breaking news
Anantapur District News
-
రోడ్డెక్కిన పత్తి రైతులు
● పత్తి కొనుగోలు చేయలేదని ఆందోళన గుత్తి: పత్తి కొనుగోలు చేయలేదంటూ రైతులు రోడ్డెక్కి ఆందోళన చేసిన ఘటన పట్టణంలో జరిగింది. వివరాలు.. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. బుధవారం రైతులు 14 ట్రాక్టర్లు, 407 వాహనాల్లో పత్తిని విక్రయించడానికి వచ్చారు. అయితే, ఏడుగురు రైతులకు సంబంధించిన పత్తిని మాత్రమే కొనుగోలు చేసిన సిబ్బంది.. నాణ్యత లోపించిందంటూ మిగతా పత్తిని తిరస్కరించారు. పత్తిని కొనుగోలు చేయాలని కోరినా ఒప్పుకోకపోవడంతో రోడ్డుపై పత్తి వాహనాలను ఉంచి రైతులు రాస్తారోకో చేశారు. దీంతో దిగొచ్చిన సీసీఐ అధికారులు ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడి కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఏడుగురు విద్యార్థుల డీబార్ అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న యూజీ మూడు, ఐదు సెమిస్టర్ పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు డీబార్ అయ్యారు. బుధవారం జరిగిన పరీక్షల్లో మాస్ కాపీయింగ్కు పాల్పడుతూ పట్టుబడిన ఏడుగురు విద్యార్థులను డీబార్ చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ తెలిపారు. హిందూపురంలో నలుగురు, అనంతపురంలో ముగ్గురిని బుక్ చేశామన్నారు. విల్డ్ తెగులు సోకిన మిరప పంట పరిశీలన ఉరవకొండ/విడపనకల్లు: మిరపకు విల్డ్ తెగులు శీర్షికన ఈ నెల 2న ‘సాక్షి’ దినపత్రికలో వెలువడిన కథనంపై అధికారులు స్పందించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారిణి ఉమాదేవి, కేవీకే సీనియర్ శాస్త్రవేత్త యుగంధర్, హార్టికల్చర్ అధికారిణి యామిని, విడపనకల్లు మండల వ్యవసాయ అధికారి పెన్నయ్య, సిబ్బంది బుధవారం ఉరవకొండ, విడపనకల్లు మండలాల్లో సాగు చేసిన మిరప పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మిరప పూత, కాయ దశలో ఉండటంతో ఎండు తెగులు ఎక్కువగా ఆశిస్తుందన్నారు. నివారణకు 10 లీటర్ల నీటిలో 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్, 10 గ్రాముల ప్ట్రెప్టొసైక్లిన్ కలిపి మొక్క పాదుల్లో పిచికారీ చేయాలన్నారు. జెమిని ఆకుముడత నివారణకు ఫెరిఫ్రాక్టిఫిన్ 1.5 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. బూడిద తెగులు నివారణకు నీటిలో కరిగే గంధం 3 గ్రాములు వాడాలన్నారు. -
సింధూర వర్ణం.. కాంతులీనిన కసాపురం
● ఘనంగా హనుమద్ వ్రతం గుంతకల్లు రూరల్: వేలాదిగా తరలి వచ్చిన ఆంజనేయస్వామి మాల ధారులతో కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం సింధూర వర్ణంతో కాంతులీనింది. భక్తుల ఆంజనేయస్వామి నామస్మరణతో ఆలయ పురవీధులు మార్మోగాయి. ఆంజనేయ పాహిమాం, పవనపుత్ర రక్షమాం అని స్వామివారిని స్మరించుకుంటూ భక్తి పారవశ్యం పొందారు. ఆంజనేయస్వామి మాలధారుల మండల దీక్షలు ముగియడంతో బుధవారం ఆలయంలో హనుమద్ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ముందుగా ఆంజనేయ స్వామి వారికి పంచామృతాభిషేకాలు నిర్వహించిన అర్చకులు ఆ తరువాత మాలధారులు తమ ఇరుముడుల ద్వారా సమర్పించిన ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు. బెంగళూరు నుంచి తెప్పించిన ప్రత్యేక పుష్పాలు, స్వర్ణాభరణాలతో నెట్టికంటి ఆంజనేయస్వామిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది వేదికపై కొలువుదీర్చారు. వేదపండితులు హనుమద్ వ్రతం విశిష్టత, నెట్టికంటి ఆంజనేయస్వామి క్షేత్ర మహిమను వివరించారు. మహామంగళహారతితో హనుమద్ వ్రతం ముగించి భక్తులకు, మాలధారులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యేక ఏర్పాట్లు.. హనుమద్ వ్రతంలో పాల్గొని స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మాలధారులు ఇరుముడులను సమర్పించేందుకు ఆలయ ముందు భాగంలో ఏర్పాట్లు చేశారు. మాలధారులు, భక్తుల కోసం వసతి కల్పించారు. ఆలయ ప్రధాన గోపురం ముందు రెండు మెడికల్ క్యాంపులు నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసు కోకుండా రూరల్ సీఐ ప్రవీణ్కుమార్, కసాపురం ఎస్సై వెంకటస్వామి, రూరల్ ఎస్సై రాఘవేంద్రప్ప పటిష్ట బందోబస్తు చేపట్టారు. ఆలయ ఈవో మేడేపల్లి విజయరాజు, ఆలయ అను వంశిక ధర్మకర్త సుగుణమ్మ, ఏఈవో వెంకటేశ్వర్లు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రత్యేక అలంకరణలో ఆంజనేయస్వామి, హనుమద్ వ్రతంలో పాల్గొన్న మాలధారులు -
జగన్తోనే దివ్యాంగుల సంక్షేమం
అనంతపురం: ఒకే దఫా రెండు లక్షల పింఛన్లు దివ్యాంగులకు ఇచ్చి వారి సంక్షేమానికి కృషి చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవానికి ‘అనంత’ ముఖ్య అతిథిగా, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, పీఏసీ సభ్యుడు వై. విశ్వేశ్వర రెడ్డి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేసి దివ్యాంగులకు పంచి పెట్టారు. అనంతరం విలేకరులతో ‘అనంత’ మాట్లాడుతూ దొంగ పింఛన్లు తీసుకున్నారంటూ దివ్యాంగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని విమర్శించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే దివ్యాంగులకు దన్నుగా నిలిచారని కొనియాడారు. వారికి అన్ని విధాలుగా ప్రాధాన్యత కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పింఛన్లలో కోత వేయాలని, కొందరు దివ్యాంగులకు అన్యాయం చేయాలని చూసిందని, దీనిపై పెద్ద ఎత్తున పోరాటం చేసిన దివ్యాంగులకు అభినందనలు తెలిపారు. అదే స్ఫూర్తితోనే ముందుకు వెళ్లాలని సూచించారు. దివ్యాంగులపై దృష్టి పెట్టాలి దివ్యాంగుల సంక్షేమంపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించాలని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి అన్నారు. దురదృష్టవశాత్తు వైకల్యం కలిగినా అన్ని రంగాల్లోనూ దీటుగా రాణిస్తున్నారన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారు ఉన్నారని ప్రశంసించారు. దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించాలని కోరారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంలుగా పనిచేసిన సమయంలో దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ వహించి పెన్షన్లు, ట్రై సైకిళ్లు పంపిణీ చేశారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు మీసాల రంగన్న, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివా రెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ జానీ, 48వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాసులు, పార్టీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు ఉపేంద్ర గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ రాజేష్, అర్బన్ అధ్యక్షుడు కాళేశ, రాయదుర్గం నియోజకవర్గ అధ్యక్షుడు టి.వీరాపురం ఆంజనేయులు, శింగన మల అధ్యక్షుడు భరత్కుమార్ రెడ్డి, రాప్తాడు నియోజకవర్గ అధ్యక్షుడు సాకే ఆంజనేయులు, కళ్యాణదుర్గం దొణస్వామి, బెనకల్లు రామాంజినేయులు, ఫకృద్దీన్, జి. శ్రీనివాసులు, నారాయణ స్వామి, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు అప్పట్లో ఎన్నో కార్యక్రమాల అమలు చంద్రబాబు పింఛన్లలో కోత పెట్టి అన్యాయం చేయాలని చూశారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, మాజీ ఎమ్మెల్యే ‘విశ్వ’ -
షీప్ సొసైటీ ఎన్నికలకు వేళాయె
అనంతపురం అగ్రికల్చర్: గొర్రెలు, మేకల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘాల (షీప్ సొసైటీ)కు ఎన్నికలు నిర్వహించడానికి పశుసంవర్ధకశాఖ షీప్ డెవలప్మెంట్ విభాగం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 350 సొసైటీలు రిజిస్టర్ చేసుకోగా... అందులో డిపార్ట్మెంట్ యూనియన్ పరిధిలో 215 సొసైటీలు ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఉమ్మడి జిల్లా పరిధిలో 130 సంఘాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. పెండింగ్లో ఉన్న 84 సొసైటీలకు డిసెంబర్ 5, 12న రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కోర్టు పరిధిలో ఉన్న మదిగుబ్బ సొసైటీకి ఎన్నిక నిలిపివేశారు. 2018లో ఎన్సీడీసీ కింద రూ.10.66 కోట్ల రుణాల పంపిణీకి సంబంధించి సక్రమంగా కంతులు కట్టని 342 మందిని డిఫాల్టర్ జాబితాలో పెట్టినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. డీ–ఫాల్టర్లకు ఎన్నికల్లో పోటీ చేయడానికి, ఓటు వేయడానికి అర్హత లేదన్నారు. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో 45 సొసైటీలకు, శ్రీ సత్యసాయి జిల్లాలో 39 సొసైటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి విడత కింద ఈనెల 5న 55 సొసైటీలకు, రెండో విడతగా ఈనెల 12న 29 సొసైటీలకు ఎన్నిక జరగనుంది. ప్రాథమిక స్థాయిలో ఎన్నికలు పూర్త్తి కాగానే జిల్లా యూనియన్కు ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలిసింది. ఒక్కో సొసైటీలో ఏడు డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించి తర్వాత ఆఫీస్ బేరర్లను ఎన్నుకోనున్నట్లు షీప్ డెవలప్మెంట్ ఏడీ డాక్టర్ కేఎల్ శ్రీలక్ష్మి తెలిపారు. కాగా, పార్టీలకు అతీతంగా జరుగుతున్న షీప్ సొసైటీ లను ఎలాగైనా దక్కించుకునేందుకు ప్రజాప్రతినిధుల సూచనల మేరకు ‘పచ్చ’ నాయకులు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. గత జనవరి, ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో సైతం తెలుగు తమ్ముళ్లు చాలా చోట్ల బెదిరింపులకు దిగి పాగా వేసిన విషయం తెలిసిందే. తొలివిడత ఎన్నికలు జరగనున్న సొసైటీలివే.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రేపు (శుక్రవారం) తొలివిడతగా 55 షీప్ సొసైటీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అందులో అనంతపురం జిల్లా పరిధిలో పంపనూరు, పాపంపల్లి, సనప, నీలంపల్లి, వెంకటాపురం, పి.యర్రదొడ్డి, నెలగొండ, సంగాల, ఈస్ట్కోడిపల్లి, ఎం.వెంకటాంపల్లి, పి.చెన్నంపల్లి, ఓబగానపల్లి, ఉదిరిపికొండ, బెస్తరపల్లి, బొందలవాడ, చామలూరు, ఎద్దులపల్లి, నరసాపురం, జూటూరు, బండార్లపల్లి, గాండ్లపర్తి, భోగినేపల్లి, సలకంచెరువు, గడేహొత్తూరు, హావలిగి ఉండగా... శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో మందనకుంట, ధేమకేతేపల్లి, గౌనివారిపల్లి, బాలంపల్లి, చలివెందుల, పరిగి, చాలకూరు, మాగేచెరువు, పత్తికుంటపల్లి, సోమందేపల్లి, గొడ్డువెలగల, డబురువారిపల్లి, వంచిరెడ్డిపల్లి, వెంకటగిరిపాలెం, రాంపురం, వెంగలమ్మచెరువు, కోగిర, ఎం.కొత్తపల్లి, రొద్దం, తురకలా పట్నం, యర్రాయపల్లి, హరియాణ్చెరువు, బిల్వంపల్లి, దాదులూరు, భానుకోట, కొండపల్లి, కేఎన్ పాళ్యం, తగరకుంట, గంగరెడ్డిపల్లి, దుబ్బార్లపల్లి సొసైటీలకు ఎన్నికలు జరగనున్నాయి. 12న 29 సొసైటీలకు.. రెండో విడత కింద ఈ నెల 12న ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో 29 సొసైటీలకు ఎన్నికలు జరగనున్నాయి. రేపు 55 సొసైటీలకు, 12న 29 సొసైటీలకు ఎన్నికలు వీటిని దక్కించుకునేందుకు టీడీపీ నాయకుల కుయుక్తులు -
అయ్యో దేవుడా.. !
పెద్దవడుగూరు: అభం శుభం తెలియని బాలురు. తల్లిదండ్రుల పక్కన ఆదమరచి నిద్రిస్తున్నారు. ఆ సమయంలో విష సర్పం కాటేసింది. దీంతో ఒకరు మృతి చెందగా, మరొకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ హృదయ విదారక ఘటన పెద్దవడుగూరు మండలంలోని కండ్లగూడూరు గ్రామంలో చోటు చేసుకొంది. వివరాలు.. గ్రామానికి చెందిన వడ్డే వీరనారాయణస్వామి, లక్ష్మీదేవి దంపతులు వ్యవసాయ పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కుమారుడు శివరామరాజు (10) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతుండగా, రెండో కుమారుడు శివనారాయణ (7) అదే బడిలో 2వ తరగతి చదువుతున్నాడు. అన్నదమ్ములిద్దరూ మంగళవారం రాత్రి తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో నిద్రపోయారు. రాత్రి 12 గంటల సమయంలో శివనారాయణ తనకు కడుపు నొప్పిగా ఉందంటూ తల్లి లక్ష్మీదేవికి చెప్పగా ఆమె బయటకు తీసుకెళ్లింది. చూస్తుండగానే బాలుడు నోటి వెంట నురగలు కక్కుతూ కుప్పకూలాడు. పాముకాటు అని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే 108కు సమాచారం అందించారు. ఎంత సేపటికీ వాహనం రాకపోవడంతో బాలుడిని ద్విచక్ర వాహనంలో తీసుకుని బయలుదేరారు. మార్గమధ్యంలో 108 రావడంతో అందులోకి ఎక్కించి పెద్దవడుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య సిబ్బంది పరిశీలించి బాలుడి శరీరంలో స్పందన లేకపోవడంతో పామిడికి తీసుకెళ్లాలని చెప్పారు. అక్కడికి తీసుకెళ్లగా వైద్య సిబ్బంది పరీక్షించి శివనారాయణ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలోనే ఇంటి దగ్గర నుంచి మొదటి కుమారుడు శివరామరాజు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు సమాచారం రావడంతో వెంటనే ద్విచక్ర వాహనంలో అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఇద్దరు బాలురు పాము కాటుకు గురవడం, అందులో ఒకరు మృతి చెందారన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. మృతి చెందిన బాలుడు శివనారాయణ జీజీహెచ్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న శివరామరాజు ప్రాణాపాయ స్థితిలో.. అనంతపురం మెడికల్: పాముకాటుకు గురైన శివరామరాజు సర్వజనాస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. చిన్నపిల్లల విభాగాధిపతి డాక్టర్ రవికుమార్ పర్యవేక్షణలో అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ ప్రవీణ్దీన్కుమార్, డాక్టర్ సంజీవప్ప, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మమత బాలుడికి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఇప్పటికే 40 యాంటీ స్నేక్ వీనమ్స్ వైల్స్ను అందించారు. బాలుడి నరాలపై విషం ప్రభావం చూపడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బాబును చూసి కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. అన్నదమ్ములకు పాముకాటు తమ్ముడి మృతి.. ప్రాణాపాయ స్థితిలో అన్న పెద్దవడుగూరు మండలం కండ్లగూడూరులో విషాదం -
సమస్యలు పరిష్కారం కావడం లేదు : మంత్రి కేశవ్
అనంతపురం అర్బన్: జిల్లాలో ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని, సమస్యలపై ప్రజల నుంచి అధికారులు, జిల్లా యంత్రాంగానికి, రాజకీయ వ్యవస్థకు అందుతున్న ఫిర్యాదులే ఇందుకు నిదర్శనమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. అపరిష్కృత సమస్యలపై బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ ఓ.ఆనంద్తో కలసి అధికారులతో మంత్రి సమీక్షించారు. అనంతరం రెవెన్యూభవన్లో విలేకరులతో మాట్లాడారు. పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన అర్జీలపై అధికారులతో సమీక్షించినప్పుడు పరిష్కారం కాని వాటిని కూడా అయినట్లుగా చూపించినట్లుగా వెల్లడైందన్నారు. ఇలాంటి వాటిలో ప్రధానంగా రెవెన్యూ, పోలీసు శాఖలకు సంబంధించి 50 శాతం వరకు ఉంటున్నాయన్నారు. ప్రతి అర్జీని ప్రత్యేకంగానే భావించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. విద్యుత్ ప్రమాదాలపై అవగాహన ఉండాలి అనంతపురం టౌన్: విద్యుత్ ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. విద్యుత్ ప్రమాదాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్ రక్షక్ వాహనాన్ని బుధవారం ఆయన ప్రారంభించి, మాట్లాడారు. విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్, ఈఈ జేవీ రమేష్, విజిలెన్స్ సీఐ విశ్వనాథ్చౌదరి పాల్గొన్నారు. వికసించని చామంతి పెద్దపప్పూరు: మండలంలో రైతులు సాగు చేసిన చామంతి పంట మొగ్గ దశలోనే ఎండిపోతోంది. మండల వ్యాప్తంగా దాదాపు 118 ఎకరాల్లో రైతులు చామంతి పంట సాగు చేస్తున్నారు. గత నెల కురిసిన వర్షాలకు పంటకు తెగుళ్లు సోకాయి. రైతులు ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం దక్కలేదు. క్షేత్రస్థాయిలో ఉద్యాన అధికారులు పరిశీలించి, చేపట్టాల్సిన చర్యలను వివరించాలని రైతులు కోరుతున్నారు. వైఎస్సార్సీపీ పీఆర్ విభాగం కర్నూలు ఇన్చార్జ్గా రంగారెడ్డి అనంతపురం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ పంచాయతీ రాజ్ విభాగం కర్నూలు ఇన్చార్జ్గా గుత్తికి చెందిన సీవీ రంగారెడ్డి (పీఆర్ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ) నియమితులయ్యారు. ఈ మేరకు పీఆర్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి బుధవారం వెల్లడించారు. -
పర్యాటక అభివృద్ధికి నోచుకోని దుర్గం
పర్యాటకంగా అభివృద్ధి చేయాలి ●కాలగర్భంలో కలిసిపోతున్న ప్రాచీన దేవాలయాలు ●కన్నెత్తి చూడని పర్యాటక, పురావస్తు శాఖలు రాయదుర్గం టౌన్: విజయనగరాజుల 3వ రాజధానిగా శతాబ్దాల చరిత్ర గల రాయదుర్గం కోటను పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం కనబరుస్తున్నాయి. వారసత్వ సంపదకు నిలయమైన చారిత్రక కట్టడాలు, ప్రసిద్ది చెందిన ప్రాచీన ఆలయాలు, కోట, కొండలు, గుట్టలు, దేశంలోనే అరుదైన పాదరాస లింగం, దశభుజ గణపతి ఆలయం, లింగాలబండ చతుర్ముఖ పశుపతినాథేశ్వర ఆలయం, జైన సంస్కృతిని చాటిచెప్పే రససిద్దేశ్వరస్వామి ఆలయం, ఏనుగుల బావి, కోనేరు, ప్రాచీన విగ్రహాలతో నేటికీ రాయదుర్గంలో 15వ శతాబ్దపు వైభవం కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. కొండపై అద్బుతమైన శిల్పకళా సంపద చెక్కు చెదరలేదు. అయితే ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు శీతకన్నేయడంతో గుప్త నిధుల వేటగాళ్ల దుశ్చర్యకు ప్రాచీన ఆలయాలు కాస్త కాలగర్భంలో కలిసి పోతున్నాయి. పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా రాష్ట్ర పర్యాటక శాఖ, కేంద్ర పురావస్తుశాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. రాయదుర్గానికి రాచమార్గమైన కోట ఊరువాకిలిని ఆధునికీకరించే విషయంలో కేంద్ర పురావస్తుశాఖ అధికారులు పూర్తి నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. కోటగోడలు శిథిలావస్థకు చేరుకుని కళావిహీనంగా మారాయి. -
తాడిపత్రిలో కలకలం
● పోలీసుల అదుపులో ధర్మవరం వాసులు తాడిపత్రి రూరల్: స్థానిక ఆర్డీటీ కాలనీలో బుధవారం పిల్లల అపహరణ కలకలం రేగింది. మత్తుతో కూడిన బిస్కెట్లు, చాక్లెట్లు చిన్నారులకు ఇచ్చి ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఓ జంటను స్థానికులు పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన దంపతులు కౌసల్య, వెంకట్రాముడు కుటుంబ కలహాల నేపథ్యంలో విడిపోయారు. ఈ క్రమంలో ఆరు నెలల క్రితం తన కుమార్తెతో కలసి కౌసల్య తాడిపత్రికి చేరుకుని ఆర్డీటీ కాలనీలో నివాసముంటోంది. బుధవారం వెంకట్రాముడు తన వెంట మరో యువతిని వెంటబెట్టుకుని తాడిపత్రికి చేరుకుని కూతురిపై మమకారంతో ఆరా తీయడం మొదలు పెట్టాడు. రమేష్రెడ్డి కాలనీలోని పాఠశాలలో చదువుకుంటున్నట్లుగా తెలుసుకుని అక్కడకు చేరుకుని తన వద్ద ఉన్న కుమార్తె ఫొటోలను ఉపాధ్యాయులు, విద్యార్థులకు చూపించాడు. అక్కడ లేదని తెలుసుకున్న అనంతరం వెంట తెచ్చిన చాక్లెట్లు, బిస్కెట్లను విద్యార్థులకు పంచి ఆర్డీటీ కాలనీకి వెళ్లి భార్య, కుమార్తె ఆచూకీ కోసం గాలింపు చేపట్టాడు. తన వద్ద మిగిలిన చాక్లెట్లు, బిస్కెట్లను కాలనీలోని చిన్నారులకు పంపిణీ చేస్తుండడంతో అనుమానం వచ్చిన స్థానికులు వారిని పట్టుకుని వివరాలు అడిగారు. సమాధానం చెప్పకపోవడంతో దేహశుద్ధి చేసి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని ఆప్గ్రేడ్ పీఎస్కు తరలించారు. వెంకట్రాముడు చెబుతున్న వివరాలను నిర్ధారించుకునేందుకు కౌసల్య, ఆమె కుమార్తెను పిలిపించారు. విచారణలో వెంకట్రాముడు చెప్పింది వాస్తవమని నిర్ధారించుకున్నారు. అయితే వెంకట్రాముడు వద్ద కత్తి ఉండడంతో అనుమానాలు రేకెత్తాయి. కుమార్తెను బలవంతంగా తీసుకెళ్లే సమయంలో భార్య అడ్డుపడితే కత్తితో దాడి చేయాలని అనుకున్నాడా? అనే కోణంలో విచారణ చేపట్టారు. -
జనవరి 1 నుంచి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణ
● జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమణయ్య అపంతపురం టవర్క్లాక్: పెన్షనర్లు తమ డిజిటల్ లైఫ్ సర్టిపికెట్ల (డీఎల్సీ)ను జనవరి 1 నుంచి సమర్పించాల్సి ఉంటుందని, అంతకు ముందు సమర్పించిన వాటిని పరిగణనలోకి తీసుకోబోమని జిల్లా ఖజానా శాఖ డిప్యూటీ డైరెక్టర్ రమణయ్య పేర్కొన్నారు. బుధవారం స్థానిక పెన్సనర్ల భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్యామిలీ పెన్షనర్లు ఎక్కడ ఉన్న తమ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను ఏటా జనవరి 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరులోపు సమర్పించాల్సి ఉంటుందన్నారు. స్థానికంగా ఉన్న వారు ఎస్టీఓ కార్యాలయం, మీ–సేవా సెంటర్లు, పెన్షనర్ల సంఘాలు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా లైఫ్ సర్టిఫికెట్లను సమర్పించవచ్చునన్నారు. విదేశాల్లో ఉన్నవారు అక్కడి ఎంబసీ కార్యాలయంలో సర్టిఫై చేయించుకుని డీఎల్సీ సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఎస్టీఓకి వీడియో కాల్ చేసినా వారి డీఎల్సీ కూడా ఆమోదించబడుతుందన్నారు.అనారోగ్య పరిస్థితి లో ఉన్న వారు ఫిబ్రవరిలో ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే వారి ఇంటి వద్దకెళ్లి డీఎల్సీ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పెన్షనర్లను కోరారు. సమావేశంలో జిల్లా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు పెద్దన్న గౌడ్, ప్రధాన కార్యదర్శి శీలా జయరామప్ప తదితరులు పాల్గొన్నారు. -
డిటోనేటర్ల దొంగల అరెస్ట్
● 24 గంటల్లోనే మిస్టరీని ఛేదించిన పోలీసులు పెద్దవడుగూరు: మండలంలోని కోనాపురం సమీపంలో ఉన్న కార్తికేయ ఎంటర్ప్రైజెస్లో సోమవారం రాత్రి డిటోనేటర్లను అపహరించుకెళ్లిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటన చోటు చేసుకున్న 24 గంటల్లోపే కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. పెద్దవడుగూరు పీఎస్లో బుదవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను తాడిపత్రి ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి వెల్లడించారు. పట్టుబడిన వారిలో యాడికి మండల చందన గ్రామానికి చెందిన రవికుమార్, పామిడిలోని నాగిరెడ్డి కాలనీ నివాసి చిట్టావుల రాము, కర్నూలు జిల్లా మద్దికెరకు చెందిన ఉప్పర వీరేష్ ఉన్నారు. వీరిలో ప్రధాన నిందితుడు రవికుమార్ గతంలో కార్తికేయ ఎంటర్ప్రైజెస్లో ఎక్స్ప్లోజివ్ మ్యాగజైన్ విభాగం డ్రైవర్గా పనిచేశాడు. అయితే జీతం ఇవ్వకపోవడంతో పని మానేశాడు. ఈ క్రమంలో పలుమార్లు అడిగినా మేనేజర్ శ్యాంకుమార్ జీతం చెల్లించలేదు. స్టాక్ పాయింట్లో నిల్వ ఉన్న ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ను తీసుకెళ్లి విక్రయించి తన డబ్బు తీసుకోవాలని భావించిన రవికుమార్.. తన స్నేహితులు చిట్టావుల రాము, ఉప్పర వీరేష్తో కలసి పథకం రచించాడు. ఇందులో భాగంగా సోమవారం రాత్రి కారులో కార్తికేయ ఎంటర్ప్రైజెస్ గోదాము వద్దకు చేరుకుని గోడకు కన్నం వేసి లోపలకు ప్రవేశించారు. రూ.2 లక్షల విలువైన డిటోనేటర్లు అపహరించుకెళ్లారు. మంగళవారం ఉదయం విషయాన్ని గుర్తించిన మేనేజర్ శ్యాంకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో చందన గ్రామ సమీపంలో నిందితులను అరెస్ట్ చేసి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. నిందితుల అరెస్ట్లో చొరవ చూపిన సీఐ రామసుబ్బయ్య, ఎస్ఐ ఆంజనేయులు, పెద్దపప్పూరు ఎస్ఐ నాగేంద్రప్రసాద్, పెద్దవడుగూరు ఏఎస్ఐ చంద్రశేఖర్రెడ్డి, సిబ్బంది మధుసూధన్, రామకృష్ణ, మోహన్, లక్ష్మీనారాయణ, షాషావలి, కిషోర్రాజు, సూర్యనారాయణ, సుధాకర్నాయక్ను ఏఎస్పీ రోహిత్కుమార్ అబినందించారు. -
కర్ణాటక దీటైన జవాబు
