Anantapur District News
-
ఉరవకొండలో సైకో వీరంగం
● ఇద్దరిపై కత్తితో దాడి ● రెండు ద్విచక్ర వాహనాల ధ్వంసం ● పోలీసు స్టేషన్లోనూ హల్చల్ ● అతికష్టం మీద తాళ్లతో బంధించిన స్థానికులు ఉరవకొండ: స్థానిక హమాలీ కాలనీలో నివాసముంటున్న సైకో శేఖర్ మంగళవారం రెచ్చిపోయాడు. తెల్లవారుజామున చేతిలో కత్తి పట్టుకుని ఇందిరానగర్, హమాలీ కాలనీ, శివరాంరెడ్డి కాలనీ, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో తిరుగుతూ జనాలను భయభ్రాంతులకు గురి చేశాడు. ఇందిరానగర్లో నివాసముంటున్న హనుమంతప్ప ఇంటి తలుపు తట్టడడంతో ఆయన ఎవరో వచ్చారని తలుపు తీయగానే వెంటనే కత్తితో దాడి చేసి, తీవ్రంగా గాయపరిచాడు. బస్టాండ్ ప్రాంతంలో బస్సు కోసం వేచి ఉన్న వజ్రకరూరు మండలం తట్రకల్లు గ్రామానికి చెందిన నరసింహులుపై కత్తితో దాడి చేసి గాయపరిచాడు. హమాలీ కాలనీలో ఇంటి ఆవరణలో నిలిపి ఉన్న రెండు బైక్లను కట్టెలు, రాళ్లతో బాది ధ్వంసం చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో చొరబడి నానా హంగామా సృష్టించి, అక్కడ ఇనుంచి బయటపడి హమాలీ కాలనీకు చేరుకున్నాడు. ఆ సమయంలో కాలనీవాసులు ధైర్యం చేసి సైకోను తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేయడంతో పోలీసులు అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. సైకో చేతిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే అనంతపురంలోని జీజీహెచ్కు తరలించారు. గతంలో కూడా సైకో శేఖర్ ఉరవకొండ కోర్టు భవనం ఎక్కి ఎక్కి గొంతు కోసుకోని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. విద్యుదాఘాతం... విద్యార్థి మృతి ● చదువుకుంటూ...పనికి వెళ్తున్న విద్యార్థి రాప్తాడు రూరల్: ఓవైపు చదువుకుంటూ మరోవైపు కుటుంబానికి అండగా ఉంటున్న విద్యార్థిని కరెంటు రూపంలో మృత్యువు వెంటాడింది. ఈ ఘటన మంగళవారం రాప్తాడు మండల పరిధిలోని చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...అనంతపురం రూరల్ జాకీర్కొట్టాలుకు చెందిన రితేష్ఖాన్ కుమారుడు అజాంఖాన్ (20) ప్రభుత్వ ఐటీఐలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఖాళీ సమయంలో టైల్స్ పనికి వెళ్లేవాడు. మంగళవారం రాప్తాడు మండలం కళాకారుల కాలనీలో టైల్స్ పనులు చేస్తుండగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రమాదవశాత్తు కరెంట్ వైర్ తొక్కడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. తోటి కార్మికులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించినా... ఫలితం లేకపోయింది. అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. చదువుకుంటూనే కుటుంబానికి అండగా ఉంటున్న అజాంఖాన్ దుర్మరణం చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న రాప్తాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైతుల బాగోగులు పట్టని చంద్రబాబు
● మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి టౌన్: రాష్ట్రంలో రైతుల బాగోగులు సీఎం చంద్రబాబుకు పట్టడం లేదని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విమర్శించారు. మంగళవారం తాడిపత్రి నియోజకవర్గంలోని పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట గ్రామంలో ఆయన పర్యటించి, మొక్కజొన్న పంటను పరిశీలించారు. రైతుల సమస్యలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు అతి తక్కువ ధరతో పంటను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం క్వింటా మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ 2,400 ప్రకటించిందని, కొనుగోలు కేంద్రాలు లేక కేవలం రూ.1,800తో దళారులు కొనుగోలు చేస్తున్నారని వివరించారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్కెఫెడ్ ద్వారా రైతుల నుంచి మొక్కజొన్నలు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. అలాగే గత ప్రభుత్వంలో కౌలు రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ, క్రాప్ఇన్సూరెన్స్, ధరల స్థిరీకరణ, గిట్టుబాటు ధరలు, పంట కొనుగోలు కేంద్రాలు, రైతు బరోసా అందజేసారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు కనీసం యూరియా కూడా సక్రమంగా అందించలేకపోయిందని మండిపడ్డారు. తీవ్రమైన ఎండలు, వర్షాభావం కారణంగా భూగర్భజలాలు అడుగంటి ఉద్యాన పంటలు ఎండుతున్నాయన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో రోజూ రూ.వేల ఖర్చుతో ట్యాంకర్ల ద్వారా ఉద్యాన పంటలకు సాగునీరందించాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని, తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
సిబ్బందిని నియమిస్తాం
అనంతపురం టౌన్: జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. జిల్లావ్యాప్తంగా ఉన్న 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ సరిపడా సిబ్బంది లేరు. 50 మంది దాకా సిబ్బంది కొరత ఉంది. ఈ క్రమంలో వినియోగదారులకు సకాలంలో సేవలు అందడం లేదు. స్థిరాస్తుల విక్రయాలు, కొనుగోలు సమయంలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. అలాంటి రికార్డులను రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా పొందేందుకు రోజులు కాదు నెలల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. స్పందించండి సారూ.. గతంలో ప్రైవేట్ సిబ్బందిని ఏర్పాటు చేసుకొని మాన్యువల్ ఈసీ, ఆర్హెచ్ పేజీలతో పాటు నకలు డాక్యుమెంట్లను అందించేవారు. ప్రస్తుతం వారు కార్యాలయాలకు రాకపోవడంతో సమస్య తలెత్తింది. వారి స్థానాల్లో కొత్తగా సిబ్బందిని నియమించాల్సిన అధికార యంత్రాంగం చర్యలు చేపట్టకపోవడంతో నిత్యం వేలాది మంది రికార్డుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికైనా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు స్పందించి సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సిబ్బందిని నియమించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. అక్కడి నుంచి ఉత్తర్వులు రాగానే భర్తీ చేస్తాం. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం. – బి. శ్రీనివాసులు, జిల్లా రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ శాఖను వేధిస్తున్న సిబ్బంది కొరత రికార్డుల కోసం నెలల తరబడి ప్రజల ప్రదక్షిణలు పట్టించుకోని ఉన్నతాధికారులు -
చాపట్లలో కౌలు రైతు ఆత్మహత్య
రాప్తాడు రూరల్: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన మేరకు.. కణేకల్లు ప్రాంతానికి చెందిన తలారి నరసింహులు (41) రాప్తాడు మండలం చాపట్లలో వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. కొన్నేళ్లుగా మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ ఏడాది టమాట, వేరుశనగ పంటలు సాగు చేసినా... ఆశించిన దిగుబడి రాకపోవడం కుదేలయ్యాడు. పంటల కోసం చేసిన అప్పులకు వడ్డీల భారం పెరుగుతుండగా తీర్చే మార్గం కానరాక మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం తన పొలం వద్దే పంటకు వినియోగించే మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబానికి అండగా ఉన్న నరసింహులు మరణించడం వారిని పూర్తిగా కుదేలు చేసింది. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా మృతుడి బంధువులు రాత్రి రాప్తాడు పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు. -
రైలు కింద పడి యువకుడి మృతి
గుంతకల్లుటౌన్: స్థానిక హనుమాన్ జంక్షన్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఓ యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. లభ్యమైన ఆధారాలను బట్టి మృతుడిని కర్నూలు జిల్లా మద్దికెరకు చెందిన విశ్రాంత ఆర్టీసీ డ్రైవర్ గోపాల్ కుమారుడు కె.బాలచంద్ర (34)గా గుర్తించారు. గుంతకల్లులోని కొనకొండ్ల రైల్వేగేట్ సమీపంలో ఉన్న ఆర్డీటీ బిల్డింగ్స్లో అద్దెకుంటున్నాడు. అవివాహితుడు. ఆర్టీసీ అద్దె బస్సుల్లో క్లీనర్గా దినసరి కూలి పనితో జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం వేకువజామున రైలుకింద పడి మృతి చెందాడు. కాగా, మద్యం మత్తులో రైలు కిందపడ్డాడా? లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
●కల్యాణం.. కమనీయం
రాయదుర్గం: పట్టణంలోని కోటలో వెలసిన ప్రసన్న వేంకటరమణుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం బాలికతో శ్రీవారి వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. విశిష్ట సంప్రదాయం ప్రకారం నిర్వహించిన ఈ ఘట్టాన్ని కనులారా వీక్షించిన భక్తులు తరించారు. పద్మశాలీయ వంశం అరవ తెగకు చెందిన బాలికతో శ్రీనివాసుడి కల్యాణం జరిపితే, ఆ బాలికకు సకల గుణ సంపన్నుడు భర్తగా వస్తాడని భక్తుల నమ్మకం. అందులో భాగంగా ఈ ఏడాది కర్ణాటక రాష్ట్రం విజయనగర జిల్లాలోని కానాహొసళ్లికి చెందిన అరవ నగేష్, పావని దంపతుల కుమార్తె పద్మావతిని వధువుగా నిర్ణయించారు. ముందుగా పట్టణంలోని అరవ తెగ కులదైవం భక్త మార్కండేయుని ఆలయం వద్ద వేంకటేశ్వరుడి ఉత్సవ విగ్రహం ఎదుట కులపెద్దల సమక్షంలో తాంబూలాలు మార్చుకున్నారు. అనంతరం మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ స్వామి ఆలయం వద్దకు ఊరేగింపుగా వెళ్లారు. అభిజిత్ లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేతుడైన వేంకటేశ్వరుడితో బాలిక మెడలో ఆమె తల్లి పావని చేత పసుపుతాడు కట్టించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి వివాహ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గోవిందా.. గోవింద నామస్మరణతో ఆలయాన్ని మార్మోగించారు. భక్తులకు ఆలయ నిర్వాహకులు ప్రసాదాలు పంచి పెట్టడంతో పాటు అన్నదానం చేశారు. వైఎస్సార్సీపీ ఎస్ఈసీ మెంబర్ గౌని ఉపేంద్ర రెడ్డి, బీఎన్టీ, కేకేటీ కుటుంబాల ఆధ్వర్యంలో 4,500 లడ్డూలను భక్తులకు పంపిణీ చేశారు. ● ప్రసన్న వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో గురువారం (రేపు) ఉదయం 11 గంటలకు మడుగుతేరు, సాయంత్రం 4 గంటలకు బ్రహ్మరథోత్సవం నిర్వహించనున్నారు. బాలికతో శాస్త్రోక్తంగా శ్రీవారి వివాహం వేడుకను తిలకించేందుకు తరలివచ్చిన భక్తజనం -
వివాహిత అదృశ్యం
రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం ఆలమూరు రోడ్డు కట్టకిందపల్లి క్రాస్ సమీపంలో నివాసముంటున్న వివాహిత అరుణకుమారి కనిపించడం లేదు. కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన అరుణకుమారికి మూడేళ్ల క్రితం కట్టకిందపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్రెడ్డితో వివాహమైంది. ఇద్దరూ కట్టకిందపల్లి క్రాస్ కొండారెడ్డి కాంప్లెక్స్లో నివాసముంటూ సమీపంలోని ఓ కళాశాలలో పని చేస్తున్నారు. గత నెల 29న ఇంటి నుంచి బయటకు వెళ్లిన అరుణకుమారి తిరిగి రాలేదు. పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. ఘటనపై శ్రీకాంత్రెడ్డి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు అనంతపురం రూరల్ పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 93469 17102, 94404 10117 కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
హనీట్రాప్ కేసు ముగిసింది
● దర్యాప్తు కొనసాగుతోంది ● ఎస్పీ జగదీష్ అనంతపురం సెంట్రల్: హనీట్రాప్ కేసు క్లోజ్ అయ్యిందని, దర్యాప్తు మాత్రం కొనసాగుతోందని ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. మంగళవారం పోలీసు కాన్ఫరెన్స్ హాలులో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ఆధారాలతో ఫిర్యాదు చేయాలని, తప్పకుండా న్యాయం చేస్తామని అన్నారు. అపోహలు సృష్టించే వారికి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేసులో ఏ–1 నిందితురాలికి చెందిన ఓ ప్లాటును సీజ్ చేసినట్లు తెలిపారు. తప్పు చేసిన అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నట్లు వివరించారు. గంజాయి బ్యాచ్ను గుర్తించేందుకు మెడికల్ కిట్లు.. గంజాయి వినియోగించే వారిని డ్రంకన్ డ్రైవ్ తరహాలో మెడికల్ టెస్ట్ కిట్ల ద్వారా గుర్తించనున్నట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. నూతన సాంకేతికతతో గంజాయి సరఫరా మార్గాలకు సంబంధించిన కీలక సమాచారం సేకరిస్తామన్నారు. ఎక్కడైనా గంజాయి వినియోగిస్తున్నట్లు సమాచారం ఉంటే 1972, 112 టోల్ఫ్రీకి సమాచారం ఇవ్వాలని కోరారు. మామిడి టన్ను రూ.45 వేలు అనంతపురం అగ్రికల్చర్: స్థానిక కక్కలపల్లి మార్కెట్లో మంగళవారం టన్ను మామిడి గరిష్టంగా రూ.45 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ కార్యదర్శి రూప్కుమార్ తెలిపారు. మార్కెట్కు 344 టన్నులు అమ్మకానికి రాగా, వాటిని వేలం వేశామన్నారు. అందులో మల్లికా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.45 వేలు, కనిష్టంగా రూ.25 వేలు, సరాసరిన రూ.33 వేల ప్రకారం ధర పలికిందన్నారు. బేనీషా రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.41 వేలు, కనిష్టంగా రూ.30 వేలు, సరాసరిన రూ.35 వేలు పలికిందని వివరించారు. అలాగే హిమాయత్ రకం మామిడి టన్ను గరిష్టంగా రూ.30 వేలు, కనిష్టంగా రూ.20 వేలు, సరాసరిన రూ.25 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి వెల్లడించారు. ఆర్ఎంపీ క్లినిక్ సీజ్ విడపనకల్లు: అనధికారికంగా నిర్వహిస్తున్న ఆర్ఎంపీ క్లినిక్ను వైద్య ఆరోగ్య శాఖాధికారులు మంగళవారం సీజ్ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం గడేకల్లు గ్రామంలో రెండు ఆర్ఎంపీ క్లినిక్లపై దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా దస్తగిరి అనే ఆర్ఎంపీ నిర్వహిస్తున్న క్లినిక్ను సీజ్ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఆర్ఎంపీ క్లినిక్ నిర్వహించడం చట్ట రీత్యా నేరమన్నారు. పోలీసు కేసులు కూడా నమోదు చేయిస్తామని హెచ్చరించారు. ఆర్ఎంపీలు అనధికారికంగా క్లినిక్లు నిర్వహిస్తే జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. కార్యక్రమంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ కేశవరెడ్డి, కొట్టాలపల్లి పీహెచ్సీ డాక్టర్ సంజీవ్, ఆరోగ్య విస్తరణ అధికారి తిరుపాల్ నాయక్, మాస్ మీడియా అధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. పాలిసెట్లో సత్తా అనంతపురం: పాలిసెట్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. జిల్లాలో 9,070 మంది పరీక్షకు హాజరుకాగా.. 8,120 (89.53%) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర ఉత్తీర్ణతా శాతం 87.67, బాలికలు 92.44% శాతంగా నమోదైంది. జిల్లా స్థాయిలో నున్నా కృష్ణ తనయ ప్రథమ స్థానంలో నిలిచి సత్తా చాటాడు. రెండో స్థానంలో డి ప్రహాస్య, మూడో స్థానంలో ఎస్.ఎం. నయీం సాదియా నిలిచారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రభుత్వ పాలి టెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ జిల్లా సమన్వయకర్త సి. జయచంద్రా రెడ్డి అభినందించారు. -
నారసింహా.. నమోస్తుతే
ఉరవకొండ రూరల్: పెన్నహోబిలం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నృసింహస్వామి సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి వారి మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజల అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీదేవి భూదేవి సమేత నృసింహస్వామి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించిన సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చి ఆలయం చుట్టూ ఊరేగించారు. ఉభయదారులుగా అనంతపురం అంబేడ్కర్నగర్కు చెందిన ఎం. నారాయణ స్వామి కుమారులు వ్యవహరించారు. సాయంత్రం స్వామి వారు ఐరావత వాహనంపై విహరించారు. కార్యక్రమానికి పెద్దముష్టూరు గ్రామానికి చెందిన నెట్టెం జయచంద్ర, నెట్టెం ఎర్రిస్వామి సోదరులు ఉభయదారులుగా వ్యవహరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సాకే రమేష్ బాబు, కమిటీ చైర్మన్ రేగాటి నాగరాజు పాల్గొన్నారు. నేడు నూతన కోర్టుల ప్రారంభం కళ్యాణదుర్గం/అనంతపురం: జిల్లాలోని కళ్యాణదుర్గం, రాయదుర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టులను బుధవారం ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జస్టిస్ లీసా గిల్ వర్చువల్గా కోర్టులను ప్రారంభిస్తారని ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఈ.భీమా రావు తెలిపారు. కళ్యాణదుర్గంలో 1వ అదనపు సివిల్ జడ్జి కోర్టు, 2వ అదనపు సివిల్ జడ్జి కోర్టు, రాయదుర్గంలో అదనపు సివిల్ జడ్జి కోర్టులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. -
తరుముకొస్తున్న కరువు
● సూపర్ ఎల్నీనో ఎఫెక్ట్ కారణంగా ముఖం చాటేయనున్న వర్షాలు రాయదుర్గం: గత ఐదేళ్లు సమృద్ధిగా కురిసిన వానలు ఈ ఏడాది ముఖం చాటేయనున్నాయి. సూపర్ ఎల్నినో ప్రభావం కారణంగా కరువు పరిస్థితులు తప్పవని తెలుస్తోంది. ఫలితంగా జిల్లాలో రైతు పరిస్థితి మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అనే చందంగా మారింది. ఇప్పటి వరకూ వేసవి దుక్కులు సైతం ఊపందుకోలేని పరిస్థితి. వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న జిల్లాలో వరుణుడు ముఖం చాటేస్తే కరువు కరాళనృత్యం తప్పదని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఖరీప్లో జిల్లాలో 16,54,080 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయి. ఇందులో వేరుశగన, కంది, ఆముదం, పత్తి మెజార్టీ పంటలు. జూన్ నుంచి సెఫ్టెంబర్ వరకు ఎల్నినో ముప్పు పొంచి ఉండవచ్చునని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న క్రమంలో ఖరీఫ్ సాగుపై ప్రభావం పడనుంది. రుతుపవనాలు ముందే వచ్చినా? నైరుతి రుతుపవనాలు జాన్ మొదటి వారంలోనే జిల్లాలో ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. తొలకరి వర్షాలు కురిసినా ఎల్నినో దెబ్బకు ఆ తర్వాత పెద్ద విరామం ఉండే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నదాతలు ఆలోచించి అడుగేయాల్సి వస్తోంది. జిల్లాలో సాధారణంగా ఖరీప్లో వేరుశనగ, కంది, పత్తి, ఆముదం, జొన్న, సజ్జ, ఉలువ లాంటి పంటలు సాగుచేస్తారు. ఎల్నినో ప్రభావం కారణంగా ఈ సారి తక్కువ నీటితో ఎక్కువ ఉత్పత్తి సాధించే పంటల వైపు రైతులు దృష్టి సారిస్తే ప్రయోజనంగా ఉంటుంది. అలాగే తీవ్ర వర్షాభావం కారణంగా భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయే ప్రమాదం ఉండడంతో బోరుబావుల కింద వరి కాకుండా ఇతర ఆరుతడుల పంటలు సాగు చేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఆలోచించి అడుగేయాలి ఎల్నినో ప్రభావం ఉంటుందని ఇప్పటికే వాతావరణశాఖ అప్రమత్తం చేసింది. దీనిపై ఇటీవల ఓ సమావేశం కూడా జరిగింది. సరైన స్పష్టత వెలువడాల్సి ఉంది. అలాంటిదేదైనా ఉంటే రైతులు ఆలోచించి అడుగేయాలి. తక్కువ వర్షాపాతానికి తట్టుకునే పంటల సాగుపై దృష్టిసారించడం మంచిది. – మల్లికార్జున, సేద్యం విభాగపు శాస్త్రవేత్త, కళ్యాణదుర్గం -
కిశోరి వికాసంతో ఉజ్వల భవిత
● కలెక్టర్ ఓ.ఆనంద్ ● గుత్తిలో శిక్షణ కార్యక్రమం పరిశీలన గుత్తి రూరల్: కిశోరి వికాసం కార్యక్రమం మహిళలు, బాలికల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. మండలంలోని కొత్తపేట గ్రామంలో ఉన్న హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న కిశోరి వికాసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని మంగళవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘కిశోరి వికాసం’ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. శిక్షణలో తెలుసుకున్న విషయాలను ఇతర బాలికలకు, తల్లిదండ్రులకు తెలియజేసి చైతన్యవంతుల్ని చేయాలన్నారు. అనంతరం పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సీడీపీఓ ఎల్లమ్మ, డీసీపీఓ మంజునాథ్, తహసీల్దార్ పుణ్యవతి, ఎంపీడీఓ ప్రభాకర్నాయక్, కమిషనర్ జబ్బార్మియా, వైద్యాధికారిణి ఆసియా అంజుమ్, హాండ్స్ సీఈఓ నారాయణస్వామి, సూపర్ వైజర్లు రాజేశ్వరి, గౌరి, దస్తగిరమ్మ తదితరులు పాల్గొన్నారు. గుత్తిలో కలెక్టర్ సుడిగాలి పర్యటన గుత్తి: గుత్తిలో మంగళవారం కలెక్టర్ ఆనంద్ సుడిగాలి పర్యటన చేశారు. మొదట కోట ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు నిర్వహిస్తున్న పునశ్చరణ తరగతులను పరిశీలించారు. విద్యార్థులకు పలు సూచనలిచ్చారు. విద్యార్థులందరూ పరీక్షల్లో పాసయ్యేలా చూడాలని, మళ్లీ ఫెయిల్ అయితే బాధ్యత వహించాల్సి వస్తుందని టీచర్లను హెచ్చరించారు. అనంతరం స్థానికంగా ఓ ఇంటి వద్ద ఎన్యూమరేటర్లు చేస్తున్న జనగణనను పరిశీలించారు. బస్టాండ్ ఎదురుగా స్ట్రీట్ వెండర్స్తో మాట్లాడారు. లోన్లు బాగా వస్తున్నాయా అంటూ ఆరా తీశారు.అర్ధంతరంగా ఆగిపోయిన మెప్మా భవనాన్ని పూర్తి చేయించాలని ఆర్పీలు కోరగా.. సానుకూలంగా స్పందించారు. రూ. 15 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులనూ కలెక్టర్ పరిశీలించారు. -
హనీట్రాప్ వ్యవహారం ‘అనంత’ టీడీపీలో చిచ్చు రేపింది. బీజేపీ నేతలపై ఆ పార్టీ చర్యలు తీసుకున్న నేపథ్యంలో టీడీపీ నేతల ప్రమేయంపై రాష్ట్ర పార్టీ ఆరా తీసింది. టీడీపీ నేతల ప్రమేయంపై రాష్ట్ర పార్టీకి జిల్లా నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని, రాష్ట్ర పార్టీ దృష్టికి వా
సాక్షిప్రతినిధి, అనంతపురం : హనీట్రాప్ వ్యవహారంలో ఉరవకొండ, అనంతపురం, రాప్తాడు నియోజకవర్గ టీడీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు తీవ్ర చర్చ నడుస్తోంది. బాధితుల నుంచి నిందితులు ప్రామిసరీ నోటు బాండ్లు సేకరించిన తర్వాత పోలీసులతో చెప్పి నిందితులకు అనుకూలంగా పంచాయితీలు చేసిన వారిలో టీడీపీకి చెందిన కీలక నేతలు ఉన్నారు. ఈ వ్యవహారంపై పలు పత్రికలు, టీవీల్లో కథనాలు వచ్చాయి. ఈ క్రమంలో ‘హనీట్రాప్ వ్యవహారంలో టీడీపీ నేతల ప్రమేయం’ వివరాలు రాష్ట్రపార్టీకి చెప్పాలి కదా..’ అని సునీల్ ఆరా తీస్తే హనీట్రాప్ వ్యవహారంలో తనకు తెలిసిన అంశాలను సునీల్కు నాగరాజు వివరించారు. అలాగే తన అసంతృప్తిని కూడా వెళ్లగక్కారని తెలుస్తోంది. కాలవతో పూల నాగరాజుకు ఇక్కట్లు.. రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులకు అదే నియోజకవర్గానికి చెందిన పూల నాగరాజుకు మధ్య వైరం నడుస్తోంది. పూల నాగరాజు దుర్గానికి స్థానికుడు కావడంతో వాల్మీకి కోటాలో గత సార్వత్రిక ఎన్నికల్లో ‘దుర్గం’ ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ప్రయత్నించారు. చివరకు కాలవ టిక్కెట్ దక్కించు కుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ, ఎప్పటికై నా నాగరాజుతో ప్రమాదమని భావించి, పథకం ప్రకారం నాగరాజును అణగదొక్కే చర్యలను కాలవ ముమ్మరం చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కాలవ పూజలు నిర్వహించారు. ఒక్కో మండలానికి ఒక్కో మంత్రిని పిలిపించారు. గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్, టీజీ భరత్, సత్యకుమార్ విచ్చేశారు. వీరితో పాటు టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్చౌదరిని కూడా ఆహ్వానించారు. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడైన పూల నాగరాజును మాత్రం ఆహ్వానించలేదు. ‘దుర్గం’లో నిర్వహించిన కార్యక్రమానికి సాటి సామాజికవర్గం నేత, పైగా జిల్లా అధ్యక్షుడిని విస్మరించడం చూస్తే కావాలనే దూరం పెడుతున్నారనేది స్పష్టమవుతోంది.దీన్ని నాగరాజు కూడా తీవ్ర అవమానంగా భావించినట్లు తెలుస్తోంది. అలాగే వైఎస్సార్సీపీ చేపట్టిన బీసీ గళం సదస్సు దిగ్విజయమైంది. ఈ క్రమంలో కాలవ, ఎంపీ బీకే ప్రెస్మీట్ నిర్వహించారు. బీసీ అంశం మాట్లాడే క్రమంలో బీసీ నేతగా ఉన్న జిల్లా అధ్యక్షుడిని కాలవ ఆహ్వానించలేదు. అలాగే చాలా సందర్భాల్లో పార్టీ వ్యవహారాలపై ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో కాలవ ప్రెస్మీట్ నిర్వహిస్తే, మళ్లీ అధ్యక్షుడిగా పార్టీ ఆఫీసులో నాగరాజు రెండోసారి అదే అంశంపై ప్రెస్మీట్ నిర్వహిస్తున్నారు. ఇది వీరిమధ్య విభేదాలను స్పష్టం చేస్తోంది. చివరకు ఇద్దరూ రైలు ప్రయాణం చేసే సమయంలో కాలవ ఎదురుగా సీట్లో నాగరాజు కూర్చుంటే ‘ఇక్కడ వద్దు పక్కకు వెళ్లి కూర్చోపో’ అని చెప్పారంటే నాగరాజుపై ఏస్థాయిలో కాలవ విద్వేషం పెంచుకున్నారో స్పష్టం అవుతోంది. దీన్నిబట్టి జిల్లా అధ్యక్షుడిని కాలవ ఎలా అవమానిస్తున్నారో అర్థమవుతోంది. నాగరాజు, అంబికా, గుమ్మనూరుతో పాటు చాలామంది వాల్మీకి నేతలు కాలవ ధోరణిపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. తాను మినహా వాల్మీకుల్లో ఏ ఒక్కరూ రాజకీయంగా ఎదగకూడదనే ధోరణిలో కాలవ ఉన్నట్లు తెలుస్తోంది. పైగా ఒకే జిల్లాలో తనతో పాటు అంబికా, గుమ్మనూరు రూపంలో బలమైన పోటీ కూడా నెలకొంది. దీంతో తన రాజకీయ ప్రయాణానికి అడ్డు తొలగించుకునే క్రమంలోనే కాలవ వ్యూహాత్మకంగా ఇలా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అలాగే ‘దుర్గం’లో అక్రమ మైనింగ్, ఇసుక, కల్తీకల్లు తదితర అంశాల్లో కాలవ శ్రీనివాసులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్న వివరాలను కూడా కొందరు నేతలు సునీల్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురు ఏకమయ్యారా..? వాల్మీకి కార్డుతోనే కాలవ రాజకీయాల్లో చెలామణీ అవుతున్నారు. తమపై కాలవ అనుసరిస్తోన్న వైఖరితో గుమ్మనూరు జయరాం, అంబికా, నాగరాజు ఏకమైనట్లు తెలుస్తోంది. పైగా గుమ్మనూరు జయరాం కుమార్తెను పూల నాగరాజు కుమారుడికి ఇచ్చి వియ్యం కలుపుకుంటున్నారు. ఇలా బంధువులుగా మారి తర్వాత రాజకీయంగానూ ఏకం కానున్నారు. మరో వాల్మీకి నేత అంబికా వీరితోనే చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ముగ్గురు వాల్మీకి నేతలు ఏకమైతే పార్టీ అధిష్టానం వద్ద బలంగా తమ వాణీ విన్పించొచ్చని, తద్వారా కాలవకు చెక్ పెట్టొచ్చనేది వీరి భావనగా ఉన్నట్లు సమాచారం. టీడపీ కీలకంగా ఉన్న లోకేశ్తోనూ సన్నిహితంగా ఉంటూ కాలవ ఎత్తులకు పై ఎత్తులు వేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఏది ఏమైనా హనీట్రాప్ చిచ్చు టీడీపీలోని వర్గ విభేదాలను రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లేలా చేసిన విషయం ప్రస్తుతం ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంగా మారింది. వాల్మీకీ నేతల మధ్య తారస్థాయిలో విభేదాలు జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజును అవమానించేలా కాలవ ప్రవర్తన అంబికా, గుమ్మనూరు, నాగరాజులను నిరోధించేలా చర్యలు కాలవకు చెక్ పెట్టేందుకు ఏకమైన ముగ్గురు వాల్మీకీ నేతలు టీడీపీ పార్లమెంట్ ఇన్చార్జ్ సునీల్కు ఫిర్యాదు -
ఆ పాలతో అనర్థాలు
ఆక్సిటోసిన్ అనే మందును వైద్య రంగంలో ప్రసవ సమయంలో గర్భాశయ కుదుపులను సులభతరం చేయడానికి కానీ, కొన్ని ప్రత్యేక హార్మోన్ అసమతుల్యత సమస్యల పరిష్కారానికి మాత్రమే ఉపయోగిస్తారు. వైద్యుల సిఫారసు లేనిదే ఈ ఇంజక్షన్ను విక్రయించరాదు. అయితే పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో దీనిని వాడటం సరికాదు, అలాగే నేరం కూడా. ఆక్సిటోసిన్ వాడిన పశువుల పాలు తాగిన చిన్నారుల్లో పలు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పశువులకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్ను ఇవ్వడం మానుకోవాలి. – డాక్టర్ హేమలత, ఆర్ఎంఓ, జీజీహెచ్, అనంతపురం -
●ఇల్లే.. వ్యవసాయ క్షేత్రం
తాడిపత్రి టౌన్: ప్రకృతి ప్రేమికులు ఎక్కడున్నా పచ్చదనాన్ని కోరుకుంటారు. గ్రీనరీ అంటే ఎవరికై నా ఇష్టం.. చెట్లు, పూల మొక్కలు పెంచుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ కాంక్రీట్ జంగిల్లో ఇంటికే స్థలం సరిపోవట్లేదు... ఇక మొక్కలు పెట్టేందుకు స్థలమెక్కడిది? అయితే ఓ ఫర్టిలైజర్ షాపు యజమాని తన ఇంటినే వ్యవసాయ క్షేత్రంగా మార్చేశారు. వివిధ రకాల ఉద్యాన పంటలతో పాటు పూలు, కూరగాయలు పండిస్తూ అందరినీ అబ్బుర పరుస్తున్నారు. ఈ నందన వనాన్ని చూడాలనుకుంటే తాడిపత్రిని సందర్శించాల్సిందే. పట్టణంలోని సంజీవనగర్కు చెందిన రాజేష్, శ్రీలత దంపతులు తమ ఇంటి ఆవరణతో పాటు మిద్దైపె కూడా డ్రమ్ములు, బ్యాగ్లలో మట్టి నింపి 25 రకాల మందార మొక్కలు, నాలుగు రకాల మల్లె మొక్కలతో పాటు వివిధ రకాల పూలు, ఆకుకూరలు, మామిడి, జామ, నిమ్మ చెట్లను పెంచుతున్నారు. తన తండ్రి వెంకటరమణారావు మొక్కలపై మమకారంతో ఇంట్లో పచ్చని చెట్లను పెంచారని, ఆయన మరణాంతరం తండ్రి జ్ఞాపకాలను మొక్కల్లో చూసుకుంటూ మొక్కలను సంరక్షించుకుంటున్నట్లు రాజేష్ తెలిపారు. -
ఆక్సిటోసిన్తో రోగాలపాలు
అనంతపురం: యూరియా, డిటర్జెంట్, రసాయనాలతో తయారు చేస్తున్న పాల గురించి విన్నాం. కొన్నిసార్లు చూశాం కూడా. తాజాగా మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గేదెలు, ఆవులు ఎక్కువగా పాలు ఇచ్చేందుకు వాటికి డ్రగ్స్ ఇస్తున్నారు. తమ స్వలాభం కోసం నిషేధాన్ని ఉల్లంఘిస్తూ వీటిని ఉమ్మడి జిల్లాలోని మెడికల్ స్టోర్ల నిర్వాహకులు ప్రోత్సహిస్తున్నట్లుగా తెలుస్తోంది. పాడి రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న కొందరు మెడికల్ స్టోర్ల నిర్వాహకులు అక్రమ దందాకు తెరలేపారు. పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని నమ్మిస్తూ నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజక్షన్లను కట్టబెడుతున్నారు. వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా ఆక్సిటోసిన్ అమ్మడం, కొనడం రెండూ చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. అయితే ఔషధ నియంత్రణ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ వీటి విక్రయాలను నియంత్రించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా పాడి సంపద ఎక్కువగా ఉన్న ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాల్లోని మెడికల్ స్టోర్లలో ఆక్సిటోసిన్ విక్రయాలు సాగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొన్ని ప్రాంతాల్లో గోపాల మిత్రల ద్వారా ఈ విక్రయాలను మెడికల్ స్టోర్ల నిర్వాహకులు ప్రోత్సహిస్తున్నట్లుగా తెలుస్తోంది. అనర్థాలు మెండు.. 1960 ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాల్టీ టు యానిమల్స్ యాక్ట్ లోని సెక్షన్ 12 ప్రకారం ఆక్సిటోసిన్ ఇంజక్షన్ను వైద్యుల ప్రిస్కిప్షన్ లేకుండా అమ్మడం, కొనడం రెండూ చట్టరీత్యా నేరమే అయినా, మెడికల్ స్టోర్ల నిర్వాహకులు మాత్రం వాటిని పాడి రైతులను ప్రలోభాలకు గురి చేస్తూ అంటగడుతున్నట్లుగా సమాచారం. వీటి వినియోగం వల్ల ఆవులు, గేదెలు చాలా తక్కువ కాలంలోనే వట్టిపోతాయి. వాటి పాలను తాగితే మనుషుల్లోనూ చాలా రకాల దుష్ట్రభావాలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాలురల్లో హార్మోన్ల అసమతుల్యత, బాలికల్లో రజస్వల అయ్యే వయసు తగ్గిపోవడం, చిన్న పిల్లల్లో కంటి చూపు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయంటున్నారు. చిన్నారులకు పచ్చకామెర్లు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, హృదయ స్పందనలో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. వాంతులు రావడం, కళ్లు తిరగడం, ముక్కులో అసౌకర్యం, నొప్పితో పాటు మెదడులోని కణాలు క్షీణించి మతిమరుపు సమస్యలు ఉత్పన్నమవుతాయని అంటున్నారు. గర్భం ధరించిన వారు ఈ పాలు తాగితే గర్భస్రావం అవుతుందని, ఒకవేళ బిడ్డ పుట్టినా రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుందని, బిడ్డ పుట్టిన తర్వాత బాలింతల్లో హెమరేజ్ రిస్క్ కూడా అధికంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిషేధాన్ని ధిక్కరించి మెడికల్ స్టోర్లలో స్టెరాయిడ్స్ విక్రయం అధిక పాల ఉత్పత్తి కోసం పాడిపశువులకు వేస్తున్న వైనం పాలు తాగిన వారిపై తీవ్ర దుష్ప్రరిణాలు -
పీడీఓ, డిజిటల్ అసిస్టెంట్ల ఎస్ఆర్ల పరిశీలన
అనంతపురం ఎడ్యుకేషన్: పంచాయతీ సెక్రటరీలను స్పెషల్ గ్రేడ్, గ్రేడ్–1, గ్రేడ్–2, గ్రేడ్–3గా పునర్విభజన చేసే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయతీ అభివృద్ధి అధికారులు (పీడీఓ), డిజిటల్ అసిస్టెంట్ల ఎస్ఆర్ల పరిశీలన ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో డీపీఆర్సీ భవనంలో డీపీఓ నాగరాజనాయుడు ఆధ్వర్యంలో ప్రక్రియ ప్రారంభించారు. పంచాయతీల పునర్విభజన నేపథ్యంలో ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్ల పరిశీలన చేస్తున్నారు. ఎంపీడీఓలు, వారి ఆఫీసు సిబ్బంది, ఉమ్మడి జిల్లా ట్రెజరీ అధికారులు, ఆడిట్ అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారులు, సిబ్బంది పాల్గొని పరిశీలన చేస్తున్నారు. అర్ధరాత్రి దొంగల బీభత్సం ● ఇంటి తాళం బద్ధలుగొట్టి 15 తులాల బంగారు నగల అపహరణ కళ్యాణదుర్గం రూరల్: స్థానిక మున్సిపాలిటీ పరిఽధిలోని ఒంటిమిద్ది గ్రామంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. పోలీసులు తెలిపిన మేరకు.. ఒంటిమిద్దిలో నివాసముంటున్న దంపతులు రామాంజనేయులు, గీతమ్మ వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు. ఇటీవల రామాంజనేయులు అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే రోజూ ఇంటికి తాళం వేసి సమీపంలోని బంధువుల ఇంటి ఆవరణలో నిద్రించేవారు. సోమవారం బంధువుల ఇంటి వద్దకు దంపతులు వెళ్లిన సమయంలో ఇంటి తాళాన్ని దుండగులు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. బీరువాలోని 15తులాల బంగారు నగలు, రూ.6వేల నగదు అపహరించారు. మంగళవారం ఉదయం ఇంటికి చేరుకున్న రామాంజనేయులు దంపతులు చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలో దించి నిందితుల వేలి ముద్రలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ హరినాథ్ తెలిపారు. స్టాక్ పాయింట్లో ఆరు గదులు ఉండాలి ● విద్యార్థి మిత్ర కిట్ల రాష్ట్ర పరిశీలకులు అనురాధ అనంతపురం ఎడ్యుకేషన్: సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లను భద్రపరిచేందుకు స్టాక్పాయింట్లలో ఆరు గదులు ఉండేలా చూడాలని రాష్ట్ర పరిశీలకులు అనురాధ సూచించారు. మంగళవారం ఆమె కళ్యాణదుర్గం, బెళుగుప్ప, ఆత్మకూరు, అనంతపురం మండలాల్లో ‘విద్యార్థి మిత్ర’ స్టాక్ పాయింట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రాష్ట్ర అధికారులు ఇచ్చిన మ్యాపు ప్రకారమే వచ్చిన కిట్లను భద్రపరచాలన్నారు. స్టాక్ పాయింట్లలో తగినంత వెలుతురు ఉండేలా చూడాలన్నారు. గదుల్లోకి వర్షపు నీరు రాకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. కిట్లు తెచ్చే వాహనాలకు ఆటంకం కలగకుండా తగినంత స్థలం ఉండాలన్నారు. స్టాక్పాయింట్లకు కిట్లు చేరిన తర్వాత స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఆమె వెంట సీఎంఓ చంద్రశేఖర్, ఆయా మండలాల ఎంఈఓలు, సీఆర్ఎంటీలు ఉన్నారు. పెద్దొడ్డిలో ఇరువర్గాల ఘర్షణ గుత్తి రూరల్: మండలంలోని పెద్దొడ్డి గ్రామంలో మంగళవారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన రాజు, అశోక్కు సమీప బంధువైన నరేష్తో కొన్ని నెలలుగా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో నరేష్ తన ఇంట్లో నుంచి రోకలిబండ తీసుకెళ్లి రాజు, అశోక్పై దాడి చేశాడు. అడ్డుకోబోయిన మేనత్తలు పార్వతి, లక్ష్మీదేవిపై కూడా దాడి చేశాడు. ఘటనలో తీవ్ర గాయాలైన రాజును వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చైన్ స్నాచర్కు దేహశుద్ధి శింగనమల(నార్పల): మండల కేంద్రం నార్పలలో ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కొని ఉడాయిస్తున్న వ్యక్తిని ప్రజలు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మంగళవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. నార్పలలోని సుల్తాన్పేటలో నడుచుకుంటూ వెళుతున్న మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కొనేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె గట్టిగా కేకలు వేసింది. ఆ సమయంలో స్థానికులు అప్రమత్తమై దుండగుడిని వెంబడించి పట్టుకున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కేబుల్ చోరీ బొమ్మనహాళ్: మండలంలోని ఉద్దేహాళ్ గ్రామ శివారులో తాగునీటి మోటార్ కేబుల్ సోమవారం రాత్రి చోరీ అయినట్లు పంచాయతీ కార్యదర్శి శివన్న తెలిపారు. తాగునీటి పథకం మోటారు నుంచి మొయిన్ బోర్డు వరకు ఉండే 30 మీటర్ల కేబుల్ ఎత్తుకెళ్లారు. కేబుల్ ఎత్తుకెళ్లడంతో తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగిందని, కొత్త కేబుల్ ఏర్పాటు చేసిన్నట్లు పంచాయతీ కార్యదర్శి తెలిపారు. -
రాష్ట్రాన్ని కుదిపేసిన ‘అనంత’ హనీట్రాప్ ఉదంతంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్న వారిని పోలీసులు రిమాండ్కు పంపారు. తమ శాఖలోని అధికారులపై వేటు వేశారు. అలాగే బీజేపీ కూడా రిమాండ్కు వెళ్లిన ముగ్గురు మహిళా మోర్చా నేతలను పార్టీ నుంచి బహిష్కరించింది. వీరి
సాక్షిప్రతినిధి అనంతపురం: ‘హనీట్రాప్’ బీజం బీజేపీలో పడి టీడీపీలో విషవృక్షంగా ఎదిగి ‘అనంత’ వాసులను వేధించింది. ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉన్న వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరికొంత మందిపై చర్యలు తీసుకునే దిశగా కేసును విచారిస్తున్నారు. రిమాండ్కు వెళ్లిన ముగ్గురు బీజేపీ మహిళా మోర్చా నేతలు చంద్రకళ, మల్లీశ్వరి, అనంతకుమారిలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో ఆ పార్టీకి సంబంధించి మరో ఇద్దరు నేతల ప్రమేయంపైనా చర్చ నడిచింది. ఇద్దరిలో ఒకరి బ్యాంకు ఖాతాలోకి రంగమ్మ ఖాతా నుంచి రూ.15 లక్షల నగదు బదిలీ జరిగింది. అలాగే రంగమ్మను ప్రోత్సహించిన మరో మాజీ జిల్లా అధ్యక్షుడి ప్రమేయం కూడా హనీట్రాప్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన మంత్రి సత్యకుమార్ కీలక అనుచరుడు కావడంతో పోలీసుస్టేషన్లలో ఆర్థిక వ్యవహారాలలో పంచాయితీలు కూడా చేశారు. రంగమ్మ బీజేపీలో ఉన్నప్పుడు ఆమెను, ప్రస్తుతం చంద్రకళను ప్రోత్సహించారు. చంద్రకళ మహిళా మోర్చా రాయలసీమ జోనల్ అధ్యక్షురాలిగా పని చేస్తూ హనీట్రాప్ కేసులో రిమాండ్కు వెళ్లారు. చంద్రకళకు జమ్మలమడుగులో ఇసుక క్వారీ ఇప్పించి ఆర్థికంగా స్థితిమంతురాలిని చేసే చర్యలు చేపట్టారు. ఇదంతా మంత్రి సత్యకుమార్ సహకారంతోనే జరిగిందనేది బీజేపీ నేతలే చెబుతున్న మాట! దీన్నిబట్టే చంద్రకళ వ్యవహారాలలో మంత్రి అనుచరుడికి ఏ మేరకు ప్రమేయం ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చునని వారు అంటున్నారు. ఆయనపై హనీట్రాప్ ఆరోపణలు రావడంతో ప్రెస్మీట్ ఏర్పాటు చేసి తన ప్రమేయం లేదని చెప్పేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆరోపణలు పూర్తిగా వ్యక్తిగతమైనవని, దాన్ని పార్టీకి ఆపాదించడమేంటని, ప్రెస్మీట్ వద్దని రాష్ట్ర నేతలు అడ్డుచెప్పారు. దీంతో ప్రెస్మీట్ చివరి నిమిషంలో ఆపారు. బీజేపీ చీఫ్కు జిల్లా నేతల ఫిర్యాదు హనీట్రాప్ ఉదంతం, పార్టీ నేతల ప్రమేయాన్ని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్కు జిల్లా నేతలు వివరించారు. ఈ వ్యవహారంతో ‘అనంత’ బీజేపీ పరువు బజారున పడిందని ఇద్దరు కీలక నేతలు గట్టిగా ఫిర్యాదు చేశారు. ‘నగదు బదిలీ’ అయిన నేతపై వెంటనే చర్యలు తీసుకుందామని మాధవ్ చెప్పినట్లు సమాచారం. అలాగే మరో నేతపై చర్యలకు మంత్రి సత్యకుమార్ అడ్డుపడే అవకాశం ఉన్నందున అదను చూసి వేటు వేద్దామని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఓ నేతపై ఏ క్షణమైనా వేటు పడొచ్చు! మరో నేతపై ఆలస్యంగా చర్యలు తీసుకోవచ్చని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్తో దబ్బర రాజేష్ (ఫైల్)రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతతో రంగమ్మ (ఫైల్) హనీట్రాప్లో ప్రమేయం ఉన్నవారిపై వేటుకు బీజేపీ నిర్ణయం రంగమ్మ ఖాతా నుంచి నగదు బదిలీ అయిన నేతను బహిష్కరించే యోచన రంగమ్మను ప్రోత్సహించిన మాజీ జిల్లా అధ్యక్షుడి అంశంలో ఆచితూచి నిర్ణయం మంత్రి సత్యకుమార్ అడ్డుపడతారనే కారణంతో ఆయనపై ఆలస్యంగా చర్యలు ! జిల్లా నేతలకు సూచించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఇప్పటికే ముగ్గురు మహిళా మోర్చా నేతలు పార్టీ నుంచి సస్పెండ్ బీజేపీ తరహాలో టీడీపీ చర్యలు చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు హనీట్రాప్ ఉదంతంలో బీజేపీ నేతలతో పాటు టీడీపీ నేతలూ ఉన్నారు. ఉరవకొండ నియోజకవర్గ నేతలు ఇద్దరు ఉన్నట్లు తేలింది. వీరిలో ఒకరు జిల్లా కమిటీలో అత్యంత ‘ప్రధానంగా’ ఉన్నారు. మరొకరు స్థానిక నేత! జిల్లా కమిటీలోని ‘ప్రధాన’ వ్యక్తిని ఇప్పటికే పోలీసులు పిలిపించి విచారించారని తెలుస్తోంది. ఈ ఇద్దరి పాత్రను తేల్చి, వీరిని కూడా టీడీపీ నుంచి తప్పించాల్సిన బాధ్యతను జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు తీసుకోవాలన్న చర్చ జనంలో నడుస్తోంది. అలాగే లేడీడాన్ రంగమ్మ మెడలో టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే పరిటాల సునీత కూడా ఆమెను సస్పెండ్ చేయించే బాధ్యత తీసుకోలేదు. దీంతో విమర్శలు వస్తున్నాయి. అనంతపురానికి చెందిన రాజేశ్ ఇప్పటికీ టీడీపీలోనే కొనసాగుతున్నాడు. ఒకవైపు బీజేపీ అధిష్టానం విడతల వారీగా చర్యలు తీసుకుంటుంటే... టీడీపీ మాత్రం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందనేది తేలాల్సి ఉంది. ఒకవేళ వీరిపై చర్యలు తీసుకుంటే వారు బయటకు వచ్చి దీని వెనుక ఉన్న ‘పెద్ద తలకాయల’ పేర్లు చెబుతారనే భయం ఆవహించిందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. -
కేజీబీవీల్లో రహస్య బదిలీలు
అనంతపురం ఎడ్యుకేషన్: అధికారిక ఉత్తర్వులు లేకుండా కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, సీఆర్టీలను రహస్యంగా బదిలీలు చేసేందుకు సమగ్ర శిక్ష అధికారులు పూనుకున్నారు. ఈ క్రమంలో అనంతపురంలోని సైన్స్ సెంటర్లో సోమవారం బదిలీల కౌన్సెలింగ్ ఏర్పాటు చేశారు. దీన్ని పలువురు స్పెషలాఫీసర్లు, సీఆర్టీలు అడ్డుకున్నారు. ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వు లు, మార్గదర్శకాలు లేకుండా నోటిమాటతో ఎలా బదిలీలు చేపడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సెలింగ్ జరగనీయకుండా అధికారులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమగ్రశిక్ష ఏపీసీ శైలజ, డీఈఓ ప్రసాద్బాబు ఎంత నచ్చజెప్పేప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. వీరికి ఎస్టీయూ నాయకులు హరిప్రసాద్రెడ్డి, రామాంజులయాదవ్, సమగ్ర శిక్ష ఉద్యోగులు, కేజీబీవీ ఉద్యోగుల ఫోరం రాష్ట్ర ప్రధానకార్యదర్శి విజయ్, ఏఐటీయూసీ చిరంజీవి, రాజు, ఏఐఎస్ఎఫ్ కుళ్లాయిస్వామి, అంజి, ఏఐవైఎఫ్ తేజు, రియాజ్బాషా తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాంగ్ స్టాండింగ్ పేరుతో ఐదేళ్లు పూర్తయిన ప్రిన్సిపాళ్లు, 8 ఏళ్లు పూర్తయిన సీఆర్టీలను బలవంతంగా బదిలీలు చేస్తున్నారన్నారు. ఓవైపు చాలీచాలని జీతాలతో ఉద్యోగ భద్రత లేక కొట్టుమిట్టాడుతున్న కేజీబీవీ ఉద్యోగులను బెదిరింపు ధోరణిలో బదిలీలు చేయడం సమంజసం కాదన్నారు. వారికి మినిమం టైం స్కేలు వర్తింపజేసి ఉద్యోగభద్రత కల్పించిన తర్వాతనే ప్రభుత్వ ఉత్తర్వులు, మార్గదర్శకాలను అనుసరించి బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్నం వరకు కౌన్సెలింగ్ జరగకుండా అడ్డుకున్నారు. కలెక్టరేట్లో కౌన్సెలింగ్ పూర్తి కౌన్సెలింగ్ ప్రక్రియను మధ్యాహ్నం తర్వాత సైన్స్ సెంటర్ నుంచి కలెక్టరేట్లోని ఎన్ఐసీ కార్యాలయానికి మార్చారు. డీఆర్ఓ సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ముందుగా పీజీటీలు, తర్వాత ప్రిన్సిపాళ్లు, సీఆర్టీలకు కౌన్సెలింగ్ పూర్తి చేశారు. కాగా పలువురు విల్లింగ్ ఇవ్వలేదు. వారి స్థానాలకు విల్లింగ్ ఇచ్చిన వారిని బదిలీ చేశారు. విల్లింగ్ ఇవ్వని వారి స్థానాలకు బదిలీ అయిన వారు జాయిన్ అవుతారా లేదా? అనేది చూడాలి. మరోవైపు పలువురు ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. స్టే రాకముందే కౌన్సెలింగ్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆగమేఘాల మీద పూర్తి చేశారు. -
రూ.కోట్లు.. హాంఫట్!
