breaking news
East Godavari District Latest News
-
కడియం నర్సరీ అందాలు అద్భుతం
కడియం: నర్సరీ అందాలు అద్భుతంగా ఉన్నాయని రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ కె. శ్రీనివాసులు తెలిపారు. గురువారం ఆయన కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీని సందర్శించారు. ఆ నర్సరీ రైతు పుల్లా పెద సత్యనారాయణ మొక్కనిచ్చి స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ నర్సరీ రైతులకు ప్రభుత్వ ద్వారా తగిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ పాటిస్తూ నర్సరీలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు. వైఎస్సార్ హెచ్ ఓ డైరెక్టర్ బి.గోవిందరాజు, కొవ్వూరు పరిశోధన క్షేత్రం ప్రిన్సిపాల్ డాక్టర్ పి.లలిత కుమారేశ్వరి, సీనియర్ సైంటిస్టులు డాక్టర్ రవీంద్ర కుమార్, డాక్టర్ వి శివకుమార్, ఏపీఎంఐపి పిడి ఎ. దుర్గేష్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఎన్. మల్లికార్జునరావు, కడియం ఉద్యాన శాఖ అధికారి పి.లావణ్య పాల్గొన్నారు. జర్మనీ భాషలో ఉచిత శిక్షణ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో గల ఎస్సీ,ఎస్టీ కులాలకు చెందిన నర్సింగ్ పట్టభద్రులకు జర్మనీ భాషలో బి2 స్థాయి కోసం ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశం కల్పించటానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత శాఖ అధికారి ఎమ్.డి. గవాజుద్దీన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి దరఖాస్తు చేసుకునే విద్యార్థి వయసు 35 సంవత్సరములు లోపు ఉండాలన్నారు. బీఎన్ఎం గాని, బీఎస్సీ నర్సింగ్ కోర్సు గాని చదివి ఉండాలన్నారు. ఆసక్తి గల విద్యార్థినీ విద్యార్థులు ఆగస్టు 6వ తేదీలోపు అన్ని ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపిక అయిన విద్యార్ధులకు 8 నుంచి 10 నెలల వరకు ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు. శిక్షణ విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలలో మాత్రమే ఇస్తారన్నారు. పూర్తి వివరాల కోసం మొబైల్ నంబర్లు: 99488 68862, 83400 94688 లలో సంప్రదించాలన్నారు. రేపు అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ యోజన నిధుల జమ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): అన్నదాత సుఖీ భవ – పీఎం కిసాన్ పథకాల కింద మంజూరైన నిధులను శనివారం రైతుల బ్యాంకు ఖాతాల్లో జ మ చేయనున్నట్లు కలెక్టర్ పి.ప్రశాంతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలో రూ.7,000 చొప్పున, జిల్లావ్యాప్తంగా మొత్తం రూ.79 కోట్లు జమ చేయనున్నట్టు తెలిపారు. ఇందులో రూ.2,000 పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తుండగా, రూ.5,000 అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.ఆరు వేలు , రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు చొప్పున సంవత్సరానికి మొత్తం రూ.20,000 లను మూడు విడతల్లో నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తాయని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో 1,434 ఖాతాల ఎన్పీసీఐతో అనుసంధానం కాలేదని, మరో 1,072 ఖాతాలు అనుసంధానమైనా ‘ఇన్ యాక్టివ్‘గా ఉన్నాయనీ కలెక్టర్ పేర్కొన్నారు. కాల్ సెంటర్: 155251, వాట్సాప్ గవర్నెన్స్ నంబర్: 95523 00003, స్థానిక రైతు సేవా కేంద్రాలలో సంప్రదించవచ్చు అని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం రాజానగరం: విధులను నిర్వర్తించడంలో అలసత్వం చూపిస్తున్న నందరాడ, నరేంద్రపురం (ఇన్చార్జ్) వీఆర్వోలు ముని తిరుపతి, ఎం.సత్యనారాయణలపై జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరినీ తక్షణమే కలెక్టరేట్కి అటాచ్ చేయాలని తహాస్లీల్దారు జీఎఎస్ఎల్ దేవిని ఆదేశించారు. పీఎం కిసాన్ యోజన, అన్నదాత సుఖీభవ పథకాల అమలు తీరును పర్యవేక్షించడంలో భాగంగా మండలంలోని నందరాడ, నరేంద్రపురంలోని రైతు సేవా కేంద్రాలను గురువారం ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణ, డేటా ఎంట్రీ, ఇతర అనుబంధ కార్యక్రమాలను పరిశీలించారు. విధులను నిర్వర్తించడంలో అలక్ష్యంగా వ్యవహరిస్తున్న పై ఇద్దరు వీఆర్వోలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది అలక్ష్యం చూపడం సరికాదన్నారు. -
బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రత
– ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశం రాజమహేంద్రవరం రూరల్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడెన్స్ ప్రకారం బ్యాంకులు, ఏటీఎంల వద్ద నిర్దేశిత భద్రతా ప్రమాణాలు తప్పక పాటించాలని ఎస్పీ డి.నరసింహకిషోర్ ఆదేశించారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని వివిధ బ్యాంకు అధికారులు, సెక్యూరిటీఅధికారులతో బ్యాంకులు, ఏటీఎంల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన సమావేశం నిర్వహించారు. బ్యాంకులు, ఏటీఎంల వద్ద నేర నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు, భద్రత పరంగా తీసుకోవలసిన చర్యల గురించి పి.పి.టి. ద్వారా జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ వివరించి సూచనలు చేశారు. బ్యాంకు విధుల్లో నియమించుకునే తాత్కాలిక సిబ్బంది, అవుట్ సోర్సింగ్ భద్రతా సిబ్బందికి ముందుగా పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయించాలన్నారు. ప్రతి బ్యాంకు, ఏటీఎం వద్ద 24 గంటలూ పనిచేసే నైట్ విజన్ ఏఈ సీసీటీవీలను అమర్చుకోవాలన్నారు. ఏదైనా అనుకోని ఘటన జరిగినప్పుడు బ్యాంకు అధికారులకు కాల్ చేసే సౌకర్యంతో కూడిన భద్రతా అలారం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సెక్యూరిటీ, ఫైర్ సెక్యూరిటీ పరికరాల పనితీరును క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలని తెలిపారు. విడిగా ఉన్న ఏటీఎంలు, బ్యాంకుల వద్ద తప్పనిసరిగా సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలన్నారు. బ్యాంకు సిబ్బంది పోలీసు సిబ్బందితో సంబంధాలు ఏర్పరుచుకోవాలని, అత్యవసర సమయాలలో సంప్రదించడానికి వీలుగా పోలీసు అధికారుల కాంటాక్ట్ డీటెయిల్స్ కలిగి ఉండాలని తెలిపారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన సర్వెలెన్స్ రిపోర్టును సంబంధిత స్టేషన్కు విధిగా పంపాలన్నారు. బీట్ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ, సెక్యూరిటీ గార్డులను, వాచ్మన్లను అలర్ట్ చేయాలని ఆదేశించారు. డిస్ట్రిక్ట్ లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రసాద్, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్.బి.ఎం మురళీకృష్ణ, అడిషనల్ (ఎస్పీ లా అండ్ ఆర్డర్) ఏవీ సుబ్బరాజు, అడిషనల్ ఎస్పీ ( క్రైమ్స్) ఎల్. అర్జున్, డి.ఎస్.పి.(ఎస్బీ) బి.రామకృష్ణ,, జోనల్ డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
ఆ సీటు యమ హాటు..!
సాక్షి, రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ సీటు హాట్కేక్గా మారింది. గోదావరి పుష్కరాలు 2027లో జరగనున్నాయి. రూ.2 వేల కోట్ల నిధులు పుష్కరాలకు కేటాయించనున్నారు. అభివృద్ధి పనుల్లో సింహభాగం కార్పొరేషన్ కార్యాలయం కేంద్రంగా జరగనున్నాయి. పనులకు సంబంధించి బిల్లుల మంజూరు, వసతుల కల్పన, భక్తులకు సౌకర్యాలు, నిధులు ఖర్చుచేయడం తదితర ప్రక్రియంతా కమిషనర్ కనుసన్నల్లోనే జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి కమిషనర్ సీటుకు ప్రాధాన్యం ఏర్పడింది. ఎలాగైనా కుర్చీ దక్కించుకునేందుకు కొందర అధికారులు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పైరవీలు ప్రారంభించారు.. తీరా రంగంలోకి దిగాక.. ‘ఆ సీటు యమ టఫ్’ అని గ్రహించి ప్రయత్నాలు విరమించుంటున్నారు. వెరసి కమిషనర్ నియామకం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఇదిలా ఉంటే మరో వైపు తమ అడుగులకు మడుగులొత్తే కమిషనర్ను తెచ్చుకుంటే రూ.కోట్ల విలువైన పనులు దక్కించుకోచ్చన్న ఉద్దేశంతో తమకు అనుకూలమైన అధికారిని తెచ్చుకునేందుకు రాజకీయ నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఓ కమిషనర్ బలి! రాజమహేంద్రవరం రూరల్, రాజమహేంద్రవరం సిటీ టీడీపీ నేతల మితిమీరిన రాజకీయ జోక్యానికి ఇప్పటికే ఓ కమిషనర్ బలయ్యారు. తాను కమిషనర్గా బాధ్యతలు చేపట్టి ఏడాది గడవకముందే ఇక్కడ పనిచేయలేనంటూ విశాఖకు బదిలీ చేయించుకుని వెళ్లిపోయారంటే ఏ స్థాయిలో రాజకీయ ఒత్తిళ్లు ప్రభావం చూపాయన్న విషయం అర్ధమవుతోంది. ఏడాది పాలనలో తనదైన ముద్ర వేసుకున్న బదిలీ అయిన కమిషనర్ కేతన్గార్గ్... నగరాన్ని సుందరంగా, అక్రమణలు లేకుండా తీర్చిదిద్దాలని భావించారు. అక్రమ నిర్మాణాల్ని తొలగించడంలో భేదాల్లేకుండా వ్యవహరించారు. దీనికి ఓ ప్రజాప్రతినిధి అడుగడుగునా అడ్డంకులు సృష్టించినట్లు విమర్శలున్నాయి. ఏదైనా అక్రమ నిర్మాణం తొలగించేందుకు మున్సిపల్ అధికారులు వెళ్లిన సందర్భంలో వెంటనే ఆ అధికారులకు ఓ ప్రజాప్రతినిధి నుంచి వెంటనే ఫోన్ వచ్చేది. అది తమ వారిదేనని, దాని జోలికి వెళ్లొద్దంటూ హుకుం జారీ చేసేవారు. చేసేది లేక వెనుదిరిగి వచ్చేవారు. ప్రధాన రహదార్ల ఆక్రమణలు తొలగించడంతో రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. కాంట్రాక్టర్లు చేపట్టిన ప్రతి పనినీ స్వయంగా పరిశీలించి నాణ్యత విషయమై కఠినంగా వ్యవహరించే వారు. తను సంతృప్తి చెందితేనే బిల్లులు మంజూరు చేసేవారు. దీంతో ఎలాగైనా కమిషనర్ను బదిలీ చేయించాలని కూటమి నేతలు భావిస్తూ వచ్చారు. ప్రజా ప్రతినిధుల వద్ద పైరవీలకు తెర తీశారు. దీంతో విసుగెత్తిపోయిన కమిషనర్ తాను ఇక్కడ ప్రశాంతంగా పనిచేయలేనని భావించి స్వయంగా బదిలీ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఇటీవల విశాఖపట్నం కార్పొరేషన్కు బదిలీ చేసింది. జిల్లా కలెక్టర్ ప్రశాంతికి కమిషనర్ బాధ్యతలు అప్పగించింది. బదిలీ అయి నెల కావస్తున్నా.. నేటీకీ పూర్తి స్థాయి కమిషనర్ నియామకం జరగలేదు. మితిమీరుతున్న రాజకీయ జోక్యం? రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయ జోక్యం మితిమీరుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో మున్సిపల్ పాలన సాగుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన అనుమతి లేనిదే చీమకూడా కదలకూడదన్న ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేకంగా తన వ్యక్తిగత సహాయకుణ్ణి ఉంచి మరీ పాలన సాగిస్తున్నట్లు సమాచారం. నగరంలో ఎన్ని అపార్ట్మెంట్లు, భవన నిర్మాణాలకు టౌన్ప్లానింగ్ అధికారులు అనుమతులు ఇచ్చారు? అందులో ఎన్ని కమర్షియల్.. ఎన్ని నాన్ కమర్షియల్..? అన్న లెక్కలు తీస్తున్నారు. కమర్షియల్ భవన యజమానుల జాబితా తీసుకుని వారిని సంప్రదించి తమకేంటంటూ..? టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ పరిణామం మున్సిపల్ అధికారులకు తలనొప్పిగా పరిణమించింది. మున్సిపల్ అధికారులకు ప్రధాన ఆదాయ వనరు భవన నిర్మాణాల అనుమతులు. వాటిలో సైతం రాజకీయ జోక్యంతో అధికారులు ఆదాయాన్ని కోల్పోతున్నారు. తమకు అందే ఆదాయాన్ని అడ్డుకుంటే తమ ప్రొటోకాల్ ఖర్చులు ఎలాగన్న ఆందోళన వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితులన్నీ బేరీజు వేసుకుంటున్న అధికారులు కమిషనర్గా వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. పుష్కరాలు వస్తున్నాయి.. రూ.కోట్ల అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉన్నా.. రాజకీయ నేతల జోక్యం తలనొప్పిగా పరిణమించే అవకాశం ఉండటంతో వెనకడుగు వేస్తున్నారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ కార్యాలయంఇద్దరి మధ్యా భిన్నాభిప్రాయాలు రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణలో ఇప్పటికే రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్ వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజమహేంద్రవరం రూరల్కు చెందిన విలీన గ్రామాలతో కలిపి ఎన్నికలు నిర్వహించాలని గోరంట్ల పట్టుబడుతుండగా.. విలీనం లేకుండానే ఎన్నికలకు వెళ్లాలని ఆదిరెడ్డి వర్గం వాదిస్తోంది. ఈ వ్యవహారం ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. ఇరు వర్గాలపై సీఎం చంద్రబాబు సైతం అసహనం వ్యక్తం చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2027లో జరిగే పుష్కర పనుల్లో సైతం వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తం అయ్యే అవకాశాలు ఉన్నాయి. తమ కార్యకర్తలకు పనులు ఇవ్వాలంటూ ఇద్దరూ పట్టుబట్టే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య తాము నలిగిపోవడం ఎందుకులే..? అన్న అభిప్రాయంతో కమిషనర్గా వచ్చేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హాట్కేక్గా రాజమండ్రి మున్సిపల్ కమిషనర్ స్థానం స్థానిక రాజకీయ పరిస్థితులు, పైరవీకారులతో వచ్చేందుకు హడలెత్తిపోతున్న అధికారులు తొలుత బాధ్యతలు చేపట్టేందుకు సుముఖం ఆపై ఎలా ఉంటుందో ఆరా తీశాక వెనకడుగు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించలేమన్న అసహనం ఇప్పటికే కమిషనర్గా పనిచేసిన కేతన్గార్గ్ విశాఖకు బదిలీ చేయించుకొని వెళ్లిన వైనం ఆయన స్థానంలోకి నలుగురు పోటీ.. ఆపై ఆగిన ప్రయత్నాలు ఇన్చార్జ్ కమిషనర్గా కలెక్టర్కు బాధ్యతలుపోటీ తీవ్రం.. రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ కుర్చీ కోసం నలుగురు అధికారులు పోటీ పడినట్టు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసి బదిలీపై వెళ్లిన ఓ అధికారి నియామకానికి ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. సదరు అధికారి మంత్రి లోకేష్కు అత్యంత ఆప్తుడని ఇక నియామక ఉత్తర్వులు రావడమే తరువాయి అన్న విధంగా ప్రచారం సాగింది. ఇక్కడి అధికార పార్టీ నేతలు ఆయన తమకు వద్దని చెప్పడంతో ఆ ప్రక్రియ మధ్యలోనే ఆగింది. అనంతరం రాజమండ్రిలో సబ్కల్టెర్గా విధులు నిర్వర్తించిన మరో అధికారిణి పేరు ప్రముఖంగా వినిపించింది. తాజాగా నెల్లూరులో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి పేరు విపరీతంగా చర్చకు వచ్చింది. ఇక రేపో మాపో నియామక ఉత్తర్వులు సైతం వెలువడే అవకాశం ఉందనే సమాచారం అందింది. ఆ అధికారి వస్తే తమ పంట పండినట్లేనని అధికార పార్టీ నేతలు అనుకున్నారు. ఆ అధికారి సైతం రాజమహేంద్రవరం అనగానే ఓకే అనేశారు. ఇంతలోనే ఏమైందో ఏమో.. సదరు అధికారి ఇక్కడకు వచ్చేందుకు ప్రస్తుతం వెనకడుగు వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. -
ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం
అమలాపురం టౌన్: ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు మద్దాల బాపూజీ అన్నారు. అమలాపురంలోని గొల్లగూడెంలో జిల్లా ప్రభుత్వ సంఘం ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాపూజీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఎరియర్స్, డీఏలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు.. ఇలా పలు రూపాల్లో రూ.వేల కోట్లలో ప్రభుత్వం బకాయిలు పెట్టిందన్నారు. జిల్లాలో ఈ నెల 5 నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు శాఖల వారీగా సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వ బకాయిలపై గణాంకాలతో వివరించే వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు పలు ఎరియర్స్ కింద ప్రభుత్వం దాదాపు రూ.25 వేల కోట్ల వరకూ బకాయిలు ఉందని గుర్తు చేశారు. ఉద్యోగులకు వారి బాధ్యతలు తెలియజేసి, వారిని పోరాటంలో కార్యోణ్ముఖులను చేసేందుకు ‘ఉద్యోగులారా... రండి.. టీ తాగుతూ మాట్లాడుకుందాం’ పేరుతో రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించామన్నారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఎరెండ్స్ లీవులు బకాయిలు చెల్లించలేదని, పీఆర్సీ కమిటీ నియమించలేదని, నాలుగు డీఏలు నేటికీ ఇవ్వలేదన్నారు. ప్రతి ఉద్యోగికి ఎంత చెల్లించాలో ప్రభుత్వం నిర్ధారించాలని, బకాయిలు ఎంత ఇవ్వాలో ఉద్యోగి రిజిస్టర్ (ఎస్ఆర్)లో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పలు ఎరియర్స్ బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తారో లిఖిత పూర్వకంగా రాసి ష్యూరిటీ బాండ్లు ఇవ్వాలన్నారు. సమావేశంలో జిల్లా సంఘం అసోసియేట్ ప్రెసిడెంట్ కె.వీరబాబు, జిల్లా కార్యదర్శి కె.మల్లిబాబు, ఉపాధ్యక్షుడు సీహెచ్ విజయ్కుమార్, కోశాధికారి జేఏ రాజ్కుమార్, అమలాపురం, రామచంద్రపురం, కొత్తపేట, ముమ్మిడివరం, రాజోలు, మండపేట ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ నెల 5 నుంచి శాఖల వారీగా సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు బాపూజీ -
బదిలీ భారం
అమలాపురం టౌన్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్) విధానంలో పనిచేస్తున్న 220 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ప్రస్తుతం బదిలీల బాధలు, దూరాభారాలతో సతమతమవుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మూడేళ్ల కిందట వీరికి ఎంటీఎస్ విధానంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు వచ్చాయి. తర్వాత ఏడాదికి జరిగిన బదిలీల ప్రక్రియలో ఉమ్మడి జిల్లాలోని దగ్గర మండలాల్లో ఉన్న పాఠశాలల్లోనే పోస్టులు ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక గత జూన్ నెలలో జరిగిన ఎంటీఎస్ ఉపాధ్యాయుల బదిలీల్లో అనేక లోపాలతో వీరిని 100 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న పాఠశాలలకు పంపించారు. 220 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయుల్లో దాదాపు 75 మందిని ఏకోపాధ్యాయ పాఠశాలలకు బదిలీలు చేయడమే కాకుండా వారికి ప్రధానోపాధ్యాయ బాధ్యతలు అప్పగించారు. యాప్ల భారం కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే ఎంటీఎస్ ఉపాధ్యాయులకు ఏడాదిలో 11 నెలల పాటు, అదీ నెలకు రూ.32,470 మాత్రమే జీతం వస్తుంది. మే నెలలో వీరికి జీతం ఉండదు. కూటమి ప్రభుత్వం ఈ ఎంటీఎస్ ఉపాధ్యాయులను 100 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న పాఠశాలకు బదిలీ చేసి, వారిలో కొందరికి ప్రధానోపాధ్యాయ బాధ్యతలు అప్పగించింది. వారిపై యాప్ల భారాన్ని బలవంతంగా మోపింది. గత ప్రభుత్వంలో ఈ తరహ ఉపాధ్యాయులను కేవలం సపోర్టింగ్ టీచర్లగానే భావించి, వారిని సమీప మండలాలకు బదిలీ చేసింది. గత జూన్ 23న కాకినాడలో ఎంటీఎస్ ఉపాధ్యాయులు డీఈవో కార్యాలయం వద్ద ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. కేవలం బదిలీల్లో లోపాలతో తమను బలవంతంగా దూరంగా నియమిస్తున్నారని, కొందరికి ఏకోపాధ్యాయ పాఠశాలలకు హెచ్ఎంలను చేసి యాప్ల బాధ్యతలు అప్పగించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్బంధ బదిలీలు! ఉన్నతాధికారులు తమను నిర్బంధంగా బదిలీలు చేశారన్న ఆవేదన, ఆందోళన ఎంటీఎస్ ఉపాధ్యాయుల నుంచి వ్యక్తమవుతోంది. ఉదాహరణకు తుని నుంచి ముమ్మిడివరానికి, సామర్లకోట నుంచి ఐ.పోలవరం మండలానికి, రాజమహేంద్రవరం నుంచి అడ్డతీగలకు ఎంటీఎస్ ఉపాధ్యాయులను బదిలీలు చేశారు. అసలే కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు, బదిలీల భారం ఒక ఎత్తు అయితే హెచ్ఎంగా బాధ్యతలు అప్పగించి యాప్ల భారాన్ని మోపడం మరో ఎత్తు. దీని ప్రభావం విద్యాబోధనపై తీవ్రంగా పడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దూరాభార బదిలీల వల్ల అనారోగ్య ఉపాధ్యాయులు, దివ్యాంగులు, మహిళలు చాలా అవస్థలకు గురవుతున్నారు. కాంట్రాక్టు పద్ధతిలో నెలకు ఇచ్చే జీతం రూ.32,470తో అంత దూరం వెళ్లి ఎలా పనిచేయగలరని ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ వెళ్లినా సగం జీతం రవాణా ఖర్చులకే సరిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంటీఎస్ ఉపాధ్యాయుల ఆవేదన ఏకోపాధ్యాయ పాఠశాలలకు హెచ్ఎంలుగా నియామకం దూర ప్రాంతాలకు బదిలీ యాప్లతో ఇబ్బంది కాంట్రాక్టు ఉపాధ్యాయులుగా చాలీ చాలనీ జీతాలతో బతుకుతున్న మమ్మల్ని వంద కిలోమీటర్లకు పైబడి దూరంలో ఉన్న పాఠశాలలకు బదిలీలు చేయడం అన్యాయం. మాలో కొందరిని ఏకోపాధ్యాయ పాఠశాలలకు బదిలీలు చేసి ప్రధానోపాధ్యాయుడి బాధ్యతలు అప్పగించారు. యాప్ల భారం పెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదు. మాలో కొందరు ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నారు. ఈ సమయంలో అంత దూరం బదిలీలు, ప్రధానోపాధ్యాయుడి బాధ్యతులు, యాప్ల భారం సరైన విధానాలు కాదు. మేము చేసిన అభ్యర్థనలు, నిరసనలను విద్యాశాఖ ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. – ఎ.బాల గోపాలరావు, ఎంటీఎస్ ఉపాధ్యాయుడు -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 30,000 గటగట (వెయ్యి) 27,000 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 29,000 గటగట (వెయ్యి) 26,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 18,000 – 19,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 18,000 – 19,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 6,000 ఒక కిలో 400 -
విద్యార్థి దశ నుంచే క్రీడాసక్తి పెంచుకోవాలి
పెద్దాపురం: విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ క్రీడాసక్తి పెంపొందించుకోవాలని ప్రముఖ పారిశ్రామిక వేత్త, లలిత రైస్ ఇండస్ట్రీస్ ఈడీ మట్టే ఆది శంకర్, ప్రముఖ డెర్మాలజిస్ట్ డాక్టర్ మట్టే స్రవంతి అన్నారు. స్థానిక జవహర్ నవోదయ విద్యాలయలో మూడు రోజుల పాటు నిర్వహించిన క్లస్టర్ స్థాయి కబడ్డీ మీట్ గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బి.సీతాలక్ష్మి అధ్యక్షతన జరిగిన ముగింపు సభలో వారు మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువుతో పాటు క్రీడా నైపుణ్యం ఎంతో అవసరమన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పీఈటీ సత్యనారాయణ, అనురాధ, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, పాండిచ్చేరికి చెందిన 458 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలు వీరే మూడు రోజుల పాటు నిర్వహించిన కబడ్డీ పోటీల్లో 101 లీగ్ మ్యాచులు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ సీతాలక్ష్మి, పీఈటి సత్యనారాయణ తెలిపారు. అండర్–14 బాలికల విభాగంలో ఖమ్మం క్లస్టర్, అండర్–17 విభాగంలో పిమోగా క్లస్టర్, అండర్–19 విభాగంలో కృష్ణ క్లస్టర్ విజేతలుగా నిలిచాయన్నారు. అండర్–14 బాలుర విభాగంలో బీదర్ క్లస్టర్, అండర్–17 విభాగంలో కడప క్లస్టర్, అండర్–19 విభాగంలో పిమోగా క్లస్టర్ విజయం సాధించాయని తెలిపారు. రీజినల్ మీట్లో ఆల్రౌండ్ ఛాంపియన్గా పిమోగా క్లస్టర్ (కేరళలో కొన్ని జిల్లాలు), కర్ణాటకలో కొన్ని జిల్లాలు కలిసి ఓవరాల్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్నాయన్నారు. పారిశ్రామిక వేత్త మట్టే ఆదిశంకర్ జేఎన్వీలో ముగిసిన కబడ్డీ మీట్ -
అదుపు తప్పి బస్సును ఢీకొన్న కారు
తాళ్లరేవు: అమలాపురం నుంచి కాకినాడ వెళుతున్న ఆర్టీసీ బస్సును ఓ కారును ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందారు. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన మందపాటి శ్రీరామరాజు, సుభద్రమ్మ (67) దంపతులు ఐ.పోలవరం మండలం పెదమడి గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లేందుకు కారులో బయలుదేరారు. జాతీయ రహదారి 216లోని కోరంగి పోలీస్స్టేషన్కు సమీపంలో వారి కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న అమలాపురం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో సుభద్రమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, భర్త శ్రీరామరాజుకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు, స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రయాణికులను వేరే బస్సులో వారి స్వస్థలాలకు తరలించారు. విషయం తెలుసుకున్న కోరంగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాకినాడ–యానాం రహదారిలో గత వారం రోజుల్లో జరిగిన మూడు ప్రమాదాల్లో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కారులోని మహిళ మృతి కోరంగి వద్ద విషాదం -
మేమంటే ఎందుకు అంత వివక్ష?
● అభివృద్ధి పనులన్నీ జనసేన సభ్యుల వార్డులకే కేటాయిస్తారా? ● మున్సిపల్ సమావేశాన్ని బహిష్కరించిన 13 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు నిడదవోలు : పురపాలక సంఘంలో జనసేన పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ టి.కృష్ణవేణి తమ పట్ల తీవ్ర వివక్ష చూపిస్తున్నారని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం జరిగిన నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశాన్ని వారు బహిష్కరించారు. 13 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల వార్డుల్లో ఒక్క పనిని కూడా అజెండాలో చేర్చకపోవడంతో నల్లబ్యాడ్జీలు ధరించి మున్సిపల్ సమావేశానికి హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలోనే నిరసన వ్యక్తం చేస్తూ సమావేశాన్ని బహిష్కరించి బయటికి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కౌన్సిలర్ కామిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ పురపాలక సంఘంలో జనసేనకు చెందిన 14 మంది కౌన్సిలర్ల వార్డుల్లో 16 పనులకు గాను మున్సిపల్ సాధారణ నిధులు రూ.78 లక్షలతో సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీ నిర్మాణానికి అంచనాలు తయారు చేసి అజెండాకు తీసుకువచ్చారన్నారు. పురపాలక సంఘంలో ఉన్న 13 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ల వార్డులో మాత్రం ఒక్క పని కూడా కేటాయించకుండా చైర్మన్ ఆదినారాయణ పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మేము కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులమని, మా వైఎస్సార్ సీపీ సభ్యుల వార్డుల్లో పనులు కేటాయించడంలో ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. ఇలాంటి వివక్ష మేమున్నడూ చూడలేదన్నారు. దీనిపై మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ సమాధానమిస్తూ అత్యవసర పనులు కొన్ని వార్డులకు కేటాయించామన్నారు. త్వరలో పట్టణానికి ఎల్ఆర్ఎస్ నిధులు రూ.2 కోట్లు మంజూరు కాగానే అన్ని వార్డులకు అభివృద్ధి పనులు కేటాయిస్తామన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలగడ బాలరాజు, 13 మంది వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు. -
బియ్యం పంపిణీలో కూటమి నేతల కుమ్ములాట
కొత్తపల్లి: మత్సకారులకు బియ్యం పంపిణీ చేసే కార్యక్రమంలో కూటమి నాయకులు కుమ్ములాడుకున్నారు. టీడీపీ, జనసేన నాయకులు కాలర్లు పట్టుకుని వాగ్వాదానికి దిగారు. ఉప్పాడ సచివాలయం వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే.. వాతావరణంలో మార్పుల కారణంగా ఉప్పాడ తీర ప్రాంతంలో ఇటీవల సముద్రం అలలు ఎగసి పడి గ్రామంలోకి నీరు చేరింది. దీంతో ప్రభుత్వం ఆ ప్రాంతంలోని మత్స్యకారులకు బియ్యం పంపిణీ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. ఆ మేరకు గురువారం ఉప్పాడ గ్రామ సచివాలయం వద్ద తహసీల్దార్ చిన్నారావు ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి పిఠాపురం నియోజవర్గ జనసేన ఇన్చార్జి మర్రెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే బియ్యం పంపిణీపై తమకు సమాచారం ఇవ్వకుండా నిర్వహించడం ఏమిటంటూ టీడీపీ నాయకులు వాగ్వాదానికి దిగారు. కనీసం అధికారులు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా జనసేన పార్టీ నాయకులకే చెప్పడమేమిటంటూ ప్రశ్నించారు. దీంతో టీడీపీ, జనసేన నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. మర్రెడ్డి శ్రీనివాస్ ఎదురుగానే కాలర్లు పట్టుకుని తోసుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి, సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అయితే తమకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పి, ఇప్పుడు రేషన్ బియ్యం ఇస్తున్నారంటూ మత్సకారులు మండిపడ్డారు. వాటిని తీసుకునేందుకు నిరాకరించారు. టీడీపీ, జనసేన నాయకుల వాగ్వాదం ఉప్పాడ సచివాలయం వద్ద ఘటన పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన వివాదం -
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అవగాహన
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రం పరిధిలోని ఉమ్మడి జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలలో పదోన్నతి పొందిన ఎంపీడీఓల శిక్షణ కొనసాగుతోంది. గత నెల 28న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెల 26 వరకూ నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం విస్తరణ శిక్షణ కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించారు. చనిపొయిన వారితో పాటు గ్రామాన్ని విడిచి వెళ్లిన వారిని గుర్తించి తగిన ఆధారాలతో వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలన్నారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని సూచించారు. దివ్యాంగులు పోలింగ్ బూత్లలోకి వచ్చేలా ర్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. 650 మంది ఓటర్లు మించిన సమయంలో మాత్రమే రెండవ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. -
రత్నగిరి విశ్రాంత ఈఓ పెన్షన్లో 25 శాతం కోత
● 1998–99లో అక్రమ కొనుగోళ్లపై అభియోగాలు ● విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదించిన ఏసీబీ ● ట్రిబ్యునల్ తీర్పుతో దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలు అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయంలో గతంలో ఈఓగా పని చేసిన ఎన్.సోమశేఖర్ అవినీతికి పాల్పడినట్టు వచ్చిన అభియోగాలపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మేరకు ఆయన పెన్షన్లో 25 శాతం కోత విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వి.వినయ్చంద్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. 1998–99 కాలంలో ఆయన ఈఓగా ఉన్న కాలంలో టెండర్ పిలవకుండా నిబంధనలకు విరుద్ధంగా సత్యదేవుని వెండి స్టాండ్లు, క్యాలెండర్లు, గ్రీటింగ్ కార్డులు కొనుగోలు చేసినట్టు, మరో 17 అంశాలలో అవినీతికి పాల్పడినట్టు ఆయనపై, మరో 53 మంది సిబ్బందిపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఏసీబీ అధికారులు విచారణ జరిపి ఆయన చర్యల వల్ల దేవస్థానానికి ఆర్థికంగా నష్టం వాటిల్లిందని, ఆయనపై చర్య తీసుకోవాలని 2018లో ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై ట్రిబ్యునల్ షోకాజ్ నోటీసు జారీ చేస్తూ ఆయన పెన్షన్లో 25 శాతం కోత విధిస్తున్నట్లు పేర్కొంది. ఈ ఆదేశాలపై సోమశేఖర్ బదులిస్తూ దేవస్థానంలో 20 ఏళ్లుగా కొనసాగుతున్న విధానం మేరకే తాను వాటిని కొనుగోలు చేశానని, వాటిని దేవదాయశాఖ కమిషనర్ సైతం ఆమోదించారని పేర్కొన్నారు. ఆ చర్యల వల్ల ఆలయానికి ఆర్థిక నష్టం జరగలేదని పేర్కొన్నారు. తాను 2013లో పదవీ విరమణ చేశానని, ఈ అభియోగాల వల్ల తన పెన్షన్ ప్రయోజనాలు అందడం లేదని, తనపై అభియోగాలు తొలగించి పూర్తి పెన్షన్ ఇవ్వాలని కోరారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆయన విజ్ఞప్తిని తోసిపుచ్చి ట్రిబ్యునల్ తీర్పు మేరకు పెన్షన్లో 25 శాతం కోత విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ అభియోగాలపై జరిగిన విచారణలో 31 మందికి క్లీన్చిట్ ఇవ్వగా, 22 మందిపై విచారణ కొనసాగుతున్నట్లు ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. -
వనదుర్గమ్మకు త్వరలో ఖడ్గమాల పూజ
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామి దేవస్థానంలో వన సంరక్షురాలిగా, రత్నగిరి వనదేవతగా పూజలందుకుంటున్న వనదుర్గ అమ్మవారి ఆలయంలో మరో పూజను ప్రారంభించేందుకు దేవస్థానం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రతి శుక్రవారం ఈ ఆలయంలో నిర్వహిస్తున్న చండీహోమం, ప్రతి పౌర్ణమి, అమావాస్యకు నిర్వహిస్తున్న ప్రత్యంగిర హోమాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో ప్రతి శుక్రవారం ఖడ్గమాల పూజ ప్రారంభించనున్నట్లు దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు తెలిపారు. ఆ రోజు ఉదయం 7.30 నుంచి 8.30 వరకూ జరిగే ఈ పూజలో పాల్గొనడానికి టిక్కెట్ ధరను రూ.1.116గా నిర్ణయించారు. విజయవాడలో మాదిరిగానే.. దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వనదుర్గ ఆలయ అర్చకుడు అమ్మవారికి ఈ పూజ నిర్వహిస్తారు. భార్యాభర్తలు అమ్మవారికి ఎదురుగా కూర్చుని అర్చకుడు చెప్పిన సూచనల ప్రకారం మంత్రాలు చదువుతూ శ్రీచక్రంపై పసుపు, కుంకుమ, ఇతర ద్రవ్యాలతో ఈ పూజ చేస్తారు. అనంతరం దంపతులకు అమ్మవారి కుంకుమ, రాగి ప్రతిమ, కండువా, రవికల వస్త్రం, 250 గ్రాముల పులిహోర ప్రసాదం అందజేస్తారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహించే ఖడ్గమాల పూజ మాదిరిగానే ఇక్కడ కూడా జరుగుతుంది. కాగా.. ఖడ్గమాల పూజపై సలహాలు, సూచనలు ఇవ్వాలని భక్తులు, గ్రామస్తులను దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు కోరారు. ఈ నెల 31వ తేదీ లోపు ఈ నంబర్లకు (98484 81536, 98493 63217, 94907 12066)కు తెలియజేయాలని కోరారు. అలాగే కార్యనిర్వాహణాధికారి, వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం, అన్నవరం, శంఖవరం మండలం, కాకినాడ జిల్లా చిరునామాకు, e ndow-eoanna@gov.inకు మెయిల్ ద్వారా సలహాలు, సూచనలు తెలియజేయాలని కోరారు. ప్రతి శుక్రవారం నిర్వహించేందుకు దేవస్థానం సన్నాహాలు టిక్కెట్ ధర రూ.1,116గా నిర్ణయం భక్తుల సలహాలు కోరిన అన్నవరం ఈవో -
పవిత్ర క్షేత్రాల్లో ఆధ్యాత్మిక యాత్ర
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): పవిత్ర క్షేత్ర సందర్శనలే లక్ష్యంగా ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టినట్టు ఇండియన్ రైల్వేస్ సౌత్ స్టార్ రైల్, టూర్ టైమ్స్ డైరెక్టర్ విఘ్నేష్ జీ తెలిపారు. కాకినాడ ప్రెస్ క్లబ్లో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. యాత్ర సెప్టెంబర్ 9వ తేదీన ప్రారంభం అవుతుందన్నారు. గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, హైదరాబాద్, కాజీపేట స్టేషన్లలో యాత్రికులు రైలు ఎక్కే వీలుందన్నారు. ఈ యాత్ర పదిహేను రోజులు సాగుతుందన్నారు. ఇండియన్ రైల్వేస్, భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు, సౌత్ స్టార్ రైలు, భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన అగ్రశ్రేణి టూరిస్ట్ రైలు ఆపరేటర్ ‘టూర్ టైమ్స్’ ఈ యాత్రకు నడుం బిగించిందన్నారు. ఈ యాత్రలో ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ద్వారక, సిద్ధపూర్, మధుర, అయోధ్య, ప్రయాగ్రాజ్, వారణాసి, గయ వంటి పవిత్ర పుణ్యక్షేత్రాల దర్శించుకునే వీలుంటుందన్నారు. గతంలో ఇండియన్ రైల్వేస్ టూర్ టైమ్స్ ప్యాకేజీకి విశేష స్పందన లభించిందన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి 650 మంది యాత్రికులతో విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా టూర్ టైమ్స్ జనరల్ మేనేజర్ సంతోష్ మాట్లాడుతూ ప్రాచీన గ్రంథాలు, పురాణాల ప్రకారం ఈ యాత్రలో ఉన్న క్షేత్రాలు ఎంతో పేరుగాంచాయన్నారు. ఈ రైలు లోపల, బయట దక్షిణ భారత భోజనం అందుబాటులో ఉంటుందన్నారు. లగేజీ భారం ఉండదన్నారు. దర్శనానికి అవసరమైన బ్యాగ్ మాత్రమే మోయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ ప్యాకేజీపై ఇండియన్ రైల్వే 33 శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు. అనంతరం యాత్ర పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ యాత్ర టికెట్లను 93550 21516 నంబర్కు ఫోన్చేసి బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ సమావేశంలో టూర్ టైమ్స్ మేనేజర్ యాకేశ్ పాల్గొన్నారు. -
ఫార్మా – అకడమిక్లతో స్థిరమైన అభివృద్ధి
రాజానగరం: ఔషధ పరిశ్రమ ఆవిష్కరణలపై అభివృద్ధి చెందుతుందని, పరిశోధన సామాజిక అవసరాలను తీర్చినప్పుడు విద్యారంగం ఔచిత్యాన్ని పొందుతుందని, ఫార్మా – అకడమిక్ ఈ రెండు స్థిరమైన అభివృద్ధికి అవసరమని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. ‘ఫార్మా – అకడమిక్ సినర్జీ ఫర్ సస్టైనబుల్ గ్రోత్’ అనే అంశంపై గురువారం వర్సిటీలో ఇంటర్నేషనల్ వర్క్షాప్ జరిగింది. స్థిరమైన ఆవిష్కరణలను పెంపొందించడానికి ఫార్మాస్యూటికల్ పరిశ్రమ, విద్యా పరిశోధన కలిసే అత్యాధునిక అవకాశాలు, సహకార మార్గాలను కనుగొనవచ్చన్నారు. ఇటువంటి వర్క్షాప్లను అంతరాలను తగ్గించడం, అర్థవంతమైన సంభాషణ లక్ష్యంగా నిర్వహించాలన్నారు. అమెరికా నుంచి ఫార్మాస్యూటికల్స్ క్వాలిటీ అస్యూరెన్స్ డైరెక్టర్ డాక్టర్ విష్ణు మారిశెట్టి ఆన్లైన్లో ‘ఫార్మా అకడమిక్ సినర్జీ ఫర్ సస్టైనబుల్ గ్రోత్’ పై పవర్పాయింట్ ప్రజెంటేషన్ అందించారు. సదస్సుకు కన్వీనర్గా డాక్టర్ బి. జగన్మోహన్రెడ్డి, కోకన్వీనర్గా డాక్టర్ కె.దీప్తి వ్యవహరించారు. -
బాలికల హాకీ పోటీలకు సర్వం సిద్ధం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడలోని డీఎస్ఏ మైదానంలో జాతీయస్థాయి జూనియర్ బాలికల హాకీ పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యియి. మైదానంలోని హాకీ టర్ఫ్పై శుక్రవారం నుంచి ఈ నెల పదో వరకూ ఈ పోటీలు జరుగుతాయి. 2022లో బాలికల విభాగంలో జూనియర్ నేషనల్ పోటీలను ఇక్కడ నిర్వహించారు. 2023లో సీనియర్ నేషనల్స్ బాలికల విభాగంలో జరిగాయి. ఇప్పుడు మూడోసారి జూనియర్ బాలికల జాతీయ స్థాయి హాకీ పోటీలకు రంగం సిద్ధమైంది. సుమారు రూ.20 లక్షల బడ్జెట్తో వీటిని నిర్వహిస్తున్నారు. 29 రాష్ట్రాల క్రీడాకారుల రాక ఈ పోటీల్లో 29 రాష్ట్రాలకు చెందిన 522 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. వారితో పాటు 58 మంది కోచ్లు, మేనేజర్లు, స్థానిక అఫీషియల్స్తో కలిపి సుమారు 660 మంది హాజరవుతున్నారు. పోటీల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన కమిటీకి అధ్యక్షుడిగా హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణక్య రాజ్, నిర్వహణ కార్యదర్శిగా జి.హర్షవర్ధన్, సంయుక్త నిర్వహణ కార్యదర్శిగా కాకినాడ జిల్లాకు చెందిన వి.రవిరాజు వ్యవహరిస్తున్నారు. కలెక్టర్ షణ్మోహన్ స్వీయ పర్యవేక్షణలో జేసీ రాహుల్ కుమార్.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులకు వసతి, భోజన సదుపాయాలు కల్పించారు. పూల్– ఎలో జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, పూల్ –బిలో మధ్యప్రదేశ్, పంజాబ్, చంఢీఘడ్, పూల్ –సిలో హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, బెంగాల్, పూల్ –డిలో ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడుతున్నాయి. నేటి నుంచి పదో తేదీ వరకూ నిర్వహణ కాకినాడ డీఎస్ఏ మైదానంలోపూర్తయిన ఏర్పాట్లు -
అన్నవరం ఈఈకిఅదనపు బాధ్యతలు
అన్నవరం: స్థానిక వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్) వి.రామకృష్ణకు సింహాచలం దేవస్థానం ఈఈగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. గత మే నెలలో సింహాచలం దేవస్థానంలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన దుర్ఘటనలో అక్కడ ఈవోతో పాటు ఈఈని ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈఈ స్థానంలో అన్నవరం దేవస్థానం ఈఈ రామకృష్ణకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇకపై రెండు దేవస్థానాలలో ఆయన సేవలు అందిస్తారు. యువకుడిపై పోక్సో కేసు అల్లవరం: బాలికను ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేసిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. అల్లవరం మండలంలోని టిడ్కో భవనాల్లో నివాసం ఉంటున్న బాలికను అయినవిల్లి మండలం మాగం గ్రామానికి చెందిన నవుండ్రు రాకేష్ ప్రేమిస్తున్నానని వెంటపట్టాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. తీరా పెళ్లి చేసుకోవాలని అడగ్గా నిరాకరించడంతో ఆ బాలిక అల్లవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్సై సంపత్ కుమార్ కేసు నమోదు చేశారు. ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య రాజమహేంద్రవరం రూరల్: మానసిక రుగ్మతతో బాధపడుతున్న ఓ మహిళ ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. హుకుంపేట డి బ్లాక్ రామాలయం వీధి తూర్పుపేటకు చెందిన బత్తిన అప్పాయమ్మ (42) కొంతకాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఇంటిలోని ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు దోసకాయలపల్లికి చెందిన దుర్గారావు సంఘటనా స్థలానికి చేరుకుని అప్పాయమ్మను రాజమహేంద్రవరంప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. దుర్గారావు ఫిర్యాదు మేరకు బొమ్మూరు ఎస్సై కె.రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఐసీడీఎస్ పీడీగా లక్ష్మి
కాకినాడ క్రైం: జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సాధికారిత అధికారి(ఐసీడీఎస్ పీడీ)గా చెరుకూరి లక్ష్మి గురువారం కాకినాడ గాంధీనగర్లోని ఐసీడీఎస్ పీడీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. రాజానగరం సీడీపీవోగా పనిచేస్తూ రాజమహేంద్రవరం ఇన్చార్జి పీడీగా అదనపు బాధ్యతల్లో కొనసాగుతున్న ఆమెకు తాజాగా పదోన్నతి లభించింది. ప్రభుత్వం ఆమెను కాకినాడ జిల్లా ఐసీడీఎస్ పీడీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పీడీ లక్ష్మిని మిషన్ వాత్సల్య డీసీపీవో వెంకట్ ఆధ్వర్యంలో బృందం కలిసి అభినందనలు తెలిపింది. అనంతరం శాఖ సిబ్బందితో పీడీ సమీక్ష నిర్వహించారు. -
ఫ్రీ జర్నీకి ప్రీ జర్క్లు!
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుకు సన్నద్ధమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఈ హామీ అమలుకు కాలయాపన చేస్తూనే వచ్చింది. సూపర్సిక్స్ అమలుపై ఎప్పటికప్పుడు వైఎస్సార్ సీపీ నిలదీస్తుండటంతో చేసేది లేక అమలుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలనే అంశం గుర్తుకొచ్చింది. ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు చేస్తామంటూ మంత్రులు ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అమలుపై పూర్తి స్థాయిలో స్పష్టత కరవైంది. జిల్లాలో ఇప్పటికే బస్సుల కొరత తీవ్రంగా ఉంది. దీంతో పాటు 25 గ్రామాలకు పైగా ఆర్టీసీ బస్సులు వెళ్లడం లేదు. గ్రామీణ ప్రాంతాలకే కాకుండా పట్టణ ప్రాంతాలకు సైతం సౌకర్యం ఉండటం లేదు. దీనికితోడు జిల్లా పరిధిలోనే ప్రయాణానికి అనుమతులు ఇస్తారా? ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందా?. అన్న విషయమై మీమాంస నెలకొంది. ఇందుకు సంబంధించి పూర్తి మార్గదర్శకాలు వెలువరిస్తామన్న ప్రభుత్వం, అధికారులు నేటికీ విడుదల చేయకపోవడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది.జిల్లాలో మాత్రమే?ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కేవలం జిల్లాకు పరిమితం చేస్తారన్న వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం విభజిత జిల్లా పరిధిలో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. జిల్లా దాటితే టిక్కెట్ తీసుకోవాల్సి ఉంది. మరోవైపు ఒక మహిళ రోజుకు ఒకసారి మాత్రమే ప్రయాణించేలా నిబంధనలు తీసుకురానున్నట్లు తెలిసింది. దీన్ని బట్టి చూస్తుంటే పథకం అమలులో ఆంక్షలు పెడతారన్న విషయం తేటతెల్లం అవుతోంది. మరోవైపు పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగులో ఉచిత ప్రయాణానికి వీలుంటుందన్న మరో వాదన వినిపిస్తోంది.ఆదాయం రాని మార్గాల్లో పల్లె వెలుగు కట్ఆదాయం రాని మార్గాల్లో పల్లె వెలుగు బస్సులను నిలుపుదల చేయాలని భావిస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు తిప్పలు తప్పవు. ఇప్పటికే 25 మార్గాల్లో పల్లె వెలుగు బస్సులు నడవడం లేదు. ఉన్న పల్లె వెలుగు సర్వీసులు ఉచిత స్కీమ్కు వినియోగిస్తే జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు బస్సులు తగ్గుతాయని భావిస్తున్నారు.కొన్ని బస్సుల్లోనే ఉచితంఎన్నికల సమయంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ హామీ ఇచ్చారు. అయితే పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్లు, మెట్రో సర్వీసులు, టౌన్ సర్వీసుల్లో మాత్రమే ఉచితంగా మహిళలు ప్రయాణం చేసేందుకు అవకాశం కల్పిస్తామని చెబుతున్నారు.రాష్ట్రమంతా అన్నారు..సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలన్న తలంపుతో కూటమి నేతలు ప్రతి ఇంటికీ తిరిగారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రమంతా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక మాట మార్చుతున్నారు. కేవలం పల్లె వెలుగు, అల్ట్రా బస్సుల్లో మాత్రమే ఉంటుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి వెల్లడించారు. దీనిపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఎక్కడా పల్లెవెలుగు, ఆల్ట్రా డీలక్స్ బస్సులలో మాత్రమే ఉచితమని చెప్పలేదు. తీరా అధికారం చేపట్టిన అనంతరం చంద్రబాబు కుతంత్రం బహిర్గతమైందని మహిళలు ఆరోపిస్తున్నారు. చిరు వ్యాపారులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, విద్యార్థినులు పట్టణాలకు వెళ్లాలంటే ఎక్స్ప్రెస్, సూపర్ లగ్జరీ సర్వీసులు ఎక్కువగా ఉంటాయి. వాటిలో ప్రయాణ సదుపాయం ఇవ్వకపోతే ఉపయోగమేంటన్న ప్రశ్న వెల్లువెత్తుతోంది. ఇప్పుడున్న ఒకటి, అర పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణించడం కష్టమని పెదవి విరుస్తున్నారు.రద్దీ ఇలా..సగటున తూర్పుగోదావరి జిల్లాలో ప్రతి రోజూ 83,000 మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే మరో 10 నుంచి 20 శాతం మంది అధికంగా ప్రయాణించే అవకాశముందని ఆర్టీసీ అధికారులు వెల్లడిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా బస్సుల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి నివేదికలను ఇప్పటికే పంపారు. అయితే ఆ దిశగా బస్సుల సంఖ్య పెంచకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.కండీషన్ అంతంతమాత్రంగ్రామీణ జనాభా అధికంగా ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో ఆర్టీసీ సేవలు అంతంతమాత్రంగా ఉంటున్నాయి. డిపోలలో బస్సుల కొరత తీవ్రంగా ఉంది. ఉన్న బస్సుల్లో చాలా వరకు కండీషన్లో లేవు. డ్రైవర్, కండక్టర్ల పోస్టులు సైతం ఖాళీగా ఉన్నా ప్రభుత్వం వాటిని భర్తీ చేయడం లేదన్న విమర్శలున్నాయి.25 గ్రామాలకు చేరని బస్సుతూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 25 గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. రాజమహేంద్రవరం డిపో పరిధిలో 12, గోకవరం పరిధిలో 4, కొవ్వూరు 8, నిడదవోలు డిపో పరిధిలో 5 గ్రామాలకు బస్సు వెళ్లడం లేదు. ఆర్టీసీ బస్సు లేని గ్రామాల ప్రజల ఆటోలపై ఆధారపడుతున్నారు. ప్రధానంగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేయకపోవడంతో ఆటోలలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయా గ్రామాలకు ఆర్టీసీ బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తే ఉచిత బస్సు ప్రయోజనాలను మహిళలు పొందగలుగుతారు. లేకపోతే కూటమి ప్రభుత్వం ప్రచారానికి మాత్రమే ఈ పథకం అమలుకు పరిమితం అయినట్టు అనుకోవాలి.10 లక్షల మందికి 283 బస్సులుతూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రాజమహేంద్రవరం, గోకవరం, కొవ్వూరు, నిడదవోలు డిపోల పరిధిలో మొత్తం 283 బస్సులు ఉన్నాయి. అందులో పల్లెవెలుగు 167, ఆల్ట్రా 67, ఎక్స్ప్రెస్ 37 బస్సులు, 12 ఏసీ బస్సులు. ఇవి జిల్లా వ్యాప్తంగా ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. ఇప్పటికే ఆయా రూట్లలో బస్సులు తక్కువగా ఉండటం, రోడ్ల మరమ్మతులు చేపట్టకపోవడంతో ఆర్టీసీ సర్వీసులపై ఏడాదిగా విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణమంటే ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉంటుంది. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 18,32,332 ఉండగా.. అందులో పురుషులు 9,11,520 ఉన్నారు. సీ్త్రలు అత్యధికంగా 9,20,812 మంది ఉన్నారు. ప్రసుత్తం ఈ సంఖ్య మరింతగా పెరిగి 10 లక్షలకు పైగా ఉండే అవకాశం ఉంది. ఇంతమంది మహిళలున్న జిల్లాలో కేవలం 283 బస్సులకు మాత్రమే సదుపాయం కల్పించడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది.జిల్లాలో బస్సుల వివరాలు ఇలా...డిపో పల్లె ఆల్ట్రా ఎక్స్ప్రెస్వెలుగు డీలక్స్రాజమహేంద్రవరం 64 15 22గోకవరం 30 12 14కొవ్వూరు 42 0 1నిడదవోలు 31 0 0ప్రతి రోజూ 83,000 మంది ప్రయాణంజిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ 83,000 మంది ప్రయాణాలు సాగిస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఇందులో 30,000 మందికి పైగా మహిళలు ఉంటున్నారు. వీళ్లందరికీ బస్సులు ఏర్పాటు చేయడంపై అధికారుల్లో ఆందోళన నెలకొంది. నేటికీ స్పష్టమైన విధి, విధానాలు వెలువరించకపోవడంతో పథకం అమలుపై గందరగోళం నెలకొంది. -
స్వేచ్ఛగా మాట్లాడనివ్వరా..?