● స్వల్ప ఆధిక్యంలో ఆంధ్ర జట్టు అనంతపురం కార్పొరేషన్: ఆర్డీటీ క్రీడామైదానం వేదికగా సాగుతున్న అండర్019 కుచ్బెహార్ క్రికెట్ ట్రోఫీలో భాగంగా ఆంధ్రతో జరుగుతున్న మ్యాచ్లో కర్ణాటక జట్టు దీటైన జవాబిచ్చింది. ఓవర్నైట్ స్కోర్ 176/5 బుధవారం ఆటను కొనసాగించిన కర్ణాటక జట్టు బ్యాటర్ అక్షత్ ప్రభాకర్, సిద్ధార్థ్ అఖిల్ వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోర్ వేగాన్ని పెంచారు. అక్షత్ ప్రభాకర్ 200 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 112 పరుగులు చేశాడు. సిద్ధార్థ్ అఖిల్ 83, ధ్యాన్ హిరేమత్ 47 పరుగులు చేశారు. కర్నాటక జట్టు తొలి ఇన్నింగ్స్లో 148.1 ఓవర్లలో 392 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 33 పరుగుల ఆధిక్యంతో ఆంధ్ర జట్టు తన రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించి ఆట ముగిసే సమయానికి 18.1 ఓవర్ల వద్ద 2 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది. కోగటం హనీష్ వీరారెడ్డి 22 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. కాగా, గురువారం ఆటకు చివరి రోజు కావడంతో మ్యాచ్ ఫలితం డ్రా గా ముగిసే అవకాశమున్నట్లు సమాచారం. -
రోడ్డు కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం
● అక్రమంగా మట్టి తవ్వకాలు ● కన్నెత్తి చూడని అధికారులు విడపనకల్లు: రోడ్డు కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. మండల పరిధిలోని చీకలగురికి గ్రామంలో బూదగవి రోడ్డు క్రాస్ నుంచి చీకలగరికి వరకు నూతనంగా రూ.1.5 కోట్లతో రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు.ఇందుకోసం రోడ్డు కాంట్రాక్టర్ గ్రామ సచివాలయం సమీపంతో పాటు జగనన్న లేఅవుట్కు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిలో పెద్ద పెద్ద గుంతలు తవ్వి మట్టిని అక్రమంగా తరలిస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఇష్టమొచ్చినట్లు జేసీబీలను పెట్టి ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించినా అటు వైపు రెవెన్యూ,మైనింగ్ శాఖ అధికారులు, పోలీసులు కన్నెత్తి చూడటం లేదు. విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, కాంట్రాక్టర్ టీడీపీకి చెందిన వ్యక్తి కావడంతో పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘కాంట్రాక్టర్ మంత్రి పయ్యావుల కేశవ్ బంధువు.. అందుకే అతను ఏం చేసినా, ప్రజలకు ఇబ్బంది కలిగించినా పట్టించుకోవడం లేదు’ అని చర్చించుకుంటున్నారు. -
బొలెరో వాహనానికి నిప్పు
యల్లనూరు: మండలంలోని వెన్నపూసపల్లిలో గట్టు విజయ్కుమార్కు చెందిన బొలెరో (ఏపీ 27 టీడబ్ల్యూ 0227) వాహనానికి మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పోలీసులు తెలిపిన మేరకు... మంగళవారం రాత్రి విజయ్కుమార్ తన బొలెరో వాహనాన్ని నివాసం సమీపంలో పెట్టి ఇంట్లోకి వెళ్లి నిద్రించాడు. బుధవారం వేకువజామున నిద్రలేచి చూసే సరికి వాహనం పూర్తిగా కాలిపోయి కనిపించింది. సమాచారం అందుకున్న పుట్లూరు సీఐ సత్యబాబు.. సిబ్బందితో కలసి అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుడిగా ఉన్నందుకే ఈ పని చేశారా? లేదా ఎవరైనా కక్షతో నిప్పు పెట్టారా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. -
నేత్రపర్వంగా చన్నమల్లప్ప జాతర
బ్రహ్మసముద్రం: మండలంలోని సూగేపల్లిలో సోమవారం రాత్రి ఆరూఢ చన్నమల్లప్ప స్వామి జాతర నేత్రపర్వంగా సాగింది. అర్ధరాత్రి 11 గంటల సమయంలో పీఠాధిపతి ఆరూఢా చన్నమల్లప్ప స్వామిని అశ్వ రథంపై ఊరేగించారు. మంగళవారం తెల్లవారుజామున ఊరేగింపు స్వామీజీ పూర్వీకుల సజీవ సమాధుల వద్దకు చేరుకుంది. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం తిరిగి మఠానికి ఊరేగింపుగా చేరారు. ఉత్సవంలో పాల్గొనేందుకు ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. రథంపై ఊరేగుతున్న చన్నమల్లప్ప స్వామి జాతరలో పాల్గొన్న భక్తులు -
బీకేఎస్లో ఇరువర్గాల ఘర్షణ
బుక్కరాయసముద్రం: తహసీల్దార్ కార్యాలయం సమీపంలో మంగళవారం ఇరువర్గాలు ఘర్షణ పడ్డాయి. ఇటీవల అంబేడ్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులు అంబేడ్కర్ సర్కిల్ పేరిట బోర్డు నాటిన సంగతి తెలిసిందే. అయితే ఈ బోర్డును రెండు రోజుల క్రితం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. అదే స్థలంలో అంబేడ్కర్ సర్కిల్ అంటూ మరో బోర్డు నాటడానికి దళిత సంఘాల నేతలు సిద్ధమయ్యారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కొందరు ఇది కొండమీద రాయుని స్వామి ద్వారం అని, ఇక్కడ బోర్డు ఏర్పాటు చేయొద్దని అడ్డుచెప్పారు. దీంతో మంగళవారం రాత్రి ఇరువర్గాల మధ్య గొడవ చోటు చేసుకుని ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాల వారికి నచ్చజెప్పారు. దీంతో బోర్డు ఏర్పాటు విషయం తాత్కాలికంగా వాయిదా పడింది. -
రూ.8.66 లక్షల విలువైన ఎరువుల విక్రయాల నిలిపివేత
కళ్యాణదుర్గం రూరల్: స్థానిక సాయి ఫర్టిలైజర్స్, రాయల్ ట్రేడర్స్, జయ మహాలక్ష్మి ఫర్టిలైజర్స్ దుకాణాల్లో మంగళవారం ఉదయం వ్యవసాయాధికారులు తనిఖీలు చేపట్టారు. రికార్డులకు, నిల్వలకు పొంతన లేని రూ.8,66,242 విలువైన ఎరువులు, విత్తనాల విక్రయాలను నిలుపుదల చేస్తూ నోటీసులు జారీ చేశారు. తనిఖీల్లో వ్యవసాయ స్క్వాడ్ అధికారి రవి, ఏడీఏ యల్లప్ప, ఏఓ శ్రావణ్కుమార్ పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం లాభదాయకం : డీపీఎం గుమ్మఘట్ట: ప్రకృతి వ్యవసాయం లాభదాయకంగా ఉంటుందని రైతులకు డీపీఎం లక్ష్మానాయక్ సూచించారు. గుమ్మఘట్ట మండలం 75వీరాపురం సమీపంలోని నారాయణనాయక్ పొలంలో ప్రకృతి వ్యవసాయం కింద సాగు చేసిన కంది, ఆముదం, సజ్జ, గోరుచిక్కుడు, అనుముల పంటలను మంగళవారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. పీఎండీఎస్ విత్తనాలతో జీవవైవిద్యాన్ని అనుసరిస్తూ పంటల సాగు చేపడితే అధిక దిగుబడులు సాధించవచ్చునని పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. డిటోనేటర్ల అపహరణ పెద్దవడుగూరు: మండలంలోని కోనాపురం సమీపంలో ఉన్న కార్తికేయ ఎంటర్ప్రైజేస్ గోదాములో నిల్వ చేసిన డిటోనేటర్లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గోదాముకు కన్నం వేసి లోపలకు ప్రవేశించిన దుండగులు.. ఆర్డినరీ డిటోనేటర్లు, 2,500 కిలోల పవర్ జెల్, 4,500 డీకార్డులను అపహరించుకెళ్లారు. వీటి విలువ రూ.8లక్షలు ఉంటుందని కార్తికేయ ఎంటర్ప్రైజేస్ మేనేజర్ శ్యాంకిరణ్ తెలిపారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పెద్దవడుగూరు పీఎస్ ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. డిటోనేటర్ల స్వాధీనం యాడికి: మండలంలోని చందన గ్రామ సమీపంలో కల్లం దొడ్డిలో దాచిన డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, పెద్దవడుగూరు సీఐ రామసుబ్బయ్య, ఎస్ఐ ఆంజనేయులు మంగళవారం రాత్రి చందన గ్రామంలో తనిఖీలు చేపట్టి భారీగా దాచి ఉంచిన డినోటేర్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పెద్దవడుగూరు పోలీసు స్టేషన్కు తరలించారు. పెరుగుతున్న అరటి ధరలు● జిల్లా ఉద్యాన అధికారి ఉమాదేవి పుట్లూరు: అరటి రైతులు ఎవరూ నిరుత్సాహానికి గురికాకూడదని, కొన్ని రోజులుగా అరటి ధరలు పెరుగుతూ వస్తున్నాయని జిల్లా ఉద్యాన అధికారి ఉమాదేవి అన్నారు. మంగళవారం పుట్లూరు మండలం సూరేపల్లి, కడవకల్లు గ్రామాల్లో ఆమె పర్యటించి, అరటి తోటలను పరిశీలించారు. సకాలంలో కోతలు చేపట్టాలన్నారు. ఫ్రూట్ కేర్ యాక్టివిటీ సక్రమంగా చేపట్టడం ద్వారా మంచి నాణ్యతతో పాటు అధిక దిగుబడి వస్తుందన్నారు. కార్యక్రమంలో ఉద్యాన సహాయ సంచాలకులు దేవానంద్, ఉద్యాన అధికారి నెట్టికంటయ్య, ఉద్యాన విస్తరణ అధికారి రామాంజనేయులు, ఉద్యాన సహాయకురాలు రస్మిత, రైతులు పాల్గొన్నారు. -
తాగుడుకు డబ్బివ్వలేదని వ్యక్తి బలవన్మరణం
రాప్తాడు రూరల్: తాగుడుకు డబ్బివ్వకపోవడంతో క్షణికావేశంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... కనగానపల్లి మండలం యలకుంట్ల గ్రామానికి చెందిన కామేశ్వరగౌడ్ (46), నాగలక్ష్మి దంపతులు దాదాపు పాతికేళ్ల క్రితం అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లికాలనీ పంచాయతీ నందమూరినగర్కు వలస వచ్చారు. ఆటో డ్రైవర్గా కామేశ్వరగౌడ్, ప్రభుత్వాస్పత్రిలో శానిటేషన్ వర్కర్గా నాగలక్ష్మి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఇటీవల మద్యానికి బానిసైన కామేశ్వరగౌడ్ తరచూ తాగుడుకు డబ్బుల కావాలని, భార్య, కుమారులను వేదించేవాడు. సోమవారం రాత్రి కూడా మద్యం కొనుగోలుకు డబ్బివ్వాలని భార్యతో గొడవ పడ్డాడు. ఆమె తన వద్ద లేవనడంతో ఆటో తీసుకుని వెళ్లిపోయాడు. ఇంటెల్ పాత కళాశాల భవనం వద్దకు చేరుకుని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన వారు గుర్తించి సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ రాంబాబు అక్కడకు చేరుకుని మృతుడిని కామేశ్వరగౌడ్గా అనుమానిస్తూ సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని నిర్ధారించారు. బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యా వలంటీర్ పోస్టుల కోసం దరఖాస్తుల స్వీకరణ అనంతపురం సిటీ: ఐదు నెలల కాలానికి సంబంధించి విద్యా వలంటీర్ల పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 5వ తేదీలోపు జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. అనంతపురం జిల్లాకు 80, శ్రీసత్యసాయి జిల్లాకు 68 విద్యావలంటీర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఖాళీలు, ఇతర వివరాలకు www.deoananathapuramu.bolgspot. com వెబ్సైట్ను పరిశీలించాలని సూచించారు. ఎద్దుల బండి నుంచి జారి పడి వ్యక్తి మృతి బ్రహ్మసముద్రం: ప్రమాదవశాత్తు ఎద్దుల బండి నుంచి జారి పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లిలో నివాసముంటున్న పవన్ (35)కు భార్య రత్నమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి పలువురు గ్రామస్తులు ఎద్దుల బళ్లు కట్టుకుని సూగేపల్లిలో జరుగుతున్న జాతరకు బయలుదేరారు. అప్పటికే ఫుల్లుగా మద్యం సేవించిన పవన్... తాను కూడా జాతరకు వస్తానంటూ పట్టుబట్టి ఎద్దుల బండిలో ఎక్కాడు. గ్రామం నుంచి ఒక కిలోమీటరు దూరం ప్రయాణించిన తర్వాత అదుపు తప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్తుల నుంచి సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని క్షతగాత్రుడిని కళ్యాణదుర్గంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ‘స్వమిత్వ’ సర్వే పక్కాగా జరగాలి ● జిల్లా పంచాయతీ అధికారి నాగరాజునాయుడు అనంతపురం ఎడ్యుకేషన్: గ్రామీణ ప్రాంతాలలో ఆస్తులపై యజమానులకు చట్టపరమైన గుర్తింపు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వమిత్వ యోజన పథకం సర్వేలో జిల్లా వెనుకబడి ఉందని జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు తెలిపారు. స్వమిత్వ యోజన పథకం సర్వే ప్రక్రియపై మంగళవారం సర్వే అధికారులు, డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ అధికారులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, సర్వేయర్లతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సమీక్షించారు. జిల్లాలో మొత్తం 276 రెవెన్యూ గ్రామాల పరిధిలో 324 గ్రామాలు ‘స్వమిత్వ’ కింద ఎంపిక చేశారన్నారు. సర్వే పక్కాగా జరగాలన్నారు. గ్రామకంఠాలను గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమం పూర్తయితే యాజమాన్య హక్కు పత్రం ఇవ్వడానికి వీలుంటుందన్నారు. డీపీఓను కలిసిన జీఎస్డబ్ల్యూఎస్ మండల ఇన్చార్జ్లు డిప్యూటీ ఎంపీడీఓలుగా పదోన్నతులు పొంది గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల (జీఎస్డబ్ల్యూఎస్) మండల ఇన్చార్జ్లుగా నియమితులైన వారు మంగళవారం డీపీఓను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ పని విషయంలో ఎవరూ రాజీ పడొద్దన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మంచిపేరు తెచ్చుకోవాలని సూచించారు. -
మిరపకు విల్డ్ తెగులు
● ఎండిపోతున్న పంట ● మందులు వాడిని అదుపు కాని వైనంఉరవకొండ: కీలక దశలో విల్డ్ తెగులు ఆశించడంతో మిరప పంట ఎండిపోతోంది. ఎన్ని మందులు వాడిని తెగులు అదుపులోకి రావడం లేదు. చేసేదిలేక రైతులు పంటను తొలగిస్తున్నారు. హెచ్చెల్సీ, జీబీసీ, హంద్రీ–నీవా కాలువ కింద, బోర్ల సౌకర్యం ఉన్న భూముల్లో 30 వేల ఎకరాల్లో వాణిజ్య పంటగా మిరప వేశారు. ఇందులో అత్యధికంగా ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, కణేకల్లు మండలాల్లో సాగు చేశారు. ఎకరాకు రూ.1.20 లక్షల దాకా పెట్టుబడి పెట్టి మిరపను సాగు చేశారు. ప్రస్తుతం కాయ, పూత దశలో విల్డ్ తెగులు ఆశించడంతో పంట ఒక్కసారిగా ఎండిపోతోంది. మొదట వేర్లకు సోకి కుళ్లిపోవడం ప్రారంభమవుతోంది. ఒక్క మొక్కకు ఈ వైరస్ సోకి రోజుల వ్యవధిలోనే వ్యాప్తి చెంది ఎక్కడికక్కడే మొక్కలు ఎండిపోతున్నాయి. ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. పంటను దున్నేసిన రైతులు మండల పరిధిలోని ఇంద్రావతి, మోపిడి గ్రామాల్లో పలువురు రైతులు 30 ఎకరాల్లో సాగు చేసిన మిర్చి పంట విల్డ్ తెగులు సోకి ఎండిపోతుండటంతో ఏం చేయాలో తెలియక రైతులు ట్రాక్టర్తో దున్నేశారు. లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టి ఎంతో జాగ్రత్తగా పంట సాగు చేస్తే విల్డ్ తెగులు ఇలా నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రబుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. ఇంద్రావతి వద్ద ట్రాక్టర్తో పంటను దున్నేస్తున్న రైతువాతావరణంలో మార్పులతోనే.. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం మంచు ప్రభావం ఎక్కవగా ఉండటం వల్ల మిర్చికి తెగుళ్లు ఆశించాయి. రైతులు యాజమాన్య పద్ధతులు పాటిస్తే తెగుళ్లు నివారించవచ్చు. మూడు గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ ఒక లీటరు నీటితో కలిపి మొక్కల మొదల్లో పిచికారీ చేయాలి. నత్రజని ఎరువులు తగ్గించుకుంటే మంచిది. కొమ్మ ఎండు, కాయ కుళ్లుకు ఒక ఎంఎల్ ప్రొపికోనజోల్ 0.5 ఎంఎల్ డైఫోన్కోనజోల్ ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. – యామిని, హార్టికల్చర్ అధికారి, ఉరవకొండ గత్యంతరం లేక దున్నేశా.. నేను ఐదు ఎకరాల విస్తీర్ణంలో 5531 తేజ రకం మిర్చి సాగు చేశాను. మందుల పిచికారి, ఎరువులు, ఇతరత్రా ఖర్చులన్నీ కలిపి ఎకరాకు రూ1.20 లక్షల దాకా పెట్టుబడి పెట్టాను. పంట కీలక దశకు చేరుకున్నా విల్డ్ తెగులు సోకింది. కళ్లెదుటే పంట ఎండిపోతోంది. నివారణ చర్యలు చేపట్టినా తెగులు అదుపులోకి రాలేదు. గత్యంతరం లేక ట్రాక్టర్తో పంటంతా దున్నేశాను. – నరసింహులు, మోపిడి -
మాల్యంలో మాతా శిశు మరణం
● గర్భంలోనే శిశువు మృతి ● సిజేరియన్ సమయంలో తల్లి మృత్యువాత ● శోకసంద్రంలో కుటుంబ సభ్యులు కణేకల్లు: రాయదుర్గం నియోజకవర్గంలో మాతాశిశు మరణం కలకలం రేపింది. ఏడు నెలల శిశువు గర్భంలోనే మృతి చెందగా.. సిజేరియన్ చేసి బయటకు తీసే క్రమంలో అధిక రక్తస్రావమై తల్లి మరణించింది. వివరాలిలా ఉన్నాయి. కణేకల్లు మండలం మాల్యం గ్రామానికి చెందిన హరిజన గంగమ్మ (26), హరిజన సురేష్ దంపతులు. వీరికి ఏడాదిన్నర వయసుగల కుమారుడు ఉన్నాడు. గంగమ్మ రెండోసారి గర్భం దాల్చింది. ఇటీవల డీ హీరేహాళ్ మండలం కల్యం గ్రామంలోని పుట్టింటికెళ్లింది. నెలవారీ వైద్య పరీక్షల్లో హైరిస్క్ గర్భవతిగా గుర్తించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భంతో ఉంది. సోమవారం ఉదయం తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న గంగమ్మను భర్త వచ్చి హుటాహుటిన కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించి.. కడుపులో బిడ్డ అడ్డం తిరిగినట్లు గుర్తించి మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే అంబులెన్స్ ద్వారా అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ మరోమారు వైద్య పరీక్షలు చేసి.. కడుపులో శిశువు మృతి చెందినట్లు గుర్తించారు. సిజేరియన్ చేసి శిశువును బయటకు తీయాలని కుటుంబ సభ్యులకు చెప్పారు. సరే తల్లినైనా కాపాడండని కుటుంబ సభ్యులు కోరారు. అనంతరం వైద్యులు సిజేరియన్ చేస్తుండగా... అధిక రక్తస్రావమై గంగమ్మ కూడా ప్రాణాలు కోల్పోయింది. అమ్మా.. అమ్మా... గంగమ్మ మృతదేహాన్ని కుటుంబ సభ్యులు మాల్యం తీసుకొచ్చారు. అమ్మ చనిపోయిన విషయం పసికందుకు తెలియలేదు. ఎందుకని అమ్మ లేవలేదని అక్కడే ఉండిపోయాడు. ఎంతకూ లేవలేదని ‘అమ్మా.. అమ్మా..’ అంటూ ఏడవడం మొదలు పెట్టాడు. గుక్కపట్టి ఏడుస్తూనే ఉన్న కుమారుడిని చూసి అక్కడున్నవారు కంటతడి పెట్టారు. దేవుడు ఎంత నిర్దయుడు.. పసికందుకు తల్లిని లేకుండా చేశాడు అంటూ నిట్టూర్చారు. అమ్మ పలకలేదని ఏడుస్తున్న చిన్నారి (ఇన్సెట్) గంగమ్మ -
రెడ్ బుక్ అండతో అధికమైన అకృత్యాలు
అనంతపురం: రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలులోకి తేవడంతో అకృత్యాలు అధికమయ్యాయని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. అనంతపురంలోని తన నివాసంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తాడిపత్రిలో ఆటవిక పాలన సాగుతోందన్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెచ్చుమీరాయని తెలిపారు. స్టేషన్కు వెళ్లి కేసులు నమోదు చేస్తే.. నిందితులు తిరిగి కౌంటర్ కేసులు పెడుతూ వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. శాంతిభద్రతలు ప్రశ్నార్థకంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ రెడ్బుక్ రాజకీయాలు ఆపి.. ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని హితవు పలికారు. స్వార్థ రాజకీయాల కోసం జేసీ ప్రభాకర్రెడ్డి గొడవలు సృష్టిస్తున్నారని, పోలీసుల ద్వారా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు, అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించకపోతే తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. దందాలో జేసీ ప్రభాకర్రెడ్డికి వాటాలు తాడిపత్రిలో విచ్చలవిడిగా గంజాయి, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, మహిళలు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదని పెద్దారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తాడిపత్రి శివారులో ఎర్ర కాలువను ఆక్రమించి ప్లాట్లు వేస్తున్నారని, వంకలు పూడ్చి, ప్లాట్లు వేసి అమ్మకాలు సాగిస్తున్నారని, పెద్ద కాలువలను పూడ్చి చిన్న డ్రెయినేజీలుగా మార్చేశారని తెలిపారు. భారీ వర్షం వస్తే పలు కాలనీలు నీట మునిగిపోతాయన్నారు. తాడిపత్రి దందా వ్యవహారాల్లో జేసీ ప్రభాకర్రెడ్డికి వాటాలు అందుతున్నాయని ఆరోపించారు. తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. వంకలు, వాగుల్లో లే అవుట్లు వేయకుండా, ఇప్పటికే ఉన్న ఆక్రమణలు తొలగించాలని కలెక్టర్కు వినతిపత్రం అందజేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని ఎస్పీకి లేఖ రాసినట్లు వివరించారు. కలెక్టర్, ఎస్పీ తక్షణమే స్పందించి తాడిపత్రి ప్రజలకు భరోసా కల్పించాలని కోరారు. గంజాయి విక్రేతలు, మట్కా బీటరు, పేకాట నిర్వాహకులు ఎవర్ని అడిగినా తాము ఎమ్మెల్యేకు వారం వారం చందాలు ఇస్తున్నామంటున్నారన్నారు. ఈ అక్రమ నిర్మాణాలపై ఎమ్మెల్యే అస్మిత్రెడ్డి, ఎమ్మెల్యే తండ్రి జేసీ ప్రభాకర్రెడ్డి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడే కాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలు రాజకీయ నాయకుడే కాదని, చంద్రబాబు వద్ద నెల మామూళ్లు తీసుకోవడం తప్ప ఆయనకేం తెలుసని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎద్దేవా చేశారు. మహిళలపై దారుణాలు జరుగుతున్నా ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. రాయల సీమలో ఫ్యాక్షన్ తగ్గింది కానీ.. రెడ్బుక్ రాజ్యాంగంతో అరాచకాలు, అకృత్యాలు పెరిగిపోయాయన్నారు. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు పెచ్చుమీరాయి స్వార్థ రాజకీయాలు కోసం జేసీ ప్రభాకర్రెడ్డి గొడవలు సృష్టిస్తున్నారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి ధ్వజం -
బస్సుల కోసం రోడ్డెక్కిన విద్యార్ధులు
బొమ్మనహాళ్: గ్రామీణ ప్రాంతాల నుంచి కళాశాలకు వచ్చే విద్యార్ధుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలని ఎస్ఎఫ్ఐ, సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉంతకల్లు క్రాస్ వద్ద కళ్యాణదుర్గం–బళ్లారి అంతర్రాష్ట్ర రహదారి ఎస్ఎఫ్ఐ స్టేట్ కమిటి సభ్యుడు బంగి శివ, సీఐటీయూ జిల్లా కోశాధికారి నాగమణి, మండల నాయకుడు ఓబులేసు ఆధ్వర్యంలో జూనియర్ కళాశాల విద్యార్ధులు ఆందోళనకు దిగారు. బస్సులు నిలపకపోవడంతో కళాశాలకు సమయానికి వెళ్లలేకపోతున్నామని, చదువులకు దూరమవుతున్నామని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల వదిలిన తర్వాత సాయంత్రం వచ్చే బస్సులు ఒక్కటి కూడా ఆపడం లేదని, తాము ఇంటికి వెళ్లేసరికి రాత్రి అవుతోందన్నారు. పాసులు జారీ చేసి బస్సులు ఆపకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గంటపాటు బైఠాయించడంతో రోడ్డుకు ఇరువైపులా బస్సులు, లారీలు, ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని రాయదుర్గం, కళ్యాణదుర్గం ఆర్టీసి డీపోల మేనేజర్లకు ఫోన్ చేసి మాట్లాడారు. బస్సులు కళాశాల సమయానికి పంపుతామని, ఉంతకల్లు క్రాస్ వద్ద నిలిపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్ధులు, ప్రజాసంఘాల నాయకులు శాంతించారు. ఆందోళన విరమించడంతో వాహనాలు ముందుకు కదిలాయి. -
‘ఉపాధి’ కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
కూడేరు: ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే అటువంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) పీడీ సలీం బాషా సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం ఆయన చోళసముద్రం, కూడేరు, ఇప్పేరు గ్రామాల్లో ఉపాధి హామీ ద్వారా చేపడుతున్న నీటి కుంట, పశువుల షెడ్, కుడికాలువలో చెట్ల తొలగింపు, పూడిక తీత పనులను తనిఖీ చేశారు. పనులను నిబంధనల మేరకు నాణ్యతగా చేస్తే కేటాయింపు మేరకు దినకూలీ వర్తింపజేస్తామని కూలీలకు తెలియజేశారు. ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ సభలు నిర్వహించి కూలీలకు ఏయే పనులు కల్పించడానికి అందుబాటులో ఉన్నాయో వివరించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఓ పోలేరయ్య, ఈసీ రాజేష్, టీఏలు కోమల అనిల్ కుమార్, ఆయా పంచాయతీల ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. బెళుగుప్ప: మండలంలోని రామసాగరం, అంకంపల్లి గ్రామాల్లో ఉపాధి హామీకింద చేపట్టిన గోకులం షెడ్లు, పల్లె వనం పనులను డ్వామా పీడీ సలీం బాషా మంగళవారం పరిశీలించారు. పల్లె వనం మొక్కలను పూర్తిస్థాయిలో సంరక్షించాలని మండల అదికారులకు పీడీ సూచించారు. ఏపీఓ మురళీకృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ వన్నూరస్వామి, పంచాయతీ సెక్రటరీ వెంకటేశులు పాల్గొన్నారు. బీటీపీ ఆయకట్టుకు 15 నుంచి సాగు నీరు గుమ్మఘట్ట: భైరవానితిప్ప ప్రాజెక్టు ద్వారా ఈ నెల 15 నుంచి ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు జలవనరుల శాఖ రాయదుర్గం, కళ్యాణదుర్గం డీఈఈలు గీతాలక్ష్మి, దామోదర తెలిపారు. బైరవానితిప్ప గ్రామంలోని ఇన్స్పెక్షన్ బంగ్లా ఆవరణలో ఆయకట్టు రైతులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. కుడి కాలువ కింద 6బీ తూము నుంచి చివరి ఆయకట్టు వరకు 1,940 ఎకరాలకు, ఎడమ కాలువ కింద ఒకటో తూము నుంచి 9వ తూము వరకు 3,162 ఎకరాలకు సాగునీటిని విడుదల చేయనున్నట్లు వారు తెలిపారు. ఆయకట్టు రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ ఈఈ సురేంద్రనాథ్రెడ్డి, ఎంపీపీ భవాని, గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం తహసీల్దార్లు రజాక్వలి, సుమతి, సాగునీటి సంఘం చైర్మన్ నాగరాజు, వైస్ చైర్మన్ సుబాన్, ఏఈఈ హరీష్, రైతులు పాల్గొన్నారు. ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్ ● రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం గుంతకల్లు టౌన్: పట్టణంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండున్నర కిలోల గంజాయితో పాటు రూ.11 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ మనోహర్ మంగళవారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. పట్టణంలోని ఇరానీ కాలనీకి చెందిన యాసర్ అలీ, షేక్ మొహమ్మద్ ఈజీ మనీకి అలవాటు పడి ఆరు నెలలుగా గంజాయి విక్రయిస్తున్నారు. మహారాష్ట్రలోని థానే జిల్లా కోసాటౌన్ మురముర ప్రాంతం నుంచి రూ.25 వేలకు గంజాయి కొనుగోలు చేశారు. ఆ గంజాయిని చిన్న ప్యాకెట్లుగా తయారుచేసి వాటిని అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అందిన సమాచారం మేరకు పట్టణంలోని రైల్వే ఆస్పత్రి వెనుక పాడుబడిన రైల్వేక్వార్టర్స్ వద్ద యాసర్ అలీ, షేక్ మొహమ్మద్ను అరెస్ట్ చేసి, వీరి నుంచి రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరిచామన్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు విక్రేతలను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. సమావేశంలో ఎస్ఐ కొండయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
