కూడా తీసుకువెళ్లి రక్తదానం చేయించి సేవా సంస్థలు, ప్రముఖుల మన్ననలు పొందుతున్నారు. -
తండ్రి మందలించాడని ఆత్మహత్య
కొత్తపేట: తండ్రి మందలించాడని మనస్తాపంతో ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఎస్సై జీ సురేంద్ర శుక్రవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండల పరిధిలోని పలివెలశేరేపాలెం గ్రామానికి చెందిన తులా రాంబాబు కుమారుడైన సతీష్ (31) గురువారం పనికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. భోజనం చేస్తున్న సమయంలో పనికి వెళ్లగా వచ్చిన డబ్బు ఇంట్లో ఇవ్వకుండా రోజూ మద్యం తాగుతున్నావని తండ్రి రాంబాబు మందలించాడు. దాంతో మనస్తాపం చెందిన సతీష్ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. కొంతసేపటి తరువాత గదిలోంచి శబ్దం రావడంతో తండ్రి రాంబాబు కిటికీలోంచి చూడగా మంచంపైన ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని వేళ్లాడుతున్నాడు. స్థానికుల సాయంతో తలుపుతీసి సతీష్ను కిందికి దించి చూడగా స్పృహలో లేకపోవడంతో వెంటనే కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వై ద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్టు ధ్రువీకరించారు. కాగా సతీష్కు వివాహం కాలేదు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేంద్ర తెలిపారు. -
టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడిపై పోక్సో కేసు
● బాలికను మోసగించి ముఖం చాటేసిన వైనం ● అబార్షన్ చేయించిన నిందితుడు ● కేసు నమోదు చేసిన బొమ్మూరు పోలీసులు రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరు పోలీస్ స్టేషన్లో టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడిపై పోక్సో కేసు నమోదు అయింది. అతను బాలికను గర్భవతిని చేసి ముఖం చాటేశాడు. ఏడు నెలల గర్భవతిగా ఉన్న ఆమెకు అబార్షన్ చేయించిన అతనిపై బాధితురాలు వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నేతలతో కలిసి శుక్రవారం బొమ్మూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి చేసుకోమంటే కులం తక్కువ దానివంటూ దూషిస్తున్నాడని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. ఎమ్మెల్యే అనుచరుడు కావడంతో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకుండా పోలీసులు తాత్సారం చేశారని బాధితురాలు ఆరోపించారు. రాజమహేంద్రవరం మోరంపూడి ప్రాంతానికి చెందిన పులపర్తి సత్యదేవ్ 2022 నుంచి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను మోసగించాడు. 2024 నవంబర్ నెలలో బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ బాలిక 6వ నెల గర్భవతి అని నిర్ధారించారు. ఈ మేరకు పులపర్తి సత్యదేవ్ వద్దకు వెళ్లి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని కుటుంబ సభ్యులు అడిగారు. అయితే నేను ఇప్పుడు అయ్యప్పస్వామి మాలలో ఉన్నాను. మాల తీసే లోపు మీ అమ్మాయికి అబార్షన్ చేయించమని కోరాడు. దీంతో 2024 డిసెంబర్ 17న బాలికకు ధవళేశ్వరంలోని ఓ ఆసుపత్రిలో అబార్షన్ చేయించారు. అనంతరం పెళ్లి చేసుకోమని అడుగగా అప్పటి నుంచి సత్యదేవ్ ఆచూకీ తెలియలేదని, ఈ మేరకు న్యాయం చేయాలని బొమ్మూరు పోలీసులను ఆశ్రయించినట్లు బాధితురాలు తెలిపారు. బాధితురాలికి న్యాయం చేయండి గర్భవతిని చేసి అబార్షన్ చేయించిన నిందితుడు పులవర్తి సత్యదేవ్పై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించి బాధితురాలికి న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా, నగర అధ్యక్షులు మార్తి లక్ష్మి, పోలు విజయలక్ష్మి తదితరులు తూర్పుజోన్ డీఎస్పీ విద్య, బొమ్మూరు ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథ్ను కోరారు. బాధితురాలితో కలిసి పోలీసు అధికారులను కలిసి ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. రాష్ట్ర తెలికులగాండ్ల కార్పొరేషన్ మాజీ చైర్మన్ సంకిన భవానిప్రియ, మహిళా నేతలు పాల్గొన్నారు. మానవతా దృక్పథంతోనే కేసు నమోదు ఆలస్యం : డీఎస్పీ విద్య మానవతా దృక్పథంతోనే బాధితురాలు కోరిక మేరకు కేసు నమోదు ఆలస్యమైందని తూర్పుజోన్ డీఎస్పీ బి.విద్య అన్నారు. శుక్రవారం బొమ్మూరు పోలీసుస్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 4వ తేదీన బాధితురాలు కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసిందన్నారు. జిల్లా వన్స్టాప్ సెంటర్ అడ్మిన్ సౌజన్య బాధితురాలిని బొమ్మూరు పోలీసుస్టేషన్కు తీసుకువచ్చారన్నారు. ఆ సమయంలో ఆమెకు తాను, సౌజన్య కౌన్సెలింగ్ ఇచ్చామని, సత్యదేవ్తో తనకు వివాహం జరిపించాలని కోరిందన్నారు. దీంతో సత్యదేవ్ను, అతని బాబాయిని పిలిచి మాట్లాడామన్నారు. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటానని, పదిరోజులు సమయం కావాలని కోరారన్నారు. పదిరోజులు కుదరదు ఏడురోజులలో విషయం తెలపాలని ఇద్దరికీ చెప్పామన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సత్యదేవ్పై పోక్సో కేసు నమోదు చేశామని తెలిపారు. అబార్షన్ చేసిన ఆసుపత్రిపై చర్యలు ఉంటాయన్నారు. సత్యదేవ్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. బొమ్మూరు పీఎస్ ఇన్స్పెక్టర్ కాశీవిశ్వనాథం, వన్స్టాప్ సెంటర్ అడ్మిన్ సౌజన్య పాల్గొన్నారు. -
సాంకేతికత సమర్థతే భవిష్యత్ వైద్య రంగం
కాకినాడ క్రైం: కాకినాడ రంగరాయ వైద్య విద్యార్థులు నిర్వహిస్తున్న ఎరెవ్నా 4.0 వైద్య విజ్ఞాన సదస్సు గురువారం జీజీహెచ్ ఎదురుగా ఉన్న ఫార్మకాలజీ లెక్చర్ గ్యాలరీలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.విష్ణువర్దన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా డాక్టర్ ఎన్టిఆర్ హెల్త్ యూనివర్సిటి వైస్ చాన్సలర్ పి.చంద్రశేఖర్ హాజరై, సదస్సును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, భవిష్యత్ వైద్య రంగం సాంకేతికత, సమర్థతల సమాహారం అని అన్నారు. ఈ రెండూ లేని వారు వైద్యరంగంలో తమ మనుగడను కొనసాగించలేరని తేల్చి చెప్పారు. వైద్య విద్యా అభ్యాస నైపుణ్యాలకు సాంకేతికతను జోడించాలని సూచించారు. లోతైన విశ్లేషణలపై మొగ్గు చూపాలన్నారు. ఓ అనారోగ్యాన్ని సామాన్యుడి దృక్కోణంలోనే మనమూ చూస్తే అభ్యాసనకు అర్థం లేదన్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తున్న తీరు అభినందనీయమని ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్దన్ను వీసీ అభినందించారు. ఈ సదస్సుకు విశిష్ట అతిథిగా హాజరైన డీఎంఈ అకడమిక్స్ డాక్టర్ రఘునందన్ మాట్లాడుతూ, నేర్చుకోవడమే వైద్యుడి తపన కావాలని అన్నారు. అటువంటి వారు వైద్య రంగాన్ని శాసిస్తారని చెప్పారు. ప్రయోగాత్మక విద్యాభ్యాసం విషయ అవగహనకు దోహదపడుతుందని, ఎరెవ్నా సదస్సు ఆ దిశగా తోడ్పాటునిస్తుందని అన్నారు. ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ విష్ణువర్దన్ మాట్లాడుతూ తమ భవిత కోసం విద్యార్థులే నిర్వహిస్తున్న ఓ అరుదైన సదస్సు ఇదని వ్యాఖ్యానించారు. ఈ సదస్సుకు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి మరో విశిష్ట అతిథిగా హాజరయ్యారు. సీపీఆర్ మేన్ ఆఫ్ ఇండియా, ఐఎస్ఏ రిసక్స్యుయేషన్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ఎస్ఎస్సి చక్రరావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్లు డాక్టర్ ఎంపీఆర్.విఠల్, డాక్టర్ శ్రీనివాసన్, ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఉమామహేశ్వరరావు, డాక్టర్ శశితో పాటు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు, వివిధ విభాగాల హెచ్వోడీలు పాల్గొన్నారు. తొలి రోజు 14 వర్క్ షాప్లు నిర్వహించినట్లు కోర్ కమిటీ పేర్కొంది. సదస్సు అనంతరం వీసీ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ రఘునందన్, డాక్టర్ విష్ణువర్దన్ సత్కారాన్ని అందుకున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటి వీసీ డాక్టర్ చంద్రశేఖర్ ఎరెవ్నా వైద్య విజ్ఞాన సదస్సు ప్రారంభం -
విద్యుదాఘాతానికి కార్మికుడి మృతి
దేవరపల్లి: నల్లజర్ల మండలం పోతవరంలో విద్యుదాఘాతానికి గురై ఆయిల్ పామ్ గెలలను చెట్టు నుంచి దించుతున్న కార్మికుడు తిప్పనబోయిన శ్రీనివాసరావు(35) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం నల్లజర్ల మండలంలోని సుభద్రపాలెంకు చెందిన శ్రీనివాసరావు గురువారం ఉదయం పోతవరం శివారులోని ఒక రైతులకు చెందిన పామ్ ఆయిల్ తోటలో గెలలు కోస్తుండగా అతని చేతిలో ఉన్న ఇనుప ఊస ప్రమాదవశాత్తూ పక్కన గల విద్యుత్ తీగలకు తగిలింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సుధారాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 18,000 – 18,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,000 గటగట (వెయ్యి) 25,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,000 గటగట (వెయ్యి) 24,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 17,000 – 17,500 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 18,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ప్రకృతికి ప్రణామం
● సేంద్రియ సాగుపై రైతు మొగ్గు ● జిల్లాలో లక్ష్యం 47 వేల ఎకరాలు ● 35 వేల ఎకరాల్లో వరి ● 12 వేల ఎకరాల్లో ఇతర పంటలు ● 43 వేల మంది రైతుల ఎంపిక దేవరపల్లి: జిల్లాలోని మెట్ట ప్రాంత రైతులు పలువురు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. తద్వారా సాగు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన పంట దిగుబడులు అందిస్తున్నారు. దిగుబడులు కూడా ఆశాజనకంగా వస్తూండటంతో సేంద్రియ వ్యవసాయం గిట్టుబాటు అవుతోందని చెబుతున్నారు. అధికారులు అవగాహన కల్పిస్తూండటంతో జిల్లాలో ప్రకృతి సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే సాగు చేస్తున్న వారితో పాటు ఏటా కొత్త రైతులను ప్రకృతి సాగు వైపు అధికారులు, సిబ్బంది మళ్లిస్తున్నారు. ఇదీ ప్రకృతి సాగు లక్ష్యం ప్రస్తుత ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా 47 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేపట్టాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 35 వేల ఎకరాల్లో వరి, 10 వేల ఎకరాల్లో ఉద్యాన, 2 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేయనున్నారు. దీని కోసం 43 వేల మంది రైతులను ఎంపిక చేశారు. ఒక్కో రైతు అరెకరం నుంచి ఎకరం వరకూ ప్రకృతి సాగు చేపట్టేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ నెల 15 నుంచి 30వ తేదీ మధ్య ప్రకృతి సాగు ప్రణాళికకు తుది రూపు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. 2022–23 ఖరీఫ్లో 19,500 మంది రైతులు 17 వేల ఎకరాల్లో సేంద్రియ వరి సాగు చేశారు. 2023–24 ఖరీఫ్లో 32 వేల మంది 28 వేల ఎకరాల్లోను, గత ఏడాది ఖరీఫ్లో 36 వేల మంది 40 వేల ఎకరాల్లోను ప్రకృతి సాగు చేపట్టారు. నవధాన్యాల విత్తనాలు సరఫరా ప్రకృతి సాగు విధానంలో ఖరీఫ్ ప్రారంభానికి రెండు నెలల ముందు పచ్చిరొట్ట పంటలు సాగు చేసుకుంటే భూసారం పెరిగి ఎరువులు, పురుగు మందుల వినియోగం తగ్గుతుంది. దీనికి అవసరమైన నవధాన్యాల విత్తనాలను రైతులకు అధికారులు సరఫరా చేస్తున్నారు. ఐదు జాతుల పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, సుగంధద్రవ్యాలు, 15 నుంచి 20 రకాల నూనె జాతులను అందిస్తున్నారు. ఎకరాకు 10 నుంచి 12 కిలోల విత్తనం వేసుకోవాలి. విత్తనం వేసిన రెండు నెలల్లో వచ్చిన పచ్చిరొట్టను భూమిలో కలియదున్ని పంటలు వేసుకోవాలి. దీనివలన ఎకరాకు 10 నుంచి 12 టన్నుల సేంద్రియ ఎరువు తయారవుతుంది. తద్వారా రసాయనిక ఎరువుల వాడకం 40 నుంచి 50 శాతం తగ్గుతుంది. ప్రస్తుత ఖరీఫ్లో పచ్చిరొట్ట పంటల సాగుకు ఎకరాకు 12 కిలోల చొప్పున సుమారు 564 క్వింటాళ్ల నవధాన్యాల విత్తనాలను రైతులకు సరఫరా చేశారు. సేంద్రియ ఉత్పత్తులకు గిరాకీ సేంద్రియ పద్ధతిలో పండించిన పంట ఉత్పత్తులకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఈ ఉత్పత్తులపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఏటా కొత్త రైతులను ఎంపిక చేసి, ప్రకృతి సాగు విస్తీర్ణం పెంచుతున్నాం. – బొర్రా తాతారావు, జిల్లా ప్రాజెక్టు మేనేజర్, ప్రకృతి వ్యవసాయ విభాగం, రాజమహేంద్రవరం -
విద్యార్థులకు కిట్కట
● ప్రచారార్భాటానబడిసాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి పాలకుల మాటలు కోటలు దాటేస్తున్నాయి. పనులు మాత్రం గుమ్మం కూడా దాటడం లేదు. అధికారం కోసం ఎన్నికల్లో ఎడాపెడా ఇచ్చిన హామీల అమలు మొదలుకుని అన్నింటా పాలనలో తిరోగమనమే కనిపిస్తోంది. చివరకు గత జగన్ పాలనలో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన విద్యపై కూడా ఉదాసీనంగానే వ్యవహరిస్తోంది. వేసవి సెలవుల తరువాత ప్రభుత్వ పాఠశాలలు గురువారం తెరచుకున్నాయి. ఈ తరుణంలో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్లు, బూట్లు.. ఇలా అన్నీ కలిపిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర (ఎస్ఆర్కేవీఎం) కిట్లు అందజేసినట్టు విద్యా శాఖా మంత్రి లోకేష్ను సామాజిక మాధ్యమాల్లో ఆహా ఓహో అంటూ భజన బృందం పొగడ్తలతో ముంచెత్తుతోంది. అయితే, వందిమాగధుల ప్రచారంలో వాస్తవం లేదని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కిట్ల పంపిణీని పరిశీలిస్తే అర్థమవుతోంది. లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు ప్రచారం చేయడంలో దిట్ట అయిన చినబాబు అనుచరగణం విద్యార్థులకు పూర్తి స్థాయిలో కిట్లు పంపిణీ చేయకుండానే చేసినట్టు ప్రచారార్భాటం చేస్తోంది. ప్రభుత్వం విఫలం సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మూడు జతల యూనిఫాం, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్స్లు, స్కూల్ బ్యాగ్, ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు అదనంగా డిక్షనరీలు కలిపి ఒక్కో విద్యార్థికి రూ.2,300 విలువైన విద్యార్థి మిత్ర కిట్లను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఏ విద్యార్థిని కదిపినా బూట్లు రాలేదని, బ్యాగ్లు, యూనిఫాం ఇవ్వలేదనే చెబుతున్నారు. పుస్తకాలు మినహా కిట్లో మిగిలిన ఏ ఒక్కటీ విద్యార్థులకు చేరలేదు. పాఠశాలలు పునఃప్రారంభమైన తొలి రోజునే విద్యార్థులకు పూర్తి స్థాయిలో కిట్లు అందించడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. బాబు పాలనలో ఎప్పుడూ ఇంతే.. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ ఇలానే జరుగుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే తేదీని ప్రభుత్వం ముందుగానే ప్రకటిస్తుంది. ఆ సమయానికి విద్యార్థులకు పుస్తకాలతో పాటు బూట్లు, యూనిఫాం అందజేసేందుకు ముందస్తు ప్రణాళిక ఉండదా అని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో సగం విద్యా సంవత్సరం ముగిసినా ప్రభుత్వ బడులకు పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు అందక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఉండేది. అప్పట్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బూట్లు మాత్రమే ఇచ్చేవారు.తూర్పుగోదావరి జిల్లాలో.. ● జిల్లాలోని 19 మండలాల్లో అన్ని రకాల పాఠశాలలూ కలిపి 984 ఉన్నాయి. వీటిల్లో 44,771 మంది బాలు రు, 49,583 మంది బాలికలు చదువుతున్నారు. ● జిల్లాకు పాఠ్య పుస్తకాలు 4,14,529, వర్క్ బుక్స్ 76,662, నోట్ బుక్స్ 6,62,952, డిక్షనరీలు 14,947, బెల్టులు 61,548 వచ్చాయి. ● మొత్తం విద్యార్థులకు 94,354 బ్యాగ్లు రావాల్సి ఉండగా 67,158 మాత్రమే వచ్చాయి. ● 94,548 బూట్లు రావాల్సి ఉండగా 84,726 మాత్రమే వచ్చాయి. ● 94,354 యూనిఫాంలు రావాల్సి ఉండగా 50,549 మాత్రమే వచ్చాయి. రాజమహేంద్రవరంలో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినులుజగన్ హయాంలో.. చంద్రబాబు పాలనకు భిన్నంగా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద పిల్లల విద్యకు పెద్దపీట వేశారు. బడి వైపు వారిని మరింతగా ప్రోత్సహించేలా జగనన్న విద్యా కానుక కిట్లు అందజేశారు. గతంలో మాదిరిగా పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, బూట్లతో పాటు అదనంగా విద్యార్థులకు అవసరమైన నోట్ బుక్స్, బెల్టు, బ్యాగు, ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు జత చేసి ఇచ్చారు. పాఠశాలలు తెరచిన రోజునే జగనన్న విద్యాకానుక కిట్లను విద్యార్థులకు పూర్తి స్థాయిలో క్రమం తప్పకుండా అందజేసేవారు. గత ఏడాది సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పటికీ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పాఠశాలలు తెరచిన రోజున విద్యా కానుక అందజేశారు. ఈసారి అందుకు భిన్నంగా కూటమి ప్రభుత్వ పాలనలో కిట్ల పంపిణీ జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో వచ్చిన కిట్లను కూడా విద్యార్థులకు అందజేయకుండా ఆపేశారు. దీనిపై అడిగితే మెగా పేరెంట్స్ మీట్లు పెట్టి అందజేస్తామంటున్నారని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ కిట్ల పంపిణీని ప్రచారార్భాటానికి వాడుకోవాలనుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రారంభమైన పాఠశాలలు పుస్తకాలకే ‘విద్యార్థి మిత్ర’ కిట్ పరిమితం బూట్లు, బ్యాగులు, యూనిఫాం లేవు ఇతర వస్తువుల ఊసే లేదు కూటమి సర్కారు వైఫల్యం -
1,268 కిలోల రేషన్ బియ్యం పట్టివేత
రాజానగరం: తణుకు నుంచి జగ్గంపేటకు అక్రమంగా రవాణా చేస్తున్న 1,268 కిలోల రేషన్ బియ్యం రాజానగరంలో గురువారం పట్టుబడింది. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఒక వాహనంలో 32 ప్లాస్టిక్ సంచుల్లో మూటలుగా కట్టి రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని గుర్తించి, స్వాధీన పర్చుకున్నారు. బియ్యం విలువ రూ.58,328 కాగా, వాహనం విలువ రూ.1.50 లక్షలుగా అంచనా వేశామని స్థానిక ఎంఎస్ఓ బాపిరాజు తెలిపారు. వాహన యజమాని అయిన జగ్గంపేటకు చెందిన మారిశెట్టి గణేష్.. డ్రైవర్ జి.సత్తిబాబు సాయంతో ఈ బియ్యాన్ని తరలిస్తున్నాడన్నారు. నిందితులను పోలీసులకు అప్పగించి, 6ఏ కేసు నమోదు చేశామన్నారు. -
తల్లికి వంచనే
తాళ్లపూడి (కొవ్వూరు): ఎటువంటి నిబంధనలూ లేకుండా అందరికీ తల్లికి వందనం అమలు చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు ఆ మాట తప్పి, తల్లులను మోసం చేశారని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ తలారి వెంకట్రావు విమర్శించారు. కొవ్వూరులో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు అంటేనే మోసానికి, వెన్నుపోటుకు చిరునామా అని దుయ్యబట్టారు. తల్లికి వందనం పథకానికి ‘300 యూనిట్లకు మించి కరెంటు వాడకం’ నిబంధన లేకుండా చేస్తానని ఎన్నికల్లో పదేపదే మాయ మాటలు చెప్పారని, నేడు అదే నిబంధన పెట్టడం దుర్మార్గమని అన్నారు. ఒక ఇంట్లో ఇద్దరి పేరిట కరెంట్ మీటర్ ఉంటే వేర్వేరుగా లెక్క కట్టాలని, అలా కాకుండా రెండు మీటర్ల నుంచి వాడిన కరెంటు యూనిట్లు లెక్క కడుతున్నారని చెప్పారు. అలాగైతే, ఇళ్లు అద్దెకిచ్చిన వారి పరిస్థితేమిటని ప్రశ్నించారు. ఎటువంటి నిబంధనలూ విధించబోమన్న మాట తప్పి, తల్లికి వందనం పథకానికి అనేక మందిని దూరం చేసి, డబ్బులు మిగుల్చుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘నీకు రూ.15 వేలు, నీకు 15 వేలు’ అని ఎన్నికల్లో చెప్పి.. ఇప్పుడు రూ.13 వేలు వేస్తున్నట్టు చెబుతున్నారని అన్నారు. ఒక ఇంట్లో ఉన్న ఆధార్ కార్డులన్నింటినీ కలిపి లింక్ పెట్టడం సరికాదన్నారు. తల్లి ఆధార్ కార్డులో ఉన్న వివరాలు మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఆదాయపు పన్ను చెల్లించేవారు కూడా అనర్హులని అంటున్నారని, నిబంధనలు సడలించాలని వెంకట్రావు డిమాండ్ చేశారు. టెన్త్ సప్లిమెంటరీలో 82.99 శాతం ఉత్తీర్ణత కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లో జిల్లా 82.99 శాతం ఉత్తీర్ణత సాధించిందని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు గురువారం తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం 3,057 మంది హాజరు కాగా 2,537 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. మార్కుల జాబితాలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.రిజల్ట్స్.బీఎస్ఈ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఫలితాల్లో ఏమైనా అనుమానాలుంటే ఈ నెల 19వ తేదీ రాత్రి 11 గంటల్లోగా రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. రీకౌంటింగ్కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500, రీ వెరిఫికేషన్కు ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చొప్పున ఫీజు చెల్లించాలి. ఓపెన్ టెన్త్, ఇంటర్లో.. ఓపెన్ స్కూలు టెన్త్త్, ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఓపెన్ స్కూలు ఇంటర్ పరీక్షలు 730 మంది రాయగా 371 మంది ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతిలో 460 మంది పరీక్షలు రాయగా 246 మంది ఉత్తీర్ణత సాధించారు. రీకౌంటింగ్ ఫీజు రూ.200, రీ వెరిఫికేషన్ ఫీజు రూ.1,000 చొప్పున చెల్లించాలి. యోగాంధ్రపై పోటీలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): యోగాంధ్ర కార్యక్రమంపై వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్, ఈ కార్యక్రమం జిల్లా నోడల్ అధికారి ఎస్.చిన్నరాముడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాటలు, కవితలు, డాక్యుమెంటేషన్పై ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పాటల విభాగంలో విజేతకు రూ.లక్ష, కవితలు, డాక్యుమెంటేషన్ పోటీల విజేతలకు రూ.50 వేల చొప్పున నగదు పురస్కారాలు అందజేస్తామని వి వరించారు. ఈ పోటీల దరఖాస్తులకు శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకూ అవకాశం ఉందన్నారు. వచ్చిన దరఖాస్తులను శనివారం ప్రభుత్వానికి పంపిస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు ఎంవీ సుబ్రహ్మణ్యం, హెడ్మాస్టర్, ఎస్కేవీటీ ఉన్నత పాఠశాల, రాజమహేంద్రవరం చిరునామాలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. వర్షాల హెచ్చరికలతో ఈపీడీసీఎల్ అప్రమత్తం విశాఖ సిటీ: భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ఈపీడీసీఎల్ అప్రమత్తమైంది. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి అధికారులను అప్రమత్తం చేశారు. ఆయన ఆదేశాల మేరకు వినియోగదారులకు 24/7 సేవలందించేందుకు కార్పొరేట్ కార్యాలయంతో పాటు సంస్థ పరిధిలోని 11 జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయాలు లేకుండా చూసేందుకు అవసరమైన యంత్రాంగాన్ని, పరికరాలను, సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని ఎస్ఈలు, ఈఈలను సీఎండీ ఆదేశించారు. అధికారులందరూ వినియోగదారులకు అందుబాటులో ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తప్ప సిబ్బందికి ఎటువంటి సెలవులూ మంజూరు చేయవద్దని సూచించారు. విద్యుత్ అంతరాయాలకు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులు కంట్రోల్ రూమ్ నంబర్లకు తెలియజేసి, సత్వర పరిష్కారం పొందవచ్చని సూచించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కంట్రోల్ రూము నంబర్లు రాజమహేంద్రవరం: 73822 99960 కాకినాడ: 94931 78718 కోనసీమ: 94409 04477 కార్పొరేట్ ఆఫీస్: 1912 -
భక్తుల అసంతృప్తికి బాధ్యులెవరు?
గత ప్రభుత్వంలో ఇలా.. గతం లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దేవస్థానంలో సుమారు రూ.30 కోట్లతో వివిధ నిర్మాణాలు చేపట్టి పూర్తి చేశారు. 50 వ్రత పురోహిత పోస్టులు భర్తీ చేశారు. వారికి 30 నుంచి 40 శాతం పారితోషికం పెంచారు. భక్తుల సదుపాయాలకు పెద్ద పీట వేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం దృష్టి సారించి భక్తుల అసంతృప్తిని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అన్నవరం: సత్యదేవుని ఆలయానికి విచ్చేసిన భక్తులను అన్ని విభాగాల్లోనూ అసంతృప్తి వెంటాడుతోంది. ప్రతి ముగ్గురిలో ఒకరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం ప్రభుత్వం చేసిన సర్వేలలో వెల్లడవుతున్న నిజం. రాష్ట్ర ప్రభుత్వం గత జనవరి నుంచి వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాలలో భక్తుల అభిప్రాయాలను సేకరిస్తుండగా ఏ నెలలో కూడా అన్నవరం దేవస్థానం టాప్ వన్ స్థానంలో లేకపోవడం విశేషం. తాజాగా ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 25 వ తేదీ వరకు నిర్వహించిన సర్వేలో అన్నవరం దేవస్థానానికి విచ్చేసిన భక్తుల్లో 35 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తేలింది. ఒకప్పుడు ఎంతో గొప్ప అన్నవరంలోని శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయమంటే ఒకప్పుడు ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. ఉత్తరాన పంపా నది, పచ్చని రత్నగిరి, సత్యగిరి కొండలపై వెలసిన అనంతలక్ష్మీ సత్యవతీ సమేత సత్యదేవుడు, నిత్యకల్యాణం పచ్చతోరణంలా విలసిల్లే ఆలయం, కమ్మని సత్యదేవుని ప్రసాదం, ఎక్కడ చూసినా అద్దంలా దర్శనమిచ్చే ఆలయ ప్రాంగణం, భక్తులకు గౌరవ మర్యాదలతో సిబ్బంది సేవలు ఇలా ఉండేది. నేడు సిబ్బందికి, ఈఓకు మధ్య కుదరని సమన్వయం, క్షేత్రస్థాయిలో పర్యటించని ఈఓ, ఆయన వ్యవహారశైలిపై అధికారుల అసంతృప్తి, వీటిపై మీడియాలో వచ్చిన కథనాలపై అడిషనల్ కమిషనర్ నివేదిక సమర్పించినా దానిపై ఏ విధమైన స్పందన లేని వైనం ఇలా అంతా అందరిదీ తలో దారి అన్నట్టు తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మే లో పెరిగిన భక్తుల అసంతృప్తి రాష్ట్రంలోని ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాలలో జనవరిలో సేకరించిన అభిప్రాయ సేకరణలో అన్నవరం ఏడో ర్యాంకులో నిలిచింది. ఫిబ్రవరిలో సేకరించిన అభిప్రాయ సేకరణలో రెండో ర్యాంకు వచ్చింది. మార్చి, ఏప్రిల్ నెలలో సర్వేలలో భక్తుల అసంతృప్తి 30, 31శాతంగా నమోదైంది. మే నెలలో ఇది 35 శాతానికి చేరింది. ఏప్రిల్ 30– మే 25 మధ్య అభిప్రాయాల సేకరణ దేవస్థానాలు భక్తులకు అందిస్తున్న సేవలు, ప్రసాదం నాణ్యత, ఇతర ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నావళి ద్వారా వారి అభిప్రాయాలు తెలుసుకుంది. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ది వినాయక స్వామి దేవస్థానం , తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం, ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల, ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని కనకదుర్గ గుడి, విశాఖ జిల్లా సింహాచలం శ్రీవరాహ నృశింహస్వామి దేవస్థానం, నంద్యాలలోని శ్రీభ్రమరాంబికా మల్లికార్జునస్వామి దేవస్థానం, అన్నవరంలోని సత్యనారాయణ స్వామివారి దేవస్థానాల్లో భక్తుల అభిప్రాయాలు సేకరించింది. దర్శనంపై 32 శాతం అసంతృప్తి సత్యదేవుని దర్శనం సకాలంలో జరిగిందా అనే దానికి 68 శాతం మంది భక్తులు అవునని సమాధానం చెప్పగా 32 శాతం మంది కాలేదని చెప్పారు. దేవస్థానంలో మౌలిక వసతుల కల్పన, తాగునీరు, వాష్ రూమ్స్, వెయిటింగ్ ఏరియా, రవాణా సౌకర్యాలు, చెప్పులు భద్రపరిచే చోటు, తదితర విషయాలపై 61 శాతం మంది భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. సత్యదేవుని ప్రసాదం రుచి, నాణ్యత విషయాలలో 78 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. పారిశుధ్యంపై 64 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యత ప్రభుత్వానిదా.. అధికారులదా? అన్నవరంలో పరిస్థితి దిగజారడానికి బాధ్యత ఎవరిది అనే చర్చ నడుస్తోంది. ఒక నెలలో అసంతృప్తి ఉంటే తరువాత నెల మార్పు వచ్చేలా చేయాలి. కాని అదే అసంతృప్తి కొనసాగుతుంటే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అనే అభిప్రాయం వినిపిస్తోంది. పరిస్థితి చక్కదిద్దాలని కలెక్టర్ ప్రయత్నించినా.... జనవరిలో ఏడో ర్యాంకు రావడంతో కలెక్టర్ షణ్మోహన్ ఫిబ్రవరిలో దేవస్థానానికి వచ్చి అన్ని విభాగాల పర్యవేక్షించి పలు చర్యలు తీసుకున్నారు. అన్నదానంలో సిట్టింగ్తో బాటు బఫే పద్ధతిలో కూడా భోజనాలు పెట్టేలా చర్యలు తీసుకున్నారు. సత్రాలలో గదులు భక్తులకు అద్దెకివ్వాలని, బ్లాక్ చేసి దళారీల ద్వారా అమ్ముకోవద్దని హెచ్చరించారు. ఫోన్ పే, పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్స్ కోసం వైఫై ఏర్పాటు చేసి దర్శనం, సేవా టిక్కెట్ల కొనుగోలు, సత్రాలలో గదులు అద్దెకిచ్చేలా ఏర్పాటు చేశారు. పారిశుధ్యం మెరుగుపర్చాలని ఆదేశించారు. ఆ నెలకే అదంతా అమలైంది. భక్తుల అసంతృప్తికి కారణాలివీ... పనితీరు మార్చుకోని అధికారులా? విమర్శలొచ్చినా పట్టించుకోని ప్రభుత్వమా? మెరుగుపడని అన్నవరం దేవస్థానంలో పరిస్థితులు వైఫే పనిచేయక భక్తులు డిజిటల్ పేమెంట్స్ కోసం ప్రయాస పడాల్సి వస్తోంది. పశ్చిమ రాజగోపురం వద్ద గైడ్లు మళ్లీ చెలరేగి పోతున్నారు. వీరు భక్తులను రూ.వేయి ఇవ్వండి సులభంగా దర్శనం చేయిస్తాం అని చెప్పి దేవస్థానం ఉద్యోగులు, సెక్యూరిటీ వారికి ఆ భక్తులను అప్పగిస్తారు. వారు నేరుగా దేవాలయానికి తీసుకువెళ్లి దర్శనం చేయిస్తారు. గైడ్లు వసూలు చేసిన సొమ్ము సమానంగా పంచుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేవస్థానం ఈఓ ఎప్పుడూ ఆలయంలో గంట సేపు ఉన్న దాఖలా లేదు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆరు నెలలుగా దేవస్థానంలో వివాదాలు లేని నెల లేదంటే ఆశ్చర్యం. ఫిబ్రవరిలో ఉచిత కల్యాణ మండపంలో ఒక సంస్ధ కార్యవర్గం ప్రమాణ స్వీకారం వివాదంగా మారింది. మార్చి నెలలో దేవస్థానంలో చినబాబు హల్చెల్ చేయడం, అదే నెలలో ఏసీ గదులు అద్దెకివ్వడం లేదని ఈఓ చేసిన ప్రకటన వివాదాస్పదం అవడం, ఈఓపై దిగువ స్థాయి అధికారుల అసంతృప్తి, ఈఓపై వచ్చిన విమర్శలపై ఏడీసీ విచారణ, ఏప్రిల్, మే నెలలో శానిటేషన్ సిబ్బంది జీతాల ఆలస్యం, చెత్త ట్రాక్టర్ టెండర్ వివాదం, మేలో కల్యాణోత్సవాలలో వనదుర్గ అమ్మవారికి హోమాలు నిలిపివేయడం, శ్రీపుష్పయాగం రోజు స్వామి, అమ్మవారి అలంకరణ ఆకట్టుకోకోపోవడం ఇలా ఎన్నో వివాదాలు దేవస్థానం ప్రతిష్ఠను పలుచన చేశాయి. -
హామీల అమలు లేకుండా సంబరాలా?
● ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారు? ● కలగానే రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ● వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి నేతలు సాక్షి, రాజమహేంద్రవరం: ఏడాదయినా ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా విద్యార్థులను, నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాల నేతలు విమర్శించారు. తాడితోటలోని సంహిత కన్వెన్షన్ హాలులో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంఠమని రమేష్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ముచ్చకర్ల రవి, విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు నల్లమిల్లి విజయారెడ్డి గురువారం ఉదయం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. యువగళం పాదయాత్ర సందర్భంగా 20 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని విమర్శించారు. రెండు లక్షల మంది వలంటీర్లను, బేవరేజెస్ ఉద్యోగులను, ఎండీయూ ఆపరేటర్లను తొలగించి, వారి జీవితాలను రోడ్డున పడేశారని దుయ్యబట్టారు. ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఎగ్గొట్టడంతో ఏడాదిలో ఒక్కొక్కరు రూ.36 వేల మేర నష్టపోయారన్నారు. ఫీజు రీ యింబర్స్మెంట్ అమలు చేయకపోవడంతో ఇంజినీరింగ్ విద్యార్థులు ఫీజులు చెల్లించలేక, పరీక్షలకు హాజరు కాలేని దుస్థితి నెలకొందన్నారు. మెగా డీఎస్సీలో 30 వేల పోస్టులని చెప్పి, 16 వేల పోస్టులకు మెగా డీఎస్సీ అని పేరు పెట్టి మోసం చేయడం దారుణమని మండిపడ్డారు. అందరూ చదువుకుని ఉన్నత స్థితికి చేరాలనే ఉద్దేశంతో 2004లో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీ యింబర్స్మెంట్ ప్రవేశపెట్టి ఇంటికొక ఇంజినీర్ను తయారు చేశారని, ఈ పథకానికి 2014లో ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడించిందని అన్నారు. వైఎస్ జగన్ 2019లో సీఎం అయ్యాక ఈ పథకాన్ని పునరుద్ధరించడంతో పాటు చదువులను ప్రోత్సహించేందుకు అమ్మ ఒడి పథకం ప్రవేశపెట్టి ఏటా రూ.15 వేల చొప్పున అందించారని గుర్తు చేశారు. కూటమి నేతల మోసపూరిత హామీలు, అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎవరైనా ప్రశ్నిస్తే, అరెస్టు చేస్తున్నారని వాపోయారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ చేకూరి వీఎస్ రామకృష్ణ, రాజానగరం నియోజకవర్గ అధ్యక్షుడు కొండమీది శ్రీను, గోపాలపురం అధ్యక్షుడు నక్కా నాగ సత్యనారాయణ, అనపర్తి అధ్యక్షుడు పడాల దుర్గారెడ్డి, రాజానగరం నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ప్రగడ కల్యాణ్ పాల్గొన్నారు. -
పుష్కర్ఘాట్లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక పుష్కర్ఘాట్ వద్దనున్న గోదావరి నదిలో సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు వయసుగల వ్యక్తి మృతదేహం గురువారం లభ్యమైంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని వెలికితీశారు. 5.5 అడుగుల ఎత్తు ఉండగా మృతదేహంపై నీలం రంగు షర్ట్ ఉంది. ఎడమపాదానికి నలుపురంగు కాశీతాడు ఉంది. కుడిచేయి మణికట్టుకు నలుపురంగు పూసలతాడు, కుడిచేయి మణికట్టు వద్ద కాషాయ రంగు తాడు కట్టి ఉంది. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. ఆచూకీ తెలిసిన వారు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ 9989786529, 9440796532 నంబర్లలో తెలపాలన్నారు.గుర్తు తెలియని మృతదేహం స్వాధీనంతాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణ సీఐ విశ్వం తెలిపిన వివరాల ప్రకారం కొవ్వూరు లాంచీల రేవు వద్ద గోదావరిలో 40 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. ఎవరికై నా వివరాలు తెలిస్తే పట్టణ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని తెలిపారు.ఆర్డీని కలిసిన ఏపీ ఎన్జీవో నేతలుఆఫీస్ బేరర్ అయినప్పటి నుంచే లెక్కించాలని వినతికాకినాడ క్రైం: ఆఫీస్ బేరర్లకు ప్రభుత్వం ఇచ్చిన తొమ్మిదేళ్ల మినహాయింపును ఆఫీస్ బేరర్గా చేరినప్పటి నుంచి మాత్రమే లెక్కించాలని కోరుతూ జోన్–2 ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నాయకులు గురువారం సాయంత్రం రీజినల్ డైరెక్టర్ డాక్టర్ పద్మాశశిధర్ను రాజమహేంద్రవరంలోని ఆర్డీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. స్టేషన్ సీనియారిటీ పరిగణించరనే విషయాన్ని ప్రభుత్వం జీఏడీ సర్కులర్ ద్వారా తెలియజేసిందని పేర్కొన్నారు. సదరు పత్రాలను ఆర్డీకి అందజేశారు. బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టడంతో పాటు మినహాయింపులను పరిగణించాలని కోరారు. ఏపీ ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గుద్దటి రామ్మోహన్ అధ్యక్షతన రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపులేటి శ్రీనివాస్, చోడిశెట్టి శ్రీనివాస్, కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ, కృష్ణాజిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి నేరుసు రామారావు, ఉమ్మడి తూర్పుగోదావరి సహ అధ్యక్షుడు మట్టపర్తి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పాలపర్తి మూర్తిబాబు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మినీస్టిరియల్ సంఘ అధ్యక్షుడు వీరాజీ, రాజమహేంద్రవరం యూనిట్ సహ అధ్యక్షుడు అనిల్తో పాటు వివిధ యూనిట్ల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు. -
గోదారి.. కళాఝరి
● ప్రారంభమైన అంతర్జాతీయ కళా సమ్మేళనం ● అలరించిన కళాకారుల నృత్య ప్రదర్శనలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కళలకు కాణాచి అయిన ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో.. గోదావరి తీరాన కళాఝరి రసరమ్యంగా ప్రవహించింది. శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం ఆధ్వర్యాన స్థానిక ఆనం కళా కేంద్రంలో 43వ కళా సమ్మేళనం–2025 గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ నెల 15వ తేదీ వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. భారతీయ కళా వైభవాన్ని చాటేలా పలువురు చిన్నారులు తొలి రోజు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ అలరించాయి. అంతర్జాతీయ సంగీత, నృత్యోత్సవాల్లో భాగంగా తొమ్మిది మంది సంగీత కళాకారులు వీణానాదంతో అన్నమయ్య కీర్తనలను వీనుల విందుగా వినిపించారు. అలాగే, తమిళనాడుకు చెందిన జానపద కొమ్మి నృత్యాలు, దుర్గ సూక్తం భరతనాట్యం అందరినీ ఆనంద గోదారిలో ఓలలాడించాయి. కళా సమ్మేళనంలో పాల్గొన్న కళాకారులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. కళా సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటాలి ఈ ఉత్సవాలను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మన రాష్ట్ర కళా సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని అన్నారు. శ్రీ రాధాకృష్ణ కళాక్షేత్రం వ్యవస్థాపకుడు జీబీ నారాయణ ఇటీవలి కుంభమేళాలో సైతం తన ప్రదర్శనలతో పలువురి మన్ననలు పొందారని గుర్తు చేశారు. నారాయణ కుమార్తె లక్ష్మీ గీతిక చిన్న వయస్సులోనే కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, మోహిని అట్టం వంటి నృత్యాల్లో ప్రతిభ చూపి ఉపరాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్నారని, ఆమె మరిన్ని అద్భుత ప్రదర్శనలతో రాష్ట్రపతి అవార్డు సైతం అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ ప్రదర్శనలకు ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి శనివారం హాజరు కానున్నారని తెలిపారు. నృత్యాలతో అలరించిన చిన్నారులను మంత్రి అభినందించారు. అనంతరం ముఖ్య అతిథులను సత్కరించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు తీగల రాజా తదితరులు పాల్గొన్నారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
తుని: స్థానిక జాతీయ రహదారి కొండవారిపేట ప్రాంతంలో ఉన్న చర్చి ఎదురుగా ఉన్న పొదల్లో వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు తుని పట్టణ సీఐ గీతా రామకృష్ణ తెలిపారు. బుధవారం అందిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని ఆయన తెలిపిన వివరాల మేరకు పిఠాపురం రూరల్ మండలం కోలంక గ్రామానికి చెందిన నంద్యాల వీరభద్రరావు (40)గా మృతుడిని గుర్తించారు. ప్రస్తుతం వీరభద్రరావు కుటుంబ సభ్యులను విచారిస్తున్నామన్నారు. ప్రమాదమా, లేదా హత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్నామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామన్నారు. ఏడీబీ రోడ్డుపై లారీ దగ్ధం రంగంపేట: స్థానిక శివారు ఏడీబీ రోడ్డుపై బుధవారం కాంక్రీట్ మిల్లర్ లారీ దగ్ధమైంది. ఏడీబీ రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా కాంక్రీట్ తీసుకువచ్చిన లారీ అన్లోడింగ్ అనంతరం డ్రైవర్ లారీని రోడ్డుపై పార్కు చేసి పక్కకు వెళ్లారు. అనంతరం లారీపై ఉన్న విద్యుత్తు తీగలు గాలికి కదిలి తాకడంతో ఒక్కసారిగా లారీ టైర్ల నుంచి మంటలు వచ్చి పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో లారీలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
సత్యదేవుని సన్నిధికి సులువుగా!