సాక్షి, రాజమహేంద్రవరం: ఎంపీ మిథున్రెడ్డితో ములాఖత్లో సైతం స్వేచ్ఛగా మాట్లాడనివ్వడం లేదు. ములాఖత్లో మా పక్కనే పోలీసులు ఉంటున్నారు. కనీసం ప్రశాంతంగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదని తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి ఆరోపించారు. లిక్కర్ కేసులో అక్రమ అరెస్టుకు గురై రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న ఎంపీ మిథున్రెడ్డితో శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు, ఎమ్మెల్యే ద్వారకానాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు బుధవారం ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయట ద్వారకనాథ్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. న్యాయ స్థానం ఆదేశాలిచ్చినా.. ఆర్డర్ ఇచ్చినా అన్ని విషయాల్లో పోలీసులు వేలు పెట్టి చూసే పరిస్థితి కనిపిస్తోందన్నారు. వైఎస్సార్ సీపీ నేతలు, ప్రజా ప్రతినిధులను టెర్రరిస్టులు, మావోయిస్టులను చూసినట్టు చూస్తున్నారని ఆవేదన చెందారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ప్రభుత్వానికి ఇది మంచిది కాదని హితవు పలికారు. ‘పెద్దిరెడ్డి కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. చంద్రబాబు ఆయన కొడుకులా మోసాలు చేస్తే ఇంతకన్నా బాగా ఉండే వాళ్లం. మాపై కక్ష సాధించే వాళ్లను కచ్చితంగా భగవంతుడు చూస్తాడు. ఇలాంటి కేసులు బనాయించి ఇబ్బంది పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదు. చార్జ్ షీట్లో కూడా మిథున్రెడ్డి పేరు లేదు. అయినా అరెస్టు చేశారు. చంద్రబాబు కంటే ముందు నుంచి మా కుటుంబం ఎంతో ఉన్నతంగా ఉంది. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు ఆయన మీడియా ఎన్నో కథలు చెప్పింది. మిథున్రెడ్డిని ఏ కారణంతో అరెస్టు చేశారో చెప్పలేకపోతున్నారు. సాధారణ వ్యక్తులు సైతం జైల్లో ప్రశాంతంగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. మేము వెళ్లినప్పుడు మాత్రం నలుగురు పోలీసులు ఉంటున్నారు. వసతులపై కోర్టు ఉత్తర్వులిచ్చినా తమకు అందలేదంటూ ఇబ్బందులు పెడుతున్నారు. అరెస్టు చేసేందుకు ఒక్క ఆధారం దొరకలేదు. ఏదో ఒక కేసు పెట్టి పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు.’ అని ఆవేదన చెందారు. మాజీ ఎమ్మెల్యే ప్రసాద్రాజు మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కరిని జైల్లో పెడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెట్టి అణగదొక్కాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ రాష్ట్రంలో విధ్వంసకర పాలన కొనసాగుతోందన్నారు. ప్రజల కష్టాలు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం పాలన సాగిస్తోంది. నియంత పోకడ అమలవుతోందని మండిపడ్డారు. అధికారంతో అణచి వేస్తామనే ధోరణి ప్రభుత్వంలో కనిపించడం దారుణమన్నారు. నియంతృత్వ పోకడలతోనే మిథున్రెడ్డిని అరెస్టు చేశారన్నారు. ములాఖత్లో సైతం పోలీసులు పక్కనే ఉంటున్నారు టెర్రరిస్టులు, మావోయిస్టులను చూసినట్లు చూస్తున్నారు మా కుటుంబంపై ఎందుకింత కక్ష? ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి ఎంపీ మిథున్రెడ్డితో శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు ములాఖత్ -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,000 గటగట (వెయ్యి) 24,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
వైఎస్సార్ సీపీ జిల్లా కమిటీలో పలువురు నియామకం
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులకు తూర్పుగోదావరి జిల్లా పార్టీ కమిటీలో వివిధ హోదాలలో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ తూర్పుగోదావరి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా కడియాల శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీగా దాసి వెంకటరావు, ఆర్గనైజేషనల్ సెక్రటరీలుగా ముప్పన శ్రీనివాస్, లక్కోజు ఓంకార్, యాక్టివిటీ సెక్రటరీలుగా తమ్మిశెట్టి శివప్రసాద్, దామదాసు శ్యాంసుందర్, ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్గా రొక్కం త్రినాథ్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గృహ నిర్మాణాల్లో పురోగతి ఉండాలి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘అందరికీ గృహం’ కార్యక్రమం కింద లబ్ధిదారులకు గృహ నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయడం ప్రభుత్వ ప్రాధాన్య లక్ష్యమని కలెక్టర్ పి.ప్రశాంతి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో హౌసింగ్ నిర్మాణాల లక్ష్యంలో దిగువ స్ధానంలో ఉన్న ఐదు మండల స్థాయి అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సీతానగరం, నల్లజర్ల, దేవరపల్లి, రాజానగరం, కడియం మండలాల పరిధిలో అదనపు ఆర్థిక సహాయం పొందిన 704 మంది లబ్ధిదారుల్లో150 ఇళ్లు మాత్రమే రూఫ్ లెవెల్ దశను చేరుకున్నాయని అన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్రెడ్డి, ఎంపీడీవోలు, హౌసింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
కాండ్రేగుల పాఠశాలలో అదనపు జిల్లా జడ్జి విచారణ
జగ్గంపేట: మండలంలోని కాండ్రేగుల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం 7వ అదనపు జిల్లా జడ్జి శ్రీమతి జి.చంద్రమౌళీశ్వరి విచారణ నిర్వహించారు. ఈ నెల 17వ తేదీన పాఠశాలలో ఏడు గురు విద్యార్థినులు అస్వస్థతకు గురి కావడం, వారికి ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రులలో చికిత్స అందించిన సంగతి తెలిసిందే. దీనిపై జిల్లా జడ్జి విచారణకు వచ్చి అస్వస్థతకు గురయినవిద్యార్థినులతోను, వైద్యం అందించిన డాక్టర్లతోనూ, విద్యార్థినులు తల్లిదండ్రు లతో ఆరోజు జరిగిన ఘటన గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విచారణ అనంతరం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. విద్యార్థినులకు కౌన్సెలింగ్ సెషన్ నిర్వహించాలని ఆమె మండల విద్యాశాఖాధికారికి సూచించారు. -
సహనానికి పరీక్ష
రాయవరం: పదో తరగతి అనేది విద్యార్థులకు అత్యంత కీలకమైన దశ. ఇక్కడ సాధించిన మార్కులే వారి ఉన్నత చదువులకు, మంచి ఉద్యోగాలు సాధించడానికి ఉపయోగపడతాయి. పాఠశాలల్లో విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే పదో తరగతి విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారిస్తారు. అయితే పదో తరగతి పబ్లిక్ పరీక్షలు తెలుగు, ఇంగ్లిషు మీడియాల్లో రాసుకోవచ్చా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే కొందరు విద్యార్థులకు ఇంగ్లిషులో రాయాలంటే బెరకుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు మాధ్యమాల్లో పరీక్షలు రాసుకునే అవకాశాన్ని ఇస్తే బాగుంటుందని విద్యావేత్తలు చెబుతున్నారు. రెండు నెలలైనా.. నూతన విద్యా సంవత్సరం జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఇప్పటికి దాదాపు రెండు నెలలు పూర్తి కావస్తోంది. అలాగే విద్యార్థులకు ఆగస్టు 4వ తేదీ నుంచి సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలు కూడా ప్రారంభం కానున్నాయి. అయితే ఇప్పుడు పది పరీక్షలు ఇంగ్లిషు మీడియంతో పాటు, తెలుగు మాధ్యమంలో నిర్వహిస్తారా, లేదా అనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటుగా, తల్లిదండ్రులకు వచ్చిన ఈ ప్రశ్నకు సమాధానం కరవవుతోంది. గత విద్యా సంవత్సరంలో జరిగిన పది పబ్లిక్ పరీక్షల్లో తెలుగులో రాసుకునే వెసులుబాటును ప్రభుత్వ పరీక్షల విభాగం కల్పించింది. ఈ విధంగా గత విద్యా సంవత్సరంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 211 మంది రెగ్యులర్ విద్యార్థులు, 15 మంది ప్రైవేటు విద్యార్థులు తెలుగు మీడియంలో పరీక్షలు రాశారు. వీడని ఉత్కంఠ ప్రస్తుత విద్యా సంవత్సరంలో కూడా పది పరీక్షలను తెలుగు మీడియంలో రాసుకునే వెసులుబాటు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నందున స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. పాఠ్య పుస్తకాలను బైలింగ్విల్ విధానంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. బోధన రెండు భాషల్లోనూ వివరిస్తుండగా, పరీక్షలు మాత్రం ఇంగ్లిషు మీడియంలోనే రాయాల్సిన పరిస్థితి ఉంది. ఈ స్థితిలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తెలుగు మీడియంలో పరీక్షలకు అవకాశం కల్పిస్తారా, లేదా అనే ప్రశ్న వేధిస్తోంది. ప్రధానంగా పదో తరగతి విద్యార్థులు ఈ విషయమై ఉత్కంఠను ఎదుర్కొంటున్నారు. జిల్లాల వారీగా.. ప్రస్తుతం కోనసీమ జిల్లాలో ఈ విద్యా సంవత్సరంలో 19,850 మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్నారు. ప్రభుత్వ పరీక్షల విభాగం అక్టోబర్ చివరి వారంలో పరీక్ష ఫీజు కట్టించుకునేందుకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఈలోగా ఈ సంఖ్య కొంతమేర పెరిగే అవకాశం ఉంటుంది. వీటిలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 12,923 మంది విద్యాభ్యాసం చేస్తుండగా, 6,927 మంది విద్యార్థులు ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 26,898 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతుండగా, వారిలో ప్రభుత్వ పాఠశాలల్లో 13,600 మంది, ప్రైవేటు పాఠశాలల్లో 13,298 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో 30,441 మంది విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో 18,463 మంది, ప్రైవేటు స్కూళ్లలో 11,978 మంది చదువుతున్నారు. స్పష్టత ఇస్తారా..గతేడాది చివరి క్షణంలో తెలుగు మీడియంలో పరీక్షలు రాసుకోవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో గతంలో మాదిరిగా చివరి క్షణాల్లో చెప్పకుండా ముందుగానే స్పష్టత ఇస్తే ప్రయోజనకరంగా ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ విషయాన్ని ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువస్తుండడంతో ఏమి చెప్పాలో వారికి కూడా తెలియని పరిస్థితి. ప్రభుత్వ పరీక్షల విభాగం ఈ విషయంలో స్పష్టత ఇచ్చి ఉత్కంఠకు ముగింపు పలకాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. పదో తరగతి విద్యార్థుల అయోమయం తెలుగు మీడియంలో పరీక్ష రాసే విషయంపై స్పష్టత కరవు గతేడాది అవకాశం ఈసారి ఇస్తారో, లేదో?రెండు మాధ్యమాల్లో అవకాశమివ్వాలి పదో తరగతి విద్యార్థులు తెలుగు, ఇంగ్లిషు మీడియాల్లో పబ్లిక్ పరీక్షలు రాసుకునేందుకు అవకాశమివ్వాలి. ఇంగ్లిషు మీడియంలో రాయడానికి కొందరు విద్యార్థులు భయపడుతున్నారు. వారి ఇష్టానికి ప్రాధాన్యమివ్వాలి. – పి.సురేంద్రకుమార్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఉత్తర్వులు రావాలి గత విద్యా సంవత్సరం మాదిరిగా రెండు మీడియాల్లో పదో తరగతి పరీక్షలు రాసుకునే వెసులుబాటుపై ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి ఉత్తర్వులు రావాలి. అవి వస్తేనే విద్యార్థులకు ఆ అవకాశం ఉంటుంది. – బి.హనుమంతరావు, అసిస్టెంట్ కమిషనర్, ప్రభుత్వ పరీక్షల విభాగం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముందుగానే ప్రకటించాలి ఆగస్టులో సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో ముందుగానే పది పరీక్షల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలి. ప్రభుత్వం ఈ విషయంలో చొరవ చూపించాలి. తెలుగు, ఇంగ్లీషు మీడియంలో విద్యార్థులుపరీక్షలు రాసుకునేలా అవకాశమివ్వాలి. – ఎస్ఎస్ పల్లంరాజు, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
వానపల్లిలో క్షుద్ర పూజల కలకలం!
కొత్తపేట: వానపల్లి గ్రామంలోని ఒక ఇంట్లో క్షుద్ర పూజలు చేస్తున్నారన్న వదంతులపై కలకలం రేగింది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. వానపల్లి గాంధీ బొమ్మ సెంటర్లో నలుగురు అన్నదమ్ములకు చెందిన ఇల్లు ఉంది. ప్రస్తుతం ఆ ఇంట్లో నలుగురిలో పెద్దాయన కుమారుడు ఒక్కడే ఉంటున్నాడు. అతడికి వివాహం కాలేదు. కాగా.. నాలుగు రోజులుగా ఆ ఇంట్లో రహస్యంగా పూజలు నిర్వహిస్తున్నట్టు సమీపంలోని ప్రజలు గమనించారు. ఆ నోటా ఈ నోటా గ్రామమంతా ప్రచారం జరిగింది. దీంతో బుధవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామ వీఆర్వో లంక వెంకట నాగరాజు, పోలీసు కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్న అనంతరం గ్రామస్తులు మూకుమ్మడిగా ఆ ఇంటిని చుట్టుముట్టి లోపలకు ప్రవేశించారు. అక్కడ ఒక గదిలో సుమారు మీటరు నలుచదరంలో సుమారు 30 అడుగుల లోతు గొయ్యి తవ్వి ఉంది. దానిలో పూజా సామగ్రితో పాటు, దిగటానికి నిచ్చెన, తాడు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్న వ్యక్తులను ఇదేమిటని గ్రామస్తులు నిలదీశారు. దానితో ఆ ఇంటికి చెందిన వ్యక్తి మొదట బాత్రూమ్కు తవ్వుతున్నామని, తర్వాత ఎముకలు ఉన్నాయని, తవ్వి తీసేయమని సిద్ధాంతి చెప్పారని అన్నాడు. ఎముకలు ఎక్కడ అని ప్రశ్నించగా, బయట పారేశామన్నారు. రంపచోడవరం, రాజమహేంద్రవరం నుంచి నలుగురిని తీసుకువచ్చి, ఈ గొయ్యి తవ్వినట్టు తెలుస్తోంది. అమలాపురానికి చెందిన ఒక వ్యక్తితో అక్కడి పూజ చేయిస్తున్నట్టు సమాచారం. దీనితో ఆరుగురిని అదుపులోకి తీసుకుని కొత్తపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. దీనిపై ఎస్సై జి.సురేంద్రను ‘సాక్షి’ వివరణ కోరగా క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారన్న స్థానికుల అనుమానంతో పిర్యాదు చేశారని, విచారణ చేయాల్సి ఉందన్నారు. ఒక ఇంట్లో 30 అడుగుల లోతు గొయ్యి గ్రామస్తుల భయాందోళన ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు -
భార్యను చంపిన భర్త అరెస్టు
రాజానగరం: కట్టుకున్న భార్యను నాపరాయితో కొట్టి హతమార్చిన భర్తను అరెస్టు చేసి, రిమాండ్కు పంపించామని రాజమహేంద్రవరం నార్త్ జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ తెలిపారు. ఆయన బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఆ ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు శివారు సంతోష్ నగర్లో నివాసం ఉంటున్న నల్లమాటి లక్ష్మి పెద్ద కుమార్తె ఉషారాణికి నర్సీపట్నం సమీపంలోని గిడుతూరుకు చెందిన వేమగిరి మాణిక్యంతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వివాహం అనంతరం ఉపాధి కోసం అత్తింటికి వచ్చిన మాణిక్యం సంతోష్ నగర్లోనే వేరొక ఇంటిలో ఉంటూ వెల్డింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే భార్యపై అనుమానం పెంచుకుని, తరచూ గొడవ పడేవాడు. నెల రోజుల క్రితం ఇదే విషయమై రాజానగరం పోలీసులకు ఉషారాణి ఫిర్యాదు చేసింది. అయినా అతడిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో ఈ నెల 26 రాత్రి 11.30 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో మాణిక్యం తన భార్య తలపై నాపరాయితో కొట్టి పరారయ్యాడు. గమనించిన చుట్టుపక్కలవారు ఈ విషయాన్ని అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆమె తల్లి నల్లమాటి లక్ష్మికి సమాచారం ఇవ్వడంతో రక్తపు మడుగులో ఉన్న ఉషారాణిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లింది. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 12.40 గంటలకు చనిపోయింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాణిక్యాన్ని అరెస్టు చేసి బుధవారం రిమాండ్కి పంపించారని డీఎస్పీ వివరించారు. సమావేశంలో సీఐ వీరయ్యగౌడ్, సిబ్బంది పాల్గొన్నారు. -
కటకటాల్లోకి కీచక కరస్పాండెంట్
రాయవరం: మాచవరంలో బాలిక (విద్యార్థిని)ను గర్భవతిని చేసిన ప్రైవేట్ పాఠశాల కరస్పాండెంట్ ఆకుమర్తి జయరాజును బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. రాయవరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రైనీ డీఎస్పీ పి.ప్రదీప్తి ఆ వివరాలు వెల్లడించారు. మాచవరంలో మార్గదర్శి ఇంగ్లిషు మీడియం పాఠశాలను ఆకుమర్తి జయరాజు కరస్పాండెంట్గా ఉంటూ నిర్వహిస్తున్నాడు. ఇదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికపై కన్నేశాడు. ఈ ఏడాది మార్చి 26న ఆ బాలికను పాఠశాలలో తన ఆఫీసు రూమ్కు రప్పించుకుని అల్మరాలో ఉన్న ఫైల్స్ తీయాలని ఆదేశించాడు. బాలిక ఆ ఫైల్స్ తీస్తుండగా జయరాజు వెనుక నుంచి గట్టిగా పట్టుకోవడంతో బాలిక కేకలు వేసింది. దీంతో ఆమె నోరు నొక్కి, చంపేస్తానని బెదిరించి, అత్యాచారం చేశాడు. కాగా.. బాలిక శరీరంలో వస్తున్న మార్పులు గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా, ఐదు నెలల గర్భవతి అని తేలింది. బాలిక ద్వారా విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఈ నెల 28న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జయరాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని రామచంద్రపురం మండలం కొత్తూరు వద్ద అరెస్ట్ చేశారు. అలాగే నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ దొరరాజు, ఎస్సై సురేష్బాబులను ఆమె అభినందించారు. విలేకరుల సమావేశంలో మండపేట సీఐ పి.దొరరాజు, ఎస్సై డి.సురేష్బాబు పాల్గొన్నారు. రామచంద్రపురం మండలం కొత్తూరులో అరెస్టు వివరాలు వెల్లడించిన ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి -
వాడపల్లిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి క్షేత్రంలో అన్న ప్రసాదం, లడ్డూ, పులిహోర తయారీ, ఆర్వో వాటర్ ప్లాంట్లను బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడ భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. అలాగే లడ్డూ, పులిహోర ప్రసాదాలను విక్రయిస్తున్నారు. వాటి నాణ్యతను ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జీఏబీ నందాజీ, జిల్లా ఫుడ్స్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ వై.రామయ్య పరిశీలించారు. తయారీతో పాటు అక్కడ ఉన్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం అనంతరం వారికి వేద ఆశీర్వచనం అందించారు. కార్యక్రమంలో దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్య చక్రధరరావు పాల్గొన్నారు. -
అర్బన్ డెవలప్మెంట్ స్టాండింగ్ కౌన్సిల్గా ఆచార్యులు
కొత్తపేట: ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని వివిధ అర్బన్ డెవలప్మెంట్స్కు స్టాండింగ్ కౌన్సిల్గా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటకు చెందిన హైకోర్టు న్యాయవాది రామోజు నాగ వెంకట సత్య కామాచార్యులు (ఆర్కే ఆచార్యులు) నియమితులయ్యారు. ఆ మేరకు సెక్రటరీ లీగల్ అండ్ లెజిస్లేటివ్ ఎఫైర్స్ అండ్ జస్టిస్ జి.ప్రతిభాదేవి జారీ చేసిన నియామక ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అందజేశారని ఆచార్యులు బుధవారం విలేకరులకు తెలిపారు. రాజమహేంద్రవరం, కాకినాడ, ఏలూరు, అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు సంబంధించిన ఫిర్యాదులపై ప్రభుత్వం తరఫున స్టాండింగ్ కౌన్సిల్గా వ్యవహరిస్తానని తెలిపారు. నకిలీ పీఎఫ్ చలానాలపై విచారణకు ఆదేశంఅన్నవరం: స్థానిక వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ఇటీవల శానిటరీ కాంట్రాక్టర్ నకిలీ పీఎఫ్ చలానాలు ఇచ్చినట్టు వచ్చిన ఆరోపణలపై శాఖాపరమైన విచారణకు దేవదాయశాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాజమహేంద్రవరం ఆర్జేసీ వి.త్రినాథరావును విచారణ అధికారిగా నియమించారు. ఆయన ఆగస్టు ఆరో తేదీన అన్నవరం దేవస్థానికి వచ్చి విచారణ చేయనున్నారు. ఐదుగురి అరెస్ట్ సీతానగరం: మండలంలోని నల్గొండ శివారున గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురిని అరెస్టు చేశామని నార్త్ జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ తెలిపారు. సీతానగరం పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్గొండ శివారున ఉన్న మామిడి తోటల్లో అదే గ్రామానికి చెందిన చింతల గంగరాజు, బండారు అప్పన్న దొర, తొర్రేడుకు చెందిన తాటిపాక గణేష్, మురముండకు చెందిన నేరుమిల్లి అఖిల్, బొబ్బిల్లంకకు చెందిన పోలీన సాయి సతీష్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2.57 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీఆర్వో సమక్షంలో ఐదు ప్యాకెట్లులో ఉన్న గంజాయి, మోటారు సైకిల్, రూ.1,500 సీజ్ చేశారు. ఒడిశాలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి, ఇక్కడకు తీసుకువచ్చి చిన్న ప్యాకెట్లుగా తయారుచేసి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించడంతో సెంట్రల్ జైలుకు తరలించారు. -
మందుబాబుల జేబుగుల్ల
చాగల్లు, సాక్షి టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వంలో మందుబాబులను అడ్డంగా దోచుకుంటున్నారు. మద్యం ధరలు తగ్గించినా ఆ విషయాన్ని దాచిపెట్టి మందుబాబుల జేబులు గుల్లచేస్తున్నారు. చాగల్లు కేంద్రంగా జిల్లాలో పలు మండలాల్లోని మద్యం దుకాణాల్లో ఈ దందా జరుగుతోంది. అయినా ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నంద్యాల డిస్టలరీ నుంచి హెచ్డీ బ్రాండ్తో విడుదల అవుతున్న విస్కీతో ఈ మోసం జరుగుతోంది. నంద్యాల డిస్టలరీ నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని చాగల్లు డిపోకు వస్తున్న ఈ హెచ్డీ విస్కీని డీలర్లు అయిన కాడికి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. అందుకోసమే పెద్దగా ఆదరణ లేని హెచ్డీ విస్కీని ఒకే సారి కేసులకు కేసులు డీలర్లు కొనుగోలు చేస్తున్నారు. రూ.130 ఉన్న హెచ్డీ బ్రాండ్ విస్కీ బాటిల్ ఇటీవల రూ.120కు తగ్గింది. తగ్గిన ధర ప్రకారం బాటిల్పై ఎంఆర్పీ రూ.120గా ముద్రించాలి. కానీ ధర తగ్గినప్పటికీ బాటిల్పై లేబుల్లో మాత్రం ఇప్పటికీ ఎంఆర్పీ రూ.130గా ఉంటోంది. తగ్గిన ఎంఆర్పీకి అనుగుణంగా డిపో నుంచి హెచ్డీ బ్రాండ్ విస్కీని రూ.100కే డీలర్లకు సరఫరా చేయాలి. దాన్ని డీలర్ రూ.120కి విక్రయించాలి. అయితే డిపో నుంచి డీలర్లకు రూ.100కే లభిస్తున్నా మందుబాబులకు మాత్రం రూ.130కు విక్రయిస్తున్నారు. పాత లేబుల్ రూ.130తోనే హెచ్డీ విస్కీ బాటిళ్లను విక్రయిస్తున్న విషయం తెలిసినా ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం చూసీ చూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఈ బ్రాండ్కు పెద్దగా ఆదరణ లేకపోవడంతో అమ్మకాలు కూడా పెద్దగా ఉండవు. డిపో నుంచి రోజూ 30 నుంచి 40 కేసులు మాత్రమే వెళుతుంటాయి. ఇప్పుడు ఒకే రోజు 3,500 కేసులు మార్కెట్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. చాగల్లు డిపో పరిధిలోని కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు, జంగారెడ్డిగూడెం తదితర మండలాల్లోని సుమారు 105 షాపులలో సగానికి పైగా షాపులకు హెచ్డీ బాటిళ్లు సరఫరా చేశారు. హెచ్డీ విస్కీ ధర తగ్గిన వైనం కానీ పాత రేటుకే అమ్మకాలు చాగల్లు కేంద్రంగా అక్రమార్కుల దందా -
బడ్డీకొట్టు తొలగించేందుకు టీడీపీ నేత కుట్ర
నల్లజర్ల: కూటమి అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై మొదలైన వేధింపుల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. అధికారాన్ని అడ్డుగా పెట్టుకుని గ్రామాల్లో సైతం పేదలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. దూబచర్లలో బుధవారం జరిగిన ఈ ఘటన దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. డైట్ కళాశాలకు వెళ్లే దారిలో దొబ్బిడి పెద్దిరాజు సుమారు 15 ఏళ్లుగా పాన్షాపు పెట్టుకుని, అక్కడే కొబ్బరి బొండాలు విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే బుధవారం పంచాయతీ కార్యదర్శి తమ సిబ్బంది, పోలీసులతో వచ్చి ఆ బడ్డీకొట్టు తొలగించాలంటూ హంగామా చేశారు. దీంతో తమ జీవనాధారం పోతుందనే మనస్తాపంతో పెద్దిరాజు పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అతడిని తొలుత నల్లజర్ల తర్వాత మెరుగైన చికిత్స కోసం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంపై పెద్దిరాజు భార్య రాణి మాట్లాడుతూ తాము వైఎస్సార్ సీపీ సానుభూతిపరులమని తమ కొట్టు ఖాళీ చేయించడానికి కూటమి నాయకులు కుట్ర పన్నారన్నారు. ఆరు నెలల క్రితం టీడీపీ నాయకుడు తమ బడ్డీ వెనుక షాపు పెట్టారని, దానికి తమ బడ్డీ అడ్డుగా ఉందని తొలగించడం కోసం పంచాయతీ, పోలీసు సిబ్బందితో ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రహదారి పక్కనే ఉన్న ఆక్రమణలను తొలగించాలనుకుంటే గ్రామంలో అన్ని దుకాణాలను తీసివేయాలన్నారు. అంతేగానీ తమపై కక్ష కట్టి, కేవలం తమ బడ్డీకొట్టునే టార్గెట్ చేశారని ఆరోపించారు. దీనిపై గ్రామ కార్యదర్శి ఆషాలేఖ్యను వివరణ కోరగా ఆ రహదారిలో వెళ్లే లారీలకు ఆ బడ్డీకొట్టుపై ఉన్న చెట్టు కొమ్మలు అడ్డంకిగా ఉన్నాయన్నారు. వాటిని తొలగించాలని పలుమార్లు వారికి చెప్పిన వినకపోవడంతో, ఆ కొమ్మలు తొలగించడానికి మాత్రమే వెళ్లామని వివరణ ఇచ్చారు. పంచాయతీ సిబ్బంది, పోలీసుల హడావుడి ఆత్మహత్యాయత్నం చేసిన బాధితుడు వైఎస్సార్ సీపీ సానుభూతిపరుడు కావడంతో టార్గెట్ -
బంగారం వ్యాపారిపై దొంగల దాడి
పిఠాపురం: బంగారు, వెండి ఆభరణాలు తయారు చేసే వ్యాపారిపై దొంగలు దాడి చేసి, అతడి వద్ద ఉన్న వస్తువులను దోపిడీ చేశారు. చెందుర్తిలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. గొల్లప్రోలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరంలోని నల్లమందు సందుకు చెందిన సమీర్ ప్రజాపత్ భవాని అనే వ్యక్తి సిల్వర్ ప్యాలెస్ అనే వెండి, బంగారు నగల దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. ప్రతి రోజూ ఇతర ప్రాంతాల్లోని వెండి, బంగారు వ్యాపారుల నుంచి వచ్చిన ఆర్డర్ల ప్రకారం వస్తువులు తయారు చేయడం, వాటిని తీసుకెళ్లి వారికి ఇవ్వడం, మళ్లీ వారి నుంచి ఆర్డర్లు తీసుకోవడం, వారిచ్చే నగదుతో పాటు వెండి, బంగారం రావడం ఆయన పని. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు యజమాని చెప్పిన ఆర్డర్ల ప్రకారం వెండి వస్తువులను తీసుకుని పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలులోని షాపుల్లో ఇచ్చాడు. అక్కడి నుంచి ముడి వెండిని, వెండి వస్తువులను, బంగారాన్ని తీసుకుని గొల్లప్రోలులో పని ముగించుకుని చెందుర్తిలోని మరో బంగారు షాపు వద్దకు బయలుదేరాడు. మార్గం మధ్యలో జాతీయ రహదారి 216 నుంచి చెందుర్తి వెళ్లే రోడ్డులో పామాయిల్ తోట వద్దకు వచ్చే సరికి, రెండు మోటారు సైకిళ్ల మీద నలుగురు వ్యక్తులు వచ్చి అతడిని అడ్డుకున్నారు. భయభ్రాంతులకు గురిచేసి అతడి వద్ద ఉన్న 12.50 కేజీల వెండి, 51 గ్రాముల బంగారం, రూ.60 వేల నగదును బలవంతంగా లాక్కొని పరారయ్యారు. దీంతో బాధితుడు గొల్లప్రోలు పోలీసు స్టేషన్కు చేరుకుని విషయం తెలిపాడు. పిఠాపురం సీఐ శ్రీనివాస్, గొల్లప్రోలు ఎస్సై ఎన్.రామకృష్ణ, తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఏఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ పర్యవేక్షణలో కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నారు. ఆభరణాలు, నగదు లాక్కుని పరారీ చెందుర్తిలో కలకలం రేపిన ఘటన -
వేతన యాతన
జీతాలివ్వకపోతే ఎలా బతుకుతారు? పారిశుధ్య కార్మికులకు సక్రమంగా జీతాలివ్వకపోతే ఎలా బతుకుతారో ప్రభుత్వం ఆలోచించాలి. ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పాలకుల చేతుల్లో మోసపోవడం పరిపాటిగా మారుతోంది. ఏదో ఒక ఉద్యోగం దొరికిందని సంతోషపడాలో.. లేక సక్రమంగా జీతాలందక, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమై, అకాల మరణం పొందితే కనీస ఆర్థిక సహాయం కూడా అందక కుటుంబాలు రోడ్డున పడుతున్న దీనస్థితిని తలచుకొని బాధపడాలో తెలియని పరిస్థితి. వీరిని ప్రభుత్వోద్యోగులుగా గుర్తించాలి. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకిచ్చే వేతనాలను ప్రభుత్వం కాంట్రాక్టర్ ద్వారా ఇచ్చే విధానం వల్ల కొంత.. కాంట్రాక్టర్ వద్ద కొంత ఆలస్యం జరుగుతూండటంతో నెలల తరబడి జీతాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికై నా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీస వేతనం నెలకు రూ.28 వేలు ఇవ్వాలి. పారిశుధ్య కార్మికులకు సకాలంలో వేతనాలు ఇవ్వకపోతే వారి పక్షాన ఉద్యమం చేపడతాం. – ఈమని గ్రీష్మకుమార్, జిల్లా సహాయ కార్యదర్శి, ఐఎఫ్టీయూ ప్రతి నెలా చెల్లించాలి వేతనాల కోసం ప్రతి నెలా ఎదురు చూస్తూనే ఉంటున్నాం. నిడదవోలు ప్రభుత్వాస్పత్రిలో పదేళ్లుగా పారిశుధ్య కార్మికురాలిగా పని చేస్తున్నాను. సక్రమంగా జీతాలు ఇవ్వకపోవడంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంటోంది. కుటుంబ పోషణకు అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రతి నెలా జీతాలు వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. – కొడమంచిలి శారమ్మ, పారిశుధ్య కార్మికురాలు, నిడదవోలునిడదవోలు: ఇంట్లో ఎవరికై నా అనారోగ్యం వస్తే కుటుంబ సభ్యులే సరిగ్గా చూడని రోజులివి. వారికి పరిచర్యలు చేయాల్సి వస్తే మరింత యాతన. అటువంటి రోగులను కూడా సొంత మనుషుల కంటే మిన్నగా చూసుకునే బడుగు జీవులు వారు. జీవనోపాధి కోసం క్లిష్టమైన పరిస్థితులను సైతం సహిస్తూ ప్రభుత్వాస్పత్రుల్లో కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులుగా కొనసాగుతున్నారు. బండెడు చాకిరీ చేస్తున్న వారికిస్తున్న వేతనాలు గంపెడు కూడా ఉండవు. అది కూడా నెలల తరబడి బకాయి పెడుతూండటంతో నానా ఇక్కట్లూ పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. కష్టం ఎక్కువ.. వేతనం తక్కువ ప్రభుత్వాస్పత్రుల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు ఆ ప్రాంగణాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే కాదు.. రోగులను అక్కున చేర్చుకుని పరిచర్యలు చేస్తూంటారు. రోగులు వాంతులు, మలమూత్ర విసర్జన చేసుకున్నా అసహ్యించుకోకుండా శుభ్రపరుస్తారు. దగ్గరుండి బాత్రూములకు కూడా తీసుకువెళ్తారు. వేకువజామునే విధులకు హాజరై ఓపీ ప్రారంభించక ముందే వార్డులు, పరిసరాలను చీపుర్లతో నిత్యం శుభ్రం చేస్తారు. వాడి పడేసిన సిరంజులు, ఇంజెక్షన్లు, ప్రమాదకరమైన బయో మెడికల్ వేస్ట్ పదార్థాలను బయటకు తరలిస్తారు. శస్త్రచికిత్సలు చేయించుకున్న రోగులకు కుట్లు వేస్తున్న సమయంలో ఆ వ్యర్థాలను తీసుకువెళ్లి బయట పడేస్తారు. నెలంతా ఇంత చాకిరీ చేస్తున్న వారికి ఇస్తున్న వేతనం కోతలు పోనూ రూ.11,800 మాత్రమే ఉంటోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వాస్పత్రుల్లో 129 మంది పారిశుధ్య కార్మికులున్నారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో 89 మంది పని చేస్తూండగా వీరికి ఒక నెల జీతం బకాయి పెట్టారు. నిడదవోలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)లో ఆరుగురు కార్మికులకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. కొవ్వూరు ప్రభుత్వాస్పత్రిలో 13 మందికి రెండు నెలలుగా.. గోపాలపురం ప్రభుత్వాస్పత్రిలో మూడు నెలలుగా అనపర్తి సీహెచ్సీలో 13 మందికి రెండు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. ఇస్తున్నదే అరకొర వేతనం కాగా.. అది కూడా నెలల తరబడి బకాయి పెడుతూండటంతో కుటుంబ పోషణ భారంగా మారుతోందని ఈ బడుగు జీవులు గగ్గోలు పెడుతున్నారు. పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నప్పటికీ వారితో పోలిస్తే సగం జీతం కూడా వీరికి అందడం లేదు. ఒప్పందం ఉల్లంఘించి.. ప్రభుత్వాస్పత్రుల్లో పారిశుధ్య కార్మికుల నియామకానికి 2021లో టెండర్లు పిలిచారు. ఆ సందర్భంగా ఈఎస్ఐ, పీఎఫ్ పోను ప్రతి నెలా రూ.16 వేల జీతం చెల్లించేందుకు కాంట్రాక్టర్ ఒప్పందం చేసుకున్నారు. కానీ, పీఎఫ్, ఈఎస్ఐ పేరిట రూ.4,200 కట్ చేస్తున్నామని చెప్పి కొన్నాళ్లుగా నెలకు రూ.11,800 జీతం మాత్రమే చెల్లిస్తున్నారు. పీఎఫ్ కూడా సక్రమంగా ఇవ్వడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. నిడద వోలు ప్రభుత్వాస్పత్రిలో కార్మికులకు ఆరు నెలల పీఎఫ్ బకాయి పెట్టారు. పీఎఫ్, ఈఎస్ఐకి కట్ చేసుకుంటున్న మొత్తాన్ని తమ పేరిట చెల్లించడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. 12 శాతం సిబ్బంది జీతం నుంచి, 12 శాతం కాంట్రాక్టర్ పీఎఫ్కు జమ చేయాలి. కానీ, మొత్తం 24 శాతం తమ జీతం నుంచే కట్ చేస్తున్నారని, అది కూడా సక్రమంగా చెల్లించడం లేదని ఆరోపిస్తున్నారు. ఒకటో తారీకు వస్తోందంటే అల్ప వేతన జీవులకు భయం.. అరువు తెచ్చిన కిరాణా సరకులకు డబ్బులు కట్టాలి.. కూరగాయల పద్దు చెల్లించాలి.. పాల బకాయి ఇవ్వాలి.. ఇంకా పాత బాకీలుంటే తీర్చేయాలి.. అన్నీ పోనూ ఇంకా ఏవైనా మిగిలితే ఇతర చిల్లరమల్లర ఖర్చులకు కాస్త దాచుకోవాలి.. అనుకోని ఖర్చు మీద పడితే చేతిలో సొమ్ముంటే సరే.. లేకపోతే మళ్లీ అప్పోసొప్పో చేయాలి.. ఇదంతా ఎటువంటి ఆటంకమూ లేకుండా జరగాలంటే ప్రతి నెలా వచ్చే కొద్దిపాటి వేతనమైనా టైముకు రావాలి. అలా రాకపోతే వారి బతుకు బండి తలకిందులవక మానదు. ప్రభుత్వాస్పత్రుల్లో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులు అటువంటి దుస్థితినే ఎదుర్కొంటున్నారు. ఫ నెలల తరబడి అందని జీతాలు ఫ నెలకు రూ.16 వేలకు ఒప్పందం ఫ ఇస్తున్నది మాత్రం రూ.11,800 ఫ అది కూడా నెలల తరబడి పెండింగ్ ఫ ఆస్పత్రుల్లోని పారిశుధ్య కార్మికుల దుస్థితి -
ఫుల్ వసూల్
అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమ పథకాలను అందించనప్పటికీ, మద్యాన్ని మాత్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అన్నిచోట్లా మద్యం షాపులు ఏర్పాటు చేసింది. దీనికి తోడు విచ్చలవిడిగా పెరిగిన బెల్టుషాపులతో మద్యం ఏరులై ప్రవహిస్తోంది. ఈ షాపుల్లో అమ్మకాల ద్వారా అక్రమార్జన ఎడాపెడా జరుగుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో లైసెన్స్ మద్యం షాపులు 150 లోపు ఉంటే, బెల్ట్ షాపులు దానికి దాదాపు ఏడు రెట్లు పెరిగాయి. లైసెన్స్ దుకాణాల వద్ద పర్మిట్ రూమ్ల పేరుతో మద్యం అమ్మకాలు ఫుల్గా సాగుతున్నాయి. బెల్ట్ షాపుల ద్వారా అక్రమంగా సరకును అమ్మేస్తున్నారు. లైసెన్స్ మద్యం షాపులకు అనుబంధంగా బెల్ట్ షాపులు ఉండవని, ఒక వేళ బెల్ట్ షాపుల్లో మద్యం పట్టుబడితే, సంబంధిత లైసెన్స్ షాపునకు రూ.5 లక్షలు జరిమానా విధించడంతో పాటు లైసెన్స్ కూడా రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎకై ్సజ్ అధికారులు చేస్తున్న ప్రకటనలు ఆచరణలో అమలు కావడం లేదు. వెయ్యికి పైగా బెల్ట్ షాపులు జిల్లాలో అధికారికంగా 146 లైసెన్స్డ్ మద్యం షాపులు, 10 బార్లు ఉన్నాయి. ఈ 146 అధికారిక షాపులకు అనుసంధానంగా దాదాపు వెయ్యికి పైగా బెల్ట్ షాపులు అనధికారికంగా నడుస్తున్నాయి. కలెక్టర్ ఇటీవల జిల్లా ఎకై ్సజ్ అధికారులతో ఓ సమావేశం నిర్వహించారు. బెల్ట్ షాపులకు ఏ విధమైన ఆస్కారం లేకుండా మద్యం షాపుల ద్వారానే విక్రయాలు జరగాలని ఆదేశించారు. అయితే ఎకై ్సజ్ అధికారుల పర్యవేక్షణా వైఫల్యం, లైసెన్స్ మద్యం షాపుల వారితో లాలూచీ వంటి కారణాలతో జిల్లాలో బెల్ట్ షాపులకు కొదవ లేకుండా పోయింది. మామూళ్ల మత్తుతోనే పర్మిట్ రూమ్లను, బెల్ట్ షాపులను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు బాహటంగా వినిపిస్తున్నాయి. మామూళ్ల మత్తులో! ఎకై ్సజ్ అధికారులను బెల్ట్ షాపుల గురించి అడిగితే ఎక్కడ ఉన్నాయని ఎదురు ప్రశ్నించే స్థాయిలో ఉన్నారు. బెల్ట్ షాపుల నిర్వహణలో ఆరి తేరిన వారుంటే, అలాంటి వారిపై లైసెన్స్ షాపుల యాజమానులతో మాట్లాడి పరస్పర అంగీకారం, అవగాహనతో కొందరిపై బైండోవర్ కేసులు నమోదు చేయడం ఎకై ్సజ్ అధికారులకు పరిపాటైపోయింది. అయితే పొరుగున్న ఉన్న పాండిచ్చేరి, యానాం నుంచి అక్రమ మద్యాన్ని (నాన్ డ్యూటీ పెయిడ్) తరలిస్తుంటే అధికారులు మాత్రం అలాంటి మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తున్నారు. అయితే కాట్రేనికోన తదితర మండలాల్లో రిమోట్ గ్రామాల్లో కొన్ని మద్యం షాపులు ప్రైవేటు వేలం పాట పరమవుతున్నా పట్టించుకోరు సరికదా, అసలు తమకు తెలియనట్లే వ్యవహరిస్తున్నారు. లైసెన్స్ షాపుల నుంచి సంబంధిత అధికారులకు ప్రతి నెలా అందుతున్న మామూళ్లతో ఇలా జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. అక్రమంగా అమ్మకాలకు ప్రోత్సాహం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అవుట్ లెట్ల ద్వారా ప్రభుత్వమే పరిమితంగా మద్యం షాపులను నిర్వహిస్తే, ఈ కూటమి ప్రభుత్వం ప్రజల చేత మద్యాన్ని ఫుల్గా తాగించి అమ్మకాలను అయినకాడికి పెంచేసి, తద్వారా వచ్చే ఆదాయానికి ఆశపడి ఈ అడ్డదారులు తొక్కుతోంది. మద్యం విక్రయాలను అటు లైసెన్స్ షాపుల ద్వారా ఇటు బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్ల ద్వారా అదనంగా అమ్మేసి అక్రమార్జనకు పాల్పడుతోంది. ప్రజల జీవితాలు, ఆరోగ్యాలతో పనిలేదన్నట్లుగా, మద్యం అమ్మకాలే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ జిల్లాలో అక్రమ మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోంది. యథేచ్ఛగా మద్యం అమ్మకాలు పుట్ట గొడుగుల్లా బెల్ట్ షాపులు నిబంధనలు బేఖాతరు ఏరులై పారుతున్న మద్యం రూ.కోట్లలో అక్రమార్జన నకిలీ మద్యం కేసు గత టీడీపీ ప్రభుత్వంలో, ఇప్పటి కూటమి ప్రభుత్వంలో బెల్ట్ షాపులతో మద్యం అక్రమ అమ్మకాలు సాగితే, అల్లవరం మండలం కొమరిగిరపట్నంలో ఏకంగా నకిలీ మద్యం తయారీ కేంద్రం గుట్టురట్టు కావడంతో కోనసీమ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏసీ బ్లాక్ పేరుతో నకిలీ మద్యం తయారీ యూనిట్ను, ఈ అక్రమ వ్యాపారంలో పాత్రధారులను ఎకై ్సజ్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో సూత్రధారులైన పెద్దలను వదిలేసి పాత్రధారులైన చిన్న వారిని మాత్రమే అరెస్ట్ చేశారన్న విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. ఈ నకిలీ దందా ఇక్కడ నుంచి సాగుతూ కోనసీమలోని పలు బెల్ట్ షాపులకు నకిలీ మద్యాన్ని సరాఫరా చేశారన్న గుసగుసలు కూడా వినిపించాయి. కేవలం కేరామిల్ లిక్విడ్, స్పిరిట్తో నకిలీ మద్యాన్ని తయారు చేసి నకిలీ లేబుళ్లతో ఓ బాటిలింగ్ యూనిట్నే మెయింటెన్స్ చేస్తున్న ఈ నకిటీ ముఠా స్థావరాన్ని చూసి ప్రజలు అవాక్కయ్యారు. రూ.10 కోట్ల మేర ఈ నకిలీ మద్యం కేంద్రం నుంచి పక్కదారి పట్టిందని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ బాహటంగా స్పష్టం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో బెల్ట్ షాపుల కల్చర్ గత టీడీపీ ప్రభుత్వం కంటే రెట్టింపు అయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు. మందుబాబులకు పండగే జల్లా కేంద్రమైన అమలాపురంలోని ఎకై ్సజ్ కార్యాలయం సమీపంలోనే కొన్ని లైసెన్స్ షాపులకు పర్మిట్ రూమ్లు ఉన్నాయి. బారులతో సమాంతరంగా మద్యం షాపుల వద్ద కూడా మందుబాబులు ఫుల్గా తాగేస్తున్నారు. ఇక గుడి, బడి నిబంధనలను బెల్ట్ షాపుల నిర్వాహకులు అసలు పాటించడం లేదు. బెల్ట్ షాపు పెట్టడమే ఓ నేరమైతే గుడి, బడికి 200 మీటర్ల దూరంలో పెట్టడం మరో నేరం. ఉదాహరణకు అమలాపురం రూరల్ మండలం బండార్లంక గ్రామంలో ఇలా బడి, గుడి నిబంధనలకు నీళ్లొదిలి బెల్ట్ షాపులు వెలిశాయి. అమలాపురం రూరల్, అయినవిల్లి, అల్లవరం, ఉప్పలగుప్పం, కాట్రేనికోన మండలాలతో పాటు జిల్లాలో అసలు బెల్ట్ షాపుల లేని గ్రామాలు లేవంటే అతిశయోక్తి కాదు. -
దేవుడి పేరుతో ఇసుక దోపిడీ!
కొత్తపేట: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. నిబంధనలను అతిక్రమించి యథేచ్ఛగా తరలించేస్తున్నారు. చివరకు దేవుడి పేరును వాడుకుని మరీ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆత్రేయపురం అధికారిక ఇసుక ర్యాంపు సమీపంలో ప్రజల అవసరాల కోసం స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి ఇసుక నిల్వలు పెట్టారు. ఆ పాయింట్ నుంచి ఆదివారం రాత్రి అక్రమంగా ఇసుక రవాణాను ప్రారంభించారు. దీన్ని గమనించిన స్థానికులు సోమవారం రాత్రి మాటు వేసి ఇసుక రవాణాను అడ్డుకున్నారు. ఎందుకు ఇసుక తరలిస్తున్నారని గ్రామస్తులు నిలదీస్తే, వాడపల్లి వేంకటేశ్వరస్వామివారి క్షేత్రంలో అభివృద్ధి పనులకు తీసుకువెళుతున్నామని అక్రమార్కులు సమాధానం చెప్పారు. ఆలయానికి అయితే అర్థరాత్రి దొంగతనంగా తరలించడమేమిటి, పగటి పూటే తోలుకోవచ్చు కదా అని ప్రశ్నించడంతో ఇరు వర్గాల మాటామాటా పెరిగి వివాదం తలెత్తింది. ఈ లోపు పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను సముదాయించారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించాలని గ్రామస్తులు పట్టుపట్టగా, అది రెవెన్యూ అధికారుల పని అని చెప్పి, వాహనాలను అక్కడి నుంచి పంపించేశారని పలువురు స్థానికులు తెలిపారు. దీనిపై ఎస్సై రామును ‘సాక్షి’ వివరణ కోరగా అక్కడ గొడవపడుతున్నారనే సమాచారంతో రెవెన్యూ సిబ్బందితో కలిసి వెళ్లి ఇరువర్గాలను అక్కడి నుంచి పంపిచేశామని తెలిపారు. వాహనాలేమీ సీజ్ చేయలేదని స్పష్టం చేశారు. మండల స్థాయి నాయకుడి ఆగడాలు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక మండలంలో టీడీపీ నాయకులు ముఖ్యంగా ఒక మండల స్థాయి నాయకుడి ఆగడాలు, అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఆ నాయకుడి అక్రమ వ్యవహారాల్లో భాగంగానే గత నెల 16, 17 తేదీల్లో ఆత్రేయపురం చినపేట సమీపం నుంచి లంక భూముల్లోకి అక్రమంగా ర్యాంపు ఏర్పాటు చేసి మట్టి తరలించే ప్రయత్నాలు చేయగా స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేయడం, వారు స్పందించకపోవడంతో గ్రామస్తులే అడ్డుకున్నారు. అప్పట్లో వారి ప్రయత్నాలు తాత్కాలికంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. కూటమి నాయకుల అక్రమ దందా అడ్డుకున్న గ్రామస్తులు -
‘మాచవరం’ ఘటనపై కదిలిన యంత్రాంగం
రాయవరం: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకునేందుకు, అవసరమైన పక్షంలో మూసివేసేందుకు వెనుకాడబోమని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా హెచ్చరించారు. మాచవరంలోని మార్గదర్శి పాఠశాలలో బాలికను ఆ స్కూల్ కరస్పాండెంట్ గర్భవతిని చేసిన ఘటనపై మంగళవారం ఆయన విచారణ చేపట్టారు. రాయవరం ఎంఈవో–1 పి.రామలక్ష్మణమూర్తి ద్వారా ప్రాథమిక సమాచారం తెలుసుకున్న ఆయన హుటాహుటిన మాచవరం గ్రామానికి చేరుకున్నారు. ఆ స్కూల్లో ఎటువంటి అనుమతులు లేకుండా 8, 9, 10 తరగతులు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఒకటి నుంచి 7వ తరగతి వరకు 49 మంది విద్యార్థులు చదువుతున్నారని పాఠశాల రికార్డుల ద్వారా తెలుసుకున్నారు. పాఠశాలలో కనీస సౌకర్యాలు ముఖ్యంగా మరుగుదొడ్లకు తలుపులు కూడా లేకపోవడంపై డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం పాఠశాలలో విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. అలాగే బాలిక కుటుంబ సభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం పాఠశాల గుర్తింపును రద్దు చేసే విషయాన్ని కూడా పరిశీలిస్తామన్నారు. విచారణ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు ఇటువంటి పాఠశాలలను మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఈవోకు విన్నవించారు. ఆయన వెంట ఎంపీడీవో ఎన్.కీర్తి స్పందన, ఎంఈవోలు పి.రామలక్ష్మణమూర్తి, వై.సూర్యనారాయణ, సమగ్ర శిక్షా జీసీడీవో డాక్టర్ ఎంఏకే భీమారావు, ఏఎల్ఎస్ కో ఆర్డినేటర్ డి.రమేష్బాబు తదితరులు ఉన్నారు. ట్రైనీ డీఎస్పీ విచారణ మాచవరంలో బాలిక ఘటనపై ట్రైనీ డీఎస్పీ ప్రదీప్తి, మండపేట సీఐ పి.దొరరాజుతో కలిసి విచారణ చేపట్టారు. ఆ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో పాఠశాలలో నేర స్థలాన్ని పరిశీలించారు. మాచవరంలో ప్రైవేట్ పాఠశాలను కరస్పాండెంట్ ఆకుమర్తి షాజీ జయరాజ్ కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నాడు. పాఠశాలలో చదువుకోవడానికి వచ్చిన బాలికను లోబర్చుకుని, ఆమెను భయపెట్టి గర్భవతిని చేసినట్లుగా ప్రాథమిక విచారణలో అధికారులు గుర్తించారు. గతంలో కూడా పాఠశాలలో ఇలాంటి కొన్ని ఘటనలు జరగ్గా, పరువు పోతుందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా మిన్నకుండినట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. అయితే తమ కూతురికి జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదనే ఉద్దేశంతో బాలిక తండ్రి ఆ పాఠశాల కరస్పాండెంట్ షాజీ జయరాజుపై ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే రాయవరం ఎస్సై డి.సురేష్ బాబు సోమవారం రాత్రి జరిగిన ఘటనపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. డీఈవో సలీం బాషా విచారణ బాలిక తల్లిదండ్రులతో మాట్లాడిన వైనం ఘటనా స్థలాన్ని పరిశీలించిన ట్రైనీ డీఎస్పీ, సీఐ -
హజ్ కమిటీని రద్దు చేయాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ముస్లింల ధార్మిక పవిత్రతను మంటగలిపేలా, కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీని నియమించిందని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మొహమ్మద్ ఆరిఫ్ ఆరోపించారు. ధర్మపండితుల స్థానంలో పార్టీ కార్యకర్తలను నియమించడం హజ్ యాత్ర పవిత్రతను, యాత్రికుల ప్రయోజనాలను కాలరాసే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరించిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కార్యాలయంలో మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ కమిటీలో ముగ్గురు ఇస్లామిక్ ధార్మిక పండితులను నియమించాల్సి ఉండగా టీడీపీ కార్యకర్తలైన పఠాన్ ఖాదర్ ఖాన్, షేక్ హాసన్ బాషాలను ముస్లిం థియాలాజిస్ట్లుగా పొందు పరుస్తూ అనర్హులను నియమించిందని ఆరోపించారు. నిజానికి వీరిద్దరూ ఎలాంటి ఇస్లామిక్ ధర్మశాస్త్రాన్నీ అధ్యయనం చేయలేదన్నారు. ఈ నియామకాన్ని సవాల్ చేస్తూ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించినట్లు ఆరిఫ్ చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించి ఏర్పాటు చేసిన హజ్ కమిటీని తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వంలో మైనారిటీ మంత్రి, ప్రభుత్వ మైనారిటీ సలహాదారులవంటి వారున్నప్పటికీ పవిత్రమైన హజ్ కమిటీలో చట్ట ఉల్లంఘన జరుగుతూంటే నోరెత్తకుండా వ్యవహరించడం శోచనీయమన్నారు. వారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ‘లులు’ భూముల జీఓ రద్దు చేయాలి నిడదవోలు: విశాఖలో 13.83 ఎకరాల ప్రభుత్వ భూములు, విజయవాడలో 4.15 ఎకరాల ఆర్టీసీ భూములను బహుళ జాతి సంస్థ లులుకు కట్టబెడుతూ ఇచ్చిన జీఓ నంబర్ 137ను తక్షణమే రద్దు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నిడదవోలు ఆర్టీసీ డిపో ముందు మంగళవారం ధర్నా నిర్వహించారు. అనంతరం జీఓ కాపీని దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నేత రాంబాబు మాట్లాడుతూ, లులును ప్రోత్సహించడం వలన వేలాది మంది చిన్న వ్యాపారులు, లక్షలాది మంది ఉపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ భూములను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటిని నాశనం చేయడం తగదని అన్నారు. అన్నదాత సుఖీభవ ఫిర్యాదులపై గ్రీవెన్స్ సెల్స్రాజమహేంద్రవరం సిటీ: అన్నదాత సుఖీభవ ఫిర్యాదుల పరిష్కారానికి మండల, డివిజన్, జిల్లా స్థాయిల్లో గ్రీవెన్స్ సెల్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. అన్నదాత సుఖీభవకు అనర్హులైన రైతుల ఫిర్యాదుల పరిష్కారానికి ఈ గ్రీవెన్స్ సెల్లు ఏర్పాటు చేయాలని సూచించారు. తిరస్కరణ కారణాలను రైతులకు వివరించి, సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు. జిల్లా స్థాయిలో 0883–2944455 నంబరుతో గ్రీవెన్స్ సెల్ అందుబాటులో ఉంటుందన్నారు. లబ్ధిదారుల ఖాతాలను ఆధార్తో అనుసంధానించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గృహ నిర్మాణ ప్రగతి సాధించని ఎంపీడీఓలు, గృహ నిర్మాణ అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గృహ నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారుల నుంచి అడ్వాన్స్ నిధులు తిరిగి తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. కాలువల పూడికతీత పనుల పురోగతిపై క్షేత్రస్థాయి నివేదిక ఇవ్వాలని కోరారు. వర్షాకాలంలో ముంపు నివారణపై ప్రత్యేక దృష్టి అవసరమన్నారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు ప్రతి శనివారం వసతి గృహాలను సందర్శించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, డీఆర్ఓ టి.సీతారామమూర్తి, హౌసింగ్ పీడీ ఎస్.భాస్కర్రెడ్డి, సీపీఓ ఎల్.అప్పలకొండ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
దళిత విద్యార్థులపై కూటమి ప్రభుత్వ కక్ష
ఫ వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఫైర్ ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): దళిత విద్యార్థులంటే కూటమి ప్రభుత్వానికి అలుసని వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆరోపించారు. వారు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగడం సీఎం చంద్రబాబుకు ఇష్టం లేదని విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం ఎస్సీ హాస్టల్ను యూనియన్ జి ల్లా అధ్యక్షుడు చంద్రబాబు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నీటి ఆనంద్ ఆధ్వర్యాన చైతన్య మంగళవారం సందర్శించారు. సమస్యలు స్వయంగా పరిశీలించి, విద్యార్థుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, వసతి గృహాలను పాడుబెడుతున్నారని, విద్యార్థులకు సరైన తిండి పెట్టకుండా ఆసుపత్రి పాలు చేస్తున్నారని ఫైరయ్యారు. జగన్ హయాంలో ఇచ్చిన మంచి భోజనం, మంచి దుస్తులు, పరిసరాల పరిశుభ్రత మాయమైపోయాయని మండిపడ్డారు. పేద విద్యార్థులు బా గా చదువుకుని, మంచి ఉద్యోగాలు పొందాల ని, తద్వారా రాష్ట్రంలో పేదరికం కనుమరుగైపోవాలని గత ముఖ్యమంత్రి జగన్ ఆశిస్తే.. ప్రస్తు త సీఎం చంద్రబాబు దానికి పూర్తి విరుద్ధంగా ఆలోచిస్తున్నారని అన్నారు. సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాటం సాగిస్తామని చెప్పా రు. రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చైతన్య డిమాండ్ చేశా రు. వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్ రీజినల్ కో ఆర్డినేటర్ రమేష్, విద్యార్థి నేతలు రేష్మ, కేపీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి అవసరం
పెద్దాపురం: ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని ప్రముఖ పారిశ్రామిక వేత్త, లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేత మట్టే శ్రీనివాస్ అన్నారు. స్థానిక జవహర్ నవోదయ విద్యాలయలో మూడు రోజుల పాటు నిర్వహించే క్లస్టర్ స్థాయి కబడ్డీ మీట్ను మంగళవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రిన్సిపాల్ బి.సీతాలక్ష్మి అధ్యక్షతన జరిగిన కబడ్డీ మీట్నుద్దేశించి శ్రీనుబాబు మాట్లాడుతూ ఉన్నత విద్యతో పాటు క్రీడారంగానికి ప్రాధాన్యనివ్వడంలో నవోదయ విద్యాలయాల పాత్ర కీలకమన్నారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి కృష్ణా క్లస్టర్, తుంకుర్ క్లస్టర్ అండర్–19 బాలుర లీగ్ మ్యాచ్ కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో పీఈటీ సత్యనారాయణ, అనురాధ, ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది, తెలంగాణ, ఏపీ, కర్ణాటక ప్రాంతానికి చెందిన 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పారిశ్రామికవేత్త మట్టే శ్రీనివాస్ ‘నవోదయ’లో కబడ్డీ మీట్ ప్రారంభం -
‘నన్నయ’కు వుడ్ చిప్పర్
రాజానగరం: యూనివర్సిటీ ప్రాంగణాన్ని సుందరీకరించడంలో భాగంగా చెట్ల కొమ్మలు, పొదలు, వ్యర్థాలను చిప్స్గా మార్చే మైజో వీమా వుడ్ చిప్పర్ యంత్రాన్ని ఆదికవి నన్నయ యూనివర్సిటీ కొనుగోలు చేసింది. దీనిని వైస్ చాన్సలర్ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ మంగళవారం ప్రారంభించారు. ఈ యంత్ర సాయంతో తయారయ్యే వుడ్ చిప్స్ను మొక్కలకు కంపోస్టు ఎరువుగా వాడవచ్చని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. వ్యర్థాలను కాల్చివేయడం వలన పర్యావరణం కలుషితమవుతుందని, ఆవిధంగా కాకుండా ఈ యంత్రం చక్కని ప్రత్యామ్నాయమని అన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డీన్ డాక్టర్ బి.జగన్మోహన్రెడ్డి, కె.దేవలాల్, కె.లక్ష్మీపతి, వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. -
కూటమి ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో పిల్ వేస్తాం
రాజమహేంద్రవరం సిటీ: దొంగ హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చి, ఆ హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్) వేయనున్నట్లు అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ చెప్పారు. రాజమహేంద్రవరంలోని తన నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి ప్రభుత్వం ఒక్క పథకం కూడా అమలు చేయలేదన్నారు. మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తే రాష్ట్రం దివాళా తీస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు అనడం దారుణమైన విషయమన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ పథకాన్ని అమలు చేసి చూపించారన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని అమలు చేయకుండా క్యాబినెట్లో ప్రకటించడం దారుణమన్నారు. తల్లికి వందనం అమలు జరగడం లేదన్నారు. జగన్ రూ.13 వేలు ఇస్తే విమర్శించారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా రూ.13 వేలే ఇస్తోందని చెప్పారు. సంపద సృష్టిస్తామని చెప్పి, కార్పొరేట్ కంపెనీలకు భూములను కారుచౌకగా 99 పైసలకే కట్టబెడుతున్నారని, ఇందులో క్విడ్ ప్రో కో జరుగుతోందని హర్షకుమార్ ఆరోపించారు. ఎవరికో ఒకరికి భూములు కట్టబెట్టడానికే మంత్రి మండలి సమావేశం జరుగుతోందని ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం కక్షపూరిత ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు. ప్రతి వారినీ జైలులో పెడుతున్నారన్నారు. రాష్ట్రాన్ని బాగు చేయడం గురించి ఆలోచించకుండా పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. బిహార్లో జరిగిన ఎన్నికల అక్రమాలపై బీజేపీ ప్రభుత్వం లోక్సభలో చర్చ జరపాలని డిమాండ్ చేశారు. బిహార్ ఎన్నికల్లో 8 లక్షల బోగస్ ఓట్లు వచ్చాయన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అన్ని ఎన్నికల్లోనూ బోగస్ ఓట్లు సృష్టించి గెలుస్తున్నారని ఆరోపించారు. పోలైన ఓట్ల కంటే లెక్క పెట్టిన ఓట్లే ఎక్కువగా ఉంటున్నాయన్నారు. ఈవీఎంలను మేనిప్యులేట్ చేసి, ఎన్నికై న ప్రధాని దేశాన్ని పాలిస్తున్నారని అన్నారు. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిపి విజయం సాధించాలని హర్షకుమార్ సవాల్ చేశారు. -
అర్జీలు త్వరితగతిన పరిష్కరించాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో వస్తున్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) టి.సీతారామమూర్తి జిల్లా అధికారులకు సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన జిల్లా స్థాయి పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి ఆయన, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంఆర్ఆర్ ప్రేమ్కుమార్, సీపీఓ ఎల్.అప్పలకొండ తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ, ఫిర్యాదుల పరిష్కారంపై ఆయా శాఖల అధికారులు దృష్టి సారించాలన్నారు. మళ్లీ మళ్లీ వస్తున్న అర్జీలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు. రెవెన్యూ 71, పోలీస్ 34, పంచాయతీరాజ్ 28, ఇతర శాఖలవి 58 చొప్పున అర్జీలు వచ్చాయని వివరించారు. పోలీసు పీజీఆర్ఎస్కు 31 ఫిర్యాదులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టం(పీజీఆర్ఎస్)కు 31 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిశోర్ అర్జీదారులతో నేరుగా మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వీల్చైర్లో వచ్చిన దివ్యాంగ మహిళ వద్దకు నేరుగా ఆమె వెళ్లి అర్జీ స్వీకరించారు. ఆమె సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేశారు. పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీలను నిర్దేశిత సమయంలోగా చట్ట పరిధిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయా పోలీసు స్టేషన్ల అధికారులను ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీలు ఎంబీఎన్ మురళీకృష్ణ, ఏవీ సుబ్బరాజు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఎస్జీఎఫ్ సెక్రటరీ నియామ కానికి దరఖాస్తుల ఆహ్వానం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) జిల్లా సెక్రటరీగా రెండేళ్లు పని చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ యాజమాన్యాల్లోని పాఠశాలల్లో పని చేస్తున్న అర్హులైన వ్యాయామోపాధ్యాయులు (పీడీ) తమ నామినేషన్లను తన కార్యాలయానికి ఆగస్టు 4వ తేదీ 12 గంటల్లోగా అందజేయాలని సూచించారు. గతంలో ఒకసారి జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీలుగా పని చేసిన వారు అనర్హులని తెలిపారు. ఇంటర్ సంస్కరణలపై శిక్షణ కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటర్మీడియెట్ విద్యా సంస్కరణలపై జిల్లాలోని ప్రిన్సిపాళ్లకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం శిక్షణ జరిగింది. ఈ సందర్భంగా ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ అధికారి (ఆర్ఐఓ) ఎన్ఎస్వీఎల్ నరసింహం మాట్లాడుతూ, కొత్త సంస్కరణల ప్రకారం సిలబస్ అప్డేట్, సౌకర్యవంతమైన సబ్జెక్టులను కలపడం తదితర మార్పులు చేశారని వివరించారు. విద్యార్థులకు పరీక్షల ఒత్తిడిని తగ్గించి, నీట్, జేఈఈ వంటి ఉన్నత విద్య, పోటీ పరీక్షలకు సన్నద్ధ చేయడమే ఈ సంస్కరణల ఉద్దేశమన్నారు. కడలిలోకి 5.85 లక్షల క్యూసెక్కులుధవళేశ్వరం: కాటన్ బ్యారేజీ నుంచి సోమవారం రాత్రి 5,85,246 క్యూసెక్కుల గోదావరి మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులుగా ఉంది. తూర్పు డెల్టాకు 3,700, మధ్య డెల్టాకు 2,400, పశ్చిమ డెల్టాకు 6 వేలు కలిపి 12,100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. భద్రాచలంలో నీటిమట్టం 36.10 అడుగులకు చేరింది. -
అదిగో జాగా.. ఇదిగో పాగా!