● కళ్యాణదుర్గం మునిపాలిటీలో అవినీతి అక్రమాలు ● సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వైనం కళ్యాణదుర్గం: అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలిచ్చారు. తద్వారా బాగా డబ్బు వెనకేసుకున్నారు. పనులు పర్యవేక్షించి.. నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాల్సిన అధికారులు మిన్నకుండిపోయారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన పనుల్లో కోట్లాది రూపాయల అవినీతి జరిగినట్లు, దీనిపై జిల్లాస్థాయి ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు సోమవారం సోషల్ మీడియాలో పోస్టులు చక్కర్లు కొట్టాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తమకు అనుకూలంగా ఉన్న కమిషనర్ను అధికార టీడీపీ నాయకులు కళ్యాణదుర్గానికి వేయించుకున్నారు. ఆ తర్వాత గతంలో పెండింగ్ పడిన పనులకు ఆగమేఘాలపై అనుమతులు తెప్పించుకున్నారు. వెనువెంటనే కాంట్రాక్ట్ పనులను టీడీపీ నాయకులు దక్కించుకున్నారు. సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, డివైడర్లు, కంపోస్టుయార్డు శుద్ధీకరణ పనులను హడావుడిగా ప్రారంభించారు. అయితే ఈ పనుల్లో ఎక్కడా నాణ్యత ప్రమాణాలు కనిపించలేదు. అంతేకాదు ఆయా పనులు పూర్తికాకపోయినా రూ.30 కోట్ల దాకా బిల్లులు మంజూరు చేసినట్లు కమిషనర్పై ఆరోపణలు ఉన్నాయి. కమిషనర్ పాత్రపై విచారణ! అవినీతి అక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ పాత్ర ఉందంటూ గతంలో దళిత జనజాగృతి వ్యవస్థాపకుడు ఆర్కే రాజు ఏకంగా మున్సిపల్ కమిషనరేట్కు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై మరికొన్ని ఫిర్యాదులు కూడా అందినట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా ఉన్నతాధికారులు గుట్టుగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఆరోపణలు అవాస్తవం మున్సిపాలిటీ పరిధిలో రూ.కోట్ల అవినీతి జరిగిందని సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలు అవాస్తవం. అయినా సోషల్ మీడియాలో వచ్చే వాటికి నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. అవినీతి జరిగి ఉంటే విచారణలో బయట పడుతుంది. నాపై ఆరోపణలు చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా. – వంశీకృష్ణ భార్గవ్, మున్సిపల్ కమిషనర్, కళ్యాణదుర్గం -
టాపర్లకు కలెక్టర్ అభినందనలు
అనంతపురం అర్బన్: పదో తరగతి పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన ప్రభుత్వ పాఠశాల, వసతి గృహాల విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. విద్యార్థులకు సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. టాపర్లుగా నిలిచిన విద్యార్థులను ఇతర విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. చదువుతో పాటు సమాజం, కుటుంబం పట్ల బాధ్యతగా ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం టాపర్లను కలెక్టర్ సన్మానించి ప్రశంసాపత్రం, మెమొంటో అందజేశారు. ఎస్సీ విభాగంలో జిల్లాస్థాయిలో టాపర్గా నిలిచిన తాడిపత్రి ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని లాస్యకు కలెక్టర్ చేతుల మీదుగా ఉపాధ్యాయుడు బి.నాగేంద్ర రూ.5 వేల ఆర్థిక సహాయన్ని అందజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్కుమార్, డీఈఓ ప్రసాద్బాబు, బీసీ సంక్షేమ శాఖ డీడీ ఖుష్బూ కొఠారి, డీటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు, పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నిర్లక్ష్యం వీడకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు అనంతపురం ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు కాకి ప్రకాష్రావు హెచ్చరించారు. సోమవారం నగరంలోని ఉపాధ్యాయ భవనంలో ఆప్టా జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కాకి ప్రకాష్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు ఉద్యోగుల సహకారంతోనే విజయం సాధించామని, ఉద్యోగులకు అన్ని విధాలుగా మేలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే పీఆర్సీ గడువు ముగిసి 33 నెలలు గడిచినా కనీసం స్పందించకపోవడం అన్యాయమన్నారు. పైగా ‘మమ్మల్ని ఊపిరి పీల్చుకోనివ్వండి’ అనే వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ప్రభుత్వంపై ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో వ్యతిరేక భావాలు మొదలవుతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నూతన పీఆర్సీ కమిటీని నియమించి 30 శాతం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు గోపాల్రెడ్డి మాట్లాడుతూ సరెండర్ లీవ్ బిల్లులు నాలుగేళ్లుగా పెండింగ్ ఉన్నాయన్నారు. ప్రధానకార్యదర్శి వెంకటరత్నం మాట్లాడుతూ డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. సమావేశంలో ఆప్టా జిల్లా ఆర్థిక కార్యదర్శి బీఏ శంకరమూర్తి, అసోసియేట్ ప్రెసిడెంట్ ప్రభాకర్రెడ్డి, కార్యదర్శి చల్లా శివానంద, నాయకులు వలి, నారాయణ, శ్రీనివాసులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలి అనంతపురం అర్బన్: ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణపై కలెక్టర్ సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 9 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలు సజావుగా జరగాలన్నారు. ఆరో తేదీ రథోత్సవం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దేవదాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని అవసరమైన చోట్ల బారికేడ్ల ఏర్పాటు, తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. పోలీసులు పూర్తిస్థాయిలో బందోబస్తు కల్పించాలన్నారు. బ్రహ్మోత్సవాల వేళ తగినన్ని బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఏర్పాట్లను పరిశీలించాలని గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాస్కు సూచించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో దేవదాయ శాఖ ఏసీ మల్లికార్జున ప్రసాద్, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ శేషాద్రిశేఖర్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్, అగ్నిమాపక అధికారి శ్రీనివాసరెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం శ్రీలక్ష్మి, పెన్నహోబిలం దేవస్థానం ఈఓ రమేష్బాబు పాల్గొన్నారు. -
సమ్మెలోకి ‘సత్యసాయి తాగునీటి’ కార్మికులు
● ఉమ్మడి జిల్లాలో వెయ్యి గ్రామాలకు నీరు బంద్ కళ్యాణదుర్గం రూరల్/ కూడేరు: సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్లో పని చేస్తున్న కార్మికులు జీతాల కోసం సోమవారం రాత్రి నుంచి సమ్మెబాట పట్టారు. మూడు యూనియన్ల పరిధిలోని 570 మంది కార్మికులు జేఏసీగా ఏర్పడి సమ్మెలోభాగంగా కూడేరు మండల పరిధిలోని పీఏబీఆర్ వద్ద ఉన్న సత్యసాయి తాగునీటి ప్రాజెక్టులో మోటర్లు పని చేయకుండా స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని దాదాపు 1000 గ్రామాలకు తాగునీటి సరఫరా బంద్ కానుంది. సత్యసాయి నీటి సరఫరా జేఏసీ నాయకులు వన్నూరప్ప, రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకుండా కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. ఎన్నికల హామీ మేరకు కార్మికుల సమస్యలకు నేటికీ శాశ్వత పరిష్కారం చూపలేదన్నారు. 2026–27 రాష్ట్ర బడ్జెట్లో తాగునీటి కార్మికులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వానికి అసలు సత్యసాయి నీటి ప్రాజెక్టును కొనసాగించాలనే ఉద్దేశం ఉందో లేదో అర్థం కావడం లేదన్నారు. తక్షణమే పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని, పీఎఫ్ జమ చేయాలని, సత్యసాయి ప్రాజెక్టును పరిరక్షించాలని కార్మికులు డిమాండ్ చేశారు. నకిలీ పట్టాలను నమ్మొద్దు అనంతపురం ఎడ్యుకేషన్: ఆర్ఓఎఫ్ఆర్ పథకం కింద జిల్లాలో 549 అటవీ హక్కుల పాసుపుస్తకాలను జిల్లాస్థాయి కమిటీ ఆమోదించిందని జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి శ్రీనవాసరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా పుస్తకాల్లో మంజూరు చేసినంత భూమి మాత్రమే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత కొత్త అటవీ హక్కు పాసుపుస్తకాలు మంజూరు చేయలేదని పేర్కొన్నారు. కొందరు బ్రోకర్లు రంగప్రవేశం చేసి నకిలీ పట్టాలు, ఉన్న పట్టాల్లో దిద్దుబాటు చేస్తున్నారని తెలిసిందన్నారు. లబ్ధిదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం వెంకటాంపల్లి చిన్నతండా, ఎన్ఎన్పీ తండా, పందికుంట తండా, పులగుట్టపల్లి తండా, బెళుగుప్పతండాలో గ్రామ సభలు నిర్వహించామన్నారు. -
ప్రయాసే..పరిష్కారమేదీ?
అనంతపురం అర్బన్: వ్యయప్రయాసలకోర్చి కలెక్టరేట్కు వచ్చి గోడు వెల్లబోసుకుంటున్నా పరిష్కారం మాత్రం లభించడం లేదని పలువురు దివ్యాంగులు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ ఆనంద్తో పాటు జేసీ విష్ణుచరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్కుమార్, డీఆర్ఓ మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, రమేష్రెడ్డి, డీపీఓ నాగరాజునాయుడు ప్రజల నుంచి 405 అర్జీలు స్వీకరించారు. ఇందులో భూ సమస్యలపై 197, ఇతర సమస్యలపై 208 అర్జీలు ఉన్నాయి. సమస్యలపై అర్జీలు ఇస్తున్నా పరిష్కారం కాకపోవడంతో మళ్లీమళ్లీ కలెక్టరేట్కు రావాల్సి వస్తోందన్నారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారం పై అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. అర్జీల్లో మచ్చుకు కొన్ని... ● శింగనమల మండలం చక్రాయపేట రామాలయం వద్ద హైవే మీదుగా ఉన్న దారిని మూసివేయడంతో పంటపొలాలకు వెళ్లేందుకు, డెయిరీ పాలు పోసేందుకు వెళ్లడానికి కిలోమీటరు దూరం చుట్టుకుని రావాల్సి వస్తోందని గ్రామస్తులు అర్జీ అందజేశారు. ● తమ వ్యవసాయ పొలంలోకి వెళ్లేందుకు రస్తా ఇవ్వకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని కుందుర్పి మండలం అప్పిలేపల్లికి చెందిన జయమ్మ అనే వృద్ధురాలు ఫిర్యాదు చేసింది. నాలుగు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పందన కరువైందని తెలిపింది. -
●గరుడ వాహనంపై శ్రీవారు
ఉరవకొండ రూరల్: పెన్నహోబిలం బ్రహ్మోత్సవాల్లో సోమవారం లక్ష్మీ నృసింహస్వామి వారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత నృసింహస్వామి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించి గరుడవాహనంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయం చుట్టూ ఊరేగించారు. కార్యక్రమానికి బొల్లినేని జయసింహ, బొల్లినేని కృష్ణవేణి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. అనంతరం వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ నరసింహస్వామి కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ సాకే రమేష్ బాబు, ఆలయ కమిటీ చైర్మన్ రేగాటి నాగరాజు, అర్చకులు పాల్గొన్నారు. -
సాక్షి తోడు... పదింతల ఫలితం
అనంతపురం ఎడ్యుకేషన్: నిపుణులతో ప్రత్యేకంగా తయారు చేయించిన ‘సాక్షి’ మెటీరియల్ పదో తరగతి విద్యార్థులకు అండగా నిలిచింది. బాగా కష్టమని భావించే గణితం, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులకు సంబంధించి ‘సాక్షి’ యాజమాన్యం తొలిసారి మెటీరియల్ తయారు చేయించి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు సరఫరా చేసింది. ఈ నేపథ్యంలో తాము మంచి మార్కులు సాధించడం వెనుక ఈ మెటీరియల్ దోహదపడినట్లుగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు సగర్వంగా చెబుతున్నారు. ముఖ్యంగా గణితంలో సమస్యలను పరిష్కరించే విధానం, సైన్స్లో ముఖ్యమైన ప్రశ్నలపై స్పష్టమైన సమాధానాలివ్వడంపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకున్నట్లు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయులు కూడా ఈ మెటీరియల్ను ప్రశంసిస్తూ, విద్యార్థుల అభ్యాసంలో ఇది కీలక పాత్ర పోషించిందని అంటున్నారు. సమయానికి సరైన మార్గదర్శకం లభించడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ‘సాక్షి’ అందజేసిన ప్రత్యేక మెటీరియల్పై పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులు ఏమంటున్నారో.. వారి మాటల్లోనే. ‘సాక్షి’కి రుణపడ్డాం చాలామంది పేద విద్యార్థులు మెటీరియల్ కొని చదివే పరిస్థితిలో లేరు. అయితే ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా విద్యార్థులందరికీ మెటీరియల్ అందజేసి అండగా నిలిచిన ‘సాక్షి’కి మేము ఎంతో రుణపడి ఉన్నాం. ‘సాక్షి’ యాజమాన్యం అందజేసిన మెటీరియల్ చదువుకోవడం వల్ల మొత్తం 560 మార్కులు వచ్చాయి. – ఎస్.మానస, జెడ్పీహెచ్ఎస్, ఆత్మకూరు చాలా ఉపయోగపడింది నేను రాప్తాడు కేజీబీవీలో చదువుకున్నా. ‘సాక్షి’ అందజేసిన గణితం, సైన్స్ మెటీరియల్స్లో ఇంపార్టెంట్ ప్రశ్నలు చదువుకున్నా. అత్యధికంగా ప్రశ్నలు అందులోనివే వచ్చాయి. దీంతో సైన్స్లో 81, గణితంలో 80 మార్కులు వచ్చాయి. మొత్తం 482 మార్కులు సాధించాను. అమ్మానాన్న ఇద్దరూ కూలి పనులకు వెళుతుంటారు. – సుప్రజ, గొందిరెడ్డిపల్లి 70 శాతం ప్రశ్నలు అందులోవే అమ్మ కూలి పని చేస్తుండగా, నాన్న వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తున్నారు. ‘సాక్షి’ అందజేసిన మెటీరియల్లోని ప్రశ్నలు 70 శాతం వరకు వచ్చాయి. ఆ మెటీరియల్ చదువుకుని నేను గణితంలో 79, సైన్స్లో 96 మార్కులు సాధించాను. మొత్తంగా 523 మార్కులతో రాప్తాడు కేజీబీవీలో టాపర్గా నిలవడం చాలా సంతోషంగా ఉంది. – ఉమాదేవి గొందిరెడ్డిపల్లి, రాప్తాడు మండలం ‘సాక్షి’ మెటీరియల్ చాలా ఉపయోగపడిందంటున్న విద్యార్థులు -
అత్యాశకు పోయి.. దొంగగా మారి
కదిరి: ట్రాన్స్కో ఉద్యోగి దొంగలా మారడం.. పోలీసులకు పట్టుబడి జైలులో ఊచలు లెక్కపెడుతున్న విషయం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. అసలు రూ.లక్ష జీతం ఉన్న ఉద్యోగి దొంగలా ఎందుకు మారాడు? అన్న విషయంపై ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు. వివరాలు.. స్థానిక ట్రాన్స్కో కార్యాలయంలో సీనియర్ అసి స్టెంట్గా పనిచేస్తున్న బుక్యా రమేష్నాయక్ ఒకప్పుడు కుటాగుళ్లలో ఓ అద్దె ఇంట్లో ఉండేవాడు. తనకు పరిచయం లేకపోయినా ఏదైనా పనిమీద ట్రాన్స్కో కార్యాలయానికి వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించి, అక్కడున్న అధికారులకు చెప్పి వారి సమస్యలు పరిష్కరిస్తూ అందరి మన్ననలు పొందేవాడు. రెండేళ్ల క్రితం కదిరి పట్టణంలోని మారుతీనగర్లో రూ.50 లక్షలు విలువ చేసే సొంతింట్లోకి వెళ్లి తల్లిదండ్రులతో పాటు పిల్లనిచ్చిన అత్తమామల ప్రశంసలు అందుకున్నాడు. కొంప ముంచిన తోటి ఉద్యోగి సలహా.. రమేష్నాయక్ పనిచేసే కార్యాలయంలో ఓ ఉద్యోగికి షేర్ మార్కెట్ పిచ్చి. తనకు అందులో రూ.లక్షల్లో లాభాలు వస్తున్నాయని తోటి ఉద్యోగులతో చెప్పేవాడు. ఆ మాటలకు ఆకర్షితుడైన రమేష్ నాయక్ షేర్లపై దృష్టి సారించాడు. యూట్యూబ్ ద్వారా కొంత తెలుసుకొని ఆ ఊబిలోకి దిగాడు. అనతి కాలంలోనే లక్ష కాదు..రెండు లక్షలు కాదు..రూ.80 లక్షలు నష్టపోయాడు. బ్యాంకుల్లోనే కాకుండా కొంత మంది ప్రైవేటు వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలకు అప్పులు చేసి ఏమి చేయాలో తెలియక మానసికంగా కుంగిపోయాడు. ఈ విషయంలో తరచూ భార్యతో గొడవ పడుతుండే వాడు. ఆమె పుట్టింటి వారికి విషయం తెలిసి అల్లుడు చెప్పిన రూ.40 లక్షల అప్పులు తీర్చి, ఇక షేర్ మార్కెట్ జోలికి వెళ్లొద్దని సలహా ఇచ్చారు. రమేష్ను ఈ ఊబిలోకి దింపిన ఉద్యోగి కూడా షేర్ మార్కెట్లో రూ.20 లక్షలు నష్టం రావడంతో తేరుకొని షేర్లకు స్వస్తి పలికాడు. మళ్లీ అదే ఊబిలోకి .. భార్యతో పాటు అత్తమామలకు తెలియకుండా చేసిన మరో రూ.40 లక్షల అప్పులు తీర్చేందుకు రమేష్ షేర్ మార్కెట్ను వదల్లేకపోయాడు. భార్యకు అనుమానం వచ్చి ‘నువ్వు ఇంక మారవా..?’ అని చెప్పి 10 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పులోళ్ల బాధలు తట్టుకోలేక మరింత మానసిక వేదనకు గురయ్యాడు. ఏమి చేయాలో దిక్కు తెలియక నిద్రలేని రాత్రులు గడిపాడు. దొంగగా మారి... రమేష్ ఇంట్లో ఒక్కడే ఉంటూ టీవీ ఆన్ చేశాడు. సీరియల్ వస్తోంది. అందులో ఓ యువకుడు ఓ మహిళ మెడలో బంగారు చైను లాక్కెళ్లి గోల్డ్షాప్లో అమ్మి సొమ్ము చేసుకోవడం చూశాడు. ఆ దృశ్యం ఇతని మనసులో నాటుకుపోయింది. మరుసటి దినం (ఏప్రిల్ 28న) రమేష్ కదిరి – హిందూపూర్ రోడ్లో టీ తాగేందుకు తన స్కూటీపై వెళ్తుంటే ఇళ్లలో పని చేసుకునే శాంతి ఆయన కంట పడింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు చైను లాక్కొని అక్కడి నుంచి జారుకున్నాడు. పోలీసులకు పట్టుబడింది ఇలా... బాధిత మహిళ శాంతి ఫిర్యాదు మేరకు కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి ఈ కేసును పట్టణ సీఐ నారాయణరెడ్డికి అప్పగించారు. ముందుగా సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ మహిళ మెడలో చైను లాక్కెళ్లిన వ్యక్తి వాడిన స్కూటీ బ్లూ కలర్ (నంబర్ ఏపీ 39హెచ్ వీ.3804) అని పోలీసులు గుర్తించారు. ఈ నెల 2న ఉదయాన్నే స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద పోలీసులు రమేష్నాయక్ను పట్టుకున్నారు. ఆయన వద్ద నుంచి రూ.2 లక్షలు విలువ చేసే బంగారు చైనుతో పాటు స్కూటీని స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు. విలపించిన కుటుంబ సభ్యులు.. విషయం తెలిసి ఆయన భార్యతో పాటు అత్తమామలు ఇంటికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. షేర్ మార్కెట్ వ్యసనం నుంచి ఎలా బయట పడేయాలో తెలియక తాము బాధపడుతుంటే మళ్లీ ఈ దొంగ కేసేంటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ‘దయచేసి ఎవరూ ఇలాంటి షేర్మార్కెట్ల జోలికెళ్లి.. తప్పుడు మార్గాన్ని ఎంచుకోకండి’ అని విన్నవించారు. మిత్రుడి సలహాతో షేర్ల ఊబిలోకి దిగిన ట్రాన్స్కో ఉద్యోగి అప్పులపాలై చోరీల బాట -
రాజకీయ కక్షతోనే అక్రమ కేసులు
గుంతకల్లు: వైఎస్సార్సీపీ మద్దతుదారులమనే ఉద్దేశంతో రాజకీయ కక్షతో తమపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మండలంలోని నెలగొండ, చింతలాంపల్లి, నల్లదాసరపల్లి, పాతకొత్తచెరువు, ఇమాంపురం గ్రామాల మాజీ సర్పంచులు పాటిల్ భాగ్యమ్మ, పద్మావతి, ఎర్రలింగమ్మ, మల్లికార్జున, రంగన్న మాట్లాడారు. తమపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారని, అయితే తమకు న్యాయ స్థానాలపై నమ్మకం ఉందన్నారు. అందుకే త్వరగా బెయిల్ మంజూరైందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పంచాయతీల్లో అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించకుండా వేధించారన్నారు. గ్రామాల్లో నీటి సమస్య, డ్రైనేజీలు, రోడ్ల సమస్యల పరిష్కారానికి ప్రజల వినతుల మేరకు..రూ.లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. అయితే మండల అధికారులు బిల్లులు చేయలేదని జిల్లా ఉన్నాతాధికారు దృష్టికి తీసుకెళ్లినా ఒక్క అధికారి కూడా స్పందించలేదన్నారు. తాము ఎక్కడా కూడా అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని తెలిపారు. తమపై వచ్చిన ఆరోపణలపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. -
కేబుల్ గుంతలో పడి బైకర్ మృతి
గుంతకల్లుటౌన్: పట్టణంలోని ఆలూరురోడ్ విద్యానగర్–1 క్రాస్ దగ్గర కేబుల్ పనుల కోసం తవ్విన గోతి వద్ద బైక్ అదుపు తప్పి రామిరెడ్డి కాలనీకి చెందిన ట్యాంకర్ డ్రైవర్ ఉప్పర ప్రసాద్ (52) ఆదివారం మృతి చెందాడు. వన్టౌన్ సీఐ మనోహర్ తెలిపిన మేరకు.. ఆయిల్ ట్యాంకర్ను నడుపుతూ జీవనం సాగిస్తున్న ప్రసాద్.. బర్మాశాలలో మృతి చెందిన తన స్నేహితుడి మృతదేహాన్ని సందర్శించి బుధవారం రాత్రి 11:30 గంటల సమయంలో తిరిగి తన బైక్పై ఇంటికి బయల్దేరాడు. విద్యానగర్ క్రాస్–1 వద్ద ఓఎఫ్సీ కేబుల్ కోసం తవ్విన గుంత దగ్గర మట్టి, కంకర అడ్డుగా వేయడంతో అదుపుతప్పి గోతిలో పడ్డాడు. స్థానికులు అతన్ని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రసాద్ ఆదివారం వేకువజామున మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య మంజుల, ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
విశిష్ట సంప్రదాయం.. శ్రీవారి కల్యాణం
రాయదుర్గంటౌన్: పట్టణంలోని కోట ప్రాంతంలో వెలసిన ప్రసన్న వేంకటరమణస్వామి ఆలయంలో శ్రీవారి కల్యాణోత్సవం విశిష్ట సంప్రదాయంగా అనాదిగా కొనసాగుతోంది. ఈ నెల 10 వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముఖ్య ఘట్టమైన శ్రీవారి కల్యాణోత్సవం ఈ నెల 5న జరగనుంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా తరాలుగా కొనసాగుతున్న వివాహ ఆచారానికి మంగళవారం ప్రసన్న వేంకటరమణస్వామి ఆలయం వేదిక కానుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా 8 లేదా 9 ఏళ్ల ఓ బాలికతో శ్రీవారి వివాహం జరిపించడం ఇక్కడ ఆచారం. నిశ్చితార్థం మొదలుకొని కల్యాణం వరకూ అన్ని బ్రహ్మణ పండితులు, పురోహితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగే వివాహ తంతు, బాలికతో శ్రీవారికి వివాహం జరిపించాలనే ఆలోచన, ఆచారం దాదాపు వందేళ్ల క్రితం నుంచి పద్మశాలీయ వంశస్తుల ద్వారా కొనసాగుతూ వస్తోంది. ఏటా శ్రీవారితో పద్మశాలీయ వంశం అరవ తెగకు చెందిన బాలికతో వివాహం జరిపించడం ఆనవాయితీ. 5న బాలికతో శ్రీవారి కల్యాణ ఘట్టం.. ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 5న ఉదయం 11.30 గంటలకు అభిజిన్ లగ్నంలో శ్రీవారి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఏడాది పద్మశాలీయ వంశం అరవ తెగకు చెందిన అరవా నాగేష్, పావని దంపతుల కుమార్తె శ్రీఽస్వర జాహ్నవి అనే బాలికతో శ్రీవారి వివాహం జరిపించనున్నారు. పెళ్లి పెద్దలుగా శ్రీవారి తరఫున బ్రాహ్మణులు, ఆలయ పాలక కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు మేళతాళాలతో పెళ్లి కూతురు పద్మావతిని (జాహ్నవి)ను ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకొస్తారు. అక్కడి నుంచి పెళ్లి కూతురిని అలంకరించి, కోటలోని శ్రీవారి సన్నిధికి తీసుకొచ్చి పురోహితులు, వేదపండితుల ఆధ్వర్యంలో వివాహం జరిపిస్తారు. తొమ్మిదేళ్ల బాలికతో రేపు శ్రీవారి వివాహ ఘట్టం కల్యాణోత్సవానికి పూర్తయిన ఏర్పాట్లు -
హనీట్రాప్ కుదిపేసినా.. మారని తీరు
అనంతపురం సెంట్రల్: హనీట్రాప్.. జిల్లాలోనూ, పోలీస్శాఖను కుదిపేసిన ఘటన.. అక్రమ సంపాదన కోసం కొందరు ఖాకీలు అడ్డదారులు తొక్కి పోలీసు శాఖకు మాయని మచ్చ తెచ్చారు. అవినీతికి పాల్పడిన ఓ సీఐ, ముగ్గురు సిబ్బందిని విధుల నుంచి తొలగించడంతో ఇద్దరు సీఐలు వీఆర్కు, ఒక ఎస్ఐ, ఇద్దరు కానిస్టేబుల్ సస్పెన్షన్ వేటు వేయడంతో పోలీసు శాఖ చరిత్రలో ఏనాడూ జరగలేదు. ఈ ఘటనతోనైనా అవినీతి పోలీసు అధికారులకు కనువిప్పు కలుగుతుందనే భావన వ్యక్తమైంది. అయితే కొందరిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఇందుకు తాజాగా ఓ అవినీతి ఉదంతం బయటకు వచ్చింది. రిమాండ్ ఖైదీ నుంచి ఏకంగా డబ్బు వసూలు చేసిన విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. వివరాలు.. పోలీసుశాఖలోని ఏఆర్ విభాగం కానిస్టేబుల్ అవినీతి ఉదంతమిది. రిమాండ్ ఖైదీలకు కోర్టు వాయిదా బందోబస్తు నిమిత్తం వెళ్లిన సదరు కానిస్టేబుల్ ఏకంగా నిందితుడితోనే డీల్ కుదుర్చుకున్నాడు. ఓ దొంగతనం కేసులో సదరు నిందితుడు పట్టుబడినట్లు సమాచారం. రెడ్డిపల్లి సబ్జైలు నుంచి పలుమార్లు రాయదుర్గం కోర్టుకు సదరు నిందితుడిని వాయిదాలకు తీసుకుపోయేవారు. ఎస్కార్ట్ వాహనంలో నిందితులకు బందోబస్తుగా సదరు కానిస్టేబుల్ వెళ్లేవాడు. ఇలా పలుమార్లు సదరు నిందితుడితో చర్చలు జరిపాడు. ఈ కేసులో నుంచి నిన్ను బయటకు తీసుకొస్తాను..బెయిల్ రావడానికి అన్ని విధాలుగా సహకరిస్తానని సదరు కానిస్టేబుల్ నమ్మబలికాడు. నిందితుడి బంధువుల నుంచి రూ.65 వేలు ఒకేసారి ఫోన్ఫే ద్వారా తన బ్యాంకు ఖాతాకు వేయించుకున్నాడు. బెయిల్ రావడానికి కావాల్సిన ష్యూరిటీలు ఇప్పిస్తానని చెప్పినట్లు సమాచారం. డబ్బులు తీసుకున్న తర్వాత కానిస్టేబుల్ చేతులెత్తేశాడు. దీంతో నిందితుడు, వారి బంధువులు డబ్బులు తీసుకొని పనిచేయలేదు.. డబ్బు తిరిగిచ్చేయాలని డిమాండ్ చేయగా ఘటన బయటకు పొక్కింది. గుట్టుగా విచారణ.. ఏఆర్ కానిస్టేబుల్ అవినీతి ఉదంతంపై గుట్టుగా పోలీసులు విచారిస్తున్నారు. డబ్బు తీసుకున్న మాట వాస్తమని విచారణలో కానిస్టేబుల్ అంగీకరించినట్లు సమాచారం. రిమాండ్ ఖైదీకి.. కానిస్టేబుల్కు మధ్య ఓ లాయర్ రాయభారం నడిపినట్లు చర్చ జరుగుతోంది. ఈ ఘటనపై రెండు, మూడు రోజుల్లో సదరు కానిస్టేబుల్పై వేటు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా పోలీసుశాఖలో అవినీతి తారస్థాయికి చేరుకుంది. ఓ ఖైదీ నుంచి ఏఆర్ కానిస్టేబుల్ డబ్బు వసూలు రూ.65 వేలు ఫోన్ పే ద్వారా వసూలు -
జిల్లాకు చేరిన 627 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్
అనంతపురం అగ్రికల్చర్: కోరమాండల్ కంపెనీ నుంచి 627 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ ఎరువు ఆదివారం జిల్లాకు చేరినట్లు ఇన్చార్జ్ ఏడీఏ, రేక్ ఆఫీసర్ వెంకటకుమార్ తెలిపారు. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన్ రేక్ పాయింట్లో వ్యాగన్లలో వచ్చిన ఎరువులను ఆయన పరిశీలించారు. 20–20–0–13 రకం 239 మెట్రిక్ టన్నులు, 14–35–14 రకం 239 మెట్రిక్ టన్నులు, 15–15–15 రకం 29 మెట్రిక్ టన్నులు వచ్చినట్లు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇండెంట్ ఆధారంగా ప్రైవేట్ డీలర్లకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. సనాతన బ్రాహ్మణ వ్యవస్థను కాపాడుకుందాం అనంతపురం కల్చరల్: సనాతన బ్రాహ్మణ వ్యవస్థను కాపాడుకుందామని ప్రముఖ వేదపండితులు సతీష్శర్మ అన్నారు. నగరంలో వందలేళ్లనాటి శ్రీగురుదత్తాత్రేయ మందిరంలో ఆదివారం శ్రీగాయత్రి సమేత గణపతి, నవగ్రహ హోమాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన శ్రీ శంకర విజయపరంపర వేదపండితుల ఆధ్వర్యంలో గణపతి, గోపూజలు, రుద్ర సమేత గాయత్రి హోమం, కలశస్థాపన జరిగాయి. అనంతరం వేదమంత్రాల నడుమ ఘనంగా నిర్వహించి, మహాపూర్ణాహుతి జరిపించారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన సతీష్శర్మ, ఆలయ నిర్వాహకులు మాట్లాడారు. భక్తులకు తీర్థప్రసాద వినియోగం, నారాయణ సేవ చేశారు. రోడ్డు ప్రమాద రూపంలో ‘కూలి’న జీవితం రాప్తాడురూరల్: దినసరి కూలీగా కుటుంబాన్ని నెట్టుకొస్తున్న రమేష్ (49) జీవితం రోడ్డు ప్రమాదంలో విషాదంగా ముగిసింది. రాప్తాడు మండలం రామినేపల్లి వద్ద ఆదివారం జరిగిన ఈ ప్రమాదం కూలీల కుటుంబాల్లో కన్నీరు మిగిల్చింది. వివరాలు.. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లికి చెందిన కూలీలు రోజులాగే పని కోసం అనంతపురం శివారు ప్రాంతానికి ఆటోలో బయల్దేరారు. రామినేపల్లి దాటి కాస్తా దూరం వెళ్లిన తర్వాత వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఆటోను బలంగా ఢీకొట్టింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనలో ఆటో అదుపుతప్పి కిందపడింది. అందులో ప్రయాణిస్తున్న కూలీలు చెల్లాచెదురయ్యారు. వారిలో రమేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారు, ఆటోను స్టేషన్కు తరలించారు. రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలుబత్తలపల్లి: మండలంలోని పోట్లమర్రి గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు.. పోట్లమర్రి గ్రామానికి చెందిన సాకే పోతులయ్య, నాగమ్మ దంపతులు ధర్మవరం సమీపంలోని చిన్నూరు వద్ద ఇల్లు నిర్మాణం చేపట్టారు. రోజూ అక్కడికి వెళ్లి వస్తుంటారు. ఆదివారం కూడా ఇంటి వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా, పోట్లమర్రి సమీపంలోని పెట్రోలు బంకులోకి వెళ్తుండగా, ఇదే సమయంలో బత్తలపల్లి వైపు నుంచి ధర్మవరం వెళ్తున్న మరో ద్విచక్రవాహనం ఢీకొనింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. పోతలయ్యకు ఎడమ కాలు విరిగింది. నాగమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనదారుడు ఆపకుండా వెళ్లిపోయాడు. స్థానికులు వారిని ఆర్డీటీ ఆస్పత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. క్షతగాత్రుల కుమారుడు సాకే చిన్నప్ప ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రైలు కింద పడేందుకు మతిస్థిమితం లేని వ్యక్తి యత్నం తాడిపత్రి రూరల్: పట్టణ సమీపంలోని పుట్లూరు రోడ్డు రైల్వేగేట్ వద్ద ఆదివారం సాయంత్రం గూడ్స్రైలు కింద పడబోతున్న అంజి అనే మతిస్థిమితంలేని వ్యక్తిని స్థానికులు రక్షించారు. అప్గేడ్ర్ సీఐ శివగంగాధర్రెడ్డి తెలిపిన మేరకు..చుక్కలూరు క్రాస్కు చెందిన అంజి.. పుట్లూరు రోడ్డులోని రైల్వే గేట్ వద్ద గూడ్స్ రైలు కింద పడబోతుండగా స్థానికులు కాపాడారు. వెంటనే సమాచారం అందించగా, ఘటనాస్థలికి వెళ్లి విచారించామని సీఐ తెలిపారు. -
సజావుగా నీట్
అనంతపురం అర్బన్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్నీ (ఎన్టీఏ) ఆదివారం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) జిల్లాలో సజావుగా జరిగింది. పరీక్షకు విద్యార్థుల హాజరు 96.62 శాతం నమోదైంది. అనంతపురం నగర పరిధిలోని ఆరు కేంద్రాల్లో, గుత్తి పట్టణ పరిధి లోని రెండు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. వేసవి తీవ్రత దృష్ట్యా కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సదుపాయం కల్పించారు. విద్యార్థులు ఉక్కపోతకు గురికాకుండా పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. పరీక్షకు 3,616 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా 3,494 మంది హాజరయ్యారు. 122 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను నీట్ నోడల్ అధికారి, డీఆర్ఓ ఎ.మలోల సందర్శించారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని అధికారులను అడిగారు. హాజరు 96.62 శాతం నమోదు -
● గుమ్మనూరు గమ్మున.. అంబులెన్స్ మూలన
గుంతకల్లు టౌన్: వేలాది మంద్రి ప్రాణాలను కాపాడిన ఈ అంబులెన్స్ పాలకుల నిర్లక్ష్యం కారణంగా మూలనపడింది. గత ప్రభుత్వం సమకూర్చిందనే అక్కసుతోనే ప్రస్తుత పాలకులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. కరోనా సమయంలో అప్పటి ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి అభ్యర్థన మేరకు నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ తీసుకుని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ సహకారంతో ఎంపీ కోటా నిధుల కింద అత్యాధునిక అంబులెన్స్ను గుంతకల్లుకు సమకూర్చారు. ఆ సమయంలో వేలాది మంది కరోనా బాధితులను ఈ అంబులెన్స్ కాపాడింది. అనంతరం కాలంలోనూ విశిష్ట సేవలను అందిస్తూ వచ్చింది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహణ లోపం కారణంగా ఈ అంబులెన్స్ను మూలన పెట్టేశారు. దీంతో అత్యవసర రోగులను గోల్డెన్ అవర్లో కర్నూలు, అనంతపురం, బళ్లారి తదితర ప్రాంతాల్లోని ఆస్పత్రులకు చేరవేయడం గగనమైంది. గతంలో పనిచేసిన కలెక్టర్ వినోద్కుమార్ సైతం ఈ అంబులెన్స్ కండీషన్ బాగున్నట్లుగా తెలుసుకుని వెంటనే ప్రజా వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అయినా నేటికీ ఎలాంటి చర్యలూ లేవు. స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గమ్మునుండడంతోనే అంబులెన్స్ స్థితిగతుల్లో ఎలాంటి మార్పు రావడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇప్పటికై నా అంబులెన్స్ను ప్రజా వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. -
కందిపప్పు కోతకు ఏడాది
తాడిపత్రి రూరల్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలకు చౌకధాన్యపు డిపోల ద్వారా కంది పప్పు అందకుండా పోయింది. 2025 మే నుంచి పూర్తిస్థాయిలో రేషన్ దుకాణాల్లో కందిపప్పు కోటాను ఎత్తివేసింది. అంతకు ముందు ఒక కోటా ఇవ్వకపోయినా మరో కోటా ఇచ్చేవారు. ఏడాది కాలంగా కందిపప్పుపై టెండర్లు పూర్తి కాలేదని, కాంట్రాక్టర్లు ఎక్కువ కోట్ చేస్తున్నారని చెప్పుకుంటూ వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం చివరకు కోటనే ఎత్తేసి లబ్ధిదారులకు పంగనామం పెట్టింది. 2014–19 టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ రేషన్ దుకాణాల్లో కందిపప్పు పంపిణీ జరగలేదు. ఎన్నికలకు ఏడాది కాలం ఉందనగా ఓట్లు కొల్లగొట్టేందుకు రేషన్ దుకాణాల్లో కందిపప్పు పంపిణీ చేపట్టింది. నెలకు రూ.4.80 కోట్లకు పైగా భారం.. గతంలో ప్రతి నెల 667టన్నుల కందిపప్పు లబ్ధిదారులకు పంపిణీ జరిగేది. ప్రస్తుతం కేవలం రూ.67కే కిలో కందిపప్పును రేషన్ లబ్ధిదారులకు అందజేసేవారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కందిపప్పు ధరలు పెరిగినా రేషన్ దుకాణాల్లో మాత్రం నిర్ణీత ధరకే పేదలకు అందజేస్తూ వచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కందిపప్పును దశల వారీగా తగ్గిస్తూ చివరకు కోటానే ఎత్తేశారు. ఫలితంగా జిల్లాలోని 6.67 లక్షల రేషన్కార్డుల లబ్ధిదారులపై నెలకు రూ.4.80కోట్లకు పైగా భారం పడుతోంది. ప్రస్తుతం జిల్లాలో కందిపప్పు నాణ్యతను బట్టి రూ.140 ధర పలుకుతోంది. రేషన్ దుకాణాల్లో కందిపప్పు పంపిణీ చేసి ఉంటే కిలోకు రూ.73కు పైగా అదా అయ్యేది. ఏడాది కాలంగా రూ.50 కోట్ల వరకు కందిపప్పు కొనుగోలు ద్వారా ప్రజలు నష్టపోతున్నారు. తెల్ల రేషన్ కార్డుదారులను దగా చేసిన చంద్రబాబు ప్రభుత్వం నెలకు రూ.4.80 కోట్లకు పైగా నష్టపోతున్న లబ్ధిదారులు -
ఆగిపోతూ.. అవస్థలు పెడుతూ
కూడేరు: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రోజురోజుకూ ఆర్టీసీ సేవలు దిగజారిపోతున్నాయి. కండీషన్ లేని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ప్రజలకు నరకం చూపుతోంది. ఎక్కడబడితే అక్కడ మొరాయించి ఆగిపోతుండడంతో చుక్కలు కనబడుతున్నాయి. ఆదివారం రాత్రి అనంతపురం నుంచి ఉరవకొండకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు కూడేరు సమీపంలో గిపోయింది. ఇంజిన్ వద్ద ఫ్యాన్ బెల్టు తెగిపోవడంతో ఇలా జరిగినట్లు తెలిసింది. ఆ సమయంలో బస్సులో 40 మంది దాకా ప్రయాణికులు ఉన్నారు. బస్సు ఆగిపోవడంతో వారంతా ఇబ్బంది పడ్డారు. చాలా సమయం తర్వాత మరో బస్సు రాగా అందులో ఎక్కి వెళ్లారు. ప్రభుత్వం స్పందించి కండీషన్ ఉన్న బస్సులను నడపాలని ప్రజలు కోరుతున్నారు. -
ఉపాధి కల్పనలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం
● ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్కుమార్ అనంతపురం అర్బన్: చంద్రబాబు ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పనలో విఫలమైందని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి.సంతోష్కుమార్ విమర్శించారు. ఆదివారం స్థానిక నవయుగ కాలనీలో ఏఐవైఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంతోష్కుమార్తో పాటు ఏఐవైఎఫ్ జిల్లా మాజీ నాయకుడు చిరుతల మల్లికార్జున హాజరై, సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేశ స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన భగత్సింగ్, రాజ్గురు, సుఖదేవ్ థాపర్, అల్లూరి సీతారామరాజు లాంటి గొప్ప వీరులు నేటి యువతకు మార్గదర్శకమన్నారు. యువతకు ఉపాధి కల్పించడంలో, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ విధానాలు, ప్రైవేటీకరణ, ఒప్పంద ఉద్యోగాలపై ఆధారపడుతూ యువత భవిష్యత్తు అస్థిరతలోకి నెట్టబడుతోందన్నారు. వైద్యరంగాన్ని ప్రైవేటీకరిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను దూరం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతను మోసం చేసిందన్నారు. యువతకు గౌరవప్రదమైన ఉపాఽధి కల్పన, నిరుద్యోగ భృతి అమలు, ఉద్యోగ ఖాళీల భర్తీకి ఆందోళలు, పోరాటాలు సాగించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజు, రాంబాబు, నిఖిల్, తేజ, రియాజ్, అశోక్, గణేష్ర నానీ పాల్గొన్నారు. తరిమెల అమరనాథరెడ్డి కథలు విలక్షణం అనంతపురం కల్చరల్: తరిమెల అమరనాథరెడ్డి రచనలు విలక్షణంగా ఉంటాయని వక్తలు పేర్కొన్నారు. ఆదివారం అమరనాథరెడ్డి రచించిన ‘చేదు నిజాలు’ పుస్తకాన్ని స్థానిక ఎస్ఎస్బీఎన్ కళాశాల ఆడిటోరియంలో ఆవిష్కరించారు. నిర్వాహకులు మానవత కోకన్వీనర్ సలీంమాలిక్ పరిచయ కార్యక్రమంతో ప్రారంభమైన సమావేశానికి సీనియర్ కవి తూముచర్ల రాజారామ్ అధ్యక్షత వహించారు. కమ్యూనిస్టు కుటుంబానికి చెందిన వీకే అరుణమ్మ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కృతి స్వీకర్త జిడ్డు కృష్ణమూర్తి ట్రస్టు జాతీయ కార్యదర్శి ఎల్లూరి విశ్వనాథ్, కవులు మహాబోధి కృష్ణమూర్తి, మురళీకృష్ణ, గేట్స్ ఇంజినీరింగ్ కాలేజ్ డైరెక్టర్ పద్మావతి తదితరులు కమ్యూనిస్టుల త్యాగనిరతితో కూడిన కుటుంబాలపై, తరిమెల నాగిరెడ్డి త్యాగమయ జీవితం గురించి మాట్లాడారు. అదే నేపథ్యమున్న అమరనాథరెడ్డి కథలలో ఎక్కడా కాల్పనికత ఉండదని నేటి సమాజంలో జరుగుతున్న అవకతవకలు అవలక్షణాలు, వాస్తవాలకు ప్రతిరూపంగా చేదు నిజాలున్నాయని కొనియాడారు. శివశంకరనాయుడు రాసిన గీతం ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆర్డీటీ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కరరెడ్డి, సంపాదకులు తోట నాగరాజు, నరిసిరెడ్డి, మానవహక్కుల వేదిక రాష్ట్ర నాయకులు ఎస్ఎం బాషా, రియాజుద్దీన్, గోవిందరాజులు, నవీన్కుమార్, కవయిత్రి డాక్టర్ అనంత మాలతి, తదితరులు పాల్గొన్నారు. -
నేడు ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజాసమస్యల పరిష్కారవేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఉదయం 9 గంటలకు ప్రారంభించనున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. భూ సమస్యలపై అర్జీలను పరిష్కార వేదికలో భాగంగా ఏర్పాటు చేసే రెవెన్యూ క్లినిక్లో అందజేయాలన్నారు. కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి అర్జీ పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్లోనూ సమర్పించ వచ్చని తెలియజేశారు. హనుమ వాహనంపై నృసింహుడు ఉరవకొండ రూరల్: పెన్నహోబిలం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం లక్ష్మీ నరసింహస్వామి హనుమంత వాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి వారి మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత నృసింహ స్వామి ఉత్సవమూర్తులను అందంగా అలంకరించి హనుమంత వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆమిద్యాల గ్రామానికి చెందిన గుర్రం సుధాకర్, గుర్రం రవీంద్రనాఽథ్ సోదరులు ఉభయదారులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రేగాటి నాగరాజు, ఈఓ సాకే రమేష్ బాబు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ‘నిజాయితీకి’ న్యాయం! ● డీఈఓ చేరికకు అనుమతులిచ్చిన ఉన్నతాధికారులు ● ఎట్టకేలకు బాధ్యతలు తీసుకున్న ఎం.ప్రసాద్బాబు అనంతపురం ఎడ్యుకేషన్: నిజాయితీ అధికారికి న్యాయం జరిగింది. జిల్లాలో విద్యాశాఖను గాడిలో పెట్టి అందరి మన్ననలు అందుకున్న డీఈఓ ఎం.ప్రసాద్బాబు తీవ్ర పని ఒత్తిడితో అనారోగ్యం బారినపడి గుండెకు స్టంట్ వేయించుకన్న సంగతి తెలిసిందే. 15 రోజుల విశ్రాంతి అనంతరం వైద్యులు ఇచ్చిన ఫిట్నెస్ సర్టిఫికెట్ ఆధారంగా విధుల్లో చేరేందుకని వస్తే ఉన్నతాధికారులు అనుమతులు ఇవ్వకుండా అవమానపరిచారు. గత నెల 24న విధుల్లో చేరాల్సి ఉన్నా...అనుమతులు రాకపోవడంతో ఎదురు చూశారు. ఈ క్రమంలో ‘సాక్షి’లో శనివారం ‘నిజాయితీకి న్యాయం ఎక్కడ?’ శీర్షికతో ప్రత్యేక కథనం వెలువడింది. ప్రసాద్ బాబు డీఈఓగా బాధ్యతలు చేపట్టకముందు జిల్లాలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండేది. కలెక్టర్, ఉన్నతాధికారులు, సిబ్బంది సహకారంతో పూర్తిగా చక్కదిద్దారు.ముఖ్యంగా సామాన్య టీచర్లు, చిరుద్యోగులు సైతం నేరుగా వచ్చి తమ సమస్యను చెప్పుకునేలా కార్యాలయాన్ని అందుబాటులోకి తెచ్చిన వైనంపై ప్రచురితమైన కథనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ ఉద్యోగులు, టీచర్లలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర అధికారుల దృష్టికి వెళ్లింది. కమిషనర్ కార్యాలయ అధికారులు వెంటనే స్పందించారు. కమిషనర్ ఆదేశాలతో ఆర్జేడీ శామ్యూల్, ప్రసాద్బాబుకు ఫోన్ చేశారు. వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో ఆదివారం జిల్లాకు వచ్చిన ఎం.ప్రసాద్బాబు, కలెక్టర్ ఆనంద్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన అనుమతి ఇవ్వడంతో ఎట్టకేలకు సాయంత్రం తన చాంబరులో బాధ్యతలు తీసుకున్నారు. ఏది ఏమైతేనేం మంచి అధికారికి న్యాయం జరిగిందంటూ ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
అనంతపురం సెంట్రల్: జిల్లాలో ఖాళీగా ఉన్న 14 అంగన్వాడీ వర్కర్లు, 224 హెల్పర్స్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ శశికళ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టుల వారీగా... అనంతపురం రూరల్ 19 (వర్కర్లు 2, హెల్పర్లు 17), అనంతపురం అర్బన్లో 7(హెల్పర్లు), గుత్తిలో 12 (హెల్పర్లు), కళ్యాణదుర్గంలో 35 (హెల్పర్లు), కంబదూరులో 18 (హెల్పర్లు), కణేకల్లు 6 (ఒక కార్యకర్త, ఐదుగురు హెల్పర్లు), నార్పలలో 20 (వర్కర్లు 3, హెల్పర్లు 17), రాయదుర్గంలో 16 (వర్కర్లు 2, హెల్పర్లు 14), శింగనమలలో 33 (ఒక వర్కర్, హెల్పర్ 32), తాడిపత్రిలో 43 (ఒక వర్కర్, హెల్పర్ 42), ఉరవకొండలో 30 (వర్కర్లు 4, హెల్పర్లు 26) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వివరించారు. సోమవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ఆయా ప్రాజెక్టు కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఖాళీల వివరాలు, అర్హతలు నోటీసు బోర్డులో ఉంచినట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు సీడీపీఓ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరారు. -
క్షణికావేశం తీసింది ప్రాణం
● మనస్తాపంతో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య అనంతపురం ఎడ్యుకేషన్/యాడికి: క్షణికావేశం టెన్త్ విద్యార్థిని ప్రాణం తీసింది. ఒక్క మార్కుతో ఫెయిల్ అవడాన్ని సున్నిత మనస్కురాలైన ఆ విద్యార్థిని జీర్ణించుకోలేకపోయింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ వంటి అవకాశాలు ఉన్నప్పటికీ ఉపయోగించుకోకుండా ఆత్మహత్యాయత్నం చేసింది. మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయింది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు... యాడికి మండలం నిట్టూరుకు చెందిన వెంకటరమణ, అనూష దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె జింకల అపర్ణ (15) ఇటీవల రాసిన పదో తరగతి పరీక్షల్లో 410 మార్కులు సాధించింది. తెలుగులో 73, హిందీలో 81, ఇంగ్ల్లిష్లో 70, గణితంలో 67, సోషల్లో 85 మార్కులు తెచ్చుకుంది. అయితే సైన్స్లో 34 మార్కులే వచ్చాయి. ఒక్క మార్కు తేడాతో ఫెయిలైంది. దీన్ని అపర్ణ జీర్ణించుకోలేకపోయింది. తనకంటే తక్కువ మార్కులు తెచ్చుకున్న వారు పాస్ కావడం, తాను ఫెయిల్ కావడం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. ఫలితాలు వచ్చిన కొన్ని గంటల్లోనే, ఇంట్లో ఎవరూ లేని సమయంలో వ్యవసాయానికి వినియోగించే విషద్రావకం తాగింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ వంటి అవకాశాలు ఉన్నప్పటికీ, అవగాహన లేక క్షణికావేశంతో విలువైన జీవితం ఆగిపోయింది. పరీక్ష ఫలితాలే జీవితం కాదు అని, కేవలం ఒక దశ మాత్రమే అని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చినా తిరిగి ప్రయత్నించే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయంటున్నారు. ఒక పరీక్షలో ఫెయిల్ అవ్వడం అంటే జీవితంలో ఫెయిల్ కాదని చెబుతున్నారు. మార్కులు కంటే ప్రాణం విలువైనదని, ఒక నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుందని అంటున్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
రెసిడెన్షియల్ శిక్షణ అట్టర్ఫ్లాప్
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి విద్యార్థుల ఫలితాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘రెసిడెన్షియల్ శిక్షణ’ కార్యక్రమం జిల్లాలో ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయింది. మొత్తం 409 మంది విద్యార్థులను ఈ శిక్షణకు ఎంపిక చేయగా.. వారిలో 143 మంది (34.96 శాతం) మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. 266 మంది (65.04 శాతం) విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ఈ ప్రోగ్రాం, క్షేత్రస్థాయిలో సరైన ప్రణాళిక లేకపోవడంతో చివరికి విద్యార్థుల భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆలోచన మంచిదే... అమలే అధ్వానం ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థులను ఒకేచోట ఉంచి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో వారిని కేజీబీవీలు, ప్రభుత్వ వసతిగృహాల్లో చేర్పించారు. లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పటికీ, దాన్ని అమలు చేసే విధానంలో అనేక లోపాలు బయటపడ్డాయి. గైడ్లైన్స్ లేకుండా దూకుడుగా.. కార్యక్రమం అమలుకు ముందుగా స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. జిల్లాల అధికారులకు సరైన దిశానిర్దేశం లేకుండా బాధ్యతలు అప్పగించడం వల్ల ప్రతి చోటా వేర్వేరు విధానాలు అనుసరించాల్సి వచ్చింది. హాస్టళ్లలో చేర్పించినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. అక్కడ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు టీచర్లను నియమించాలి. అలా ఎక్కడా జరగలేదు. ప్రభుత్వం చెప్పింది కదా అని జిల్లాస్థాయి అధికారులు, ఎంఈఓలు, హెచ్ఎంలపై బలవంతం చేశారు. టీచర్లు లేక... పర్యవేక్షణ గాలికి.. విద్యార్థులను హాస్టళ్లకు తరలించినప్పటికీ, అక్కడ అవసరమైన టీచర్లను నియమించకపోవడం తీవ్ర ప్రభావం చూపింది. పర్యవేక్షణ లేకపోవడంతో పిల్లల చదువులో క్రమశిక్షణ తగ్గి, చదువు గాడి తప్పిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు పరిచయం ఉన్న పాఠశాల వాతావరణం నుంచి అకస్మాత్తుగా హాస్టళ్లకు మారడం కూడా విద్యార్థులపై ప్రభావం చూపింది. సరైన కౌన్సెలింగ్ లేకపోవడం వల్ల కొందరు విద్యార్థులు ఒత్తిడికి లోనయ్యారని తెలుస్తోంది. ప్రణాళికా దశలో క్షేత్రస్థాయి వాస్తవాలపై పరిశీలన లేకపోవడమే ఈ కార్యక్రమం అట్టర్ఫ్లాప్ కావడానికి కారణమని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మంచి ఉద్దేశంతో ప్రారంభమైన ‘రెసిడెన్షియల్ శిక్షణ’ కార్యక్రమం, సరైన అమలు లేకపోతే ఎలా విఫలమవుతుందో ఈ కార్యక్రమమే ఉదాహరణ అని స్పష్టం చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థులకోసం ప్రతిష్టాత్మకంగా అమలు గైడ్లైన్స్ లేకుండా జిల్లాలపై భారంగా మారిన ప్రోగ్రాం పర్యవేక్షణ లోపంతో ఫలితాల్లో పల్టీ జిల్లాలో 409 మంది విద్యార్థులకు 143 మంది ఉత్తీర్ణత -
కాలవ ఇలాకాలో తాగునీటి కష్టాలు
రాయదుర్గం టౌన్/గుమ్మఘట్ట: ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు సొంత నియోజకవర్గంలో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. గత సోమవారం రాయదుర్గంలోని మొలకాల్మూరు రోడ్డు ప్రధాన రహదారిపై తాగునీటి కోసం మహిళలు రోడ్డుపై బైటాయించగా, తాజాగా మరోసారి శనివారం మధుటాకీస్ ప్రాంతంతో పాటు గుమ్మఘట్ట మండలం కోనాపురంలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. నీటి కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు. రాయదుర్గంలో చేపట్టిన ధర్నా కార్యక్రమం వద్దకు మున్సిపల్ డీఈ సురేష్, పోలీసులు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటామని, అప్పటి వరకూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని భరోసానివ్వడంతో ఆందోళనను విరమించారు. ఇక గుమ్మఘట్ట మండలం కోనాపురంలో చేపట్టిన ధర్నాపై అధికారులు కనీసంగానూ స్పందించలేదు. దాదాపు రెండు గంటల పాటు రోడ్డుకు అడ్డంగా ఖాళీబిందెలు, ముళ్లకంపలు వేసి ఆందోళన వ్యక్తం చేసినా గోడు పట్టించుకునే వారు కరువయ్యారు. వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి లేకుండా చూసుకోవాల్సిన ప్రభుత్వం, అధికారులు అందుకు తగినట్లుగా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. ఇలాంటి తరుణంలో పట్టణ ప్రాంతంతో పాటు గ్రామాల్లోనూ గతంలో మాదిరి చేతి పంపులు ఏర్పాటు చేస్తే తమ ఇబ్బందులు కాస్తేనా తీరుతాయని పలువురు పేర్కొంటున్నారు. -
ఆవుకు సీమంతం.. దూడకు పుట్టిన రోజు!
