ప్రజల పక్షాన పోరాడుతాం
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధిని విస్మరించి ఈ ప్రాంతానికి ఉరి వేయాలన్న ఆలోచనను పాలకులు విరమించుకోవాలి. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలి. రాయలసీమ ప్రాంత రైతుల ప్రయోజనాలు కాపాడడానికి అలుపెరుగని పోరాటం చేయాల్సిన తరుణం ఆసన్నమైంది. ‘చలో పోతిరెడ్డిపాడు’ కార్యక్రమానికి రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ (రఫ్) తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం.
– తిప్పిరెడ్డి నాగార్జునరెడ్డి, రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు