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని సత్యదేవుని దర్శనానికి మరో మార్గానికి పనులు చురుగ్గా సాగుతున్నా యి. మొదటి ఘాట్రోడ్డు వద్ద గల టోల్గేట్ నుంచి స్వామివారి ఆలయం సమీపం వరకు నిర్మిస్తున్న రెండో మెట్లదారి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రూ.90 లక్షల వ్యయంతో సుమారు 450 మెట్లతో ఆకర్షణీయంగా ఈ మార్గం రూపుదిద్దుకుంటోంది. రాజస్థాన్ కార్మికుల మెళకువలతో రాజస్థాన్ నుంచి తీసుకువచ్చిన మెషీన్తో అందమైన పరిమాణాల్లో కట్ చేసిన రాళ్లను మెట్లుగా తీర్చిదిద్దుతున్నారు. తొలిపావంచా నుంచి స్వామివారి ఆలయానికి ఉన్న ప్రస్తుతం మెట్లను సుమారు 50 ఏళ్ల క్రితం రాతితో నిర్మించారు. కాగా ప్రస్తుతం నిర్మిస్త్న్ను రెండో మెట్లమార్గానికి గ్రానైట్, మార్బుల్ రాళ్లను యంత్రాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. 2010లోనే ప్రతిపాదన 2010 సంవత్సరంలో అప్పటి ఈఓ, ప్రస్తుత దేవదాయశాఖ ఇన్చార్జి కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ మెట్ల దారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దేవస్థానం కళాశాల మైదానంలో సందర్శకుల బస్సులు, ఇతర వాహనాలను నిలిపి అక్కడి నుంచి తొలి పావంచా వద్దకు నడిచి వెళ్లి అక్కడ నుంచి మెట్లపై స్వామివారి దర్శనానికి వెళ్లాల్సివచ్చేది. ఇది దూరాభారం కావడంతో కళాశాల మైదానానికి దగ్గరలో మరో మెట్లదారి నిర్మించాలని ఆయన సంకల్పించారు. ఇంతలో ఆయన 2012లో బదిలీకావడంతో ఆ ప్రతిపాదన మూలపడింది. మళ్లీ 2023లో ఆయన ఈఓగా రావడంతో ఈ మెట్ల మార్గం పనులకు టెండర్లు పిలిచి ఖరారు చేశారు. మూడు మలుపులు, 450 మెట్లు ఈ మార్గాన్ని 450 మెట్లతో మూడు మలుపులతో నిర్మిస్తున్నారు. మొదటి ఘాట్రోడ్ టోల్గేట్ నుంచి మెట్లు ప్రారంభమై రత్నగిరిపై ఓల్డ్ సీసీ, న్యూ సీసీ సత్రాల రోడ్డు వద్ద ముగియనున్నాయి. అక్కడ నుంచి 200 మీటర్ల దూరంలోనే స్వామివారి ఆలయం ఉంటుంది. గత ఏప్రిల్లో ప్రారంభించిన పనుల్లో భాగంగా వంద మెట్లు పూర్తి చేశారు. ఇంకా 350 మెట్లు నిర్మించాల్సి ఉంది. ఈ మెట్లకు అవసరమైన రాయిని ప్రత్తిపాడులోని క్వారీ నుంచి తీసుకువచ్చి మెట్లుగా తీర్చిదిద్దుతున్నారు. భక్తుల విశ్రాంతికి ఏర్పాట్లు మెట్ల మార్గంలో వెళ్లే భక్తులు అలసట చెందితే విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా షెడ్లు, తాగునీటి సదుపాయానికి పక్కనే కొంత స్థలాన్ని చదును చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. మూడు నెలల్లో పూర్తి ఈ మెట్ల నిర్మాణాన్ని ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తిచేయనున్నట్టు దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ, డీఈ ఉదయ్కుమార్ తెలిపారు. పనుల పరిశీలన దేవదాయశాఖ చీఫ్ ఇంజినీర్ జీవీ శేఖర్ ఈ మెట్ల మార్గం పనులను ఇటీవల పరిశీలించిన సంతృప్తి వ్యక్తం చేశారు. చురుగ్గా రెండో మెట్లదారి నిర్మాణం రూ.90 లక్షలతో 450 మెట్లు ఏర్పాటు ఆగస్టు నెలాఖరుకు అందుబాటులోకి -
పీతల సరఫరాలో ఘరానా మోసం
కాట్రేనికోన: పచ్చ పీత పిల్లలకు సొమ్ము చెల్లిస్తే మండ పీత పిల్లలను అంటగట్టి రైతులకు కుచ్చుటోపీ పెట్టిన ఘటన పల్లం గ్రామంలో చోటు చేసుకుంది. మండలం పల్లం గ్రామానికి చెందిన 26 మంది రైతులు 50 ఎకరాలు పీతల చెరువులు లీజుకు చేస్తున్నారు. పచ్చ పీత పిల్లల కోసం స్థానికం హేచరీ అందుబాటులో లేక పోవడంతో మద్రాసుకు చెందిన హేచరీ నుంచి పీత పిల్లలను పల్లం గ్రామానికి చెందిన పాలెపు శ్రీను, సంగాని సత్యంకు సొమ్ము చెల్లించారు. 26 మంది రైతులు ఒక పీత పిల్లకు రూ.23 చొప్పున 60 వేల పిల్లలకు రూ.14 లక్షలను దళారులు పాలెపు శ్రీను, సంగాని సత్యంలకు చెల్లించారు. అయితే పచ్చ పీత పిల్లలకు బదులు నకిలీ పీతలను (మండ పీతల) సరఫరా చేయడంతో తీవ్రంగా నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళ చెరువులో పీత పిల్లలను వదలడం, సీడ్ దశలో ఉండడం వల్ల అసలో నకిలీయో తెలియదని వారు పేర్కొన్నారు. చెరువులో పీతలు వేసి 20 రోజులు పైబడిందని, పచ్చ పీతలకు బదులు మండ పీతలని తేలడంతో మోసపోయినట్టు గుర్తించామని, మండ పీత పిల్లలను సరఫరా చేసిన హేచరీ యాజమాన్యం పైన, దళారులపై కేసు నమోదు చేయాలని కోరుతూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళారులు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు పచ్చ పీతలకు బదులు మండ పీతలు పంపిన హేచరీ యాజమాన్యం రూ.14 లక్షలు నష్టపోయిన రైతులు -
గల్లంతైన మృతదేహం లభ్యం
ఉప్పలగుప్తం: మండలంలోని ఎస్.యానం బీచ్కు స్నానాలకు వెళ్లి సముద్రంలో మంగళవారం గల్లంతైన ఇద్దరిలో రెండో యువకుడి మృతదేహం బుధవారం లభ్యమైంది. అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన యాళ్ల హరికిశోర్ మృత దేహం మంగళవారమే లభ్యమైనప్పటికీ మరో యువకుడు ఇసుకపట్ల జస్వంత్ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా బుధవారం ఉదయం వాపాలతిప్ప సమద్రతీర ప్రాంతంలో లభ్యమైనట్టు ఎస్సై సీహెచ్ రాజేష్ తెలిపారు. ఆ మృత దేహాన్ని తహసీల్దార్ వీఎస్ దివాకర్, ఎస్ఐ రాజేష్ పరిశీలించి పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించి కుటుంబ సభ్యులకు అందించారు.యువకుడి ఆత్మహత్యయానాం: పిన్ని ఇంటికి వచ్చి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం యానాం పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణం, జయంతి కాలనీకి చెందిన గండ్రాపు వెంకటకృష్ణచైతన్య (24) యానాంలో వికాస్కాలనీలో నివాసం ఉంటున్న తన పిన్ని ఇంటికి ఇటీవల వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం ఫ్యాన్కు ఉరివేసుకుని వేలాడుతున్న కృష్ణచైతన్యను చూసిన బంధువులు హుటాహుటిన కిందకు దింపి యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కృష్ణచైతన్య బీటెక్ చదువుకున్నాడని ఆత్మహత్యకు ప్రేమ వైఫల్యమే కారణమని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో ఉంచినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై పెంకే గణేష్ తెలిపారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 24,500 గటగట (వెయ్యి) 22,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 23,500 గటగట (వెయ్యి) 21,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 15,000 – 15,500 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
మిథ్యారంభం కరిష్యామి!
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందాన తయారైంది నేటి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ. గత ప్రభుత్వ హయాంలో పాఠశాలలు తెరవకుండానే, వేసవి సెలవుల్లోనే విద్యార్థులకు అందాల్సిన టెక్ట్స్బుక్స్, నోట్ బుక్స్, బ్యాగులు, షూస్, యూనిఫాంలు వచ్చేసి స్టాక్ పాయింట్లలో ఉండేవి. జిల్లాలోని 19 మండలాల్లో 984 ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో బాలురు 44,771 మంది, బాలికలు 49,583 మంది ఉన్నారు. టెక్స్స్టబుక్స్, నోట్బుక్స్ వంటివి జిల్లాకు చేరినా అవి ఇంకా మండలాల నుంచి స్కూల్స్కు చేరలేదు. బ్యాగులు 94,354 రావాల్సివుండగా 67, 158 మాత్రమే 13 మండలాలకు చేరాయి. 94,354 షూస్ రావాల్సి వుండగా 64,726 మంది విద్యార్థులకే వచ్చాయి. యూనిఫాం అయితే కనీసం 10 మండలాలకు కూడా ఇంకా రాలేదు. 94,354 యూనిఫాంలకు 50,549 మాత్రమే వచ్చాయి. ఇంకా 40,805 యూనిఫాంలు రావాల్సి వుంది. అంసంపూర్తిగా తరగతి గదులు, టాయిలెట్స్ నూతన విద్యాసంవత్సరం ప్రారంభంలో ఉత్సాహంతో స్కూల్స్కు వెళ్లే విద్యార్థులకు రంగులు వెలసిపోయిన విద్యాలయాలే కనిపించనున్నాయి. పాఠశాలలు తెరిచే నాటికి నాడు – నేడు పనులు పూర్తి చేసి విద్యాలయాలను సిద్ధం చేయాల్సి వుండగా నిర్లక్ష్యంగా సగం పనులతో వాటిని అలాగే వదిలేశారు. దీంతో పాఠశాలల్లో టాయిలెట్స్ నిరుపయోగంగా మారాయి. స్కూల్స్కు రంగులు వేయలేదు. కొన్ని స్కూల్స్లో అదనపు తరగతి గదుల నిర్మాణం ప్రారంభించారు. అవి అసంపూర్తిగానే మిగిలిపోయాయి. కొన్ని పాఠశాలలకు అయితే కిటీకీలు, తలుపులు ఇంకా బిగించలేదు. పూర్తికాని ఉపాధ్యాయ బదిలీలు జిల్లాలో జరుగుతున్న ఉపాధ్యాయుల బదిలీలు పూర్తికాలేదు. స్కూల్కు వెళ్లి పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయులకు వారి బదిలీలు ఇంకా అగమ్యగోచరంగా ఉండడంతో ఏం చేయాలో తెలీని పరిస్థితిలో ఉన్నారు. ప్రాథమిక పాఠశాలలో బోధించే ఎస్జీటీల కౌన్సెలింగ్ పూర్తికాలేదు. దీంతో పాత పాఠశాలల్లోనే ఎస్జీటీలు ఉండిపోయారు. అయితే ప్రధానోపాధ్యాయులు మాత్రం నూతనంగా వచ్చారు. వేసవి కాలం సెలవుల్లో పూర్తి చేయాల్సిన బదిలీలు పూర్తి నిర్లక్ష్యంతో పాఠశాలలు తెరిచే వరకూ కూడా పూర్తి చేయలేదు. హామీ ఇచ్చిన ఎస్జీటీలకు మాన్యువల్ బదిలీలు చేయకుండా ఆన్లైన్ ప్రక్రియ చేపట్టడంతో వారు ఆందోళన చేశారు. తప్పు తెలుసుకున్న ప్రభుత్వం ఎట్టకేలకు మాన్యువల్ బదిలీలకు ఒప్పుకుంది. అయితే ఇప్పటకే ఆలస్యం కావడంతో దీనివల్ల గురువారం కూడా బదిలీల ప్రక్రియ కొనసాగనుంది. నేడు పాఠశాలల పునఃప్రారంభం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 94,354 మంది పూర్తిగారాని విద్యార్థుల స్కూల్ కిట్లు పూర్తికాని ఉపాధ్యాయుల బదిలీలు -
వనదుర్గమ్మకు ఘనంగా ప్రత్యంగిర హోమం
అన్నవరం: రత్నగిరి దుర్గామాతగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారికి జ్యేష్ట పౌర్ణిమ సందర్భంగా బుధవారం ఘనంగా ప్రత్యంగిర హోమం నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పండితులు ప్రత్యంగిర హోమం ప్రారంభించారు. 11 గంటలకు హోమగుండంలో హోమద్రవ్యాలను సమర్పించి ఘనంగా పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. ప్రత్యంగిర హోమం, పూజ కార్యక్రమాలను వేద పండితులు నిర్వహించారు. 40 మంది భక్తులు రూ.750 చొప్పున టికెట్లు కొనుగోలు చేసి హోమంలో పాల్గొన్నారు. దీంతో భక్తులకు హోమ మంటపం సరిపోక ఇబ్బంది పడ్డారు.మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభించిన రోజు నుంచే విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకానికి సన్న బియ్యాన్ని వినియోగిస్తామని జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు బుధవారం ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే అన్ని అర్హత కలిగిన పాఠశాలలకు మధ్యాహ్న భోజనం తయారీకి ఫైన్రైస్ను అందించామన్నారు.నేడు కనకదుర్గ అమ్మవారికి చండీ హోమంకొండ దిగువన తొలిపావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారి జన్మనక్షత్రం మూల నక్షత్రం సందర్బంగా గురువారం చండీహోమం నిర్వహిస్తారు. శుక్రవారం వనదుర్గ అమ్మవారికి చండీహోమం నిర్వహిస్తారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి జరిగే ఈ హోమాలలో రూ.750 టిక్కెట్తో భక్తులు పాల్గొనవచ్చునని అధికారులు తెలిపారు.సత్యదేవుని దర్శించిన 40 వేల మందిఅన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం బుధవారం భారీ సంఖ్యలో విచ్చేసిన భక్తులతో పోటెత్తింది. సుమారు 40 వేలమంది భక్తులు సత్యదేవుని ఆలయానికి తరలి వచ్చారు. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. స్వామివారి వ్రతాలు రెండువేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షలు ఆదాయం సమకూరింది. సుమారు ఐదువేల మంది భక్తులకు సత్యదేవుని నిత్యాన్నదానపధకంలో ఉచిత భోజన సౌకర్యం కలుగ చేశారు.జర్నలిస్ట్లపై అక్రమ కేసులు దారుణంఅమలాపురం టౌన్: రాష్ట్రంలో సీనియర్ జర్నలిస్ట్లు, వైఎస్సార్ సీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేసి వేధించడం దారుణమని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. ముఖ్యంగా సీనియర్ జర్నలిస్ట్లు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజులపై అక్రమ కేసులు పెట్టడాన్ని ఎమ్మెల్సీ ఖండించారు. అమలాపురం హైస్కూలు సెంటరులోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు బుధవారం సాయంత్రం స్థానిక మీడియాతో మాట్లాడారు. ఈ అక్రమ కేసులను చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? కక్ష సాధింపు చర్యల్లో ఉన్నామా? అనే సందేహం కలుగుతోందన్నారు. డైవర్షన్ పాలిటిక్స్తో ప్రభుత్వం ‘సాక్షి’ కార్యాలయాల ఎదుట ధర్నాలు, కేసులు అనే కొత్త నాటకానికి తెర తీసిందని చెప్పారు. భారత రాజ్యాంగంలో నాలుగో స్తంభంగా ఉన్న జర్నలిజాన్ని నేటి కూటమి ప్రభుత్వం ఖతం చేసే ప్రయత్నంలో ఉందని అన్నారు. ప్రభుత్వం కూటమి పార్టీల నేతలకే రక్షణగా నిలుస్తోందని విమర్శించారు. తుపాకీ గొట్టంతో రాజ్య హింస ద్వారా నియంత పాలన రుచి చూపిస్తోందని ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు ఆరోపించారు. -
జాతీయ ఎస్టీ కమిషన్ సిఫారసులు అమలు చేయాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జాతీయ ఎస్టీ కమిషన్ 2018లో పోలవరం ముంపు ప్రాంతాల్లో పర్యటించి రాష్ట్రపతికి ఒక నివేదిక సమర్పించిందని, ఆ నివేదిక ప్రకారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆదివాసీ మహాసభ న్యాయసలహాదారు అయినాపురపు సూర్య నారాయణ విమర్శించారు. స్థానిక ప్రెస్క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ఎస్టీ నిర్వాసితుల విషయంలో చట్టాలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులలో 53శాతం మంది గిరిజనులున్నారని, వీరి విషయంలో ప్రభుత్వం, అధికారులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రూ.11.80 లక్షల వరకు చెల్లించాల్సి ఉందన్నారు. కొత్త భూసేకరణ చట్టం రూల్ 24 ప్రకారం భూమిలేని ఎస్సీ, ఎస్టీ నిర్వాసితులకు ఒక్కొక్క కుటుంబానికి కనీసం ఎకరం భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు సరైన న్యాయం చేసే వరకు వారికి అండగా ఉంటామని స్పష్టం చేశారు. సమావేశంలో నెసిక లక్ష్మణరావు, బూరమ్మ, వీరమ్మ, రాజమణి పాల్గొన్నారు. -
రైతులు నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం
రాజమహేంద్రవరం రూరల్: ధాన్యం కొనుగోలు చేయకుండా, ఇన్సూరెన్స్ చెల్లించకుండా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తుంటే, మరోవైపు కేంద్రం కేవలం మూడు శాతం మాత్రమే వరిపై మద్దతు ధర పెంచడం దారుణమని మాజీ మంత్రి ,వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పక్కనే ఉన్న ఒడిశా ప్రభుత్వం వరిపై కనీస మద్దతు ధరకు 800 రూపాయలు బోనస్ చెల్లించి క్వింటాల్ వరిని కొనుగోలు చేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా రూ.500 అదనంగా చెల్లిస్తుండగా మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులకు పెట్టుబడి సహాయం ఏడాదికాలంగా అందించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఓవైపు పెట్టుబడులు పెరిగిపోతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం సరికాదని రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. పక్క రాష్ట్రాలు బంజరు భూములను కూడా వరి భూములుగా మారుస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం మూడు పంటలు పండే భూములను రాజధాని పేరిట లాక్కుంటున్నారని వేణు ఆవేదన వ్యక్తం చేశారు . రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి రాష్ట్రంలో శాంతి భద్రతలు కూటమి ప్రభుత్వ పాలనలో దారుణంగా క్షీణించాయని మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. డిబేట్లో మాట్లాడిన అంశాన్ని ఆధారంగా చేసుకుని సీనియర్ జర్నలిస్టు కేఎస్ఆర్ను అరెస్టు చేయడం, సాక్షి కార్యాలయాలపై దాడులు నిర్వహించటం దారుణమన్నారు. ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి ఏ విధంగా ఉందో స్పష్టం చేస్తోందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలకు నాలుగురెట్లు ఇస్తానని చెప్పిన సంవత్సరకాలంలో చేయకుండా చంద్రబాబు మహిళలను, రైతులను, అన్ని వర్గాలను మోసం చేశారన్నారు. ఇప్పుడు సాక్షి డిబేట్లో ఒక ఎనలిస్ట్ అన్నమాటలకు చంద్రబాబు మహిళలను అడ్డుపెట్టుకుని డైవర్షన్ పాలిటెక్స్ చేస్తున్నారన్నారు. గతంలో తన సతీమణిపై వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు ఎంతో మనోవేదన చెందారన్నారు. ఇప్పుడు ఏబీఎన్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి పై వ్యక్తిత్వ హననం చేస్తూ, ఆయన సతీమణి భారతమ్మపై దుష్ప్రచారం చేస్తుండడాన్ని సభ్యసమాజం తలదించుకుంటోందన్నారు. ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తున్నారని కచ్చితంగా కూటమి పార్టీలకు బుద్ధి చెబుతారన్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ -
పంచ భూతాలను కాపాడుకోవాలి
పిఠాపురం: ప్రకృతి వ్యవసాయాన్ని అనుసరించడం ద్వారా పంచ భూతాలను కాపాడుకోవచ్చునని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా అన్నారు. ఏరువాక పౌర్ణమిను పురస్కరించుకుని పిఠాపురం, ఆశ్రమ ప్రాంగణంలో బుధవారం సస్యవృద్ధి బీజారోపణోత్సవం ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ఆరు సంవత్సరాలుగా తమ ఆశ్రమం వద్ద ఏరువాక పౌర్ణమి నిర్వహిస్తున్నామని వెల్లడించారు. సేంద్రియ పద్ధతుల ద్వారా ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను సాధించడమే ఆధ్యాత్మిక వ్యవసాయమని అన్నారు. దానికి ప్రేరణ కలిగించే కార్యక్రమమే సస్యవృద్ధి బీజారోపణోత్సవం అని తెలిపారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న దారపురెడ్డి వెంకన్న, దార్లంక సూరిబాబు, యాండ్ర చంద్రావతి, దాసరి పెద్దనాగేశ్వరరావు, గుళ్ళపల్లి వీరభద్రరావును సత్కరించారు. పరబ్రహ్మ మొహియద్దీన్ బాద్షా ఆధ్యాత్మిక వ్యవసాయం 2025 పురస్కారాన్ని పశ్చిమగోదావరి జిల్లా చీమలవారిగూడెంకు చెందిన చీమల వెంకటేష్కు అందజేసి రూ.10వేల నగదు పురస్కారాన్ని, జ్ఞాపికను ఇచ్చి సత్కరించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త నడింపల్లి రామగోపాలవర్మ డ్రోన్లతో వ్యవసాయం గురించి రైతులకు వివరించారు. అంబాజీపేట హార్టికల్చర్ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.బి.వి చలపతి వివిధ పంటలలో జీవ నియంత్రణ పద్ధతులను తెలిపారు. ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ జాయింట్ సెక్రటరీ వాసంశెట్టి సత్య నారాయణమూర్తి, గోలి సుభాష్, పృథ్వీరాజ్ కఠారి, పొట్రు శశికాంత్ సమీకృత ప్రకృతి వ్యవసాయంపై మాట్లాడారు. కెప్టెన్ అజ్జరపు మల్లికార్జునరావు, ఎస్సార్ కార్పొరేషన్ మాజీ సీఈవో జి.వి.కృష్ణంరాజు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం గురించి తెలిపారు. పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ పాల్గొన్నారు. ఏరువాక సాగిన పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా -
దివ్యాంగుల పింఛన్లలో కోత తగదు
కాకినాడ సిటీ: దివ్యాంగుల పింఛన్లలో భారీ కోత పెట్టే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం సరికాదని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు ఖండించారు. కాకినాడ ఆర్అండ్బీ అతిథి గృహంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. పింఛన్ల తనిఖీ పేరుతో రాష్ట్రంలో దివ్యాంగులను ప్రభుత్వం అవమానిస్తోందని ఆరోపించారు. పింఛన్ల తనిఖీకి హాజరయ్యే క్రమంలో అనేక మంది దివ్యాంగులు ఆసుపత్రి పాలవుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇటువటి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడనాడి దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. దివ్యాంగుల హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖండవిల్లి భరత్కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కరప, ముమ్మిడివరం మండలాల్లో మానసిక మహిళ దివ్యాంగులపై అత్యాచార ఘటన జరపడం దురదృష్టకరమన్నారు. జరిగిన సంఘటనపై రాష్ట్ర హోంమంత్రి ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధ్యతారాహిత్యమన్నారు. ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని, 35 కేజీల బియ్యం పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని, 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. నామినేటెడ్ పదవుల్లో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. సంఘ జాతీయ కార్యదర్శి ముత్యాల పోసికుమార్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పలివెల రాజు పాల్గొన్నారు. -
విశ్వాసం నిలబెట్టుకోలేకపోయారు
దేవరపల్లి: రాష్ట్రంలోని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. నల్లజర్లలో పార్టీ మండల కార్యాలయం వద్ద ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో చట్టాలను అమలు చేయవలసిన వ్యవస్థలను ప్రభుత్వ పెద్దలు తమ గుప్పెట్లో పెట్టుకుని పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. చట్టాల్ని ఉల్లంఘించడానికే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు మీడియాపై, మరోవైపు ప్రతిపక్ష నాయకులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని, అక్రమ కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు యంత్రాంగం విఫలమైందని విమర్శించారు. రైతులను ప్రభుత్వం నిలువునా ముంచిందని విమర్శించారు. పెట్టుబడి సాయం లేదని, పంటల బీమా సౌకర్యం లేక, గిట్టుబాటు ధరలు రాక రైతులు తీవ్ర నిరాశలో మునిగిపోయారని అన్నారు. రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోవడంతో వ్యవసాయం భారంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం, కోకో, ఆయిల్పామ్, పొగాకు వంటి పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. వారికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అండగా ఉండి, సమస్యల పరిష్కారానికి పోరాడుతుందని చెప్పారు. రాష్ట్రం మద్యాంధ్రప్రదేశ్గా మారడంతో ముక్కుపచ్చలారని చిన్నారులు, యువతులు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఎక్కువగా జరుగున్నాయని వేణు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మహిళలపై 185 అత్యాచారాలు జరగగా, వీటిలో 27 హత్యలు జరిగాయని తెలిపారు. తల్లికి వందనం సాయం అందించకుండా పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం అడ్డుకట్ట వేసిందన్నారు. విద్యారంగాన్ని విధ్వంసం చేశారన్నారు. ఇటువంటి ప్రజా సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పాలకులందరూ బంజరు భూములను సాగులోకి తెచ్చి పంట భూములుగా మార్చ గా, సీఎం చంద్రబాబు పట్టుదలకు పోయి మూడు పంటలు పండే భూముల్లో అమరావతి నిర్మాణం చేపట్టారని విమర్శించారు. అమరావతి భూములను వ్యాపార భూములుగా మార్చారని అన్నారు. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వ పని తీరుపై విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని వేణు అన్నారు. విలేకర్ల సమావేశంలో రాష్ట్ర మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యురాలు తానేటి వనిత, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు వెల్లంకి సుబ్రమణ్యం, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బంకా అప్పారావు పాల్గొన్నారు.ఫ ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు ఫ రెడ్ బుక్ రాజ్యాంగంతో కక్షసాధింపు చర్యలు ఫ కూటమి ప్రభుత్వ పనితీరుపై విస్తృత చర్చ జరగాలి ఫ వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు -
జీజీయూలో ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలు
రాజానగరం: ఆస్ట్రేలియాలోని మెక్వెరీ యూనివర్సిటీ, ప్రముఖ సంస్థ కేపీఎంజీ ఇండియాలతో స్థానిక గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ (జీజీయూ) అవగాహన ఒప్పందాలు చేసుకుంది. దీనికి సంబంధించిన పత్రాలను యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ప్రొ.ఛాన్సలర్ కె.శశికిరణ్వర్మ, కేపీజీఎం ఇండియా ప్రతినిధి నారాయణ్ రామస్వామి సంతకాలు చేసి, పరస్పరం మార్చుకున్నారు. ఈ సందర్భంగా జీజీయూ ఛాన్సలర్ కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలతో బోధన అందించేందుకు జీజీయూ ఎప్పుడూ ముందుంటుందన్నారు. ప్రొ.ఛాన్సలర్ శశికిరణ్వర్మ మాట్లాడుతూ, ఈ ఒప్పందం ద్వారా బీటెక్లో సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్ చేసేందుకు అవకాశాలుంటాయన్నారు. కేపీజీఎం ఇండియా ప్రతినిధి నారాయణ్ రామస్వామి మాట్లాడుతూ, జీజీయూతో కలిసి పని చేయడం ద్వారా విద్యార్థులకు చక్కటి భవితను అందించే అవకాశం లభించిందన్నారు. మెక్వెరీ యూనివర్సిటీ సైబర్ స్కిల్ అకాడమీ సీఈఓ మాట్ బుష్బై ఆన్లైన్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో కేపీఎంజీ ఇండియా ప్రతినిధులు మహావీర్, రాఘవన్ ఎస్., జీజీయూ సాంకేతిక సలహాదారు సుమంత్, వీసీ కేవీబీ రాజు, రిజిస్ట్రార్ డాక్టర్ పీఎంఎంఎస్ శర్మ, డైరెక్టర్ డాక్టర్ ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. డీఐపీఆర్ఓగా లక్ష్మీనారాయణ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సమాచార, పౌర సంబంధాల అధికారి(డీఐపీఆర్ఓ)గా కె.లక్ష్మీనారాయణ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతిని ఆమె క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. నెల్లూరు జిల్లా కావలి మండలానికి చెందిన లక్ష్మీనారాయణ 2020 జనవరిలో ఏపీపీఎస్సీ ద్వారా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఉప సమాచార ఈఈగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. జిల్లాల పునర్విభజన అనంతరం బదిలీపై అమలాపురంలో డీఐపీఆర్ఓగా నియమితులయ్యారు. ప్రస్తుతం భాగంగా రాజమహేంద్రవరానికి బదిలీ అయ్యారు. లక్ష్మీనారాయణకు జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, డీఆర్ఓ టి.సీతారామమూర్తి, బదిలీపై వెళ్తున్న డీఐపీఆర్ఓ సీహెచ్ శ్రీనివాస్, తదితరులు అభినందనలు తెలిపారు. -
కూటమి పాలనలో అతివలకు రక్షణ కరవు
రాజమహేంద్రవరం సిటీ: కూటమి ప్రభుత్వ పాలనలో సీ్త్రలకు, బాలికలకు రక్షణ కరువైందని పలువురు మహిళలు ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి ఆధ్వర్యాన పెద్ద సంఖ్యలో మహిళలు రాజమహేంద్రవరంలో మంగళవారం ఆందోళన నిర్వహించారు. మహిళలపై దాడులు అరికట్టాలని, వైఎస్ భారతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద నిరసన తెలిపి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ, మహిళలకు రక్షణ అని సీఎం చంద్రబాబు చెప్పడమే తప్ప వారికి రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతూంటే సాటి మహిళ అయిన హోం మంత్రి కనీసంగా కూడా స్పందించకపోవడం దారుణమని అన్నారు. అత్యాచారాలకు గురైన మహిళల గురించి ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. మహిళలకు న్యాయం చేస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా వారి రక్షణ గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, మహిళలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నవారిని అరెస్ట్ చేయాలని, భవిష్యత్తులో మహిళలపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు. సాక్షి చానల్లో జరిగిన డిబేట్లో ఒక తప్పు మాట దొర్లిందని ఆ పత్రిక కార్యాలయాల వద్ద ఆందోళన చేయడం, భారతిని, జగన్రె నిందించడం సరైన విధానం కాదని అన్నారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగానికి బదులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి మాట్లాడుతూ, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరచిన హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా హామీలు అమలు చేయకపోవడంతో వెన్నుపోటు దినం పేరిట వైఎస్సార్ సీపీ ఆందోళన చేయడాన్ని జీర్ణించుకోలేక డైవర్షన్ పాలిటిక్స్కు తెర లేపారని ధ్వజమెత్తారు. సాక్షి చానల్లో జరిగిన డిబేట్లో దొర్లిన తప్పునకు సంబంధిత వ్యక్తులు క్షమాపణ చెప్పినప్పటికీ, సంబంధం లేని భారతిని దూషిస్తూ రాద్ధాంతం చేయడంలో ఉద్దేశమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన మహిళా అధ్యక్షులు పోలు విజయలక్ష్మ, ఇమంది విజయకుమారి, దాకారపు బంగారమ్మ, ముప్పిడి దమయంతి, అంగాడ సత్యప్రియ, చీరాల ఉమాదేవి, గాండ్ల, తెలుకుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సంకిస భవానీప్రియ తదితరులు పాల్గొన్నారు. ఫ అత్యాచార ఘటనల్లో తక్షణ చర్యల్లేవు ఫ మహిళలకు, బాలికలకు రక్షణ కల్పించాలి ఫ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన నిరసన -
సముద్ర స్నానానికి వెళ్లిన యువకుడి మృతి
ఉప్పలగుప్తం: మండలంలోని ఎస్.యానం గ్రామంలో ఉన్న బీచ్లో స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగి ఇద్దరు యువకులు గల్లంతుకాగా అందులో ఒకరు మృతిచెందారు. మంగళవారం సాయంత్రం అంబాజీపేట మండలం మాచవరానికి చెందిన యాళ్ళ హరికిషోర్(19), అయినవిల్లి మండలం నేదునూరుకి చెందిన ఇసుకపట్ల జస్వంత్(19), మరో ముగ్గురు నేదునూరుకు చెందిన యువకులు ఎస్.యానం బీచ్కు వచ్చి స్నానం చేసేందుకు సముద్రంలోకి దిగారు. వీరు ఐదుగురు స్నేహితులు. సముద్రంలో స్నానానికి దిగిన ఐదుగురు యువకుల్లో హరి కిషోర్, జస్వంత్ సముద్రంలో మునిగిపోయారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా హరికిషోర్ మృతదేహం లభ్యమయిందని, జస్వంత్ కోసం గాలిస్తున్నట్టు ఎస్ఐ సీహెచ్.రాజేష్ తెలిపారు. కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్నాం... అంబాజీపేట: మృతిచెందిన యాళ్ల హరికిషోర్ ఓ ప్రైవేటు కంపెనీలో రికవరీ ఏజెంటుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని మృతితో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్న నేపథ్యంలో ఇప్పుడు దిక్కెవరని బంధువులు, కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు చూపరులకు కంటతడి పెట్టించింది. వీరి స్వగ్రామం పి.గన్నవరం కాగా మృతుడి తండ్రి కుమార్ ఎస్.యానం ఓఎన్జీసీలో పనిచేస్తున్నారు. తల్లి నాగమణి, అతని సోదరి మాచవరం కుసుమవారిపేటలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. అందరితో సరదగా ఉండే హరికిషోర్ ఇక లేడని తెలియడంతో కుసుమవారిపేటలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి. హరికిషోర్ అందరితో కలిసి ఉండేవాడని అతని మరణం జీర్ణించుకోలేకపోతున్నామని కుటుంబ సభ్యులు, బంధువులు రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. గల్లంతైన మరొకరి కోసం గాలింపు -
అఘాయిత్యాలపై స్పందించరేం..?
దేవరపల్లి: రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, బాలికలు, యువతులు, మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు, లైంగిక వేధింపులు ఎక్కువగా జరుగుతున్నప్పటికీ హోం మంత్రి వంగలపూడి అనిత కనీసం స్పందించిన దాఖలాల్లేవని రాష్ట్ర మాజీ హో మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత విమర్శించారు. నల్లజర్లలో పార్టీ మండల అధ్యక్షుడు వెల్లంకి సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద ఆమె విలేకర్లతో మాట్లాడారు. అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థిని తన్మయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. వారం రోజులు గడిచినా పోలీసులు స్పందించలేదన్నారు. నాడు అదృశ్యమైన తన్మయి ఆదివారం శవమై కనిపించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఆమె గురించి హోం మంత్రి అనిత ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరమని విమర్శించారు. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్కు తెర లేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో బాలికపై టీడీపీ కార్యకర్త అత్యాచార యత్నానికి ఒడిగట్టాడని, బాధితురాలికి ప్రభుత్వం తరఫున ఇంతవరకూ సాయం అందించలేదని వనిత ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో ఒక యువతిని ఆరు నెలలుగా ఏడుగురు యువకులు ఇంట్లో బంధించి లైంగిక దాడికి పాల్పడినా, విషయం పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లినా కేసు నమోదు చేయని విషయం అనితకు కనిపించడం లేదని మండిపడ్డారు. ఎంతసేపూ వైఎస్ జగన్ను, భారతిని తిట్టడం తప్ప వేరే పని లేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో శాంతిభద్రతల గురించి అనిత పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు. వీటిపై ఎవరైనా మాట్లాడితే తప్పుడు కేసులు బనాయించి, జైల్లో పెడుతున్నారన్నారు. జర్నలిస్టు కృష్ణంరాజు మహిళలపై చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ, మహిళల తరఫున ఖండిస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ వాటిని తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి, భారతికి ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. గతంలో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి గురించి వంగలపూడి అనిత ఎన్నో అన్నారని, అలా మాట్లా డాలని చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి, లోకేష్ చెప్పా రా అని వనిత ప్రశ్నించారు. కొమ్మినేని, కృష్ణంరాజు వ్యాఖ్య ల గురించి వైఎస్ జగన్ క్షమాపణ చెప్పాలని అనిత అంటున్నారని, విజయమ్మ, భారతి గురించి మాట్లాడిన మాటలపై ముందు ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చిన్నారులు, యువతులు, మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలకు అడ్డుకట్ట వేసి, బాధితులకు అండగా నిలబడాలని సూచించారు. బాధితులను పరామర్శించడం లేదని, ప్రభుత్వం నుంచి కనీస సాయం అందించడం లేదని, డైవర్షన్ పాలిటిక్స్కు తెర లేపుతూ వైఎస్ జగన్, సాక్షి చానల్, చానల్ అధినేత భారతి గురించి తప్పుడుగా మాట్లాడటమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. జగన్ గురించి అనితకు ఏం తెలుసని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో మహిళలకు జగన్ ఇచ్చినంత గౌరవం ఏ సీఎం ఇవ్వలేదన్నారు. మహిళలంతా మహరాణులుగా ఉండాలని అమ్మ ఒడి, చేయూత, ఆసరా, ఇళ్ల స్థలాలు, ఇళ్లు వంటి 11 పథకాలను మహిళల పేరిట అందించారని గుర్తు చేశారు. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం మహిళలకు ఇచ్చారని వనిత చెప్పారు. జగన్ గురించి మాట్లాడే అర్హత మంత్రి అనితకు లేదని అన్నారు. విలేకర్ల సమావేశంలో పార్టీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు యజ్జవరపు లక్ష్మి, నియోజకవర్గ కార్మిక విభాగం అధ్యక్షుడు మద్దూరి నాగేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు బంకా అప్పారావు, మేన్నీ కృష్ణ చౌదరి పాల్గొన్నారు.ఫ డైవర్షన్ రాజకీయాలకు తెర లేపుతారా? ఫ హోం మంత్రి అనితపై మాజీ హోం మంత్రి వనిత విమర్శ -
మాన్యువల్ కౌన్సెలింగ్ కోరుతూ టీచర్ల నిరశన
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా సెకండరీ గ్రేడ్ (ఎస్జీటీ) టీచర్లకు మాన్యవల్ విధానంలో కౌన్సెలింగ్పై స్పష్టత లేకపోవడంతో సోమవారం జిల్లా విద్యాశాఖకార్యాలయం వద్ద ఽనిరాహార దీక్ష చేపట్టారు. ఆన్లైన్ విధానంలో వెబ్ కౌన్సెలింగ్కు ఉపాధ్యాయ ఐక్యసంఘాలు ఏమాత్రం ఆసక్తి చూపడంలేదు. మాన్యువల్ కౌన్సెలింగ్కే కట్టుబడి ఉండటంతో వెబ్ ఆప్షన్లకు లింక్ విడుదల చేసినప్పటికీ ఆప్షన్లు ఇవ్వడం లేదు. దశలవారీ పోరాటంలో భాగంగా ఐక్యవేదిక పిలుపు మేరకు నిరహార దీక్ష చేపట్టారు. మంగళవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ను ముట్టడించాలని ఐక్యవేదిక నిర్ణయించింది. పీడీఎఫ్ ఎంఎల్సీ బొర్రా గోపిమూర్తి హాజరై సంఘీభావం తెలిపి నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అందోళనలు చేస్తున్నా ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శించడం తగదన్నారు. జీవో నంబర్ 22లో అనేక లోపాలున్నాయని, దాన్ని మార్పు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ దీక్షలో పలు ఉపాధ్యాయ సంఘ నేతలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
దేవదాయశాఖ రాజమహేంద్రవరం ఆర్జేసీగా త్రినాథరావు
అన్నవరం: విశాఖ జిల్లా సింహాచలంలోని శ్రీవరాహ లక్ష్మీనృసింహ స్వామివారి దేవస్థానం ఈఓగా పనిచేస్తున్న వి.త్రినాథరావును దేవదాయశాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ (రాజమహేంద్రవరం)గా బదిలీ చేస్తూ ఆ శాఖ కార్యదర్శి వి.వినయ్చంద్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. సింహాచలం దేవస్థానానికి ఈఓని నియమించేవరకు ఆ దేవస్థానానికి ఇన్చార్జి ఈఓగా కూడా కొనసాగాలని ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం ఇన్చార్జి ఆర్జేసీగా పనిచేస్తున్న ద్వారకాతిరుమల దేవస్థానం ఈఓ వి. సత్యనారాయణమూర్తికి ఇన్చార్జి బాధ్యతలు తొలగించారు. త్రినాథరావు గతంలో రాజమహేంద్రవరం ఆర్జేసీగా, రెండుసార్లు అన్నవరం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా, 2020–22 మధ్య రెగ్యులర్ ఈఓగా పనిచేశారు. ఆ తరువాత ద్వారకాతిరుమల దేవస్థానానికి బదిలీ అయ్యారు. సింహాచలం దేవస్థానం ఈఓగా 2024లో బదిలీ అయ్యారు. ఈ ఏడాది జనవరిలో ఆయన సెలవు పై విదేశాలకు వెళ్లగా ఆయన స్థానంలో రాజమహేంద్రవరం ఆర్జేసీ సుబ్బారావును సింహాచలం దేవస్థానం ఇన్చార్జి ఈఓగా నియమించారు. ఏప్రిల్ 30న సింహాచలం అప్పన్న చందనోత్సవం రోజున గోడ కూలి ఆరుగుగు భక్తులు మృతి చెందిన ఘటనలో ఇన్చార్జి ఈఓ సుబ్బారావుతో సహా ఆరుగురు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. త్రినాథరావు సెలవు అనంతరం మే 26న సింహాచలం దేవస్థానం ఈఓగా జాయిన్ అయ్యారు. -
ఏపీఈఏపీ –25 ఫలితాల్లో ఆదిత్య ప్రతిభ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఈఏపీసెట్–2024 ఫలితాల్లో ఆదిత్య విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారు. ఈ మేరకు ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజినీరింగ్ విభాగంలో పి.ఆదిత్య అభిషేక్ 13వ ర్యాంక్, జి.లోషిణి 72, .శుభశ్రీవల్లిఅత్రేయ 91, జి.శ్రీరామశశాంక్ 95, వై.వేదిక 96 ర్యాంక్ సాధించారన్నారు. వీటితో పాటు 121, 136, 156, 169, 170, 172, 177, 198 ర్యాంకులు సాధించారన్నారు. అగ్రికల్చరల్ ఫార్మశీ విభాగంలో సాయిభవ్యహర్షిణి 31వర్యాంక్, దేవి సౌమ్య శ్రీ 112, పి.శ్రీధర్ 119, సి.వెంకట శివసాయి అచ్యుత 152 ర్యాంకు కై వసం చేసుకున్నారన్నారు. వీటితో పాటు 500లోపు 38, వెయ్యిలోపు 62మంది ర్యాంకులు సాధించారన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆదిత్య విద్యాసంస్థల కార్య దర్శి కృష్ణదీపక్రెడ్డి, హాస్టల్ డైరెక్టర్ లక్ష్మీరాజ్యం, డైరెక్టర్లు శృతి, సుగుణ, ఐఐటీ ప్రిన్సిపాల్ మొయి నా, కో–ఆర్డినేటర్ లక్ష్మీకుమార్, రాఘవరెడ్డి, గంగిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, అధ్యాపకులు అభినందించారు. -
కన్నుల పండువలా శ్రీపుష్పయాగం
దివ్యాంగ హక్కుల వేదిక సమావేశం రేపు 09ఆర్జడ్ఎల్82 స్వామి వారి శ్రీపుష్పయాగంలో పాల్గొన్న భక్తులు ● వైభవంగా ద్వాదశ ప్రదక్షిణలు ● బాల బాలాజీ స్వామి వారి కల్యాణోత్సవాలు సంపూర్ణం మామిడికుదురు: శ్రీనివాసా గోవిందా, శ్రీవేంకటేశా గోవిందా అంటూ భక్తుల కోలాహలం నడుమ అయిదు రోజుల పర్యంతం కనుల పండుగలా సాగిన అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి వారి వార్షిక తిరు కల్యాణోత్సవాలు సోమవారం శ్రీపుష్పయాగంతో సంపూర్ణమయ్యాయి. పచ్చని పందిళ్లు, మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల కాంతులు, పలు రకాల పుష్పాల సోయగాల నడుమ శ్రీదేవీ, భూదేవీ సమేతంగా శ్రీబాల బాలాజీ స్వామి భక్తులకు నయనానందకరంగా దర్శనమిచ్చారు. మేళతాళాలు, భక్తుల కోలాహలం నడుమ ద్వాదశ ప్రదక్షిణలు ఘనంగా జరిగాయి. వేద పండితులు భక్తులతో కలిసి 12 పర్యాయాలు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. 12 రకాల మంగళ వాయిద్యాలు, 12 రకాల ప్రసాదాలతో ఈ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. కల్యాణోత్సవాల్లో చివరి అంకంగా స్వామి వారి శ్రీపుష్పయాగం (పవళింపు సేవ) వైభవంగా నిర్వహించారు. శ్రీపుష్పయాగంలో పాల్గొన్న దంపతులకు ఉఽభయ దేవేరులతో కొలువు తీరిన శ్రీబాల బాలాజీ స్వామి వారి తరఫున తాంబూలాలు అందించారు. పసుపు, కుంకుమ, రవికల గుడ్డ అందజేశారు. ముందుగా సుప్రభాత సేవతో అయిదవ రోజు శ్రీబాల బాలాజీ స్వామి వారిని మేల్కొలిపారు. స్వామి వారి సన్నిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన చోర సంవాదం కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. దేవస్ధానం ఉప ముఖ్య అర్చక గొడవర్తి శ్రీనివాసాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారి శిష్యులు చలమచర్ల వేణుగోపాలచార్యులు ఆధ్వర్యంలో శ్రీవారికి సహస్రనామార్చన ఘనంగా నిర్వహించారు. బాల భోగం, నివేదన, వేదపారాయణ హృద్యంగా సాగాయి. వేద మంత్రోచ్ఛారణల నడుమ నిత్యహోమం, నిత్యారాధన, మంగళశాసనం, తీర్థప్రసాద గోష్ఠి, తదితర కార్యక్రమాలను వైభవోపేతంగా జరిపించారు. దేవస్ధానం ఽకార్య నిర్వహణాధికారిణి ముదునూరి సత్యనారాయణరాజు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు కనుల పండువలా జరిగాయి. రామచంద్రపురం రూరల్: అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో రామచంద్రపురం పట్టణంలో బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు వేదిక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు పలివెల రాజు సోమవారం విలేకరులకు తెలిపారు. ఈ సమావేశానికి వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు పాల్గొననున్నారని తెలిపారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే విధంగా జిల్లా, మండల స్థాయి నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
ఎండ వేడికి పేలిపోయిన ట్రాన్స్ఫార్మర్
నిడదవోలు : పట్టణంలోని బసివిరెడ్డిపేట విద్యుత్ సబ్ స్టేషన్లో ఎండ వేడికి సోమవారం పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది. ట్రానన్స్ఫార్మర్ నుంచి ఆయిల్ బయటకు రావడంతో అంటుకొని మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పక్కనే ఉన్న గడ్డి మొక్కలు మంటలకు కాలిపోయాయి. పురుషోత్తపల్లి విద్యుత్ ఏఈ బి.రమేష్బాబు ఘటనా స్థలానికి చేరుకొని తన సిబ్బందితో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ నుంచి కనెక్షన్ తీసివేసి ప్రత్యామ్నాయంగా మరో మార్గం ద్వారా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి ఓ. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకొని మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.30,000 ఆస్తి నష్టం జరిగినట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలియజేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడంతో నిడదవోల పట్టణంలోని బసివిరెడ్డిపేట, నిడదవోలు మండలంలోని సమిస్రగూడెం, అట్లపాడు, తాళ్లపాలెం, శెట్టి పేట గ్రామాల్లో సుమారు రెండు గంటలపాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. -
కరవాక తీరానికి వింత జీవులు
మలికిపురం: మండలంలోని గొల్లపాలెం, కరవాక సముద్ర తీరానికి వింత జీవులు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. జనసంచారం లేని సమయంలో, రాత్రివేళల్లో సముద్రం నుంచి భారీ జంతువులు తీరానికి వచ్చి సేద తీరి వెళ్తున్నట్లు చెబుతున్నారు. ఆ జీవులు ఏంటనేది తెలియడం లేదు. అయితే జంతువుల అడుగులు ఇక్కడ స్పష్టంగా కనిపించడం గమనార్హం. సుమా రు రెండు నుంచి నాలుగు పెద్ద సముద్ర జంతువులు ఇలా తీరానికి వస్తున్నట్లు ఇక్కడి రైతులు చెబుతున్నారు. ఇక్కడ సముద్రం లోతు అధికంగా ఉండడం వల్ల భారీ సముద్ర జీవులు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
స్వామి పుష్కరిణిలో డేవిల్ ఫిష్!