ఆత్మకూరు: మండల కేంద్రంలో ఓ రైతు కుటుంబం ఆవుకు సీమంతం.. చేసి, ఆ ఆవు దూడకు పుట్టిన రోజు జరిపిన ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఆత్మకూరుకు చెందిన గూలి పెద్దిరెడ్డి, ఆయన కుమారులు గూలి కొండారెడ్డి, గూలి వెంకటరెడ్డి తమ ఇంట్లో ఆవు జన్మించడంతో ఆడపడుచులా చూసుకున్నారు. ఆ ఆవుకు జన్మించిన దూడకు శనివారం పుట్టిన రోజు కావడంతో వేడుకలు నిర్వహించారు. తమ కాలనీలోని వారందరినీ పిలిచి దూడ ముందు కేక్ కట్ చేసి సంబరం చేసుకున్నారు. అదే విధంగా ఆ దూడ తల్లి ప్రస్తుతం గర్భం దాల్చడంతో దానికి కూడా సీమంతం చేశారు. ముత్తయిదువులచేత హారతి ఇచ్చి, నుదుటిన బొట్టు పెట్టారు. పూలు వేసి.. పసుపు, కుంకుమ చల్లి చీర పెట్టి సీమంతం చేశారు. ఈ సందర్భంగా అందరికీ భోజన ఏర్పాట్లు కూడా చేశారు. దీంతో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులను తోటి రైతులతో పాటు మహిళలు మెచ్చుకున్నారు. మనుషులకే శుభకార్యాలు చేయని ఈ రోజుల్లో మూగ జీవాలను తమ ఇంట్లో మనుషులుగా భావించి వేడుకలు నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. -
బీ ఫార్మసీ ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ఫిబ్రవరి నెలలో నిర్వహించిన బీ ఫార్మసీ రెండో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–23) రెగ్యులర్, సప్లిమెంటరీ, బీ ఫార్మసీ రెండో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–19), (ఆర్–15), (ఆర్–23) సప్లిమెంటరీ ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి.నాగప్రసాద్ నాయుడు విడుదల చేశారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ డాక్టర్ శారద, డాక్టర్ ఎం.అంకారావు, డాక్టర్ ఎస్.శ్రీధర్ పాల్గొన్నారు. ఫలితాలు యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలని కోరారు. ‘నీట్’కు సర్వం సిద్ధం ● ఎనిమిది కేంద్రాల్లో పరీక్ష నిర్వహణ అనంతపురం అర్బన్: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించనున్న జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) నిర్వహణకు జిల్లాలో సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలను ఆయన శనివారం వెల్లడించారు. ఎనిమిది కేంద్రాల్లో నిర్వహించనున్న పరీక్షకు 3,616 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. కేంద్రాల వద్ద మౌలిక, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచామన్నారు. విద్యార్థులు నిర్దేశించిన పరీక్ష సమయం కంటే గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు గేట్లు మూసివేస్తారని, ఆ తరువాత ఎవరినీ కేంద్రాల్లో అనుమతించబోరని అన్నారు. విద్యార్థులు తమ అడ్మిట్ కార్డుతో పాటు ఏదేని గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి ఆత్మకూరు: పని ప్రదేశంలో వడదెబ్బకు గురైన ఉపాధి హామీ కూలీ ఇంటికి వచ్చాక మృతి చెందాడు. స్థానికులు, బంధువులు తెలిపిన మేరకు... వడ్డుపల్లికి చెందిన బొజ్జన్న (50) శనివారం ఉదయం ఉపాధి హామీ పనికి వెళ్లాడు. పని ముగించుకుని ఇంటికి వచ్చాక నీరసంగా ఉందని పడుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత భార్య దేవి నిద్ర లేపేందుకు ప్రయత్నించగా ఉలుకూపలుకు లేదు. దీంతో గట్టిగా కేకలు వేసి చుట్టుపక్కల వాళ్లను పిలిచి పరిశీలించగా.. బొజ్జన్న అప్పటికే మృతి చెందాడు. బొజ్జన్నకు ఇంటర్, తొమ్మిదో తరగతి చదువుతున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో వారు కన్నీరు మున్నీరయ్యారు. హంస వాహనంపై శ్రీవారుఉరవకొండ రూరల్: పెన్నహోబిలం బ్రహ్మోత్సవాల్లో శనివారం లక్ష్మీ నృసింహసామి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత నృసింహస్వామి ఉత్సవమూర్తులను వివిధ పుష్పాలతో అలంకరించి హంస వాహనంపై కొలువు దీర్చారు. అనంతరం పల్లకీని ఆలయం చుట్టూ ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమానికి వేలూరు నారమ్మ మనువడు రంగయ్య ఆమిద్యాలకు చెందిన కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో సాకే రమేష్ బాబు, అర్చకులు పాల్గొన్నారు. 65 ప్రాంతాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు అనంతపురం: జిల్లా వ్యాప్తంగా 65 ప్రాంతాల్లో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (డీఎస్డీఓ) మంజుల తెలిపారు. అథ్లెటిక్స్, ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, చెస్, ఫెన్సింగ్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, జూడో, ఖో–ఖో, కరాటే, కబడ్డీ, రైఫిల్ షూటింగ్, సెపక్త్రా, స్కేటింగ్, స్విమ్మింగ్, వాలీబాల్, టేబుల్ టెన్నిస్, వ్రెస్టింగ్, తైక్వాండో, సాఫ్ట్బాల్, కర్రసాము క్రీడల్లో శిక్షణ ఇస్తామని తెలిపారు. పూర్తి వివరాలకు అనంతపురం అశోక్నగర్ ఇండోర్ స్టేడియంలోని డీఎస్డీఓ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. -
రేషన్ సరుకుల పంపిణీలో కోతలు
అనంతపురం అర్బన్: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే రేషన్ సరుకుల్లో చంద్రబాబు ప్రభుత్వం కోతలు పెడుతూనే ఉంది. కందిపప్పు పంపిణీకి మంగళం పాడిన ప్రభుత్వం నిత్యావసర సరుకుల్లో ఒక్కొక్కటిగా తగ్గించేస్తోంది. ఈ నెల జొన్నలు, రాగులు కోటా ఇవ్వని కారణంగా పంపిణీ నిలిచింది. ఆర్భాటంగా ప్రకటించిన గోధుమపిండి పంపిణీ కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. చౌకధరల దుకాణాల్లో ప్రస్తుతం బియ్యం, చక్కెర మాత్రమే అందిస్తున్నారు. స్టోర్లకు చేరని బియ్యం కోటా జిల్లా వ్యాప్తంగా 1,645 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. ప్రతి నెలా రేషన్ ఒకటో తేదీ నుంచి 15 వరకు కార్డుదారులకు పంపిణీ చేస్తారు. ముందు నెల చివరినాటికి స్టోర్లకు బియ్యం, సరుకులు సరఫరా కావాలి. అయితే ఈ నెల బియ్యం కోటా చాలా స్టోర్లకు రెండో తేదీ అయినా సరఫరా కాలేదు. కేటాయింపులు ఇలా... జిల్లాలో 6,72,623 బియ్యం కార్డులు ఉన్నాయి. వీటిలో 20,70,917 యూనిట్లు (సభ్యులు) ఉన్నాయి. కోటా విషయానికి వస్తే జిల్లాకు ప్రతి నెలా 10,118 టన్నుల బియ్యం, 673 టన్నుల చక్కెర, 650 టన్నుల జొన్నలు, 630 టన్నుల రాగులు, 669 టన్నుల గోధుమపిండి కేటాయింపు ఉంది. అయితే ఈ నెల రాగులు, జొన్నల కోటా సరఫరాకాలేదు. దీంతో కార్డుదారులకు ఆ సరుకులు అందని పరిస్థితి. ఇక గోధుమపిండి కూడా కోటా మేరకు సరఫరా కాని కారణంగా మొక్కుబడిగా కొన్ని ప్రాంతాల్లోనే పంపిణీ చేస్తున్నారు. బియ్యం సరఫరా అవుతున్నాయి ప్రతినెలా 31లోగా బియ్యం, సరుకులు స్టోర్లకు సరఫరా అవుతాయి. అయితే ఈసారి సాంకేతిక కారణాల వల్ల కొన్ని చౌక దుకాణాలకు బియ్యం సరఫరా కాలేదు. ఒకట్రెండు రోజుల్లో అన్ని దుకాణాలకూ బియ్యం చేరుతాయి. ఇక రాగులు, జొన్నలు స్టాక్ అయిపోయింది. వాటి సేకరణ చేపట్టాం. గోధుమపిండి కొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నారు. – రమేష్రెడ్డి, జిల్లా మేనేజర్, పౌర సరఫరాల సంస్థ -
టీడీపీ నేత బరి తెగింపు
సాక్షి టాస్క్ఫోర్స్: మండలంలోని సొల్లాపురం గ్రామంలో టీడీపీ నేత దౌర్జన్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. సొల్లాపురం నుంచి కౌకుంట్లకు వెళ్లే మార్గంలో పూర్వం ఉన్న రెండు బావులు పాడుబడి పోవడంతో 15ఏళ్ల క్రితం ఉపాధిహామీ పథకం కింద మట్టిని తరలించి పూడ్చేయడంతో సువిశాలమైన గ్రామ కంఠం అందుబాటులోకి వచ్చింది. ఈ స్థలాన్ని అక్కడే ఉన్న సీతారామాంజనేయస్వామి, వేంకటేశ్వరస్వామి ఆలయాల ఉత్సవాల సమయంలో, శుభకార్యాలు జరిగినప్పుడు స్థానికులు వంటలు వండి భోజనాలు చేసేందుకు వాడుకుంటున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక టీడీపీ నేత వెంకట్రామిరెడ్డి ఆ స్థలాన్ని కబ్జా చేసి, ఇంటి నిర్మాణ పనులు చేపట్టాడు. ఈ క్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా జాగ్రత్త పడ్డాడు. గ్రామ సర్పంచ్గా వైఎస్సార్సీపీ నాయకుడు భాస్కరరెడ్డి సతీమణి మహేశ్వరీ పదవీకాలంలో పూర్తి అయ్యే వరకూ వేచి ఉండి, ఆ తర్వాత పక్కా ప్లాన్ ప్రకారం మేరకు పనులు చేపట్టాడు. అధికారులు ఇప్పటికై నా స్పందించి గ్రామ కంఠం భూమిని కాపాడి ప్రజావసరాలకు వినియోగపడేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కేఎఫ్ఆర్ వర్సిటీతో జేఎన్టీయూ ఒప్పందం అనంతపురం: అంతర్జాతీయ స్థాయి పోటీకి దీటుగా విద్యా ప్రమాణాలు పెంపుదల చేసేలా జర్మనీలోని కేఎఫ్ఆర్ యూనివర్సిటీతో జేఎన్టీయూ(ఏ) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు రెండు వర్సిటీల ప్రతినిధులు అవగాహన ఒప్పంద పత్రాలను శుక్రవారం మార్చుకున్నారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ వీసీ డాక్టర్ హెచ్.సుదర్శనరావు మాట్లాడుతూ.. ఉన్నత విద్యా రంగంలో అంతర్జాతీయ సహకారాల ప్రాముఖ్యత పెంపొందించేలా రెండు విశ్వవిద్యాలయాల మధ్య పరస్పర సహకారం అందిపుచ్చుకోనున్నట్లు తెలిపారు. జర్మనీలోని ఆ విశ్వవిద్యాలయ నాలెడ్జ్ ఫౌండేషన్ సీఈఓ డేనియల్ గీగిస్ వర్చువల్గా మాట్లాడుతూ.. జేఎన్టీయూ(ఏ)తో చేసుకున్న ఒప్పందం మేరకు ముందుకు సాగుతామని పేర్కొన్నారు. అలాగే, ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీతో అన్ని విధివిధానాలను ఖరారు చేస్తామని తెలిపారు. జర్మనీ వర్సిటీ ప్రతినిధులు రాజ్ వంగపండు, శ్యామ్ సుందర్, జేఎన్టీయూ రిజిస్ట్రార్ ఎస్. కృష్ణయ్య, డీఏపీ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, అడ్మిషన్లు – విదేశీ వ్యవహారాల డైరెక్టర్ ఎ.సురేష్బాబు, ప్రొఫెసర్ భానుమూర్తి , ఓఎస్డీటూ వీసీ ప్రొఫెసర్ ఓ.దేవన్న పాల్గొన్నారు. -
జీవనోపాధులతో వ్యవస్థాపకులుగా ఎదగాలి
బెళుగుప్ప: డీఆర్డీఏ ద్వారా జీవనోపాధులను సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ వ్యవస్థాపకులుగా ఎదగాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. శుక్రవారం కాలువపల్లి రైతు సేవా కేంద్రంలో 2026–27 వార్షిక సంవత్సరానికి ఏసీఎల్పీ (యాన్యువల్ క్రెడిట్ లైవ్లీవుడ్ ప్లాన్) ప్రణాళికపై వీవోఏలు, ఈ–నారీలు, ఎస్హెచ్జీ సభ్యులతో కలెక్టర్ సమావేశమయ్యారు. జీవనోపాధులను ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు.. వ్యవస్థాపకులుగా ఎలా ఎదగాలనుకుంటున్నారు అనే అంశాలపై చర్చించారు. అనంతరం హెల్త్ వెల్నెస్ సెంటర్ను సందర్శించిన వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నివారణ చర్యలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సుయాశ్కుమార్, తహసీల్దార్ అనిల్కుమార్, డీఆర్డీఏ ఏపీడీ రాధారాణి, ఇన్చార్జ్ ఏపీఎం శివప్రసాద్, ఎంపీడీఓ లక్ష్మినారాయణ, వైద్యాధికారి హిమబిందు, హెల్త్ సూపర్వైజర్ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. జలధార పనులు సజావుగా చేపట్టండి జలధార పనులను సజావుగా చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం హనిమరెడ్డిపల్లి వద్ద ఎంఐ ట్యాంకును కలెక్టర్ పరిశీలించారు. -
శ్రామికుల పక్షపాతి వైఎస్ జగన్
● వైఎస్సార్టీయూ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి అనంతపురం: తన ఐదేళ్ల పాలనలో కార్మికులు, కర్షకులు, ఉద్యోగుల పక్షపాతిగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖ్యాతిగాంచారని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.ఓబిరెడ్డి అన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ట్రేడ్ యూనియన్ జెండాను ఆవిష్కరించారు. హక్కుల సాధనలో భాగంగా అమరులైన కార్మికులకు నివాళులు అర్పించారు. అనంతరం ఓబిరెడ్డితో పాటు జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మాజీ మేయర్ వసీం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీసీ రమేష్ గౌడ్, సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, ఎస్ఈసీ సభ్యుడు కోగటం విజయభాస్కరరెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్ పీరా, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, యువజన విభాగం రాష్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్రెడ్డి తదితరులు మాట్లాడారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, మున్సిపల్ కార్మికులు అడగకముందే వారి జీతాలను రెట్టింపు చేసిన ఖ్యాతి మాజీ సీఎం వైఎస్ జగన్కు దక్కుతుందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసి కార్మికులకు ఉద్యోగ భద్రతను కల్పించారన్నారు. కార్మిక లోకం ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న హక్కులను ఎన్డీఏ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. కార్మికులకు పని గంటలు 8 ఉండగా.. దానిని పది గంటలకు పెంచారని మండిపడ్డారు. కార్మికులకు మేలు జరగాలంటే ఒక్క వైఎస్సార్సీపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. బీసీ రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. కార్మికుల కష్టాన్ని శ్రమను చంద్రబాబు ప్రభుత్వం దోపిడీ చేస్తోందని విమర్శించారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఏకై క పార్టీ వైఎస్సార్సీపీనే అని కొనియాడారు. కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంపంగి రామాంజినేయులు, రాజారత్నం, జిల్లా కార్యదర్శులు అనిల్కుమార్ గౌడ్, రామాంజి రాయల్, కుళ్లాయప్ప, నగర అధ్యక్షుడు ఖాజా, హుస్సేన్, కాకర్ల శ్రీనివాసరెడ్డి, పట్టణ కార్యదర్శి రాజశేఖరరెడ్డి, జానీ, గోగుల రాధాకృష్ణ, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, అమర్నాథరెడ్డి, శ్రీనివాసులు, మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు రాధాయాదవ్, భారతి, జాహ్నవి రెడ్డి, అంజలి, కళావతి, వెంకటేశ్ రాయల్, సాకే చిరంజీవి, గుజ్జల నారాయణ, శశి, నవీన్ కుమార్, విశ్వతేజ, రమణ, శ్రీనివాస రాయల్ పాల్గొన్నారు. -
నిజాయితీకి న్యాయం ఎక్కడ..?
● విద్యాశాఖను సజావుగా నడిపిన అధికారికి అవమానం ● అనారోగ్యం కారణంగా సెలవుపై వెళ్లిన డీఈఓ ప్రసాద్బాబు ● తిరిగి వచ్చిన తర్వాత విధుల్లో చేర్చుకోని ఉన్నతాధికారులు ● అనుమతుల కోసం వారం రోజులుగా ఎదురుచూస్తున్న అధికారి ● పరిపాలనా ఆలస్యమా..? ఏదైనా రాజకీయ కారణాలున్నాయా? ● ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకుల్లో తీవ్ర చర్చ అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో విద్యాశాఖను గాడిలో పెట్టి అందరి మన్ననలు అందుకున్న డీఈఓ ఎం.ప్రసాద్బాబు ప్రస్తుతం సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. జిల్లాలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యావ్యవస్థను ఆయన బాధ్యతలు తీసుకున్న చక్కదిద్దారు. పెండింగ్లో ఉన్న అనేక ఫైళ్లను వ్యక్తిగతంగా పరిశీలించి, న్యాయబద్ధమైన వాటికి పరిష్కారం చూపడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు. కలెక్టర్, ఉన్నతాధికారుల సమన్వయంతో సమస్యలను పరిష్కరించడంలో ప్రసాద్బాబు చూపిన చొరవ అందరినీ ఆకట్టుకుంది. మరీముఖ్యంగా ఒక సాధారణ ఉపాధ్యాయుడు నేరుగా వచ్చి తన సమస్యను చెప్పుకునేలా కార్యాలయాన్ని అందుబాటులో ఉంచడం ఆయన ప్రత్యేకత. ‘నొప్పించక.. తానొవ్వక’ అన్న విధంగా ఎవరికీ ఇబ్బంది కలగకుండా, బాధితులకు న్యాయం చేయాలనే ధ్యేయంతో పనిచేసిన అధికారిగా పేరు సంపాదించారు. అయితే ఇటీవలి కాలంలో తీవ్ర పని ఒత్తిడితో అనారోగ్యానికి గురై గుండెకు స్ట్టంట్ వేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైద్యుల సూచన మేరకు 15 రోజుల విశ్రాంతి తీసుకున్న అనంతరం, ఫిట్నెస్ సర్టిఫికెట్తో తిరిగి విధుల్లో చేరేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం విద్యాశాఖ కమిషనర్కు లేఖ కూడా పంపించారు. గత నెల 24న విధుల్లో చేరాల్సి ఉంది. కానీ వారం దాటినా ఆయన్ను విధుల్లో చేర్చడంపై స్పష్టత లేకపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. నిజాయితీగా, పారదర్శకంగా పనిచేసే అధికారిని ఇలా అవమానించడం సరైనదా? అనే ప్రశ్నలు ఉపాధ్యాయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే 20 రోజులకు పైగా జిల్లా విద్యాశాఖకు అధికారి లేకపోవడంతో కీలక ఫైళ్లు పెండింగ్లో పడుతున్నాయి. ఇది విద్యావ్యవస్థపై ప్రభావం చూపే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం పరిపాలనా ఆలస్యం మాత్రమేనా..? లేక దీనివెనుక ఏదైనా రాజకీయ కారణాలున్నాయా..? అనే అభిప్రాయాలు ఉపాధ్యాయ సంఘాల నేతల నుంచి వ్యక్తమవుతున్నాయి. కార్యాలయ సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ప్రసాద్బాబుకు జరుగుతున్న అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రస్థాయి అధికారులు వెంటనే స్పందించి ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలని, నిజాయితీగా పనిచేసే అధికారికి న్యాయం చేయాలని ఉపాధ్యాయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి. -
మార్కులే జీవితం కాదు
● ఓటమి కూడా భవిష్యత్తు విజయానికి తొలి మెట్టు ● మార్పు తెచ్చే మార్గాలు ఎన్నో ● యాడికిమండలంలోని నిట్టూరు గ్రామానికి చెందిన విద్యార్థిని అపర్ణ పదో తరగతిలో అన్ని సబ్జెక్ట్ల్లోనూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినా... సైన్స్ సబ్జెక్ట్లో మాత్రం ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపానికి గురై గురువారం పురుగుల మందు తాగింది. గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అనంతపురం తరలించారు. ● హిందూపురం మండలం కిరికెర గ్రామానికి చెందిన హంసశ్రీ(15) ఇదే మండలంలోని కె.బసవనపల్లిలోని జెడ్పీహెచ్ఎస్లో 10వ తరగతి చదివి పరీక్షలు రాసింది. గురువారం విడుదలైన ఫలితాల్లో ఫెయిల్ అయినట్లుగా గుర్తించి బాధతో ఆత్మహత్య చేసుకుంది. ... ఈ రెండు ఘటనలే కాదు... ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెలుగు చూడని మరిన్ని ఉన్నాయి. అయితే మార్కులే జీవితం కాదని, ఒక్కోసారి ఓటమి కూడా భవిష్యత్తు విజయానికి తొలి మెట్టుగా మారుతుందనే విషయాన్ని గుర్తించకపోవడం బాధాకరం. కీలకమైన ఇలాంటి సమయంలోనే మార్పు తెచ్చే ఎన్నో మార్గాలు ఉన్నాయని, వాటిని అనుసరిస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. రాయదుర్గం టౌన్/హిందూపురం టౌన్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రలు తమ పిల్లల మార్కులనే వారి పరువు, ప్రతిష్టలుగా భావిస్తూ వారిపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు పెంచుతున్నారు. దీంతో విజయం సాధించలేక చతికిల పడినప్పుడు ఆత్మనూన్యత భావానికి లోనై విద్యార్థులు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఓటమి కూడా భవిష్యతులో విజయానికి తొలి మెట్టుగా మారుతుందని మానసిక నిపుణులు, విద్యావంతులు పేర్కొంటున్నారు. పదో తరగతిలో ఒకసారి, ఇంటర్లో రెండుసార్లు ఫెయిలైన రాజస్తాన్కు చెందిన అంజుశర్మ.. ఏమాత్రం నిరుత్సాహపడకుండా పట్టుదలతో చదువుకుని యూపీఎస్సీ తొలి ప్రత్నంలోనే ఐఏఎస్కు ఎంపికయ్యారని గుర్తు చేస్తున్నారు. ఇవి గుర్తుంచుకోండి... ● పరీక్షలు అనేవి తలరాతను మార్చలేదు. ● అపజయం అనేది మరింత నేర్చుకునేందుకు ఒక అవకాశం. ● పిల్లలు వారి సమస్యలు చెప్పుకునేలా చిన్నప్పటి నుంచే వారితో తల్లిదండ్రులు మెలగాలి. ● ఓటమి నుంచే విజయం వరిస్తుందనే స్ఫూర్తిదాయక విజయాలను సాధించిన వారి జీవన విధానాలను వివరించాలి.మార్కులు శాశ్వతం కాదు ఫెయిలైనా, తక్కువ మార్కులొచ్చినా మళ్లీ ప్రయత్నించి జీవితంలో అత్యున్నత ఉద్యోగాలు సాధించిన వారు చాలా మంది ఉన్నారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలి. మార్కులు తక్కువ వస్తే జీవితమే ఆగిపోయినట్లు భావించకుండా మళ్లీ ప్రయత్నించాలి. అపజయం తర్వాత వచ్చే విజయం ఎంతో బలాన్ని అందిస్తుంది. – మహమ్మద్ ఇర్షాద్, ఎంఈఓ, రాయదుర్గం ఓటమి అనేది కామన్ ప్రతి విజయం వెనుక ఓటమి అనేది కామన్ అంశం. ఆత్మహత్య చేసుకోవడమనేది సమస్యకు పరిష్కారం కాదు. ఫెయిలయ్యామనో.. మార్కులు తక్కువగా వచ్చాయనో ఆత్మనూన్యత భావంతో ఉన్న వారు ఒక్కసారి హెల్ప్లైన్ నంబర్ 14416కు కాల్ చేస్తే సమస్యకు పరిష్కారం దక్కుతుంది. – డాక్టర్ జీవన, మానసిక వైద్యనిపుణురాలు, హిందూపురం -
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
బ్రహ్మసముద్రం : ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆదేవిధంగా కుటుంబ జనగణన సర్వేను కలెక్టర్ ప్రారంభించారు. కుటుంబ గృహగణనలో కచ్చితమైన సమాచారాన్ని అందజేయాలని ప్రజలకు సూచించారు. జనగణన వల్ల మీ ఇంటికి వచ్చేసంక్షేమ పథకాలకు ఎటువంటి సంబంధమూ లేదన్నారు. అనంతరం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుతో కలిసి గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. మండల వ్యాప్తంగా దాదాపు 68 ఆర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు అధికారుల దృష్టికి వచ్చిన తక్షణమే పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కళ్యాణదుర్గం ఆర్డీఓ వసంతబాబు, తహసీల్దార్ సుమతి, ఎంపీడీఓ ఏకాంబరేశ్వరయ్య, ఎంఈఓ ఓబుళపతి, ఏపీఓ శారద, మండల వైద్యాధికారి రాజేష్కుమార్ పాల్గొన్నారు. టన్ను మామిడి రూ.1.20 లక్షలు అనంతపురం అగ్రికల్చర్: స్థానిక కక్కలపల్లి మామిడి మార్కెట్లో శుక్రవారం టన్ను గరిష్టంగా రూ.1.20 లక్షలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్కుమార్ తెలిపారు. మార్కెట్కు 310 టన్నులు అమ్మకానికి రాగా వాటిని వేలం వేశారన్నారు. అందులో టన్ను గరిష్టంగా రూ.1.20 లక్షలు, కనిష్టంగా రూ.40 వేలు, సరాసరిన రూ.80 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు ఆయన వెల్లడించారు. గాలివానకు రూ.50 లక్షల పంట నష్టం అనంతపురం అగ్రికల్చర్: భారీ ఉరుములు, మెరుపుల మధ్య గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. 16 మండలాల పరిధిలో 3.9 మి.మీ సగటు నమోదైంది. రాప్తాడు 35.2 మి.మీ, పెద్దవడుగూరు 14.8, కళ్యాణదుర్గం 11, గుత్తి 9.4, అనంతపురం 6.4, బుక్కరాయసముద్రం 6.2 మి.మీతో పాటు నార్పల, పామిడి, కూడేరు, గార్లదిన్నె, కంబదూరు, బొమ్మనహాళ్, పుట్లూరు, కణేకల్లు, ఉరవకొండ, ఆత్మకూరు తదితర మండలాల్లో వర్షపాతం నమోదైంది. చాలా ప్రాంతాల్లో 20 నుంచి 25 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. దీంతో అనంతపురం, గుత్తి, రాప్తాడు తదితర మండలాల్లో అక్కడక్కడా 20 హెక్టార్లలో అరటి, చీనీ, మామిడి, కూరగాయల పంటలు దెబ్బతినడంతో రూ.50 లక్షల వరకు పంట నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. వైభవంగా గో వాహనోత్సవం ఉరవకొండ రూరల్: పెన్నహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారు గోవాహనంపై విహరించారు. ఉదయం స్వామి వారి మూలవిరాట్కు అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలకరించి గోవాహనంపై కొలుదీర్చారు. డప్పు, మేళతాళాలు, వాయిద్యాల నడుమ ఆలయం చుట్టూ ఊరేగించారు. కార్యక్రమానికి సూరా లక్ష్మీపతి, సూరా క్రిష్ణమూర్తి, సూరా విశ్వనాథ్, సూరా వెంకటచలమయ్యశెట్టి కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. సాయంత్రం స్వామి వారు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీదేవి భూదేవి సమేత నృసింహస్వామి ఉత్సవమూర్తులను శేషవాహనంపై ఆలయం చుట్టూ ఊరేగించారు. సుదర్శనం మదిగుబ్బ గ్రామానికి చెందిన వారు ఉభయదాతలుగా వ్యవహరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఈవో సాకే రమేష్ బాబు, ఆలయ కమిటీ ప్రతినిధులు, అర్చకులు పాల్గొన్నారు. -
ప్రతిభావంతులకు అవకాశం
గతంలో ఆర్డీటీ సెట్ నిర్వహించి 400 ప్రతిభావంతులను ఎంపిక చేసి వారి ఉన్నత చదువులకు దోహదపడేవాళ్లం. ఈ సారి మరింత విస్తృతం చేస్తూ అదనంగా వెయ్యి మందిని ఎంపిక చేయనున్నాం. అయితే ఇందుకు సెట్ నిర్వహించడం లేదు. పదో తరగతిలో సాధించిన ఉత్తమ మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసి స్పెషల్ స్కాలర్షిప్, సెమీ స్కాలర్షిప్ విధానాన్ని అమలు చేస్తున్నాం. 400 మందికి స్పెషల్ స్కాలర్షిప్, 1000 మందికి సెమీ స్కాలర్షిప్ ఇస్తున్నాం. – మోహన మురళీ, ఆర్డీటీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ -
టీడీపీ బూత్ కన్వీనర్ అరాచకం
● 2022లో మూడు సెంట్ల స్థలం కొనుగోలు ● డబ్బులు చెల్లించడానికి ముప్పు తిప్పలు ● నాలుగేళ్లుగా వృద్ధ దంపతులకు నరకం ● న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన దంపతులు అనంతపురం సెంట్రల్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నాయకుల అరాచకాలు రోజురోజుకు శ్రుతి మించుతున్నాయి. అధికారం ఉంది కదా అని ధైర్యంతో సామాన్య ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. తాజాగా అనంతపురంలోని మూడో డివిజన్ టీడీపీ బూత్ కన్వీనర్ నాగరాజు దౌర్జన్యంపై బాధిత వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే... అనంతపురంలోని ఖాజా నగర్లో నివాసముంటున్న శోభ, నాగరాజు దంపతులకు గుత్తి రోడ్డు సమీపంలోని మయూరి హోటల్ వెనుక మూడు సెంట్ల స్థలం ఉంది. సంతానం లేకపోవడంతో కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న బంధువుల వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో నగరంలోని మూడు సెంట్ల స్థలాన్ని 2022లో టీడీపీ మూడో డివిజన్ నాయకుడు నాగరాజుకు రూ. 20 లక్షలకు విక్రయించారు. ఆ సమయంలో రూ.10 లక్షలు మాత్రమే నాగరాజు చెల్లించి, ఆ స్థలాన్ని ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. మిగిలిన డబ్బు ఇవ్వకుండా రోజుల తరబడి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో 80 ఏళ్లు పైబడిన వారు కాలం చేస్తే డబ్బు ఎగ్గొట్టవచ్చు అనే ఆలోచనతో అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వస్తున్నాడు. గతంలో ఓసారి తీవ్ర ఒత్తిడి చేయడంతో రూ. 10 లక్షలకు బాండ్ పేపర్ రాయించాడు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ వృద్దులకు స్పందించడమే మానేశాడు. ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి.. మీకు డబ్బులు ఇవ్వను అని భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. దీంతో చేసేదేమి లేక బాధితులు శుక్రవారం డీఎస్పీ శ్రీనివాసరావును ఆయన చాంబర్లో కలిశారు. అనంతరం వన్టౌన్ పోలీసుస్టేషన్కు వెళ్లారు. నాగరాజు పెట్టిన మానసిక క్షోభ కారణంగా తన భర్తకు పక్షవాతం, గుండెపోటు వచ్చిందని వృద్దురాలు శోభ పోలీసుల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. కాగా పోలీసులు కేసు నమోదు చేయకుండా దుప్పటి పంచాయితీ చేసినట్లు తెలుస్తోంది. కేఆర్ఆర్సీ పీడీసీ అఖిల బదిలీ అనంతపురం అర్బన్: జిల్లాకు కేటాయించిన ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్ (పీడీసీ) అఖిలను ఆర్టీజీఎస్ డిప్యూటీ సెక్రటరీ గీతాంజలి శర్మకు ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కోనేరు రంగారావు కమిటీ (కేఆర్ఆర్సీ) స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా అఖిల పనిచేస్తున్నారు. ఆన్ ఓడీ బేసిస్ కింద ఆమెను ఐఏఎస్ అధికారికి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా నియమించారు. -
ఉచితం కాదు..ఉపకార వేతనం
అనంతపురం: కరువుసీమలో కల్పతరువుగా భాసిల్లుతున్న ఆర్డీటీ.. ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రతిభావంతులైన విద్యార్థులకు దన్నుగా నిలిచే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పదో తరగతిలో మంచి మార్కులతో సత్తా చాటిన వారికి గతంలో ఆర్డీటీ సెట్ నిర్వహించి.. ఉత్తమ ఫలితాలు సాధించిన వారికి ఆరేళ్ల పాటు ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తూ వచ్చింది. తాజాగా వీటిని మరింత విస్త్ర ృత పరుస్తూ.. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు తీపి కబురు అందించింది. అన్ని సామాజిక వర్గాల వారికి ఈ అవకాశం కల్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను జారీ చేసింది. అర్హులు ఎవరంటే ● ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి (స్టేట్ సిలబస్ విధానం) 520 ఆపై మార్కులు, సీబీఎస్ఈ సిలబస్ విధానంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 430/500 సాధించి ఉండాలి. వీరు స్పెషల్ స్కాలర్షిప్ ప్రోగ్రాం, సెమీ స్కాలర్షిప్కు అర్హులు. ● పదో తరగతిలో స్టేట్ సిలబస్కు సంబంధించి ప్రైవేట్ పాఠశాలలో చదివిన విద్యార్థులు 550 ఆపై మార్కులు, సీబీఎస్ఈ సిలబస్ విధానంలో 450/500 ఆపై మార్కులు సాధించి ఉండాలి. వీరు సెమీ స్కాలర్షిప్ ప్రోగ్రాంకు అర్హులు. ● ఆర్డీటీ ప్రాజెక్ట్ ప్రాంతాల్లో నివసించే అన్ని కుటుంబాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ● సమాన మార్కులు వస్తే .. సైన్స్, మేథమేటిక్స్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ● కుటుంబ ఆర్థిక నేపథ్యాన్ని బట్టి ఎంపిక ఉంటుంది. ● ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ సంస్థల్లో మంచి స్థాయిల్లో ఉన్న కుటుంబాలకు చెందిన విద్యార్థులు అనర్హులు. ● నెలకు రూ.15 వేలు, ఆ లోపు వేతనం తీసుకుంటున్న చిరుద్యోగుల పిల్లలు మాత్రమే అర్హులు. వేతన ధృవీకరణ పత్రం సమర్పించాలి. 1,400 మందికి అవకాశం స్పెషల్ స్కాలర్షిప్ కింద 400 మందికి అవకాశం కల్పిస్తున్నారు. ఇంటర్మీడియట్, బీటెక్ వరకు (మొత్తం ఆరేళ్లు) కళాశాల ఫీజు, హాస్టల్ ఫీజు చెల్లిస్తారు. సెమీ స్కాలర్షిప్ కింద 1000 మందికి అవకాశం కల్పిస్తున్నారు. ఇంటర్మీడియట్ కోర్సులో ఏడాదికి రూ.40 వేలు చొప్పున రెండేళ్లు పాటు చెల్లిస్తారు. ఈ నెల 9 లోపు దరఖాస్తు చేసుకోవాలి ఆర్డీటీ స్పెషల్ స్కాలర్షిప్, సెమీ స్కాలర్షిప్కు దరఖాస్తు చేయడానికి ఈ నెల 9 వరకు అవకాశం ఉంది. పదో తరగతి హాల్టికెట్, పదో తరగతి మార్కుల జాబితా, విద్యార్థి, తల్లిదండ్రుల ఆధార్ కార్డు జిరాక్స్, ఇటీవల జారీ చేసిన రేషన్ కార్డు జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు (జిరాక్స్) అందజేయాలి. ఆయా ఆర్డీటీ ఏరియా కార్యాలయాల్లో సంప్రదించి.. దరఖాస్తులు అందజేయవచ్చు. ఆర్డీటీ సెట్లో కీలక మార్పులు స్పెషల్ స్కాలర్షిప్కు ఎంపికై తే ఆరేళ్ల వరకు నేరుగా విద్యా సంస్థకు ఫీజు చెల్లింపు సెమీ స్కాలర్షిప్కు ఎంపికై తే ఇంటర్మీడియట్ రెండేళ్లు ఏడాదికి రూ.40 వేల చొప్పున చెల్లింపు అన్ని సామాజిక వర్గాల వారికీ అవకాశం -
●నడకై నా నరకమే..
శింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలం పెనకచెర్ల డ్యాంకు వెళ్లే రహదారి పూర్తి అధ్వానస్థితికి చేరుకుంది. అడుగుకో గుంత చొప్పున కంకర తేలి రాకపోకలకు తీవ్ర అసౌకర్యంగా మారింది. ద్విచక్ర వాహనాల చక్రాల కింద రాళ్లు పడి అదుపు తప్పి వాహన చోదకులు కిందపడుతున్నారని, ఈ మార్గంలో కనీసం నడవాలన్నా ఇబ్బందిగా ఉంటోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరకప్రాయంగా మారిన రహదారి మరమ్మతుకు ఇప్పటికై నా ప్రజాప్రతినిధి చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం: -
రాష్ట్రం అప్పుల పాలు
ఉరవకొండ: సంక్షేమ పాలనను గాలికి వదిలేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మండిపడ్డారు. సంక్షేమ పథకాలు, అభివృద్ది గురించి ప్రశ్నిస్తారన్న భయంతో మంత్రులు, ఎమ్మెల్యేలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందంటూ ప్రజలను పెడదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కు ఇదొక పాటలా మారిందని ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందంటూ మంత్రి కేశవ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు, 1.35 లక్షల మందికి ఉద్యోగాల కల్పన, పేదల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా 10,032 విలేజ్ క్లినిక్లు, 10,778 రైతు భరోసా కేంద్రాలు, నాడు–నేడు ద్వారా 15,715 ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దడం, 17 మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం, మూడు పోర్టులు, ఒక ప్రైవేట్ పోర్టుతో సహ 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, అమ్మ ఒడితో 26.067 మందికి లబ్ధి చేకూర్చడం విధ్వంసం ఎలా అవుతుందో కేశవ్ చెప్పాలని ప్రశ్నించారు. దీంతో పాటు పేదలకు పక్కా గృహాలు, కోవిడ్ సంక్షోభంలోనూ వందశాతం సంక్షేమ ఫలాలు అందజేసి దేశంలోనే నంబర్ వన్ సీఎంగా వైఎస్ జగన్కు ఖ్యాతి దక్కిందన్నారు. వాస్తవానికి విధ్వంసం అనేది రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే మొదలైందన్నారు. అభివృద్ది పేరుతో వేల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని రాష్ట్ర ప్రజల నెత్తిన రుద్ది అమరావతి నిర్మాణం ముసుగులో దోపిడీ సాగిస్తున్నారని మండిపడ్డారు. పనులు చేయకుండానే కాంట్రాక్టర్లకు రూ5,500 కోట్లు ఎలా దోచి పెడతారంటూ నిలదీశారు. రూ.2,600 కోట్ల బకాయిలు చెల్లించకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని అటకెక్కించారన్నారు. 17 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ ఆధీనంలో చేపట్టకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. చంద్రబాబు పాలన ఎంత దరిద్రంగా ఉందో ప్రజలకు బాగా అర్థమై, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోయిందని పేర్కొన్నారు. ● ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి -
ముంచుకొస్తున్న నీటి ఎద్దడి
● జిల్లాలో 129 గ్రామాలో తాగునీటి సమస్య అనంతపురం టవర్క్లాక్: ఈ వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సరైన వర్షాలు లేకపోవడంతో నీటి వనరులు ఆవిరైపోతున్నాయి. భూగర్భజలాలు అడుగంటి బోర్లలో నీరు పైకి రావడం లేదు. దీంతో తాగునీటి ఎద్దడి ముంచుకొస్తోంది. జిల్లాలోని రాప్తాడు, శింగనమల, గుంతకల్లు నియోజకవర్గాల్లోని 129 గ్రామాలకు తాగునీటి సమస్య ఏర్పడింది. ఇప్పటికే చాలా గ్రామాల్లో నీటికోసం దూర ప్రాంతాలకెళ్లి తెచ్చుకుంటున్నారు. అతి త్వరలో 78 గ్రామాల్లో నీటి సమస్య తారస్థాయికి చేరనుంది. ● ఇక జిల్లా వ్యాప్తంగా 3,600 చేతిపంపులు ఉన్నాయి. వీటిలో కూడా చాలావరకు నీటిమట్టం పడిపోయింది. జల జీవన్ మిషన్ కార్యక్రమం కింద 2028 నాటికి ప్రతి ఇంటికీ శుద్ధమైన తాగునీరు సరఫరా చేయాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇప్పటికి జిల్లాలోని 1,071 గ్రామ పంచాయతీల పరిధిలో 77 గ్రామాల్లో అమలవుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు శ్రీరామరెడ్డి, సత్యసాయి తాగునీటి సరఫరా కార్మికులకు రూ.30 కోట్ల వేతనాలను గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందంటూ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఇటీవల విలేకరుల సమావేశంలో చెప్పారు. ఆయన చెప్పినది అవాస్తవమని తేలింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో బకాయిలు ఉంటే గత ప్రభుత్వంపైకి నెపం నెట్టి మంత్రి విమర్శలు మూటగట్టుకున్నారు. నీటి ఎద్దడి నివారణకు చర్యలు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. రాప్తాడు, శిగనమల, గుంతకల్లు నియోజకవర్గలో 78 గ్రామాలకు రాబోవు రోజుల్లో నీటి ఎద్దడి తలెత్తవచ్చు. ఆయా గ్రామాలకు ట్యాంకర్లతో తాగునీటి సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. జల్ జీవన్ కార్యక్రమం కింద నిర్దేశిత గడువులోపు ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తాం. తాగునీటి సరఫరా కార్మికులకు రెండు నెలలు మాత్రమే వేతనాలు బకాయిలు ఉన్నాయి. త్వరలోనే బకాయిలు చెల్లిస్తాం. – రేగులగడ్డ సురేష్, ఆర్డబ్ల్యూస్ ఎస్ఈ -
చీనీ రైతులు కంట తడి పెడుతున్నారు. ఏడాదిగా వర్షాలు లేవు, ఉష్ణోగ్రతలు 42 నుంచి 44 డిగ్రీలతో మండిపోతున్నాయి. రానురాను భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. బోర్లలో నీటి మట్టం బాగా తగ్గిపోతోంది. ఫలితంగా చీనీ చెట్లు నిలువునా ఎండుతున్నాయి. ఆశల సౌధం కళ్ల ముందే కుప్పకూ
కోటంకలో ఎండిపోయిన చీనీతోట అనంతపురం అగ్రికల్చర్/గార్లదిన్నె: చీనీ పంటకు అనంతపురం జిల్లా ప్రసిద్ధిగాంచింది. 91 వేల ఎకరాల విస్తీర్ణంలో చీనీ తోటలు విస్తరించాయి. ఫ్రూట్బౌల్ ఆఫ్ ఏపీగా, ఉద్యానహబ్గా పిలవబడుతోందంటే దానికి కారణం ప్రధానంగా చీనీ తోటలే. అత్యధికంగా గార్లదిన్నె మండలంలో 19 వేల ఎకరాలు, కూడేరు 10 వేలు, యల్లనూరు 9,900, పామిడి 5,900, నార్పల 5,000, శింగనమల 4,500, పుట్లూరు 4,400, రాప్తాడు 4,000, ఆత్మకూరు 3,850, అనంతపురం 3,820, బుక్కరాయసముద్రం 2,350, బెళుగుప్ప 1,800, కళ్యాణదుర్గం 1,600, గుత్తి 1,600, పెద్దవడుగూరు 1,500, కంబదూరు, తాడిపత్రి 1,000 ఎకరాలు సాగవుతోంది. గత రెండు సీజన్లు అంటే ఏడాదిన్నర కాలంగా టన్ను రూ.20 వేలకు మించి ధర లేకపోవడంతో గిట్టుబాటు ధరల్లేక రైతులు నష్టాలు మూటగట్టుకున్నారు. ఇప్పుడిప్పుడే ధరలు పెరిగినా ఇప్పటికే చాలా మంది రైతులు తక్కువకే పంటను అమ్మేసుకున్నారు. ఇప్పుడు భూగర్భజలాలు తగ్గిపోవడంతో చెట్లను కాపాడుకునేందుకు అవస్థలు పడుతున్నారు. ట్యాంకర్లతో నీటి తడులు అత్యధిక విస్తీర్ణంలో చీనీ సాగువుతున్న మండలం గార్లదిన్నె. ముకుందాపురం, కోటంక, మర్తాడు, సంజీవపురం, యర్రగుంట్ల, పెనకచెర్ల, బూదేడు, కమలాపురం, కొప్పలకొండ, గార్లదిన్నె, ముంటిమడుగు, క్రిష్ణాపురం, కనంపల్లి... ఇలా గ్రామ గ్రామాన చీనీ తోటలు ఉన్నాయి. 2019–2024 మధ్య కాలంలో భారీ వర్షాలు కురవడంతో ఆ ఐదేళ్లూ నీటి సమస్య లేకుండాపోయింది. అయితే గత రెండేళ్లుగా అనుకున్నస్థాయిలో వర్షాలు కురవకపోవడం, కురిసినా అకాలంలో పడటంతో భూగర్భజలాలు తగ్గుముఖం పట్టాయి. లైనింగ్తో మరింత నష్టం హంద్రీ–నీవా కాలువకు కాంక్రీట్తో లైనింగ్ చేయడం వల్ల జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పాతాళగంగ పైకి రావడం లేదు. దీంతో బోర్లలో నీళ్లు అడుగంటాయి. 700 నుంచి 1000 అడుగుల లోతు వరకు కొత్తగా బోర్లు వేయిస్తున్నా చాలా వరకు ఫెయిల్ అవుతున్నాయి. దీంతో చీనీ తోటలను కాపాడుకునేందుకు ట్యాంకర్ నీటికి రూ.వెయ్యి చొప్పున వెచ్చించి తడులు ఇస్తున్న పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా ముకుందాపురం, మర్తాడు, కోటంక గ్రామాల పరిధిలో చీనీతోటలు నీటి సమస్యను బాగా ఎదుర్కొంటున్నట్లు రైతులు చెబుతున్నారు. ఈ మూడు గ్రామాల మధ్యలో అటవీప్రాంతం ఉండటం, కొంచెం మిట్ట ఉండటం, అలాగే ఒట్టికుంట అనే చిన్నపాటి చెరువు పూర్తిగా ఎండిపోవడం వల్ల సమస్య జఠిలంగా మారిందని అంటున్నారు. నీళ్లు లేక అవస్థలు పడుతున్న తోటి రైతుల కష్టాలను కళ్లారా చూస్తున్న మర్తాడుకు చెందిన ఆదర్శ రైతు తాతిరెడ్డి మానవత్వంతో తన తోటలోని బోర్ల నుంచి ట్యాంకర్లకు ఉచితంగా నీరందిస్తున్నారు. తగినన్ని నీళ్లు లేకపోవడం, మండే ఎండలకు వేరుకుళ్లు, ఎండుతెగులు వల్ల పెద్ద పెద్ద చెట్లు సైతం నిలువునా ఎండిపోతున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తోటలను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీటి సరఫరా భూగర్భజలాలు అడుగంటి, బోర్లలో నీళ్లు తగ్గిన దుస్థితి చాలా ప్రాంతాల్లో నీళ్లు లేక నిలువునా ఎండుతున్న చెట్లు జిల్లా వ్యాప్తంగా 91 వేల ఎకరాల విస్తీర్ణంలో పంట సాగు -
సింహ వాహనంపై నృసింహుడు
ఉరవకొండ రూరల్: ప్రసిద్ధి చెందిన పెన్నహోబిలం లక్ష్మీ నృసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామి వారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత నృసింహస్వామిని వివిధ పుష్పాలతో అలంకరించి సింహ వాహనంపై కొలువుదీర్చారు. డప్పు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయం చుట్టూ ఊరేగించారు. స్వామివారిని తిలకించిన భక్తులు తన్మయత్వం చెందారు. కార్యక్రమానికి సురేంద్ర కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. ● బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం స్వామి వారు చంద్రప్రభ వాహనంపై ఊరేగారు. జల్లిపల్లికి చెందిన వెంకట రెడ్డి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఈఓ సాకే రమేష్ బాబు, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పీటీసీ ప్రిన్సిపాల్గా సుప్రజ అనంతపురం సెంట్రల్: పోలీసు ట్రైనింగ్ కళాశాల (పీటీసీ) ప్రిన్సిపాల్గా ఈ.సుప్రజ నియమితులయ్యారు. ప్రస్తుతం విజయవాడ ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆమెను అనంతపురం పీటీసీకి ప్రిన్సిపాల్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.2010లో పోలీసుశాఖలో డీఎస్పీగా నియమితులైన ఆమె గతంలో గుంతకల్లు డీఎస్పీగా పనిచేశారు. అనంతరం అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందారు. త్వరలో ఆమె బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. ఈతకు వెళ్లి విద్యార్థి మృతి బెళుగుప్ప: మండలంలోని శ్రీరంగాపురంలోని అంబేడ్కర్ కాలనీలో నివాసముంటున్న తిమ్మరాజు, గంగమ్మ దంపతుల కుమారుడు ప్రణయ్(8) గ్రామ సమీపంలోని చెరువులోకి గురువారం ఈతకు వెళ్లి నీట మునిగి మృతి చెందాడు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి ఈత కొడుతూ లోతు ఎక్కువ ఉన్న ప్రాంతానికి వెళ్లి నీట మునిగి పోయాడు. విషయం తెలుసుకున్న కాలనీ వాసులు అక్కడకు చేరుకుని గాలించి వెలికి తీసే లోపు ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పిడుగుపాటుకు వ్యక్తి మృతి పెద్దవడుగూరు: పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని తెలికి గ్రామంలో జరిగింది. వివరాలు... తెలికి గ్రామానికి చెందిన గొర్రెల కాపరి బోయ సాంబశివుడు (48) గురువారం సాయంత్రం సమీప పొలాల వైపు తన గొర్రెలను మేపునకు తీసుకెళ్లాడు. అదే సమయంలో ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వర్షం కురవడంతో చెట్టు కిందకు వెళ్లాడు. చెట్టుపై పిడుగు పడడంతో అక్కడికక్కడే సాంబశివుడు మృతి చెందాడు. చీకటి పడినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పొలాల్లో గాలించగా విగతజీవిగా కనిపించాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బీటెక్ ఫలితాల విడుదల అనంతపురం: జేఎన్టీయూ (ఏ) క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాల పరిధిలో బీటెక్ నాల్గో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–20) రెగ్యులర్ ఫలితాలను ప్రిన్సిపాల్ పి.చెన్నారెడ్డి గురువారం విడుదల చేశారు. ఫలితాల కోసం కళాశాల అకడమిక్ సెక్షన్లో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో జేఎన్టీయూ పాలకమండలి సభ్యుడు డాక్టర్ ఎం.రామశేఖరరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ దిలీప్కుమార్, ప్రొఫెసర్ ఇన్చార్జ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కె.మాధవి, డాక్టర్ జరీనా, డాక్టర్ జయలక్ష్మి, హెచ్ఓడీలు ఆర్.రాజశేఖర్, కళ్యాణికుమార్, కె.కళ్యాణి రాధ తదితరులు పాల్గొన్నారు. -
మేమూ తగ్గేదే లే..