చిన్న కాలువలను కూడా వదల్లేదు ఆలమూరు మండలం కోటిపల్లి ప్రధాన పంట కాలువ మీదనే కాదు... దీనికి అనుబంధంగా ఉండే చానల్స్ను కూడా అక్రమార్కులు వదల్లేదు. ప్రధాన పంట కాలువ పరిధిలో మూలస్థానం వద్ద ఏటిగట్లను ఆనుకుని నిర్మాణాలు చేశారు. ఆలమూరు సూర్యారావుపేట, వెదురుమూడి కాలువలు కూడా ఆక్రమణలకు చిక్కి శల్యమవుతున్నాయి. సాక్షి అమలాపురం: గోదావరి డెల్టాకు జీవనాడులైన ప్రధాన పంట కాలువలు, మురుగునీటి కాలువలు, వీటికి అనుబంధంగా ఉండే చానల్స్, మీడియం, మైనర్ డ్రెయిన్లు పలుచోట్ల ఆక్రమణదారుల బారిన పడి చిక్కి శల్యమవుతున్నాయి. సహజ సిద్ధమైన ప్రవాహాలను కోల్పోతున్నాయి. దీనివల్ల ఆయకట్టు రైతులు సాగు సమయంలో పడరాని పాట్లు పడుతున్నారు. తూర్పు, మధ్య డెల్టా అనే తేడా లేదు, పంట కాలువ, మురుగునీటి కాలువ అనే భేదం లేదు, పెద్దా, చిన్నా అనే అంతరం లేదు, కాలువలకు – రోడ్లకు మధ్య కొద్దిపాటి స్థలం ఉంటే చాలు కబ్జాల బారిన పడుతున్నాయి. చిరు వ్యాపారాలు చేసుకునే జాగాలో టింబర్ డిపోలు, షాపింగ్ కాంప్లెక్స్ల నిర్మాణాలు జరిగిపోయాయి. పూరి గుడిసెల నుంచి రెండంతస్తుల పక్కా భవనాల వరకు నిర్మాణాలు చేసేశారు. చివరకు ఈ స్థలాలపై హక్కులున్న జలవనరుల శాఖకు చెందిన కార్యాలయాలను సైతం ఆక్రమించేశారు. ఇటీవల ఆ శాఖ అధికారులు నిర్వహించిన సర్వేలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 4,800 వరకు ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించారు. వీటి ని తమ శాఖతో పాటు రెవెన్యూ, పోలీసుల సహకారంతో తొలగిస్తామని ప్రకటించారు. ఇతర శాఖల వత్తాసు ఆక్రమణల తొలగింపు సాధ్యం కాదనేది పలువురి అభిప్రాయం. ఇటీవల కాలంలో పెరిగిన మితిమీరిన రాజకీయ జోక్యంతో పాటు పలు నిర్మాణాలకు సంబంధించి పక్కాగా దస్తావేజులు కూడా పుట్టుకురావడం వంటి కారణాలతో వీటి తొలగింపు కేవలం ప్రకటనలకే పరిమితమనే విమర్శలు వినిపిస్తున్నాయి. జలవనరుల శాఖకు చెందిన ఈ స్థలాలను దర్జాగా కబ్జా చేస్తుంటే వీటికి రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్, విద్యుత్ శాఖలు వంత పాడుతుండడం గమనార్హం. ఈ నిర్మాణాలకు పంచాయతీ, మున్సిపల్ శాఖలు పన్నులు వసూలు చేస్తుండగా, రెవెన్యూ శాఖ పట్టాలు మంజూరు చేస్తోంది. విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం ద్వారా ఆక్రమణదారులకు అండగా నిలుస్తున్నట్టుగా మారింది. హద్దూ పద్దూ లేదు జిల్లా వాణిజ్య కేంద్రంగా పేరొందిన రావులపాలెం మండలం మీదుగా మధ్య డెల్టాలోని మూడు ప్రధాన పంట కాలువలు ప్రవహిస్తాయి. ఈ మూడు కాలువల మీద ఈ మండలంలో ఆక్రమణలకు హద్దే లేకుండా పోయింది. ప్రధానంగా ముక్తేశ్వరం బ్యాంకు కెనాల్ మీద ఊబలంక, రావులపాలెంలో ఇరువైపులా అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇళ్లు, వాణిజ్య దుకాణాలు, ప్రార్థనా స్థలాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఆక్రమణలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఈ కాలువలపై ఊబలంక నుంచి రావులపాలెం, కొమరాజులంక, వెదిరేశ్వరం ఇరువైపులా ఆక్రమణలతో నిండిపోయింది. అమలాపురం కాలువపై ఈతకోట– ర్యాలీ రహదారి వెంబడి కూడా ఆక్రమణలు అధికంగా ఉన్నాయి. రావులపాలెం వద్ద ముక్తేశ్వరం కాలువ గట్లపై ఆక్రమణలు కొత్తపేట కౌశిక డ్రెయిన్ ఇరువైపులా నిర్మాణాలు గోదావరి డెల్టాలో కాలువల వెంబడి ఆక్రమణలు ఉమ్మడి జిల్లాలో 4,800 ఆక్రమణల గుర్తింపు రెవెన్యూ, పోలీసుల సహకారంతో తొలగిస్తామంటున్న ఇరిగేషన్ అధికారులు రాజకీయ జోక్యంతో అసాధ్యమంటున్న రైతులు పలు ప్రాంతాల్లో పక్కాగా భవన నిర్మాణాలు చిరు దుకాణాల నుంచి షాపింగ్ కాంప్లెక్స్ల వరకు మురుగునీటి కాలువను వదల్లేదు కొత్తపేట నడిబొడ్డున ఉండే కౌశిక ఇది. ఆక్రమణలతో చిక్కి శల్యమైంది. మురుగునీటి కాలువకు ఇరువైపులా ఇళ్లు, ఇతర భవనాల నిర్మాణాలు జరిగిపోయాయి. కాలువల్లో పిల్లర్లు వేసి డాబాలు, మేడలు, రేకుల షెడ్ల నిర్మాణాలు చేపట్టారు. వాడకం నీరంతా దీనికిలోకి వదిలేస్తున్నారు. మురుగునీరు దిగేందుకు మరో మార్గం లేకపోవడంతో దీనిని అమలాపురం పంట కాలువలోకి నేరుగా వదిలేస్తున్నారు. కొత్తపేట దిగువున ఉన్న అమలాపురం మున్సిపాలిటీతోపాటు అంబాజీపేట, ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురం మండలాల్లోని ప్రధాన రక్షిత మంచినీటి పథకాలకు ఈ నీరే వెళుతోంది. మండపేట కాలువ గట్టుపై.. తూర్పు డెల్టా పరిధిలో కీలకమైన మండపేట కాలువ గట్టుపై అక్రమ నిర్మాణాలు లెక్కలేనన్ని. రాయవరం మండలం పసలపూడిలో కాలువ గర్భంలోకి వచ్చి మరీ నిర్మాణాలు చేశారు. ఈ కాలువపై మండపేట, రామచంద్రపురం మున్సిపాలిటీతో పాటు రామచంద్రపురం రూరల్ మండలాల్లోని పలు గ్రామాల్లో అక్రమ నిర్మాణాలు పెద్ద ఎత్తున సాగాయి. దీనివల్ల కీలక రబీ సమయంలో శివారుకు నీరందక రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. -
అందుకేనా.. పూనకాలు లోడింగ్!
గత అవమానాలు మరిచారా? సీనియర్ నేతయిన బుచ్చయ్య చౌదరి టీడీపీలో ఆది నుంచీ అవమానాలే ఎదుర్కొంటున్నారు. దివంగత ఎన్టీఆర్కు ఆయన అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు వెన్నుపోటు ఉదంతంలో గోరంట్ల.. ఎన్టీఆర్ వర్గంలోనే ఉన్నారు. పార్టీలోనే ఉన్నా తనకు అన్యాయం జరిగితే అధినాయకత్వాన్నే ప్రశ్నించే తత్వం ఆయన సొంతం. ఆయన వ్యవహార శైలి ఇష్టం లేకపోయినా పార్టీలో సీనియర్ అనే కారణంతో చంద్రబాబు పట్టించుకోకుండా వదిలేసేవారు. పార్టీపై ఉన్న అభిమానంతో గోరంట్ల కూడా అలాగే కొనసాగేవారు. మంత్రి పదవి రాని సమయంలో పార్టీలో పదవులు అమ్ముకుంటున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్వపక్షంపై ఆయన చేసిన వ్యాఖ్యలను గమనించిన చంద్రబాబు అప్పటి నుంచీ బుచ్చయ్యను పెద్దగా నమ్మరనే ప్రచారం ఉంది. యువగళం పాదయాత్ర, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్లినప్పుడు ఆయన తనయుడు లోకేష్ టీడీపీ రాజకీయ వ్యవహారాల్లో క్రియాశీలకంగా మారారు. దీంతో, గోరంట్ల ప్రాబల్యం మరింత తగ్గింది. చంద్రబాబు జైలులో ఉన్న 52 రోజులూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నా.. లోకేష్ పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా, బాబుతో ఒక్కసారి కూడా ములాఖత్ ఏర్పాటు చేయలేదంటే టీడీపీలో బుచ్చయ్య పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మంత్రి పదవి ఇవ్వకపోయినా, తరచుగా అవమానిస్తున్నా గోరంట్ల ఇప్పటికీ వారినే పొగుడుతూంటారు. వారి దృష్టిలో పడేందుకే మాజీ సీఎంను విమర్శిస్తున్నారని, మంత్రి పదవి కోసమే ఆయన స్వరం పెంచారని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇటీవల తన వయసు, అనుభవాన్ని పక్కన పెట్టేసి మరీ తరచుగా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై ఆయన తరచుగా దుర్భాషలాడుతున్నారు. కూటమి ప్రభుత్వం త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టనుంది. అందులో స్థానం దక్కించుకునే కాంక్షతోనే ఆయన ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలకు దిగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హద్దు మీరి మరీ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ టీడీపీ నాయకులు ప్రతిపక్ష నేత, మాజీ సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్ సీపీ నేతలపై తరచుగా విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాలుగాకులు ఎక్కువే చదివినట్టు కనిపిస్తోంది. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఎంతో హుందాగా.. కొత్త తరానికి స్ఫూర్తినిచ్చేలా ఉండాలి. కానీ, ఆయనే సభ్యసమాజం తలదించుకునేలా వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర రాజకీయ విశ్లేషకుల్లో చర్చనీయాంశంగా మారుతోంది. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ, అవి కూడా హద్దులో ఉండటమే సమాజానికి హితం. కానీ, బుచ్చయ్య వ్యాఖ్యలు మాత్రం ఆ హద్దు దాటేస్తున్నాయి. మాజీ సీఎం అనే కనీస గౌరవం కూడా లేకుండా మీడియా సమావేశాలు, టీవీ డిబేట్లలో ఇష్టమొచ్చినట్లు అన్స్టాపబుల్గా తప్పుడు వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారుతోంది. ‘నువ్వు ఓ సైకో. నీకు ఉరి వేయక సన్మానాలు చేయాలా? నీ తల ఎందుకు తీయకూడదు? నిన్ను చంపితే తప్పేముంది? ఉరి తీసినా తప్పులేదు?’ అంటూ జగన్నుద్దేశించి ఆయన ఊగిపోతూ మాట్లాడుతున్నారు. గోరంట్ల ఇంత దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్నా పార్టీ అధిష్టానం కనీసంగా కూడా పట్టించుకోవడం లేదు. ఇదంతా చూస్తూంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా అనే భావన కలుగుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. మంత్రి పదవి కోసమేనా? కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిగా విఫలమైంది. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. కూటమి సర్కారు ప్రజలకు చేస్తున్న అన్యాయం, దగాను ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ గట్టిగా ప్రశ్నిస్తోంది. దీంతో, ఆత్మరక్షణలో పడిన టీడీపీ నేతలు ప్రతిపక్షంపై బురద జల్లుతున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం త్వరలో మంత్రివర్గ విస్తరణకు సన్నాహాలు చేస్తోంది. ఆ సందర్భంగా సీనియర్లకు మంత్రి పదవులిచ్చి మాజీ సీఎం జగన్ను, వైఎస్సార్ సీపీపై విమర్శల దాడిని పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. ఈసారైనా తనకు మంత్రి పదవి దక్కకపోతుందా అనే ఆశతోనే గోరంట్ల స్వరం మార్చినట్లు తెలుస్తోంది. జగన్ను, వైఎస్సార్ సీపీని గట్టిగా విమర్శిస్తే తనకు బెర్త్ ఖాయమవుతుందని భావించారో ఏమో కానీ ఎన్నడూ లేని విధంగా ఆయన కొన్ని రోజులుగా నిందా వ్యాఖ్యలకు దిగుతున్నారు. తద్వారా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టిలో పడేందుకు పాట్లు పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కొద్ది రోజులుగా చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతూండటం దీనికి బలం చేకూరుస్తోంది. అయితే, బుచ్చయ్య ఎంత ట్రై చేసినా మంత్రి పదవి దక్కదని టీడీపీ నేతలే అంటున్నారు. మాజీ సీఎం జగన్, గత ప్రభుత్వంపై తరచుగా గోరంట్ల విమర్శలు వయసు, అనుభవం పక్కనపెట్టి మరీ దిగజారుడు వ్యాఖ్యలు మంత్రి పదవి కోసమే ఈ తాపత్రయం అంటున్న రాజకీయ విశ్లేషకులు -
వైఎస్సార్ సీపీ నేత షర్మిలా రెడ్డి ఇంట్లో అగ్నిప్రమాదం
రూ.10 లక్షల వరకు నష్టం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వైఎస్సార్ సీపీ నాయకురాలు మేడపాటి షర్మిలారెడ్డి ఇంటిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ సోమవారం ఆ వివరాలను తెలిపారు. షర్మిలారెడ్డి, ఆమె భర్త అనిల్రెడ్డితో కలిసి కొద్దిరోజుల క్రితం లండన్లో ఉంటున్న వారి కుమార్తె గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. అయితే ఇంటిలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో ఇంటిలోని ఫర్నిచర్కు మంటలు అంటుకుని ఇల్లంతా పొగ కమ్మేసింది. ఇల్లు లాక్ చేసి ఉండడంతో ఆ పొగలు భవనం పైకి వచ్చాయి. దీన్ని చూసిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిచారు. వారు వచ్చి తలుపులను పగులకొట్టి మంటలను ఆర్పారు. ఈ ప్రమాదంలో ఇంటిలో సుమారు రూ.10లక్షల విలువైన ఫర్నిఛర్ ధ్వంసమైంది. అగ్నిప్రమాదం వార్త తెలిసిన వెంటనే వచ్చి సహాయం అందించిన ఫైర్ సిబ్బంది, తన అభిమానులకు షర్మిలారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. -
తాడిని తలదన్నే రుచి!
సామర్లకోట: ప్రస్తుత సీజన్లో దొరికేది తాటి పండు. ఈ తాటిపండులో అనేక పోషకాలు ఉంటాయి. ముంజెలు, పండ్లు, తేగలు అందిస్తూ అనేక విధాలుగా మనకు తాటి చెట్లు ఉపయోగపడుతున్నాయి. పూర్వం తాటిచెట్టు, ఆకులతో ఇళ్ల నిర్మాణం జరిగేది. క్రమేపీ పెంకుటిళ్లు, ప్రస్తుతం డాబాలు వచ్చాయి. ప్రకృతి మనకు ప్రసాదించిన పండ్లను తినడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. తాటి పండుతో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. వాటి రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది. తాటిచెట్టుకు కాసిన ముంజెకాయలు ముదిరిపోవడంతో తాటి పండ్లుగా మారుతాయి. ఆ పండ్ల గుంజుతో బూరెలతో పాటు అనేక రకాల పిండి వంటలు తయారు చేస్తారు. రసాయనాలు లేని ఏకై క పండు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారు 20 ఏళ్ల క్రితం వరకు ప్రస్తుత సీజన్లో తాటిపండ్లతోనే కడుపు నింపుకునే వారు. చెట్టు నుంచి పడిన పండును నేరుగా కొందరు, నిప్పులపై కాల్చుకొని మరి కొందరు ఈ పండ్లను తొక్కలు తీసి నేరుగా తినేవారు. అయితే ప్రస్తుతం ఈ పండ్లను దూరం పెడుతున్నారు. తాటిపండులో అనేక పోషకాలు ఉన్నాయి. ఎటువంటి పురుగు మందులు, రసాయనాలు వాడని తాటి పండ్లు వినియోగం ఆరోగ్యదాయకం. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు చెందిన వంటకాలకు డిమాండ్ పెరిగింది. దాంతో పండ్లను రోడ్డు మార్జిన్లో విక్రయించే వారి సంఖ్య పెరుగుతోంది. తాటిపండులో విటమిన్ ఎ,సీలు ఉంటాయి. బి కాంప్లెక్స్ పుష్కలంగా లభిస్తుంది. ఎక్కువగా పీచు పదార్థాలు ఉండటం వలన జీర్ణకోశ వ్యాధులు, మలబద్ధకం దూరం అవుతుంది. రక్త శుద్ధికి, మెదడుకు గ్లూకోజ్ అందించడంలో ఈ పండు దోహదపడుతుంది. నేటి తరం వారికి ఈ తాటిపండు విలువ తెలియడం లేదు. దీనికితోడు తాటి చెట్లను నరికి వేయడంతో ఇవి రానురాను కనుమరుగైపోతున్నాయి. అనేక వంటకాలు తాటి పండ్లతో అనేక రకాల వంటకాలను తయారు చేస్తారు. వీటితో చేసే బూరెలు, గారెలు, రొట్టెలు, అప్పాలు ఎంతో రుచిగా ఉంటాయి. తాటికాయ గుంజు తీసి దానిలో వరి నూక, బెల్లం కలిపి బూరెలు, గారెలు, రొట్టెలు తయారు చేస్తారు. కొన్ని మిఠాయి దుకాణాల్లో ఆంధ్రా పిండి వంటకాల పేరుతో తాటి బూరెల విక్రయాలు సాగుతున్నాయి. వీటి ధర కూడా అధికంగానే ఉంటుంది. తాటి పండ్లతో అనేక ప్రయోజనాలు వాటితో చేసే వంటకాలు అద్భుతం నోరూరించేలా గారెలు, బూరెలు అధిక శ్రమతో కూడిన పని తాటి పండ్లతో పిండి వంటలు చేయడం ఎంతో శ్రమతో కూడుకున్న పని. శుభకార్యాలలో వేసే బూరెలను సులభంగా తయారు చేయవచ్చు. తాటి పండ్లతో బూరెలు చేయడానికి కనీసం ఇద్దరు ఉండాలి. తాటి పండ్లను నిప్పులపై మగ్గ బెట్టాలి. వాటి తొక్క తీసి గుంజును పీచు లేకుండా తీయాలి. పండ్ల తీపిని బట్టి తగిన మోతాదులో బెల్లం కలపాలి. అప్పటికే నీటిలో నానబెట్టిన నూకను తాటిపండ్ల గుంజులో బాగా కలపాలి. సుమారు 30 నిమిషాలు ఉంచిన తరువాత నూనెలో కావలసిన పరిమాణంలో తాటి బూరెలు, అప్పాలు, గారెలు తయారు చేసుకోవచ్చు. వీటిని ఒకసారి రుచి చూస్తూ వదలిపెట్టే ప్రసక్తి ఉండదు! – మచ్చా బిందు, వీకే రాయపురం, సామర్లకోట మండలం అనేక పోషకాలు తాటిచెట్ల నుంచి వచ్చే పండ్లలో మంచి పోషకాలు ఉంటాయి. తాటిపండులో విటమిన్లు ఏ,బీ,సీ.. జింక్, పోటాషియం, ఐరన్, క్యాల్షియం వంటి అనేక ఖనిజాలు ఉంటాయి. తాటిపండులో పోషకాలు క్యాన్సర్ నిరోధకంగా పని చేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచటంలో తాటిపండు దోహదపడుతుంది. తాటిపండు వికారం తొలగించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. తాటి పండ్లతో పిండి వంటలు తయారు చేసేవారు కనిపిం చడం లేదు. ఆ పిండి వంటలు ఎంతో రుచిగా ఉంటాయి. చిన్నతనంలో స్నేహితులతో కలిసి తినే వారం. – పసల సత్యానందరావు, డాక్టర్, సామర్లకోట -
నేటి నుంచి ఆటల పండగ
జవహర్ నవోదయలో మూడురోజుల పాటు కబడ్డీ పోటీలు పెద్దాపురం: స్థానిక జవహర్ నవోదయ విద్యాలయలో ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు ఆటల పండగ పేరుతో కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు విద్యాయల ప్రిన్సిపాల్ బి.సీతాలక్ష్మి తెలిపారు. దీనిలో భాగంగా సొమవారం తెలంగాణ, ఏపీ, కర్ణాటక ప్రాంతాలకు చెందిన సుమారు 450 మంది క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించారు. 29వ తేదీ ఉదయం 9 గంటలకు క్రీడాజ్వాల, క్రీడార్యాలీ, శాంతికపోతం ఎగురవేత తదితర కార్యక్రమాలతో కబడ్డీ మీట్ ప్రారంభమవుతుందని ప్రిన్సిపాల్ సీతాలక్ష్మి తెలిపారు. ఈ పోటీలను ప్రముఖ పారిశ్రామిక వేత్తలు మట్టే శ్రీనివాస్, మట్టే ప్రసాద్బాబు ప్రారంభిస్తారన్నారు. కృష్ణ, ఖమ్మం, బీదర్, వయనాడు , కడప, షిమోగా, తుముకురు క్లస్టర్ల నుంచి అండర్–14, అండర్–17 బాలుర, బాలికల విభాగంలో పోటీలు ఉంటాయని ప్రిన్సిపాల్ సీతాలక్ష్మి, పీఈటీలు ఆర్.సత్యనారాయణ, అనురాధ ఓ ప్రకటనలో తెలిపారు. -
మొరాయించిన ప్రైవేటు ట్రావెల్ బస్సు
గండేపల్లి: జాతీయ రహదారిపై సోమవారం ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు మొరాయించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం నుంచి ఆదివారం రాత్రి హైదరాబాద్కు ప్రయాణికులతో కావేరి ట్రావెల్ బస్సు బయలుదేరింది. మండలంలోని మల్లేపల్లి శివారు హోటల్ వద్ద భోజనాలు చేసేందుకు బస్సును డ్రైవర్ నిలిపాడు. భోజనాలు అనంతరం బస్సును స్టార్ట్ చేయగా మొరాయించింది. స్థానికంగా ఉన్న మెకానిక్ మరమతులు చేసినప్పటికీ ఉపయోగం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమస్యలను బస్సు యాజమాన్యానికి వివరించినా సరిగా స్పందించలేదని ప్రయాణికులు తెలిపారు. మరో బస్సులో గమ్యానికి పంపించాలని కోరామని, కనీసం టికెట్ సొమ్ములైన ఇస్తే మరో బస్సులో వెళతామని చెప్పినప్పటికి పట్టించుకోలేదన్నారు. దీనిపై ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గండేపల్లి పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికుల నుంచి వివరాలు సేకరించారు. దీంతో యాజమాన్యం స్పందించి ప్రయాణికులకు భోజన సదుపాయం, ప్రయాణ సౌకర్యం కల్పించినట్టు పోలీసులు తెలిపారు. తీవ్ర ఇబ్బందులు పడిన ప్రయాణికులు పట్టించుకోని యాజమాన్యం -
జనసేన నేతలపై చార్జిషీట్ వేయాలి
ఎస్పీకి ఫీల్డు అసిస్టెంట్ ఫిర్యాదు కరప: జనసేన పార్టీ నాయకులు తనను కులంపేరుతో దూషించడమే కాకుండా వేధింపులకు గురిచేశారని, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినా ఇంతవరకు చార్జిషీట్ ఫైల్ చేయలేదని ఫీల్డు అసిస్టెంట్ పులపకూర సునీత సోమవారం ఎస్పీని కలసి ఫిర్యాదు చేశారు. తన చావుతో న్యాయం జరుగుతుందని పోలీసులు భావిస్తే దానికై నా సిద్ధంగా ఉన్నానని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు సునీత జిల్లా ఎస్పీ బిందుమాధవ్కు చేసిన ఫిర్యాదు వివరాలు ఇలా ఉన్నాయి... కరప మండలం పెనుగుదురు గ్రామానికి చెందిన పులపకూర వీరబాబు భార్య సునీత ఉపాధిహామీ పథకం ఫీల్డు అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు బండారు మురళి ఫీల్డు అసిస్టెంట్ సునీతను కులంపేరుతో దూషించడమే కాకుండా, కోరిక తీర్చాలని లేదా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. ఆ వేధింపులు తాళ లేక గతేడాది అక్టోబర్ నెల 22వ తేదీన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేధింపులకు గురిచేసిన జనసేన నాయకులు బండారు మురళి, ఘంటా నానిబాబు, గుబ్బల భవానీలపై అదే నెల 28వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఐదునెలలు అవుతున్నా చార్జిషీట్ ఫైల్ చేయకపోవడంపై ఈ ఏడాది మార్చి 10న, ఏప్రిల్ 7న కలెక్టరేట్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఈ నెల 21న కరప పోలీసులు తన వద్దకు వచ్చి బండారు మురళి, మరో ఇద్దరిపై పెట్టిన కేసు కొట్టివేశారు.. కాగితాలపై సంతకం చేయమని అడిగారని, సంతకం చేయనని చెప్పడంతో పోలీసులు వెళ్లిపోయినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను వేధింపులకు గురి చేసినవారిపై చార్జిషీట్ వేసి, వారిని అరెస్ట్ చేసి తనకు న్యాయం చేయాలని కోరుతూ ఫిర్యాదు చేసినట్టు సునీత తెలిపారు. తన చావుతో న్యాయం జరుగుతుందని పోలీసులు భావిస్తే అందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆమె తెలిపారు. -
శ్రీరస్తు.. శుభమస్తు..
● వివాహ సందడి మళ్లీ ప్రారంభం ● నవంబర్ 26 వరకూ ముహూర్తాలే ● ఫంక్షన్ హాల్స్, టెంట్హౌస్లు, బ్యాండ్ మేళాలకు డిమాండ్ కాకినాడ సిటీ: సుమారు 80 రోజుల విరామం తర్వాత శుభకార్యాలకు మళ్లీ మంచి ముహూర్తాలు మొదలయ్యాయి. దీంతో జోరుగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. మే 25 నుంచి జూలై 26 వరకు ముహూర్తాలు లేకపోవడంతో శుభకార్యాలకు బ్రేక్ పడింది. శ్రావణ మాసం శుభకార్యాలకు శ్రేష్టం కావడం.. ఈ నెల 27 నుంచి నవంబర్ 26వ తేదీ వరకూ 35 మంచి ముహూర్తాలు ఉండటంతో లగ్గాలు, వివాహాలు, నూతన గృహ ప్రవేశాలు జోరుగా జరగనున్నాయి. ఈ నెల 30, 31; ఆగస్టు 1, 3, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17, 20; సెప్టెంబర్ 24, 26, 27, 28; అక్టోబర్ 1, 2, 3, 4, 8, 10, 11, 12, 22, 24, 29, 30, 31; నవంబర్ 1, 2, 7, 8, 12, 13, 15, 22, 23, 26 తేదీల్లో మంచి ముహూర్తాలున్నాయి. ఈ నాలుగు నెలల్లో మొత్తం 35 ముహూర్తాలు ఉండటంతో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో లెక్కకు మిక్కిలిగా వివాహాలు జరగనున్నాయని పురోహితులు చెబుతున్నారు. వీరికి డిమాండ్ వివాహాల సీజన్ మొదలవడంతో పురోహితులు, బ్యాండ్ మేళాలు, టెంట్హౌస్లు, డెకరేషన్, ఫొటో, వీడియోగ్రాఫర్లకు ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వీరిని ముందుగానే మాట్లాడుకున్నారు. పెళ్లివారు ముందుగానే అడ్వాన్స్లు కూడా ఇచ్చారు. మరోవైపు ఫంక్షన్ హాళ్లకు కూడా ఎక్కడ లేని డిమాండూ వచ్చింది. ఇప్పటికే ముహూర్తాలు నిర్ణయించుకున్న వారు 2 నెలల ముందే ఫంక్షన్ హాళ్లు బుక్ చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో 3,500కు పైగా ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్, మరో వెయ్యి వరకూ టీటీడీ, ప్రభుత్వ కమ్యూనిటీ హాళ్లు ఉన్నాయి. చాలా మంది ఫంక్షన్ హాల్స్ దొరక్కపోవడంతో ఇళ్ల వద్ద ఖాళీ స్థలాల్లో సైతం వివాహాలు జరపడానికి సిద్ధపడుతున్నారు. ప్రారంభమైన వివాహాలు శ్రావణ మాసం ప్రారంభం కావడం.. నవంబర్ 26 వరకూ వివాహ ముహూర్తాలు ఉండటంతో జిల్లాలో అధిక సంఖ్యలో జంటలు ఒక్కటి కానున్నాయి. ఇప్పటికే 150కి పైగా పెళ్లిళ్లకు ముహూర్తాలు పెట్టాను. – సుబ్రహ్మణ్యశాస్త్రి, పండితుడు, కాకినాడ టెంట్ హౌస్లకు ఫుల్ గిరాకీ పెళ్లిళ్ల సీజన్ కావడంతో ముందుగానే టెంట్హౌస్ సామగ్రిని బుక్ చేసుకుంటున్నారు. ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి. సుమారు 80 రోజులుగా శుభకార్యాలు లేకపోవడంతో ఖాళీగా ఉన్నాం. ప్రస్తుతం టెంట్హౌస్లకు గిరాకీ పెరిగింది. – కొండబాబు, టెంట్హౌస్ నిర్వాహకుడు, కాకినాడ -
జాబ్చార్టుపై అవగాహన అవసరం
ఎంపీడీఓల శిక్షణలో రాష్ట్ర అదనపు కార్యదర్శి వెంకటకృష్ణ సామర్లకోట: ఎంపీడీఓలు తమ జాబ్చార్టుపై అవగాహన పెంచుకోవాలని, ఇదే తరుణంలో గ్రామ పంచాయతీల సొంత వనరుల ఆదాయాన్ని పెంచడంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర అదనపు కార్యదర్శి కె.వెంకటకృష్ణ అన్నారు. స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో నెల రోజుల పాటు నిర్వహించే శిక్షణకు సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో పదోన్నతి పొందిన 46 మందికి మొదటి బ్యాచ్లో శిక్షణను ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు సొంత వనరులు సమీకరణ, ఆర్థిక సుస్థిరత ఎంతో అవసరమని తెలిపారు. ప్రభుత్వాలు అందిస్తున్న ఆర్థిక సహాయం ఆయా గ్రామ పంచాయతీలకు సరిపోదన్నారు. గ్రామ పంచాయతీలు సమగ్రాభివృద్దికి, సంక్షేమానికి వివిధ కార్యక్రమాలను చేపట్టవలసి ఉంటుందని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో సామాజిక న్యాయంతో కూడిన ఆర్థికాభివృద్ధి ప్రణాళికలు, బహుముఖ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ కార్యక్రమాల అమలులో మండల పరిషత్తు పాలక మండలి సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. ఎంపీపీల నిర్ణయాలనే పాటించవలసిన పనిలేదన్నారు. విస్తరణ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు మాట్లాడుతూ ఎంపీడీఓ విధి నిర్వహణలో మండల ప్రజా పరిషత్తుకు, ప్రభుత్వానికి బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. డ్వామా ఏపీడీ భానుప్రకాష్, ఈటీసీ వైస్ ప్రిన్సిపాల్ జి.రమణ, ఎంపీడీవో డి.శ్రీలలిత, ఫ్యాకల్టీలు శర్మ, డి.శ్రీనివాసరావు, కె సుశీల మొదటి రోజు శిక్షణ నిర్వహించారు. -
భర్తపై భార్య కత్తి పీటతో దాడి
అమలాపురం టౌన్: తల్లికి వందనం డబ్బు ఏమి చేశావని అడిగినండుకు భర్తపై భార్య కత్తి పీటతో దాడి చేసి గాయపరిచింది. పట్టణ ఎస్సై ఎన్ఆర్ కిషోర్బాబు తెలిపిన వివరాల ప్రకారం...అమలాపురం పట్టణం సావరం రోడ్డులో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సావరం రోడ్డులో నివాసం ఉంటున్న పెనుమాల దుర్గాప్రసాద్, దుర్గ దంపతులకు ఇద్దరు పిల్లలు. వారికి ఇటీవల తల్లికి వందనం పతకం కింద వచ్చిన డబ్బు ఏమి చేశావని భర్త దుర్గాప్రసాద్ భార్య దుర్గను అడిగాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భార్య దుర్గ భర్తపై కత్తి పీటతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అమలాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో భర్త చికిత్స పొందుతున్నాడు. అతని నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిషోర్బాబు చెప్పారు. -
నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు
టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వయసు, అనుభవాన్ని పక్కన పెట్టి మరీ మంత్రి పదవి కోసం ‘నరుకుతాను, ఉరి తీయాలి’ అని మాట్లాడటం సబబేనా? తన నియోజకవర్గంలో రైతులు పడుతున్న కష్టాలపై చంద్రబాబును నిలదీయాలి. గోదావరి నుంచి విచ్చలవిడిగా ఇసుక తరలించి బుచ్చయ్య చౌదరి సాగిస్తున్న దందా గురించి ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. చాక్లెట్ రూపంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. గంజాయి అమ్మకాల్లో టీడీపీ నాయకులు అడ్డంగా దొరికిపోతున్నారు. అక్రమ మద్యం, కల్తీ మద్యం ఏరులై పారుతోంది. అయినప్పటికీ వాటిని తయారు చేస్తున్న డిస్టిలరీలను ఈ ప్రభుత్వం ఎందుకు సీజ్ చేయడం లేదు? బుచ్చయ్య చౌదరి చెప్పినట్లు ఉరి తీయాలనుకుంటే ఈ ప్రభుత్వంలో అక్రమంగా మద్యం, గంజాయి, ఇసుక తరలించే వారిని ఉరి తీయాలి. సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రజల్ని వంచించిన కూటమి నాయకులే బుచ్చయ్య చౌదరి చెప్పిన ఉరి శిక్షకు అర్హులు. – చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు -
చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి
ధవళేశ్వరం: చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తూ గోదావరిలో పడి మత్స్యకారుడు మృతి చెందాడు. ధవళేశ్వరం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక జలారుపేటకు చెందిన సావదాల సత్యారావు (43) సోమవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో గోదావరిలో చేపలు పట్టేందుకు కాటన్ బ్యారేజీ వద్దకు వెళ్లాడు. బ్యారేజ్ స్కవర్ స్లూయిజ్ వద్ద ప్రమాదవశాత్తూ గోదావరిలో పడి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధవళేశ్వరం సీఐ టి.గణేష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారులో శిశువు జననం ప్రత్తిపాడు రూరల్: కారులో పండంటి పాపకు ఓ మహిళ సోమవారం జన్మనిచ్చింది. మండలంలోని రాచపల్లికి చెందిన మడికి సారికకు సోమవారం పురిటి నొప్పులు రావడంతో స్థానిక ప్రభుత్వం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ గీత సెలవులో ఉండడంతో సిబ్బంది వైద్య సేవలు అందించారు. మెరుగైన వైద్యం నిమిత్తం ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తీసుకువెళ్లాని సిబ్బంది సూచించారు. దీంతో గర్భిణి భర్త మడికి చిన్నిబాబు గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత, వైస్ ఎంపీపీ ఏనుగు శ్రీనుకు విషయం తెలిపారు. దీంతో వైస్ ఎంపీపీ శ్రీను తన కారు రాచపల్లి పీహెచ్సీకి పంపి గర్భిణిని ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. రాచపల్లి దాటిన వెంటనే పోలవరం కాలువ వద్ద పురిటి నొప్పులు ప్రారంభం కావడంతో కారులో ఉన్న ఆశా వర్కర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి పురుడు పోసింది. తిరిగి రాచపల్లి పీహెచ్సీకి తల్లీబిడ్డను తరలించి వైద్య సేవలు అందించారు. -
పశువుల అక్రమ తరలింపుపై కేసు
గండేపల్లి: పశువుల అక్రమ తరలింపుపై కేసు నమోదు చేసినట్టు సీఐ వైఆర్కే శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు మండలంలోని గండేపల్లి జాతీయ రహదారిపై ఎస్సై యు.వి.శివనాగబాబు, సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా లారీలో తుని నుంచి చిలకలూరిపేటకు అక్రమంగా తరలిస్తున్న 4 ఆవు దూడలు, 12 ఎద్దులను గుర్తించి వాహనాన్ని సీజ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలియజేశారు వ్యక్తి మృతికి కారణమైన యువకుడి అరెస్ట్రామచంద్రపురం రూరల్: ఈ నెల 22వ తేదీ రాత్రి సుమారు 11.45 గంటలకు జగన్నాయకులపాలెం గ్రామంలో ప్రధాన రోడ్డుపై ద్విచక్ర వాహనంపై వెళుతున్న తాళ్లపొలం గ్రామానికి చెందిన వనుం కృష్ణను గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోగా అతడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదానికి కారణమైన కారును గుర్తించినట్లు ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ ఆదివారం విలేకరులకు తెలిపారు. ప్రమాద సంఘటన జరిగిన తరువాత ఆ స్థలంలో లభించిన కారు సైడ్ మిర్రర్, సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా కారు మండపేటలోని దుర్గా మల్లేశ్వరి మెకానికల్ షెడ్లో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. కారును స్వాధీనం చేసుకోవడంతో పాటు, తనకు అందిన సమాచారం మేరకు రామచంద్రపురానికి చెందిన కారు డ్రైవర్ దామిశెట్టి వెంకట వర్షిత్ను జగన్నాయకులపాలెం గ్రామంలోని హెచ్పీ పెట్రోల్ బంకు దాటిన తరువాత గున్నయ్య తూము వద్ద ఆదివారం అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. -
ధర ఢమాల్
మంచి మార్కెట్ కొనసాగుతోంది ప్రస్తుతం మంచి మార్కెట్ కొనసాగుతోంది. కిలో సగటు ధర రూ.287 లభిస్తోంది. కంపెనీలు సిండికేట్ కావడంతో మార్కెట్ ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. దీంతో, మార్కెట్లో ధర పెరిగి, తగ్గింది. సగటు ధర కిలో రూ.300 ఉంటే గిట్టుబాటు అవుతంది. కిలోకు రూ.22 వరకూ తగ్గింది. నాణ్యతను బట్టి ధర పలుకుతుంది. మంచి గ్రేడులకు ధర బాగుంది. ముందు ముందు మార్కెట్ ఎలా ఉంటుందో చెప్పలేం. కౌలు రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ ధరకు భూముల కౌలు, బ్యారన్లు తీసుకుంటే నష్టపోతారు. – కరుటూరి శ్రీనివాస్, అధ్యక్షుడు, పొగాకు వేలం కేంద్రం రైతు సంఘం, దేవరపల్లి నిబంధనలు కఠినతరం పొగాకు బోర్డు నిబంధనలు కఠినంగా ఉంటాయి. 2025–26 పంట కాలానికి సాగు విస్తీర్ణం, పంట ఉత్పత్తి లక్ష్యాన్ని తగ్గించారు. బ్యారన్కు 3,512 కిలోల చొప్పున ఎన్ఎల్ఎస్ ప్రాంతంలోని ఐదు వేలం కేంద్రాల్లో 49.70 మిలియన్ల ఉత్పత్తికి మాత్రమే అనుమతి ఉంది. దీనికి మించి పంట ఉత్పత్తి చేస్తే రైతులు నష్టపోతారు. పంట నియంత్రణ రైతుల చేతుల్లోనే ఉంటుంది. 2024–25 పంట కాలంలో 58.25 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, వచ్చే పంట కాలానికి సుమారు 9 మిలియన్ల కిలోలు తగ్గించారు. పంట సాగుకు, నర్సరీల ఏర్పాటుకు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు. మార్కెట్ హెచ్చుతగ్గుల్లో నడుస్తోంది. – జీఓల్కే ప్రసాద్, రీజినల్ మేనేజర్, పొగాకు బోర్డు, రాజమహేంద్రవరం ● పడిపోయిన వర్జీనియా పొగాకు రేటు ● కిలోకు రూ.20 తగ్గుదల ● రెండు వారాలుగా కిలో గరిష్ట ధర రూ.390 ● నేడు రూ.370 ● దిగులు చెందుతున్న రైతులు దేవరపల్లి: ఊహించని విధంగా వర్జీనియా పొగాకు ధర పడిపోయింది. మార్కెట్లో దాదాపు రెండు వారాలుగా కిలో గరిష్ట ధర రూ.390 పలుకుతూండగా.. శనివారం అది ఏకంగా రూ.20 తగ్గి రూ.370కి పడిపోయింది. దీంతో, రైతులు దిగులు చెందుతున్నారు. ఈ నెల 9న రూ.290 ధర పలకగా 10న రూ.336, 11న రూ.348, 16న ఏకంగా రూ.392కు పెరిగింది. ఒకే రోజు కిలోకు రూ.44 పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఏడాది మార్కెట్లో ఇదే గరిష్ట ధర. ఈ ధర ఈ నెల 17న రూ.390కి తగ్గి, శుక్రవారం వరకూ దాదాపు పది రోజుల పాటు అదే స్థాయిలో కొనసాగింది. దీంతో, తమ పంట పండిందనే రైతులు భావించారు. ఈ ధర ఇలాగే పెరుగుతూ రూ.400కు చేరుతుందని ఆశ పడ్డారు. పెట్టుబడులు, కౌలు డబ్బులు చేతికి వచ్చి, అప్పులు తీరడంతో పాటు కాస్త మిగులుతాయని ఆనందపడ్డారు. అయితే, వారి ఆశలపై నీళ్లు జల్లేలా ఒక్క రోజులోనే ధర కిలోకు రూ.20 తగ్గిపోయింది. దీంతో, ముందుముందు మార్కెట్ ఎలా ఉంటుందోనని రైతులు కలవరపడుతున్నారు. రూ.1,077 కోట్ల పొగాకు విక్రయాలు పొగాకు బోర్డు రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో శనివారం నాటికి రూ.1,077 కోట్ల విలువైన 37.53 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. ఉత్తర తేలిక నేలల్లో (ఎన్ఎల్ఎస్) పండిచే పొగాకు 35.87 మిలియన్ల కిలోలు, బ్లాక్ సాయిల్ (బీఎస్) పొగాకు 1.65 మిలియన్ల కిలోల మేర విక్రయాలు జరిగాయి. ఐదు వేలం కేంద్రాల్లో కిలో సగటు ధర ఎన్ఎల్ఎస్ పొగాకుకు రూ.289.19, బీఎస్ పొగాకుకు రూ.239.96 మేర లభించింది. ఎన్ఎఎల్ఎస్ పొగాకు ధర కిలోకు గరిష్టంగా రూ.370, కనిష్టంగా రూ.190 చొప్పున రైతులకు లభించింది. దాదాపు 45 మిలియన్ల కిలోల పొగాకు రైతుల వద్ద అమ్మకానికి ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్స్ గ్రేడ్, మిడిల్ గ్రేడ్ పొగాకు కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతున్నాయని రైతులు చెప్పారు. లీఫ్ గ్రేడ్ బేళ్లను నిల్వ చేసి ఉంచారు. దీనికి చివరిలో మంచి మార్కెట్ ఉంటుందని వారు భావిస్తున్నారు. లో గ్రేడ్ పొగాకు విక్రయాలు జరగాల్సి ఉంది. అదనపు కోటా కోసం నిరీక్షణ పొగాకు బోర్డు నిర్దేశించిన విధంగా బ్యారన్కు 45 క్వింటాళ్ల పొగాకు విక్రయాలు పూర్తయిన రైతులు అదనంగాా పండించిన పొగాకును మార్కెట్లో అమ్ముకోవడానికి అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. ఏటా వేలం ముగింపు సమయంలో అదనంగా పండిన పొగాకును అమ్ముకోవడానికి బోర్డు అనుమతిస్తుంది. దీనికి కిలోకు రూ.5 శాతం అపరాధ రుసుంతో పాటు 2 శాతం కమీషన్ను రైతుల నుంచి వసూలు చేస్తోంది. గత ఏడాది రైతు సంఘాల విజ్ఞప్తి మేరకు రాష్ట్రంలో అదనంగా పండించిన పొగాకు అమ్మకాలపై కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అపరాధ రుసుం రద్దు చేసింది. దీని ద్వారా రైతులకు సుమారు రూ.184 కోట్ల లాభం చేకూరింది. అయితే 2025–26 పంట కాలంలో అదనంగా పండించిన పొగాకుకు పెనాల్టీ తప్పదని అప్పట్లోనే కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ హెచ్చరింది. మార్కెట్లో ధర బాగున్నందున ఈ సమయంలో అదనపు పంట అమ్ముకోవడానికి అనుమతిస్తే తమకు లాభసాటిగా ఉంటుందని రైతులు అంటున్నారు. పొగాకు బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలో వేలం కేంద్రాల వారీగా పొగాకు విక్రయాలు (మిలియన్ కిలోలు) దేవరపల్లి 6.29 జంగారెడ్డిగూడెం–1 8.43 జంగారెడ్డిగూడెం–2 8.04 కొయ్యలగూడెం 7.53 గోపాలపురం 7.21 -
గంజాయి పట్టివేత?
సీతానగరం: మండలంలోని నల్గొండ దగ్గరలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని విశ్వసనీయ సమాచారం. ఆదివారం గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని నల్గొండ – సీతానగరం మధ్యలో పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని రాజమహేంద్రవరానికి విచారణ నిమిత్తం తరలించారు. విచారణ అనంతరం రెండు రోజుల్లో పూర్తి వివరాలను తెలియజేస్తామని పోలీసులు వివరించారు. మహిళకు తప్పిన ప్రాణాపాయం ● ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడుతుండగా కాపాడిన పోలీసులు ధవళేశ్వరం: కుటుంబ కలహాలతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడుతున్న మహిళను ధవళేశ్వరం పోలీసులు రక్షించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ధవళేశ్వరం టిడ్కో గృహ సముదాయానికి చెందిన 28 ఏళ్ల మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఈ క్రమంలో ఆమె తన బావకు ఫోన్చేసి విషయం చెప్పింది. దీంతో ఆయన 112కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదుచేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ టి.గణేష్ కానిస్టేబుల్ వెంకటేష్ను నాలుగు నిమిషాల వ్యవధిలో ఘటనాస్థలానికి పంపగా ఆయన వెంటనే తలుపులు పగులగొట్టి ఉరివేసుకోబోతున్న మహిళను కిందకు దించి చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మహిళ ప్రాణాలు కాపాడిన పీసీ వెంకటేష్, ఇన్స్పెక్టర్ గణేష్, కంట్రోల్ రూమ్ సిబ్బందిని ఎస్పీ డి.నరసింహకిశోర్ అభినందించారు. -
వాడపల్లి స్వామికి దండిగా ఆదాయం
కొత్తపేట: కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి ఆదివారం దండిగా ఆదాయం లభించింది. స్వా మివారిని విశేషంగా భక్తులు దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ప్రత్యేక దర్శనం, విశిష్ట దర్శనం, వే దాశీర్వచనం, అన్న ప్రసాద విరాళాలు, వివిధ సేవలు, లడ్డూ ప్రసాదాల విక్రయం, ఆన్లైన్ తదితర సేవల ద్వారా దేవస్థానానికి ఈ ఒక్కరోజే రూ.6,73,949 ఆ దాయం వచ్చిందని దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఈఓ నల్లం చక్రధరరావు వివరించారు. ఆలయంలో నిత్య పూజా కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి నిత్య కల్యాణంతో పాటు ఏడు ప్రదక్షిణలు చేసిన భక్తులు అష్టోత్తర నామార్చనలు నిర్వహించారు. -
కూటమి పాలనలో దళితులపై వివక్ష
వైఎస్సార్ సీపీ పాలనలో దళితులకు పెద్దపీట వైఎస్ జగన్ నేతృత్వంలోని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దళితుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని సుధాకర్బాబు గుర్తు చేశారు. దళితుల సంక్షేమ పథకాలకు రూ.2.75 లక్షల కోట్లు అందించారన్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలతో పాటు అన్ని వర్గాల్లో ఉన్న పేదల కోసం తానున్నానని భరోసా ఇచ్చిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్కే దక్కిందన్నారు. ‘నీకోసం, నాకోసం, ఊరు, వాడ కోసం, దగాపడ్ట అక్కచెల్లెమ్మల కోసం, సమాజం, అణగారిన వర్గాల కోసం వైఎస్ జగన్ను తిరిగి సీఎంను చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. జగన్ను గద్దె దింపడం కోసం ఈవీఎంలే పని చేశాయో.. ఢిల్లీ పెద్దలే పని చేశారో.. కుతంత్ర రాజకీయాలే పని చేశాయో తెలియదు. కానీ, ఈ సమయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఎదుర్కొనేందుకు దళితులందరూ నడుం బిగించి ముందుకు సాగాలి’ అని పిలుపునిచ్చారు. దళిత వర్గాల పిల్లలు ఇంగ్లిష్ మీడియం చదువుకోవాలన్నా, సొంతింటి కల నెరవేరాలన్నా, సంక్షేమ పథకాలు అందాలన్నా, అంబేడ్కర్ ఆశయాలు కొనసాగాలన్నా జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని, అందుకు దళితులందరూ కలసికట్టుగా కృషి చేసి, వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీతో వైఎస్సార్ సీపీని గెలిపించాలని అన్నారు. అన్న పేరు చెప్పి రాజకీయాల్లోకి వచ్చి, అన్ననే వంచించాడని పవన్కు పరోక్షంగా చురకలు వేశారు. సాక్షి, రాజమహేంద్రవరం/సీటీఆర్ఐ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దళితులపై వివక్ష పెరిగిందని, దళిత మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, సంక్షేమ పథకాలు అందడం లేదని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు విమర్శించారు. రాజమహేంద్రవరం సంహిత డిగ్రీ కళాశాల ఫంక్షన్ హాలులో ఆదివారం నిర్వహించిన జిల్లా దళిత నాయకుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో దళితులపై వివక్ష పేట్రేగిపోతోందన్నారు. దళిత జాతి తలెత్తుకుని జీవించాలన్నా, సంక్షేమ పథకాలు మళ్లీ అందాలన్నా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరిగి సీఎంగా రావాలని అన్నారు. ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు అలుపెరగని పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూంటే వేధింపులకు గురి చేస్తున్నారని, అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. అంతటితో ఆగకుండా బరితెగించి వైఎస్సార్ సీపీ నేతలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ దౌర్జన్యాలు, అరాచకాలను ఎదుర్కొనేందుకు దళిత జాతి అంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘మన దగ్గర డబ్బు లేకపోవచ్చు. కార్లు, బంగ్లాలు లేకపోవచ్చు. కానీ, గుండెల నిండా సత్తా ఉంది’ అని అన్నారు. చివరి రక్తపు బొట్టు వరకూ వైఎస్ జగన్ వెంటే నడుస్తామని చెప్పారు. నమ్మిన వారి కోసం ప్రాణాలర్పించే సత్తా దళితులకుందన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దళిత గ్రామాల్లో చిట్టచివరి గ్రామం వరకూ కూటమి ప్రభుత్వ అరాచకాలను తీసుకెళ్లేందుకు దళితులందరూ సంసిద్ధంగా ఉండాలని సుధాకర్బాబు సూచించారు. కూటమి కుట్రలపై ‘దళిత ఫోర్స్’ కూటమి ప్రభుత్వం దళితులు, ప్రజలకు చేస్తున్న అన్యాయాలను ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా దళిత ఫోర్స్ను నియమించనున్నట్లు సుధాకర్బాబు వెల్లడించారు. దీనికోసం 82,987 మందిని ఎంపిక చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 17 నగరాలున్నాయని, ఒక్కో నగరంలో 30 మంది చొప్పున 510 మందిని నియమిస్తామని చెప్పారు. అలాగే, 660 మండలాలకు గాను ఒక్కో మండలానికి 18 మంది చొప్పున 11,888 మందిని 104 పట్టణాలకు గాను ఒక్కోచోట 18 మంది చొప్పున 18,072 మందిని, 13,500 గ్రామాల్లో ఒక్కో గ్రామానికి ఐదుగురు చొప్పున 67,500 మందిని దళిత ఫోర్స్లో భాగస్వాముల్ని చేస్తామని వివరించారు. మాజీ హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, అమ్మ ఒడి అనగానే జగనన్న గుర్తుకొస్తే.. ఆరోగ్యశ్రీ అంటే గుర్తుకొచ్చేది వైఎస్సార్ అని అన్నారు. ఎన్నో పథకాల సృష్టికర్త జగన్ అని చెప్పారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, జగన్ నాయకత్వం మరింత బలపడేందుకు ప్రధాన కారణం దళితులేనని అన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి కీలకమైన దళిత వర్గాలు ప్రజల పక్షాన పోరాటాలు చేయాలని, వైఎస్ జగన్ను సీఎంను చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ ఇన్చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, చంద్రబాబు దళిత ద్రోహి అని, అబద్ధాల్లో ఘనుడని ఆరోపించారు. వైఎస్సార్ అడుగుజాడల్లో నడిచిన నేత వైఎస్ జగన్ అని చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, జి.శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ అమలు చేసిన ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. మంత్రి, నామినేటెడ్ పదవుల్లో దళితులకు పెద్దపీట వేసిందన్నారు. అనంతరం దళిత ప్రజాప్రతినిధులు, నేతలను సుధాకర్బాబు ఘనంగా సన్మానించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాలి వేణు తదితరులు పాల్గొన్నారు. దళిత మహిళలపై అత్యాచారాలు అటకెక్కిన సంక్షేమం వైఎస్ జగన్తోనే అంబేడ్కర్ ఆశయ సాధన ఆయనను తిరిగి ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా సాగుదాం వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబు పిలుపు రాజమహేంద్రవరంలో దళితుల ఆత్మీయ సమావేశం -
మూగజీవాలకూ హక్కులున్నాయ్..