గుంతకల్లు: హనుమన్ శోభయాత్ర వైభవంగా జరిగింది. హనుమాన్ మాలధారులు 40 రోజుల దీక్ష అనంతరం మంగళవారం ఇరుముడి సమర్పణ చేపట్టారు. తొలుత మండల పరిధిలోని ఎన్.తిమ్మాపురం సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద నుంచి ర్యాలీగా గుంతకల్లులోని బళ్లారి గేట్ సమీపంలోని అభయాంజనేయస్వామి విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం అక్కడ నెట్టికంటి ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహాన్ని రథంపై కొలువుదీర్చారు. బెంగళూరు నుంచి తెప్పించిన వివిధ రకాల పుష్పాలతో ఉత్సవ విగ్రహంతో పాటు రథాన్ని ముస్తాబు చేశారు. అనంతరం శోభాయాత్రను పుర ప్రముఖలు ప్రారంభించారు. వాయిద్య కళాకారులు, కోలాటం ఆడే కళాకారుల ప్రదర్శనల నడుమ శోభాయాత్ర బీరప్పగుడి సర్కిల్, ప్రధాన రహదారి, సత్యనారాయణపేట మీదుగా కసాపురం వరకు సాగింది. జై శ్రీరామ్, జై నెట్టికంటి ఆంజనేయస్వామి నినాదాలతో పురవీధులు మార్మోగాయి. దారి పొడవునా మాలధారులకు అన్నప్రసాదాలను భక్తులు అందజేశారు. ఆలయ ప్రాంగణం చేరుకున్న అనంతరం మాలధారులు ఇరుముడి సమర్పించారు. బుధవారం మాలధారుల నడుమ అత్యంత వైభవంగా హనుమద్వత్రం నిర్వహించడానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శోభాయాత్రలో ఆర్డీఓ శ్రీనివాస్, ఆలయ ఈఓ విజయరాజు, ఆలయ కమిటీ చైర్మన్ సుగుణమ్మ, అర్చకులు, నెట్టికంటి మాలధారులు తదితరులు పాల్గొన్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. -
కోగటం ‘వీర’బాదుడు
అనంతపురం కార్పొరేషన్: అండర్ –19 కూచ్బెహార్ క్రికెట్ ట్రోఫీలో భాగంగా ఆర్డీటీ క్రికెట్ గ్రౌండ్లో కర్ణాటకతో సోమవారం జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఆంధ్ర జట్టు బ్యాటర్ కోగటం హనీష్ వీరారెడ్డి మెరుపు సెంచరీతో జట్టును భారీ స్కోర్ దిశగా నడిపాడు. తొలి రోజు ఆటముగిసే సమయానికి ఆంధ్ర జట్టు 5 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. తొలుత టాస్ నెగ్గిన ఆంధ్ర జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఆదిలోని ఓపెనర్ లోహిత్ లక్ష్మీనారాయణ 5 పరుగులు చేసి పెవిలిన్ బాట పట్టాడు. ఈ సమయంలో మరో ఓపెనర్ కోగటం హనీష్ వీరారెడ్డితో జతకట్టిన కేఎల్ శ్రీనివాస్ వికెట్ పడకుండా కర్ణాటక బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ఈ క్రమంలో కోగటం వీరారెడ్డి 163 బంతుల్లో 10 బౌండరీలు, 5 సిక్సర్లతో 114 పరుగులు చేశాడు. కెరియర్లో (అండర్–19) తొలి మ్యాచ్ ఆడుతున్న కేఎల్ శ్రీనివాస్ కూడా 225 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 98 పరుగులు సాధించి పెవిలియన్ బాట పట్టాడు. ఆటముగిసే సమయానికి పరమ్వీర్ సింగ్ 24, ఏఎన్వీ లోహిత్ 41 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. కర్ణాటక బౌలర్లలో ధ్యాన్ 3, రతన్ 2 వికెట్లు పడగొట్టారు. ఆంధ్ర స్కోర్ 300/5 -
రాష్ట్రంలో హామీలు అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం
ఉరవకొండ: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో పాలన సాగిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మద్యాన్ని పారిస్తూ సీఎం చంద్రబాబు తన సొంత జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. గిట్టుబాటు ధర లేక రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఉద్యోగ అవకాశాలు లేక యువత నిరాశకు గురవుతున్నారన్నారు. పేదలకు ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ విధానాలు నిరసిస్తూ ఉద్యమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కేశవరెడ్డి, సీపీఐ తాలుకా కార్యదర్శి మల్లికార్జున, సహాయ కార్యదర్శి చండ్రాయుడు, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పార్వతీప్రసాద్, నాయకులు గన్నేమల్లేసు, పురిడి తిప్పయ్య, శ్రీధర్, శ్రీరాములు, రమణ, బసవరాజు, ప్రసాద్, నారాయణమ్మ, మల్లారాయుడు, వనజాక్షి తదితరులు పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ భార్య ఆత్మహత్యాయత్నం
రాప్తాడు రూరల్: అగ్నిమాపక శాఖలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న వీరనారాయణ భార్య యమున ఆత్మహత్యాయత్నం చేసింది. అదనపు కట్నం వేధింపులు తారాస్థాయికి చేరడంతో జీవితంపై విరక్తితో ఆమె పురుగుల మందు తాగింది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... రాప్తాడుకు చెందిన యమునకు 11 ఏళ్ల క్రితం అనంతపురం రూరల్ పరిధిలోని చిన్నకుంటకు చెందిన వీరనారాయణతో పైళ్లెంది. పెళ్లి సమయంలో వీరనారాయణకు కట్న కానుకలు కింద రూ.3 లక్షల నగదు, 16 తులాల బంగారాన్ని యమున తల్లిదండ్రులు ఇచ్చి ఘనంగా పెళ్లి జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. కొంతకాలంగా అదనపు కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. పుట్టినింటి నుంచి ఎకరా భూమి రాయించుకుని రావాలంటూ భార్యపై వీరనారాయణ ఒత్తిడి చేస్తూ వచ్చాడు. అప్పట్లో వేధింపులు భరించలేక యమున ఆత్మహత్యాయత్నం చేసింది. సకాలంలో పోలీసులు గుర్తించడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ సమయంలోనే వీరనారాయణకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం భర్తతో కలసి యమున తోటకు వెళ్లింది. అక్కడ అదనపు కట్నం విషయంగా మరోసారి భర్త, అత్త, మామ, ఆడపడచు నిలదీశారు. యమున సమాధానం ఇచ్చే లోపు భౌతిక దాడికి పాల్పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన యమున నేరుగా ఇంటికి చేరుకుని తోట నుంచి తెచ్చుకున్న పురుగుల మందు తాగింది. విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారి సమాచారంతో వీరనారాయణ ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న యమునను వెంటనే అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు బెంగళూరుకు తరలించారు. కాగా, సమాచారం అందుకున్న ఇటుకలపల్లి పోలీసులు ఆస్పత్రికి చేరుకుని యమునను పరిశీలించారు. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు, ఆడపడుచు వేధిస్తుండడంతోనే తమ కుమార్తె ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిందంటూ బాధితురాలి తల్లి, సోదరుడు వాపోయారు. ఘటనపై పోలీసులు విచారణ కొనసాగుతోంది. అదనపు కట్నం వేధింపులు తాళలేక పరిస్థితి విషమం... బెంగళూరుకు తరలింపు -
సీనియర్ జర్నలిస్ట్ కాలవ రమణ మృతి
అనంతపురం: సీనియర్ జర్నలిస్ట్ కాలవ రమణ (54) అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం మృతి చెందారు. ఆయనకు భార్య రాజేశ్వరి, కుమార్తె జాహ్నవి ఉన్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా వివిధ పత్రికల్లో ఆయన పాత్రికేయుడిగా పనిచేశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన... అనంతపురంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్హోంలో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. రాజకీయ, అధికార, అనధికారులతో సుదీర్ఘ పరిచయాలు ఉన్న కాలవ రమణ... జిల్లా కరువు, సాగునీటి పరిస్థితులపై ఎప్పటికప్పుడు కథనాలు రాస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన మృతిపై అన్ని వర్గాల వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పలువురు జర్నలిస్టులు నర్సింగ్ హోం వద్దకెలిల రమణ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం అంత్యక్రియలకు మృతదేహాన్ని స్వస్థలం హిందూపురానికి కుటుంబసభ్యులు తరలించారు. రమణ మృతి బాధాకరం : అనంత వృత్తి పట్ల అంకితభావం, నిబద్ధత గల కాలవ రమణ మృతి బాధాకరమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అందరితో కలివిడిగా, ఆప్యాయంగా ఉంటూ అభిమానంగా మాట్లాడే కాలవ రమణ పత్రికా లోకానికి తీరని లోటుగా అభివర్ణించారు. పాత్రికేయ వృత్తిలో విశేష సేవలు అందించిన సీనియర్ జర్నలిస్ట్ కాలవ రమణ మృతి బాధాకరమని మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. హిందూపురంలోని కాలవ రమణ నివాసం వద్ద మృతదేహాన్ని ఆయన సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘కమర్షియల్’లో జేసీ, డీసీలుగా పదోన్నతులు అనంతపురం ఎడ్యుకేషన్: కమర్షియల్ ట్యాక్స్ శాఖలో జాయింట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లుగా పదోన్నతులు కల్పించి స్థానాలు కేటాయించారు. ఈ మేరకు సోమవారం ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతపురం డివిజన్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్గా పని చేస్తున్న పి.భాస్కర్వల్లికి జాయింట్ కమిషనర్గా పదోన్నతి కల్పించి విజయవాడ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి బదిలీ చేశారు. అలాగే తాడిపత్రి సర్కిల్లో అసిస్టెంట్ కమిషనర్గా పని చేస్తున్న ఎస్.సోనియాతారకు డిప్యూటీ కమిషనర్గా పదోన్నతి కల్పించి విజయవాడ–3 డివిజన్కు, సూర్యపేట సర్కిల్ విజయవాడ–2 డివిజన్లో అసిస్టెంట్ కమిషనర్గా పని చేస్తున్న షేక్ షహనాజ్బేగంకు డిప్యూటీ కమిషనర్గా పదోన్నతి కల్పించి అనంతపురం డివిజన్ కార్యాలయానికి బదిలీ చేశారు. కాగా డిప్యూటీ కమిషనర్గా పదోన్నతి పొందిన సోనియాతారను ఏపీ ఎన్జీఓ మహిళా విభాగం అనంతపురం చైర్మన్ జమీలాబేగం, ఇతర సభ్యులు శాలువా కప్పి అభినందించారు. ఖైదీల బందోబస్తులో జాగ్రత్తలు తప్పనిసరిఅనంతపురం సెంట్రల్: ఖైదీల ఎస్కార్టు, గార్డు డ్యూటీల్లో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాజ్బాషా సూచించారు. పోలీసు కార్యాలయ ఆవరణలోని జిల్లా శిక్షణ కేంద్రంలో సిబ్బందికి ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఖైదీల వివరాలను ముందుగా తెలుసుకోవాలని, ఆయుధాలు, హ్యాండ్కప్స్, లీడింగ్ చైన్లను అవసరానికి తగినట్లుగా వాడాలని సూచించారు. ఆయుధాల అప్పగింత విధి ప్రకారం జరగాలన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, ఆర్ఐ పవన్కుమార్, ఆర్ఎస్ఐలు బాబ్జాన్, రమేష్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఎద్దుల బండిని ఢీకొన్న ప్రైవేట్ బస్సు
● రైతుకు తీవ్రగాయాలు ● జోడెద్దులు మృతి విడపనకల్లు: మండలంలోని పెద్ద కొట్టాలపల్లి సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో రైతుకు తీవ్రంగా గాయపడగా జోడెద్దులు మృతి చెందాయి. వివరాలు... పెద్ద కొట్టాలపల్లి గ్రామానికి చెందిన రైతు ఎర్రిస్వామిరెడ్డి సోమవారం తెల్లవారుజామున ఎద్దుల బండి కట్టుకుని మాళాపురం వైపుగా ఉన్న తన పొలానికి బయలుదేరాడు. పెద్ద కొట్టాలపల్లి సమీపంలోకి చేరుకోగానే 42వ జాతీయ రహదారిపై శరవేగంగా దూసుకొచ్చిన పీఎస్ఆర్ ట్రావెల్స్ బస్సు.. వెనుక నుంచి బండిని ఢీకొంది. ఘటనలో ఎద్దులతో పాటు బండి ఎగిరి రోడ్డుపక్కనే ఉన్న పొలంలో పడి ముక్కలైపోయింది. ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాయి. తీవ్రంగా గాయపడిన ఎర్రిస్వామిరెడ్డిని స్థానికులు వెంటనే అంనతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై విడపనకల్లు పోలీసులు కేసు నమోదు చేశారు. డీసీఎం బాధ్యతల స్వీకరణగుంతకల్లుటౌన్: స్థానిక రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ (డీసీఎం)గా జి.మోహన్కృష్ణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఇక్కడ డీసీఎంగా పనిచేస్తున్న శ్రీకాంత్రెడ్డి సికింద్రాబాద్ డివిజన్కు డీఓఎంగా బదిలీ అయ్యారు. గంజాయి విక్రేతల అరెస్ట్అనంతపురం సెంట్రల్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి నుంచి 1.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అనంతపురం వన్టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుల వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. పట్టుబడిన వారిలో నగరంలోని టీవీ టవర్ ప్రాంతంలో నివాసముంటున్న షికారి శీనా, ఎన్టీఆర్ కాలనీకి చెందిన షేక్ మహమ్మద్ ఉన్నారు. అందిన పక్కా సమాచారంతో సోమవారం నదోదయ కాలనీ శశ్మాన వాటిక వద్ద నిందితులను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. శిశుగృహ సిబ్బంది తొలగింపు అనంతపురం సెంట్రల్: మహిళాశిశు సంక్షేమశాఖ పరిధిలోని శిశుగృహ సిబ్బందిని తొలగిస్తూ ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీ అరుణకుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. శిశుగృహలో రెండు నెలల పసికందు నిరూప్ అక్టోబర్ 2న మృతిచెందిన విషయం తెలిసిందే. కేవలం శిశుగృహ సిబ్బంది నిర్లక్ష్యం, గొడవలు కారణంగా శిశువు మృతి చెందినట్లుగా అధికారిక విచారణలో నిర్ధారణ అయింది. దీంతో ఇటీవల సిబ్బంది మొత్తాన్ని తొలగిస్తూ కలెక్టర్ ఆనంద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ఏఎన్ఎం గుణవతి, ఆయాలు ఆదిలక్ష్మి, నూర్జహాన్, ప్రభావతమ్మ, వాచ్మెన్ రాజశేఖర్కు టర్మినేట్ చేస్తూ సోమవారం ఉత్తర్వులను అరుణకుమారి అందజేశారు. ఉత్తర్వులు అందుకునేందుకు శిశుగృహ మేనేజర్ దీప్తి, సోషల్ వర్కర్ లక్ష్మీదేవి రాలేదు. -
తమ్ముళ్ల ఇసుక దోపిడీ
శింగనమల: చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతల ధన దాహానికి వాగులు, వంకలు కనుమరుగవుతున్నాయి. అడ్డగోలుగా ఇసుక అక్రమ తరలింపు చేపట్టి ప్రశ్నించిన వారిని ‘ప్రభుత్వం మాది... మేం ఏమీ చేసినా చెల్లుతుంది. కాదని ఎవరైనా అంటే భూమి మీద నూకలు చెల్లిపోతాయి’ అని బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో వారి ఆగడాలను అడ్డుకునే ధైర్యం ఎవరూ చేయలేకపోతున్నారు. ప్రజాప్రతినిధి అండతో.. శింగనమల నియోజకవర్గంలో శింగనమల, గార్లదిన్నె, యల్లనూరు, బుక్కరాయసముద్రం మండలాల్లోని వంకలు, వాగులు, పెన్నా, చిత్రావతి నదుల్లో పుష్కలంగా ఇసుక లభ్యమవుతోంది. ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధి అండతో ఆయా వంకలు, వాగులు, నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ తరలింపులతో టీడీపీ నాయకులు రూ. లక్షల్లో కూడబెట్టుకున్నట్లుగా ఆరోపణలున్నాయి. తాజాగా శింగనమల మండలంలోని చీలేపల్లి వంకపై కన్నేసిన టీడీపీ నాయకులు.. 20 రోజులుగా ఇసుకను యథేచ్ఛగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రోజుల వ్యవధిలోనే వంక మొత్తం గోతుల మయమై పోయింది. సలకంచెర్వు నుంచి చీలేపల్లికి వెళ్లే మార్గంలో వంకలోకి టిప్పర్ల వెళ్లేందుకు ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశారు. వంకలో జేసీబీని ఏర్పాటు చేసి ఇసుకను తవ్వి ఒడ్డున ఓ చోట డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా రాత్రి సమయాల్లో ఇతర ప్రాంతాలకు తరలించి, సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో టిప్పర్కు రూ.5వేలు చొప్పున ఈ రోజుల్లోనే రూ. 50 లక్షలకు పైగా ఇసుకను దోచేశారు. ఈ విషయం రెవెన్యూ అధికారులు, పోలీసులకు తెలిసినా వారు అటుగా కన్నెత్తి కూడా చూడడం లేదు. రోజూ టిప్పర్ల ద్వారా అక్రమ రవాణా రైతులు ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు ఉనికి కోల్పోతున్న చీలేపల్లి వంక టిప్పర్ డ్రైవర్లకు ప్రత్యేక వసతి వంకలో ఇసుకను తరలించుకెళ్లేందుకు వచ్చే టిప్పర్ డ్రైవర్ల కోసం టీడీపీ నేతలు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. డ్రైవర్లు నిద్రించేందుకు వంక పక్కనే ప్రత్యేకంగా మంచాలు వేశారు. భోజనాలు, ఇతరత్రాలను అక్కడే సమకూరుస్తున్నారు. దీంతో చీలేపల్లి వంక నుంచి ఇసుక తరలించేందుకు టిప్పర్ డ్రైవర్లు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇసుక తరలింపులతో భూగర్భ జలాలు అడుగంటి పంటల సాగు ప్రశ్నార్థకమవుతుందని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇసుక అక్రమ తరలింపులు అడ్డుకోవాలని అధికారులకు విన్నవించినా వారు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఇసుక అక్రమ తరలింపులు అడ్డుకోవాలని వేడుకుంటున్నారు. -
సమస్యలు పరిష్కరించండి సారూ..
● పరిష్కార వేదికలో ప్రజల వేడుకోలు ● వివిధ సమస్యలపై 437 వినతులు అనంతపురం అర్బన్: ‘‘సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాము.. అర్జీలు ఇస్తూనే ఉన్నాము. ప్రయోజనం ఉండడం లేదు. దయచేసి మా సమస్యలు పరిష్కరించి ఆదుకోండి’’ అంటూ ప్రజలు అర్జీదారులు అధికారులను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ ఓ.ఆనంద్తో పాటు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, మల్లికార్జునుడు, తిప్పేనాయక్, వ్యవసాయాధికారి ఉమామహేశ్వర్మ అర్జీలు స్వీకరించారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రజల నుంచి అందే అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యను నాణ్యతగా పరిష్కరించాలని ఆదేశించారు. వినతులు కొన్ని... ● మంచినీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అనంతపురం రూరల్ మండలం కళ్యాణదుర్గం రోడ్డు రాఘవేంద్ర కాలనీకి చెందిన రామకృష్ణారావు తదితరులు విన్నవించారు. ద్వారకా విల్లాస్ వరకు మంచినీటి సరఫరా చేస్తున్నారని, అక్కడి నుంచి పైప్లైన్ పొడిగించి తమ కాలనీకి నీటి సరఫరా చేయాలని కోరారు. ● ప్రభుత్వ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఓ మహిళ ఉద్యోగం ఇప్పిస్తానని తన వద్ద నుంచి రూ.1.55 లక్షలు తీసుకుని మోసం చేసిందని నగరంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన కుమ్మర లక్ష్మి ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పించడం లేదని, తీసుకున్న డబ్బు కూడా తిరిగివ్వడం లేదని చెప్పింది. గట్టిగా అడిగితే మూడు చెక్లు ఇచ్చిందని అవి బ్యాంకులో చెల్లలేదని తెలిపింది. ఆమె నుంచి తనకు డబ్బు ఇప్పించాలని కోరింది. ● వితంతు పింఛను మంజూరు చేయించాలని అనంతపురం రూరల్ మండలం సజ్జల కాల్వకు చెందిన ఎం.రత్నమ్మ విన్నవించింది. తన భర్త గత ఏడాది నవంబరు 3వ తేదీన మరణించాడని చెప్పింది. కుటుంబ పోషణ కష్టంగా ఉందని, పింఛను మంజూరు చేయించి ఆదుకోవాలని కోరింది. ఇతని పేరు ఏకుల కృష్ణ. కూడేరు మండలం లెప్రసీ కాలనీలో ఉంటున్నాడు. ఈయన భార్య అలివేలమ్మ పేరున 2.48 ఎకరాల భూమి (ఖాతా నంబరు 1083) ఉంది. ఇటీవల అలివేలమ్మ మరణించింది. ‘అన్నదాత సుఖీభవ’ కింద మొదటి, రెండో విడతలో సాయం జమ కాలేదని చెప్పాడు. చాలా సార్లు అర్జీ ఇచ్చానని, సమస్య పరిష్కరిస్తామని పంపిస్తారే తప్ప ఇప్పటికీ పరిష్కరించలేదని వాపోయాడు. ఈమె పేరు సారంబీ. కూడేరు మండలం బ్రాహ్మణపల్లి. ఈమెకు ఎకరా భూమి ఉంది. ‘అన్నదాత సుఖీభవ’ నగదు జమ కాలేదు. ఈమె ఆధార్కు వీఆర్ఓ అథెంటికేషన్ కావడంతో ప్రభుత్వ ఉద్యోగి అని చూపిస్తోంది. దీంతో డబ్బులు జమ కావడం లేదు. పలుమార్లు అర్జీ ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. -
ఘనంగా ధ్వజారోహణ, అంకురార్పణ
● నేడు హనుమద్ వ్రతం మడకశిరరూరల్: భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి, జిల్లెడుగుంట ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఘనంగా ధ్వజారోహణ, అంకురార్పణ చేశారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బెంగళూరుకు చెందిన హనుమంతయ్య, రామాంజనప్ప వారి కుటుంబ సభ్యులచే, ఆంజినేయస్వామి ఆలయంలో గోవిందరాజులు, రత్నమ్మ కుటుంబ సభ్యులచే ధ్వజారోహణ, అంకురార్పణ, అగ్నిహోత్ర, హోమం తదితర కార్యక్రమాలను పురోహితులు నిర్వహించారు. స్వామివార్లకు ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే ఎంఎస్ రాజు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి, పూజలు చేశారు. అదే విధంగా రొళ్ల జెడ్పీటీసీ అనంతరాజు కుటుంబ సభ్యులు స్వామి వార్లకు పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, సర్పంచులు కరియన్న, రామాంజినేయులు, ఈఓ నరసింహరాజు, కమిటీ చైర్మన్ నర్సేగౌడ్, సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. నేడు వ్రతం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఆలయాల్లో స్వామి వార్లకు మన్యసూక్త పవమాన హోమం, హనుమద్వ్రతం, అభిషేకం తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవదాయ శాఖ అధికారులు తెలిపారు. -
33 ఏళ్లు కళ్లుగప్పి.. ఎట్టకేలకు దొరికి
● బంగారు ఆభరణాల చోరీ కేసులో నిందితుడి అరెస్టు కూడేరు: 33 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఓ నిందితుడు ఎట్టకేలకు దొరికాడు. కూడేరు పోలీసులు తెలిపిన మేరకు.. చెన్నేకొత్తపల్లికి చెందిన బోయ నరసింహులు 33 ఏళ్ల క్రితం కూడేరు మండలం జల్లిపల్లి వద్ద మదనపల్లి డిపోకు చెందిన బస్సును అడ్డగించాడు. కత్తులు చూపి ప్రయాణికుల వద్ద బంగారు ఆభరణాలు చోరీ చేశాడు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు కూడేరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎంత గాలించినా నరసింహులు ఆచూకీ మాత్రం లభించలేదు. అతని అరెస్టు వారెంట్ 33 ఏళ్లుగా అనంతపురం కోర్టులో పెండింగ్లో ఉంది. ఇటీవల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసుపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు ఎట్టకేలకు నరసింహులును ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అనంతపురంలోని కోర్టులో జడ్జి ఎదుట హాజరు పరచి రిమాండ్కు పంపారు. పంట రుణాల కోసం బ్యాంకు ఎదుట ధర్నా ఉరవకొండ: పంట రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఉరవకొండలోని యూనియన్ బ్యాంకు ఎదుట కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగారెడ్డి, బాలరంగయ్య, నియోజకవర్గ అధ్యక్షుడు పెద్దముస్టూరు వెంకటేష్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కౌలు రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదన్నారు. ప్రస్తుతం రైతులు మిరప, వరి, కంది సాగు చేస్తున్నారని, అయితే వీరికి ఇప్పటి వరకు బ్యాంకు రుణాలు మంజూరు కాలేదన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కౌలు రైతులకు రెండు లక్షల వరకూ రుణాలు మంజూరు చేయాలనే నిబంధన ఉన్నా బ్యాంకర్లు అమలు చేయడం లేదన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం కౌలు రైతులకు వర్తింపచేయాలన్నారు. అనంతరం బ్యాంకు సిబ్బందికి వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం నాయకులు సుంకన్న, శీనప్ప, రామాంజనేయులు, ఆంజనేయులు, నాగవేణి, తిప్పమ్మ, భారతి తదితరులు పాల్గొన్నారు. హెచ్ఐవీ నియంత్రణ అందరి బాధ్యత ● జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాజశేఖర్ అనంతపురం మెడికల్: హెచ్ఐవీ నియంత్రణ అందరి బాధ్యత అని జిల్లా లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాజశేఖర్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని పురస్కరించుకుని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హెచ్ఐవీ పట్ల యువత అవగాహన కల్గి ఉండాలన్నారు. హెచ్ఐవీ రోగుల పట్ల వివక్షకు ఆస్కారం లేకుండా వారికందించే సేవల్లో నాణ్యత పెంచాలన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబ దేవి మాట్లాడుతూ హెచ్ఐవీ రోగులకు మెరుగైన వైద్య సేవలందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తునట్లు పేర్కొన్నారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ జయలక్ష్మి మాట్లాడుతూ ఆరోగ్యశాఖ ద్వారా విస్తృత కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ర్యాలీ ఆర్ట్స్ కళాశాల నుంచి క్లాక్టవర్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు సాగింది. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్రమణ్యం, డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ హేమలత, డెమో నాగరాజు, డిప్యూటీ హెచ్ఈఈఓ త్యాగరాజు, డీపీఎం వెంకటరత్నం, అనంత నెట్వర్క్ వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
మహిళలపై హింసకు అడ్డుకట్ట వేయాలి