అనంతపురం ఎడ్యుకేషన్: లక్షల రూపాయలు ఖర్చు చేసి కార్పొరేట్ పాఠశాలల్లో చదివితేనే మంచి ఫలితాలు వస్తాయనే భావనను చెరిపేస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు తమ ప్రతిభతో సత్తా చాటారు. పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ బడి పిల్లలు మెరిసిపోతూ ‘మేము కూడా తగ్గేదే లేదు’ అని నిరూపించారు. గార్లదిన్నె మండలం కల్లూరు ఆర్ఎస్ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థిని రామగౌని హారిక 600లకు గానూ 592 మార్కులు సాధించి ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి టాప్లో నిలవగా... జిల్లాలో 19 మంది విద్యార్థులు 585, ఆపైన మార్కులు సాధించారు. దారి చూపిన ‘మనబడి నాడు–నేడు’ గత కొన్నేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో జరిగిన మార్పులు ఈ ఫలితాలకు కారణమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ‘మనబడి నాడు–నేడు’ కార్యక్రమంతో పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ బోధన, తాగునీరు, శౌచాలయాలు వంటి సదుపాయాలు కల్పించడంతో విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో చదువుకునే అవకాశం లభించింది. విద్యార్థుల విజయంలో టీచర్ల పాత్ర కీలకం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు అదనపు సమయం కేటాయించి, ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించడం ఈ ఫలితాలకు కారణమైంది. విజేతలలో చాలా మంది సామాన్య కుటుంబాలకు చెందినవారే. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించడం వారి పట్టుదలను తెలియజేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాణ్యమైన విద్య అందుతుందని, సరైన మార్గదర్శనం చేస్తే ఎవరైనా విజయాన్ని సాధించగలరని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. -
ఆ విద్యార్థి పాస్
శింగనమల: ప్రమాదంలో మృతి చెందిన పదో తరగతి విద్యార్థి పరీక్షల్లో 488 మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. వివరాల్లోకి వెళితే.. శింగనమల మండలం చక్రాయిపేట గ్రామానికి చెందిన శర్మస్వలి (16) గత నెల 21న చోటు చేసుకున్న ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. శర్మస్ వలి సి.బండమీదపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతూ మార్చిలో శింగనమల సెంటర్లో పరీక్షలు రాశాడు. గురువారం ఫలితాలు వెలువడ్డాయి. 488 మార్కులు సాధించాడని తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం యాడికి: మండలంలోని నిట్టూరు గ్రామానికి చెందిన వెంకటరమణ కుమార్తె అపర్ణ గురువారం ఆత్మహత్యకు యత్నించింది. పదో తరగతిలో అన్ని సబ్జెక్ట్లూ ఉత్తీర్ణత సాధించిన ఆమె సైన్స్ సబ్జెక్ట్లో మాత్రం 34 మార్కులే రావడంతో ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అనంతపురం తరలించారు. -
లక్ష్యాలను అధిగమించాలి
● అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశం అనంతపురం అర్బన్: ‘‘సంక్షేమ శాఖలకు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలి. కార్పొరేషన్ల పరిధిలో రుణ రికవరీపై దృష్టి సారించండి. హెచ్పీటీఎస్ (హైజీన్, పోటబిలిటీ అండ్ టాయ్లెట్ శానిటేషన్) యాప్ను అధికారులు రోజూ మానిటర్ చేయాలి. ఫొటోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలి’’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. సంక్షేమ శాఖల పనితీరుపై కలెక్టర్ గురువారం కలెక్టరేట్లో మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే నెలాఖరుకు పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తవ్వాలన్నారు. నీటి సరఫరా లేకపోతే సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి కొళాయి కనెక్షన్ తీసుకోవాలని ఆదేశించారు. వసతి గృహాలను అధికారులు తనిఖీ చేయాలన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో పనితీరు మెరుగుపర్చుకునేలా వార్డెన్లకు దిశానిర్దేశం చేయాలని ఆదేశించారు. ఏడాదికి సంబంధించి ప్రతి మూడు నెలల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి అందించాలన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులకు వంద శాతం యూడీఐడీ కార్డులను మే నెలాఖరుకు అందించాలని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో రూ.16 కోట్ల వరకు రుణాలు ఇచ్చారని, వాటి వసూలు వేగవంతం చేయాలన్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ, ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో రుణాల రికవరీ లక్ష్యం నిర్దేశించుకుని వసూలుపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. పదో తరగతి ఫలితాలపై విశ్లేషించుకుని ఎందుకు వెనుకబడ్డామో కారణాలు తెలుసుకోవాలని ఆదేశించారు. జిల్లాలోని తిమ్మాపురం పాఠశాలను తనిఖీ చేయాలని, అక్కడ వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా నిర్వహించారనేది పరిశీలించాలని చెప్పారు. సమావేశంలో సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల అధికారి ఖుష్బూ కొఠారి, డీపీఓ, ఇన్చార్జ్ జెడ్పీ సీఈఓ నాగరాజునాయుడు, డీటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు, డీఎండబ్ల్యూఓ రామసుబ్బారెడ్డి, ఎస్ఎస్ఏ ఏపీసీ శైలజ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కుముద, బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్రమణ్యం, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ అర్చన, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ విశ్వనాథరెడ్డి, జెడ్ఎస్డబ్ల్యూఓ గిరీష్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఆగిన రెడ్క్రాస్ ఎన్నికలు
అనంతపురం అర్బన్: రెడ్క్రాస్ జిల్లా కమిటీ ఎన్నికలు గందరగోళం మధ్య ఆగిపోయాయి. ఏకగ్రీవంగా కమిటీ ఎన్నికవ్వాలే తప్ప ప్రత్యక్షంగా ఎన్నికలు నిర్వహించడం కుదరదనే దానిపై వివాదం రాజుకుంది. ఇదెక్కడి తీరంటూ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన అభ్యర్థులు తీవ్ర నిరసన తెలిపారు. కమిటీని తమ చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. పరిస్థితి రాష్ట్ర కమిటీ దృష్టికెళ్లడం.. అక్కడినుంచి వచ్చిన సూచనల మేరకు ఎన్నికలను అధికారులు వాయిదా వేశారు. ఏమి జరిగిందంటే... కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో బుధవారం రెడ్క్రాస్ జిల్లా కమిటీ వార్షిక సమావేశం నిర్వహించారు. 11 మంది మేనేజ్మెంట్ సభ్యుల నూతన కమిటీ ఎన్నికకు అవసరమైన ప్రక్రియను నిర్వహించేందుకు సమాయత్తం అయ్యారు. ఎన్నికల అధికారిగా ఎఫ్ఎస్ఓ రామకృష్ణా రెడ్డి వ్యవహరించారు. ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర కమిటీ నుంచి కె.జి.గోవిందరెడ్డి హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి నామినేషన్ ప్రక్రియను ఎన్నికల అధికారి చేపట్టారు. దీంతో నాలుగు ప్యానెళ్లు డాక్టర్ లక్ష్మణ ప్రసాద్, సుంకర రమేష్, ఎం.రాజ్కుమార్, ఎం.జి.వీరన్న ప్యానెళ్లు బరిలోకి దిగాయి. వీటితో పాటు వ్యక్తిగతంగా 20 మంది అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు సిద్ధపడ్డారు. అభ్యంతరంతో వివాదం రెడ్క్రాస్ సొసైటీ మేనేజ్మెంట్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడమే తప్ప ప్రత్యక్ష ఎన్నికలు జరపడం ఉండదంటూ ఎన్నికల అధికారికి కొందరు లిఖిత పూర్వకంగా అభ్యంతరం తెలిపారు. బరిలోకి దిగిన అభ్యర్థులు దీన్ని వ్యతిరేకించారు. ఎన్నిక ఏకగ్రీవంగా జరగాలన్నప్పుడు ఓటరు రిజిస్ట్రేషన్, నామినేషన్ తతంగం ఎందుకు అంటూ ఎన్నికల అధికారిని ప్రశ్నించారు. దీంతో వివాదం చోటుచేసుకుంది. పరిస్థితిని రాష్ట్ర పరిశీలకుని ద్వారా రాష్ట్ర కమిటీ దృష్టికి ఎన్నికల అధికారి తీసుకెళ్లారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎన్నికలను అధికారులు వాయిదా వేశారు. చెప్పుచేతల్లో ఉంచుకునేందుకే.. రెడ్క్రాస్ సొసైటీని తమ చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు కొద్దిమంది వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని పలువురు సభ్యులు విమర్శించారు. సమావేశం, ఎన్నికల గురించి సభ్యులందరికీ సమాచారం ఇవ్వలేదని చెబుతున్నారు. సొసైటీలో మొత్తం 2,353 మంది సభ్యులు ఉంటే 167 మంది మాత్రమే సమావేశానికి హాజరవడం ఇందుకు నిదర్శనమన్నారు. ఈసారైనా ఇంత మంది వచ్చారని, గతంలో అయితే తమకు అనుకూలంగా ఉన్న 20 మంది లేదా 30 మందిని రప్పించుకోవడం.. ముందే నిర్ణయించుకున్న వ్యక్తులను సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకోవడం పరిపాటిగా ఉండేదని పలువురు విమర్శించారు. అయితే ఈసారి ఎన్నికల బరిలో నాలుగు ప్యానెళ్లతో పాటు మరో 20 మంది అభ్యర్థులు వేరుగా నామినేషన్ వేయడంతో ఏకగ్రీవ ఎన్నిక ఎత్తు పారలేదని పలువురు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. బరిలో నాలుగు ప్యానెళ్లు వ్యక్తిగతంగా మరో 20 మంది నామినేషన్ ప్రక్రియపై కొందరు లఖితపూర్వ అభ్యంతరం రాష్ట్ర కమిటీ సూచనలతో వాయిదా -
●గాలివాన బీభత్సం
● రూ.25 లక్షలకు పైగా నష్టం గుత్తి రూరల్: మండలంలోని ఊటకల్లు, ఊబిచెర్ల, గ్రామాల్లో మంగళవారం రాత్రి గాలి, వాన బీభత్సం సృష్టించింది. గంట పాటు ఏక బిగిన భారీగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో రైతులు, ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రెండు గ్రామాల్లోనూ సుమారు 125 ఎకరాల్లో 10 నుంచి 12 సంవత్సరాల వయస్సున్న చెట్లకు కాసిన మామిడి కాయలు నేలరాలాయి. కాపు చేతికొచ్చే సమయం కావడం, ప్రస్తుతం మార్కెట్లో టన్ను మామిడి ధర రూ.40వేలు ఉండటంతో ఇక తమ కష్టాలు గట్టెక్కుతాయని భావించిన తమను గాలి, వాన రూపంలో కోలుకోలేని దెబ్బ తీసిందని ఊటకల్లు రైతులు బాలన్న, శ్రీరాములు, చంద్రశేఖర్రెడ్డి, సూర్యప్రకాష్రెడ్డి, నాగరాజు, ఊబిచెర్ల రైతు లక్కిరెడ్డి శేఖర్ వాపోయారు. నేలరాలిన మామిడికాయల ధర టన్ను రూ.10 వేలకు మించి పోదని, దీంతో తమకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. మండల వ్యాప్తంగా భారీ గాలులకు మామిడికాయలు నేలరాలి రూ.25 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
లారీ డ్రైవర్ దుర్మరణం
రాప్తాడు రూరల్: మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో లారీ డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం కొత్తవారిపల్లి గ్రామానికి చెందిన బి.భాస్కర్రెడ్డి (32) కర్ణాటకలోని బాగేపల్లి తాలూకా పొట్టోళ్లపల్లిలో నివాశముంటూ లారీ డ్రైవరుగా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కేఏ40బీ 7198 నంబర్ గల లారీలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు గ్రానైట్ లోడుతో బయలుదేరిన భాస్కరరెడ్డి బుధవారం తెల్లవారుజామున రాప్తాడు మండలం హంపాపురం సమీపంలోని ఎస్వీఐటీ కళాశాల వద్దకు చేరుకోగానే 44వ జాతీయ రహదారిపై ముందు వెళుతున్న సిమెంట్ లారీని వెనుక నుంచి ఢీకొన్నాడు. ప్రమాదతీవ్రతకు గ్రానైట్ బలంగా క్యాబిన్ను తాకడంతో క్యాబిన్ ఛిద్రమైంది. డ్రైవరు భాస్కరరెడ్డి అందులో ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గంటకు పైగా శ్రమించి మృతదేహన్ని వెలికి తీసి అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. మృతుడి వద్ద లభించిన ఆధారాల మేరకు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కాగా నిద్రమత్తు కారణంగా ఈ ఘటన చోటు చేసుకుని ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై రాప్తాడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
గుండెపోటుతో ఆరేళ్ల చిన్నారి మృతి
యాడికి: మండలంలోని చందన గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కుమ్మర ఆంజనేయులు, అనిత దంపతుల కుమార్తె నైనిక (6) గుండె పోటుతో మృతి చెందింది. నైనిక ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. వేసవి సెలవులు కావడంతో బుధవారం ఉదయం 11 గంటలకు గ్రామ సమీపంలో ఆడుకుంటూ ఉన్నఫళంగా కుప్పకూలిపోయింది. తల్లిదండ్రులు వెంటనే రాయలచెరువులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటు కారణంగా చిన్నారి మృతి చెందినట్లు నిర్ధారించారు. గంజాయి ముఠా అరెస్ట్ ● 10.55 కేజీల గంజాయి స్వాధీనం తాడిపత్రి టౌన్: తాడిపత్రి మీదుగా సూరత్కు గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం తాడిపత్రి పోలీస్ స్టేషన్లో ఏఎస్పీ రోహిత్కుమార్ మీడియాకు వెల్లడించారు. ఒడిశాకు చెందిన బలరాం స్వామ్స్ ఓ మైనర్తో కలిసి ఒడిశా నుంచి గంజాయిని తాడిపత్రి మీదుగా సూరత్కు సరఫరా చేస్తున్నారు. ఇందులో భాగంగా సూరత్కు రైలులో గంజాయి తీసుకెళ్తుండగా అందిన సమాచారం మేరకు తాడిపత్రి పోలీసులు బుధవారం రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన బలరాం స్వామ్స్తో పాటు మైనర్ బాలుడిని సోదా చేయగా వారి వద్ద 10.55 కేజీల గంజాయి దొరకడంతో స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు మైనర్ కావడంతో తదుపరి చర్యల కోసం కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. చాకచక్యంగా ముఠాను పట్టుకున్న కానిస్టేబుల్ గోవిందుకు రివార్డు అందజేశారు. కార్యక్రమంలో సీఐ ఆరోహణరావు, ఎస్ఐ దయాకర్రెడ్డి, ఏఎస్ఐ హనుమంతు తదితరులు పాల్గొన్నారు. తాగునీటి సమస్యపై ప్రత్యేక కంట్రోల్ రూమ్ అనంతపురం ఎడ్యుకేషన్: వేసవి దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా సంబంధిత ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్రజలు నేరుగా ఈ కంట్రోల్ రూమ్ను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని డీపీఓ నాగరాజనాయుడు పేర్కొన్నారు. ఫిర్యాదులను వెంటనే సంబంధిత అధికారులకు చేరవేసి తక్షణ పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సేవలు రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రజలు 95504 80972 నంబర్కు కాల్ చేసి సమస్యలను తెలియజేయవచ్చన్నారు. పెన్నహోబిలం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ ఉరవకొండ రూరల్: ప్రసిద్ధ పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు బుధవారం అంకురార్పణ జరిగింది. ఉదయం స్వామి వారి మూలవిరాట్కు సుప్రభాత సేవల్లో భాగంగా ప్రత్యేక అభిషేకాలు, అలంకరణలు, పూజలు చేశారు. అనంతరం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజస్తంభం వద్ద ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. సాయంత్రం ప్రాకారోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ రేగాటి నాగరాజు, ఈఓ సాకే రమేష్ బాబు, అర్చకులు ద్వారకనాథాచార్యులు, బాలాజీస్వామి పాల్గొన్నారు. జేడీఏగా సవ్యార్నంద్ అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ (జేడీఏ)గా ఎస్.బ్లాక్థిల్ సవ్యార్నంద్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్ అఫిషియో స్పెషల్చీఫ్ సెక్రటరీ రాజశేఖర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న సవ్యార్నంద్కు అడహాక్ కింద జేడీఏగా పదోన్నతి కల్పించి జిల్లాకు బదిలీ చేశారు. అయితే ఆయన డిప్యుటేషన్ మీద అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో)గా పనిచేయనున్నట్లు జీవోలో పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లా జేడీఏ ఇన్చార్జ్గా ముదిగల్లు రవి కొనసాగుతున్నారు. జిల్లాకు రెగ్యులర్ జేడీఏ నియమితులైనా...ఆయన డిప్యుటేషన్ తీసుకోవడంతో ప్రస్తుతమున్న రవి మరికొద్ది కాలం కొనసాగనున్నారు. -
ఏసీబీ వలలో వీఆర్వో
● రైతు నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం ఏసీబీకి చిక్కిన వీఆర్వో రామకృష్ణ, తహసీల్దార్ సోమశేఖర్ను విచారణ చేస్తున్న ఏసీబీ అధికారులు తాడిపత్రి టౌన్: తాడిపత్రి మండలం ఆవులతిప్పాయిపల్లి గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో) రామకృష్ణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలకు చిక్కాడు. రైతు నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఆవులతిప్పాయిపల్లికి చెందిన ప్రభాకర్రెడ్డి తాడిపత్రిలో నివాసముంటూ కూలి పనులు చేస్తూ జీవనం సాగుస్తున్నాడు. ఇతనికి స్వగ్రామమైన ఆవుల తిప్పాయిపల్లిలో సర్వే నంబర్ 37లో వారసత్వంగా సంక్రమించిన 87 సెంట్ల భూమి ఉంది. దీన్ని అండగల్లో మిగులు భూమిగా చూపడంతో సరిచేయాలని ఐదు నెలలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. వీఆర్వో రామకృష్ణను సంప్రదించగా.. రూ.లక్ష లంచం ఇస్తేనే సరిచేస్తానని చెప్పాడు. అంత ఇచ్చుకోలేనని ప్రభాకర్రెడ్డి చెప్పగా.. చివరకు రూ.30 వేలకు బేరం కుదుర్చుకున్నాడు. ఈ మొత్తం కూడా ఇవ్వడం ఇష్టలేని రైతు ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వీఆర్వోను వలపన్ని పట్టుకోవడానికి ఏసీబీ అధికారులు ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగా బుధవారం తాడిపత్రి పట్టణ శివారులోని కడపరోడ్డులో ఉన్న ఓ టీ కేఫ్లో రైతు ప్రభాకర్రెడ్డి రూ.30 వేల నగదును వీఆర్వోకు అందజేస్తుండగా ఏసీబీ డీఎస్పీ ప్రసాద్రెడ్డి, సీఐ హమీద్ఖాన్ రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం వీఆర్వోను తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేశారు. తహసీల్దార్ సోమశేఖర్ను సైతం విచారించారు. -
ఈత .. కారాదు గుండెకోత
● బెళుగుప్ప మండలం జీడిపల్లి రిజర్వాయర్ కాలువ సమీపంలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఏడో తరగతి విద్యార్థి విజయ్కుమార్ ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. రాయదుర్గం: జిల్లాలోని రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల పరిధిలో ప్రవహిస్తున్న వేదవతి హగరితో పాటు, బీటీపీ, పీఏబీఆర్, జీడిపల్లి రిజర్వాయర్లు, మైనర్, మేజర్ ఇరిగేషన్ చెరువులు, బావుల్లో నీటి నిల్వలు ఉన్నాయి. బీటీపీ కుడి, ఎడమ కాలువలు నిండుగా పారుతున్నాయి. వేసవి తాపం తట్టుకునేందుకు ఆయా గ్రామాల పరిధిలో విద్యార్థులు ఈతకు కాలువల్లో దిగుతున్నారు. గంటల తరబడి నీటిలోనే ఉంటున్నారు. మరి కొందరు వేదవతి హగరిల్లో ఈత కొట్టేందుకు వెళ్తున్నారు. నీటి లోతును తక్కువగా అంచనా వేసి ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. కనిపించని హెచ్చరిక సూచికలు బీటీ ప్రాజెక్ట్లో ఈత కోసం వెళ్లి మృత్యుఒడికి చేరే వారి సంఖ్య క్రమంగా ఎక్కువవుతోంది. పంట కాలువలు, వేదవతి హగరిల్లోనూ అలాంటి ఘటనలే కనిపిస్తున్నాయి. పర్యాటకులు, సరదాగా వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువే. సెల్పీలు, ఫొటోలు దిగుతూ నీటి అంచుల్లో వినోదాన్ని ఆస్వాదిస్తుంటారు. ఈ క్రమంలో అనుకోకుండా నీటిలో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. నీరుండే రిజర్వాయర్లు, చెరువులు, హగరి వద్ద హెచ్చరిక సూచికలు లేకపోవడంతో లోతు ఎంతుందో తెలియక ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాగ్రత్తలు తప్పనిసరి ● చెరువులు, నది పరివాహక ప్రాంతాల్లో మట్టి, ఇసుక కోసం తీసిన గోతుల్లో నీరు చేరుకోవడంతో లోతు ఎంతుందో తెలియదు. ఇలాంటి సమయంలో గోతులు ఎక్కడ ఉంటాయో తెలుసుకుని అప్రమత్తంగా వ్యవహరించాలి. రిజర్వాయర్లు, చెరువుల్లో చేపల కోసం అమర్చిన వలలు ఉంటాయి. అందులో చిక్కుకుని ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. ● కాలువల్లో నీటి ప్రవాహ వేగం అంచనా వేయలేం. ప్రవాహ వేగం ఎక్కువగా ఉంటే ఈత వచ్చిన వారు సైతం కొట్టుకుపోయో ప్రమాదం ఉంది. ● ఈత రాని వారు తేలికై న ట్యూబ్లు, బెండ్లు వినియోగించాలి. వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఈత నేర్చుకునే వారు లోతు తక్కువగా ఉన్న ప్రదేశాలనే ఎంపిక చేసుకోవాలి. ● ఈత కొట్టే సమయంలో సరదాలు, పందేలు, అత్యుత్సాహం, సెల్ఫీలు తీసుకోవడం మంచిదికాదు. విషాదం కారాదు అవగాహన లేని ఈత సరదా చాలా మంది కుటుంబాల్లో విషాదం నింపుతోంది. ఈతకెళ్లిన సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. నీటి లోతు తెలియకుండా దిగడం ప్రమాదకరం. నీటి వనరుల వద్ద సెల్ఫీలు దిగడం మంచిది కాదు. పాఠశాలలకు వేసవి సెలవుల నేపథ్యంలో బీటీపీ వద్ద పోలీసు గస్తీ పెంచాం. పర్యాటకుల్ని అప్రమత్తం చేసేలా జాగ్రత్తలు తీసుకున్నాం. సంబంధిత అధికారులతో చర్చించి నీటి వనరుల వద్ద హెచ్చరికబోర్డులు కూడా ఏర్పాటు చేయిస్తాం. వేసవి సెలవులు కావడంతో పిల్లలను తల్లిదండ్రులు కూడా ఓ కంట కనిపెట్టాలి. – వెంకటరమణ, సీఐ, రాయదుర్గం గుమ్మఘట్ట మండలం కోనాపురం గ్రామానికి చెందిన విద్యార్థి శరత్ తన తల్లిదండ్రులతో కలిసి బెంగళూరుకు వలస వెళ్లాడు. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తుండగా అక్కడే పదో తరగతి చదువుకుంటున్నాడు. వేసవి సెలవులు కావడంతో రాయదుర్గం మండలం వేపరాళ్ల గ్రామంలో ఉండే అమ్మమ్మ ఇంటికి ఇటీవల వచ్చాడు. రెండు రోజుల క్రితం వేదవతి హగరిలో సరదాగా ఈతకు వెళ్లాడు. నీటిలో ఆడుకుంటూ లోతైన గుంతలోకి వెళ్లడంతో ఈత రాక నీట మునిగి మృతి చెందాడు. డి.హీరేహాళ్ మండలం బాదనహాళ్ వద్ద రెండు రోజుల క్రితం నీటి గుంతలో ఈతకు వెళ్లిన కర్ణాటకలోని నాగసముద్రానికి చెందిన టైలర్ హంపన్న మృతి చెందాడు. కల్యంలోని బందువుల ఇంట్లో పెళ్లి వేడుకలకు వచ్చి సరదగా ఈతకు వెళ్లాడు. గుంత లోతు తెలియక బురదలో కూరుకుపోయి ప్రాణాలు వదిలాడు. .. ఇలా ఈ మూడు ఘటనలే కాదు.. వేసవి వచ్చిందంటే చాలు జిల్లాలోని ఏదో ఓ చోట విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈత సరిగా రాక ప్రమాదాలు ప్రతి వేసవిలోనూ ఇలాంటి ఘటనలు పునరావృతం తల్లిదండ్రులకు కడుపుకోత మృతుల్లో పిల్లలు, యువకులే అధికం -
అరటి తోట దగ్ధం
కూడేరు: మండలంలోని చోళసముద్రానికి చెందిన రైతు ప్రవీణ్ సాగు చేసిన అరటి తోట మంటల్లో కాలిపోయింది. కడదరకుంట గ్రామం సమీపంలో తనకున్న ఏడున్నర ఎకరాల పొలంలో 12,800 అరటి చెట్లను రైతు పెంచుతున్నాడు. ఈ క్రమంలో ప్రవీణ్ తోట పక్కనే ఉన్న రైతు తన పొలం గట్టును శుభ్రం చేసుకునే క్రమంలో ఎండు గడ్డికి బుధవారం నిప్పు రాజేశాడు. దీంతో మంటలు చెలరేగి ప్రవీణ్ అరటి తోటను చుట్టుముట్టాయి. గమనించిన చుట్టుపక్కల రైతులు మంటలు అర్పే లోపు 3 వేల అరటి చెట్లు, డ్రిప్ పైపులు, పరికరాలు కాలిపోయాయి. ఘటనతో రూ.6 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వివాహిత ఆత్మహత్య తాడిపత్రి రూరల్: స్థానిక గన్నెవారిపల్లి కాలనీలో నివాసముంటున్న వివాహిత గంగాపావని (19) ఆత్మహత్య చేసుకుంది. గంగాపావని, సాయి ప్రేమించి 7 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి రెండు కుటుంబాలకు ఇష్టం లేదు. ఈ కారణంగా తరుచుగా రెండు కుటుంబాల మధ్య గొడవలు చోటు చేసుకునేవి. దీంతో మనస్తాపానికి గురైన గంగాపావని బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి వెంకటనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శివగంగాధరరెడ్డి తెలిపారు. నేటితో ముగియనున్న శాప్ ఫుట్బాల్ టోర్నీ అనంతపురం: ఆర్డీటీ స్టేడియంలో నిర్వహిస్తున్న శాప్ ఫుట్బాల్ టోర్నీ గురువారంతో ముగియనుంది. బుధవారం జరిగిన మ్యాచ్ల్లో అండర్–15 బాలుర విభాగంలో ముందంజలో అన్నమయ్య, నెల్లూరు, శ్రీసత్యసాయి, తిరుపతి, ఏలూరు, పల్నాడు, శ్రీకాకుళం, అనంతపురం, నెల్లూరు, కృష్ణా జట్లు ఉన్నాయి. అలాగే బాలికల విభాగంలో నెల్లూరు, కర్నూలు, అనంతపురం, ఏలూరు, అన్నమయ్య జట్లు, అండర్–21 పురుషుల విభాగంలో అల్లూరి సీతారామరాజు, తిరుపతి, ఏలూరు, అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం, శ్రీసత్యసాయి, తిరుపతి, గుంటూరు, అన్నమయ్య, మహిళా విభాగంలో అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనంతపురం, కర్నూలు జట్లు ముందంజలో ఉన్నాయి. ఆక్సిజన్ అందక అపస్మారక స్థితిలోకి వెళ్లిన కూలీలు తాడిపత్రి రూరల్: స్థానిక సంజీవనగర్లోని వాటర్ ట్యాంక్ లోపల పెయింట్ కొడుతూ ఊపిరి అందక ఇద్దరు కూలీలు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల తాగునీటి అవసరాల కోసం సంజీవనగర్లో వాటర్ ట్యాంక్ నిర్మాణం జరుగుతోంది. ట్యాంకు లోపలి భాగంలో పెయింట్ వేసే పనిని ఉత్తరప్రదేశ్కు చెందిన ముగ్గురు కూలీలు ఒప్పుకున్నారు. ఈ క్రమంలో బుధవారం కూలీలు అర్జున్కుమార్, రామ్చరణ్ ట్యాంక్ లోపల దిగి పెయింట్ వేస్తుండగా ఆక్సిజన్ తక్కువై ఊపిరి అందక కేకలు వేస్తూ కుప్పకూలిపోయారు. ట్యాంక్ పైభాగంలో ఉన్న మరో కూలీ విషయాన్ని వెంటనే మేసీ్త్రకి ఫోన్ చేసి తెలిపాడు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక ఎస్ఐ మోహన్బాబు, సిబ్బంది అక్కడకు చేరుకుని అపస్మారక స్థితికి చేరుకున్న కూలీలను అతి కష్టంపై వెలికి తీసుకువచి, అంబులెన్స్ ద్వారా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చీటింగ్ కేసు నమోదు తలుపుల: డబ్బు ఇవ్వకుండా మోసం చేసిన ఇద్దరిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను బుధవారం వెల్లడించారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం మూడిళ్లపల్లికి చెందిన రామాంజనేయులు, ఓబులరెడ్డి తలుపుల మండలం సంగటివారిపల్లికి చెందిన మల్లినాయుడు వద్ద గత ఏడాది జనవరిలో 105 పొట్టేళ్లను రూ.11.20 లక్షలతో కొనుగోలు చేశారు. అప్పట్లో రూ.4.20 లక్షలు అడ్వాన్స్గా చెల్లించారు. ఈ క్రమంలో మిగిలిన డబ్బు చెల్లించకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. గట్టిగా అడిగితే బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు రామాంజనేయులు, ఓబులరెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చెన్నయ్య తెలిపారు. -
జీతం బకాయిలు చెల్లించండి
● ఇన్చార్జ్ డీఎంహెచ్ఓకు ఏపీ ఎన్జీఓ ఉద్యోగుల వినతి అనంతపురం: వైద్య, ఆరోగ్య శాఖలో ఆప్కాస్ కింద పనిచేస్తున్న 12 మంది ఎఫ్ఎన్ఓ, శానిటరీ వర్కర్లు, అటెండర్లకు ఆరు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, తక్షణమే జీతం బకాయిలు చెల్లించాలంటూ ఏపీ ఎన్జీఓ శాఖ ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు జక్కల మాధవ మాట్లాడారు. ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ కేడర్ ఉద్యోగులకు సంబంధించి మూడు నెలలు పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆప్కాస్ ఉద్యోగుల్లో 12 మందికి ఆరు నెలలుగా జీతాలు చెల్లించలేదన్నారు. వెంటనే జీతాలు చెల్లించేలా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులకు నిధి పోర్టల్ ద్వారా త్వరితగతిన వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా ఉద్యోగులకు మెటర్నటీ లీవ్లను మంజూరు చేసి నెలవారీ జీతాలను జాప్యం లేకుండా చెల్లించాలన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను సకాలంలో చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, వెంటనే సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. అనంతరం ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ సహా అధ్యక్షుడు చంద్రమోహన్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీధర్ బాబు, కోశాధికారి ప్రవీణ్ కుమార్, ఉమెన్ వింగ్ చైర్పర్సన్ జమీలాబేగం, సుదర్శనశర్మ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు హరికృష్ణ, శ్రీనివాసరెడ్డి, శరత్, మధుబాబు, ఆప్కాస్ కాంట్రాక్ట్, రెగ్యులర్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్ అవయవ దానం
రొద్దం: జిల్లాలో సచివాలయ ఉద్యోగి కుటుంబం పెద్ద మనసు చాటుకుంది. బ్రెయిన్ డెడ్ అయిన శ్రీనివాసులు అవయవ దానం చేసి మరో నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు. వివరాల్లోకి వెళితే.. రొద్దం గ్రామ ఎస్సీ కాలనీలో నివాసముంటున్న శ్రీనివాసులు (40)కు భార్య అనిత, ఆరేళ్లు, నాలుగేళ్లు, రెండేళ్ల వయసున్న ముగ్గురు కుమారులు ఉన్నారు. కలిపి గ్రామ సచివాలయ పరిధిలో ఎనర్జీ అసిస్టెంట్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 25న ఇంటి పట్టున ఉండగా తనకు తెలిసిన వారి ఇంట్లో విద్యుత్ సమస్య తలెత్తడంతో మరమ్మతు చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడడంతో తొలుత పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. బుధవారం శ్రీనివాసులు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు గుర్తించారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు డాక్టర్లు తెలిపారు. అలాగే అవయవదానంపై వారికి అవగాహన కల్పించడంతో అంత వేదనలోనూ వారు అంగీకరించారు. దీంతో ఆస్పత్రి వైద్యులు ‘జీవన్దాన్’కు దరఖాస్తు చేసి, వెంటనే శ్రీనివాసులు దేహం నుంచి కాలేయం, మూత్రపిండాలను సేకరించి వాటిని అవసరమైన రోగులకు అందజేశారు. -
రెవెన్యూలో దళారుల దందా
అనంతపురం అర్బన్: రెవెన్యూ శాఖలో అవినీతి చాపకింద నీరులా విస్తరిస్తోంది. జిల్లాలోని కొన్ని మండల తహసీల్దార్ కార్యాలయాల్లోకి దిగువస్థాయి సిబ్బంది ‘పార్టీ’ల నుంచి డబ్బులు దండుకునేందుకు ప్రత్యేకంగా దళారులను ఏర్పాటు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి చోట ముందుగా దళారులను ఆశ్రయిస్తేనే ఏ పనైనా జరుగుతుందనే ప్రచారం ఉంది. ప్రజలు, రైతులు తమ పనిమీద నేరుగా అధికారులను కలిసేందుకు ఇక్కడి అవినీతి సిబ్బంది అవకాశం ఇవ్వరని తెలిసింది. ఒకవేళ ఎవరైనా వెళ్లి అధికారిని కలిసి తమ సమస్య గురించి చెప్పుకున్నా.. ఇక్కడి అవినీతి సిబ్బంది తమపై అధికారికి ఏదో ఒకటి చెప్పి పనికాకుండా చేస్తారనే విమర్శలు ఉన్నాయి. దీంతో చేసేది లేక పనుల కోసం వచ్చేవారు దళారులను ఆశ్రయిస్తున్నట్లు తెలిసింది. రెవెన్యూ శాఖ పనితీరుపై ప్రజల్లో నమ్మకం పెరగాలంటే మండల స్థాయిలో అవినీతికి అడ్డుకట్ట వేయాలనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దళారుల రూటు సప‘రేటు’ వివిధ పనుల కోసం రెవెన్యూ కార్యాలయానికి వచ్చే వ్యక్తులు, రైతులను లక్ష్యంగా చేసుకుని దళారీల ద్వారా వసూళ్ల దందా సాగిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. పనిని బట్టి ‘రేటు’ నిర్ణయించి వసూలు చేస్తారని తెలిసింది. అందులోంచి దళారి తన వాటా సొమ్మును తీసుకుని మిగతాది తమకు అనుకూల ఉద్యోగికి ఇస్తారని సమాచారం. అయితే మరికొందరు దళారుల రేటు సప‘రేటు’గా ఉంటోందనే విమర్శలు ఉన్నాయి. పనిచేసేందుకు తమ అనుకూల సిబ్బంది చెప్పిన మొత్తానికి మించి ‘పార్టీల’ నుంచి వసూలు చేస్తారని సమాచారం. సిబ్బందికి ఇవ్వాల్సింది ఇచ్చేసి మిగతా మొత్తాన్ని ఈ దళారులు నొక్కేస్తారని తెలిసింది. పని కాకపోతే డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ‘పార్టీ’ నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. దీంతో డబ్బులు చెల్లించకుండా తప్పించుకునేందుకు దళారులు అవినీతి సిబ్బందిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్లు సమాచారం. భూ వివాదం ఫైలు క్లియర్ చేయిస్తానని యాడికి మండలం కంబాలపాడుకు చెందిన ఒక రైతు నుంచి మధ్యవర్తి ద్వారా ఒక ఉద్యోగి గతంలో రూ.30 వేలు వసూలు చేశాడు. పని కాకపోవడంతో డబ్బులు వెనక్కు ఇవ్వాలంటూ ఆ ఉద్యోగిపై మధ్యవర్తి ఒత్తిడి పెంచాడు. వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఆ ఉద్యోగి డబ్బులను వెనక్కు చెల్లించాడు. నార్పల మండలానికి చెందిన ఒక రైతు భూమి వివాదంలో ఉంది. రెవెన్యూ సిబ్బందికి అనుకూలంగా ఉన్న దళారి ఒకరు రైతు తరఫున రంగంలోకి దిగాడు. ఆర్డీఓ కోర్టులో రైతుకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తానని వీఆర్ఓ చెప్పడంతో రూ.లక్ష బేరం కుదుర్చుకున్నాడు. వీఆర్ఓ సూచించిన వీఏఓకు డబ్బులను దళారీ అందజేశాడు. అయితే ఆర్డీఓ కోర్టులో రైతుకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో దళారి అడ్డం తిరిగాడు. తనకు రూ.లక్ష కాదు.. రూ.4 లక్షలు వెనక్కు ఇవ్వాలంటూ డబ్బులు తీసుకున్న సిబ్బందిపై ఒత్తిడి పెంచాడు. అంతే కాకుండా కలెక్టర్, ఎస్పీ, డీఆర్ఓకు ఆ దళారి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అంతటితో ఆగకుండా రాష్ట్ర మంత్రి లోకేష్కు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కీలక పాత్రధారులుగా దిగువస్థాయి సిబ్బంది అధికారులతో పనిచేయిస్తామని ముడుపులు ఉన్నతాధికారుల వద్దకు ఫిర్యాదులు -
ఫలించిన న్యాయపోరాటం
● బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్రహ్మణ్యం బాధ్యతల స్వీకరణ అనంతపురం ఎడ్యుకేషన్: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిబంధన కార్పొరేషన్ ఉద్యోగులకు వర్తించకపోవడంతో ఓ అధికారి తనకు అన్యాయం జరిగినట్లుగా భావిస్తూ హైకోర్టును ఆశ్రయించి, తిరిగి పోస్టింగ్ పొందారు. వివరాల్లోకి వెళితే.. బీసీ కార్పొరేషన్ ఈడీగా పనిచేసిన సుబ్రహ్మణ్యం 60 ఏళ్లకు ఉద్యోగ విరమణ పొందారు. అయితే శ్రీఇతర ప్రభుత్వ ఉద్యోగులకు 62 ఏళ్లు ఉంటే, తనకు మాత్రం ఎందుకు వర్తించదు?శ్రీ అంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు అనుకూలంగా హైకోర్టు స్టే మంజూరు చేసింది. అయినా పరిస్థితి అక్కడితో సర్దుకోలేదు. స్టే ఉన్నా.. ఆయనను విధుల్లో కొనసాగనివ్వకుండా ఇంటికి పంపించడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో సుబ్రహ్మణ్యం కంటెమ్ట్ పిటిషన్ వేసి మరోసారి న్యాయపోరాటం ప్రారంభించారు. ఈ పరిణామాల మధ్య ప్రభుత్వం కూడా తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. చివరకు కోర్టు ఆదేశాలు, న్యాయపరమైన ఒత్తిళ్ల నేపథ్యంలో సుబ్రహ్మణ్యంను మళ్లీ విధుల్లోకి తీసుకోవాల్సి వచ్చింది. ఈక్రమంలో బుధవారం ఆయన తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే ఆర్నెళ్లు గడిచిపోయాయి. మరో 16 నెలల పాటు సేవలందించే అవకాశం లభించింది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యంను ఇన్చార్జ్ ఈడీ రామసుబ్బారెడ్డి, కార్యాలయ ఉద్యోగులు రాజు, వెంకటేశు, శంషాద్బేగం, అనసూయమ్మ, యల్లప్ప, రవి అభినందనలు తెలిపారు. -
చాట్ జీపీటీతో ట్రాన్స్ఫర్ ఆర్డర్
● బురిడీ కొట్టించేందుకు తండ్రీకొడుకు యత్నం ● ఫోర్జరీ కేసులో అరెస్టు తనకల్లు: ‘చాట్ జీపీటీ’ ఏఐ టూల్ ద్వారా నకిలీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ రూపొందించి మోసం చేయడానికి ప్రయత్నించిన తండ్రీకొడుకును పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి రూరల్ సీఐ నాగేంద్రతో కలిసి స్థానిక రూరల్ పోలీసు సర్కిల్ కార్యాలయంలో విలేకరులకు వెల్లడించారు. తనకల్లు మండలం చీకటిమానిపల్లికి చెందిన జయచంద్ర భార్య రమణమ్మ కడపలోని రిమ్స్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్నారు. తన భార్య కడప నుంచి చీకటిమానిపల్లికి వచ్చివెళ్లడం కష్టంగా ఉందని జయచంద్ర కదిరి మండలం కౌలేపల్లికి చెందిన తన బంధువు పలక గంగాద్రితో చెప్పాడు. దీంతో గంగాద్రి తన కుమారుడైన వేణు ఇద్దరూ కలిసి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వద్ద శేషాద్రి అనే వ్యక్తి పీఏగా ఉన్నాడని, అతని ద్వారా నీ భార్యకు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి బదిలీ చేయిస్తామని జయచంద్రతో నమ్మబలికారు. ఇందుకు రూ.లక్ష ఖర్చవుతుందని చెప్పారు. వారి మాటలను నమ్మిన జయచంద్ర రూ.లక్ష అందజేశాడు. అనంతరం జయచంద్ర ద్వారా అతని భార్య రమణమ్మ పూర్తి వివరాలను సేకరించిన వేణు.. తన సెల్ఫోన్లో చాట్ జీపీటీ ఏఐ టూల్ను ఉపయోగించి ఒరిజనల్ సర్టిఫికెట్ మాదిరే మంత్రి డిజిటల్ సంతకంతో కూడిన ఫేక్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాపీని తయారు చేశాడు. దాన్ని వాట్సాప్లో జయచంద్రకు పంపించాడు. అనుమానం వచ్చిన జయచంద్ర మంత్రి పీఏగా శేషాద్రి అనే వ్యక్తి ఉన్నాడా, లేదా అని ఆరా తీశాడు. అయితే మంత్రి సత్యకుమార్ వద్ద శేషాద్రి అనే వ్యక్తి ఎవరూ పీఏగా లేరని తెలుసుకున్న జయచంద్ర తాను మోసపోయినట్లు గ్రహించి తనకల్లు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. -
గుంతకల్లు డివిజన్కు అన్యాయం
● ఎస్సీఆర్ఎంయూ జోనల్ ప్రధాన కార్యదర్శి శంకర్రావు గుంతకల్లు: దశాబ్దాలుగా గుంతకల్లు రైల్వే డివిజన్కు అన్యాయం జరుగుతూనే ఉందని దక్షిణ మధ్య రైల్వే జోనల్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ శంకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక రైల్వే గ్రౌండ్ సమీపంలోని మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే ఏర్పడుతున్న తరుణంలో తాజాగా గుంతకల్లు డివిజన్కు మరోసారి అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు అడ్డుకోవడంతో రాయచూరు సెక్షన్ను గుంతకల్లు డివిజన్ నుంచి తప్పించి దక్షిణ మధ్య రైల్వేలోనే కొనసాగించడం సబబు కాదన్నారు. గుంతకల్లు నుంచి విశాఖపట్నంకు హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. రైల్వే ఉద్యోగులకు అనుకూలంగా ఉండేలా విజయవాడలో రైల్వే సెంట్రల్ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలన్నారు. గ్రూప్ సీ, డీ ఉద్యోగాలను స్థానిక నిరుద్యోగులకు కేటాయించేలా రాజ్యాంగ సవరణ చేయడానికి కేంద్రంతో సీఎం చంద్రబాబు చర్చించాలన్నారు. డివిజన్లోని ఏదో ఒక కేంద్రంలో రిక్రూట్మెంట్ బోర్డును నియమించాలన్నారు. రైల్వే డీజిల్ షెడ్డులన్నీ ఎలక్ట్రికల్ షెడ్లుగా మారుతున్న తరుణంలో డీజిల్ షెడ్ ఉద్యోగులకు అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. వందే భారత్, హంసఫర్ తదితర హైస్పీడ్ రైళ్ల లోకో పైలెట్లకు జీతాలు పెంచాలన్నారు. సమావేశంలో మజ్దూర్ యూనియన్ గుంతకల్లు డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎస్.విజయ్కుమార్, కోశాధికారి శ్రీనివాసశర్మ, స్టేషన్ బ్రాంచ్ కార్యదర్శి జాఫర్ఖాన్, పెన్షనర్ల అసోసియేషన్ గుంతకల్లు డివిజన్ ప్రధాన కార్యదర్శి మస్తాన్వలి తదితరులు పాల్గొన్నారు. -
ఫేక్ సర్టిఫికెట్ల సృష్టికర్త పరుశురామ్
● నగర పాలక సంస్థ అధికారుల విచారణలో వెల్లడి అనంతపురం క్రైం: నగర పాలక సంస్థ పరిధిలో కొందరు కాంట్రాక్టర్లు ఫేక్ సర్టిఫికెట్లతో రూ.కోట్లలో పనులు చేసి, బిల్లులు పొందిన విషయం తెలిసిందే. ఈ అంశంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించడంతో స్పందించిన అధికారులు లోతైన విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సదరు కాంట్రాక్టర్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలను పరిశీలించడంతో అవి ఫోర్జరీ సంతకాలతో సృష్టించినట్లుగా గుర్తించారు. ఈ మొత్తం అక్రమాలకు ఆద్యుడు నగర పాలక సంస్థలోని కంప్యూటర్ ఆపరేటర్ పరుశురామ్ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్లుగా అనుమతులు పొందేందుకు అవసరమైన ఆర్అండ్బీ ఎస్ఈ సంతకాలు చేయించి ఇస్తానంటూ పరుశురామ్ కొందరితో పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుని తానే ఎస్ఐ సంతకాలు చేసినట్లుగా తెలుస్తోంది. గ్రీన్ ఇంక్తో కాకుండా బ్లూ ఇంక్తో చేసిన సంతకాలను పరిశీలన సమయంలోనూ అధికారులు పసిగట్టలేకపోయారు. దీంతో రెండేళ్లుగా వారందరూ కాంట్రాక్టర్లుగా చలామణి అవుతూ వచ్చారు. రూ. కోట్లలో పనులు చేసి, బిల్లులు కూడా చేసుకున్నారు. అక్రమాలు నిర్ధారణ కావడంతో పరుశురామ్పై అనంతపురం రెండో పట్టణ పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్లు కూడా పరుశురామ్పై ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. బండిశుల తిరునాల ప్రారంభం పామిడి: మండలంలోని రామరాజుపల్లి గ్రామంలో వెలిసిన సుంకులమ్మ, ముత్యాలయ్య ఆలయం ఉత్సవాల్లో భాగంగా బండిశుల తిరునాల బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయంలో విశేష పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. సాయంత్రం చిలకమ్మ పల్లకీలో గ్రామదేవతల ఉత్సవ మూర్తులను ఊరేగించారు. అనంతరం బండిశుల (రథం)పై అధిష్టింపజేసి గుత్తిఅనంతపురం గ్రామం వైపుగా ఏడు గాన్ల ఎద్దులతో రథాన్ని లాగించారు. బుధవారం రాత్రికి గుత్తిఅనంతపురం గ్రామంలోని ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేసిన అనంతరం గురువారం రాత్రి రామరాజుపల్లికి రథాన్ని చేరుస్తారు. తిరిగి శుక్రవారం రాత్రికి బయలుదేరి శనివారం తెల్లవారుజామున గుత్తిఅనంతపురానికి, శనివారం రాత్రి అక్కడ నుంచి బయలుదేరి ఆదివారం తెల్లవారుజామున రామరాజుపల్లికి చేరడంతో ఈ తిరునాల ముగుస్తుంది. -
గంజాయి, ఇతర డ్రగ్స్పై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించటంతో నిషా కోసం యువత కొత్త దారులు వెదుకుతోంది. ఇదే అదనుగా కొన్ని ముఠాలు నొప్పి నివారణ, మానసిక వ్యాధుల చికిత్సలో వాడే ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లను అడ్డదారుల్లో అమ్ముతున్నాయి. వీటిని ఎక్కువ మోతాదులో తీసుక
అనంతపురం: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మెడికల్ స్టోర్లలో మత్తు కలిగించే మందుల విక్రయాలు ఊపందుకున్నాయి. కొన్ని రకాల మత్తు మాత్రలను అవసరమైన రోగులకు మాత్రమే వైద్యులు సూచిస్తుంటారు. నిబంధనల ప్రకారం ఇలాంటి ఔషధాలను ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయించరాదు. అయితే.. మెడికల్ స్టోర్ నిర్వాహకులు మాత్రం నిబంధనలకు నీళ్లొదిలి అధిక మొత్తం చెల్లిస్తే చాటు ఎన్ని కావాలంటే అన్ని మందు బిల్లలు, సిరప్లు అందజేస్తున్నారు. కండలు తిరిగిన దేహంపై మోజుతో జిమ్లకు వెళుతున్న కొందరు యువకులు క్లినికల్ ట్రీట్మెంట్లో ముఖ్యమైన పాత్ర పోషించే అనాబాలిక్–ఆండ్రోజెనిక్ స్టెరాయిడ్లు వాడుతున్నట్లుగా తెలుస్తోంది. హిందూపురం, కదిరి, అనంతపురం తదితర ప్రాంతాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. వీటిని వినియోగిస్తే గుండెపోటు, మూత్రపిండాల వ్యాధులు, లివర్ సమస్యలు వస్తాయి. యువతలో వంధ్యత్వ సమస్యలకు కూడా ఇవి కారణమవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి షెడ్యూల్ హెచ్–1 పరిధిలో ఉన్న నైట్రోవిట్, ఆల్ఫ్రాజోలం, ట్రెమడాల్ వంటి కొన్ని రకాల ట్యాబ్లెట్లను డాక్టర్లు నొప్పి నివారణకు, మరికొన్నింటిని మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారికి నిద్ర వచ్చేలా సూచిస్తుంటారు. వీటిని డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే మెడికల్ దుకాణాల్లో విక్రయించాలి. ఇందు కోసం ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలి. కొనుగోలుదారు వివరాలను అందులో పొందుపరచాలి. కానీ, మెడికల్ స్టోర్ నిర్వాహకులు మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ అధిక ధరలకు వాటిని విక్రయించి యువతను పెడదోవ పట్టిస్తున్నారు. సైకోట్రోపిక్ సబ్స్టెన్స్ (మాదకద్రవ్యం)గా కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ట్రెమడాల్ వంటి ప్రమాదకరమైన మాత్రలను సైతం ఉమ్మడి జిల్లాలోని కొన్ని మెడికల్ స్టోర్లలో గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. ఐసిస్ డ్రగ్గా పేరొందిన ట్రెమడాల్ను డిమాండ్ను బట్టి ఒక్కో షీట్పై రూ. 200 నుంచి రూ.300 అధిక ధరకు విక్రయిస్తున్నట్లుగా తెలుస్తోంది. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల నుంచి వీటిని తెప్పించుకుంటున్న విక్రయదారులు హిందూపురం మీదుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యంత గోప్యంగా సరఫరా చేస్తున్నట్లు సమాచారం. అతీగతీ లేని ఆడిట్ వాస్తవానికి షెడ్యూల్ హెచ్–1 డ్రగ్స్.. కంపెనీలో తయారీ నుంచి అవి ఏ ఏజెన్సీకి వచ్చాయి? ఏ మెడికల్ షాప్నకు వెళ్లాయి? ఏ కస్టమర్కు విక్రయించారు? అన్న ప్రతి అంశంపై ఆడిట్ ఉండాలి. కానీ, ఆ నిఘా ఉండడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. శస్త్రచికిత్సల్లో వాడే అనస్థీషియా ఇంజెక్షన్లను కూడా మత్తు జల్సాకు ఉపయోగిస్తున్నట్టు తేలింది. వీటిని బహిరంగ మార్కెట్లో అమ్మరు. కేవలం దవాఖానల్లోనే దొరుకుతాయి. ఈ ఇంజెక్షన్లకు సంబంధించి వైద్యులు ప్రిస్క్రిప్షన్ కూడా రాయరు. కానీ, కొంత మంది ఫార్మా డీలర్లే అక్రమంగా బయటికి తీసుకొచ్చి తెలిసిన వారితో విక్రయిస్తు భారీగా సంపాదిస్తున్నారు. తనిఖీలు చేస్తున్నాం మెడికల్ స్టోర్లలో మత్తు కలిగించే యాంటీబయాటిక్స్ అమ్మకూడదు. నిబంధనల మేరకే నిర్వాహకులు నడుచుకోవాలి. లేకపోతే సంబంధిత మెడికల్ స్టోర్ల యజమానులపై చర్యలు తప్పవు. మెడికల్ స్టోర్లను తరచుగా తనిఖీలు చేస్తున్నాం. – వీరకుమార రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్, డ్రగ్స్ కంట్రోల్ ఈ ఏడాది ఫిబ్రవరిలో అనంతపురంలోని హౌసింగ్బోర్డు కాలనీలో ఉన్న లైఫ్కేర్ మెడికల్, జనరల్ స్టోర్స్లో మత్తు కలిగించే మందులను బిల్లులు లేకుండా కలిగి ఉన్నట్లుగా తనిఖీ అధికారులు గుర్తించారు. అలాగే కొనుగోలు, అమ్మకం రికార్డులూ సరిగా నిర్వహించలేదు.దీంతో ఇచ్చిన నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో పాటు రికార్డులనూ చూపించకపోవడంతో ఆ షాపు లైసెన్స్ రద్దు చేశారు. గత ఏడాది అక్టోబర్లో పామిడి గ్రామంలోని బాలాజీ మెడికల్, ఫ్యాన్సీ స్టోర్లో భారీ స్థాయిలో మత్తు కలిగించే మెడికల్ మందులు బయటపడ్డాయి. దీంతో తనిఖీ అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేసి, ఆ షాపు లైసెన్స్ను రద్దు చేశారు. ఉమ్మడి జిల్లాలో ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపుల్లో విక్రయాలు మత్తులో చిత్తవుతున్న యువత కట్టడి చేయడంలో డ్రగ్స్ నియంత్రణ అధికారులు విఫలం -