ఫ పశువులు, వన్యప్రాణులను చంపడం నేరం ఫ జంతు రవాణాలో జాగ్రత్తలు అవసరం రాయవరం: శారీరకంగా ఎక్కువగా బాధిస్తే, గొడ్డును బాదినట్లు బాదారు అంటారు. పశువుకన్నా హీనంగా ప్రవర్తించాడంటారు. అంటే పశువులను ఇష్టం వచ్చినట్లు దండించవచ్చని, అవమానించవచ్చని చాలా మంది ఉద్దేశం. వాటికి నోరు లేదు కాబట్టి ఎవరికీ తమ బాధ చెప్పుకోలేవు. అలాంటి మూగజీవాల రక్షణకు చట్టాలు ఉన్నాయన్న సంగతి చాలా మందికి తెలియని విషయం. అయితే మనుషులకే కాదు జంతువులకూ హక్కులుంటాయని మాచవరం పశు వైద్యురాలు ఎం.బిందు వివరించారు. అకారణంగా జంతువులను హింసిస్తే జరిమానాతో పాటు జైలుశిక్ష కూడా విధించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. జంతువుల రవాణా, పెంపకంలోనూ వాటికి ఇబ్బంది కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటీవల కాలంలో మూగజీవాలు, పశువులను విచక్షణా రహితంగా వాహనాల్లో తరలిస్తున్నారు. పదుల సంఖ్యలో పశువులను చిన్న చిన్న వాహనాల్లో కుక్కి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. మూగజీవాల రక్షణ కోసం ప్రభుత్వం పలు చట్టాలు చేసింది. వాటిని అమలు పరిచేందుకు వివిధ విభాగాల అధికారులతో కమిటీలు వేసింది. అయినప్పటికీ పశువుల హక్కుల ఊసెక్కడా కన్పించడం లేదు. జంతువులను క్రూరంగా హింసిస్తూ ఆటోలు, లారీల్లో రవాణా చేస్తుంటారు. పశువుల మార్కెట్ నుంచి పశు సంపదను ఒకచోట నుంచి మరోచోటకు తరలించే క్రమంలో తీవ్ర హింసకు గురిచేస్తున్నారు. అలాగే పంట చేను మేసిందనే కోపంతో కొందరు పశువులను ఇష్టం వచ్చినట్లు బాదినా, నోరులేని పశువులు ఆ దెబ్బలను మౌనంగా భరిస్తూ ఉంటాయి. మానవ మనుగడకు సహాయపడుతూ జీవించే జంతుజాలం కోసం చట్టం ఏం చెబుతుందంటే.. చట్టం... జరిమానాలు ఫ జంతువులపై క్రూరత్వ నివారణ/ నిరోధక చట్టం 1960లో అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం వాహనాల్లో ఓవర్ లోడింగ్, తీవ్రంగా కొట్టడం, చిత్రహింసలకు గురిచేయడం, నొప్పిని కలిగించే చర్యలను క్రూరత్వంగా పరిగణిస్తారు. ఫ పది రూపాయలకు పైన విలువ చేసే ఏ జీవినైనా హింసిస్తే భారత శిక్షాస్మృతి కింద నేరమవుతుంది. ఫ చిన్న వయసులో ఉన్న పశువులను, వ్యాధి బారిన పడిన వాటిని గానీ ఎలాంటి పనులకూ ఉపయోగించరాదు. ఫ అవసరం కోసం లేదా కావాలని పశువుల శరీరానికి హాని కలిగించే మందులు, పదార్థాలను ఇవ్వకూడదు. కొందరు పశువుల యజమానులు పాల దిగుబడిని పెంచేందుకు అనవసరంగా మందులను ఇచ్చి బాధిస్తూ ఉంటారు. ఇలాంటి వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతుంది. ఫ పశువులను ఒకచోట నుంచి మరోచోటకు తరలిస్తున్నప్పుడు వ్యాన్లు, ఆటోల్లో కిక్కిరిసేలా ఉంచరాదు. వాటికి బాధ కలిగించకుండా తరలించే ఏర్పాటు చేయాలి. ఒక వాహనంలో పరిమితికి మించి పశువులను తరలించడం నేరం. ఫ అలాగే పశువులు, జంతువులను ఎక్కువ సేపు కట్టేసి ఉంచడం కూడా నేరమే. ఫ జంతువులు, పక్షులను పందెం కోసం వాడడం, చిత్రహింసకు గురిచేయడం, చంపడాన్ని చట్టం నిషేధించింది. ఫ వధశాలలు తప్పనిసరిగా లైసెన్స్ పొందాలి. చూడితో ఉన్న, మూడు నెలల కంటే తక్కువ వయసున్న జంతువులను వధించరాదు. పశు వైద్యాధికారి పరీక్షించిన తర్వాతే జంతువును వధించాలి. లేదంటే నేరంగా పరిగణిస్తారు. వన్యప్రాణులకూ రక్షణ వన్య ప్రాణులను వేటాడడం, వాటిని ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలు శిక్షార్హం. ఇలాంటి నేరాలకు పాల్పడితే సెక్షన్–1 (ఏ) ప్రకారం జరిమానా విధిస్తారు. మూడేళ్లలో మరోసారి ఇలాంటి తప్పు చేసినట్లు రుజువైతే జరిమానాతో పాటు మూడు నెలల శిక్ష కూడా విధిస్తారు. ప్రత్యేక నిఘా ఏర్పాటు మూగజీవాలను హింసిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. వాటి హక్కుల రక్షణకు చట్టాలున్నాయి. వాటిని అక్రమంగా తరలించడంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం. అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం ఇస్తే కేసులు నమోదు చేసి, మూగజీవాలను రక్షిస్తాం. – బి.రఘువీర్, డీఎస్పీ, రామచంద్రపురం పరిశీలించిన తర్వాతే రవాణా పశువులు, జంతువులను రవాణా చేసేటప్పుడు స్థానిక పశువైద్యాధికారి వాటిని పరిశీలించి, అవి ఆరోగ్యంగా ఉన్నాయని నిర్ధారించిన తర్వాతే తరలించాలి. అప్పుడే ఈనిన పశువు లేదా అనారోగ్యంతో ఉన్న పశువును తరలించడం నేరం. చూడితో ఉన్న పశువు, లేగదూడలను వేరే పశువులతో కలిపి రవాణా చేయడం నేరం. – ఎం.బిందు, పశు వైద్యాధికారి, మాచవరం -
డైరెక్టర్ల అసమర్థత వల్లే అన్యాయం
అమలాపురం టౌన్: జయలక్ష్మి ఎంఏఎం కోపరేటివ్ సొసైటీ ప్రస్తుత బోర్డు డైరెక్టర్ల అసమర్థత వల్లే బాధితులకు నేటికీ అన్యాయం జరుగుతోందని బాధితుల స్టీరింగ్ కమిటీ కన్వీనర్ యీరంకి రఘు భూషణ్ ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డు డైరెక్టర్లు తక్షణం రాజీనామా చేసి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమలాపురంలోని ఏఎస్ఎన్ కళాశాల ప్రాంగణంలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్టా జిల్లాలకు చెందిన సొసైటీ బాధితులు ఆదివారం సమావేశమై బోర్డులో జరుగుతున్న అవకతవకలపై చర్చించారు. సొసైటీ బోర్డు తిప్పేసి ఏళ్లు గడుస్తున్నా బాధితులకు ఒక్క రూపాయి కూడా న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సొసైటీ అమలాపురం బ్రాంచి బాధితుడు టీవీడీఎన్ ప్రసాదరావు మాట్లాడుతూ సొసైటీలో ప్రస్తుతం జరుగుతున్న అవకతవకలను సమావేశానికి వివరించారు. సొసైటీ బాధితుడు, విశ్రాంత బ్యాంక్ అధికారి గుళ్లపల్లి వెంకటరామ్ మాట్లాడుతూ పారదర్శకత లేని ప్రస్తుత బోర్డు వల్ల బాధితులకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. ఇప్పటి వరకు 80 మంది డిపాజిటర్లు మరణించారని, బాధితులకు న్యాయం చేయలేని అమలాపురానికి చెందిన ఇద్దరు డైరెక్టర్లు తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్క అమలాపురం శాఖ పరిధిలోనే దాదాపు రూ.50 కోట్ల వరకూ డిపాజిట్లు చేసి నష్టపోయారని పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన అమలాపురానికి చెందిన బోర్డు డైరెక్టర్లు స్వామి ప్రసాద్, గవర్రాజు కుమార్లను బాధితులు తమ డిపాజిట్ల కోసం నిలదీసినా వారి నుంచి సరైన సమాధానం రాలేదు. సొసైటీ బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేసి డైరెక్టర్ల చేత రాజీనామాలు చేయించి తాజాగా కొత్త బోర్డును నియమించాలని సమావేశం నిర్ణయిస్తూ ఓ కార్యచరణ ప్రకటించింది. సొసైటీలో డిపాజిట్లు చేసి మోసపోయిన బాధితులంతా ఒక తాటిపై ఉండి తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని తీర్మానించింది. సమావేశంలో మహిళా బాధితులు కూడా వచ్చి తమ నిరసన తెలియజేశారు. సమావేశంలో సొసైటీ బాధితులు పుత్సా కృష్ణ కామేశ్వర్, వి.సుబ్బారావు, కస్తూరి రవికుమార్, పిల్లి గణేష్, చక్రవర్తి, బదరీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. జయలక్ష్మి సొసైటీ బాధితుల ఆవేదన పాతవారి స్థానంలో కొత్త డైరెక్టర్లను ఎన్నుకోవాలని కార్యాచరణ ప్రణాళిక అమలాపురం సమావేశంలో నిర్ణయం -
ఘనంగా జన్మనక్షత్ర పూజలు
● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది ● రూ.30 లక్షల ఆదాయంఅన్నవరం: జన్మ నక్షత్రం మఖను పురస్కరించుకుని సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లకు ఆదివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆయుష్య హోమం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున రెండు గంటలకు ఆలయం తెరచి స్వామి, అమ్మవార్లకు అర్చకులు సుప్రభాత సేవ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, సత్యదేవుడు, అమ్మవార్ల మూలవిరాట్టులకు, శివలింగానికి మహన్యాస పూర్వక పంచామృతాభిషేకం చేసి, సుగంధభరిత పుష్పాలతో అలంకరించి పూజించారు. ఉదయం 7 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతించారు. యాగశాలలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ సత్యదేవుడు, అమ్మవారికి ఆయుష్య హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. స్వామి, అమ్మవారిని ఆలయ ప్రాకారంలో టేకు రథపై ఊరేగించారు. ఈ కార్యక్రమాలను వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, యనమండ్ర శర్మ, ఉపాధ్యాయుల రమేష్, చిట్టి శివ, ఆలయ ప్రధానార్చకుడు ఇంద్రగంటి నరసింహమూర్తి, అర్చకులు ఇంద్రగంటి వేంకటేశ్వర్లు, దత్తాత్రేయశర్మ, పరిచారకుడు గణేష్ తదితరులు నిర్వహించారు. సత్యదేవుడిని సుమారు 30 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు రెండు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. -
వరద గోదారి
● సముద్రంలోకి 6 లక్షల క్యూసెక్కులు ● ఎగువన తగ్గుతున్న ఉధృతి ధవళేశ్వరం: గోదావరి వరద ఉధృతి పెరిగింది. దీంతో, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి ఆదివారం రాత్రి 6,01,884 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ఎగువ నుంచి వరద నీరు పోటెత్తుతూండటంతో మిగులు జలాల విడుదలను పెంచారు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో గోదావరి వరద ఉధృతి తగ్గుతోంది. దీంతో, ధవళేశ్వరం వద్ద కూడా సోమవారం నీటి ఉధృతి తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 34.60 అడుగులకు చేరింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10.90 అడుగులుగా నమోదైంది. మరిడమ్మ సన్నిధిలో భక్తుల సందడి పెద్దాపురం: మరిడమ్మ మహోత్సవాల్లో భాగంగా ఆఖరి ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చి, క్యూలైన్లలో బారులు తీరారు. సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. అమ్మవారి దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా ఆలయ ట్రస్టీ చింతపల్లి శ్రీహర్ష, అసిస్టెంట్ కమిషనర్ కె.విజయలక్ష్మి ఆధ్వర్యాన ఏర్పాట్లు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పెద్దాపురం బ్రాహ్మణ సేవా సంఘం, సామర్లకోట లయన్స్ క్లబ్ ఆధ్వర్యాన భక్తులకు పులిహోర పంపిణీ చేశారు. కొత్తపేట, పాశిలి వీధి సంబరాలు ఘనంగా నిర్వహించారు. లోవకు కొనసాగుతున్న భక్తుల రద్దీ తుని రూరల్: ఆషాఢ మాసోత్సవాలు ముగిసి, శ్రావణ మాసం ప్రారంభమైనప్పటికీ లోవ దేవస్థానానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ జిల్లాల నుంచి ఆదివారం ప్రత్యేక వాహనాల్లో 30 వేల మంది భక్తులు తరలి వచ్చి, తలుపులమ్మ అమ్మవారిని క్యూ లైన్ల ద్వారా దర్శించుకున్నారని ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్, కార్యనిర్వహణాధికారి పెన్మె త్స విశ్వనాథరాజు తెలిపారు. పులిహోర, లడ్డూ ప్రసాదాల విక్రయం ద్వారా రూ.2,48,265, పూజా టికెట్లకు రూ.2,62,031, తలనీలాలకు రూ.19,150, వాహన పూజలకు రూ.7,550, వసతి గదులు, పొంగలి షెడ్లు, కాటేజీల అద్దెలు రూ.87,576, విరాళాలు రూ.66,375 కలిపి మొత్తం రూ.6,90,947 ఆదాయం లభించిందని వివరించా రు. తలుపులమ్మ అమ్మవారికి భక్తులు హుండీల ద్వారా సమర్పించిన నగదును సోమవారం లెక్కిస్తామని ఈఓ తెలిపారు. దేవదాయ శాఖ, బ్యాంకు అధికారుల పర్యవేక్షణలో హుండీలను తెరచి, నగ దు లెక్కిస్తామన్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఉద్యోగులు, శ్రీవారి సేవకులు పాల్గొంటారన్నారు. -
● చెత్తలో చిత్తై..
అందమైన లోకమనీ.. రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామా.. అంత అందమైంది కానేకాదని ఓ కవి వాక్యం. నిజమే కదా. కొందరి జీవితాలు నిర్వచనాలకు అందనివి. వివర్ణమైన జీవనాన్ని ఎవరు ఆశిస్తారు? బరువైన బతుకుదెరువు ఎవరైనా ఎంచుకుంటారా? విధిరాతగా ఎంచి ఓ నిట్టూర్పు విడవడం తప్ప. ఈ శ్రమజీవిని కన్న తల్లి తన బిడ్డ ఇలా జీవించాలని కోరుకుంటుందా? ఎంత అగత్యమో కదా..? పూట గడవడానికి ముక్కుపుటాలు అదిరే మురుగునీటిలో తేలియాడే ప్లాస్టిక్, గాజు సీసాల సేకరణే జీవనాధారం కావాలా? చెత్తలో చిత్తైన జీవనపోరాటం ఎన్నాళ్లో..! రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్ వీరభద్రపురం ప్రధాన డ్రైనేజీలో ఓ శ్రామికుని జీవనమిది. – ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్) -
కోటసత్తెమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
నిడదవోలు రూరల్: తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి ఆలయానికి ఆదివారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారిని దర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. ప్రధానార్చకుడు అప్పారావుశర్మ పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అమ్మవారి దర్శనాలు, ప్రసాదం, పూజా టికెట్లు, ఫొటోల అమ్మకం ద్వారా దేవస్థానానికి రూ.2,01,266 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ వి.హరి సూర్య ప్రకాష్ తెలిపారు. కోటసత్తెమ్మ వారి నిత్యాన్నదాన ట్రస్టుకు నిడదవోలుకు చెందిన అయితం కనకయ్య, లక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారులు సత్యనారాయణ, గంగాధర్, శివయ్య కుటుంబ సభ్యులు ఆదివారం రూ.లక్ష విరాళం సమర్పించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవిశంకర్, ప్రధానార్చకుడు అప్పారావుశర్మ, సిబ్బంది పాల్గొన్నారు. ఎయిడెడ్ ఉపాధ్యాయ పరీక్ష ప్రశాంతం కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఎయిడెడ్ ఉపాధ్యాయ పరీక్ష రాజమహేంద్రవరం, కాకినాడలోని అయాన్ డిజిటల్ సెంటర్లలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరులోని ఎస్తేర్ ఆగ్జిన్ రెసిడెన్షియల్ ఎయిడెడ్ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ ఎయిడెడ్ పోస్ట్లకు విద్యా శాఖ ఈ పరీక్షలు నిర్వహించింది. దీనికి మొత్తం 1,249 మంది అభ్యర్థులకు హాజరు కావాల్సి ఉండగా 426 మంది పరీక్షలు రాశారు. కాకినాడలోని అచ్యుతాపురం సెంటర్లో 181 మంది, రాజమహేంద్రవరం లూథరిగిరి సెంటర్లో 245 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని డీఈఓ వాసుదేవరావు తెలిపారు. కాకినాడ, రాజమహేంద్రవరంలోని పరీక్ష కేంద్రాలను పాఠశాల విద్యా శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ సందర్శించి, సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం అనపర్తి: మండలంలోని లక్ష్మీనరసాపురంలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలుర పాఠశాలలో 5 నుంచి ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం వరకూ ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రిన్సిపాల్ వి.నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ప్రవేశ పరీక్షతో సంబంధం లేకుండా ఎస్టీ విద్యార్థులకు 6, 7, 8, 9 తరగతుల్లో ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 28న నేరుగా పాఠశాలలో సంప్రదించాలని ఆయన సూచించారు. -
కక్ష పూరితంగానే మిథున్ రెడ్డి అరెస్టు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కక్షపూరితంగానే ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు జరిగిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ఆయనకు సౌకర్యాలు కల్పించాలంటూ వేసిన పిటిషన్పై ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయడాన్ని బట్టి ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నట్టు అర్ధం అవుతోందన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో అయితే 40 ఏళ్లుగా చంద్రబాబుకి వైరం ఉండొచ్చని, అది అడ్డం పెట్టుకుని ఆయన కొడుకుని ఇలా ఇబ్బంది పెట్టి ఆనందం పొందడం ఎంతవరకు సబబన్నారు. చివరకు మిథున్ రెడ్డిని భార్య, పిల్లలు కలవడానికి వస్తే కూడా ఏదో రకంగా ఆపే ప్రయత్నం చేస్తూ వచ్చారన్నారు. అసలు ప్రభుత్వ మద్యం పాలసీలో నష్టం ఎక్కడ వచ్చిందని, ఎక్కడా అవకతవకలు జరగలేదన్నారు. 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే సరికి రూ.18 వేల కోట్ల మేర మద్యం ద్వారా ఆదాయం ఉండేదని, అదే జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.25 వేల కోట్లకు పెరిగిందన్నారు. మరి రూ 3,200 కోట్లు అవినీతి ఎలా నిరూపిస్తారని ప్రశ్నించారు. 2019కి ముందు చంద్రబాబు ప్రభుత్వంలో డిస్టిలరీలకు ప్రివిలేజ్ ఫీజు తగ్గించడం వలన ప్రభుత్వ ఖజానాకు రూ.3 వేల కోట్ల నష్టం వచ్చిందన్నారు. అది కదా స్కామ్, క్విడ్ ప్రోకో అంటే అన్నారు. ఇవన్నీ ప్రజలు అంతా గమనిస్తున్నారని భరత్ అన్నారు. మాజీ ఎంపీ భరత్ రామ్ -
సంక్షామ గృహాలు!
సాక్షి, రాజమహేంద్రవరం/నెట్వర్క్: అపరిశుభ్రతతో కూడిన పరిసరాలు, చాలీచాలని గదులు.. దోమలతో సహజీవనం.. నేలపై భోజనాలు.. వెరసి సంక్షేమ, రెసిడెన్షియల్ వసతి గృహాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పేద విద్యార్థుల సంక్షేమం, వసతితో కూడిన విద్య అందించేందుకు నెలకొల్పిన గృహాల నిర్వహణ లోపం, అపరిశుభ్ర వాతావరణం కంపరం కలిగిస్తున్నాయి. నాణ్యమైన ఆహారం లేకపోవడం మరో సమస్య. సీసీ కెమేరాలు, ప్రహరీలకు విద్యుత్ ఫెన్సింగ్ లేకపోవడంతో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. సీసీ కెమెరాలు ఉన్నా సరిగా పనిచేయని పరిస్థితి. వసతిగృహాల్లో వసతులపై ఇటీవల హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ తరచూ ఆందోళన కలిగించే భయంకర ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన చెందింది. ఇలాంటి ఘటనలపై స్పందించకపోతే భావితరాలపై ఆ ప్రభావం పడుతుందని స్పష్టం చేసింది. ఈ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని అభిప్రాయపడింది. విద్యార్థులు భద్రంగా, సురక్షితంగా విద్య, వసతి పొందేలా చూడాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేసింది. జిల్లాలోని వసతిగృహాల్లో ‘సాక్షి’ చేపట్టిన ప్రత్యేక పరిశీలనలో అనేక సమస్యలు తేటతెల్లమయ్యాయి. జిల్లాలో ఇలా.. జిల్లా వ్యాప్తంగా 36 ఎస్సీ సంక్షేమ వసతి గృహాలు ఉండగా.. సుమారు 2,600 మందికి పైగా విద్యార్థులు వసతి పొందుతున్నారు. బీసీ హాస్టళ్లు 24 ఉండగా 1,657 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఒక గురుకుల పాఠశాల ఉంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న గురుకుల, కేజీబీవీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో అధ్వాన పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. అన్నిచోట్లా ఇబ్బందులే.. ● రాజమహేంద్రవరం నగరంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ముగ్గురు వార్డెన్లు మూడు విభాగాలుగా పనిచేస్తున్నారు. వీరిలో 310 మంది విద్యార్థులున్నారు. వారిని ముగ్గురు వార్డెన్లకు సమానంగా విభజించారు. ● ఎస్సీ బాలుర హాస్టల్లో 90 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ తాగేందుకు రక్షిత నీరు లేదు. మున్సిపల్ నీటినే తాగుతున్నారు. ఆర్ఓ ప్లాంట్ నిరుపయోగంగా ఉంది. ● ఎస్సీ బాలుర కళాశాల హాస్టల్లో వార్డెన్ లేరు. సమీప ఎస్సీ బాలుర హాస్టల్ వార్డెన్ ఇన్చార్జ్జిగా వ్యవహరిస్తున్నారు. ● ఎస్టీ బాలుర హాస్టల్లో వంట గది, చుట్టూ ప్రహరీ లేవు. ఆ ఆవరణలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ హాస్టళ్లకు స్కావెంజర్లు లేకపోవడంతో వార్డెన్లు సొంత డబ్బులతో ఏర్పాటు చేసి పనులు కానిస్తున్నారు. ● కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి సాంఘిక సంక్షేమ వసతి గృహంలో 3 నుంచి పదో తరగతి వరకు 29 మంది విద్యార్థులు ఉన్నారు. రూ.12 లక్షలతో చేపట్టిన హాస్టల్ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇంకా ఫ్లోరింగ్, శ్లాబ్ లీకేజీ పనులు చేయాలి. కిటికీలకు మెష్లు లేవు. విద్యార్థులు దోమల బెడదతో బాధపడుతున్నారు. చుట్టుపక్కల వారు చెత్త వేయడంతో అపరిశుభ్రంగా ఉంది. ● రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో మూడు హాస్టళ్లు ఉన్నాయి. ధవళేశ్వరంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్, కడియంలో బీసీ బాలుర వసతి గృహం, ఎస్సీ బాలికల వసతి గృహాలు ఉన్నాయి. ధవళేశ్వరం ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో గతంలో సాక్షిలో ప్రచురితమైన కథనాలకు ఫ్యాన్లు, కిటికీలకు, తలుపుల బాగుచేయించి దోమల మెష్లు వేశారు. మరుగుదొడ్లు బాగుచేయించారు. భవనానికి పెయింటింగ్ వేయాల్సి ఉంది. ● కడియం బీసీ బాలుర వసతి గృహంలో 13 మంది, ఎస్సీ బాలికల వసతి గృహంలో 25 మంది ఉంటున్నారు. వీరికి పాఠశాల దూరంగా ఉండడంతో తల్లిదండ్రులు ఇక్కడ చేర్చేంచేందుకు ఆసక్తి చూపడం లేదు. రెండు వసతి గృహాలకు రెండేసి మరుగుదొడ్ల అవసరం ఉన్నప్పటికీ విద్యార్థులు తక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వం మంజూరు చేయడం లేదు. సబ్ మెర్సిబుల్ మోటారు సరిగా పని చేయక గోదావరి రక్షిత నీటిని వినియోగిస్తున్నారు. లైట్లు, ఫ్యాన్లు, వంట సామగ్రి, మిక్సీ, గ్రైండర్ ఇటీవలే ఇచ్చారు. రెండు భవనాలకు పెయింటింగ్స్ వేయాల్సి ఉంది. ● అనపర్తి నియోజకవర్గం అనపర్తి మండలంలో అనపర్తి శివారు లక్ష్మీ నరసాపురంలో గురుకుల రెసిడెన్షియల్ హాస్టల్ జూనియర్ కాలేజీ ఉంది. ఇందులో సుమారు 483 మంది చదువుతున్నారు. హాస్టల్లో డైనింగ్ హాలు, బయట పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. తినేసి వదిలేసిన ఆహార పదార్థాలు, చేతులు శుభ్రం చేసుకునే ప్రదేశం అపరిశుభ్రంగా ఉన్నాయి. డైనింగ్ హాల్ ద్వారం వద్ద టైల్స్ శిథిలమయ్యాయి. ఈ హాస్టల్లో ఒకటి నుంచి 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులు చదువుతున్నారు.హైకోర్టు మార్గదర్శకాలు ఇలా.. వసతి గృహం భవనం చుట్టూ సోలార్ ఎలక్ట్రికల్ ఫెన్సింగ్తో ప్రహారీ నిర్మించాలి. గేటు తప్పనిసరిగా ఉండాలి. విద్యార్థుల రాకపోకలు ఎంట్రీ, ఎగ్జిట్ రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలి. హాస్టల్ ప్రవేశ మార్గం, కామర్ ఏరియాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. మురగుదొడ్లు శుభ్రంగా ఉండాలి. నీటి సదుపాయం కల్పించాలి. హాస్టళ్ల సిబ్బందికి ప్రవర్తనా నియమావళిని నిర్దేశించాలి. విద్యార్థినులపై అసభ్య ప్రవర్తన, వేధింపులకు ఆస్కారం లేకుండా చూడాలి. జాతీయ శిశు సంరక్షణ ప్రమాణాలకు అనుగుణంగా హాస్టళ్లు ఉండాలి. ఇలా అనేక మార్గదర్శకాలు రూపొందించింది. జిల్లా వ్యాప్తంగా ఒక్క వసతి గృహంలోనూ ఈ మార్గదర్శకాలు పూర్తి స్థాయిలో అమలవుతున్న దాఖలాలు లేవు. వసతి గృహాల్లో సమస్యల తాండవం అపరిశుభ్రత, తాగునీటికి ఇబ్బందులు నేలపైనే భోజనాలు నిరుపయోగంగా సీసీ కెమెరాలు హైకోర్టు ఆదేశాలు పట్టని ప్రభుత్వం -
నేటి నుంచి డిపార్ట్మెంటల్ పరీక్షలు
డీఆర్ఓ సీతారామ మూర్తి సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో మే 2025 డిపార్ట్మెంటల్ పరీక్షలు ఆదివారం నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు 6 రోజుల పాటు నిర్వహించనున్నట్టు డీఆర్ఓ సీతారామమూర్తి తెలిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఈ మేరకు వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. స్థానిక రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్లో ఈ పరీక్షలకు సుమారు 3,771 మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరుగుతాయన్నారు. కన్వెన్షనల్ పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని డీఆర్ఓ సూచించారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందు నుంచి కేంద్రంలోకి అనుమతించాలని, కేంద్రాల వద్ద సెక్షన్ 144 అమలు చేయాలని అర్బన్ తహసీల్దార్ను ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా, మెడికల్ క్యాంప్ తదితర చర్యలు చేపట్టాలని, పోలీసు భద్రత పటిష్టంగా పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ ఎం.బాబర్, సెక్షన్ ఆఫీసర్ సీహెచ్ యోగేశ్వరరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. సీబీటీ హెల్ప్లైన్ ఏర్పాటు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కొంతమూరులోని ఎయిడెడ్ స్కూలుకు సంబంధించి ఆదివారం జరగనున్న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కు హెల్ప్లైన్ కేటాయించినట్లు డీఈఓ కె.వాసుదేవరావు శనివారం తెలిపారు. అభ్యర్థులు సమాచారం కోసం హెల్ప్లైన్ 83091 77952 నంబర్లో సంప్రదించి ఉదయం 8.00 గంటలోపు సమాచారం తెలుసుకుని పరీక్షా కేంద్రానికి హాజరు కావాలన్నారు. నేడు విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు రాజమహేంద్రవరం సిటీ: జిల్లాలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలలో విద్యుత్ బిల్లుల వసూలు కౌంటర్లు ఆదివారం సెలవు దినమైనప్పటికీ పనిచేస్తాయని ఈపీడీసీఎల్ ఎస్ఈ కె.తిలక్కుమార్ శనివారం తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బిల్లులు చెల్లించాలన్నారు. విద్యుత్ రెవెన్యూ కార్యాలయాలతో పాటు, ఏపీ ఈపీడీసీఎల్ సెక్షన్ ఆఫీస్ కలెక్షన్ కౌంటర్లు, ఏటీపీ సెంటర్ లలో కూడా బిల్లులు చెల్లించవచ్చునని తెలిపారు. -
లిటిల్ బడ్స్ బర్త్డే.. ట్రెండీగా!
నెలకో పండగ.. ఏడాదికో ఉత్సవంఒక మధుర జ్ఞాపకం ప్రస్తుతం పిల్లల పుట్టిన రోజులు నెలవారీగా చేస్తూ ఫొటోలు తీయడం సంప్రదాయంగా మారింది. ఈ ఫోటోలు వారి శారీరక వృద్ధి, హావభావాలు, వ్యక్తిత్వ వికాసాలను నెలనెలా చిత్రీకరిస్తూ.. వా ప్రగతిని కళ్లకు కడతాయి. ఇది కేవలం వయసు పెరిగిన రోజు కాదని, వారి బాల్యంలో అమూల్యమైన క్షణాలను పదిలం చేస్తాయి. – బి.హేమ, సైంటిస్ట్, రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం రూరల్: ఏ ఇంట అయినా క్యార్మని శబ్దం ఎప్పుడు వినిపిస్తుందా అని ఎదురుచూడని దంపతులు ఉండరు. ఆ రోజు కోసం ఏళ్ల తరబడి నిరీక్షణ. అది ఫలించిన నాడు ఆ ఇంట అంతకు మించిన పండగ ఏముంటుంది. ఆ బిడ్డ పెరుగుదలలో ప్రతి అంకం ఆ ఇంట ఓ ఉత్సవమై అలరారుతుంది. గత తరాల అమ్మమ్మల సంప్రదాయం.. నేటి అమ్మల ట్రెండీనెస్ కలగలసి బుజ్జాయిల పుట్టిన రోజులు థీమ్లుగా రూపాంతరం చెందుతున్నాయి. గత తరాల అమ్మమ్మలు శిశువు రెండో నెలలో నవ్వితే నువ్వుండలు చేసి పంచడం.. మూడో నెలలో బోర్లా పడితే బొబ్బట్లు చేసి సందడి చేయడం.. ఆరో నెలలో పాకడం మొదలుపెట్టగానే పరమాన్నం వండి నోరు తీపిచేయడం.. ఏడో నెల గడప దాటితే గారెలు వంటి సరదాగా దండ వేసి పంచడం.. పదో నెలలో అడుగులేస్తుంటే అరిసెలు వండడం.. అందరికీ తెలిసిందే. నేటికీ చాలా ఇళ్లలో ఈ సందడి కనిపిస్తున్నా వీటికి అదనంగా ప్రతి నెలా పుట్టినరోజు చేస్తూ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. అదికూడా ట్రెండీగా. ఏడాది పాటు ప్రతి నెలా ఒక్కో థీమ్తో పుట్టిన రోజును చేస్తున్నారు. ఆ పన్నెండు నెలల జ్ఞాపకాలను ఫొటో ఫ్రేమ్లు, వీడియోల రూపంలో క్రోడీకరించి మొదటి ఏడాది పుట్టినరోజును వైభవంగా నిర్వహిస్తూ బంధుమిత్రులకు చూపి, సోషల్ మీడియాలో పోస్టుచేసి లైక్లకు, కామెంట్లకు మురిసిపోతున్నారు. నయా బర్త్డే సెలబ్రేషన్స్పై ‘సాక్షి’ సండే స్పెషల్ స్టోరీ. సరికొత్తగా అలంకరణ విభిన్న థీమ్లతో నిర్వహణ ఏడాది పొడవునా సంబరాలు అదో మధురానుభూతి ఏడాదికి ఓ బర్త్డే నుంచి నెలనెలా వేడుకలు జరుపుకోవడం కొత్త ట్రెండ్. మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దవాడు అభిరామ్కు నెలనెలా కొత్త బట్టలతో అలంకరించి పండ్లు, స్వీట్లు, చాక్లెట్స్తో అలంకరించాం. ఇప్పుడు చిన్నవాడు అనిరుథ్కు కూడా అలాగే చేస్తున్నాం. ఇది వారి జీవితంలో మధురానుభూతిగా నిలిచిపోతుంది. ప్రతి నెల ఫొటోలను భద్రంగా ఉంచి, ఏడాది పూర్తయిన తరువాత అన్నీ కలిపి ఫ్రేమ్ చేయించి ఇంటిలో పెట్టుకుంటాం. – అడ్డాల ఇందుమాధురి, గృహిణి, బొమ్మూరు కలకాలం గుర్తుండాలని... బర్త్డేకి ఏడాది వరకు ఎదురు చూడడం ఎందుకని.. నెలనెలా ఒక్కో థీమ్తో మా పాపను రెడీ చేశా. ఫొటోలు తీసి భద్రంగా ఉంచా. పెద్దయ్యాక చూపిస్తే తను కూడా సంబరపడుతుంది. ఒకప్పుడంటే కెమెరామన్ వచ్చి ఫొటోలు తీసేవాడు. ఇప్పుడు ఫోన్లోనే ఫొటోలు తీసి ఎడిటింగ్ చేస్తున్నా. మంచి పాటను యాడ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడితే చాలా లైక్లు, కామెంటు వస్తున్నాయి. – వలవల దేదీప్య, గృహిణి, మోరంపూడి ప్రతి నెలా పండగే మా గారాలపట్టి యశశ్వి పుట్టినరోజును ప్రతి నెలా ఓ వేడుకలా చేసుకుంటున్నాం. కుటుంబసభ్యులంతా కలిసి సందడి చేస్తాం. పిల్లల చిన్నప్పటి ఫొటోలు భద్రంగా ఉంచితే పెద్దయ్యాక చూసి మురిసిపోతారు. ప్రతినెల కొత్త బట్టలు వేసి ఒక్కో రకమైన వస్తువులు, ఇతర పండ్లతో నెలల నంబర్లు వేసి ఫొటోలు తీసుకుంటాం. ఏడాది పాటు ఈ ఫొటోలను భద్రపరచి ప్రదర్శిస్తాం. – సుకీర్తి, సచివాలయ ఉద్యోగి, నగరం -
వేతన సవరణకు సానుకూలం
సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్ర పేపర్మిల్లులో పనిచేసే శాశ్వత ఉద్యోగులకు వేతన సవరణపై మిల్లు యాజమాన్యం సానుకూలంగా స్పందించడం కార్మికుల విజయమని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పేపర్ మిల్లు యాజమాన్య వైఖరి, కార్మికుల సమస్యల పరిష్కారానికి తాను చేపట్టిన ఆందోళన వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమైనప్పటికీ.. పూర్తిగా కార్మికులకు న్యాయం జరగలేదన్నారు. శాశ్వత ఉద్యోగులకు మంచి చేస్తూనే కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికుల డిమాండ్ల సాధనలో పోరాటం కొనసాగుతుందన్నారు. కార్మికుల పక్షాన పోరాడేందుకు జక్కంపూడి కుటుంబం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. వాస్తవానికి గతంలో జరిగిన వేతన ఒప్పందాల కంటే ఇది గొప్పగా లేకపోయినా, పరిశ్రమ మేలు కోరుకునే వారిగా కార్మికులే కొంతమేర రాజీపడి యాజమాన్యంతో జరిగిన వేతన సవరణ చర్చలలో తమ అంగీకారాన్ని తెలిపారన్నారు. కేవలం తాము పని చేస్తున్న పరిశ్రమ బాగుండాలనే ఏకై క లక్ష్యంతో యాజమాన్యం మొండి వైఖరిని భరించి సామరస్యంగానే సమస్యను పరిష్కరించుకోవాలని వేచి చూసి తమ విజ్ఞత చాటుకున్నారని అభినందించారు. వేతన సవరణ విషయంలో సహకరించిన కార్మిక నేతలకు, అధికారులకు, భాగస్వాములైన వారికి రాజా కృతజ్ఞతలు తెలిపారు. ఇది పేపర్ మిల్లు కార్మికుల విజయం వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా -
పీ–ఫోర్.. శ్రీమంతులు పరార్
మార్గదర్శకులు ముందుకు రావాలి పి–4 కార్యక్రమ లక్ష్యాన్ని అధిగమించే దిశగా సమష్టి కృషి జరుగుతోంది. జిల్లాలో ఉన్నత స్థాయిలో ఉన్న వారు, విద్యా వంతులు, పారిశ్రామిక వేత్తలు మార్గదర్శకులుగా స్వచ్ఛందంగా ముందుకురావాలి. ఒక వ్యక్తి అనేక కుటుంబాలకు దరఖాస్తు చేస్తే ఆ కుటుంబాలకు దీర్ఘకాలిక మద్దతుదారుగా నిలుస్తారు. ఉపాధి, విద్య, ఆరోగ్య పరిస్థితులపై స్వావలంబన దిశగా అడుగులు పడతాయి. జిల్లాలో 489 గ్రామ, వార్డు సచివాలయాల్లో గ్రామ సభలు నిర్వహించారు. జిల్లాలో మొత్తం 57 వేల బంగారు కుటుంబాలను ప్రాథమిక సర్వే ద్వారా గుర్తించాం. ప్రతి ఒక్క అధికారి, ఉద్యోగి, సమాజంలో మెరుగైన ఆర్థికస్థితిలో ఉన్న వ్యక్తులు ఒకరిని సంరక్షణ బాధ్యత తీసుకోవాలి. సామాజిక చైతన్యం, స్పృహ కలిగి ఉండే కార్యక్రమం ఇది. – పి.ప్రశాంతి, జిల్లా కలెక్టర్, తూర్పుగోదావరి జిల్లా సాక్షి ప్రతినిధి, కాకినాడ: సంపద సృష్టిస్తామని గద్దె నెక్కిన చంద్రబాబు సంపన్నుల వెంట పడుతున్నారు. జీరో పేదరికమే లక్ష్యంగా బంగారు కుటుంబాలకు ఉజ్వల భవిష్యత్ కల్పిస్తామని కూటమి సర్కార్ గొప్ప గా ప్రకటించింది. ఇందుకోసం విజయవాడలో ప్రత్యే క సమావేశం ఏర్పాటు చేసి జిల్లాల నుంచి బంగారు కుటుంబాల పేరుతో పెద్ద ఎత్తున జనాన్ని బస్సుల్లో తరలించి హడావిడి చేసింది. అలా అని ఆ బాధ్యతను ప్రభుత్వం మీద వేసుకోవడం లేదు. ఎంపిక చేసిన బంగారు కుటుంబాలను ఉన్నత స్థితికి తీసుకువచ్చే బాధ్యతను సంపన్నులకు అప్పగించే ఏర్పాట్లు చేస్తోంది. బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే వారికి మార్గదర్శులనే నామకరణం చేసింది. వాస్తవానికి సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అటువంటి ప్రభుత్వమే సమాజంలో సంపన్నులను గుర్తించి వారికి నిరుపేదలను దత్తత ఇవ్వడమంటే ప్రభుత్వం పేదల సంక్షేమం నుంచి వైదొలగి ఎన్జీఓలకు అప్పగించడమేనని విజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. ముందుకురాని మార్గదర్శకులు పేదలను ఉన్నత స్థాయికి తీసుకువస్తామని ప్రచారం చేసుకుంటున్న కూటమి సర్కార్ (పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ పార్టనర్షిప్) పీ–4 అమలుకు కిందా మీద పడుతోంది. ఉగాది సందర్భంగా ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. పీ–4 ప్రారంభంలో పెద్ద ఎత్తున బంగారు కుటుంబాల ఎంపిక చేశారు. తీరా చూస్తే ఆ కుటుంబాలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శకులు ముందుకు రావడం లేదు. ఆగస్టు 15 నాటికి నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని ముఖ్యమంత్రి వీడియో కాన్ఫ్రెన్స్లో దిశానిర్దేశం చేశారు. ఆ మేరకు జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయికి వెళ్లి అధికారులల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. అంతటితో ఆగకుండా సంపన్నుల్లో స్ఫూర్తి నింపేందుకు జిల్లా కలెక్టర్లు నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకున్నారు. అయినా ఉమ్మడి తూ ర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా మార్గదర్శుల కోసం అన్వేషణ తప్పడం లేదు. క్షేత్ర స్థాయిలో పరిస్థితితో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పీ–4 ‘ఆదిలోనే హంసపాదు’ అన్న సామెత చందంగా తయారై ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్నట్టుగా సాగుతోంది. కూటమి ప్రభుత్వంపై విశ్వాసం లేకనో మరేమిటో కారణం తెలియదు కానీ చంద్రబాబు చెబుతున్నట్టుగా ఆశించిన స్థాయిలో సంపన్నులు (మార్గదర్శులు) ముందుకు రావడం లేదు. ప్రభుత్వ ఆదేశాలతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధికార యంత్రాంగం అంతా సంపన్నుల అన్వేషణలో తలమునకలై ఉంది. ప్రభుత్వం నిర్దేశించిన గడువు ఆగస్టు–15 దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో మిగిలిన పనులన్నింటినీ పక్కనబెట్టి అధికారులు సంపన్నుల అన్వేషణలో పడ్డారు. మార్గదర్శకులు ముందుకు రాకపోవడంతో పీ–4 ప్రారంభంలో పెద్ద సంఖ్యలో ఎంపిక చేసిన బంగారు కుటుంబాల సంఖ్య తగ్గించే పనిలో పడ్డారు. బంగారు కుటుంబాల తుది జాబితా కోసం సచివాలయ ఉద్యోగుల దగ్గర నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు సర్వేలలో తలమునకలై ఉన్నారు. ఉదాహరణకు కాకినాడ జిల్లా యంత్రాంగం పారిశ్రామిక సంస్థలు, విభిన్న సంపన్న వర్గాలను మార్గదర్శకులుగా అభ్యర్థిస్తూ 80 లేఖలు రాశారని సమాచారం. మిగిలిన రెండు జిల్లాల్లోను కొద్ది అటు, ఇటుగా దాదాపు ఇదే వాతావరణం కనిపిస్తోంది. ఈ సరికే చారిటీలతో పేదలకు సేవలందిస్తున్నామని కొందరు, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఫండ్తో సేవలు చేస్తున్నామని మరి కొందరు, నిరుపేదలను ఆదుకుంటున్నామని ఇంకొందరు ఆసక్తి చూపకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అధికారులకు గుదిబండ పేదల్లో నిరుపేదల ఎంపిక పేరుతో బంగారు కుటుంబాల సంఖ్య కుదించే పనిలో పడ్డారు. బంగారు కుటుంబాల తగ్గింపు, మార్గదర్శకుల గుర్తింపు ప్రక్రియ మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు గుదిబండగా మారింది. మండల స్థాయిలో ఒక్కో అధికారి నలుగురికి తక్కువ కాకుండా మార్గదర్శకులను గుర్తించాలని ఉన్నత స్థాయి నుంచి అధికారులపై ఒత్తిళ్లు ఉన్నాయి. ఈ మేరకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. పారిశ్రామిక సంస్థలు, ప్రవాస భారతీయులు, వైద్యులు, విభిన్న రంగాలకు చెందిన సంపన్నులను గుర్తించి పీ–4 అమలులో మార్గదర్శకులుగా వారిని భాగస్వాముల్ని చేయాల్సిన బాధ్యతను అప్పగించడం అధికారులకు గుదిబండగా మారింది. మొదట్లో ఎడాపెడా కుటుంబాలను ఎంపిక చేయించిన ప్రభుత్వం ఇప్పుడు మార్గదర్శకాల పేరుతో కుటుంబాల సంఖ్యను తగ్గించే పని అప్పగించింది. సొంతిల్లు, విద్యుత్ కనెక్షన్, కుళాయి కనెక్షన్.. ఇవేవీ లేని అత్యంత నిరుపేదలను ఎంపిక చేయాలని పై నుంచి వచ్చిన ఆదేశాలతో మండల స్థాయిలో అధికారులు తల పట్టుకుంటున్నారు. ప్రజల కనీస అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. కానీ సంపన్నులకు ఆ బాధ్యతను అప్పగించడమంటే ప్రభుత్వం పేదల సంక్షేమం నుంచి వైదొలగడమేనని మేధావి వర్గం అభిప్రాయపడుతోంది. ప్రభుత్వ పథకాల నుంచి పేదలు లబ్ధి పొందితే ఎవరికీ జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉండదు. పీ–4లో సంపన్నుల నుంచి సాయం అందితే పేదలను వారి చెప్పుచేతల్లో పెట్టడమేనని అ భిప్రాయపడుతున్నారు. పీ–4 కోసం సంపన్నుల గుర్తింపు పెద్ద ప్రహసనంగా తయారై మండల స్థాయిలో అధికారులకు తలకు మించిన భారంగా తయారైంది. 57 వేల బంగారు కుటుంబాల గుర్తింపు తూర్పుగోదావరి జిల్లాలో 57 వేల బంగారు కుటుంబాలను ప్రాథమిక సర్వేలో గుర్తించారు. ఇందులో 1,226 మార్గదర్శకులకు 12,500 బంగారు కుటుంబాలను మ్యాపింగ్ చేశారు. ఇదే విషయాన్ని కలెక్టర్ ప్రశాంతి శుక్రవారం రాత్రి సీఎం నిర్వహించిన వీడియోకాన్ఫ్రెన్స్లో నివేదించారు. కలెక్టర్ మలకపల్లి గ్రామానికి చెందిన సనమండ్ర పోసిబాబు కుటుంబాన్ని దత్తత తీసుకున్నట్టు వీసీలో వివరించారు. -
నైతిక స్థైర్యంపై దాడులు
బదిలీ చేశారు సరే... కారణం ఏదైనా నార్త్,సౌత్ స్టేషన్ల సిబ్బందిని బదిలీ అయితే చేసేశారు. కొత్తగా ఇక్కడకు సిబ్బందిని తీసుకురానున్నారు. అయితే పూర్తిస్థాయిలో సిబ్బందిని తీసుకువస్తారా..ఇప్పుడున్న అరకొర సిబ్బందితోనే ఎకై ్సజ్ స్టేషన్లను నడిపిస్తారా అన్నది వేచి చూడాలి.● కూటమి నేతల మాట కాదన్నందుకు బదిలీలు ● రెండు ఎకై ్సజ్ స్టేషన్ల సిబ్బంది ఒకేసారి మార్పు రాజమహేంద్రవరం రూరల్: చట్ట వ్యతిరేక కార్యక్రమాలను అడ్డుకోమని ఆదేశించేది వారే...తీరా చట్టాన్ని అమలు చేస్తే కక్ష సాధింపు చర్యలకు దిగేది వారే అన్నట్టుగా తయారైంది కూటమి నాయకుల తీరు. రాజ్యాంగ వ్యవస్థలు, పాలనా పరిస్థితులు, ప్రజాప్రయోజనాలు వంటివి పట్టించుకోకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని తాము పట్టుకున్న కుందేటికి మూడే కాళ్లు అన్నరీతిలో అధికార పార్టీ నాయకులు చెలరేగిపోతున్నారు. ఉద్యోగులు నైతిక స్థైరాన్ని దెబ్బతీసే రీతిలో వీరు పేట్రేగుతుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా రెండు ఎకై ్సజ్ స్టేషన్లలో సిబ్బంది మొత్తాన్ని ఒకేసారి బదిలీ చేసి తాము అమలు చేస్తున్న రెడ్బుక్ రాజ్యాంగాన్నే పాటించాలని బాహాటంగానే ప్రకటిస్తున్నారు. కూటమి నాయకుల అధికార దుర్వినియోగానికి బలైన రాజమహేంద్రవరం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సౌత్, నార్త్ స్టేషన్ల సిబ్బంది మౌనంగా ఇబ్బంది పడుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కఠినంగా వ్యవహరించినందుకేనా? రాజమహేంద్రవరం ఎకై ్సజ్ నార్త్, సౌత్ స్టేషన్లలో సిబ్బంది మొత్తాన్ని గురువారం బదిలీ చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. నవోదయ 2.0 కింద సారాను అరికట్టడంలో రెండు స్టేషన్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఈ బదిలీకి కారణంగా చూపారు. అయితే వాస్తవ కారణం ఈ సిబ్బంది టీడీపీ, జనసేన నాయకుల పట్ల కఠినంగా వ్యవహరించడమేనని చర్చ జోరుగా సాగుతోంది. ఇటీవల నార్ట్ స్టేషన్ పరిధిలో ఒక టీడీపీ నాయకుడి సోదరుడిని అరెస్టు చేయడంతో అతను స్టేషన్పై దాడి చేసి ఇద్దరు కానిస్టేబుళ్లను గాయపరిచాడు. దీనిపై త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సౌత్ స్టేషన్ పరిధిలో శ్రీరామపురం గ్రామానికి చెందిన జనసేన నాయకుడిని సారా కేసులో అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. దీంతో టీడీపీ, జనసేన నాయకులు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి రెండు స్టేషన్ల సిబ్బందిని ఒకేసారి బదిలీ చేయించినట్లుగా ఉద్యోగ వర్గాల్లో ముమ్మరంగా చర్చ నడుస్తోంది. నిజాయితీగా పనిచేసినా.. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రాజమహేంద్రవరం నార్త్, సౌత్స్టేషన్ల పరిధిలో 52 మద్యం షాపులు ఉన్నాయి. రెండు స్టేషన్ల పరిధిలో 400 మందికి పైగా విఽవిధ కేసులలో ముద్దాయిలు ఉన్నారు. ఈ రెండు స్టేషన్లలోనూ కలిపి 15 మంది మాత్రమే సిబ్బంది ఉన్నారు. మద్యం షాపులపై పర్యవేక్షణ, కోర్టు పనులు, సారా నియంత్రణ చర్యలు, మద్యానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడం తదితర విధులను వీరు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా సర్వీసు రిజిస్టరు నిబంధనల ప్రకారం రెండు స్టేషన్లలో 30మందికి పైగా సిబ్బంది ఉండాలి. కానీ ఏళ్ల తరబడి సగం మందితోనే ఇక్కడ కథ నడిపిస్తున్నారు. ఇవి కాకుండా గోదావరిలంకలు, రాజానగరం తదితర ప్రాంతాల్లో రెండువందలకు పైగా సారాబట్టీలు ఉన్నట్లు సమాచారం. ప్రతిరోజూ చేయాల్సిన పనులు చేస్తూనే అటు సారా నిర్మూలన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. వాస్తవంగా ఎటువంటి ఆయుధాలు లేకుండా చిట్టడవులను తలపించే తోటల మధ్యలోకి వెళ్లి సారాబట్టీలను నిర్మూలించడం ఈ అరకొర సిబ్బందితో సాధ్యం కాదన్నది ఉద్యోగ వర్గాల మాట. అందుకే సారా తయారీ నియంత్రణలో విఫలమయ్యారనే కారణంతో వీరిపై బదిలీ వేటు వేయడాన్ని ఉద్యోగ వర్గాలు తప్పుబడుతున్నాయి. అయితే ఏళ్లతరబడి ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఇప్పుడే బదిలీ వేటు చేయడం వెనుక టీడీపీ, జనసేన నాయకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడమే ప్రధాన కారణమని చెబుతున్నారు. -
అతివృష్టి.. వరికి నష్టి
ఆక్రమణలు తొలగించాలి కొవ్వాడ కాలువ కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైంది. దీనికితోడు క్లోజర్ పనులు సక్రమంగా చేపట్టలేకపోవడం ఇబ్బందిగా మారుతోంది. కాలువల్లో గుర్రపుడెక్క తొలగించకపోవడం, పూడికతీత పనులు పూర్తి స్థాయిలో చేపట్టకపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది. దీంతో కాలువ పరివాహక ప్రాంతాల్లోని పంట పొలాలు ముంపునకు గురువుతున్నాయి. ఫలితంగా ఆయా గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలి. – తలారి వెంకట్రావు, వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి పంట పొలాలు కాపాడండి దారవరం స్లూయిజ్ నుంచి నీటి ప్రవాహం ముందుకు సాగకపోవడంతో పేమల కాలువ, దారవరం మడుగు పరివాహక ప్రాంతాల్లో వేలాది ఎకరాలు నీట మునుగుతున్నాయి. పంట పొలాలు ముంపు బారిన పడకుండా శాశ్వత పరిష్కారం చూపాలి. ఏటా ఇదే సమస్య ఎదురవుతోంది. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. – మద్దుకూరి రవిప్రసాద్, దారవరం సర్పంచ్సాక్షి, రాజమహేంద్రవరం: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వాన వ్యవసాయాన్ని కకావికలం చేస్తోంది. వర్షం నీరు పంట పొలాలను ముంచెత్తుతోంది. స్వేదం చిందించి చేపట్టిన నాట్లను నామరూపాల్లేకుండా చేస్తోంది. ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీటితో కాలువలు పొంగిపొర్లుతుండగా.. పలు ప్రాంతాల్లో వరి పొలాలు నీటి మునుగుతున్నాయి. మరోవైపు కొవ్వాడ, అప్పారావు చానల్ నీరు దిగువకు వెళ్లకపోవడంతో ఆ కాలువల పరిధిలో పంట పొలాల్లోకి నీరు చేసి వరినాట్లు నేలకొరుగుతున్నాయి. వెరసి రైతులకు అగచాట్లు తప్పడం లేదు. ఇప్పటికే పంట సాగుకు అప్పులు చేశామని.. పొలాలను నీరు ముంచెత్తుతుండటంతో మరోమారు నాట్లు వేయాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో 2వేల ఎకరాల్లో నీట మునిగిన వరి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా వరి సాధారణ సాగు విస్తీర్ణం 76,941 హెక్టార్లు కాగా.. ఈ నెల 21వ తేదీ నాటికి 55,021 హెక్టార్లలో నాట్లు పడ్డాయి. మిగిలిన విస్తీర్ణంలో నాట్ల వేయడానికి వర్షం కాస్త తెరపిస్తే అనువుగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 1,236 ఎకరాల్లో పంటలు నీట మునిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. సుమారు 2 వేల ఎకరాలకు పైగా నీట మునిగినట్లు సమాచారం. మరోవైపు ఈ నెల 28వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయన్న హెచ్చరికలతో రైతులు మరింత ఆందోళన చెందుతున్నారు. ముంపు ప్రభావం కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల పరిధిలో ఎక్కువగా ఉంది. ఎకరానికి రూ.15 వేల చొప్పున నష్టం రైతులు అప్పులు చేసి మరీ వరి సాగు చేపట్టారు. నారుమళ్ల దశ దాటి నాట్ల వరకు వచ్చింది. ఎకరం పొలానికి నాట్లు వేయాలంటే సుమారు రూ.10 వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. రెండు వేల ఎకరాల్లో నాట్లు మునిగిపోవడంతో రైతులకు ఇప్పటికే సుమారు రూ.2 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. నాట్లు దెబ్బతిన్న స్థానంలో తిరిగి వేయాలంటే మరో రూ.5 వేలు వెచ్చించాల్సి ఉంది. దీనికిగాను మరో రూ.కోటి వెచ్చించాలి. కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం లేక.. అన్నదాత సుఖీభవ నిధులు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ముంపు పరిణామం ఆర్థిక అవస్థలు తెచ్చిపెడుతోంది. నామమాత్రపు పూడికతీతతో ముంపు విజ్జేశ్వరం బ్యారేజీ నుంచి నీరు రిజర్వ్ చేసి అప్పారావు చానల్ ద్వారా ఏలూరు కెనాల్కు పంపుతారు. 5,000 క్యూసెక్కుల నీటి సరఫరా సామర్థ్యం ఉన్న కెనాల్ నుంచి 8,000 క్యూసెక్కుల నీటిని పంపడంతో తమ పొలాలు ముంపునకు గురయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏలూరు కెనాల్ గట్లు 5వేల క్యూసెక్కుల నీటిని పంపేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. వాటి ద్వారా 8 వేల క్యూసెక్కులు పంపాలంటే గట్లకు మరమ్మతులు చేపట్టాలి. కాలువలో పూడికతీత, గుర్రపు డెక్క తొలగించాలి. క్లోజర్ పనులు దక్కించుకున్న ఓ టీడీపీ నేత తూతూ మంత్రంగా పనులు కానిచ్చేసి చేతులు దులుపుకున్నారు. గుర్రపుడెక్క అలాగే ఉండిపోయింది. పూడికతీత పనులు సైతం నామమాత్రంగా చేపట్టడంతో ముంపు సమస్య తలెత్తిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డెక్కిన రైతులు ముంపు సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ ఇటీవల కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలం దారవరం, బ్రాహ్మణగూడెం, గరప్పాడు, మార్కొండపాడు, సమిశ్రగూడెం, ఎస్.ముప్పవరం గ్రామ రైతులు శెట్టిపేట ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు. అప్పారావు చానల్ను ఆనుకొని ఉన్న భూములు నారుమడి దశ నుంచి ముంపునకు గురవుతున్నాయన్నారు. ముంపు నివారణకు శాశ్వత పరిష్కారం ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన నీరు తమ పంట పొలాల్లో ఉండిపోవడంతో తాము పంట నష్టపోతున్నామని, వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు అంటున్నారు. దారవరం మడుగు నుంచి నేరుగా నీటి ప్రవాహం తూరలు లేదా, ప్రత్యేక డ్రెయిన్ ఏర్పాటు చేసి నిడదవోలు మండలం శెట్టిపేట లాకుల వద్ద పశ్చిమడెల్టా ప్రధాన కాలువలో కలిసేలా ఏర్పాటు చేస్తే సమస్యకు శాశ్వత పరిష్కారం లభ్యమవుతుందని రైతులు అంటున్నారు. లేకపోతే దారవరం లాకుల వద్ద లిఫ్ట్ పద్ధతిలో నీటిని అప్పారావు చానెల్కు తరలించాలని కోరుతున్నారు. పంట పొలాలను ముంచెత్తిన వరద కొవ్వాడ, అప్పారావు చానల్ నుంచి నీటి విడుదల తూర్పుగోదావరి జిల్లాలో 2వేలకు పైగా ఎకరాల్లో నీట మునిగిన వరి ఎకరానికి రూ.15 వేల వరకు నష్టం కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల్లో ప్రభావం లబోదిబోమంటున్న రైతులు.. ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఆందోళనముంపులోనే పంట పొలాలు కొవ్వాడ, అప్పారావు కాలువల వరద నీరు పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలో కలవాల్సి ఉంది. డెల్టా కాలువకు నీరు విడుదల చేస్తుండటంతో ఈ రెండు కాలువల నుంచి వచ్చే నీరు పశ్చిమ డెల్టా కాలువలో కలవడం లేదు. దీంతో వరద నీరు వెనక్కి పోటెత్తి వందలాది ఎకరాలను ముంచెత్తుతోంది. ఈ ప్రభావం కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల రైతులపై పడుతోంది. కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలంలో వందలాది ఎకరాలు నీట మునిగాయి. పంట పొలాలు ముంపులో ఉండటంతో కర్షకులు కన్నీళ్లు పెడుతున్నారు. దారవరం, బ్రాహ్మణగూడెం, మార్కొండపాడు, మల్లవరం, గౌరిపల్లి, చంద్రవరం గ్రామాల పరిధిలో పొలాలకు నీటి ముప్పు తప్పడం లేదు. నిడదవోలు మండలం శెట్టిపేట, సింగవరం ప్రాంతాల్లోనూ లోతట్టు ప్రాంతాల భూముల్లోకి నీరు చేరింది. పెరవలి మండలం కానూరు అగ్రహారంలో పంటలు నీట మునిగాయి. కొవ్వూరు మండలం ఆరికరేవుల, నందమూరు, దొమ్మేరు, పసివేదల, ధర్మవరం తదితర లోతట్టు ప్రాంత భూములు ముంపు బారిన పడ్డాయి. అధికారుల లెక్కల ప్రకారం కొవ్వూరు మండలంలో 113 ఎకరాలు, నిడదవోలు మండలంలో 197 ఎకరాలు, పెరవలిలో 25 ఎకరాలు ముంపు బారిన పడినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇదిలా ఉంటే.. కానూరు అగ్రహారంలో 150, ఊసులుమర్రు 150 ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లు రైతులు వెల్లడిస్తున్నారు. -
భూగర్భ జలాల సంరక్షణపై ముగిసిన శిక్షణ
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు (సీజీడబ్ల్యూబీ) ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరిగిన భూగర్భ జల స్థిరత్వ శిక్షణ శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో సీజీడబ్ల్యూబీ రీజినల్ డైరెక్టర్ ఎన్.జ్యోతి కుమార్ మాట్లాడుతూ గోదావరి రీజియన్లో వాటర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, భూగర్భ జలాలను పెంపొందించే మార్గాలను వివరించారు. క్షేత్ర స్థాయిలో వాటర్ లెవెల్ మానటరింగ్ విధానాలు, నీరు కాలుష్యం కాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కలిగించారు. మాజీ అధికారి ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ వాతావరణ, భూగర్భ జలాల మార్పులను వివరించారు. జియోసైన్సెస్ హెచ్ఓడీ డాక్టర్ వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ శ్రీగ్రౌండ్ వాటర్ సస్టైనబుల్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ ఈస్ట్ గోదావరిశ్రీ అనే అంశంపై చర్చించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి. విజయనిర్మల, అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలి
● సచివాలయ ఉద్యోగులతో వెట్టిచాకిరీ ● రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు బాపూజీ ముమ్మిడివరం: ఉద్యోగులకు ఇవ్వాల్సిన రూ.25 వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దాల బాపూజీ డిమాండ్ చేశారు. ముమ్మిడివరం డీఎంహెచ్ఓ కార్యాలయ ఆవరణలో శుక్రవారం జరిగిన జిల్లా ఉద్యోగుల సంఘ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని, పెండింగ్ డీఏ బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కాశీభట్ల రామసూర్యనారాయణ నాయకత్వంలో రాష్ట్రంలో ఎనిమిది లక్షల ఉద్యోగులను ఐక్యం చేసి ముందుకు సాగుతామన్నారు. జిల్లాలో అర్బన్, రూరల్ ప్రాంతాలలో సచివాలయ ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారని బాపూజీ వాపోయారు. సెలవు దినాలలో కూడా ఉద్యోగులతో పని చేయించుకోవడం అన్యాయమన్నారు. ఫీల్డ్ వర్కు పేరుతో నిర్బంధించి పని చేయించడం ఉద్యోగుల హక్కులను కాలరాయడమేనన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మల్లిబాబు మాట్లాడుతూ ఈ నెల 25, 26 తేదీల్లో విజయవాడలో జరిగే ప్రభుత్వ ఉద్యోగుల రాష్ట్ర సమావేశంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటానికి పిలుపు ఇస్తామన్నారు. జిల్లా అఽసోసియేట్ అధ్యక్షుడు కె.వీరబాబు, జిల్లా కోశాధికారి ఎస్.రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముమ్మిడివరం తాలూకా కమిటీ నియామకం జరిగింది. తాలూకా అధ్యక్షుడిగా జీఎస్వీడీ ప్రసాద్, కార్యదర్శిగా రెడ్డి సుబ్రహ్మణ్యం, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎం.నూకరత్నం, ఉపాధ్యక్షులుగా డాక్టర్ పూజ, టి.సుజాత, డి.సువర్ణరాజు, ఎం.స్టీవెన్, కోశాధికారి డి.మహేష్, సహయ కార్యదర్శులుగా ఎం.రమేష్, సీహెచ్ లలిత, నియమితులయ్యారు. -
గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్టు
రాజమహేంద్రవరం రూరల్: గంజాయి తరలిస్తున్న ముగ్గురిని ఎకై ్సజ్ అధికారులు అరెస్టు చేశారు. వివరాల్లలోకి వెళితే.. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి చింతాడ లావణ్యకు వచ్చిన సమాచారం మేరకు శుక్రవారం కొంతమూరు గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై గల నయరా పెట్రోల్ బంక్ సమీపంలో ఎకై ్సజ్ అధికారులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కారులో 220 కేజీల గంజాయిని తరలిస్తున్న తమిళనాడుకు చెందిన నాగరాజు, సుబ్రహ్మణ్యం, జైసల్వాలను అదుపులోకి తీసుకున్నారు. వారిపై ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నార్త్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి.హనుశ్రీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడిలో ఎస్సై సీహెచ్ రాజేష్, ఎం.శ్రీనివాసరావు, ఏ.రామాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
28 నుంచి ఎంపీడీఓలకు శిక్షణ
సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో ఈ నెల 28 నుంచి ఎంపీడీఓలుగా పదోన్నతి పొందిన 89 మందికి శిక్షణ ఇస్తున్నట్లు శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ కేఎన్వీ ప్రసాదరావు తెలిపారు. ఆయన శుక్రవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలో పదోన్నతి పొందిన ఎంపీడీఓలకు నెల రోజుల పాటు శిక్షణ ఉంటుందన్నారు. ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే మొదటి బ్యాచ్లో 46 మంది ఎంపీడీఓలు హాజరవుతారన్నారు. మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తియిన తర్వాత రెండో బ్యాచ్ శిక్షణ ఉంటుందన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 27,500 గటగట (వెయ్యి) 25,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 26,000 గటగట (వెయ్యి) 24,000 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
శిశువులకు అమృతమే..