గండేపల్లి: తాళ్లూరు శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి గజేంద్ర మోక్ష పుష్కరిణిలో కొందరు ఆకతాయిలు సోమవారం చేపలను వల సహాయంతో పట్టుకుని తీసుకుపోయినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఈ పుష్కరిణిలో పెరిగిన చేపలను పట్టుకోవడం శాస్త్ర సమ్మతం కాదని పండితులు పేర్కొంటున్నారు. ఆలయాలలో ఉండే కోనేరులలో పెరిగిన చేపలను విష్టుమూర్తి మత్స్యావతారంగా భక్తులు భావిస్తారు. అంతటి పవిత్రమైన పుష్కరిణిలో చేపలను పట్టుకోవడం ఏమిటని భక్తులు మండిపడుతున్నారు.అసలు పుష్కరిణిలోకి చేపలు ఎలా వచ్చాయి?గజేంద్ర మోక్ష పుష్కరిణిలోకి చేపలు ఎలా వచ్చాయి? ప్రకృతి సహజసిద్ధమా! ఎవరైనా చేప పిల్లలను కోనేరులో వేశారా అన్నది భక్తులను వేధిస్తున్న ప్రశ్న. గతంలో కొందరు కోనేరులో చేప పిల్లలను పెంపకానికి వేయడంతో అడ్డుకున్నామని అర్చకులు చెబుతున్నారు. అప్పట్లో వేసిన చేపల పెట్టిన గుడ్లే ప్రస్తుతం కోనేరులో చేపలు పెరగడానికి కారణం కావచ్చు అంటున్నారు.ఘోరం జరిగే వరకూ మనసు కరగదాఘోరాలు జరిగితేనే అధికారులు స్పందిస్తారని భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రాణాలు పోయే వరకూ స్పందించారా? అని ప్రశ్నిస్తున్నారు. పుష్కరిణికి మెట్ల మార్గం నాచుకట్టి కనీసం భద్రత లేకపోవడంతో ఇటీవల బొర్రంపాలెంకు చెందిన తండ్రీ కొడుకు స్నానాకికి దిగి మృతిచెందారు. దీంతో రెవెన్యూ, దేవదాయశాఖ, అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టేందుకు తగు సూచనలతో ప్రణాళికను సిద్ధం చేశారు.పుష్కరిణిలో నీటికి మోక్షంఎట్టకేలకు పుష్కరిణిలో నీటికి మోక్షం కలిగింది. ఇటీవల జరిగిన ప్రమాదంతో ఇది సాధ్యమైంది. కొన్ని సంవత్సరాలుగా పుష్కరిణిలో నీరు నిల్వ ఉండి నాచుకట్టి తట్టు తేలి పుష్కరిణి (కోనేరు) ప్రమాదకరంగా మారింది. పదవులు లేకపోయినా కొందరు పెత్తనం చెలాయించడం వల్ల ఆలయ అభివృద్ధికి ఆటకం కలుగుతోందని గ్రామస్తులు, భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరుతున్నారు.పుష్కరిణిలో డేవిల్ ఫిష్పుష్కరిణిలో సాధారణ చేపలతో పాటు డేవిల్ ఫిష్లు పెరిగాయి. పుష్కరిణిలో నీరు తగ్గుముఖం పట్టడంతో చేపల వేటకు దిగిన వారి వలకు ఈ డేవిల్ ఫిష్లు చిక్కాయి. అటుగా వెళ్లే వారందూ వాటిని చూసేందుకు ఎగబడి ఫొటోలు తీసుకున్నారు. ఈ డేవిల్ ఫిష్, ఇతర జాతులకు చెందిన చేపలు పుష్కరిణి అడుగుబాగం బురదలో తేలియాడుతున్నాయి. -
యాజమాన్య పద్ధతులకు ప్రాధాన్యమివ్వాలి
● నారుమడుల సంరక్షణతో నాణ్యమైన దిగుబడులు ● రైతులు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి ● వ్యవసాయశాఖ సూచనలు పాటిస్తే మేలు ఆలమూరు: ఖరీఫ్ పంటకు సంబంధించి నారుమళ్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఖరీఫ్లో అధిక శాతం వెదజల్లు సాగు చేపడుతుండగా మిగతా భూమిలో నారుమళ్ల ద్వారా సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని 22 మండలాల్లో ఖరీఫ్ సీజన్కు సంబంధించి 1.63 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇంకా అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా పెట్టుబడి సాయం అందకపోవడంతో ఖరీఫ్ మరింత జాప్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఖరీఫ్ సీజన్లో అధిక దిగుబడులను సాధించడంతో పాటు త్వరితగతిన కోతకు వచ్చే వరి వంగడాలకు రైతులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులో భాగంగా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవడంతో పాటు త్వరితగతిన కోతకు వచ్చే అవకాశం ఉండటంతో వ్యవసాయశాఖ ఈ ఖరీఫ్లో స్వర్ణ (7029), ఎంటీయూ (1318), ఎంటీయూ (1121) రకాలు వినియోగించాలని సూచనలిస్తోంది. అయితే రైతుల మాత్రం ఏళ్ల తరబడి సంప్రదాయబద్ధంగా వస్తున్న స్వర్ణ (7029) రకానికి మాత్రమే ప్రాధ్యాన్యం ఇస్తున్నారు. నారుమళ్ల దశలో సరియైన యాజమాన్య పద్ధతులు, జాగ్రత్తలు, నష్ట నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా చీడపీడలను నివారించడంతో పాటు నాణ్యమైన పంటలను పండించవచ్చునని వ్యవసాయశాఖ చెబుతోంది. సస్యరక్షణ చర్యలు నారుమడుల తయారీలో కనీస యాజమాన్య పద్ధతులు, సస్యరక్షణ చర్యలను పాటిస్తే పెట్టుబడి ఆదా అవడంతో పాటు నాణ్యమైన పంటలను పండించవచ్చునని ఆలమూరు వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు కె.నాగేశ్వరరావు చెబుతున్నారు. ● తొలుత 80 శాతం మొలక కలిగిన నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకుని విత్తన శుద్ధి చేయాలి. నారుమడులను ఏర్పాటు చేసుకునేందుకు 10–12 రోజుల మధ్య దమ్ము చేసి నేలను చదును చేసుకోవాలి. ● పొలాల్లో నీరు పారేందుకు చిన్న చిన్న కాలువలను ఏర్పాటు చేసుకుని ప్రతి మొక్కకు నీరు అందేలా చూడాలి. ● ఐదు సెంట్ల నారుమడికి రెండు కిలోల నత్రజని, ఒక కిలో భాస్వరం, ఒక కిలో పోటాష్నిచ్చే ఎరువులను మిశ్రమం చేసి దుక్కులో వేయాలి. ● చలి తీవ్రత ఎక్కువగ ఉండే ప్రదేశంలో భాస్వరాన్ని రెట్టింపు చేయాలి. ● వరి నారు ఆకుగా విచ్చుకునే వరకూ ఆరుతడులుగా నీటిని అందించాలి. ఆకు కొద్దిగా ఎదిగి ఒక దశకు వచ్చిన తరువాత నీటిని నిల్వకట్టాలి. ● జింక్లోపం గమనిస్తే లీటరు నీటిలో రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ను పిచికారీ చేయాలి. ● చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో దాళ్వా వరి సాగుకు కనిపించే జింక్ లోప లక్షణాలను గుర్తిస్తే సత్వరమే వ్యవసాయశాఖ సూచనలు తీసుకోవాలి. ● నారు తీయడానికి వారం రోజుల ముందు ఎకరాకు సరిపడే ఐదు సెంట్లలో వేసిన నారుమడికి ఒక కేజీ కిర్టోప్యూరాన్ గుళికలను తక్కువ నీటిలో సమానంగా చల్లాలి. నాట్లు వేసే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు ● వరి నారుమడి వేసే ముందు తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. ● నారు వేయడానికి పక్షం రోజుల ముందు పొలాన్ని మురుగు దమ్ము చేయాలి. ● 15 సెంటీమీటర్లకు మించి లోతుగా దమ్ము చేయరాదు. ● పొలాన్ని దమ్ము చెక్కతో కాని యంత్ర పరికరంతో గాని చదును చేయాలి. ● నారుమడి లేత ఆకు రంగులో ఉన్నప్పుడే నాటడం ద్వారా త్వరగా మూన కడుతుంది. ● నాలుగు నుంచి ఆరు ఆకులు ఉన్న నారును ఉపయోగించుకుంటే ఫలితం ఉంటుంది. ● నారు ౖపైపెన ఉండే విధంగా నాటితే పిలకలు ఎక్కువగా తొడిగే అవకాశం ఉంటుంది. ● నారు వేసేటపుడు భూసారాన్ని బట్టి చదరపు మీటరుకు 33 మూనలు ఉండేటా నాటాలి. ● వరి నాట్లు నాటిన తరువాత ప్రతి రెండు మీటర్లకు 20 సెంటిమీటర్ల చొప్పున బాటలు వేయాలి. ● దీనివల్ల పైరుకు వెలుతురు తగిలి చీడపీడలు నివారణకు దోహదపడుతుంది. ● నారుమడి మునిగితే తీసుకోవలసిన జాగ్రత్తలు ● నారుమడిలో బాటలు వేసి నీటిని తొలగించాలి. ఠిమొక్కలు కోలుకోవడానికి ఎకరా నారుమడికి యూరియా, పొటాష్ ఎరువులను 10 కేజీల చొప్పున అందించాలి. ● నారుమడికి తెగుళ్లు సోకకుండా లీటరు నీటిలో రెండు గ్రాముల కార్బన్డిజమ్, 2.5 మి.గ్రా క్లోరోపైరీపాస్ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ● నారుమళ్లు పూర్తిగా దెబ్బతిన్న రైతులు ప్రత్యామ్నాయంగా వెదజల్లు విధానాన్ని అవలంబించి సమయం, పెట్టుబడిని ఆదా చేసుకోవాలి. వ్యవసాయశాఖ సూచనలు, సలహాలను తీసుకుంటే నారుమడి దెబ్బతిన్న రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. జూన్ ద్వితీయార్థంలో నారుమళ్లు చేపట్టాలి 2025 ఖరీఫ్ సీజన్కు సంబంధించి జూన్ ద్వితీయార్థంలో నారుమళ్ల ప్రక్రియను చేపట్టి జూలై 15 నాటికి వరినాట్లు పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయశాఖ చెబుతోంది. దీనివల్ల అక్టోబర్ నెలాఖరు నాటికి వరి కోతలు పూర్తయ్యే అవకాశం ఉంటుందని భావిస్తుంది. దీనివల్ల ఏటా నవంబర్ నెలలో సంభవించే ప్రకృతి వైపరీత్యాలను నుంచి తప్పించుకోవచ్చునని, మళ్లీ డిసెంబర్ చివరి నాటికి రబీ సాగుకు సంబంధించి వరినాట్లు పూర్తి చేస్తే వచ్చే ఏడాది మార్చి నాటికి రబీ పంట చేతికొస్తుందని, దీనివల్ల మూడవ పంటగా అపరాల సాగు చేసుకునే అవకాశం ఏర్పడుతుందని వ్యవసాయశాఖ అధికారులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. వ్యవసాయశాఖ సూచనలు కచ్చితంగా పాటిస్తూ భూసారం పెరిగి ప్రతి ఎకరాకు మూడు నుంచి నాలుగు బస్తాలు అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
‘సాక్షి’పై దాడులు ఆపాలి
మంగళవారం శ్రీ 10 శ్రీ జూన్ శ్రీ 2025‘సాక్షి’ కార్యాలయాలపై దాడులు తగవు : స్వాతి ప్రసాద్ సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సాక్షి కార్యాలయాలపై అధికార పార్టీ కార్యకర్తలు దాడులు చేయడాన్ని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ సభ్యుడు కె.స్వాతిప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. సాక్షి కార్యాలయాలపై దాడులు చేసి బోర్డులపై సాక్షి అక్షరాలను తొలగించడం, పత్రిక ప్రతులను దహనం చేయడం వంటి చర్యలకు పాల్పడటం దిగ్భ్రాంతి కలిగిస్తోందన్నారు. ఈ నెల 6న ‘సాక్షి’ టీవీలో ప్రసారమైన లైవ్ షోలో అమరావతి మహిళలను కించపరుస్తూ ఒక పాత్రికేయుడు చేసిన వ్యాఖ్యలు దారుణమని, దీనిపై పలుచోట్ల పౌరులు ఫిర్యాదులు చేయగా కేసులు నమోదయ్యాయని, వాటిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ కార్యకర్తలు సాక్షి కార్యాలయాలపై దాడులకు పూనుకోవడం గర్హనీయమన్నారు. పత్రికా కార్యాలయాలపై దాడులు చేసే సంస్కృతి పత్రికా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. అధికార పార్టీ నేతలు వెంటనే తమ కార్యకర్తలను అదుపు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే లైవ్ షో నిర్వాహకుడు, సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు తన షోలో జరిగిన సంఘటనకు క్షమాపణ చెప్పినందున, ఆయన సీనియార్టీ, వయస్సును దృష్టిలో ఉంచుకుని ఆయనపై తదుపరి చర్యలు నిలిపివేయాలని స్వాతిప్రసాద్ కోరారు. ‘సాక్షి’పై దాడులను నిరసిస్తూ రాజానగరంలోని పత్రిక యూనిట్ కార్యాలయం వద్ద సిబ్బంది సోమవారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పత్రికా స్వేచ్ఛను పరిరక్షించాలని, పత్రికా కార్యాలయాలపై దాడులు వెంటనే ఆపాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. బ్రాంచి మేనేజర్, రీజినల్ మేనేజర్ రమేష్రెడ్డి, వివిధ విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. కాగా, సాక్షిపై దాడులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని పలు మండలాల్లో పాత్రికేయులు పోలీసు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. – రాజానగరం -
విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా పదో తరగతి, ఇంటర్మీడియెట్లో అత్యుత్తమ మార్కులు సాధించిన 169 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రదానం చేశారు. స్థానిక త్యాగరాజ నారాయణ సేవా దాస సమితి హాలులో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తదితరులు ఈ అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తల్లికి వందనం పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించనున్నామని చెప్పారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, క్రమశిక్షణతో విద్యార్థులు ఉన్నత స్థానంలో నిలుస్తారని అన్నారు. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థీ ఈ విజయపరంపరను కొనసాగించాలని ఆకాంక్షించారు. ఉన్నత స్థానాలకు చేరుకున్న తరువాత పుట్టిన ఊరిని, తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలని, వారి అభ్యున్నతికి పాటు పడాలని కోరారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్, రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, ఆర్డీఓలు ఆర్.కృష్ణానాయక్, ఆర్.సుస్మిత, పాఠశాల విద్య ఆర్జేడీ జి.నాగమణి, జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు. నెలాఖరుకు పోలవరం ఎడమ కాలువ పనులు ధవళేశ్వరం: పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రభుత్వ ఇరిగేషన్ ప్రాజెక్టుల సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తితో కలిసి ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై ధవళేశ్వరం కాటన్ గెస్ట్ హౌస్లో ఆయన సోమవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిర్దేశిత లక్ష్యాల సాధనలో వెనుకబడిన ఇంజినీరింగ్ అధికారుల నుంచి వివరణ కోరాలని ఆదేశించారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి కార్యాలయంలో వచ్చే వారంలో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 24 అర్జీలుకంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టం(పీజీఆర్ఎస్)కు 24 అర్జీలు వచ్చాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఎస్పీ డి.నరసింహ కిషోర్ అర్జీలు స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏవీ సుబ్బరాజు, ఎస్బీ డీఎస్పీ బి.రామకృష్ణ, ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ పవన్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఉచిత సీటు నిరాకరించే పాఠశాలలపై చర్యలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం ఉచిత సీట్లు నిరాకరించే పాఠశాలలపై చర్యలు తప్పవని జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె.వాసుదేవరావు హెచ్చరించారు. ఎంఈఓలతో సోమవారం నిర్వహించిన వెబెక్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉచిత అడ్మిషన్ల ప్రక్రియను మంగళవారం సాయంత్రం లోగా పూర్తి చేయాలన్నారు. ఎంపికై న విద్యార్థుల వివరాలను గత నెల 29న ప్రకటించినప్పటికీ ఇంకా కొన్నిచోట్ల ప్రవేశాలు పూర్తి కాలేదన్నారు. అడ్మిషన్లు నిరాకరించే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అడ్మిషన్ పొందిన విద్యార్థుల వివరాలను తగు ధ్రువీకరణతో తమ కార్యాలయానికి సమర్పించాలన్నారు. ఒకవేళ తల్లిదండ్రులు నిరాసక్తత చూపితే వారి నుంచి రాతపూర్వకంగా తీసుకోవాలని సూచించారు. -
యోగాపై అవగాహన ర్యాలీ
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా రాజమహేంద్రవరం వై జంక్షన్ నుంచి దేవీచౌక్ వరకూ, తిరిగి వై జంక్షన్ వరకూ సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు మాట్లాడుతూ, సుమారు 2,100 మందితో ఈ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకు రేపు బస్ పాస్లు రాజమహేంద్రవరం సిటీ: ప్రస్తుత విద్యా సంవత్సరానికి గానూ జిల్లాలోని రాజమహేంద్రవరం, కొవ్వూరు, గోకవరం, నిడదవోలు ఆర్టీసీ డిపోల్లో బుధవారం ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకూ విద్యార్థులకు బస్ పాస్లు ఇవ్వనున్నారు. జిల్లా ప్రజా రవాణా అధికారి వై.సత్యనారాయణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. పీజీఆర్ఎస్కు 159 అర్జీలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించి జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 159 అర్జీలు సమర్పించారు. వారి నుంచి డీఆర్ఓ సీతారామమూర్తి, డీఎల్డీఓలు పి.వీణాదేవి తదితరులు అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీని సత్వరం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని డీఆర్ఓ ఈ సందర్భంగా చెప్పారు. -
ఇసుకాసురులు
● ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్ర సంగమ ప్రాంతం వరకూ.. ● చెలరేగిపోతున్న అక్రమార్కులు ● ఏడాదిలో రూ.100 కోట్లకు పైగా ఇసుక దందా ● గోదావరి ఇసుక, తువ్వ, సముద్ర తీరంలో బొండు ఇసుక, చేలల్లో మట్టి తవ్వకాలు ● దేనినీ వదలని కూటమి నాయకులు ● జిల్లాలో 20 అధికార ర్యాంపుల్లోనూ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చీకటి పడితే చెలరేగిపోవడమే.. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో చీకటి పడితే చాలు. తెలుగు తమ్ముళ్లు చెలరేగిపోతున్నారు. ఐ.పోలవరం మండలంలో మరీ బరితెగించారు. ఎదుర్లంక పాత రేవులో ఇసుక తవ్వకాలు జోరుగా సాగాయి. ఇదే మండలం గుత్తెనదీవి, ముమ్మిడివరం మండలం గేదెల్లంక, కాట్రేనికోన మండలం నడవపల్లి సమీపంలోని పత్తిగొంది వద్ద వృద్ధ గౌతమీ పాయలో పెద్ద ఎత్తున ఇసుక తవ్వేశారు. సొంతంగా డ్రెడ్జింగ్ గోదావరి నదీపాయల్లో పడవల మీద డ్రెడ్జర్లు ఏర్పాటు చేసి మరీ ఇసుక తోడేశారు. పి.గన్నవరం మండలం ఊ డిమూడిలంకలో అనధికార ఇసుక ర్యాంపు ఏర్పాటు చేసి ఇసుకతో పాటు మట్టి తవ్వకాల కోసం ఏకంగా డ్రెడ్జింగ్ చేశారు. ఇది లంక గ్రామాలకు పెనుముప్పు. అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో నిలిపివేశారు. సాక్షి, అమలాపురం: రాష్ట్రంలో గత ఏడాది ప్రభుత్వం మారినప్పటి నుంచి నేటి వరకూ ఇసుకాసురులు చెలరేగిపోతూనే ఉన్నారు. ర్యాంపుల్లో నిబంధనలకు విరుద్ధంగా దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వం ఉచిత ఇసుక అంటున్నా అడ్డగోలు దోపిడీ చేస్తున్నారు. ఇక అనధికార ర్యాంపుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ‘నదీపాయల్లో బండ్లు, ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా ఇసుక తెచ్చుకోవచ్చు’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటనను టీడీపీ, జనసేన నేతలు వరంగా మార్చుకున్నారు. బాబు చెప్పిన దాని ప్రకారం జిల్లా ఇసుక కమిటీ ఎంపిక చేసిన ర్యాంపుల నుంచి మాత్రమే ఇసుక తవ్వాల్సి ఉంది. కానీ, ఇదే అదనుగా కూటమి పార్టీలకు చెందిన చోటామోటా నాయకులు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్ర సంగమ ప్రాంతం వరకు గోదావరి నదీపాయలను దొలిచేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు గత ఏడాది జూన్ 4న వెలువడ్డాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఖరారైంది. ఆ రోజు సాయంత్రం నుంచే ఇసుక అక్రమార్కులు దందాకు తెర తీశారు. అంతకు ముందు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వరదలు, భారీ వర్షాల సమయంలో ఇసుకకు కొరత రాకుండా ఆరు స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసి భారీగా ఇసుక నిల్వ ఉంచింది. మొత్తం 2,44,131 మెట్రిక్ టన్నుల ఇసుకను ఆగస్టు మొదటి వారానికల్లా ఇసుకాసురులు ఊడ్చేశారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు సైతం ఇసుక లేకుండా చేశారు. ప్రభుత్వం ఉచితం పేరుతో టన్నుకు రూ.265 చొప్పున వసూలు చేసిన విషయం తెలిసిందే. స్టాక్ పాయింట్ల వద్ద ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా లారీకి అదనంగా రూ.5 వేల చొప్పున వసూలు చేసి సొమ్ము చేసుకున్నారు. నియోజకవర్గ కీలక నేతలు బి–ట్యాక్స్, వి–ట్యాక్స్ పేరుతో కోట్లు కొల్లగొట్టారని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. సీఆర్జెడ్ పరిధిలో.. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జెడ్) పరిధిలో సైతం అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. రావులపాలెం మండలం గోపాలపురం సీఆర్జెడ్ పరిధిలో ఉన్నప్పటికీ ఇసుక తవ్వేశారు. అది కూడా గోపాలపురం – సిద్ధాంతం మధ్య ఉన్న రెండు వంతెనలకు 300 మీటర్ల సమీపంలోనే ఇసుక తవ్వేయడం గమనార్హం. పి.గన్నవరంలో సైతం సీఆర్జెడ్ నిబంధనలను తోసిరాజని తవ్వేశారు. అయినవిల్లి మండలం కొండుకుదురు పరిసర ప్రాంతాలు, ఐ.పోలవరం మండలం ఎదుర్లంక, కొమరగిరి, పాత ఇంజరం, గుత్తెనదీవి, జి.వేమవరం, ముమ్మిడివరం మండలం గేదెల్లంక, కాట్రేనికోన మండలం పల్లంకుర్రు, కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పిల్లంక, గోవలంకలలోను సీఆర్జెడ్ పరిధిలో ఇసుక తవ్వేశారు. పి.గన్నవరంలో ‘జట్టు కట్టారు’ పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలో కూటమి నేతలు ఎన్నికల్లోనే కాకుండా ఇసుక అక్రమ తవ్వకాల్లో సైతం జట్టు కట్టారు. మామిడికుదురు మండలం బి.దొడ్డవరం, ఆదుర్రులో ఇసుక తవ్వకాలు సాగించారు. అయినవిల్లి మండలం కొండుకుదురులంకలో రాత్రి వేళల్లో ఇసుక తవ్వకాలు జరిగాయి. పి.గన్నవరం మండలం యర్రంశెట్టివారిపాలెంలో తువ్వ ఇసుక అనుమతులు తెచ్చుకున్నారు. అభివృద్ధి కార్యక్రమాల పేరుతో అనుమతులివ్వగా దీనిని అడ్డం పెట్టుకుని అక్రమ తవ్వకాలు జోరుగా చేస్తున్నారు. పెదకందాలపాలెం, ఊడిమూడి, మానేపల్లిలో సైతం ఇష్టానుసారం తవ్వకాలు చేస్తున్నారు. నియోజకవర్గ స్థాయి నేత కనుసన్నల్లో ఈ దందా సాగుతోంది. -
ఏదీ.. వ్యవసాయం!
నాడు రైతులకు పెద్ద పీట ● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వ్యవసాయం, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. మిచాంగ్ తుపాను ప్రభావంతో పంట నష్టపోయిన కర్షకుల కన్నీళ్లు తుడిచింది. తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు దెబ్బ తిన్న పంటల లెక్క వేగంగా తేల్చింది. నెలల వ్యవధిలోనే పంటలకు పరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) అందించింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 15,615 మంది రైతులకు సంబంధించి 10,487.02 హెక్టార్లలో ఉద్యాన, వ్యవసాయ పంటలు దెబ్బ తిన్నట్లు నాడు వ్యవసాయ అధికారులు నిర్ధారించి ప్రభుత్వానికి నివేదించారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన ప్రభుత్వం ఇంకో ఆలోచన చేయకుండా రైతులకు అండగా నిలిచింది. నష్టపోయిన రైతులకు రూ.14.80 కోట్ల పెట్టుబడి రాయితీ మంజూరు చేసింది. ● వైఎస్సార్ యంత్ర సేవ పథకం కింద గత ప్రభుత్వం రైతులకు అత్యాధునిక యంత్ర పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలో 367 ఆర్బీకేలు ఉండగా.. తొలి దశలో ప్రతి మండలంలో మూడు చొప్పున ఆర్బీకేలకు డ్రోన్లు మంజూరు చేసింది. జిల్లాకు మొత్తం 91 డ్రోన్లు అందుబాటులోకి తెచ్చి, వ్యవసాయ పనులకు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంది. ● ధాన్యం కొనుగోలులో దళారుల ప్రమేయాన్ని పూర్తిగా నివారించింది. ఆర్బీకేల ద్వారా వ్యవసాయ, రెవెన్యూ, పౌర సరఫరాలు, తూనికలు – కొలతలు, ఇతర శాఖల సమన్వయంతో ధాన్యం కొనుగోలు చేపట్టింది. రవాణా చార్జీల చెల్లింపులో జాగ్రత్తలు తీసుకున్నారు. కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేశారు. ● కూటమి పాలనలో వ్యవసాయ రంగం తిరోగమనం ● రబీ ధాన్యం సొమ్ము చెల్లింపులో నిర్లక్ష్యం ● అందని ‘అన్నదాత సుఖీభవ’ ● గత ప్రభుత్వంలో సాగుకు భరోసా ● అడగడుగునా రైతుకు తోడ్పాటు ● క్రమం తప్పకుండా రైతు భరోసా ● పంట నష్టపోయిన మూడు నెలల్లో పరిహారం సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగం తిరోగమనంలో పయనిస్తోంది. సాగుకు సిద్ధమైన సమయంలో పెట్టుబడులకు ‘అన్నదాత సుఖీభవ’ ఆర్థిక సాయం అందడం లేదు. పంట నష్టపోతే పరిహారం సైతం అందే పరిస్థితి లేదు. బీమా ప్రీమియం చెల్లింపునకు మంగళం పాడారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించడంతో పాటు పంట విక్రయాల వరకూ రైతులకు అడుగడుగునా అండగా నిలిచిన రైతుభరోసా కేంద్రాలను (ఆర్బీకే) నిర్వీర్యం చేశారు. ఆరుగాలం స్వేదం చిందించి, పండించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయిస్తే.. సకాలంలో సొమ్ము ఇవ్వకుండా రైతులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. పొగాకుకు మద్దతు ధర లేదు. ఉద్యాన, ఆక్వా పంటలకు సైతం ప్రోత్సాహం కరువైంది. వెరసి అన్నదాతకు ఆర్తనాదాలు తప్పడం లేదు. గతమెంతో ఘనం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. రైతులను ఆదుకునేందుకు, పెట్టుబడులకు అప్పులు చేయకుండా ఉండేందుకు ‘రైతు భరోసా’ పేరిట ఏటా రూ.13,500 ఆర్థిక సాయం అందించారు. ఈవిధంగా నాలుగేళ్లలో 1,33,502 మంది రైతులకు రూ.584.64 కోట్లు అందజేశారు. ప్రకృతి విపత్తుల సమయంలో అండగా నిలిచారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు అందుబాటులోకి తెచ్చారు. ఆక్వా రైతులకు విద్యుత్లో రాయితీ సైతం అమలు చేశారు. వెరసి వ్యవసాయ రంగం సస్యశ్యామలంగా విరాజిల్లింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా రూ.20,000 అందిస్తామని గొప్పగా ప్రకటించి, తొలి ఏడాది ఎగ్గొట్టారు. దీనిని ఈ ఏడాదైనా అమలు చేస్తారా అనే మీమాంస నెలకొంది. ఈ పథకం కోసం 1.35 లక్షల మంది రైతులు నిరీక్షిస్తున్నారు. వ్యవసాయ విద్యుత్కు కోతలు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నెలల వ్యవధిలోనే వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు నాంది పడింది. వ్యవసాయానికి పగటి పూట 9 గంటల విద్యుత్ సరఫరా ఇస్తున్నామని ప్రకటనలు గుప్పించిన సర్కారు.. కొన్ని రోజులకే దీనిని 8 గంటలకు తగ్గించింది. తరువాత మరో గంట కుదించింది. విద్యుత్ అధికారుల ద్వారా గుట్టు చప్పుడు కాకుండా.. ఎలాంటి ప్రకటనా చేయకుండా అనధికారిక కోతలు అమలు చేస్తోంది. తద్వారా వ్యవసాయానికి 7 గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తామన్న సంకేతాన్ని రైతులకు ఇస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా సుమారు 25 వేలకు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మెట్ట ప్రాంతాలైన దేవరపల్లి, గోపాలపురం, చాగల్లు, నల్లజర్లలో కొంత భాగం, నిడదవోలు రూరల్, పెరవలి మండలంలో కొన్ని గ్రామాలు, గోకవరం, రాజానగరం, అనపర్తి మండలాల్లో ఎక్కువ శాతం రైతులు ఉద్యాన పంటలకు బోర్లపై ఆధారపడుతారు. వీరందరికీ ఇబ్బందులు తప్పడం లేదు. ధాన్యం.. దయనీయం.. ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రకటించిన కూటమి ప్రభుత్వం నెల రోజులు గడుస్తున్నా ఆ డబ్బులు ఇవ్వడం లేదు. గత నెల 24వ తేదీ నాటికి 3.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. దీనికి గాను రూ.781.08 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. రూ.632.6 కోట్లు ఇచ్చారు. మిగిలిన రూ.148.48 కోట్లు ఎప్పుడు చెల్లిస్తారో తెలియకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉచిత పంటల బీమా హుళక్కి ప్రకృతి విపత్తుల సమయంలో పంటలు దెబ్బ తిన్న రైతులకు ఎటువంటి నష్టమూ వాటిల్లకుండా పరిహారం అందించడంలో ఉచిత పంటల బీమా కీలక భూమిక పోషించేది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకానికి కూటమి ప్రభుత్వం మంగళం పాడింది. ప్రీమియం సొమ్ము రైతులే చెల్లించాలని నిబంధన పెట్టింది. 2024–25 రబీ సీజన్లో ప్రభుత్వం గుర్తించిన పంటలకు బీమా ప్రీమియం చెల్లింపునకు ఉత్తర్వులు వెలువరించింది. వరికి హెక్టారుకు రూ.1.05 లక్షలుగా విలువ నిర్ధారించి రైతు వాటాగా 1.50 శాతం అంటే రూ.1,575 ప్రీమియం చెల్లించాల్సి ఉంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతు వాటాను సైతం ప్రభుత్వమే భరించేది. పంటల వారీగా హెక్టారుకు మంజూరు చేసిన ఇన్పుట్ సబ్సిడీ పంట ఇన్పుట్ సబ్సిడీ వరి, వేరుశనగ, పత్తి, చెరకు రూ.17,000 మొక్కజొన్న రూ.12,500 మినుములు, పెసలు, శనగలు, రూ.10,000 పొద్దుతిరుగుడు, పొగాకు జొన్న 8,500 జిల్లాలో ఇన్పుట్ సబ్సిడీ మంజూరు ఇలా.. నియోజకవర్గం రైతులు పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ (హెక్టార్లలో) (రూ.లక్షల్లో) అనపర్తి 682 344.28 52.43235 రాజమండ్రి రూరల్ 214 112.55 18.8077 రాజానగరం 8,554 6032.16 838.6905 జగ్గంపేట (గోకవరం) 1,484 832.05 141.4485 గోపాలపురం 2,970 2195.81 279.91535 కొవ్వూరు 819 534.9 77.28165 నిడదవోలు 892 435.27 71.9426 -
ప్చ్.. నిరాశే..
రైతులను ఆదుకున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ● వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 2014లో ప్రతిపక్ష నేతగా దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. గిట్టుబాటు ధర ఇవ్వకపోతే గుంటూరు బోర్డు కార్యాలయం వద్ద రైతులకు అండగా ధర్నా చేస్తానని ప్రకటించారు, అనంతరం కిలోకు రూ.10 నుంచి రూ.17 వరకూ ధర పెరిగి, రైతులకు మేలు జరిగింది. ● 2020 పంట కాలంలో పొగాకు మార్కెట్ సంక్షోభంలో పడి, రైతుల వద్ద లో గ్రేడ్ పొగాకు కొనుగోలుకు ట్రేడర్లు ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్క్ఫెడ్ ద్వారా రైతుల వద్ద ఉన్న లో గ్రేడ్ పొగాకును గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయించారు. మార్క్ఫెడ్కు రూ.200 కోట్లు మంజూరు చేసి, సుమారు 16 మిలియన్ల కిలోల పొగాకును కొనుగోలు చేయించారు. ● 2004లో పాదయాత్ర చేపట్టిన అప్పటి ప్రతిపక్ష నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 2005–06 పంట కాలంలో పండించిన పొగాకును కేంద్ర ప్రభుత్వం ద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయించారు. ● పుంజుకోని పొగాకు మార్కెట్ ● లో గ్రేడ్కు ట్రేడర్లు నో ● నాణ్యతకే ప్రాధాన్యం ● గిట్టుబాటు ధర దక్కక రైతుల గిలగిల దేవరపల్లి: రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లు ప్రారంభించి దాదాపు రెండు నెలలు దాటింది. ఇప్పటికీ మార్కెట్ పుంజుకోవడం లేదు. పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో ఉత్తర తేలిక నేలల్లో (ఎన్ఎల్ఎస్) పండే పొగాకు కొనుగోళ్లను ఈ ఏడాది మార్చి 24న ప్రారంభించారు. ఇప్పటి వరకూ 59 రోజులు వేలం నిర్వహించినా ధరలో పెరుగుదల లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. దీంతో, వేలం కేంద్రాలకు వస్తున్న బేళ్లు తక్కువగా ఉంటున్నాయి. సాధారణంగా జూన్ రెండో వారం నాటికి సుమారు 50 నుంచి 55 శాతం పొగాకు విక్రయాలు జరిగేవి. ప్రస్తుతం అది 25 శాతానికే పరిమితమైంది. రైతు.. కుదేలు గత ఏడాది పొగాకుకు ఊహించని ధర పలికి, మంచి లాభాలు రావడంతో రైతులు కుబేరులయ్యారు. కిలోకు రూ.410 ధర లభించడంతో ఎకరాకు దాదాపు రూ.4 లక్షల ఆదాయం వచ్చింది. దీంతో, అధిక శాతం రైతులు పొగాకు సాగుపై మొగ్గు చూపారు. కనీసం ఎకరం పొలం లేని రైతులు 5 నుంచి 10 ఎకరాలు కౌలుకు తీసుకుని పంట వేశారు. అధిక పెట్టుబడులు పెట్టి పంట పండించారు. తీరా పండించిన పొగాకును వేలం కేంద్రాలకు తీసుకు వెళ్లిన రైతులకు ఎదురు దెబ్బ తగిలింది. ఏటా అత్యధికంగా పొగాకు కొనుగోలు చేసే కంపెనీలు కూడా ఈసారి అంతంత మాత్రంగానే కొంటున్నాయి. దీంతో, రైతులు సాగుకు తెచ్చిన అప్పులు గుర్తుకు తెచ్చుకుని ఆందోళన చెందుతున్నారు. ఎకరం విస్తీర్ణంలో పొగాకు సాగుకు రూ.3 లక్షల వరకూ ఖర్చవుతోంది. ఎకరం కౌలు రూ.70 వేలు, బ్యారన్ అద్దె రూ.50 వేలు, పెట్టుబడి దాదాపు రూ.1.50 లక్షలు అవుతోంది. చాలా మంది బ్యారన్కు రూ.7 లక్షల నుంచి రూ.8 లక్షల వరకూ బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని పెట్టుబడి పెట్టి పంట పండించారు. తీరా చూస్తే మార్కెట్లో గిట్టుబాటు ధర లభించడం లేదు. ఇదే ధర కొనసాగితే ఎకరాకు రూ.లక్ష నష్టం వస్తుందని రైతులు దిగులు చెందుతున్నారు. గత అప్పులకు కొత్త అప్పులు తోడవడంతో రుణభారం పెరిగిందని కౌలు రైతులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం కొనుగోళ్లు మందగించడంతో రైతుల వద్ద పొగాకు నిల్వలు పేరుకుపోయాయి. వేలానికి వస్తున్న బేళ్లే తక్కువగా ఉండగా.. వాటిని కూడా ట్రేడర్లు పూర్తిగా కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారు. పరిమితికి మించి.. పండించి.. రైతులు 2024–25 పంట కాలంలో పరిమితికి మించి పొగాకు పండించారు. ఎన్ఎల్ఎస్ ప్రాంతంలో 59 మిలియన్ల పంటకు పొగాకు బోర్డు అనుమతి ఇచ్చి, రిజిస్ట్రేషన్ చేసింది. గత ఏడాది వచ్చిన ధర చూసి, ఆశపడి, అధిక విస్తీర్ణంలో సాగు చేయవద్దని అధికారులు, ట్రేడర్లు, రైతు సంఘాల ప్రతినిధులు చెబుతూనే ఉన్నారు. ఈ ఏడాది జింబాబ్వే, బ్రెజిల్ దేశాల్లో పొగాకు ఉత్పత్తి గణనీయంగా పెరిగినందున అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గుతుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని పంట వేయాలని సూచించారు. కానీ, ఈ ఏడాది కూడా మంచి ధర వస్తుందనే ఉద్దేశంతో నిషేధిత భూముల్లో కూడా రైతులు అనుమతి లేకుండా పంట సాగు చేశారు. దీంతో ఉత్పత్తి 80 మిలియన్ల కిలోలకు చేరింది. 24,450 హెక్టార్లలో పొగాకు సాగు చేసినట్టు అధికారులు చెబుతున్నప్పటికీ, దాదాపు 40 వేల హెక్టార్లలో పంట వేసినట్టు సమాచారం. ఈవిధంగా కొనుగోలు సంస్థల అవసరానికి మించి పంట ఉత్పత్తి కావడంతో మార్కెట్ సంక్షోభంలో పడినట్టు అధికారులు చెబుతున్నారు. తక్కువ ధరకు బ్లాక్ సాయిల్ పొగాకు దక్షిణాదిన నల్లరేగడి భూముల్లో పండించిన పొగాకు తక్కువ ధరకు లభించడంతో కొనుగోలు సంస్థలు అక్కడే ఎక్కువగా కొనుగోళ్లు చేస్తున్నారు. బ్లాక్ సాయిల్ పొగాకు కిలో రూ.180కి లభిస్తూండగా, ఎన్ఎల్ఎస్ పొగాకు రూ.290 నుంచి రూ.220 వరకూ పలుకుతోంది. బ్లాక్ సాయిల్, ఎన్ఎల్ఎస్ పొగాకులో నికోటిన్ శాతం సమానంగా ఉండడంతో కొనుగోలుదారులు అక్కడి పొగాకు కొనుగోలుకే మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఎన్ఎల్ఎస్ పొగాకు కంటే బ్లాక్ సాయిల్ పొగాకు కిలో రూ.50 నుంచి రూ.80 తక్కువకు వస్తోందని వ్యాపారులు చెబుతున్నారు. అయితే, పంట ఎక్కువగా పండినందున కొనుగోలు సంస్థలు సిండికేట్గా మారి ఇబ్బంది పెడుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. ఖరారు కాని ఎగుమతి ఆర్డర్లు గుంటూరు ప్రధాన కేంద్రంగా ఉన్న పొగాకు బోర్డు తన పరిధిలో వేలం కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు, ట్రేడర్కు మధ్యవర్తిగా పని చేస్తుంది. దీనికి గాను రైతు, ట్రేడర్ నుంచి కిలోకు చెరొక రూపాయి చొప్పున కమీషన్ తీసుకుంటుంది. పంట ధరను బోర్డు నిర్ణయించదు. మార్కెట్లో డిమాండ్, సరఫరాను బట్టి ధర వస్తుంది. పొగాకు ఎగుమతి ఆర్డర్లు ఇంత వరకూ ఖరారు కాలేదు. ప్రధాన ఎగుమతి సంస్థలు పొగాకు శాంపిల్స్ను వివిధ దేశాల్లోని సిగరెట్ తయారీ సంస్థలకు పంపించాయి. మొదట పంపిన శాంపిల్స్ వారికి నచ్చకపోవడంతో రెండోసారి మళ్లీ పంపించారు. ఈ నేపథ్యంలో ఆయా ఏజెన్సీల ప్రతినిధులు ఈ ప్రాంతంలో పర్యటించి పొగాకును పరిశీలించి వెళ్లారు. త్వరలో ఆర్డర్లు రావచ్చని అధికారులు భావిస్తున్నారు. రూ.425.62 కోట్ల పొగాకు విక్రయాలు ఎన్ఎల్ఎస్ ప్రాంతంలోని ఐదు వేలం కేంద్రాల్లో ఇప్పటి వరకూ రూ.425.62 కోట్ల విలువైన పొగాకు విక్రయాలు జరిగాయి. కిలోకు గరిష్టంగా రూ.290, కనిష్టంగా రూ.200, సగటున రూ.274.95 చొప్పున ధర పలికింది. ట్రేడర్లు 1,19,775 బేళ్లు కొనుగోలు చేశారు. పొగాకును నాలుగు గ్రేడులుగా విభజించి రైతులు బేళ్లు తయారు చేస్తారు. మొదటి గ్రేడు పొగాకు కొనుగోలు చేస్తున్న ట్రేడర్లు మిగిలిన గ్రేడ్ల పొగాకు కొనడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. త్వరగా అమ్ముకోవాలి వేలానికి బేళ్లు తక్కువగా వస్తున్నాయి. కొనుగోళ్లు మందకొడిగా జరుగుతున్నాయి. చాలా మంది రైతులు ఇప్పటి వరకూ కిలో పొగాకు కూడా అమ్మలేదు. వారికి నోటీసులిచ్చాం. వర్షాలు పడితే పొగాకు నాణ్యత దెబ్బ తింటుంది. ప్రస్తుతం మీడియం, బ్రైట్ గ్రేడ్ పొగాకు కొనుగోలు చేస్తున్నారు. ఇంతవరకూ 15.48 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. అమ్ముడుపోతున్న గ్రేడ్ పొగాకును వేలానికి తీసుకురావాలి. రైతులు తమ వద్ద మున్న పొగాకును త్వరితగతిన అమ్ముకోవాలి. – జీఎల్కే ప్రసాద్, రీజినల్ మేనేజర్, పొగాకు బోర్డు, రాజమహేంద్రవరం జాగ్రత్తగా అమ్ముకోవడం మంచిది రాష్ట్రంలో 167 మిలియన్ల కిలోల పొగాకు ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా 240 మిలియన్ల కిలోలు పండింది. బర్లీ పొగాకు అధికంగా పండింది. అంతర్జాతీయంగా ప్రతి దేశంలోనూ పంట ఉత్పత్తి పెరిగింది. ఈ పరిస్థితిని అధికారులు, కంపెనీలు ముందు నుంచీ చెప్పినా ఒక్క రైతూ వినలేదు. బ్యారన్కు (4 ఎకరాల్లో) 41.25 క్వింటాళ్లు పండించాల్సి ఉండగా, 100 క్వింటాళ్లు పండించిన రైతులున్నారు. ఈ ఏడాది దెబ్బ తిన్న రైతులు ఎక్కువగానే ఉన్నారు. – గద్దే శేషగిరారావు, మాజీ వైస్ చైర్మన్, పొగాకు బోర్డు -
రత్నగిరిపై మరో అపచారం!