అసమర్థ ప్రభుత్వమిది
● మాజీ మంత్రి శైలజానాథ్ మండిపాటు శింగనమల (నార్పల): ‘మొన్నటి వరకు రైతులను యూరియా సమస్య వేధించింది. గ్యాస్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నేడు పెట్రోల్, డీజిల్కూ అవస్థలు పడేలా చేశారు. చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతతోనే ఇలా జరుగుతోంది’ అంటూ మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపడ్డారు. ఇంధన సరఫరా విషయంలో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్య వైఖరిపై మంగళవారం నార్పలలోని పెట్రోల్ బంక్ వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీజిల్ దొరక్క పంట నూర్పిడి యంత్రాలు ఆగిపోతున్నాయన్నారు. రైతులు సేద్యం చేసుకోలేకపోతున్నారన్నారు. సామాన్యుడిపై మోయలేని భారం పడుతోందన్నారు. సీఎం చంద్రబాబు మాటలు తప్ప చేతల్లో చూపడం లేదని విమర్శించారు. ఇంధనం కొరత లేదంటూ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందన్నారు. డీజిల్, పెట్రోలు కోసం ప్రజలు బారులు తీరుతున్నారన్నారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో సులువుగా దొరుకుతున్న డీజిల్, పెట్రోలు ఇక్కడెందుకు దొరకడం లేదని నిలదీశారు. త్వరలో ప్రభుత్వం డీజిల్ ధరను పెద్ద ఎత్తున పెంచుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో పంటలను మద్దతు ధరకు కొనేవారు లేక అన్నదాతలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికై నా ఒట్టి మాటలు చాలించాలన్నారు. ‘ఇది అసమర్థ ప్రభుత్వం.. వెంటనే దిగిపోవాలి’ అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్నారు. వెంటనే డీజిల్, పెట్రోలు సరఫరా పెంచి ప్రజల అవస్థలు తొలగించకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు పరంధామ రెడ్డి, మహేశ్వర్రెడ్డి, ఎల్లారెడ్డి, ఎంపీపీ నాగేశ్వరావు, జడ్పీటీసీ భాస్కర్, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఫణీంద్ర, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఆంజినేయులు, ఇంటెలెక్చువల్ నియోజకవర్గ అధ్యక్షుడు అనిల్కుమార్రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ప్రభుదాస్, ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి రామాంజినేయులు, నాయకులు బాలనాగి బయన్న, శంకర్ యాదవ్, వెంకటరామిరెడ్డి, పక్కీరెడ్డి, రంగయ్య, శివశంకర్రెడ్డి, నాగరాజు, శివారెడ్డి, ఎంఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
15 లోపు డ్రిప్ సరఫరా చేయాలి
● కంపెనీ ప్రతినిధులకు ఏపీఎంఐపీ పీడీ ఆదేశం అనంతపురం అగ్రికల్చర్: మార్చితో ముగిసిన 2025–26కు సంబంధించి మంజూరు ఉత్తర్వులు జారీ చేసిన రైతులకు డ్రిప్ పరికరాలు మే 15వ తేదీలోపు సరఫరా చేయాలని సంబంధిత డీసీఓలను ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డి ఆదేశించారు. డ్రిప్ సరఫరాపై మంగళవారం తన కార్యాలయంలో ఏపీడీ ధనుంజయతో కలిసి డ్రిప్ కంపెనీ డీసీఓలతో పీడీ సమీక్షించారు. గత ఏడాది 23వేల హెక్టార్లకు డ్రిప్ మంజూరు చేయగా, 20 వేల హెక్టార్లకు పంపిణీ చేశారని, మిగిలిన 3 వేల హెక్టార్లకు పరికరాలు పొలాల్లో బిగించాలని ఆదేశించారు. -
సూరీడు సెగలు.. ముచ్చెమటలు
● అగ్ని గోళంలా అనంత ● రాగల ఐదు రోజులు మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు అనంతపురం అగ్రికల్చర్: సూరీడు ఏ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు. ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. భానుడి భగభగలకు జిల్లా అగ్ని గోళంలా మారింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉక్కపోత, వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రిళ్లు కూడా 25 నుంచి 30 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో అల్లాడిపోతున్నారు. పుట్లూరు, యల్లనూరు మండలాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. సాయంత్రం 5, 6 గంటల సమయంలో కూడా కొన్ని మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణ్రోగతలు నమోదుకావడం గమనార్హం. మధ్యాహ్న సమయంలో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా సుదీర్ఘకాలం వేసవితాపం కొనసాగుతుండటంతో జనం పరిస్థితి ఘోరంగా తయారైంది. తాడిపత్రి, కళ్యాణదుర్గం, యల్లనూరు, పుట్లూరు, విడపనకల్లు, నార్పల, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, గుత్తి, గుంతకల్లు, శింగనమల తదితర మండలాల్లో మరింత దారుణంగా ఉంది. నీడ కోసం జనం వెంపర్లాడుతున్నారు. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, రైతులు, శ్రామికులు, మహిళలు, వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. మంచినీరు, మజ్జిగ, కొబ్బరినీళ్లు, చెరకు రసం, ఓఆర్ఎస్, పండ్ల రసాలు తీసుకోవాలంటున్నారు, గొడుగు, టోపీ, మాస్క్, గ్లౌజులు లాంటివి వాడాలని సూచిస్తున్నారు. మరింత తీవ్రత.. రాగల ఐదు రోజులు కూడా ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 29 నుంచి మే 3 వ తేదీ మధ్య పగటి ఉష్ణోగ్రతలు 42.7 డిగ్రీల నుంచి 43.2 డిగ్రీలు, రాత్రిళ్లు 28.3 డిగ్రీల నుంచి 28.9 డిగ్రీల మధ్య నమోదు కావచ్చన్నారు. కొన్ని మండలాల్లో 44 డిగ్రీలకు పైగా నమోదయ్యే సూచన ఉన్నట్లు తెలిపారు. అలాగే 29, 30 తేదీల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడవచ్చన్నారు. గాలిలో తేమశాతం ఉదయం 54 నుంచి 56, మధ్యాహ్న సమయంలో 15 నుంచి 25 శాతం మధ్య రికార్డు కావచ్చన్నారు. ఆగ్నేయం దిశగా గాలులు గంటకు 6 కిలోమీటర్ల వేగంతో వీచే సూచన ఉన్నట్లు తెలిపారు. -
గ్రంథాలయాలకొచ్చేలా ప్రోత్సహించండి
అనంతపురం కల్చరల్: వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేటట్లు చిన్నారులను గ్రంథాలయాలలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిక్షణా శిబిరాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని కేంద్ర గ్రంథాలయ కార్యదర్శి కమ్మన్న పిలుపునిచ్చారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం విద్యా, వైజ్ఞానిక వేసవి శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించి, మాట్లాడారు. ఈసారి వేసవి మరింత తీవ్రంగా ఉండడంతో పిల్లలు ఎండల్లో కాకుండా నీడపట్టున అన్ని రకాల కళలు నేర్చుకునేందుకు గ్రంథాలయాలు తోడ్పాటునందిస్తాయన్నారు. ఆటపాటల్లో ఉచిత శిక్షణతో పాటూ నిత్యం స్నాక్స్ అందిస్తామన్నారు. గ్రంథాలయాల విశిష్టతను శిక్షకులుగా వ్యవహరిస్తున్న కవులు శ్రీరాములు, అంకె రామలింగమయ్య, యోగా మాస్టర్ వెంకటేష్, డ్రాయింగ్ మాస్టర్ వినోద్కుమార్ వివరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది గోవిందు, ముత్యాలమ్మ, ఇందిరమ్మ, శిరీషకుమారి, నాగరాజు, నాగభూషణ పాల్గొన్నారు. ఏడీఏ నారాయణనాయక్కు డీడీఏగా పదోన్నతి అనంతపురం అగ్రికల్చర్: ఆత్మ ఇన్చార్జ్గా పనిచేస్తున్న వ్యవసాయశాఖ కణేకల్లు ఫారం ఏడీఏ నారాయణనాయక్కు డిప్యూటీ డైరెక్టర్ (డీడీఏ)గా పదోన్నతి కల్పించారు. శ్రీసత్యసాయి జిల్లా జేడీఏ కార్యాలయంలో ఖాళీగా ఉన్న డీడీఏ స్థానానికి ఆయనను బదిలీ చేశారు. అలాగే వైఎస్సార్ కడప జిల్లాలో ఏడీఏగా ఉన్న మురళీధర్రెడ్డికి డీడీఏగా పదోన్నతి కల్పించి అనంతపురం జేడీఏ కార్యాలయ డీడీఏగా బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా, మురళీధర్రెడ్డి వచ్చే మే నెలాఖరున, నారాయణనాయక్ వచ్చే జూన్ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నట్లు ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి. ‘పనస’కు రాయితీలు కల్పించాలి ● ఉద్యానశాఖ ఏడీకి రైతుల వినతి అనంతపురం అగ్రికల్చర్: పనస తోటలు సాగు చేసిన జిల్లాలోని రైతులకు ఉద్యానశాఖ తరపున రాయితీలు వర్తింపజేయాలని పలువురు రైతులు కోరారు. ఈ మేరకు స్థానిక ఉద్యానశాఖ కార్యాలయంలో ఏడీ దేవానందకుమార్ను రాయదుర్గం, బొమ్మనహాల్, అనంతపురం, ఉరవకొండ మండలాలకు చెందిన రైతులు పాటిల్ అనంతరెడ్డి, ఆదినారాయణరెడ్డి, సి.రామకృష్ణారెడ్డి, లోకానంద్, బసపప్ప, రామస్వామినాయుడు, రామనాథరెడ్డి తదితరులు మంగళవారం కలిసి విన్నవించారు. కొందరు ఇప్పటికే పసన సాగు చేయగా, మరికొందరు సాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం తరపున రాయితీలు వర్తింపజేస్తే కొంత వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై ఏడీ మాట్లాడుతూ.. పనసకు రాయితీ అంశాన్ని ఉద్యానశాఖ డీడీ, అలాగే కమిషనరేట్ అధికారుల దృష్టికి తీసుకెళతానని తెలిపారు. అలాగే డ్రైలాండ్ హార్టికల్చర్, ఉపాధి హామీ పథకం కింద చేర్చే అవకాశం ఉన్నందున డ్వామా అధికారులనూ కలవాలని సూచించారు. విద్యను వ్యాపారంగా మారుస్తున్న ప్రభుత్వం ● ఆలిండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ మండిపాటు అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.500 కోట్లు ఇస్తుందని, మరో రూ. 500 కోట్లు పెట్టుబడుదారులు సమకూర్చాలని చెప్పడాన్ని ఆలిండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ (ఏఐఎస్ఈసీ) తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఏఐఎస్ఈసీ రాష్ట్ర అధ్యక్షుడు కె.వేణుగోపాల్రెడ్డి, కార్యదర్శి మాసూల సుబ్రమణ్యం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యా వ్యవస్థకు అవసరమైన నిధులు ప్రభుత్వం సమకూర్చితేనే విద్యావ్యవస్థ సామాజిక ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. అలాకాకుండా కార్పొరేట్ కంపెనీల నుంచి నిధులు అడిగితే పబ్లిక్ ఫండింగ్ విద్యలో కూడా వ్యాపారానికి తలుపులు తెరిచినట్లేనని మండిపడ్డారు. లాభాపేక్ష లేకుండా పెట్టుబడుదారులు ఎందుకు ముందుకు వస్తారని ప్రశ్నించారు. వారినుంచి నిధులు ఆశించడం అంటే ఏదో ఒకరూపంలో యూనివర్సిటీ ఆస్తులను వారి చేతుల్లో పెట్టడమేనన్నారు. ఇలాంటి చర్యలు ఇప్పటికే ప్రభుత్వం రంగంలో ఉన్న యూనివర్సిటీలు, డిగ్రీ, జనియర్ కళాశాలలు, పాఠశాలల ఆస్తులను ప్రైవేట్ వ్యవక్తుల చేతుల్లో పెట్టడానికి మార్గం సుగమమవుతుందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని ఆంధ్ర యూనివర్సిటీకి రూ. వెయ్యికోట్లు తానే సమకూర్చాలన్నారు. విద్యా వ్యవస్థలో పీపీపీ విధానాన్ని అమలు చేయొద్దని డిమాండ్ చేశారు. -
‘అనంత’ హనీట్రాప్లో పాత్రధారులపై డీఐజీ, ఎస్పీ చర్యలు తీసుకున్నారు. వారం రోజుల్లోనే కఠిన చర్యలు తీసుకోవడం అభినందనీయమే అయినా ఇదే తరహాలో సూత్రధారుల సంగతి కూడా తేల్చాల్సి ఉంది. ఈ తంతులో టీడీపీ, బీజేపీకి చెందిన కీలక నేతలు, వ్యక్తుల పాత్ర ఉంది. రిమాండ్కు వెళ్ల
సాక్షిప్రతినిధి, అనంతపురం: జిల్లా చరిత్రలోనే అత్యంత నీచమైన వ్యవహారం హనీట్రాప్ దందాలో తవ్వేకొద్దీ విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. కింగ్పిన్ రంగమ్మ మొదలెట్టిన ఈ వ్యవహారంలో ‘ఈజీమనీ’గా భావించి నాలుగు గ్యాంగ్లుగా విడిపోయారు. దందా మొత్తాన్ని నిశితంగా పరిశీలిస్తే టీడీపీ, బీజేపీలోని నేతల ప్రమేయంతోనే అంతా జరిగిందని స్పష్టమవుతోంది. ముఠా పుట్టింది...విస్తరించింది ఇలా ఓ బీజేపీ నేత తాను జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రంగమ్మకు మహిళా మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పదవి ఇప్పించారు. అప్పట్లోనే రంగమ్మ ‘హనీట్రాప్’ మొదలెట్టారు. ఈ నేత మంత్రి సత్యకుమార్కు అత్యంత సన్నిహితుడు. ఇతను స్టేషన్కు వస్తే పనులు చేయాలని పోలీసులకు మంత్రి సూచించినట్లు తెలుస్తోంది. దీంతో మొదట ఇతనే స్టేషన్లలో పంచాయితీలు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహిళా మోర్చా రాయలసీమ జోనల్ ఇన్చార్జ్ చంద్రకళ, మహిళా మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు అనంతకుమారి, మల్లీశ్వరి కూడా చేరారు. ఆపై వీరి మధ్య విభేదాలతో రంగమ్మ దూరమైంది. టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో టీడీపీలో చేరింది. అక్కడి నేతల అండతో రంగమ్మ దందాను యథేచ్ఛగా నడిపించింది. ఇదే క్రమంలో అనంతకుమారి, మల్లీశ్వరి కూడా ఎవరి దందా వాళ్లు నడిపించారు. ఈ ముగ్గురు ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. అంతా ఒకేపార్టీలో పని చేసిన వారే. ఈజీమనీని ఆదాయమార్గంగా ఎంచుకుని మొత్తం నాలుగు గ్యాంగ్లుగా ఏర్పడి చాలామంది పరువును నాలుగు గోడల మధ్య బేరం పెట్టి అక్రమంగా సంపాదించారు. వీరితో పాటు టీడీపీలోని రాజేష్, నరేంద్రరెడ్డి కూడా రిమాండ్కు వెళ్లారు. రంగమ్మ, మల్లీశ్వరి ముఠాల మధ్య విభేదాలతో ఈ వ్యవహారం బయటకు పొక్కింది. హనీట్రాప్లో బీజేపీలో పడిన బీజం టీడీపీకి విస్తరించి ‘అనంత’ సమాజాన్ని వేధించింది. రూ.కోట్లలో అక్రమార్జన... మంత్రి సత్యకుమార్కు సన్నిహితుడైన బీజేపీ నేత ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లిలో వెంచర్ వేశారు. ఇందులో ఇటీవల వేటుపడిన ఓ సీఐ కూడా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. పాపపు సొమ్ముతో ‘అనంత’లో రెండు ఇళ్లు కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బీజేపీలోని ఇతనితో పాటు రంగమ్మ నిర్వహించిన 7 హిల్స్ హోటల్ వద్ద సమావేశమైన టీడీపీ నేతలు కూడా ఈ డబ్బును పెట్టుబడుల కోసం వినియోగించుకున్నట్లు సమాచారం. నిజానికి ఇది చిన్న వ్యవహారం కాదని, బాధితులు కోల్పోయిన డబ్బు రూ.కోట్లలో ఉందని తెలుస్తోంది. రిమాండ్కు వెళ్లిన వారి కాల్లిస్ట్, ఆడియో రికార్డులతో పాటు బ్యాంకు లావాదేవీలను పోలీసులు శోధిస్తున్నారు. పాత్రధారులైన వ్యక్తులు, కొందరు పోలీసులపై చర్యలు తీసుకున్న డీఐజీ, ఎస్పీ సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి నీచానికి ఒడిగట్టరు. ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యుల హస్తం.. హనీట్రాప్ దందాలో ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యుల పాత్ర ఉందని తెలుస్తోంది. ఎస్పీ చెప్పినా కేసులు నమోదు చేయని పరిస్థితి ఉందంటే, ‘ఉద్యోగం తీయగలిగే శక్తి ఎస్పీకి లేదు, ఎమ్మెల్యే చెబితే పోస్టింగ్ ఇస్తారు.. ఎమ్మెల్యేలే మా బాస్’లు అనేలా పోలీసులు ఉద్యోగం చేశారు కాబట్టి కచ్చితంగా ఈ ముడుపుల్లో కొందరు ప్రజాప్రతినిధుల పాత్ర కూడా ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలలో మొత్తం ముగ్గురి పాత్ర స్పష్టంగా ఉందనే విషయం తెలుస్తోంది. ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది. చర్యలు తీసుకోవాల్సిందేహనీట్రాప్ అంశాన్ని విపక్షాలు తీవ్రంగా పరిగణించాయి. సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ జగదీష్కు వినతిపత్రం అందజేశారు. మరోవైపు హనీట్రాప్పై సీబీఐ విచారణ చేయాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి డిమాండ్ చేశారు. ‘హనీ’ తంతులో టీడీపీ, బీజేపీ నేతల ప్రమేయంపై సర్వత్రా చర్చ మంత్రి సత్యకుమార్ అనుచరుడి పాత్రపై అనుమానాలు బత్తలపల్లిలోని ఓ వెంచర్లో అతనితో పాటు వేటు పడిన ఓ సీఐ పెట్టుబడులు రాజకీయ పార్టీ నేతల హస్తం నేరుగా ఉండటంపై చీదరించుకుంటున్న జిల్లా ప్రజలు -
మే 3న నీట్
అనంతపురం అర్బన్: ‘‘నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) మే 3వ తేదీన జిల్లాలో ఎనిమిది కేంద్రాల్లో జరగనుంది. పరీక్షకు 3,616 మంది విద్యార్థులు హాజరవుతారు. కేంద్రాల వద్ద ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలి’’ అని నీట్ నోడల్ ఆఫీసర్, డీఆర్ఓ ఎ.మలోల అన్నారు. డీఆర్ఓ మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమావేశం నిర్వమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురంలో ఆరు, గుత్తిలో రెండు కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తాన్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. అనంత పురంలోని కేంద్రాలకు కో–ఆర్డినేటర్గా మార్కండేయులు సూరిని, గుత్తి పట్టణంలోని కేంద్రాలకు ఎం.మాలిక్సాబ్ను నియమించామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలన్నారు. పరీక్ష వేళలకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపాలని ఆదేశించారు. విద్యార్థులు నిర్దేశించిన పరీక్ష సమయం కంటే గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అడ్మిట్కార్డుతో పాటు పాస్పోర్ట్ ఫొటో, ఏదేని గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని, కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, స్టేషనరీ బుక్స్, వ్యక్తిగత వస్తువులు, ఆహార పదార్థాలు అనుమతించబోరన్నారు. అదుపులోకి పరిస్థితి● కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్ అనంతపురం అర్బన్: పెట్రోల్, డీజిల్ పంపిణీలో నెలకొన్న ఆందోళన తగ్గి పరిస్థితి అదుపులోకి వచ్చిందని కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీతో కలిసి విలేకరులతో కలెక్టర్ మాట్లాడారు. రెండు రోజుల్లో అంతా సాధారణ స్థితికి చేరుకుంటుందన్నారు. అప్పటి వరకు బంక్ల వద్ద నిఘా కొనసాగుతుందన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించి వారిని ఆందోళనకు గురిచేసిన ఆరు సామాజిక మాధ్యమాలకు చెందిన వ్యక్తులకు నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. ఈ నెల 27వ తేదీతో పోలిస్తే ఇంధన నిల్వలు గణనీయంగా పెరిగాయన్నారు. రోజువారీగా పెట్రోల్ 257 కిలో లీటర్లు అవసరమైతే ప్రస్తుతం 984 కిలో లీటర్లు ఉందని ఇది నాలుగు రోజులకు సరిపోతుందని తెలిపారు. డీజిల్ రోజువారీగా 383 కిలో లీటర్లు అవసరమైతే ప్రస్తుతం 947 కిలో లీటర్లు ఉందని ఇది రెండున్నర రోజులకు వస్తుందని చెప్పారు. ఇంధన సరఫరాలో అంతరాయం లేకుండా చూసేందుకు గుత్తి, గుంతకల్లు, వైఎస్సార్ కడపలోని ప్లాంట్ల వద్ద పర్యవేక్షణకు ముగ్గురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను ఉంచినట్లు వెల్లడించారు. 198 అవుట్లెట్ల వద్ద వీఆర్ఓ, పోలీసు పర్యవేక్షణ ఉందన్నారు. ఐడీ (ఇండస్టియల్ డీజిల్) కింద ఎవరైనా రిటైల్ అవుట్లెట్ల నుంచి తీసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధిక పరిమాణంలో పెట్రోల్, డీజిల్ తీసుకున్నవారి జాబితాను తహసీల్దార్లకు ఇచ్చామని, వారు విచారణ చేస్తారని తెలిపారు. ఇంధనం బ్లాక్ మార్కెట్ చేసే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ● అనంతరం అనంతపురం నగరంలోని పెట్రోల్ బంక్లను కలెక్టర్ ఓ.ఆనంద్, ఎస్పీ పి.జగదీష్ తనిఖీ చేశారు. -
డ్రంకన్ డ్రైవ్లో రూ.10వేల జరిమానా
తాడిపత్రి రూరల్: డ్రంకన్ డ్రైవ్లో పట్టుపడిన ట్రాక్టర్ డ్రైవర్ నగేష్కు రూ.10వేల జరిమానా విధిస్తూ తాడిపత్రి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ప్రభావతి తీర్పు వెలువరించారు. ఈ మేరకు వివరాలను సీఐ శివగంగాధరరెడ్డి వెల్లడించారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం గొర్విమానిపల్లి గ్రామానికి చెందిన నగేష్ మంగళవారం మద్యం మత్తులో ట్రాక్టర్ నడుపుతూ పట్టుబడ్డాడన్నారు. దీంతో న్యాయస్థానంలో హాజరుపరిస్తే విచారణ అనంతరం రూ.10 వేల జరిమానాతో పాటు సాయంత్రం వరకూ కోర్టు ప్రాంగణంలో ఉండేలా శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారని పేర్కొన్నారు. -
పిడుగు పాటుకు గొర్రెల మృతి
విడపనకల్లు: పిడుగుపాటుకు గొర్రెలు మృతిచెందాయి. స్థానికులు తెలిపిన మేరకు... విడపనకల్లు గ్రామానికి చెందిన కురుబ అనిల్కుమార్ జీవాల పోషణతో జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం తన జీవాలను కర్ణాటక సరిహద్దులోని ఏపీ మోడల్ స్కూల్ వద్దకు మేపునకు తోలుకెళ్లాడు. సాయంత్రం ఒక్కసారిగా ఉరములు, మెరుపులతో వాతావరణంలో మార్పు చోటు చేసుకోవడంతో సమీపంలోని చెట్టుకిందకు గొర్రెలను కాపరులు చేర్చారు. ఆ సమయంలో పిడుగు పాటుకు 26 గొర్రెలు మృతి చెందాయి. కాపరి కురుబ మల్లికార్జునకు గాయాలయ్యాయి. ఘటనతో రూ.4 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత కాపరి వాపోయాడు. కుక్కల దాడిలో 40 పొట్లేళ్లు మృతి గార్లదిన్నె: కుక్కల దాడిలో 40 పొట్టేళ్లు మృతి చెందిన ఘటన మంగళవారం గార్లదిన్నె మండలం మర్తాడులో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన చిన్న నారాయణ పొట్టేళ్ల పెంపకంతో జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం తనకున్న 60 పొట్టేళ్లను షెడ్డులో వదిలి భోజనానికి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో కుక్కల గుంపు షెడ్డులోకి చొరబడి పొట్టేళ్లపై దాడి చేశాయి. కుటుంబసభ్యులు గమనించి కేకలు వేస్తూ కుక్కలను తరిమేశారు. అప్పటికే 40 పొట్టేళ్లు మృతి చెందాయి. మరికొన్ని తీవ్రంగా గాయపడ్డాయి. సమాచారం అందుకున్న తరిమెల పశువైద్యాధికారి డాక్టర్ మౌనుప్రియ అక్కడకు చేరుకుని గాయపడిన గొర్రెలు చికిత్స అందించారు. ఘటనతో రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి గుత్తి రూరల్: మండలంలోని బేతాపల్లికి చెందిన శ్రీనివాసులు (45) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు. మంగళవారం తన ఇంటి వద్ద నిచ్చెన పైకి ఎక్కి విద్యుత్ మరమ్మతు పనులు ముగించుకుని కిందకు దిగుతున్న సమయంలో పక్కనే ఉన్న తీగలు తగిలి షాక్కు గురై కిందపడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా, చికిత్స మొదలు పెట్టేలోపు మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
గ్రామస్థాయి క్రీడాకారులకు శాప్ వెన్నుదన్ను
అనంతపురం: గ్రామస్థాయిలో ప్రతిభ గల క్రీడాకారులకు శాప్ వెన్నుదన్నుగా నిలుస్తుందని శాప్ ఎండీ ఎస్. భరణి అన్నారు. రాష్ట్రస్థాయి శాప్ పుట్బాల్ పోటీలు మంగళవారం అనంతపురం ఆర్డీటీలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫుట్బాల్ క్రీడకు ప్రపంచంలో అత్యధికంగా ఆదరణ ఉందన్నారు. ఫుట్బాల్లో రాణిస్తే.. మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ జగన్నాథ్ రెడ్డి, డీఎస్డీఓ నంద్యాల ఎంఎన్వీ రాజు, డీఎస్డీఓ ఎస్ఎ మంజుల, కిశోర్, సురేంద్రబాబు, జగన్మోహన్ రావు శ్రీనివాసులు, ఆర్డీటీ డైరెక్టర్ సాయి కృష్ణ పాల్గొన్నారు. ● మంగళవారం జరిగిన మ్యాచ్ల్లో అండర్ –15 బాయ్స్ విజేత అనకాపల్లి, గర్ల్స్ విజేత అన్నమయ్య జిల్లా, అండర్– 21 బాయ్స్ విజేత కృష్ణ, గర్ల్స్ విజేత–అనంతపురం జట్టు నిలిచాయి. ఈ నెల 30న టోర్నీ ముగియనుంది. -
నాట్య ప్రతిభ ‘అనంతం’
సందర్భం అనంతపురం కల్చరల్: శాసీ్త్రయ, జానపద, వెస్ట్రన్ నృత్యరూపమేదైనా ఆహూతులను మంత్రముగ్దులను చేసే కళ అనంతవాసుల సొంతం కావడం విశేషం. జిల్లాకు చెందిన ఎందరో కళాకారులు శాసీ్త్రయ నృత్యవైభవాన్ని ఖండాంతరాలకు పరిచయం చేశారు. భారతీ య సంప్రదాయ నృత్యకళ విశిష్టతను చాటుతూ ఏటా ఏప్రిల్ 29న ‘అంతర్జాతీయ నృత్య దినోత్సవం’ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం అనంతపురంలో సాగనున్న ప్రత్యేక నాట్య ప్రదర్శనలు అనంత వాసులను అలరించనున్నాయి. అసలైన నాట్య‘వరద’ జిల్లాలో శాసీ్త్రయ నృత్యానికి పునాదులేసిన వరదరాజ అయ్యంగార్ అనంతరం అప్పారావు, కృష్ణకుమార్ వంటి మాస్టర్లు తొలిరోజుల్లో అనంతలో అద్భుతమైన కళాకారులను తీర్చిదిద్దారు. అనంతర కాలంలో ప్రముఖ నాట్యాచార్యులుగా రాణిస్తున్న సంధ్యామూర్తి.. నృత్య కళానిలయం స్థాపించి అనంత ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపజేశారు. అలాగే నాట్య విద్వాంసుడు పట్నం శివప్రసాద్ చిరుప్రాయం నుంచి జాతీయ స్థాయిలో అన్ని ప్రధాన వేదికలపై జిల్లా ఖ్యాతిని ఘనంగా చాటిచెప్పారు. ఆయన శిష్యురాలు నాగలక్ష్మి తానా సభల్లో కూచిపూడి ప్రదర్శనతో మెప్పించడమే కాక ప్రస్తుతం విదేశాల్లో స్థిరపడి అక్కడి వారికి శాసీ్త్రయ నృత్య శిక్షణ ఇస్తోంది. అలాగే కృష్ణమూర్తిరాజు, విజయ్కుమార్, సురేష్ మాస్టర్, పద్మావతి వంటి శాసీ్త్రయ నాట్యకళాకారులతో పాటూ అరుదైన ‘పేరిణి శివతాండవం, ఆంఽధ్రనాట్యం’ను నారాయణస్వామి జిల్లా వాసులకు పరిచయం చేశారు. వెస్ట్రన్, ఫోక్ స్టైల్లో రాణిస్తున్న కత్తి విజయ్కుమార్, మక్బుల్బాషా, విష్ణు, వన్నూరు, హరిప్రసాద్ వంటి వారు అధునాతన నాట్యాలకు ప్రత్యేక గుర్తింపు తెస్తున్నారు. ఎల్కేపీ వేదికగా నాట్య దినోత్సవం శ్రీగురుకృప సంగీత నృత్యకళానికేతన్ ఆధ్వర్యంలో ప్రముఖ నాట్యాచార్యులు పట్నం శివప్రసాద్ నేతృత్వంలో ఆయన శిష్య బృందాలు బుధవారం అనంతపురంలోని లలితకళాపరిషత్తు వేదికగా శాసీ్త్రయ నృత్య రూపకాలతో నటరాజుకు నీరాజనాలర్పించనున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి సాగే నృత్య వేడుకల్లో కళాభిమానులు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. నృత్య రూపకాన్ని ప్రదర్శిస్తున్న పట్నం శివప్రసాద్ శిష్యబృందం (ఫైల్), విదేశాల్లో ప్రదర్శన ఇస్తున్న సంధ్యామూర్తి శిష్య బృందం (ఫైల్) నేడు అంతర్జాతీయ నృత్యదినోత్సవం -
కూటమి నేతలదే ‘హనీట్రాప్’ పాపం
ఉరవకొండ: రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన ‘హనీట్రాప్’ పాపం కూటమి నేతలదేనని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పార్టీ ఉరవకొండ నియోజకవర్గ పరిశీలకుడు గోవర్దన్రెడ్డితో కలిసి ‘విశ్వ’ మాట్లా డారు. హనీట్రాప్ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు, టీడీపీ ముఖ్య నాయకులు హస్తం ఉండడం సిగ్గుచేటన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్, సవితలు ఇప్పటి వరకు ఈ విషయంపై నోరు మెదపకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు అమాయకులకు అమ్మాయిలను ఎరవేసి వారి నుంచి కోట్లాది రూపాయలు దోచుకున్న వ్యవహారం దేశంలోనే సంచలనంగా మారిందన్నారు. ఈ వ్యవహారంపై గవర్నర్ వెంటనే స్పందించి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విచ్చలవిడిగా పేకాట కేంద్రాలు.. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత సృష్టించి చంద్రబాబు ప్రభుత్వం వాహనదారులను ఇబ్బందులకు గురిచేస్తోందని ‘విశ్వ’ అన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఇలాకాలో విచ్చలవిడిగా పేకాట కేంద్రాలు వెలిశాయని, ఇసుక, మట్టిని అక్రమంగా రవాణా చేస్తూ టీడీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. హనీట్రాప్ వ్యవహారంలో ఉరవకొండ టీడీపీ నేతల పాత్ర కూడా ఉండటం సిగ్గుచేటన్నారు. ప్రతి మంగళవారం అప్పులు చేయనిదే చంద్రబాబు ప్రభుత్వ పాలన ముందుకు సాగని దుస్థితి ఏర్పడడం దారుణమన్నారు. ఇప్పటికే రూ. 3.50 లక్షల కోట్లు అప్పులు చేశారని, నెలకు రూ. 8 వేలకు కోట్లకు పైగా అప్పులు చేస్తున్నారని వివరించారు. రైతులు సాగు చేసిన పంటలను కొనే పరిస్థితి కనిపించడం లేదని, పంట కొనుగోలు చేయడానికి డబ్బులు లేవని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడంతో రైతాంగం కంగుతినే పరిస్థితి ఏర్పడిందన్నారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గంలో గుక్కెడు నీరు అందక ప్రజలు రోడ్లు ఎక్కి నిరసన తెలుపుతున్నా మంత్రి కేశవ్కు చీమకుట్టినట్లుగా కూడా లేదన్నారు. అదే మందు కావాలంటే ఏ గ్రామానికి వెళ్లినా ఏరులై పారుతోందని విమర్శించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఈడిగప్రసాద్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, రాష్ట్ర నాయకులు భీమిరెడ్డి, బసవరాజు, కౌడిగిగోవిందు, ఎర్రిస్వామిరెడ్డి, ఓబన్న, డోనేకల్లు కురుబ రమేష్, సోమశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీసు వ్యవస్థను టీడీపీ నేతలు భ్రష్టు పట్టించారు జిల్లా మంత్రులు నోరు మెదపకపోవడం సిగ్గుచేటు పీఏసీ సభ్యుడు విశ్వ ధ్వజం -
వ్యవసాయశాఖలో విచారణల పర్వం
అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖలో విచారణల పర్వం కొనసాగుతోంది. ఇటీవల ఆ శాఖ అధికారుల మధ్య నెలకొన్న విభేదాలు ముదిరిపాకాన పడడంతో పరస్పర ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో రాజకీయ నాయకులు కూడా ఫిర్యాదులు సమర్పించారు. దీంతో గత నెల రోజులుగా రకరకాల విచారణలు కొనసాగుతున్నాయి. తాజాగా కమిషనరేట్ నుంచి వచ్చిన జేడీఏ స్థాయి విచారణాధికారి విజయభారతి మంగళవారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ప్రధానంగా అనంతపురం ఏడీఏగా పనిచేసిన ఎం.రవిపై స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్ గతేడాది జూన్లో మంత్రి అచ్చెన్నాయుడుకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఇన్చార్జి జేడీఏగా పనిచేస్తున్న రవిపై పలు ఆరోపణలు చేశారు. అయితే తాజాగా ఎమ్మెల్యే దగ్గుపాటి తన ఫిర్యాదును వెనక్కు తీసుకుని.. గతంలో తాను చేసిన అరోపణల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని విచారణాధికారికి లేఖ కూడా రాశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఇచ్చిన రెండు ఫిర్యాదులపై మంగళవారం విచారణ చేపట్టారు. అప్పట్లో అనంతపురం డివిజన్ పరిధిలో పనిచేసిన ఆరు మండలాల ఏఓలు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సబార్టినేట్లు, ప్రస్తుతం తాడిపత్రి ఏడీఏ ఇన్చార్జ్ జేడీఏగా ఉన్నందున తాడిపత్రి కార్యాలయ స్టాఫ్ను పిలిపించారు. అలాగే 20 మంది వరకు ఇన్పుట్ డీలర్లు విచారణాధికారి ఎదుట హాజరయ్యారు. చివరగా జేడీఏ రవి కూడా హాజరయ్యారు. అందరి నుంచి లిఖిత పూర్వక వాంగ్మూలం తీసుకున్నట్లు విచారణాధికారి తెలిపారు. సమగ్ర నివేదికను కమిషనరేట్కు అందించనున్నట్లు పేర్కొన్నారు. -
ఇంధన సంక్షోభానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే
అనంతపురం:రాష్ట్రంలో నెలకొన్న ఇంధన సంక్షోభానికి చంద్రబాబు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే ఇంధన కొరత ఏర్పడిందని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఏపీలోనే ఇంధన సంక్షోభం నెలకొనడం ఆందోళనకరమన్నారు. సమస్య తీవ్రమవుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ఇంధన సరఫరాలో ఎలాంటి లోటు లేదని, ఒక్క ఇండెంట్ కూడా పెండింగ్లో లేదని కేంద్ర ప్రభుత్వ స్థాయిలో సమాచారం ఉన్నప్పటికీ రాష్ట్రంలో కొరత ఏర్పడటం ఏమిటని ప్రశ్నించారు. ధరలు పెరుగుతాయన్న అంచనాలతో డీలర్లు స్టాక్ నిల్వ చేసుకుంటున్నారని, ఈ విషయం తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. జిల్లా వ్యాప్తంగా చాలా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి క్యూలలో వేచి ఉండాల్సి వస్తోందని, కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని తెలిపారు. ప్రజల ఇబ్బందులను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని విమర్శించారు. కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు ఉన్నాయని చెప్పుకునే ప్రభుత్వం ఇంధన కొరతను గుర్తించలేకపోవడం అసమర్థతకు నిదర్శనమన్నారు. ఇంధన సంక్షోభానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. -
పోలీస్ స్టేషన్లోనే రెచ్చిపోయిన ‘పచ్చ’ మూక
● పోలీసులను పక్కకు నెట్టి వైఎస్సార్సీపీ నేతపై దాడి తాడిపత్రి రూరల్: ప్రజలకు రక్షణ దక్కుతుందనుకున్న పోలీస్ స్టేషన్లోనే ‘పచ్చ’ మూక రెచ్చిపోయింది. నాలుగు గోడల మధ్య పోలీసులను పక్కకు నెట్టేస్తూ వైఎస్సార్సీపీ నేత ప్రవీణ్కుమార్రెడ్డిని చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడికి తెగబడింది. ఇందుకు తాడిపత్రిలోని అప్గ్రేడ్ పీఎస్ వేదికై ంది. బాధితుడు ప్రవీణ్కుమార్రెడ్డి తెలిపిన మేరకు... మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన ఆనంద్ పెద్దలను ఎదిరించి అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంగా ఇరువైపులా తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ప్రేమ జంటను అదుపులోకి తీసుకుని తాడిపత్రి యూజీ పీఎస్కు పిలుచుకువచ్చారు. విషయం తెలుసుకున్న అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు ప్రవీణ్కుమార్రెడ్డి సోమవారం ఉదయం పోలీసుస్టేషన్లోని తన స్నేహితుడు అనంద్ను కలిసి మాట్లాడేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ నాయకులు తిరుపాల్రెడ్డి, రవి, ఆంజనేయరెడ్డి, ప్రవీణ్, సుబ్బరాయుడు తదితరులు ప్రవీణ్కుమార్ రెడ్డిని చూడగానే చంపండిరా అంటూ విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. అడ్డుకోబోయిన పోలీసులను పక్కకు నెట్టేశారు. అతి కష్టంపై ప్రాణాలు దక్కించుకుని బయటపడిన ప్రవీణ్కుమార్రెడ్డి విషయాన్ని వెంటనే గ్రామంలోని వైఎస్సార్సీపీ నాయకులకు తెలిపి వారిని అప్రమత్తం చేశాడు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఫోన్ ద్వారా వివరించారు. పెద్దారెడ్డి సూచన మేరకు అనంతపురానికి వెళ్లి ఎస్పీ జగదీష్ను కలిసి తనకు టీడీపీ నాయకుల నుంచి ప్రాణహాని ఉందని, తనను రక్షించాలంటూ వినతి పత్రం అందజేశాడు. అనంతరం తాడిపత్రిలో ఏఎస్పీ రోహిత్ కుమార్ను కలిసి దాడికి కారణమైన టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.అసిస్టెంట్ కలెక్టర్ బాధ్యతల స్వీకరణ అనంతపురం అర్బన్: అసిస్టెంట్ కలెక్టర్గా సుయాష్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన కలెక్టర్ ఆనంద్ వద్ద రిపోర్టు చేసుకున్నారు. కలెక్టర్కు పూల మొక్క అందజేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ను కలిశారు. ఏడాది పాటు జిల్లాలో శిక్షణ పొందుతారు. 2025 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన సుయాష్ కుమార్ది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీ (వారణాసి)లో ఐఐటీ, ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో ఫేస్–1 శిక్షణ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం ఏడాది పాటు జిల్లాలో వివిధ శాఖల్లో శిక్షణ తీసుకుంటారు. బీజేపీ నుంచి ‘హనీ ట్రాప్’ మహిళల తొలగింపుఅనంతపురం టవర్క్లాక్: హనీట్రాప్ వ్యవహారంలో అరెస్టయిన ముఠా సభ్యులు చంద్రకళ రాయల్, మల్లీశ్వరి, అనంత కుమారిలను బీజేపీ నుంచి తొలగిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇక నుంచి వారికి బీజేపీతో ఎటువంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. హనీట్రాప్ ముఠాతో ఎవరికి సంబంధమున్నా పార్టీ ఉపేక్షించబోదని, కఠినంగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. -
ఎరువుల దుకాణాల బంద్ విజయవంతం
అనంతపురం అగ్రికల్చర్: తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలంటూ విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల డీలర్లు సోమవారం తలపెట్టిన బంద్ విజయవంతమైంది. ఎరువుల కంపెనీలు నేరుగా దుకాణాలకు సరుకు రవాణా చేయాలని, మార్జిన్ 8 శాతం పెంచాలనే ప్రధాన డిమాండ్లతో దుకాణాల బంద్కు పిలుపునిచ్చినట్లు అసోసియేషన్ నాయకులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దుకాణాలకు పూర్తిగా మూతేయడంతో అక్కడక్కడ రైతులు ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యే అమిలినేని అనుచరులపై కేసు నమోదుకళ్యాణదుర్గం: స్థానిక టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అనుచరులపై అన్నమయ్య జిల్లా వాయల్పాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇటీవల అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం గండబోయనపల్లి టోల్ప్లాజా సిబ్బందిపై అమిలినేని అనుచరులు దాడి చేసిన విషయం తెలిసిందే. విధుల్లో ఉన్న మేనేజర్ రవి, మహిళా సిబ్బంది శ్రీలతపై దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఈ క్రమంలో టోల్ప్లాజా మేనేజర్ రవి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. రైల్వే విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్య గుత్తి: మండలంలోని ఎస్ఎస్ పల్లికి చెందిన రైల్వే విశ్రాంత ఉద్యోగి చంద్రగిరి సింగరయ్య(66) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అనారోగ్య కారణాలతో మనస్తాపం చెందిన ఆయన సోమవారం స్థానిక ఫోర్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కేసు నమోదు చేశారు. శతాధిక వృద్ధురాలి మృతి కళ్యాణదుర్గం (కంబదూరు): కంబదూరు మండలం వెంకటాంపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు లోక్నాథరెడ్డి తల్లి, శతాధిక వృద్ధురాలు గోవిందమ్మ (106) సోమవారం కన్నుమూశారు. కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుండేవారు. విషయం తెలుసుకున్న కంబదూరు రూరల్ మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కదిరిదేవరపల్లి హనుమంతరాయుడు, వైస్ ఎంపీపీ తిమ్మారెడ్డి, ఐపార్శపల్లి రాఘవేంద్ర, పాళ్లూరు పంచాయతీ రైతు విభాగం అధ్యక్షుడు ప్రతాపరెడ్డితో పాటు పలువురు వెంకటాంపల్లికి చేరుకుని మృతురాకి ఘననివాళులర్పించారు. ● కూల్కూల్ ప్రయాణంఆత్మకూరు: మండుతున్న ఎండలకు బస్సు ప్రయాణమంటే చాలా మంది భయపడుతున్నారు. అయినా తప్పని పరిస్థితుల్లో ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో వాటర్ బాటిల్ మరిచిపోతే వారి పరిస్థితి వర్ణణాతీతం. ఇలాంటి పరిస్థితుల్లో రాయదుర్గం నుంచి అనంతపురం వెళ్లే ఆర్టీసీ లగ్జరీ బస్సుడ్రైవర్, కండెక్టర్ మంచి ఆలోచన చేశారు. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా కూల్ వాటర్ క్యాన్ను స్వయంగా కొనుగోలు చేసి, బస్సులో ఏర్పాటు చేశారు. అందులో నీరు అయిపోయిన వెంటనే తిరిగి సొంత డబ్బుతో కూల్ వాటర్తో నింపుతున్నారు. రోజూ రెండు క్యాన్ల నీరు అయిపోతుందని ఈ సందర్భంగా కండెక్టర్ తెలిపారు. సైన్స్ సెంటర్లో వేసవి శిక్షణ శిబిరంఅనంతపురం ఎడ్యుకేషన్: వేసవి సెలవుల్లో జిల్లా కేంద్రంలోని సైన్స్ సెంటర్ను విద్యార్థులు సందర్శించేలా చొరవ తీసుకుని విజ్ఞాన శాస్త్రం పట్ల ఆసక్తి పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని ఇన్చార్జ్ డీఈఓ శ్రీనివాసరావు, సైన్స్ సెంటర్ అధికారి బాలమురళీకృష్ణ కోరారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులకు సైన్స్పట్ల అవగాహన పెంచేందుకు, పిల్లల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని ఏర్పరిచేందుకు, ఆలోచన శక్తి, విశ్లేషణాత్మక శక్తి అభివృద్ధి పరిచేలా సైన్స్సెంటర్లో మే 1 నుంచి 15 వరకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. విద్యాశాఖ, సమగ్రశిక్ష, ఆగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సంయుక్తంగా 6 నుంచి 10వ తరగతుల విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారన్నారు. ప్రయోగాలు, హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియనపై శిక్షణ ఉంటుందని, మరిన్ని వివరాలకు సైన్స్ సెంటర్ అధికారి బాలమురళీకృష్ణ (89859 34531)ను సంప్రదించాలన్నారు. -
రాయలసీమకు బాబు ద్రోహం
టమాట కిలో రూ.30 కక్కలపల్లి మార్కెట్లో సోమవారం కిలో టమాట గరిష్ట ధర రూ.30, కనిష్టం రూ.17, సరాసరి రూ.24 ప్రకారం క్రయ విక్రయాలు జరిగాయి. మామిడి టన్ను రూ.50 వేలు కక్కలపల్లి మామిడి మార్కెట్లో సోమవారం టన్ను గరిష్ట ధర రూ.50 వేలు, కనిష్టం రూ.25 వేలు, సరాసరి రూ.40 వేలు పలికాయి. మంగళవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి, పుట్టపర్తి: ‘సీఎం చంద్రబాబు తన స్వార్థ రాజకీయాలతో రాయలసీమకు తీరని ద్రోహం చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్పై ఆయన చేస్తున్న కుట్రలను ప్రజా బలంతోనే తిప్పికొడతాం’ అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ అన్నారు. సోమవారం ఆమె అధ్యక్షతన పుట్టపర్తిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు సాకే శైలజానాథ్, మాలగుండ్ల శంకర్నారాయణ, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, వై. విశ్వేశ్వర రెడ్డి, అత్తార్ చాంద్బాషా, డాక్టర్ తిప్పేస్వామి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను పూర్తి చేసేలా చంద్రబాబు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. గ్రామ స్థాయి నుంచి ప్రజలను చైతన్యపరిచేలా కార్యాచరణ రూపొందించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ప్రజా ప్రయోజనాలను పక్కనపెట్టి కేవలం రాజకీయం చేస్తూ రైతులు, ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపేస్తున్నామని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో రహస్యంగా చెప్పాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, గ్యాంగ్ రేప్లు జరుగుతున్నా పట్టించుకునే దిక్కు లేదని విమర్శించారు. అనంతపురం హనీ ట్రాప్ ఉదంతంలో పోలీసులు ఉండటం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తూ బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ● మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ.. ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 3 టీఎంసీలు రాయలసీమకు తేవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారన్నారు. రాయలసీమ ప్రజలంటే చంద్రబాబుకు చులకనభావమని, అందుకే సీమకు రావాల్సిన జలాలను తన స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ దగ్గర తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రాజెక్టుల ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని కొనియాడారు. ఆయన మార్గంలోనే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పయనించారన్నారు. సీఎం చంద్ర బాబు హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేయకుండా నీళ్లు వస్తే కొట్టుకుపోయే లైనింగ్ కోసం రూ.3 వేల కోట్లు ఖర్చు చేయడం బాధాకరమన్నారు. బాబు ఏనాడూ నీటి ప్రాజెక్టుల విషయంలో న్యాయం చేయలేదని, అక్కడ కూడా రాజకీయమే చేశాడని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రజాబలంతోనే కూటమి కుట్రలను తిప్పికొడతాం ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్’ ఆగితే లక్షల మందికి అన్యాయం నీటి హక్కుల కోసం గ్రామ స్థాయి నుంచి పోరాటం మాజీ మంత్రులు సాకే శైలజానాథ్, ఉషశ్రీచరణ్ పుట్టపర్తిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం సీఎం చంద్రబాబు తీరుపై నేతల ధ్వజం -