జిల్లాలో పరిస్థితి అంగన్వాడీ కేంద్రాలు 1,726 బాలింతలు 5,846 గర్భిణులు 7,725 ఆరు నెలల లోపు చిన్నారులు 901 6 నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 7,017 3–6 ఏళ్ల వయస్సున్న చిన్నారులు 8,041 ● తల్లిపాలలో పోషకాలు ● బిడ్డలకు తాగిస్తే ఎన్నో ప్రయోజనాలు ● తల్లులకూ ఉపయోగమే ● వచ్చే నెల ఒకటి నుంచి తల్లిపాల వారోత్సవాలు రాయవరం: శిశువుకు అత్యంత బలం, రోగనిరోధక శక్తిని అందించేవి తల్లిపాలే. అవి దాదాపు అమృతంతో సమానం. అందుకే పిల్లలు పుట్టిన వెంటనే తల్లి పాలు పట్టించాలని వైద్యులు చెబుతారు. తల్లి పాలు తాగిన పిల్లలకు రోగనిరోధకశక్తి పెరుగుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఎదుగుదల చాలా చక్కగా ఉంటుంది. అయితే పిల్లలకు తల్లి పాలు ఎప్పటి వరకూ పట్టించాలి, ముర్రుపాలు అంటే ఏమిటి అనే విషయాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. దీని కోసం ఆగస్టు ఒకటి నుంచి ఏడో తేదీ వరకూ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గర్బిణులు, బాలింతలకు తల్లిపాల విశిష్టతపై అవగాహన కల్పిస్తారు. తల్లిపాల గొప్పదనం తల్లిపాలు బిడ్డకు అమృతం లాంటివి. బిడ్డ పుట్టిన వెంటనే అర్ధగంటలోపు ముర్రుపాలు పట్టాలి. ఎందుకంటే ఆ పాలలో బిడ్డను వ్యాధుల నుంచి రక్షించే ఖనిజాలు, మాంసకృతులు, విటమిన్–ఏ సమృద్ధిగా ఉంటాయి. ముర్రుపాలు బిడ్డకు వ్యాధి నిరోధక టీకాగా పనిచేస్తుంది. తల్లిపాలు శిశువులకు ప్రకృతి ప్రసాదించిన అత్యుత్తమమైన పౌష్టికాహారం అని చెప్పవచ్చు. వీటి వల్ల పిల్లలకు మలవిసర్జన సులభంగా అవుతుంది. తల్లితో చక్కటి అనుబంధం ఏర్పడుతుంది. బిడ్డ కోరుకున్న ప్రతి సారి ఎంతసేపు తాగితే అంతసేపు తల్లి పాలు పట్టించాలి. ఆరోగ్యకర సమాజం సాంకేతిక కొత్త పుంతలు తొక్కుతున్న నేటి కాలంలో తల్లుల వైఖరిలో కూడా మార్పు వస్తోంది. బిడ్డకు పాలిస్తే తమ అందం పాడవుతుందని ఆలోచించే తల్లులు కూడా నేటి సమాజంలో దర్శనమిస్తున్నారు. తల్లి పాలు పట్టడం వలన బిడ్డలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా, ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్న ఉద్దేశంతో వరల్డ్ అలైన్స్ ఫర్ బెస్ట్ ఫీడింగ్ ఏక్షన్(వాబా) అనే సంస్థ పర్యవేక్షణలో డబ్ల్యూహెచ్వో, యునిసెఫ్ వంటి అంతర్జాతీయ, బీపీఏఐ వంటి జాతీయ సంస్థల అనుబంధంగా ప్రపంచ వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. తల్లిపాలను ముఖ్యంగా బిడ్డ పుట్టిన గంట లోపే ముర్రుపాలు ఎందుకు పట్టించాలనే అంశంపై ఏటా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ఐసీడీఎస్, వైద్య ఆరోగ్యశాఖలు సంయుక్తంగా తల్లిపాల విశిష్టతపై అవగాహన కల్పిస్తున్నాయి. వైద్యారోగ్యశాఖ రక్షణ అవసరం బాలింతలకు వైద్యఆరోగ్యశాఖ రక్షణ అవసరం. వారికి అవసరమైన మందులు అందించాలి. ముఖ్యంగా రక్తహీనత రాకుండా చర్యలు తీసుకోవాలి. అవసరమైన సమయంలో గర్భిణుల రక్తశాతాన్ని పరిశీలించాలి. ప్రసవం తర్వాత కాల్షియం, ఐరన్ మాత్రలను ఆరు నెలల పాటు అందించాలి. అధిక పోషకాలు చిన్నారులను దృష్టిలో ఉంచుకుని తల్లి పాలు మాత్రమే పట్టించాలి. తల్లి పాలలోనే పోషకాలు ఉంటాయి. ఆకలితో ఉన్న బిడ్డకు డబ్బా పాలు ఇవ్వడం వల్ల శక్తిని కోల్పోతారు. బిడ్డకు ఆరు నెలల వరకు తల్లి పాలు మాత్రమే అందించాలి. డబ్బా పాల ద్వారా పౌష్టికాహారం అందదు. – డాక్టర్ రమ్య, పీహెచ్సీ వైద్యాధికారి, రాయవరం వ్యాధులు దూరం దేవుడు సృష్టించిన తల్లి పాలు ఒక టీకా కంటే గొప్పవి. తల్లి పాలు పట్టించడం వల్ల బిడ్డకు వైరల్ ఇన్పెక్షన్లు రాకుండా ఉంటాయి. తల్లి పాలలో ఎన్నో పోషకాలు, ప్రొటీన్లు ఉంటాయి. బిడ్డలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుదలకు, శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదం చేస్తాయి. – డాక్టర్ పి.ప్రశాంతి, గైనకాలజిస్ట్, మండపేట సీహెచ్సీ తల్లికీ ప్రయోజనాలు బిడ్డకు తల్లి పాలివ్వడం వల్ల ఆరు నెలల్లోపు గర్భం దాల్చే అవకాశం ఉండదు. ఇది సహజ కుటుంబ నియంత్రణ పద్ధతిగా ఉపయోగపడుతుంది. పాలిచ్చే తల్లులకు రొమ్ము, గర్భసంచి, అండాశయం క్యాన్సర్లు వచ్చే అవకాశం తక్కువని కొన్ని రకాల అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే ప్రసవ సమయంలో స్థిరత్వం కోల్పోయిన గర్భసంచి పూర్వస్థితికి వచ్చి రక్తస్రావం తగ్గుతుంది. తల్లిపాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అవి పుష్కలంగా రావాలంటే గర్భిణిగా ఉన్నప్పటి నుంచే పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. పాలు, చేపలు, గుడ్లు, తాజా కూరగాయలు, పండ్లు తగిన మోతాదులో తినాలి. -
మహిళను రక్షించిన పోలీసులు
తాళ్లపూడి (కొవ్వూరు): స్థానిక రోడ్ కం రైల్వే వంతెన పైనుండి గోదావరిలో దూకబోయిన మహిళను పట్టణ పోలీసులు రక్షించారు. వివరాల్లోకి వెళితే. కొయ్యలగూడెం మండలానికి చెందిన సుమారు 30 ఏళ్ల మహిళ తన కుటుంబ సమస్యలతో మనస్థాపం చెంది, ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో శుక్రవారం కొవ్వూరులోని రోడ్ కం రైల్వే వంతెన పైకి వచ్చింది. అటుగా ఆటోలో వెళ్తున్న శ్రీనివాస్ అను వ్యక్తి ఆ మహిళను గమనించి, 112 ద్వారా జిల్లా పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఆదేశాల మేరకు కొవ్వూరు పట్టణ సీఐ పి.విశ్వం వెంటనే కొవ్వూరు టౌన్ సిబ్బంది ఎంవీవీ సత్యనారాయణను స్థలానికి పంపారు. దీంతో ఆ మహిళను గుర్తించి, ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకుని, పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత ఆమె బంధువులకు అప్పగించారు. -
పరామర్శకు వెళుతూ మృత్యుఒడికి..
● ఆటోను ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ● తల్లీ కుమార్తెలు, ఆటోడ్రైవర్ మృతి ● మరొకరికి తీవ్ర గాయాలు ● పటవల వద్ద ప్రమాదం తాళ్లరేవు: ఆటోను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జాతీయ రహదారి 216లో పటవల జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, కోరంగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ ఏటిమొగ గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు పోతాబత్తుల దుర్గ, లంకే భవానితో పాటు దుర్గ చెల్లెలు ఓలేటి లక్ష్మి శుక్రవారం గాడిమొగ పంచాయతీ చినవలసల గ్రామానికి సంగాడి గంగరాజును పరామర్శించేందుకు ఆటోలో బయలు దేరారు. గంగరాజు ఇటీవల కంటికి ఆపరేషన్ చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నాడు. జాతీయ రహదారి 216లో పటవల జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలోకి వచ్చే సరికి వీరి ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొంది. ఈ ఘటనలో పోతాబత్తుల దుర్గ (55), లంకే భవాని (35)తో పాటు యానాం కురసాంపేటకు చెందిన ఆటో డ్రైవర్ కూరాకుల కుమార్ రాజు (30) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఓలేటి లక్ష్మిని అంబులెన్స్లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని కాకినాడ రూరల్ సీఐ చైతన్య కృష్ణ, కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ సందర్శించారు. ప్రమాదానికి కారణమైన బస్సును సీజ్ చేసి, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెన్షనర్లను విభజించడం తగదు
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పెన్షనర్లను రెండు విభాగాలుగా విభజించడం తగదని పెన్షనర్ల అసోసియేషన్ కన్వీనర్ భాస్కరరావు అన్నారు. తమ డిమాండ్ల సాధనకు ఫోరమ్ ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు నగరంలోని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో పుష్కర ఘాట్ వద్ద శుక్రవారం మానవహారంగా ఏర్పాడ్డారు. ఈ సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రూల్స్ను మార్చిందన్నారు. దీనివల్ల పెన్షనర్ల కమిషన్ అమలుకు ముందు రిటైరైన వారు, అమలు తరువాత రిటైరైన వారు అనే రెండు వర్గాలుగా విభజిస్తారని తెలిపారు. ఫలితంగా పే కమిషన్కు ముందు రిటైర్ అయ్యిన ఉద్యోగులు గతంలో మాదిరిగా పెన్షన్ రివిజన్ అడిగే హక్కు కోల్పోతారన్నారు. పాత పెన్షన్పైనే శేషజీవితం గడపాల్సి వస్తుందన్నారు. ఎప్పటికీ వారి పెన్షన్లో డీఏలు తప్ప ఇతరత్రా పెరుగుదల ఉండదన్నారు. పెన్షనర్లను రెండు వర్గాలుగా విభజించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎన్ మూర్తి, కె.సన్యాసిరావు, ఏవీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఎస్జీటీ, స్కూలు అసిస్టెంట్లకు పరీక్ష రేపు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కొంతమూరులోని ఎస్తేరు ఏగ్జిన్ రెసిడెన్షియల్ ఎయి డెడ్ ఎలిమెంటరీ, హైస్కూల్లో ఖాళీగా ఉన్న ఎస్జీటీ, స్కూలు అసిస్టెంట్ పోస్టులకు ఆదివారం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు శుక్రవారం తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారు ఈ పరీక్షకు హాజరుకావాలన్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వర కు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. కాకినాడలోని అయాన్ డిజిటల్ జోన్, అచ్యుతాపురంలో 486 మంది అభ్యర్థులకు మొదటి సెషన్లో స్కూలు అసిస్టెంట్, 500 అభ్యర్థులకు రెండో సెషన్లో ఎస్జీటీ వారికి పరీక్షలు జరుగుతాయన్నా రు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, లూథర్గిరిలోని అయాన్ డిజిటల్ జోన్లో 263 మంది అభ్యర్థులకు రెండో సెషన్లో ఎస్జీటీలకు పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు హాల్టిక్కెట్తో పాటు ఏదైనా గుర్తింపుకార్డుతో పరీక్షకు ఒక గంటముందు హాజరుకావాలన్నారు. సందేహాలున్న వారు ఫోన్ నంబర్ 98485 74622, 83091 77952లో సంప్రదించాలన్నారు. ఐవీఎఫ్ సెంటర్లలో తనిఖీలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రపంచ ఐవీఎఫ్ డే సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖాధికారులు ఐవీఎఫ్ సెంటర్లలో శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. డీఎం అండ్ హెచ్వో డాక్టర్ కె.వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు జీజీహెచ్కు చెందిన రెండు బృందాలు పలు ఐవీఎఫ్ సెంటర్లలో తనిఖీలు చేపట్టాయి. ఈ సందర్బంగా నోవా ఐవీఎఫ్ సెంటర్లో అసిస్టెవ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ లెవెల్ 2 ఇన్స్పెక్షన్ నిర్వహించి అవగాహన కల్పించారు. ఐవీఎఫ్ కేంద్రంలో సదుపాయాలు, పరికరాలు పరిశీలించారు. కేంద్రాలు ఏఆర్టీ చట్టం ప్రకారం నడుచుకోవాలని సూచించారు. తనిఖీ బృందంలో డిప్యూటీ డీఎంఅండ్ హెచ్వో పి.సరిత, గైనకాలజిస్ట్ డాక్టర్ అక్కమాంబ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వాసవి, అసిస్టెంట్ ప్రొఫెసర్ పెథాలజీ డాక్టర్ పరాంకుశ, రేడియాలజిస్ట్ డాక్టర్ రామచంద్ర, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రాజీవ్ శామ్యూల్ ఉన్నారు. -
ఖరీఫ్కు రిలీఫ్
పెరవలి: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఖరీఫ్కు ఊపిరులూదాయి. రైతులు వరినాట్లు ముమ్మరంగా వేస్తున్నారు. జిల్లాలో ఖరీఫ్ సాగు 76,941 హెక్టార్లలో చేపట్టడానికి రైతులు సిద్ధంగా ఉండగా ఇప్పటి వరకు 55,021 హెక్టార్లలో మాత్రమే నాట్లు వేశారు. జూలై 15 నాటికి పూర్తి అవ్వవలసిన వరి నాట్లు ఆలస్యంతో దీని ప్రభావం దిగుబడులపై పడుతుందని, ప్రకృతి వైపరీత్యాలకు పంటలు బలవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం రైతుల పట్ల చిన్నచూపు చూడటంతో ఖరీఫ్ సాగు కష్టాలతో మొదలైంది. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవటంతో ఖరీఫ్ పనులు ఆలస్యంగా ప్రారంభించారు. ముందస్తు సాగుకి రైతులను సన్నద్ధం చేయవలసిన అధికారులు రబీ ధాన్యం సొమ్ము ఇవ్వకపోవటంతో ఖరీఫ్ పనులు ఆలస్యం అయ్యాయి. ప్రస్తుత వర్షాలకు పుడమి పులకరించటంతో ఖరీప్ సాగు ఊపిరి పోసుకుంది. అయితే రైతులకు అవసరమైన ఎరువులు సిద్ధంగా లేవు. జిల్లాలో ఖరీఫ్ సాగుకి అన్ని రకాల ఎరువులు కలిపి 61,692 మెట్రిక్ టన్నులు అవసరం కాగా జూలై నెల 21వ తేదీకి 27,275 మెట్రిక్ టన్నులే ఉన్నాయి. అయితే అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి మాధవరావు చెబుతున్నారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు 20 వేల హెక్టార్లలో వరినాట్లు వేశారు. నెలాఖరుకు వరినాట్లు పూర్తి అవుతాయని అధికారులు అంటున్నారు. ఖరీఫ్ సాగు ఆలస్యానికి కారణాలు జూన్ 1వ తేదీనే కాలువలకు నీరు వదలినా, ఖరీఫ్ పనులు చేపట్టలేదు. చిన్న కాలువల ఆధునీకరణ పనులు మే నేలాఖరులో చేపట్టటం వల్ల నీరు చిన్న, పిల్ల కాల్వలకు వదలలేదు. దీంతో జూలై నెలలో వరి నాడుమడులు వేయటం ప్రారంభించారు. పెట్టుబడికి ప్రభుత్వం ఎటువంటి సాయం అందించకపోవడం, రబీ ధాన్యం సొమ్ము నేటీకీ ఇవ్వకపోవటంతో రైతులు అఽధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఖరీఫ్ పనులు చేపట్టారు. దీనితో ఖరీఫ్ సాగు ఆలస్యం అయింది. పెరవలిలో వరినాట్లు వేస్తున్న కూలీలు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముమ్మరంగా నాట్లు జిల్లాలో 76,941 హెక్టార్లలో వరి సాగు ఇప్పటి వరకు నాట్లు 55,021 హెక్టార్లలో నాట్లు 61,692 మెట్రిక్ టన్నులు అవసరం కాగా 27,275 టన్నులే లభ్యం ఎరువుల కొరత ఉన్నా లేదంటున్న అధికారులు జిల్లాలో ఎరువుల నిల్వలు ఇలా.. వివరం ఖరీఫ్ ప్రస్తుతం అంచనా ఉన్నవి (మెట్రిక్ టన్నులు) యూరియా 26,465 9,416 డీఏపీ 6,420 2,461 ఎంఓపీ 4,806 2,758 ఎన్పీకే 18,607 8,365 ఎస్ఎస్పీ 5,394 4,275 61,692 27,275నానా పాట్లూ పడుతున్నాం ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. పెట్టుబడి కోసం నానా పాట్లు పడుతున్నాం. సమయానికి ఎరువులు దొరకటం లేదు, ఒక్కోటి ఒక్కోచోట తెచ్చుకుంటున్నాం. దిడ్ల సంపతిరావు, రైతు, ఖండవల్లి ప్రభుత్వం ధాన్యం సొమ్ము ఇస్తే చాలు రబీ ధాన్యం సొమ్ము అందక ఖరీఫ్ పనులు చేపట్టలేదు. అప్పులు చేసి ఖరీఫ్ పంట పనులు చేపట్టాం. ప్రభుత్వం రైతులను ఆదుకోకపోయినా కనీసం పండించిన పంట కొనుగోలు చేసి సమయానికి సొమ్ము ఇస్తే చాలు. జుత్తుగ రంగయ్య, రైతు, ముక్కామల -
అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులా..?
● పార్లమెంట్ సమావేశాలకు ముందు ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ దారుణం ● వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మొహమ్మద్ ఆరిఫ్ సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పార్లమెంట్ సమావేశాలకు ముందు ఎంపీ మిథున్రెడ్డిని మద్యం కేసులో ఇరికించి జైలుకు పంపడం దారుణమని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మొహమ్మద్ ఆరిఫ్ అన్నారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. కూటమి పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను పార్లమెంటులో ప్రశ్నించకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. నాటి బ్రిటిష్ పాలనను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తలపిస్తోందని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం భారత రాజ్యాంగం స్థానంలో బ్రిటిష్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఎన్నో కీలకమైన బిల్లులు చర్చకు రానున్నాయని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చాలన్న సంకల్పంతో వైఎస్సార్ సీపీ ఎంపీలు ఉన్నారన్నారు. కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి నిధులు తెచ్చే ధైర్యం లేని కూటమి ఎంపీలు తమ చేతకాని తనాన్ని పార్లమెంటులో ఎవరూ ప్రశ్నించకుండా వ్యూహాత్మకంగా మిథున్రెడ్డిని అక్రమ అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్న విషయాన్ని మిథున్రెడ్డి లోక్సభలో బలంగా వినిపించారని, ఆయనకు ముస్లిం సమాజం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజల తిరుగుబాటుతో కూటమి సర్కారు కూలిపోవడం ఖాయమని అన్నారు. -
15 మంది ప్రొబేషనరీ ఎస్సైల నియామకం
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): నూతనంగా జిల్లాలో నియమించిన 15 మంది ప్రొబేషనరీ సబ్ ఇన్స్పెక్టర్లకు గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో దిశానిర్దేశం జరిగింది. ఈ సందర్భంగా వారితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏఎస్పీలు ఎంబీఎన్.మురళీకృష్ణ, ఏవీ.సుబ్బరాజు, ఎల్.అర్జున్, ఎల్.చెంచిరెడ్డి వారికి దిశానిర్దేశం చేశారు. వీరిలో అయిదుగురు మహిళలు, 10 మంది పురుషులు ఉన్నారు. వీరు ఐదు నెలలు పాటు వివిధ విభాగాలలో శిక్షణ తీసుకోనున్నారు. పోలీసు శాఖ ప్రతిష్ట పెంచేలా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఏఎస్పీలు వారికి సూచించారు. క్షేత్ర స్తాయిలో ప్రజలతో ఎలా మెలగాలి, పోలీసు స్టేషన్కు వచ్చిన బాధితుల సమస్యల పరిష్కారంలో శాస్త్ర, సాంకేతిక పద్దతులను ఎలా ఉపయోగించాలో వివరించారు. ప్రజలలో పోలీసు శాఖపై నమ్మకాన్ని పెంపొందించే విధంగా భాధ్యతలు నిర్వర్తించాలన్నారు. మారుతున్న కాలమాన పరిస్థితులకనుగుణంగా నేర నియంత్రణ, పరిశోధన ఉండాలని, చార్జీషీట్లో సాంకేతికమైన ఆధారాలను జోడించి ఎక్కువ శాతం శిక్షలు పడేలా కృషి చేయాలన్నారు. మహిళలు, చిన్నారులకు చెందిన కేసుల విషయంలో ఎటువంటి అలసత్వం చూపించవద్దన్నారు. డీఎస్పీలు బి.రామకృష్ణ, టీవీఆర్కే.కుమార్, కృష్ణంరాజు, పవన్కుమార్రెడ్డి, ఆలీఖాన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
మిథున్రెడ్డికి బెయిల్ రావాలని సర్వమత ప్రార్థనలు
తాళ్లపూడి: కుట్ర పూరితంగా అరెస్టు చేసిన ఎంపీ మిథున్రెడ్డికి దేవుడి దయతో త్వరగా బెయిల్ రావాలని వైఎస్సార్ సీపీ నియోజక వర్గ కోఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. కొవ్వూరులో గురువారం ఎంపీ మిథున్రెడ్డికి త్వరగా బెయిన్ రావాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, నాయకులు సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. 12వ వార్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. చర్చిలో ప్రార్థనలు నిర్వహించారు. మసీదులో ముస్లింలతో కలిసి నమాజు చేశారు. తలారి వెంకట్రావు మాట్లాడుతూ చంద్రబాబు బెయిల్పైనే బయట ఉన్నారని, ఆయన చేసిన అక్రమాలు బయట పడకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం మిథున్రెడ్డిని లిక్కర్ కేసులో అక్రమంగా ఇరికించి రిమాండ్కు పంపిందని అన్నారు. ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని తెలిపారు. మిథున్రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారని తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా యువజన అధ్యక్షుడు కంఠమణి రమేష్, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు చిట్టూరి అన్నవరం, జిల్లా అధికార ప్రతినిధి గంధం సాయి, మున్సిపల్ కౌన్సిలర్లు గీత, విల్లి పద్మ, నాయకులు ఉప్పులూరి సూరిబాబు, జుట్టా ఏడు కొండలు, సురేంద్ర, సుంకర సత్యానారాయణ, పద్మ, లక్ష్మణరావు, హనుమంతరావు, గంగాధర నాగేశ్వరావు, దక్షిణామూర్తి పాల్గొన్నారు. మొదటి విడత డీసెట్ కౌన్సెలింగ్ పూర్తి 99 సీట్లకు 56 మంది మాత్రమే హాజరు నల్లజర్ల: దూబచర్లలోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలో ఈ నెల 17 నుంచి 24 వరకు జరిగిన మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం ముగిసినట్టు ప్రిన్సిపాల్ ఎం.కమలకుమారి తెలిపారు. డైట్కు కేటాయించిన 99సీట్లకు కేవలం 56మంది అభ్యర్థులు మాత్రమే హాజరై సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ప్రవేశ పత్రాలు తీసుకున్నారు. సీనియర్ అధ్యాపకులు ఎన్.రామసుబ్రహ్మణ్యం, కెఎస్బీకే రాజ్కుమార్, కె.సరోజని, ఏఎస్ఆర్ ఆర్ గుప్తా ఈ సర్టిఫికెట్ల పరిశీలనలో పాల్గొన్నారు. డీఎడ్కు తగ్గుతున్న ఆదరణ దూబచర్ల డైట్ కళాశాలకు 99సీట్లు కేటాయిస్తే కేవలం 56మంది మాత్రమే కౌన్సిలింగ్కు హాజరవడం చూస్తుంటే డీఎడ్కు ఆదరణ తగ్గుతున్నట్టు కనపడుతోంది. తరుచూ డీఎస్సీ నిర్వహించక పోవడం, డీఎడ్ శిక్షణ పూర్తయి ప్రైవేటు పాఠశాలల్లో రూ.7వేలు, రూ.8వేలకు పనిచేయడం ఇష్టం లేకపోవడం కారణాలుగా కనిపిస్తున్నాయి. డాక్టర్ సీఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీకి అనుమతులు రద్దు! డీఎడ్ ప్రవేశాలకు సంబంధించి భీమవరం సీఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఎలిమెంటరీకి ఎన్.సీ.డి.ఈ. ఈ ఏడాది అనుమతులు రద్దు చేసింది. తొలుత ఆ కళాశాలకు చెందిన విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన కూడా దూబచర్ల డైట్ కళాశాలలోనే ఏర్పాటు చేశారు. ఆ కళాశాలకు 71 సీట్లు కేటాయించారు. 17 నుంచి 24వ తేదీ వరకు జరిగిన మొదటి దఫా కౌన్సెలింగ్కు అభ్యర్థులు ఎవరూ హాజరు కాలేదు. ఆ కళాశాలకు చెందిన 9మంది విద్యార్థులు దూబచర్ల డైట్ కళాశాలలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కన్వీనర్కు తెలియజేసి వారిని చేర్చుకోనున్నట్టు ప్రిన్సిపాల్ తెలిపారు. -
యాప్లతో యాతన..
పనిభారం.. నరకం సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకే అందించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ, వలంటీర్ వ్యవస్థలను తీసుకొచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వలంటీర్లను విధులకు దూరం పెట్టి, వారి పనిభారాన్ని సచివాలయ ఉద్యోగులపై మోపింది. బ్యాంకు సిబ్బంది చేయాల్సిన ఖాతాకు ఆధార్ లింక్, ఈకేవైసీ వంటి పనులను, ఐటీ శాఖ చేయాల్సిన వర్క్ ఫ్రం హోం సిటిజన్స్ గుర్తింపు సర్వేను, పరిశ్రమల శాఖ నిర్వహించాల్సిన ఎంఎస్ఎంఈ సంస్థల గుర్తింపు సర్వేలను, సహకార సంఘాల రికార్డుల కంప్యూటీకరణలో భాగంగా సహకార సంఘాల సిబ్బంది రైతులకు ఈకేవైసీ చేయాల్సిన పనులను సైతం సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. కపిలేశ్వరపురం: ఉన్నది ఊడపీకేలా.. పథకాలన్నీ అటకెక్కించేలా.. ఉద్యోగులను హింసించేలా.. పలు యాప్లతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రస్తుతం యాప్ల నిర్వహణ పథకాలు పొందుతున్న లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకో, ఇస్తున్న లబ్ధిని ఎగ్గొట్టేందుకో అన్నట్టు ఉంది. అంతేకాకుండా యాప్ల నిర్వహణతో ప్రభుత్వ, స్కీమ్ ఉద్యోగులు, సిబ్బందికి నరకం కనిపిస్తోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మొబైల్ యాప్ తెరిచి ఎవరింటికి వెళ్లినా ప్రభుత్వం తమకేమి మేలు చేస్తుందమ్మా అని అడగడంతో ఉద్యోగులు సంతోష పడేవారు. ఇప్పుడు యాప్ తెరిచి ఇంటికెళ్తే సదరు ఉద్యోగి ఏమీ చెప్పుకోలేని పరిస్థితి నెలకొంటుంది. తమపై యాప్ల భారాన్ని తొలగించాలంటూ అంగన్వాడీ తదితర చిరు ఉద్యోగులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఆందోళనలను సైతం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 18,32,332, కాకినాడ జిల్లాలో 20,92,374, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 17,19,013 మంది జనాభా ఉన్నారు. కాగా వారిలో అత్యధికులు కూటమి ప్రభుత్వం యాప్ల నిర్వహణలో బాధితులే. ఏదో రూపంలో వారి నుంచి సర్వేల ద్వారా వ్యక్తిగత వివరాలను సేకరిస్తుండటంతో ఎప్పుడు ఏ లబ్ధి ఎగిరిపోతుందోనంటూ ఆందోళనలో ఉన్నారు. ఇక స్కీమ్ ఉద్యోగులు పనిభారంతో అల్లాడుతున్నారు. కాకినాడ జిల్లాలోని 10 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,986 మెయిన్, మినీ అంగన్వాడీ కేంద్రాల్లో సుమారు 1,05,996 మంది ప్రీస్కూల్ పిల్లలు, 11,610 మంది బాలింతలు, 10,573 మంది గర్భిణులకు సేవలందిస్తున్న అంగన్వాడీలు పలుమార్లు యాప్లను రద్దు చేయాలని ధర్నా చేశారు. కోనసీమ జిల్లాలోని 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,726 మెయిన్, మినీ అంగన్వాడీ కేంద్రాలుండగా 86,296 మంది చిన్నారులు, 15,743 మంది గర్భిణులు, బాలింతలు ఉండగా, తూర్పుగోదావరి జిల్లాలో 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,536 మెయిన్, 26 మినీ మొత్తం 1,562 అంగన్వాడీ కేంద్రాల ద్వారా వేల సంఖ్యలో అంగన్వాడీలు యాప్లతో యాతన పడుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 135 పీహెచ్సీలు, 22 సీహెచ్సీలు, 7 ఏరియా ఆస్పత్రులు ఉన్నాయి. కాకినాడలో జీజీహెచ్, రాజమహేంద్రవరంలో ప్రభుత్వ ఆస్పత్రి ఉన్నాయి. ప్రభుత్వ, గ్రామీణ, అర్బన్ సీహెచ్సీల్లో 1,445 మంది హెల్త్ సెక్రటరీలు ఉన్నారు. 200 మంది ఏఎన్ఎంలు, 473 మంది స్టాఫ్ నర్సులు, 1232 మంది ఎంఎల్హెచ్పీలు, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1,396 మంది ఆశ కార్యకర్తలు పనిచేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 480, కాకినాడ జిల్లాలో 450, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 165 ప్రైవేటు ఆసుపత్రులున్నాయి. ఆయా సంస్థల్లో ఆరోగ్యపరమైన యాప్ల నిర్వహణతో సిబ్బంది పనిభారాన్ని మోస్తున్నారు. ఆన్లైన్.. పరేషాన్ సామాన్య ప్రజలకు సేవలందించేందుకు అంగన్వాడీ, ఆశ, తదితర చిరు ఉద్యోగులు ఎప్పుడూ ముందుంటారన్నది కరోనా లాంటి విపత్కర కాలంలోనే నిరూపితమైంది. వారిని గౌరవంగా చూసుకోవాల్సిన కూటమి ప్రభుత్వం యాప్ల పేరుతో వేధిస్తుండటంతో తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు 2.0 వెర్షన్ బాల సంజీవని యాప్లో కొత్త వర్షన్ను సవరించి ఏప్రిల్ 1వ తేదీ నుంచి కంపల్సరీ వర్కర్, హెల్పర్ ఫొటో తీసి, సబ్మిట్ చేసి, ప్రీ స్కూల్ పిల్లల ఫొటోలను కూడా ఇన్టైమ్లో తీసి సబ్మిట్ చేయాలంటున్నారు. వారికి సంబంధించిన మెనూ కూడా ఇన్టైమ్లో ఆన్లైన్ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వం సరకులను ఎప్పుడు పంపిస్తుందో తెలియని పరిస్థితుల్లో పీకపై కత్తిపెట్టినట్టు వెంటనే యాప్లో వివరాలను నమోదు చేయాలని చెప్పడాన్ని ఆయా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎగ్గొట్టేందుకు పావులు కదుపుతూ.. పెన్షన్స్ ఎగవేతకు పెన్షన్స్ పేమెంట్ యాప్ను పావుగా ప్రభుత్వం ప్రయోగిస్తుంది. అర్హులకే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను అందించేందుకు ఈ యాప్ను వినియోగిస్తున్నట్టు పైకి చెబుతుంది. ఈ యాప్లో లబ్ధిదారుల వివరాలను జియో ట్యాగింగ్ చేయడం ద్వారా 300 మీటర్ల దూరం దాటి సొమ్ము తీసుకుంటున్న వారిని గుర్తించి మరికొన్ని ఆప్షన్స్ను పూర్తి చేసేలా చేస్తుంది. తర్వాత వారిని విచారించి పింఛన్కు అర్హులా కాదా అనే దానిపై దృష్టి సారిస్తుందన్న వాదన ఉంది. సాంకేతిక దన్ను లేకుండా.. ఐసీడీఎస్ పరిధిలోని యాప్ల పట్ల లబ్ధిదారుల్లో సైతం వ్యతిరేకత వస్తుంది. యాప్లను రద్దు చేయాలంటూ తాము చేసిన ఆందోళనల్లో లబ్ధిదారులు సైతం పాల్గొన్నారు. సరైన సాంకేతిక దన్ను సమకూర్చుకుండా అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు, లబ్ధిదారులకు ఫేస్ రికగ్నిషన్ సిస్టం నిర్వహణ సాధ్యం కాదు. సమస్యలపై రాష్ట్రపతికి లేఖ కూడా రాశాం. – కె.కృష్ణవేణి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, మండపేట ఫేస్ రికగ్నిషన్ సిస్టం (ఎఫ్ఆర్ఎస్)తో యాతనఅంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు గుడ్లు, పాలతో పాటు మరికొన్ని పౌష్టికాహార పదార్థాలను అందజేస్తున్నారు. ఆయా వివరాలను రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని బాల సంజీవిని యాప్లో, కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని పోషణ ట్రాకర్లో ఫేస్ రికగ్నిషన్ సిస్టిం యాప్ ద్వారా నమోదు చేయాలని ప్రభుత్వం చెబుతోంది. లబ్ధిదారుల మొబైల్ నుంచి వచ్చే ఓటీపీతో వివరాలు ఖరారు చేయాలి. ఆ ప్రక్రియను సాగించేందుకు తగిన సాంకేతిక పరికరాలను కానీ, సమయాన్ని కానీ కూటమి ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ముందుగా ఫీడ్ చేసిన లబ్ధిదారుల ఫొటో ఎలా ఉండేదో వర్తమానంలో కూడా అచ్చుగుద్దినట్టు ఉంటేనే యాప్లో వివరాలు నమోదవుతున్నాయి. వివాహమైనప్పుడు యాప్లో ఫీడ్ చేసిన ఫొటోతో పిల్లలను కనివారిని పెంచుతున్న క్రమంలో ముఖంలో వచ్చిన మార్పులను యాప్ అంగీకరించకపోవడంతో యాతన పడుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీలకు ప్రభుత్వం తరఫున అప్డేటెడ్ సెల్ఫోన్లను ఇవ్వకపోవడంతో వారి సొంత ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుని యాప్లను వాడాల్సి వస్తుంది. ప్రభుత్వం నామమాత్రంగా ఇస్తున్న 2 జీబీ డేటా సరిపోకపోవడం, నెట్ సిగ్నల్స్ 5జీ కాకపోవడం లబ్ధిదారులను, అంగన్వాడీలను ఇబ్బంది పెడుతుంది. చిరుద్యోగులకు సంకటంలా నిర్వహణ కూటమి పాలనలో సంక్షేమానికి తూట్లు తిరకాసు పెట్టేందుకే ముందుకు.. -
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఘన స్వాగతం
సాక్షి, రాజమహేంద్రవరం: లిక్కర్ స్కాంలో అక్రమ అరెస్టుకు గురై, రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎంపీ మిథున్రెడ్డితో మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం ములాఖత్ అయ్యారు. విజయవాడ నుంచి రోడ్డు మార్గంలో బయలు దేరిన ఆయన రాజమహేంద్రవరం నగరంలో తాను తీసుకున్న ఇంట్లో కాసేపు కూర్చుని నేతలతో సమాలోచనలు చేశారు. అంతకు ముందు కొవ్వూరు టోల్గేట్ వద్దకు చేరుకోగానే.. అప్పటికే భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న వైఎస్సార్ సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, రీజనల్ కో–ఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల రావు, పార్టీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, తానేటి వనిత, మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ ఎమ్మెల్యేలు తలారి వెంకట్రావు, రౌతు సూర్యప్రకాశరావు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వరకు భారీ కాన్వాయ్గా వచ్చారు. మంత్రి కారుమూరి, జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, పెద్దాపురం ఇన్చార్జి దవులూరి దొరబాబు, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మహమ్మద్ ఆరిఫ్, మిథున్రెడ్డి కుటుంబ సభ్యులు సెంట్రల్ జైల్ వద్దకు చేరుకున్నారు. పెద్దిరెడ్డి, వనిత, భరత్ ములాఖత్ అయ్యే వరకు అక్కడే కూర్చున్నారు. అనంతరం పెద్దిరెడ్డికి వీడ్కోలు పలికారు. పోలీసుల ఆంక్షలు పోలీసులు జైలు పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేశారు. మిథున్రెడ్డిని కలిసేందుకు వచ్చిన జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్, మాజీ మంత్రి కారుమూరి, నేతలను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. జైల్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందని నానా హంగామా చేశారు. మిథున్రెడ్డికి ఆహారం, దిండు, దుప్పట్లను తీసుకెళ్లకుండా అడ్డుకున్నారు. చివరకు న్యాయవాది కలుగజేసుకుని తీసుకెళ్లడంతో సమస్య సద్దుమణిగింది. హైదరాబాద్కు పయనం మధురపూడి: బుధవారం మధురపూడి విమానాశ్రయం నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు. ఎంపీ మిథున్రెడ్డితో ములాఖత్ అనంతరం ఆయన ఇండిగో విమానంలో బయలుదేరారు. టోల్గేట్ వద్దకు భారీగా చేరుకున్న నేతలు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్రెడ్డితో ములాఖత్ -
కూటమి ప్రభుత్వ రెండు నాల్కల ధోరణి దుర్మార్గం
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా రెండు నాల్కలతో మాట్లాడుతున్న కూటమి నాయకుల ధోరణి దుర్మార్గం. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తానని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చడం దారుణమైన విషయం. గత ప్రభుత్వ అమ్మ ఒడి పథకం పేరును తల్లికి వందనంగా మార్చి.. రూ.15 వేలకు రూ.11 వేలు మహిళల ఖాతాల్లో వేసి మోసం చేయడం సరైన విధానం కాదు. కూటమి పాలనలో మహిళలకు ఇస్తానన్న ఏ హామీ అమలు కాలేదు. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మహిళలకు నెలకు రూ.1,500 ఇవ్వడంపై మాట్లాడుతూ రాష్ట్రాన్ని అమ్మేయాల్సి ఉంటుందనడం అత్యంత హేయమైన చర్య. మహిళలకు ఉచిత బస్సు అన్నారు. ఏడాది దాటినా ఇది అమలు కాలేదు. ఇలా మహిళలను కూటమి ప్రభుత్వం పూర్తిగా మోసం చేసింది. – జరీనా, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం -
శ్రావణంలో రత్నగిరికి కొత్త శోభ
పశ్చిమ రాజగోపురం వద్ద.. కాగా, విశాఖపట్నానికి చెందిన లారెస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ నిధులతో పశ్చిమ రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్డు నిర్మాణ పనులు కూడా ఈ శ్రావణ మాసంలోనే ప్రారంభించనున్నట్టు దేవస్థానం అధికారులు తెలిపారు. సుమారు రూ.1.5 కోట్ల వ్యయంతో వంద అడుగుల పొడవు, 175 అడుగుల వెడల్పున టెన్సిల్ షెడ్డు నిర్మించేందుకు లారెస్ కంపెనీ సంసిద్ధత తెలిపిందని అధికారులు చెప్పారు. మంచిరోజు చూసి పనులు ప్రారంభిస్తారని తెలిపారు. అన్నవరం: శ్రావణ మాసం సందర్భంగా రత్నగిరిపై పలు నిర్మాణాలకు శంకుస్థాపనలు జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ‘ప్రసాద్’ నిధులతో సత్యదేవుని నిత్య అన్నదాన భవనం, క్యూ కాంప్లెక్స్, టాయిలెట్ బ్లాక్లు తదితర నిర్మాణాలకు టూరిజం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పశ్చిమ రాజగోపురం వద్ద లారెస్ ఫ్మార్మాస్యూటికల్ కంపెనీ నిధులతో విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో పిలిగ్రిమేజ్ రీజువినేషన్ అండ్ స్ప్రిట్యువల్ అగ్నంటేషన్ డ్రైవ్ (ప్రసాద్) స్కీం టెండర్ గత వారం ఖరారైన సంగతి తెలిసిందే. రూ.18.98 కోట్ల వ్యయంతో చేపట్టే వివిధ నిర్మాణ పనులకు మూడో విడతగా మే నెలలో పిలిచిన నోటిఫికేషన్కు ఆరుగురు టెండర్లు దాఖలు చేయగా, రాజమహేంద్రవరానికి చెందిన గాలి సుబ్బరాజు అండ్ కంపెనీ 3.69 శాతం తక్కువకు టెండర్ దక్కించుకుంది. దీంతో ‘ప్రసాద్’ నిర్మాణాలకు శంకుస్థాపన చేసి, పనులు ప్రారంభించేందుకు టూరిజం శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. శ్రావణ మాసంలో ఈ పనులు ప్రారంభించనున్నారు. టెండర్ ఖరారుకు ముందే టూరిజం శాఖ చీఫ్ ఇంజినీర్ ఈశ్వరయ్య అన్నవరం దేవస్థానానికి విచ్చేసి, ప్రసాద్ నిర్మాణాల స్థలాలకు జియో ట్యాగింగ్ చేసిన విషయం తెలిసిందే. ప్రసాద్ స్కీం నిర్మాణాలివీ.. ● రూ.11.09 కోట్ల వ్యయంతో పాత టీటీడీ భవనం పక్కనే రెండంతస్తుల అన్నదాన భవనం ● ప్రస్తుత అన్నదాన భవనం పక్కనే రూ.5.9 కోట్ల వ్యయంతో క్యూ కాంప్లెక్స్ ● ప్రకాష్ సదన్ భవనం వెనుక ప్రస్తుతం పార్కింగ్ స్థలంగా వాడుతున్న ప్రదేశంలో అటు సత్యగిరి, ఇటు రత్నగిరికి దగ్గరగా రూ.61.78 లక్షల వ్యయంతో నిర్మించనున్న టాయిలెట్స్ బ్లాక్లు ● రూ.1.08 కోట్ల వ్యయంతో వ్యర్థ జలాల శుద్ధి ప్లాంట్ ● రూ.91.96 లక్షల వ్యయంతో భక్తుల క్యూ కాంప్లెక్స్ ప్రహరీ ఇవే కాకుండా ప్రసాద్ నిధులతో దేవస్థానానికి రూ.కోటి వ్యయంతో రెండు బ్యాటరీ కార్లు కూడా మంజూరు చేశారు. వీటిని దేవస్థానంలో సత్రాల నుంచి స్వామివారి ఆలయం, వ్రత మంటపాల మధ్య భక్తులను తరలించేందుకు ఉపయోగించనున్నారు. శంకుస్థాపనకు ఏర్పాట్లు అన్నవరం దేవస్థానంలో ప్రసాద్ నిధులతో వివిధ నిర్మాణాలకు శ్రావణ మాసంలో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్, టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్తో శంకుస్థాపన చేయించేందుకు ప్రయత్నిస్తున్నాం. అనంతరం నిర్మాణాలు వేగంగా కొనసాగించి, రెండేళ్లలోపు పూర్తి చేస్తాం. – ఈశ్వరయ్య, చీఫ్ ఇంజినీర్, టూరిజం శాఖ పట్టాలెక్కనున్న ‘ప్రసాద్’ నిర్మాణాలు అన్నదాన భవనం, క్యూ కాంప్లెక్స్, టాయిలెట్ బ్లాక్ల నిర్మాణాలకు త్వరలో శంకుస్థాపన -
డిమాండ్లు నెరవేర్చాలి
మత్స్యకారుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే మరింత ఉధృతంగా ఆందోళన చేస్తాం. ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్నా పాలక యంత్రాంగం పెడచెవిన పెడుతోంది. ఇది చాలా దారుణం. మత్స్యకారుల సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగుతుంది. ఇప్పటికే తినడానికి తిండి లేక మత్స్యకారులు ఆకలితో అలమటిస్తున్నారు. కూటమి పాలకులు వెంటనే స్పందించి మత్స్యకారుల డిమాండ్లు నెరవేర్చాలి. లేకపోతే ఉద్యమం మరింత తీవ్రతరం చేయాల్సి ఉంటుంది. – సంగాడి ఈశ్వరరావు, మత్స్య కార్మిక సంఘం నాయకుడు, కాకినాడ ● -
రాజకీయ ప్రేరేపిత అరెస్టులు అన్యాయం
జెడ్పీ చైర్మన్ విప్పర్తి సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్రంలో పాలన గాడితప్పి ఎమెర్జెన్సీ నడుస్తోందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ విమర్శించారు. కక్ష సాధింపులతో కూటమి పాలన సాగుతోందన్నారు. బుధవారం కాకినాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎకై ్సజ్ శాఖకు ఎటువంటి సంబంధం లేకున్నా అన్యాయంగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని అరెస్టు చేశారన్నారు. తప్పుడు ఆరోపణలు, బలవంతపు ఒప్పందాలు, అధికార దుర్వినియోగం ద్వారా కేసులు నమోదుచేయడం కుట్ర కోణాన్ని చెప్పకనే చెబుతోందన్నారు. మిథున్రెడ్డి అక్రమ అరెస్టును ప్రజాస్వామ్యవాదులు ముక్తకంఠంతో ఖండించాలన్నారు. తప్పుడు కేసులో ఇరికించి ఇరుకున పెట్టడం చాలా బాధాకరమన్నారు. 2014–19లో మద్యం మాఫియా నడిచిందని, ఇప్పుడు కూడా అదే సాగుతోందని రాష్ట్రం కోడైకూస్తోందన్నారు. రాష్ట్రంలో 4,380 లిక్కర్ షాపులు, 43 వేల బెల్ట్షాపులు, పర్మిట్ రూమ్లు ప్రైవేటు మాఫియాకు అప్పగించారన్నారు. ఇటువంటి వాస్తవాలు అన్నింటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. కక్షపూరిత రాజకీయాలకు ఇప్పటికై నా కూటమి సర్కార్ స్వస్తి పలికి అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడంపై దృష్టి పెట్టాలని విప్పర్తి విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇలా అక్రమ అరెస్టులకు పాల్పడటం సమంజసం కాదన్నారు. ‘నన్నయ’ వీసీ ఆచార్య ప్రసన్నశ్రీకి మరో అవార్డు రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీకి ప్రొఫెసర్ డాక్టర్ ఆర్.సుబ్బకృష్ణ స్మారక అవార్డు–2025 లభించింది. యూనివర్సిటీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో బుధవారం జరిగిన వర్చువల్ కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. దేశంలో 19 గిరిజన భాషలకు లిపి అభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ఇస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మణిపూర్లోని ఇంఫాల్(నార్త్)లోని క్లాసిక్ హోటల్లో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ఖ పాపులేషన్ ఎడ్యుకేషన్లో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి నారీ శక్తి అవార్డును, 2025కు నెల్సన్ మండేలా ఇన్స్పైర్ అవార్డును ఆమె అందుకున్నారు. ఈ సందర్భంగా ఆచార్య ప్రసన్నశ్రీని పలువురు అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. అదనపు సిబ్బందిని నియమిస్తాం రాజమహేంద్రవరం సిటీ: విద్యుత్ సంబంధిత ఇబ్బందులు పరిష్కరించేందుకు అవసరమైతే అదనపు సిబ్బందిని నియమిస్తామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. పారిశ్రామిక, వ్యాపార సంబంధ సమస్యలపై వెంటనే తనిఖీలు చేసి, పరిష్కరించేలా చర్యలు చేపట్టామన్నారు. బుధవారం రాజమ హేంద్రవరంలో ఆయన విద్యుత్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పనులు, ఆర్డీఎస్ఎస్ పను లపై ఆరా తీశారు. దరఖాస్తు చేసిన రైతులందరికీ వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయాలని ఆదేశించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అవసరమైన ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం, అదనపు ట్రాన్స్ఫార్మర్లు, లైన్లను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. గోదా వరి పుష్కరాలకు విద్యుత్ అధికారులు ఇప్పటి నుంచి సిద్ధంగా ఉండాలన్నారు. విద్యుత్ వ్యవ స్థపై కొందరు అపోహలు, గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు 75 వేల వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ పి.ప్రశాంతి, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ కె.తిలక్కుమార్, ఈఈ నక్కపల్లి శ్యామ్యూల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మిథున్ రెడ్డి అరెస్టు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు
వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబాసలామ్ సాక్షి, రాజమహేంద్రవరం: ఎంపీ మిథున్రెడ్డి అక్రమ అరెస్టు ప్రజాస్వామ్యానికి చీకటి రోజని వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబాసలామ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపీ మిథున్రెడ్డి అక్రమ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. కూటమి కుట్రలో భాగంగానే మిథున్ రెడ్డిని అరెస్టు చేశారన్నారు. నారా లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగానే వైఎస్సార్ సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు అబద్ధపు వాగ్దానాలు చేసిందన్నారు. వాటిని నిలబెట్టుకోలేక, ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు వైఎస్సార్ సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. తప్పుడు కేసులు, అరెస్టులకు భయపడేది లేదని, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతామన్నారు. రాములోరి సాక్షిగా ‘బెల్టు’కు వేలం చినవలసలలో రూ.7 లక్షలకు ఖరారు! తాళ్లరేవు: కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. గ్రామ స్థాయిలో మద్యాన్ని మరింత అందుబాటులోకి తెచ్చేందుకు అనధికారికంగా నిర్వహిస్తున్న వేలం పాటలకు సాక్షాత్తు రాములోరి ఆలయాన్ని వేదికగా చేయడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. శివారు మత్స్యకార గ్రామం గాడిమొగ పంచాయతీ చినవలసలలోని రామాలయంలో నిర్వహించిన వేలం పాటలో రికార్డు స్థాయిలో సుమారు రూ.7 లక్షలకు పాట ఖరారైనట్టు తెలిసింది. నూతనంగా ఎన్నికై న గ్రామ పెద్దల సమక్షంలో గంగాధరరావు అనే వ్యక్తి ఏడాది పాటు మద్యాన్ని విక్రయించుకునేందుకు ఈ పాట దక్కించుకున్నట్టు చెబుతున్నారు. మద్యం విక్రయాలకు పాట పెడుతున్నారని, పాడుకునేవారు రావాలంటూ చాటింపు వేయడం గమనార్హం. ఇంత జరుగుతున్నా అటు పోలీసులు కానీ, ఇటు ఎకై ్సజ్ అధికారులు కానీ పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మంగళవారం నిర్వహించిన వేలం విషయాన్ని వైఎస్సార్ సీపీ నాయకులు బయటపెట్టడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. -
క్రీడలతో శారీరక, మానసిక వికాసం
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని, క్రీడల తో శారీరక, మానసిక వికాసం కలుగుతుందని ఎల్ఐసీ రాజమండ్రి సీనియర్ డివిజనల్ మేనేజర్ సత్యనారాయణ సాహూ అన్నారు. రాజమహేంద్రవరం సూర్య గార్డెన్స్లో బుధవారం ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ క్యారమ్స్, చెస్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథి సత్యనారా యణ సాహూ మాట్లాడుతూ, విధి నిర్వహణలో బిజీగా ఉండే ఎల్ఐసీ ఉద్యోగులు ఇలాంటి పోటీలతో మానసికోల్లాసం, శారీరక ఆరోగ్యం పొందవచ్చన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి 82 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్టు తెలిపారు. క్యారమ్స్ ప్రపంచ, జాతీయ చాంపియన్లు అపూర్వ, పి.నిర్మల పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణ అని నిర్వాహకులు చెప్పారు. క్యారమ్స్ అంతర్జాతీయ రిఫరీ షేక్ జలీల్, చెస్ అంతర్జాతీయ రిఫరీ జీవీ కుమార్ పర్యవేక్షణలో పోటీలు కొనసాగాయి. ఎల్ఐసీ పీఅండ్ఐఆర్ మేనేజర్ ఎం.పూర్ణచంద్రరావు, స్పోర్ట్స్ బోర్డు మెంబర్లు సురేష్, శర్మ తదితరులు పాల్గొన్నారు. ఎల్ఐసీ ఎస్డీఎం సాహూ సౌత్ సెంట్రల్ జోన్ క్యారమ్స్, చెస్ పోటీలు ప్రారంభం -
స్థిర భూగర్భ జల నిర్వహణపై శిక్షణ
రాజానగరం: స్థిరమైన భూగర్భ జల నిర్వహణను నిర్థారించడానికి యూనివర్సిటీలు, సాంకేతిక సంస్థల మధ్య శాసీ్త్రయ, సమాజ ఆధారిత సహకారం ఉండాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ అన్నారు. యూనివర్సిటీ సెమినార్ హాలులో సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు సదరన్ రీజియన్ (హైదరాబాద్) ఆధ్వర్యంలో స్థిర భూగర్భ జల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని యూనివర్సిటీలో బుధవారం ప్రారంభించారు. ‘గ్రౌండ్ వాటర్ సబ్స్టైనబుల్ అండ్ మేనేజ్మెంట్ ఇన్ ఈస్ట్ గోదావరి’ అనే అంశంపై మూడు రోజుల పాటు ఈ శిక్షణ జరుగుతుందని వీసీ తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ వాటర్ బోర్డు రీజినల్ డైరెక్టర్ జ్యోతికుమార్, డిప్యూటీ డైరెక్టర్ వై.శ్రీనివాస్ భూగర్భ జలాల పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా భూగర్భ జలాన్వేషణ, రీచార్జ్ పద్ధతులపై పుస్తకాన్ని వీసీ ఆవిష్కరించారు. -
ఆటోలో తిప్పి.. తీవ్రంగా కొట్టి..