● కలెక్టర్ ఆనంద్ అనంతపురం అర్బన్: మహిళలు, బాలికలపై జరిగే హింసకు అడ్డుకట్ట వేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ పిలుపునిచ్చారు. మహిళలపై హింస వ్యతిరేక అంతర్జాతీయ పక్షోత్సవాల సందర్భంగా సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నేను సైతం’’ అంటూ అందరూ భాగస్వాములై మంచి మార్పు కోసం పనిచేయాలన్నారు. మహిళలు, బాలికలపై జరిగే హింసకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెల్ఫీ భూత్, సైన్ బోర్డులో కలెక్టర్తో పాటు అధికారులు సెల్ఫీ దిగి, సంతకం చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ ఎ.మలోల, పీడీ అరుణకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అర్హులందరికీ పింఛన్లు బుక్కరాయసముద్రం: రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేద ప్రజలందరికీ పింఛన్లు పంపిణీ చేసేలా ప్రత్యేక చర్యలు చేపడుతోందని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని రేకులకుంట గ్రామంలో పలువురు లబ్ధిదారులకు ఆయన పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పింఛన్ల పంపిణీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీధర్మూర్తి, ఎంపీడీఓ సాల్మాన్, సర్పంచ్ నరసమ్మ, ఎంపీపీ సునీత, డిప్యూటీ ఎంపీడీఓ సదాశివ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
అరటి రైతు నిరసనాగ్రహం
అనంతపురం: కడుపు మండిన అరటి రైతులు చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా కదం తొక్కారు. వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అరటి గెలలను భుజాన తీసుకొచ్చి కలెక్టరేట్ ఎదుట పారపోసి వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం అక్కడే బైఠాయించారు. ఆరుగాలం శ్రమించి పండించిన అరటి పంటను పొలాల్లో ట్రాక్టర్లతో దున్నివేయాల్సి వస్తోందని, పశువులకు మేతగా వేస్తున్నామని ఆవేదన చెందారు. వెంటనే అరటి పంటను ప్రభుత్వం గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మాజీ మంత్రి సాకే శైలజనాథ్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రైతుల్ని గాలికి వదిలేసిందన్నారు. అరటి రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అరటి గెలలు కొనే నాథుడే లేక చెట్లలోనే మాగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రెండు రూపాయలకే కిలో అరటి అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందంటే ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా అని వాపోయారు. కిలో రూ. 7–10తో కొనుగోలు చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం చెబుతున్నదంతా డ్రామా అని విమర్శించారు. తాము 24 టన్నుల అరటి కాయలు తీసుకొచ్చామని, ప్రభుత్వం చెబుతున్న రేటుతో కొనుగోలు చేస్తే రూ.500 మినహాయింపు కూడా ఇస్తామని పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలకు ఎకరా రూపాయికి కట్టబెడుతున్న చంద్రబాబుకు రైతుల సంక్షేమం మాత్రం పట్టడం లేదన్నారు. రోజూ ప్రత్యేక విమానాల్లో ప్రయాణిస్తూ ప్రజలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. జగన్ పాలన చూసి నేర్చుకోండి: వైఎస్ జగన్ పాలన చూసి చంద్రబాబు ఎంతో నేర్చుకోవాల్సి ఉందని శైలజానాథ్ పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు రైతుల గురించి అవగాహనే లేదని, ఆయన గురించి మాట్లాడుకోవడమే వృథా అని ఎద్దేవా చేశారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు అదే సిద్ధాంతంతో అన్నదాతలను నట్టేట ముంచుతున్నారన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో జిల్లాలో ఏకంగా 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రైతుల పక్షాన వైఎస్సార్సీపీ అలుపెరగని పోరాటం చేస్తుందని, రైతన్నకు తోడుగా వైఎస్సార్సీపీ నిలుస్తుందని స్పష్టం చేశారు. అనంతరం మాజీ మంత్రి శైలజానాథ్ రైతులతో కలిసి కలెక్టర్ ఆనంద్కు వినతి పత్రం సమర్పించి, రైతులు పడుతున్న కష్టాలను వివరించారు. కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు నారాయణ రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి తరిమెల వంశీ గోకుల్ రెడ్డి, శ్రీరామరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకులు సాకే రుత్విక్ హృదయ్, సాకే చంద్రశేఖర్, నార్పల సత్యనారాయణ రెడ్డి, శ్రీరామ రెడ్డి, బండ్ల ప్రతాప్ రెడ్డి, భోగాతి ప్రతాప్ రెడ్డి, సూరి, పూల ప్రసాద్, మహేశ్వర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఖాదర్ బాషా, నీలం భాస్కర్, జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, శివశంకర్ నాయక్, శ్రీనివాస నాయక్, మారుతీ నాయుడు, చామలూరు రాజగోపాల్, మిద్దె కుళ్లాయప్ప, విష్ణు నారాయణ తదితరులు పాల్గొన్నారు. అన్నదాతలతో సీఐ దురుసు ప్రవర్తన.. రైతుల నిరసన సందర్భంగా కలెక్టరేట్ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అరటి గెలలతో నిరసన తెలుపుతున్న రైతులపై వన్టౌన్ సీఐ వెంకటేశ్వర్లు దురుసుగా ప్రవర్తించగా.. అన్నదాతలూ అంతే స్థాయిలో ప్రతిస్పందించారు. రైతులు ఇబ్బంది పడుతుంటే మీరు ఇలా మాట్లాడడం సమంజసం కాదంటూ హితవు పలికారు. అంతలోనే మరో సీఐ వచ్చి సర్దిచెప్పి పంపింజేశారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్న అరటి రైతులు, నాయకులు, కలెక్టర్ ఆనంద్కు వినతిపత్రం సమర్పిస్తున్న మాజీ మంత్రి శైలజానాథ్ జిల్లాకేంద్రంలో భారీ ర్యాలీ పెద్ద సంఖ్యలో తరలివచ్చి కలెక్టరేట్ వద్ద ధర్నా పంటను రోడ్డుపై పారబోసి నిరసన మాజీ మంత్రి శైలజానాథ్ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం రైతుల కన్నీళ్లు కనిపించడం లేదా చంద్రబాబూ..?: శైలజానాథ్ ఆగ్రహం -
నేటి నుంచి ఆంధ్ర, కర్ణాటక మధ్య టెస్ట్ మ్యాచ్
అనంతపురం కార్పొరేషన్: కూచ్ బెహార్ అండర్ –19 క్రికెట్ ట్రోఫీలో భాగంగా సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు ఆంధ్ర, కర్ణాటక జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఆర్డీటీలోని రాయలసీమ క్రికెట్ మైదానాన్ని సిద్ధం చేశారు. ఆదివారం ఇరు జట్ల క్రీడాకారులు నెట్స్లో ముమ్మర సాధన చేశారు. భారత మాజీ ఆటగాడు, కోచ్ రాహుల్ ద్రావిడ్ కుమారుడు అన్వయ్ ద్రావిడ్ కర్ణాటక జట్టు కెప్టెన్గా బరిలో దిగుతున్నాడు. నేడు పింఛన్ల పంపిణీఅనంతపురం టౌన్: సామాజిక భద్రతా పింఛన్లను సోమవారం ఉదయం 6.30 గంటల నుంచి పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. పింఛన్ల పంపిణీ అంశంపై సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్లో సంబంధిత అధికారులతో మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ పరిధిలోని లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ మొత్తాన్ని అందజేయాలని సూచించారు. ఈ ప్రక్రియను ఎంపీడీఓలు, డీఎల్డీఓలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. అమ్మాజీ ఆలయంలోకి ఎలుగు బంటి రొళ్ల: మండలంలోని జీరిగేపల్లిలో త్రిశక్తి దేవతలుగా విరాజిల్లుతున్న అమ్మాజీ (మారక్క, గ్యారక్క, ముడుపక్క) ఆలయంలో ఆదివారం వేకువజామున ఎలుగుబంటి ప్రవేశించింది. శనివారం సాయంత్రం ఆలయ అర్చకులు మారన్న, ముడుపన్న పూజాదికాలు ముగించుకున్న అనంతరం గర్భగుడికి తాళం వేసి వెళ్లిపోయారు. ఆదివారం వేకువజామున ఆలయంలోకి ఎలుగుబంటి చొరబడి గర్భగుడి తలుపులు తాకి వెళ్లింది. ఆదివారం ఉదయం ఆలయానికి చేరుకున్న అర్చకులు విషయాన్ని గుర్తించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయి. -
60 చీనీ చెట్ల నరికివేత
తాడిమర్రి: చిల్లకొండయ్యపల్లిలో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు 60 చీనీచెట్లు నరికివేశారు. ఫిర్యాదు చేయడానికి స్టేషన్కు వెళ్లిన బాధితుల పట్ల సీఐ శ్యామరావు ఫోన్లో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో బాధితులు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. చిల్లకొండయ్యపల్లిలో కొంకా తిరుపాల్ తనకున్న సర్వే నంబర్ 24–5లోని పొలంలో ఐదేళ్ల క్రితం 300 చీనీ మొక్కలు సాగు చేశాడు. ఆదివారం ఉదయం నీరు పెట్టడానికి వెళ్లగా తోటలో 60 చీనీ చెట్లు నరికివేతకు గురవడం చూసి తిరుపాల్ భార్య కళావతి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. బాధితులు అక్కడి నుంచి తాడిమర్రి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. అయితే అక్కడ వారు ఏఎస్ఐతో మాట్లాడుతూ ఇటీవల నెలకొన్న రస్తా వివాదం కారణంగానే గుర్తు తెలియని వ్యక్తులు తమ చీనీచెట్లను నరికేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని ఏఎస్ఐ తన సెల్ఫోన్ లౌడ్ స్పీకర్ ఆన్చేసి ముదిగుబ్బ సీఐ శ్యామరావ్కు వివరాలు తెలిపారు. చెట్లు ఎవరు పీకారో చెప్పలేనప్పుడు ‘ఏం.... కి వచ్చారు’ అంటూ మహిళ అని కూడా చూడకుండా సీఐ అనుచిత వ్యాఖ్యలు చేశారని రైతు దంపతులు ఆరోపించారు. అనంతరం వారు అక్కడి నుంచి ధర్మవరం వెళ్లి డీఎస్పీ హేమంత్కుమార్కు సీఐ ప్రవర్తన తీరుతో పాటు చీనీచెట్ల నరికివేత గురించి ఫిర్యాదు చేశారు. డీఎస్పీ స్పందిస్తూ కేసు నమోదు చేసి, సమగ్ర విచారణ చేపట్టి నిందితులను గుర్తించాలని తాడిమర్రి పోలీసులను ఆదేశించారు. చిల్లకొండయ్యపల్లిలో ఘటన ఫిర్యాదు చేసేందుకు వెళ్తే సీఐ అనుచిత వ్యాఖ్యలు డీఎస్పీకి బాధిత రైతు దంపతుల ఫిర్యాదు -
నట్టేట ముంచిన ‘ఆమె’
● అనంతపురం రూరల్ మండలం నందమూరినగర్లో వందల సంఖ్యలో మహిళలు యానిమేటర్ ఆదిలక్ష్మి మోసానికి బలయ్యారు. వందలు... వేలు.. కాదు రూ. కోట్లలో దగా చేసి ఉడాయించడం ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. ఇళ్లల్లో పాచి పని చేసుకుంటున్న వారిని కూడా వదల్లేదు. చీటీలు, వడ్డీలతో పాటు డ్వాక్రా సభ్యుల పేర్లతో రుణాలు తీసుకుంది. ఈమె బాధితుల్లో ఎక్కువగా కూలీనాలీ చేసుకునే వారే ఉన్నారు. రాప్తాడు రూరల్: నందమూరి నగర్లో చాలా కాలంగా ఉంటూ యానిమేటర్గా పనిచేస్తున్న ఆదిలక్ష్మి సుదీర్ఘకాలంగా ఆ ప్రాంతంలో చీటీ వ్యాపారం నిర్వహిస్తోంది. అందరితోనూ మంచిగా ఉండడంతో చాలా మంది ఆమెను నమ్మారు. ఈ నమ్మకంతోనే చీటీలు పూర్తయినా వడ్డీ చెల్లిస్తానంటే చీటీలు వేసిన వారు ఒప్పుకున్నారు. వడ్డీ డబ్బులు ఇవ్వకుండా తిరిగి వారిని కొత్త చీటీల్లోకి సభ్యులుగా చేర్చుకునేది. దీనికి తోడు రూ. 2 వడ్డీతో రూ.లక్షల్లో అప్పులు చేసింది. అంతటితో ఆగకుండా ప్రగతి మహిళా సంఘం సభ్యుల పేరుపై రుణాలు తీసుకుంది. ఇలా మొత్తం రూ. 3 కోట్ల దాకా చేరుకోగానే 15 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. వారం రోజుల క్రితం విషయాన్ని తెలుసుకున్న బాధితులు తమకు న్యాయం చేయాలంటూ గత సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నేరుగా కలెక్టర్ను కలసి ఫిర్యాదు చేశారు. అనంతరం డీఆర్డీఏ అధికారులకు, అనంతపురం రూరల్ పోలీసులకూ ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదులపై అటు పోలీసులు కానీ, ఇటు డీఆర్డీఏ అధికారులు కాని ఎలాంటి విచారణ చేపట్టకపోవడంతో బాధితుల్లో ఆందోళన మొదలైంది. టీడీపీ నేత జోక్యం.. ఆదిలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లే విషయం స్థానిక ఓ టీడీపీ నేతకు ముందుగానే తెలుసుననే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఆదిలక్ష్మిపై ఒత్తిడి తీసుకెళ్లి ఆమె ఇంటిని బాధితుల్లో ఒకరైన తన సమీప బంధువు పేరిట రాయించినట్లుగా సమాచారం. ఇది ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. ఆమె కూడా తమలాగానే అప్పులు ఇచ్చిందని, అయితే ఇంటిని ఆమె ఒక్కతే ఎలా రాయించుకుంటుందని మిగిలిన వారు ప్రశ్నిస్తున్నారు. ఆదిలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లే ముందు సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆమె కుమార్తెకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా ముందుగానే లాంగ్లీవ్లో వెళ్లడానికి సదరు టీడీపీ నేతనే పావులు కదిపినట్లుగా తెలిసింది. ఈ విషయంలో అధికారులు ఇప్పటికై నా స్పందించి తమకు న్యాయం చేయాలని పలువురు బాధితులు కోరుతున్నారు. కోట్లాది రూపాయలు ముంచేసి పరారైన యానిమేటరు చీటీలు, వడ్డీలతో పాటు సభ్యుల పేర్లతో రుణాలు బాధితులంతా కూలీనాలీ చేసుకునేవారే అజ్ఞాతంలోకి వెళ్లేముందు ఓ మహిళ పేరుపై ఇంటిని రాయించిన వైనం వెనుక నుంచి తతంగం నడిపిన స్థానిక టీడీపీ నేత -
అపార్కు ఆటంకాలు
అనంతపురం సిటీ: ఆధార్ తరహాలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే ప్రతి విద్యార్థికి 12 అంకెల గుర్తింపు సంఖ్యను జారీ చేసేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త ప్రక్రియకు నాంది పలికింది. నూతన విద్యా విధానం అమలులో భాగంగా దేశ వ్యాప్తంగా ప్రత్యేకించి విద్యార్థుల కోసమే అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకాడమీ అకౌంట్ రిజిస్ట్రీ)ని తీసుకొచ్చింది. ఈ ప్రక్రియ అన్ని పాఠశాలలు, కళాశాలల్లో నిర్వహించాలని ఆదేశించింది. అయితే ‘అపార్’ మొదట్లో కొంత వరకు జోరుగా సాగినా ఇప్పుడు ముందుకు సాగడం లేదు. పిల్లలను పాఠశాలల్లో చేర్చే సమయంలో నమోదు చేసిన వివరాలు, ఆధార్లోని వివరాలకు ఏమాత్రమూ పొంతన కుదరడం లేదని తెలుస్తోంది. దీంతో చిక్కులు తలెత్తుతున్నాయి. ప్రధానంగా ఇంటి పేరు, పుట్టిన తేదీల్లో చాలా తేడా ఉండడంతో వీటిని సరి చేయడం ప్రధాన సమస్యగా మారింది. ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు.. పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లించడానికి అపార్ గుర్తింపు సంఖ్య అనివార్యం. అది ఉంటేనే ఫీజు చెల్లించేందుకు వీలు కలుగుతుందని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఈ సంవత్సరం జిల్లాలో పది పరీక్షలు రాసే విద్యార్థులు 1,74,837 మంది ఉన్నారు. 83.84 శాతం అపార్ నమోదు పూర్తయిందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. మిగిలిన వారి పరిస్థితిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఇక జిల్లా వ్యాప్తంగా ఇంటర్ కళాశాలలు 141 ఉండగా, మొత్తం 50,934 మంది విద్యార్థులకు గాను 24,213 మంది మాత్రమే అపార్ నమోదు చేయించుకున్నారు. మిగిలిన 26,721 మంది పిల్లల వివరాలు నమోదు కాకపోవడం గమనార్హం. ఆధార్లో తప్పులతో మందకొడిగా ప్రక్రియ వేల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ కాని వైనం ‘అపార్’ ఉంటేనే పరీక్ష ఫీజు చెల్లింపునకు అవకాశం ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు వంద శాతం పూర్తి చేస్తాం విద్యార్థులకు అపార్ చాలా కీలకం కానుంది. వంద శాతం ఈ ప్రక్రియను పూర్తి చేస్తాం. ఇందుకు సంబంధించి ఎంఈఓలు, అన్ని పాఠశాలల హెడ్మాస్టర్లకు, ఉపాధ్యాయులకు తగిన ఆదేశాలు ఇచ్చాం. – కడప ప్రసాద్బాబు, డీఈఓ సమస్యలను అధిగమిస్తాం ఆధార్ కార్డుల్లోని వివరాలతో పాఠశాలల్లో నమోదైన వివరాలు సరిపోలడం లేదు. అందుకే ఆలస్యమవుతోంది. సమస్యను అధిగమించి త్వరలోనే లక్ష్యం మేరకు అపార్ నమోదును పూర్తి చేయాలని అన్ని కళాశాల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశాం. – కదిరి వెంకటరమణ నాయక్, ఆర్ఐఓ -
మాటలతోనే సరి.. రైతు ఆశలు ఆవిరి
పంట చేతికి వచ్చినా ధరల్లేక అరటి రైతులు దిక్కులు చూస్తున్నారు. కొనేవారు లేక తోటలను అలాగే వదిలేస్తున్న దుస్థితి నెలకొంది. తోటలోనే కాయలు మాగిపోతున్నా పట్టించుకునే వారు లేరు. రూ. లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి సాగు చేసిన పంట కళ్లెదుటే కుళ్లిపోతుండడం చూసి రైతులు నలిగిపోతున్నారు. ‘గిట్టుబాటు ధర కల్పిస్తాం.. ఆదుకుంటాం..’ అంటూ ఆశలు రేకెత్తిస్తున్న పాలకులు, అధికారులు చివరికి ఉత్తచేతులు చూపుతూ నిరాశే మిగులుస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
పింఛన్ కోసం వెళుతూ పరలోకాలకు..
● కారు ఢీకొని మహిళ మృతి ● కుమారుడికి తీవ్ర గాయాలు ముదిగుబ్బ: పింఛన్ తీసుకోవడానికి వేరే గ్రామానికి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో రామలక్ష్మమ్మ (72) అనే మహిళ మృతి చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు... ముదిగుబ్బ మండలం ఈదులపల్లికి చెందిన రామలక్ష్మమ్మ పుట్టినిల్లు ధర్మవరం మండలం బిల్వంపల్లి. గతంలో ఆమె కుటుంబమంతా బిల్వంపల్లిలోనే నివాసం ఉండేది. ఆమెకు వితంతు పింఛన్ ఆ ఊరిలోనే వచ్చేది. తర్వాత కొంతకాలానికి ఈదులపల్లికి తిరిగొచ్చారు. పింఛన్ మాత్రం బిల్వంపల్లిలోనే ఉండిపోయింది. దీంతో ఆమె సోమవారం పింఛన్ తీసుకోవడానికి ఒకరోజు ముందుగానే ఆదివారం కుమారుడు ఓబుళపతితో కలసి ద్విచక్ర వాహనంపై బిల్వంపల్లికి బయలుదేరింది. మార్గమధ్యంలోని రాళ్ల అనంతపురం వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో రామలక్ష్మమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రంగా గాయపడిన ఓబుళపతిని బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా..వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి పింఛన్ ఇచ్చేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు చర్చించుకోవడం కనిపించింది. ప్రశాంతంగా యూపీఎస్సీ పరీక్ష అనంతపురం అర్బన్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో ఏపీఎఫ్సీ, ఈఓ, ఏఓ పోస్టులకు సోమవారం నిర్వహించిన కంబైన్డ్ రిక్రూట్మెంట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అభ్యర్థుల హాజరు 43.70 శాతం నమోదైంది. మొత్తం 1,263 మంది అభ్యర్థులకు గానూ 552 మంది హాజరవ్వగా 711 మంది గైర్హాజరయ్యారు. పరీక్షను డీఆర్ఓ మలోల, యూపీఎస్సీ అసిస్టెంట్ కంట్రోలర్ అనిల్కుమార్ పర్యవేక్షించారు. -
బడి బస్సు భద్రమేనా..?
అనంతపురం సిటీ: ఇటీవల కర్నూలు సమీపంలో రహదారిపైనే కావేరి బస్సు దగ్ధమై పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల బస్సుల కండీషన్లపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థల బస్సులను తనిఖీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా జిల్లాలో రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలకు సంబంధించి 680 వాహనాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో అత్యధిక శాతం వాహనాలకు భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. నర్సరీ నుంచి డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ చదివే విద్యార్థులను తరలించే వాహనాల్లో ప్రమాదం జరిగితే భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నారు.వాహనాల్లో ఫైర్ అలారం, డిటెక్షన్ సిస్టం, అత్యవసర ద్వారాలు, స్పీడ్ గవర్నర్లు, అగ్ని ప్రమాదాలు జరిగితే నివారించే పరికరాలు పని చేయకపోవడం వంటి లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. రంగంలోకి రవాణా శాఖ అధికారులు.. జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు చెందిన వాహనాల కండీషన్లను పరిశీలించేందుకు రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రెండు రోజుల క్రితం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అనంతపురం, తాడిపత్రి, గుంతకల్లు, కళ్యాణదుర్గం రవాణా శాఖ ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో మొత్తం 71 వాహనాలను తనిఖీ చేశారు. అత్యవసర ద్వారం, స్పీడ్ గవర్నర్, అగ్నిమాపక పరికరాలు లేకపోవడం, ఉన్న వాటిలో సక్రమంగా పని చేయకపోవడాన్ని గుర్తించారు. 60 బస్సుల నిర్వాహకులకు నోటీసులు జారీ చేయడం గమనార్హం. మిగిలిన వాహనాలను కూడా తనిఖీ చేయాలని అధికారులు నిర్ణయించారు. నిబంధనలు అతిక్రమించిన వాహనాలను అవసరమైతే సీజ్ చేయనున్నట్లు చెబుతున్నారు. కావేరి బస్సు ఘటన నేపథ్యంలో అధికారుల స్పెషల్ డ్రైవ్ 60 బస్సుల నిర్వాహకులకు నోటీసులు -
సర్వే ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నిక
అనంతపురం అర్బన్: ఏపీ సర్వే ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నికలు ఆదివారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో జరిగాయి. అధ్యక్షుడిగా జి.ప్రభాకర్, ఉపాధ్యక్షుడిగా జి.బ్రహ్మానంద, కార్యదర్శిగా ఇ.నాగరాజు, సంయుక్త కార్యదర్శిగా పి.రవితేజ, కోశాధికారిగా కె.దామోదర్నాయుడు, కార్యనిర్వాహక సభ్యులుగా ఎం.శేఖర్బాబు, ఎన్.సునీల్కుమార్, ఆర్.అయేషాసిద్ధిక్, జి.వన్నూరుస్వామి, డి.ఎర్రిస్వామి, బి.జగన్మోహన్రెడ్డి ఎన్నికయ్యారు. అధ్యక్ష, సంయుక్త కార్యదర్శి పదవులకు పోటీ నెలకొనడంతో ఓటింగ్ నిర్వహించారు. మిగిలిన తొమ్మిది పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఎన్నికల అధికారిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోదండపాణి వ్యవహరించారు. మొరాయిస్తున్న టౖర్బైన్ కూడేరు: పీఏబీఆర్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఈ నెల 22న తలెత్తిన టర్బైన్ సమస్య కొలిక్కి రాలేదు. ఈ నెల 23 నుంచి అధికారులు మరమ్మతులు చేయిస్తున్నా.. సమస్య తీరలేదు. దీంతో నిపుణుల కోసం వేచి ఉండాల్సి వస్తోంది. ఇదే విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి రిజర్వాయర్ అధికారులు తీసుకెళ్లినట్లుగా తెలిసింది. వృద్ధురాలి బలవన్మరణం గుంతకల్లు టౌన్: స్థానిక తిలక్నగర్లో నివాసముంటున్నజి.సుంకన్న భార్య రాములమ్మ(61) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లులోని మెయిన్ రోడ్డులో ఓ లాడ్జి పక్కన సుంకన్న టీ స్టాల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో భార్య రాములమ్మ కొన్నేళ్లుగా డయాబెటిక్, తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతోంది. దీనికి తోడు ఇటీవల మూత్ర విసర్జన సమస్య తీవ్రమైంది. దీంతో జీవితంపై విరక్తి చెందిన రాములమ్మ... ఆదివారం వేకువజామున బాత్రూమ్లోకి వెళ్లి టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్ తాగింది. కాసేపటి తర్వాత బాత్రూం వద్దకెళ్లిన మనవడు.. అపస్మారక స్థితిలో పడి ఉన్న అవ్వను గమనించి సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఉదయం 7.30 గంటల సమయంలో ఆమె మృతిచెందింది. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఏఎస్ఐ మంజుల తెలిపారు. ఆటో బోల్తా .. ఒకరి మృతికూడేరు: ఆటో బోల్తాపడిన ఘటనలో కూడేరు మండలం చోళసముద్రం గ్రామానికి చెందిన పర్వతయ్య(57) మృతిచెందాడు. ఆదివారం రాజప్పకు చెందిన ఆటోలో ఉజ్జనయ్యతో కలసి వెళుతుండగా గ్రామ శివారుకు చేరుకోగానే కొర్రకోడుకు చెందిన అమర్నాథ్ ద్విచక్ర వాహనంపై వెళుతూ అదుపు తప్పి ఆటోను ఢీకొన్నాడు. ఘటనలో ఆటో బోల్తాపడింది. కిందపడిన పర్వతయ్య, రాజప్ప, ఉజ్జనయ్య, అమర్నాథ్ గాయపడ్డారు. స్థానికులు వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. కొద్దిసేపటికి పర్వతయ్య మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగిసిన రాష్ట్ర స్థాయి జూడో పోటీలు ధర్మవరం రూరల్: మండలంలోని చిగిచెర్ల గ్రామంలో రెండు రోజులుగా సాగిన ఎస్జీఎఫ్ అండర్–17, 19 రాష్ట్ర స్థాయి జూడో పోటీలు ఆదివారం ముగిశాయి. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. బాలికల విభాగంలో అనంతపురం క్రీడాకారులు ఓవరాల్ చాంపియన్ షిప్ను దక్కించుకున్నారు. అండర్–19లో బాలుర విభాగంలో చిత్తూరు జిల్లా క్రీడాకారులు విజయం సాధించారు. తృతీయ స్థానంలో నెల్లూరు జిల్లా క్రీడాకారులు నిలిచారు. విజేతలను అభినందిస్తూ పరిటాల శ్రీరామ్, జనసేన నేత మధుసూదన్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ ఓబిరెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. ఉమ్మడి జిల్లా ఉద్యోగుల ఆటవిడుపు అనంతపురం కార్పొరేషన్: శ్రీసత్యసాయి జిల్లా పోలీసు, అనంతపురం జిల్లా రెవెన్యూ జట్లు ఆదివారం అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ ఆడాయి. పోటాపోటీగా సాగిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీసత్యసాయి జిల్లా పోలీసు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసింది. జట్టులో నాగేంద్రప్రసాద్ 31, ప్రభాకర్ 20, ఎస్పీ సతీష్కుమార్ 14, డీఎస్పీ మహేష్ 17 పరుగులు చేశారు. అనంతరం బరిలో దిగిన అనంత రెవెన్యూ జట్టు 17.5 ఓవర్ల వద్ద 95 పరులకు కుప్పకూలింది. జట్టులో రవితేజ 17, కలెక్టర్ ఆనంద్ 9 పరుగులతో నాటౌట్గా నిలిచారు. 35 పరుగుల తేడాతో శ్రీసత్యసాయి జిల్లా పోలీసు జట్టు విజయం సాధించింది. శ్రీసత్యసాయి జిల్లా బౌలర్లలో ఎస్పీ సతీష్కుమార్ 4 వికెట్లు తీసుకుని ఆల్రౌండర్ ప్రతిభను కనబరిచారు. -
అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?