సీమ ప్రజలు మేల్కోవాలి
ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకప్పుడు 1,500 అడుగుల లోతులో ఉన్న భూగర్భ జలాలను హంద్రీ–నీవా కాలువ ద్వారా 600 అడుగుల పైకి తీసుకొచ్చాం. నేడు కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు కాంక్రీట్ లైనింగ్ పనులు చేయించి భూగర్భ జలాలు అడుగంటేలా చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్తో సీమను సస్యశ్యామలం చేయాలనుకున్న వైఎస్ జగన్ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారు. ఈ పథకం రాకుంటే రానున్న రోజుల్లో తాగునీటి సమస్య తీవ్రమవుతుంది. తెలంగాణ సీఎంతో రహస్య ఒప్పందం చేసుకోవడం సిగ్గుచేటు. మనకు కావాల్సింది నీళ్లు కానీ అమరావతి, హాంకాంగ్, సింగపూర్ గ్రాఫిక్స్ కాదు. సీమ ప్రజలు మేల్కోవాలి. – దుద్దుకుంట శ్రీధర్రెడ్డి, పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే -
అమిలినేని సురేంద్రబాబును అరెస్ట్ చేయాలి
● ఉపన్యాసాలు సరే.. మహిళపై దాడి సంగతేంటి? ● మాజీ ఎంపీ తలారి రంగయ్య ధ్వజం అనంతపురం: ఆగర్భ శ్రీమంతుడిని అని చెప్పుకునే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు టోల్గేట్ చెల్లించలేని స్థితిలో ఉన్నాడని వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య ఎద్దేవా చేశారు. ముందస్తుగా రూ.3వేలు చెల్లిస్తే ఏడాదిలో 200 టోల్గేట్లను దాటే అవకాశం ఉంటుందని, ఇది కూడా తెలియని స్థితిలో ఎమ్మెల్యే ఉన్నారా? అని ప్రశ్నించారు. సోమవారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో తలారి రంగయ్య మీడియాతో మాట్లాడారు. అన్నమయ్య జిల్లా గండబోయినపల్లె టోల్గేట్ వద్ద అహంకారంతో, అధికార గర్వంతో ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు టోల్గేట్ సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేశారని విమర్శించారు. మహిళని కూడా చూడకుండా దుర్భాషలాడుతూ భౌతికదాడి చేశారని ఆవేదన చెందారు. ఈ నెల 23న కళ్యాణదుర్గంలో మహిళల భద్రతపై ఎమ్మెల్యే సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారని, మరుసటి రోజే టోల్గేట్ వద్ద ఆయన అనుచరులు మహిళపై దాడి చేశారని అన్నారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే దాడి చేశారని, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అక్రమార్జనలో అమిలినేని అగ్రస్థానం ఎమ్మెల్యే అమిలినేని అక్రమార్జనలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారని మాజీ ఎంపీ తలారి రంగయ్య ధ్వజమెత్తారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అడుగడుగునా బెల్టుషాపులు ఉన్నాయని, మద్యం బాటిల్పై రూ.20 అధికంగా వసూలు చేస్తున్నారని, నెలకు రూ.కోటి అక్రమంగా ఆర్జిస్తున్నారని ఆరోపించారు. కొండల్ని పిండిచేసి మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బీటీపీ కాలువ కోసం భూమి కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం ఇవ్వాలన్నారు. రెండేళ్లవుతున్నా ఒక్క కొత్త పింఛన్ కూడా మంజూరు చేయలేదన్నారు. అనంతపురంలో నిర్వహించిన బీసీ గళం విజయవంతం కావడంతో ఇప్పుడు అధికార పార్టీ బీసీ నాయకులు బయటకు వచ్చి.. బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు పాల బండ్ల చంద్రశేఖర్రెడ్డి, గోళ్ల సూరి, ఎంఎస్ హనుమంతరాయుడు, జిల్లా కార్యదర్శి ఎర్రంపల్లి కృష్ణమూర్తి, మున్సిపల్ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు దొడగట్ట మురళి, ఎనుములదొడ్డి మాజీ సర్పంచ్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. -
40 మంది రైతుల పొలాల్లో కేబుల్ అపహరణ
బొమ్మనహాళ్: మండలంలోని నేమకల్లు శివారున వ్యవసాయ బోరు బావుల మోటార్లకు అనుసంధానం చేసిన కేబుల్ను దుండగులు అపహరించారు. ఒక్క రాత్రిలోనే ఏకంగా 40 మంది రైతుల పొలాల్లోని కేబుల్ను అపహరించుకెళ్లడం సంచనలం రేకెత్తిస్తోంది. సోమవారం ఉదయం పొలాలకు వెళ్లిన రైతులు విషయాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఒక్కో మోటర్ వద్ద సుమారు 30 మీటర్ల మేర కేబుల్ను ఎత్తుకెళ్లినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ లెక్కన దాదాపు రూ. 3 లక్షల విలువైన కేబుల్ను అపహరించుకెళ్లినట్లుగా రైతులు వాపోయారు. గతంలోనూ ఇలానే కత్తిరించారని, ఎవరికి వారు మళ్లీ కేబులు తెచ్చుకుని ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. ఇప్పుడు ప్రతి మోటార్కు రూ. 7,500 ఖర్చు చేసి కేబుల్ వైరు కోనాల్సి వస్తుందని, మళ్లీ ఏ రోజు దొంగలు ఎత్తుకెళ్తారో కూడా తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత రైతులు బోయ రామాంజనేయులు, పరమేష్, బోయ గౌసిద్ద, కురుబ హనుమంతప్ప, దానమ్మ, వన్నూరుస్వామి, కుమ్మది వన్నూరుస్వామి, అంగడి ముత్తు తదితరుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
అంగన్వేడి కేంద్రాలు
తాడిపత్రి రూరల్: జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఎండల తీవ్రతతో పెద్దలు సైతం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడి పోతున్నారు. ఉదయం 10 గంటలకే ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకూ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. కానీ అంగన్వాడీ ఫ్రీ సూళ్లకు వెళ్లే 3–6 ఏళ్ల లోపు చిన్నారులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు ఇవ్వలేదు. అటు తెలంగాణ, ఇటు కర్ణాటక రాష్ట్రాలు సైతం అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించాయి. చంద్రబాబు సర్కారు మాత్రం చిన్నారులకు వేసవి సెలవులు ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండల కారణంగా తమ పిల్లలకు వడదెబ్బ సోకి ఏమైనా జరిగితే అందుకు చంద్రబాబు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చిన్నారుల తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు. ఒంటిపూట.. అయినా ఇబ్బందే జిల్లా వ్యాప్తంగా 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 2,079 అంగన్వాడీ కేంద్రాలతో పాటు 223 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 71వేలకు పైగా చిన్నారులు ఉండగా 3నుంచి 6ఏళ్లలోపు చిన్నారులు 35650మంది ఉన్నారు. 7,655 మంది గర్భిణులు, 7,250 మంది బాలింతలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా సేవలు అందుకుంటున్నారు. అంగన్వాడీ సెంటర్లల్లోని చిన్నారులకు ఉక్కపోత తప్పడం లేదు. రోజు రోజుకు పెరుగుతున్నా ఉష్ణోగ్రతల వల్ల ఎక్కడ చిన్నారులు వడదెబ్బ, అనారోగ్యాలకు గురవుతారోనన్నా భయంతో తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలకు పంపడం లేదు. జిల్లాలో ఎండల తీవ్రత కారణంగా తాడిపత్రి మండలంలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. అలాగే మరికొన్ని మండలాల్లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు జిల్లా విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఎండలు ఇలాగే కొనసాగితే వడగాలులు వీచే అవకాశం ఉందని సంస్థ నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇలాంటి తరుణంలో అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించకుండా ప్రభుత్వం ఉదయం 8 నుంచి 12గంటల వరకు చిన్నారులకు ఒంటిపూట బడి నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే మధ్యాహ్నం 12 గంటల తర్వాత సెంటర్ల నుంచి దూరంగా వివాసముంటున్న చిన్నారులు ఇళ్లకు తమ తల్లిదండ్రులతో మండుటెండలో నడుచుకుంటూ వెళుతుండటం సాహసంగా మారుతోంది. దీంతో చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. అసౌకర్యాల మధ్య అంగన్వాడీ కేంద్రాలు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు ఎక్కువగా అద్దె ఇళ్లల్లో అసౌకర్యాల మధ్య ఉంటున్నాయి. పట్టణాల్లో అత్యధికం అద్దె ఇళ్లే. గ్రామీణ ప్రాంతాల్లో కొంత వరకు పక్కా భవనాలు ఉన్నాయి. ఇరుకై న భవనాల్లో అసౌకర్యాల మధ్య చిన్నారులతో పాటు సిబ్బంది సైతం అల్లాడిపోతున్నారు. కొన్ని కేంద్రాల్లో ఫ్యాన్లు ఉన్నా... అప్రకటిత విద్యుత్ కోత, ఇతర కారణాలతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. విద్యార్థులు ఉక్కపోతను భరించకలేక పోతున్నారు. ఈ క్రమంలో ఎండ తీవ్రత పెరిగినప్పటి నుంచి సగానికి పైగా చిన్నారులు కూడా హాజరు కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం మీనవేశాలు లెక్కిస్తోంది. ఉక్కపోతతో అల్లాడిపోతున్న చిన్నారులు వేసవి సెలవుల ప్రకటనపై చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం తెలంగాణ, కర్ణాటకలో సెలవులు ప్రకటించిన ప్రభుత్వాలు వేసవి సెలవులు ఇవ్వాలి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఉక్కపోతలతో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణలో టీచర్లు, ఆయాలు ఇబ్బందులు పడుతున్నారు. మే నెలంతటా సెలవులు ఇవ్వాలి. ఇదే విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర నాయకత్వం ప్రయత్నిస్తోంది. ఐసీడీఎస్ పీడీని కలిసి వేసవి సెలవులపై ప్రస్తావించనున్నాం. – రమాదేవి, అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
వైఎస్సార్ ఆశయాలు కొనసాగిస్తాం
రాయలసీమ విషయంలో వైఎస్సార్ ఆశయాలను కొనసాగించడమే లక్ష్యంగా ముందుకెళ్తాం. ఇక్కడి ప్రజల కష్టాలను తెలుసుకున్న వైఎస్ జగన్ పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. రైతులకు మంచి చేయాలని వైఎస్ కుటుంబం ఎప్పుడూ చూస్తుంది. కానీ చంద్రబాబు ఆ దిశగా వెళ్లకపోవడం బాధాకరం. పోలవరం ఎత్తు తగ్గించడం, రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను ప్యాకేజీలకు త్యాగం చేయడమే చంద్రబాబు రాజకీయం. పాలమూరు – రంగారెడ్డి ద్వారా రోజుకు 8 టీఎంసీల నీళ్లు ఎత్తుకెళ్లిపోతున్నారు. హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేసి ఎక్కువ నీళ్లు తేకుండా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చి కమీషన్లు దండుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు లైనింగ్ పనులు చేశారు. – తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే -
ఇది చేతకాని ప్రభుత్వం
జగన్ పథకాలన్నీ పేర్లు మార్చి కొనసాగిస్తూ క్రెడిట్ చోరీ చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని రంగాలకు అన్యాయమే. నీటి పంపకాల విషయంలో ఆరు జిల్లాల ప్రజలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు. మనకు రావాల్సిన నీటి హక్కుల కోసం అందరం కలిసికట్టుగా పోరాటానికి సిద్ధమవుదాం. చంద్రబాబు చీకటి ఒప్పందాలను తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి బయటపెట్టారు. రేవంత్ వ్యాఖ్యలపై ఏ ఒక్క టీడీపీ నాయకుడూ నోరు విప్పడం లేదు. – టీఎన్ దీపిక, హిందూపురం సమన్వయకర్త -
పోలీసుల వైఫల్యంతోనే హత్యలు
● మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిటౌన్: తాడిపత్రిలో జరిగిన హత్యలకు పోలీసుల వైఫల్యమే కారణమని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు. పోలీస్ అధికారులు మట్కా, గ్యాంబ్లింగ్ మామూళ్ల మత్తులో పడి శాంతిభద్రతలను గాలికొదిలేశారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ కార్యకర్త అబ్దుల్ హత్య విషయం తెలుసుకున్న ఆయన ఆదివారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి విలేకరులతో మాట్లాడారు. తాడిపత్రిలో పోలీసులకు చట్టంతో పని లేదని, డబ్బులు సంపాదించుకుంటే రేపు ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఫర్వాలేదు.. వ్యాపారాలు చేసుకోవచ్చనే ధీమాతో ఉన్నారన్నారు. ఓ పోలీస్ అధికారే మహిళలను ఈవ్టీజింగ్ చేస్తున్నారన్నారు. ఈ విషయంలో ఎస్పీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పోలీసులు సివిల్ పంచాయితీలు చేస్తూ.. మాట వినని వారిపై గంజాయి కేసులు నమోదు చేస్తామంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. సామాన్యులు న్యాయం కోసం పోలీస్స్టేషన్కు వెళ్లే పరిస్థితి లేదన్నారు. టీడీపీ నాయకులు నేరాలకు పాల్పడినా గంటలోపే స్టేషన్ బెయిల్ ఇస్తున్నారని, అదే వైఎస్సార్సీపీ కార్యకర్త యాక్టివ్గా ఉంటే చాలు అక్రమ కేసులు నమోదు చేస్తూ జైలుకు పంపుతున్నారని విమర్శించారు. పోలీసులు పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. -
పునాది దశ నుంచి అభ్యసన పటిష్టంగా ఉండాలి
అనంతపురం ఎడ్యుకేషన్: పునాది దశ నుంచే పిల్లల్లో అభ్యసనం పటిష్టంగా ఉండాలని ఐసీడీఎస్ సిబ్బందిని పీడీ శశికళ ఆదేశించారు. ప్రీ ప్రైమరీ స్థాయిలో అభ్యసన పటిష్టం చేయడానికి ఉమ్మడి జిల్లా పరిధిలోని మండల స్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ టీచర్లు, అంగన్వాడీ సూపర్వైజర్లకు అనంతపురం నగర శివారు పంగల్రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో 6 రోజుల పాటు జరిగే ‘జ్ఞానజ్యోతి’ శిక్షణను సోమవారం ఆమె ప్రారంభించి, మాట్లాడారు. సమగ్ర శిక్ష ఏఎంఓ వేణుగోపాల్ మాట్లాడుతూ పిల్లల అభ్యాసనకు ప్రీ ప్రైమరీ దశ చాల ముఖ్యమైందన్నారు. ఆ దశలో వారు నేర్చుకునే విధానం బాగుంటే భవిష్యత్తులో అభ్యసన పటిష్టంగా ఉంటుందన్నారు. ఈ శిక్షణ ద్వారా మండల స్థాయిలో అంగన్వాడీ టీచర్లు పటిష్టమైన బోధనను అందించడానికి దోహరపడుతుందన్నారు. శ్రీసత్యసాయి జిల్లా సమగ్ర శిక్ష ఏఎంఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. డీఆర్పీలు శిక్షణా కార్యక్రమం సద్వినియోగం చేసుకుని క్షేత్రస్థాయిలో విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేలా చూడాలని కోరారు. ఐసీడీఎస్ పీడీ శశికళ -
అడకత్తెరలో గ్రంథాలయ పాలకులు
అనంతపురం కల్చరల్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేటి (మంగళవారం) నుంచి నలబై రోజుల పాటూ ‘వేసవి విజ్ఞాన శిక్షణా శిబిరం’ నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రంథాలయ పాలకుల (లైబ్రేరియన్లు) పరిస్థితి అడకత్తెరలో పొకచెక్కలా మారింది. అసలే మూడు నెలలుగా జీతాలందక సతమతమవుతున్న నేపథ్యంలో ఎలాంటి నిధులు విడుదల చేయకనే వేసవి శిక్షణా శిబిరాలను నిర్వహించాలంటూ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు గోరు చుట్టపై రోకటి పోటులా మారింది. జీతాలు వచ్చే రోజుల్లోనూ అరకొర బడ్జెట్ విడుదల కావడంతో ఇబ్బంది పడిన లైబ్రేరేయన్లు.. ఈసారి జేబులో చిల్లిగవ్వలేకుండా సమ్మర్ క్యాంపులు ఎలా నిర్వహించాలో తెలియక మదన పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 70 గ్రంథాలయాలు ఉన్నాయి. వీటిల్లో గ్రేడ్ 1 గ్రంథాలయాలుగా జిల్లా కేంద్ర గ్రంథాలయంతో పాటూ ధర్మవరం, రాయదుర్గం, గుంతకల్లు ఉండగా గ్రేడ్ – 2 గ్రంథాయాలు 8 ( గుత్తి, ఉరవకొండ, పెనుకొండ, కదిరి, మడకశిర, తాడిపత్రి, కల్యాణదుర్గంతో పాటూ జిల్లాకేంద్రంలోని ఉమెన్స్ లైబ్రరీ) ఉన్నాయి. మిగిలిన 58 గ్రంథాలయాలు గ్రేడ్ 3 పరిధిలోకి వస్తాయి. వీటిన్నంటిలో ఈ నెల 28 నుండి జూన్ నెల 6 వరకు సమ్మర్ క్యాంపులు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా వేసవి శిక్షణా శిబిరాల నిర్వహణకు గ్రేడ్ 1 గ్రంథాలయాలకు రూ.15 వేలు, గ్రేడ్ 2 గ్రంథాలయాలకు రూ.12 వేలు, గ్రేడ్ 3 గ్రంథాలయాలకు రూ.10 వేలు చొప్పున మాత్రమే నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఈ నిధులతో 40 రోజుల పాటు శిబిరం నిర్వహణ సాధ్యం కాదు. శిక్షణ ఇచ్చేందుకు వచ్చేవారికి కనీసం గౌరవ భత్యం ఇవ్వాలి. నిత్యం విద్యార్థులకు మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్లు ఇవ్వడం, వివిధ రకాల పోటీలకు కొంతలో కొంత సామగ్రిని సమకూర్చుకోవడం, ముగింపు రోజు ఉత్సవం నిర్వహించి విద్యార్థులకు బహుమతుల ఖర్చులు కలుపుకుంటే ప్రభుత్వం విడుదల చేసే నిధులకు రెట్టింపు అవుతుంది. దీంతో ఏటా గ్రంథాలయాధికారులు తమ సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రభుత్వ ఉత్తర్వులను పాలిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ వేసవికి ముందు మూడు నెలలుగా జీతాలు లేవు. దీనికి తోడు శిబిరాల నిర్వహణకు బడ్జెట్ కూడా లేదంటే నిర్వహణ భారం మొత్తం గ్రంథాలయాధికారులపై పడుతోంది. ఇప్పటికే గత గ్రంథాలయ వారోత్సవాల బిల్లులు, రెండు సమ్మర్ క్యాంపుల బిల్లులు నేటికీ పెండింగులో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో మళ్లీ వేసవి శిక్షణ శిబిరాలనగానే చాలా మంది గ్రంథాలయాధికారులు లోలోన అసంతృప్తితో రగిలిపోతున్నారు. నేటి నుంచి వేసవి విజ్ఞాన శిబిరాల నిర్వహణ నిధులు కేటాయించకపోవడంతో తీవ్ర ఇబ్బంది నేటికీ అందని గత రెండేళ్ల వేసవి శిబిరాల నిర్వహణ బిల్లులు ఇప్పటికే పేరుకుపోయిన మూడునెలల వేతన బకాయిలు సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి విద్యార్థులను మనోవైజ్ఞానికంగా ఉన్నతులను చేసే గ్రంథాలయాల సమ్మర్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ వడ్డే వెంకట్, కార్యదర్శి కమ్మన్న పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం కేంద్ర గ్రంథాలయంలో సమ్మర్ క్యాంపు పోస్టర్లను గ్రంథాలయాధికారులతో కలసి వారు ఆవిష్కరించి, మాట్లాడారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది గోవిందు, రాజు, రామాంజనమ్మ తదితరులు పాల్గొన్నారు. -
బాబుది దుర్మార్గపు ఆలోచన
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపాలనేది దుర్మార్గపు ఆలోచన. వైఎస్ రాజశేఖర రెడ్డి వ్యవసాయాన్ని పండగ చేశారు. మడకశిర వరకు కృష్ణా జలాలను తీసుకొచ్చారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తయితే రోజుకు 3 టీఎంసీల నీళ్లు మనకు దక్కుతాయి. చంద్రబాబు తన స్వార్థ రాజకీయం కోసం తెలంగాణ వద్ద మన నీళ్లను తాకట్టు పెడుతున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటా రైతులకు నష్టమే. బోరుబావులు ఎండిపోతున్నాయి. వర్షాలు లేక పంటలు చేతికందడం లేదు. అరకొరగా దక్కినా గిట్టుబాటు కావడం లేదు. – ఈరలక్కప్ప, మడకశిర సమన్వయకర్త -
పెట్రోల్పై ఆందోళన వద్దు
అనంతపురం అర్బన్: జిల్లాలో ఇంధన (డీజిల్–పెట్రోల్) కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. ఇంధన కొరత అంశంపై కలెక్టర్ సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో తగినంత పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. స్టాక్ ఉండదనే ఆందోళనతో వాహనదారులు అవసరానికి మించి కొనుగోలు చేసి నిల్వ చేసుకోవద్దని సూచించారు. జిల్లాలోని 204 అవుట్లెట్లలో 16 చోట్ల మాత్రమే స్టాక్ లేదన్నారు. వాటికి త్వరలోనే స్టాక్ వస్తుందన్నారు. మిగిలిన వాటిలో యథావిధిగా ఇంధనం పంపిణీ జరుగుతోందన్నారు. బంక్ల వద్ద పర్యవేక్షణకు ప్రత్యేకంగా రెవెన్యూ, పోలీసు అధికారులను నియమించామన్నారు. కొందరు బల్క్గా పెట్రోల్, డీజిల్ను నేరుగా కంపెనీల నుంచి కాకుండా రిటైల్ అవుట్లెట్ల నుంచి డ్రమ్ములు, బ్యారెళ్లలో కొనుగోలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వారి వివరాలు రిజిష్టర్లో నమోదు చేయాలని బంక్ యజమానులను ఆదేశించామన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఇంధన సమస్యలపై వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. 85002 92992, 08554–220009, 234122, 239822, 1800 425 8804 నంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలన్నారు. పెట్రోల్ బంక్ల తనిఖీ కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సోమవారం నగరంలోని పలు పెట్రోల్ బంక్లను వేరువేరుగా తనిఖీ చేశారు. -
వైఎస్ కుటుంబమే రైతుకు అండ
రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోతే అనంతపురం జిల్లా ఎడారి ప్రాంతంగా మారడం ఖాయం. ప్రజలందరూ ఉద్యమ బాట పట్టాలి. రైతులకు అండగా నిలిచేది ఒక్క వైఎస్ కుటుంబమే. చంద్రబాబు వ్యవసాయం దండగ అని ఎప్పుడూ అనేవారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్, ఇన్పుట్ సబ్సిడీ తీసుకొచ్చారు. సాగునీటి రంగానికి రూ.లక్ష కోట్లను బడ్జెట్లో ప్రతిపాదించిన ఘనత వైఎస్సార్దే. హంద్రీ–నీవా పూర్తి చేయించి రాయలసీమకు నీళ్లు తెచ్చారు. పోలవరం వైఎస్ చొరవే. ఇప్పుడు సీమకు అన్యాయం జరుగుతుంటే రాష్ట్ర మంత్రులు విదేశీ పర్యటనలో జల్సాలు చేస్తుండటం సిగ్గుచేటు. – కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే -
వైఎస్ చొరవతోనే హంద్రీ–నీవా
రాయలసీమలో నీళ్ల అవసరాలు తీర్చేందుకు హంద్రీ–నీవాను వైఎస్సార్ పూర్తి చేశారు. అప్పట్లోనే కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లారు. కమీషన్ల కక్కుర్తితో కాలువలో లైనింగ్ పనులు చేయించి అంతా తానే చేసినట్లు చంద్రబాబు చెబుతున్నారు. సీమలో నీటి ఆవశ్యకత గురించి టీడీపీ నాయకులకు ఏమీ తెలియదని అర్థమవుతోంది. ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్’ ఆపేందుకు చంద్రబాబు ఒప్పుకున్నారని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో చెప్పడం బాబు ద్రోహానికి నిదర్శనం. స్వార్థ రాజకీయాల కోసం రాయలసీమ ప్రజల హక్కులను టీడీపీ కాలరాస్తోంది. ఈవీఎంలతో గెలిచారు కనుకనే ప్రజా ప్రయోజనాలతో ఏం పని అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. – వై.విశ్వేశ్వరరెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే -
ఉపాధి కూలీలను ఆదుకోవాలి
అనంతపురం అర్బన్: ఉపాధి హామీ కూలీలను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు బి.యోగేంద్రరెడ్డి విమర్శించారు. సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగేంద్రరెడ్డి మాట్లాడారు. 2025 డిసెంబరు నుంచి కూలీలకు వేతనాలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. బకాయిపడిన వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. కూలీలకు సమృద్ధిగా పనులు కల్పించాలన్నారు. పని ప్రాంతంలో నీరు, నీడ, మందుల సదుపాయం కల్పించాలన్నారు. కూలీలు అడిగిన వెంటనే పనులు కల్పించి వలసలు ఆపాలన్నారు. నకిలీ మస్టర్లను అరికట్టాలన్నారు. ఉపాధి హామీ పనుల్లో వెలుగుచూసిన అవినీతిపై తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. కూలీల సమస్యలు పరిష్కరించి ఆదుకునే వరకూ ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ ఆనంద్ను కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నాయకులు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ పీఆర్ విభాగం ఉపాధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు నాగేంద్రరెడ్డి, బి.కిరణ్కుమార్, హంపారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సీవీ రంగారెడ్డి, ఉరవకొండ, తాడిపత్రి, అనంతపురం అధ్యక్షులు ఏసీ రంగారెడ్డి, యోగేశ్వరరెడ్డి, విజయకుమార్, జిల్లా కార్యదర్శి జగదీష్, నాయకులు గుత్తి చంద్ర, ఉరవకొండ రామకృష్ణ, అనంతపురం షేక్బీ, తదితరులు పాల్గొన్నారు. ధర్నాలో వైఎస్సార్సీపీ పంచాయతీ రాజ్ విభాగం నాయకులు -
‘బీసీ గళం’ విజయవంతం కావడంతో టీడీపీలో వణుకు
అనంతపురం: ‘బీసీ గళం’ కార్యక్రమం ఘన విజయం సాధించడంతో టీడీపీ వెన్నులో వణుకు పుట్టిందని వైఎస్సార్సీపీ బీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్గౌడ్ అన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారీ సంఖ్యలో బీసీ నాయకులు తరలివచ్చి విజయవంతం చేసినందుకు, కార్యక్రమానికి హాజరు కావడంతో పాటు అన్ని విధాలుగా సహకారం అందజేసిన ఉమ్మడి జిల్లా నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న మోసాలకు తిరుగుబాటుగా బీసీలు పెద్ద సంఖ్యలో హాజరై గళం వినిపించారన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో వణుకు పుట్టిన ఎంపీలు అంబికా లక్ష్మీనారాయణ, బి.కె.పార్థసారథి, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, ఆర్టీసీ జోనల్ చైర్మన్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పూల నాగరాజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి హేళన చేస్తూ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. తక్షణమే బీసీలకు వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా టీడీపీలో బీసీల పక్షాన వీరు ఏనాడూ మాట్లాడిన పాపాన పోలేదన్నారు. రెడ్బుక్ పేరుతో రాష్ట్రంలో బీసీలపై దాడులకు తెగబడుతున్నా.. కనీసం పల్లెత్తు మాట మాట్లాడకుండా ఎందుకు మౌనం పాటిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. బీసీ గళం విజయవంతం కావడంతో కంటి మీద కునుకు దూరమై బీసీలను మభ్య పెట్టే కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. బీసీల న్యాయమైన డిమాండ్లను ఒక్కసారైనా పార్లమెంట్లో వినిపించలేని అసమర్థులు ఎంపీలుగా ఉన్నారని విమర్శించారు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకు కనీసం జ్యోతిరావు పూలే అనే పేరు పలకడం కూడా రాదన్నారు. పార్టీ ఎస్ఈసీ సభ్యుడు మీసాల రంగన్న మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని కూటమి పార్టీల నాయకుల్లో బీసీలు పెద్ద సంఖ్యలో ఉన్నా... ఏ ఒక్కరైనా బీసీల గురించి మాట్లాడలేకపోతున్నారని మండిపడ్డారు. సీనియర్ నేత కేవీ రమణ మాట్లాడుతూ.. బీసీలకు అండగా నిలిచిన ఏకై క నాయకుడు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డినే అన్నారు. సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు రిలాక్స్ నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దాడులకు నిరసనగా ఏర్పాటు చేసిన బీసీ గళం విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ ఈ తరహా కార్యక్రమాన్ని ఏ నాయకుడూ నిర్వహించలేదన్నారు. బీసీ సెల్ నగర అధ్యక్షుడు బోయ లక్ష్మన్న మాట్లాడుతూ.. జిల్లాలో బీసీలపై దాడులు జరుగుతున్న స్పందించని టీడీపీ నాయకులకు బీసీ గళం కార్యక్రమం విజయవంతమై వెన్నులో వణుకు పుట్టించిందన్నారు. కార్యక్రమంలో బీసీ నాయకులు బెస్త వెంకటేష్, అంకె తేజ, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్గౌడ్ -
సామాజిక విప్లవానికి ఆద్యుడు జగన్
బీసీలంటే బ్యాక్ బోన్ అని చాటిన నాయకుడు మాజీ సీఎం వైఎస్ జగన్. 2019 ఎన్నికల్లో బీసీల సంక్షేమం కోసం ఏటా రూ.15 వేల కోట్లు కేటాయిస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఐదేళ్లలో ఏకంగా రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసి రికార్డు సృష్టించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 24 మంది మంత్రులలో 11 మంది బీసీలకు చోటు కల్పించారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బీసీలకు అవకాశం కల్పించి సామాజిక విప్లవానికి వైఎస్ జగన్ నాంది పలికారు. డైవర్షన్ పాలిటిక్స్తో కాలం నెట్టుకొస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి జనరంజక పాలన కోసం జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది. – అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
జనగణనలో ప్రజలు భాగస్వాములవ్వాలి
అనంతపురం అర్బన్: జనగణనలో ప్రజలందరూ స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ముఖ్య సెన్సస్ అధికారి, కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. జనగణనపై అవగాహన కోసం సెన్సస్ విభాగం ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురంలో 5కే రన్ నిర్వహించారు. కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆర్ట్స్ కళాశాల వద్ద ప్రారంభమై 5కే రన్ క్లాక్టవర్, కోర్టురోడ్, ప్రభుత్వ ఆస్పత్రి, జిల్లా పరిషత్, సప్తగిరి సర్కిల్, రాజురోడ్, శ్రీకంఠం సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా తిరిగి ఆర్ట్స్ కళాశాల వద్దకు చేరుకుంది. కలెక్టర్ మాట్లాడుతూ జనగణన ప్రక్రియలో భాగంగా ప్రవేశపెట్టిన స్వీయ గణన (సెల్ఫ్ ఎన్యుమరేషన్)పై ప్రజలకు అవగాన కల్పించడం కోసమే 5కే రన్ ముఖ్య ఉద్దేశమన్నారు. స్వీయగణన అనేది వివరాల నమోదు మాత్రమే కాదన్నారు. అది దేశం విషయంలో మనకున బాధ్యత అన్నారు. జనగణనలో నమోదు చేసుకునే వివరాలను దేశ అభివృద్ధికి, సంక్షేమానికి రచించే ప్రణాళికల కోసం వినియోగిస్తారన్నారు. ఈ విరాలు అంత్యంత గోప్యంగా ఉంటాయన్నారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదన్నారు. జిల్లాలో 10 లక్షల కుటుంబాలు ఉండగా.. ఇప్పటి వరకు 32 వేల కుటుంబాలు మాత్రమే ఆన్లైన్ పోర్టల్లో తమ వివరాలను నమోదు చేసుకున్నాయన్నారు. స్వీయగణన ఈ నెల 30 వరకు కొనసాగుతుందన్నారు. మిగిలిన వారందరూ ఈ నాలుగు రోజుల వ్యవధిలో స్వీయ గణన ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. స్వీయ గణనలో నమోదు చేసుకున్న తరువాత ఐడీ సంఖ్య వస్తుందన్నారు. వివరాలను సేకరణకు మే–1 తేదీ నుంచి ఆ నెల 30వ తేదీ వరకు ఎన్యుమరేటర్లు ఇంటింటికి వస్తారన్నారు. ఆ సమయంలో ఎన్యుమరేటర్లకు ఐడీ నెంబర్ చెబితే సరిపోతుందన్నారు. వివరాలను రీ–వెరిఫై చేసే ప్రక్రియను సమర్థవంతంగానూ త్వరగా పూర్తి చేస్తారన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల, ఏఎస్పీ ఇలియాజ్ బాషా, ఆర్డీఓ కేశవనాయుడు, నగర పాలక సంస్థ కమిషనర్ జస్వంత్రావు, డీఎస్పీ శ్రీనివాసులు, నీటకంఠారెడ్డి, సీపీఓ అశోక్కుమార్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మశ్రీ, ఆర్ఐఓ వెంకటరమణ, డీఐపీఆర్ఓ బాలకొండయ్య, జిల్లా క్రీడాధికారి మంజుల, జిల్లా అధికారులు, తహసీల్దారు, సెన్సస్ విభాగం అధికారులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. -
బీసీలంటే జగన్.. జగనంటే బీసీలు
సామాన్య కార్యకర్తగా ఉన్న నన్ను వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తించి ఎమ్మెల్సీగా చేశారు. బీసీలు అంటే జగన్, జగన్ అంటే బీసీలు అనే రీతిలో గుండెల్లో పదిలంగా ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు గడుస్తున్నా బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తానన్న హామీ ఏమైంది? రానున్న 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకుంటే బీసీలకు మళ్లీ స్వర్ణయుగమే. – రమేష్ యాదవ్, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు -
ఆప్షన్ మార్పు పక్రియను వేగవంతం చేయండి
అనంతపురం టౌన్: జిల్లాలో గృహ నిర్మాణాలకు సంబంధించి ఆప్షన్–3 ఇళ్లను ఆప్షన్–1లో మార్పు చేసే పక్రియను వేగవంతం చేయాలని గృహ నిర్మాణ సంస్థ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ శైలజా అధికారులను ఆదేశించారు. ఆదివారం హౌసింగ్ డీఈ, ఏఈలతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 10 వేల ఇళ్లకు పైగా ఆప్షన్–3 కింద ఉన్నాయన్నారు. వాటి నిర్మాణ పనులు సైతం వివిధ దశల్లో ఉన్నాయన్నారు. లబ్ధిదారులతో చర్చించి ఆప్షన్–1 కిందకు మార్చేలా చర్యలు చేపట్టాలన్నారు. కొన్ని డివిజన్లలో ఆప్షన్ మార్పు ప్రక్రియ మందకోడిగా సాగుతోందన్నారు. ప్రధానంగా అనంతపురం అర్బన్ పరిధిలోని ఆలమూరు, కొడిమి లేఅవుట్లలో ఆప్షన్–3 లబ్ధిదారులతో మాట్లాడి మార్పు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. గురుకులం విద్యార్థి అదృశ్యం ఉరవకొండ: మండల పరిధిలోని కొనకొండ్ల బీసీ గురుకులంలో 7వ తరగతి చదువుతున్న కార్తీకేయ అదృశ్యమైనట్లు విద్యార్థి తండ్రి గురు ఆదివారం ఉరవకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురు మాట్లాడుతూ.. పాఠశాలలకు సెలవులు వదలడంతో తన కుమారుడిని అనంతపురంలోని తన చెల్లెలు ఇంట్లో వదిలిపెట్టానన్నారు. అయితే తిరిగి అనంతపురం నుంచి ఉరవకొండకు వచ్చిన తన కుమారుడు కనిపించకుండా పోయాడన్నారు. రెండు రోజుల నుంచి అన్నిచోట్లా వెతికినా ఆచూకీ లభ్యం కాలేదన్నారు. కార్తికేయ ఆచూకీ తెలిసిన వారు సెల్: 8074104223కు సమాచారం ఇవ్వాలన్నారు. ఆర్ట్స్ కళాశాలలో రేపు ఉద్యోగ మేళా అనంతపురం ఎడ్యుకేషన్: స్థాని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) హొనూర్ ల్యాబ్ లిమిటెడ్ సంస్థ, జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసీ) ఆధ్వర్యంలో ఈనెల 28న ఆర్ట్స్ కళాశాలలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పద్మశ్రీ ఒక ప్రకటనలో తెలిపారు. తృతీయ సంవత్సరం డిగ్రీ/ఫార్మసీ చదువుతున్న విద్యార్థులు, డిగ్రీ పూర్తీ చేసిన 21–28 మధ్య వయసు గల పురుషులు మాత్రమే పాల్గొనాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు విద్యార్హత సర్టిఫికెట్లు, బయోడేటా, ఆధార్ కార్డుతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని ప్రిన్సిపాల్తో పాటు జేకేసీ కోఆర్డినేటర్ జీవన్కుమార్ కోరారు. వివరాలకు 94413 88434 నంబరును సంప్రదించాలన్నారు. పి.కొత్తపల్లికి చెందిన విద్యార్థి గుజరాత్లో ఆత్మహత్య పుట్లూరు: మండలంలోని పి.కొత్తపల్లికి చెందిన విద్యార్థి పవన్కుమార్ నాయుడు (19) గుజరాత్ రాష్ట్రంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామస్తుల వివరాలమేరకు.. రామానాయుడు, రాధమ్మ దంపతుల కుమారుడు పవన్కుమార్ నాయుడు గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ సమీపంలో ఉన్న అకలేశ్వర్ వద్ద ఉన్న పీపీ సవాణి యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం తెల్లవారుజామున హాస్టల్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమైయ్యారు. తమ ఏకై క కుమారుడు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో తెలీడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మత్తుకు నిండు ప్రాణం బలి● బైక్ ఢీ కొని వ్యక్తి మృతి యాడికి: మద్యం మత్తు ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. వివరాలు.. కర్నూలు జిల్లా మంత్రాలయంకు చెందిన రాజన్న (40) రెండేళ్లుగా యాడికి మండలం రాయలచెరువు వద్ద ఉన్న తమలపాకు తోటలో కూలి పనులు చేస్తున్నాడు. రాయలచెరువులోని ఉన్నత పాఠశాల వద్ద ఓ గదిని అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. ఆదివారం సాయంత్రం రాజన్న పెరుగు ప్యాకెట్ తీసుకొని ఇంటికెళ్తున్నాడు. పెద్దవడుగూరు మండలం అప్పేచెర్లకు చెందిన దస్తగిరి ద్విచక్ర వాహనంతో చందన రైల్వేగేట్ వద్ద రాజన్నను బైక్తో ఢీకొనడంతో చనిపోయాడు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసులు మృతుడి భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే దస్తగిరి తాగిన మైకంలో బైక్తో ఢీ కొనడంతో రాజన్న చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కదిరి అర్బన్: మండల పరిధిలోని కదిరి కుంట్లపల్లి వద్ద కదిరి – పులివెందుల రహదారిపై కారు.. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న ప్రమాదంలో కదిరి కుంట్లపల్లి రాజారెడ్డి కాలనీకి చెందిన రామకృష్ణ (58) మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. రామకృష్ణ తన ద్విచక్ర వాహనంలో సొంత పని నిమిత్తం కదిరికి బయలుదేరాడు. కదిరి నుంచి పులివెందుల వైపు వెళ్తున్న కారు ఢీ కొనడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వైభవంగా ‘దేవర ఎద్దు వేల్పు’
తలుపుల: మండలంలోని బండ్లపల్లిలో ఓబుళేశ్వరస్వామి రూపంగా కొలిచే దేవర ఎద్దు వేల్పు ఉత్సవం ఆదివారం వైభవంగా ముగిసింది. ఈ వేల్పుకు 11 నాణేలుగా పిలువబడే ఇద్దరు చౌడమ్మలు, ఎల్లమ్మతో పాటు కదిరి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చిన 8 దేవర ఎద్దులు బాజా భజంత్రీలతో వచ్చారు. నాలుగేళ్ల క్రితం దేవర ఎద్దు చనిపోయింది. గత ఏడాది తూపల్లిలో ఎద్దుల కోపు పెట్టి పూజా కార్యక్రమంలో బియ్యం బేడలు తిన్న లేగ దూడను ఓబుళేశ్వరస్వామి స్వరూపంగా గుర్తించారు. అప్పటి నుంచి ఇలకాపులు, భక్తులు దేవర ఎద్దు వేల్పు ఏర్పాట్లకై సహకారం అందిస్తున్నారు. ఆదివారం వారందరూ బండ్లపల్లికి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఇరవై ఏళ్ల తర్వాత ఇంత ఘనంగా కార్యక్రమం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఉదయం నుంచి ఓబుళేశ్వరస్వామి స్వరూపంగా భావించే దేవర ఎద్దుతో కల్యాణం నిర్వహించి 11 నాణేలతో ఆశీర్వాదం తీసుకొని పసుపును దేవర ఎద్దుపై చల్లుతూ పొదిలో వదిలారు. వచ్చే శనివారం దేవర ఎద్దుకు ముద్రవేసి గ్రామ స్వరూప దేవతగా దేవర ఎద్దును బహిరంగంగా వదిలేస్తారు. -
రారండోయ్ వేడుక చూద్దాం
ఉరవకొండ/ఉరవకొండ రూరల్: రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన లక్ష్మీ నారసింహుడి పుణ్యక్షేత్రాల్లో ఒకటైన పెన్నహోబిళం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈనెల 28 నుంచి మే 9వ తేదీ వరకూ ఉత్సవాలు కొనసాగనున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఆలయ చరిత్ర.. పెన్నహోబిళం లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉన్నట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. విజయనగర సామ్రాజ్యాదీశుడైన సదాశివరాయులు విజయనగం నుంచి పెనుకొండకు వెళ్తూ ఈ క్షేత్రంలో మజలీ అయినట్లు ఆధారాలున్నాయి. ఆయనకు తన స్వప్నంలో స్వామి వారు కనిపించి నీ జైత్రయాత్ర దిగ్విజయమవుతుందని ఆశ్వీరదించినట్లు చెబుతారు. సదాశివరాయులు తన జైత్రయాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణంలో స్వామి వారిని దర్శించుకొని స్వామి వారికి, లక్ష్మిదేవి అమ్మవారి ఆలయాలు నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. స్వామి వారి ఆలయ పాలనకు పెన్నహోబిళ శ్రోతియ గ్రామం దానంగా ఇచ్చారట. ఉదిరిపికొండ ప్రాంత రాజప్రతినిధి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి ఏకశిలగల ధ్వజ స్తంభంతో పాటు రాజు గుర్తుగా ఏకశిల విజయ స్తంభాన్ని క్షేత్రంలో ప్రతిష్టించారు. దాదాపు 45 అడుగుల ఎత్తుగల రెండు శిలలు ఇక్కడ కన్పిస్తాయి. ఇక్కడ లక్ష్మీనృసింహస్వామి, లక్ష్మిదేవి అమ్మవార్లు స్వయంభుగా వెలిశారు. ఈ క్షేత్రం పెన్నానది సమీపంలో ఉండటం, స్వామి వారి పాదముద్రిక కింది భాగాన బిలం ఉండటంతో పెన్నహోబిలంగా పిలవబడుతోంది. ఆలయంలో కింది భాగంలో ఉద్భవ లక్ష్మీదేవి ఆలయంలో 30 ఏళ్లుగా పుట్ట అక్కడ వెలసిన శిల ఎత్తుగా పెరగడం విశేషంగా చెప్పుకొవచ్చు. 28 నుంచి బ్రహ్మోత్సవాలు.. పెన్నహోబిళం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 28 నుంచి ప్రారంభమవుతాయి. 28న ఆమిద్యాల గ్రామం నుంచి శ్రీవారి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా పెన్నహోబిళంకు తీసుకురావడంతో బ్రహ్మోత్సవాలకు అంకుర్పారణ జరగనుంది. 29న ధ్వజారోహణం, ప్రాకారోత్సవం, 30న సింహ వాహోనత్సవం, చంద్రప్రభ వాహనోత్సవం, మే 1న గో, శేష వాహనోత్వం, 2న హంస వాహనోత్సవం, 3న హనుమంత వాహనోత్సవం, 4న గరుడ వాహనోత్సవాలు జరుగుతాయి. అదే రోజు రాత్రి శ్రీవారి కల్యాణం, 5న సూర్యప్రభ, ఐరావత వాహనోత్సవం, 6న శ్రీవారి బ్రహ్మరథోత్సవం, 7న అశ్వ వాహనోత్సవం, 8న ధ్వజారోహణం, 9న ఉత్సవ మూర్తులు ఆమిద్యాలకు ఊరేగింపుగా చేరుకోవడంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. రేపటి నుంచి పెన్నహోబిళం లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవాలు 4న గరుడ వాహనోత్సవం, శ్రీవారి కల్యాణం 6న బ్రహ్మ రథోత్సవం అన్ని ఏర్పాట్లు చేశాం మంగళవారం నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్ రేగాటి నాగరాజు, ఈఓ సాకే రమేష్బాబు తెలిపారు. ఉమ్మడి అనంత జిల్లా నుంచే కాకుండా కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి కూడా బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరాన్నట్లు పేర్కొన్నారు. వారికి భోజన వసతి, తాగునీరు, ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో బ్రహ్మోత్సవాలను విజయంతం చేస్తామన్నారు. పాత రథానికి మరమ్మతు నిర్వహించి ట్రయిల్ రన్ నిర్వహించామన్నారు. – ఆలయ ధర్మకర్త మండలి చైర్మన్, ఈఓ -
ట్రాక్టర్ కింద పడి మహిళా కూలీ మృతి
కూడేరు: ట్రాక్టర్ కింద పడి మహిళా కూలీ శివలింగమ్మ (50) మృతి చెందిన ఘటన ఆదివారం కూడేరు మండల పరిధిలోని అంతరగంగలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలమేరకు.. ఇప్పేరుకు చెందిన సత్యం, శివలింగమ్మ దంపతులు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. దంపతులిద్దరూ వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. ఆదివారం అంతరగంగకు చెందిన ఓ రైతు పొలంలోని వేరుశనగలో కలుపు మొక్కలు తొలగింపునకు శివలింగమ్మ కూలి పనికి వెళ్లింది. అక్కడ ట్రాక్టర్ ట్రాలీ కింద కూలీలు భోజనానికి కూర్చున్నారు. అది గమనించని డ్రైవర్ ట్రాక్టర్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. కూలీలు కేకలు వేయడంతో వెంటనే అప్రమత్తమై బ్రేక్ వేశాడు. అంతలోపే టైర్ శివలింగమ్మ తలకు తగిలింది. వెంటనే ఆమెను అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
రాధేయ సాహితీ సేవలు స్ఫూర్తిదాయకం
అనంతపురం కల్చరల్: అనంత వేదికగా దశాబ్దాల పాటు డాక్టర్ రాధేయ ఉత్తమ సాహిత్యాన్ని ప్రోత్సహిస్తుండడం అభినందనీయమని వక్తలన్నారు. ప్రతిష్టాత్మక కవితా సంపుటాలకందించే ఉమ్మడిశెట్టి అవార్డుల ప్రదానోత్సవం ఆదివారం నగరంలోని ప్రభుత్వ కళాశాల వేదికగా సాగింది. అలాగే ఇటీవల రాధేయ వెలువరించిన కొత్త విమర్శ వ్యాసాల సంపుటి ‘అలజడి మా జీవితం’ పుస్తకావిష్కరణ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు రచయితలు, కవులు అవార్డులనందుకున్నారు. ఉమ్మడిశెట్టి సత్యాదేవి పురస్కారాన్ని శ్రీకాకుళం నుంచి విచ్చేసిన కంచరాన భుజంగరావు, ఉమ్మడిశెట్టి సతీష్ జాతీయ యువ పురస్కారాన్ని సిద్ధిపేటకు చెందిన జాబేర్ షాషా, అలాగే ఒంగోలుకు చెందిన చరణ్పరిమి అందుకున్నారు. కవియిత్రి సుమన ప్రణవ్లు లిటరరీ ట్రస్టు సత్కారాలందుకుంది. డాక్టర్ సుంకర గోపాల్, డాక్టర్ పెళ్లూరు సునీల్, దోర్నాథుల సిద్దార్థ, డాక్టర్ అంకె శ్రీనివాస్ అవార్డులు పొందిన కవుల పుస్తకాలను సమీక్షించారు. -
బీసీలంటే బాబుకు ఓటు బ్యాంకే
చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు. బీసీల సంక్షేమానికి ఎటువంటి ప్రాధాన్యతా ఇవ్వడం లేదు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం స్ఫూర్తితో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమానికి కృషి చేసినది ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే. చంద్రబాబు ప్రభుత్వంలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు నమోదు చేస్తున్నారు. అంతా ‘రెడ్బుక్’ మాటున అరాచక పాలనే. రానున్న రోజుల్లో అందరూ కలిసికట్టుగా వైఎస్సార్సీపీని గెలిపించి అధికారంలోకి తీసుకురావాలి. – సాకే శైలజానాథ్, మాజీ మంత్రి -
తీవ్రమైన పెట్రోల్ కష్టాలు