● సత్యదేవుని వార్షిక కల్యాణ మండపం ముందు భారీ వివాహ సెట్టింగ్ ● షెడ్డు సగం ఆక్రమించి అట్టహాసంగా వివాహం ● భక్తులకు ఇబ్బందులుఅన్నవరం: సత్యదేవుని వార్షిక కల్యాణ మండపం ముందు సాధారణంగా దేవస్థానం వైదిక కార్యక్రమాలు తప్ప మరే ఇతర కార్యక్రమాలూ నిర్వహించరు. అది కూడా వార్షిక కల్యాణ మండపాన్ని మూసివేసేలా ఎటువంటి సెట్టింగులనూ అనుమతించరు. వివాహ ముహూర్తాల సమయంలో ఆ కల్యాణ మండపం ముందున్న విశ్రాంతి మండపంలో పేద, మధ్యతరగతి వారు చిన్నచిన్న మండపాలు వేసుకుని వివాహాలు చేసుకుంటారు. ఆ షెడ్డు నిర్మించక ముందు నుంచే అక్కడ అలా వివాహాలు చేసుకుంటున్నారు. కానీ ఎప్పుడూ పెద్ద పెద్ద సెట్టింగ్లు వేసి వివాహాలకు అనుమతి లేదు. కానీ, ఆదివారం ఉదయం మాత్రం యలమంచిలికి చెందిన వారు స్వామివా రి వార్షిక కల్యాణ వేదిక ముందు చాలా పెద్ద సెట్టింగ్ వేసి అట్టహాసంగా వివాహం చేశారు. వార్షిక కల్యాణ వేదిక ముందు దాతల సహకారంతో నిర్మించిన విశ్రాంతి షెడ్డును కుర్చీలు వేసి, సగం వరకూ ఆక్రమించేశారు. భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు అక్కడకు రాకుండా బారికేడ్లు కూడా కట్టేశారు. ఉదయం 6 నుంచి 11.30 గంటల వరకూ ఈ వివాహ వేడుకలు నిర్వహించారు. మధ్యాహ్నం వరకూ ఆ సెట్టింగ్ అలాగే ఉంది. దీంతో మిగిలిన సగం షెడ్డులోనే సేద తీరుతూ భక్తులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు పక్కనే ఉన్న రామాలయంలో దర్శనానికి వచ్చిన వారు కూడా అవస్థలు పడ్డారు. ఈ వివాహ సెట్టింగ్ వలన పండితులు నిర్వహించిన సూర్య నమస్కారాలు కూడా భక్తులకు కనిపించలేదు. పండితులు ఆ సెట్టింగ్ వెనుకనే ఉండి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ విశ్రాంతి షెడ్డును ఇప్పటి వరకూ ఈవిధంగా ఆక్రమించి, వివాహం జరిపిన సందర్భం లేదు. ఈవిధంగా చేయడానికి గతంలో ఎప్పుడూ ఎవ్వరూ అనుమతి కూడా ఇవ్వలేదు. స్వామివారి వార్షిక కల్యాణ మండపంలో వివాహం చేసుకోవడానికి నిర్వాహకులు దేవస్థానానికి రూ.10 వేలు చెల్లించారని అధికారులు చెప్పారు. వార్షిక కల్యాణ మండపం ముందు భాగాన్ని ఈ విధంగా ఆక్రమించి, వివాహం చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం అపచారమేనంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కంప్యూటర్ ఇంజినీరింగ్పై గురి
● ఏపీ ఈఏపీ సెట్ టాపర్ల మనోగతం ● పలువురికి ఉత్తమ ర్యాంకులు రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం గత నెలలో నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఈ పరీక్షల ఫలితాలను సెట్ చైర్మన్, జేఎన్టీయూ–కాకినాడ వైస్ చాన్స్లర్ సీఎస్ఆర్కే ప్రసాద్, సెట్ కన్వీనర్ వీవీ సుబ్బారావు ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఏపీ ఈఏపీ సెట్కు సంబంధించి ఇంజినీరింగ్ విభాగంలో 7,641 మంది, అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగాల్లో 2,580 మంది, రెండు విభాగాల్లో ఐదుగురు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల మనోగతమిదీ.. పేరు: ఆదిమూలం శ్రీహర్ష, అరవపాలెం, కడలి, రాజోలు ర్యాంకు: 20 తండ్రి: ఆదిమూలం వీర రాఘవులు, టీచర్ తల్లి: ఆదిమూలం పద్మావతి, టీచర్ లక్ష్యం: ఐఐటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్. పేరు: చింతా సాయి కేశవరామ్, బొమ్మూరు ర్యాంకు: 27 తండ్రి: చింతా శ్రీనివాస్, ప్రైవేటు ఉద్యోగి తల్లి: చింతా శ్రీదేవి, గృహిణి లక్ష్యం: ముంబై ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. పేరు: వనపర్తి తేజశ్రీ, రాజమహేంద్రవరం ర్యాంకు: 31 తండ్రి: వనపర్తి మల్లేశ్వరరావు, ఫైనాన్షియల్ అడ్వైజర్ తల్లి: లక్ష్మి, గృహిణి లక్ష్యం: ఐఐటీ చదివి, సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావడం. పేరు: కంచుమర్తి ప్రణీత్, రాజమహేంద్రవరం ర్యాంకు: 36 తండ్రి: ప్రతాప్ జీవన్, ఏడీ, అగ్రికల్చర్ తల్లి: కంచుమర్తి మీనా, ఏఓ, అగ్రికల్చర్ లక్ష్యం: ముంబై ఐఐటీలో కంప్యూటర్ ఇంజినీరింగ్. పేరు: దువ్వి ఆశిష్ సాయి శ్రీకర్ ర్యాంకు: 66 తండ్రి: దువ్వి శ్యామ్ కిరణ్, వైద్యులు తల్లి: నీలపాల పద్మజ, వైద్యులు లక్ష్యం: ఐఐటిలో కంప్యూటర్ ఇంజినీరింగ్. పేరు: కె.యశ్వంత్రాజా, మానేపల్లి, రాజోలు ర్యాంకు: 26 తండ్రి: నాగ వెంకటరత్నం నాయుడు, టీచర్ తల్లి: సత్యవేణి, గృహిణి లక్ష్యం: ఐఐటీ, సాఫ్ట్వేర్ ఇంజినీర్ పేరు: డి.కిరీటి, రాజమహేంద్రవరం ర్యాంకు: 8 తండ్రి: డాక్టర్ డీఎస్ అరుణ్ కుమార్, ఈఎన్టీ స్పెషలిస్ట్ తల్లి: లత, గృహిణి లక్ష్యం: కార్డియాలజీ, స్కల్బేస్ స్పెషలైజేషన్ పేరు: ఎం.సూర్య సంతోష్రెడ్డి, పందలపాక, బిక్కవోలు మండలం ర్యాంకు: 12 తండ్రి: డాక్టర్ మల్లిడి కృష్ణారెడ్డి, వైద్యుడు తల్లి: సంధ్యాదేవి, కెమిస్ట్ లక్ష్యం: జనరల్ సర్జన్, గ్రామీణ ప్రజలకు వైద్య సేవలందించడం. పేరు: ఎల్.అభిషేక్, ఎన్.కొత్తపల్లి, ఉప్పలగుప్తం ర్యాంకు: 39 తండ్రి: గణపతి, ఆక్వా కల్చర్ తల్లి: లక్ష్మి, గృహిణి లక్ష్యం: న్యూరోసర్జన్ -
లేబర్ కోడ్స్ రద్దుకు వచ్చే నెల 9న సమ్మె
రాజమహేంద్రవరం సిటీ: కార్మిక హక్కులు హరించేలా రూపొందించిన లేబర్ కోడ్స్ రద్దు చేయాలనే డిమాండుతో దేశవ్యాప్తంగా వచ్చే నెల 9న నిర్వహించనున్న కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.సుందరబాబు, బి.పవన్ పిలుపునిచ్చారు. నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో సమ్మె వాల్పోస్టర్ను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 11 కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యాన సార్వత్రిక సమ్మె జరుగుతుందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా, ఇప్పుడున్న హక్కులు కూడా లేకుండా కార్మికులను పూర్తిగా అణచివేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పైకి మాత్రం చట్టాలను ఆధునీకరిస్తున్నామని చెబుతున్నా కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ పేరుతో రద్దు చేసే కుట్ర చేస్తోందని. దీనిని కార్మిక వర్గం తిప్పికొట్టాలని అన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి కేఎస్వీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీహెచ్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తి రాజమహేంద్రవరం రూరల్: ధవళేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్(ఆర్టీహెచ్)ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్గా లేదా ప్రత్యక్షంగా ప్రారంభించనున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జాయింట్ కలెక్టర్, నోడల్ అధికారి ఎస్.చిన్నరాముడు తెలిపారు. ఆర్టీహెచ్ కేంద్రాన్ని సమన్వయ శాఖల అధికారులతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని, అక్కడి నుంచి వర్చువల్గా ధవళేశ్వరంలోని ఆర్టీహెచ్ను ప్రారంభిస్తారని చెప్పారు. ఒకవేళ నేరుగా హాజరైనా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామని అన్నారు. ఆర్టీహెచ్ను ప్రారంభించిన అనంతరం ప్రభుత్వ, విద్యా సంస్థలు, పారిశ్రామికవేత్తలతో సీఎం సంభాషించి, వారి ఆలోచనలను తెలుసుకుంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి మార్టిన్ లూథర్, నగర పాలక సంస్థ ఎస్ఈ ఎంసీహెచ్ కోటేశ్వరరావు, ఈపీడీసీఎల్ ఈఈ నక్కపల్లి శామ్యూల్, సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్, ఇన్చార్జి తహసీల్దార్ బి.శ్రీనివాస్, ఇన్చార్జి ఎంపీడీఓ ఆర్మ్స్ట్రాంగ్ తదితరులు పాల్గొన్నారు. నేడు పీజీఆర్ఎస్ రాజమహేంద్రవరం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవా రం కలెక్టరేట్తో పాటు డివిజన్, మండల స్థాయిల్లో జరుగుతుందని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ నంబర్ 95523 00009 నంబర్ ద్వారా, 1100 నంబర్తో ‘మీకోసం కాల్ సెంటర్’కు కూడా నేరుగా అర్జీ దాఖలు చేయవచ్చని పేర్కొన్నారు. కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి ఆధ్వర్యాన అర్జీలు స్వీకరిస్తారన్నారు.యోగాపై నేడు ర్యాలీ రాజమహేంద్రవరం రూరల్: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా సాధకులతో సోమవారం జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ర్యాలీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపాసారు. జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో జిల్లా యంత్రాంగం, రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ, ఆయుష్, వైద్య, ఆరోగ్య, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు, మహిళలు, విద్యార్థులతో కలిసి ఉదయం 7 గంటలకు స్థానిక వై జంక్షన్ నుంచి దేవీచౌక్ వరకూ, తిరిగి వై జంక్షన్ వరకూ ర్యాలీ నిర్వహించనున్నట్లు వివరించారు. 172 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పరిధిలో 48 మంది ఇంటర్, 124 మంది పదో తరగతి విద్యార్థులకు సోమవారం షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డులు అందజేస్తున్నట్లు డీఈఓ కె.వాసుదేవరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. త్యాగరాజ నారాయణ దాస సేవా సమితిలో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. మెరుగైన ఫలితాలు సాధించిన ఈ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డుతో పాటు రూ.20 వేల నగదు పురస్కారం, ధ్రువపత్రం అందజేస్తామన్నారు. -
మట్టి మాయం
ఏలేశ్వరం: దోపిడీకి కాదేదీ అనర్హం అన్నట్టు ప్రత్తిపాడు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల పరిస్థితి తయారైంది. రైతులకు మేలు చేస్తున్న చెరువును సైతం వదలడం లేదు. వేలాది ఎకరాలకు సాగునీరు అందిస్తున్న చెరువులో మట్టిపై కన్నుపడింది. ఏలేశ్వరం శివారులో సుమారు 1,800 విస్తీర్ణంలో ఉన్న తిమ్మరాజు చెరువు ద్వారా సుమారు ఆరు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇందులో మట్టిని నియోజకవర్గ ప్రజాప్రతినిధి అండదండలతో అనుచరులు యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. ఆ ప్రజాప్రతినిధి ప్రధాన అనుచరుడైన ప్రత్తిపాడుకు చెందిన వ్యక్తి మట్టి తవ్వకాల ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. రెండు జేసీబీలతో వందలాది లారీలతో చెరువు గర్భంలోని మట్టిని తరలించేస్తున్నారు. దీనిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు సైతం తమ స్థాయికి మించిన మామూళ్లు అందుతుండడంతో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఫ తెలుగు తమ్ముళ్ల అక్రమ దందా ఫ సాగునీటి చెరువులో తవ్వకాలు ఫ చోద్యం చూస్తున్న అధికారులు -
ఇంటర్ ఫలితాల్లో తిరుమల ప్రభంజనం
రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రథమ సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని ఆ విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. ఎంపీసీలో 470కి 467 మార్కులను సీహెచ్ సందీప్, బత్తుల తన్మయిరిత్విక, ముత్యాల హర్షిత, సింగులూరి తేజ, మువెనున్నీషా ఖాన్, పర్చూరి పునీ త వెంకటసాయి, కిల్లంపల్లి రేవతిదేవి, జె.గోపికధమని, వడ్డి జ్వలితసాయిశివవాణి, మద్దు సూర్యదేవ్, కె. సత్యప్రియ, గెడ్డం రాజనవీన్తేజ, దాడి దినేశ్వర్, ఎ. వీరవెంకట సాయిలిఖిత, కేశన తపస్వి, డి.దీపిక, కొ వ్వూరి హాసిని, దీప్తిమహంతి సాత్విక్ సాధించారన్నా రు. 466 మార్కుల పైన 155 మంది, 465 మార్కుల పైన 506 మంది, 463 మార్కులపైన 1,224 మంది , 460 పైన 177 మంది, 450 పైన 204 మంది పొందారన్నారు. బైపీసీలో 440కి 437 మార్కులను మహమ్మ ద్ మనీష, గంగేయుల కృష్ణచందన, కాగ గాయత్రి, గంపల వీరవెంకట లక్ష్మణ్ సాధించారన్నారు. 435 పైన 90 మంది, 430 పైన 292 మంది, 400 పైగా మార్కులు 501 మంది సాధించారని నున్న తిరులమరావు వివరించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను తిరుమలరావు, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరిలు అభినందించారు. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. -
అంతకందకూ తెగుళ్లు
ఫ వాతావరణ మార్పులతో ఇబ్బంది ఫ దెబ్బతింటున్న తోటలు ఫ సస్యరక్షణ అవసరమంటున్న అధికారులు పెరవలి: అంతకందకూ తెగుళ్లు వ్యాపిస్తున్నాయి.. ముప్పేట దాడి చేస్తున్నాయి.. రైతులను గుక్కతిప్పుకోకుండా మార్చుతున్నాయి.. తూర్పుగోదావరి జిల్లాలో 400 హెక్టార్లలో కంద సాగు జరుగుతోంది. ఇందులో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, తాళ్లపూడి, కొవ్వూరు, నల్లజర్ల, చాగల్లు, కడియం, రాజమహేంద్రవరం రూరల్ మండలాల్లో ఎక్కువగా సాగవుతోంది. ప్రస్తుతం వాతావరణంలో మార్పులతో తెగుళ్లు దాడి చేస్తున్నాయి. ఒకపక్క వర్షాలు, మరోపక్క ఎండల కారణంగా తోటలపై తెగుళ్లు ఆశిస్తున్నాయని, తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కొవ్వూరు ఉద్యాన శాఖ అధికారి సీహెచ్ శ్రీనివాస్ వివరిస్తున్నారు. ముఖ్యంగా ఇనుప ధాతులోపం, జింక్ ధాతులోపం, ఆకుమచ్చ తెగులు, కాండం లేక మొదలు కుళ్లు తెగులు, మొజాయిక్ తెగులు ఆశించాయని, దీని నివారణకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన తెలిపారు. అవి ఇలా.. ఇనుపధాతు లోపం: నీటి తడులు సక్రమంగా లేనప్పుడు ఇనుప ధాతులోపం సహజంగా కనిపిస్తుంది. ఆకులు పత్రహరితాన్ని కోల్పోయి తెల్లగా మారతాయి. ఈ ధాతు లోపాన్ని నివారించడానికి లీటరు నీటికి 5 గ్రాముల అన్నభేది, ఒక గ్రాము నిమ్మ ఉప్పు తగిన మోతాదులో కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి నీటి తడులు పెడుతూ నీటి ఎద్దడి లేకుండా చూడాలి. జింకుధాతు లోపం: ఆకుల ఈనెలు మధ్య పసుపు వర్ణంగా మారి, క్రమేపి ఆకు మొత్తం పండి, ఎండిపోతాయి. ఈ లోపాన్ని నివారించడానికి లీటరు నీటికి మూడు గ్రాముల జింక్ సల్ఫేట్ మోతాదులో కలిపి పది రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు: వర్షాకాలంలో ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. ఆకులపై చిన్న మచ్చలుగా ప్రారంభమై త్వరగా ఎదిగి, ఆకులు పండి, ఎండిపోయి దిగుబడులు బాగా తగ్గిపోతాయి. దీని నివారణకు తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును పిచికారీ చేయాలి. తెగులు ఎక్కువగా ఉంటే లీటరు నీటికి 2 గ్రాముల మెటలాక్సిల్ ఎమ్.జెడ్ మందును ఒకసారి మాత్రమే ఆకులు అన్ని పూర్తిగా తడిసేలా పిచికారీ చేయాలి. దుంపలు తవ్వకానికి కనీసం రెండు నెలల ముందు నుంచి మందును వాడరాదు. కాండం లేక మొదలు కుళ్లు ఈ తెగులు కాండం మొదలు వద్ద ఆశించి కాండం పూర్తిగా కుళ్లి చనిపోతుంది. దీని నివారణకు మురుగు, వర్షపు నీరు నిల్వ లేకుండా జాగ్రత్త పడాలి. తెగులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇదే చేలో తిరిగి ఈ పంట వేయరాదు. పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలి. తెగులు ఆశించిన చెట్టు చుట్టూ మట్టిని గట్టుగా చేసి, తడి పెట్టినప్పుడు, నీటి ద్వారా ఇతర మొక్కలకు వ్యాపించకుండా అరికట్టాలి. తెగులు ఆశించిన చెట్టు మొదలు చుట్టూ ఉన్న మట్టిని లీటరు నీటికి 2 గ్రాముల కాప్టాన్ లేక 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును కలిపిన ద్రావణంలో బాగా తడిపి తెగులును అరికట్టవచ్చు. 05ఎన్డీడీ48: ఎల్లో మొజాయిక్ తెగులు సోకి గిడసబారి ఇలా.. మొజాయిక్ తెగులుతెగులు ఆశించిన మొక్కల ఆకులు పత్ర హరితాన్ని కోల్పోయి, తెలుపు, పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు చిన్నవిగా, ముడుచుకుపోయినట్టు ఉంటాయి. ఈ వైరస్ విత్తనపు దుంపలు, పేను బంక పురుగుల ద్వారా వ్యాపిస్తుంది. దీని నివారణకు విత్తన దుంపలను తెగులు సోకిన తోటల నుంచి సేకరించాలి. పేను బంక నివారణకు డైమిధోయేట్ లేదా మిథైల్ డెమెటాన్లను 2 మిల్లీలీటర్లు ఒక లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారీ చేయాలి. -
లోక కల్యాణార్థం వేద సదస్యం
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి దివ్య తిరు కల్యాణోత్సవాల్లో భాగంగా మూడో రోజు శనివారం ఆలయం సందడిగా మారింది. దేవస్థానం ముఖ్య అర్చకుడు గొడవర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, శ్రీవారికి సహస్ర నామార్చన, బాలభోగ నివేదన, చతుస్థానార్చనలు, వేద పారాయణ, హోమాలు, బలిహరణ, మంగళశాసనాలు, తీర్థ ప్రసాద గోష్టి, సదస్యం (పండిత సన్మానం), వేద పారాయణ, నిత్య హోమం, బలిహరణ, తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 30 మంది వేద పండితుల ఆధ్వర్యంలో చతుర్వేద మహదాశీర్వచనంలో భాగంగా లోక కల్యాణార్థం వేద సదస్యం నిర్వహించారు. ఆకట్టుకున్న కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కళాకారులు ఆలపించిన ఆధ్యాత్మిక గీతాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అప్పనపల్లికి చెందిన శ్రీశేష శారద భక్త బృందం ఆలపించిన పురంధర దాసు కీర్తనలు అబ్బురపర్చాయి. మానేపల్లికి చెందిన అరుణకుమారి, జీవీ రమణ బృందం ఆధ్యాత్మిక గీతాలు ఆలపించింది. అప్పనపల్లికి చెందిన కాజులూరి మహేంద్రకుమార్ బృందం ఆధ్యర్యంలో శ్రీసీతారామ బాలభక్త బృందం కళాకారులు తమదైన శైలిలో ఆధ్యాత్మిక గీతాలను పాడారు. ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. -
పెళ్లింట వినోదం.. అంతలోనే విషాదం
గండేపల్లి: ఆ పెళ్లింట ఆనందంగా గడుపుతున్న వేళ అంతలోనే విషాదం చోటుచేసుకుంది. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, బంధువులతో కళకళలాడుతున్న చోట అంతులేని దుఃఖం మిగిలింది. అందరితో సరదాగా గడిపిన వ్యక్తి మృత్యుఒడికి చేరుకున్న సంఘటన ఇది. ఆ వివరాల్లోకి వెళ్తే.. గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట గ్రామ సర్పంచ్, వైఎస్సార్ సీపీ నాయకుడు ములంపాక సురేష్ సోదరుడు కృష్ణ (48) హఠాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురై మృత్యువాతకు గురయ్యాడు. గురువారం రాత్రి సమీప బంధువు వివాహ వేడుకలో కృష్ణ ఎంతో సరదాగా గడిపి, శుక్రవారం రాత్రి బంధువులు, కుటుంబ సభ్యులతో కలసి భోజనం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య దేవి, కొడుకు కార్తీక్, కూతురు హాసిని ఉన్నారు. మారేడుమిల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్గా కృష్ణ పని చేస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అందరినీ నవ్వుతూ పలకరిస్తూ ఉండే అతను మృతి చెందడం జీర్ణించుకోలేకపోతున్నామని స్నేహితులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అతని కొడుకు 9వ తరగతి పూర్తి చేయగా, కుమార్తె ఇంటర్ ఫలితాల్లో 987 మార్కులు సాధించారు. ఈ ఆనందాన్ని పంచుకునేలోపే దూరమైపోయావా అంటూ కుటుంబ సభ్యుల రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. పాముకాటుకు ఉపాధి కూలీ మృతి కాజులూరు: పెదలంకలో పాముకాటుకు ఉపాధి కూలీ పాలిక నాగేశ్వరరావు (62) మృతి చెందాడు. స్థానికులు, ఉపాధి ఏపీఓ వెంకటలక్ష్మి కథనం ప్రకారం.. శనివారం స్థానికంగా ఉండే పంట కాలువ వద్ద ఉపాధి పనులు చేస్తుండగా పాలిక నాగేశ్వరరావును తాచుపాము కరవడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. స్థానికులు సమీపంలోని యానాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సంఘటనా స్థలాన్ని ఏపీఓ వెంకటలకి్ష్మ్, సర్పంచ్ చెరువూరి వెంకట సత్యనారాయణ రాజు పరిశీలించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. 07జెపిటి122: పెళ్లికి ముందు కల్యాణ వేదిక వద్ద భార్యతో కలసి డ్యాన్స్ చేస్తున్న కృష్ణ -
భారం చెత్తగించండి..
ఫ రత్నగిరిపై పారిశుధ్యానికి పెరిగిన ఖర్చులు ఫ కొత్త టెండర్ అంచనాల ప్రకారం నెలకు రూ.80 లక్షలు అన్నవరం: సత్యదేవునికి వచ్చే ఆదాయం కన్నా అయ్యే ఖర్చు ఎక్కువగా కనిపిస్తోంది. ఏ నిర్మాణాలూ చేపట్టకుండా, సీజీఎఫ్, ఆడిట్ ఫీజు, అర్చక వెల్ఫేర్ ట్రస్ట్లకు చెల్లింపులు చేయకుండా అలా నెట్టుకుంటూ వెళ్తే సరి.. లేకపోతే బండి ఎక్కడ ఆగిపోతుందో తెలియని పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో దేవస్థానానికి మరింత ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ పారిశుధ్య నిర్వహణ మరింత భారం కానుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. అన్నవరం శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంతో సహా రాష్ట్రంలోని ఏడు ప్రముఖ దేవస్థానాల్లో శానిటరీ మెటీరియల్తో సహ క్లీనింగ్, హౌస్ కీపింగ్ తదితర పారిశుధ్య పనులు నిర్వహించేందుకు గత ఏప్రిల్లో పిలిచిన సెంట్రలైజ్డ్ టెండర్ ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. మరికొన్ని అంశాలను కలిపి త్వరలో రీటెండర్ పిలవనుంది. కొలిక్కి రాని టెండర్ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏ దేవస్థానానికి ఆ దేవస్థానం శానిటరీ టెండర్లు పిలిచి ఖరారు చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని ప్రముఖ దేవస్థానాలకు ఒకే శానిటరీ టెండర్ పిలవాలని దాదాపు ఆరు నెలలు ఆలస్యం చేశారు. అన్నవరం, సింహాచలం, శ్రీశైలం, ద్వారకాతిరుమల, విజయవాడ దుర్గగుడి, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాల్లో పారిశుధ్య పనులు, వివిధ సత్రాల్లో హౌస్ కీపింగ్, రహదారులు, టాయిలెట్ల క్లీనింగ్, ఫెసిలిటీ మేనేజ్మెంట్ తదితర పనులు నిర్వహించడానికి రెండేళ్ల కాల పరిమితికి గత ఏప్రిల్లో పిలిచిన టెండర్ను రద్దు చేశారు. సత్రాల్లో ఏసీలు, విద్యుత్ ఉపకరణాల నిర్వహణతో పాటు సిబ్బందికి వారాంతపు సెలవులు, మహిళా సిబ్బందికి నెల నెలా వచ్చే శారీకర మార్పులప్పుడు ఇవ్వాల్సిన సెలవులకు గాను అదనపు సిబ్బందిని కూడా కలుపుతూ కొత్తగా టెండర్ పిలవనున్నారు. పెరగనున్న సిబ్బంది, ఖర్చులు రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాల్లో విస్తీర్ణంలో శ్రీశైలం దేవస్థానం తరువాత అన్నవరం విస్తీర్ణం పెద్దది. అందుకే అన్నవరం దేవస్థానంలో ప్రస్తుతం 349 మంది మాత్రమే పని చేస్తుండగా, 375 మంది సిబ్బంది అవసరమని లెక్కేశారు. కొత్త టెండర్లో సిబ్బంది పెరిగితే శానిటరీ కాంట్రాక్ట్ వ్యయం కూడా పెరగనుందని అంచనా వేస్తున్నారు. కాగా, రెండేళ్లు శానిటరీ కాంట్రాక్ట్ నిర్వహించిన కేఎల్టీఎస్ సంస్థ నెలకు రూ.49 లక్షలకు పారిశుధ్య పనులు నిర్వహించింది. నవంబర్తో ఆ సంస్థ టెండర్ ముగిసినా ఫిబ్రవరి నెలాఖరు వరకూ కొనసాగించింది. ఆ సంస్థ కాంట్రాక్ట్ నుంచి వైదొలిగాక దేవస్థానం తాత్కాలికంగా రెండు నెలల నుంచి గుంటూరుకు చెందిన కనకదుర్గా ఏజెన్సీస్కు నెలకు రూ.59 లక్షలు చెల్లిస్తున్నారు. మరో రూ.12 లక్షలు శానిటరీ మెటీరియల్కు ఖర్చు చేస్తున్నారు. అంటే మొత్తం మీద రూ.71 లక్షల ఖర్చు అవుతోంది. పారిశుధ్య పనుల్లో అత్యాధునిక మిషనరీలు ఉపయోగించాలనే షరతుతో పాటు, శానిటరీ సిబ్బందికి లేబర్ యాక్ట్ ప్రకారం కచ్చితంగా జీతాలు చెల్లించాలనే షరతుతో ఈ సారి రూ. 80 లక్షలకు పైగా టెండర్ కోట్ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. అంటే ఏడాదికి దాదాపు రూ. పది కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. బడ్జెట్ సవరించాలి అన్నవరం దేవస్థానానికి సంబంధించి 2025–26 ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్ రూ.171.33 కోట్లు కాగా, అందులో పారిశుధ్య నిర్వహణకు రూ.7.5 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇప్పుడు పారిశుధ్య నిర్వహణ వ్యయం రూ.పది కోట్ల వరకూ పెరిగే అవకాశం ఉన్నందున ఆ మేరకు కేటాయింపులు సవరించాల్సి ఉంది. అభ్యంతరాల నేపథ్యంలో.. గత ఏప్రిల్లో పిలిచిన శానిటేషన్ టెండర్లలోని ప్రీ బిడ్ సమావేశంలో పాల్గొన్న పలు సంస్థల ప్రతినిధులు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇందులో సిబ్బందికి వీక్లీ ఆఫ్ ఇవ్వాలంటూ నిబంధన చేర్చారని, అటువంటప్పుడు సిబ్బందిని పెంచకుండా వీక్లీ ఆఫ్ ఎలా ఇవ్వాలంటూ వారి నుంచి ప్రశ్న వచ్చింది. దీంతో ఆ టెండర్ను రద్దు చేసి కొత్త నిబంధనలు, సిబ్బంది పెంపుదలతో కొత్త టెండర్ పిలవడానికి ప్రభుత్వం దేవదాయశాఖకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు త్వరలోనే రీ టెండర్ పిలవనున్నారు. -
సీలేరులో యువకుడి గల్లంతు
● నలుగురిని రక్షించిన పోలీసులు ● బాధితులు దేవరపల్లి వాసులు ● నదిలో స్నానాలు చేస్తూండగా ప్రమాదం దేవరపల్లి/మోతుగూడెం: స్నేహితులతో విహార యాత్రకు వచ్చిన యువకుల్లో ఒకరు సీలేరు నదిలో స్నానాలు చేస్తూండగా గల్లంతయ్యాడు. నలుగురు యువకులను పోలీసులు రక్షించారు. వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన సుమారు 30 మంది యువకులు శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం సమీపంలోని పొల్లూరు ప్రాంతానికి విహార యాత్రకు వచ్చారు. ఉదయం 9 గంటలకు ఇక్కడకు చేరుకున్న వారు సీలేరు నది ఒడ్డున వంటలు చేస్తూ స్నానాలు చేశారు. మధ్యాహ్నం భోజనాలు చేసిన తరువాత మళ్లీ సీలేరు నది మధ్యలోకి పి.సుధీర్, ఎ.నాగేంద్ర, రామకృష్ణ, ప్రభు, అభిలాష్ వెళ్లారు. అక్కడ స్నానాలు చేస్తూండగా అకస్మాత్తుగా ప్రవాహ ఉధృతి పెరగడంతో వారు నదిలో చిక్కుకుపోయారు. వీరిలో అభిలాష్ (18) కొట్టుకుపోయాడు. మిగిలిన నలుగురూ నది మధ్యలో బండరాయిని పట్టుకుని ఉండిపోయారు. వెంటనే స్థానికులు అందించిన సమాచారంతో ఎస్సై సాధిక్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఏపీ జెన్కో అధికారులకు సమాచారం అందించడంతో నదిలోకి నీటి విడుదలను తగ్గించారు. వెంటనే ఎస్సై ఆధ్వర్యంలో సిబ్బంది తాళ్ల సాయంతో నలుగురు యువకులనూ ఒడ్డుకు చేర్చారు. కొట్టుకుపోయిన అభిలాష్ ఆచూకీ శనివారం సాయంత్రం వరకూ లభ్యం కాలేదు. దీంతో అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విహార యాత్రకు వచ్చిన యువకులంతా తాపీమేస్త్రులుగా పని చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కూడా సీలేరు నదిలో చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆరుగురు యువకులను ఎస్సై సాధిక్ ఆధ్వర్యంలో సిబ్బంది రక్షించారు. విహార యాత్రకు వచ్చిన వారు సీలేరు నదిలో దిగి ప్రమాదానికి గురవడం బాధాకరంగా ఉందని ఆయనన్నారు. విహార యాత్రకు వచ్చిన వారు ఒడ్డున స్నానాలు చేయకుండా నది మధ్యలోకి వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని అన్నారు. త్వరలోనే సీలేరు నది ఒడ్డున ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. -
త్యాగానికి ప్రతీక
ఈ నెలలోనే హజ్ యాత్ర అల్లాహ్ ఆదేశం ప్రకారం ఇబ్రహీం ప్రవక్త తన కుమారుడైన ఇస్మాయిల్ను బలివ్వడానికి తీసుకెళ్లే సంప్రదాయాన్ని గుర్తు చేసుకుంటూ ప్రపంచంలోని ముస్లింలు ఈ పండగ జరుపుకొంటారు. దీనికి ప్రామాణికం ఖురాన్. ఈదుల్ ఫిత్ర్(రంజాన్)లో మాదిరిగా బక్రీదు పండగనాడు కూడా ప్రార్థనలు ఖుత్బా(ధార్మిక ప్రసంగం)తో ప్రారంభమవుతాయి. ఈ నెలలోనే హజ్ యాత్ర చేస్తారు. ఈ యాత్ర కోసం సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి వెళ్లి మస్జిద్–అల్–హరామ్లోని కాబా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 20 లక్షల మంది ముస్లింలు ఒకేసారి హజ్ ద్వారా ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. – సయ్యద్ నిజాముద్దీన్, ఇమామ్, మదీనా మసీద్, రాజమహేంద్రవరం ● జిల్లాలో ఘనంగా బక్రీద్ ● ముస్లింల ప్రత్యేక ప్రార్థనలుసీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): త్యాగానికి ప్రతీకగా నిలిచే పవిత్ర బక్రీద్ పండగ ఈద్ ఉల్ అద్హాను జిల్లా వ్యాప్తంగా ముస్లింలు శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకుకున్నారు. ఉదయం 6 గంటల నుంచే శుద్ధి స్నానం చేసి, కొత్త దుస్తులు ధరించి, ఈద్ నమాజ్ చదివేందుకు ఈద్గాలు, మసీదులకు వెళ్లారు. ఇబ్రహీమ్ ఖలీలుల్లా, ఇస్మాయిల్ జబీవుల్లా ప్రవక్తల త్యాగాలకు ప్రతీకగా బక్రీద్ పండగ నిర్వహిస్తారు. ఇదే రోజు పవిత్ర పుణ్యక్షేత్రం మక్కాలో హజ్ జరుగుతుంది. మక్కాలోని కాబా సమీపంలో ఉన్న అర్భత్ మైదానంలోని పెద్ద మసీదుల్లో బక్రీద్ నమాజ్తో పాటు పలు నియమ నిబంధనలతో ప్రార్థనలు చేస్తే హజ్ పూర్తవుతుంది. అల్లాహ్ సూచించిన ఇస్లాం ధర్మ సూత్రాల్లో ఇది ఒకటి. ప్రతి ముస్లిం తన జీవితంలో పాటించాల్సిన పంచ నియమాలను పవిత్ర గ్రంథం ఖురాన్లో అల్లాహ్ సూచించారు. అవే ఈమాన్, రోజుకు ఐదు పూటలా నమాజ్, రోజా, జకాత్, హజ్ యాత్ర. ఆర్థికంగా శక్తి ఉన్న ప్రతి ముస్లిం జీవితంలో ఒకసారైనా హజ్ చేయాలని ప్రస్తావించారు. ఇది 40 రోజుల యాత్ర. బక్రీద్ పర్వదినం సందర్భంగా జిల్లాలోని మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాజమహేంద్రవరం రాయల్ మాస్క్, జామా మసీదు, అబూబకర్ షా మసీద్, బిలాల్ మసీద్, జాంపేట మసీదు, దానవాయిపేట మసీదుతో పాటు పలు ఈద్గాలలో ఈద్ నమాజ్ నిర్వహించారు.దైవం పట్ల విధేయత.. ఖుర్బానీ తనకు అత్యంత ప్రీతిపాత్రమైన దానిని సర్వ సృష్టికర్త అయిన అల్లాహ్కు ఖుర్బానీ ఇవ్వడం.. దైవం పట్ల దాసుడు విధేయత ను చాటుకునే ఒక అత్యున్నత సందర్భం. ధార్మికంగానే కాకుండా ప్రాపంచికంగా కూడా బక్రీద్ పండగ వల్ల ఎంతో మేలు జరుగుతుంది. – ఎం.ఆరిఫ్, జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ -
రత్నగిరిలో భక్తజన సంద్రం
● సత్యదేవుని దర్శించిన 50 వేల మంది ● 2,300 వ్రతాల నిర్వహణ ● దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం అన్నవరం: రత్నగిరి శనివారం భక్తజన సంద్రాన్ని తలపించింది. శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున రత్నగిరి, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ దంపతులు, వారి బంధుమిత్రులతో పాటు ఇతర భక్తులు వేలాదిగా సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. రద్దీ అధికంగా ఉండటంతో అంతరాలయ దర్శనాన్ని కొంతసేపు నిలిపివేశారు. సుమారు 50 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. వ్రతాలు 2,300 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. -
మట్టి అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకోవాలి
రాజానగరం: మైనింగ్ చట్టాన్ని ఉల్లంఘించి, వాణిజ్య పరమైన లాభాల కోసం చెరువులను తవ్వి, మట్టి తరలిస్తున్న దుండగులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. మండలంలోని తూర్పు గానుగూడెం ఊర చెరువులో జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలపై శనివారం జిల్లా కలెక్టర్కు ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ప్రజల ప్రయోజనార్థం చెరువులో మట్టిని తవ్వాల్సి వస్తే జల వనరుల శాఖ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ పర్యవేక్షణలో జరగాలన్నారు. కానీ, ఆ విధానం లేకుండా, నిబంధనలు పాటించకుండా అధికార పార్టీ అండదండలతో జలవనరులు, మైనింగ్ శాఖల నిబంధనలను అతిక్రమించి ఈ తవ్వకాలు జరుపుతున్నారని పేర్కొన్నారు. అధికార పార్టీ పెద్దల సహకారంతో నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ మాఫియా ఇప్పటికే రెచ్చిపోతోందని, చెరువుల పూడికల పేరుతో కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. తక్షణమే క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టి, మట్టి మాఫియా ఆగడాలకు బ్రేకులు వేయాలని, ఇప్పటి వరకూ అనధికారికంగా జరిగిన తవ్వకాలకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు.ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. జిల్లా విద్యార్థులు ఫస్టియర్లో 42 శాతం, సెకండియర్లో 55 శాతం చొప్పున ఉత్తీర్ణులయ్యారని ప్రాంతీయ ఇంటర్మీడియెట్ అధికారి (ఆర్ఐఓ) ఎన్ఎస్వీఎల్.నరసింహం తెలిపారు. ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 3,891 మందికి గాను 1,636 మంది, ద్వితీయ సంవత్సరం 2,624 మందికి గాను 1,437 మంది పాసయ్యారు. ఒకేషనల్ విభాగంలో ఫస్టియర్ 819 మందికి 394 మంది, సెకండియర్లో 542 మందికి 316 మంది ఉత్తీర్ణత సాధించారు. పరీక్ష ఫలితాలపై అనుమానం ఉంటే రీవెరిఫికేషన్, రీకౌంటింగ్కు ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని నరసింహం సూచించారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కడియం: యోగాతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన కడియపులంకలోని శ్రీ సత్యదేవ నర్సరీలో శనివారం నిర్వహించిన యోగాంధ్ర–2025లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తదితరులతో కలసి సూర్య నమస్కారాలు, యోగాసనాలు వేశారు. డ్రగ్స్ నివారణ, సహాయం కోసం ఏర్పాటు చేసిన ఈగల్ ప్రత్యేక వ్యవస్థ పోస్టర్ను ఆవిష్కరించారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని పురస్కరించుకుని కొత్త మామిడి మొక్కలను ఆవిష్కరించి, యోగాంధ్ర–11గా ఒక మొక్కకు, పీఎస్ఎన్–5గా మరో మొక్కకు పేరు పెట్టారు. జిల్లా పాఠశాల విద్యా శాఖాధికారి కె.వాసుదేరావు రచించిన వృక్ష విలాపం గేయం ఆకట్టుకుంది. కార్యక్రమంలో యోగాంధ్ర నోడల్ అధికారి, జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, నర్సరీ రైతులు పుల్లా పెద సత్యనారాయణ, కుప్పాల దుర్గారావు, మెర్ల కృష్ణ, పుల్లా వీర వెంకట్రావు, నర్సరీ అసోసియేషన్ అధ్యక్షుడు రత్నం అయ్యప్ప, అధికారులు పాల్గొన్నారు. 10న వర్చువల్గా ఆర్టీహెచ్ ప్రారంభం సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్(ఆర్టీహెచ్)ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం వర్చువల్గా ప్రారంభించనున్నారు. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఈ విషయం తెలిపారు. రాష్ట్ర ఉన్నతాధికారులు కాటమనేని భాస్కర్, పీఎస్ ప్రద్యుమ్నలు శనివారం నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్లో తన క్యాంపు కార్యాలయం నుంచి ఆమె పాల్గొన్నారు. ఆర్టీహెచ్ ఏర్పాటుకు రాజమహేంద్రవరం రూరల్లో భవనం, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. -
ధర ఫుల్.. సరకు నిల్
ఫ అమాంతం పెరిగిన రూప్చంద్ ధర ఫ కేజీ రూ.113 మలికిపురం: రూప్చంద్ చేపల ధరలు భారీగా పెరిగాయి. నాలుగేళ్ల క్రితం కేజీ రూ.30కి పడిపోయిన కేజీ రూప్చంద్ చేపలను ఎగుమతిదారులు ప్రస్తుతం రూ.114కు కొనుగోలు చేస్తున్నారు. మధ్యలో కాస్త పెరుగుదల ఉన్నప్పటికీ ఈ స్థాయిలో ధర పలకడం ఇదే మొదటిసారని ఎగుమతిదారులు అంటున్నారు. 2020లో అత్యధికంగా కిలో రూ.70 పలికిన ఈ చేప ధర అనంతరం రూ.30 కనిష్ట స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం ధర అయితే పెరిగిందిగానీ, రైతుల వద్ద సరకు లేదు. చెరువుల్లో కిలో రూప్చంద్ పెంపకానికి అన్ని ఖర్చులూ కలిపి రూ.80 వరకూ అవుతోంది. నాలుగేళ్లుగా ధర లేక నష్టాల బారిన పడిన రైతులు రూప్చంద్ పెంపకం జోలికే వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ధర పెరిగినా రైతుల వద్ద సరకు లేదు. ఈ చేపలకు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, బిహార్, పశ్చిమ బెంగాల్ తదితర ఈశాన్య రాష్ట్రాల్లో బాగా డిమాండ్ ఉంది. గతంలో భారీగా ఎగుమతులు కోస్తా జిల్లాల్లో పదేళ్లుగా ఆక్వా రంగం కుదేలవుతున్న తరుణంలో రైతులు ఐదేళ్ల క్రితం ముమ్మరంగా రూప్చంద్ చేపల సాగు చేశారు. కోస్తా జిల్లాల నుంచి ఏటా 25 వేల టన్నుల రూప్చంద్ చేపలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి అయ్యేవని అంచనా. అయితే, ధర పతనమైన తరువాత రైతులు దాని జోలికి వెళ్లలేదు. వేరే అవకాశం లేని ప్రాంతాల్లో తప్ప మిగిలిన ప్రాంతాలో ఈ చేపల సాగు నిలిపి వేశారు. అయినప్పటికీ ప్రస్తుతం ఏటా 5 వేల టన్నులకు పైగా ఈ చేపల ఎగుమతులు జరుగుతున్నట్లు అంచనా. ధర బాగున్న సమయంలో ఇక్కడి రైతులు సాగు చేశారు. ఎకరం చెరువులో సుమారు 4 వేల నుంచి 5 వేల వరకూ రూప్చంద్ చేప పిల్లలను పెంచుతారు. ఎకరానికి నాలుగు టన్నుల పైనే దిగుబడి వస్తుంది. తెగుళ్లను తట్టుకుని ఈ చేప పెరుగుతుంది. ఇవీ ప్రత్యేకతలు కొన్ని దేశాల్లో పిరాపింగా లేదా రెడ్–బెల్లీడ్ పాకు అని కూడా ఈ చేపను పిలుస్తారు. ఇది దక్షిణ అమెరికా మూలానికి చెందిన మంచినీటి చేప. రెడ్–బెల్లీడ్ పాకును అసోంలో సాధారణంగా శ్రీరుప్చంద్ఙ అని పిలుస్తారు. పాకు అనేది అనేక దక్షిణ అమెరికా చేప జాతులను సూచించడానికి ఉపయోగించే సాధారణ పేరు. ప్రత్యేకమైన రుచి కలిగిన చేపల్లో రూప్చంద్ ఒకటి. చెరువుల్లో పెంచుతారు కాబట్టి దీనిని కోస్తాలో చెరువు చందువా అని పిలుస్తారు. సముద్ర చందువా చేపలకు పోటీగా దీనిని మత్స్యశాఖ శాస్త్రవేత్తలు ఇక్కడ ప్రవేశపెట్టారు. కోల్కతా నుంచి సీడ్ వస్తుంది. సముద్ర చందువా చేపలు ఒక సీజన్లో మాత్రమే లభిస్తాయి. రూప్చంద్ చేప మన దేశంతో పాటు బంగ్లాదేశ్, చైనాల్లో కూడా పెరుగుతుంది. అన్ని సీజన్లలోనూ లభిస్తుంది. ఇది భిన్నమైన నిర్మాణ శైలి కలిగి ఉన్న చేప. సముద్ర చందువాతో పాటే, చెరువు చందువా చేపను చైనీస్లో ఫ్రాంఫెట్ అని పిలుస్తారు. తెలుగులో దీనిని చందువా లేదా సందువా అని అంటారు. ఈ జాతి చేపలు కొన్ని ఎరుపు, తెలుపు, నలుపు, సిల్వర్ రంగుల్లో ఉంటాయి. చెరువుల్లోనూ, నదుల్లోనూ పెరుగుతాయి. సిల్వర్ రంగు చేపలు ఉప్పునీటిలో సైతం పెరుగుతాయి. ఎముకను కలిగి ఉండటం ఈ చేప ప్రత్యేకత. అయితే ముళ్లు గుచ్చుకుంటాయనే భయం లేకుండా ఈ చేపలను ఎక్కువగా ఇష్టంగా తింటారు. రూప్చంద్ మాంసంలో ఎక్కువగా ప్రొటీన్లు, విటమిన్లు లభిస్తాయి. పోషక విలువలు అధికంగా ఉండే ఈ చేపలను ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యకరం. దీనిలో ప్రత్యేకంగా అమైనో ఆమ్లాలు, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. రూప్చంద్ చేపలో సోడియం, పొటాషియం, కాల్షియం, ఐరన్, విటమిన్–సి, విటమిన్–ఇ, శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి తింటే మెదడు బాగా పని చేస్తుంది. గుండె జబ్బులకు గురి కాకుండా ఉంటారు. ఇందులో ఉండే ఐరన్, మెగ్నీషియం మానవ శరీరంలోని ఎంజైముల పని తీరును మెరుగుపరుస్తాయి. పెరిగిన ధరలు ప్రస్తుతం రూప్చంద్ ధరల పెరుగుదలకు పలు కారణాలు చెబుతున్నారు. ప్రధానంగా ఈ చేపల సాగు మన దేశంలోని ఆంధ్రప్రదేశ్తో పాటు బంగ్లాదేశ్, చైనాల్లో ఎక్కువగా ఉంది. చైనా, బంగ్లాదేశ్ల నుంచి దొడ్డి దారిన రూప్చంద్ చేపలను ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్కు తక్కువ ధరలకే తరలించేవారు. ఇటీవల బంగ్లాదేశ్ సరిహద్దులో వాణిజ్యం నిలిచిపోవడం వంటి కారణాలతో ప్రస్తుతం అటు నుంచి రూప్చంద్ దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో, ఆంధ్రాలో ఈ చేపలకు గిరాకీ పెరిగిందని భావిస్తున్నారు. -
వాడపల్లి స్వామికి లక్ష్మీ కటాక్షం
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రంలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తోంది. దేవస్థానం కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఈ వివరాలు తెలిపారు. హుండీలు, టికెట్లు, లడ్డూ ప్రసాదం ద్వారా దేవస్థానానికి గత ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకూ రూ.17,73,72,207 ఆదాయం వచ్చిందన్నారు. నెలకు సగటున రూ.2,21,71,525 సమకూరిందన్నారు. శనివారాల్లో రూ.38,78,288 ఆదాయం లభించిందన్నారు. అలాగే, గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి ఈ ఏడాది మే 31 వరకూ రూ.26,11,62,698 రాబడి వచ్చిందన్నారు. అంతకు ముందు కాలంతో పోలిస్తే ఆదాయం రూ.8,37,90,491 పెరిగిందన్నారు. ఈ కాలంలో నెలకు సగటున రూ.3,26,45,337 వచ్చిందన్నారు. శనివారాల్లో రూ.55,86,962 మేర ఆదాయం రాగా అంతకు ముందుతో పోలిస్తే రూ.17,08,764 పెరుగుదల నమోదైందని తెలిపారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం రూ.1.14 కోట్లతో వివిధ పనులు పూర్తి చేశామని తెలిపారు. ఆలయ నిధులు రూ.11.17 కోట్లతో చేపట్టిన పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రూ.19.30 కోట్లతో శాశ్వత నిర్మాణాలు చేపట్టనున్నామని తెలిపారు. కల్యాణోత్సవాలకు గత ఏడాది రూ.89,67,000, ఈ ఏడాది రూ.71,14,806 మేర ఖర్చయిందని చెప్పారు. మొత్తం మీద ఖర్చు రూ.18,52,194 తగ్గిందన్నారు. గోదాదేవి కల్యాణోత్సవాలకు గత ఏడాది రూ.99,14,800, ఈ ఏడాది రూ.54,07,220 చొప్పున ఖర్చయ్యాయని, ఈ వ్యయం రూ.45,07,580 తగ్గిందని చక్రధరరావు వివరించారు.ఫ గణనీయంగా పెరిగిన ఆదాయం ఫ రూ.1.14 కోట్లతో సౌకర్యాల కల్పన ఫ ఈఓ చక్రధరరావు -
పదవుల కోసం తండ్రిపై ఆరోపణలు సరికాదు
● బార్లపూడి క్రాంతిపై మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి ఫైర్ ● పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ కోసం ఇంత దిగజారి పోవాలా? సాక్షి ప్రతినిధి, కాకినాడ: పదవుల కోసం నీ తండ్రి మీద, నీ తమ్ముడుపై ఆరోపణలు చేయడం సరికాదని కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతికి మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీశివకుమారి సూచించారు. బార్లపూడి క్రాంతి ఇటీవల తండ్రి ముద్రగడపై, సోదరుడు, ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబుపై చేసిన వ్యాఖ్యలకు లక్ష్మీ శివకుమారి ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ కోసం నీవు దిగజారి పోవాలా? అని ప్రశ్నించారు. నీ ఆడపడుచు ఆస్తికోసం మీ నాన్న వాచ్మన్ ఉద్యోగం చేయాలా? అన్నారు. నీ రాజకీయం కోసం మా నాయకుడు గిరిబాబుపై నిందలు వేస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. తన తండ్రి ఆరోగ్యం కోసం కొడుకు గిరిబాబు పడుతున్న కష్టాలు రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు తెలుసునని అన్నారు. ఎన్నికలప్పుడు నీ తండ్రి మీద ఆరోపణలు చేసి పరువు తీసినప్పుడు ఈ ప్రేమ ఏమైందన్నారు. మా నాయకుడు ముద్రగడ ఆరోగ్యం నిలకడగానే ఉంది. నీ తండ్రి ముద్రగడ పద్మనాభం ‘నా కూతురితో ఇంక సంబంధాలు లేవు, నాకు ఏమి జరిగినా చూడటానికి కూడా రావద్ద’ని ఎన్నికల సమయంలో మీడియా ముఖంగా చెప్పింది నీకు గుర్తు లేదా అని ప్రశ్నించారు. మా నాయకుడు గిరిబాబుపై ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేస్తే త్వరలోనే మరిన్ని ఆధారాలతో నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. మా నాయకుడు ముద్రగడ పద్మనాభం పై ఉన్న కక్షతోనే పవన్ కల్యాణ్ జనసేన నాయకురాలు క్రాంతితో వ్యాఖ్యలు చేయిస్తున్నారా? అనే అనుమానం ప్రజల్లో ఉందన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్న క్రాంతిపై పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా నాయకుడు ముద్రగడ ఆరోగ్యంపై నీ సలహాలు మాకు అవసరం లేదు ముందు మీ మామయ్య ఆరోగ్యం, నీ భర్త ఆరోగ్యం కోసం ట్రీట్ మెంట్ చేయించుకో అని ఆమెకు సూచించారు. -
బక్రీద్ పండగకు సర్వం సిద్ధం
● జిల్లాలో ఘనంగా ఈద్ ఉల్ అద్హా నిర్వహణకు ఏర్పాట్లు ● సర్వమానవాళి కోసం దువా చేయనున్న మత పెద్దలు సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): బక్రీద్ పండుగ ఈదుల్ అద్హాను శనివారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకునేందుకు ముస్లింలు సిద్ధమవుతున్నారు. ఈద్గాలతో పాటు మసీదుల్లోనూ నమాజ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే శుద్ధి స్నానం చేసి కొత్త దుస్తులు వేసుకుని ఈద్ నమాజ్ చదివేందుకు ఈద్గాలకు బయలుదేరతారు. ‘అల్లాహు అక్బర్.... అంటూ తక్బీర్ చదువుకుంటూ తద్గాలకు చేరుకుంటారు.ఈద్గాలకు వెళ్లలేని వారు సమీపంలోని మసీదులకు వెళ్లి ఈద్ నమాజు చేస్తారు. ఈద్గా, మసీదుల్లో నమాజు చేయించే ఖాజీలు, మౌల్వీలు తమ ఆధ్యాత్మిక ప్రసంగం అనంతరం దువా చేస్తారు. సర్వమానవాళి శాంతి కోసం, జీవితంలో చేసిన పాపాల విముక్తి కోసం అల్లాహ్ను వేడుకుంటారు. నమాజు, దువా అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ చెప్పుకుంటూ కరచాలనం, ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకుంటారు. కొందరు బక్రీద్ సందర్భంగా ఉపవాసాలు ఉంటారు. మరి కొందరు ఈద్కు ఒక రోజు ముందు రోజూ ఉపవాసం పాటిస్తారు. ఇంకొందరు పండగ రోజు ఈద్ నమాజు పూర్తయ్యే వరుకు ఏమీ తినకుండా వెళ్లి ప్రార్థనలు చేస్తారు. శుభాలు జరగాలని కోరుకుంటారు. త్యాగాలకు ప్రతీక.... ఇబ్రహీమ్ ఖలీలుల్లా, ఇస్మాయిల్ జబీవుల్లా ప్రవక్తల త్యాగాలకు ప్రతీకగా బక్రీద్ పండగ చేసుకుంటారు. ఇదే రోజు పవిత్రమైన పుణ్యక్షేత్రం మక్కా ప్రాంతంలో హజ్ జరుగుతుంది. మక్కాలోని కాబా సమీపంలో ఉన్న అర్భత్ మైదానంలో ఉన్న పెద్ద మసీదులలో బక్రీద్ నమాజ్ చేయడంతో పాటు పలు నియమ నిబంధనలతో ప్రార్థనలు చేస్తే హజ్ పూర్తవుతుంది. అల్లాహ్ సూచించిన ఇస్లాం ధర్మ సూత్రాల్లో ఇది ఒకటి. తమ జీవితంలో పాటించాల్సిన పంచ నియమాలను పవిత్ర గ్రంథం ఖురాన్లో అల్లాహ్ సూచించారు. అవే ఈమాన్, రోజుకు ఐదు పూటల నమాజ్, రోజా, జకాత్, హజ్యాత్ర, ఆర్థికంగా శక్తి ఉన్న ప్రతి ముస్లిం జీవితంలో ఒకసారైనా హజ్ చేయాలని ప్రస్తావించారు. ఇది 40 రోజుల యాత్ర. ఈద్గాలతో పాటు మసీదుల్లో ఏర్పాట్లు రాజమహేంద్రవరంలో రాయల్ మాస్క్, జామా మసీదు, అబుబకర్ షామసీద్, బిలాల్ మసీద్, జాంపేట మసీదు, దానవాయిపేట మసీదు, పలు ఈద్గాలలో ఈద్ నమాజ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. -
గోగులమ్మకు వెండి కిరీటం సమర్పణ
రాజానగరం: స్థానిక రావుల చెరువు గట్టున కొలువైవున్న గోగులమ్మకు వెండి కిరీటాన్ని భక్తులు శుక్రవారం సమర్పించారు. రాజానగరంతోపాటు పలుప్రాంతాలకు చెందిన భక్తులంతా కలసి సుమారు రూ.4 లక్షలు విలువ చేసే 4 కిలోల బరువు ఉన్న ఈ కిరీటాన్ని శనివారం జరిగే తిరునాళ్లను పురస్కరించుకుని అమ్మవారికి కానుకగా సమర్పించారు. శని, ఆదివారాలలో ఇక్కడ గోగులమ్మ వారి జాతర, తిరునాళ్లు, వీరభద్ర స్వామి సంబరాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మెగా డీఎస్సీ ప్రారంభం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మెగా డీఎస్సీ పరీక్ష జిల్లాలో శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. రాజమహేంద్రవరం లూధర్గిరిలోని రాజీవ్గాంధీ కళాశాల ఐయాన్ డిజిటల్ జోన్లో ఈ పరీక్షలు జరిగాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన మొదటి సెషన్కు 600 మంది అభ్యర్థులు హాజరుకావాల్సివుంది. అయితే 532 మంది పరీక్షలు రాశారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగి సెషన్కు 600 మంది హాజరుకావాల్సివుండగా 527 మంది పరీక్షలు రాశారు. పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ పి.ప్రశాంతి పరిశీలించారు. ఏర్పాట్లపై జిల్లా విద్యాశాఖాదికారి కె.వాసుదేవరావును అడిగి తెలుసుకున్నారు. 12 వరకు వ్యవసాయ ఉత్పత్తులు పెంచేందుకు కృషి ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐకార్) ఆధ్వర్యంలో వ్యవసాయ ఉత్పత్తులు పెంచాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున వికసిత్ కృషి కార్యక్రమంలో భాగంగా ప్రీ ఖరీఫ్ ప్రచారాన్ని గత నెల 29 నుంచి ఈనెల 12వతేదీ వరకు చేపడుతున్నామని జాతీయ వాణిజ్య వ్యవసాయ పరిశోధన సంస్థ(నిర్కా) డైరెక్టర్ డా.మాగంటి శేషుమాధవ్ అన్నారు. శుక్రవారం ఐకార్–నిర్కా( సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాస్త్రవేత్తలు 2,000కు పైగా జట్లుగా ఏర్పడి ప్రతీరోజు గ్రామాలను సందర్శిస్తూ, కార్యక్రమం ఖరీఫ్ సీజన్లో రైతుల ఆదాయాన్ని పెంచడానికి, స్థిరమైన వ్యవసాయం చేయడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నాయన్నారు. వికసిత్ కృషి ప్రోగ్రామ్ నోడల్ సైంటిస్ట్ డా.వై.సుబ్బయ్య పాల్గొన్నారు. వనదుర్గమ్మకు ఘనంగా చండీహోమంఅన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం ఘనంగా చండీ హోమం నిర్వహించారు. సత్యదేవుని దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి, కొండ దిగువన తొలిపావంచా వద్ద కొలువైన కనకదుర్గ అమ్మవారికి పండితులు కుంకుమ పూజలు నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు పండితులు వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం చండీ హోమం ప్రారంభించారు. హోమం అనంతరం 11 గంటలకు హోమగుండంలో ద్రవ్యాలను సమర్పించి ఘనంగా పూర్ణాహుతి నిర్వహించారు. తరువాత అమ్మవార్లకు పండితులు వేదాశీస్సులు, నీరాజన మంత్రపుష్పాలు, నైవేద్యం సమర్పించారు. వనదుర్గ అమ్మవారికి నిర్వహించిన హోమంలో 40 మంది భక్తులు పాల్గొన్నారు. సత్యదేవుని ప్రధానాలయంలో దేవేరి అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారికి ప్రధానార్చకుడు ఇంద్రగంటి నర్శింహమూర్తి ఆధ్వర్యంలో, కనకదుర్గకు అర్చకుడు హరగోపాల్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. -
ముందస్తుకు నీళ్లొదిలారు!