అమలాపురం టౌన్: ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.లక్షల వసూలు చేశారన్న వివాదంలో దళిత యువకుడితో పాటు, మున్సిపల్ మాజీ ఉద్యోగిని ఆరుగురు తీవ్రంగా హింసించిన ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు అమలాపురం డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో బుధవారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో ఈ కేసు వివరాలు వెల్లడించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, డబ్బు వసూలు చేశారనే వివాదంలో అయినవిల్లి మండలం వెలవెలపల్లికి చెందిన అధ్యాపకుడు దోనిపాటి మహేష్, మున్సిపల్ మాజీ ఉద్యోగి సిరసపల్లి ఉదయశంకర్ను తమ డబ్బులు ఎప్పుడిస్తారంటూ ఆరుగురు నిందితులు ఆటోలో పలుచోట్ల తిప్పి, తీవ్రంగా కొట్టారు. అమలాపురం పట్టణం శ్రీరామపురానికి చెందిన యల్లమెల్లి విజయ్ రవిశంకర్, అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లికి చెందిన ఉరదల బాలరాజు, విజయనగరం జిల్లా భోగాపురానికి చెందిన యర్రా కృష్ణను ఈ కేసులో ఇప్పటి వరకూ అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. పెద్ద సార్ మాట్లాడుతున్నారని.. మున్సిపాలిటీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఏడుగురు నిరుద్యోగుల నుంచి మున్సిపల్ మాజీ ఉద్యోగి సిరసపల్లి ఉదయశంకర్ రూ.లక్షల్లో వసూలు చేశాడు. అదిగో ఇదిగో ఉద్యోగమంటూ నిరుద్యోగులను మభ్య పెట్టాడు. వారిని నమ్మించేందుకు ఉదయ్శఽంకర్ ‘పెద్ద సార్ మాట్లాతున్నార’ని దోనిపాటి మహేష్తో ఫోన్ మాట్లాడించాడు. పలుమార్లు ఫోన్ కాన్పరెన్స్ను నిర్వహించి, నిరుద్యోగులతో పాటు, నిందితులతో మాట్లాడించేవాడు. అప్పటికే మహేష్కు ఉదయ్శంకర్ డబ్బు ఇవ్వాల్సి ఉండగా, ఇలా పెద్ద సార్గా మాట్లాడితే వచ్చిన డబ్బుతో బాకీ ఇచ్చేస్తానని మహేష్ను నమ్మించాడు. ఇందులో భాగంగా నిందితులు యల్లమెల్లి విజయ్ రవిశంకర్ తదితరులు మహేష్కు ఫోన్ చేసి తాము చెప్పిన చోటికి రాకపోతే చంపుతామని బెదిరించారు. దీంతో భయపడి మహేష్.. అప్పటికే బందీగా ఉన్న ఉదయ్శంకర్ను డబ్బు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్న విజయ్ రవిశంకర్ బ్యాచ్ వద్దకు వచ్చారు. పేరూరు వై.జంక్షన్కు వచ్చిన మహేష్తో పాటు, ఉదయ్శంకర్ను బోడసకుర్రు గోదావరి గట్టు వద్దకు తీసుకెళ్లి, పగులగొట్టిన బీరు బాటిళ్లతో చంపేస్తామని బెదిరించారు. రబ్బరు ట్యూబ్, కర్ర, కొబ్బరి మట్టతో తీవ్రంగా కొట్టారు. అక్కడి నుంచి మరో రెండు చోట్లకు ఆటోలో తీసుకెళ్లి, ఇద్దరినీ చిత్రహింసలు పెట్టారు. అయితే ఉదయ్శంకర్ తప్పించుకోవడంతో, తీవ్ర గాయాలతో ఉన్న మహేష్ను వారు వదిలిపెట్టారు. కులం పేరుతో మహేష్ను నిందితులు దూషించారు. మహేష్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పట్టణ ఎస్సై టి.శ్రీనివాస్ బృందం బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితుల నుంచి ఆటో, దాడికి వాడిన రబ్బరు ట్యూబ్, కొబ్బరి మట్టను స్వాఽధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఆరుగురిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు ముగ్గురు నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన డీఎస్సీ ప్రసాద్ -
రిగ్గులతో మత్స్యకారులకు నష్టం
సముద్రంలో రిలయన్స్, ఓఎన్జీసీ రిగ్గుల వల్ల కాకినాడ జిల్లాలో అద్దరిపేట నుంచి గాడిమొగ వరకున్న తీర ప్రాంతంలో మత్స్యకారుల జీవితాలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. సముద్రంలో కాలుష్యం పెరిగి, మత్స్య సంపద తగ్గి మత్స్యకారులు చేపల వేట సాగక తీవ్రంగా నష్టపోతున్నారు. తీరం వెంబడి ఉన్న వివిధ పరిశ్రమల వల్ల కాలుష్యం పెరిగి, చేపలు దొరక్క మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారు. ఇదే విషయమై గత ఎన్నికల్లో మా సమస్యలను కూటమి నేతల దృష్టికి తీసుకెళ్లాం. వాటిని పరిష్కరిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాటిచ్చారు. ఎన్నికలయ్యాక వాటిని విస్మరించారు. దీనిపై ఉద్యమం చేపట్టాలని నిర్ణయించుకున్నాం. మూడు రోజుల క్రితం పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించాం. ఆయన అందుబాటులో లేకపోగా, ఆయన ఇన్చార్జి కూడా అందుబాటులో లేక పోవడంతో మేము ఆందోళన చేయాల్సి వచ్చింది. చివరకు మా వినతిపత్రం జనసేన నేతలు తీసుకున్నారు. వారు స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం. మా డిమాండ్లు అమలు చేసే వరకు ఉద్యమం ఆపేది లేదు. – సీహెచ్ రమణి, ఏపీ మత్స్యకార, మత్స్య కార్మిక సంఘం, ఆలిండియా కమిటీ మెంబర్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, కాకినాడ ● -
నిర్బంధంతో పోరాటాలు అణచలేరు
సాక్షి, రాజమహేంద్రవరం: నిర్బంధాలతో పోరాటాలను అణచలేరని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ఆంధ్రా పేపరు మిల్లు కార్మికులకు న్యాయం జరిగే వరకూ తన పోరాటం ఆగదని చెప్పారు. మిల్లు కార్మికులకు న్యాయం చేయాలనే డిమాండుతో మంగళవారం నుంచి ఆయన చేపట్టాలనుకున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు సోమవారం అర్ధరాత్రి అడ్డుకున్నారు. రాజాను హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రకాశం నగర్లోని తన నివాసం వద్ద రాజా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కార్మికులకు అన్యాయం జరుగుతున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్మికులకు న్యాయం చేస్తామని కూటమి నేతలు ఎన్నికల్లో చెప్పి, వారి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చారని, ఏడాది గడుస్తున్నా సమస్యలు పరిష్కరించిన దాఖలాలు లేవని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9 నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించానని, అయితే మిల్లు యాజమాన్యంతో చర్చలు జరుపుతున్నాం. సమస్య పరిష్కారమపోతుందని కూటమి నేతలు చెప్పడంతో దీక్షను వాయిదా వేశానని వివరించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును రాజ్యాంగం కల్పించిందని, కానీ, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ, ప్రజా సమస్యలపై గొంతెత్తుతున్న వారిని అణచివేస్తున్నారని అన్నారు. పేపరు మిల్లులో సుమారు 2,500 మంది కార్మికులున్నారని, వారి వేతన సవరణ, ఇతర సౌకర్యాల కల్పనలో యాజమాన్యం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ విధానాలకు తావు లేదన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఇవే విధానాలను అవలంబిస్తే కూటమి నేతలను ప్రజలు బయట తిరగనివ్వబోరని చెప్పారు. పేపరు మిల్లు కార్మికుల సమస్యను రాష్ట్ర స్థాయికి తీసుకువెళ్లి పోరాడతామని వెల్లడించారు. పోరాటాన్ని మరింత ఉధృతం చేసేందుకు నాయకులతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. పేపరు మిల్లు యాజమాన్యం కొమ్ములు వంచైనా కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పారు. అర్ధరాత్రి హౌస్ అరెస్టు పేపరు మిల్లు కార్మికుల సమస్యలపై జక్కంపూడి రాజా తొమ్మిది రోజులుగా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్నారు. మిల్లు కార్మికులకు వేతన సవరణ చేయాలని, చట్టపరంగా అన్ని సౌకర్యాలూ కల్పించాలనే డిమాండ్లతో మంగళవారం నుంచి ఆమరణ దీక్ష చేపట్టడానికి సిద్ధమయ్యారు. దీనిని ఎలాగైనా అడ్డుకోవాలన్న ఉద్దేశంతో రాజా ఉంటున్న కృష్ణసాయి కల్యాణ మండపం వద్దకు దాదాపు 150 మంది పోలీసులు సోమవారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో చేరుకున్నారు. అక్కడ నానా హంగామా చేశారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు రాజాను ఆయన ఇంటికి తరలించి హౌస్ అరెస్టు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తున్న తనను ఎందుకు అరెస్టు చేస్తున్నారని ప్రశ్నించగా.. పేపరు మిల్లుకు 500 మీటర్ల దూరంలో ఎలాంటి ఆందోళనలు, నిరసనలు చేపట్టకూడదని చెప్పారు. రాజాతో పాటు మరో 50 మందిని ముందస్తుగా అరెస్టు చేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరుపై రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అనుచరులను పోలీస్ స్టేషన్కు తరలించి, తెల్లవారుజామున ఇళ్లకు పంపడం దారుణమని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ నేతల మద్దతు పోలీసుల నిర్బంధంలో ఉన్న రాజాను వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ ఇన్చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంఠమని రమేష్, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, యువజన విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షుడు రాగిరెడ్డి బన్నీ, కాకినాడ సిటీ అధ్యక్షుడు రోకళ్ల సత్య, నేతలు కర్రి పాపారాయుడు, రామలింగం, శ్రీనివాస్, దీపక్, స్థానిక నాయకులు గేడి అన్నపూర్ణరాజు, దుంగ సురేష్, ఆశోక్కుమార్ జైన్, పసుపులేటి కృష్ణతో పాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు కలసి మద్దతు తెలిపారు. ఫ పేపరు మిల్లు కార్మికులకు న్యాయం జరిగే వరకూ ఉద్యమం ఆగదు ఫ వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఫ ఆమరణ దీక్షను అడ్డుకున్న పోలీసులు ఫ అర్ధరాత్రి హంగామా.. హౌస్ అరెస్టు ఫ రాజాకు పలువురి పరామర్శ -
ఇవేం రోడ్లురా బాబూ!
గోపాలపురం: గోపాలపురం మండలంలో పలు రహదారులు ఛిద్రమయ్యాయి. గజానికో గొయ్యి అన్నట్టుగా మారడంతో ప్రయాణికులు నానా యాతనలూ పడుతున్నారు. సంక్రాంతి నాటికే రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కూటమి సర్కారు గొప్పగా చెప్పింది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా రోడ్ల మరమ్మతులకు ఒక్క రూపాయి కూడా వెచ్చించ లేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా సంబంధిత ఆర్అండ్బీ అధికారులు కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ పట్టించుకున్న దాఖలాల్లేవని వాపోతున్నారు. ఫ దేవరపల్లి – తల్లాడ జాతీయ రహదారిపై గోపాలపురం – కొయ్యలగూడెం మధ్య మాతంగమ్మ ఆలయం సమీపాన ఉన్న కల్వర్టుకు ఇరువైపులా పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. రాత్రి వేళల్లో వాహనదారులు ఆ గుంతల్లో పడి గాయాల పాలవుతున్నారు. గోతుల్లో పడిన భారీ వాహనాలు కమాన్ కట్టలు విరిగిపోయి రోజుల తరబడి రోడ్డు పక్కనే నిలిచిపోతున్నాయి. ఫ గోపాలపురం – దేవరపల్లి పొగాకు బోర్డు సమీపాన రోడ్డు దెబ్బతింది. ఇక్కడ ద్విచక్ర వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ రోడ్డుపై ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించని రీతిలో మలుపులుండటంతో వాహనదారులు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. ఫ గోపాలపురం – గుడ్డిగూడెం రోడ్డులో పిచ్చుక గండి సమీపాన పెద్ద గుంత పడింది. ఫ గోపాలపురం – భీమోలు రోడ్డు కల్వర్టుకు ఇరువైపులా పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. రాత్రి సమయంలో ఆ గోతులు కనిపించకపోవడంతో ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఫ ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నిత్యం ప్రమాదాలు జరుగుతున్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు. -
రుణాలివ్వకపోవడం అన్యాయం
కార్పొరేషన్ రుణాల పేరు చెప్పి, కాపులను ప్రభుత్వం దగా చేసింది. అందరికీ రుణాలని ఆశలు కల్పించి, తీరా యూనిట్ల మంజూరు సమయం వచ్చేసరికి చేతులెత్తేయడం చంద్రబాబు సర్కార్కు కొత్తేమీ కాదు. ప్రతి ఎన్నికల్లోనూ జనాన్ని ఇలానే నమ్మించి మోసం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. సబ్సిడీ సొమ్ము విడుదల చేయలేనప్పుడు అంత హడావుడిగా రుణ ప్రణాళిక ప్రకటించడమెందుకు? రుణాల మంజూరు ప్రక్రియ మొదలై ఐదు నెలలైనా ఇంతవరకూ ఒక్కరంటే ఒక్కరికై నా రుణం మంజూరు చేసి ఉంటే చెప్పాలి. – రావూరి వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ ప్రచార విభాగం కార్యదర్శి, కాకినాడ వెంటనే మంజూరు చేయాలి కుటుంబ పోషణ కోసం వస్త్ర, కిరాణా దుకాణాలు పెట్టుకుందామని బీసీ కార్పొరేషన్ రుణానికి దరఖాస్తు చేసుకున్న వారు ఆ రుణం వస్తుందా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ఐదు నెలలు గడచినా ఇప్పటి వరకూ రుణం మంజూరు కాలేదు. అధికారులను అడిగితే లబ్ధిదారుల లిస్టు పంపామంటున్నారు. రుణాలు మంజూరైన జాబితాయే రాలేదనీ చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి త్వరితగతిన బీసీ రుణాలు మంజూరు చేయాలి. – గుబ్బల వీర వెంకట సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ బీసీ విభాగం అధ్యక్షుడు, రాజోలు అసలు ఇస్తారా? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కార్పొరేషన్ రుణాలు వస్తాయని దరఖాస్తుదారులు మూడు నెలలుగా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇస్తామన్న రుణాలు రాక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. రుణాలు వెంటనే మంజూరు చేయాలి. స్వయం ఉపాధికి అవకాశాలు మరింత పెంచాలి. రుణాలకు సంబంధించి సబ్సిడీ ప్రభుత్వం విడుదల చేయకుంటే బ్యాంకులు మాత్రం ఎలా రుణాలు ఇస్తాయి? – దుర్వాసుల సత్యనారాయణ, బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు, రాజమహేంద్రవరం ఆశలు ఆవిరి ప్రభుత్వం రాయితీ రుణాలిస్తుందని ఆశపడి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. మండల స్థాయిలో జాబితాలపై పరిశీలన జరిపి, బ్యాంకుకు వెళ్లేసరికి ప్రభుత్వం రాయితీ సొమ్ము విడుదల చేయలేదని సమాధానం చెబుతున్నారు. సర్కారు ఉదాసీనత కారణంగా ఐదు నెలలుగా ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుతున్నా ఫలితం ఉండటం లేదు. అసలు రుణాలిస్తారో ఇవ్వరో అర్థం కావడం లేదు. – వేట్ల నాగేశ్వరరావు, మైనార్టీ బీసీ సంఘం అధ్యక్షుడు, రామచంద్రపురం -
దారుణ మోసం!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాయితీ రుణాలతో స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తామని కూటమి సర్కార్ చెప్పిన మాటలు నీటిమీద రాతలుగానే మిగిలిపోయాయి. రూ.లక్ష, రూ.2 లక్షలు, రూ.3 లక్షలు రుణాలిస్తామని, సగం సబ్సిడీ అని, మిగిలిన సగం బ్యాంక్ రుణమని చంద్రబాబు, పవన్ కల్యాణ్ గొప్పగా డప్పేశారు. బీసీ, ఎస్సీ, కాపు సామాజికవర్గాలకు రుణాలో రుణాలంటూ దండోరా వేసి మరీ ప్రచారం చేశారు. మంత్రుల నుంచి ద్వితీయ శ్రేణి నేతల వరకూ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దరఖాస్తు చేసుకోవడమే తరువాయి అందరికీ సబ్సిడీ రుణాలంటూ ఊదరగొట్టారు. మాయ మాటలతో జనాన్ని నమ్మించిన చంద్రబాబు గద్దెనెక్కారు. తరువాత ఎప్పటి మాదిరిగానే నిలువునా ముంచేశారు. దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ రుణాలు రాకపోవడంతో.. స్వయం ఉపాధి పొందవచ్చని ఆశపడిన వారు హతాశులవుతున్నారు. అంతన్నారింతన్నారే చంద్రబాబు.. నట్టేట్లో ముంచేశారే.. అని మండిపడుతున్నారు. లక్ష్యం మూరెడు.. దరఖాస్తులు బారెడు బీసీ, ఎస్సీ, ఈబీసీ, కాపు సామాజికవర్గాల్లో అర్హులైన వారికి రాయితీ రుణాలిస్తామని సర్కారు ఊరూవాడా ఊదరగొట్టింది. తీరా ఆచరణలోకి వచ్చేసరికి రుణ లక్ష్యాలు వందల్లోనే ఇచ్చారు. ఒక నియోజకవర్గంలో అన్ని కార్పొరేషన్లు కలిపి సుమారు 100 యూనిట్లు కేటాయిస్తే అంతకు పది రెట్లు దరఖాస్తులు కూడా వచ్చాయి. ఆయా కార్పొరేషన్ల ద్వారా రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం మార్చి 11న ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించింది. ఆ నెలంతా స్వీకరించడంతో వేలాదిగా దరఖాస్తులు వచ్చిపడ్డాయి. వాటిని ఏప్రిల్ నెలలో మండల స్థాయిలో వడబోసిన ఎంపీడీఓలు.. ఆయా బ్యాంకులకు పంపించారు. బ్యాంకులు కూడా రుణం ఇచ్చేందుకు ఆసక్తి చూపాయి. బ్యాంకుల నుంచి ఆమోదం లభించిన వారంతా శ్రావణమాసం మంచి రోజుల్లో యూనిట్లు ప్రారంభిద్దామని గంపెడాశతో ఎదురు చూస్తున్నారు. కానీ, వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు జల్లింది. మంజూరు చేసిన యూనిట్లకు, వచ్చిన దరఖాస్తులకు ఎక్కడా లంగరు అందకపోవడంతో ప్రభుత్వం మార్జిన్ మనీ విడుదల చేయకుండానే కార్పొరేషన్ రుణ ప్రక్రియను అప్పటికప్పుడు నిలిపివేసింది. ఈ రుణాలపై ముందుకు వెళ్లవద్దని మే 8న ఆదేశాలిచ్చింది. ఫలితంగా కార్పొరేషన్ రుణాల ప్రక్రియ ప్రారంభమై మూడు నెలలు కావస్తున్నా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క యూనిట్ కూడా ఇప్పటి వరకూ మంజూరు కాలేదు. ఒక యూనిట్ విలువ రూ.2 లక్షలనుకుంటే అందులో 50 శాతం అంటే రూ.లక్ష ప్రభుత్వ సబ్సిడీ. మిగిలిన రూ.లక్ష బ్యాంకు రుణం. ఇస్తానన్న 50 శాతం సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేయకుండా మూడు నెలలుగా ముప్పుతిప్పలు పెడుతోంది. రుణాల పేరిట దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం ఎందుకు.. ఇప్పుడు తమ ఆశలను అడియాశలు చేయడం ఎందుకని దరఖాస్తుదారులు ప్రశ్నిస్తున్నారు. రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకొచ్చినా ప్రభుత్వం కావాలనే సబ్సిడీ విడుదల చేయకుండా చివరి నిమిషంలో అర్ధాంతరంగా ఈ ప్రక్రియను నిలిపివేసిందని మండిపడుతున్నారు. పెద్దాపురంలో కార్పొరేషన్ రుణాల ఇంటర్వ్యూలకు హాజరైన అర్జీదారులు (ఫైల్) మూడు జిల్లాల్లో ఆయా కార్పొరేషన్ల వారీగా రుణాల వివరాలురుణాల కేటగిరీ యూనిట్ల రుణాల లక్ష్యం దరఖాస్తు మంజూరు మొత్తం లక్ష్యం (రూ.లక్షలు) దార్లు చేసిన (రూ.కోట్లు) యూనిట్లు కాకినాడ జిల్లా బీసీ కార్పొరేషన్ 1,914 3,952.00 31,859 562 1,283.55 ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ 154 417.00 2,449 41 84.42 కాపు కార్పొరేషన్ 763 2,824.00 21,454 238 5.93 తూర్పుగోదావరి జిల్లా బీసీ కార్పొరేషన్ 1,374 2,887.00 16,408 234 5.22 ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ 203 540.00 2,211 20 0.54 కాపు కార్పొరేషన్ 757 2,715.00 8,193 174 4.53 కోనసీమ జిల్లా బీసీ కార్పొరేషన్ 1,394 2,954.00 15,147 246 5.87 ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ 154 417.00 1,657 12 0.24 కాపు కార్పొరేషన్ 757 2,714.00 15,644 158 4.62 ఒక్క యూనిట్ అయినా ఇస్తే ఒట్టు! ఊదరగొట్టి ఉసూరుమనిపించారు మూడు నెలలైనా దిక్కూమొక్కూ లేదు సబ్సిడీపై చేతులెత్తేసిన సర్కార్ -
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
ఆలమూరు: 216 ఏ జాతీయ రహదారిపై మడికి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ వెంపల చంద్రశేఖర్ (50) మృతి చెందాడు. ఆలమూరు పోలీసుల కథనం ప్రకారం అయినవిల్లి మండలంలోని ముక్కామల సమీపంలోని ఇరుసుమండకు చెందిన చంద్రశేఖర్ తన వ్యాన్పై సమీపంలోని కొత్తపేట నుంచి లోడు వేసుకుని రాజమహేంద్రవరం బయలుదేరాడు. రావులపాలెం వచ్చేసరికి ఒక ప్రయాణికుడిని తన వాహనంలో ఎక్కించుకున్నాడు. స్థానిక అంతర్రాష్ట కూరగాయల మార్కెట్ వద్దకు వచ్చేసరికి ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందగా అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి వ్యాన్ క్యాబిన్లో చిక్కుకున్నాడు. దీంతో ఆ ప్రయాణికుడిని బయటకు తీసేందుకు పోలీసు, హైవే సిబ్బంది రెండుగంటల పాటు శ్రమించారు. అప్పటికే తీవ్ర గాయాలతో ఉన్న అతన్ని ఎన్హెచ్ అంబులెన్స్పై రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఎస్సై జి.నరేష్ కేసును నమోదు చేయగా రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇరుసుమండలో విషాద ఛాయలు అంబాజీపేట: చంద్రశేఖర్ మృత్యువాత పడటంతో ఇరుసుమండలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య రామలక్ష్మి, కుమారులు పవన్, చందు ఉన్నారు. అందరితో కలిసి ఉండే చంద్రశేఖర్ ఇక లేడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మృతుని స్వగ్రామం తాడేపల్లిగూ డెం మండలంలోని మిలటరి మాధవరం. అయి తే 30 ఏళ్ల క్రితం వివాహనంతరం ఇరుసుమండ వచ్చి ఇక్కడే ఉంటున్నారని స్థానికులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి రాజానగరం: జాతీయ రహదారిపై స్థానిక వైఎస్సార్ జంక్షన్లో మంగళవారం జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ప్రత్తిపాడు మండలం ఒమ్మంగికి చెందిన చవల శ్రీనివాస్ (38) రాగితో తయారు చేసిన ఉంగరాలు, కడియాలను తీర్థాలలోను, గ్రామ గ్రామం తిరుగుతూ అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అవివాహితుడైన అతను తల్లితో కలిసి కొంతమూరులో ఉంటున్నాడు. ఈ క్రమంలో పెద్దాపురంలోని మరిడమ్మ తీర్థంలో రాగి వస్తువులను అమ్ముకునేందుకు తన యాక్టివా స్కూటర్ పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ అతనిని ఢీ కొని, కొద్దిదూరం బైకుతో సహా ఊడ్చుకుంటూ పోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన అతనిని అదే లారీ డ్రైవర్ అంబులెన్స్లో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లాడు. అయితే అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కాగా యాక్టివా స్కూటర్పై ప్రయాణిస్తూ తలకు హెల్మెట్ ధరించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. కొడుకే ఆధారంగా ఉన్న ఆ వృద్ధ తల్లి అనాథగా మిగిలింది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నారాయణమ్మ తెలిపారు. -
వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం
● చెరువులో దూకిన వారిని కాపాడిన స్థానికులు ● పురుగులు మందుకూడా తాగినట్లు పోలీసుల వెల్లడి ● సంతానం పట్టించుకోకపోవడమే కారణం? జగ్గంపేట: జీవిత చరమాంకంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా జీవనం సాగించవలిసిన వృద్ధ దంపతులు జీవితంపై విరక్తితో పురుగు మందు తాగి, చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జగ్గంపేట శివారు సీతానగరం గ్రామం వద్ద చోటు చేసుకుంది. అయితే స్థానికులు ఘటన జరిగిన వెంటనే స్పందించి వృద్ధ దంపతులను కాపాడి జగ్గంపేటలోని సీహెచ్సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఆసుపత్రికి తరలించారు. జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ అందించిన వివరాల ప్రకారం తొండంగి మండలం ఏవీ నగరం గ్రామానికి చెందిన 70 ఏళ్ల సక్కుల సత్యనారాయణ, 65 ఏళ్ల సక్కుల మంగతాయారు దంపతులు. సత్యనారాయణ పెద్దాపురంలో శ్రీ చక్ర హాస్పిటల్లో వాచ్మన్గా పనిచేస్తున్నారు. సంతానం ఈ దంపతుల మంచి చెడ్డలు పట్టించుకోకపోవడంతో జీవితంపై విరక్తి చెందినట్టు భావిస్తున్నామన్నారు. దీంతో మంగళవారం జగ్గంపేట శివారు సీతానగరం గ్రామం వద్ద చెరువు వద్దకు చేరుకుని పురుగు మందు సేవించి ఆత్మహత్య చేసుకోవడానికి చెరువులో దూకారు. అయితే అక్కడ వున్న స్థానికులు దీన్ని గమనించి వారిని రక్షించి చెరువు గట్టుపై పడుకోబెట్టి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాసరావు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని జగ్గంపేట సీహెచ్సీకి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు. -
నిడదవోలులో చోరీ
నిడదవోలు: పట్టణంలోని సంజీవయ్యనగర్లో సోమవారం రాత్రి దొంగలు పడి దొరికిన కాడికి దోచుకుపోయారు. గొట్టుముక్కల నాగేశ్వరరావు తన కుటంబ సభ్యులతో ఈ నెల 19న హైదరాబాద్లోని బంధువుల ఇంటికి వెళ్లారు. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరిగి ఇంటికి వచ్చాక చోరీ జరిగినట్లు గుర్తించారు. దుండగులు ముందుగా ప్రధాన ద్వారానికి వేసిన తాళం పెకిలించి ఇంట్లోకి ప్రవేశించారు. గదిలో బీరువా తెరచి లాకర్లో దాచుకున్న రెండు కాసుల బంగారు వస్తువులు, రూ.లక్ష నగదును అపహరించారు. ఇంటి యజమాని నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై జగన్మోహన్రావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చోరీకి గురైన నగదు, నగలు స్వాధీనం
రౌతులపూడి: మండల కేంద్రమైన రౌతులపూడిలో ఇటీవల పేంటి మరియమ్మ ఇంట్లో చోరీకి గురైన రూ.30 వేల నగదు, 30 గ్రాముల బంగారు నగలను స్వాధీన పరచుకున్నట్లు రౌతులపూడి ఎస్సై జి.వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 12వ తేదీన రౌతులపూడికి చెందిన పేంటి మరియమ్మ ఇంట్లో చోరీ జరిగిందని, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేశామన్నారు. ఈ నేపథ్యంలో రౌతులపూడి శివారు మరిడమ్మతల్లి గుడి వద్ద ఇద్దరు బాలుర నుంచి రూ.30వేలు నగదు, 30గ్రాముల బంగారు నగలను స్వాధీన పరచుకున్నట్లు తెలిపారు. బాలురను జిల్లా ప్రొహిబిషన్ అధికారి వద్ద హాజరు పరచామన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ డీవీ రమణ, కానిస్టేబుళ్లు బోస్, నూకరాజు, ఉదయ్, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
కాలుష్య కారక పరిశ్రమలను రద్దు చేయాలి
అరుణోదయ విమలక్క డిమాండ్ పిఠాపురం: ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో తీర ప్రాంత మత్స్యకారులను రోడ్డున పడేసే కాలుష్య కారక పరిశ్రమలు నిలిపివేయాలని అరు ణోదయ సాంస్కృతిక సమాఖ్య ఉభయ రాష్ట్రాల చైర్పర్సన్ విమలక్క విజ్ఞప్తి చేశారు. అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ఏఐఎఫ్టీయూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏఐఎఫ్టీయూ 34వ వార్షికోత్సవం సందర్భంగా మహాసభ మంగళవారం స్థానిక సూర్యరాయ గ్రంథాలయం ప్రాంగణంలో నిర్వహించారు. తొలుత ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి సభాస్థలి వరకు కార్మికులు ఎరజ్రెండాల చేతబట్టి ప్రదర్శన నిర్వహించారు. అంబేడ్కర్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి విమలక్క పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏఐఎఫ్టీయూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కుంచే అంజిబాబు అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆమె ప్రసంగించారు. తీర ప్రాంతంలో పలు విషతుల్యమైన పరిశ్రమల వలన వాతావరణ సమతుల్యం దెబ్బతింటోందన్నారు. దీనివల్ల తీర ప్రాంతంలో హేచరీస్ కనుమరుగైపోతాయని, అనేకమంది ఉపాధి దెబ్బతింటుందన్నారు. ప్రధాన వక్త ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు పెంచబోమని ఎన్నికలలో హామీ ఇచ్చి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ప్రజలను నయవంచన చేస్తోందని విమర్శించారు. అదానీకి లబ్ధి చేకూర్చడం కోసం స్మార్ట్ మీటర్లను బలవంతంగా అమరుస్తున్నారని విమర్శించారు. ఏఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు కరీం బాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ కరోనా కాలంలో 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా కుదిస్తూ చట్టం చేసిందని, దాన్ని అమలు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ఏఐఎఫ్టీయూ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గొల్ల అంజయ్య, ఏపీ ఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వల్లూరి రాజబాబు, బి రమేష్, ఏపీఆర్సీఎస్ సీనియర్ నాయకులు కొండ దుర్గారావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏపూరి సుధాకర్, తెలంగాణ అధ్యక్షుడు మల్సూర్, ప్రగతిశీల మహిళా సంఘం (సీ్త్ర విముక్తి) కన్వీనర్ డొక్కులూరి సంగీత పాల్గొన్నారు. -
మిథున్రెడ్డిది ముమ్మాటికీ అక్రమ అరెస్టే
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఎంపీ మిథున్రెడ్డిని ముమ్మాటికీ అక్రమంగానే అరెస్టు చేశారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ అన్నారు. సెంట్రల్ జైలు వద్ద మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. అసలు స్కామ్ ఎక్కడ జరిగిందని మిథున్రెడ్డిని అరెస్టు చేశారో చెప్పాలని ప్రశ్నించా రు. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో మద్యంపై రూ.16,500 కోట్ల వార్షిక ఆదాయం వస్తే, అది జగన్ ప్రభుత్వ హయాంలో రూ.25 వేల కోట్లకు పెరిగిందన్నారు. పైగా ప్రభుత్వమే మద్యం అమ్మినప్పుడు అవినీతికి ఆస్కారం ఎక్కడుందని ప్రశ్నించారు. జగన్ హయాంలో కొత్తగా డిస్టిలరీలకు అనుమతులివ్వలేదని, గతంలో చంద్రబాబు హయాంలోనే ఇచ్చారని చెప్పారు. లిక్క ర్ స్కామ్ అనడమే తప్ప 13 నెలల కూటమి పాలనలో మనీ ట్రయల్ ఎక్కడ జరిగిందో తేల్చారా అని నిలదీశారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నందున అక్రమ అరెస్టులతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు రోజే వైఎస్సార్ సీపీ ఎంపీ, ఫ్లోర్లీడర్ను అరెస్టు చేయడం ద్వారా సంచలనం సృష్టించాలన్నది ప్రభుత్వ దురుద్దేశమని విమర్శించారు. పైగా ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ముడిపెడుతు న్నారని మండిపడ్డారు. ఏవో రెండు డిస్టిలరీలను సీజ్ చేసి, వాళ్ల ఆస్తుల జప్తు చేశామని చెప్తే సరిపోదన్నారు. కేవలం ఒత్తిడితోనే సిట్ పని చేస్తోందని అన్నారు. మీ ఇష్టం వచ్చినట్లు 300 పేజీల చార్జిషీటు తయారు చేసేస్తే నిజం కాబోదని, మిథున్రెడ్డి క్లీన్ చిట్తో బయటకు వస్తారని చెప్పా రు. కోర్టు సూచనల ప్రకారం జైలులో ఎంపీకి కనీస సదుపాయాలు కల్పించకపోవడం అధికారులకు తగదని భరత్రామ్ అన్నారు.ఫ జగన్ హయాంలో మద్యం ఆదాయం పెరిగింది ఫ ప్రభుత్వమే విక్రయిస్తే అవినీతి ఎక్కడ? ఫ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ -
మందుల దుకాణాల్లో తనిఖీలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లాలో మత్తు, వయాగ్రా మందుల అమ్మకాలు జరుగుతున్న నేపథ్యంలో డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో 80 మందుల దుకాణాలకు పైగా తనిఖీ చేసినట్లు డ్రగ్స్ ఏడీ నాగమణి తెలిపారు. దుళ్లలోని శ్రీశ్రీనివాస మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్, శ్రీ మెడికల్స్లో డ్రగ్స్ అధికారులు దాడులు చేయగా అక్కడ ఫార్మాసిస్ట్ లేకపోవడం, బిల్లులు లేకుండా అమ్మకాలు చేయడం, షెడ్యూల్ రిజిస్టర్ సరిగా లేకపోవడం, కాలం చెల్లిన మందులు లభించడం కనుగొన్నామన్నారు. వీటితో పాటు మరికొన్ని దుకాణాలు ఇదే విధంగా ఉన్నాయని, వాటన్నింటిపై కేసులు నమోదు చేశామన్నారు. -
ముద్రగడ క్షేమంగానే ఉన్నారు
ముద్రగడ పెద్ద కుమారుడు వీర్రాఘవరావు కిర్లంపూడి: మాజీ మంత్రి, రాష్ట్ర వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) సభ్యులు ముద్రగడ పద్మనాభం క్షేమంగా ఉన్నారని ఆయన పెద్ద కుమారుడు వీర్రాఘవరావు (బాలు)తెలిపారు. ముద్రగడ ఇటీవల అస్వస్థతకు గురికాగా హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించిన విషయం విదితమే. ముద్రగడ పద్మనాభం ఆరోగ్యానికేమి ఢోకా లేదని, ఆయన క్షేమంగా ఉన్నారని ఆయన పెద్ద కుమారుడు వీర్రాఘవరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలో ఉండడంతో తన తండ్రి వద్దకు ఎవరినీ అనుమతించడం లేదన్నారు. ప్రజల ఆశీస్సులతో ఆయన క్షేమంగా తిరిగి వస్తారని దయచేసి ఎవరూ ఆసుపత్రికి వెళ్లొద్దని వీర్రాఘవరావు కోరారు. విద్యతోపాటు క్రీడలూ అవసరమే రాజానగరం: విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, వాటికి కూడా తగిన సమయాన్ని కేటాయించి, క్రీడలలోనూ మంచి ప్రతిభను చాటాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పి. చంద్రశేఖర్ అన్నారు. స్థానిక జీఎస్ఎల్ వైద్య కళాశాల క్రీడా మైదానంలో యూనివర్సిటీ స్థాయిలో మూడు రోజులపాటు జరిగే 25 వ వుమెన్ స్పోర్ట్సు మీట్ని మంగళవారం గాలిలోకి బెలూన్స్ని వదిలి ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. 24 మెడికల్ అండ్ డెంటల్ కళాశాలల నుంచి 567 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటున్నారని యూనివర్సిటీ స్పోర్ట్సు క్లబ్ సెక్రటరీ డాక్టర్ ఈ. త్రిమూర్తి తెలిపారు. వాలీబాల్, త్రోబాల్, బాస్కెట్బాల్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బాడ్మింటన్, చెస్ వంటి ఆటలలో ఈ పోటీలు జరుగుతున్నాయని జీఎస్ఎల్ మెడికల్ కాలేజ్ పీడీ శ్రీనివాసరావు చెప్పారు. జీఎస్ఎల్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ఎస్ మిశ్రా, సూపరింటెండెంట్ డాక్టర్ టీవీఎస్పీ మూర్తి పాల్గొన్నారు. చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి సీతానగరం: మండలంలోని బొబ్బిల్లంకకు చెందిన పోలిన వెంకట్రావు (70) రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ మంగళవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకట్రావు అనారో గ్యం బారిన పడ్డారు. ఆ బాధ తట్టుకోలేక సోమ వారం రాత్రి 9 గంటలకు ఇంటి వద్ద పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యు లు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వెంకట్రావు మంగళవారం ఉదయం 9 గంటలకు మరణించారు. ఆసుపత్రి సమాచారం, మృతుని కుమారుడు పోలిన వీరవెంకట సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ తెలిపారు -
బ్రాండ్ బాజా!
జిల్లా పేరు మద్యం గీత కార్మికుల మొత్తం దుకాణాలు షాపులు కోనసీమ 133 13 146 తూర్పు గోదావరి 125 12 137 కాకినాడ 155 15 170● బ్రూవరీస్ కార్పొరేషన్ నిర్వాకం ● బ్రాండు ఒకటే.. ధరలే వేరు ● మద్యం వ్యాపారుల సరికొత్త దోపిడీ ● అందుబాటులో లేని రూ.99 మద్యం ఆలమూరు: బ్రూవరీస్ కార్పొరేషన్ చేస్తున్న మద్యం సరఫరా, ధరల నిర్ధారణ ఒక ప్రహసనంలా మారుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అండతో మద్యం సిండికేట్లు కుమ్మకై ్క మద్యం ప్రియుల బలహీనతలను ఆసరాగా తీసుకుని వారిని అనేక రూపాల్లో దోచుకుంటున్నారు. ఒకే మద్యం బ్రాండును ఒకే ధరకు విక్రయించవలసి ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. బ్రాండు ఒకటే అయినా ధర మాత్రం వేర్వేరుగా ముద్రించి వసూలు చేయడం ద్వారా ప్రజలను ప్రభుత్వం దోచుకుంటోంది. దీంతో మద్యం కొనుగోలుదారుల్లో మద్యం ధరలపై అయోమయం నెలకొంటోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనున్న 453 మద్యం దుకాణాలకు అమలాపురం, రాజమహేంద్రవరం, సామర్లకోట బ్రూవరీస్ కార్పొరేషన్ డిపోల నుంచి మద్యం సరఫరా జరుగుతుంది. మద్యం షాపుల స్థాయిని బట్టి 20 నుంచి 30 రకాల చీప్ లిక్కర్ నుంచి ప్రీమియం క్వాలిటీ వరకూ అందుబాటులో ఉంటున్నాయి. ఇటీవల జిల్లాలోని పలు మండలాల్లో చీప్ లిక్కర్ బ్రాండు అయిన 9 సీ హార్స్ కంపెనీ క్వార్టర్ మద్యం బాటిల్ ధర రూ.120గా ఉంది. అయితే గత ఏడాది నవంబర్లో తయారు చేసిన 179 బ్యాచ్ బాటిళ్లలో మూడు ఎంఆర్పీ ధరలు ఉండటం వినియోగదారులను నివ్వెర పరుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ.99 ధర కలిగిన మద్యం బాటిళ్లు ఎక్కడా దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ చీప్ లిక్కర్ను ఐదు కంపెనీలు సరఫరా చేస్తున్నా పూర్తిస్థాయిలో మద్యం కొనుగోలుదారులకు అందుబాటులో ఉండటం లేదు. ఇదో రకం దోపిడీ ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మద్యం షాపుల వద్ద ఒక్కొక్క చోట ఒక్కొక్క ధర ముద్రించి దోచుకుంటున్నారని మద్యం కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు. 9సీ హార్స్ బ్రాండుకు చెందిన క్వార్టర్ బాటిల్ ధర రూ.120గా ఉంది. అయితే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని మద్యం షాపుల్లో ఒక్కొక్క చోట ఒక్కొ విధంగా రూ.120. రూ.130, రూ.140 ధరలు ముద్రించి ఉన్నట్లు బాటిళ్లను చూస్తే తెలుస్తోంది. ఈ ధరలు మద్యం విక్రయదారులు ముద్రించారా లేదా బ్రూవరీస్ కార్పొరేషన్ ముద్రించి అమ్మకాలు కొనసాగిస్తోందా అనే సందేహం కలుగుతోంది. ఈ ధరల తేడా వల్ల మద్యం కొనుగోలుదారులు సుమారు రూ.ఐదు లక్షల వరకూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. చీప్ లిక్కర్ ధరలను ప్రాంతానికి ఒక్కో విధంగా నిర్ణయించి ప్రజలతో చెలగాటం ఆడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మద్యం దుకాణాల వద్ద విధిగా ఏర్పాటు చేయాల్సిన మద్యం ధరల పట్టిక కాని, స్టాకు వివరాలు కాని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఏర్పాటు చేయకపోవడం పరిస్థితికి అద్దం పడుతుంది. ఎంఆర్పీలో తేడా ప్రస్తుతం ఒక బ్రాండు కేనా మిగిలిన బ్రాండులపై కూడా తేడాగా ముద్రిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. కనిపించని రూ.99 మద్యం మద్యం షాపుల్లో పేదలకు అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన మద్యాన్ని రూ.99 కే విక్రయిస్తామన్న కూటమి నాయకుల ఎన్నికల హామీ బుట్టదాఖలైంది. బ్రూవరీస్ కార్పొరేషన్ నుంచి రేషన్ పద్ధతిలో వారానికి దుకాణానికి మూడు మద్యం కేసులకు మించి సరఫరా చేయడం లేదని తెలుస్తోంది. అలాగే రూ.99 మద్యం బాటిల్కు కమీషన్ను పూర్తిగా తగ్గించడంతో విక్రయదారులు కూడా ఆ బ్రాండ్లను అమ్మడానికి ఇష్టపడటం లేదని మద్యం ప్రియులు చెబుతున్నారు. -
పాలెం సర్పంచ్పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
కడియం: తమకు ప్రభుత్వం కేటాయించిన భూములను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్న మాధవరాయుడుపాలెం సర్పంచ్ అన్నందేవుల చంటిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని జేగురుపాడు ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షుడు సాకా కిరణ్కుమార్, మాజీ అధ్యక్షుడు బళ్ల అన్నవరం, మద్దుకూరి సూరిబాబు, మోటిక మునియ్య మంగళవారం కడియం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివరాలను కిరణ్కుమార్ విలేకరులకు తెలిపారు. 1977లో జేగురుపాడు గ్రామానికి చెందిన దళితులకు సర్వే నం.10లో 5.58 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. సర్వే నం.84, 86లో సుమారు పది ఎకరాల భూమిని మాధవరాయుడుపాలెం దళితులకు కూడా ఇచ్చిందన్నారు. ఆ భూమిలో దళితులు వ్యవసాయం చేసుకుంటున్నారన్నారు. ఇటీవల పాలెం సర్పంచ్ అన్నందేవుల చంటి దళితుల భూమిని కబ్జా చేయాలనే ఆలోచనతో తన అనుచరులతో గొడవలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. 52 ఏళ్లుగా తమ అధీనంలో ఉన్న భూమిని కబ్జా చేస్తారన్న భయంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ శిలా విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడంతో పాటు, చేపల చెరువును కూడా ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. తన రాజకీయ పలుకుబడితో రెవెన్యూ, పోలీసు అధికారులను అడ్డుపెట్టుకుని తాము ఏర్పాటు చేసుకున్న విగ్రహాన్ని, దిమ్మెను దౌర్జన్యంగా తొలగించారన్నారు. అందువల్ల చంటిపైనా, అతనికి సహకరించిన వారిపైనా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం ప్రకారం అరెస్టు చేయాలని కోరారు. -
ఇదేం భోజనం.. ఇవేం సౌకర్యాలు?
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి స్థానిక ఆర్ట్స్ కాలేజీ సమీపంలోని గిరిజన సంక్షేమ బాలురు, బాలికల హాస్టల్ను, బీసీ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ను మంగళవారం సందర్శించారు. హాస్టళ్లలో వసతులు, ఆహారాన్ని పరిశీలించారు. వసతి గృహం సిబ్బందితో మాట్లాడారు. గిరిజన సంక్షేమ బాలుర హాస్టల్లో వసతులు, శుభ్రత విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. హాస్టల్ కిటికీలకు దోమ తెరలు లేవని, బాత్ రూములకు డోర్లు లేవని, భోజనం చేసే స్థలం శుభ్రంగా లేదని, భోజనం బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిని వెంటనే మెరుగు పరచాలని సూచించారు. విద్యార్థులకు సురక్షిత తాగునీరు, మంచి ఆహారం అందించాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, వసతి గృహ ప్రాంగణంలో అవసరమైన మరమ్మతులు ఎప్పటికప్పుడు చేయించాలన్నారు. విద్యార్థులకు ఎటువంటి వైద్య సహాయం అవసరమైనా వెంటనే చర్యలు తీసుకోవాలని శ్రీలక్ష్మి చెప్పారు. వసతి గృహంలో ఎటువంటి సమస్యలున్నా, న్యాయ సహాయం కావాలన్నా డీఎల్ఎస్ఏకి తెలియజేయాలని శ్రీలక్ష్మి సూచించారు.స్మార్ట్ మీటర్లు రద్దు చేసేంత వరకూ పోరాటం ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలులోకి తీసుకువచ్చిన స్మార్ట్ మీటర్లను రద్దు చేసేంత వరకూ తమ పోరాటం ఆగదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అన్నారు. ఆ పార్టీ జిల్లా మహాసభల పోస్టర్ను స్థానిక సీపీఐ కార్యాలయంలో మంగళవారం ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పటికే రాష్ట్రంలో నాలుగుసార్లు విద్యుత్ చార్జీలు పెంచారని అన్నారు. ఇప్పుడు స్మార్ట్ మీటర్ల విధానం ద్వారా సామాన్యుడిపై మరింత భారం పడుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు అరకొరగా ఉందని విమర్శించారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని నడుపుతున్నారంటూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వాన్ని విమర్శించిన చంద్రబాబు, ఇప్పుడు అదే పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పోలవరం ఎత్తు తగ్గించి ఆ ప్రాజెక్ట్కు సమాధి కడుతున్నారని వనజ ఆరోపించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ, ఆగస్టు 6, 7 తేదీల్లో పార్టీ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని 17 మండలాలకు చెందిన ప్రతినిధులు ఈ సభలకు హాజరవుతారన్నారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 29,500 గటగట (వెయ్యి) 27,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 28,000 గటగట (వెయ్యి) 25,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
‘మా ఆకలి కేకలు పట్టవా?’
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): సుపరిపాలన తొలి అడుగు అంటూ.. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో సంక్షేమ పథకాలు చేపట్టామని గొప్పలు చెబుతున్న సీఎం, డిప్యూటీ సీఎంకు తమ ఆకలి కేకలు పట్టవా అని సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లాలాచెరువు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద వాటర్ ప్రాజెక్టు కార్మికులు చేస్తున్న సమ్మె సోమవారం 14వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్మికులు సీఎం, డిప్యూటీ సీఎం ఫొటోలు పెట్టి, కళ్లకు గంతలతో నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను అమలు చేయాలని కోరారు. ప్రాజెక్టు యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.శ్రీను, ఇసాక్ మాట్లాడుతూ, 19 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో.. కుటుంబ పోషణ కష్టమై సమ్మె బాట పట్టామన్నారు. 25 నెలలుగా ఈఎస్ఐ, పీఎఫ్ కట్టడం లేదని ఆరోపించారు. సుపరిపాలన అని చెప్పుకొంటూ తిరిగే నేతలకు తమ ఆకలి బాధ అర్థం కావడం లేదని మండిపడ్డారు. ఈ సమ్మె కారణంగా సుమారు 85 గ్రామాల్లో దాదాపు మూడు లక్షల మంది మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. తమ వేతనాల విషయమై ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించి, తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో సమ్మె చేపట్టగా.. కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చినప్పటికీ, అది ఆచరణకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం 52 మంది కార్మికుల కుటుంబాల ఆకలికేకలను దృష్టిలో ఉంచుకుని, పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కోశాధికారి కె.రామకృష్ణ, సభ్యులు పాల్గొన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంపై కార్మికుల మండిపాటు కళ్లకు గంతలతో సత్యసాయి డ్రింకింగ్ ప్రాజెక్టు సిబ్బంది నిరసన -
జవహర్ను పదవి నుంచి తొలగించండి
● టీడీపీ దళిత నాయకుల డిమాండ్ ● కొవ్వూరులో ఎమ్మెల్యేని చుట్టుముట్టి ఆందోళన ● ‘పచ్చ’ పార్టీలో మరోసారి బయటపడిన విభేదాలు తాళ్లపూడి (కొవ్వూరు): కొవ్వూరు టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి రోడ్డున పడ్డాయి. ఫ్లెక్సీ వివాదం నేపథ్యంలో పార్టీలోని రెండు వర్గాల్లో ఉన్న దళిత నాయకులు పరస్పర ఆరోపణలకు దిగారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ను ఆ పదవి నుంచి తొలగించాలని ఓ వర్గం వారు డిమాండ్ చేశారు. దీంతో వర్గపోరు రచ్చకెక్కింది. వివరాలివీ.. ఎంఆర్పీఎస్, దళిత సంఘాల నాయకులు ఆదివారం రాజమహేంద్రవరంలో మీడియా సమావేశం నిర్వహించారు. పశివేదల గ్రామంలో ఏర్పాటు చేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ ఫ్లెక్సీలను కొంత మంది చించివేశారని ఆ సందర్భంగా ఆరోపణలు చేశారు. ఈ నెల 23లోగా నిందితులను గుర్తించి, అరెస్టు చేసి, చర్యలు తీసుకోవాలని, లేకుంటే 24న ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో కొవ్వూరు టీడీపీ కార్యాలయం వద్ద దళిత సంఘాల నాయకులు సోమవారం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. జవహర్ ఫ్లెక్సీలు చించివేయడానికి, తమకు ఎటువంటి సంబంధమూ లేదని చెప్పారు. జవహర్ వర్గం కావాలనే టీడీపీ పరువు తీయడానికి చూస్తోందని ఆరోపించారు. అచ్చిబాబు వర్గంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఫ్లెక్సీలు చించిన వారిపై తక్షణం కేసులు పెట్టాలంటూ కొవ్వూరు పోలీస్ స్టేషన్లో జవహర్ వర్గీయులు కొందరు ఫిర్యాదు చేశారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం, కొవ్వూరు ప్రెస్క్లబ్లో దళిత నాయకులు మాట్లాడుతూ, జవహర్పై తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు. నియోజకవర్గం అంటేనే అచ్చిబాబు అని, ఆయనను ఏమైనా అంటే సహించేది లేదని అన్నారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని అడ్డం పెట్టుకుని పార్టీ పరువును జవహర్ బజారున పడేస్తానంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరంలో మీడియా సమావేశం పెట్టినవారు కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన వారు కాదని, వారందరూ జవహర్ వర్గీయులేనని, కావాలనే కేసులు పెట్టి కక్ష సాధించాలని చూస్తున్నారని ఆరోపించారు. వారిని వెంటనే గుర్తించి, చర్యలు తీసుకోవాలని, వారిని వెనుక ఉండి నడిపిస్తున్న ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇటీవల జనసేన నేత టీవీ రామారావు కూటమిలో తమకు ప్రాధాన్యం లేదని, సొసైటీ పదవుల్లో అన్యాయం జరిగిందని ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా జవహర్ వర్గం మీడియా సమావేశం.. దానికి కౌంటర్గా కొవ్వూరు టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ దళిత నాయకులు చేసిన ఆందోళనతో కూటమి పార్టీల పరువు బజారున పడింది. -
ఎంపీ మిథున్రెడ్డి అరెస్ట్ దుర్మార్గం
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కపిలేశ్వరపురం (మండపేట): వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్రెడ్డిపై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వ దుర్మార్గ పాలనకు అద్దం పడుతుందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. మండపేటలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, మిథున్రెడ్డి అరెస్ట్ కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగమన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అణచివేత ధోరణులను వైఎస్సార్ సీపీ ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగడుతుందని, దానిని ఓర్వలేకే తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. ప్రజా క్షేత్రం నుంచి జైళ్లలో వేయడం ద్వారా కూటమి నేతలు తమ ప్రభుత్వాన్ని రక్షించుకోవాలని చూస్తున్నారని, వాస్తవానికి ఏ ఒక్క వైఎస్సార్ సీపీ నాయకుడు, కార్యకర్త అణచివేతలకు భయపడరన్నారు. లిక్కర్ స్కాంలో తొలుత రూ.50 వేల కోట్ల అవినీతి జరిగిందని, అయితే సిట్ రిపోర్టులో కేవలం రూ.3,500 కోట్లుగా చూపించడం ప్రభుత్వ అసంబద్ద వైఖరికి నిదర్శనమన్నారు. మిథున్రెడ్డిపై ఆరోపణలు ఏమాత్రం నిలబడవన్నది వాస్తవమన్నారు. ప్రజలకు వాస్తవాలు చెప్పేందుకు గత ప్రభుత్వ హయాంలోనూ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో లిక్కర్ ద్వారా వచ్చిన ఆదాయ వివరాలను బయటపెట్టాలన్నారు. సమావేశంలో పార్టీ మండపేట నియోజకవర్గ పరిశీలకుడు కటకంశెట్టి ఆదిత్య, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, సీనియర్ నాయకులు వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, దూలం వెంకన్నబాబు పాల్గొన్నారు. కక్ష సాధింపుతోనే మిథున్రెడ్డి అరెస్ట్ ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అమలాపురం టౌన్: రెడ్ బుక్ రాజ్యాంగం, కక్ష సాధింపుతోనే కూటమి ప్రభుత్వం ఎంపీ మిథున్రెడ్డిని అక్రమ అరెస్ట్ చేసిందని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు ఆరోపించారు. అమలాపురం హైస్కూలు సెంటరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు జరుగుతున్నా పట్టించుకోకుండా, కేవలం వైఎస్సార్ సీపీ నేతలపై ఎలా తప్పుడు కేసులు పెట్టి, జైల్లో పెడదామనే దుర్మార్గపు ఆలోచనలతోనే పాలన చేస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థ కూడా ఇలాంటి అక్రమ కేసుల కోసమే సమయాన్ని పూర్తిగా కేటాయించి, లా అండ్ ఆర్డర్కు పనిచేయడం లేదని విమర్శించారు. అక్రమ కేసులు, కక్ష సాధింపు చర్యలపై కోర్టులు అక్షింతలు వేస్తున్నా కూటమి ప్రభుత్వానికి పట్టడం లేదని ధ్వజమెత్తారు. ఎంపీగా, పార్లమెంట్లో వైఎస్సార్ సీపీ ఫ్లోర్లీడర్గా మిథున్రెడ్డి పోలీసు దర్యాప్తునకు సహకరిస్తున్నా, సాక్ష్యాలను తారుమారు చేసి అక్రమంగా అరెస్ట్ చేయడం అన్యాయమని ఖండించారు. కుట్రలకు, అక్రమ కేసులకు తెరవెనుక సూత్రధారులైన ముఖ్యమంత్రి చంద్రబాబు, అతని పుత్రుడు, మంత్రి లోకేష్కు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయని స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర, లీగల్సెల్ జిల్లా మాజీ అధ్యక్షుడు కుడుపూడి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
నవోదయం ఏదీ..?