● సంక్షేమ వసతి గృహాల్లో ఏఐ యాప్ వినియోగంపై అనేక సందేహాలు అనంతపురం సిటీ: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో అక్రమాలను గుర్తించేందుకు అమలు చేసిన హాస్టల్ పర్మినెంట్ ట్రాకింగ్ సిస్టం(హెచ్పీటీఎస్) యాప్ ఎంత వరకు సత్ఫలితాలను ఇస్తుందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వసతి గృహాల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. హాస్టళ్లలో కింది స్థాయి సిబ్బందికి అన్ని బాధ్యతలు అప్పగించి వార్డెన్లు వచ్చిపోయే అతిథులుగా మారిపోయారు. దీంతో సిబ్బంది అనేక అక్రమాలకు తెరలేపినట్లుగా ఫిర్యాదులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏఐ యాప్ తీసుకువచ్చారు. జిల్లా వ్యాప్తంగా వెనుకబడిన తరగతులకు సంబంధించి 55 వసతి గృహాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుండగా, ఇందులో 7,700 మంది విద్యార్థులు ఉంటున్నారు. 50 ఎస్సీ హాస్టళ్లలో 5,400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీటన్నింటిలోనూ గత నెల 18 నుంచి యాప్ను అమలుల్లోకి తీసుకువచ్చారు. వార్డెన్లకు అవగాహన కల్పించాం ఏఐ యాప్తో హాస్టళ్లలో అక్రమాలను ఎక్కడికక్కడ గుర్తించి వాటిని సరిదిద్దేందుకు అవకాశం ఉంది. హాస్టళ్లలో రోజు వారీ చేసే పనుల ఫొటోలు ఈ యాప్లో అప్లోడ్ చేయాలి. మెనూ ప్రకారం అల్పాహారం, భోజనాలు, చిరుతిళ్లు, వసతి గృహ ప్రాంగణం, గదులు, మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నారా లేదా అని కూడా ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు వీలుంటుంది. లోపాలు, నిర్లక్ష్యం ఉన్నట్లు తెలిసిన వెంటనే చర్యలు తప్పవు. – కుష్బూ కొఠారి, బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్, అనంతపురం -
రైతాంగం పరిస్థితి అగమ్యగోచరం
బెళుగుప్ప: పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఫలితంగా రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. బెళుగుప్ప మండలం యలగలవంకలో పార్టీ నేతలతో కలసి ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మార్కెట్లో మొక్కజొన్న, కంది, అరటి తదితర పంటలకు సరైన ధరలు లేక రైతులు నష్టపోతున్నారన్నారు. మొక్కజొన్నకు క్వింటా రూ.2400 మద్దతు ధరను ప్రకటించిన ప్రభుత్వం... కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా మోసం చేసిందన్నారు. ఫలితంగా క్వింటా రూ.1,700కు మించి దళారులు కొనుగోలు చేయడం లేదన్నారు. ఇదే తరహాలో కంది, అరటి రైతులు దగా పడ్డారన్నారు. పాలకుల వైఫల్యం కారణంగా వరి, పత్తి రైతులు కూడా నష్టపోతున్నారని తెలిపారు. గత జగన్ ప్రభుత్వంలో ఉచిత పంటల బీమాను లక్షలాది మంది రైతులు సద్వినియోగం చేసుకున్నారని, చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం లేక ప్రస్తుతం 19 లక్షల మంది కూడా పంటల బీమా ప్రీమియంను చెల్లించలేదన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, సబ్సిడీ విత్తన పంపిణీకి చంద్రబాబు సర్కార్ మంగళం పాడిందన్నారు. అధికారం చేపట్టకు ముందు ఒక మాట చేపట్టిన తర్వాత మరో మాట మాట్లాడడం చంద్రబాబుకే చెల్లుతుందన్నారు. ఇప్పటికై నా రైతులను ఆదుకోకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిది సీపీ వీరన్న, జిల్లా ఉపాధ్యక్షుడు శివలింగప్ప, మండల కన్వీనర్ చిన్న మచ్చన్న, యువజన విభాగం మండల ఉపాధ్యక్షుడు సంతోష్రెడ్డి, జిల్లా రైతు విభాగం కార్యదర్శి తిమ్మారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడుసురేష్, సర్పంచ్ మారుతి, నాయకులు శీనప్ప, వెంకటేశులు, పాతన్న, వెంకటేశులురెడ్డి, పూల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆదుకోవడంలో చంద్రబాబు సర్కారు పూర్తిగా విఫలం వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వ -
రాయలసీమకు తీరని అన్యాయం
అనంతపురం కల్చరల్: రాయలసీమ ప్రాంతానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీరని అన్యాయం చేస్తున్నాయని, నిధులు, నీళ్లు రాబట్టుకోవడంలో పాలకులు దారుణంగా విఫలమయ్యారని రచయితలు, ఉద్యమ సంస్థల ప్రతినిధులు ధ్వజమెత్తారు. వేమనా ఫౌండేషన్, రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో అనంతపురం జెడ్పీ సమావేశ మందిరంలో ఆదివారం రాయలసీమ మహాకవి సమ్మేళనం జరిగింది. సీమ వ్యాప్తంగానే కాకుండా చైన్నె, నెల్లూరు, ప్రకాశం, బళ్లారి, హంపీ నుంచి కవులు, రచయితలు విచ్చేసి సీమ ప్రత్యేకతను చాటేలా కవితలు వినిపించారు. ముఖ్యంగా జనప్రియకవి ఏలూరు యంగన్న, ఒంటెద్దు రామలింగారెడ్డి రాగయుక్తంగా ఆలపించిన కవితాగానం, జూటూరు షరీఫ్, రఘురామయ్య, రియాజుద్దీన్, సడ్లపల్లి చిదంబరరెడ్డి, వన్నప్ప, నరిసిరెడ్డి, టీవీరెడ్డి వచన కవితలు అమితంగా ఆకట్టుకున్నాయి. అంతకు ముందు ఏర్పాటు చేసిన సమావేశంలో వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కార గ్రహీతలు డాక్టర్ శాంతినారాయణ, బండి నారాయణస్వామి, జెట్టీ జైరామ్, మాజీ వీసీ కాడా రామకృష్ణారెడ్డి, కవిసమ్మేళనం సమన్వయకర్త డాక్టర్ అప్పిరెడ్డి హరినాథరెడ్డి, తరిమెల అమరనాథరెడ్డి, జిరసం అధ్యక్షుడు కొత్తపల్లి సురేష్ , ఉద్యమ సంస్థల ప్రతినిధులు కృష్ణారెడ్డి తదితరులు మాట్లాడారు. రాజధానిని కర్నూలు నుంచి అమరావతికి తరలించుకుపోతున్నా పాలకులు నిలదీయలేకపోయారని విమర్శించారు. అడుగడుగునా సీమకు జరిగిన అన్యాయాలను ఎండగట్టారు. ప్రజలను సీమ సమస్యలు ప్రతిబింబించే సాహిత్యంతో పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రమణారెడ్డి, రవికుమార్, లోకన్న తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ మహాకవి సమ్మేళనంలో రచయితలు -
పశువైద్యానికి కష్టకాలం
జిల్లాలోని పశు వైద్యశాలల్లో మూగజీవాలకు సరైన వైద్యం అందడం లేదు. డాక్టర్ల కొరత, ఉన్నచోట సరైన సమయానికి విధులకు హాజరు కాకపోవడం, సీజనల్ వ్యాధులకు మందులు లేకపోవడంతో జిల్లాలో పశువులకు వైద్యం కరువైంది. అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పశువైద్యం గాలిలో దీపమైంది. ప్రతి మూడు నెలలకోసారి పశువైద్యశాలలకు అవసరమైన మందులు, వైద్య సామగ్రి సరఫరా చేయాల్సి ఉన్నా.. ఏడాదికి కనీసం రెండు సార్లు కూడా చేయడం లేదు. అదిగో ఇదిగో అంటూ నెలల తరబడి నెట్టుకొస్తున్నారు. డాక్టర్లు, ఏడీలు ఆన్లైన్లో పెడుతున్న ఇండెంట్ చివరకు పత్తా లేకుండా పోతోంది. ఇప్పటికే చాలా ఆసుపత్రుల్లో మందులు లేని పరిస్థితి. ఏదైనా జబ్బు బారిన పడిన పశువులు, జీవాలను పశు వైద్యశాలకు తీసుకెళ్తే డాక్టర్లు పరీక్షించి ప్రైవేట్లో మందులు తీసుకురావాలని చెబుతుండడంతో పెంపకందారులు అవాక్కవుతున్నారు. ప్రబలుతున్న ప్రాణాంతక వ్యాధులు.. పశువైద్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో తమపై అదనపు భారం పెరిగి పోతోందని రైతులు, కాపర్లు వాపోతున్నారు. ఇప్పటికే సీజనల్ వ్యాధులు, అంటు వ్యాధులు, లంపీస్కిన్, అంత్రాక్స్ లాంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలి వైద్యానికి ఇబ్బంది పడుతున్నామంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అత్యవసర మందులు లేక ప్రాథమిక వైద్యానికి కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఆర్ఎస్కేలను పూర్తిగా విస్మరించడంతో గ్రామాల్లో ప్రథమ చికిత్సకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఆర్బీకేల్లో సైతం అత్యవసర మందులు అందుబాటులో పెట్టారని, ఇపుడు ఆర్ఎస్కేల్లో ఎక్కడేగాని కనీసం మందు బిళ్ల కూడా కనిపించడం లేదని పశుపోషకులు అంటున్నారు. తీవ్రంగా మందుల కొరత.. జిల్లా వ్యాప్తంగా పట్టణ, ఏరియా పశువైద్యశాలలు (వెటర్నరీ హాస్పిటల్స్–వీహెచ్లు) 15 ఉండగా, మండల, మేజర్ పంచాయతీ ప్రాంతాల్లో వెటర్నరీ డిస్పెన్సరీలు (వీడీ) స్థాయి ఆసుపత్రులు 56, గ్రామ స్థాయి పశుచికిత్సా కేంద్రాలు (రూరల్ లైవ్స్టాక్ యూనిట్స్–ఆర్ఎల్యూ) 14 ఉన్నాయి. ఇవి కాకుండా 122 గోపాలమిత్ర కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటన్నింటిలోనూ మందుల కొరత తీవ్రంగా నెలకొంది. ప్రథమ చికిత్స చేయడానికి కూడా చాలా ఆస్పత్రుల్లో అత్యవసర మందులు లేవు. గొంతువాపు, చొప్ప వాపు, చిటుకు రోగం, ఆంత్రాక్స్, ఈసుడు రోగం, బొబ్బరోగం, కొక్కెర తెగులు, మశూచి, రేబీస్, పారుడు రోగం, నట్టల మందు, గోట్ఫాక్స్, నీలినాలుక వ్యాధి, గాలికుంటురోగం, ముద్దచర్మవ్యాధి, బాతుపారుడు, బాతు ప్లేగు, జూనోటిక్ సమస్యలు, తదితర ప్రాణాంతక, ప్రమాదకరమైన వ్యాధుల నివారణ టీకాలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేవంటున్నారు. అరకొర సరఫరాతో నెలకొన్న మందుల కొరత ఆర్ఎస్కేల్లో ప్రథమ చికిత్సకూ ఇబ్బంది -
జిల్లాలో కంది, మొక్కజొన్న సాగు చేసిన రైతుల కంట కన్నీరు కనిపిస్తోంది. పంటకు గిట్టుబాటు ధర దక్కక అన్నదాతల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. వరుణుడు భయపెడుతుండడంతో పంటను కాపాడుకోలేక... మార్కెట్లో తక్కువ ధరకు అమ్ముకోలేక అల్లాడిపోతున్నారు. క్రమక్రమంగా అప్పుల ఊబిలోక
రైతులను వెంటాడుతున్న కష్టాలు ● కంది, మొక్కజొన్న పంటలకు దక్కని కనీస మద్దతు ధర ● కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని చంద్రబాబు ప్రభుత్వం ● అన్నదాత కష్టాలు వర్ణనాతీతం కూడేరు మండలం ముద్దలాపురంలో పొలాల్లోనే ఆరబోసిన మొక్కజొన్నలు కళ్యాణదుర్గం/కూడేరు: ఇప్పటివరకూ అరటి రైతు కష్టాలు అందరినీ ఆలోచింపజేశాయి. తాజాగా ఆ జాబితాలో కంది, మొక్కజొన్న రైతులు చేరారు. ఈ ఖరీఫ్లో జిల్లావ్యాప్తంగా కంది 55,296 హెక్టార్లలో సాగులోకి వచ్చింది. ఇటీవల పంటను తొలగించారు. చంద్రబాబు ప్రభుత్వం కంది పంటకు కనీస మద్దతు ధర క్వింటాల్కు రూ.7,550 ప్రకటించినా కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తుండడంతో నష్టపోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ప్రస్తుతం మార్కెట్లో వ్యాపారులు కంది క్వింటాల్ ధర రూ.6,300కు కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. మొక్కజొన్న.. ధర లేదన్నా.. మొక్కజొన్న సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్లో 42 వేల హెక్టార్లలో పంట సాగైంది. ఇతర పంటలతో పోల్చితే తక్కువ పెట్టుబడితో గిట్టుబాటవుతుందన్న ఉద్దేశంతో ఖరీఫ్లో రైతులు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా సాగు చేశారు. మంచి దిగుబడులు వచ్చాయి. పంట చేతికొచ్చి విక్రయించాల్సిన సమయంలో ధర పడిపోయింది. దీంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర క్వింటా రూ.2,400 ప్రకటించినా.. కొనుగోలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఇదే క్రమంలో క్వింటా ధర బహిరంగ మార్కెట్లో కేవలం రూ.1,600–రూ.1,750 పలుకుతుండడంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. బూజు పడుతున్న గింజలు... పొలాల్లోనే మొక్కజొన్న గింజలను రైతులు నిల్వ ఉంచుకున్నారు. ఇటీవల మంచు కురుస్తుండడంతో గింజలు దెబ్బతినకుండా టార్ఫాలిన్ కప్పుతున్నారు. అయితే, వాతావరణంలో మార్పుతో సూర్యరశ్మి అంతంత మాత్రంగానే తగులుతుండడంతో గింజలు బూజు పట్టాయి. కష్టపడి పండించిన పంట దెబ్బతింటుంటే రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
కానరాని ఉషస్సు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యా లయంలో మౌలిక సదుపాయాల కల్పనకు పీఎం ఉష (ప్రధాన మంత్రి– ఉచ్ఛతార్ శిక్షా అభియాన్) కింద రూ.20 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులు ఖర్చుపెట్టలేని నిస్సహాయ స్థితిలో వర్సిటీ ఉన్నతాధికారులు ఉన్నారు. దీంతో నిధులకు చెదలు పట్టడమే కాకుండా వెనక్కి వెళ్లే ప్రమాదం ఏర్పడింది. 2026 మార్చిలోపు నిధులు ఖర్చు చేయకపోతే వెనక్కి వెళ్లడమే కాకుండా మరో దఫా రావాల్సిన రూ.20 కోట్ల నిధులూ రాని పరిస్థితి ఏర్పడనుంది. ఇప్పటి దాకా ఒక్క పనిలో కూడా కనీసం అడుగు కూడా ముందుకు పడకపోవడంతో మార్చి నెలాఖరులోపు దాదాపుగా పూర్తి చేయని దుస్థితి నెలకొంది. సమావేశాలతో సరి.. పీఎం ఉష పథకం కింద పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు అవకాశముంటుంది. న్యాక్ గ్రేడింగ్ను బట్టి నిధులు మంజూరవుతాయి. నాక్ ఏ ప్లస్ గ్రేడ్ ఉంటే రూ.100 కోట్ల నిధులు, న్యాక్–బీ గ్రేడ్ ఉంటే రూ.20 కోట్ల నిధులు అందుతాయి. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి న్యాక్–బీ గ్రేడ్ గుర్తింపు ఉండడంతో రూ.20 కోట్ల నిధులు మంజరయ్యాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వర్సిటీ వీసీగా పనిచేసిన ప్రొఫెసర్ మాచిరెడ్డి రామకృష్ణా రెడ్డి ‘పీఎం– ఉష’కు దరఖాస్తు చేయగానే, నిధులు మంజూరయ్యాయి. అనంతరం అప్పట్లోనే వీసీ ప్రొఫెసర్ కే. హుస్సేన్ రెడ్డి హయాంలో నిధులు వర్సిటీ ఖాతాకు జమయ్యాయి. 2026 మార్చి నెలాఖరులోపు రూ.20 కోట్ల నిధులు ఖర్చు చేయకపోతే వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని తెలిసినా వర్సిటీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. సివిల్ పనులకు సంబంధించి టెండర్లు మాత్రమే ఖరారయ్యాయి. అవి ఎప్పుడు ప్రారంభం అవుతాయో తెలియదు. గడువు సమీపిస్తున్నా తరచూ సమావేశాలు నిర్వహించడం, చర్చించడంతోనే కాలయాపన చేస్తున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వర్సిటీ అభివృద్ధిపై శ్రద్ధేదీ? వర్సిటీలో ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి బ్లాక్గ్రాంట్ నిధులు మినహా నయాపైసా నిధులను చంద్రబాబు ప్రభుత్వం అందించిన పాపాన పోలేదు. నూతన ప్రాజెక్ట్ ఒక్కటీ రాలేదు. అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్క రూపాయి మంజూరు చేయలేదు. వర్సిటీల అభివృద్ధిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టకపోగా.. పీఎం ఉష పథకం కింద గత ప్రభుత్వం హయాంలో అందిన నిధుల ఖర్చుపై దృష్టి పెట్టడంలో నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వర్సిటీ భవిష్యత్తుపై ఉన్నతాధికారులు దృష్టి సారించడంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందాన తయారైంది ఎస్కేయూలో పరిస్థితి! అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని అధికారులు పదేపదే విజ్ఞప్తి చేయడం అందరికీ తెలిసిందే. కానీ, ఎస్కేయూలో మాత్రం అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది. నిధులుండీ ఖర్చు చేయలేని దుస్థితి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్ సీపీ హయాంలో పీఎం ఉష పథకం కింద ఎస్కేయూకు రూ.20 కోట్ల నిధులు 2026 మార్చి నెలాఖరులోపు పనులు పూర్తి చేయాలని లక్ష్యం గడువులోపు నిధులు ఖర్చు చేస్తే.. మరో రూ.20 కోట్లు వచ్చే అవకాశం ఇప్పటిదాకా ప్రారంభం కాని పనులు వర్సిటీ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు -
బోయ ఆనంద్ది ముమ్మాటికీ హత్యే
● హంతకులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అండదండలు ● మాజీ ఎంపీ తలారి రంగయ్య ధ్వజం అనంతపురం: ‘బ్రహ్మసముద్రం మండలం యనకల్లు గ్రామానికి చెందిన బోయ ఆనంద్ది ముమ్మాటికీ పరువు హత్యే. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆటవిక పాలన సాగిస్తూ బీసీ సామాజికవర్గాల వారిపై దమనకాండకు పాల్పడుతున్నారు. హంతకులు సీఎం చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారు కావడం, ఎమ్మెల్యే సురేంద్రబాబు అండదండలు ఉండడంతో పోలీసులు పట్టించుకోవడం లేదు’ అంటూ వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య ధ్వజమెత్తారు. శనివారం బాధిత కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన ఓ యువతి, బోయ ఆనంద్ ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారన్నారు. ఈ విషయం తెలిసిన యువతి తల్లిదండ్రులు గతంలోనే ఆనంద్ తల్లిదండ్రులైన బోయ వెంకటేశులు, వరలక్ష్మిపై పాశవికంగా దాడి చేశారన్నారు. ఈ క్రమంలోనే ఆనంద్ బెంగళూరుకు వెళ్లిపోయి ఉద్యోగంలో చేరాడన్నారు. ఈ నెల 20న మళ్లీ సదరు యువతి ఫోన్ చేసి కళ్యాణదుర్గం రాకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో వెంటనే బయలుదేరి వచ్చాడన్నారు. ఈ క్రమంలో రాయదుర్గం రోడ్డులోని పెట్రోల్ బంకు వెనుక ముళ్ల కంపల్లో బోయ ఆనంద్కు యువతి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు బలవంతంగా గడ్డి మందు తాగించి, చిత్రహింసలకు గురి చేసి హత్య చేశారన్నారు. దీనిపై బ్రహ్మసముద్రం పోలీస్ స్టేషన్తో పాటు కళ్యాణదుర్గం సీఐకి బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. ఆనంద్ను కడతేర్చారనేందుకు తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. పోలీసులు నిష్పాక్షికంగా దర్యాప్తు చేసి నిందితులకు శిక్ష పడేలా చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇంకా ఎంత మంది బలి కావాలి..? కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు,టీడీపీ నాయకుల వేధింపులకు ఎంతో మంది ఎస్సీ, బీసీలు బలవుతున్నారని రంగయ్య పేర్కొన్నారు. టీడీపీలో చేరలేదని వేధించడంతో మర్రిమాకులపల్లికి చెందిన గొల్ల మమత తన బిడ్డను నీళ్ల తొట్టెలో వేసి తనూ ఆత్మహత్య చేసుకుందని వాపోయారు. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన తలారి శ్రావణిని టీడీపీకి చెందిన మున్సిపల్ మాజీ చైర్మన్, మాజీ వైస్ చైర్మన్ పోలీసులతో కుమ్మకై ్క వేధించడంతో బాధితురాలు ఆత్మహత్య చేసుకుందన్నారు. బోరంపల్లి చాకలి రామాంజినేయులు, తలారి రత్నమ్మలూ టీడీపీ నాయకుల బాధితులేనన్నారు. జంబుగుంపలకు చెందిన షాలిని అనే బాలికను టీడీపీ నాయకులు పట్టపగలే చేయి పట్టుకుని అఘాయిత్యం చేసేందుకు యత్నించారని విమర్శించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి.. బోయ ఆనంద్ హత్యతో కుటుంబం దిక్కులేనిదిగా మారిందని రంగయ్య వాపోయారు. తక్షణమే కుటుంబాన్ని ఆదుకోవాలని, కోటి రూపాయల పరిహారంతో పాటు ఆనంద్ సోదరి పూజకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి యర్రంపల్లి కృష్ణమూర్తి, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం రూరల్ కన్వీనర్లు పాలబండ్ల చంద్రశేఖర్ రెడ్డి, గోళ్ల సూరి, కంబదూరు జెడ్పీటీసీ జి. నాగరాజు, మున్సిపల్ విభాగం అధ్యక్షుడు దొడగట్ట మురళి, లీగల్ సెల్ నాయకులు రామాంజినేయులు, ఎనుముల దొడ్డి సర్పంచ్ విజయ్కుమార్, సీనియర్ నాయకులు భాస్కర్, అంకంపల్లి గోపాల్, జానీ తదితరులు పాల్గొన్నారు. -
క్రికెట్ సంఘం ఎన్నికలు ఏకగ్రీవం
● జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా శ్రీనాథ్, యుగంధర్రెడ్డి అనంతపురం కార్పొరేషన్: జిల్లా క్రికెట్ సంఘం ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. శనివారం ఆర్డీటీ ఆడిటోరియంలో క్రికెట్ సంఘం నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి బీఆర్ ఈశ్వర్ ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా సి.శ్రీనాథ్, ఉపాధ్యక్షుడిగా నూర్ మహమ్మద్ ఖాన్, కార్యదర్శిగా యుగంధర్రెడ్డి, సహాయ కార్యదర్శిగా ఎన్ సర్దార్, కోశాధికారిగా జె.మురళీకృష్ణ, కౌన్సిలర్గా హెచ్ అన్సార్ఖాన్ నియమితులయ్యారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో యువకుల ప్రతిభ ఆధారంగానే వివిధ జట్లకు ఎంపిక చేస్తామని చెప్పారు. క్రికెట్ సంఘం అభివృద్ధికి పారదర్శంగా పనిచేయాలని క్రికెట్ సంఘం లైఫ్ టైం మెంబర్ మాంఛోఫెర్రర్ సూచించారు. క్రికెట్ అభివృద్ధికి ఆర్డీటీ మైదానం, సౌకర్యాలను కల్పిస్తుందన్నారు. నూతన సంఘానికి ఆయన అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ మహిళా క్రికెట్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి మచ్చా రామలింగారెడ్డి, క్రికెట్ సంఘం మాజీ ఉపాధ్యక్షుడు నార్పల సత్యనారాయణరెడ్డి, మండల క్రికెట్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు. -
ఆట పాటలతో ఆత్మస్థైర్యం
● అట్టహాసంగా విభిన్న ప్రతిభావంతుల ఆటల పోటీలు అనంతపురం కార్పొరేషన్: ఆటపాటల ద్వారా విభిన్న ప్రతిభావంతుల్లో ఆత్మస్థైర్యం నింపొచ్చని కలెక్టర్ ఆనంద్ అన్నారు. డిసెంబర్ మూడో తేదీన అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (పీటీసీ) మైదానంలో విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఆటల పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. ఇలాంటి పోటీల వల్ల విభిన్న ప్రతిభావంతుల్లో దాగి ఉన్న అసాధారణ ప్రతిభను వెలికి తీయడమే గాక వారిలో ఆత్మస్థైర్యం నింపొచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వాలు అమలు చేసే అన్ని పథకాల్లోనూ వీరికి రావాల్సిన రిజర్వేషన్ తప్పక పాటించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో విభిన్న ప్రతిభావంతుల కోసం ర్యాంప్స్, లిఫ్ట్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపామని తెలిపారు. ప్రతి ఒక్కరూ యూడీఐడీ కార్డును కలిగి ఉండాలని సూచించారు. అనంతరం రన్నింగ్ 100 మీటర్లు, షాట్పుట్, డిస్కస్త్రో, లాంగ్ జంప్, సాఫ్ట్బాల్ ఆటల పోటీలు నిర్వహించగా, 500 మంది విభిన్నప్రతిభాంతులైన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ సత్తా నిరూపించారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ గడుపుటి నారాయణస్వామి, విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకురాలు అర్చన, బీసీ సంక్షేమ శాఖల డీడీ ఖుష్బూ కొఠారి, డీఎస్డీఓ మంజుల, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రతిష్టాత్మకంగా కోటి సంతకాల సేకరణ
అనంతపురం: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ శ్రేణులకు పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన అధ్యక్షతన నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. వివిధ మండలాల పరిశీలకులు, కన్వీనర్లు, ఎంపీపీలు, సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. గ్రామ కమిటీల నియామకం, అనుబంధ కమిటీల ఏర్పాటు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలోనూ కోటి సంతకాల సేకరణ విజయవంతంగా పూర్తి చేయడానికి మండల నేతల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి సీపీ వీరన్న, ఎంపీపీ నారాయణరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తులూరు అశోక్ కుమార్, కరణం భీమరెడ్డి, మండల కన్వీనర్లు రమేష్, మచ్చన్న, సోమశేఖర్ రెడ్డి, ఈడిగ ప్రసాద్, రామచంద్రారెడ్డి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
క్రీడల్లో మేటిగా రాణించాలి
అనంతపురం కార్పొరేషన్: అవకాశాలను సద్వినియోగం చేసుకుని క్రీడల్లో మేటిగా రాణించాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. ఆర్డీటీ స్టేడియంలో జరుగుతున్న డాక్టర్ తాలిమెరాన్ ఏఓ ఆల్ ఇండియా జూనియర్ బాలికల ఫుట్బాల్ టోర్నమెంట్లో భాగంగా కేరళ, గోవా జట్ల మధ్య జరిగిన్ మ్యాచ్లో క్రీడాకారులను కలెక్టర్ పరిచయం చేసుకున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులందరూ క్రీడా స్పూర్తితో ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో పుట్బాల్ అసోసియేషన్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. రేపు కలెక్టర్ దృష్టికి అరటి రైతుల సమస్యలు శింగనమల: నియోజకవర్గంలోని అరటి రైతుల సమస్యలను సోమవారం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ తెలిపారు. అరటి ధరలు పాతాళానికి పడిపోవడంతో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, రైతులను ఆదుకోవాలని మరోసారి కలెక్టర్కు విన్నవించనున్నట్లు పేర్కొన్నారు. శింగనమల నియోజకవర్గంలోని రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లాలో ఇంటర్ చదివి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు వివిధ అంశాల్లో డిసెంబర్ ఒకటి నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సీడాప్ జాబ్స్ జిల్లా కో–ఆర్డినేటర్ శైలజ శనివారం తెలిపారు. 19 నుంచి 26 ఏళ్లలోపు వయస్సు కలిగిన యువతీ యువకులు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా 90 రోజుల ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఎంపికై న వారికి ఉచిత భోజనం, వసతితో పాటు యూనిఫాం ఇవ్వనున్నట్లు వివరించారు. -
28,768
ఉమ్మడి జిల్లాలో గణాంకాలు మందులు తీసుకున్న వారి సంఖ్య16,414● ఉమ్మడి జిల్లాలో విస్తరిస్తున్న హెచ్ఐవీ ● నియంత్రణలో ఆరోగ్య శాఖ వెనుకంజ ● రోగుల పట్ల వివక్ష..చికిత్సలకు నిరాకరణ అనంతపురం మెడికల్: హెచ్ఐవీ మహమ్మారి నియంత్రణ పట్ల ఉమ్మడి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికారులు అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చాపకింద నీరులా హెచ్ఐవీ కేసులు నమోదవడంతో పాటు హెచ్ఐవీతో జీవిస్తున్న వారి పట్ల వివక్ష కొనసాగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. ఇక హెచ్ఐవీ బాధితులకు పూర్తిస్థాయిలో పింఛన్లు మంజూరు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. ఆరోగ్యశాఖ బుకాయింపు ఉమ్మడి జిల్లాలో గత ఐదేళ్లలో 2,283 మంది హెచ్ఐవీ బారిన పడినట్లు ఆరోగ్యశాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఏఆర్టీ సెంటర్లో గడిచిన రెండేళ్లలోనే 1,400కుపైగా కేసులు నమోదయ్యాయి. ఇంకా కదిరి, బత్తలపల్లి ఏఆర్టీ సెంటర్ల పరిధిలో వేల సంఖ్యలో కేసులు రికార్డయ్యాయి. కానీ ఆరోగ్యశాఖాధికారులు హెచ్ఐవీ కేసులను తొక్కిపెడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. వాస్తవంగా అనంతపురం, కదిరి, బత్తలపల్లి ఏఆర్టీ సెంటర్లలో 28,768 మంది హెచ్ఐవీ బాధితులుంటే.. అందులో 16,414 మంది మాత్రమే హెచ్ఐవీకి సంబంధించి మందులు వాడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. కానీ వేల సంఖ్యలో హెచ్ఐవీ బాధితులు మందులను వాడడం లేదు. ఆరోగ్యశాఖ మాత్రం అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో చైతన్యం తీసుకువస్తున్నట్లు ప్రగల్భాలు పలుకుతున్నా.. క్షేత్రస్థాయిలో అటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా హెచ్ఐవీ మందులు వాడని వారిపై దృష్టిసారించి, వారిని మందులు వాడించేలా చర్యలు తీసుకోవడంలో ఉమ్మడి జిల్లా ఆరోగ్యశాఖాధికారులు విఫలమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. మందులు క్రమం తప్పకుండా వాడితేనే హెచ్ఐవీ పాజిటివ్ బాధితుల జీవిత కాలం పెరిగే అవకాశం ఉంది. 511 మంది మృతి ఆరోగ్యశాఖ నివేదికల ప్రకారం హెచ్ఐవీతో జీవిస్తున్న వారు గత ఐదేళ్లలో 511 మంది మృతి చెందారు. వీరిలో క్రమం తప్పకుండా మందులు వాడని వారు చాలా మంది ఉన్నట్లు తెలుస్తోంది. 2021–22లో 130, 2022–23లో 155, 2023–24లో 122, 2024–25లో 81, 2025–26కు సంబంధించి ఇప్పటి వరకు 23 మంది మృతి చెందారు. ఆగని వివక్ష.. ● ఈ ఏడాది జూలై 24న ఓ హెచ్ఐవీ బాధితురాలికి అపెండిసైటిస్ ఆపరేషన్ చేయాల్సి వస్తే వైద్యులు తిరస్కరించారు. చివరకు హెచ్ఐవీ బాధితులు విషయాన్ని అప్పటి ఇన్చార్జ్ కలెక్టర్ శివనారాయణ్ శర్మకు వినవిస్తే.. ఆయన స్పందించడంతో సర్జరీ చేశారు. ● రాయదుర్గానికి చెందిన ఓ యువకుడు, ధర్మవరానికి చెందిన మరో యువకుడు కాలు సమస్యతో అనంతపురం ప్రభుత్వాస్పత్రికి రాగా ఆర్థో వైద్యులు సర్జరీకి తిరస్కరించి తిరుపతికి వెళ్లండని సిఫార్సు చేశారు. కాగా అక్కడికి వెళ్లాక అనంతపురంలోనే చేస్తారని అక్కడి వైద్యులు సెలవిచ్చారు. చివరకు ఇద్దరు యువకులు రూ.3 లక్షలు వెచ్చించి బెంగళూరులో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ● హెచ్ఐవీ బాధితులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం లేదు. జిల్లాలో 18 మంది ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ● ప్రస్తుతం జిల్లాలో ఐదేళ్లుగా 2,366 మందికి మాత్రమే పింఛన్ ఇస్తున్నట్లు ఆరోగ్యశాఖ చెబుతోంది. అర్హులైన వారు ఇంకా వేల సంఖ్యలో పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. హెఐవీతో జీవిస్తున్న వారికి మెరుగైన వైద్య సేవలందిస్తామని పాలకులు, అధికారులు చెబుతున్నా అది మాటలకే పరిమితమవుతోంది. ఏఆర్టీ సెంటర్ల సంఖ్య 3గత ఐదేళ్లలో మరణించిన వారి సంఖ్య511హెచ్ఐవీ బాధితుల సంఖ్య పట్టించుకునే వారే లేరు హెచ్ఐవీతో జీవిస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారే లేరు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పుడు మాత్రం అధికారులు స్పందించడం ఆ తర్వాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారిపోయింది. వేల మందికి పింఛన్ మంజూరు కావాల్సి ఉంది. గత ప్రభుత్వంలో కొత్త పింఛన్లు ఇచ్చారు. – రామాంజినేయులు, అనంత నెట్వర్క్ ఆఫ్ పాజిటివ్స్ నియంత్రణకు కృషి హెచ్ఐవీ నియంత్రణకు కృషి చేస్తాం. క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. బాధితులకు జరగాల్సిన శస్త్రచికిత్సల జాప్యంపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. హెచ్ఐవీ రోగులకు మెరుగైన సేవలందించేలా చూస్తాం. – డాక్టర్ భ్రమరాంబదేవి, డీఎంహెచ్ఓ -
పంచాయతీ స్థలం కబ్జాకు యత్నం
ఉరవకొండ: ప్రజోపయోగం కోసం కేటాయించిన స్థలాలపై కొంతమంది పచ్చనేతల కన్ను పడింది. ఉరవకొండలో గ్రామపంచాయతీ స్థలం ఎక్కడ ఖాళీ ఉందంటే అక్కడ గద్దల్లా వాలిపోతున్నారు. లక్ష్మీనృసింహస్వామి కాలనీలోని సర్వే నంబర్ 604లో రూ.80 లక్షలు విలువ చేసే 30 సెంట్ల స్థలం ఉంది. ఇందులో 3 సెంట్ల స్థలాన్ని పీర్లచావిడికి పంచాయతీ వారు కేటాయించారు. ఇంకా 27 సెంట్ల స్థలం ప్రజాప్రయోజనాల కోసం అలాగే ఉంచారు. ఈ విలువైన స్థలంపై కొంతమంది టీడీపీ నేతల కన్ను పడింది. రెవెన్యూ అధికారులతో ములాఖత్ అయి 2017లో మంజూరు చేసినట్లు నకలీ పట్టాలు సృష్టించుకున్నారు. ఇందులో టీడీపీ కుటుంబ సభ్యులు, వారి బంధువుల పేరు మీద రెండు సెంట్ల స్థలం మంజూరైనట్లు పట్టాల్లో కనబరిచారు. దీంతో రెండు రోజులుగా సదరు స్థలం వద్దకెళ్లి హద్దులు వేసేందుకు సిద్ధమయ్యారు. గమనించిన కాలనీవాసులు అడ్డగించి.. ప్రజోపయోగం కోసం కేటాయించిన స్థలాన్ని మీరెలా ఆక్రమిస్తారంటూ నిలదీశారు. ‘మమ్మల్నే నిలదీస్తారా’ అంటూ అధికార పార్టీ నాయకులు కాలనీవాసులపై దాడికి యత్నించారు. అంతటితో ఆగక వీరే ముందుగా పోలీస్ స్టేషన్కు చేరుకుని తమపై కాలనీవాసులు దౌర్జన్యం చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు టీడీపీ నేతలకు కేటాయించిన పట్టాలపై రెవెన్యూ అధికారులతో విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ స్థలంలో కొంతమంది రెవెన్యూ సిబ్బంది కుడా వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద పట్టాలు రాయించుకున్నట్లు విశ్వసనీయసమాచారం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజోపయోగ కార్యాల కోసం కేటాయించిన స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తే తాము అడ్డుకుని తీరుతామని కాలనీవాసులు స్పష్టం చేశారు. పంచాయతీ కార్యదర్శి గౌస్సాహెబ్ స్పందిస్తూ విచారణ జరిపి పంచాయతీ స్థలం అయితే దాన్ని ఆక్రమణకు గురికాకుండా చూస్తామని తెలిపారు. ప్రజోపయోగ స్థలానికి నకిలీ పట్టాలు స్థలంలోకి వెళ్లిన వారిని అడ్డుకున్న ప్రజలు కాలనీవాసులపై దాడికి యత్నించిన ‘తమ్ముళ్లు’ -
బాలికలు అన్ని రంగాల్లో విజయం సాధించాలి
గార్లదిన్నె: బాలికలు అన్ని రంగాల్లో విజయం సాధించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ అరుణకుమారి పిలుపునిచ్చారు. శనివారం మండల గార్లదిన్నెలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలికల రక్షణ, విద్య, చట్టాలు, బాలికలకు ఉన్న అవకాశాలుపై శిక్షణ నిర్వహించారు. ప్రాజెక్టు డైరెక్టర్ అరుణకుమారి మాట్లాడుతూ బాలికలకు భరోసా ఇవ్వగలిగితే వారు ఎంతటి క్లిష్టమైన లక్ష్యాన్నైనా సునాయాసంగా చేరుకోగలరని, జీవితంలో స్థిరపడగలరని అన్నారు. బాలికల్లో ప్రతిభను వెలికి తీయడానికి పాటల పోటీలు, డ్రాయింగ్ వకృత్వ పోటీలు నిర్వహించి, సర్టిఫికెట్లు అందజేస్తున్నామన్నారు. బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్ఐ సురేంద్రబాబు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శైలజ, చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా సమన్వయకర్త కృష్ణమాచారి, ఎంపీడీఓ యోగానందరెడ్డి, ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రీవాణి, నిర్మల, కేజీబీవీ ఎస్ఓ నాగసత్య, తదితరులు పాల్గొన్నారు. -
హెచ్ఐవీ నియంత్రణకు పటిష్ట చర్యలు
అనంతపురం మెడికల్: హెచ్ఐవీ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి తెలిపారు. శనివారం ఆమె తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్లలో హెచ్ఐవీ తగ్గుముఖం పట్టిందని చెప్పారు. ఈ ఏడాదిలో 26,516 మంది గర్భిణులకు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తే అందులో 20 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. ఇక సాధారణ ప్రజలు 58,501 మందికి పరీక్షలు చేయగా 264 మందికి హెచ్ఐవీ నిర్ధారణ అయ్యిందన్నారు. క్షేత్రస్థాయిలో హెచ్ఐవీని అరికట్టడానికి విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ దినం డిసెంబర్ ఒకటో తేదీన అనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్ట్స్ కళాశాల నుంచి టవర్క్లాక్ మీదుగా సప్తగిరి సర్కిల్ వరకు చేపట్టే ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు క్యాండిల్ లైట్ ర్యాలీ ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ జయలక్ష్మి, ఎయిడ్స్ విభాగం ప్రోగ్రాం మేనేజర్ వెంకటరత్నం, రమణ, డెమో నాగరాజు, ఎస్ఈఈఓ త్యాగరాజు, డిప్యూటీ హెచ్డీఓ గంగాధర్ పాల్గొన్నారు. -
కేశవా.. విద్యార్థుల ఇక్కట్లు కానవా!