అనంతపురం అర్బన్: జిల్లా వ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల కొరత తీవ్రమవుతోంది. డీజిల్, పెట్రోల్ కొరత లేదు.. ప్రజలు ఆందోళన చెందాల్సిన అసవరం లేదు అంటూ అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. జిల్లాలోని దాదాపు అన్ని పెట్రోల్ బంకుల్లోనూ డీజిల్, పెట్రోలు పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. కొన్ని బంకుల్లో మాత్రమే ఇంధనం వేస్తున్నారు. మూడు రోజులుగా డీజిల్, పెట్రోల్ స్టాక్ రాలేదని బంకుల నిర్వాహకులు చెబుతున్నారు. మూతపడుతున్న బంక్లు.. జిల్లావ్యాప్తంగా దాదాపు 186 పెట్రోల్ బంక్లు ఉన్నాయి. ఇందులో అనంతపురం నగరంలో 22, పట్టణ, మండలాల పరిధిలో 164 బంకులు ఉన్నాయి. ఇక పెట్రోల్ వినియోగం రోజువారీగా 2.50 లక్షల లీటర్లు, డీజిల్ 3.72 లక్షల లీటర్లుగా ఉంది. అనంతపురంలో ఇప్పటికే దాదాపు 15 బంక్లు స్టాకు లేదని మూసివేశారు. మిగిలిన బంకుల్లో ఇంధనం కోసం వాహనాలు బారులుతీరుతున్నాయి. ధరలు పెరిగే అవకాశం.. డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందున ఇప్పటి వరకు ధరలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని, ఎన్నికలు పూర్తయిన వెంటనే ధరలు పెరగవచ్చని కొందరు డీలర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ధర పెంచే ఆలోచన కారణంగానే బంకులకు డీజిల్, పెట్రోల్ను కంపెనీలు సవ్యంగా సరఫరా చేయడం లేదని తెలిసింది. ప్రస్తుతం డీజిల్ టీటరు ధర రూ.97.50 ఉంది. పెట్రోల్ రూ.109.50 ఉంది. యుద్ధం కారణంగా ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర అధికంగా ఉండడంతో డీజిల్ లీటర్పై ఆయిల్ కంపెనీలకు రూ.70 నుంచి రూ.80 వరకు నష్టం వస్తోందని, దీంతో డీజిల్ వినియోగం అధికంగా ఉండే సంస్థలు, ఇతర పరిశ్రమలకు లీటరు రూ.170తో సరఫరా చేస్తున్నట్లు పెట్రోల్ బంక్ డీలర్ల సంఘం నాయకులు చెబుతున్నారు. ఇదే క్రమంలో బంకులకు ఆయిల్ కంపెనీలు డీజిల్ను సరఫరా చేయడం లేదని తెలిసింది. ఇక పెట్రోల్ విషయాని వస్తే లీటరుపై రూ.15 నుంచి రూ.20 వరకు పెంచే సూచనలు కనిపిస్తున్నాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. స్టాకు లేక మూత పడుతున్న బంకులు ఉన్నచోట పోటెత్తుతున్న వాహనదారులు -
బీసీల ఆత్మగౌరవానికి ప్రతీక జగన్
బీసీల ఆత్మగౌరవానికి ప్రతీక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. బీసీల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు. ఆయన హయాంలో సంక్షేమ పథకం అందని ఇల్లు ఏదైనా ఉందా? సామాజిక, రాజకీయంగా, ఆర్థికంగా బీసీలను ఆదుకునే పార్టీ వైఎస్సార్సీపీ. బీసీల కోసం పదవులను సైతం త్యాగం చేసిన గొప్ప వారు ఈ వేదిక మీదే ఉండడం గర్వకారణం. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం బీసీల హామీలను తుంగలో తొక్కి.. రెడ్బుక్ పేరుతో అక్రమ కేసులు పెట్టి అణచివేస్తోంది. రానున్న రోజుల్లో బీసీలందరూ ఏకమై జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకుంటేనే బీసీలకు సరైన న్యాయం జరుగుతుంది. – రమేష్గౌడ్, వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ -
పదేళ్ల బాలికపై అత్యాచారయత్నం
అనంతపురం సెంట్రల్: అభం శుభం తెలియని చిన్నారిపై ఏడు పదుల వయస్సున్న ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన అనంతపురం నగర శివారులోని రుద్రంపేటలో చోటు చేసుకుంది. వివరాలు.. స్థానికంగా ఉంటున్న ఖాజా హుస్సేన్ (70) ఈ నెల 24న పదేళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించాడు. సదరు బాలిక ఓ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. సెలవులు కావడంతో ఇంటి వద్ద ఆడుకుంటుండగా నిందితుడు గమనించాడు. ఐస్క్రీం కొనుక్కునేందుకు డబ్బు ఇస్తానని ఆశ చూపి ఇంట్లోకి రప్పించుకుని గడియపెట్టాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు గమనించి తల్లికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆమె వెంటనే అక్కడికి చేరుకుని బాలికను రక్షించారు. మరుసటి రోజు కాలనీ వాసులందరికీ తెలియడంతో నిందితుడిని చితకబాది గుండుగీసి ఊరేగించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ శశికళ ఆదివారం ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి స్థానికులను విచారించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. అనంతరం ప్రాజెక్టు డైరెక్టర్ శశికళ 4వ పట్టణ పోలీసుస్టేషన్కు వెళ్లి ఇన్చార్జ్ సీఐ శ్రీకాంత్యాదవ్తో చర్చించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో సుమోటోగా కేసు నమోదు చేసి, నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడిని చితకబాదిన స్థానికులు -
ఇరు వర్గాల మధ్య చిచ్చుపెట్టిన రూ.500 నోటు
రాయదుర్గం టౌన్: పెట్రోల్ బంకులో రూ.500 వేరేది ఇవ్వమన్నందుకు పంప్బాయ్ దాడి చేసిన ఘటన ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. వివరాలు... రాయదుర్గం మండలం కెంచానపల్లికి చెందిన పెళ్లి బృందం రాయదుర్గంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో జరిగిన పెళ్లి వచ్చారు. వివాహం తర్వాత తిరిగి స్వగ్రామానికి బయలు దేరారు. 74 ఉడేగోళం వద్ద ఉన్న పెట్రోల్ బంక్ వద్ద డీజల్ నింపుకుని పంప్ బాయ్ మంజునాథకు రూ.500 నోటు ఇచ్చారు. అయితే నోటుకు రంగు అయిందని వేరేది ఇవ్వాలని మంజునాథ అభ్యర్థించాడు. దీంతో పెళ్లి బృందంలోని కొందరు ఆగ్రహంతో పంప్బాయ్ మంజుపై దాడి చేశారు. దీన్ని అడ్డుకున్న మరో పంపుబాయ్ అశోక్పై కూడా దాడి చేశారు. దాడికి గురైన ఇద్దరు ఉడేగోళం గ్రామానికి చెందిన వారు. విషయం తెలుసుకున్న వారి బంధువులు మంజు, అశోక్తో కలిసి ఫిర్యాదు చేసేందుకు పట్టణంలోని స్టేషన్కు వెళుతుండగా స్టేషన్కు కూతవేటు దూరంలోనే కెంచానపల్లికి చెందిన కొందరు కారులో వచ్చి తమపై దాడి చేసినట్లు బాధితులు వాపోయారు. దాడిలో మంజు, అశోక్తో పాటు సిద్దేశ్ గాయపడ్డారు. హుటాహుటిన వారిని ఆస్పత్రిలో చేర్పించిన తర్వాత బాధితుల బంధువులు పెద్ద ఎత్తున ఆస్పత్రి బయట ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అనుచరులే కారులో వచ్చి దాడి చేసినట్లు బాధితుల బంధువులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అర్బన్ సీఐ జయనాయక్ ఆస్పత్రికి వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు తర్వాత విచారణ చేపట్టి చర్యలు చేపడతామని సీఐ తెలిపారు. పెట్రోల్ బంకు బాయ్స్పై దాడి -
అప్పుల ఊబిలోకి అన్నదాతలు
తాడిపత్రిటౌన్: తాడిపత్రి నియోజకవర్గంలో భూగర్భజలాలు అడుగంటడంతో రైతులు పంటలను కాపాడుకునేందుకు భగీరథప్రయత్నం చేస్తున్నారు. తాడిపత్రి, యాడికి, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు మండలాల్లో ఎక్కువగా బోరు బావుల కింద పండ్లతోటలు సాగువుతున్నాయి. ఆయా మండలాల్లోని రిజర్వాయర్లు, చెరువులు నీరు లేక ఎండిపోతున్నాయి. దీంతో ఆయా మండలాల్లో రోజురోజుకూ భూగర్భజలాలు ఆవిరవుతుండటంతో బోరుబావుల్లో నీరు రాక వేలాది ఎకరాల్లో ఉన్న అరటి, మామిడి, చీనీ, నిమ్మ పంటలను కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఒక్క పంట తడికి వేల రూపాయలు ఖర్చుచేస్తూ అప్పుల ఊబిలో కూరుకపోతున్నారు. ఇదే అదునుగా ట్యాంకర్ యజమానులు ఒక్కో ట్యాంకర్ నీటిని రూ.800 నుంచి రూ.1,200 వరకు అమ్ముతున్నారు. ప్రభుత్వం స్పందించి పంటలకు నీరిచ్చి కాపాడేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఉదయం 9 గంటల నుంచే అర్జీలను స్వీకరిస్తారన్నారు. పరిష్కార వేదికలో ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. భూసమస్యలపై అర్జీలను పరిష్కార వేదికలో భాగంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్లో అందజేయాలన్నారు. అర్జీ పరిష్కార స్థితిని కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. తాడిపత్రిలో భారీగా గంజాయి పట్టివేత ? తాడిపత్రిటౌన్: పట్టణంలోని ఓ లాడ్జ్లో ఆదివారం పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నట్లు సమాచారం. దాదాపు 15 కేజీల గంజాయితో పాటు ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. ఒడిశాకు చెందిన వీరు మరో చోటకు వెళ్లే క్రమంలో లాడ్జిలో దిగారా లేక తాడిపత్రి పట్టణానికి సంబంధించిన వారికి వీరితో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై ‘సాక్షి’ సీఐ ఆరోహణరావును వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విషయాన్ని దాటవేశారు. నేడు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు మొబైల్: 8977716661 నంబర్కు ఫోన్ చేసి పిర్యాదు చేయాలన్నారు. ఫోన్ చేసే వినియోగదారులు తమ విద్యుత్ నంబర్ను తప్పకుండా తెలియజేయాలని సూచించారు. జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ.. అనంతపురం జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు విద్యుత్శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు ఫోన్ నంబర్లు 08554–272943, 9154790350కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. -
కార్యకర్తలే పార్టీకి బలం
ఆత్మకూరు: వైఎస్సార్సీపీకి కార్యకర్తలే బలమని, కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుని అండగా నిలుస్తామని రాప్తాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తిలోని తన స్వగృహంలో శనివారం రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ బూత్ కమిటీ అధ్యక్షులతో ఆయన సమావేశమై మాట్లాడారు. గ్రామ కమిటీ అధ్యక్షులను పార్టీ కార్యకర్తలకు పరిచయం చేశారు. గ్రామ కమిటీ అధ్యక్షుడితో మొదలు ప్రతి ఒక్కరూ పార్టీ గుర్తింపు కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. గుర్తింపు కార్డు లేని వారు తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. ఓటు హక్కును కాపాడుకుందాం మనం ఎక్కడున్నా... నియోజకవర్గంలోనే ఓటు హక్కు ఉండేలా చూసుకోవాలని కార్యకర్తలకు ప్రకాష్రెడ్డి సూచించారు. ప్రతి గ్రామంలోనూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు. ఓటరు నమోదు ప్రక్రియలో బీఎల్ఓలు, గ్రామ కమిటీ అధ్యక్షులు కీలకంగా వ్యవహరించాలన్నారు. గ్రామంలో ఎవరికై నా ఓటు హక్కు ఉందో లేదా తెలుసుకుని వారిని ఓటరుగా నమోదు చేయించాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా ఎండగట్టాలని యువతకు పిలుపునిచ్చారు. అలాగే వైఎస్ జగన్ హయాంలో ప్రజలకు మనం చేసిన మంచిపై చైతన్యం తీసుకురావాలన్నారు. గ్రామ స్థాయి సమావేశాలతో చైతన్యం పరచాలి గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై జనాన్ని చైతన్య పరచాలన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేరూరు డ్యాంకు నీరు అందకుండా చేశారని, అలాగే హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ వేసి రైతులకు తీరని అన్యాయం చేశారన్నారు. పాపంపేటలో 300 ఎకరాలను ఆక్రమించుకోవాలని చూశారని, 14 ఇళ్లను కూలదోశారని, ఆ సమయంలో బాధితులకు అండగా నిలిచామని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని జగనన్నతో మాట తీసుకున్నామని, ఇందులో భాగంగానే పిల్ల కాలువల ద్వారా లక్ష ఎకరాలకు నీరు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు దుబ్బా చంద్రశేఖరరెడ్డి, రంగంపేట గోపాలరెడ్డి, బాలపోతన్న, వీరాంజనేయులు, నరసింహారెడ్డి, గూలి కొండారెడ్డి, సుభద్రమ్మ, వాసుదేవరెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ విజయ్కుమార్, సనప గోపాలరెడ్డి, కృష్ణానాయక్, మల్లారెడ్డి, మీనుగ నాగరాజు, ఎంపీటీసీ పోతులయ్య, మాజీ ఎంపీటీసీ మల్లికార్జున, సుదాకర్రెడ్డి, యల్లప్ప, భాస్కర్, లోకేష్, అమర్నాథ్, రమేష్, కొండా, ఆదెప్ప, మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి, వెంకటేష్, మురళి, ఓబీ టైలర్ వెంకటేష్, ఆంజనేయులు, నరసింహ పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై జనాన్ని చైతన్యపరచండి పిల్ల కాలువల ద్వారా పొలాలకు నీరు అందించడమే మా లక్ష్యం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి -
రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన ‘హనీ ట్రాప్’ వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది.చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లుగా ముఠా సభ్యులు ఈ వ్యవహారాన్ని నడుపుతుంటే పోలీసులు ఎందుకు పసిగట్టలేకపోయారు? ఇంటెలిజెన్స్, ఎస్బీ (స్పెషల్ బ్రాంచ్
● రెండేళ్లుగా నడుస్తున్న హనీట్రాప్ను గుర్తించడంలో పోలీసులు విఫలం ● ఎస్పీకి సమాచారం ఇవ్వడంలో ఇంటెలిజెన్స్, ఎస్బీ విభాగాలు ఘోర వైఫల్యం ● బాధితులు స్టేషన్లకు వచ్చి ఫిర్యాదులు చేసినా ఎస్బీ, ఇంటెలిజెన్స్ మౌనరాగం ● హనీట్రాప్ వ్యవహారాన్ని ఆదాయ మార్గంగా మార్చుకున్న కొందరు పోలీసులు ● టీడీపీ ఎమ్మెల్యేలకు తెలియకుండానే అనుచరులు దందా చేశారా అనే అనుమానాలు ● టీడీపీ ఎమ్మెల్యేలు, కీలకనేతలపై విచారణ చేస్తేనే వెలుగులోకి మరిన్ని వాస్తవాలు సాక్షిప్రతినిధి అనంతపురం: దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో అనంతపురం ఒకటి. మొన్నటి వరకు దేశంలో వ్యభిచార ముఠాలపై ఎక్కడ రైడ్ చేసినా ‘అనంత’ యువతులు, మహిళలు ఉండేవారు. వీరికి కౌన్సిలింగ్ ఇచ్చి.. ఆ రొంపిలోకి తిరిగి వెళ్లకుండా నిరోధించేందుకు ఎన్నో స్వచ్ఛందసంస్థలు పని చేశాయి. ఇలాంటి దశ నుంచి ఇప్పుడిప్పుడే ‘అనంత’ అభివృద్ధిబాట పడుతోంది. కష్టపడి బతికే మనుషులున్న ప్రాంతం. పిల్లలను బాగా చదివించుకునేందుకు పట్టణాలకు పంపుతున్నారు. శని, ఆదివారాల్లో అనంతపురం మార్కెట్ యార్డు ప్రాంతాన్ని సందర్శిస్తే జిల్లావాసుల కష్టం, వారి జీవనశైలి కళ్లముందే కన్పిస్తుంది. యాపిల్తో సహా రాష్ట్రంలో అత్యంత ఎక్కువ పండ్ల ఉత్పత్తులు పండించే ప్రాంతం. ఇలాంటి జిల్లాలో ‘హనీ ట్రాప్’ ఉదంతం తీరు, దాని వెనుక టీడీపీ ముఠా సభ్యుల పాత్ర చూస్తుంటే కళ్లు బైర్లు కమ్మాల్సిందే! ఒళ్లు అమ్ముకుని బతికే అభాగ్యులు ఒక రకం. కానీ అమ్మాయిల అందాలతో వలపు వల వేసి.. అందులో చిక్కుకున్న వారిని చితకబాది వీడియోలు తీసి లక్షల రూపాయలకు ప్రామిసరీ నోట్లు రాయించుకుని, వేధించడం, చివరకు వారి ప్రాణాలు పోయే స్థితికి తీసుకురావడం అనేది క్షమించరాని నేరంగా ‘అనంత’ సమాజం భావిస్తోంది. ఎస్పీ చెప్పినా కేసు నమోదుకు నో! జిల్లాలో ఎక్కడ నేరాలు జరిగినా పోలీసుల వ్యవహారశైలి ఎప్పటికప్పుడు గుర్తించి పోలీసుబాస్కు అందించడం ఇంటెలిజెన్స్, ఎస్బీ విధి. ఎస్పీ ఉన్న అనంతపురంలోనే 15 మందికిపైగా ఉన్న ముఠా సభ్యులు వందలాది మందిని ట్రాప్ చేస్తుంటే గుర్తించడంలో విఫలమయ్యారు. చివరకు ఓ పురోహితుడిని పూజ పేరుతో రప్పించి కొట్టి, వీడియోలు తీసి రూ.10 లక్షలు లాగేసి తిరిగి వేధింపులకు దిగితే బాధితుడు పోలీసుస్టేషన్కు వెళ్లినా ఫలితం లేదు. చివరకు గతేడాది డిసెంబర్లో ఎస్పీ జగదీష్ను కలిసి విన్నవిస్తే చర్యలు తీసుకోవాలని ఎస్పీ సిఫార్సు చేసినా సీఐ రాజేంద్రనాథ్యాదవ్ కేసు నమోదు చేయలేదు. దీన్నిబట్టి పోలీసుశాఖ సిబ్బంది పనితీరు ఏస్థాయిలో ఉందో స్పష్టమవుతోంది. ఊరికో సచివాలయం, కానిస్టేబుళ్లు, ఎస్ఐలు, సీఐలు ఉన్నారు. వీరిలో ఒక్కరు కూడా రెండేళ్లుగా జరుగుతున్న తంతును గుర్తించలేదు. కాదు..కాదు.. తెలిసినా చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోయారు. ఎందుకంటే హనీట్రాప్ ముఠాలో పోలీసుల పాత్ర ఉండటంతో వారి గురించి ‘బాస్’కు చేరవేయకుండా తాత్సారం చేశారు. దీని ఫలితమే హనీ ట్రాప్ కుంభకోణం రూ.కోట్లకు చేరుకుంది. ముఠా వేధింపులు భరించలేక ఏకంగా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. వందలాది బాధితులు గోడు చెప్పుకోలేక తమలో తామే కుమిలిపోతున్నారు. ఇలాంటి సిబ్బందితో శాంతి భద్రతలను ఎలా కాపాడతారో ఎస్పీకే తెలియాలి. మేల్కోకుంటే ముప్పే జిల్లాలో నిఘా వ్యవస్థ పటిష్టంగా లేకపోతే శాంతిభద్రతలు దారితప్పే ప్రమాదం ఉంది. ఇద్దరు సీఐలు, ఆరుగురు కానిస్టేబుళ్ల పాత్ర ఉన్న హనీట్రాప్ దందా వ్యవహారంలోనే ఎస్బీ, ఇంటెలిజెన్స్ అధికారులు ఎస్పీని అప్రమత్తం చేయలేకపోతే జిల్లాలో జరుగుతున్న నేరాల సమాచారం, ఎస్ఐ, సీఐల పనితీరుపై ఎలాంటి పారదర్శక నివేదికలు ఇస్తున్నారో ఎస్పీ గుర్తించాలి. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రాజకీయాల కోసం ఇలాంటి ఆసాంఘిక శక్తులను వెనకబెట్టుకోవడంపై ఆలోచించాలి. బెంగళూరు, ముంబై, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో వినిపించే ‘హనీ ట్రాప్’ పేరు ఇప్పుడు ‘అనంత’కు పాకింది. ప్రభుత్వ, రాజకీయ నేతల ఒత్తిళ్లతో కేసును సీరియస్గా తీసుకోకపోతే భవిష్యత్లో మరిన్ని దారుణాలకు ఇలాంటి ముఠాలు ఒడిగడతాయి. ఎస్పీ నిష్పక్షపాతంగా విచారణ చేయించి కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. దందా వెనుక ఎమ్మెల్యేల సపోర్ట్ లేదా? బీజేపీ నుంచి లేడీ డాన్ రంగమ్మను రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత టీడీపీలో చేర్చుకున్నారు. దబ్బర రాజేష్ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మాజీ మేయర్ మదమంచి స్వరూపకు అనుచరుడు. హనీట్రాప్ ముఠాతో సంబంధమున్న నరేంద్రరెడ్డి 2024 నుంచి దగ్గుపాటి ప్రసాద్ వెంట నడుస్తున్నారు. వీరు ఇంత అరాచకం చేస్తుంటే పరిటాల సునీత, దగ్గుపాటి ప్రసాద్ ఎందుకు తెలుసుకోలేకపోయారు.. రాప్తాడు మండలం హంపాపురంలోని 7 హిల్స్ హోటల్ వద్ద నిందితురాలితో కలిసి సీఐ శ్రీహర్ష పంచాయితీలు చేస్తుంటే ఎందుకు మిన్నకుండిపోయారు.. సునీత సోదరుడు ధర్మవరపు మురళీకి కూడా ఈ వ్యవహారం తెలీదా.. ఎమ్మెల్యేల మద్దతు లేకుండానే పోలీసులు ఇంత ధైర్యంగా భాగస్వాములయ్యారా.. కార్యకర్తలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇంత నీచమైన మార్గం ఎంచుకోవాలా అనేది జిల్లావాసులు లేవనెత్తుతున్న ప్రశ్నలు. రెండేళ్లుగా ఈ గుట్టును గుర్తించకపోవడం కేవలం నిఘా వైఫల్యమే కాదు, పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కూడా అనేది స్పష్టమవుతోంది. -
కారు ఢీకొని యువకుడి మృతి
గుత్తి రూరల్: కారు ఢీకొన్న ఘటనలో ఓ వలస కూలీ మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఉత్తర్ప్రదేశ్లోని ఆజమ్ఘర్ జిల్లా ఫూల్పూర్ తాలూకా బెల్బాయి గ్రామానికి చెందిన అజయ్ సరోజ్ (23), అదే గ్రామానికి చెందిన మరికొందరితో కలసి గుత్తి మండలంతో పాటు నంద్యాల జిల్లా, ప్యాపిలి మండలంలో మామిడి కాయల ప్యాకింగ్ పనికి వచ్చాడు. ఈ నేపథ్యంలో శనివారం ప్యాపిలి మండలం పోతుదొడ్డి గ్రామ శివారున ఉన్న తోటలో మామిడి కాయలు ప్యాకింగ్ చేసి లారీలో లోడు చేశారు. మధ్యాహ్న భోజనం కోసమని 44వ జాతీయ రహదారి దాటుతున్న అజయ్ సరోజ్ను కర్నూలు నుంచి దూసుకొచ్చిన కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అజయ్ను తోటి కూలీలు వెంటనే గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స మొదలు పెట్టే లోపు ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి కారణమైన కారును అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతర్రాష్ట్ర గంజాయి విక్రేత అరెస్ట్ కూడేరు: గంజాయి విక్రయిస్తున్న యువకుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కూడేరు పీఎస్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలను సీఐ రాజు వెల్లడించారు. తాడిపత్రికి చెందిన గట్టు శివదత్త చెడు వ్యసనాలకు బానిసై సులువుగా డబ్బు సంపాదనకు గంజాయిని కొనుగోలు చేసి కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి తరలించి ఎక్కువ మొత్తానికి విక్రయించి సొమ్ము చేసుకునేవాడు. ఈ నేపథ్యంలో శనివారం గంజాయి తరలిస్తుండగా అందిన సమాచారం మేరకు కూడేరు మండలం ముద్దలాపురం సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకటిన్నర కిలోల గంజాయి, ఖరీదైన ఓ కారు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. డీఎస్సీ వికలాంగుల కోటాలో అన్యాయం చేశారు ● విద్యాశాఖ తీరుపై దివ్యాంగులు అంజనప్ప, ప్రభావతి ఆవేదన అనంతపురం టవర్క్లాక్: మెగా డీఎస్సీలో భాగంగా గత ఏడాది చేపట్టిన నియామక ప్రక్రియలో వికలాంగుల కోటా కింద అనర్హులకు పోస్టింగ్ ఇచ్చారంటూ బాధితులు శ్రీసత్యసాయి జిల్లా ఓడీసీ మండలానికి చెందిన అంధుడు అంజనప్ప, అనంతపురం జిల్లా గుంతకల్లు మండలానికి చెందిన ప్రభావతి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం అనంతపురంలోని రోడ్లు భవనాల శాఖ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో పనిచేసిన డీఈఓ ప్రసాద్, ఆర్జేడీ శ్యామూల్ ముడుపులు తీసుకుని తమకు తీరని అన్యాయం చేస్తూ ఎలాంటి అర్హత లేని శివలింగమ్మకు పోస్టింగ్ ఇచ్చారని ఆరోపించారు. స్థానికంగా ఆమెకు వైద్య పరీక్షలు చేయించకుండా వైఎస్సార్ కడప జిల్లాలో చేయించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ను స్వయంగా సమస్య వివరించినా ఇప్పటి వరకూ వారూ కూడా స్పందించలేదని వాపోయారు. న్యాయం చేకూరే వరకు తాము పోరాటం చేస్తామని తెలిపారు. క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్య రాప్తాడు రూరల్: క్షణికావేశంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... వజ్రకరూరు మండలం కొనకొండ్లకు చెందిన చాకలి భాగ్యమ్మ (34)కు రాప్తాడుకు చెందిన చాకలి నరేష్తో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. నరేష్ ఎలక్ట్రీషియన్గా, భాగ్యమ్మ బేల్దారి కూలీగా జీవనం సాగిస్తున్నారు. ఇటీవల దంపతుల మధ్య చిన్నపాటి మనస్పర్థలు నెలకొన్నాయి. శనివారం ఉదయం ఇద్దరూ పనుల కోసమని బయటకు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికొచ్చారు. ఆ సమయంలో పిల్లలతో కలసి తాను ఊరికి వెళ్తానని వదిలిరావాలంటూ భర్తను భాగ్యమ్మ అడిగింది. అయితే తనకు ఓపిక లేదని, మీరే వెళ్లాలంటూ నరేష్ తెలిపాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తల్లి గట్టిగా అరుస్తుంటే కుమారుడు ‘అమ్మా నువ్వు లోపలికి వెళ్లు’ అంటూ గదిలోకి పంపి తలుపులు వేశాడు. అప్పటికే తీవ్ర మనస్థాపానికి గురైన భాగ్యమ్మ గది లోపలి నుంచి గడియపెట్టుకుని ఉరి వేసుకుంది. కాసేపటి తర్వాత తలుపులు తీసేందుకు ప్రయత్నించగా తెరుచుకోలేదు. దీంతో బలవంతంగా తలుపు తొలిగించి చూశారు. అప్పటికే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భాగ్యమ్మను గమనించి వెంటనే సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
సజావుగా పాలిసెట్
అనంతపురం: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం శనివారం నిర్వహించిన ఏపీ పాలిసెట్ –2026 జిల్లాలో సజావుగా జరిగింది. మొత్తం 9,809 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 9,110 (93 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని పాలిసెట్ జిల్లా సమన్వయకర్త సి.జయచంద్రారెడ్డి తెలిపారు. అబ్బాయిలు 5,537 (94 శాతం), అమ్మాయిలు 3,553 (92శాతం) మంది హాజరయ్యారని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలను జిల్లా పరిశీలకులు సత్యనారాయణరెడ్డి పర్యవేక్షించారు. విపత్తుల నిర్వహణపై మాక్ ఎక్సర్సైజ్ అనంతపురం అర్బన్: రాష్ట్ర విపత్తుల నిర్వహణ అథారిటీ ఆదేశాల మేరకు జిల్లాలో ఆయిల్, కెమికల్ మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 28న ఉదయం 10 గంటలకు టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ను కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తామన్నారు. విపత్తుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా విపత్తుల నిర్వహణ అథారిటీ ఆధ్వర్యంలో 30న ఉదయం 8 గంటలకు గుత్తి మండలం పరిధిలో ఉన్న బీపీసీఎల్ ప్లాంట్లో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇన్చార్జ్ జేడీఏ రవిపై 28న విచారణ అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖ అనంతపురం డివిజన్ ఏడీఏగా ఎం.రవి (ప్రస్తుతం ఇన్చార్జ్ జేడీఏ) ఉన్న సమయంలో 2025 జూన్ 6న అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 28న విచారణ చేపట్టనున్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. వ్యవసాయశాఖ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని కమిషనరేట్కు చెందిన విచారణాధికారి (జేడీఏ) విజయభారతి నోటీసు జారీ చేసినట్లు సమాచారం. మంత్రికి ఇచ్చిన ఫిర్యాదులో ఎమ్మెల్యే దగ్గుపాటి.. ఏడీఏ రవి మీద అనేక ఆరోపణలు చేస్తూ ఇక్కడి నుంచి బదిలీ చేయాలని కోరినట్లు సమాచారం. దీంతో ఈ నెల 22, 23 తేదీల్లో విచారణ ఉంటుందని ఆదేశాలు ఇచ్చారు. అయితే తాజాగా ఎమ్మెల్యే మరో ఉత్తరం ద్వారా సదరు అధికారి ఎం.రవి మీద చేసిన ఆరోపణలు సమాచార లోపం కారణమని తెలియజేశారు. దీంతో ఈ వ్యవహారం ఇంతటితో ఆగిపోతుందని భావించారు. కానీ తాజాగా ఈ నెల 28న అనంతపురం, 29న హిందూపురంలో విచారణ కొనసాగుతుందని విచారణాధికారి ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఇటీవల కాలంలో వ్యవసాయశాఖలో ఆధిపత్య పోరుపై వరుసగా విచారణలు కొనసాగుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాకినాడ టౌన్–మైసూర్ మధ్య బై వీక్లీ ఎక్స్ప్రెస్ గుంతకల్లు: కాకినాడ టౌన్ నుంచి కర్ణాటకలోని మైసూర్కు కొత్తగా బై వీక్లీ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టినట్లు డివిజన్ అధికారులు తెలిపారు. కాకినాడటౌన్ – మైసూర్ ఎక్స్ప్రెస్(17289)ను మే1 నుంచి పట్టాలెక్కుతుంది. కాకినాడ టౌన్ నుంచి ప్రతి సోమ, శుక్రవారాల్లో ఉదయం 9 గంటలకు బయల్దేరుతుంది. మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు మైసూర్ జంక్షన్కు చేరుతుందున్నారు. తిరుగు ప్రయాణంలో మైసూర్ జంక్షన్ (17290) నుంచి ప్రతి మంగళ, శనివారాల్లో సాయంత్రం 5.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.30 గంటలకు కాకినాడ టౌన్కు చేరుతుందన్నారు. ఈ రైళ్లు సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరంటౌన్, ఆకివీడు, కై కలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నెలగొండ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, యాదగిరి, కృష్ణ, రాయచూర్, మంత్రాలయం, ఆదోని, గుంతకల్లు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం, యలహంక, బెంగళూరు, బెంగుళూరు సిటీ, కెంగేరి, రామనగరం, చెన్నపట్నం మండ్య మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు. మే చివరి వరకు ఉపాధి హామీ పథకమే అనంతపురం టౌన్: ఇటీవల కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉఫాధి హమీ పథకాన్ని వీబీ జీ రామ్ జీ పథకంగా పేరు మార్చి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. అయితే రాష్ట్రంలో ఉపాధి కూలీల పనిదినాలను పెంచడంతో మే నెలాఖరు వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగానే కొనసాగుతుందని డ్వామా పీడీ సలీం బాషా తెలిపారు. -
ప్రాణాలు బలిగొన్న ఈత సరదా
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇంటి పట్టున ఉంటున్న వారు సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి నీట మునిగారు. ● వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు విద్యార్థుల మృతి గుమ్మఘట్ట: మండలంలోని కోనాపురం గ్రామానికి చెందిన హనుమంతరాయుడు, ఈరమ్మ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. స్థిరాస్తులేమీ లేకపోవడంతో బెంగళూరుకు వలస వెళ్లి కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. అక్కడే పిల్లలను చదివించుకుంటున్నారు. వేసవి సెలవులు కావడంతో రాయదుర్గం మండలం వేపరాల గ్రామంలో ఉన్న అమ్మమ్మ గంగమ్మ ఇంటికి వచ్చిన కుమారుడు శరత్ (16)... శనివారం స్నేహితులతో కలసి సరదాగా వేదవతి హగరిలోని ఓ గుంతలో ఉన్న నీటిలో ఈత కొట్టేందుకు వెళ్లాడు. ఈత రాకపోవడంతో నీట మునిగిపోయాడు. ఆ సమయంలో స్నేహితులు గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న వారు అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టి వెలికి తీసేలోపు మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెళుగుప్ప: మండలంలోని జీడిపల్లి గ్రామానికి చెందిన హరిజన వెంకటేశులు అనంతపురానికి మకాం మార్చి ఓ అపార్ట్మెంట్కు వాచ్మెన్గా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. అనంతపురంలోనే ఆయన కుమారుడు విజయ్కుమార్ ఏడో తరగతి చదువుకుంటున్నారు. వేసవి సెలవులు కావడంతో అపార్ట్మెంటులోని తన స్నేహితులతో కలసి స్వగ్రామం జీడిపల్లికి విజయ్కుమార్ వచ్చాడు. శనివారం రిజర్వాయర్ కాలువ సమీపంలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు విజయ్కుమార్ నీటిలో పడిపోయాడు. స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న సమీపంలోని పొలాల్లో ఉన్న రైతులు వెంటనే కాలువ వద్దకు చేరుకుని గాలించి వెలికి తీసేలోపు విజయకుమార్ మృతి చెందాడు. ఘటనపై తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ శివ తెలిపారు. శరత్ (ఫైల్), మృతుడు విజయ్కుమార్ -
ఇంధన కొరతతో ఇక్కట్లు
● పలు చోట్ల పెట్రోలు బంకులు మూత ● నో స్టాక్ బోర్డుతో వాహనదారుల బేజారు కళ్యాణదుర్గం/ తాడిపత్రి టౌన్: అనంతపురంతో పాటు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శనివారం ఇంధన కొరతతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కళ్యాణదుర్గంలో 8 పెట్రోల్ బంకులకు గాను ఆరు చోట్ల నోస్టాక్ బోర్డులు వెలిశాయి. దీంతో మిగిలిన రెండు బంకుల వద్దకు వాహనదారులు క్యూ కట్టారు. అయితే అక్కడ ఒక చోట పెట్రోల్ లేకపోతే.. మరొక చోట డీజిల్ లేదు. ఉదయం నుంచి వేచి ఉన్నా పెట్రోల్, డీజిల్ లభించకపోవడంతో వాహనదారులు మండిపడ్డారు. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కష్టాల నుంచి కోలుకోకముందే ఇప్పుడు ఇంధన కొరత ఏర్పడటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పౌరసరఫరాల అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేదని దుమ్మెత్తిపోశారు. ఇక తాడిపత్రి పట్టణ, చుట్టుపక్కల 20 పెట్రోలు బంకులు ఉండగా.. 12 బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు వెలిశాయి. పెట్రోలు, డీజిల్ దొరక్కపోతే ఆటోలు ఎలా నడపాలి.. కుటుంబాలు ఎలా పోషించుకోవాలని డ్రైవర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కొందరు వాహనదారులు ముందు జాగ్రత్తగా అదనపు క్యాన్లతో క్యూలో నిల్చోవడం గమనార్హం. రాత్రికల్లా మిగిలిన బంకుల్లో కూడా ఇంధన నిల్వలు అయిపోయినట్లు తెలిసింది. ఇక అనంతపురంలో అర్ధరాత్రి వరకూ పెట్రోలు బంకుల వద్ద వాహనదారులు కిక్కిరిసిపోయారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు అనంతపురం అర్బన్: జిల్లాలో డీజిల్ కొరత లేదని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ స్పష్టం చేశారు. కొరత ఉందంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు ఆయన సూచించారు. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ నిల్వలు ఉన్నాయన్నారు. డిమాండ్ మేరకు ఇంధనం సరఫరా చేయాలని సంబంధిత బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీఎల్ సేల్స్ ఆఫీసర్లకు తెలియజేశామన్నారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించినా, అక్రమంగా స్టాక్ నిల్వ చేసినా, బ్లాక్ మార్కెటింగ్కు తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని, లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. తహసీల్దార్లు, సీఎస్డీటీలు తమ పరిధిలోని పెట్రోల్ బంక్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. కళ్యాణదుర్గంలోని నోస్టాక్ బోర్డుతో మూతతాడిపత్రిలో క్యూ..అనంతపురంలో పెట్రోలు బంకుల వద్ద శనివారం రాత్రి బారులు తీరిన ద్విచక్ర వాహనదారులు -
హద్దులు చెరిపేసిన ఇసుక మాఫియా
శింగనమల: మండలంలోని నిదనవాడ సమీపంలో ఉన్న పెన్నానదీ పరివాహక ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ తరలింపులపై శనివారం రెవెన్యూ, మైనింగ్ అధికారులతో కలిసి పోలీసులు పరిశీలించారు. చెలరేగిన ఇసుక మాఫియా ఆగడాలను గత రెండు రోజులుగా రైతులు ఆడ్డుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శింగనమల, పెద్దవడుగూరు మండలాలకు చెందిన అధికారుల్లో చలనం వచ్చి క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టారు. పెన్నానది నట్టనడి మధ్య నుంచి ఇసుకను తవ్వి తరలించడంతో ఏర్పడిన లోతైన గుంతలను చూడగానే అధికారులు విస్తుపోయారు. భారీ స్థాయిలో ఇసుకను అక్రమంగా తరలించారని నిర్ధారించుకున్నారు. అక్రమంగా పెన్నానదిలోకి చొరబడి.. పెద్దవడుగూరు మండలం చిత్రచేడు రెవెన్యూ పరిధిలోని పొలంలో ఇసుక రీచ్ కోసం అనుమతులను పొందిన చిత్రచేడు ప్రాంతానికి చెందిన కొందరు చివరకు పెన్నానదిలోకి అక్రమంగా చొరబడినట్లుగా అధికారులు గుర్తించారు. అటూఇటు చేస్తూ పెద్దవడుగూరు, శింగనమల మండలాల హద్దులను చెరిపేస్తూ శింగనమల మండలం నిదనవాడ సరిహద్దులోకి చొరబడి పెన్నానది నుంచి అక్రమంగా ఇసుకను తరలించినట్లుగా నిర్ధారించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులను నిదనవాడ గ్రామానికి చెందిన పలువురు రైతులు నిలదీశారు. పలుమార్లు తాము వాహనాలను ఆడ్డుకుని అధికారులకు పట్టిస్తే ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేయడంతోనే ఈ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సరిహద్దులు గుర్తిస్తాం ఇసుక తరలింపులతో భూగర్భ జలం అడుగంటి చుట్టుపక్కల ప్రాంతాల పొలాల్లోని బోరు బావుల్లో నీరు అందకుండా పోతోందని రైతులు వాపోయారు. నిదనవాడ రెవెన్యూ పరిధిలోని వంద ఎకరాల్లో పండ తోటలు ఉన్నాయని, నీటి తడులు అందక చెట్లు ఎండిపోతున్నాయని తెలిపారు. ఇసుక తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను వేడుకున్నారు. ఇసుక అక్రమ తరలింపుపై చర్యలు తీసుకపోతే, కలెక్టర్ వద్దకెళ్లి తమ గోడు వెళ్లబోసుకుంటామన్నారు. అప్పటికై నా ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అయితే అక్రమంగా ఇసుకను తరలించిన వారిపై తీసుకునే చర్యల గురించి అధికారులు ఏమాత్రం మాట్లాడకుండా నిదనవాడ, చిత్రచేడు గ్రామాల మధ్య ఉన్న రెవెన్యూ సరిహద్దులు గుర్తిస్తామని చెప్పడం విశేషం. విస్తుపోయిన రెవెన్యూ, మైనింగ్ అధికారులు, పోలీసులు పెన్నానది నట్టనడిమధ్య నుంచి అక్రమ తరలింపు -
తాగునీటి ఎద్దడిపై సభ్యుల గళం
అనంతపురం సెంట్రల్: ‘ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎండలు తారస్థాయికి చేరాయి. భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. అనేక గ్రామాల్లో తాగునీటి సమస్య జఠిలంగా మారుతోంది. సత్యసాయి, శ్రీరామరెడ్డి తదితర తాగునీటి పథకాల నిర్వహణ అధ్వానంగా తయారైంది. కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో నీటి సరఫరా జరగడం లేదు. జిల్లాలో తాగునీటి ఇబ్బందులను తక్షణం పరిష్కరించాలి. బోర్లు ఎండిపోయిన పోయిన గ్రామాల్లో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి’ అని సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అనంతపురం కలెక్టర్ ఆనంద్, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి పాల్గొన్నారు. ముగ్గురు మంత్రులు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి.. తాగునీటి సమస్య జఠిలంగా మారుతోంది. నిధుల లేమితో ఏ పనులూ ముందుకు సాగడం లేదు. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వ స్థాయిలో చొరవ చూపి నిధులు తీసుకొస్తారని భావిస్తే వారు పత్తా లేకుండా పోయారని జెడ్పీటీసీలు, ఎంపీపీలు నిట్టూర్చారు. సభ్యులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. ముందస్తు చర్యలు చేపట్టకపోతే ఎలా..? వేసవిలో తాగునీటి ఇబ్బందులు వస్తాయని తెలిసినా ముందస్తుగా పనులు చేపట్టకపోతే ఎలా అని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో తీసుకున్న ఆర్థిక నిర్ణయాల వలన ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయని పుట్టపర్తి ఎమ్మెల్యే సిందూరరెడ్డి వ్యాఖ్యానించడాన్ని ఖండించారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలవుతున్నా ఇంకా గత ప్రభుత్వంపై నిందలు వేయడం ఏంటని ప్రశ్నించారు. గ్రామాల్లో ఉపాధిహామీ పథకం ద్వారా పశువుల నీటి తొట్టెలు నిర్మించినా అందులో నీరు నింపకపోవడంతో నిరుపయోగంగా మారాయన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని, శనగ, వరి, మొక్కజొన్న పంటను సకాలంలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. రూ. వంద కోట్ల నిధులు తీసుకురండి పుట్టపర్తి నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి కోరగా.. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ స్పందిస్తూ నిధులు తీసుకురావాల్సిన మీరే అడిగితే ఎక్కడి నుంచి ఇవ్వాలని అన్నారు. జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారినికి రూ.100 కోట్ల నిధులు తీసుకురావడానికి కృషి చేయాలని ఎమ్మెల్యేకు సూచించారు. అలాగే సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 108 అంబులెన్స్ సేవల్లో అంతరాయం లేకుండా చూడాలని, అంగన్వాడీ కేంద్రాల్లో ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య అధికంగా ఉందని, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సూచించారు. పెండింగ్లో ఉన్న యూజర్ చార్జీలు జెడ్పీ అందించడం ద్వారా సమస్యాత్మక ప్రాంతాలకు నిధులు మంజూరు చేయడానికి వీలవుతుందని వివరించారు. ఖరీఫ్ సీజన్కు ముందుగానే విత్తనాలు రైతులకు అందించేందుకు వ్యవసాయశాఖ అధికారులు సన్నద్ధం కావాలని ఆదేశించారు. సమస్యలపై ఏకరువు జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ మాట్లాడుతూ నార్పల పీహెచ్సీలో గైనకాలజిస్టు లేకపోవడంతో గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్కానింగ్ మిషన్ అందుబాటులో ఉన్నా ఉపయోగంలో లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం రూరల్ జెడ్పీటీసీ చంద్రకుమార్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ హయాంలో రాప్తాడు నియోజకవర్గ తాగునీటి సమస్య పరిష్కరించడానికి పీఏబీఆర్ నుంచి పైపులైన్ ఏర్పాటుకు నిధులు తీసుకొచ్చి శంకుస్థాపన చేసి రెండున్నరేళ్లు అవుతున్నా ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. బుక్కరాయసముద్రం జెడ్పీటీసీ నీలం భాస్కర్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 23 గ్రామాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, అవసరమైన చోట బోర్లు వేయాలని కోరారు. అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేక పిల్లలు బయటకు వెళ్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ నెట్టం వెంకటేశ్వర్లు, ఏడీసీసీ బ్యాంకు చైర్మన్ కేశవరెడ్డి, ఇన్చార్జ్ జెడ్పీ సీఈఓ నాగరాజు నాయుడు, డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్య, జెడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు. జెడ్పీ సమావేశంలో మాట్లాడుతున్న చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, చిత్రంలో కలెక్టర్ ఆనంద్, హాజరైన ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ఎమ్మెల్యే పల్లె సింధూర, సభ్యులు జిల్లాలో తాగునీటి సమస్య జఠిలం ప్రభుత్వ తీరుపై జెడ్పీ సమావేశంలో సభ్యుల ధ్వజం పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ ముగ్గురు మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేల గైర్హాజరు -
ఆలయ కమిటీ నుంచి ‘హనీట్రాప్’ అనంత కుమారి తొలగింపు
అనంతపురం కల్చరల్: హనీట్రాప్ కేసులో పట్టుబడిన అనంతపురంలోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయ ధర్మకర్తల మండలి సభ్యురాలు అనంతకుమారిని కమిటీ నుంచి తొలగిస్తున్నట్లు ఈఓ నాగేంద్రుడు తెలిపారు. శనివారం మొదటిరోడ్డులోని శివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్ర చౌదరితో కలిసి ఆయన మాట్లాడారు. ఇకపై ఆలయానికి ఆమెకు ఎలాంటి సంబంధాలుండవని, ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు. మలేరియా అంతమే లక్ష్యం అనంతపురం: జిల్లాలో 2030 నాటికి మలేరియాను పూర్తి స్థాయిలో అంతం చేయడమే లక్ష్యంగా నిర్దేశించుకుని కార్యాచరణను అమలు చేస్తున్నట్లు జిల్లా మలేరియా అధికారి ఓబులు తెలిపారు. నివారించదగిన వ్యాధులపై ప్రపంచ టీకాల వారోత్సవాలను పురస్కరించుకుని ప్రజలను చైతన్య పరుస్తూ శనివారం అనంతపురంలో నర్సింగ్ కళాశాల విద్యార్థులతో కలిసి ర్యాలీని చేపట్టారు. డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద ర్యాలీని డాక్టర్ ఓబులు ప్రారంభించారు. తెలుగు తల్లి విగ్రహం వద్ద మానవహారంగా ఏర్పడి మలేరియాను నిర్మూలించడంలో తమ వంతు బాధ్యత నెరవేరుస్తామంటూ విద్యార్థులతో కలిసి వైద్యాధికారులు ప్రతిజ్ఞ చేశారు. డాక్టర్ ఓబులు మాట్లాడుతూ.. 2027 చివరి నాటికి మలేరియా జీరో కేసులే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, 2030 నాటికి పూర్తి స్థాయిలో అంతం చేస్తామని పేర్కొన్నారు. మలేరియా ప్రభావిత ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా పరిగణిస్తూ ప్రభుత్వ అన్ని శాఖల సహకారంతో ముందస్తు వ్యాధి నివారణ చర్యలు చేపడతామన్నారు. జూన్ మాసమంతటా మలేరియా నివారణ మాసోత్సవాలను నిర్వహిస్తామన్నారు. జిల్లా మాస్ మీడియా అధికారి నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో మాత్రమే మలేరియా కేసులు నమోదు కావడం లేదన్నారు. ఇందులో అనంతపురం జిల్లాను చేర్చేలా కృషి చేయాలన్నారు. మాస్ మీడియా డిప్యూటీ అధికారి లక్ష్మీనారాయణ, హెచ్ఈఓ గంగాధర్, ఇన్చార్జ్ సహాయ మలేరియా అధికారి మద్దయ్య, అర్బన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి అబ్దుల్ మునాఫ్, సిబ్బంది నూర్బాషా, శ్రీధర్ మూర్తి, రమేష్ బాబు, రాఘవేంద్రరెడ్డి, లోకేశ్వరరెడ్డి, మధుసూదన్, డిప్యూటీ హెచ్ఈఓ వెంకటేష్, ఆదిల్ బాషా, డెమో సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు అనంతపురం ఎడ్యుకేషన్: వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతుల పేరుతో పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్చార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ మేరకు ఆయన శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. అన్ని యాజమాన్యాల పాఠశాలలు జూన్ 11 వరకు వేసవి సెలవులు పాటించాల్సినందేనని స్పష్టం చేశారు. ప్రత్యేక తరగతులు, స్పెషల్ కోచింగ్, రెమిడియల్ క్లాస్ల పేరుతో విద్యార్థులను పాఠశాలలకు రప్పించడం పూర్తిగా నిషేధమన్నారు. అలాగే హోమ్వర్క్, ప్రాజెక్టులు, పరీక్షలు వంటి అకడమిక్ కార్యకలాపాలు అప్పగించరాదన్నారు. ఎలాంటి స్కాలర్షిప్ పరీక్షలూ నిర్వహించరాదన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని యాజమాన్యాలను ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలను విక్రయించరాదన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం మాత్రమే ఫీజులు వసూళ్లు చేయాలన్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సిలబస్కు అనుగుణంగా ప్రభుత్వం ముద్రించిన పాఠ్యపుస్తకాలనే వినియోగించాలన్నారు. ఇతర పుస్తకాలను గుర్తిస్తే మాత్రం చర్యలుంటాయని హెచ్చరించారు. ఉప విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు వారి పరిధిలోని పాఠశాలలను పర్యవేక్షించాలని సూచించారు. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించినా, నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు విక్రయించినా, అధికఫీజులు వసూళ్లు చేసినా సంబంధిత ఉప విధ్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. -
అడ్డంగా దొరికి..అడ్డగోలు ప్రచారమా?