రాయవరం: విద్యార్థుల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు జవహర్ నవోదయ విద్యాలయ సమితి కృషి చేస్తోంది. ప్రతిభావంతులైన విద్యార్థులకు పట్టం కట్టి, వారికి ఉజ్వల భవిష్యత్తునిచ్చే ఆలయంగా నవోదయ విద్యాలయం భాసిల్లుతోంది. అటువంటి నవోదయ విద్యాలయంలో సీటు వస్తే తమ పిల్ల భవిష్యత్తుకు ఢోకా ఉండదని తల్లిదండ్రులు ఆశ పడుతుంటారు. అందుకే తమ పిల్లల్ని చేర్చేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. కారణాలేమైనా ఈ ఏడాది దరఖాస్తుల ప్రక్రియ మందగించడంతో.. గతంతో పోలిస్తే దరఖాస్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. నవోదయలో ఆరో తరగతిలో చేరాలంటే ప్రవేశ పరీక్షే ఆధారం. ఇందులో ప్రతిభ చూపితే సీటు ఖాయం. 2026–27 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించారు. ఐదో తరగతిలో చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేయాల్సి ఉండగా, ఈ ఏడాది దరఖాస్తుల సంఖ్య నిరాశాజనకంగా ఉంది. ఈ నెల 29తో దరఖాస్తుల గడువూ ముగియనుంది. కాకినాడ జిల్లాలో పెద్దాపురంలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని విద్యార్థులు మాత్రమే ఇక్కడ దరఖాస్తు చేయాలి. ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు ఉచిత విద్యను ఇక్కడ అందిస్తారు. విద్యతో పాటు, అధునాతన వసతుల కల్పన, ప్రయోగాత్మక విద్య, క్రీడలు, క్రమశిక్షణ, ప్రతిభకు పెద్దపీట వేయడం ఈ విద్యా సంస్థల్లో ప్రత్యేకత. అవగాహన లేక..? ఈ ఏడాది డిసెంబర్ 13న నిర్వహించే ప్రవేశ పరీక్షకు మూడు జిల్లాల నుంచి కేవలం 668 దరఖాస్తు మాత్రమే వచ్చాయి. ఉమ్మడి జిల్లా నుంచి అతి తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. 2023–24లో 8,506 దరఖాస్తులు రాగా, గతేడాది మూడు జిల్లాల పరిధిలో 8,971 దరఖాస్తులు వచ్చాయి. ఇలాఉంటే, ఈ ఏడాది 9 వేల వరకు దరఖాస్తులు వస్తాయనే అంచనాతో అధికారులు ఉన్నారు. గడువు సమీపిస్తున్నా తక్కువగా వచ్చిన దరఖాస్తుల సంఖ్య చూసి అధికారులు విస్తుపోతున్నారు. దీనికి కారణం.. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సరైన అవగాహన కల్పించక పోవడమా, లేక వారిలో ఆసక్తి సన్నగిల్లడమా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. జవహర్ నవోదయ విద్యాలయంలో సీటు వచ్చినా, రాకున్నా విద్యార్థులతో దరఖాస్తు చేయిస్తే, ఐదో తరగతిలోనే విద్యార్థులకు పోటీతత్వాన్ని అలవాటు చేయడం, ఆన్లైన్ పరీక్షను పరిచయం చేసినట్టవుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు. పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయంలో మొత్తం 80 సీట్లు ఉన్నాయి. ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రస్తుతం ఆయా మండలాల్లో ఐదో తరగతి చదువుతున్న బాలబాలికలు అర్హులు. జవహర్ నవోదయ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఒక్కసారి మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. మూడు జిల్లాల్లో ఈ ఏడాది ఐదో తరగతిలో సుమారు 60 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. 2026–27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్ పొందడానికి నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరయ్యే బాలబాలికలు 2014 మే ఒకటో తేదీ నుంచి 2016 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి. ప్రభుత్వం గుర్తించిన పాఠశాలల్లో 3, 4 తరగతుల్లో ఉత్తీర్ణత సాధించి, ఐదో తరగతి చదువుతున్న వారు మాత్రమే అర్హులు. గతేడాది ప్రవేశ పరీక్షకు హాజరైన వారు అనర్హులు. జిల్లాల వారీగా దరఖాస్తులు ఇలా.. జిల్లా వచ్చిన నేటి వరకు దరఖాస్తులు దరఖాస్తులు (గతేడాది) (ఈ ఏడాది) కోనసీమ 3,869 201 తూర్పు గోదావరి 1,741 107 కాకినాడ 3,361 360 జవహర్ నవోదయ ప్రవేశ పరీక్షకు గణనీయంగా తగ్గిన దరఖాస్తులు విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆసక్తి అంతంతమాత్రం ఈ నెల 29తో ముగుస్తున్న గడువు గతేడాది వచ్చినవి 8,971 ఈ ఏడాది ఇంత వరకు 668 మాత్రమే.. డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష పరీక్షా విధానమిలా.. నవోదయ ప్రవేశ పరీక్షను ఈ ఏడాది డిసెంబర్ 13న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జిల్లాలో నిర్దేశించిన పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షను విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న భాషను(తెలుగు/ఇంగ్లిష్) ఎంచుకుని పరీక్ష రాయవచ్చు. ప్రవేశ పరీక్షలో 80 ప్రశ్నలుంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు నిర్వహించే ప్రవేశ పరీక్ష రాసేందుకు రెండు గంటల సమయాన్ని కేటాయిస్తారు. మూడు విభాగాల్లో ప్రశ్నలు కేటాయిస్తారు. మేధా శక్తి(మెంటల్ ఎబిలిటీ)పై 50 మార్కులకు 40 ప్రశ్నలు, గణితం(అర్థమెటిక్), భాషపై ఒక్కొక్క విభాగానికి 20 వంతున 40 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. తప్పుడు సమాధానాలకు నెగిటివ్ మార్కులు ఉండవు. దివ్యాంగులకు 40 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయిస్తారు. పరీక్షా పత్రాల రూపకల్పన నుంచి అభ్యర్థుల ఎంపిక వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) నిర్వహిస్తుంది. ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై, ప్రవేశానికి ఎంపికై న వారికి తొలి రెండేళ్లు తెలుగు/ఇంగ్లిష్ భాషల్లో బోధిస్తారు. పోటీ పరీక్షలపై అవగాహన జవహర్ నవోదయ విద్యాలయ సమితిలో సీటు పొందడాన్ని ప్రతిష్టగా భావిస్తారు. ఇందుకు ఏటా దరఖాస్తు చేసిన విద్యార్థులు ప్రత్యేకంగా తర్ఫీదు పొందుతారు. జిల్లాలో ఉన్న ఐదో తరగతి విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యేలా పాఠశాలల ఉపాధ్యాయులు కృషి చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా ఐదో తరగతి నుంచే పోటీ పరీక్షలపై విద్యార్థులకు అవగాహన కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఆ దిశగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆలోచన చేసి, అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసేలా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి విద్యార్థితో దరఖాస్తు చేయించాలి విద్యార్థులకు అవగాహన కల్పించి ప్రతి విద్యార్థితో దరఖాస్తు చేసేలా ప్రధానోపాధ్యాయులు చొరవ చూపాలి. జవహర్ నవోదయ విద్యాలయంలో ఆరో తరగతిలో ప్రవేశ పరీక్షకు ప్రతి విద్యార్థి దరఖాస్తు చేయడం ప్రధానమైన విషయంగా భావించాలి. ఈ నెల 29వ తేదీ దరఖాస్తుకు తుది గడువు. ప్రవేశ పరీక్ష దరఖాస్తులను మూడు జిల్లాల విద్యాశాఖాధికారుల ద్వారా పాఠశాలలకు పంపించాం. పాఠశాలలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నాం. – బి.సీతాలక్ష్మి, ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ విద్యాలయ సమితి, పెద్దాపురం డీఈవోలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి జవహర్ నవోదయలో గ్రామీణ పాంత విద్యార్థులకు అధిక శాతం సీట్లు కేటాయించడంతో వారికి ప్రయోజనం కలుగుతుంది. జిల్లా విద్యా శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉప విద్యా శాఖాధికారులు, మండల విద్యా శాఖాధికారుల ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. ప్రవేశ పరీక్షను విద్యార్థులతో రాయించడం వల్ల వారిలో పోటీ పరీక్షలను ఎదుర్కోగలిగే ఆత్మ విశ్వాసం ఏర్పడుతుంది. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యా శాఖ, కాకినాడ -
నేటి నుంచి ఆమరణ దీక్ష
● పేపరు మిల్లు కార్మికుల సమస్యలపై ఇక తాడోపేడో ● వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి రాజా వెల్లడిరాజమహేంద్రవరం సిటీ: కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారంలో ఏపీ పేపరు మిల్లు యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తోందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యను కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు పరిష్కరిస్తారేమోనని వేచి చూశామన్నారు. సమస్య పరిష్కారంలో తీవ్ర జాప్యం చేస్తున్న నేపథ్యంలో మిల్లు యాజమాన్యంతో ఇక తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమని, మంగళవారం ఉదయం 9 గంటలకు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నానని ప్రకటించారు. పేపరు మిల్లు మెయిన్ గేటు ఎదురుగా ఉన్న శ్రీకృష్ణసాయి కల్యాణ మండపంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన ఈ విషయం వెల్లడించారు. పేపరు మిల్లు ఎదురుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం పాదాల చెంత ఆమరణ దీక్షకు కూర్చుంటానని ప్రకటించారు. దీనికి ఏపీ కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడపా శేషుబాబు సంఘీభావం తెలపనున్నారని చెప్పారు. మిల్లు కార్మికులకు వేతన ఒప్పందం, ఇతర సౌకర్యాలు కల్పనలో యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని అనేక రూపాల్లో ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తోందని చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిందని, సమస్య పరిష్కారానికి స్థానిక ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చినప్పటికీ యాజమాన్యంతో జరుగుతున్న చర్చలు సఫలం కావడం లేదని రాజా అన్నారు. యాజమాన్యం తీరు చూస్తూంటే సమస్యను పరిష్కరించకుండా వాయిదాలు వేస్తూ కోల్డ్ స్టోరేజ్లో పెట్టే పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో యాజమాన్యంతో అమీతుమీ తేల్చుకుంటామన్నారు. ఇటీవల అధికార పార్టీకి చెందిన కార్మిక యూనియన్ నాయకులు తనను విమర్శించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. గతంలో పేపర్ మిల్లులో ప్రభుత్వానికి 27 శాతం వాటా ఉండేదని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వాటాను విక్రయించారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి షేర్లు ఉండేటప్పుడు మిల్లుపై నియంత్రణ ఉండేదని, కార్మికులకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం పరిష్కరించేదని అన్నారు. ప్రభుత్వం తన వాటా వదులుకున్న తర్వాత యాజమాన్యం ఇష్టానుసారం వ్యవహరిస్తోందని చెప్పారు. యాజమాన్యం ఇంత అన్యాయం చేస్తోందంటే గుర్తింపు యూనియన్గా ఎవరున్నారో ఒకసారి గుర్తు చేసుకోవాలని అన్నారు. కాార్మికులకు వేతన ఒప్పందం విషయంలో ఇప్పుడు జరిగినంత జాప్యం గత 30 ఏళ్లలో ఎన్నడూ జరగలేదన్నారు. తాను చేస్తున్న ఉద్యమానికి పార్టీలోని ముఖ్య నాయకులు శ్రీఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం, డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, నందెపు శ్రీనివాస్, ఇతర నేతలందరూ మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. అవసరమైతే పేపరు మిల్లు సమస్యను రాష్ట్ర స్థాయికి తీసుకు వెళ్తామన్నారు. వాస్తవానికి ఈ నెల 9 నుంచే ఆమరణ దీక్ష చేయనున్నట్లు ప్రకటించామని, చర్చలు జరుపుతున్నామని, సమస్య పరిష్కారమవుతుందని కూటమి నాయకులు అనడం, కొద్ది రోజులు వేచి చూద్దామని కార్మిక నాయకులు చెప్పడంతో తన దీక్షను రెండుసార్లు వాయిదా వేసుకున్నానని రాజా చెప్పారు. విలేకర్ల సమావేశంలో నందెపు శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు బొంత శ్రీహరి, మానె దొరబాబు, మాసా రామ్జోగ్, బురిడి త్రిమూర్తులు, అడపా అనిల్, కోడి కోట, నాళం రోశయ్య తదితరులు పాల్గొన్నారు. -
అమ్మవారి సన్నిధికి వెంకన్న సారె
● మందపల్లి పార్వతీదేవికి వాడపల్లి నుంచి ఆషాఢ సారె సమర్పణ ● దేవస్థాన ముఖద్వారంలో ఘన స్వాగతం ● శాకంబరిగా పార్వతీదేవి దర్శనం కొత్తపేట: శనిదోష నివారణకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మందపల్లిలోని ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామివారి క్షేత్రంలో ఆషాఢ మాసం కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. పార్వతీదేవి అమ్మవారిని శాకంబరిగా అలంకరించి, సారె, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్బాబు ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకుడు అయిలూరి శ్రీరామమూర్తి, అర్చకులు, వేద పండితులు పార్వతీదేవి అమ్మవారితో పాటు, శనైశ్చర స్వామి, ఇదే క్షేత్రంలో వేంచేసిన బ్రహ్మేశ్వర, నాగేశ్వర స్వామివార్లను కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో విశేషాలంకరణ చేశారు. ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. క్షేత్ర పాలకుడు వేణుగోపాలస్వామిని పుష్పాలతో విశేషంగా అలంకరించారు. కొనసాగుతున్న సంప్రదాయం కొన్నేళ్లుగా వస్తున్న ఆషాఢ మాస సంప్రదాయం ప్రకారం కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి మందపల్లి పార్వతీదేవి అమ్మవారికి సారె పంపించారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, వాడపల్లి దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో సూపరింటెండెంట్ రాంబాబు, దేవస్థానం సిబ్బంది, పండితులు సారె తీసుకురాగా.. రావులపాలెం–అమలాపురం ప్రధాన రహదారిలో శనైశ్చరస్వామి దేవస్థాన ముఖద్వారం వద్ద ఈఓ సురేష్బాబు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. మేళతాళాలు, బాణసంచా కాల్పులతో భారీ ఊరేగింపుగా ఆలయానికి సారెను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. మందపల్లి, ఏనుగుల మహల్, పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. -
అరెస్టును ఖండిస్తూ మోకాళ్లపై నిరసన
అమలాపురం రూరల్: ఎంపీ మిథున్రెడ్డి అరెస్టును ఖండిస్తూ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ జిల్లెళ్ల రమేష్ ఆధ్వర్యంలో సోమవారం జనుపల్లిలో అంబేడ్కర్ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని, మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఆరోపణలు తప్ప, ఆధారాల్లేకుండా కూటమి ప్రభుత్వం మిథున్రెడ్డిపై కేసులు పెట్టిందని రమేష్ ఆరోపించారు. విద్యార్థి విభాగం నాయకులు పెయ్యాల సాయి, బడుగు మోహన్, వరసల సుజిత్, విన్సీ, సాగర్, ఆనంద్, రవికుమార్, సల్మాన్రాజ్ పాల్గొన్నారు. -
ప్రతిపక్షంపై కక్షపూరితంగా కేసులు
● మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ● మిథున్రెడ్డి అరెస్టుకు నిరసనగా కొవ్వూరులో కొవ్వొత్తుల ర్యాలీతాళ్లపూడి (కొవ్వూరు): వైఎస్సార్ సీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎంపీలు, నాయకులపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా అక్రమ కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తోందని, చట్టాలను పక్కన పెట్టి రౌడీ రాజ్యం చెలాయిస్తోందని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఆరోపించారు. ఎంపీ మిథున్రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ కొవ్వూరు బస్టాండ్ సెంటర్ వద్ద సోమవారం రాత్రి పార్టీ శ్రేణులతో కలసి ఆయన కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. న్యాయం గెలుస్తుందంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ, రాష్ట్రంలో రెడ్బుక్ పాలన ఎంతోకాలం సాగదని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని అన్నారు. మిథున్రెడ్డిపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని వెంకట్రావు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంఠమణి రమేష్, మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ, చాగల్లు ఎంపీపీ మట్టా వీరాస్వామి, పార్టీ కొవ్వూరు, తాళ్లపూడి, చాగల్లు మండలాల కన్వీనర్లు చిట్టూరి అన్నవరం, కొలిశెట్టి నాగేశ్వరరావు, మట్టా వెంకట్రావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. -
మంగళవారం శ్రీ 22 శ్రీ జూలై శ్రీ 2025
సాక్షి, రాజమహేంద్రవరం: విద్యుత్ శాఖలో స్మార్ట్ మీటర్లు కలకలం రేపుతున్నాయి. వీటిని తమ నెత్తిన బలవంతంగా పెట్టేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో విద్యుత్ వినియోగదారుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు విద్యుత్ వినియోగం నమోదు చేసే మీటర్ రీడర్లకు సైతం ఈ ‘స్మార్ట్’ షాక్ తగులుతోంది. దశల వారీగా అన్ని రకాల విద్యుత్ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు విద్యుత్ శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే 10 వేలకు పైగా స్మార్ట్ మీటర్లు బిగించారు. ఒక్క నవ్య తూర్పు గోదావరి జిల్లాలోనే 6 వేలకు పైగా బిగించారు. స్మార్ట్ మీటర్ల ప్రక్రియ పూర్తయితే మొబైల్ ఫోన్ల మాదిరిగానే విద్యుత్కు కూడా రీచార్జ్ పాలసీ అమలులోకి వస్తుంది. అంటే, కరెంటు కావాలంటే ముందుగానే డబ్బులు చెల్లించాలన్న (ప్రీపెయిడ్) మాట. ఇది వినియోగదారులకు ఇబ్బందికరంగా మారనుండగా.. మరోవైపు ఉపాధి కోల్పోయి మీటర్ రీడర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తలెత్తనుంది. తొలి దశలో 5 లక్షల మీటర్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గృహ విద్యుత్ కనెక్షన్లు సుమారు 16.70 లక్షలున్నాయి. అలాగే, వాణిజ్యం 1,93,613, వ్యవసాయం 63,751, పారిశ్రామికం 6,314, హెచ్టీ 11 కేవీ 1,292 చొప్పున కనెక్షన్లు ఉన్నాయి. తొలి దశలో సుమారు 5 లక్షల మీటర్లు బిగించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. నవ్య తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 6.70 లక్షల విద్యుత్ సర్వీసులుండగా.. తొలి విడతగా 2 లక్షల వరకూ స్మార్ట్ మీటర్లు అమర్చే ప్రక్రియకు నాంది పలికారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలకు వీటిని బిగిస్తున్నారు. రోడ్డున పడనున్న మీటర్ రీడర్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు 500 మందికి పైగా మీటర్ రీడర్లు ఉన్నారు. వీరిలో అత్యధికులు పదేళ్లకు పైగా అనుభవం ఉన్న వారే. ప్రతి నెలా 1 నుంచి 11వ తేదీ లోపు వీరు మీటర్ రీడింగ్ తీస్తారు. ఒక మీటర్ రీడింగ్ తీసినందుకు గాను విద్యుత్ శాఖ సంబంధిత కాంట్రాక్టర్కు రూ.6 నుంచి రూ.7 చెల్లిస్తుంది. రీడింగ్ యంత్రం చార్జీలు, ఫోన్ రీచార్జ్, పేపర్ రోల్, మరమ్మతులు, ఈఎస్ఐ, ఈపీఎఫ్ మినహాయింపులు పోనూ ఒక్కో రీడర్కు చేతికి మీటర్కు రూ.3.10 మాత్రమే అందుతుంది. సగటున ఒక్కో రీడర్ నెలకు 3 వేల మీటర్ల వరకూ రీడింగ్ తీస్తారు. దీని ప్రకారం వారి ఆదాయం ప్రతి నెలా కేవలం రూ.10 వేలలోపే ఉంటుంది. ప్రాంతం, పట్టణాన్ని బట్టి రీడింగ్ సామర్థ్యం మారుతుంది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్)లో ఏళ్ల తరబడి పని చేస్తున్న కొంతమంది సిబ్బందితో పాటు మీటర్ రీడర్లు కూడా ఉద్యోగాలు కోల్పోతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికితోడు విద్యుత్ రీచార్జ్పై అవగాహన లేకపోతే ఇబ్బందులు తప్పవు. ముందుగా రీచార్జి చేయించుకోని వారి ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. దీనివలన నేరుగా లైన్ల నుంచి విద్యుత్ అక్రమంగా వినియోగించుకునే వారి సంఖ్య పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. పొట్టకూటి కోసం పోరుబాట చాలీచాలని వేతనాలతో బతుకుబండి లాగుతున్న విద్యుత్ మీటర్ రీడర్లు కూటమి ప్రభుత్వం షాక్ ఇవ్వడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా లాభం లేకపోవడంతో ఉద్యమ బాట పట్టారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ చలో విజయవాడ నిర్వహించారు. సోమవారం విజయవాడ ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని గళమెత్తారు. 20 ఏళ్లుగా విద్యుత్ శాఖలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేస్తున్న తమకు న్యాయం చేయాలని నినదించారు. ఈ ఆందోళనకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వందలాది మంది తరలి వెళ్లారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తీరుపై విమర్శలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు సీఎం అయిన తరువాత వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. వ్యవసాయ బోరు బావుల వద్ద స్మార్ట్ మీటర్లు పెడితే పగులగొట్టాలంటూ అప్పట్లో పిలుపునిచ్చిన చంద్రబాబు, నారా లోకేష్.. ప్రస్తుతం వీటిని వ్యవసాయ కనెక్షన్లకు అమర్చేందుకు సన్నాహాలు ప్రారంభించడంపై రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షంలో ఉంటే మరోలా వ్యవహరించడం తగదని హితవు పలుకుతున్నారు. మీటర్ రీడర్ల డిమాండ్లివీ.. కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు తీసుకువస్తున్నందున ఇప్పటికే కొనసాగుతున్న తమకు విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలని మీటర్ రీడర్లు డిమాండ్ చేస్తున్నారు. కనీస వేతనాలు అమలు చేయాలని, విద్యార్హతను బట్టి రీడర్లకు విద్యుత్ శాఖలో టెక్నికల్, నాన్ టెక్నికల్ షిఫ్ట్ ఆపరేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లుగా.. మిగిలిన వారిని వాచ్మెన్, అటెండర్లుగా నియమించాలని కోరుతున్నారు. అలాగే, ఎస్క్రో ఖాతా వెంటనే తెరవాలని, కాంట్రాక్టర్లు, విద్యుత్ శాఖ అధికారులతో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్మార్ట్ మీటర్లు వద్దు విద్యుత్ శాఖనే నమ్ముకుని ఇరవయ్యేళ్లుగా బతుకుబండి లాగుతున్న మీటర్ రీడర్ల ఉపాధికి గండి కొట్టడం తగదు. అసలు మొత్తం స్మార్ట్ మీటర్ల ప్రక్రియనే విరమించుకోవాలి. ఇది అనైతికం. ప్రజల వద్ద పెద్ద ఎత్తున బిల్లులు వసూలు చేసేందుకు అమలు చేస్తున్న కుట్ర. ఒకవేళ తప్పనిసరిగా అమలు చేస్తే మీటర్ రీడర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. – తాటిపాక మధు, సీపీఐ జిల్లా కార్యదర్శి లో10 స్మార్ట్ విద్యుత్ మీటర్లకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇకపై బిల్లు తీసే ప్రక్రియకు మంగళం ఉమ్మడి జిల్లాలో 500 మందికి పైగా మీటర్ రీడర్ల ఉపాధికి గండి -
కక్ష సాధింపులో భాగమే మిథున్రెడ్డి అరెస్టు
రాజమహేంద్రవరం సిటీ: రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్రెడ్డిని అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేశా రని, వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ హబీబుల్లా ఖాన్ ఆరోపించారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతోనే లేని లిక్కర్ కేసును సృష్టించి, అక్రమంగా అరెస్టు చే యడం దారుణమని మండిపడ్డారు. కూటమి పాలనలో కక్షసాధింపులు తారస్థాయికి చేరాయన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూండటంతో వైఎస్సార్ సీపీలోని కీలక నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామన్నందుకే ప్రజ లు కూటమికి ఓట్లేశారని, కానీ నేడు వారి ఆశలు అడియాసలయ్యాయని అన్నారు. కూటమి సర్కారు ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని దుయ్యబట్టారు. పీజీఆర్ఎస్కు 234 అర్జీలు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ప్రజలు 234 అర్జీలు సమర్పించారు. వారి నుంచి జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి తదితరులు అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ 101, పంచాయతీరాజ్ 39, పోలీస్ 22, విద్యుత్ 12, ఇతర శాఖలకు చెందినవి 58 చొప్పున అర్జీలు వచ్చాయి. పోలీస్ పీజీఆర్ఎస్కు 27 ఫిర్యాదులు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టం(పీజీఆర్ఎస్)కు 27 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులతో ఏఎస్పీలు ఎంబీఎన్ మురళీకృష్ణ, ఏవీ సుబ్బరాజు స్వయంగా మాట్లాడి, అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని, పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు.23న ఐటీఐలలో రెండో విడత అడ్మిషన్ కౌన్సెలింగ్ రాజమహేంద్రవరం రూరల్: స్థానిక ప్రభుత్వ ఐటీఐలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 23న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రిన్సిపాల్ సునీల్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన అభ్యర్థులు దీనికి హాజరు కావాలని సూచించారు. పదో తరగతి మార్కుల జాబితా, టీసీ, స్టడీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత ఇచ్చిన ధ్రువీకరణ పత్రం, ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక జత జిరాక్స్ కాపీలతో కౌన్సెలింగ్కు హాజరు కావాలని వివరించారు. 27న జిల్లా స్థాయి యోగా పోటీలురాజమహేంద్రవరం సిటీ: యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఈస్ట్ గోదావరి ఆధ్వర్యాన ఈ నెల 27న జిల్లా స్థాయి యోగాసన పోటీలు స్థానిక గౌతమ ఘాట్లోని శ్రీ జగద్గురు పీఠం(వరల్డ్ టీచర్స్ ట్రస్ట్)లో నిర్వహించనున్నారు. యోగా గురువు శ్రీధర్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. 10 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు సబ్ జూనియర్, 14 నుంచి 18 సంవత్సరాల వారికి జూనియర్, 18 నుంచి 28 సంవత్సరాల వారికి సీనియర్, 28 నుంచి 35 సంవత్సరాల వారికి సీనియర్–ఎ, 35 నుంచి 45 సంవత్సరాల వారికి సీనియర్–బి, 45 నుంచి 55 సంవత్సరాల వారికి సీనియర్–సి కేటగిరీల్లో 10 ఈవెంట్లలో ఈ పోటీలు నిర్వహిస్తామని వివరించారు. రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు 7396 00 3444 నంబరులో సంప్రదించాలన్నారు.జక్కంపూడికి అనపర్తి మాజీ ఎమ్మెల్యే సంఘీభావం అనపర్తి: పేపర్ మిల్లు కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వారం రోజులుగా పోరాడుతున్న రాజానగరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాకు అనపర్తి మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి సంఘీభావం తెలిపారు. రాజాను సోమవారం రాజమహేంద్రవరంలో ఆయన కలిశారు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న రాజా.. కార్మికుల సమస్యలపై చేస్తున్న పోరాటానికి తామెప్పుడూ తోడుగా ఉంటామని చెప్పారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 29,500 గటగట (వెయ్యి) 27,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 28,000 గటగట (వెయ్యి) 25,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
ప్రభుత్వ అరాచకాలపై ప్రశ్నించరెందుకు!
ఎమ్మెల్సీ వీర్రాజుపై ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ ధ్వజం అమలాపురం టౌన్: కూట మి ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న మీరు రాష్ట్రంలో చంద్రబాబు అండ్ కో చేస్తున్న అరాచకాలు, కక్ష సాధింపు చర్యలపై ఎందుకు నోరు మెదపడం లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఎమ్మెల్సీ వీర్రాజు చేసిన వ్యాఖ్యలను ఇజ్రాయిల్ ఖండించారు. అమలాపురంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి సోము వీర్రాజుకు లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై దుర్భాషలాడినప్పుడు ఇదే వీర్రాజు ఏమైపోయారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రస్తుతం మహిళలు, బాలికలపై అత్యాచారాలు రోజురోజుకూ పెరుగుపోతుంటే మీరు చోద్యం చేస్తున్నారా...? అని ధ్వజమెత్తారు. ఇప్పుడు రాష్ట్రంలో బెల్ట్ షాపులు, మద్యం అధిక ధరలకు విక్రయం, సారాను ఏరులై పారిస్తున్నా వాస్తవాలు ఆయనకు కనిపించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఇప్పటికే రూ.1.75 లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేయ కుండా, ఏ విధంగా ఆ నిధులు ఖర్చు చేశారో లెక్కలు అడిగే దమ్ము వీర్రాజుకు ఉందా...? అని ఎమ్మెల్సీ ఇజ్రాయిల్ మరోసారి ప్రశ్నించారు. -
బాంబు పేలుళ్లు
ఫ ఎగిరిపడిన బండరాళ్లు ఫ ఇద్దరు మహిళలకు గాయాలు తుని: పోలవరం ఎడమ ప్రధాన కాలువ తవ్వకం పనుల్లో భాగంగా వినియోగిస్తున్న బాంబు పేలుళ్లకు బండరాళ్లు ఎగిరిపడి తుని పట్టణం ఒకటో వార్డు డ్రైవర్స్ కాలనీలోని ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం కట్రాళ్లకొండ తవ్వకానికి కాంట్రాక్టు సిబ్బంది బాంబులు పేల్చారు. దీంతో బండరాయి ఎగిరి గృహాల మధ్య పడింది. ఈ సంఘటనలో ఓ ఇంటి ప్రహరీ ధ్వంసం కావడంతో పాటు శాంతి, వీరమ్మ అనే ఇద్దరు మహిళలు గాయపడ్డారు. వీరిని తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాత్రి పగలు బాంబుల పేలుళ్లతో ఇళ్ల మధ్య కంపనాలు రావడంతో భయాందోళనకు గురవుతున్నామని కాలనీ వాసులు అంటున్నారు. అధికారులు స్పందించి జన జీవనానికి అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
నరసన్న దేవస్థానానికి వెలుగులు
కోరుకొండ: ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న కోరుకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి వెలుగులు వచ్చాయి. కొంతకాలంగా స్వామివారి కొండపై వెలుగులు దూరమయ్యాయి. రాత్రిళ్లు దర్శన భాగ్యం కలగక భక్తులు పడుతున్న ఇబ్బందులపై ఇటీవల సాక్షి దినపత్రికలో నిశీధిలో నరసన్న అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి అన్నవరం దేవస్థానం అధికారులు స్పందించి కోరుకొండ స్వామివారి ఆలయానికి విద్యుత్ వెలుగు లు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. నారసింహుని దేవస్థానంలో కింద నుంచి కొండపైకి లైట్లు ఏర్పాటు చేయడంతో స్వామివారి గోపుర దర్శనం భక్తులకు ప్రాప్తించింది. దీనితో భక్తులు సంతోషిస్తున్నారు. -
తండ్రిపై దాడి చేసిన తనయుడి అరెస్ట్
రాయవరం: స్థానిక రాజరాజేశ్వరి కాలనీలో తండ్రిపై సుత్తితో దాడి చేసిన తనయుడిని శనివారం అరెస్ట్ చేసినట్లు రాయవరం ఎస్సై డి.సురేష్బాబు విలేకరులకు తెలిపారు. ప్రతి రోజు తండ్రి గంటా శ్రీనివాస్ తిడుతున్నాడని, కోపం పెంచుకున్న కొడుకు పవన్కళ్యాణ్ ఈ నెల 17వ తేదీ రాత్రి దాడి చేశాడు. మండపేట సీఐ పి.దొరరాజు పర్యవేక్షణలో దర్యాప్తు చేపట్టి, నిందితుడు పవన్కళ్యాణ్ను అరెస్ట్ చేసి అనపర్తి జేఎఫ్సీఎం ముందు హాజరు పర్చగా నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు ఎస్సై సురేష్బాబు తెలిపారు. -
ప్రతిభకు పరీక్ష..
రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారిలా.. పాఠశాల స్థాయి ప్రాథమిక పరీక్ష రాసిన విద్యార్థుల్లో తరగతుల వారీగా ప్రతిభ చూపిన మొదటి 25 మందిని ఎంపిక చేస్తారు. 6–11 తరగతులకు గాను మొత్తం 150 మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. అందులో ప్రతిభ చూపిన ప్రతి తరగతి నుంచి ముగ్గురు వంతున మొత్తం 18 మందిని జాతీయ స్థాయికి అర్హత పొందుతారు. రాష్ట్ర స్థాయి పరీక్ష డిసెంబర్ 21 లేదా 28 లేదా జనవరి 4 తేదీల్లో ఏదో ఒకరోజు పరీక్ష రాయాల్సి ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ప్రతి తరగతి నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేలతో పాటు మెమెంటో, సర్టిఫికెట్ అందజేస్తారు. ● 6 నుంచి 11వ తరగతి విద్యార్థులకు అవకాశం ● విద్యార్థి విజ్ఞాన్మంథ్కు దరఖాస్తుల ఆహ్వానం ● సెప్టెంబర్ 30 ఆన్లైన్ రిజిస్ట్రేషన్్కు తుది గడువు రాయవరం: విద్యార్థుల్లో సృజనాత్మకతను ఆవిష్కరణల వైపు మళ్లించేందుకు బాట పడుతుంది. పరిశోధన, ప్రయోగాల్లో వారు రాణించేలా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన మంథన్(వీవీఎం) పేరుతో జాతీయ స్థాయి ప్రతిభాన్వేషణ పరీక్ష నిర్వహిస్తోంది. దీనిని కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సమాచార సంస్థ ఆధ్వర్యంలో ఏసీఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం మరియు విజ్ఞాన భారతిలు సంయుక్తంగా జరుపుతున్నాయి. దేశంలో ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ ఫస్టియర్ చదువుతున్న వారికి ఈ పరీక్ష ఉంటుంది. ప్రతిభ చాటిన వారికి భారతదేశ ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఇంటర్న్షిప్, స్కాలర్షిప్లు పొందే అవకాశం ఉంది. విద్యార్థి విజ్ఞాన మంథన్ప్రవేశ పరీక్షలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఏడాది ఆన్లైనన్్ రిజిస్ట్రేషన్న ప్రక్రియ ప్రారంభం కాగా, సెప్టెంబర్ 30 వరకూ గడువు ఉంది. ఈ ప్రవేశ పరీక్షను ఆన్లైన్ విధానంలో పాఠశాల స్థాయిలో నిర్వహించనున్నారు. పరీక్ష జరిగే రోజు విద్యార్థులకు వారికి అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్, మొబైల్, ల్యాప్టాప్, డెస్క్టాప్, డిజిటల్ పరికరాలతో ఏదైనా ఒక దాని ద్వారా పరీక్షకు నిర్దేశించిన అప్లికేషన్ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని వారి ఇంటి నుంచే పరీక్షకు హాజరయ్యే అవకాశముంది. విభాగాలు.. మార్కులు ఈ పరీక్షను జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహిస్తారు. 6 నుంచి 11 తరగతులకు విడివిడిగా ఈ పరీక్ష ఉంటుంది. ఇందులో తెలుగు, హిందీ, ఇంగ్లిషు తదితర భారతీయ భాషల్లో పరీక్ష జరుపుతారు. ఈ పరీక్షకు సంబంధించి మాక్ పరీక్షలను సెప్టెంబర్ 1 నుంచి నిర్వహిస్తారు. పాఠశాల స్థాయి ప్రధాన పరీక్ష అక్టోబర్ 28 నుంచి 30 తేదీల వరకూ ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి లెవిల్ 2, ద్వితీయ పరీక్ష ఆన్లైన్లో ప్రోక్టరింగ్ విధానంలో పరిశీలకుల సమక్షంలో నవంబర్ 19న ఉంటుంది. పై రెండు పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల మధ్య కాలంలో 90 నిమిషాల పాటు (గంటన్నర) రాయాల్సి ఉంటుంది. లెవిల్ –1 ప్రధాన పరీక్షలో ప్రతి తరగతికి సంబంధించిన 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు వంతున 100 మార్కులు కేటాయిస్తారు. సెక్షన్న్ –ఏలో విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయ మేధావుల కృషి 20 ప్రశ్నలు (20 మార్కులు), సత్యేంద్రనాథ్ బోస్ జీవిత చరిత్ర నుంచి 20 ప్రశ్నలు (20 మార్కులు), సెక్షనన్ బీలో 6 నుంచి 11 తరగతులకు సంబంధించి విద్యార్థులకు గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల నుంచి 50 ప్రశ్నలు (50 మార్కులు), లాజిక్, రీజనింగ్ 10 ప్రశ్నలు (10 మార్కులు) ఉంటాయి. ఇందులో ఉత్తీర్ణులైన వారికి లెవిల్– 2 ద్వితీయ పరీక్షలో 50 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. జాతీయ స్థాయి పోటీలకు ఇలా.. రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన ప్రతి తరగతి నుంచి మొదటి ఇద్దరు విద్యార్థుల చొప్పున 12 మందిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. అందులో ప్రతి తరగతిలో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురు విద్యార్థుల వంతున 18 మందిని జాతీయ స్థాయి విజేతలుగా ప్రకటిస్తారు. జాతీయ స్థాయి విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతిగా వరుసగా రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలతో పాటు మెమెంటో, ప్రశంసా పత్రంతో పాటు నెలకు రూ.2 వేల చొప్పున సంవత్సరం పాటు భాస్కర ఉపకార వేతనం అందజేస్తారు. విద్యార్థి విజ్ఞాన్మంథన్2025–26లో జాతీయ, జోనల్ స్థాయి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు డీఆర్డీఓ, ఇస్రో, సీఎస్ఐఆర్, బీఏఆర్సీ మొదలైన ప్రఖ్యాత జాతీయ ప్రయోగశాలలు, పరిశోధన సంస్థల్లో 1–3 వారాల పాటు ప్రత్యేక శిక్షణ, ఇంటర్న్షిప్ కార్యక్రమం నిర్వహిస్తారు. వ్యక్తిగతంగా లేదా పాఠశాల నుంచి.. పరీక్ష రాయడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు వ్యక్తిగతంగా లేదా పాఠశాల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వీవీఎం.ఓఆర్జీ.ఇన్ వెబ్సైట్లో లాగిన్న కావచ్చు. ప్రతి విద్యార్థి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పోటీతత్వాన్ని పెంచుకునేందుకు ఈ పరీక్ష దోహదపడుతుంది. –డాక్టర్ షేక్ సలీం బాషా, జిల్లా విద్యాశాఖాధికారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ -
నలుగురు యువకుల అరెస్ట్
950 గ్రాముల గంజాయి స్వాధీనం మామిడికుదురు: నగరం గ్రామంలో గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు శనివారం దాడి చేసి నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 950 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ కథనం మేరకు... నగరం గ్రామంలోని ఈదరాడ రోడ్డులో మాజీ ఎమ్మెల్యే నీతిపూడి గణపతిరావు సమాధి వద్ద గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం వచ్చింది. అక్కడకు వెళ్లగా అనుమానాస్పదంగా కనిపించిన యానాంకు చెందిన కనపర్తి వెంకటదుర్గ, పెద్దిరెడ్డి గోవిందరాజు, పల్లం గ్రామానికి చెందిన పెమ్మాడి నాగూర్, పుచ్చల్లంక గ్రామానికి చెందిన యన్నాబత్తుల వెంకట్ను అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీ చేయగా 950 గ్రాముల గంజాయి దొరికింది. నలుగురిని అరెస్టు చేసి గంజాయిని సీజ్ చేశామని ఎస్సై చైతన్యకుమార్ తెలిపారు. వారిని రిమాండు నిమిత్తం రాజోలు కోర్టుకు తరలించామని చెప్పారు. -
స్థానచలనం లేని వేతనం
●● బదిలీలు, పదోన్నతులు సరే ● ఉపాధ్యాయులకు అందని జీతాలు ● పొజిషన్ ఐడీలు రాక అగచాట్లు ● ఉమ్మడి జిల్లాలో 1,500 మందిపై ప్రభావం రాయవరం: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ముగిశాయి.. ఇందులో పలువురికి పొజిషన్ ఐడీలు రాకపోవడంతో జీతభత్యాలు నిలిచిపోయాయి. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 1,500 మందికి ఇబ్బందులు ఎదురయ్యాయి. సాధారణంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులకు వారు బదిలీ అయిన ప్రాంతాల్లో జీతాలు తీసుకునేలా అక్కడి డీడీఓకు సమాచారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గతంలో రెగ్యులర్ జీతాలు తీసుకుంటున్నప్పటికీ వీరి స్థానం మారడంతో ఏ స్థానానికి బదిలీ అయ్యారో ఆ స్థానానికి సంబంధిత ఉద్యోగికి పొజిషన్ ఐడీ కేటాయించాలి. అది జరిగితేనే సీఎఫ్ఎంఎస్లో వారి వివరాలు డిస్ప్లే అవుతాయి. అప్పుడు మాత్రమే వేతనాలు చెల్లించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 6,533 మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారు. గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు 178 మందికి, మోడల్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా 284 మందికి, స్కూల్ అసిస్టెంట్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులుగా 3,298 మందికి, సెకండరీ గ్రేడ్, సమాన స్థాయి కేడర్ ఉపాధ్యాయులుగా 2,995 మందికి, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు 32 మందికి, ఆర్ట్/డ్రాయింగ్/క్రాఫ్ట్/మ్యూజిక్ /ఒకేషనల్ ఉపాధ్యాయులు 20 మందికి స్థాన చలనం కలిగింది. జూన్ 15వ తేదీ నాటికి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తయ్యింది. కొత్తగా ఏర్పడిన మోడల్ ప్రైమరీ స్కూల్స్కు పలువురు స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు బదిలీ అయ్యారు. మోడల్ ప్రైమరీ పాఠశాలలు కొత్తగా ఏర్పడడంతో ఇక్కడకు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంది. అయితే బదిలీలు జరిగి నెల కావొస్తున్నా నేటికీ అధిక శాతం ఉపాధ్యాయులకు పొజిషన్ ఐడీలు కేటాయించలేదు. ఫలితంగా జూలైలో తీసుకోవాల్సిన జూన్ నెల జీతాలు వీరికి మంజూరు కాలేదు. వేతనాలు రాకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా జీతాల బిల్లులు ప్రతి నెలా 25వ తేదీ లోపు సీఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేసి, ట్రెజరీకి బిల్లు సమర్పించాలి. ఈ నెల 25వ తేదీ లోపు పొజిషన్ ఐడీలు రాకుంటే జూలై జీతం కూడా వీరు పొందలేని పరిస్థితి నెలకొంటుంది. పలు ఉపాధ్యాయ సంఘాలు రాష్ట్ర స్థాయిలో పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ అధికారులకు వినతిపత్రాలు ఇస్తున్నా నేటికీ పూర్తి స్థాయిలో పొజిషన్ ఐడీలు క్రియేట్ కాలేదు. సమస్యలు ఎక్కడెక్కడంటే.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117కు వ్యతిరేకంగా ప్రస్తుత ప్రభుత్వం జీవో 21ను తీసుకువచ్చింది. ఆరు రకాల పాఠశాలల స్థానంలో ఇప్పుడు తొమ్మిది రకాల పాఠశాలలు ఏర్పడ్డాయి. ఇందులో ముఖ్యంగా మోడల్ ప్రైమరీ స్కూల్స్, అప్గ్రేడ్ అయిన యూపీ స్కూల్స్లో కొత్తగా ఉపాధ్యాయుల నియామకం జరిగింది. ఈ పాఠశాలలకు కొత్తగా పోస్టులు మంజూరు కావడంతో ఆ స్థానాలకు బదిలీ పొందిన వారికి పొజిషన్ ఐడీలు కేటాయించాల్సి ఉంది. మోడల్ ప్రైమరీ స్కూల్స్లో అప్పటి వరకూ అదే స్కూల్ పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అప్పటికే పొజిషన్ ఐడీలు ఉండడంతో వారికి వేతనాలు చెల్లించారు. ఇదే పాఠశాలకు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు పాజిషన్ ఐడీలు రాకపోవడంతో వేతనాలు పొందలేని పరిస్థితి నెలకొంది. అలాగే ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలలుగా అప్గ్రేడ్ అయిన పాఠశాలల్లో డీడీఓ మారడంతో అక్కడ ఏ ఒక్కరికీ జీతభత్యాలు రాని పరిస్థితి ఉంది. సాధారణంగా జూన్ నెలలో ప్రతి కుటుంబంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో పిల్లల స్కూల్ ఫీజులు, విద్యా సామగ్రి కోసం రూ.వేలల్లో వెచ్చించాల్సి ఉంటుంది. బ్యాంకు రుణాలు తీసుకున్న వారు నెలవారీ ఇన్స్టాల్మెంట్ చెల్లించాలి. అలాగే బదిలీ అయిన ప్రాంతానికి వెళ్లేందుకు రవాణా ఖర్చులు, ఇంటి అద్దెలు, అడ్వాన్సుల రూపంలో మరింత ఖర్చు పెరిగిందని, ఈ నేపథ్యంలో జీతాలు రాకపోవడం ఇబ్బంది కలుగుతుందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పరిష్కరించాలి పొజిషన్ ఐడీలు వెంటనే కేటాయించక పోవడంతో బదిలీ అయిన ఉపాధ్యాయుల్లో కొందరు జీతాలు పొందలేకపోయారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు చెల్లించేందుకు, కుటుంబ ఖర్చులకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు తక్షణమే సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి. – మేడిచర్ల త్రివెంకట ఆది సత్య సుబ్బారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్, కోనసీమ ఈ నెల జీతాలైనా వస్తాయా! రాష్ట్ర వ్యాప్తంగా 72 వేల మంది ఉపాధ్యాయులు పొజిషన్ ఐడీలు రాక జూన్ నెల లేక జీతాలు పొందలేకపోయారు. జూలై నెల జీతాల బిల్లు సబ్మిట్ చేసే సమయం ఆసన్నమవడంతో ఈ నెల జీతాలు వస్తాయా? రావా? అన్న మీమాంసలో ఉన్నారు. పొజిషన్ ఐడీలు వెంటనే కేటాయించి, సమస్య పరిష్కారానికి కృషి చేయాలి. – ఎస్ఎస్ పల్లంరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఎస్టీయూ, కోనసీమ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి పొజిషన్ ఐడీలు రాక ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలి. జూన్, జూలై నెలలకు సంబంధించి వేతనాలు చెల్లించేందుకు ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాలి. ఇప్పటికే ఒక నెల వేతనం రాక ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధ్యాయుల ఇబ్బందులను వెంటనే పరిష్కరించాలి. – చింతాడ ప్రదీప్కుమార్, జిల్లా అధ్యక్షుడు, పీఆర్టీయూ, కాకినాడ జిల్లా -
ఆ కాంట్రాక్టర్పై పీఎఫ్ అధికారులే కేసు పెట్టాలి
● తక్షణం కొత్త కాంట్రాక్టర్ను తీసుకోవాలి ● అన్నవరం దేవస్థానానికి న్యాయవాది సలహా! అన్నవరం: ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) చెల్లించినట్లు నకిలీ చలానాలు ఇచ్చిన విజయవాడకు చెందిన కనకదుర్గా మ్యాన్పవర్ సర్వీసెస్ శానిటేషన్ కాంట్రాక్టర్పై పీఎఫ్ అధికారులే కేసు పెట్టాల్సి ఉంటుందనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. నకిలీ పీఎఫ్ చలానాల బాగో తంపై తీసుకోవాల్సిన చర్యలపై దేవస్థానం ఈఓ వీర్ల సుబ్బారావు, శానిటేషన్ విభాగం అధికారులు న్యాయవాదిని సలహా అడిగారు. మార్చిలోనే సిబ్బంది ఖాతాలో పీఎఫ్ జమ చేయకపోతే అప్పట్లోనే సిబ్బంది కాంట్రాక్టర్కు ఆ విషయం తెలియజేయాలి. అతడి నుంచి ఎటువంటి సమాధానమూ రాకపోతే దేవస్థానానికి ఆ విషయం లిఖితపూర్వకంగా తెలపాలి. అప్పుడు దేవస్థానం ఆధికారులకు చర్య తీసుకునే అధికారం ఉండేది. అలా జరగలేదు కాబట్టి ఆ కాంట్రాక్టర్పై దేవస్థానం క్రిమినల్ చర్య తీసుకోవడం అంత సులువు కాదని న్యాయవాది చెప్పినట్లు సమాచారం. కాకపోతే నకిలీ పీఎఫ్ చలానాలు సృష్టించి, మోసం చేశారంటూ పీఎఫ్ అధికారులకు దేవస్థానం ఫిర్యాదు చేసి వారితో ఆ కాంట్రాక్టర్పై కేసు పెట్టవచ్చని సమాచారం. అదే సమయంలో ఆ కాంట్రాక్టర్ను తొలగించాలని న్యాయవాది సూచించినట్లు తెలుస్తోంది. షార్ట్ టెండర్ ద్వారా కొత్త కాంట్రాక్టర్ను ఎంపిక చేయాలని చెప్పినట్టు చెబుతున్నారు. టెండర్ పిలవకుండానా? దేవస్థానంలో చెత్త ట్రాక్టర్ నిర్వహణకు టెండర్ పిలిచారు. అదే విధంగా సత్రాల్లో దుప్పట్లు, కర్టెన్ల వంటివి ఉతికి, ఇసీ్త్ర చేయడానికి కూడా టెండర్ పిలిచారు. చిన్నచిన్న వాటికే టెండర్లు పిలుస్తున్నప్పుడు ప్రతి నెలా 350 మంది సిబ్బందిని సరఫరా చేసే కాంట్రాక్ట్కు టెండర్ పిలవకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవస్థానంలో ఎటువంటి డిపాజిట్ లేకుండా, టెండర్ పిలవకుండా నామినేషన్ పద్ధతిలో కనకదుర్గా మ్యాన్పవర్ సర్వీసెస్కు శానిటేషన్ కాంట్రాక్ట్ కట్టబెట్టడమే ఈ నకిలీ వ్యవహారానికి దారి తీసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం 350 మంది పారిశుధ్య సిబ్బందికి కార్మిక చట్టాల ప్రకారం జీతాలిచ్చేందుకు దేవస్థానం నెలకు రూ.59 లక్షలు చెల్లించేలా ఆ సంస్థతో ఒప్పందం కుదిరింది. ప్రతి నెలా దేవస్థానం 13 శాతం, సిబ్బంది వాటా 12 శాతం వసూలు చేసి పీఎఫ్ చెల్లించి, ఆ రసీదులు జమ చేస్తే దేవస్థానం బిల్లు ఇవ్వాలి. కానీ మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఆ సంస్థ ఫేక్ రసీదులు ఇచ్చి, సుమారు రూ.1.77 కోట్ల మేర బిల్లులు పొందింది. సిబ్బంది ఖాతాల్లో పీఎఫ్ జమ కాకపోవడంతో అనుమానం వచ్చిన అధికారులు నిలదీయడంతో మూడు నెలలకు కలిపి పీఎఫ్కు సుమారు రూ.30 లక్షలు జమ చేసి కొత్త రశీదులు అందజేశారు. కొత్త కాంట్రాక్ట్కు మరింత సమయం! మరోవైపు రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాలన్నింటికీ కలిపి ఒకే శానిటేషన్ కాంట్రాక్ట్కు పిలిచిన టెండర్ ఖరారుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు దేవస్థానంలో శానిటేషన్ నిర్వహణను షార్ట్ టెండర్ ద్వారా కొత్త కాంట్రాక్టర్కు అప్పగించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రసీదుల తనిఖీపై సూచనలు పీఎఫ్ రసీదులు ఒరిజనల్ లేక ఫేక్ అనే విషయం తెలుసుకోవాలనే అంశంపై దేవస్థానం సిబ్బందికి పీఎఫ్ అధికారులు శనివారం అవగాహన కల్పించా రు. ఈఓ సుబ్బారావు కోరిక మేరకు కాకినాడ పీఎఫ్ ఆఫీసుకు చెందిన ఇద్దరు అధికారులు రసీదుపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం, గూగుల్లో పీఎఫ్ వెబ్సైట్లో తనిఖీ చేయడం వంటివి వివరించారు. -
పొగాకు నారుమడులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
దేవరపల్లి: పొగాకు నారుమడులు వేయడానికి సిద్ధమవుతున్న రైతులు తప్పనిసరిగా టుబాకో బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకుని రసీదు పొందాలని రీజినల్ మేనేజర్ జీఎల్కే ప్రసాద్ సూచించారు. వారికి మాత్రమే సీటీఆర్ఐ, ఐటీసీ సంస్థలు విత్తనాలు సరఫరా చేస్తాయని తెలిపారు. శనివారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. పంట నియంత్రణలో భాగంగా నర్సరీ దశ నుంచే నిబంధనలు కఠినతరం చేస్తున్నామని తెలిపారు. వాణిజ్య రైతులు రెండు హెక్టార్ల వరకూ విస్తీర్ణంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చన్నారు. నర్సరీలను ప్రత్యేక అధికారుల బృందం తనిఖీ చేస్తుందని, ఆ సమయంలో రైతులు రసీదు చూపించాలని చెప్పారు. పొగాకు సాగు చేసే రైతులు విధిగా రిజిస్ట్రేషన్ ఉన్న నర్సరీల నుంచి నారు కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. పొగాకు నాట్ల సమయంలో బోర్డు అందిస్తున్న ఫారం–2తో పాటు నారు అమ్మిన నర్సరీ యజమాని ఇచ్చిన రసీదును జత చేసి, అధికారులకు అందజేయాలన్నారు. బోర్డు రిజిస్ట్రేషన్ లేకుండా నర్సరీలు వేసే వారిపై చర్యలు తీసుకుంటామని ప్రసాద్ చెప్పారు. నర్సరీలను రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతుల జాబితాను బోర్డు వద్ద ప్రదర్శిస్తామన్నారు. అంతర్జాతీయంగా వర్జీని యా పొగాకు విలువ పెరగాలంటే ఉత్పత్తి తక్కువగా ఉండాలన్నారు. రైతులు ఎక్కువగా ఎల్వీ–7, ఎ–3 వంగడాలు సాగు చేస్తున్నారని, కొత్తగా సీటీఆర్ఐ ఎఫ్సీజే–11 వంగడం అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. రిజిస్ట్రేషన్ లేని నర్సరీల నుంచి నారు కొనుగోలు చేసి, పొగాకు సాగు చేస్తే బ్యారన్ రిజిస్ట్రేషన్ నిలుపు చేస్తామని ప్రసాద్ చెప్పారు. రత్నగిరికి పోటెత్తిన భక్తులుఅన్నవరం: రత్నగిరికి శనివారం భక్తులు పోటెత్తారు. సత్యదేవుని సుమారు 20 వేల మంది దర్శించుకున్నారు. ఉదయం నుంచీ భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం, వ్రత, విశ్రాంత మండపాలు రద్దీగా మారాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. స్వామివారి వ్రతాలు 1,500 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.25 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు. -
అపర సంజీవనికి.. తీస్తున్నారా ఊపిరి!