క్లోజర్ పనులు ఇప్పుడు మొదలు పెట్టారు డెల్టా పంట కాలువలకు ఏప్రిల్ 27వ తేదీ నుంచి నీళ్లు బంద్ చేశారు. అయితే చాలాచోట్ల మే 20 తరువాత క్లోజర్ పనులు మొదలయ్యాయి. కొన్నిచోట్ల ఇప్పుడిప్పుడే పనులు మొదలు పెట్టడం గమనార్హం. ఆత్రేయపురం మండలం లొల్ల లాకు దిగువన మూడు కాలువల మీద మొదలు పెట్టిన సైఫన్ నిర్మాణాల పనులు నత్తను తలపిస్తున్నాయి. అమలాపురంలో బెండా కెనాల్ మీద ఈదరపల్లి, నడిపూడి వద్ద వంతెనల నిర్మాణాలు సైతం అనుకున్నంత వేగంగా సాగడం లేదు. ఇవి కాకుండా పి.గన్నవరం, ముక్తేశ్వరం, అమలాపురం, మండపేట, కాకినాడ కాలువల మీద ఇప్పుడిప్పుడే పూడిక తీత పనులు చేపట్టడం గమనార్హం. ఈ పనులు ఈ నెల పదవ తేదీ నాటికి పూర్తయ్యే అవకాశముందని సాగునీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన కోనసీమ జిల్లా సమావేశంలో కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ సైతం ఈ నెల పదవ తేదీకి పనులు పూర్తి చేయాలని కోరారు. అంటే ఈ నెల పది వరకు కాలువలకు పూర్తిస్థాయిలో సాగునీరందే అవకాశం లేదని తేలిపోయింది. అటువంటప్పుడు జూన్1వ తేదీన సాగు నీరు విడుదల చేయడం ఎందుకని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. జూన్ పదో తేదీన నీరు విడుదల చేసినా పంట కాలువల వ్యవస్థ అధ్వానంగా ఉండడం వల్ల ఈ నెల 20వ తేదీ వరకు ఆయకట్టుకు చేరే పరిస్థితి లేదని రైతులు పెదవి విరుస్తున్నారు. ● ఉమ్మడి జిల్లాలో ముందస్తు ఖరీఫ్ సాగు లేనట్టే ● ఒకటో తేదీన మొక్కుబడిగా నీటి విడుదల ● తూర్పు, మధ్య డెల్టాకు కలిపి 300 క్యూసెక్కులు మాత్రమే ● పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కులు ● పలుచోట్ల కాలువలపై పనులు ● మధ్య డెల్టాకు లొల్ల లాకుల వద్దనే నిలిపివేసిన అధికారులు ● ఈ మాత్రం దానికి ఎందుకు వదిలినట్టు అని రైతుల మండిపాటు సాక్షి, అమలాపురం: గోదావరి డెల్టాలో ఖరీఫ్కు ప్రధాన అవరోధం ‘ముంపు’. సాగు ఆలస్యం అయి భారీ వర్షాలు, తుపాన్ల సమయంలో ఖరీఫ్ దిగుబడికి సిద్ధంగా కావడం వల్ల చేలు ముంపుబారిన పడి రైతులు కోట్ల రూపాయలు నష్టపోవడం పరిపాటిగా మారింది. దీనిని గుర్తించిన గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం డెల్టాలో ముందస్తు సాగును ప్రోత్సహించింది. దీనిలో భాగంగా జూన్ ఒకటి, రెండు తేదీలలో నీరు విడుదల చేయడం మొదలు పెట్టింది. ఈసారి కూటమి ప్రభుత్వం కూడా ముందస్తు సాగుకు నీరు విడుదల చేస్తామని చెప్పి కొంత మొత్తంలో నీరు విడుదల చేసింది. దానికి కూడా పలుచోట్ల హెడ్ స్లూయిజ్ల సమీపంలోనే నిలిపివేయడం గమనార్హం. కోటి ఆశల ఖరీఫ్కు ఆదిలోనే అవరోధం ఏర్పడింది. ముందస్తు సాగుకు వీలుగా జూన్ ఒకటి, రెండు తేదీల్లో పశ్చిమ, తూర్పు, మధ్య డెల్టా ప్రధాన పంట కాలువలకు నీరు విడుదల చేశారు. కాని ఈ మూడు డెల్టాలకు కలిపి కేవలం 800 క్యూసెక్కులు మాత్రమే నీరు వదులుతున్నారు. దీంతో పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కులు, తూర్పు డెల్టాకు 200 క్యూసెక్కులు. మధ్య డెల్టాకు 100 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నారు. దీనిలో మధ్య డెల్టాకు వదులుతున్న నీరు సమీపంలోని లొల్ల లాకుల వద్దనే నిలిపివేశారు. ఇక్కడ నిలిపివేయడం ద్వారా పి.గన్నవరం, ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్, అమలాపురం కాలువలకు నీరు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఇక తూర్పు డెల్టాకు 200 క్యూసెక్కుల వదలడం వల్ల కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. దీని మీద కాకినాడ, మండపేట, కోరంగి, కోటిపల్లి, సామర్లకోట, పిఠాపురం బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) కాలువల ద్వారా ఆయకట్టుకు సాగునీరందాల్సి ఉంది. అలాగే పశ్చిమ డెల్టాలో ఏలూరు, నర్సాపురం బ్యాంకు కెనాల్ ద్వారా సాగునీరందాల్సి ఉంది. ముందస్తుతో పలు విధాలుగా మేలు ప్రకృతి వైపరీత్యాల నుంచి ఖరీఫ్ పంటను గట్టెక్కించడం, రబీ సాగు నీటి ఎద్దడి బారిన పడకుండా చూడడం, మూడవ పంటగా అపరాలు సాగు చేయించడం ద్వా రా రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చేయడం వంటి ఉన్నత లక్ష్యాలకు అనుగుణంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఖరీఫ్లో ముందస్తు సాగును ప్రోత్సహించింది. కాని కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఖరీఫ్, రబీ నీటి విడుదలపై నిర్లక్ష్యం కమ్ముకుంటోంది. పంట కాలువలపై మొదలు పెట్టిన పనులు ఇంకా ప్రాథమిక దశలో ఉండడంతో నీటి విడుదల ఆలస్యమై ఆ ప్రభావం ఖరీఫ్ సాగుపై పడనుంది. కాకినాడ జిల్లా పరిధిలో తూర్పు డెల్టాకు వచ్చి మొత్తం 3,40,548.78 ఎకరాల నికర ఆయకట్టు ఉండగా, డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలో తూర్పు, మధ్య డెల్టాలు కలిపి 2,46,155.26 ఎకరాలు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో తూర్పు, పశ్చిమ డెల్టాలు కలిపి మొత్తం 66,692.47 ఎకరాలు ఉంది. ఇక్కడ సాగు ఆలస్యమైతే వరి దిగుబడి వచ్చే సమయానికి వర్షాలు, తుపాన్ల బారిన పడే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెల్టా ఆయకట్టు ఇలా (ఎకరాల్లో) జిల్లా రిజిస్టర్ ఆయకట్టు నికర ఆయకట్టు తూర్పు గోదావరి 77,464.14 66,692.47 -
ముందస్తు సాగుకు శ్రీకారం
దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంలో వేస్తున్న సార్వా వరినాట్లుమడి నుంచి ఆకు తీస్తున్న కూలీలు● మెట్ట ప్రాంతంలో నాట్లు ప్రారంభం ● బోర్ల కింద ముమ్మరంగా ఆకుమడులు ● అందుబాటులో 4,550 క్వింటాళ్ల విత్తనాలు ● 154 హెక్టార్లలో నారుమడులు ● 77,820 హెక్టార్లలో సార్వా వరి సాగు దేవరపల్లి: దాళ్వాలో పండించిన ధాన్యం కొనుగోళ్లు పూర్తికాకుండానే ముందస్తు సార్వా సాగుకు రైతులు సిద్ధమవుతున్నారు. బోర్ల కింద ముమ్మరంగా వరి ఆకుమడులు వేస్తున్నారు. అధిక దిగుబడులు ఇవ్వడంతో పాటు చీడపీడలు, తెగుళ్లను తట్టుకునే వంగడాల నారుమడులు వేస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీన ధవళేశ్వరం ఆనకట్ట నుంచి కాలువలకు నీరు విడుదల చేయడంతో డెల్టాలో రైతులు వరి నారుమడులు వేస్తుండగా, మెట్ట ప్రాంతంలోని రైతులు బోర్లు కింద ఆకుమడులు వేస్తున్నారు. చెరువులు, తాడిపూడి కాలువ కింద సాగుకు అవసరమైన నారును బోర్ల కింద ఆకుమడులు వేసి పెంచుతున్నారు. మే నెల రెండవ వారంలో వేసిన నారు నాటడానికి సిద్ధంగా ఉంది. ఎక్కువ మంది రైతులు వారం రోజుల నుంచి నారుమడులు వేస్తున్నారు. అధిక దిగుబడి వచ్చే వంగడాల సాగు ఖరీఫ్లో అధిక దిగుబడులు వచ్చే వంగడాలను రైతులు ఎంపిక చేసుకుని నారుమడులు వేస్తున్నారు. సన్న రకాలైన ఎంటీయూ–1224, బీపీటీ–2841, బీపీటీ–2270, బీపీటీ–2846, ఎల్ఎల్ఆర్–3238 రకాలతో పాటు ఎంటీయూ 1318 వంటి నూతన రకాల వంగడాలను రైతులు సాగు చేస్తున్నారు. ఈ వంగడాలతో ఎకరాకు 30 నుంచి 35 బస్తాల దిగుబడి వస్తున్నట్టు రైతులు తెలిపారు. రైతులకు అందుబాటులో విత్తనాలు వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అవసరమైన వరి విత్తనాలను అధికారులు అందుబాటులో ఉంచారు. ఖరీఫ్లో జిల్లాలో 77,820 హెక్టార్లలో రైతులు వరి పంట వేస్తున్నారు. దీనికి 38,910 క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతాయి. దీనిలో 400 క్వింటాళ్ల వరకు రాయితీపై రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా అందిస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ పంట కాలానికి దాదాపు 3,845 హెక్టార్లలో వరి నారుమడి వేయవలసిన అవసరం ఉంది. ఇప్పటి వరకు 154 హెక్టార్లలో నారుమడి వేశారు. 80 నుంచి 90 శాతం వరకు వరి రైతులు సొంత విత్తనం లేదా ఇతర రైతుల నుంచి తీసుకుని వినియోగిస్తున్నారు. 10 నుంచి 20 శాతం విత్తనాలు వివిధ మండలాల్లో లైసెన్సు కలిగిన విత్తన అమ్మకందారులు విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు 4,550 క్వింటాళ్ల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉన్నట్టు అధికారులు తెలిపారు. మెట్ట ప్రాంతంలో ప్రారంభమైన వరినాట్లు కొవ్వూరు డివిజన్ పరిధిలోని దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లో వరినాట్లు ప్రారంభించారు. దేవరపల్లి మండలం ధుమంతునిగూడెంలో రైతు ధుమంతరావు వెంకటసుబ్బారావు తన ఏడు ఎకరాల పొలంలో రెండు రోజుల నుంచి వరినాట్లు వేశారు. నల్లజర్ల మండలం పోతవరంలో వరినాట్లు ప్రారంభించారు. ముందస్తుగా రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. ఒకపక్క దాళ్వా పంట కొనుగోళ్లు పూర్తికాలేదు, మరొక పక్క ముమ్మరంగా ఆకుమడులు వేస్తుండగా, పై రెండు మండలాల్లో వరినాట్లు ప్రారంభమయ్యాయి. నూతన వంగడం ఎంటీయూ–1318 రైతులు సాగు చేస్తున్నారు.నూతన వంగడం సాగు ఖరీఫ్లో చీడపీడలు, తెగుళ్లను తట్టుకునే నూతన వంగడం ఎంటీయూ–1318 నారుమడి మే నెల 19న బోరు కింద వేశాను. 18 రోజుల్లో ఆకు సిద్ధం కావడంతో రెండు రోజుల నుంచి ఏడు ఎకరాల్లో నాట్లు వేశాను. 150 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరాకు 30 నుంచి 35 బస్తాలు దిగుబడి వస్తుంది. ముందస్తు సాగు చేయాలనే ఉద్దేశంతో ముందుగా నాట్లు వేశాను. మృగశిర కార్తెలో నాట్లు వేయడం ఆనవాయితీ. ఈ కార్తెలో వరినాట్లు వేస్తే దిగుబడులు ఆశాజనకం ఉంటాయని నమ్మకం. – ధుమంతరావు వెంకటసుబ్బారావు(బుజ్జి), రైతు, ధుమంతునిగూడెం, దేవరపల్లి మండలం 80,918 హెక్టార్లలో ఖరీఫ్ పంటలు జిల్లాలో 2025–25 పంట కాలానికి 80,918 హెక్టార్లలో వివిధ రకాల వ్యవసాయ పంటలు వేసే అవకాశం ఉంది. దీనిలో 77,820 హెక్టార్లు వరి, 2,595 హెక్టార్లు మినుము, 181 హెక్టార్లు మొక్కజొన్న, ఇతర పంటలైన పత్తి, వేరుశనగ పంటలు తక్కువ విస్తీర్ణంలో సాగు చేసే అవకాశం ఉంది. వరి సాగుకు అవసరమైన విత్తనాలు జిల్లాలోని 19 మండలాల్లో 4,5550 క్వింటాళ్లు అందుబాటులో ఉంచాం. 3,845 హెక్లార్లలో వరి నారుమడులు వేయవలసి ఉంది. ఇప్పటి వరకు 154 హెక్టార్లలో నారు మడులు వేశారు. ఎక్కువగా రైతులు సొంతంగా తయారు చేసుకున్న విత్తనాలను సాగు చేస్తున్నారు. వాతావరణ శాఖ ప్రస్తుత నివేదికల ప్రకారం ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వల్ల సకాలంలో వర్షాలు పడతాయి. అక్కడక్కడా బోర్ల కింద నాట్లు వేస్తున్నారు. – ఎస్.మాధవరావు, జిల్లా వ్యవసాయాధికారి, రాజమహేంద్రవరం -
బాలాజీ పరిణయం.. నేత్రపర్వం..
● దివ్య కల్యాణాన్ని చూసి తరించిన భక్తజనం ● కనువిందు చేసిన రాయబారోత్సవం ● దేవేరులతో దర్శనమిచ్చిన స్వామివారు మామిడికుదురు: పవిత్ర వైనతేయ గోదావరి నదీతీరం అప్పనపల్లి క్షేత్రంలో బాలునిగా కొలువుదీరిన బాలబాలాజీస్వామి దివ్య తిరుకల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. జ్యేష్ట శుద్ధ ఏకాదశి శుభ ముహూర్తంలో రాత్రి 9.15 గంటలకు శ్రీదేవి, భూదేవిలను స్వామివారు పరిణయమాడారు. కల్యాణానికి ముందుగా స్వామి, అమ్మవార్ల గుణగణాలను భక్తులకు వివరిస్తూ నిర్వహించిన రాయబారోత్సవం (ఎదుర్కోలు సన్నాహం) భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గుణ గణాల్లో స్వామి వారికి అమ్మవార్లు సరిజోడి అంటూ సాగిన ఈ ఉత్సవాన్ని చూసిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన మంటపంలో దేవేరులతో కొలువు తీరిన స్వామివారు భక్తకోటికి సర్వమంగళ రూపంలో దర్శనమిచ్చి కనువిందు చేశారు. ఆలయ ఉప ముఖ్య అర్చక గొడవర్తి శ్రీనివాసాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి శిష్య బృందం ఆధ్వర్యంలో కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో భక్తుల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో భక్తులు కల్యాణోత్సవంలో పాల్గొని స్వామి వారిని దర్శించి తన్మయులయ్యారు. కన్నుల పండువగా గ్రామోత్సవం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామ స్మరణలు, బాణసంచా కాల్పుల నడుమ స్వామివారిని, దేవేరులను పురవీధుల్లో గరుడ వాహనంపై ఊరేగించారు. భక్తులు, ఆలయ ఉద్యోగులు, సిబ్బంది గ్రామోత్సవంలో పాల్గొని పరమానందం పొందారు. భక్తులు స్వామి, అమ్మవార్లకు ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి ఆలయాన్ని పలు రకాల బెంగుళూరు పుష్పాలతో సర్వాంగ సుందరంగా ఆలంకరించారు. ప్రత్యేక ఆకర్షణగా కోలాటం స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన హరే శ్రీనివాస్ కోలాటం ఆహూతులను ఆనంద పరవశుల్ని చేసింది. అలాగే కేరళ వాయిద్యాలు భక్తుల్ని తన్మయత్వంలో ముంచెత్తాయి. అప్పనపల్లికి చెందిన వాణి మహిళా సత్సంగ మిత్ర బృందం సభ్యులు ఆలపించిన శ్రీలలితా విష్ణు సహస్రనామ పారాయణం, మామిడికుదురుకు చెందిన యింటి శ్రీరామ్కుమార్, సుజాత ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేశాయి. సంతానం కోసం పూజలు సంతానం లేక ఇబ్బంది పడుతున్న మహిళలకు శుక్రవారం ఉదయం ధ్వజారోహణం సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి, స్వామి వారి ప్రసాదాలు అందజేశారు. ఈ ప్రసాదాన్ని తినడం ద్వారా సంతాన యోగం కలుగుతుందని భక్తుల విశ్వాసం. -
రత్నగిరికి పోటెత్తిన భక్తజనం
● ఆలయం వద్ద నవ దంపతుల సందడి ● ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు అన్నవరం: జ్యేష్ట శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి కిక్కిరిసింది. ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంతి మండపాలు భక్తులతో నిండిపోయాయి. గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున రత్నగిరిపై జరిగిన వివాహాలతో నవదంపతులు, వారి బంధుమిత్రులతో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల కూడా అవే ముహూర్తాలలో వివాహాలు చేసుకున్న భక్తులు రత్నగిరికి వచ్చి వ్రతాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు 50 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా స్వామివారి వ్రతాలు 2,500 జరిగాయి. శుక్రవారం అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.50 లక్షలు ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఏకాదశిని పురస్కరించుకుని ఉదయం ఏడు గంటలకు స్వర్ణ పుష్పార్చన, తొమ్మిది గంటల నుంచి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు తులసి దళాలతో సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం వేదపండితులు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి ప్రసాదాలు నివేదించారు. ఈ పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నర్శింహమూర్తి, అర్చకులు సుధీర్, పరిచారకులు పవన్ తదితరులు నిర్వహించారు. నేడు తిరుచ్చి వాహనంపై సత్యదేవుని ఊరేగింపు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను శనివారం తిరుచ్చి వాహనంపై ఊరేగించనున్నారు. ఉదయం పది గంటలకు ఈ ఊరేగింపు ప్రారంభం కానుంది. -
అక్రమంగా గోవుల తరలింపు
తాళ్లపూడి: ఐషర్ లారీలో అక్రమంగా తరలిస్న్ను ఆవులు, దూడలు, ఎద్దులను కొవ్వూరు సీఐ పి.విశ్వం స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం కొవ్వూరు పట్టణంలోని గ్రామన్ బ్రిడ్జి వద్ద రోడ్డు బొబ్బిలి నుంచి తుని మీదుగా హైదరాబాద్కు తరలిస్తున్న వాహనాన్ని గుర్తించి అందులని 16 ఆవులు, 18 దూడలు, నాలుగు ఎద్దులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వాహనాన్ని సీజ్ చేశారు. అనుమతి లేకుండా గోవులను తరలిస్తే చర్యలు తప్పవని విశ్వం తెలిపారు. దీనిపై తాండ్ర నరేష్, పాసాదులు దుర్గాప్రసాద్లపై కేసు నమోదు చేయడం జరిగిందని సిఐ తెలిపారు.వాహనం ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతిధవళేశ్వరం: స్థానిక జాతీయ రహదారిపై మంతెన సత్యనారాయణరాజు ఆశ్రయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శుక్రవారం ఉదయం జాతీయ రహదారిపై సుమారు 40 ఏళ్ల వయసున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అతనిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతిచెందాడు. మృతుని ఆచూకీ తెలిసినవారు 94407 96586, 94919 99336 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సీఐ టి.గణేష్ కోరారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
● చెట్టుకు ఢీకొని నుజ్జయిన కారు ● పోతవరంలో విషాద ఛాయలు నల్లజర్ల: మండలంలోని పోతవరం–యర్నగూడెం రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే పోతవరం సర్పంచ్ నూతికుర్తి లక్ష్మణరావు సోదరుడు రామకృష్ణ తన భార్య రత్నకుమారి, కుమారుడు మనోజ్ (24), మనుమరాలు ఆద్య (2) నిడదవోలులోని కలవచర్ల గ్రామానికి ఓ వివాహానికి హాజరయ్యేందుకు కారులో బయలుదేరారు. పోతవరం నుంచి బయలుదేరి కిలోమీటరు దూరం వెళ్లేసరికే అతివేగంతో చెట్టును ఢీకొని కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మనోజ్ అక్కడికక్కడే మృతి చెందగా రామకృష్ణ, రత్నకుమారి, ఆద్య తీవ్ర గాయాలపాలయ్యారు. పోతవరంలో జరుగుతున్న జాతర హడావిడిలో ఉన్న గ్రామస్తులు ఈ ప్రమాద వార్త తెలియగానే హుటాహుటిన ఘటనాస్థలానికి వెళ్లి క్షతగాత్రులను ఏలూరు ఆశ్రమ్ ఆస్పత్రికి తరలించారు. రామకృష్ణ మనవరాలు (కుమార్తె అంకితకు కుమార్తె) ఆద్య చికిత్స పొందుతూ మృతి చెందగా మిగిలిన ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. పోతవరంలో జరుగుతున్న జాతర చూసేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన మనోజ్ ఇలా మృతి చెందడంతో పోతవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. క్షతగాత్రలను మాజీ హోం మంత్రి తానేటి వనిత, మండల పార్టీ అధ్యక్షుడు వెల్లంకి వెంకట సుబ్రమణ్యం, మాజీ జెడ్పీటీసీ బంక అప్పారావు పరామర్శించారు. అనంతరం పోతవరం వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి బంధువులను పరామర్శించారు. కాగా ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు కాలేదు. తమ్ముడి పిల్లలే తన పిల్లలుగా.. పోతవరం సర్పంచ్ నూతికుర్తి లక్ష్మణరావుకు పిల్లలు లేకపోవడంతో తన సోదరుడు రామకృష్ణ పిల్లలనే తన పిల్లలుగా అల్లారుముద్దుగా పెంచారు. అవసాన దశలో తమ అన్నదమ్ములిద్దరికి ఆసరాగా ఉంటాడుకున్న మనోజ్ జీవితం ఇలా ముగియడంతో ఆ దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇంజినీరింగ్ పూర్తిచేసిన మనోజ్ కారు కావాలంటే కొన్నామని, ఏ లోటూ రాకుండా చూసుకున్నామని వారు అతనితో జ్ఞాపకాలను గుర్తుచేసుకుని రోదిస్తున్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 22,500 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,500 గటగట (వెయ్యి) 19,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
కాకినాడ రూరల్: కాకినాడ నుంచి సామర్లకోట వెళ్లే మార్గంలో గంగనాపల్లి గ్రామ పరిధిలో కోటిపల్లి రైల్వే లైన్ దాటిన తరువాత కాల్వలో గుర్తు పట్టలేని స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 45 నుంచి 50 మధ్య ఉండవచ్చని, గులాబీ రంగు చొక్కా ధరించి ఉన్నట్టు ఇంద్రపాలెం పోలీసులు తెలిపారు. సుమారు 15 నుంచి 20 రోజుల వ్యవధిలో కాల్వ నీటిలో మునిగిపోయి ఉంటాడని, మృతదేహం ఉబ్బిపోయి చర్మం ఊడిపోయి ఉన్నట్టు ఎస్సై వీరబాబు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. -
ఉసురు తీసిన అతివేగం
● స్నేహుతుడి వివాహానికి వెళ్తూ ఒకరు మృతి ● మరొకరికి తీవ్ర గాయాలు పెరవలి: స్నేహితుడి పెళ్లికి వెళ్తుండగా వాహనం అదుపుతప్పి పడిపోయిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని అన్నవరప్పాడు వద్ద జరిగిన ఈ సంఘటన వివరాలను ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన మేరకు.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామానికి చెందిన కత్తుల మహేష్ (19), శీలం అంజిబాబు రైడర్ మోటార్సైకిల్పై వేగంగా వస్తుండగా సడన్ బ్రేక్ వేయటంతో వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడి సుమారు 60 మీటర్ల దూరం రోడ్డుపైనే ఈడ్చుకుపోయి డివైడర్ను ఢీకొన్నారు. ఈ సమయంలో మోటార్సైకిల్ నడుపుతున్న కత్తుల మహేష్ రోడ్డు డివైడర్పై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడని స్థానికులు తెలిపారు. స్థానికులు ప్రమాదం జరిగిన వెంటనే పరుగున వచ్చి ఇద్దరినీ లేపగా మహేష్ ఎటువంటి చలనం లేకపోవటంతో శీలం అంజిబాబును లేపి రోడ్డు పక్కన కూర్చోపెట్టారు. అతడికి తీవ్రగాయాలయ్యాయని, కుడికాలు విరిగిపోయిందని స్థానికులు తెలిపారు. ఇంతలో జాతీయ రహదారుల అంబులైన్స్ వచ్చి మహేష్కు సపచర్యలు చేయగా శరీరంలో కదలిక రావడంతో వెంటనే ఆక్సిజన్ పెట్టి తణుకు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యం అందిస్తుండగా మహేష్ మృతిచెందినట్టు తెలిపారు. మహేష్ తండ్రి కత్తుల నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. -
వైభవంగా వేణుగోపాలుని కల్యాణం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి క్షేత్రంలో కొలువైన రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వార్షిక కల్యాణం శుక్రవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో, ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, విశేషార్చనలు జరిపారు. సాయంత్రం కల్యాణాన్ని ప్రారంభించారు. ప్రదానం నుంచి తలంబ్రాలు వరకూ ప్రతి క్రతువునూ వేదపండితులు, అర్చక స్వాములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే వ్యాఖ్యాన పండితులు ప్రతి ఘట్టాన్ని కళ్లకు కట్టినట్టు వివరించారు. స్వామి, అమ్మవార్లకు దేవస్థానం తరఫున డీసీ, ఈఓ చక్రధరరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కల్యాణ మహోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులకు ఈఓ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు. అభివృద్ధి పనుల పరిశీలన కొత్తపేట: వాడపల్లి క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కొత్తపేట ఆర్డీఓ పి.శ్రీకర్ శుక్రవారం పరిశీలించారు. ఈ క్షేత్రానికి పెరుగుతున్న భక్తుల తాకిడికి అనుగుణంగా సౌకర్యాలు, రహదారుల ఆధునీకరణ, వాహనాల పార్కింగ్ స్థలం అభివృద్ధి, ఏడు వారాల ప్రదక్షిణకు అనుకూలంగా మాడ వీధుల విస్తరణ వంటి పనులు చేపట్టారు. ఆయా పనులపై ఆర్డీఓ శ్రీకర్, దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావుతో సమీక్షించారు. దానిలో భాగంగా స్వాతంత్య్ర సమరయోధుల స్థూపాన్ని పరిశీలించారు. అన్నప్రసాద భవనానికి విరాళాలు వాడపల్లి క్షేత్రంలో వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా భీమవరానికి చెందిన సీవీ చంటి, శాంతి దంపతులు రూ.1,15,000 విరాళంగా సమర్పించారు. వారు శుక్రవారం స్వామివారిని దర్శించుకున్నారు. దాతలకు ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్వామివారి చిత్రపటాలను అందచేశారు. -
దళితులను విద్యకు దూరం చేయొద్దు
తాళ్లపూడి (కొవ్వూరు): ఎస్సీ ఏరియాలో ఉన్న ప్రాథమిక పాఠశాలను తరలిస్తే తమ పిల్లలు విద్యకు దూరం అవుతారని దొమ్మేరు ఇందిరమ్మ కాలనీవాసులు వాపోయారు. కొవ్వూరు మండలం దొమ్మేరు ఇందిరమ్మ కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల(స్పెషల్)ను వేరే పాఠశాలలో విలీనం చేయడంపై గ్రామస్తులు గురువారం కొవ్వూరులోని మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకుడు ముదునూరి నాగరాజు, సర్పంచ్ తానేటి కుమారి, ఎస్ఎంసీ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు రౌతు రాణి, పొసిపో బేబి, అనిమిల్లి జ్ఙానేంద్ర ఎంఈవో కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివేవారు 33 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. పాఠశాల విద్యాకమిటీ, విద్యార్థుల తల్లిందండ్రులు, సర్పంచ్ పాఠశాలల తరలించరాదని చెప్పినప్పటికీ, తాము అనుకూలంగా సంతకాలు చేసినట్టు అధికారులు నివేదిక పంపడం ఏంటని ప్రశ్నించారు. 1930లో ఏర్పడిన ఈ పాఠశాల ద్వారా దళితుల పిల్లలు విద్య నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడిందన్నారు. ఫౌండేషన్ స్కూల్ చేయడం వల్ల ఇక్కడ కేవలం 1,2 తరగతులు మాత్రమే మిగులుతాయని తెలిపారు. ఎంఈవో బి స్వరూప్కు వినతి పత్రం అందజేశారు. వైఎస్సార్ సీపీ నాయకుడు వరిగేటి సుధాకర్, విద్యార్థుల తల్లిదండ్రులు జి.సునీల్, కె.రాజేష్, ఎ.లక్ష్మి, యాగంటి శాంతకుమారి పాల్గొన్నారు. ప్రాథమిక పాఠశాల తరలింపుపై ఎంఈవో కార్యాలయం వద్ద ఆందోళన -
అమలాపురంలో సైబర్ మోసం
అమలాపురం టౌన్: ఓ సైబర్ నేరగాడు గ్రీజు డబ్బా కొనుగోలు పేరుతో షాపు యజమానికి రూ.24 వేలకు టోకరా వేసిన ఉదంతమిది. స్థానిక శ్రీనివాస ఏటిగట్టు ప్రాంతంలో బ్రహ్మం రేడియేటర్స్ అండ్ మొబైల్ షాపు యాజమాని టి.సత్యనారాయణకు ఓ ఆగంతకుడు బుధవారం సాయంత్రం హిందీలో మాట్లాడుతూ ఫోన్ చేశాడు. 5 కేజీల గ్రీజు డబ్బా కావాలని ధర అడిగాడు. రూ.వెయ్యి అని చెప్పగానే మీ షాపునకు మా మనిషిని పంపుతాను, డబ్బా అతని చేతికివ్వమని ఆగంతకుడు షాపు యజమానికి చెప్పాడు. మీకు రూ.వెయ్యి ఫోన్ పే చేస్తున్నానని చెప్పి కొద్దిసేపటికి మీ అకౌంట్లో పొరపాటున రూ.10 వేలు సొమ్ము వేశాను. మీకు ఇవ్వాల్సిన రూ.వెయ్యి తీసుకుని మిగిలిన రూ.9 వేలు మీ ఫోన్కు ఓ స్కానర్ పంపిస్తున్నాను, దానికి డబ్బు పంపమని చెప్పాడు. అకౌంట్లో డబ్బు పడిందో లేదో చూడకుండా కేవలం మెసేజ్కు స్పందించిన షాపు యాజమాని రూ.9 వేలు ఆగంతకుడు పంపించిన స్కానర్కు పంపించేశారు. తర్వాత కొద్ది సేపటికి మీ ఫోన్కు మరో రూ.15 వేలు పొరపాటున పంపించాను, ఆ డబ్బును కూడా స్కానర్లో పంపించండని మెసేజ్ పెట్టాడు. నేనెక్కడో ఉన్నాను. ఇక్కడ డబ్బు ఫోన్ పే చేయాలని, అర్జంటుగా నాకు డబ్బు పంపించాలని షాపు యాజమానిని ఆగంతకుడు నమ్మించాడు. షాపు యాజమాని రూ.15 వేలు కూడా స్కానర్ ద్వారా పంపించేశారు. దీంతో మొత్తం రూ.24 వేలు ఆగంతకుడు పంపిన స్కానర్కు పంపించారు. తర్వాత ఫోన్ పేలో అకౌంట్ బ్యాలెన్స్ను చెక్ చేసుకుంటే రూ.24 వేలు డ్రా అయినట్లు కనిపించింది. దీంతో తాను సైబర్ మోసానికి గురైనట్టు షాపు యజమాని గ్రహించి సైబర్ పోలీసులకు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. గ్రీజు డబ్బా కొనుగోలు పేరుతో రూ.24 వేలకు టోకరా -
జాతీయ స్థాయి పోటీల్లో కార్టూనిస్ట్ శేఖర్కు బహుమతి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఛత్తీస్గఢ్ ఎన్విరాన్మెంట్ కన్జర్వేషన్ బోర్డ్, కార్టూన్ వాచ్ పత్రికల సంయుక్త నిర్వహణలో జాతీయస్థాయిలో నిర్వహించిన కార్టూన్ పోటీల్లో నగరానికి చెందిన కార్టూనిస్ట్ శేఖర్ తృతీయ బహుమతి సాధించారు. నిర్వాహకులు త్రియంబక్ శర్మ గురువారం ఆ వివరాలను వెల్లడించారు. ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్, వీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే అంశంపై నిర్వహించిన ఈ పోటీలో విజేతలకు నగదు బహుమతితోపాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేయనున్నారు. బహుమతి పొందిన కార్టూన్లను నగర కూడళ్లలో హార్డింగ్స్, వాల్పోస్టర్లు, కరపత్రాల ద్వారా ప్రదర్శించి ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. అనాథ శవానికి అంత్యక్రియలు కొత్తపేట: A¯é£ýl ÔèæÐé-°MìS A…™èlÅ-{MìS-Ķæ$Ë$ °Æý‡Ó-íßæ…_ ™èlÐ]l$ Ð]l*¯]l-Ð]l-™éÓ°² ^ér$-MýS$-¯é²Æý‡$ Ý린MýS Ķæ¬Ð]l-MýS$Ë$. ´ùÍ-Ôðæsìæt ¯éVóS-ÔèæÓ-Æý‡-Æ>Ð]l# (82) A¯ól Ýë«§ýl$Ð]l# VýS$Æý‡$-ÐéÆý‡… Ý린MýS M>Æó‡²-çÙ¯ŒS çÜ{™èl… AÆý‡$VýS$Oò³ ^èl°-´ù-Ķæ*yýl$. M>ç³# ¯éĶæ$-MýS$yýl$ çÜÌê¨ Æ>Ð]l$-Ððl*-çßæ-¯]lÆ>Ð]l# (_°²) B«§ýlÓ-Æý‡Å…ÌZ Ķæ¬Ð]lMýS$Ë$ A…™èlÅ-{MìS-Ķæ$Ë$ °Æý‡Ó-íßæ…-^éÆý‡$. Ð]l$–™èl$yýl$ ¯éVóS-ÔèæÓÆý‡-Æ>Ð]l# Mö™èl¢õ³-rÌZ 50 çÜ…Ð]l-™èlÞ-Æ>ÌS ¯]l$…_ Ýë«§ýl$-Ð]l#V> À„>-r¯]l ^ólçÜ$-MýS$…r* iÑ-çÜ$¢-¯é²yýl$. A™èl-°MìS VýS™èl OÐðlG-ÝëÞÆŠ‡ ïÜï³ {糿¶æ$™èlÓ…ÌZ Ð]l–§é®ç³Å í³…bèl¯]l$ Ð]l$…þ-OÆð‡…-¨. EÚù~-{VýS-™èlË$ ò³Æý‡VýSyýl…™ø Ð]lyýl-§ðl-º¾ ™èlWÍ Ð]l$–† ^ðl…§éyýl$. A…™èlÅ{MìS-Ķæ$ÌZÏ ´ëĶæ$çÜ… çÜ¡‹Ù, çÜÌê¨ »ê¼, çÜÌê¨ ¯é° ´ëÌŸY-¯é²Æý‡$. ˘ చికిత్స పొందుతూ వ్యక్తి మృతి కోరుకొండ: మండలంలోని గాదరాడ పుష్కర కాలువ వద్ద ప్రమాదవశాత్తూ పడిపోయిన గెద్దాడ సురేష్ (33) హాస్పిటల్లో చికిత్సపొందుతూ గురువారం మృతిచెందాడు. గండేపల్లి మండలం మురారికి చెందిన సురేష్ బుధవారం పుష్కర కెనాల్ వద్ద పడిపోయాడు. అతన్ని రాజమహేంద్రవరం జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందినట్టు కోరుకొండ ఏఎస్సై రంగారావు తెలిపారు. మృతుడు సురేష్కు భార్య, చిన్నపిల్లాడు ఉన్నారు, రాజమహేంద్రవరం ఐరెన్షాపులో భార్యభర్తలిద్దరూ పనిచేస్తున్నారు. -
ఆలయాల్లో చోరీలు చేసే ఆటోడ్రైవరు అరెస్టు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అందరూ దేవుడి గుడికి వెళ్లి మొక్కులు తీర్చుకునేందుకు హుండీల్లో డబ్బులు వేస్తే ఇతగాడు హుండీలు దొంగిలించేందురు ఆలయాలకు వెళుతుంటాడు. జిల్లాలో పలు ప్రాంతాల్లో చిన్న చిన్న ఆలయాల్లో హుండీలు కొల్లగొడుతున్న దొంగను రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. స్టేషన్ ఆవరణలో గురువారం విలేకరులకు సెంట్రల్ డీఎస్పీ కె.రమేష్ బాబు, మూడో పట్టణ సీఐ వి.అప్పారావు, ఎస్సై వి.అప్పలరాజు ఆ వివరాలు తెలిపారు. కాకినాడ జిల్లా తొండంగి మండలంలోని అసూరు గ్రామానికి చెందిన పారేపల్లి బాబి రాజమహేంద్రవరం గోకవరం బస్టాండులో టీ దుకాణంలో పనిచేసేవాడు. ఆ తర్వాత ఆటో డ్రైవరుగా మారాడు. కొన్నాళ్లకు సులువుగా డబ్బు సంపాదించేందుకు ఆలయాల్లో హుండీలు చోరీ చేయాలన్న తలంపు వచ్చింది. అందుకు పథక రచన చేసుకుని ఆలయాల గేట్లు కోసేందుకు కట్టర్ కొన్నాడు. దొంగతనం చేసేందుకు నిర్దేశించుకుస్న ఆలయానికి పగటి సమయంలో భక్తుడిలా వెళ్లి ఆనుపానులు పరిశీలించేవాడు. రాత్రి సమయంలో ఆ ఆలయం సమీపంలో ఆటోను ఆపి ఎవరికీ అనుమానం రాకుండా చూసుకుంటాడు. జన సంచారం తగ్గిన తరువాత ముందే సిద్ధం చేసుకున్న ఎలక్ట్రికల్ కట్టర్తో ఆ గుడి కరెంటు ఉపయోగించుకుని గేటు కట్ చేస్తాడు. లోపల హుండీ తాళాన్ని కూడా కోసి డబ్బు మొత్తం దోచుకుని వెళతాడు. దొంగతనానికి వెళ్లినా ఇతడికి ఉన్న దైవ భక్తి కారణంగా ఆలయంలో విగ్రహాలపై ఉండే వస్తువులను ముట్టుకునేవాడు కాదు. ఇలా రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో నాలుగు ఆలయాల్లో, కోరుకొండ పరిధిలో ఒక ఆలయంలో హుండీలు దోచుకున్నాడు. ఆలయాల్లో వరుస దొంగతనాలతో ఎస్పీ నరసింహకిశోర్ ఆదేశాల మేరకు క్రైం అదనపు ఎస్పీ అర్జున్ పర్యవేక్షణలో దర్యాప్తు చేసి సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని గుర్తించారు. లింగంపేట వద్ద వాహనాలు తనిఖీ నిర్వహిస్తుండగా నిందితుడిని అరెస్ట్ చేశారు. హుండీల డబ్బుతో గోవా వెళ్లి జల్సా చేయాలని కొంత డబ్బు దాచినట్టు విచారణలో నిందితుడు పోలీసులకు చెప్పాడు. నిందితుడి నుంచి రూ.95 వేలు నగదు, నేర పరికరాలు, ఆటో, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లు బి.విజయకుమార్, పి.మహేష్కుమార్, కె.పవన్కుమార్, కె.శ్రీనివాసులను ఎస్పీ అభినందించారు. -
స్వామివారి పెళ్లికి అంకురార్పణ
మామిడికుదురు: జ్యేష్ఠ శుద్ధ దశమి శుభ ముహూర్తంలో వేద మంత్రాలు, భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళ వాయిద్యాలు, కర్పూర పరిమళ సుగంధ ద్రవ్యాల నడుమ శ్రీబాలబాలాజీ స్వామి తిరు కల్యాణోత్సవాలకు గురువారం అంకురార్పణ జరిగింది. పాంచరాత్ర ఆగమానుసారం శ్రీబాల బాలాజీ స్వామి వారి వార్షిక దివ్య తిరు కల్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయ ఉప ముఖ్య అర్చక గొడవర్తి శ్రీనివాసాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్స్వామి వారి శిష్యులు యాజ్ఞిక బ్రహ్మ చలమచర్ల వేణుగోపాలాచార్యులు బృందం ఆధ్వర్యంలో శ్రీవారి వార్షిక కల్యాణోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి. బాల బాలాజీ స్వామితో పాటు శ్రీదేవి, భూదేవిలను చూడముచ్చటగా అలంకరించారు. బుగ్గన చుక్క పెట్టి, నుదుటన కల్యాణం తిలకం దిద్ది పెండ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెలుగా ముస్తాబు చేశారు. ఎటువంటి ఆటంకాలు కలుగకుండా స్వామి వారి కల్యాణోత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని కోరుతూ విష్వక్సేనారాధన కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు. ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు దంపతులు 108 కలశాలతో పాటు బ్రహ్మ కలశంలో పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పసుపు, కుంకుమతో స్నపన తిరు మంజన సేవను వైభవోపేతంగా జరిపించారు. సేకరించిన పుట్ట మన్నును తొమ్మిది పాత్రల్లో నింపి అంకారార్పణ కార్యక్రమాన్ని నయనానందకరంగా జరిపించారు. పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాశనం, పరిషదక్షిణ, మృత్సంగ్రహణం, హోమం, తదితర కార్యక్రమాలు వైభవోపేతంగా నిర్వహించారు. కల్యాణోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు, పుష్పాలంకరణ భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి. నేటి కార్యక్రమాలు కల్యాణోత్సవంలో భాగంగా రెండవ రోజు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి శుక్రవారం ఉదయం 6 గంటలకు ఆరాధన, శ్రీస్వామి వారికి సహస్ర నామార్చన. ఏడు గంటలకు బాల భోగం నివేదన, నిత్య హోమం, బలిహరణ, తీర్థ ప్రసాద గోష్ఠి. ఎనిమిది గంటలకు చతుస్థానార్చనలు. 10 గంటలకు ధ్వజారోహణ, నీరాజన మంత్ర పుష్పాలు. తీర్థ ప్రసాద గోష్ఠి. రెండు గంటలకు శ్రీస్వామి వారి గ్రామోత్సవం (ఊరేగింపు) అనంతరం ఆరాధన. 6 గంటలకు సాయంకాలార్చన, చతుస్థానార్చనలు, నిత్యోపాసన, బలిహరణ. 8 గంటలకు స్వామి వారి రాయబారోత్సవం (ఎదుర్కోలు ఉత్సవం). 9.15 గంటలకు శ్రీస్వామి వారి దివ్య తిరు కల్యాణ మహోత్సవం. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 9 గంటలకు శ్రీలలితా విష్ణు సహస్ర నామ పారాయణం, 11 గంటలకు శ్రీఅన్నమాచార్య సంకీర్తన విభావరి, మధ్యాహ్నం ఒంటి గంటకు స్వామి వారి తిరువీధి ఉత్సవంలో భాగంగా కోలాటం ప్రదర్శన.కల్యాణ తిలకం దిద్దుకున్న బాలబాలాజీ -
ఆడబిడ్డకు దగా