కూడేరు: ఉరవకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు విద్యార్థుల సమస్యలు పట్టడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు కావొస్తున్నా.. బడి పిల్లలు ఇంకా మండుటెండలోనే పాఠాలు వల్లె వేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇందుకు నిదర్శనమే కూడేరు మండలం ఉదిరిపికొండ తండాలోని ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు 64 మంది విద్యార్థులున్నారు. ఐదుగురు ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అయితే తరగతి గదులు కేవలం మూడే ఉన్నాయి. దీంతో 2, 4వ తరగతులను ఆరు బయట నిర్వహించాల్సి వస్తోంది. ఇప్పటికైనా మంత్రి కేశవ్ స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. -
వైఎస్సార్ నాయకుడికి వేధింపులు
● నోటీసులు ఇస్తామని రప్పించి అరెస్టు చేసిన వైనం అనంతపురం సెంట్రల్: చంద్రబాబు ప్రభుత్వంలో అమలవుతున్న రెడ్బుక్ రాజ్యాంగంలో అరాచకాలు తారస్థాయికి చేరాయి. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రశ్నించే గొంతు కలను అణచివేసేందుకు ‘పచ్చ’ నేతలు యత్నిస్తున్నారు. తాజాగా అనంతపురంలో మూడో డివిజన్ కార్పొరేటర్ అంకే కుమారమ్మ భర్త, వైఎస్సార్సీపీ నాయకుడు బోయ కృష్ణమూర్తిని వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేయడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. గొడవ కేసులో కేవలం నోటీసులు ఇస్తామని పిలిపించి అదుపులోకి తీసుకోవడంపై పలువురు మండిపడుతున్నారు. ఈ నెల 21న మూడో డివిజన్ లో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ సీపీ నాయకులు పర్యటిస్తుండగా టీడీపీ నాయకుడు గోపాల్ కవ్వింపు చర్యలకు పాల్పడడమే కాకుండా ఘర్షణకు దిగాడు. నగరపాలక సంస్థ శానిటేషన్ వర్కర్ కదిరప్పపై దాడికి పాల్పడ్డాడు. ఈ విషయంపై ఇరువర్గాల ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం కేసులో నోటీసులు ఇవ్వాల్సి ఉందంటూ వైఎస్సార్సీపీ నాయకుడు కృష్ణమూర్తిని పోలీసుస్టేషన్కు పిలిపించారు. అక్కడికి వెళ్లిన తర్వాత అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పి కోర్టులో హాజరుపరచి రిమాండ్కు తరలించడం గమనార్హం. పోలీసుల తీరును వైఎస్సార్సీపీ నాయకులు ఖండించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఒత్తిళ్ల మేరకే కృష్ణమూర్తిని అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. -
ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి
గోరంట్ల: కేంద్రీయ విద్యాలయ సంఘటన్లో బోధన, బోధనేతర ఉద్యోగ నియామకాలకు అర్హులైన అభ్యర్థులు డిసెంబరు 4లోపు దరఖాస్తు చేస్తుకోవాలని పాలసముద్రంలోని నాసిన్ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ బట్న కృష్ణారావు కోరారు. కేంద్రీయ విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 6,191 ఉద్యోగాలకు సీబీఎస్ఈ దరఖాస్తులు ఆహ్వానిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేవీఎస్ పాటు ఎన్వీఎస్లో కూడా నియామకాలు చేపడుతున్నాయన్నారు. ఉసురు తీసిన మద్యం మత్తు బ్రహ్మసముద్రం : మద్యం మత్తు ఆ యువకుడి ఉసురుతీసింది. ఎరడికెర గ్రామానికి చెందిన బోయ రవి (28), గౌరమ్మ దంపతులు. వీరికి కుమారుడు గౌతమ్నంద, కూతుళ్లు విష్ణుప్రియ, బేబీ ఉన్నారు. కూలి పనులకెళ్లి కుటుంబాన్ని పోషించుకునేవారు. అయితే రవి ఇటీవల మద్యానికి అలవాటుపడ్డాడు. విపరీతంగా తాగేవాడు. ఈ క్రమంలో కూలి పనులకు కూడా వెళ్లడం మానేశాడు. శనివారం ఉదయం పూటుగా మద్యం తాగాడు. తర్వాత ఏమైందో తెలీదు మత్తులోనే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నీటిలో కొట్టుకొచ్చిన శవం వజ్రకరూరు: రాగులపాడు సమీపంలోని హంద్రీ–నీవాసుజల స్రవంతి ఎత్తిపోతల పథకం వద్దకు శనివారం గుర్తుతెలియని శవం కొట్టుకువచ్చింది. అక్కడి సిబ్బంది గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ నాగస్వామి తన సిబ్బందితో అక్కడకు చేరుకుని కాలువలో కొట్టుకువచ్చిన శవాన్ని బయటకు తీయించారు. మృతుని వయసు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉంటుందని ఎస్ఐ పేర్కొన్నారు. చేతిపై పి.సునిత అని పచ్చబొట్టు ఉన్నట్లు గుర్తించారు. గుర్తు పట్టిన వారు వెంటనే 94409 01867, 94407 96856, 94901 08514, 94407 96828 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. విజయలక్ష్మి మృతిపై వీడని మిస్టరీ గుత్తి: గుత్తి ఆర్ఎస్కు చెందిన విజయలక్ష్మి మృతి మిస్టరీ వీడలేదు. ఆర్ఎస్కు చెందిన రామాంజనేయులురెడ్డి భార్య మృతి చెందడంతో విజయలక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. ఈమె ఈ నెల 26న ఇంటి నుంచి తోటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే విజయలక్ష్మి వైటీ చెరువు గ్రామంలోని చెరువులో శవమై తేలింది. ఎవరైనా హత్య చేసి చెరువులో పడేశారా? లేక ఆత్మహత్య చేసుకుందా అన్నది తెలియడం లేదు. ఆస్తి కోసం మొదటి భార్య పిల్లలే తమ తల్లిని చంపి ఉంటారని విజయలక్ష్మి పిల్లలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీలకు హర్షవర్దన్ ఆత్మకూరు: జాతీయస్థాయి ఫుట్బాల్ పోటీబాల్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టులో ఆత్మకూరు క్రీడాకారునికి చోటు లభించింది. మూడు నెలల క్రితం విజయవాడలో నిర్వహించిన రాష్ట్రస్ధాయి పోటీల్లో ఆత్మకూరుకు చెందిన భానుకోట వీర హర్షసాయివర్దన్ సత్తా చాటాడు. దీంతో అతడిని త్వరలో జరిగే సంతోష్ ట్రోఫీ జాతీయస్థాయి ఫుట్బాల్ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే ఆంధ్రప్రదేశ్ జట్టుకు ఎంపిక చేస్తూ ఫుట్బాల్ అసోసియేషన్ నుంచి శుక్రవారం లేఖ పంపారు. హర్షవర్దన్ చైన్నెలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచే క్రీడలపై మక్కువ.. : ఆత్మకూరుకు చెందిన భానుకోట వీర హర్షసాయివర్దన్ చిన్నప్పటి నుంచే క్రీడలపై మక్కువ పెంచుకున్నాడు. ముఖ్యంగా ఫుట్బాల్ క్రీడలో జిల్లాస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు చాలాసార్లు ఆడి ప్రతిభ కనబరిచాడు. చదువు, క్రీడలతో పాటు ఖాళీ సమయాల్లో తన తండ్రి భానుకోట బాలపోతన్నకు వ్యవసాయ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నాడు. జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల హర్షవర్దన్ సంతోషం వ్యక్తం చేశాడు. హ్యాండ్బాల్ పోటీలకు సెలెక్షన్స్ రేపు అనంతపురం కార్పొరేషన్: ఎల్ఆర్జీ స్కూల్లో సోమవారం ఉదయం 9 గంటలకు జిల్లాస్థాయి సీనియర్ హ్యాండ్ బాల్ పోటీలకు క్రీడాకారుల సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు హ్యాండ్బాల్ కార్యదర్శి సాకే శివశంకర్ తెలిపారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
రాయదుర్గం టౌన్: అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి, రూ.3.50 లక్షల విలువైన ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు రాయదుర్గం అర్బన్ పీఎస్ సీఐ జయనాయక్ తెలిపారు. వివరాలను శుక్రవారం సాయంత్రం ఆయన వెల్లడించారు. బొమ్మనహాళ్కు చెందిన డి.నాగరాజు వ్యసనాలకు బానిసగా మారి ద్విచక్రవాహనాల దొంగతనాలకు తెరలేపాడు. రాయదుర్గం నియోజకవర్గంలోని పలు గ్రామాలు, కర్ణాటకలోని బళ్లారిలోనూ ద్విచక్ర వాహనాలు అపహరించాడు. ఆయా ఘటనల్లో కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా ఆధారాలతో శుక్రవారం రాయదుర్గంలోని శాంతినగర్ శ్మశాన వాటిక వద్ద నాగరాజును అరెస్ట్ చేసి ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. రైతు వ్యతిరేక విధానాలపై పోరుబాట ● సీపీఐ రాష్ట్ర నాయకుడు జగదీష్ గుంతకల్లు: చంద్రబాబు ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై అన్నదాతలను, ప్రజలను చైతన్య పరిచి, అందరినీ కలుపుకుని పోరాటానికి శ్రీకారం చుడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు డి.జగదీష్ తెలిపారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అప్పులు చేసి పంటలు సాగు చేసిన రైతులు చంద్రబాబు ప్రభుత్వ విధానాల కారణంగా నష్టాల పాలవుతున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో కొద్దో.. గొప్పో చేతికి వచ్చిన పంటలకు గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆరటి టన్నుకు రూ.1,500 ధర పలకడంతో కూలీ ఖర్చులు కూడా గిట్టుబాటు కాని పరిస్థితుల్లో డోజర్లను పెట్టి రైతు తోటలను దున్నేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ఈ ప్రభుత్వంలో చలనం రాలేదని మండిపడ్డారు. కార్పొరేట్, ప్రైవేటీకరణ జపం చేస్తూ వేలాది ఎకరాల భూములను ధారాదత్తం చేస్తున్నారని, ఇప్పటి వరకూ ఓ పరిశ్రమ తెచ్చింది లేదని విమర్శించారు. గతంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన చంద్రబాబు.. నేడు బలవంతంగా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయిస్తుండడం సిగ్గుచేటన్నారు. అన్నదాతలను పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం చివరకు రైతుల ఊసురు తగిలి కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. సమావేశంలో సీపీఐ నాయకులు బి.గోవిందు, మహేష్, తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలత కల్పించండి
అనంతపురం అర్బన్: జిల్లాలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ.. ఏపీఐఐసీ పారిశ్రామికవాడల్లో ఇప్పటికీ ఉత్పత్తి ప్రారంభించని యూనిట్లను గురించి ఆరా తీశారు. వాటిలో ఉత్పత్తి మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని జోనల్ మేనేజర్ను ఆదేశించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా అనుమతులు మంజూరు చేయాలన్నారు. పరిశ్రమల స్థాపనకు ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి విరివిగా రుణాలు మంజూరు చేయాలని సూచించారు. అనంతరం పారిశ్రామికాభివృద్ధి పాలసీ కింద రెండు యూనిట్లకు విద్యుత్ రాయితీ రూ.3.84 లక్షలు, వడ్డీ రాయితీ కింద నాలుగు యూనిట్లకు రూ.4.68 లక్షలు, పెట్టుబడి రాయితీ కింద 11 యూనిట్లకు రూ.3.88 కోట్లు సబ్సిడీ మంజూరుకు ఆమోదం తెలిపారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. భూముల సమస్యలు పరిష్కరించాలి జాతీయ రహదారి 544డీ నిర్మాణంలో తలెత్తిన భూ సమస్యలను త్వరిగతగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ ప్రాజెక్టులు నిర్ధేశించిన సమయంలో పూర్తికావాలంటే అందుకు తగ్గట్టుగా పనులు జరగాలన్నారు. ఎన్హెచ్ 544డీకి సంబంధించి తాడిపత్రి అర్బన్, బుగ్గ, బోడిగానిదొడ్డి, ముచ్చుకోట, కొండాపురం, ఎర్రగుంటపల్లి తదితర గ్రామాల పరిధిలో పెండింగ్లో ఉన్న భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ కేశవనాయుడు, నేషనల్ హైవే పీడీ తరుణ్కుమార్, మేనేజర్ మురళీకృష్ణ, కలెక్టరేట్ భూ విభాగం సూపరింటెండెంట్ రియాజుద్దీన్, డీటీ శ్రీనివాసులు పాల్గొన్నారు. సమాజంలో లింగ వివక్ష తగదు అనంతపురం టౌన్: సమాజంలో లింగ వివక్ష తగదని కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు. లింగ వివక్షపై కలెక్టర్ కార్యాలయంలో డీఆర్డీఏ అధికారులతో కలిసి పోస్టర్లను శుక్రవారం కలెక్టర్ విడుదల చేసి, మాట్లాడారు. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారన్నారు. లింగ వివక్షతపై చేపట్టే ర్యాలీల్లో అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. డీఆర్డీఏ పీడీ శైలజ మాట్లాడుతూ.. శనివారం నుంచి డిసెంబర్ 23వ తేదీ వరకు మహిళలపై చూపుతున్న వివక్షత, బాల్య వివాహాలు, మహిళా సాధికారతపై జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీడీ రాధారాణి, డీపీఎం రవీంద్రబాబు, ఏపీఎంలు భాస్కర్నాయుడు, శివప్రసాద్, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సుశీలమ్మ పాల్గొన్నారు. మెగా పీటీఎం విజయవంతం చేయాలి అనంతపురం సిటీ: మెగా పేరెంట్ మీటింగ్ (మెగా పీటీఎం 3.0)లను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆవరణలోని రెవెన్యూ భవన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఈఓ ప్రసాద్బాబు, ఆర్ఐఓ వెంకటరమణనాయక్, సమగ్రశిక్ష ఏపీసీ శైలజ పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,752 పాఠశాలలు, కళాశాలల్లో పీటీఎం సమావేశాలు నిర్వహించనున్నట్లు వివరించారు. మొత్తం 2,15,504 మంది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొంటారని వివరించారు. కార్యక్రమానికి అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను ఆదేశించినట్లు తెలిపారు. పిల్లల ప్రగతి, వారి నడవడిక, మాట తీరు, సాధించిన మార్కులు వంటి అన్ని అంశాలపై సమగ్రంగా చర్చిస్తారన్నారు. డొక్కా సీతమ్మ భోజన కార్యక్రమంలో భాగంగా సహపంక్తి భోజనాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అనంతరం విద్యార్థులకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు అందజేయనున్నట్లు తెలిపారు. -
చంద్రకళకు వైఎస్సార్సీపీ ఎన్నారై నేతల చేయూత
కళ్యాణదుర్గం రూరల్: టీడీపీ నేతల వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసిన వడ్డే కాలనీకి చెందిన వివాహిత చంద్రకళకు వైఎస్సార్సీపీ ఎన్నారై విభాగం నాయకులు అండగా నిలిచారు. చంద్రకళ కుటుంబానికి అండగా ఉంటామని గతంలో ఇచ్చిన హామీ మేరకు కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య ప్రత్యేక చొరవ తీసుకుని, విషయాన్ని పార్టీ ఎన్నారై విభాగం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎన్నారైలు ఆమె వైద్య ఖర్చుల కోసమని రూ.2.20 లక్షలను శుక్రవారం అందజేశారు. భవిష్యత్తులో బాధితురాలికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా రంగయ్య మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నేతల దౌర్జన్యాలపై ధ్వజమెత్తారు. చంద్రకళ విషయం తెలియగానే ఆస్ట్రేలియాలో స్థిరపడిన యశ్వంత్రెడ్డి, దీపక్రెడ్డి, వారి స్నేహితులు తక్షణమే స్పందించి ఆర్థిక సాయం అందజేయడం అభినందనీయమన్నారు. ఇందుకు సహరించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి, పార్టీ ఎన్నారై స్టేట్ కోర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్నారైలు జస్వంత్రెడ్డి, దీపక్రెడ్డి, పార్టీ నియోజవర్గ పరశీలకుడు మహేంద్రరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షుడు గంగాధరప్ప, మండల కన్వీనర్లు సుధీర్, గోళ్ల సూరి, ఎంఎస్రాజు, హనుమంతరాయుడు, చంద్రశేఖర్రెడ్డి, కౌన్సిలర్లు లక్షన్న, పరమేశ్వరప్ప, జెడ్పీటీసీ గుద్దెళ్ల నాగరాజు, ఎంపీపీ చంద్రశేఖర్రెడ్డి, జేసీఎస్ కన్వీనర్ అంజి, తిమ్మరాయుడు, దొడగట్ట మురళి, చరణ్, రామాంజనేయులు, టైలర్ శీన, భీమేష్, పాతలింగ, మల్లాపురం మల్లి, బసవరాజు, గునపల్లి నాగరాజు, అనిల్, తదితరులు పాల్గొన్నారు. -
చెంతనే నీరు..
పుట్లూరు: సుబ్బరాయసాగర్ నుంచి చెరువులకు నీటి సరఫరా విషయంలో చోటు చేసుకున్న జాప్యం కారణంగా పుట్లూరు మండలంలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. ఈ నెల 13న సుబ్బరాయసాగర్ నుంచి పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతపల్లి చెరువులకు నీటిని విడుదల చేశారు. అయితే అప్పట్లో కేవలం మూడు అడుగుల మేర మాత్రమే క్రస్ట్ గేట్లను ఎత్తడంతో విడుదలైన నీరు చెరువులకు అందకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో గేట్లను మరింత పైకి ఎత్తడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. భారీ క్రేన్లను రంగంలో దించినా గేట్లు ఒక్క ఇంచు కూడా పైకి లేవలేదు. దీంతో కర్ణాటకలోని శివమొగ్గ నుంచి ఇంజినీరింగ్ నిపుణులను రప్పించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పుట్లూరు మండలంలోని మూడు చెరువులకు నీటి సరఫరాపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఉపశమన చర్యలకు తిలోదకాలు గ్రామీణుల నీటి కష్టాలను చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా పుట్లూరు, కోమటికుంట్ల, గరుగుచింతపల్లి గ్రామాల్లోని చెరువులు పూర్తిగా ఒట్టిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో చెరువులకు నీటితో నింపాలంటే సుబ్బరాయసాగర్ ప్రాజెక్ట్ కస్ట్గేట్లు ఎత్తడం తప్ప మరో మార్గం లేదు. అయితే ప్రభుత్వం ఆ దిశగా ఉపశమన చర్యలు చేపట్టలేకపోయింది. దీంతో పరిస్థితి మరింత దిగజారింది. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న’ చందంగా మారింది అధికారుల తీరు కూడా. నీటి సమస్య జఠిలమవుతుండడంతో ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేందుకు సిద్ధమయ్యారు. అయితే గేట్ల నిర్వహణను నిర్లక్ష్యం చేసిన కారణంగా అవి పైకి లేయడానికి మొరాయిస్తున్నాయి. అరకొరగా లేచిన గేట్ల నుంచి విడుదలైన నీటిని 29వ డిస్ట్రిబ్యూటరీ ద్వారా బొప్పేపల్లి చెరువు వైపుగా మళ్లించారు. తాగు, సాగు నీటి కష్టాలతో పుట్లూరు మండల వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సమీపంలోనే సుబ్బరాయ సాగర్ ప్రాజెక్ట్ ఉన్నా... నీటి కష్టాలు తప్పడం లేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పటికే చెరువులన్నీ ఒట్టి పోయాయి. భూగర్భ జలాల జాడ లేకుండా పోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే దాహం కేకలు మిన్నంటక తప్పదు. పైకి లేవనంటున్న సుబ్బరాయసాగర్ ప్రాజెక్ట్ క్రస్ట్గేట్లు ఒట్టి పోయిన చెరువులు అడుగంటిన భూగర్భజలాలు -
గుత్తిలో అదృశ్యమై.. వైటీ చెరువులో శవమై!