8లోసాక్షి, రాజమహేంద్రవరం: అపర సంజీవనిగా పేరొంది.. లక్షలాది మంది పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందించి.. వారికి కొత్త ఊపిరి అందించిన అపూర్వ పథకం ఆరోగ్యశ్రీ. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూపొందించిన ఈ పథకం.. ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలకు ఖరీదైన వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించింది. ఆ మహానేత తదనంతరం ఆయన తనయుడు, గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం ఈ పథకాన్ని మరింత బలోపేతం చేశారు. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీని దాదాపు నిర్వీర్యం చేశారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన సమయానికి 938 చికిత్సలు మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధిలో ఉండేవి. వాటిని ఏడాది కాలంలోనే 2,436కు పెంచారు. అనంతరం వాటిని మరింత పెంచి 3,275 చికిత్సలకు విస్తరించారు. అంతే కాకుండా, వార్షిక చికిత్స వ్యయాన్ని తొలుత రూ.5 లక్షలకు.. ఆ తరువాత ఏకంగా రూ.25 లక్షలకు పెంచి, ప్రజలకు ఆరోగ్య భరోసాను అందించారు. అవసరాన్ని బట్టి ఇతర రాష్ట్రాల్లోని పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో సైతం చికిత్స పొందే అవకాశం కల్పించారు. ఇటువంటి మహత్తర పథకాన్ని రద్దు చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీని వెనుక డాక్టర్ వైఎస్సార్, ఆయన తనయుడు వైఎస్ జగన్ చేసిన మంచిని మరుగున పెట్టే కుట్ర ఉందని పలువురు విమర్శిస్తున్నారు. ఏం చేస్తున్నారంటే.. ఆరోగ్యశ్రీ పథకం పేరును కూటమి సర్కారు ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చింది. అయినప్పటికీ జనం ఇప్పటికీ ఆరోగ్యశ్రీ గానే ఈ పథకాన్ని పిలుస్తున్నారు. దీనిని సహించలేని ప్రభుత్వం ఏకంగా ఈ పథకానికి మంగళం పాడేందుకు దాదాపు రంగం సిద్ధం చేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఆరోగ్యశ్రీ స్థానంలో ప్రభుత్వం ఆరోగ్య బీమా (హెల్త్ ఇన్సూరెన్స్) తీసుకుని వస్తోంది. దీనిని ఆయుష్మాన్ భారత్తో అనుసంధానం చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ‘ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన, ప్రధానమంత్రి వయో వందన యోజన’ పేరుతో ప్రత్యేక కార్డుల రూపకల్పన ఇప్పటికే ప్రారంభమైంది. ఈ ప్రక్రియ జిల్లాలో ఇప్పటికే 85 శాతం పూర్తయింది. ఆయుష్మాన్ భారత్ అమలుపై ఉద్యోగులకు శిక్షణ సైతం పూర్తి చేశారు. త్వరలోనే ఇది అమలులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ పరిణామం ఇటు ప్రజల్లో.. అటు ఎన్టీఆర్ వైద్య సేవ ఉద్యోగుల్లో ఆందోళన నింపుతోంది. కొత్త విధానం అమలులోకి వస్తే పేదలకు వైద్యం అందని ద్రాక్షలా మారే అవకాశం ఉందన్న విమర్శలు సర్వత్రా వస్తున్నాయి. చికిత్సల సంఖ్య కుదింపు! ఆరోగ్యశ్రీలో ఏకంగా 3,275కు పైగా చికిత్సలు అందిస్తూండగా.. ఆయుష్మాన్ భారత్ పథకంలో ఈ సంఖ్య 1,900 లోపే ఉంటుంది. ప్యాకేజీ సైతం తక్కువగా ఉండటంతో ప్రైవేటు ఆస్పత్రులు ఈ నూతన పథకంపై ఆసక్తి చూపడం లేదు. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసి, దీని పరిధిలోకి రాని చికిత్సలను బీమా పరిధిలోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. ఇదే కనుక జరిగితే ఇప్పటి వరకూ నయాపైసా కూడా చెల్లించకుండా కార్పొరేట్ స్థాయి వైద్యం పొందుతున్న పేద, మధ్య తరగతి ప్రజలపై పెను భారం పడుతుంది. పైగా, ఇప్పటి వరకూ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా నెట్వర్క్ ఆస్పత్రులకు నిధులు విడుదలవుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ అమలులోకి వస్తే చికిత్స క్లెయిమ్కు అప్రూవల్ వచ్చాక కలెక్టర్ ద్వారా నిధులు విడుదల కానున్నట్లు సమాచారం. ఇది కూడా రోగులకు ఇబ్బందికరంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రూ.150 కోట్ల బిల్లులు పెండింగ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసే యత్నాల్లో భాగంగానే నెట్వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం పెండింగ్ బిల్లులు నిలిపివేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు సుమారు రూ.150 కోట్ల మేర బిల్లులను సర్కారు నిలిపివేసింది.వైఎస్సార్ సీపీ పాలనలో.. ● గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం కింద 2023 వరకూ జిల్లా వ్యాప్తంగా రూ.508,49,95,571 వెచ్చించారు. ● 2,48,805 మందికి చికిత్స అందించారు. ● ఏటా రూ.50 కోట్లకు పైనే నిధులు ప్రజారోగ్యం కోసం ఖర్చు చేశారు. ● గుండె, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, క్యాన్సర్ వంటి ఖరీదైన చికిత్సలను సైతం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చారు. ● బైలాట్రల్ కాక్లియర్ ఇంప్లాంటేషన్కు రూ.11.97 లక్షలు, అల్లోజెనిక్ బోన్మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ (14 ఏళ్లు పైన) రూ.11 లక్షలు, గుండె మార్పిడికి రూ.10.77 లక్షల చొప్పున వెచ్చించారు. ఇటువంటి వ్యాధులకు సైతం ఆరోగ్యశ్రీలో నయా పైసా కూడా చెల్లించనవసరం లేకుండానే చికిత్స చేయించుకునే అవకాశాన్ని పేదలకు కల్పించారు.ఆరోగ్యశ్రీ చికిత్సల వివరాలు సంవత్సరం చికిత్స వెచ్చించిన పొందిన (రూ.కోట్లు) వారు 2019-20 25,750 62.71 2020-21 29,602 62.15 2021-22 47,039 89.48 2022-23 1,46,414 294.15ఆదివారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2025 ఆరోగ్యశ్రీని నీరుగార్చే దిశగా కూటమి సర్కారు అడుగులు ఆయుష్మాన్ భారత్గా మార్చేందుకు రంగం సిద్ధం ఇప్పటికే ఉద్యోగులకు ముగిసిన శిక్షణ కార్డుల రూపకల్పనకు శ్రీకారం 85 శాతం పూర్తి త్వరలో అమలుకు ప్రణాళికలుజిల్లాలో ఆరోగ్యశ్రీ వివరాలు నెట్వర్క్ ఆస్పత్రులు 78 వీటిలో ప్రైవేటు 43 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 5 ప్రైమరీ హెల్త్ సెంటర్లు 28 జీజీహెచ్ 1 ఏరియా ఆస్పత్రి 1 దంత వైద్య శాలలు (ఈహెచ్ఎస్) 16 ఆరోగ్యశ్రీ కార్డుదారులు 5,12,000 ‘మిత్ర’ ద్రోహం ఆరోగ్యశ్రీ పథకం ఎత్తివేత యత్నాలపై ఆ విభాగంలోని ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆరోగ్యశ్రీ స్థానంలో తీసుకుని వచ్చే నూతన పథకంలోకి వారిని తీసుకుంటారా లేక బీమా కంపెనీ ఉద్యోగులే నూతన పథకాన్ని అమలు చేస్తారా అనే విషయంలో ఇప్పటి వరకూ స్పష్టత లేదు. దీంతో, తమకు ఉద్యోత భద్రత కరువైందని వారు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తే ఇప్పటి వరకూ కొనసాగుతున్న ఎన్టీఆర్ వైద్యసేవ పరిధిలో సేవలందిస్తున్న ఆరోగ్య మిత్రల భవితవ్యం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. ఆయుష్మాన్ భారత్ అమలు లాగిన్ను సంబంధిత నెట్వర్క్ ఆస్పత్రిలోని మెడికో ద్వారా చేపడతారు. దీంతో ఆరోగ్య మిత్రల ఉనికి ప్రశ్నార్థకంగా మారనుంది. దీనిపై జిల్లా వ్యాప్తంగా 67 మంది ఆరోగ్య మిత్రలు ఆందోళన చెందుతున్నారు. -
రోజాపై వ్యక్తిగత దూషణలు సరికాదు
నల్లజర్ల: మాజీ మంత్రి ఆర్కే రోజాపై నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ దిగజారుడు వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ హోం మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వెల్లంకి వెంకట సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, భానుప్రకాష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇంటి పేరు గాలి కదా అని మహిళలపై గాలి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడటాన్ని ఆమె ఖండించారు. రోజాపై ఈవిధమైన దారుణమైన వ్యాఖ్యలు చేస్తే మహిళా కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించకపోతే జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళతామని వనిత హెచ్చరించారు. మహిళలంటే టీడీపీకి అసలు గౌరవం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న గాక మొన్న కృష్ణా జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారికపై దాడి ఘటన మరువక ముందే రోజాపై అసహ్యకరంగా మాట్లాడారని ధ్వజమెత్తారు. మహిళలను అవమానించడం, కించపర్చడం టీడీపీ నేతలకు పరిపాటిగా మారిందన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై గొంతెత్తడమే రోజా చేసిన నేరమా అని ప్రశ్నించారు. మహిళలపై దాడి జరిగితే తాట తీస్తామన్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎక్కడున్నారని, ఎమ్మెల్యే భానుప్రకాష్ తాట ఎందుకు తీయలేదని నిలదీశారు. భానుప్రకాష్ను తక్షణం అరెస్ట్ చేయాలని వనిత డిమాండ్ చేశారు. గాలి భానుప్రకాష్పై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు మాజీ హోం మంత్రి తానేటి వనిత -
40 మీటర్లు ఉన్నాయంటూ..
సామర్లకోట పట్టణం కిర్లంపూడి రోడ్డులోని జగనన్న కాలనీలోని ఓ ఇంట్లో కటకం నాగసత్య గంగాభవాని అద్దెకు ఉంటున్నారు. భర్త శ్రీను ఫ్రిజ్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు మరమ్మతులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంటారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. తల్లికి వందనం కింద ఇద్దరికీ రూ.30 వేలు వస్తుందని ఆశగా ఎదురు చూశారు. ఆ డబ్బులు రాకపోయేసరికి సచివాలయంలో ఆరా తీయడంతో అసలు విషయం తెలిసి ఆ దంపతులు కంగు తిన్నారు. కూటమి సర్కారు వచ్చాక ఒక మీటరుకు వస్తున్న బిల్లు చెల్లించడమే కష్టంగా ఉంది. అటువంటి గంగాభవాని పేరిట ఏకంగా 40 విద్యుత్ మీటర్లు ఉన్నట్లు ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు రికార్డు చేశారు. దీంతో, ఆ దంపతులు సామర్లకోట సబ్ స్టేషన్కు వెళ్లి తమ పేరిట ఉన్న విద్యుత్ మీటర్లను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. మీటరుకు రూ.35 చొప్పున చెల్లించాలని అక్కడి అధికారులు చెప్పారు. ఇందులో తమ తప్పేమీ లేనప్పటికీ గంగాభవాని దంపతులు 40 మీటర్లకు రూ.1,400 చెల్లించుకున్నారు. అయినప్పటికీ, మీటర్లు తొలగించడానికి ఈపీడీసీఎల్ సిబ్బంది నెల రోజులు చేశారు. అప్పటికే తల్లికి వందనం గడువు కూడా పూర్తయిపోయింది. ఆ డబ్బులు రాకపోగా, తమకు చేతి చమురు వదిలిపోయిందని గంగాభవాని దంపతులు ఆవేదన చెందుతున్నారు. ఆమె పేరిట ఏకంగా 180 మీటర్లు ఈపీడీసీఎల్ నిర్వాకాలు పరాకాష్టకు చేరాయనడానికి ఇది మరో ఉదాహరణ. సామర్లకోట నాలుగో వార్డుకు చెందిన సీకోలు శ్రీదేవి కుటుంబం ఒక రేకుల షెడ్లో నివాసం ఉంటోంది. ఆమె రొయ్యల ఫ్యాక్టరీలో కూలి పని చేసుకుంటోంది. ఆమె భర్త వ్యవసాయ కూలీ. వీరికి కుమారుడు (4వ తరగతి), కుమార్తె (3వ తరగతి) ఉన్నారు. తమ బిడ్డలకు తల్లికి వందనం డబ్బులు వస్తాయని ఆ దంపతులు గంపెడాశతో ఎదురు చూసినా నిరాశే మిగిలింది. దీనిపై సచివాలయంలో సంప్రదిస్తే ఏకంగా 17,758 యూనిట్ల విద్యుత్ వినియోగించినట్టు రికార్డుల్లో ఉందనే కబురు చల్లగా చెప్పారు. వాస్తవానికి ఆ కుటుంబం ఉంటున్న రేకుల షెడ్డుకు ఏనాడూ 60 యూనిట్లకు మించి కరెంటు బిల్లు రాలేదు. దీనిపై ఈపీడీసీఎల్ అధికారులను సంప్రదిస్తే శ్రీదేవి ఆధార్ నంబర్ 4329 0153 9009తో ఏకంగా 180 విద్యుత్ మీటర్లు లింక్ అయి ఉన్నాయని తెలిసింది. దీంతో, ఆ దంపతులకు గుండె ఆగిపోయినంత పనైంది. కూలీ పని చేసుకునే తమకు 180 మీటర్లు ఏమిటని నిలదీస్తే ఫిర్యాదు తీసుకుని, 179 మీటర్లు తొలగించారు. కానీ, ఆమె పేరిట వచ్చిన 17,758 యూనిట్ల బిల్లును సవరించలేదు. చివరకు కరెంటోళ్ల పుణ్యమా అని ఆ కుటుంబం తల్లికి వందనానికి దూరమైంది. వీరికి కోత కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం 2వ వార్డు సచివాలయ పరిధిలో నివాసం ఉంటున్న యల్ల గంగాభవాని, శ్రీను దంపతులు పది మందికి న్యాయం చేసే న్యాయవాద వృత్తిలో ఉన్నారు. వీరి పిల్లలు సత్యకిరణ్ వర్ధన్, హర్షవర్ధన్ ఇంటర్, టెన్త్ చదువుతున్నారు. ఇద్దరికీ కలిపి తల్లికి వందనం డబ్బులు రూ.30 వేలు వస్తాయని ఆ దంపతులు భావించారు. తీరా చూస్తే కిరణ్వర్ధన్కు రూ.9 వేలు, హర్షవర్ధన్కు రూ.10,900 మాత్రమే గంగాభవాని ఖాతాలో జమయ్యాయి. ఇంత తక్కువగా ఎందుకు పడ్డాయని సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా సిబ్బంది నుంచి తెలియదనే సమాధానమే వస్తోంది. అందరి మాదిరిగా రూ.13 వేల చొప్పున పడినట్లు చెబుతున్నారు. కానీ ఖాతాలకు జమయ్యింది మాత్రం తక్కువగా ఉంది. అందరికీ న్యాయం చేసే వృత్తిలో ఉన్న ఆ దంపతులు తమకే అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. -
వారి పాపం.. తల్లులకు శాపం
● ఒక్కొక్కరి పేరిట పదులు, వందల్లో విద్యుత్ మీటర్లు ● కరెంటోళ్ల నిర్వాకంతో సంక్షేమానికి దూరమవుతున్న పేదలు ● రెవెన్యూ శాఖదీ అదే తంతు ● మండిపడుతున్న అర్హులు ● ఇదేం పాలనంటూ ఆగ్రహంసాక్షి ప్రతినిధి, కాకినాడ: ప్రభుత్వ సహాయంతో తమ పిల్లలను బాగా చదివించుకుందామని ఆశ పడిన వారికి ఆ ప్రభుత్వమే జెల్ల కొడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న తప్పిదాలు అర్హులైన ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలను సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నాయి. అందులోనూ ఈమధ్య కరెంటోళ్ల బాగోతాలు అందరినీ నిర్ఘాంతపరుస్తున్నాయి. ఎంతటి స్థితిమంతులకై నా మహా అయితే ఆరేడు వరకూ విద్యుత్ మీటర్లు ఉంటాయి. కానీ, నిన్న కాక మొన్న సామర్లకోటకు చెందిన ఓ మహిళ పేరిట ఏకంగా 40 విద్యుత్ మీటర్లు ఉన్నాయని వెల్లడి కావడం చూసి అందరూ నివ్వెరపోయారు. తాజాగా, అదే పట్టణంలో మరో మహిళ పేరిట ఏకంగా 180 విద్యుత్ మీటర్లు ఉన్నాయంటూ కరెంటోళ్లు షాక్ ఇవ్వడం మరింత ఆశ్చర్యం కలిగించింది. అసలు ఒకే ఆధార్పై పదులు, వందల సంఖ్యలో మీటర్లు ఏవిధంగా ఉంటాయనే ఆలోచన కూడా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీ ఈపీడీసీఎల్) అధికారులకు, సిబ్బందికి రాకపోవడం వింతల్లోకెల్లా వింత. ఈపీడీసీఎల్ తీరు ఇలా ఉండగా.. తామేం తక్కువ కాదని రెవెన్యూ శాఖ కూడా అక్కడక్కడ నిరూపించుకుంటోంది. సెంటు భూమి కూడా లేని నిరుపేద తల్లుల పేరిట ఏకంగా 10, 11 ఎకరాల భూములు చూపించింది. ఇటువంటి అనేక కారణాలతో వివిధ ప్రభుత్వ పథకాలకు అర్హులైన వేలాది మంది.. ఆ సంక్షేమాన్ని అందుకోలేక కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కూటమి సర్కార్ ఎంతో ఘనంగా ప్రకటించుకున్న తల్లికి వందనం పథకం డబ్బులు రాక పలువురు తల్లులు గ్రామ, వార్డు సచివాలయాలు, విద్యుత్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూ నానా అవస్థలూ పడుతున్నారు. కొందరి సమస్య పరిష్కారమైనా, ఇప్పటికే గడువు ముగిసిపోవడంతో తామేమీ చేయలేమంటూ మరి కొంత మందిని సిబ్బంది తిప్పి పంపించేస్తున్నారు. ప్రభుత్వ నిర్వాకంపై ఆయా సంక్షేమ పథకాలకు అర్హులైన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది చేసిన తప్పులకు తమను బలి చేయడమేమిటని, ఇదేం పరిపాలనని ప్రశ్నిస్తున్నారు. తల్లికి వందనం అర్హుల వివరాలు ● కాకినాడ జిల్లాలోని పాఠశాలల్లో 2.80 లక్షల మంది, జూనియర్ కళాశాలల్లో 48,690 మంది విద్యార్థులున్నారు. తొలి విడతలో 1,49,403 మందిని మాత్రమే తల్లికి వందనం పథకానికి అర్హులుగా గుర్తించారు. మిగిలిన విద్యార్థులు మాటేమిటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ● తూర్పు గోదావరి జిల్లాలో 1.88 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరిలో 1.23 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. మిగిలిన 65 వేల మందికీ అర్హత ఉన్నా వివిధ కారణాలతో తల్లికి వందనం డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదు. ● డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2.10 లక్షల మంది విద్యార్థులున్నారు. వీరిలో 1.80 లక్షల మంది అర్హులుగా తేల్చారు. మిగిలిన 30 వేల మంది విద్యార్థులూ తల్లికి వందనానికి దూరమయ్యారు. గుత్తుల రాజేశ్వరికార్పొరేట్ పాఠశాలలో సీటు వచ్చిందంటూ.. కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామానికి చెందిన గుత్తుల రాజేశ్వరికి ఇద్దరు పిల్లలు. కుమారుడు దుర్గా చంద్రశేఖర్ 3, కుమార్తె శ్రీవల్లి 2 తరగతులు చదువుతున్నారు. అయినప్పటికీ వారికి తల్లికి వందనం జమ కాలేదు. విద్యా హక్కు చట్టం ప్రకారం కార్పొరేట్ పాఠశాలల్లో రాజేశ్వరి కుమార్తెకు సీటు వచ్చిందన్న కారణంతో ఇద్దరు పిల్లలకూ తల్లికి వందనం రాలేదని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. కానీ, ఇద్దరు పిల్లలూ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. సచివాలయాన్ని సంప్రదిస్తే అక్కడి సిబ్బంది తనిఖీ చేసి, ప్రస్తుతం పరిశీలన జరుగుతోందని బదులిస్తున్నారు. వేరే వారి భూమి లింక్ చేయడంతో... కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకుర్రుకు చెందిన పాలపు పోచమ్మ, సత్తిబాబు దంపతులకు కుమార్తె మానస (పదో తరగతి), కుమారుడు ప్రవీణ్ కుమార్ (7వ తరగతి) ఉన్నారు. కూటమి పాలకులు చెప్పిన విధంగా ఇంట్లో ఉన్న పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున వస్తాయనుకున్నారు. ఇద్దరికీ కలిపి రూ.30 వేలు వస్తాయని, ఆ డబ్బులు బిడ్డల చదువుకు ఉపయోగపడతాయని ఆశించారు. అయితే, ఎక్కడో సప్త సముద్రాల అవతల అమెరికాలో ఉంటున్న వారికి చెందిన భూమి పోచమ్మ కుటుంబ సభ్యుల ఆధార్తో లింక్ అయ్యింది. మూడెకరాలు మానస ఆధార్కు, మరో నాలుగెకరాలు పోచమ్మ ఆధార్కు లింక్ అయ్యాయి. దీనిని కారణంగా చూపించి, ఆ కుటుంబంలో ఏ ఒక్కరికీ తల్లికి వందనం సొమ్మును ప్రభుత్వం ఇవ్వలేదు. నిజానికి పోచమ్మ కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలం తప్ప అదనంగా సెంటు భూమి కూడా లేదు. కానీ, రెవెన్యూ సిబ్బంది నిర్వాకంతో ఎన్ఆర్ఐల భూమి వీరి ఆధార్తో లింక్ అయ్యింది. ఆ ఎన్ఆర్ఐలు రూ.లక్షలు ఖర్చు పెట్టి స్వగ్రామం వచ్చి వేలిముద్ర వేసి, పోచమ్మ కుటుంబ సభ్యుల ఆధార్కు లింక్ అయిన భూములను ప్రభుత్వ జాబితా నుంచి తొలగిస్తేనే కానీ వీరికి తల్లికి వందనం రాదని సిబ్బంది చెబుతున్నారు. ఈ సమస్య పరిష్కరించాలని పోచమ్మ దంపతులు అమలాపురం కలెక్టరేట్లో అర్జీ ఇచ్చారు. అది ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. -
‘తల్లికి వందనం’లో ఎస్సీ పిల్లల పట్ల వివక్ష
కడియం: తల్లికి వందనం పథకంలో ఎస్సీ విద్యార్థులకు తక్కువ డబ్బులు వేసి, కూటమి ప్రభుత్వం వివక్ష చూపిందని వైఎస్సార్ సీపీ కడియం మండల అధ్యక్షుడు, జేగురుపాడు సర్పంచ్ యాదల సతీష్చంద్ర స్టాలిన్ విమర్శించారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. 9, 10 తరగతులు చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు రూ.10,900, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు రూ.8,200 చొప్పున మాత్రమే వారి తల్లుల ఖాతాలకు జమయ్యాయని తెలిపారు. తోటి వారి కంటే తమకు తక్కువగా రావడంతో వారందరూ సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. జేగురుపాడు గ్రామంలో పదో తరగతి విద్యార్థిని తొర్లపాటి నమ్రత తల్లి ఖాతాకు రూ.8,800, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి బడుగు జగన్ తల్లి ఖాతాకు రూ.8,200 మాత్రమే ప్రభుత్వం జమ చేసిందన్నారు. మండలంలో దాదాపు 1,500 మంది దళిత విద్యార్థులున్నారని, వీరికి ఈ పథకం పూర్తి స్థాయిలో అందలేదని స్టాలిన్ తెలిపారు. వీరికి న్యాయం చేయకపోతే కడియంలో దళిత విద్యార్థులతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. టీచర్లకు బోధనేతర పనులు రద్దు చేయాలినల్లజర్ల: ఉపాధ్యాయలను బోధనేతర పనులకు దూరంగా ఉంచాలని, లేకుంటే ఆ పనులు బహిష్కరించాల్సి వస్తుందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పి.జయకర్ అన్నారు. సభ్యత్వ నమోదు నిమిత్తం శుక్రవారం నల్లజర్ల వచ్చిన ఆయన ఉపాధ్యాయుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. యోగా దినోత్సవం, మెగా పేరెంట్స్ – టీచర్స్ డే, మొక్కల పంపిణీ కార్యక్రమాల ఫొటోలు, వీడియోలు అప్లోడ్ చేయడం వంటి కార్యక్రమాలు ఉపాధ్యాయులకు అప్పగించడం ఎంత మాత్రమూ తగదన్నారు. విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ కిట్ల పంపిణీ, ఒక్క రోజులో బయోమెట్రిక్ పూర్తి చేయాలని ఆదేశించడం కేవలం ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేయడమేనని దుయ్యబట్టారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బోధన సిబ్బంది లేని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని జయకర్ చెప్పారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి మనోహర కుమార్, ఎన్.భవాని, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్ఎఫ్ ఆలీ అహమ్మద్, బి.కిశోర్, టి.నాగేశ్వరావు పాల్గొన్నారు. అష్టదేవతల తీర్థయాత్రకు ప్రత్యేక బస్సులు రాజమహేంద్రవరం సిటీ: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అష్ట దేవతల తీర్థయాత్రకు ప్రత్యేక బస్సులు నడిపామని ఆర్టీసీ రాజమహేంద్రవరం డిపో మేనేజర్ కె.మాధవ్ తెలిపారు. రెండు బస్సులలో సుమారు 100 మంది భక్తులు శుక్రవారం అష్ట దేవతల దర్శనానికి బయలుదేరి, రాత్రి 8 గంటలకు డిపోకు చేరుకున్నారని తెలిపారు. ఈ యాత్రలో కడియపులంక, చింతలూరు, మట్లపాలెం, కోవూరు వారాహి మాత, పిఠాపురం, తాటిపర్తి, పెద్దాపురం, కాండ్రకోట గ్రామాల్లో వెలసిన దేవతలను దర్శిస్తారని వివరించారు. ఎరువుల కొరత లేదు దేవరపల్లి: ఖరీఫ్ పంటలకు అవసరమైన అన్ని రకాల ఎరువులూ రైతులకు అందుబాటులో ఉంచామని, ఎక్కడా కొరత లేదని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం డివిజన్లోని 10 మండలాల్లో 9,915 మెట్రిక్ టన్నులు, కొవ్వూరు డివిజన్లోని 9 మండలాల్లో 10,336 మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. డీఏపీ 1,455 మెట్రిక్ టన్నులు, ఎఫ్ఓఎం 1,199 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 1,027 మెట్రిక్ టన్నులు, ఎన్పీకేఎస్ 6,377 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 2,474 మెట్రిక్ టన్నులు, యూరియా 6,397 మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 20,272 మెట్రిక్ టన్నుల ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచామని వివరించారు. సొసైటీలు, లైసెన్స్ కలిగిన డీలర్ల వద్ద ఎరువులను అందుబాటులో ఉంచామని తెలిపారు. -
కార్మిక చట్టాలు విస్మరిస్తున్న పేపర్మిల్లు
సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రా పేపర్ మిల్లు యాజమాన్యం కార్మిక చట్టాలను కాలరాస్తోందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. మిల్లు ఎదురుగా ఉన్న కల్యాణ మండలంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1947 పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం కార్మికులకు సంఘాలు పెట్టుకోవడం, కనీస వేతనాలు తదితర అనేక హక్కులు ఉన్నాయని చెప్పారు. వాటిని పేపర్మిల్లు యాజమాన్యం తుంగలో తొక్కుతోందని దుయ్యబట్టారు. మిల్లు ఆదాయం అమాంతం పెరుగుతున్నా కార్మికుల వేతనాలు మాత్రం అలాగే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు పెంచాలని కార్మికులు పలుమార్లు డిమాండ్ చేసినా యాజమాన్యం పట్టించుకోలేదన్నారు. రూ.కోట్ల లాభాలు గడిస్తున్నా.. కార్మికులకు సరైన వేతనాలు ఇవ్వడం లేదని విమర్శించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాల్సి ఉన్నా ఏళ్ల తరబడి కాలయాపన చేస్తున్నారన్నారు. రూ.కోట్లలో లాభాలు.. కార్మికులకు పస్తులు ఆంధ్రా పేపర్ మిల్లును 1924లో స్థాపించారని, వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేని మొండి వైఖరిని యాజమాన్యం ప్రదర్శించడం దారుణమని రాజా మండిపడ్డారు. యాజమాన్యానికి పదేళ్లుగా పెద్ద మొత్తంలో లాభాలు వస్తున్నాయన్నారు. మిల్లు ఆదాయం 2014లో రూ.61 కోట్లు ఉంటే.. 2024 నాటికి రూ.430 కోట్లకు పెరిగిందన్నారు. 2014లో రూ.1,314.84 కోట్లుగా ఉన్న ఆస్తులు.. 2024కు రూ.2,450.95 కోట్లకు పెరిగాయన్నారు. మిగులు నిధులు రూ.1,853.43 కోట్లు ఉన్నా.. కార్మికులకు మాత్రం వేతనాలు పెంచడం లేదని ఆవేదన చెందారు. 35 ఏళ్లుగా పని చేస్తున్న కార్మికుడికి రూ.13,500 మాత్రమే వేతనం చెల్లిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కార్మికుల శ్రమతో వచ్చిన లాభాలు తీసుకుంటున్న సంస్థ వారి సంక్షేమాన్ని విస్మరిస్తే సహించేది లేదని రాజా స్పష్టం చేశారు. పేపర్ మిల్లు ఈడీ ముఖేష్ జైన్ నెలకు రూ.13 లక్షల నుంచి రూ.14 లక్షల జీతం తీసుకుంటున్నారన్నారు. యాజమాన్యం, అధికారులు లేనిపోని ఈగోకు పోవద్దని.. కార్మికులకు న్యాయం జరుగుతుందంటే ఎవరి బూట్లు తుడవడానికైనా తాను సిద్ధమని చెప్పారు. ఈ నెల 9 నుంచి కార్మికుల పక్షాన పోరాడుతున్నామని, ప్రభుత్వం వద్ద చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 21వ తేదీ వరకూ సమయం ఇచ్చామని అన్నారు. అప్పటిలోగా కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే 22వ తేదీ నుంచి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని జక్కంపూడి రాజా అల్టిమేటం జారీ చేశారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, పార్టీ పార్లమెంటరీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నందెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాజాకు పోలీసుల నోటీసులు ఆంధ్రా పేపర్ మిల్లు కార్మికులకు న్యాయం చేయాలనే డిమాండ్తో శాంతియుత ఆందోళన చేస్తున్న జక్కంపూడి రాజాకు పోలీసులు శుక్రవారం రాత్రి నోటీసులు అందించారు. పేపర్ మిల్లు సమీపంలో ఉండకూడదని, కల్యాణ మండపాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు పేపర్ మిల్లుకు 500 మీటర్ల లోపు ధర్నాలు, ఆందోళనలు చేపట్టకూడదని తెలిపారు. తాను ఎటువంటి ధర్నా చేయకపోయినా నోటీసులు ఇచ్చి, ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నించడం దారుణమని రాజా అన్నారు. ఆదాయం పెరుగుతున్నా కార్మికుల వేతనాలు పెరగడం లేదు సమస్యల పరిష్కారానికి 21 వరకూ గడువు లేకుంటే 22 నుంచి ఆందోళన ఉధృతం వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి రాజా -
విజిలెన్స్ దాడులు
ఏలేశ్వరం: మండలంలోని లింగంపర్తిలోని ఎరువుల దుకాణంపై శుక్రవారం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. వ్యవసాయశాఖ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. నిల్వల్లో తేడాలను గుర్తించి, ఓ ఫారమ్ లేకపోవడం నిర్ధారించి రూ.15,62,200 విలువ గల 66.5 మెట్రిక్ టన్నుల స్టాకు తదుపరి అదేశాలు ఇచ్చే వరకు అమ్మకాలు సాగించరాదని తెలిపారు. అనంతరం దుకాణదారుడిపై 6ఏ కేసు నమోదు చేశారు. దాడిలో వ్యవసాయశాఖ సహాయ సంచాలకులు షాంసి, విజిలెన్స్ సీఐ శివరామకృష్ణ పాల్గొన్నారు. -
సెంటు భూమి కూడా లేకపోయినా..
రాయుడు గిరిజ, శివప్రసాద్ దంపతులది కరప మండలం వేళంగి. వీరికిద్దరు పిల్లలు. వారికి తల్లికి వందనం కింద ఒకేసారి రూ.30 వేలు వస్తుందని ఆ దంపతులు సంబరపడ్డారు. కానీ, వారి ఆనందం అంతలోనే ఆవిరైపోయింది. ఉండటానికి ఇల్లు తప్ప ఎక్కడా సెంటు భూమి కూడా లేని ఈ కుటుంబానికి యండమూరులో సర్వే నంబర్ 509/2లో 1.4850, 505/1లో 9.810తో కలిపి మొత్తం 11.295 ఎకరాల భూమి ఉన్నట్టు రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేశారు. ఫలితంగా ఈ కుటుంబం తల్లికి వందనానికి దూరమూంది. దీనిపై యండమూరు వీఆర్ఓ, కరప తహసీల్దార్లను కలిసినా ఫలితం లేకపోవడంతో చివరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో రెండుసార్లు అర్జీలు పెట్టుకున్నారు. సమస్య ఇప్పటికీ పరిష్కారమవలేదు. తమ పేరున ఉన్న భూములను రెవెన్యూ రికార్డుల నుంచి తొలగించి తల్లికి వందనమైనా ఇవ్వాలని, లేదంటే ఆ భూములైనా ఇప్పించాలని వారు అడగటంలో తప్పేముందని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. -
కంద రైతు కుదేలు
● గతేడాది పుట్టు కందఽ ధర రూ.11 వేలు, నేడు రూ.7 వేలు ● వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో గిట్టుబాటు– నేడు నష్టాల పాట్లు ● ఎకారానికి రూ.35వేల నుంచి రూ.1.75 లక్షల నష్టం ● జిల్లాలో కంద సాగు విస్తీర్ణం 1,450 హెక్టార్లు పెరవలి: జిల్లాలో కంద సాగుచేస్తున్న రైతులు కొన్నేళ్లుగా లాభాల బాట నుంచి నష్టాల ఊబిలోకి కూరుకుపోతున్నారు. మార్కెట్లో కందకు గిట్టుబాటు ధర లభించకపోవడంతోపాటు, దిగుబడి తగ్గడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్టులో పుట్టు కంద ధర రూ.7వేలు పలకడంతో ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.1.75 లక్షలు నష్టపోతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కంద ధరలు చరిత్ర సృష్టిస్తే.. నేడు ధరలు పతనం అవ్వడంతో రైతులు కుదేలవుతున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది దిగుబడి బాగున్నా మార్కెట్లో ధరలు పడిపోవడంతో పెట్టుబడి కూడా రావట్లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ఎకరానికి 50 నుంచి 70 పుట్టులు (పుట్టు– 232 కిలోలు) దిగుబడి వస్తోంది. సరైన ధర లేక రైతులకు ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.1.75 లక్షల వరకు నష్టం రావటంతో దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్నారు. జిల్లాలో కందసాగు విస్తీర్ణం ఇలా .. జిల్లాలో కంద పంట గతేడాది కంటే ఎక్కువ మొత్తంలో సాగు చేపట్టారు. గతేడాది ఎవరూ ఊహించని విధంగా పుట్టు కంద ధర రూ.11 వేలు పలకటంతో సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లాలో పెరవలి, ఉండ్రాజవరం, నిడదవోలు, కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, కడియం, అనపర్తి, రాజమహేంద్రవరం రూరల్, బిక్కవోలు మండలాల్లో గతేడాది 1,050 హెక్టార్లలో సాగు చేస్తే ఈ ఏడాది 1,450 హెక్టార్లకు పెరిగింది. గతంలో ఈ పంట లాభాలు తీసుకురావటం వల్ల ఈ ఏడాది రైతులు పంట విస్తీర్ణం పెంచటంతో నేడు సాగు చేసిన రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆందోళన కంద ధరలు ఊహించని విధంగా ఈ ఏడాది రూ.6 వేల నుంచి ప్రారంభమై ప్రస్తుతం రూ.7, వేలు వద్ద స్థిరంగా ఉంది. తవ్వకాలు చేపట్టిన మొదటిలోనే ఇలా ఉంటే, పంటంతా చేతికి అందే సమయంలో ధరలు మరింత పతనమవుతాయోనని తవ్వకాలు చేపట్టని రైతులు ఆందోళన చెందుతున్నారు. లాభాల నుంచి నష్టాలకు.. కంద సాగు చేసినప్పుడు పుట్టు విత్తనం కంద రూ.11 వేలకు కోనుగోలు చేయగా ఇప్పుడు మార్కెట్లో పుట్టు ధర రూ.7వేలు ఉండటం, దీనికితోడు దిగుబడి తగ్గటంతో రైతులకు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ధర ప్రకారం 50 పుట్టులకు రూ.3.50 లక్షలు, 60 పుట్టులకు రూ.4.20 లక్షలు, 70 పుట్టులకురూ.4.90 లక్షలు వస్తుంటే ఖర్చు రూ.5.60 లక్షలు ఒక ఎకరానికి అయ్యేది. దీంతో దిగుబడిని బట్టి ఒక ఎకరానికి రూ.35 వేలు నుంచి రూ.1.75 లక్షలు నష్టపోవాల్సి వస్తోంది. నష్టాలు ఇలా.. పెట్టుబడి ఎకరానికి రూ.5.25 లక్షలు అవుతుంటే ఎకరానికి 50 పుట్టులు, దిగుబడి బాగుంటే మార్కెట్ ధర ప్రకారం పుట్టు (232 కిలోలు) కంద ధర రూ.7 వేలు చొప్పున 50 పుట్టులకు రూ.3.50 లక్షలు వస్తుందని, అదే 60 పుట్టుల దిగుబడి ఉంటే రూ. 4.20 లక్షలు, 70 పుట్టుల దిగుబడి ఉంటే రూ.4.90 లక్షలు రైతులకు వస్తుంది. దీని ప్రకారం ఒక ఎకరానికి 70 పుట్టులు దిగుబడి వచ్చిన రైతులకు రూ.35 వేలు, 60 పుట్టులు, వచ్చిన వారికి రూ.1.05 లక్షలు, 50 పుట్టులు దిగుబడి వచ్చిన రైతులు రూ.1.75 లక్షలు నష్టపోతున్నారు. ఎకరానికి రూ.1.05 లక్షలు నష్టపోయాం ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో నేడు నష్టాల పాలవుతున్నాం. ఎకరానికి పెట్టుబడి పోను రూ.లక్షపైనే మిగులు వస్తుందనుకుంటే నేడు ఎకరానికి రూ.1.05 లక్షలు నష్టపోయాం. –వేండ్ర ఏసు, కంద రైతు, ముక్కామల ఇలాగైతే వ్యవసాయం ఎలా చేయాలి గత ఐదేళ్లూ కంద రైతులు లాభాలు అందుకోగా నేడు తీవ్రంగా నష్టపోయాం. గతంలో పెట్టుబడి సొమ్ము వచ్చేది. నేడు రాని పరిస్థితి. ఇలాగైతే వ్యవసాయం ఎలా చేయాలో తెలియటం లేదు. –బొలిశెట్టి వెంకటేశ్వరరావు, కంద రైతు, అన్నవరప్పాడు మార్కెట్లో వినియోగం తగ్గింది ఉభయ గోదావరి జిల్లాల్లో పండించిన కంద పంటకు చైన్నె, ముంబయి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కానీ ఈ ఏడాది కంద సాగు విస్తారంగా పెరగటం, మార్కెట్లో వినియోగం తగ్గటంతో ధరలు తగ్గాయి. అంతే కాకుండా అన్ని జిల్లాల్లో కంద దిగుబడి బాగుండటం ధరలు తగ్గటానికి కారణమైంది. –గడుగోయ్యిల సత్యనారాయణ, కంద వ్యాపారి దిగుబడి ఉన్నా.. గతేడాదిలాగే ఈ ఏడాది దిగుబడి ఉన్నా గతంలో ఉన్న ధర లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలు పాలవుతున్నారు. గతేడాది ఎకరానికి 50 నుంచి 60 పుట్టులు దిగుబడి వస్తే ఈ ఏడాది 50 నుంచి 70 పుట్టులు వచ్చింది. పెట్టుబడి.. కంద సాగు చేసే రైతులు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టా ల్సి ఉంది. ఎకరం కంద వేయాలంటే 30 పుట్టుల విత్త నం వేయాలి. గతేడాది విత్తనం ధర పుట్టు రూ.11 వేలు చొప్పున 30 పుట్టులకు రూ.3.30 లక్ష లు, దుక్కు దున్నటానికి, కంద నాటడానికి, బోదెలు తవ్వటానికి, చచ్చు ఎక్కవేయటానికి కూలీలకు రూ. లక్ష ఖర్చు అయింది. పెంట వేయటానికి రూ.30 వే లు, ఎరువులు, పురుగు మందులకి రూ.40వేలు, నీటి తడులు, కలుపుతీతకు రూ.25వేలు .. మొత్తం ఖర్చు రూ.5.25 లక్షలు అవుతుండగా.. నేడు మార్కె ట్ ధరల ప్రకారం ఎకరానికి రూ.35 వేల నుంచి రూ.1.75 లక్షలు నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. -
కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్
అంబాజీపేట: పుల్లేటికుర్రు మలుపు వద్ద ప్రధాన రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కారును ఏపీఎస్ఆర్టీసీ బస్ బలంగా ఢీ కొట్టింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముక్కామల నుంచి కె.పెదపూడి వైపు వెళుతున్న కారును అమలాపురం నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న ఆర్టీసీ బలంగా ఢీకొట్టింది. కారు ముందు బాగం నుజ్జునుజ్జు అయ్యింది. కారులో ప్రయాణిస్తున్న కె.పెదపూడికి చెందిన సత్తిరాజాకు తీవ్ర గాయాలు కావడంతో అమలాపురం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని అంబాజీపేట పోలీసులు పరిశీలించి ఆర్టీసీ బస్ను స్టేషన్కు తీసువచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిడుగుపాటుకు ఇల్లు ధ్వంసం మలికిపురం: మండలంలోని పడమటిపాలెం గ్రామంలో గురువారం రాత్రి పిడుగుపాటుకు నల్లి దాసు ఇంట్లో వస్తువులు ధ్వంసం అయ్యాయి. విద్యుత్ మీటర్లతో పాటు మంచం, పరుపు కూడా కాలిపోయినట్లు దాసు తెలిపారు. ఈదురు గాలులుకు తోడు పిడుగులు పడ్డాయని ఆయన పేర్కొన్నారు. అదృశ్యమైన కుటుంబాన్ని పట్టుకున్న పోలీసులు కిర్లంపూడి: అదృశ్యమైన కుటుంబాన్ని గాలించి పట్టుకున్నామని జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. మండల పరిధి బూరుగుపూడి గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు, బాలిక, బాలుడు గత ఏడాది నవంబర్ 9వ తేదీ అర్ధరాత్రి తాము సామూహికంగా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి గ్రామం విడిచి వెళ్లారు. సోదరుడు గణేశ్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. మహారాష్ట్రంలోని షోలాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు సమాచారం రావడంతో స్థానిక ఎస్సై జి.సతీష్ పోలీస్ సిబ్బందితో మాటువేసి శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది డబ్ల్యూహెచ్సీ గురుశ్రీ, పీసీ శివప్రసాద్ ఉన్నారు. చాకచక్యంగా పట్టుకుని ఎస్సై సతీష్ను, సిబ్బందిని పెద్దాపురం ఎస్డీపీఓ శ్రీహరిరాజు, జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ అభినందించారు. -
అంబాజీపేట కొబ్బరి మార్కెట్
కొబ్బరి రకం ధర (రూ.ల్లో) కొత్తకొబ్బరి (క్వింటాల్) 23,000 – 23,500 కొత్తకొబ్బరి (రెండవ రకం) 10,500 – 12,000 కురిడీ కొబ్బరి (పాతవి) గండేరా (వెయ్యి) 29,500 గటగట (వెయ్యి) 27,500 కురిడీ కొబ్బరి (కొత్తవి) గండేరా (వెయ్యి) 28,000 గటగట (వెయ్యి) 25,500 నీటికాయ,పాత (ముక్కుడు)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొత్త (పచ్చి)కాయ (వెయ్యి) 19,000 – 20,000 కొబ్బరి నూనె (15 కిలోలు) 3,750 ఒక కిలో 260 -
నూతన విద్యావిధానంతో ప్రపంచీకరణపై అవగాహన
జేఎన్యూ ప్రథమ మహిళా వీసీ శాంతిశ్రీ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): నూతన విద్యావిధానం 36 ఏళ్ల తరువాత రూపొందించారని, దీని ద్వారా ప్రపంచీకరణపై అవగాహన కలుగుతుందని జేఎన్యూ ప్రథమ మహిళా వీసీ ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి పేర్కొన్నారు. జేఎన్టీయూకేలో నిర్వహిస్తున్న ఓక్ ట్రీ ఉత్సవాల్లో భాగంగా రోల్ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020 ఇన్ స్వర్ణాంధ్ర వికసత్ భారత్ – 2047 అంశంపై శుక్రవారం వర్క్షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ శాంతశ్రీ మాట్లాడుతూ పరిశ్రమకు నైపుణ్యాలతో కూడిన వ్యక్తుల అవసరం ఉందన్నారు. టర్కీ, చైనా దేశాలు ఎయిర్ఫోర్స్ గ్రౌండ్స్ మెయింటెనెన్స్ చేస్తున్న విధంగా భారతదేశం ముందడుగు వేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. జేఎన్యూ వంటి విశ్వవిద్యాలయాలు నోబుల్ అవార్డు గ్రహీతలను అందిస్తున్నాయన్నారు. పరిశ్రమలకు, విద్యావ్యవస్థలకు మధ్యనున్న అంతరాన్ని తగ్గించి విద్యార్థులకు సాంకేతిక విద్యానైపుణ్యాలను నేర్పించాలన్నారు. జేఎన్టీయూకే వంటి ప్రముఖ వర్సిటీల నుంచి ఏరోస్పేస్ సర్వీస్, డిఫెన్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎయిర్క్రాప్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఒకేషనల్ సిస్టమ్, పబ్లిక్ డిజైన్ వంటి కోర్సులను అందించి ఆధునికతకు పెద్దపీట వేయాలన్నారు. రాబోయే యుద్ధాలను ఎదుర్కొనేలా భారత ఇంజినీర్లు తమ శక్తి మేరకు అన్వేషణలు సాగించి సన్నద్ధమవ్వాలన్నారు. హైదరాబాద్ ఇప్లూ వీసీ ప్రొఫెసర్ ఎన్.నాగరాజు మాట్లాడుతూ భారతదేశంలో మిలియన్కు 260 మంది మాత్రమే నిపుణులు ఉండగా చైనాలో మిలియన్కు వెయ్యిమంది ఉన్నారని, భారతదేశం పరిశోధనపై కేవలం 0.64 శాతం మాత్రమే నిధులు వెచ్చిస్తోందన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ మాజీ వీసీ బాలగంగాధర్ తిలక్ మాట్లాడుతూ అన్వేషణ, సాంకేతిక అభివృద్ధి, పరిశ్రమలు, సేవారంగం, తయారీ వంటి రంగాలను ఆర్థికాభివృద్ధి వైపు పయనించేలా చేయాలన్నారు. నాన్ ఇంజినీరింగ్ సబ్జెక్టులను ప్రవేశపెట్టి సోషల్ సైన్స్, టెక్నికల్ కోర్సులను కలిపి నేర్పించాలని, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీలను నిర్మించడం కాకుండా ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మార్గాలు అన్వేషించాలన్నారు. వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్, రెక్టార్ సుబ్బారావు, ప్రిన్సిపాల్ మోహనరావు, మాజీ వీసీలు డాక్టర్ ప్రసాదరాజు, శ్రీనివాసకుమార్, ప్రొఫెసర్ ఉదయభాస్కర్, పద్మరాజు పాల్గొన్నారు. -
అస్వస్థతకు గురయిన విద్యార్థినులకు వైద్య పరీక్షలు
● పాఠశాలకు తగ్గిన విద్యార్థుల హాజరు ● స్కూల్ను సందర్శించిన మండల అఽధికారులు జగ్గంపేట: మండలంలోని కాండ్రేగుల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అస్వస్థతకు గురయిన విద్యార్థినులకు శుక్రువారం వారి ఇంటి వద్ద వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించారు. గురువారం ఘటన అనంతరం విద్యార్థినులకు చికిత్స చేసి జగ్గంపేట సీహెచ్సీ నుంచి, ఒక ప్రయివేట్ ఆసుపత్రి నుంచి వారి ఇళ్లకు పంపారు. స్థానిక వైద్య సిబ్బంది శుక్రువారం వైద్య పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితి బాగా ఉన్నట్లు మండల అధికారులకు తెలిపారు. పాఠశాలలో పరిస్థితిని జగ్గంపేట మండల పరిషత్ అధికారి చంద్రశేఖర్, మండల విద్యాశాఖాధికారి ఆర్.స్వామి సమీక్షించారు. పాఠశాలలో క్లాస్ రూమ్లు, వెంటిలేషన్, తాగునీటి శుభ్రత, డ్రైనేజీ వ్యవస్థను వారు క్షుణంగా పరిశీలించారు. విద్యార్థులతో అధికారులు మాట్లాడారు. పాఠశాలకు శుక్రవారం విద్యార్థుల హాజరు తగ్గిందని పాఠశాల హెచ్.ఎం మారిశెట్టి నాగేశ్వరరావు తెలిపారు. 217మంది విద్యార్థులకు కేవలం 5 తరగతి గదులు కాండ్రేగులలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల కలిపి నిర్వహిస్తున్నారు. మొత్తం 217 మంది విద్యార్థులు వున్నారు. వీరిలో 165మంది హైస్కూల్ విద్యార్థులు కాగా 52 మంది ప్రాథమిక పాఠశాలకు చెందినవారు. హైస్కూల్ విద్యార్థులకు 5క్లాస్లకు కేవలం మూడే తరగతి గదులు వున్నాయి. రెండు క్లాస్లు వరండాలలో నిర్వహిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలకు రెండు తరగతి గదులు వున్నాయి. వీరిని సర్దుబాటు చేసి విద్యను అందిస్తున్నారు. –పాఠశాలలో వైద్యశిబిరం నిర్వహించాలి–విద్యార్దులకు జాగ్రత్తలు చెప్పాలి కాండ్రేగుల పాఠశాలలో గురువారం విద్యార్థుల అస్వస్థతకు గురికావడం జిల్లా వ్యాప్తంగా సంచలనం కలిగించింది. వేసవిని మించి ఎండలు కాస్తున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలిపేందుకు అధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేసివుంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడ్డారు. దీనిపై మండల అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. -
విద్యుదాఘాతానికి యువకుడి మృతి
● కూలి పనికి వచ్చి అనంత లోకాలకు ● సామాజిక ఆరోగ్య కేంద్ర వద్ద ధర్నా సామర్లకోట: స్థానిక పిఠాపురం రోడ్డులో విద్యుత్తు వైర్లు మార్పు చేయడానికి వచ్చిన ఒక కాంట్రాక్టు కార్మికుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. గణేష్ కాలనీకి చెందిన నులక బేతాలుడు (30) పిఠాపురం రోడ్డులో విద్యుత్తు వైర్లు మార్పు చేసే పనిలో భాగంగా స్తంభం ఎక్కిన సమయంలో 11కెవీ వైర్ల నుంచి విద్యుత్తు రావడంతో ఒకసారిగా కింద పడిపొయాడు. వెంటనే తోటి సిబ్బంది సమీపంలో ఉన్న సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ బేతాలుడు మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిల్లలు చిన్న వారు కావడంతో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న వైస్చైర్మన్ ఉబా జాన్మోజెస్, సీఐ ఎ కృష్ణ భగవాన్, కౌన్సిలర్ పిట్టా సత్యనారాయణ, రాష్ట్ర మాలమహానాడు నాయకుడు లింగం శివకుమార్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. పిఠాపురం రోడ్డు కాంట్రాక్టరుతో చర్చించి బాధిత కుటుంబానికి రూ.8.50 లక్షల నష్ట పరిహరం ఇచ్చేలా ఒప్పించారు. ఆస్పత్రి వద్ద భార్య, కుమార్తె రోదన స్థానికుల హృదయాలను కలచి వేసింది. కుమార్తె నాన్న కావాలని ఏడుస్తూ ఉంటే ఆ బాలికను సముదాయించడం స్థానికులకు సాధ్యం కాలేదు. సామర్లకోట–పిఠాపురం రోడ్డు విస్తరణ పనులలో భాగంగా విద్యుత్తు స్తంభాలను వెనుకకు మార్పు చేశారు. మార్పు చేసిన స్తంభాలకు వైర్లు ఏర్పాటు చేయడానికి శుక్రవారం విద్యుత్తు సబ్ స్టేషన్ నుంచి సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అయినా విద్యుత్తు వైర్లకు కరెంటు సరఫరా కావడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతదేహాన్ని పోర్టుమార్టమ్కు తరలించి కేసు నమోదు చేసి సీఐ ఎ కృష్ణభగవాన్ దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థులపై వివక్ష.. ఎంఈఓ విచారణ
నిడదవోలు: పట్టణంలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్లో విద్యార్థులపై వివక్ష చూపుతున్న ఘటనపై జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు స్పందించారు. స్కూల్లో 6, 7 తరగతుల విద్యార్థులు ఇంగ్లిష్లో మాట్లాడటం లేదనే పేరుతో వారి యూనిఫాంకు ‘ఇంగ్లిష్ డిఫాల్టర్’ అనే ట్యాగ్ తగిలించడంపై ‘విద్యార్థుల పట్ల వివక్ష’ అనే శీర్షికన ‘సాక్షి’ శుక్రవారం ప్రచురించిన కథనానికి విద్యాశాఖాధికారులు స్పందించారు. జిల్లా విద్యాశాఖాధికారి వాసుదేవరావు ఆదేశాల మేరకు ఎంఈఓ పి.గురుమూర్తి స్కూల్లో శుక్రవారం విచారణ చేపట్టారు. సదరు విద్యార్థులతో ట్యాగ్ తగిలించడంపై వివరణ కోరగా, విద్యార్థులు విషయాన్ని ఎంఈఓకు స్పష్టంగా చెప్పారు. అనంతరం మరికొన్ని తరగతుల విద్యార్థులను విచారించారు. ఈ మేరకు హెచ్ఎం మేరీ సమక్షంలో సంబంధిత పాఠశాలకు చెందిన సుమారు 25 మంది ఉపాధ్యాయులకు ఎంఈఓ విద్యాహక్కు చట్టంపై అవగాహన కల్పించారు. ఇంగ్లిష్ మాట్లాడని విద్యార్థులపై ఇలాంటి చర్యలు సరైనవి కావని హితవు పలికారు. ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకుంటామని స్కూల్ కరస్పాండెంట్ పుష్ప, విద్యార్థులకు ట్యాగ్లు తగిలించిన టీచర్ లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ తీసుకున్నారు. విద్యార్థులకు భయం ఉంటుందనే ఉద్దేశంతోనే ట్యాగ్లు తగిలించానని, దీనికి యాజమాన్యంతో ఎలాంటి సంబంధం లేదని సదరు టీచర్ ఎంఈఓకు వివరణ ఇచ్చారు. కరస్పాండెంట్ పుష్ప, ట్యాగ్లు తగిలించిన టీచర్ స్టేట్మెంట్లను జిల్లా విద్యాశాఖాధికారికి పంపిచినట్లు ఎంఈఓ తెలిపారు. -
ప్రియురాలిని హత్య చేసి పరారీ
రాజోలు: చెడు వ్యసనాలకు బానిసై మద్యం మత్తులో తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని చాకుతో పొడిచి హత్య చేశాడు. బుధవారం రాత్రి బి.సావరం సిద్ధార్థనగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలిని వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేయగా దానికి ఆమె నిరాకరించింది. దీంతో వారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ప్రియురాలు ఓలేటి పుష్ప(22)ను ప్రియుడు రాజోలు కోళ్ల వారి వీధికి చెందిన షేక్ షమ్మా చాకుతో గుండెల్లో పొడవడంతో ఒక్కసారిగా పుష్ప ప్రాణాలు కోల్పోయింది. కూతురిని కాపాడుకునేందుకు పుష్ప తల్లి గంగ, పుష్ప అన్న వినయ్ అడ్డువెళ్లగా వారిద్దరిపై కూడా షేక్ షమ్మా చాకుతో దాడి చేసి గాయపర్చాడు. వారి కేకలకు చుట్టుపక్కల వారు రావడంతో నిందితుడు షమ్మా అక్కడి నుంచి పారిపోయాడు. సిద్ధార్థనగర్లో జరిగిన హత్య విషయం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాజోలు సీఐ నరేష్కుమార్, ఎస్సై రాజేష్కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు దాడిలో గాయపడ్డ తల్లి గంగ, అన్న వినయ్లను రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సీఐ నరేష్కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం యెనుముల్లంక గ్రామానికి చెందిన ఓలేటి పుష్పకు ఐదేళ్ల క్రితం రాజోలు మేకలపాలానికి చెందిన ఓలేటి సతీష్తో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల బాబు ఉన్నాడు. భార్యాభర్తల మద్య మనస్పర్థలు రావడంతో పెద్దల సమక్షంలో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి తన నాలుగేళ్ల కుమారుడితో పుష్ప, ఆమె తల్లి అంగాని గంగతో కలసి బి.సావరం సిద్ధార్థనగర్లో నివాసం ఉంటోంది. రెండేళ్లు క్రితం నుంచి రాజోలు కోళ్లవారి వీధికి చెందిన షమ్మాతో పుష్పకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారు సహజీవనం చేస్తున్నారు. మద్యానికి బానిసైన షమ్మా తన అవసరాల కోసం పుష్పను శారీరకంగా, మానసికంగా వేధించేవాడని, డబ్బు కోసం వ్యభిచారం చేయాలని ఒత్తిడి చేస్తున్నాడని పుష్ప తన తల్లి గంగ, అన్న వినయ్కు మొర పెట్టుకుంది. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు ఎందుకు చెప్పావంటూ పుష్పతో గొడవపడి ఆమెను చాకుతో పొడవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. తల్లి గంగ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పారిపోయిన షమ్మాను పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశామని డీఎస్పీ తెలిపారు. అడ్డు వచ్చిన ఆమె తల్లి, అన్నపై దాడి -
అమ్మవార్లకు 1400 కిలోల భారీగా సారెలు
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులోని మదుగులమ్మ, నూకాలమ్మ అమ్మవార్లకు గురువారం భక్తులు 1400 కిలోల భారీ సారెలు సమర్పించారు. బిక్కవోలు తాళ్ళవారి ఆడపడుచు మదుగులమ్మ తల్లికి స్థానిక మహిళలు ఇంటి వద్ద చేసిన పలు రకాల 800 కిలోల పిండివంటలు సమర్పించారు. అలాగే పసుపు, కుంకుమ, గాజులు, అరటి పండ్లు, కొబ్బరి కాయలు, చీరలు, పండ్లు కూడా అందజేశారు. తొలుత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయానికి చేరుకుని, అక్కడి నుంచి అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించి, సారె సమర్పించారు. అలాగే, నూకాలమ్మ తల్లికి పసుపు, కుంకుమ, గాజులు, అరటి తదితర పండ్లతో పాటు 600 కిలోల స్వీట్లు సమర్పించారు. రెండు ఆలయాల వద్ద అమ్మవార్లకు సమర్పించిన సారెలను భక్తులకు పంపిణీ చేశారు. – బిక్కవోలు