కొవ్వూరు మండలం కాపవరంలో సుందరంగా తయారైన జగనన్న కాలనీ ● కూటమి పాలనలో మాయమైన మహిళా సంక్షేమం ● ఆడబిడ్డ నిధి కోసం నిరీక్షణ ● కొందరికే ఉచిత గ్యాస్ ● అందని ఫ్రీ బస్సు సాక్షి, రాజమహేంద్రవరం: మహిళలను మహారాణుల్ని చేస్తామన్నారు.. ఉచిత బస్సుతో ఎక్కడికై నా తిరగవచ్చన్నారు.. డ్వాక్రా సంఘాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తామన్నారు.. ఇంకా 18 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు నెలకు రూ.1,500, తల్లికి వందనం, డ్వాక్రా రుణ పరిమితి రెట్టింపు ఇలా.. అనేక అడ్డగోలు హామీలిచ్చి అతివల ఓట్లు వేయించుకున్నారు. గద్దెనెక్కాక ఆ హామీలు అమలు చేయకుండా ఆడబిడ్డలను అడుగడుగునా దగా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఒక్క పథకం కూడా అమలు చేయలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి పాలనలో అన్యాయం ● ఆడబిడ్డ నిధి పేరుతో 19 నుంచి 59 ఏళ్ల వయసున్న మహిళలకు ప్రతి నెలా రూ.1,500 ఆర్థిక సాయం అందిస్తామని గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పెద్దలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఈ హామీకి అతీగతి లేదు. ఎప్పుడిస్తారన్న స్పష్టత కూడా లేదు. జిల్లావ్యాప్తంగా 19 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు సుమారు 6 లక్షల మంది ఉన్నారు. వీరందరూ ఆడబిడ్డ నిధి కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికే ఏడాది కాలంలో సుమారు రూ.90 కోట్లు నష్టపోయారు. ● అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తామని కూటమి పెద్దలు చంద్రబాబు అండ్ కో హామీ ఇచ్చారు. ఏడాదవుతున్నా దీనికి అతీగతి లేదు. ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని చెబుతున్నా.. దీనిపై ఇప్పటి వరకూ ఎటువంటి విధివిధానాలూ రాలేదు. అధ్యయనాల పేరుతో ఏడాది గడిపేశారు. ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించేందుకు సుమారు 6.60 లక్షల మంది మహిళలు ఎదురు చూస్తున్నారు. ● కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తల్లికి వందనం పేరిట చదువుకునే పిల్లలందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. ప్రతిపక్షం పోరాటాల ఫలితంగా దీనిని ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని చెబుతున్నారు. అయితే ఎవరికిస్తారు.. అర్హులెవరు.. అందరికీ ఇస్తారా.. ఒక విద్యార్థికే పరిమితం చేస్తారా.. అనే మార్గదర్శకాలపై స్పష్టత ఇవ్వడం లేదు. కొద్ది రోజుల్లో విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నప్పటికీ దీనిపై స్పష్టత ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో సుమారు 1.70 లక్షల తల్లులు తల్లికి వందనం పథకం కోసం ఎదురు చూస్తున్నారు. ఉచిత గ్యాసే..! ఉచిత వంట గ్యాస్ పథకంపై కూటమి ప్రభుత్వం నిబంధనల ‘బండ’ వేసింది. సార్వత్రిక ఎన్నికల ముందు ప్రతి ఇంటికీ ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక కొర్రీలు వేస్తున్నారు. అందరికీ కాకుండా కొందరికే దీనిని పరిమితం చేసేందుకు సవాలక్ష నిబంధనలు తెర పైకి తెచ్చారు. తొలుత దీపం పథకం ద్వారా గ్యాస్ పొందిన వారికే వర్తిస్తుందన్నారు. అనంతరం రేషన్ కార్డు కలిగిన వారికి మినహాయింపు ఇచ్చారు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్కు లింక్ అయి ఉంటే మాత్రమే ఇస్తామని మరో నిబంధన తీసుకురావడంతో పూర్తి స్థాయిలో ఉచిత గ్యాస్ అందని పరిస్థితి. జిల్లావ్యాప్తంగా 3 ప్రధాన కంపెనీలు, 36 ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతోంది. మొత్తం 6,24,265 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో డబుల్ కనెక్షన్లు మినహాయిస్తే మిగిలినవి 4,09,734 ఉన్నాయి. తెల్లరేషన్ కార్డులు 5,42,964, అంత్యోదయ 21,591 కలిపి మొత్తం 5,64,555 ఉన్నాయి. రేషన్ కార్డు నిబంధనతో జిల్లాలోని 1,54,821 మందికి ఉచిత గ్యాస్ అందే పరిస్థితి లేకుండా పోయింది. మహిళా మార్ట్తో ఆసరా డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ‘జగనన్న మహిళా మార్ట్’ పేరుతో వ్యాపార సముదాయాలను గత ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఇందులో మహిళలే షేర్ హోల్డర్లుగా వ్యవహరించే వెసులుబాటు కల్పించింది. జిల్లావ్యాప్తంగా 30,832 స్వయం సహాయక సంఘాలున్నాయి. వీటిలో 3,08,430 మంది సభ్యులున్నారు. మహిళా మార్ట్లు ఏర్పాటు చేయడం ద్వారా ఖర్చులు పోను నెలకు రూ.45 వేల వరకూ డ్వాక్రా సంఘాలకు ఆదాయం లభించేలా నాటి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.‘దిశ’కు ఇక్కడి నుంచే శ్రీకారం అతివలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టేందుకు, వారికి అండగా నిలిచేందుకు గత ప్రభుత్వం ‘దిశ’ పేరిట ప్రత్యేక వ్యవస్థను తీసుకు వచ్చింది. మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పేందుకు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకుండా పోలీసులే వారి చెంతకు వెళ్లి అండగా నిలిచి సాయం అందించేలా ఈ వ్యవస్థను రూపొందించింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాజమహేంద్రవరంలో 2020లో దిశ మహిళా పోలీస్ స్టేషన్ను నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా ప్రారంభించారు. దీని ద్వారా ఫోన్ చేసిన నిమిషాల వ్యవధిలోనే బాధితురాలికి పోలీసుల సాయం అందేది. ప్రస్తుతం ఈ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. జగన్ హయాం.. మహిళాభ్యుదయం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేశారు. సంక్షేమ పథకాలన్నీ వారి పేరిటే అందించారు. స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి, రాజకీయాల్లో మహిళల స్థానాన్ని పెంపొందించారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అన్నివిధాలా సహకరించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 84,593 స్వయం సహాయక సంఘాలకు రూ.15,969.85 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు అందజేశారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా 73,993 మందికి రూ.401.28 కోట్ల ఆర్థిక సాయం అందించారు. వైఎస్సార్ సున్నా వడ్డీ కింద 33,498 స్వయం సహాయక సంఘాలకు రూ.145.94 కోట్ల వడ్డీ మంజూరు చేశారు. వైఎస్సార్ ఆసరా పథకంలో భాగంగా 27,417 స్వయం సహాయక సంఘాలకు రూ.728.9 కోట్ల రుణాలు మాఫీ చేశారు. 81,141 మంది మహిళలకు రూ.374.58 కోట్ల స్రీనిధి రుణాలు అందించారు. ఈబీసీ నేస్తంలో భాగంగా కమ్మ, రెడ్డి, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య తదితర కులాలకు చెందిన 16,218 మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఏడాదికి రూ.24.32 కోట్లు అందజేశారు. వైఎస్సార్ కాపు నేస్తం పథకంలో కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన మహిళలు 824 మందికి ఏటా ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఏడాదికి రూ.44.73 కోట్ల ఆర్థిక సాయం చేశారు. ఇలా నాలుగేళ్ల పాటు అందించారు. ప్రస్తుతం ఈ వర్గాల మహిళలను పట్టించున్న వారే లేరు. మహిళల పేరిటే ఇళ్ల స్థలాలు పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ స్థలంతో పాటు పక్కా ఇళ్లు నిర్మించేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇంటి పట్టాలు సైతం మహిళల పేరు మీదనే అందించింది. జిల్లా వ్యాప్తంగా 431 లే అవుట్లలో 65,075 ఇళ్లు మంజూరు చేసింది. ప్రభుత్వం మంజూరు చేసిన స్థలాల్లో 47,053 ఇళ్లు, ప్రైవేటు స్థలాల్లో 18,022 ఇళ్ల నిర్మాణాలకు నాంది పలికారు. -
ఆమైపె కక్ష గట్టి..
ఇదేం పద్ధతి? వాస్తవానికి కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు అనేది ప్రభుత్వం వద్దనే పెండింగ్లో ఉంది. ఈ చెల్లింపులు సీఎంఎఫ్ పరిధిలో ఉన్నాయి. అధికారం గుప్పిట్లో ఉందని జబ్బలు చరుచుకునే అధికార పార్టీ నేతలు ఉన్నత స్థాయిలో బిల్లులు మంజూరయ్యేలా ప్రయత్నించుకోకుండా కమిషనర్పై దుందుడుకుగా మాట్లాడితే ప్రయోజనమేమిటని, ఫిర్యాదు చేయడానికి వచ్చి, ఒక మహిళా ఐఏఎస్పై అంత దురుసుగా మాట్లాడటం సమంజసమా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అధికారం చేతిలో ఉందనే అహంకారంతో ఏం చేసినా చెల్లుతుందనే తెగింపుతోనే ఇలా వ్యవహరించారని అంటున్నారు. ఈ ఉదంతంలో కమిషనర్ భావన అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేయడంలో తప్పేముందని ఉద్యోగ సంఘాలు నిలదీస్తున్నాయి. బిల్లుల మంజూరులో కమిషనర్ వైఫల్యం ఏమైనా ఉంటే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని, అయినప్పటికీ దుందుడుకుగా మాట్లాడాల్సిన పనేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.భావన, కమిషనర్, నగరపాలక సంస్థ సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఒక మహిళా ఐఏఎస్పై కూటమి నేతలు కక్ష కట్టారు. ఆమెను సాగనంపేందుకు తమ మధ్య ఉన్న విభేదాలన్నింటినీ పక్కన పెట్టి ఒక్కటయ్యారు. బిల్లుల కోసం వచ్చి, గద్దించి మాట్లాడిన టీడీపీ నేత కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడమే ఆమె చేసిన పెద్ద నేరమైంది. ఆమెను కొనసాగించవద్దని అందరూ పట్టుబడుతున్నారు. దీనికోసం జిల్లా టీడీపీలో సీనియర్ నాయకులందరూ అంతర్గతంగా ప్రత్యేక అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేశారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ భావన బదిలీ కోసం కూటమి కట్టిన నేతల తీరు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. టీడీపీ నేత పుత్రరత్రం దుందుడుకు వ్యవహారం ప్రజాసంబంధాలతో ముడిపడి ఉన్న ఐఏఎస్ అధికారులు.. ఏ హోదాలో ఉన్నా ఏ విషయంౖపైనెనా సమయస్ఫూర్తితో వ్యవహరించాల్సిందే. అందునా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాఫిర్యాదుల వేదికలో మరింత జాగరూకతగా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. నాలుగున్నర లక్షల పైచిలుకు జనాభా కలిగిన కాకినాడ నగర పాలక సంస్థకు మహిళా ఐఏఎస్ భావన కమిషనర్గా పని చేస్తున్నారు. ఆమె కాకినాడ వచ్చి ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. ప్రతి వారం మాదిరిగానే గత సోమవారం ఆమె ప్రజా ఫిర్యాదుల వేదికలో అర్జీలు స్వీకరిస్తున్నారు. ఆ క్రమంలో కమిషనర్ వద్దకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి ఏసుదాసు తనయుడు, కాంట్రాక్టర్ అయిన గంగాధర రమేష్ వచ్చారు. అధికార పార్టీకి చెందిన కీలక నాయకుడి తనయుడిని కావడంతో తన మాటకు ఎదురుండదనుకున్నారో ఏమో కానీ.. పెండింగ్ బిల్లుల కోసం దుందుకుడుగా ప్రశ్నించారు. తాము చెప్పినట్టే అధికారులు, సిబ్బంది నడచుకోవాలనే మనస్తత్వాన్ని చంద్రబాబు దగ్గర నుంచి క్షేత్ర స్థాయిలో నేతల వరకూ అందరూ ఒంట పట్టించుకున్నట్టు ఈ సంఘటనతో అర్థమవుతోంది. బిల్లులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారని గంగాధర రమేష్ గద్దించి మాట్లాడంతో మనస్తాపం చెందిన కమిషనర్ భావన.. దీనిపై అదనపు ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్కు ఎంహెచ్ఓ ద్వారా మొబైల్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కాస్త శ్రుతి మించి వ్యవహరించారనే విమర్శలున్నాయి. బిల్లుల విషయం పక్కన పెట్టి.. బదిలీపై పట్టుబట్టి.. తమ పార్టీ నాయకుడి తనయుడి పైనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టీడీపీ నాయకుల అహం దెబ్బ తిన్నట్టుంది. ఈ నేపథ్యంలో వారు బిల్లుల విషయాన్ని పక్కన పెట్టేసి, కమిషనర్ భావనను తక్షణం బదిలీ చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ విషయంపై తాడోపేడో తేల్చేస్తామంటూ రచ్చరచ్చ చేస్తున్నారు. ఎంహెచ్ఓ ద్వారా పోలీసులకు కమిషనర్ ఫిర్యాదు చేయడంపై కూటమి ఎమ్మెల్యేలు కాకినాడలో అంతర్గతంగా భేటీ అయ్యారు. ఇది చర్చనీయాంశమైంది. మెట్ట ప్రాంతానికి చెందిన ఒక కీలక ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగిన ఈ భేటీలో కమిషనర్ భావనను కాకినాడ నుంచి సాగనంపాల్సిందేనని ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులకు అల్టిమేటం ఇచ్చారని సమాచారం. దీనికి వారం రోజులు డెడ్లైన్ పెట్టినట్లు తెలిసింది. మెట్ట ప్రాంత నేతలకు కాకినాడ సిటీ, రూరల్ నేతలు కూడా తోడయ్యారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అడ్డగోలు పనులకు అడ్డమని... వాస్తవానికి కమిషనర్ భావన, కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మధ్య ఆరు నెలల క్రితమే పలు అంశాల్లో విభేదాలు వచ్చాయి. అప్పటి నుంచీ నగరంలో ఏ అధికారిక కార్యక్రమంలోనూ ఇద్దరూ కలిసి పాల్గొన్న దాఖలాలు లేవు. కాకినాడ దుమ్ములపేటలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ శంకుస్థాపనకు ఎమ్మెల్యే కొండబాబు చివరి నిమిషంలో డుమ్మా కొట్టేశారు. వీరిద్దరి మధ్య విభేదాల విషయం తెలియక రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వచ్చినప్పటికీ.. కొండబాబు రాలేదని తెలిసి తిరిగి వెళ్లిపోయారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమిషనర్కు మాత్రమే కుర్చీ వేసి, ఎమ్మెల్యేని విస్మరించారంటూ అప్పట్లో కొండబాబు వర్గీయులు బయట రచ్చరచ్చ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అయినప్పటికీ ఇప్పటి వరకూ ఎమ్మెల్యే, కమిషనర్ కలసి అధికారులతో ఒక్క సమావేశం కూడా నిర్వహించిన దాఖలాలు లేవు. కార్పొరేషన్ కమిషనర్గా వచ్చిన తరువాత అధికార పార్టీ నేతలు చెప్పే అడ్డగోలు పనులకు భావన అడ్డు తగులుతూండటం టీడీపీ నేతలకు కంటగింపుగా మారింది. అయితే, అప్పట్లో ఆమైపె చర్యలకు సిఫారసు చేసేందుకు ధైర్యం చాలక కాకినాడ సిటీ టీడీపీ నేతలు కిమ్మనకుండా ఉండిపోయారు. ఇటీవల మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ కాకినాడ వచ్చిన సందర్భంలో సైతం టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కమిషనర్ భావనను మార్చాల్సిందేనని పట్టుబట్టారని ప్రచారం జరిగింది. తాజా ఘటనతో జిల్లాలోని టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులందరూ కూటమి కట్టి, కమిషనర్ బదిలీకి పావులు కదుపుతున్నారు. పట్టుమని పది నెలలు కూడా కాకుండానే ఆమెను సాగనంపేందుకు చేస్తున్న ప్రయత్నాలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.నగరపాలక సంస్థ కార్యాలయం మహిళా ఐఏఎస్కు వ్యతిరేకంగా నేతల ‘కూటమి’ కాకినాడ కార్పొరేషన్ కమిషన్ బదిలీకి యత్నం అంతా ఒక్కటై.. బదిలీకి వారం డెడ్లైన్ అధిష్టానానికి అల్టిమేటం -
చేప ముల్లు తీసి.. ప్రాణం నిలిపి..
కాకినాడ క్రైం: గుండె రక్తనాళానికి చేప ముల్లు గుచ్చుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళ ప్రాణాలను కాకినాడ వైద్యులు రక్షించారు. సంబంధిత వివరాలను కాకినాడ అపోలో ఆసుపత్రి యాజమాన్య గురువారం వెల్లడించింది. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు గ్రామానికి చెందిన మహిళ జంప మంగాయమ్మ (54) ఫోన్ మాట్లాడుతూండగా గుండె నొప్పికి గురైంది. ఆమెను కుటుంబ సభ్యులు గత నెల 25వ తేదీన కాకినాడ అపోలో ఆసుపత్రిలో చేర్చారు. వైద్యులు పరీక్షించి గుండె రక్తనాళానికి చేప ముల్లు గుచ్చుకొని ఉందని తేల్చారు. ఆమెను రక్షించేందుకు ఛాతికి అత్యంత అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ సర్జరీ చేయడానికి 12 గంటల సుదీర్ఘ సమయం పట్టింది. ఇది దేశంలోనే అత్యంత అరుదైన శస్త్రచికిత్స అని వైద్యులు తెలిపారు. వైద్య బృందానికి కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ శస్త్రచికిత్సలో మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు డాక్టర్ గూడె వంశీ చైతన్య, వాస్క్యులర్ సర్జన్ కృష్ణ, గుండె మత్తు వైద్య నిపుణుడు ప్రగడ నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. -
సమష్టి కృషితోనే ఎన్బీఏ గుర్తింపు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): సమష్టి కృషితోనే జేఎన్టీయూ కాకినాడ ఇంజినీరింగ్ కళాశాలకు నేషనల్ బోర్డు అక్రిడిటేషన్ (ఎ న్బీఏ) యూజీ స్థాయి గుర్తింపు వచ్చిందని జేఎన్టీయూకే వైస్ చాన్సలర్ సీఎస్ఆర్కే ప్రసాద్ అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ మో హనరావు అధ్యక్షతన అలుమ్నీ ఆడిటోరియంలో గురువారం సాయంత్రం జరిగిన అభినందన సభలో ఆయ న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బీటెక్ కోర్సులైన ఈఈఈ, ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్, సివిల్ విభాగాలను ఎన్బీఏ బృందం గత నెలలో సందర్శించిందని, ఈ గుర్తింపు 2028 వరకూ ఉంటుందని చెప్పారు. పీజీ ప్రోగ్రామ్కు ఎన్బీఏ గుర్తింపు వచ్చేలా ఇదే తరహాలో కృషిచేయాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ స్వరూపరాణి, ఆర్.దీక్షితులు, వివిధ విభాగాల అధిపతులు కోటేశ్వరరావు, కె.వెంకటరెడ్డి, ఆర్.మధు, ఎస్.సురేఖ, కల్యాణ్ మనోహర్, సత్యవేణి పాల్గొన్నారు. -
సేవలకు సెలవంటూ...
ఉత్తరాధికారి రాఖీ ప్రేమ్ తదుపరి పీఠాధిపతి పీఠాధిపతి కామేశ మహర్షి శివైక్యం కావడంతో ప్రస్తుతం పీఠం ఉత్తరాధికారిగా ఉన్న బాల బ్రహ్మచారి వికానస రాఖీ ప్రేమ్ను తదుపరి పీఠాధిపతిని చేసేందుకు కామాక్షీ పీఠం ట్రస్ట్ బోర్డు నిర్ణయానికి వచ్చింది. ఇంత కాలం పీఠం ట్రస్ట్కు అధిపతిగా ఉన్న కామేశ మహర్షి స్థానే ప్రేమ మందిరం అమ్మ, వరసకు ఆయన సోదరి వక్కలంక వాణి బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రేమ మందిరంలో పెరిగి పెద్ద అయిన, పీఠాధిపతి ప్రియశిష్యుడు మర్రి దుర్గారావు ఎప్పటిలాగే పీఠం మేనేజర్ బాధ్యతలు నిర్వహిస్తారు. అమలాపురం టౌన్: శ్రీకామాక్షీ పీఠాధిపతి కామేశ మహర్షి (88) సేవా ప్రస్థానం ముగిసింది. మానవ సేవే మాధవ సేవ అనే భావనతో ఆయన జీవితాంతం నడిచారు. పీఠాధిపతి అస్తమించారన్న వార్త కోనసీమ ప్రజలను విషాదంలో నింపింది. ఆరు నెలలుగా అస్వస్థతగా ఉన్న ఆయన గురువారం తెల్లవారు జాము 3.30 గంటలకు పీఠంలోనే తుది శ్వాస విడిచారు. పీఠాధిపతి ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉండి సమాజానికి సేవలు అందించారు. ఈయన స్వగ్రామం తుని సమీపంలోని హంసవరమైనప్పటికీ అమలాపురంలో పుట్టి పెరగడంతో పట్టణంలోనే పీఠాన్ని ఏర్పాటు చేశారు. 1938 ఏప్రిల్ 2న జన్మించారు. అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాలలో డిగ్రీ, మద్రాసు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీలో ఏఎంఐఈ చదివారు. ఈయన అసలు పేరు బెహరా యర్రంరాజు. పీఠాధిపతి అయ్యాక కామేశ మహర్షి అయ్యారు. 1967లో పీఠం ఏర్పాటు అమలాపురంలోని కృష్ణారావు వీధిలో శ్రీకామాక్షీ పీఠాన్ని 1967లో స్థాపించారు. కంచి కామకోటి పీఠాధిపతి శంకరాచార్య జయేంద్ర సరస్వతీ స్వామి అనుగ్రహం, ఆశీస్సులతో కామేశ మహర్షి పీఠాధిపతి అయ్యారు. కామేశ మహర్షి కంచి కామకోటి పీఠానికి అనేక సార్లు వెళ్లడమే కాకుండా జయేంద్ర సరస్వతీ స్వామీజీని అమలాపురం పీఠానికి 1976, 1996 సంవత్సరాల్లో తీసుకుని వచ్చారు. రెండేళ్ల కిందట కంచి కామకోటి పీఠాఽధిపతి విజయేంద్ర సరస్వతీ స్వామీజీని పీఠానికి తోడ్కొని వచ్చి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ పీఠాధిపతుల ఆశీర్వాదాలతోనే కామాక్షీ పీఠం ప్రస్థానం సాగింది. కామాక్షీ పీఠం ట్రస్ట్ను స్థాపించి కార్యవర్గం ఆధ్వర్యంలో సేవలు కొనసాగించారు. అనాథ పిల్లల కోసం ప్రేమ మందిరం 1996 సంవత్సరంలో పెను తుపానుతో కోనసీమలో ప్రాణ నష్టం భారీగా జరిగింది. తుపానులో వందలాది మంది మృత్యువాత పడినప్పుడు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలను చూసి పీఠాధిపతి చలించారు. ఈ క్రమంలో అదే సంవత్సరం పీఠంలోనే అనాథ పిల్లల ఆశ్రమం పేరుతో ప్రేమ మందిరం నెలకొల్పారు. వరసకు సోదరి అయిన వక్కలంక వాణికి ఆ ప్రేమ మందిరం అమ్మగా బాధ్యతలు అప్పగించారు. కన్న బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమ మందిరం అమ్మ వాణి అనాథలను చూసుకుంటున్నారు. ఇన్నేళ్లలో ప్రేమ మందిరంలో దాదాపు 600 మంది అనాథ పిల్లలు ఆశ్రమం పొందారు. అనాథ పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పి వారు ప్రయోజకులు అయ్యేలా చేశారు. సుమారు 50 అనాథ ఆడ పిల్లలకు యుక్త వయస్సు వచ్చాక పెళ్లిళ్లు చేసి మెట్టింటికి పంపించారు. ప్రస్తుతం 60 మంది అనాథలు ఆశ్రయం పొందుతున్నారు. సేవలు అనంతం కామేశ మహర్షి ఇటు పీఠంలోనే కాకుండా అనేక గ్రామాల్లో తన సేవలను కొనసాగించారు. పీఠంలో నిత్యం పూజాదికాలు నిర్వహించారు. కార్తిక, శ్రావణ, మాఘ మాసాల్లో మహిళలతో సామూహిక పూజలు చేయించేవారు. అన్నదానం అంటే ఆయనకు అమితమైన ఇష్టం. గ్రామాల్లో అనేక అన్నదానాలు నిర్వహించారు. అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి గ్రామంలో గోశాలను నెలకొల్పి 60 గోవులకు ఆశ్రయం కల్పించారు. తుని సమీపంలోని హంసవరంలో శ్రీకామాక్షీ ఆలయాన్ని, అమలాపురం రూరల్ మండలం చిందాడగరువులో అమలేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించారు. దానికి అనుబంధంగా చిందాడ మడుగులో వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు చేసేలా ఏర్పాట్లు చేశారు. ఎన్నెన్నో పురస్కారాలు కామేశ మహర్షి తన సేవా ప్రస్థానంలో పలు సంస్థల నుంచి ఎన్నెన్నో పురస్కారాలు అందుకున్నారు. మద్రాసు అకాడమి నుంచి ఉగాది పురస్కారం, రాజీవ్ విజ్ఞాన్ పురస్కారం, అల్లూరి స్మారక పురస్కారం, సహస్రాబ్ది పురస్కారం, శతాబ్ది సేవా పురస్కారం, ఎన్టీఆర్ స్మారక ట్రస్ట్ నుంచి జాతీయ పురస్కారం, అక్షర నీరాజన పురస్కారం, ప్రభుత్వం నుంచి సేవా పురస్కారాలను అందుకున్నారు. నేడు అంత్యక్రియలు కామేశ మహర్షి పార్థివ దేహానికి పీఠంలోనే శుక్రవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించేందుకు పీఠం ట్రస్ట్ బోర్డు నిర్ణయించింది. కామేశ మహర్షి జీవించి ఉండగానే తన అంత్యక్రియలు పీఠంలోనే జరగాలని ప్రదేశాన్ని కూడా సూచించారు. ఆయన సూచనల మేరకే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకామాక్షీ పీఠాధిపతి కామేశ మహర్షి అస్తమయంతో కోనసీమలో విషాదం అనాథలను అక్కున చేర్చుకున్న మానవతావాది అన్నార్తుల ఆకలి తీర్చిన దాన శీలి చిందాడగరువు, హంసవరలో ఆలయాల నిర్మాణం పీఠంలో నిత్యం పూజా కార్యక్రమాలు మూడు పర్యాయాలు కంచి కామకోటి పీఠాధిపతులు అమలాపురానికి రాక -
జిల్లావ్యాప్తంగా 4 లక్షల మొక్కలు నాటుతాం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లావ్యాప్తంగా 4 లక్షల మొక్కలు నాటుతామని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యాన స్థానిక ఆర్ట్స్ కళాశాలలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నాటిన మొక్కలను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని కోరారు. ప్లాస్టిక్ మంచిది కాదనే విషయం తెలిసిన రోజున ఎవరికి వారే దీని వినియోగం తగ్గించుకోవడం సాధ్యమవుతుందని అన్నారు. అటవీ శాఖ చీఫ్ కన్సర్వేటర్ మూర్తి మాట్లాడుతూ, ప్లాస్టిక్ వినియోగంతో మనకు తెలియకుండానే శరీరంలో మైక్రో ప్లాస్టిక్ వ్యర్థాలు రక్తంలో కలిసిపోతున్నాయని తెలిపారు. వెయ్యి మందికి రక్త పరీక్షలు నిర్వహించగా 80 శాతం మందిలో మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్లు గమనించారన్నారు. మైక్రో ప్లాస్టిక్ ఉన్న వారిలో 25 శాతం మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సెంట్రల్ జైలును సందర్శించిన అటవీ అధికారులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలును అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఎస్ఎన్ఎన్ మూర్తి, డివిజనల్ ఫారెస్ట్ అధికారి ఫణీంద్ర ధర్మ గురువారం సందర్శించారు. జైలులోని నర్సరీ గురించి వారికి కారాగార పర్యవేక్షణాధికారి ఎస్.రాహుల్ వివరించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కారాగారానికి బయో డైవర్సిటీ పురస్కారం అందజేసిందని చెప్పారు. వందేళ్ల వయస్సుకు పైబడిన వృక్షాలను అటవీ శాఖ అధికారులకు ఆయన చూపించారు. కారాగారంలో నర్సరీని అభివృద్ధి చేసిన జైలు అధికారులను అటవీ అధికారులు ప్రశంసించారు. అనంతరం కారాగారంలోని పరేడ్ మైదానంలో మొక్కలు నాటారు. కార్మిక శాఖ సహాయ కమిషనర్గా శ్రీనివాస్ మహేష్ బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కార్మిక శాఖ కాకినాడ సహాయ కమిషనర్గా పి.శ్రీనివాస్ మహేష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో కార్మిక శాఖ కమిషనర్గా పని చేస్తున్న ఆయన బదిలీపై కాకినాడ వచ్చారు. ఇప్పటి వరకూ ఇక్కడ పని చేసిన ఎస్.బుల్లిరాణి కొవ్వూరు బదిలీ అయ్యారు. -
గృహ నిర్మాణ పురోగతి బాధ్యత ప్రత్యేక అధికారులదే..
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): గృహ నిర్మాణ పనుల పురోగతిపై ప్రతి వారం సమీక్ష చేస్తున్నా, స్టేజి కన్వర్షన్ విధానంలో నిర్లిప్తత చూపితే ఉపేక్షించే ప్రసక్తి లేదని కలెక్టర్ ప్రశాంతి స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డివిజన్, మండల స్థాయి, ప్రత్యేక అధికారులతో గృహ నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ మూడు నెలలుగా ఒక్క ఇంటికి స్టేజి కన్వర్షన్ లేకపోగా 10 రోజుల్లో పూర్తి చేస్తామని ఎలా చెప్ప గలుగుతున్నారని ప్రశ్నించారు. అటువంటి అధికారులు, సిబ్బంది వ్యక్తిగత పనితీరుపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఇన్చార్జి జిల్లా హౌసింగ్ అధికారి ఎస్.భాస్కర్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 3,362 మందికి అదనపు ఆర్థిక సహాయం విడుదల చేశామన్నారు. అయితే లింటల్ లెవెల్ 701, రూఫ్ లెవెల్ 464 , రూఫ్ కంప్లీట్ స్థాయిలో 49 ఉన్నాయన్నారు. వాటిపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పర్యవేక్షణ పెంచాలి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిషేధిత ప్రాంతాల్లో, నిషేధిత కాలంలో ఇసుక తవ్వకాలు జరగకుండా పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని కలెక్టర్ ప్రశాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం జిల్లా స్థాయి డీఎల్ఎస్ఏ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, జూన్ 1వ తేదీ నుంచి సెమీ మెకనైజ్డ్ ఇసుక రీచ్ల వద్ద ఇసుక తవ్వకాలు జరపరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిషేధ సమయంలో ఇసుక తవ్వకాలు జరిపితే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామన్నారు. కలెక్టర్ ప్రశాంతి -
‘కోరింగ’లో ‘స్పాట్–టెయిల్డ్ పిట్ వైపర్’
సాక్షి ప్రతినిధి, కాకినాడ: భవిష్యత్లో అంతరించిపోయే జాతుల జాబితాలో ఉన్న స్పాట్–టెయిల్డ్ పిట్ వైపర్ జాతి పాము కాకినాడ సమీపాన గుర్తించారు. దేశంలోనే మూడో అతి పెద్ద కోరంగి అభయారణ్యంలో ఈ పాము తారసపడింది. దాదాపు 40 ఏళ్ల క్రితం జనవాసాల్లో కనిపించే ఈ అరుదైన జాతిపాము సమీప భవిష్యత్లో అంతరించిపోయే జాతుల్లో ఒకటిగా చేరింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1978 ప్రకారం ఈ పాము నాలుగో షెడ్యూల్లో ఉంది. అటువంటి ఈ జాతి పాము పరిరక్షణ కోసం తక్షణం ప్రయత్నించకుంటే అంతరించిపోతున్న జాతుల్లో చేరిపోతుందని వన్యప్రాణి సంరక్షణా విభాగం గుర్తించింది. ఈ నేపథ్యంలో స్పాట్–టెయిల్డ్ పిట్ వైపర్ పామును నాలుగో షెడ్యూల్ నుంచి ఒకటో షెడ్యూల్లోకి చేర్చారు. ఈ షెడ్యూల్ మార్పు ద్వారా అత్యంత జాగ్రత్తతో ఈ జాతి పామును రక్షించాలనే సందేశాన్ని ఇచ్చినట్టు వన్యప్రాణి విభాగం అధికారులు చెబుతున్నారు. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని ముందుచూపుతోనే 2022లో షెడ్యూల్ మార్చారు. పొడ పాము సంతతికి చెందిన ఈ పాము పచ్చరంగులో ఉంటుంది. ఈ జాతిలో రెండు రకాలు బాంబోపిట్ వైపర్, స్పాట్ వైల్డ్ పిట్వైపర్ ఉన్నాయి. బాంబో పిట్ వైపర్ సాధారణంగా అటవీ ప్రాంతమైన రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి, వై.రామవరం, అడ్డతీగల తదితర ప్రాంతాల్లో ఉంటుంది. స్పాట్ వైల్డ్ పిట్ వైపర్ జాతి పాములు చిత్తడి నేలల్లో (మాంగ్రూవ్స్) మాత్రమే మనగలుగుతాయి. ఈ పాము మనిషిపై దాడి చేసినప్పుడు రక్తంలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయి. దీంతో బ్రెయిన్ డెడ్ కావడం, హార్ట్ అటాక్, కోమాలోకి వెళ్లడంతో ప్రాణానికే ప్రమాదం ఏర్పడతాయి. అయితే, ఇంతవరకూ ఈ జాతి పామువల్ల ఇలాంటి కేసులు ఎక్కడా నమోదు కాలేదు. ఈ పాములు పగలు నిద్రావస్థలో ఉండి, రాత్రి పూట మాత్రమే సంచరిస్తుండటంతో ప్రజల ప్రాణాలకు పెద్దగా ప్రమాదం ఎదురు కాలేదు. ఈ జాతి పాములు ఎక్కువగా దక్షిణ ఆసియా, మయన్మార్లలో మాత్రమే కనిపిస్తుంటాయి. పాముకు ఉప జాతులేమీ గుర్తించ లేదు. మగ పాము గరిష్టంగా 575 మిల్లీమీటర్లు (22.6 అంగుళాలు) పొడవున పెరుగుతాయని నిర్దారించారు. వీటి తోక పొడవు 120 మిల్లీమీటర్లు (4.7 అంగుళాలు) పైనే ఉంటుంది. ఆడ పాము అయితే గరిష్టంగా 1,045 మిల్లీమీటర్లు (41.1 అంగుళాలు) పొడవు, తోక చూస్తే 165 మిల్లీమీటర్లు (6.5అంగుళాలు) పొడవు ఉంటుంది. మగ పాము కంటే ఆడపాము పొడవు ఎక్కువగా ఉంటుంది. ఫ అత్యంత విషపూరితం ఫ కాటేస్తే ప్రాణానికే ప్రమాదం ఫ పసర పాము అనుకునేరు జాగ్రత్త సుమా! -
జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా బాలరాజు
నిడదవోలు : వైఎస్సార్ సీపీ జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా ప్రస్తుత నిడదవోలు మున్సిపల్ వైస్ చైర్మన్ యలగాడ బాలరాజు ఎంపికయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నిడదవోలు నియోజకవర్గానికి చెందిన బాలరాజుని ఎంపిక చేసినట్లు బుధవారం వెల్లడించారు. 2014 నుంచి వైఎస్సార్ సీపీకి విధేయుడిగా ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం బాలరాజు కృషి చేశారు. 2014లో పట్టణంలో 13వ వార్డు నుంచి వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసి కౌన్సిలర్గా గెలుపొందారు. తిరిగి 2021లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించారు. దీంతో వైఎస్సార్ సీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే జి. శ్రీనివాసనాయుడు రెండవ మున్సిపల్ వైస్ చైర్మన్గా అవకాశం కల్పించారు. నిజాయితీ, నిబద్ధతతో పార్టీ కోసం పనిచేస్తున్న బాలరాజుకి సముచిత స్ధానం కల్పిస్తూ జిల్లా మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా నియమించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బాలరాజు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తానన్నారు. తనపై ఎంతో నమ్మకంతో జిల్లా స్థాయి పదవి ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి, మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాసనాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. -
రాష్ట్రంలో సాగుతున్న కక్షపూరిత పాలన
రాజమహేంద్రవరం రూరల్: రాష్ట్రంలో కేవలం కక్షపూరిత పాలన మాత్రమే సాగుతోందని, సంక్షేమం అంటూ ఏమీ లేదని వైఎస్సార్ సీపీ మేధావుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వై.ఈశ్వర్ప్రసాద్రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం బొమ్మూరులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ మేధావుల విభాగం నియోజకవర్గ అధ్యక్షులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ, అమలు చేయలేమని తెలిసీ, అధికార దాహంతో బూటకపు హామీలిచ్చి రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంతో గుణపాఠం చెప్పారన్నారు. ప్రజలంతా చంద్రబాబు మనస్తత్వం ఏమిటో, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యక్తిత్వం ఎటువంటిదో తెలుసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన అన్యాయాలు, అక్రమాలతో పాటు, ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ హామీలతో పాటు, 143 హామీలను అమలుచేయని విషయాన్ని ప్రజల్లో తీసుకువెళ్లాలన్నారు. వైఎస్సార్ సీపీ బలోపేతానికి మేధావుల విభాగం పూర్తి స్థాయిలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, పార్టీ మేధావుల విభాగం ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తి సహాయసహకారాలు అందిస్తానన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎస్వీఎస్ రెడ్డి, రొక్కం సంజీవయ్య, రాఘవరెడ్డి, కాకినాడ జిల్లా అధ్యక్షుడు పార్థసారధి, నియోజకవర్గ అధ్యక్షులు కర్రిశ్రీను, భీమేశ్వరరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్ సీపీ మేధావుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ప్రసాద్రెడ్డి -
బాలుడిని బలిగొన్న లారీ
ఘటనలో మేనత్తకు తీవ్ర గాయాలు ప్రత్తిపాడు: జాతీయ రహదారిపై ప్రత్తిపాడు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందగా, ఉపాధ్యాయురాలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు, కోరుకొండలో శారదలీల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. కాకినాడకు చెందిన తన మేనల్లుడు భాష్యం అఖిల్ (11) వేసవి సెలవుల కారణంగా కొద్ది రోజులుగా కోరుకొండలోని తన మేనత్త శారదలీల వద్ద ఉంటున్నాడు. ప్రత్తిపాడులోని బంధువుల ఇంటికి వారిద్దరూ స్కూటీపై బయలుదేరారు. ఎన్హెచ్పై పోలవరం కాలువ సమీపంలో వారి స్కూటీని లారీ ఢీకొంది. ఈ ఘటనలో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108లో ప్రత్తిపాడు సీహెచ్సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం కాకినాడ తరలిస్తుండగా అఖిల్ మార్గం మధ్యలో మృతి చెందాడు. శారదలీలను కాకినాడలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రత్తిపాడు ఎస్సై ఎస్ లక్ష్మీకాంతం కేసు దర్యాప్తు చేస్తున్నారు. బైక్ను ఢీకొన్న మినీవ్యాన్ముమ్మిడివరం: మోటార్ బైక్పై ప్రయాణిస్తున్న తండ్రీకొడుకులను వెనుక నుంచి మినీ వ్యాన్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన సంఘటన ఇది. ముమ్మిడివరం నగర పంచాయతీ టీటీఆర్ నగర్కు చెందిన ఏడిద సోమరాజు, అతని కుమారుడు సుదర్శన్ మోటార్ బైక్పై బుధవారం అమలాపురం వైపు వెళుతున్నారు. మహిపాల చెరువు సెంటర్లో వెనుక నుంచి వచ్చిన మినీవ్యాన్ వీరి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు 108 వాహనంలో అమలాపురంలోని ప్రవేటు ఆసుపత్రికి తరలించారు. -
ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ
కొత్తపల్లి: ఊరు వెళ్లిన సమయంలో ఓ ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ జరిగింది. బుధవారం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వాకతిప్ప విద్యుత్ ఉపకేంద్రం ఎదురుగా ఉన్న కాలనీకి చెందిన పేరూరి శ్రీనివాసరావు మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. సోమవారం కుటుంబ సమేతంగా అన్నవరంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంటి తలుపులు పగులగొట్టి ఉన్నట్టు బుధవారం వారి ఇరుగుపొరుగు వారు శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. హుటాహుటిన ఆయన ఇంటికి చేరకుని, చోరీ జరిగినట్టు గుర్తించారు. ఇంట్లో బీరువాలో పెట్టిన 12 కాసుల బంగారం, అర కిలో వెండి వస్తువులు, సుమారు రూ.1.30 లక్షల నగదు చోరీకి గురైనట్టు నిర్ధారించారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. సంఘటన స్థలాన్ని ఎస్సై వెంకటేష్ క్లూస్ టీంతో పరిశీలించారు. సంఘటన స్థలంలో ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరా పుటేజీని పరిశీలించారు. దొంగలు ఆ ఇంటికి అమర్చి ఉన్న సీసీ కెమెరాలను సైతం ధ్వసం చేసినట్టు గుర్తించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. -
విత్తు కొద్దీ పంట
జాగ్రత్తలు వహించాలి విత్తన ఎంపికలో రైతులు అత్యంత జాగ్రత్తలు వహించాలి. ఇప్పటికే రైతులు నారుమడులు సిద్ధం చేసుకుంటున్నారు. పంట కాలువలకు పూర్తి స్థాయిలో నీరు వచ్చిన అనంతరం వెదజల్లు సాగుకు కూడా ప్రాధాన్యమివ్వాలి. ముందస్తు సాగు చేపడితే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. – కొప్పిశెట్టి ప్రభాకర్, మండల వ్యవసాయాధికారి, రాయవరం రాయవరం: వ్యవసాయ అవసరాలకు ఈ ఏడాది జూన్ ఒకటో తేదీన నీరు విడుదల చేసినట్టు ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. పూర్తి స్థాయిలో పొలాలకు నీరు రావడానికి వారం రోజులు పట్టే అవకాశముంది. ఈలోగా వ్యవసాయ బోర్లు ఉన్న రైతులు ఇప్పటికే వరి నారుమడులు సిద్ధం చేసుకుంటున్నారు. కొందరు రైతులు సొంతంగా తయారు చేసుకున్న విత్తనాలను వినియోగిస్తుండగా, మరికొందరు విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. ఖరీఫ్లో అధికంగా రైతులు స్వర్ణ రకాన్ని సాగు చేస్తారు. నారుమళ్లు వేసుకునే సమయంలో రైతులు విత్తన ఎంపికకు అధిక ప్రాధాన్యమివ్వాలని, విత్తనం ఎంపికపైనే పంట దిగుబడి ఆధారపడి ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మొత్తం 1,63,365 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. నాలుగు రకాల్లో.. నాణ్యమైన విత్తనాలు బ్రీడర్, ఫౌండేషన్, సర్టిఫైడ్, ట్రూత్ఫుల్ లేబుల్స్లో లభ్యమవుతాయి. బ్రీడర్ విత్తనం న్యూక్లియర్ సీడ్ మూల విత్తనం నుంచి బ్రీడర్ విత్తనాన్ని తయారు చేస్తారు. ఇది అన్ని రకాల విత్తనాలకు మూల విత్తనం. దీన్ని కంపెనీలు ఆయా బ్రీడర్ల పర్యవేక్షణలో పండిస్తారు. వ్యవసాయ పరిశోధన స్థానాల్లో శాస్త్రవేత్తలు రూపొందించేవి ఇటువంటి విత్తనాలే. ఈ విత్తనం 100 శాతం జన్యు నాణ్యత కలిగి ఉంటుంది. బ్రీడర్ సీడ్కు బంగారు రంగు ట్యాగ్ వేస్తారు. సీడ్ ధర ఎక్కువ. రైతులకు రెండు కిలోలకు మించి బ్రీడర్ సీడ్ ఇవ్వరు. ఫౌండేషన్ ఈ విత్తనాన్ని బ్రీడర్ విత్తనం నుంచి ఉత్పత్తి చేస్తారు. వివిధ విత్తనోత్పత్తి సంస్థలు, సాంకేతిక నిపుణుల ఆధ్వర్యంలో పండిస్తారు. దాదాపు 100 శాతం జన్యు నాణ్యత కలిగి ఉంటుంది. ప్రైవేటు విత్తన కంపెనీలు వ్యవసాయ పరిశోధన కేంద్రాల నుంచి బ్రీడర్ విత్తనాలు తీసుకుని వెళ్లి ఫౌండేషన్ విత్తనాన్ని తయారు చేస్తాయి. ఈ సీడ్కు తెలుపు రంగు ట్యాగ్ వేస్తారు. సర్టిఫైడ్(ధ్రువీకరించిన) విత్తనం నుంచి నేరుగా సర్టిఫైడ్ విత్తనాలను ఉత్పత్తి చేస్తారు. వివిధ సంస్థలు, రైతుల పొలాల్లో కూడా విత్తన పర్యవేక్షకుల సమక్షంలో పండించే అవకాశం ఉంది. ఈ విత్తనానికి నీలి రంగు ట్యాగ్ వేస్తారు. ఏపీ సీడ్స్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ద్వారా సర్టిఫై చేస్తారు. ట్రూత్ఫుల్ లేబుల్ ఈ విత్తనాలను ట్రూత్ఫుల్ లేబుల్ కింద రైతులకు విత్తన కంపెనీలు విక్రయిస్తుంటారు. ట్రూత్ఫుల్ లేబుల్ విత్తనాలకు ఆకుపచ్చ రంగు ట్యాగ్ వేస్తారు. లేబుల్ ట్యాగ్పై విత్తన పరీక్ష చేసిన తేదీ ఉంటుంది. ఆ తేదీ నుంచి తొమ్మిది నెలల కాల పరిమితిలోపు విత్తనాన్ని కొనుగోలు చేయవచ్చు. నాణ్యమైన విత్తనంతోనే అధిక దిగుబడి పంట దిగుబడిలో మొలక శాతం కీలకం విత్తనాల కొనుగోలులో జాగ్రత్తలు పాటించాలంటున్న వ్యవసాయ నిపుణులుపాటించాల్సిన సూచనలివే.. వ్యవసాయ శాఖ లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలి. బిల్లుపై నంబరు, విత్తన రకం, గడువు తేదీలు, డీలరు సంతకం, రైతు సంతకం ఉండేలా చూసుకోవాలి. లూజుగా ఉన్న సంచులు, పగిలిన ప్యాకెట్లు, తెరిచిన డబ్బాల నుంచి విత్తనాలు కొనుగోలు చేయరాదు. గడువు దాటిన విత్తనాలను కొనుగోలు చేయకూడదు. కొనుగోలు చేసే విత్తన ప్యాకెట్లపై సీలు ఉందో లేదో చూసుకోవాలి. కొన్న విత్తనాలను డీలరు వద్దే తూకం వేయించాలి. వేసవి దృష్ట్యా ప్రతి రైతు తప్పనిసరిగా మొలక శాతం పరీక్ష చేయాలి. 100 గింజలకు 80 గింజలు మొలక వస్తే నాణ్యమైన విత్తనంగా పరిగణించవచ్చు. మొలక శాతం తక్కువగా ఉన్నట్లు రైతులు గుర్తిస్తే వెంటనే వేరే లాట్ నంబర్ నుంచి విత్తనాన్ని పొందే అధికారం వారికి ఉంది. దీనికి వ్యవసాయాధికారులు కూడా సహకరిస్తారు. మొలకెత్తే దశ, పూత దశలో పంటలో లోపం కనిపిస్తే వెంటనే వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. కొనుగోలు చేసిన విత్తన బిల్లులను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచుకోవాలి. అరువు పద్ధతిలో విత్తనాలు కొనుగోలు చేసినా సరే బిల్లు తీసుకోవాలి. -
ఉపాధి పోయి.. ఊపిరి విడిచి..