గుత్తి: రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన మహిళ.. చెరువులో మృతదేహమై లభ్యమైంది. పోలీసులు తెలిపిన మేరకు... గుత్తి ఆర్ఎస్లో నివాసముంటున్న విజయలక్ష్మి ఈ నెల 26న తన తోటకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఘటనపై ఆమె కుమారుడు లక్ష్మీకాంతరెడ్డి ఫిర్యాదు మేరకు గురువారం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. తోట సమీపంలో రక్తపు మరకలను గుర్తించారు. ఈ క్రమంలో గుంతకల్లు మండలం వైటీ చెరువులో మహిళ మృతదేహం ఉన్నట్లుగా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. లక్ష్మీకాంతరెడ్డిని అక్కడకు పిలిపించి మృతదేహాన్ని చూపడంతో తన తల్లి విజయలక్ష్మిగా ధ్రువీకరించాడు. అయితే ఇది ఆత్మహత్యనా? హత్యనా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పేకాట ఆడుతూ పట్టుబడిన టీడీపీ నేతలు బ్రహ్మసముద్రం: మండలంలోని సంతేకొండాపురం సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అందిన సమాచారంతో శుక్రవారం సాయంత్రం గ్రామ శివారున పోలీసులు తనిఖీలు చేపట్టారు. చెరువులో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని రూ.13 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఐటీడీపీ కో–ఆర్డినేటర్ తిమ్మరాజు, టీడీపీ నాయకులు ధనుంజయ, తాయప్ప, లింగరాజు, బీఆర్ తిప్పేస్వామి ఉన్నారు. కాగా, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసుల తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. వ్యక్తి దుర్మరణం పెద్దపప్పూరు: తాడిపత్రిలోని బిందెల కాలనీకి చెందిన మాలపాటి కృష్ణారెడ్డి (40) శుక్రవారం అనంతపురానికి ద్విచక్రవాహనంపై వెళుతూ పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట కనుమలో అదుపు తప్పి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోతూ ప్రమాదం చోటు చేసుకుందా? లేక అనంతపురం నుంచి ఎదురుగా వస్తున్న వాహనం ఢీకొనడంతో మృతి చెందాడా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. మృతుడి తల్లి జయమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
వివాహిత ఆత్మహత్య
ఆత్మకూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మకూరుకు చెందిన వివాహిత నందిని (35) ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. కళ్యాణదుర్గం మండలం మంగళకుంట గ్రామానికి చెందిన నందినికి 18 ఏళ్ల క్రితం ఆత్మకూరు గ్రామానికి చెందిన నాగేంద్రతో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. చిన్నపాటి వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇటీవల భర్త మద్యానికి బానిస కావడంతో తాగుడు మానేయాలని భార్య పలుమార్లు ప్రాధేయపడింది. అయినా అతనిలో మార్పు రాలేదు. తాగుడు విషయంగానే గురువారం దంపతుల మధ్య గొడవ చోటు చేసుకుంది. అనంతరం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నందిని ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మృతురాలి తండ్రి బండి రామాంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాల నేపథ్యంలో... గుత్తి: స్థానిక రైల్వే ఇన్స్టిట్యూట్ సమీపంలోని రైల్వే క్వార్టర్స్లో నివాసముంటున్న అసిస్టెంట్ లోకో పైలెట్ రాహుల్ కుమార్ భార్య జ్యోతి(23) ఆత్మహత్య చేసుకుంది. ఉత్తరప్రదేశ్కు చెందిన రాహుల్ కుమార్ మూడేళ్లగా గుత్తి ఆర్ఎస్లో నివాసముంటున్నాడు. రెండు రోజుల డ్యూటీకి వెళ్లిన ఆయన శుక్రవారం ఉదయం ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే ఉరికి విగతజీవిగా వేలాడుతున్న భార్యను గమనించి ప్రాణముందనే ఆశతో కిందకు దించాడు. అయితే అప్పటికే జ్యోతి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆమె మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమై ఉంటాయని పోలీసులు పేర్కొన్నారు. -
అరటి రైతు నష్టపోకుండా చూడండి
అనంతపురం అర్బన్: ‘‘అరటి రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. ధర తగ్గకుండా చర్యలు తీసుకోండి’’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఉద్యానాధికారి డి.ఉమాదేవితో కలిసి అరటి వ్యాపారులు, ఎగుమతిదారులు, ఉద్యాన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అరటిపంట నాణ్యత పెంచడం ద్వారా ఎగుమతులు పెరిగే అవకాశం ఉందన్నారు. ఫ్రూట్ కేర్ యాక్టివిటీపై ఉద్యానశాఖ ద్వారా శిక్షణ ఇవ్వాలని చెప్పారు. కోల్డ్ స్టోరేజ్ యూనిట్ల ఏర్పాటుకు కంపెనీలు ముందుకు రావాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు విధుల్ని నిర్లక్ష్యం చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. కలెక్టర్ శుక్రవారం రెవెన్యూభవన్లో ఐసీడీఎస్ పీడీ అరుణకుమారితో కలిసి మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యకలాపాలపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఖాళీగా ఉన్న 37 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు, 81 సహాయకుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సప్లిమెంటరీ న్యూట్రీషన్ ప్రోగ్రాం కింద కోడిగుడ్లు సకాలంలో సరఫరా చేయాలన్నారు. తక్కువ బరువున్న పిల్లలను ఎన్ఆర్సీలో చేర్పించాలని చెప్పారు. ఐదేళ్లలోపు వారికి సంబంధించి తీవ్రంగా కుంగిపోయిన పిల్లలు ఆగస్టులో 4,650 మంది, సెప్టెంబరులో 4,934 మంది, అక్టోబరులో 2,531 మంది ఉన్నారన్నారు. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రీ స్కూల్ పిల్లలందరూ హాజరయ్యేలా చూడాలన్నారు. -
చంద్రబాబూ.. రైతులపై నిర్లక్ష్యం వీడండి
● మోసం చేస్తే ఉసురు తగలక మానదు ● మాజీ మంత్రి శైలజానాథ్ మండిపాటు బుక్కరాయసముద్రం: సీఎం చంద్రబాబు రైతుల సంక్షేమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమాత్రమూ సరికాదని వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. శుక్రవారం మండల పరిధిలోని నీలారెడ్డిపల్లి, చెదుల్ల గ్రామాల్లో అరటి, మొక్కజొన్న పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు అతివృష్టి, అనావృష్టితో అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన అరటి పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారన్నారు. అన్నదాతలు అప్పులు పాలవు తున్నా సీఎం చంద్రబాబు ఎలాంటి భరోసా ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. అరటి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పినా ఎక్కడా కొనడం లేదన్నారు. ‘ఢిల్లీవాళ్లతో మాట్లాడాం..అక్కడ మాట్లాడాం,ఇక్కడ మాట్లాడాం’ అంటూ కూటమి నాయకులు ఉత్తుత్తి మాటలు చెబుతున్నారని విమర్శించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి రైతులపై భారం పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారన్నారు. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి మరీ ఢిల్లీ మార్కెట్కు తరలించి అరటికి గిట్టుబాటు ధర కల్పించారన్నారు. జగన్ను చూసి కూటమి నాయకులు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ధనార్జనే ధ్యేయంగా పని చేస్తోందన్నారు. కూటమి నాయకులు గాల్లో తిరగడం మానేసి రైతులను సహృదయంతో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ నిలబడుతుందని, పోరాటాలు చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్రెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్, జెడ్పీ వైస్ చైర్మన్ నాగరత్నమ్మ, సర్పంచులు పార్వతి, చెదుల్ల శ్రీనివాసరెడ్డి, ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ గువ్వల శ్రీకాంత్రెడ్డి, రాధా మనోహర్రెడ్డి, భాస్కర్రెడ్డి, మంత్రి అంజినేయులు, చికెన్ నారాయణస్వామి, రమేష్రెడ్డి, పట్నం ఫనీంద్ర, నాగ, నాగరాజు, సత్యాలు, జయరామిరెడ్డి, రవి, వైఎస్సార్ సీపీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
గొర్రెల కాపరిపై టీడీపీ నేతల దాడి
కళ్యాణదుర్గం రూరల్: మండలంలోని బోరంపల్లి గ్రామంలో గొర్రెల కాపరి ఆంజనేయులపై రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే బండి హులికుంటప్ప (టీడీపీ) సోదరుడు కృష్ణమూర్తి, ప్రస్తుత రాయదుర్గం టీడీపీ కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే తనయుడు విక్కి అలియాస్ విక్రమ్ దాడి చేశారు. శుక్రవారం ప్రధాన రహదారిపై గొర్రెలను రోడ్డు దాటిస్తున్న సమయంలో అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వైపుగా కారులో వస్తున్న సదరు టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి దిగారు. ఆ సమయంలో గ్రామస్తులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం క్షతగాత్రుడిని స్థానిక సీహెచ్సీకి తరలించారు. అక్రిడిటేషన్ గడువు పొడిగింపు అనంతపురం అర్బన్: జర్నలిస్టుల అక్రిడిటేషన్ కాలపరిమితిని మరో రెండు నెలలు పొడిగిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్.విశ్వనాథన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ హోదాలో కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సంబంధిత మీడియా యాజమ్యానం వారి సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టుల వివరాలను జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయంలో వీలైనంత త్వరగా అందించాలని కమిటీ చైర్మన్ సూచించారు. సమగ్ర సస్యరక్షణ చర్యలపై చైతన్యపరచండి : జేడీఏ కళ్యాణదుర్గం: పంటల సాగులో చేపట్టాల్సిన సమగ్ర సస్య రక్షణ చర్యలపై రైతులను చైతన్య పరచాలని సంబంధిత అధికారులను జేడీఏ ఉమామహేశ్వరమ్మ ఆదేశించారు. రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ ఎం.విజయశంకర్బాబు అధ్యక్షతన కళ్యాణదుర్గంలోని కేవీకేలో శుక్రవారం వివిధ డివిజన్ల ఏడీఏలు, సిబ్బందికి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. జిల్లా ఉద్యాన అధికారి రమాదేవి, ఏడీహెచ్ ఆర్.దేవానంద్, స్థానిక కేవీకే కో ఆర్డినేటర్ చెండ్రాయుడు, ఆత్మా పీడీ పద్మలత తదితరులు పాల్గొన్నారు. 7న ‘ఎన్ఎంఎంఎస్’ పరీక్ష అనంతపురం సిటీ: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) పరీక్షను డిసెంబర్ 7న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు డీఈఓ ప్రసాద్బాబు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తుదారులు www.bse. ap.gov.inల వెబ్సైట్, లేదా ‘మన మిత్ర’ వాట్సాప్ నుంచి, పాఠశాల యూడైస్ లాగిన్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సవరణలు ఉంటే పాఠశాల హెచ్ఎం ధ్రువీకరణ లేఖతో పరీక్షా కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్ను కలిసి నామినల్ రోల్లో నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 6 వరకూ ఫీజు చెల్లింపునకు అవకాశం అనంతపురం సిటీ: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి, ఓపెన్ స్కూల్, ఒకేషనల్ కోర్సులకు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. పదో తరగతికి సంబంధించి ఎటువంటి అపరాధ రుసుము లేకుండా డిసెంబర్ 6వ తేదీలోపు ఫీజు చెల్లించొచ్చన్నారు. bse.ap.gov.in వెబ్సైట్లో పాఠశాల లాగిన్ అయి అప్లికేషన్ అప్లోడ్ చేసి, రుసుము చెల్లించాలని సూచించారు. -
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే
అనంతపురం: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మాజ్యోతిరావు పూలే అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి అన్నారు. శుక్రవారం మహాత్మా జ్యోతిబాపూలే వర్ధంతిని స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి ‘అనంత’తో పాటు పార్టీ నేతలు ఘన నివాళుర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళలకు విద్య ప్రాముఖ్యతను చాటిచెప్పిన మహనీయుడు జోత్యిబాపూలే అని కొనియాడారు. మహాత్మాజ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా జనరంజక పాలన చేసిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. తన కేబినెట్లో ఏకంగా 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంత్రి పదవులు కల్పించి పెద్దపీట వేశారన్నారు. స్వాతంత్య్రం అనంతరం ఏకంగా రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను తీసుకురావడంతో పాటు బీసీ, ఎస్సీ,ఎస్టీ కేటగిరీ విద్యార్థుల డాక్టర్ కల సాకారం అయ్యేలా గొప్ప సంస్కరణలు ప్రవేశపెట్టారని ప్రశంసించారు. చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసి పేద విద్యార్థుల డాక్టర్ కలను ఛిద్రం చేస్తోందని విమర్శించారు. సీఎం చంద్రబాబు ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచారన్నారు. వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు మహాలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను సాకారం చేసిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. బీసీ మహిళల ఖాతాల్లోకి నేరుగా నగదు చెల్లింపులు జరిపి ఆర్థిక స్వావలంబనకు కృషి చేశారని కొనియాడారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే చూపిన బాటలో నడిచి బీసీల కోసం అనేక సంస్కరణలు తెచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీసీలు రుణపడి ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బీసీ రమేష్ గౌడ్ మాట్లాడుతూ బడుగు,బలహీన వర్గాలు బ్యాక్వర్డ్ కాదు.. బ్యాక్ బోన్ అంటూ అగ్రస్థానంలో నిలిపిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఇంగ్లిష్ మీడియం, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలతో బీసీలకు చేయూతనిచ్చారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మంగమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు దాసరి వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు మీసాల రంగన్న, అశ్వర్థనాయక్, పెన్నోబులేసు, చింతా సోమశేఖర్ రెడ్డి, జానీ, వెన్నం శివారెడ్డి, శ్రీదేవి, ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, అమరనాథ రెడ్డి, కృష్ణవేణి, సాకే చంద్రలేఖ, భారతి, రాధా యాదవ్, అంజిలి, ఉష, మహేశ్వరి, మదన్మోహన్ రెడ్డి, కమల్భూషణ్, వెన్నపూస రామచంద్రా రెడ్డి, రాధాకృష్ణ, ఓబిరెడ్డి, సంపంగి రామాంజినేయులు, శేఖర్ బాబు, వేణుగోపాల్, గుజ్జల శివయ్య, అనిల్ కుమార్ గౌడ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర, లక్ష్మన్న, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, సోషల్ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్బాబా సలామ్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావుపూలే ఆశయ సాధనకు మాజీ సీఎం జగన్ ఎంతో కృషి కేబినెట్లో 17 మంత్రి పదవులతో పాటు అన్నింటా బడుగులకు ప్రాధాన్యం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి -
రైతుల ఆదాయం పెంపే లక్ష్యం
● కేంద్ర నోడల్ అధికారి సుజాత శర్మ అనంతపురం అర్బన్: రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా రాబోవు ఆరేళ్లకు సంబంధించి ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులను ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) కేంద్ర నోడల్ అధికారి సుజాత శర్మ ఆదేశించారు. పీఎండీడీకేవై పథకంపై గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ ఆనంద్, జేసీ శివ్ నారాయణ్ శర్మతో కలిసి అధికారులతో ఆమె సమీక్షించారు. పీఎండీడీకేవై పరిధిలోని 11 శాఖలకు సంబంధించి 36 పథకాలను సమన్వయంతో అమలు చేయాలన్నారు. ఎఫ్పీఓ (రైతు ఉత్పత్తి సంఘాలు) ఏర్పాటుపై దృష్టి పెట్టాలన్నారు. ఉద్యాన పంటల్లో నూతన రకాలను పరిచయం చేయడంతో పాటు సాగు, ఉత్పత్తి పెంచడంపై రైతులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయంపై రైతులను చైతన్యపరచాలని ఆదేశించారు. పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక, మత్స్య శాఖల పరిధిలో కేటాయించిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. జిల్లాలో పీఎం ఫసల్బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డ్, నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫామింగ్, పీఎం కృషి వికాస్ యోజన, తదితర పథకాల అమలును కలెక్టర్ వివరించారు. సమావేశంలో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు ఉమామహేశ్వరమ్మ, ఉమాదేవి, రఘునాథరెడ్డి, ప్రేమ్చంద్, విజయకుమార్, చంద్రశేఖర్రెడ్డి, లక్ష్మానాయక్, సీపీఓ అశోక్ కుమార్, కేవీకే శాస్త్రవేత్త మల్లీశ్వరి, డ్వామా పీడీ సలీమ్బాషా, డీసీఓ అరుణకుమారి, ఎల్డీఎం నరేష్రెడ్డి, డీఆర్డీఏ పీడీ శైలజ, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ విశ్వనాథరెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం శ్రీనివాసరావు పాల్గొన్నారు. = రాప్తాడు: మండలంలోని హంపాపురం, రామినేపల్లి గ్రామాల్లో కేంద్ర నోడల్ అధికారి సుజాత శర్మ పర్యటించారు. దానిమ్మ, ద్రాక్ష పంటలను పరిశీలించారు. పంటల సాగు వివరాలు, దిగుబడి, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు, సస్యరక్షణపై స్థానిక రైతులతో ఆరా తీశారు. ఆమె వెంట జేసీ శివ్ నారాయణ్ శర్మ, డీఏఓ ఉమామహేశ్వరమ్మ, డీహెచ్ఓ ఉమాదేవి, ఏపీఎంఐపీ పీడీ రఘనాథ రెడ్డి తదితరులు ఉన్నారు. -
షోకాజ్కు వివరణ ఇచ్చేందుకు వస్తే ‘క్లాస్’ పీకిన డీఈఓ
అనంతపురం సిటీ: షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చేందుకు వచ్చిన కణేకల్లు మండలం ఎర్రగుంట్ల ఉన్నత పాఠశాలకు చెందిన గ్రేడ్–2 హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్కు డీఈఓ ప్రసాద్బాబు ‘క్లాస్’ పీకారు. గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో మాక్ అసెంబ్లీ నిర్వహణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రతిభ ఆధారంగా ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు చొప్పన విద్యార్థులను ఎంపిక చేసి రాష్ట్ర శాఖ కార్యాలయానికి జిల్లా విద్యాధికారులు పంపారు. అయితే రాయదుర్గం నియోజకవర్గం నుంచి రెండో పేరుగా ఉన్న విద్యార్థిని ఎంపిక చేయడాన్ని ఆక్షేపిస్తూ మొదటి పేరు విద్యార్థి తల్లిదండ్రులు... కణేకల్లు మండలం ఎర్రగుంట్ల పాఠశాల ఉపాధ్యాయులను నిలదీశారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆ పాఠశాల హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో సంజాయిషీ ఇచ్చేందుకు గురువారం కార్యాలయానికి చేరుకున్న వారిని డీఈఓ తీవ్ర స్థాయిలో మందలించినట్లు సమాచారం. కాగా, ఇదే అంశంపై తమ పాఠశాలలో మొదటి, రెండో స్థానంలో కాకుండా మూడో స్థానంలో ఉన్న విద్యార్థిని ఎలా ఎంపిక చేశారంటూ డీఈఓ కార్యాలయానికి చేరుకొని ప్రశ్నించిన తపోవనం పాఠశాల హెడ్మాస్టర్, మరో ఇద్దరు ఉపాధ్యాయులను విద్యాశాఖ అధికారులు గురువారం విజయవాడలోని కమిషనర్ విజయరామారావు వద్ద హాజరు పరిచారు. కంబదూరు పంచాయతీ కార్యదర్శిపై వేటు రాప్తాడు రూరల్: కంబదూరు పంచాయతీ కార్యదర్శి అశ్వత్థరెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. స్వర్ణ పంచాయతీ పోర్టల్లో సెల్ నంబర్లు, ఆధార్ అప్డేషన్ అంశంపై గురువారం పంచాయతీరాజ్ కమిషనర్ అన్ని జిల్లాల పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అసెస్మెంట్ల పోర్టల్లో మొబైల్ నంబర్లు నమోదు చేయడంలో అలసత్వం వహించిన కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఈ క్రమంలో దాదాపు 200 అసెస్మెంట్లకు ఒకే మొబైల్ నంబరు నమోదు చేసిన అశ్వత్థరెడ్డిన సస్పెండ్ చేస్తూ డీపీఓ ఉత్తర్వులు చేశారు. నేడు పదోన్నతుల కౌన్సెలింగ్ : జిల్లాలో అర్హులైన 120 గ్రేడ్–6 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్–5 కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించేందుకు శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు డీపీఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ ఉంటుందని డీపీఓ నాగరాజునాయుడు తెలిపారు. నేటి నుంచి స్కూల్ బస్సులపై స్పెషల్ డ్రైవ్ : డీటీసీ అనంతపురం సెంట్రల్: ప్రైవేటు స్కూల్, కళాశాలలకు చెందిన బస్సులపై శుక్రవారం నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకూ స్పెషల్డ్రైవ్ చేపట్టనున్నట్లు జిల్లా ఉపరవాణా కమిషనర్ (డీటీసీ) వీర్రాజు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ... భద్రతాపరమైన అంశంలో ఏవైనా లోపాలుంటే సవరణ చేసుకోవాలని ఇప్పటికే ఆయా యాజమాన్యాలకు నోటీసులు పంపినట్లు వివరించారు. ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పొడిగింపు అనంతపురం సిటీ: యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షకు సంబంధించి బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ దరఖాసుకు గడువును డిసెంబర్ 3వ తేదీ వరకు పొగించారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కుష్బూ కొఠారి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వివరాలకు 95502 50770, 97042 04905 నంబర్లలో సంప్రదించవచ్చు. 29న నార్పలలో జాబ్మేళా శింగనమల(నార్పల): జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నార్పలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 29న జాబ్మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డేవిడ్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ప్రతాప్రెడ్డి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ స్థాయిలోని పది ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై.. ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను ఎంపిక చేయనున్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ చదివిన వారు అర్హులు. -
‘ఎస్ఐఆర్’పై అవగాహన కల్పించాం
● సీఈఓకు తెలిపిన కలెక్టర్ ఆనంద్ అనంతపురం అర్బన్: ఓటరు జాబితాకు సంబంధించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)పై అధికారులు, సిబ్బందికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించామని రాష్ట్ర ప్రధాన ఎలక్టోరల్ అధికారి (సీఈఓ) వివేక్ యాదవ్కు కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఎస్ఐఆర్ సన్నాహక కార్యకలాపాలపై సీఈఓ గురువారం విజయవాడ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్తో పాటు డీఆర్ఓ ఎ.మలోల, ఎన్నికల విభాగం డీటీ కనకరాజు పాల్గొన్నారు. ఎలక్టోరల్ రోల్స్, ఓటరు మ్యాపింగ్, ఎస్ఐఆర్పై సీఈఓ పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లాలో చేపట్టిన ప్రక్రియపై కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు మ్యాపింగ్ ప్రక్రియ 25.91 శాతం పూర్తయ్యిందన్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 330 పోలింగ్ కేంద్రాలకు బూత్ లెవల్ అధికారుల (బీఎల్ఓ) నియామకానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం ఎస్ఏ శామ్యూల్ బెంజిమన్, టెక్నికల్ అసిస్టెంట్ శివ పాల్గొన్నారు. వివాహిత ఆత్మహత్యాయత్నం కళ్యాణదుర్గం రూరల్: తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇవ్వలేదంటూ ఓ వివాహిత ఆత్మహత్యకు ప్రయత్నించింది. వివరాలు.. కళ్యాణదుర్గంలోని కమ్మరచెట్ల వీధికి చెందిన వివాహిత శైలు.. స్థానిక వాల్మీకి సర్కిల్లోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకుంది. బంగారాన్ని విడిపించుకునేందుకు గురువారం ఫైనాన్స్ కంపెనీకి వెళ్లిన సమయంలో ఖాతా హోల్డ్లో ఉండడంతో సొత్తు ఇవ్వడం కుదరదని సిబ్బంది తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంటికి చేరుకుని పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానిక సీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి తీసుకెళ్లారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పామిడి ఏపీఎంఎస్ విద్యార్థుల మధ్య గొడవ పామిడి: స్థానిక ఏపీ మోడల్స్కూల్లో చదువుకుంటున్న కత్రిమల గ్రామ విద్యార్థుల మధ్య గొడవ చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం పాఠశాల నుంచి బస్సులో గ్రామానికి వెళుతున్న సమయంలో ఇద్దరు విద్యార్థులు గొడవ పడ్డారు. ఓ విద్యార్థి తన చేతిలోని వాటర్ బాటిల్తో దాడి చేయబోతుండగా అది వెళ్లి పక్కనే ఉన్న 7వ తరగతి విద్యార్థి తలకు తగిలి రక్తగాయమైంది. క్షతగాత్రుడికి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అనంతరం అనంతపురానికి తీసుకెళ్లారు. ఘటనపై పామిడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్రిచక్ర వాహనాల కోసం దరఖాస్తు గడువు పొడిగింపు అనంతపురం సిటీ: అర్హులైన దివ్యాంగులకు వంద శాతం రాయితీతో మూడు చక్రాల వాహనాల మంజూరుకు దరఖాస్తు గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకురాలు జి.అర్చన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన వారు www.apdascac.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. -
అసలే తండా.. అభివృద్ధి తంటా
శింగనమల: మండలంలోని నాగులగుడ్డం తండా అభివృద్ధికి నోచుకోవడం లేదు. నిధుల లేమితో ఈ పరిస్థితి దాపురించిందని అనుకుంటే పొరపాటే. గ్రామాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.కోటి నిధులను స్వాహా చేసేందుకు సిద్ధమైన టీడీపీ నేతలు మూడు గ్రూపులుగా విడిపోయి గ్రామాభివృద్ధిని పూర్తిగా అడ్డుకోవడం గమనార్హం. అసలే మారుమూల తండా ప్రాంతం, పైగా గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు తమ ఆధిపత్యం కోసం చివరకు తాగునీరు కూడా అందకుండా చేశారు. గ్రామాభివృద్ధికి కేంద్రం నిధులు ‘ధర్తీ ఆబా జంజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తూ గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టింది. ఈ పథకం కింద ఎంపిక చేసిన గిరిజన తండాల్లో అభివృద్ధి పనులకు పుష్కలంగా నిధులు మంజూరు చేసింది. తొలి విడతలో జిల్లాలోని మూడు గిరిజన తండాలను ఎంపిక చేయగా.. అందులో శింగనమల మండలంలోని నాగులగుడ్డం తండా ఒకటి. ఈ క్రమంలో పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి నాగులగుడ్డం తండాలో వారంలో ఒక రోజు చొప్పన గ్రామస్తులతో అధికారులు సమావేశాలు నిర్వహించి, గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ఆరా తీసి, నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఇందులో సీసీ రోడ్లు, తాగునీటి పైపులైన్లు, గృహ నిర్మాణాలు, పంచాయతీ భవనం, కమ్యూనిటీ భవనం తదితర పనులు ఉన్నాయి. ఈ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ తొలి విడతలో రూ.కోటికి పైగా నిధులను తొమ్మిది నెలల క్రితం మంజూరు చేసింది. ఇందులో గ్రామంలో సీసీ రహదారులకు రూ.48 లక్షలు, తాగునీటి పైప్లైన్ కోసం రూ.25 లక్షలు, పంచాయతీ భవన నిర్మాణానికి రూ.35 లక్షలు చొప్పున కేటాయించారు. అలాగే నూతన గృహ నిర్మాణాలనూ మంజూరు చేసింది. ముందుకు సాగని పనులు టీడీపీ నేతల ఆధిపత్య పోరులో నాగులగుడ్డం తండాలో అభివృద్ధి పనులు పూర్తిగా పడకేశాయి. టీడీపీలో నాయకులు మూడు గ్రూపులుగా విడిపోయి పనులు తమకు కావాలంటే తమకు కావాలని పోటీ పడ్డారు. అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వారిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో తాగునీటి కోసం కేటాయించిన రూ.25 లక్షలతో బోరుబావి తవ్వించి, మోటారు ఏర్పాటు చేశారు. గ్రామంలో పైప్లైన్ వేశారు. అయితే ఇది నచ్చని టీడీపీ నేతలు రాత్రికి రాత్రే బోరు ఉంచి మోటారును లాగేసి పక్కకు పడేశారు. దీంతో నాగులగుడ్డం తండా వాసుల పరిస్థితి ‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అనే చందంగా మారింది. గ్రామాల అభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకూ పైసా నిధులు కేటాయించలేదు. పోనీ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోనైనా గ్రామాల్లో అభివృద్ధి పనులు సాగుతున్నాయా అంటే.. అది కూడా టీడీపీ నేతల ధన దాహానికి బలవుతున్నాయి. ప్రస్తుతం గుక్కెడు తాగునీటి కోసం తండా వాసులు పొలాల వెంట పరుగు తీయాల్సి వస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు కాస్త వెనక్కు మళ్లే అవకాశముంది. మోటారు బిగించాలని చెప్పానే... నాగులగుడ్డం తండాలో తాగునీటి పథకానికి సంబంధించిన విద్యుత్ మోటారును బోరు నుంచి పెకలించినట్లుగా తెలిసింది. అయితే దీనిపై అప్పట్లోనే స్పందించాం. మోటారును వెంటనే బిగించాలని చెప్పాం. ఇప్పటి వరకూ బిగించలేదా? ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. – భాస్కర్, ఇన్చార్జ్ ఎంపీడీఓ, శింగనమల ‘తమ్ముళ్ల’ కుమ్ములాటతో పడకేసిన గిరిజన గ్రామాభివృద్ధి అభివృద్ధి పనులకు అడుగడుగునా ఆటంకాలు తాగునీరు సైతం అందకుండా మోటారు పెకలించిన టీడీపీ నేతలు మురిగిపోనున్న రూ.కోట్ల నిధులు -
కర్ణాటక న్యాయవాదిపై ‘పచ్చ’ మూక దాడి
కళ్యాణదుర్గం: స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులోఓ కేసులో వాదనలు వినిపించి తిరిగి బళ్లారికి వెళుతున్న కర్ణాటక న్యాయవాది, బళ్లారి బార్ అసోసియేషన్ సీనియర్ సభ్యుడు వై.కొట్రేష్పై స్థానిక టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. వివరాలు... కళ్యాణదుర్గం టీడీపీకి చెందిన ఓ నేత తన కుమార్తెను బళ్లారికి చెందిన యువకుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె పుట్టింటికి చేరుకుని భర్త, అత్తపై వరకట్న వేధింపులు, చిత్రహింసల కేసు పెట్టింది. ఈ కేసు విషయంగా స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వివాదం నడుస్తోంది. ఇదే కేసులో ఆమె భర్త, అత్తకు అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో కక్షిదారులతో కలసి బుధవారం కళ్యాణదుర్గంలోని కోర్టుకు న్యాయవాది వై.కొట్రేష్ హాజరయ్యారు. సాయంత్రం వారెంట్ను రద్దు చేయించి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. బైపాస్ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకోగానే గోళ్ల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ద్విచక్రవాహనాన్ని అడ్డుగా పెట్టి న్యాయవాది కారును అడ్డుకున్నారు. కారులో ఉన్న న్యాయవాదితో పాటు అతని క్లయింట్లపై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. స్థానికులు వారిస్తున్నా వినకుండా ‘లాయర్ అయితే ఏంటి.... జడ్జి అయితే ఏంటి...’ అంటూ దుర్భాషలతో రెచ్చిపోయారు. ఆ సమయంలో అక్కడే ఉన్న దుకాణాల నిర్వాహకులు దాడిని అడ్డుకుని న్యాయవాదిని సురక్షితంగా కళ్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్కు చేర్చారు. అయితే అదే సమయంలో టీడీపీ కార్యకర్తలు స్టేషన్ వద్దకు చేరుకుని న్యాయవాదికి సహకరించిన స్థానికులపై దాడికి యత్నించారు. విధుల్లో ఉన్న సీఐ హరినాథ్ వెంటనే ఇరువర్గాలకు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం న్యాయవాది ఫిర్యాదు మేరకు గోళ్ల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త వెంకటేష్తో పాటు 8 మందిపై కేసు నమోదు చేశారు. అలాగే టీడీపీ నేతల నుంచి ఫిర్యాదు స్వీకరించి న్యాయవాది వై.కొట్రేష్పై కేసు నమోదు చేశారు. విధులు బహిష్కరించిన న్యాయవాదులు కర్ణాటక న్యాయవాదిపై జరిగిన దాడిని ఖండిస్తూ కళ్యాణదుర్గం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పార్థసారథి, వైస్ ప్రెసిడెంట్ టి.రామాంజినేయులు, సీనియర్ న్యాయవాదులు హనుమంతరెడ్డి, దేవేంద్ర, కరణం తిప్పేస్వామి, మల్లికార్జున, బీటీ రామాంజనేయులు, సంపత్కుమార్, తిమ్మప్ప చౌదరి, పట్టాభి, హరిచక్రవర్తి, సుదర్శన్, ముత్యాలు, తిప్పేస్వామి, మంజు, టీపీ కిరణ్తో పాటు పలువురు రెండు రోజుల పాటు విధులను బహిష్కరించి, కోర్టు ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. బళ్లారి బార్ అసోసియేషన్ సీనియర్ సభ్యుడు వై. కొట్రేష్పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓ కేసు విషయంగా కళ్యాణదుర్గం కోర్టుకు హాజరై బళ్లారికి వెళ్తుండగా ఘటన న్యాయవాది కారుకు ద్విచక్ర వాహనాన్ని అడ్డుపెట్టి దాడి చేసిన వైనం -
మట్కా బీటర్ల అరెస్ట్
తాడిపత్రి టౌన్: స్థానిక విజయలక్ష్మి థియేటర్ సమీపంలో ఐదుగురు మట్కా బీటర్లను తాడిపత్రి పట్టణ సీఐ ఆరోహణరావు, ఎస్ఐ గౌస్ మహమ్మద్ గురువారం అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో మేకల పుల్లయ్య, దూదేకుల కుళ్లాయప్ప, లింగుట్ల కొండమనాయుడు, ఉదయగిరి మాబున్నీ, షేక్ రహమత్ ఉన్నారు. వీరి నుంచి రూ.2.01 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ రోహిత్కుమార్ మాట్లాడుతూ.. తాడిపత్రిలో జూదాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. పేకాట, మట్కా నిర్వాహకుల కుటుంబాలతో పాటు వారి సమీప బందువుల వివరాలనూ సేకరించామన్నారు. వారి బ్యాంక్ ఖాతాలపై నిఘా ఉంచామని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లుగా తేలితే కఠిన చర్యలు తప్పవన్నారు.ఒకవేళ కుటుంబ సభ్యులు, బంధువులు విదేశాల్లో ఉంటే వారి పాస్పోర్టులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఉపాధి పనులపై సామాజిక తనిఖీ అనంతపురం టౌన్: ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై సామాజిక తనిఖీలు చేపట్టనున్నట్లు డ్వామా పీడీ సలీంబాషా తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. 2024–25ఆర్థిక సంవత్సరానికి గాను ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల పరిధిలోని 10 మండలాల్లో రూ.80 కోట్లతో ఉపాధి పనులు చేపట్టిన డ్రైల్యాండ్ హార్టికల్చర్, కందకాల తవ్వకాలు, చెరువుల్లో పూడికతీత పనులు, సీసీరోడ్లు, డ్రైయినేజీ తదితర పనులపై సామాజిక తనిఖీలు ఉంటాయన్నారు. 20 రోజుల పాటు సాగే ఈ ప్రక్రియకు ఆయా గ్రామ పంచాయతీల్లోని ఉపాధి కూలీలు సహకరించాలని కోరారు. ఎస్జీఎఫ్ జాతీయ స్థాయి క్రీడలకు ఎంపిక గుంతకల్లు: ఉత్తరప్రదేశ్లోని లక్నో వేదికగా డిసెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకూ జరిగే జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు గుంతకల్లులోని సరస్వతీ జూనియర్ కళాశాల ఫస్ట్ ఇయర్ విద్యార్థి టి.రాజేష్ ఎంపికయ్యాడు. ఈ మేరకు కోచ్ దొరై గురువారం వెల్లడించారు. జాతీయ స్థాయిలో జరిగే 200, 400 మీటర్ల పరుగు పోటీలతో పాటు వంద మీటర్ల రిలే పరుగు పోటీల్లో అండర్–17 విభాగంలో ఏపీ తరఫున రాజేష్ ప్రాతినిథ్యం వహించనున్నాడు. -
కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు అనంతపురం: జాతీయ లోక్ అదాలత్లో అధికంగా కేసుల పరిష్కారానికి కృషి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఈ. భీమారావు పేర్కొన్నారు. జిల్లా కోర్టులో గురువారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కోర్టుల్లో డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ ఉంటుందన్నారు. రాజీ కాదగిన క్రిమినల్, ఎకై ్సజ్ కేసులతో పాటు దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులు పరిష్కరించే దిశగా చొరవ చూపాలన్నారు. సమావేశంలో మొదటి అడిషనల్ జిల్లా జడ్జి సత్యవాణి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వర్షసూచన అనంతపురం అగ్రికల్చర్: నైరుతి బంగాళా ఖాతంలో వాయుగుండం నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి తెలిపారు. ఉమ్మడి జిల్లాలో రాగల మూడు రోజులు వర్షాలు పడొచ్చన్నారు. అక్కడక్కడా 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావొచ్చని తెలిపారు. వీఆర్కు యాడికి సీఐ ఈరన్న యాడికి: మండలంలోని అప్గ్రేడ్ పోలీసుస్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఐ ఈరన్నను వీఆర్కు పంపుతూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ ఈరన్న యాడికిలో విధులు నిర్వహించిన 16 నెలల వ్యవధిలోనే అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసు ఉన్నతాధికారులు ఆయనను వీఆర్కు పంపడం గమనార్హం. పెద్దవడుగూరు సీఐ రామసుబ్బయ్యను యాడికి అప్గ్రేడ్ సీఐగా అదనపు బాధ్యతలు అప్పగించారు. సీఐ ఈరన్న ఆదేశాల మేరకు పోలీసు స్టేషన్లో ఇష్టారాజ్యంగా విధులు నిర్వహించిన మరో ఇద్దరిపై కూడా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. డిగ్రీ నూతన సిలబస్కు ఆమోదం అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ కోర్సులకు సంబంధించి నూతన సిలబస్ను ఆమోదించారు. గురువారం వర్సిటీలో ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి. అనిత ఆధ్వర్యంలో సీడీసీ డీన్ ప్రొఫెసర్ కే. రాంగోపాల్ అధ్యక్షతన బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ల సమావేశం నిర్వహించారు. ఉన్నత విద్యామండలి రూపకల్పన చేసిన సిలబస్ను ఎస్కేయూలో అమలు చేయడానికి వీలుగా బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లు ఆమోదం తెలిపారు. పోటీ ప్రపంచానికి అనుగుణంగా కళాశాల– పరిశ్రమకు అనుసంధానం చేసేలా సిలబస్ రూపకల్పన జరిగినట్లు వీసీ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ మునినారాయణప్ప, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీరాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. స్తంభించిన పీఏబీఆర్ కుడి కాలువ గేట్లు కూడేరు: పీఏబీఆర్ వద్ద ధర్మవరం కుడి కాలువ గేట్లు స్తంభించి పోయాయి. దీంతో కుడి కాలువకు నీటి విడుదల మళ్లీ వాయిదా పడింది. గేట్లు ఎత్తేందుకు అధికారులు మోటర్ ఆన్ చేయగానే రోప్ ఇనుప తాళ్లు కూడా తెగిపోతుండడం గమనార్హం. ఈ క్రమంలో గురువారం విజయవాడకు చెందిన అధికార బృందం కుడి కాలువ గేట్లు పరిశీలించింది. ఏళ్ల క్రితం అమర్చిన గేట్లు కావడంతో స్తంభించిపోయినట్లు గుర్తించారు. విజయవాడ నుంచి నిపుణులను పంపి మరమ్మతులు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ క్రమంలో రిజర్వాయర్ భద్రత దృష్ట్యా గురువారం రాత్రి 4వ గేటును ఎత్తి మిడ్ పెన్నార్ డ్యాంకు నీటిని విడుదల చేశారు. 400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఎస్ఈ సుధాకర్ రావు తెలిపారు. డ్యాంలోకి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి హంద్రీ–నీవా కాలువ ద్వారా 660 క్యూసెక్కులు, హెచ్చెల్సీ ద్వారా 40 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని వివరించారు. -
సేవాభావంతో పని చేసిన ‘రాక్రీట్’పై నిందలా?
