కార్మిక వ్యతిరేక విధానాలను ఆమోదించడం దుర్మార్గం
రాయవరం: కార్మికులకు నష్టాన్ని కలిగించే కేంద్ర విధానాలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించకుండా అసెంబ్లీలో ఆమోదించడం దుర్మార్గ చర్యగా తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ కార్మిక సంఘ నాయకుడు రాగుల రాఘువులు, ఐఎఫ్టీయూ రాష్ట్ర కోశాధికారి గుబ్బల ఆదినారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని చెల్లూరు పంచాయతీలో సోమవారం కార్మిక సమస్యలపై మాట్లాడేందుకు వచ్చిన సందర్భంగా వారు మాట్లాడారు. కార్మికులకు రక్షణగా ఉన్న 26 చట్టాలను రద్దు చేసి, యాజమాన్యాలకు అనుకూలంగా లేబర్ కోడ్లను మార్చి పోరాడి సాధించుకున్న 8గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ 10 గంటల భారాన్ని కార్మికుల మీద రుద్దుతున్నారన్నారు. లేబర్ కోడ్ల రద్దు కోరుతూ ఫిబ్రవరి 12న దేశ వ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు వేతనాలు మొదటి వారంలో ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న అరియర్స్ చెల్లించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య డిమాండ్ చేసింది. కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు జొన్నకూటి రవికుమార్, లంక రాంబాబు పాల్గొన్నారు.
భీష్మ ఏకాదశి ఏర్పాట్లపై
నేడు సమీక్ష
అన్నవరం: ఈ నెల 29న భీష్మ ఏకాదశి, ఫిబ్రవరి ఒకటో తేదీన మాఘ పౌర్ణమి, మాఘ మాసంలో ఇతర పర్వదినాల సందర్భంగా సత్యదేవుని ఆలయానికి వేలాదిగా భక్తులు వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహిస్తున్నారు.