కడియం: ఎప్పటిలాగే విధి నిర్వహణకు వెళ్లిన ఆయనకు ఓ చేదువార్త ఎదురైంది. పంచాయతీ వారు పని నుంచి తీసేశారని శానిటరీ మేసీ్త్రకి చెప్పారు. జీవనోపాధి కోల్పోయానన్న విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. అదే ధ్యాసలో ఉంటూ రెండ్రోజుల వ్యవధిలోనే గుండెపోటుకు గురై ఈ లోకం నుంచే నిష్క్రమించారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వేమగిరి పంచాయతీలో 21 ఏళ్లుగా పేర్ల సింహాచలం(58) శానిటరీ మేసీ్త్రగా పనిచేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి రూప్చంద్ శానిటరీ మేసీ్త్రలను తొలగించారు. అందులో సింహాచలం కూడా ఉన్నారు. ధవళేశ్వరం నుంచి ఎప్పటిలాగే సోమవారం ఆయన పంచాయతీ వద్దకు రాగా, ఆయనను తొలగించినట్టు చెప్పారు. దీంతో గ్రామంలోని పెద్దలను కలిసినా ప్రయోజనం లేకపోవడంతో దిగులుగా ఇంటికి చేరుకున్నారు. అప్పటి నుంచీ దిగాలుగా ఉన్న సింహాచలం మంగళవారం గుండెపోటుకు గురై, కన్నుమూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. సింహాచలం భార్య ఇటీవల కన్నుమూసింది. ఆయనకు వివాహమైన కుమార్తె ఉంది. కాగా సైకిల్పై తిరుగూ పారిశుధ్య పనులు పర్యవేక్షించే సింహాచలం గ్రామంలో అందరి మన్ననను పొందేవారు. ఆయన మరణవార్త తెలియగానే బుధవారం కార్మికులకు సెలవు ప్రకటించారు. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. చోరీ కేసులో ఇద్దరికి జైలుకంబాలచెరువు: దొంగతనం కేసులో ఇద్దరికి ఆరు నెలల కారాగార శిక్ష విధిస్తూ ఐదో ఏజీఎఫ్సీఎం న్యాయమూర్తి జి.శ్రీనివాసరెడ్డి బుధవారం తీర్పునిచ్చారు. స్థానిక పీఅండ్టీ కాలనీ వేంకటేశ్వరస్వామి గుడి వీధికి చెందిన నల్లమిల్లి వరలక్ష్మి 2021 ఫిబ్రవరి 20న ఇంటి పెరట్లో ఉండగా, క్వారీ మార్కెట్కు చెందిన వడ్డి శ్రీధర్దాస్, బర్రె శేఖర్ గోడ దూకి లోపలికి ప్రవేశించారు. ఆమె మెడలోని బంగారు చంద్రహారం, మంగళసూత్రాల తాడును లాక్కుని పారిపోయారు. ఈ మేరకు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో బాధితురాలి అల్లుడు కర్రి రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై రామ్మోహన్ కేసు నమోదు చేశారు. అసిస్టెంట్ ఏపీపీ బీవీ రామ్మోహనరావు కోర్టులో వాదనలు వినిపించారు. నిందితులపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధించారు. చెరువులో పడి మేకల కాపరి మృతినల్లజర్ల: ఫిట్స్ రావడంతో చెరువులో పడిన మేకల కాపరి మృతిచెందిన సంఘటన ఇది. వివరాల్లోకి వెళితే, పోతవరానికి చెందిన జువాల కుటుంబరావు(55) మేకల కాపరిగా జీవిస్తున్నాడు. బుధవారం మేకలు తోలుకుని యర్నగూడెం వైపు బయలుదేరాడు. మార్గం మధ్యలో ఫిట్స్ రావడంతో గట్టు పైనుంచి పాత్రుని చెరువులో పడిపోయాడు. ఎవరూ గమనించక పోవడంతో మృతి చెందాడు. సాయంత్రం అటుగా వెళుతున్న కొందరు చెరువులో తేలుతున్న మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్టు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనపై తమకు సమాచారం అందలేదని ఎస్సై పీవీ సత్యనారాయణ తెలిపారు. షార్ట్సర్క్యూట్తో రెండు తాటాకిళ్లు దగ్ధంనాలుగు కుటుంబాలు నిరాశ్రయం అంబాజీపేట: మండలంలోని వాకలగరువు గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక రెండు తాటాకిళ్లు దగ్ధమయ్యాయి. నాలుగు కుటుంబాల వారు నిరాశ్రయులయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వాకలగరువు పంచాయతీ పరిధిలోని బుల్లి కాలనీలో షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించి, రెండు తాటాకిళ్లు పూర్తిగా కాలిపోయాయి. వీటిలో నాలు గు కుటుంబాల వారు జీవిస్తున్నారు. వారి గృహోపకరణ వస్తువులతో పాటు, దుస్తులు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు బూడిదయ్యాయి. ఈ ఘటనలో దాకే శ్రీనివాసరావు, దాకే వెంకటరావు, ముత్తాబత్తుల వీరవెంకట సత్యనారాయణ, ముత్తాబత్తుల దుర్గారావు కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ బుధవారం సంఘటన స్థలాన్ని పరిశీలించి, బాధిత కుటుంబాలను పరామర్శించారు. నిత్యావసర సరకులను బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. సర్పంచ్ మద్దింశెట్టి దొరబాబు, ఎంపీటీసీ సభ్యుడు వాకపల్లి దొరబాబు పాల్గొన్నారు. పురుగు మందు తాగిన కుటుంబం మలికిపురం: ఉపాధి కోసం విదేశానికి వెళ్లిన మహిళ తమను పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో ఆమె భర్త, ఇద్దరు పిల్లలు పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరిన ఉదంతమిది. మండలంలోని కేశనపల్లి గ్రామంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు, తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పలివెల నాగేశ్వరరావు భార్య లక్ష్మి ఐదేళ్ల క్రితం ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లింది. ఏళ్లు గడస్తున్నా తమను పట్టించుకోవడం లేదని నాగేశ్వరరావు, వారి కుమారుడు సుమన్, కుమార్తె ప్రశాంతి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆమె స్వగ్రామానికి రాలేదు. మాట్లాడాలని ఫోన్ చేసినా స్పందించడం లేదు. కనీసం కుటుంబ పోషణకు డబ్బు కూడా పంపిచడం లేదు. ఈ నేపథ్యంలో నాగేశ్వరరావుతో పాటు, వారి పిల్లలిద్దరూ బుధవారం ఉదయం పురుగు మందు తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న వీరిని స్థానికులు గుర్తించి, రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై మలికిపురం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.● గుండెపోటుతో శానిటరీ మేసీ్త్ర మృతి ● పని నుంచి తొలగించడమే కారణం! -
కారుపై కూలిన కొబ్బరి చెట్టు
సఖినేటిపల్లి: సఖినేటిపల్లిలంక గ్రామంలోని ప్రధాన రహదారిలో బుధవారం ఓ కారుపై కొబ్బరి చెట్టు కూలింది. ప్రయాణికులతో వెళుతున్న ఈ కారు ముందు భాగంపై చెట్టు కూలినప్పటికీ, అందులో ఉన్నవారు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. కారు రామాలయం వద్దకు చేరుకునేసరికి అకస్మాత్తుగా రోడ్డు పక్కనున్న కొబ్బరి ముచ్చెట్టు(శిథిల చెట్టు) విరిగిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తి అరెస్ట్నిడదవోలు రూరల్: సెల్ఫోన్లోని యాప్తో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు బుధవారం తెలిపారు. నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలోని లోహియనగర్కు చెందిన మన్యం శివ మంగళవారం రాత్రి ఐపీఎల్ ఫైనల్లో భాగంగా ఆర్సీబీ, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్కు యాప్ ద్వారా బెట్టింగ్ చేస్తుండగా అరెస్ట్ చేసినట్టు చెప్పారు. బెట్టింగ్కు వినియోగిస్తున్న సెల్ఫోన్, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నామన్నారు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహంకడియం: ద్వారపూడి–కడియం స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ వద్ద బుధవారం సుమారు 35 ఏళ్ల గుర్తు తెలియని పురుష మృతదేహం లభ్యమైందని ప్రభుత్వ రైల్వే పోలీసులు తెలిపారు. లేత ఆకుపచ్చ రంగు ప్యాంట్ మాత్రమే ధరించి ఉన్నాడన్నారు. మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రి మార్చురీలో భద్రపరిచినట్టు చెప్పారు. ఇతడి వివరాలు తెలిస్తే 94406 27551 నంబర్లో తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
అదృశ్యమైన మహిళ మృతదేహం లభ్యం
కరప: ఇంటి నుంచి బయటకెళ్లి అదృశ్యమైన మహిళ యానాం సమీపంలో గోదావరిలో శవమై తేలింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల మేరకు, కాజులూరు మండలం డేగలపేట గ్రామానికి చెందిన దేవు త్రిమూర్తులు, చక్రమ్మ రెండో కుమార్తె సౌమ్య(23) రెండేళ్ల క్రితం సుబ్బరాజును ప్రేమ వివాహం చేసుకుంది. వారికి 14 నెలల పాప ఉంది. సౌమ్య మంగళవారం అత్తతో గొడవపడి బయటకు వెళ్లిపోయింది. దీనిపై కరప పోలీసులు అదృశ్యం కేసుగా నమోదు చేసిన విషయం విదితమే. బుధవారం ఆమె మృతదేహం పుదుచ్చేరి రాష్ట్రం యానాం వద్ద గోదావరిలో లభ్యమైంది. యానాం వంతెన పైనుంచి దూకి ఉంటుందని అక్కడి పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని వెలికితీసి, యానాం ఆస్పత్రిలో పోస్ట్మార్టం నిర్వహించారు. మృతురాలి వద్ద లభ్యమైన ఆధారాల ప్రకారం ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించి, మృతదేహాన్ని అప్పగించారు. అదనపు కట్నం కోసం భర్త వేధింపులు, మరోవైపు అత్తింటి వేధింపులు భరించలేక తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు, బంధువులు యానాం పోలీసులకు ఫిర్యాదు చేయగా, అక్కడ కేసు నమోదైంది. బుధవారం రాత్రి మృతదేహాన్ని కరప పోలీసుస్టేషన్కు తీసుకొచ్చి మృతురాలి బంధువులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వివాహ సమయంలో కట్నకానుకలు ఇచ్చారని వారు చెప్పారు. అవి చాలవంటూ అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వేధింపులు భరించలేకే ఆత్యహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు విలపించారు. తమతో మాట్లాడటానికి కనీసం ఫోన్ కూడా ఇచ్చేవారు కాదని ఆరోపించారు. ఫోన్ ఇచ్చి ఉంటే అత్తింటి బాధలు తెలిసేవని, తమ కుమార్తెను రక్షించుకునేవారమన్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు కోరారు. కరప ఎస్సై టి.సునీత మాట్లాడుతూ, యానాంలో నమోదైన కేసును ఇక్కడకు బదలాయించాల్సి ఉందన్నారు. ఆమె భర్త, అత్తమామలను అదుపులోకి తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. అంత్యక్రియల తర్వాత కేసు మార్పిడికి చర్యలు తీసుకుంటామని ఎస్సై హామీ ఇచ్చారు. ఇరు కుటుంబాల వారితో మాట్లాడతామని ఎస్సై చెప్పడంతో ఆందోళన విరమించారు. ● పోలీస్స్టేషన్ వద్ద మృతదేహంతో బంధువుల ఆందోళన ● అత్తింటి వేధింపులే కారణమంటున్న తల్లిదండ్రులు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 22,500 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,500 గటగట (వెయ్యి) 19,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
సచివాలయ సెక్రటరీపై ఫిర్యాదు
రాజమహేంద్రవరం రూరల్: రాజానగరం మండలం రాధేయపాలెం గ్రామ సచివాలయంలో జయబున్నీసా బేగం గ్రేడ్–5 హోదాలో సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆ సచివాలయంలో వారంతా ఒకే నోటిఫికేషన్లో నియమితులయ్యారు. దీంతో వారి మధ్య సీనియారిటీ సమస్య కూడా లేదు. అయితే, బేగంకు కొన్నాళ్ల క్రితం డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్(డీడీవో)గా అదనపు బాధ్యతలు కేటాయించారు. డీడీవోగా సిబ్బంది జీతాల ఫైల్ సిద్ధం చేయడం ఆమె చేతిలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తమను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని ఆ సచివాలయ సిబ్బంది రాజమహేంద్రవరం కలెక్టరేట్లోని డీఎల్డీవో, వార్డు, గ్రామ సచివాలయాల ఇన్చార్జి వీణాదేవిని కలిసి తమ గోడును వెళ్లబోసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మే నెల జీతాలు నేటికీ రాలేదని బేగం ఫైల్ సిద్ధం చేయకపోవడమే అందుకు కారణమని డీఎల్డీవో దృష్టికి తీసుకెళ్లారు. బేగం వైఖరి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసిన డీఎల్డీవో సిబ్బంది ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తక్షణ చర్యలకు సిఫారసు చేస్తామని హామీ ఇచ్చారు. -
బాణసంచా పేలుడు కేసులో 10 ఏళ్ల జైలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అనధికారికంగా బాణసంచా నిల్వ ఉంచి ముగ్గురి మృతికి కారణమైన ఘటనలో దేవాడ ముత్యాలరెడ్డికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.31,500 జరిమానా విధిస్తూ సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ అండ్ సెషన్ కోర్టు జడ్జి ప్రకాశ్బాబు మంగళవారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో 6 సంవత్సరాల 6 నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు. లాలాచెరువు, సుబ్బారావుపేటలో దీపావళి సామానులు తయారు చేసేందుకు మందుగుండు సామగ్రి అనధికారికంగా నిల్వ ఉంచారు. 2018 సెప్టెంబర్ 22న నిల్వ ఉంచిన మందుగుండు పేలి ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అప్పటి సీఐ సూర్యభాస్కర్ కేసు నమోదు చేశారు. దీనిపై వాదనలు పూర్తయి, నిజనిర్ధారణ కావడంతో ముత్యాలరెడ్డికి శిక్ష విఽధిస్తూ తీర్పు నిచ్చారు. ప్రమాదపుటంచున ప్రయాణం కాజులూరు: కాలువలకు నీరుకట్టివెయ్యటంతో డెల్టా ప్రాంతంలో మట్టిపనులు జరుగుతున్నాయి. మండల గ్రామాలలోని పొలాల్లో మెరక పనులు నిర్వహించేందుకు దూర ప్రాంతాల నుంచి పొక్లెయిన్, జేసీబీలను ఇలా లారీలపై తరలిస్తున్నారు. ఈ సమయంలో పొక్లెయిన్ డ్రైవర్లు, క్లీనర్లు అదనపు ప్రయాణ ఖర్చులెందుకని ఇలా ప్రమాదపుటంచున ప్రయాణాలు సాగిస్తున్నారు. -
రైల్వే బ్రిడ్జిల పరిరక్షణకు చర్యలు
రాజమహేంద్రవరం సిటీ: గోదావరి నదిపై గల ప్రతిష్టాత్మకమైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జి, ఆర్చ్ బిడ్జిల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ పీఈ ఎడ్విన్ పేర్కొన్నారు. మంగళవారం రాజమహేంద్రవరంలో గల రెండు బ్రిడ్జిలను అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైల్వే వంతెనలపై జరుగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల నాణ్యత, భద్రతా తనిఖీని నిర్వహించామన్నారు. 2027 నాటికి సురక్షితమైన, బలమైన వంతెనలుగా తీర్చిదిద్దడానికి, రూ.115 కోట్ల మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ పై సురక్షితమైన ఫుట్పాత్లు ఏర్పాటు చేశామన్నారు. ఐకానిక్ ఆర్చ్ బ్రిడ్జ్పై రూ.70 కోట్లతో కేబుల్ రీ ప్లేస్మెంట్ వర్క్ పూర్తి చేస్తున్నామన్నారు. భారతీయ రైల్వేలతో అవగాహన ఒప్పందం కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధుల మద్దతును ఆశిస్తున్నామన్నారు. పలువురు రైల్వే అధికారులు పాల్గొన్నారు. -
ఇద్దరు లారీ డ్రైవర్ల దుర్మరణం
తాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు మండలం కాపవరం వద్ద హైవే పై మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు లారీ డ్రైవర్లు మృతి చెందారు. కొవ్వూరు ఎస్సై శ్రీహరిరావు తెలిపిన వివరాల ప్రకారం లారీ డ్రైవర్ బత్తుల శీనయ్య(40) హైదరాబాద్ నుంచి మండపేటకు ధాన్యం లోడుతో వస్తున్నాడు. కాపవరం వద్దకు వచ్చే సరికి కునుకుపాటుకు గురై ముందు వెళుతున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టి అనంతరం రోడ్డు డివైడర్ను ఢీ కొట్టడంతో లారీ ఆగిపోయింది. ఈ లారీని ఇతర వాహనాలకు ఢీకొనకుండా, శీనయ్య కిందకు దిగి డైరెక్షన్ ఇస్తూ దారి చూపుతున్నాడు. ఇంతలో జంగారెడ్డిగూడెం నుంచి ధాన్యం లోడుతో వస్తున్న మరో లారీ.. శీనయ్య లారీని బలంగా ఢీకొట్టడంతో అందులోని డ్రైవర్ కొయ్యే బాబూరావు(40) లారీ క్యాబిన్లో ఇరుకుపోయి మృతి చెందాడు. డైరెక్షన్ ఇస్తున్న బత్తుల శీనయ్య కూడా ఐచర్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. మృతదేహాలను కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై శ్రీహరి తెలిపారు. -
అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలకు జట్టు ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): విజయనగరం జిల్లాలో 4 నుంచి 7 వరకు జరిగే ఏసీఏ నార్త్ జోన్ క్రికెట్ పోటీలలో పాల్గొనే పురుషుల జిల్లా జట్టు ఎంపి కను మంగళవారం నిర్వహించినట్లు తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ సంఘ కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. స్థానిక ఆర్ఎంసీ క్రీడామైదానంలో నిర్వహించిన సెలెక్షన్స్లో 15 మందిని ఎంపిక చేశామన్నారు. ఈ నెల 9 నుంచి 12 వరకు జరిగే ఏసీఏ నార్త్ జోన్ మ హిళల అంతర్ జిల్లా క్రికెట్ పోటీలకు జిల్లా మహిళా క్రికెట్ జట్టు ఎంపికను నిర్వహించామని పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులకు జిల్లా క్రికెట్ సంఘం తరఫున క్రీడాదుస్తులు అందజేశామని తెలిపారు. -
ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్
మునికూడలి ర్యాంపులో ఆగని ఇసుక రవాణా సీతానగరం: జిల్లాలో 28 ఇసుక ర్యాంపులు నిలిపివేస్తున్నట్లు అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ మునికూడలి ర్యాంపు నుంచి ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. మండలంలోని ములకల్లంక రెవెన్యూ భూముల్లో ఇసుక తవ్వకాలు జరిపి కాటవరం ర్యాంప్ నుంచి, పక్కిలంక రెవెన్యూ భూముల్లో ఇసుక తవ్వకాలు జరిపి మునికూడలి ర్యాంపు నుంచి, రఘుదేవపురం, వంగలపూడి ర్యాంపుల నుంచి ఇసుక రవాణా జరుగుతోంది. ర్యాంపులను అక్టోబర్ వరకు నిలిపివేస్తున్నట్లు, ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని సోమవారం కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే పక్కిలంక భూముల్లో ఇసుక తవ్వకాలు జరిపి లారీలపై మునికూడలి ర్యాంపు నుంచి రవాణా చేస్తున్నారు. గోదావరి నదీ గర్భంలో మూడు భారీ పొక్లెయిన్లతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. రాత్రి సమయంలో కూడా ఇసుక రవాణా జరుగుతోందని స్దానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ ఎ.శ్రీనివాస్ను వివరణ కోరగా తక్షణమే ర్యాంపును నిలిపివేస్తామని తెలిపారు. అయితే మంగళవారం రాత్రి కూడా యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు జరిగాయి. -
ఉత్కంఠగా సీనియర్ ఓపెన్ చెస్ పోటీలు
అమలాపురం టౌన్: జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విద్యానిధి విద్యాసంస్థల ప్రాంగణంలో మంగళవారం జరిగిన సీనియర్ ఓపెన్ చెస్ జిల్లా స్థాయి పోటీలు ఉత్కంఠగా జరిగాయి. ఈ జిల్లా స్థాయి పోటీల్లో మొదటి నాలుగు స్థానాలు సాధించిన విజేతలను రాష్ట్ర స్థాయి సీనియర్ ఓపెన్ చెస్ చాంపియన్ షిప్ పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ తాడి వెంకట సురేష్ తెలిపారు. ద్రాక్షారామ సాత్విక్ (ప్రథమ), తాడి వెంకటేష్ (ద్వితీయ), బండారు నానిబాబు (తృతీయ), పి.ధరణి (4వ స్థానం) సాధించారని చెప్పారు. ఈ నలుగురు విజేతలు ఈనెల 6వ తేదీన విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి సీనియర్ ఓపెన్ చెస్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంటారని వెంకట సురేష్ తెలిపారు. విజేతలకు విద్యానిధి స్కూల్ ప్రిన్సిపాల్ మాధవి బహుమతులు అందజేశారు. -
నాణ్యమైన విద్యకు నవోదయం
రాయవరం: జవహర్ నవోదయ విద్యాసమితిలో 6వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యనందించేందుకు 1986లో జవహర్ నవోదయ విద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 661 నవోదయ విద్యాలయాలు ఉండగా..కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఉంది. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని విద్యార్థులు ఇక్కడ దరఖాస్తుకు అర్హులు. 2026–27 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఉచిత విద్యను ఇక్కడ అందిస్తారు. విద్యతో పాటు అధునాతన సౌకర్యాల కల్పన, ప్రయోగాత్మక విద్య, క్రీడలు, క్రమశిక్షణ, ప్రతిభకు పెద్దపీట వేయడం ఈ విద్యా సంస్థల ప్రత్యేకత. పరీక్షకు ఎవరు అర్హులు, పరీక్షా విధానం, రిజర్వేషన్ తదితర వివరాలతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఒక్కసారే అవకాశం ఈ ఏడాది డిసెంబర్ 13న నిర్వహించే ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి విద్యాలయలో ప్రవేశం లభిస్తుంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయాల్లో మొత్తం 80 సీట్లు ఉంటాయి. ఆరవ తరగతిలో ప్రవేశానికి ప్రస్తుతం ఆయా మండలాల్లో ఐదో తరగతి చదువుతున్న బాలబాలికలు అర్హులు. ఈ ప్రవేశ పరీక్షకు ఒక్కసారి మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. 2026–27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ పొందగోరే బాలబాలికలు 2014 మే ఒకటో తేదీ నుంచి 2016 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి. ప్రభుత్వం గుర్తించిన పాఠశాలల్లో 3,4 తరగతులు ఉత్తీర్ణత సాధించి ఐదో తరగతి చదువుతున్న వారు మాత్రమే అర్హులు. రిజర్వేషన్ విధానం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం తగ్గకుండా సీట్లు కేటాయిస్తారు. షెడ్యూల్ కులాలకు 15 శాతం, షెడ్యూల్ తరగతులకు ఏడు శాతం, దివ్యాంగులకు మూడు శాతం రిజర్వేషన్ కల్పిస్తారు. ప్రవేశాల్లో బాలికలకు 33 శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తారు. వసతులు బాలబాలికలకు వసతి గృహాలు, భోజనం, విద్య, నోట్బుక్స్, స్కూల్ యూనిఫామ్, షూస్, టాయిలెట్ సామగ్రి ఉచితం. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు నవోదయ విద్యాలయాల్లో బోధన చేస్తారు. శాస్త్ర, సాంకేతికతతో కూడిన విద్య, క్రీడలు, యోగా ద్వారా విద్యార్థికి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కల్పిస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు నామమాత్రపు రుసుం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, బాలికలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తును పూర్తి చేసిన తర్వాత దరఖాస్తు ఫారాన్ని ప్రింట్ తీసుకుని దగ్గర ఉంచుకోవాలి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. జూలై 29వ తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తులు అందజేయాల్సి ఉంది. దరఖాస్తుకు రుసుం చెల్లించనవసరం లేదు. 2026–27 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల జూలై 29 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు ఈ ఏడాది డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష గతేడాది జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులు ఇలా.. జిల్లా వచ్చిన దరఖాస్తులు కోనసీమ 3,869 తూర్పుగోదావరి 1,741 కాకినాడ 3,361పరీక్షా విధానమిదీ.. నవోదయ ప్రవేశ పరీక్షను 2025 డిసెంబరు 13న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్థులు భాషను(తెలుగు/ఇంగ్లీషు) ఎంచుకొని పరీక్ష రాసే వీలుంది. ప్రవేశ పరీక్షలో 80 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు పరీక్ష నిర్వహియిస్తారు. మూడు విభాగాల్లో ప్రశ్నలు కేటాయిస్తారు. మేధాశక్తిపై 40 ప్రశ్నలు 50 మార్కులకు, గణితం(అర్ధమెటిక్), ఎంచుకున్న భాషపై ఒక్కొక్క విభాగానికి 20 ప్రశ్నలు వంతున 40 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. తప్పుడు సమాధానాలకు నెగిటివ్ మార్కులు ఉండవు. దివ్యాంగులకు 40 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయిస్తారు. పరీక్షలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్వహిస్తుంది. ఎంపికై న వారికి మొదటి రెండు సంవత్సరాలు తెలుగు/ఇంగ్లిషు భాషల్లో బోధిస్తారు. అనంతరం ఇంగ్లిషులోనే బోధన చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు హెచ్టీటీపీఎస్://నవోదయ.జీవోవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు అవగాహన కల్పించాలి అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యేలా విద్యాశాఖ అధికారులు అవగాహన కల్పించాలి. గతేడాదికి మించి దరఖాస్తులు వచ్చేలా ఎంఈవోలు పర్యవేక్షణ చేయాలి – బి.సీతాలక్ష్మి, ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ విద్యాలయ, పెద్దాపురం -
ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయండి
వడిశలేరు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ రంగంపేట: వడిశలేరు గ్రామం వద్ద ఐదుగురు బలైన రోడ్డు ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మంగళవారం పరిశీలించారు. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులపై క్షేత్ర స్థాయి అధికారులతో చర్చించారు. ఈ దుర్ఘటనపై సమగ్ర నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, అక్కడ వేగ నియంత్రణ, ప్రమాద హెచ్చరికల సూచికలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రమాద సమయంలో అందుబాటులో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలు సేకరించి, విశ్లేషణ చేయాలని అన్నారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడటానికి సమన్వయ శాఖల అధికారులతో కలసి క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆర్.కృష్ణనాయక్, జిల్లా ఆర్అండ్బీ అధికారి ఎస్బీవీ రెడ్డి, డీఎస్పీ భవ్య కిషోర్, జిల్లా రవాణా అధికారి ఆర్.సురేష్, ఆర్డీసీ ఈఈ రవీంద్ర పాల్గొన్నారు. నిత్యావసర సరకులు అందించిన కలెక్టర్ రాజానగరం: మండలంలోని లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ, దివాన్ చెరువు గ్రామాల్లో వృద్ధులు, దివ్యాంగులకు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి మంగళవారం నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ప్రతి నెలా 1 నుంచి 5 వరకూ ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు నిత్యావసర సరకులు అందజేస్తామని చెప్పారు. జిల్లాలోని 871 రేషన్ దుకాణాల పరిధిలో 5,64,994 మంది కార్డుదారులు ఉన్నారని, వీరిలో వృద్ధులు, దివ్యాంగులు 65,863 మంది ఉన్నారని తెలిపారు. వీరికి ఇళ్ల వద్దనే సరకులు అందిస్తామని చెప్పారు. మూడు రోజులుగా జిల్లాలో 17,286 కిలోల బియ్యం, 16,483 కిలోల పంచదార, 1,512 కిలోల కందిపప్పు సరఫరా చేశారని కలెక్టర్ తెలిపారు. మత్స్యకారులతో యోగా సాధన సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపాన గ్రాండ్ ట్రంక్ రోడ్డుపై మత్స్యకారులతో మంగళవారం యోగా సాధన కార్యక్రమం నిర్వహించారు. మత్స్యశాఖ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ కార్యక్రమంలో మత్స్యకారులు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావడం అభినందనీయమని అన్నారు. ఈ నెల 20వ తేదీ వరకూ వివిధ శాఖల ఆధ్వర్యాన ఈ కార్యక్రమం కొనసాగుతుందని, 21న అన్ని రంగాలనూ కలుపుకొని మెగా యోగా సాధన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. యోగా గురువు కేఎన్వీ శ్రీధర్రెడ్డి నేతృత్వంలో ఎన్.అనంతలక్ష్మి యోగా సాధన చేయించారు. అనంతరం బ్రహ్మకుమారి మౌనిక రాజయోగ ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో సుమారు 800 మంది మత్స్యకారులు, ఆక్వా రైతులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సిద్ధేశ్వరి పీఠం ఉత్తరాధికారిగా సూర్య అరవింద్ తుని: తమిళనాడులోని కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీ ఠం ఉత్తరాధికారిగా తునికి చెందిన డాక్టర్ కాదంబరి సూర్య అరవింద్ నియమితులయ్యారు. ఆయన సో దరుడు కాదంబరి రామకృష్ణ ఈ విషయం తెలిపారు. అరవింద్ చిన్నప్పటి నుంచీ ఆధ్యాత్మిక చింతన, భక్తి భావనతో ఉండేవాడని, ఎంబీబీఎస్ చదివి, శ్రీ సిద్ధేశ్వరి పీఠంలో చేరారని చెప్పారు. భక్తిశ్రద్ధలతో సేవలందించిన అరవింద్కు పీఠాధిపతి, జగద్గురువు సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి.. దత్తేశ్వరానంద భారతి స్వామిగా సన్యాస నామం ఇచ్చి, ఉత్తరాధికారిగా నియమించా రని వివరించారు. ఈ నెల 6న కుర్తాళంలో ఆయన పట్టాభిషేకం జరుగుతుందని తెలిపారు. -
ఈసారి ప్రజలకే వెన్నుపోటు పొడిచారు
రాజమహేంద్రవరం రూరల్: మొదట పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కు, తరువాత సహచర పార్టీలకు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు వెన్నుపోటు పొడిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఏకంగా ప్రజలకే వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. దీనిని నిరసిస్తూ బుధవారం వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించి, అధికారులకు ప్రజల వాణి వినిపిస్తామని చెప్పారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వందలకొద్దీ హామీలు ఇచ్చి, ఒక్కటి కూడా నెరవేర్చలేదని, నైతికత లేని పాలన సాగిస్తోందని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం చేయలేని ప్రతి పనినీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. అబద్ధాలు చెప్పారు కాబట్టి చంద్రబాబు అభద్రతా భావంలో ఉన్నారని, నిజాలు చెప్పారు కాబట్టి జగన్ నిబద్ధతతో పని చేశారని అన్నారు. వైఎస్ జగన్ అప్పులు చేశారంటూ ఎన్నికలకు ముందు బాబు తప్పుడు ప్రచారం చేశారని, దానిని నమ్మిన ప్రజలు అధికారం ఇస్తే ఇప్పుడు ఏకంగా వారికే వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. మోసపోయిన ప్రజల వాణిని వినిపించేందుకు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని, కూటమి ప్రభుత్వం చేతిలో మోసపోయిన రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, ఇతర వర్గాలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వేణు పిలుపునిచ్చారు. శాంతిభద్రతల్లో ఫెయిల్ వైఎస్సార్ సీపీ ప్రచార విభాగం రాష్ట్ర చైర్మన్ కాకుమాను రాజశేఖర్ మాట్లాడుతూ, శాంతిభద్రతల నిర్వహణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. తెనాలిలో దళిత, మైనారిటీ యువకులను పోలీసులు రోడ్డుపై దారుణంగా హింసించిన ఘటనను హోం మంత్రి అనిత ఖండించకపోవడం దారుణమన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ కూటమి ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ప్రజలకు అండగా ఉండేందుకే.. ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ, ప్రజలకు అండగా ఉండేందుకే వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహిస్తున్నామని పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ పరిశీలకుడు తిప్పల గురుమూర్తిరెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసిన అన్యాయాలను, అక్రమాలను వైఎస్సార్ సీపీ ప్రశ్నిస్తుందన్నారు. జిల్లాలో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు ఇప్పటికే పిలుపునిచ్చామన్నారు. నియోజకవర్గాల వారీగా పరిశీలకులు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పరిశీలకులను నియమించారు. రాజమహేంద్రవరం సిటీకి తిప్పల గురుమూర్తిరెడ్డి, గోపాలపురానికి కాకుమాను రాజశేఖర్, అనపర్తికి మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, నిడదవోలుకు పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, కొవ్వూరుకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, రాజమండ్రి రూరల్కు పార్టీ యువజన విభాగం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, రాజానగరం నియోజకవర్గానికి మేడా గురుదత్ ప్రసాద్లను పరిశీలకులుగా నియమించినట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు తెలిపారు. విలేకర్ల సమావేశంలో రౌతు సూర్యప్రకాశరావు, డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మేడపాటి షర్మిలారెడ్డి, జక్కంపూడి గణేష్, ప్రముఖ న్యాయవాది గొందేశి శ్రీనివాసులురెడ్డి, పార్టీ నగర మాజీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి తాడాల విష్ణు చక్రవర్తి, జిల్లా అధికార ప్రతినిధి పెయ్యల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఫ చంద్రబాబు మోసానికి నిరసనగా నేడు వెన్నుపోటు దినం ఫ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు -
జేఈఈలో ప్రవీణ్కుమార్కు 328వ ర్యాంకు
మామిడికుదురు: ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో పాశర్లపూడిలంకకు చెందిన కోలా ప్రవీణ్కుమార్ సత్తా చాటాడు. ఇతను జాతీయ స్థాయిలో 328వ ర్యాంకు సాధించాడు. విజయవాడ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ప్రవీణ్కుమార్కు ముంబయి సీఎస్ఈలో సీటు వచ్చింది. తండ్రి గోపాలకృష్ణ రైతు, తల్లి జ్యోతి గృహిణి. పేరెంట్స్ ఎంతో కష్టపడి కొడుకును చదివించారు. ప్రతి రోజు 14 గంటలు చదవడం వల్ల మంచి ర్యాంకు వచ్చిందని ప్రవీణ్కుమార్ మంగళవారం తెలిపాడు. సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలన్నదే తన లక్ష్యమని తెలిపాడు. అతడిని స్థానికులు అభినందించారు. మద్యం తాగి బైక్ నడిపిన వారికి జైలు కాకినాడ లీగల్: మద్యం తాగి బైక్ నడిపిన కేసుల్లో ఒకరికి ఐదురోజులు, తొమ్మిది మందికి రెండు రోజుల చొప్పున జైలు, 17 మందికి రూ.10 వేల చొప్పున జరిమానా విఽధిస్తూ కాకినాడ మూడో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ డి.శ్రీదేవి తీర్పు చెప్పారు. కాకినాడ ట్రాఫిక్–1, 2 పోలీసు స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. మంగళవారం కోర్టులో 27 మందిని హాజరుపర్చగా వారికి పై విధంగా జైలు, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పోలీసుల అదుపులో కారు యజమాని అమలాపురం టౌన్: స్థానిక ఏఎస్ఏ ఆస్పత్రి వద్ద 216 జాతీయ రహదారిపై ఓ మోటారు సైకిలిస్ట్ను ఢీకొట్టి తీవ్రంగా గాయపరచడమే కాకుండా అక్కడ నుంచి కారుతో సహా పరారైన వ్యక్తిని పట్టణ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఆ కారు యజమాని దీపక్ను అదుపులోకి తీసుకుని రోడ్డు ప్రమాదంలో ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ ఎస్సై ఎన్ఆర్ కిషోర్బాబు తెలిపారు. స్థానిక పితానివానిపాలేనికి చెందిన దీపక్ స్థానికంగా రోల్స్ ఆన్ రోడ్డు పేరుతో హోటల్ నిర్వహిస్తున్నాడని ఎస్సై పేర్కొన్నారు. పట్టణ సీఐ పి.వీరబాబు పర్యవేక్షణలో కేసును విచారిస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి అమలాపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
ఘనంగా జన్మనక్షత్ర పూజలు
అన్నవరం: సత్యదేవుని జన్మనక్షత్రం మఖను పురస్కరించుకుని స్వామి, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున 2 గంటలకు ఆలయం తెరచి స్వామి, అమ్మవార్లకు అర్చకులు సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యదేవుడు, అమ్మవార్ల మూలవిరాట్లకు, శివలింగానికి పంచామృతాలతో మహన్యాస పూర్వక అభిషేకం నిర్వహించారు. అనంతరం సుగంధభరిత పుష్పాలతో స్వామి, అమ్మవార్లను అలంకరించి పూజించారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. యాగశాలలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ సత్యదేవుడు, అమ్మవార్లకు ఆయుష్య హోమం నిర్వహించారు. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుడు, అమ్మవారు, శంకరులను ముత్యాల కవచాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. -
పోరాట పటిమ కార్యకర్తల సొంతం
● వారి కోసమే పార్టీ బాధ్యతలు తీసుకున్నా ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ● వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ మలికిపురం: ప్రజా సమస్యలపై ఎటువంటి పోరాటానికై నా జెండా పట్టుకుని ముందుండేది ఒక్క వైఎస్సార్ సీపీ కార్యకర్తలు మాత్రమేనని, అటువంటి పోరాట పటిమ తమ కార్యకర్తలకే సొంతమని పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. వైఎస్సార్ సీపీ చేపట్టనున్న వెన్నుపోటు దినం కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ మలికిపురంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో జగ్గిరెడ్డి మాట్లాడుతూ, నాడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ సీపీ అనే విత్తనం వేస్తే, దానిని మానుగా మార్చింది కార్యకర్తలేనని స్పష్టం చేశారు. ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొనైనా పార్టీని సగర్వంగా నిలిపిన కార్యకర్తలను ఎల్లప్పుడూ కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. తమ పార్టీ స్థాపించిన సమయంలో అన్ని రాజకీయ పార్టీలు తమకు తీవ్ర వ్యతిరేకంగానే ఉన్నాయని గుర్తు చేశారు. కార్యకర్తల కోసమే తాను పార్టీ జిల్లా బాధ్యతలు స్వీకరించానన్నారు. రాష్ట్రంలో కూటమి అరాచక పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వరకూ శత్రువులకు కూడా ప్రభుత్వ పథకాలను అందించిన ఘనత తమదని, దానికి విరుద్ధంగా కూటమి పాలన సాగుతోందన్నారు. వైఎస్సార్ సీపీ వాళ్లకు పథకాలు ఇవ్వొద్దని నేరుగా కూటమి పెద్దలే చెప్పడం దారుణమన్నారు. రాష్ట్రంలో పనిచేసి ఓడిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది తమ అధినేత మాత్రమేనని జగ్గిరెడ్డి అన్నారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, జెడ్పీటీసీ సభ్యులు బల్ల ప్రసన్నకుమారి, కుసుమ వనజకుమారి తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక డ్రెడ్జింగ్ పడవలు సీజ్
తాళ్లపూడి (కొవ్వూరు): ఇసుక ర్యాంపుల్లో ఇసుక డ్రెడ్జింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత హెచ్చరించారు. కొవ్వూరు గామన్ బ్రిడ్జి సమీపాన దండగొండ ర్యాంపులో రెండు ఇసుక డ్రెడ్జింగ్ పడవలను సోమవారం అధికారులు సీజ్ చేశారు. గోదావరి నదీగర్భంలో పడవలతో డ్రెడ్జింగ్ చేస్తూ యథేచ్ఛగా ఇసుక తవ్వుకుపోతూండటంపై ‘కొల్లగొట్టేస్తున్నారు..’ శీర్షికన గత నెల 31న ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. రెవెన్యూ, పోలీస్, మైనింగ్, ఇరిగేషన్, టాస్క్ఫోర్స్ అధికారులు ర్యాంపులో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. డ్రెడ్జింగ్కు ఉపయోగిస్తున్న రెండు బోట్లను పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ర్యాంపులో ఉన్నవారిని ఆర్డీఓ రాణి సుస్మిత వివరాలడిగి తెలుసుకున్నారు. అయితే, ఈ పడవలు గురించి తమకు తెలియదని అక్కడి వారు చెప్పడం గమనార్హం. దండగొండ ర్యాంపులో అధికారుల దాడి నేపథ్యంలో మిగిలిన ర్యాంపుల్లో కూడా డ్రెడ్జింగ్ నిలిపివేయడం గమనార్హం. పీజీఆర్ఎస్కు 279 అర్జీలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 279 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ పి.ప్రశాంతి, డీఆర్ఓ సీతారామమూర్తి తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పీజీఆర్ఎస్తో పాటు మీసేవా పోర్టల్, 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వచ్చే అర్జీలను అంతే ప్రాధాన్యంతో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. వచ్చిన అర్జీల్లో రెవెన్యూ 202, పోలీసు 14, ఇతర శాఖలవి 28 ఉన్నాయన్నారు. మిగిలినవి ఇతర సమస్యలపై వచ్చాయన్నారు. పోలీస్ పీజీఆర్ఎస్కు 25 అర్జీలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం(పీజీఆర్ఎస్)కు 25 అర్జీలు వచ్చాయి. అడిషనల్ ఎస్పీలు ఎంబీఎం మురళీకృష్ణ, ఏవీ సుబ్బరాజులు అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి, ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని అదేశించారు. ఈగల్ టోల్ఫ్రీ నంబర్ 1972పై విస్తృత ప్రచారం కాకినాడ సిటీ: మత్తు పదార్థాల నివారణ, సహాయానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ ఈగల్ (ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఫోర్స్మెంట్)కు సంబంధించిన పోస్టర్ను కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్మీనా, డీఆర్వో వెంకటరావు, జెడ్పీ సీఈవో లక్ష్మణరావు, హౌసింగ్ పీడీ ఎన్వీవీ సత్యనారాయణ తదితరులు కలెక్టరేట్లో సోమవారం ఆవిష్కరించారు. -
నడిరోడ్డుపై పోలీసుల థర్డ్ డిగ్రీ
● రెడ్ బుక్ రాజ్యాంగానికిదే నిదర్శనం ● మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): తెనాలిలో నడిరోడ్డుపై యువకులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడమే ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శనమని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ అన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు జూన్ 4న నిర్వహించనున్న వెన్నుపోటు దినం పోస్టర్ను రాజమహేంద్రవరం వీఎల్ పురంలోని మార్గాని ఎస్టేట్స్ వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఇది రెడ్ బుక్కా,.. బ్లడ్ బుక్కా అని జాతీయ మీడియాలో ఏపీ గురించి అడుగుతున్నారని అన్నారు. నేరం చేసిన వారిని శిక్షించడానికి న్యాయస్థానాలుండగా, పోలీసులే ఇలా వ్యవహరిస్తే ఇక ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా అని నిలదీశారు. తెనాలిలో యువకులను పోలీసులు విచక్షణారహితంగా లాఠీలతో కొట్టిన ఘటన మరువక ముందే అదే పట్టణంలో ఒక గోల్డ్ స్మిత్ కూడా వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు దారుణంగా ఉన్నాయన్నారు. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడమేమిటని, అలాగైతే ఇక కోర్టులెందుకని భరత్రామ్ ప్రశ్నించారు. నిజంగా తప్పు చేస్తే కోర్టులో నిరూపించి, అవసరమైతే ఉరి శిక్ష వేయవచ్చని, అంతే కానీ, ఇలా రోడ్డు మీద చిత్రవధ చేయడమేమిటని నిలదీశారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి.. ఇవ్వక ఇవ్వక ఇన్నాళ్లకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని, ఐదు లక్షల మంది పరీక్షలు రాయబోతున్నారని, వారు కనీసం 90 రోజుల సమయం అడిగితే, 40 రోజుల్లోనే పరీక్ష పెట్టేస్తే ఎలాగని భరత్రామ్ ప్రశ్నించారు. మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఆశావహులు ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారని, సమయం ఇవ్వకపోతే వారు పరీక్షలు ఎలా రాస్తారని ప్రశ్నించారు. డీఎస్సీ అభ్యర్థులకు మూడు నెలల సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు అంటూ ఊదరగొట్టారని, అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా అమలు చేయకపోవడంతో ఏ వర్గం ప్రజలూ సంతోషంగా లేరని అన్నారు. ప్రజలను నమ్మించి, వంచించి అధికారం పీఠం ఎక్కారని విమర్శించారు. అందుకే జూన్ 4న వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమం నిర్వహించనున్నామని ఆయన చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఈ ఆందోళనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. -
సత్తా చాటిన అన్నదమ్ములు
కె.గంగవరం: ప్రముఖ ఐఐటీల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాల్లో కె.గంగవరానికి చెందిన కొడవటి ప్రసాద్చౌదరి (విశ్రాంత ఉపాధ్యాయుడు) మనవడు సువర్ణ రామ్ప్రత్యూష్కు అత్యుత్తమమైన ఆలిండియా 510 ర్యాంక్ సాధించినట్టు కుటుంబ సభ్యులు సోమవారం విలేకరులకు తెలిపారు. గతేడాది నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాల్లో అతని అన్నయ్య కొడవటి సాయిప్రణీత్ ఆలిండియా 565 ర్యాంక్ సాధించడం గమనార్హం. తమ ఇద్దరు కుమారులు ప్రఖ్యాత ఐఐటీ కాలేజీల్లో సీట్లు సాధించడంపై తండ్రి కొడవటి సురేష్ (డీఈ, ఏపీ ట్రాన్స్కో), తల్లి వసుధ (సాఫ్ట్వేర్ ఇంజినీర్)తో పాటు, తాతయ్య కొడవటి ప్రసాద్చౌదరి, సుశీల, ఇతర కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యూష్ మీడియాతో మాట్లాడుతూ, ప్రతి వారం పరీక్ష రాసి, పొరపాట్లు సరిదిద్దుకోవటం, సందేహాల నివృత్తి, సమయ పాలన, రోజుకు 14 గంటలు శ్రమించడం వంటివి తన విజయానికి ప్రధాన కారణాలుగా తెలిపారు. -
రైతు బిడ్డకు 1911 ర్యాంకు
ఆలమూరు: మండలంలోని చెముడులంకకు చెందిన రైతు బిడ్డ నాగిరెడ్డి తేజ చంద్రనారాయణ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాల్లో ఆలిండియా 1911 ర్యాంకు సాధించాడు. రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివిన అతడు ఇంటి వద్దే స్వీయ శిక్షణ పొందాడు. దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివి, అత్యున్నత ఉద్యోగం సాధించేందుకు కృషి చేస్తానని అతను తెలిపాడు. ఇదే కుటుంబంలో తేజ చంద్రనారాయణ సోదరి శ్రావణి 2022లో జేఈఈ అడ్వాన్స్డ్లో 1800వ ర్యాంకును సాధించి, ప్రస్తుతం మద్రాసు ఐఐటీలో తృతీయ సంవత్సరం చదువుతోంది. సరస్వతీ కటాక్షం కలిగిన విద్యార్థుల తల్లిదండ్రులు శ్రీనివాసు, నాగ అరుణ దంపతులు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. -
చిరంజీవిని కుమారి మృతికి ప్రముఖుల సంతాపం
వైద్య కళాశాలకు భౌతికదేహం అందజేత బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రముఖ విద్యావేత్త డాక్టర్ పి.చిరంజీవిని కుమారి భౌతికదేహాన్ని సోమవారం పలువురు ప్రముఖులు సందర్శించారు. అభిమానులు, పూర్వ విద్యార్థులు. ప్రజాప్రతినిధుల సందర్శనార్థం ఆమె భౌతికకాయాన్ని ప్రతాప్నగర్లోని ఆమె స్వగృహం నుంచి ఇంద్రపాలెం లాకుల వద్దనున్న ఐడియల్ కళాశాలకు ఉదయం 11 గంటలకు తీసుకువచ్చారు. పలువురు ప్రజాప్రతినిధులు ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం వైద్య విద్యార్థుల పరిశోధన కోసం ఆమె భౌతికకాయాన్ని రంగరాయ వైద్య కళాశాలకు ఊరేగింపుగా తీసుకెళ్లి అందజేవారు. ఆమెకు సంతాపం తెలిపిన వారిలో మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎంపీ వంగా గీత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పంతం నానాజీ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, మాజీ ఎంపీ మిడియం బాబూరావు, మాజీ వీసీలు డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, కె.పద్మరాజు, మురళీకృష్ణ, ప్రగతి విద్యా సంస్థల చైర్మన్ పి.కృష్ణారావు, మాజీ రిజిస్ట్రార్ వి.రవీంద్ర, కుడా మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, సీపోర్టు సీఈఓ మురళీధర్, జెడ్పీ చైర్మన్ దున్నా జనార్దనరావు, పూర్వ విద్యార్థులు, సాహిత్యాభిమానులు ఉన్నారు. -
కడతేరి.. కన్నీరు మిగిల్చి..