అనంతపురం: ‘జిల్లాలో సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్న రుద్రంపేట మాజీ ఉప సర్పంచ్ నరేంద్ర రెడ్డి ..అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్కు ముఖ్య అనుచరుడు. గత సార్వత్రిక ఎన్నికల్లోనూ దగ్గుపాటి తరఫునే పనిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు కూడా ఉన్నాయి. అయినా అతను మావాడు కాదని టీడీపీ నేతలు అనడం, ఎల్లోమీడియా కూడా వైఎస్సార్సీపీకి ఆపాదించి తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు’ అని అనంతపురం నగర మాజీ మేయర్ వసీం సలీం, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం వారు అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నరేంద్రరెడ్డిని నాలుగేళ్ల క్రితమే వైఎస్సార్సీపీకి దూరంగా ఉంచినట్లు మాజీ మేయర్ వసీం తెలిపారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ స్వయంగా నరేంద్రరెడ్డి ఇంటికి వెళ్లి అతన్ని కలిశారన్నారు. అలాగే అతను దగ్గుపాటి తరఫున ఎన్నికల్లో పనిచేశాడని, గెలిచిన తర్వాత ఆయన ఇంటికి వెళ్లి మరీ అభినందించాడని తెలిపారు. అలాగే టీడీపీ అధికారంలోకి వచ్చినందుకు 101 టెంకాయలు కొట్టి సంబరాలు చేసుకున్నాడన్నారు. అలాంటి వ్యక్తి హనీ ట్రాప్ కేసులో దొరకగానే ఎల్లోమీడియా తప్పుడు ప్రచారానికి తెర లేపిందన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో నగరంలో అకృత్యాలు పెరిగిపోయాయన్నారు. భూకబ్జాలు, అక్రమాలు, బెదిరింపులు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రజలందరికీ తెలుసన్నారు. గతంలో హైదరాబాద్, బెంగళూరు వంటి పెద్ద పెద్ద నగరాల్లో హనీట్రాప్లు జరిగేవని, ఇప్పుడు టీడీపీ నేతల అండ, పోలీసుల నిర్లక్ష్యంతో అనంతపురంలోనూ జరుగుతున్నాయన్నారు. నగర అధ్యక్షుడు సోమ శేఖర్రెడ్డి మాట్లాడుతూ ఇదివరకు జిల్లాలో రైతు ఆత్మహత్యలు చూశామని, ఇప్పుడు హనీట్రాప్ల కారణంగా బాధితులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి చూస్తున్నామని అన్నారు. గత ఎన్నికల సమయంలో రుద్రంపేట నరేంద్రరెడ్డి వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడంటూ ఆంధ్రజ్యోతి పత్రిక, ఈటీవీలో సైతం కథనాలు వచ్చాయన్నారు. మళ్లీ ఇప్పుడు అతను వైఎస్సార్సీపీ అంటూ ఎల్లోమీడియా చిత్రీకరించడం దారుణమన్నారు. మంచి జరిగితే టీడీపీకి.. చెడు అయితే వైఎస్సార్సీపీకి ఆపాదించడం ద్వారా మీడియా విలువలను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. నగరంలో గంజాయి, బెల్ట్ షాపులు మితిమీరిపోయాయని, విచ్చలవిడిగా పర్మిట్ రూమ్లు పెట్టి నగరాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. రుద్రంపేట నరేంద్రరెడ్డి టీడీపీ వ్యక్తే అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటికి ప్రధాన అనుచరుడు హనీట్రాప్ కేసులో దొరకగానే మీవాడు కాదంటారా? టీడీపీ, ఎల్లోమీడియాపై మాజీ మేయర్ వసీం, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి ధ్వజం -
విధులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు
అనంతపురం అర్బన్: విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ ఆనంద్ ఐసీడీఎస్ అధికారులు, సిబ్బందిని హెచ్చరించారు. ఐసీడీఎస్ పనితీరుపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఆర్సీకి సిఫారసు చేసిన పిల్లలు తప్పనిసరిగా అక్కడే ఉండేలా చూడాల్సిన బాధ్యత సీడీపీఓ, సూపర్వైజర్లదేనని అన్నారు. పోషణ్ ట్రాకర్, గ్రోత్ మానిటరింగ్కు సంబంధించి కచ్చితమైన డేటా నమోదు చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలను సూపర్వైజర్లు, సీడీపీఓలు సందర్శించడంతో పాటు పిల్లల ఎత్తు, బరువు కొలచాలన్నారు. ఆ రిపోర్టును ఆదే రోజు సమర్పించాలని ఆదేశించారు. తాను క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని, పిల్లల బరువు విషయంలో జాగ్రత్తలు పాటించనట్లు గుర్తిస్తే బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. టీహెచ్ఆర్ పంపిణీలో జిల్లా 8వ స్థానంలో ఉందని, రానున్న రోజుల్లో మొదటిస్థానానికి చేరుకునేలా పనిచేయాలని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలకు సరుకులను పౌరసరఫరాల శాఖ సరఫరా చేయడంలో ఆలస్యం చేస్తే విషయాన్ని తన దృష్టికి తీసుకురావాలన్నారు. టీనేజీ ప్రెగ్నెన్సీ జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డులేని పిలల్లను, డ్రాపౌట్ విద్యార్థులను తిరిగి పాఠశాల్లలో చేర్పించాలన్నారు. పాఠశాలలు పునఃప్రారంమైన తరువాత వయసు 14 ఏళ్ల నుంచి 18 ఏళ్ల ఉన్న విద్యార్థినులకు బాల్యవివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ శశికళ, జిల్లా సరఫరాల సంస్థ మేనేజర్ రమేష్రెడ్డి, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ శ్రీనివాసులురెడ్డి, సీడీపీఓలు శ్రీదేవి, లలితమ్మ, షాజిదాబేగం, ఎల్లమ్మ, ఉమా, భారతి, సూపర్వైజర్లు, పాల్గొన్నారు. ప్రజలు నేరుగా ఫిర్యాదులు సమర్పించాలి అనంతపురం అర్బన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులకు మధ్యవర్తుల ద్వారా కాకుండా ప్రజలు నేరుగా ఫిర్యాదులు సమర్పించాలని కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. ప్రజల ఫిర్యాదులు ఆర్టీఐ కార్యకర్తలు, స్థానిక దళారుల వంటి మధ్యవర్తుల ద్వారా నమోదవుతున్నాయన్నారు. చాలా సందర్భాల్లో సంబంధిత వ్యక్తులు లేదా వారి కుటుంబ సభ్యులు నేరుగా నమోదు చేసుకోవడానికి బదులుగా అర్జీదారుల వివరాలను ఉపయోగించి ఇతరుల ద్వారా ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. దీంతో ఫిర్యాదుల పరిష్కార సమయంలో పౌరులకు, పరిష్కరించే అధికారులకు, శాఖాధిపతులకు అనవసరమైన సమస్యలకు, అసౌకర్యానికి దారితీస్తోందన్నారు. -
అనంతపురం కేంద్రంగా తెలుగుదేశం పార్టీ నేతలు సాగించిన హనీట్రాప్ ఉదంతంలో ఉచ్చు బిగుస్తోంది. ఇందులో భాగస్వాములైన ఎవ్వరినీ వదలకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ జగదీష్ కృతనిశ్చయంతో ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆ దిశగానే ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా, ప
సాక్షిప్రతినిధి, అనంతపురం: అమాయకులను లక్ష్యంగా చేసుకుని అమ్మాయిలను ఎరగా వేసి.. పక్కా ప్లాన్ ప్రకారం ఇంట్లోకి దూసుకొచ్చి ఒళ్లు హూనమయ్యేలా చితకబాది.. నగ్న ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి.. బాధితుల నుంచి రూ.లక్షల్లో డబ్బు వసూలు చేస్తున్న హనీట్రాప్ ముఠాపై పోలీసు శాఖ కొరఢా ఝుళిపిస్తోంది. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు రంగమ్మ నాయుడు, రాజేష్ నాయుడు, నరేంద్రరెడ్డి ఆధ్వర్యంలో నడిచిన హనీ ట్రాప్ దందాపై పోలీసులు మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు. ముఠా సభ్యుల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని కాల్డేటా ఆధారంగా ఆడియో రికార్డులు తెప్పించారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు, సూత్రధారులపై ఆడియో రికార్డుల ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. పోలీసు ప్రతిష్ట పెంచే దిశగా చర్యలు ‘అనంత’ హనీట్రాప్ వ్యవహారాన్ని ఛేదించడంపై జిల్లా పోలీస్ ఉన్నతాధికారి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో పోలీసు అధికారుల పాత్ర ఉండటం ఆయన్ను బాధించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ముఠాలో ఉన్నవారు, అందులో భాగస్వాములుగా ఉన్నవారు ఎవ్వరినీ వదలిపెట్టకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ జగదీష్, డీఐజీ షీమోషీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసు శాఖకు తీరని మచ్చను మిగిల్చిన ఈ వ్యవహారంలోని పోలీసులందరిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా రాప్తాడు సీఐ శ్రీహర్షను విధుల నుంచి పూర్తిగా తొలగించేలా సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే అనంతపురం త్రీటౌన్ సీఐ రాజేంద్రనాథ్యాదవ్పై కూడా సస్పెన్షన్ వేటు వేయనున్నట్లు తెలిసింది. వీరితో పాటు మరికొంతమంది పోలీసుల పాత్రపై ఆరా తీయడంతో పాటు ఆధారాలు సేకరిస్తున్నారు. వీరిపై కూడా సస్పెన్షన్ వేటు వేయనున్నట్లు తెలుస్తోంది. తద్వారా పోయిన పోలీసు ప్రతిష్టను పునరుద్ధరించాలనే భావనలో ఎస్పీ, డీఐజీ ఉన్నట్లు తెలు స్తోంది. ఎస్పీ ఆదేశాల మేరకు ట్రైనీ ఎస్పీ అశ్విన్ మణిదీప్ పర్యవేక్షణలో ఈ కేసు విచారణ సాగుతోంది. నలుగురు సీఐల పాత్రపై ఆరా హనీ ట్రాప్ ముఠా బాధితులతో రెండు, మూడేళ్ల కిందటి తేదీలతో ప్రామిసరీనోట్లు రాయించుకున్న తర్వాత వాటిని సీఐల వద్దకు వెళ్లి డబ్బులు వసూలు చేసే పని చేశారు. ఈ వ్యవహారంలో అనంతపురంతో పాటు ఇతర ప్రాంతాల్లోని బాధితులు ఉన్నారు. వీరితో డబ్బులు వసూలు చేసేందుకు ఆయా నియోజకవర్గాల్లోని సర్కిళ్లలో పని చేసే సీఐలు, ఎస్ఐల సహకారం తీసుకున్నారు. అయితే ఆ సీఐలు కూడా హనీ ట్రాప్ వ్యవహారం తెలిసి సహకరించారా? తెలీకుండా బకాయిలు మాత్రమే వసూలు చేశారా? బకాయిలు వసూలు చేయమని ఏ టీడీపీ నేత సిఫార్సు చేశారు? అనే దిశగా కూడా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. పురోహితులనూ వదలని గ్యాంగ్ హనీట్రాప్ బాధితుల్లో ఉద్యోగులు, వ్యాపారులు, రియల్టర్లతో పాటు పురోహితులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత బాధితులు నేరుగా ఎస్పీని కలిసి గోడు వెల్లబోసుకుంటున్నారు. ముఠా సభ్యుల నుంచి బాండ్లను సేకరించిన ఎస్పీ.. వాటిని చించేసినట్లు తెలుస్తోంది. అలాగే వసూలు చేసిన డబ్బుల రికవరీ దిశగా కూడా ఎస్పీ ఆలోచిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో ఎస్పీకి బాధితులు వాయిస్ మెసేజ్, ఫోన్లు, వాట్సాప్ ద్వారా ధన్యవాదాలు చెప్పినట్లు తెలుస్తోంది. కొందరు బాధితుల వేదనను విన్న ఎస్పీ తీవ్రంగా చలించినట్లు తెలుస్తోంది. ఓ ప్రజాప్రతినిధి వీడియోపై సర్వత్రా చర్చ! హనీట్రాప్ వ్యవహారంలో ఓ టీడీపీ ప్రజాప్రతినిధి ఆడియో, వీడియో రికార్డులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని జిల్లా పోలీసు అధికారులు ఇంటెలిజెన్స్ డీజీకి, డీజీపీకి పంపారని తెలుస్తోంది. అయితే ఇది పోలీసు వర్గాలతో పాటు టీడీపీ నేతలతో చర్చిస్తున్న అంశమే. ఇది వాస్తవమా కాదా అనేది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. హనీట్రాప్కు రాజకీయ రంగు హనీట్రాప్ వ్యవహారంలో అరెస్టయిన లేడీ డాన్ రంగమ్మనాయుడు బీజేపీ నుంచి టీడీపీలో చేరారు. రాజేశ్నాయుడు టీడీపీలో కొనసాగుతున్నారు. అలాగే రుద్రంపేట మాజీ ఉపసర్పంచ్ నరేంద్రరెడ్డి వైఎస్సార్సీపీ మద్దతుతో గెలిచినా, 2024కు ముందే టీడీపీలో చేరారు. ఎన్నికల్లో దగ్గుపాటి ప్రసాద్కు అనుకూలంగా పని చేశారు. అలాగే అనంత వెంకటరామిరెడ్డిని ఓడించేందుకు పనిచేస్తానని ఎల్లో మీడియా వేదికగా చెప్పారు. ఇలాంటి వ్యక్తిని తిరిగి వైఎస్సార్సీపీ నేతగా ప్రచారం చేసే ప్రయత్నం టీడీపీ నేతలు, అనుకూల మీడియా చేశాయి. అయితే వాస్తవం ‘అనంత’ ప్రజానీకానికి తెలియడంతో టీడీపీ ఎత్తులు పారలేదు. మరో ఆరుగురి పోలీసులపై చర్యలుహనీ ట్రాప్ ముఠాతో సంబంధాలు ఉన్న పోలీసులపై చర్యలకు ఎస్పీ జగదీష్ ఉపక్రమించారు. ఇందులో భాగంగా అనంతపురం రూరల్, ఇటుకలపల్లి పోలీస్స్టేషన్లలో పని చేస్తున్న ఆరుగురు సిబ్బందిని వీఆర్కు పంపుతూ శుక్రవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వీఆర్కు వెళ్లిన వారిలో అనంతపురం రూరల్ ఏఎస్ఐ నాగరాజు, హెడ్కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుళ్లు జయరాంనాయక్, దేవేంద్ర, మురళి ఉన్నారు. అలాగే ఇటుకలపల్లి కానిస్టేబుల్ దేవ్లానాయక్ ఉన్నారు. ముఠాలోని టీడీపీ నేతల కాల్ రికార్డులు పరిశీలిస్తున్న పోలీసులు ముఠాలో మరికొంతమంది పోలీసులు, రాజకీయ నేతలు ఉన్నట్లు గుర్తింపు బాధితుల్లో పురోహితులు, ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయనేతలు కూడా.. ట్రైనీ ఎస్పీ అశ్విన్ మణిదీప్తో లోతుగా విచారణ చేయిస్తున్న ఎస్పీ జగదీష్ వీఆర్కు మరో ఆరుగురు పోలీసులు -
ఆగిన ‘శ్రీరామరెడ్డి’ తాగునీటి సరఫరా
● మూడు నియోజకవర్గాలో దాహం కేకలు కూడేరు: వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం వల్ల ఏకంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు తాగునీటి సరఫరా ఆగిపోయింది. కూడేరు మండల పరిధిలోని పీఏబీఆర్ వద్ద ఏర్పాటైన నీలకంఠాపురం శ్రీరామరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ పథకం నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, రాయదుర్గం, హిందూపురం, మడకశిర నియోజక వర్గాల్లోని సుమారు 1,050 గ్రామాలకు తాగునీటిని సరఫరా అవుతోంది. ఈ నెల 19న తాగునీటిని సరఫరా చేసే మూడు పంపింగ్ పైపులు పని చేయకుండా మొరాయించాయి. ఇందులో ఒక పంపింగ్ పైపు పనిచేసినా కూడా నీటి సరఫరా సాఫీగానే సాగుతుంది. అయితే ఒక దాని తర్వాత మరొకటి అలా మూడు పంపింగ్ పైపులూ పనిచేయకుండా పోయాయి. కాంట్రాక్టర్, అధికారులు పంపింగ్ పైపుల పని తీరును పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించినట్లు తెలుస్తోంది. మరమ్మతుల కోసం రెండు రోజుల క్రితం పంపింగ్ పైపులను తీసుకెళ్లారు. శుక్రవారం సాయంత్రం వరకు పైపులను అమర్చలేదు. ఆరు రోజులుగా కళ్యాణదుర్గం, హిందూపురం, మడకశిర నియోజకవర్గాలలోని గ్రామాలకు నీటిసరఫరా ఆగిపోయింది. అసలే వేసవి. ఎండలు మండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాయదుర్గం నియోజకవర్గానికి మాత్రం ప్రత్యామ్నాయ మార్గం గుండా నీటిసరఫరా చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పంపింగ్ పైపులకు మరమ్మతులు చేయించి తాగునీరు సరఫరా అయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
‘అనంత’ వేదికగా ఫుట్బాల్ టోర్నీ
అనంతపురం అర్బన్: జిల్లా కేంద్రంలోని ఆర్డీటీ స్టేడియం వేదికగా ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్–2026 నిర్వహించున్నారని, ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆదేశించారు. టోర్నీ నిర్వహణ ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్లోని మినీకాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో జేసీ సమీక్షించారు. అండర్–15, అండర్–19 బాలబాలికల విభాగంలో మూడు రోజుల పాటు టోర్నీ సాగుతుందన్నారు. ప్రతి జిల్లా నుంచి దాదాపు 72 మంది చొప్పున 28 జిల్లాల ప్రాతినిథ్యం ఉంటుందన్నారు. బాలికలకు విన్సెంట్ డిపాల్, ఆర్డీటీలో వసతి ఉంటుందని, బాలురకు కలెక్టరేట్ సమీపంలోని బుడ్డప్పనగర్లో ఉన్న రాజేంద్ర మునిసిపల్ ఉన్నత పాఠశాలలో వసతి కల్పిస్తున్నట్లు వివరించారు. క్రీడా ప్రాంతం, వసతి ప్రదేశాల్లో మౌలిక వసతుల కల్పనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మంజుల, వైఎస్సార్ కడప స్పోర్ట్స్ స్కూల్ కో–ఆర్డినేటర్, ప్రత్యేక అధికారి జగన్నాథరెడ్డి, ఆన్సెట్ అధికారి శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
లోన్ యాప్ వేధింపులు తాళలేక యువకుడి ఆత్మహత్య
మడకశిర రూరల్: లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు... శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం ఉప్పిడిపల్లికి చెందిన సిద్దార్థ (24)కు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహమైంది. వీరికి రెండేళ్ల వయసున్న కుమార్తె ఉంది. ఈ క్రమంలో సిద్దార్థ వ్యక్తిగత అవసరాల నిమిత్తం ‘సీఏఎస్ఈఏఎస్’ యాప్ ద్వారా రూ.10 వేల రుణం తీసుకున్నాడు. రుణం తీసుకునే ముందు యాప్లో ఉన్న సమాచారం మేరకు తనకు పరిచయస్తులైన నలుగురి ఫోన్ నంబర్లను నమోదు చేశాడు. అయితే రుణం కంతులు సక్రమంగా చెల్లించలేకపోవడంతో వడ్డీల భారం పెరిగి రూ.16 వేలకు చేరుకుంది. ఈ క్రమంలో యాప్ నిర్వాహకుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. రుణం చెల్లించకపోతే నగ్నంగా ఉన్న ఫొటోలను షేర్ చేసి పరువు తీస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో తనకు కొద్ది సమయం కావాలని సిద్ధార్థ కోరాడు. అయినా వినకుండా లోన్ యాప్ నిర్వాహకులు గతంలో సిద్దార్థ నమోదు చేసిన పరిచయస్తుల సెల్ఫోన్ల వాట్సాప్ నంబర్లకు నగ్నంగా ఉన్న ఫొటోలు పంపారు. వారి ద్వారా విషయం తెలుసుకున్న సిద్దార్థ తీవ్ర మనోవేదనకు లోనై ఈ నెల 21న కనిపించకుండా పోయాడు. అప్పటి నుంచి కుటుంబసభ్యులు, బంధుమిత్రులు గాలించినా ఫలితం లేకపోయింది. గురువారం ఉదయం గ్రామ శివారులోని పొలంలో చెట్టుకు వేసుకున్న ఉరికి విగతజీవిగా వేలాడుతున్న సిద్దార్థను గమనించిన స్థానికుల సమాచారంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అవమానం భరించలేక తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లుగా భార్య కవిత చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
తెగుళ్లపై రైతులు అప్రమత్తంగా ఉండాలి
కూడేరు: ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు తెగుళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దేవానంద, ప్రిన్సిపల్ సైంటిస్ట్ తిరుపతి రెడ్డి, ఉద్యాన పరిశోధన స్థానం సైంటిస్ట్ రమేష్ అన్నారు. కూడేరు మండల పరిధిలోని మరుట్లలో గురువారం వారు పర్యటించారు. చీనీ, మామిడి, దానిమ్మ పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రధానంగా చీనీలో వేరుకుళ్లు, గమ్మోసిస్ తెగులు గుర్తించారు. గమ్మోసిస్తో చీనీ చెట్టు కాండం ప్రాంతంలో బెరడు బంక్ మాదిరి కారి నిదానంగా మొత్తం ఎండిపోతుందన్నారు. వేరుకుళ్లు తెగులుతో పోషక పదార్థాలు, నీరు చెట్టుకు అందకుండా పోయి ఎండిపోతాయని, తెగుళ్లు సోకిన వెంటనే కాండం, వేర్లకు తగలకుండా కలుపు మందు పిచికారీ చేయాలని సూచించారు. వారి వెంట నియోజకవర్గ హెచ్ఓ యామిని ఉన్నారు. ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదు అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాలకు ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదని ఇన్చార్జ్ డీఈఓ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉచిత, నిర్భంద విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ)–2009 సెక్షన్ 13 ప్రకారం 1–8 తరగతుల ప్రవేశాలకు ఎలాంటి పరీక్షలు, స్క్రీనింగ్, టాలెంట్ టెస్ట్లు, స్కాలర్షిప్ టెస్ట్లు నిర్వహించరాదన్నారు. స్టేట్ సిలబస్, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ ఇలా ఏ సిలబస్ అనుసరిస్తున్న పాఠశాలలకైనా ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించి పరీక్షలు నిర్వహించే పాఠశాలలకు సెక్షన్ 13(2)(బీ) ప్రకారం మొదటి ఉల్లంఘనకు రూ. 25 వేల జరిమానా, తదుపరి ప్రతి ఉల్లంఘనకు రూ. 50 వేల చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించారు. నిబంధనల తీవ్రతను బట్టి పాఠశాల గుర్తింపు రద్దుకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని తెలిపారు. ఉప విద్యాశాఖ, మండల విద్యాశాఖ అధికారులు తమ పరిధిలోని పాఠశాలలను పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. గుంతకల్లు డివిజన్ను అభివృద్ధి బాటలో నడుపుదాం గుంతకల్లు: గుంతకల్లు డివిజన్ను అభివృద్ధి బాటలో నడుపుదామని దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథుర్ పిలుపునిచ్చారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి విడిపోయిన గుంతకల్లు డివిజన్లో తొలిసారిగా గురువారం ఆయన పర్యటించారు. ప్రత్యేక రైలులో గుంతకల్లు రైల్వేస్టేషన్కు చేరుకున్న ఆయనకు డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా, ఇతర అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం డీఆర్ఎం కార్యాలయంలోని మీటింగ్ చాంబర్లో డివిజన్ స్థాయి అధికారులతో సందీప్ మాథుర్ సమావేశయ్యారు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కానున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్లో గుంతకల్లు డివిజన్ విలీనమవుతున్న తరుణంలో డివిజన్ భౌగోళిక సరిహద్దులతోపాటు ఎంత మేర డివిజన్ కుదింపులకు గురవుతుందనే అంశాలపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని రాయచూర్ సెక్షన్ను దక్షిణ మధ్య రైల్వేలో విలీనం చేయాలని రైల్వేబోర్డు నిర్ణయించినట్లు తెలిసిందన్నారు. జూన్లో డివిజన్ భౌగోళిక స్వరూపంతోపాటు రూట్ మ్యాప్ నిర్ణయిస్తున్నట్లు తెలిపారు. అధికారులు శ్రమించి డివిజన్ను అన్ని విభాగాల్లో ముందంజలో నిలపాలని పిలుపునిచ్చారు. అనంతరం కంట్రోల్ రూం కార్యాలయాన్ని, గుంతకల్లు –డోన్ రైలు మార్గాన్ని జీఎం తనిఖీ చేశారు. కార్యక్రమంలో సెక్రటరీ బాలాజీ కిరణ్ పాల్గొన్నారు. మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల అనంతపురం ఎడ్యుకేషన్: మోడల్ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశాలకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఫలితాల వివరాలు www.apms. apcfss.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఇన్చార్జ్ డీఈఓ శ్రీనివాసరావు తెలిపారు. ఎంపికై న విద్యార్థులు ఆయా మోడల్ స్కూళ్లలో సంప్రదించాలని సూచించారు. -
నేడు పుట్టపర్తిలో సత్యసాయి ఆరాధనోత్సవాలు
ప్రశాంతి నిలయం: సత్యసాయి ఆరాధనోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఉత్సవాల నేపథ్యంలో సాయికుల్వంత్ సభా మందిరాన్ని, సత్యసాయి మహాసమాధిని ప్రత్యేకంగా అలంకరించారు. వేడుకలకు భక్తులు భారీగా తరలిరానుండగా...సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసింది. ఆరాధనోత్సవాల్లో భాగంగా నిర్వహించే నారాయణ సేవకు హిల్వ్యూ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. సత్యసాయి ఆరాధనోత్సవాలు శుక్రవారం ఉదయం 8 గంటలకు సాయికుల్వంత్ సభా మందిరంలో వేద పఠనంతో ప్రారంభమవుతాయి. 8.10 గంటలకు సత్యసాయి విద్యార్థులు పంచ రత్న కీర్తనలు ఆలపిస్తారు. 9 గంటలకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఎస్ఎస్ నాగానంద ప్రారంభోపన్యాసం చేస్తారు. సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీష్ పాండ్య వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం సత్యసాయి పూర్వ ప్రసంగాలను డిజిటల్ స్క్రీన్లపై ప్రదర్శిస్తారు. భజన, మంగళ హారతితో ఉదయం వేడుకలు ముగుస్తాయి. నారాయణసేవ..ఆరాధనోత్సవాల్లో భాగంగా భక్తులకు నారాయణ సేవ (అన్నప్రసాద వితరణ) నిర్వహించేందుకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రశాంతి నిలయంలో వేడుకలు ముగిసిన అనంతరం ఉదయం 10 గంటలకు నారాయణ సేవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. భక్తులకు అన్నప్రసాద వితరణతో పాటు నూతన వస్త్రాలను బహూకరిస్తారు. కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొననుండగా.. హిల్వ్యూ స్టేడియంలో తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేశారు. -
‘నక్ష’పై ప్రత్యేక దృష్టి సారించాలి
అనంతపురం అర్బన్: ‘‘కేంద్ర ప్రభుత్వం నగరాలు, పట్టణాల్లోని భూముల సర్వే కోసం నక్ష ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు జారీ చేసే ఈ ప్రాజెక్టు అమలుకు 10 పుర, నగరపాలక సంస్థలను ఎంపిక చేసింది. అనంతపురం కూడా పైలెట్ ప్రాజ్టెక్టు కింద ఎంపిక కానున్న నేపథ్యంలో ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలి’’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. కలెక్టర్ గురువారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు అమలుతో ప్రభుత్వ, స్థానిక సంస్థల ఖాళీ స్థలాలు, భూముల లభ్యతపై స్పష్టత వస్తుందన్నారు. ఈ క్రమంలో వాటిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందన్నారు. అందుబాటులోని ఖాళీ భూముల్లో ప్రజలకు గృహవసతి కల్పించవచ్చన్నారు. క్షేత్రస్థాయిలో నక్ష ప్రాజెక్టు సర్వేను వేగవంతం చేయడంతో పాటు డిజిటల్ మ్యాపింగ్ పారదర్శకంగా చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో అహుడా కార్యదర్శి రామకృష్ణారెడ్డి, నగరపాలక సంస్థ ఎస్ఈ రాజశేఖర్, ఎల్డీఎం నరేష్రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం శ్రీలక్ష్మి, సర్వే ఏడీ విజయసారథి, టెలికాం జేటీఓ రామకృష్ణ, కార్పొరేషన్ ఇన్చార్జ్ టీపీఓ ఓంకార్ పాల్గొన్నారు. ‘పీఎం సూర్యఘర్’ను సద్వినియోగం చేసుకోండి పామిడి: పీఎం సూర్యఘర్ పథకాన్ని ఎస్సీ, ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆనంద్ అన్నారు. గురువారం ఆయన పామిడిలో పీఎం సూర్యఘర్ పథకం కింద ఏర్పాటు చేసిన ఉచిత సోలార్ ప్యానెల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. జిల్లాలో 17 వేల మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులను గుర్తించారన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి మండలానికి కేటాయించిన డ్రోన్ను అన్నదాతలు వినియోగించుకోవాలన్నారు. రాబోయే ఏడాదిలో పీఎం జన ధన్ కృషి యోజన పథకం కింద రూ. 80 కోట్లతో వ్యవసాయాన్ని ప్రగతి పథంలో పయనింపజేస్తామన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ షర్మిల, ఏఈ మధుసూదన్రావు తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు చంద్రబాబు అన్యాయం
అనంతపురం: బీసీలకు సీఎం చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. బీసీల హక్కుల సాధనలో భాగంగా ఈ నెల 26న అనంతపురంలోని లలితకళాపరిషత్లో నిర్వహించనున్న ‘బీసీ గళం’ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తదితరులతో కలిసి ‘బీసీ గళం’ పోస్టర్లను గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో వారు ఆవిష్కరించారు. భగీరథ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ యాదవ్ మాట్లాడుతూ బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ హయాంలో బీసీల అభివృద్ధికి తీసుకున్న చర్యలను నేడు కొనసాగించడం లేదని దుయ్యబట్టారు. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు, కార్పొరేషన్ల ద్వారా ఇచ్చే రుణాలు, సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టడం సిగ్గుచేటన్నారు. అడుగడుగునా దగా వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే విశ్వ మాట్లాడుతూ..చంద్రబాబు ప్రభుత్వం బీసీల కోసం సంక్షేమ పథకాల అమలులో వివక్ష చూపుతోందని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ మంగమ్మ మాట్లాడుతూ బీసీల హక్కుల కోసం ఎందాకైనా పోరాడతామన్నారు. జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ సభలో బీసీల సమస్యలను ప్రస్తావిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని, భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్న నేపథ్యంలో బీసీలు పెద్దఎత్తున హాజరు కావాలని కోరారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం బీసీలను అడుగడు గునా దగా చేస్తోందన్నారు. ‘బీసీ గళం’ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ అనంతపురం నియోజకవర్గ పరిశీలకుడు బోయ తిప్పేస్వామి, సీఈసీ సభ్యుడు మీసాల రంగన్న, రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణ రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర, మాజీ డిప్యూటీ మేయర్ దాసరి వాసంతి సాహిత్య, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, హరిత, సాకే చంద్రలేఖ, భారతి, హజరబి, కమర్ తాజ్, పార్వతి, రాధా యాదవ్, ప్రియాంక, జిల్లా ప్రధాన కార్యదర్శులు పూజారి రాజశేఖర్ యాదవ్, గౌని నాగన్న, నగర అధ్యక్షుడు చింత సోమశేఖర్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, కాగజ్ఘర్ రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు. బ్యాక్ బోన్ అని జగన్ నిరూపించారు చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మార్చుకున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు అలవిగాని హామీలిచ్చి గద్దెనెక్కాక అటకెక్కించారన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారన్నారు. బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ అని నిరూపించిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ధ్వజం బీసీల హక్కుల సాధనకు ‘అనంత’లో 26న ‘బీసీ గళం’ సభ విజయవంతం చేయండి: పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత పిలుపు -
బూదగవిలో ఉద్రిక్తత
● కోర్టు వివాదంలో ఉన్న భూమిని కొలిచేందుకు వెళ్లిన అధికారులు ● మనస్తాపంతో పురుగుల మందు తాగిన యువరైతు ఉరవకొండ: కోర్టు వివాదంలో ఉన్న భూమిని కొలిచేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధం కావడంతో మనస్తాపంతో ఓ యువరైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వివరాలు... పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు బాధిత కుటుంబసభ్యులు మేరకు ఉరవకొండ మండలం బూదగవి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మద్దతు తాజా మాజీ సర్పంచ్ లక్ష్మీదేవి పాతికేళ్ల క్రితం సోమశేఖర్గౌడ్ అనే వ్యక్తితో పాల్తూరు గ్రామ సమీపంలోని సర్వే నంబర్ 333ఎ, 313లో ఉన్న 8.64 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. కొంతకాలంగా ఆ భూమిపై కన్నేసిన కృష్ణం రఘుతో పాటు గంట రంగనాథ్, గోవిందునాయక్, ఎరికల సురేష్, నరేంద్ర ఎలాగైనా ఆక్రమించుకోవాలని తీవ్ర ప్రయత్నాలు సాగిస్తూ వచ్చారు. దీంతో లక్ష్మీదేవి కుమారులు మల్లికార్జున, ధనుంజయ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ వివాదం ఉరవకొండ సివిల్ కోర్టులో నడుస్తోంది. అయినా కృష్ణం రఘు, తదితరులు పట్టించుకోకుండా ఈ నెల 4న భూమిలో దౌర్జన్యంగా ప్రవేశించి కొలతలు తీయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో మల్లికార్జున కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. దీంతో అప్పటికి వెనక్కు తగ్గిన వారు... గురువారం భారీ పోలీసు భద్రత మధ్య రెవెన్యూ అధికారులతో కొలతలు తీయించేందుకు సిద్ధమయ్యారు. దీంతో తీవ్ర మనోవేదనకు లోనైన మల్లికార్జున అధికారుల సమక్షంలోనే పురుగుల మందు తాగడంతో వెంటనే 108 వాహనంలో ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఆర్టీసీ నిర్మాణాల్లో అలసత్వం
అధికార పార్టీ నేతల ధన దాహానికి ఆర్టీసీ అభివృద్ధి కుంటు పడింది. అభివృద్ధి పనుల్లో పంపకాలు, పర్సంటేజీల ఒత్తిళ్ల నేపథ్యంలో ఎక్కడి నిర్మాణాలు అక్కడే నిలిచి పోయాయి. టీడీపీ ప్రజాప్రతినిధులు వేసిన శిలాఫలకాలు దిష్టిబొమ్మల్లా మారాయి. ● శిలాఫలకాలతోనే సరి అనంతపురం క్రైం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ అనంతపురం రీజియన్ పరిధిలో చేపట్టిన పలు నిర్మాణాలు ప్రారంభ దశలోనే ఆగిపోయాయి. గుత్తి బస్టాండ్ నిర్మాణం కోసం రూ.20 లక్షలతో తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామంటూ ప్రకటించినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. గుత్తి బస్టాండ్లో ఆరు దుకాణాల నుంచి ప్రతి నెలా రూ. లక్ష వరకూ అద్దె రూపంలో ఆదాయం సమకూరేది. అభివృద్ధి పేరుతో ఈ దుకాణాలను కూల్చేశారు. తాత్కాలిక బస్టాండు నిర్మాణం తప్పనిసరి అంటూ మార్చి 31న నేతలు శిలాఫలకాలు కూడా వేశారు. అయితే ఈ పనులు నేటికీ ప్రారంభం కాలేదు. కారణాలు ఆరా తీస్తే శాశ్వత బస్టాండ్ నిర్మాణం కోసం రూ.5 కోట్ల అంచనాతో ప్రణాళిక సిద్ధమైనా, కాంట్రాక్టర్ పనులు చేపడుతున్న సమయంలో స్థానిక టీడీపీ నేతల నుంచి పర్సెంటేజీల కోసం వేధింపులు మొదలయ్యాయి. దీంతో పనులు చేపట్టలేక కాంట్రాక్టర్ ముఖం చాటేశాడు. రాయదుర్గంలోనూ అదే పరిస్థితి రాయదుర్గంలో బస్టాండ్ నిర్మాణానికి వర్క్ ఆర్డర్ ఉన్నా.. రూ.50 లక్షలతో జరగాల్సిన పనులపై ఎలాంటి పురోగతి లేదు. అలాగే అనంతపురంలో ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయ నిర్మాణం కూడా నత్తనడకన సాగుతోంది. ఈ పని ఇప్పటి వరకూ కేవలం పిల్లర్లకు కాలమ్స్ వేయడం వరకే పరిమితమైంది. పర్సెంటేజీల గోల తమకు పర్సెంటేజీలు చెల్లించకపోతే పనులు అడ్డుకుంటామంటూ కాంట్రాక్టర్లను స్థానిక టీడీపీ నేతలు బెదిరిస్తున్నట్లుగా అంతర్గతంగా జోరుగా చర్చ సాగుతోంది. సబ్ కాంట్రాక్టుల పంపకాల విషయంగా మితిమీరిన జోక్యం, ఆర్థిక లావాదేవీల్లో స్పష్టత లేకపోవడంతో కాంట్రాక్టర్లు సైతం ధైర్యం చేసి ముందుకు రాలేకపోతున్నారు. ఈ నిర్మాణాలపై అధికారులు కూడా సరైన చర్యలు తీసుకోలేకపోతున్నారు. ప్రధానంగా ఇన్చార్జ్ల పెత్తనంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆర్ఎం నుంచి డీఎం వరకూ కీలక స్థానాలన్నీ ఇన్చార్జ్లతోనే నెట్టుకొస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన దౌర్బాగ్యంగా మారిందని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రతి పనీ వారికి అనుకూలంగా వెళ్లాలనడమే కానీ, ప్రయాణికుల సంక్షేమం, వారి భధ్రతను గాలికి వదిలేశారని వాపోతున్నారు. ఊహల పల్లకీలో ఊరేగింపు బాబు సర్కారులో ఆర్టీసీకి పైసా లబ్ధి చేకూరకపోయినా ప్రయాణికులను మాత్రం ఊహల పల్లకీలో ఊరేగిస్తున్నట్టుగా నేతలు ప్రకటనలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజలను మభ్యపెడుతూ, అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ పలువురు మండిపడుతున్నారు. ప్రజలకు అవసరమైన బస్టాండ్లు, కార్యాలయాలు సమయానికి పూర్తి కాకపోవడం వల్ల ఆర్థిక నష్టం మాత్రమే కాక, ఉన్నవాటిని కూల్చేయడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఆర్టీసీ ఇన్చార్జ్ ఆర్ఎం శ్రీలక్ష్మిని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు. -
ఆర్టీఐహెచ్తో ఎస్ఆర్ఐటీ ఒప్పందం
బుక్కరాయసముద్రం: మండలంలోని రోటరీపురం వద్ద ఉన్న ఎస్ఆర్ఐటీ (అటానమస్) ఇంజినీరింగ్ కళాశాలలో ఇంకుబేషన్ సెంటర్ స్థాపనకు రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ (ఆర్టీఐహెచ్)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బాలకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రంజిత్రెడ్డి తెలిపారు. వివరాలను గురువారం వారు వెల్లడించారు. విద్యార్థుల్లో ఇన్నోవేషన్ వ్యాపార దృక్పథాన్ని ప్రోత్సహించడంతో పాటు వ్యాపారవేత్తలుగా ఎదిగాలనుకునే ఔత్సాహిక విద్యార్థులను గుర్తించి వారిలో నైపుణ్యాలు, బిజినెస్ స్కిల్స్ను అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యంగా ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వివరించారు. ఈ భాగస్వామ్యం ద్వారా నూతన ఆవిష్కరణలతో పాటు విద్యార్థులకు స్టార్టప్లు, ఉపాధి అవకాశాలు విస్తరించనున్నాయన్నారు. కార్యక్రమంలో రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ సీఈఓ డాక్టర్ హఫీజ్ బాషా, ఐఐసీ అధ్యక్షుడు డాక్టర్ రంజిత్రెడ్డి, కన్వీనర్ డాక్టర్ ఆంజనేయులు పాల్గొన్నారు. మొక్కజొన్న పంట దగ్ధం గుమ్మఘట్ట: గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో మొక్కజొన్న పంట దగ్ధమైంది. స్థానికులు తెలిపిన మేరకు.. గుమ్మఘట్ట మండలం తాళ్లకెర గ్రామానికి చెందిన రైతు సన్నన్న తనకున్న 4.45 ఎకరాల భూమిలో మొక్కజొన్న పంట సాగు చేశాడు. పంట చేతికి రావడంతో కోత కోసి కంకులను ఓ చోట ఆరబోశాడు. ఈ నేపథ్యంలో గురువారం ఆరుబయలు ప్రాంతంలోని ఎండు గడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు రాజేయడంతో మంటలు చెలరేగి ఆరబోసిన కంకులను చుట్టుముట్టాయి. కంకులతో పాటు టార్పాలిన్, డ్రిప్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. ఘటనతో రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. ప్రభుత్వం స్పందించి బాధిత రైతును ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. మహిళల భద్రతే ప్రభుత్వ లక్ష్యం : ఎస్పీ కళ్యాణదుర్గం రూరల్: మహిళల భద్రతే ప్రభుత్వ లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని ఎస్పీ జగదీష్ అన్నారు. సీ్త్ర శక్తి యాప్పై గురువారం కళ్యాణదుర్గంలోని ఓ ఫంక్షన్ హాల్లో మహిళలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, పోలీసు సిబ్బందితో కలసి తొలుత పట్టణంలో ఎస్పీ బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడారు. సెల్ఫోన్ ఉన్న ప్రతి ఒక్క మహిళ రస్త్రీ శక్తి యాప్ను డౌన్లోడు చేసుకోవాలన్నారు. ఏవిధమైన ఇబ్బందులు తలెత్తిన సీ్త్ర శక్తి యాప్ ఉపయోగించుకుని రక్షణ పొందాలన్నారు. స్వీయ రక్షణ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని బాలబాలికలకు సూచించారు. బాల్య వివాహలను నివారించి మహిళలు ఉన్నతమైన చదువులు చదువుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రవిబాబు, పోలీసు సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వ్యక్తి దుర్మరణం శింగనమల: వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... శింగనమల మండలం సి.బండమీదపల్లి గ్రామానికి చెందిన హరి (34) రాప్తాడు సమీపంలో ఉన్న ఐచర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం వ్యక్తిగత పనిపై ద్విచక్ర వాహనంపై తాడిపత్రికి వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని రాత్రి తిరుగు ప్రయాణమైన ఆయన నాయనపల్లిక్రాస్ వద్దకు చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన హరి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, హరికి భార్య, కుమార్తె ఉన్నారు. గతంలో సచివాలయ వలంటీర్గా పనిచేసాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆటో బోల్తా .. వ్యక్తి మృతి కూడేరు: ఆటో బోల్తా పడన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... కూడేరు మండలం పి.నారాయణపురానికి చెందిన దొనస్వామిరెడ్డి(60) తన చెల్లెలు కుమారుడి పెళ్లి కోసమని బుధవారం కడదరకుంట వద్ద ఓ తోటలో మామిడి కాయలు కొనుగోలు చేసుకుని ఆటోలో వేసుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో దొనస్వామికి తీవ్ర గాయాలయ్యాయి. స్వల్ప గాయాలతో డ్రైవర్ రాజేష్ బయటపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే దొనస్వామిని అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
●బాబోయ్ ఎండలు
జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపుతున్నాడు. 10 గంటల తర్వాత ప్రధాన రహదారులు, కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ఎండవేడిమికి వృత్తిదారులు తమ పనులు చేయలేకపోతున్నారు. ఉపాధి వేతనదారులు, భవన నిర్మాణ కార్మికులు, శ్రామికులు, ఫుట్పాత్ వ్యాపారులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 5 గంటల వరకూ ఎండ వేడి, ఉక్కపోత ఉండడంతో జిల్లావాసులు విలవిల్లాడుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం: తోపుడు బండిపై గుజరీ వేసుకుని వెళుతున్న మహిళ మండు టెండలో అనంతపురం వన్టౌన్ పీఎస్ వద్ద చంటి బిడ్డతో సేద తీరుతున్న దృశ్యం ఎండ వేడి నుంచి ప్రయాణికులకు రక్షణ కల్పించేలా ఆటోపై ఏర్పాటు చేసిన రబ్బరు షీట్ రోడ్డు పక్కన చెట్ల కింద భోజనం చేస్తున్న వ్యవసాయ కూలీలు -
ఇసుక టిప్పర్లను ఆడ్డుకున్న రైతులు
శింగనమల: మండలంలోని నిదనవాడ వద్ద ఉన్న పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ వాహనాలను గ్రామస్తులు గురువారం రాత్రి అడ్డుకున్నారు. కొంత కాలంగా నది పరివాహక ప్రాంతంలో టీడీపీ నేతలు జేసీబీలు, హిటాజీలు ఏర్పాటు చేసి, టిప్పర్ల ద్వారా ఇసుకను పెద్దవడుగూరు మీదుగా అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నెల రోజులుగా ఈ దందా ఊపందుకుంది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో పార్టీలకు అతీతంగా రైతులందరూ సమావేశమై చర్చించారు. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి బోరుబావుల్లో నీరు అందకుండా పోతోందని, ఫలితంగా భవిష్యత్తులో పంటలు సాగు చేయడం కష్టమవుతుందని భావించిన అందరూ ఇసుక తరలింపులను అడ్డుకోవాలని తీర్మానించుకున్నారు. దీంతో గురువారం రాత్రి పెన్నానదిలోకి ప్రవేశించిన టిప్పర్లను రైతులందరూ ఏకమై అడ్డుకున్నారు. వాహనాలను అడ్డుకున్న సమాచారాన్ని పోలీసు ఉన్నతాధికారులకు అందించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమిస్తామంటూ హెచ్చరించారు. అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ గుంతకల్లు టౌన్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇళ్లలో చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగలు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పట్టుబడిన వారిలో మధ్యప్రదేశ్లోని థార్ జిల్లా కుక్సీ గ్రామానికి చెందిన అశోక్ ధ్యాన్ సింగ్, రాజుసింగ్ మెహడా ఉన్నారు. వీరి నుంచి 7.2 తులాల బంగారు నగలు, రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, నిందితులు అనంతపురం 4వ పట్టణ పీఎస్తో పాటు గుంతకల్లులోని వన్టౌన్ పీఎస్ పరిధిలోని పలు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. సుమారు 55 తులాల బంగారు నగలు, 150 తులాల వెండి సామగ్రి, రూ.2.20 లక్షల నగదు అపహరించారు. గుంతకల్లులో చోటు చేసుకున్న చోరీలకు సంబంధించి కేసులు నమోదు చేసిన పోలీసులు సీఐలు మనోహర్, ప్రవీణ్ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం అశోక్ ధ్యాన్సింగ్, రాజుసింగ్ గుంతకల్లులోని ఢీజిల్ షెడ్ వద్ద తచ్చాడుతుండగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. -
గుత్తిలో నకిలీ నోట్ల కలకలం
గుత్తి: గుత్తి పట్టణంలో నకిలీ నోట్లు కలకలం రేపుతున్నాయి. నెల రోజులుగా నకిలీ నోట్ల చలామణి అవుతుండటంతో వ్యాపారులు, జనాలు బెంబేలెత్తి పోతున్నారు. అమృత్ సినిమా థియేటర్ ఎదురుగా హోటళ్లకు విచ్చేసిన కస్టమర్లు అల్పాహారం తిన్న తర్వాత బిల్లు చెల్లించారు. వారు ఇచ్చిన వంద రూపాయల నోట్లను హోటల్ నిర్వాహకులైన వలి, షారూక్, బాషా కొంతసేపటి తర్వాత గమనిస్తే నకిలీవని తేలడంతో ఆందోళనకు గురయ్యారు. రద్దీగా ఉండే హోటళ్లు, వ్యాపార సముదాయాలను టార్గెట్గా చేసుకుని నకిలీ నోట్లను చలామణి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రాథమికంగా వాటిని గుర్తించలేకపోవడంతో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. హోటల్ నిర్వాహకుడు షారూఖ్ మాట్లాడుతూ తన హోటల్లో టిఫిన్ చేసిన అనంతరం వ్యక్తి ఇచ్చిన రూ.100 నోటు నకిలీదని గుర్తించలేకపోయినట్లు తెలిపాడు. ఇలా మూడుసార్లు తాను మోసపోయానని వాపోయాడు. రెండు రోజుల క్రితం తనకూ ఓ కస్టమర్ రూ.100 నకిలీ నోటు ఇచ్చాడని మరో హోటల్ నిర్వాహకుడు వలి తెలిపాడు. సాయంత్రం డబ్బు లెక్కిస్తున్న సమయంలో అది దొంగ నోటని గుర్తించానన్నాడు. అధికారులు స్పందించి దొంగ నోట్ల చలామణిని అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
తాగుడు మానేయమంటే ఉరేసుకున్నాడు!
కణేకల్లు: సంపాదన మొత్తం తాగుడుకే ఖర్చు పెడితే కుటుంబ పోషణ ఎలా? అంటూ భార్య నిలదీయడంతో క్షణికావేశంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కణేకల్లు మండలం మాల్యం గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసముంటున్న ఎం.రాజశేఖర్ (25)కు భార్య శ్రావణి, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇటీవల మద్యానికి బానిసైన రాజశేఖర్ సంపాదన మొత్తం తాగుడుకే ఖర్చు పెట్టసాగాడు. దీంతో కుటుంబ పోషణ భారమైంది. ఇదే అంశంపై బుధవారం భార్య నిలదీసింది. తాగుడు మానేసి బంధుమిత్రుల వద్ద పరువు నిలుపుకోవాలని హితవు పలికింది. దీంతో క్షణికావేశానికి లోనైన రాజశేఖర్ గ్రామ శివారులోని చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. రైతులకు సకాలంలో విద్యుత్ కనెక్షన్లు ● విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ అనంతపురం టౌన్: రైతులకు వ్యవసాయ కనెక్షన్లను సకాలంలో మంజూరు చేయనున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 8 వేలకు పైగా వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయాల్సి ఉండగా, ప్రతిపాదనలను ఇప్పటికే కార్పొరేట్ కార్యాలయానికి పంపినట్లు తెలిపారు. అక్కడి నుంచి అనుమతులు కాగానే దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకూ వ్యవసాయ కనెక్షన్ మంజూరు చేస్తామన్నారు. రాబోవు 6 నెలల కాలంలో సీనియార్టీ మేరకు దశల వారీగా వ్యవసాయ కనెక్షన్లు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. యువకుడి దుర్మరణం ముదిగుబ్బ: ఐస్క్రీమ్ బండి ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువకుడు మృతి చెందాడు. ముదిగుబ్బ మండలం దొరిగిల్లు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. నల్లమాడ మండలం గోపేపల్లి గ్రామానికి చెందిన చాంద్బాషా, సహీన దంపతుల కుమారుడు హైదర్బాషా (18) వ్యక్తిగత పనిపై బుధవారం ముదిగుబ్బకు వచ్చాడు. పని ముగించుకున్న అనంతరం ఇందుకూరుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మార్గ మధ్యంలో ఎదురుగా వస్తున్న ఐస్క్రీమ్ విక్రయించే వాహనం ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన హైదర్బాషా అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కోర్టుకు హాజరుకాని ఇద్దరి అరెస్ట్తనకల్లు: న్యాయస్థానం కళ్లు కప్పి తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తనకల్లు పీఎస్ ఎస్ఐ దిలీప్కుమార్ తెలిపారు. వివరాలను బుధవారం వెల్లడించారు. తనకల్లు మండలం దేవళంతండా, పెనుగుండుతండాకు చెందిన ఓబులేసు, నాగరాజునాయక్ గతంలో మద్యం అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసుల్లో అప్పట్లో న్యాయస్థానానికి హాజరైన వారు ఆ తర్వాత కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరగసాగారు. దీంతో ఇద్దరిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ కావడంతో బుధవారం అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. -
పుస్తకంతోనే వ్యక్తిత్వ వికాసం
అనంతపురం కల్చరల్: సెల్ఫోన్ చేస్తున్న వింతలు, విడ్డూరాలతో అరచేతి లోనే సాహిత్యం విస్తృతంగా అందుబాటులోకి వచ్చింది. అయినా పుస్తకాలకున్న ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గలేదు. వందల సంఖ్యలో నేటికీ వస్తూనే ఉన్నాయి. ప్రతి పుస్తకంలో అనుభవాలసారంతో జీవితాన్ని నిర్దేశించే లక్ష్యం దాగుంటుంది. మానసిక వికాసానికి దోహదపడే అలాంటి పుస్తకాలకు చరిత్ర పుటల్లో అందమైన స్థానాన్ని కల్పించారు. చదవటం, రాయడం, ప్రచురించడం, కాపీరైట్స్... తదితరాలను ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా ఏప్రిల్ 23న పుస్తక దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ పుస్తక దినోత్సవం సందర్భంగా పుస్తకానికి ఆదరణ తగ్గలేదని చాటే కార్యక్రమాలు గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఆ రోజే ఎందుకు? ప్రపంచ సాహిత్య శిఖరాల్లో అగ్రభాగాన నిలిచిన ‘డాన్ క్విక్సోట్’ నవల రచయిత, స్పెయిన్కు చెందిన మిగుల్ డె సెర్వాన్టెస్ పుట్టింది అక్టోబర్ 7 కాగా, ఏప్రిల్ 23న మరణించారు. ఈ క్రమంలో ఆయనకు గౌరవం ఇవ్వాలనే ఆలోచనతో ఆయన జయంతి నాడు పుస్తక దినోత్సవం జరపాలని ప్రముఖ స్పానిష్ రచయిత విసెంటే క్లావెల్ ఆండ్రెస్ ఆలోచన చేశాడు. అయితే విలియం షేక్స్పియర్, గార్సియాసా డి లా వేగా తదితర ఎందరో ప్రముఖ రచయితలు మరణించింది ఏప్రిల్ 23 కావడంతో అందరి జ్ఞాపకార్థం 1995, ఏప్రిల్ 23న యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) తొలిసారిగా ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని నిర్వహించింది. అప్పటి నుంచి ఏటా ఏప్రిల్ 23న ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఆదివారం వస్తే రచయితలకు పండుగే పుస్తకం చదివే వాళ్ల సంఖ్య తగ్గిపోతోందని పాత తరం వారంటున్నా దిగ్గజ రచయితలతో పాటూ యువ రచయితలు పోటీ పడి రచనలు సాగిస్తుండడం విశేషం. సాధారణ రచనలతో పాటూ అవార్డులు, రివార్డులందుకుంటున్న రచనలు ఇటీవల కోకొల్లలుగా ముద్రితమవుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం వచ్చిందంటే అనంతపురంలోని ఎన్జీఓ హోమ్, ప్రెస్క్లబ్లు పుస్తకావిష్కరణలకు సిద్దమవుతాయి. ఒకప్పుడు ఒకే రోజు రెండు మూడు పుస్తకాలు పాఠకుల ముందుకొచ్చేవి. ప్రత్యేక ప్రణాళిక, ఒప్పందం అనంతరం ఒక ఆదివారం ఒక్కటే అన్నట్లుగా నిర్ణయించుకోవడంతో ప్రతి ఆదివారమూ రచయితలకు, పుస్తక ప్రియులకు ఓ పండుగలా మారింది. ఆదరణలోనూ విభిన్నమే కాల్పనిక సాహిత్యం, ప్రబంధ సాహిత్యం, విప్లవ సాహిత్యం, ఆధునిక సాహిత్యం... ఇలా ఒకప్పుడు రాజ్యమేలిన నవలలు మళ్లీ ఇప్పుడు ఊపందుకుంటున్నాయి. అలాగే ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ వికాస పుస్తకాలకూ తరగని ఆదరణ ఉంటోంది. ముఖ్యంగా యువ రచయితలు పెరుగుతుండడంతో కవిత్వంలో వస్తున్న పెనుమార్పులతో పుస్తకాదరణ పెరుగుతోంది. పుస్తక దినోత్సవం వచ్చేనాటికి పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు వచ్చేస్తున్న నేపథ్యంలో పుస్తక పఠనం వైపు విద్యార్థులను మళ్లించాలని మేధావులంటున్నారు. నగరంలో ప్రతి ఆదివారమూ ఓ పుస్తకావిష్కరణేపుస్తకాలు మరో ప్రపంచానికి కిటికీ లాంటివి. ప్రతి పేజీతో మనకు కొత్త వ్యక్తులను, కొత్త సంస్కృతులను, కొత్త ఆలోచనలను పరిచయం చేస్తాయి. ఒక పుస్తకాన్ని మొదటిసారి చదివితో ఓ కొత్త స్నేహితుడిని సంపాదించుకున్నట్లు ఉంటుంది. అదే పుస్తకాన్ని మరోసారి చదివితే పాత స్నేహితుడిని కలుసుకున్న ఆనందం కలుగుతుంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పుస్తకానికి చరిత్ర పుటల్లో ప్రత్యేకంగా ఓ రోజును కేటాయించారు. 1995 నుంచి ఏప్రిల్ 23న అంతర్జాతీయ పుస్తక దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పఠనాసక్తి పెరిగింది కాలం ఎప్పుడూ ఒకేలా ఉండకపోవడం దాని స్వాభావిక లక్షణం. ఇంటర్నెట్ విపరీతంగా పెరిగిపోతున్న రోజుల్లోనూ మళ్లీ పుస్తక పఠనానికి ఆదరణ పెరుగుతుండడం ఆహ్వానించదగిన విషయం. లుక్ కల్చర్ నుంచి బుక్ కల్చర్ వైపుగా యువత పయనం సాగుతోంది. నేను రాసిన బుజ్జోని కల, ఒక కత్తుల వంతెన, అనంత రత్నాలు వంటి పుస్తకాలను అప్పటి కంటే ఇప్పుడే మళ్లీ అడిగి చదువుతుండడం ఆనందంగా ఉంది. మంచి కంటెంట్ ఉండే రచయితల పుస్తకాలకు ఆదరణ ఉంటోంది. – చంద్రశేఖరశాస్త్రి, స్పందన అనంత కవుల వేదిక సందర్భం ః నేడు అంతర్జాతీయ పుస్తక దినోత్సవం -
‘కాగ్నిజెంట్’లో సంబరాలు
అనంతపురం ఎడ్యుకేషన్: రెండు రోజుల క్రితం విడుదలైన జేఈఈ మెయిన్స్–2026 ఫలితాలు, ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అనంతపురంలోని కాగ్నిజెంట్ జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. దీంతో బుధవారం ఆ కళాశాలలో సంబరాలు చేసుకున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు సంస్థ సీఈఓ ఎస్వీ రత్నాకర్ ప్రసాద్, డైరెక్టర్లు ఆలూరు సాంబశివారెడ్డి, జె.సాల్మన్రాజు, కె.నరేంద్ర రెడ్డి, కళాశాల అధ్యాపకులు హాజరయ్యారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆలూరు సాంబశివారెడ్డి సత్కరించారు. జేఈఈ మెయిన్స్లో జి.సుశాల్ ఆల్ ఇండియా ర్యాంక్ 168 సాధించగా, ఆర్ జస్వంత్ కుమార్ 262, ఎస్.తరుణ్ 1,088, ఎం. సాయిసహస్ర 1,479, ఎ.ప్రణవి 3,213, వి. మణిదీపిక 4,444, యు.నవీన్ 4,883, బి.జయవర్ధన్ 5,957, వీఎన్ శోభన్ 10,730, ఎ.సాయిశృతి 13,874, ఎన్.సాయి చరణ్ 14,414, బి విశ్వంత్రెడ్డి 15,127, పి.హాసిని 15,123, కె.తేజజ్యోతి 16,756 ర్యాంకులు సాధించారు. 90 పర్సంటైల్కు పైగా 29 మంది విద్యార్థులు సాధించారు. మొత్తం 33 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని రత్నాకర్ ప్రసాద్ తెలిపారు. సీనియర్ ఇంటర్ ఫలితాల్లోనూ 988 మార్కులతో ఎన్. విశిష్ట టాపర్గా నిలిచిందన్నారు. అలాగే 986 మార్కులతో ఎం రూపేష్, జి గ్రీష్మ, ఎం చేతన, ఎ.ప్రణవి మెరిసారన్నారు. 980 మార్కులకు పైగా 47 మంది, 950కు పైగా 91 మంది, 900కు పైగా 146 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో పి చైత్ర, కె.సాయి వర్షిత్, సి.పూజ, వి.రిషిత, డి.ప్రగతి చౌదరి 465 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారన్నారు. డి.జైలీల, కె.భవ్య తన్విస్ చరణ్, ఎం.జస్వంతి, డి.రజితేశ్వరి, ఎం.యోగేష్ రావు, జె.కెన్నిత్ సాల్మన్ 464 మార్కులు సాధించారన్నారు. 460 మార్కులకు పైగా 47 మంది, 450కు పైగా 100 మంది, 400కు పైగా 242 మంది విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు వివరించారు. బైపీసీ విభాగంలో జి.పూజశ్రీ 448 మార్కులతో టాపర్గా నిలిచినట్లు పేర్కొన్నారు. కె.సాకేత్ నాయర్, వి.నిఖిలశ్రీ 447 మార్కులతో రెండో స్థానం దక్కించుకున్నారన్నారు. 440కు పైగా 11 మంది, 420కు పైగా 30 మంది, 390కు పైగా మార్కులతో 44 మంది విద్యార్థులు మంచి ఫలితాలు సాధించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కాగ్నిజెంట్ను ఆదర్శవంతమైన జూనియర్ కళాశాలగా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ఆలూరి సాంబశివారెడ్డి పేర్కొన్నారు. -
పేకాటరాయుళ్ల అరెస్ట్
ఆత్మకూరు: మండలంలోని కుర్లపల్లి వద్ద పేకాట ఆడుతున్న పలువురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను బుధవారం ఎస్ఐ గౌతమ్ వెల్లడించారు. అందిన సమాచారం మేరకు బుధవారం ఉదయం కుర్లపల్లి శివారు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టామన్నారు. ఆ సమయంలో ఓ తోట వద్ద పేకాట ఆడుతూ ఐదుగురు పట్టుబడ్డారన్నారు. వీరి నుంచి రూ.6,570 నగదు, ఐదు సెల్ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు వివరించారు. మహిళల భద్రతకు ‘సీ్త్ర రక్ష’ : ఎస్పీఅనంతపురం సెంట్రల్: మహిళా భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన శక్తియాప్, సీ్త్ర రక్ష పోర్టల్ను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. బుధవారం పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో మహిళలు, చిన్నారుల భద్రతపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎస్పీ మాట్లాడారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ యాప్లు బాధిత మహిళలకు రక్షణగా నిలుస్తాయన్నారు. చిన్నారులపై జరిగే నేరాలపై చట్టం కఠినంగా అమలవుతుందని హెచ్చరించారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానస్పద కాల్స్ మెసేజ్లు, యాప్లకు దూరంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోరాదని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు, అనంతపురం బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు పద్మజ, న్యాయవాది శశికళ, పలు కళాశాలల విద్యార్థినులు పాల్గొన్నారు. 25న పారిశ్రామిక వేత్తలకు శిక్షణ అనంతపురం టౌన్: మహిళా పారిశ్రామిక వేత్తలకు ఈ నెల 25న శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ప్రాజెక్టు డైరెక్టర్ (పీడీ) శైలజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకింగ్ ఆధ్వర్యంలో అనంతపురం శివారు పంగల్ రోడ్డులోని టీటీడీసీ కార్యాలయంలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలోని ఉన్న మహిళా పారిశ్రామిక వేత్తలు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