● కోనేటిలో మునిగి కొడుకు, మనవడు మృతి ● తల్లడిల్లిన వృద్ధ దంపతుల కన్నపేగు ● తండ్రీకొడుకుల మృతితో బొర్రంపాలెంలో విషాదం గండేపల్లి: వృద్ధాప్యంలో తోడుగా ఉంటాడనుకున్న కొడుకు, మనవడు మృత్యువాత పడడం ఆ ముసలి దంపతులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. కన్న కొడుకు, మనవడు ఒకేసారి దూరమవడంతో ఆ కన్నపేగు తల్లడిల్లింది. ఒకే కుటుంబంలో ఇద్దరు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బొర్రంపాలేనికి చెందిన సాగి శ్రీరామమూర్తి (బూరయ్య), నాగరత్నం దంపతులకు కొడుకు నల్లబాబు(46), కుమార్తెలు సీతఆదిలక్ష్మి, సుగుణ ఉన్నారు. వీరికి వివాహాలు కాగా, నల్లబాబు వ్యాపారం కోసం భార్య నాగతులసి, కుమారుడు సంజయ్ శ్రీరామ్(19), కుమార్తె సరస్వతితో హైదరాబాద్లో ఉంటున్నాడు. సరస్వతి ఈ ఏడాది టెన్త్ పరీక్షలు రాసింది. ఇటీవల కాలంలో నల్లబాబు ఒంటరిగా సొంతూరు వచ్చి తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ, వ్యవసాయం చేస్తున్నాడు. సంజయ్ శ్రీరామ్ చదువు కోసం విశాఖపట్నంలో ఉంటున్నాడు. ఇటీవల అతడు ఇంటికి వచ్చాడు. కాగా సోమవారం వలసపాకల గ్రామానికి పరామర్శకు వెళ్లిన నల్లబాబు, సంజయ్ శ్రీరామ్ మైలు శుద్ధి స్నానానికి సాయంత్రం తాళ్లూరు వచ్చారు. కోనేరులో దిగిన సంజయ్ శ్రీరామ్ మునిగిపోతుండగా నల్లబాబు రక్షించేందుకు యత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీట మునిగి మృతి చెందారు. ఆ సమయంలో ఎవరూ గుర్తించకపోవడంతో కాపాడేందుకు వీల్లేకుండా పోయిందని స్థానికులు అంటున్నారు. తల్లి వద్దకు వెళ్లాల్సి ఉండగా.. హైదరాబాద్లో ఇంటర్ పూర్తి చేసిన సంజయ్ శ్రీరామ్ విశాఖపట్నంలో హాస్టల్లో ఉంటూ, రఘు ఇంజినీరింగ్ కాలేజ్లో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. సోమవారం రాత్రి హైదరాబాద్లో ఉన్న తల్లి, చెల్లి వద్దకు వెళ్లాల్సి ఉందని, ఇంతలోనే ఇలా జరిగిపోయిందని బంధువులు, స్నేహితులు వాపోయారు. మృదుస్వభావి, సౌమ్యుడు, అందరితో కలిసిమెలిసి ఉండే నల్లబాబు ఇలా దూరం కావడం బాధాకరంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చదువు, ఇల్లు తప్ప వేరే ధ్యాస లేని సంజయ్ చిన్న వయస్సులోనే దూరమయ్యాడని స్నేహితులు వాపోయారు. బొర్రంపాలెం గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో కోనేరు నుంచి మృతదేహాలను వెలికితీశారు. సంఘటనా స్థలాన్ని సీఐ వైఆర్కే శ్రీనివాస్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కడసారి చూపు కోసం.. కొడుకు, మనవడు ఒకేసారి శాశ్వతంగా దూరమవ్వడంతో కదల్లేని స్థితిలో ఉన్న శ్రీరామమూర్తి, నాగరత్నం వద్దకు అంబులెన్స్లో మృతదేహాలను బొర్రంపాలెం తీసుకువెళ్లారు. కొడుకు, మనవడిని చూసి ఆ వృద్ధ దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సంఘటన గ్రామస్తులను కంటతడి పెట్టించింది. తమ్ముడూ.. అప్పుడే నీకు నూరేళ్లూ నిండాయా.. నన్ను అక్క అని ఎవరు పిలుస్తారురా.. నన్ను అత్తా అని ఎవరు పిలుస్తారురా...అంటూ మృతదేహాలను పట్టుకుని సుగుణ విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. -
తిరుమల విద్యార్థుల ప్రభంజనం
రాజమహేంద్రవరం రూరల్: ప్రతిష్టాత్మక జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో రాజమహేంద్రవరంలోని తిరుమల ఐఐటీ అండ్ మెడికల్ అకాడమీ విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించినట్టు విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. వివిధ కేటగిరీల్లో జాతీయ స్థాయిలో తమ విద్యార్థులు కె.ప్రణీత్ రెండో ర్యాంకు, కె.యశ్వంత్ సాత్విక్ ఎనిమిది, ఇ.వర్షిత్ 12, ఎం.సుమంత్దొర 38, కె.అభినవ్ 42, జి.సుజోష్రాజ 43, జి.అఖిల్సాయి 45, తుమాటిపూజిత అఖిల్రాజ్కుమార్ 85, కప్పల వెంకటరామవినీష్ 127, పాతపాటి వెంకటవివేక్వర్మ 132, మువ్వల లిఖిత 137 ర్యాంకులు సాధించారని వివరించారు. ఇంకా 165, 174, 193, 195, 231, 238, 246, 270, 275, 276 ర్యాంకులు సాధించారన్నారు. వెయ్యిలోపు 69, మూడు వేలలోపు 201, ఐదు వేలలోపు 333, పది వేలలోపు 456 మంది ర్యాంకులు సాధించారని చెప్పారు. 260 మంది పైన విద్యార్థులు ఐఐటీలో సీట్లు సాధించగలరని తెలిపారు. ర్యాంకర్లను తిరుమలరావు, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు. -
పారిశుధ్య కార్మికులకు వేతనాలు జమ
● దేవస్థానం అధికారుల ఒత్తిడితో కాంట్రాక్టర్ చెల్లింపు ● ఊపిరి పీల్చుకున్న 349 మంది సిబ్బంది అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో 349 మంది పారిశుధ్య సిబ్బందికి ఏప్రిల్ నెల వేతనాలు ఎట్టకేలకు చెల్లించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు సిబ్బంది ఖాతాలకు సొమ్ము జమ అయింది. మే నెల గడిచినా ఏప్రిల్ వేతనాలను పారిశుధ్య సిబ్బందికి చెల్లించకపోవడంపై శ్రీవీరి కష్టం తుడిచే వారేరిశ్రీ శీర్షికన మే 26న వార్త ప్రచురితమైన విషయం విదితమే. దీంతో స్పందించిన దేవస్థానం అధికారులు మే 28న సంబంధిత కనకదుర్గా ఏజెన్సీస్ కాంట్రాక్టర్కు జీతాలు చెల్లించేందుకు రూ.58 లక్షలు చెల్లించారు. మరో రూ.లక్ష తనకు రావాల్సి ఉందని, అది వస్తే కానీ తాను జీతాలు చెల్లించనంటూ కాంట్రాక్టర్ భీష్మించడంతో.. కార్మికుల వేతనాలు మరింత ఆలస్యమయ్యాయి. దీనిపై ఇలాగైతే మేమెలా బతకాలి శీర్షికన సోమవారం సాక్షిలో కథనం ప్రచురితమైంది. అధికారుల ఒత్తిడి పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంపై దేవస్థానం అధికారులు కాంట్రాక్టర్పై ఒత్తిడి తెచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆదివారమే కార్మికుల అకౌంట్లకు వేతనాలు జమ కావాలని కాంట్రాక్టర్కు స్పష్టం చేయడంతో.. గత్యంతరం లేక ఆదివారం రాత్రి 11 నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు సిబ్బంది అకౌంట్లలో నగదు జమ అయింది. వరుసగా రెండు నెలల జీతాలు ఆలస్యం కావడంపై దేవస్థానం అధికారుల నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తోంది. మే నెల జీతాలైనా జూన్ పది కల్లా చెల్లించేలా చూడాలని పారిశుధ్య కార్మికులు కోరుతున్నారు. నలుగురికి అందని వేతనాలు కాగా, దేవస్థానంలో నలుగురు పారిశుధ్య కార్మికులకు మార్చి వేతనాలు ఇంకా చెల్లించలేదు. గత నెలలో అందరికీ మార్చి వేతనాలు చెల్లించగా, వీరికి అందలేదు. సాంకేతిక కారణాలతో జమ కాలేదని, వచ్చే నెల చెల్లిస్తామని చెప్పినట్లు వారు తెలిపారు. వీరికి మార్చి బకాయి చెల్లంచకుండా, ఏప్రిల్ వేతనాలు మాత్రమే చెల్లించారు. -
జేఈఈ అడ్వాన్స్డ్లో శ్రీషిర్డీసాయి విజయభేరి
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ప్రతిష్టాత్మకమైన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో శ్రీషిర్డీసాయి జూనియర్ కళాశాల విద్యార్థులు వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించారని విద్యాసంస్థల డైరెక్టర్ టి.శ్రీవిద్య సోమవారం తెలిపారు. తమ లక్ష్యా ఐఐటీ అకాడమీకి చెందిన ఐ.శ్రీసాయి హిమ్నీష్ జాతీయ స్థాయి 18వ ర్యాంకు సాధించగా, సీహెచ్ మోక్షిత్ 594, మోహన్ శ్రీరామ్జీ 685, మోహిత్ సత్యరాజ్ కిరణ్ 695 ర్యాంకులను కై వసం చేసుకున్నారన్నారు. మొత్తం నలుగురు విద్యార్థులు వెయ్యి లోపు ర్యాంకులు సాధించారన్నారు. 12 మంది మూడు వేల లోపు, 25 మంది ఐదువేల లోపు, 32 మంది పదివేలలోపు ర్యాంకులు సాధించారన్నారు. విద్యా సంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి ఏటా తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులతో ప్రముఖ ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. విజేతలైన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని చై ర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, లక్ష్యా అకాడమీ డీన్ చంద్రశేఖర్ అభినందించారు. -
బైక్లు ఢీకొని యువకుడి మృతి
నిడదవోలు రూరల్: కోరుమామిడి గ్రామంలో ఎదురెదురుగా రెండు బైక్లు ఢీకొని ఓ యువకుడు మృతి చెందినట్టు సమిశ్రగూడెం ఎస్సై ఎల్.బాలాజీ సుందరరావు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు, కోరుమామిడి గ్రామానికి చెందిన ఆరుగొల్లు చంద్రరావు కుమారుడు పండు(21) గేదెల వ్యాపారం చేస్తుంటాడు. సోమవారం మధ్యాహ్నం నిడదవోలు నుంచి బైక్పై ఇంటికి వెళుతుండగా, ఎదురుగా మరో బైక్పై వస్తున్న అదే గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి పిట్టా సందీప్ కోరుమామిడి కంచాలమ్మ అమ్మవారి గుడి సమీపంలో పండును వేగంగా ఢీకొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన పండును నిడదవోలు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ మేరకు అతడి తండ్రి చంద్రరావు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం అదృశ్యం
పెరవలి: వ్యాపారం కలసిరాక, అప్పులు తీర్చలేక, అప్పు ఇచ్చినవారి ఒత్తిడి తట్టుకోలేక ఓ కుటుంబం అదృశ్యమైన సంఘటన సంచలనం కలిగించింది. పెరవలి ఎస్సై ఎం.వెంకటేశ్వర్లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ముత్యాలవారిపాలెం గ్రామానికి చెందిన గంటా తేజనవీన్ తణుకులో గిఫ్ట్ ఆర్టికల్స్ షాపు నిర్వహించేవాడు. వ్యాపార, కుటుంబ అవసరాల కోసం రూ.25 లక్షలు అప్పులు చేశాడు. అప్పు ఇచ్చినవారు బాకీ తీర్చమని ఒత్తిడి చేయసాగారు. దీంతో ఆదివారం మధ్యాహ్నం కుటుంబం సహా బయటకు వెళ్లిన తేజనవీన్ తిరిగి ఇంటికి చేరలేదు. ఈ మేరకు తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు. తేజనవీన్, అతని కుటుంబ సభ్యులు కనిపిస్తే తమకు 94407 96642 లేదా 91548 75611 నంబర్లలో సమాచారం ఇవ్వాలని కోరారు. -
కరుణకు ఆలిండియా నాలుగో ర్యాంక్
బాలాజీచెరువు (కాకినాడ): నగరానికి చెందిన దామలంక కరుణ జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితా ల్లో ఆలిండియా రిజర్వ్ కేటగిరీలో నాలుగో ర్యాంకు సాధించింది. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడు తూ, ఐఐటీ ముంబైలో సీఎస్ఈ అభ్యసించాలనేది తన లక్ష్యమని పేర్కొంది. ఆలిండియా రిజర్వ్ కేటగిరీ లో నాలుగో ర్యాంక్ సాధించడం సంతోషంగా ఉందని చెప్పింది. ఇంటర్మీడియెట్లో రెగ్యులర్ సిలబస్తో పాటు, ఈ పరీక్షకు సంబంధించి ప్రతిరోజు సమయం కేటాయించి సాధన చేయడం తన విజయానికి కారణమని తెలిపింది. ఆమె తండ్రి సుబ్బారావు వ్యవసా యం చేస్తుండగా, తల్లి మంగాదేవి గృహిణి. -
ఖరీఫ్కు నీరు విడుదల
ధవళేశ్వరం: ఖరీఫ్ సాగుకు సంబంధించి గోదావరి డెల్టా కాలువలకు ఆదివారం నీటిని విడుదల చేశారు. ఈస్ట్రన్ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎం.సునీల్కుమార్, ఈస్ట్రన్ డివిజన్ ఈఈ వివి రామకృష్ణ గేట్ల స్విచ్ ఆన్ చేసి నీటిని వదిలారు. తొలుత తూర్పు డివిజన్ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ ఎం.సునీల్కుమార్, ఈస్ట్రన్ డివిజన్ ఈఈ వీవీ రామకృష్ణ గోదావరి మాతకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ సునీల్కుమార్ మాట్లాడుతూ రైతులు సకాలంలో నాట్లు వేసుకోవాలని సూచించారు. ఈఈ రామకృష్ణ మాట్లాడుతూ ఖరీఫ్ త్వరగా ప్రారంభించడం ద్వారా ప్రకృతి విపత్తులు, తుపానులు, వరదల ముంపు బారిన పంటలు పడకుండా రైతు చేతికి అందుతాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జూన్ 1న డెల్టా కాలువలకు నీటిని విడుదల చేశామన్నారు. గోదావరి డెల్టాకు సంబంధించి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాల పరిధిలో 10,13,161 ఎకరాలకు నీటిని కాటన్ బ్యారేజీ ద్వారా అందిస్తున్నామన్నారు. ఖరీఫ్ని సకాలంలో పూర్తి చేయడం ద్వారా రబీ త్వరగా ప్రారంభించడానికి అవకాశం ఉంటుందని తద్వారా రబీలో కూడా నీటి ఎద్దడి లేకుండా సాగుకు నీరు అందుతుందన్నారు. 6.1కోట్లతో చేపట్టిన పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. డెల్టా కాలువలకు మొత్తం 500క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యారేజీ వద్ద 10.25 అడుగుల వద్ద నీటిమట్టం నెలకొంది. బ్యారేజీ నుంచి ఆదివారం సాయంత్రం 10,707 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. కార్యక్రమంలో ఇరిగేషన్ సర్కిల్ ఇన్చార్జి ఎస్ఈ బి వెంకటస్వామి, ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్ డీసీ సుబ్బారెడ్డి, ఇరిగేషన్ అధికారులు డీఈలు ఆనంద్బాబు, రమేష్, ఏఈలు అద్దంకి సాయిరామ్, డి.రాధాకృష్ణ పాల్గొన్నారు. -
మంత్రికి ప్రొటోకాల్తో పనిలేదా?
వైఎస్సార్ సీపీ రామచంద్రపురం నియోజకవర్గ అధ్యక్షురాలు సతీష్కుమారి రామచంద్రపురం రూరల్: రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్కు ప్రొటోకాల్తో పని లేదా.. అని వైఎస్సార్ సీపీ రామచంద్రపురం నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు, వెంకటాయపాలెం సర్పంచ్ యల్లమిల్లి సతీష్కుమారి ప్రశ్నించారు. వెంకటాయపాలెంలో ఆదివారం జరిగిన రేషన్ డిపోల ప్రారంభోత్సవాల నేపథ్యంలో జరిగిన ఘటనలను ఆమె ఆదివారం విలేకరులకు వివరించారు. ఏదో కొత్త వ్యవస్థను తమ ప్రభుత్వంలో నూతనంగా ప్రారంభిస్తున్నట్లు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం హడావుడి చేసిందన్నారు. ఈ నేపథ్యంలో తమ గ్రామంలో రెండు రేషన్ షాపులు ఉండగా 51వ రేషన్ షాపును తాను, గ్రామంలోని జనసేన పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీటీసీ సభ్యురాలు కణితి వెంకటేశ్వరి, ఇతర గ్రామ పెద్దలతో కలసి ఉదయం 8.30 గంటలకు ప్రారంభించినట్లు తెలిపారు. ఆ తరువాత 52వ షాపు వద్దకు వెళ్లగా ఎంపీటీసీ సభ్యురాలు స్థానిక కూటమి నాయకులతో కలసి రిబ్బన్ కత్తిరించి అప్పటికే ప్రారంభించడంతో.. మీరు చేసింది సరైన విధానం కాదని డీలర్తో చెప్పి అక్కడి నుంచి వచ్చేసి తహసీల్దార్కి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఉదయం ఈ రెండు షాపులూ ప్రారంభించేసినా మంత్రి సుభాష్ను కూటమి నాయకులు మధ్యాహ్నం పిలిపించి మళ్లీ వాటికి రిబ్బన్ కత్తిరింపజేయడం గ్రామంలో చర్చనీయాంశం అయ్యిందన్నారు. కూటమి నాయకులు మంత్రిని అవమానించినట్లు భావించాలో, మంత్రి వచ్చిన తరువాత పిలవకపోవడం సర్పంచ్గా నన్ను అవమానించినట్లు భావించాలో అర్థం కావడంలేదన్నారు. ఏది ఏమైనా మంత్రి సుభాష్ ప్రొటోకాల్కి ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విషయం ఈ ఘటనతో తేటతెల్లం అయ్యిందని ఆమె మండిపడ్డారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 14,000 – 14,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 9,500 – 10,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 22,500 గటగట (వెయ్యి) 20,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 21,500 గటగట (వెయ్యి) 19,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 14,500 – 15,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
వాడపల్లిలో భక్తజన సందోహం
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి వారి క్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంలా తిరుమల క్షేత్రాన్ని తలపిస్తోంది. శ్రీఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్య ఫలంశ్రీ నానుడితో అశేష భక్తజనం తరలిరావడంతో కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. శనివారం రాష్ట్ర నలుమూలల నుంచి ఆశేష సంఖ్యలో భక్తులు తరలివస్తుండగా మిగిలిన ఆరు రోజులు కూడా భక్తజనం తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. వారితో పాటు ఏడు వారాల నోము పూర్తి చేసుకున్న భక్తులు అష్టోత్తర పూజలు జరిపిస్తున్నారు. ఆదివారం వాడపల్లి క్షేత్రానికి భక్తులు తరలివచ్చి అష్టోత్తర పూజలో పాల్గొని, స్వామిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో సిబ్బంది భక్తులకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఒక్కరోజు దేవస్థానానికి రూ 8,06,929 ఆదాయం వచ్చినట్టు డీసీ అండ్ ఈఓ చక్రధరరావు తెలిపారు. -
జాతీయ యోగా పోటీలకు ముగ్గురి ఎంపిక
అమలాపురం టౌన్: శ్రీ స్వామి వివేకానంద యోగాశ్రమంలో శిక్షణ పొందుతున్న ముగ్గురు బాల బాలికలు జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. గత ఏప్రిల్ 8న వైజాగ్లో జరిగిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో ఈ ముగ్గురి బాల బాలికలు జాతీయ పోటీలకు అర్హత సాధించారని ఆ యోగాశ్రమం యోగా గురువు డాక్టర్ ఆకుల శ్రీనివాస్ తెలిపారు. జూనియర్ కేటగిరీలో వెయిట్ విభాగంలో బంగారు మేఘన, చామకూరి వర్ధిని, గుత్తల ప్రవీణ్ ఎంపికకై నట్లు చెప్పారు. వీరు ఈ నెల 12న ఢిల్లీలో జరగనున్న జాతీయ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రాష్టపతి అవార్డు గ్రహీత, జాతీయ యోగా న్యాయ నిర్ణేత మోటారి భైరవస్వామి ఎంపికై న ముగ్గురిని యోగా శిక్షకులను అభినందించారు. విలేకరి రాముపై దాడిని ఖండించిన వైఎస్సార్ సీపీ నేతలు పరామర్శించిన ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, జగ్గిరెడ్డి, డాక్టర్ శ్రీకాంత్ అమలాపురం టౌన్: అయినవిల్లి మండల సాక్షి విలేకరి భావిశెట్టి రామకృష్ణ నాగేశ్వరరావు (రాము)పై జరిగిన దాడిని జిల్లా వైఎస్సార్ సీపీ నేతలు ఖండించారు. అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామును పార్టీ జిల్లా నేతలు ఆదివారం పరామర్శించారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ డాక్టర్ పినిపే శ్రీకాంత్ రామును పరామర్శించారు. రాముపై జరిగిన దాడి వివరాలపై వారు ఆరా తీశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాసరావు, పార్టీ నాయకులు గొల్లపల్లి డేవిడ్ రాజు, కుడుపూడి భరత్ భూషణ్ రామును పరామర్శించారు. వివాహిత అదృశ్యం అమలాపురం టౌన్: గత నెల 30వ తేదీన తన భార్య చర్చికి వెళతానని చెప్పి తిరిగి ఇంటికి రాలేదని ఆమె భర్త అమలాపురం రూరల్ మండలం రోళ్లపాలేనికి చెందిన ఉండ్రాజవరపు జగదీష్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ పి.వీరబాబు తెలిపారు. జగదీష్, నందినికి మూడేళ్ల కిందట వివాహమైంది. వారికి ఇంకా సంతానం లేదు. రెండు రోజులుగా భార్య ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో భర్త జగదీష్ ఫిర్యాదు చేశాడు. -
భక్తులతో పోటెత్తిన రత్నగిరి
అన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. రత్నగిరిపై శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. అదే ముహూర్తాలలో రాష్ట్రంలోని పలుచోట్ల కూడా వివాహాలు జరగడంతో నవదంపతులు వారి బంధుమిత్రులు ఆదివారం సత్యదేవుని ఆలయానికి విచ్చేశారు. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయంలో తీవ్ర రద్దీ నెలకొంది. వీరంతా స్వామివారి వ్రతాలాచరించి దర్శనం చేసుకున్నారు. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుడిని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేసి రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. ఆదివారం స్వామివారిని 30 వేల మంది దర్శించగా, వ్రతాలు రెండువేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదువేల మంది భక్తులకు సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో ఉచిత భోజన సౌకర్యం కలుగ చేశారు. ఘనంగా రథసేవ ఆలయ ప్రాకారంలో ఆదివారం ఉదయం సత్యదేవుని రథసేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం పది గంటలకు సత్యదేవుడు, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి రథం మీద ప్రతిష్ఠించారు. స్వామి, అమ్మవార్లకు పూజలు చేసిననంతరం అర్చకస్వాములు సుధీర్, గణేష్ ప్రాకారసేవ ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛాటన మధ్య, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో సేవ నిర్వహించారు. సేవ అనంతరం పండితులు స్వామి, అమ్మవార్లకు నీరాజనం ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. -
ప్రజ్ఞావేత్త చిరంజీవిని కుమారి అస్తమయం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): గోదావరి జిల్లాల్లో ప్రఖ్యాత విద్యాసంస్థలు ఐడియల్ విద్యాసంస్థల అధినేత, ప్రముఖ సాహితీవేత్త, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకు, సీ్త్ర హక్కుల పరిరక్షణకు అలుపెరుగని పోరాటం చేసిన డాక్టర్ పి.చిరంజీవిని కుమారి (94) ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆమె భర్త పీఎస్ శర్మ పదేళ్ల క్రితం మృతిచెందారు. ఆమెకు ఇద్దరు కుమారులు, పెద్ద కుమారుడు గోపాల్ వైద్యవృత్తిలో కొనసాగుతుండగా, చిన్నకుమార్ కిరణ్ ఐడియల్ కళాశాల అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. పూర్వ విద్యార్థులు, సాహితీ ప్రియులు, అభిమానుల సందర్శనార్థం ఆమె భౌతిక కాయాన్ని ఇంద్రపాలెం ఐడియల్ డిగ్రీ కళాశాలలో సోమవారం ఉదయం 11 గంటల వరకూ ఉంచనున్నారు. 1931 మార్చి 30వ తేదీన జన్మించిన డాక్టర్ చిరంజీవిని కుమారి కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలిగా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి కొద్దికాలం సేవలందించి, డాక్టర్ పి.వి.ఎన్.రాజుతో కలిసి 1970లో ఐడియల్ జూనియర్ కళాశాలతో ఐడియల్ విద్యాసంస్థను ప్రారంభించారు. క్రమేణా డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలలు స్థాపించి లక్షలాది మంది విద్యార్థులను తయారు చేశారు. ఒకపక్క విద్యాసంస్థల నిర్వహణతో పాటు తూర్పుగోదావరి రచయితల సంఘం కార్యదర్శిగా జిల్లాలో భాషా సాహిత్యాభివృద్ధికి చాలా కృషిచేశారు. ఐడియల్ విద్యాసంస్థల్లో తెలుగు భాషను మాత్రమే ద్వితీయ భాషగా కొనసాగిస్తూ, తెలుగు భాషా సంస్కృతి వికాసానికి ఎనలేని సేవలు అందించారు. మహాకవి శ్రీ శ్రీ సప్తతి, వెయ్యేళ్ల తెలుగు సాహిత్య వేడుకలు, పద్మశ్రీ డాక్టర్ గరికిపాటి నరసింహారావు మొదటి సహస్రావధానం మొదలైన కార్యక్రమాలు ఐడియల్ విద్యాసంస్థల ద్వారా జరిపించారు. తూర్పుగోదావరి జిల్లా చరిత్ర, సంస్కృతి, జిల్లా సాహిత్య చరిత్ర గ్రంథాల రచనకు సారథ్యంతో పాటు జన విజ్ఞాన వేదికకు సేవలందించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ పాలక మండలి సభ్యురాలిగా సేవలందించి గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేశారు. స్వాతంత్య్ర సంగ్రామంలో తూర్పుగోదావరి అనే గ్రంథాన్ని రచించి ప్రశంసలు పొందారు. ఏయూ నుంచి స్వర్ణ పతాక అవార్డు పొందారు.డాక్టర్ శిఖామణి సంతాపంయానాం: ప్రముఖ విద్యావేత్త, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు, ఐడియల్ కాలేజీ కరస్పాండెంట్, అభ్యుదయ రచయిత్రి డాక్టర్ పి.చిరంజీవినికుమారి మృతిపట్ల యానాం కవిసంధ్య సంపాదకుడు, విశ్రాంత అధ్యాపకుడు డాక్టర్ శిఖామణి ఆదివారం ప్రకటనలో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పీఆర్ కాలేజీలో డిగ్రీ చదివే రోజుల నుండి కవిసంధ్య పత్రిక వరకు ఆమె అందించిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు. వయోభారాన్ని సైతం పక్కనపెట్టి గత సంవత్సరం కథా సదస్సు నిర్వహించడం, గత నెలలో యానాంలో కవిసంధ్య నిర్వహించిన దాట్ల అభినందన సభలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న విషయాన్ని గుర్తుచేశారు. ఆయన మృతి అటు జిల్లా విద్యారంగానికి, సాహిత్యరంగాలకు తీరని లోటు అని పేర్కొన్నారు.జిల్లా క్రీడారంగానికి తీరని లోటుఒలింపిక్ సంఘ కార్యదర్శి ఎలీషాబాబునాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో సుమారు 25 సంవత్సరాల పాటు జిల్లా ఒలింపిక్ సంఘానికి వివిధ హోదాల్లో సేవలు అందించిన, ఐడియల్ విద్యాసంస్థల కరస్పాండెంట్ డాక్టర్ పి.చిరంజీవిని కుమారి మృతి జిల్లా క్రీడారంగానికి తీరని లోటని జిల్లా ఒలింపిక్ సంఘ కార్యదర్శి డాక్టర్ జి.ఎలీషాబాబు పేర్కొన్నారు. డాక్టర్ చిరంజీవినీ కుమారి ఒలింపిక్ సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా, ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా సేవలు అందించారన్నారు. అన్ని క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ ఆర్థికంగా వివిధ క్రీడాపోటీల నిర్వహణకు, ఒలింపిక్ సంఘానికి చేయూతనిచ్చారని తెలిపారు. రాజమహేంద్రవరం నన్నయ యూనివర్శిటీ ఏర్పాటులో కూడా గోదావరి సాధన సమితి ద్వారా ఆమె చేసిన కృషి ఎంతో ఉందన్నారు. ఒలింపిక్ రన్ కన్వీనర్గా మినీ ఒలింపియాడ్, ఒలింపిక్ రన్ నిర్వహణలో చాలాకాలం ఆమె సర్టిఫికెట్లు అందించారన్నారు. వాలీబాల్ సంఘానికి కూడా ఆమె సేవలు అందించారని తెలిపారు. ఒలింపిక్ సంఘ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి, గౌరవ అధ్యక్షుడు చుండ్రుగోవిందరాజు, కర్రిభామిరెడ్డి, డీఎస్డీఓ బిశ్రీనివాస్ కుమార్, రెడ్క్రాస్ రాష్ట్ర అధ్యక్షుడు వైడీ రామారావు, రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ సంఘ మాజీ అధ్యక్షుడు ఎల్.జార్జి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘ మాజీ అధ్యక్షుడు రవిరాజు, ప్రస్తుత అధ్యక్షుడు శ్రీను, మాచరరావు చిరంజీవినీ కుమారి మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.గొప్ప సాహితీ వేత్తను కోల్పోయాంవిద్య, సామాజిక, సాహితీవేత్తగా పేరొంది ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన డాక్టర్ పి.చిరంజీవినీ కుమారి మృతి సమాజానికి తీరని లోటు. జిల్లా చరిత్రను గ్రంథస్తం చేసిన ఆమె ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.– చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీమంత్రిసామాజ ఉన్నతికి పాటుపడినగొప్ప విద్యావేత్తఎంతోమంది విద్యార్థులను ఐడి య కళాశాల ద్వారా చిరంజీవినికుమారి ఉన్నతులుగా తీర్చిదిద్ది సమాజానికి మంచి పౌరులను అందించారు. ఇంటర్, డిగ్రీతోపాటు ఇంజినీరింగ్ విద్యను కూడా అందించాలనే సంకల్పంతో ఇంజినీరింగ్ కళాశాలను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఆమె మరణం సాహితీ వేత్తలకు, రచయితలకు తీరని లోటు.– డాక్టర్ పి.కృష్ణారావు, ప్రగతి కళాశాల చైర్మన్ -
వినాయకుడి ఆలయంలో హుండీ చోరీ
కడియం: స్థానిక పోస్టాఫీసు వీధిలోని పెద్ద వినాయకుడి ఆలయం వద్ద హుండీని పగలగొట్టి అందులోని నగదును దొంగలు ఎత్తుకుపోయారు. ఉదయం పూజలు చేసేందుకు వచ్చిన అర్చకులు డిబ్బీ తాళం పగలగొట్టి ఉండడాన్ని గుర్తించి స్థానికులకు సమాచారం ఇవ్వగా, వారు పోలీస్లకు తెలియజేశారు. క్రైం అడిషనల్ ఎస్పీ అర్జున్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీస్ ఇన్స్పెక్టర్ ఎ.వేంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్ఐ దుర్గాప్రసాద్, సిబ్బంది గంగాధర్, ప్రసాద్, రవి, కుమార్ దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. -
కోటసత్తెమ్మ సన్నిధిలో భక్తుల సందడి
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెంలో వేంచేసియున్న కోటసత్తెమ్మ తల్లి ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానార్చకుడు అప్పారావుశర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అమ్మవారి దర్శనాలు, ప్రసాదం, పూజా టికెట్లు, ఫొటోల అమ్మకంతో దేవస్థానానికి రూ.1,88,977 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్య ప్రకాష్ తెలిపారు. అమ్మవారికి జంగారెడ్డిగూడేనికి చెందిన కోసూరి దశరథరావు, నాగమణి దంపతులు, వారి కుమారుడు రాజేష్బాబు 500 గ్రాముల వెండి వస్తువులు సమర్పించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, సిబ్బంది పాల్గొన్నారు. యోగా.. అలవాటుగా మారాలిసీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రతి ఒక్కరికీ యోగా అలవాటుగా మారాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. పర్యాటక శాఖ ఆధ్వర్యాన గోదావరి తీరాన స్థానిక సరస్వతీ ఘాట్లో ఆదివారం తొలిసారిగా నిర్వహించిన జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యోగాపై ప్రజలకు విస్తృత అవగాహన కలిగించేందుకు గాను ఈ నెల 20వ తేదీ వరకూ సాధన కార్యక్రమాలకు రూపకల్పన చేశామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 4,700 మంది యోగా మాస్టర్ ట్రైనర్లుగా, 4,64,000 మంది అభ్యసకులుగా యోగాంధ్ర కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. జాయింట్ కలెక్టర్, ఈ కార్యక్రమ నోడల్ అధికారి ఎస్.చిన్నరాముడు మాట్లాడుతూ, ఈ నెల 7న కడియం సత్యదేవ నర్సరీ, 14న కొవ్వూరు గోష్పాద క్షేత్రం, 20న దివాన్ చెరువు నగరవనంలో యోగా సాధన కార్యక్రమాలు నిర్వహించనున్నామని చెప్పారు. యోగాపై వివిధ కేటగిరీల్లో పోటీలు నిర్వహించి జిల్లా స్థాయి విజేతలు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించే కార్యక్రమానికి హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రేపు జాబ్ మేళా సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఐటీసీ లిమిటెడ్ ఫుడ్స్ డివిజన్ కంపెనీల్లో ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి మంగళవారం కలెక్టరేట్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.లచ్చారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటీఐ, ఇంటర్ (ఒకేషనల్) ఉత్తీర్ణులైన 30 సంవత్సరాల లోపు పురుషులు, మహిళలు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు విద్యార్హతల సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలతో మేళాకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 76608 23903 నంబర్లో సంప్రదించాలన్నారు. అయినవిల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు అయినవిల్లి: శ్రీవర సిద్ధి వినాయక స్వామి ఆలయానికి ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామి సన్నిధిలో లఘున్యాస అభిషేకాలు, ఉండ్రాళ్ల పూజ, శ్రీలక్ష్మీ గణపతి హోమం జరిపించుకున్నారు. అక్షరాభ్యాసం, అన్నప్రాశన, తులాభారం, ఆశీర్వచనం పూజలు కూడా చేయించుకున్నారు. వివిధ సేవల ద్వారా స్వామి వారికి రూ.3,77,996 ఆదాయం వచ్చిందని ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన పథకానికి రూ.1,95,295 విరాళాలుగా అందించారన్నారు. అన్నప్రసాద భవనానికి విరాళాలు కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి క్షేత్రంలో వకుళమాత అన్న ప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా హైదరాబాద్కు చెందిన ఎన్.చైతన్య జనార్దన్, సిందూరి దంపతులు, కుటుంబ సభ్యులు రూ.50,307, వి.వినోద్, సులోచనారాణి దంపతులు రూ.50,307 చొప్పున ఆదివారం విరాళాలు సమర్పించారు. దాతలకు దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్వామివారి చిత్రపటాలను అందజేశారు. -
తలుపులమ్మ లోవకు పోటెత్తిన భక్తులు
తుని రూరల్: లోవ దేవస్థానంలో కొలువైయున్న తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వాహనాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. క్యూలైన్ల ద్వారా అమ్మవారిని 30 వేల మంది భక్తులు దర్శించుకున్నట్టు కార్యనిర్వహణాధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,11,455, పూజా టికెట్లకు రూ.2,13,300, కేశఖండన శాలకు రూ.24,040, వాహన పూజలకు రూ.5,010, వసతి గదులు, పొంగలి షెడ్లు, కాటేజీల అద్దెలు రూ.85,956, విరాళాలు రూ.1,44,033 కలిపి మొత్తం రూ.6,83,794 ఆదాయం లభించిందని వివరించారు.