అనంతపురం ఎడ్యుకేషన్: నిరుపేదలకు మూడు సెంట్ల స్థలంలో రూ.5 లక్షలతో ఇల్లు కట్టించి ఇస్తామని ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన హామీని అమలు చేయలేక నేడు ప్రతిపక్షంపై నిందలు మోపుతున్నారని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా వైఎస్ జగన్ ప్రభుత్వంలో కేంద్రం నుంచి 21 లక్షల ఇళ్లు మంజూరు చేయించారని, 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారని గుర్తు చేశారు. రూ.1.80 లక్షల యూనిట్ వ్యయంతో పేదలకు ఇళ్లు నిర్మించాలని గత ప్రభుత్వంలో పెద్దపెద్ద కాంట్రాక్టర్లను అడిగితే ఎవరూ ముందుకురాలేదన్నారు. ఆ తరుణంలో ‘రాక్రీట్’ సంస్థ సేవాభావంతో పనులు చేసిందన్నారు.ఆప్షన్–3 లబ్ధిదారులకు ఆర్సీ లెవల్ వరకు మాత్రమే ఇళ్లు నిర్మించి ఇస్తామని ఒప్పందం చేసుకుందని, తక్కిన పనులకు లబ్ధిదారులు రూ.35 వేలు భరించాల్సి ఉందన్నారు. ఈ పనులు కూడా రాక్రీట్ చేపట్టాల్సి ఉందంటూ నిందలు వేస్తున్నారని వాపోయారు. ఒప్పందం మేరకు ఇళ్లు నిర్మిస్తామంటూ రాక్రీట్ సంస్థ అనేకమార్లు కలెక్టర్లు, హౌసింగ్ డైరెక్టరు, జిల్లా అధికారులకు లేఖలు రాసిందని తెలిపారు. కేవలం తనను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో 50 వేల కుటుంబాలను నాశనం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికీ రూ.36 కోట్లకు పైగా బిల్లులు రావాల్సి ఉందని, దీనిపై కోర్టుకు వెళ్తే ప్రభుత్వం కనీసం కౌంటరు దాఖలు చేయలేదని విమర్శించారు. బీజేపీ కూడా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఆప్షన్–3 బెస్ట్ ఆప్షన్ ఆప్షన్–3 కింద చేపట్టిన 3 లక్షల ఇళ్లలో 2 లక్షల ఇళ్లు పూర్తి చేశారంటే దాదాపు 70 శాతం సక్సెస్ రేటు అన్నారు. 1,2 ఆప్షన్లలో 18 లక్షల ఇళ్లకు గాను 6 లక్షలు మాత్రమే పూర్తయినట్లు హౌసింగ్ మంత్రి చెబుతున్నారని, అంటే 33 శాతం మంది మాత్రమే కట్టుకున్నారని తెలిపారు. ఈ 6 లక్షల మంది కనీసం చేతినుంచి ఒక్కొక్కరు అదనంగా రెండు లక్షల దాకా పెట్టుకున్నా రన్నారు. ఈ లెక్కన రూ. 12 కోట్లు నష్టపోయారన్నారు.తక్కిన 12 లక్షల మంది కూడా ఇళ్లు నిర్మించుకోవాలంటే మరో రూ. 24 కోట్లు నష్టపోవాల్సి వస్తుందన్నారు. 70 శాతం సక్సెస్ రేటున్న ఆప్షన్–3 ఇళ్ల గురించి ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, రాప్తాడు వైస్ ఎంపీపీ రామాంజనేయులు, వైఎస్సార్సీపీ నాయకులు మీనుగ నాగరాజు, నారాయణరెడ్డి, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. 3 సెంట్లలో రూ.5 లక్షలతో ఇల్లు కట్టిస్తామని టీడీపీ హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చాక పూర్తిగా పక్కన పెట్టింది రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ధ్వజం -
‘చలి’గింతలు
● భారీగా పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు ● జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులుఅనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ‘చలి’ గింతలు పెరిగాయి. చలి పంజా మొదలు కావడంతో ప్రజలు గజగజలాడిపోతున్న పరిస్థితి నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు 27 నుంచి 32 డిగ్రీల మధ్య కొనసాగుతుండగా... రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గురువారం మరింత తగ్గిపోవడంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఉదయం 9 గంటల వరకు పొగమంచు కమ్ముకుంటోంది. వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. గురువారం వేకువజామున మడకశిర మండలంలో 12.7 డిగ్రీలు, శెట్టూరులో 13.9 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ప్రస్తుతానికి ఇవే కనిష్ట ఉష్ణోగ్రతలు కావడం గమనార్హం. రొద్దం 13.8 డిగ్రీలు, సోమందేపల్లి 13.9, బెళుగుప్ప 14.1, అమరాపురం 14.1, గుడిబండ 14.3, గుమ్మఘట్ట 14.5, వజ్రకరూరు 14.9 డిగ్రీలు ఇలా చాలా మండలాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. డిసెంబర్, జనవరి నెలల్లో చలి తీవ్రత మరింత పెరిగే సూచనలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 8 నుంచి 12 డిగ్రీలకు పతనం కావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో హీటర్లు, స్వెట్లర్లకు గిరాకీ పెరిగింది. రాత్రిళ్లు, ఉదయం పూట చలి నుంచి కాపాడుకునేందుకు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్దులు, బాలింతలు, గర్భిణులు, రోగులు, ఉదయం శ్రామిక వర్గాలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు. -
మందకొడిగా రబీ
● 48 వేల హెక్టార్లలో ‘సాగు’తోన్న పంటలు అనంతపురం అగ్రికల్చర్: రబీ మందకొడిగా ‘సాగు’తోంది. సకాలంలో విత్తన పప్పుశనగ, విత్తన వేరుశనగ పంపిణీ చేయకపోవడం, వర్షాభావ పరిస్థితులు వెరసి పంటల సాగు తక్కువగానే ఉన్నట్లు వ్యవసాయశాఖ తాజా నివేదిక వెల్లడిస్తోంది. ఈ రబీలో 1,07,261 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి వస్తాయని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతానికి 45 శాతంతో 48 వేల హెక్టార్లలో పంటలు వేశారు. అందులో వర్షాధారంగా ప్రధానపంట పప్పుశనగ 65,017 హెక్టార్లకు గానూ ప్రస్తుతానికి 40 వేల హెక్టార్లలో సాగు చేశారు. నీటి వసతి కింద 17,982 హెక్టార్లుగా అంచనా వేసిన వేరుశనగ 1,700 హెక్టార్లలో ‘సాగు’తోంది. 7,888 హెక్టార్లకు గానూ మొక్కజొన్న 2,100 హెక్టార్లు, 5 వేల హెక్టార్లకు గానూ 2,500 హెక్టార్లలో జొన్న సాగు చేశారు. ఇవి కాకుండా సజ్జ, రాగి, కొర్ర, పెసర, అలసంద, మినుము, ఉలవ, పొద్దుతిరుగుడు, ఆముదం, కుసుమ, సోయాబీన్, పత్తి తదితర పంటలు నామమాత్రంగా విత్తుకున్నారు. 6,069 హెక్టార్లు అంచనా వేసిన వరి నాట్లు ఇప్పుడే మొదలు పెట్టారు. డిసెంబర్ 15 వరకు వేరుశనగ సాగుకు అనుకూలం కాగా డిసెంబర్ ఆఖరు వరకు వరికి అనుకూలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పప్పుశనగ సాగుకు ఈనెల 15తో అదను ముగిసిపోవడం గమనార్హం. -
ఇక ‘అక్రమ’ సర్వేయర్ల వంతు..
రాప్తాడురూరల్: అనంతపురం నగర శివారులోని పాపంపేట శోత్రియం భూముల వ్యవహారంలో ప్రస్తుత సర్వేయర్ రఘునాథ్, మాజీ సర్వేయర్ ప్రతాప్రెడ్డిపై విచారణ నివేదిక ఇచ్చి తదుపరి చర్యలకు సర్వే, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్కు సిఫార్సు చేయడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన ఈ భూముల వ్యవహారంలో వీఆర్ఓ రఘుయాదవ్ పాత్రపై ఉన్నతాధికారులకు స్పష్టత వచ్చింది. ఆరు సర్వే నంబర్లలో 29.96 ఎకరాల్లో రాచూరి వెంకటకిరణ్ అనుభవంలో ఉన్నాడంటూ 2024 ఆగస్టు 13న వీఆర్ఓ పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చాడు. అసలు వీఆర్ఓకు ఈ అధికారమే ఉండదు. అయినా మొండి ధైర్యంతో ముందుకెళ్లాడు. కఠిన చర్యలు తీసుకునే క్రమంలో కలెక్టర్ ఆనంద్ ఆర్టికల్ చార్జెస్ ఫ్రేమ్ నోటీసు ఇవ్వడం ఉలికిపాటుకు గురి చేసింది. తాజాగా సర్వేయర్ల పాత్రపై స్పష్టత వచ్చింది. రాచూరి వెంకట కిరణ్ అందజేసిన డాక్యుమెంట్లు 984/1910, 1607/ 1952, 324/1956, 1628/1958 మేరకు విస్తీర్ణం 300 ఎకరాలుగా ఉన్నట్లు పూర్వ సర్వేయర్ ప్రతాప్రెడ్డి 2024 జూన్ 24న నివేదిక ఇచ్చాడు. ఈయన క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఎలాంటి సర్వే చేయలేదు. కేవలం డాక్యుమెంట్ల ఆధారంగా నివేదిక ఇచ్చాడు. సమాచారం ఇవ్వకుండానే.. ప్రస్తుత సర్వేయర్ రఘునాథ్ బరి తెగించి నివేదిక ఇచ్చాడు. చుట్టుపక్కల వారికి కనీసం సమాచారం ఇవ్వకుండా భూములు సర్వే చేశాడు. పైగా చుట్టుపక్కలంతా రైతులే ఉన్నారని వారందరికీ వాట్సాప్లో నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నాడు. నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి రాచూరి వెంకటకిరణ్, వారి కుటుంబ సభ్యుల పేరిట సుమారు 160 ఎకరాలు హక్కు అనుభవంలో ఉన్నట్లు ఏకపక్షంగా రిపోర్ట్ ఇచ్చాడు. ఈయన ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగానే వెంకటకిరణ్, ఆయన కుటుంబ సభ్యులు, వారిద్వారా జీపీఏ చేయించు కున్న వారు మ్యుటేషన్కు దరఖాస్తు చేసుకుని హైకోర్టును ఆశ్రయించడం గమనార్హం. డైరెక్టర్కు సిఫార్సు చేసిన డిప్యూటీ డైరెక్టర్ పాపంపేట భూ వివాదంలో సర్వేయర్ల పాత్రపై టాస్క్ఫోర్స్ ఇచ్చిన నివేదిక ఆధారంగా పూర్వపు సర్వేయర్ ప్రతాప్రెడ్డి, ప్రస్తుత సర్వేయర్ రఘునాథ్పై చర్యలు తీసుకోవాలంటూ సర్వే డిప్యూటీ డైరెక్టర్ పి.హరికృష్ణ ఏపీ ప్రభుత్వ సర్వే, ల్యాండ్ రికార్డ్స్ శాఖ డైరెక్టర్కు లేఖ రాశారు. త్వరలోనే ఇద్దరు సర్వేయర్లు, వీఆర్ఓపై చర్యలుంటాయని అధికారులు చెబుతున్నారు. పాపంపేట భూ వ్యవహారంలో ఇద్దరు సర్వేయర్లపై చర్యలకు నివేదిక ఇప్పటికే వీఆర్ఓ రఘుయాదవ్కు చార్జెస్ ఆఫ్ ఫ్రేమ్ నోటీసు జారీ ముగ్గురిపై వేటుకు రంగం సిద్ధం -
బిలాస్పూర్–యలహంక మధ్య ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బిలాస్పూర్–యలహంక మధ్య వారాంతంలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు. 5 సర్వీసులు మాత్రమే నడుపుతున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 2వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు బిలాస్పూర్ జంక్షన్ (08261)లో రైలు బయలుదేరి మరుసటి రోజు (బుధవారం) సాయంత్రం 6.30 గంటలకు యలహంక జంక్షన్కు చేరుతుందన్నారు. అదేవిధంగా యలహంక జంక్షన్ (08262) నుంచి డిసెంబర్ 3 బుధవారం రాత్రి 9 గంటలకు బయలుదేరి శుక్రవారం తెల్లవారుజూమున 4.30 గంటలకు రైలు చేరుతుందన్నారు. భాతాపుర, రాయపూర్, దుర్గ్, చందా పోర్ట్, సిరిపూర్, మంచర్ల, ఖాజాపేట్, చర్లపల్లి, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాదగిరి, కృష్ణా, రాయచూరు, మంత్రాలయం, గుంతకల్లు, గుత్తి, అనంతపురం, ధర్మవరం రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయని వెల్లడించారు. రైళ్లలో 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉంటాయన్నారు. -
అరటి రైతు ఆర్తనాదాలు చేస్తున్నా చంద్రబాబు సర్కారుకు చీమకుట్టినట్లు కూడా లేదు. ధరలు పతనమై పెట్టుబడి ఖర్చులు చేతికందే పరిస్థితి లేక అరటి గెలలు తెంపేసి రోడ్డుపాలు చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. దుర్భర పరిస్థితులు నెలకొన్నా మొద్దునిద్ర పాటిస
నాడు.. కరోనా కాలంలో రైతుల దగ్గరుండి అరటి ఉత్పత్తులు అమ్మకాలు సాగిస్తున్న ఆర్ఎస్కే అసిస్టెంట్లు (ఫైల్) అనంతపురం అగ్రికల్చర్: 2021 నుంచి 2024 మధ్య టన్ను రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు మంచి ధరలు పలకడంతో చాలా మంది రైతులు అరటి సాగుపై దృష్టి సారించారు. ఈ ఏడాది 39 వేల ఎకరాల్లో అరటి సాగులో ఉండగా 7 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడులు అంచనా వేశారు. అందులో మొదటి పంట కింద డిసెంబర్ నుంచి కోతలు మొదలు కానుండగా... 3.92 లక్షల మెట్రిక్ టన్నులు రావొచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రెండు, మూడో విడత పంట కోతలు జరుగుతున్నాయి. కానీ నెల రోజులుగా టన్ను రూ.2 వేలకు మించి పలకకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. మూడో విడత పంట అయితే టన్ను రూ.400 నుంచి రూ.500 కూడా అడగడం లేదని రైతులు వాపోతున్నారు. కష్టకాలంలో చేయూత ఇవ్వాల్సిన చంద్రబాబు సర్కారు అరటి రైతు గురించి కనీస ఆలోచన చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కారు వెన్నుదన్ను.. 2020 ఫిబ్రవరిలో కరోనా విపత్తు సంభవించిన విషయం తెలిసిందే. కోవిడ్ మహమ్మారి విలయతాండవంతో దేశవ్యాప్తంగా రవాణా స్తంభించిపోగా, ప్రధాన మార్కెట్లు నిరవధికంగా మూతబడ్డాయి. అంతటి కష్టకాలంలో కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు అన్నదాతకు అడుగడుగునా అండగా నిలిచింది. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనంత స్థాయిలో రైతుల్లో మనోధైర్యం నింపి ఉద్యాన ఉత్పత్తుల అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ యంత్రాంగం, ఆర్బీకే సిబ్బంది, వలంటీర్లు, ఇతరత్రా అన్ని శాఖలను సమన్వయం చేసి వెన్నుదన్నుగా నిలిచింది. అప్పట్లో ఉద్యాన ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలు, ఉత్తరాది ప్రాంతాలకు పండ్ల ఉత్పత్తులు రవాణా చేశారు. 2020 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల కరోనా కాలంలో జిల్లాలో రైతులు పండించిన అన్ని రకాల పండ్ల ఉత్పత్తులు 10 లక్షల టన్నులకు పైగా క్రయ విక్రయాలు జరిగినట్లు ఉద్యాన శాఖ నివేదిక వెల్లడిస్తుండడం గమనార్హం. మొదట్లో ధరల తగ్గుదల, కఠిన నిబంధనలతో కొంత ఇబ్బందులు పడినా రానురాను పరిస్థితి మెరుగుపడటంతో ఢిల్లీలోని అజాద్పూర్ మార్కెట్తో పాటు హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, నాగపూర్ లాంటి దక్షిణాది రాష్ట్రాల మార్కెట్లకు జిల్లా నుంచి చీనీ, మామిడి, అరటి, బొప్పాయి, మెలన్స్, ద్రాక్ష, దానిమ్మ లాంటి పంట ఉత్పత్తులు రవాణా చేశారు. సరాసరి ధరల ప్రకారం కరోనా కాలంలో రూ.1,400 కోట్ల విలువ చేసే ఫలసాయం అమ్మకాలు సాగించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అప్పట్లో పత్తాలేని బాబు బ్యాచ్.. 2020 మార్చి నుంచి అదే ఏడాది ఆగస్టు వరకు కరోనా మహమ్మారి కారణంగా రైతులు అవస్థలు పడుతున్న సమయంలో చంద్రబాబు బ్యాచ్ పత్తాలేకుండా పోయింది. సాయం కోసం రైతులు దిక్కులు చూస్తున్న సమయంలో కనీసం పలకరించి మనోధైర్యం చెప్పాల్సిన చంద్రబాబు రాష్ట్రం వైపు కన్నెత్తి చూడకుండా హైదరాబాద్లో ఉండి పోవడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. ‘కరోనా’ కష్టాల్లోనూ అన్నదాతకు వైఎస్ జగన్ సర్కారు వెన్నుదన్ను లాక్డౌన్లతో మార్కెట్లు మూతపడినా ఉద్యాన రైతుకు చేయూత 2020లో ప్రభుత్వం, పాలనా యంత్రాంగం దగ్గరుండి రైతు ఉత్పత్తులకు మార్కెటింగ్ నేడు అరటి రైతులు ఆర్తనాదాలు చేస్తున్నా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం -
రెడ్బుక్ రాజ్యాంగంతో అరాచకాలు
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ‘అనంత’ మండిపాటు అనంతపురం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన పవిత్రమైన భారత రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్బుక్ రాజ్యాంగంతో అరాచకాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి విమర్శించారు. బుధవారం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి ‘అనంత’ ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కుల, మత, వర్గాలకతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు అందడానికి కారణం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగ మేన్నారు. అంబేడ్కర్ దూరదృష్టితో రాజ్యాంగ రూపకల్పన చేశారన్నారు.చంద్రబాబు ప్రభుత్వంలో కొన్ని దుష్టశక్తులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని పవిత్రమైన రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగం చాలా శక్తివంతమైనదన్నారు. రాష్ట్రపతి మొదలు సామాన్యుడి వరకు అందరూ సమాన హక్కులు అనుభవిస్తున్నారంటే రాజ్యాంగం గొప్పదనమనేని పేర్కొన్నారు. అటువంటి రాజ్యాంగాన్ని పక్కనపెట్టి ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం క్షమించరానిదన్నారు. దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. ప్రజల గొంతు నొక్కేలా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలను పంచుకున్నా అక్రమ కేసులు బనాయించడం చంద్రబాబు ప్రభుత్వానికి తగదన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాజిక న్యాయశిల్పి డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేస్తే దాన్ని రక్షించలేని స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. దీనిపై అందరూ శాంతియుతంగా పోరాటాలు చేసి గాంఽధీజీ బాటలో పయనించాలని పిలుపునిచ్చారు. అనంతరం జెడ్పీ కార్యాలయం వద్ద ఉన్న బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి బీసీ రమేష్ గౌడ్, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు అనంత చంద్రా రెడ్డి, మీసాల రంగన్న, రాష్ట్ర మైనార్టీ విభాగం జనరల్ సెక్రటరీ కాగజ్ ఘర్ రిజ్వాన్, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు , పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస రెడ్డి, అమరనాథ రెడ్డి, వెన్నం శివారెడ్డి, జానీ, సాకే కుళ్లాయప్ప, సాకే చంద్రలేఖ, శ్రీనివాస నాయక్, చామలూరు రాజగోపాల్, భారతి, రాధాయాదవ్, అంజలి, శోభ, కసిరెడ్డి కేశవరెడ్డి, రాధాకృష్ణ, వెన్నపూస రామచంద్రారెడ్డి, కమల్భూషణ్, మల్లెల వేణు, కై లాష్, గుజ్జల లక్ష్మణ్, రహంతుల్లా, టీవీ చంద్రమోహన్ రెడ్డి, జావీద్, అనిల్కుమార్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు. -
ఎర్రవంక మాయం
సాక్షి టాస్క్పోర్స్: తాడిపత్రిలో టీడీపీ నేతల ధన దాహానికి ఎర్ర వంక కనుమరుగవుతోంది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి అండ చూసుకుని తాడిపత్రిలో రూ.కోట్లు విలువ చేసే ఎర్ర వంకను పూడ్చి వెంచర్లు వేసి విక్రయాలు చేపట్టారు. ఫలితంగా చిన్నపాటి వర్షానికే తాడిపత్రిలోని శివానగర్, టైలర్స్ కాలనీలు జలమయమవుతున్నాయి. పట్టించుకోని అధికారులు తాడిపత్రికి శివారు ప్రాంతమైన ఆటో నగర్ నుంచి బైపాస్ రోడ్డు వెంబడి కడప రోడ్డు వరకూ దాదాపు 3 కిలోమీటర్ల మేర ఎర్రవంక విస్తరించి ఉంది. ఇటీవల పట్టణం విస్తరించడంతో బైపాస్ రోడ్డు పరిధిలోని భూములకు రెక్కలొచ్చాయి. ఎకరా భూమి రూ.కోట్లలో ధర పలుకుతోంది. దీంతో ఎర్ర వంకపై టీడీపీ నేతలు కన్నేశారు. వంక పోరంబోకు భూములను ఆక్రమించి వెంచర్లు వేసి విక్రయిస్తున్నారు. కొన్ని ప్లాట్లలో అక్రమ నిర్మాణాలూ కొనసాగుతున్నాయి. టీటీడీ కల్యాణమంటపం సమీపంలో టీడీపీ నేత ఒకరు ఏకంగా వంకను పూడ్చి చిన్న పాటి కాలువగా మార్చేశాడు. మిగులు భూమిలో వెంచర్ వేసి అమ్మకానికి పెట్టాడు. ఇంత జరుగుతున్నా.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు అటుగా కన్నెత్తి కూడా చూడడం లేదు. అక్రమార్కులు టీడీపీ నేతలు కావడంతో అడ్డుకునేందుకు సాహసించలేకపోతున్నారు. వంకను పూడ్చి రియల్ దందా మొదలు పెట్టిన టీడీపీ నేతలు రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి విక్రయాలను మౌనంగా చూస్తున్న అధికారులు -
విద్యార్థులే కూలీలుగా మారి..
ఉరవకొండ: స్థానిక ఎస్కే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఇటుకలు, మట్టి మోస్తూ బుధవారం కూలీలుగా కన్పించారు. తరగతి గదుల్లో ఉంటూ చదువుకోవాల్సిన సమయంలో వారితో ఇటుకలు, మట్టిని ఆ పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు మోయించారు. ఇది చూసిన పలువురు ఆశ్చర్యపోయారు. తమ పిల్లలను ప్రయోజకులుగా చూడాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు బడులకు పంపితే అక్కడ ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొంటున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఎరువుల దుకాణాల్లో తనిఖీలు కణేకల్లు: మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాలను బుధవారం ఫర్టిలైజర్ స్క్వాడ్ అధికారి సత్యనారాయణ, ఏఓ జగదీష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆదర్శ భారతి రైతుసేవా సహకార సంఘంలో ఎరువులకు సంబంధించిన రిజిస్టర్, గోదాములో నిల్వలకు పొంతన లేకపోవడంతో రూ.1.50 లక్షలు విలువ చేసే ఎరువుల విక్రయాల నిలుపుదల చేస్తూ నోటీసు ఇచ్చారు. స్థానిక పీఏసీఎస్లో రూ.70వేలు విలువ చేసే ఎరువుల విక్రయాలకు స్టాఫ్ సేల్స్ నోటీసు జారీ చేశారు. మరో ఫర్టిలైజర్ షాపులో రూ.6.59 లక్షలు విలువ చేసే ఎరువుల విక్రయాలను నిలుపుదల చేశారు. గురువారం లోపు సరైన ఇన్వాయిస్లు చూపకపోతే రూ.2.49 లక్షల విలువైన ఎరువులను జప్తు చేస్తామని సంబంధిత యజమానిని అధికారులు హెచ్చరించారు. -
‘ప్రైవేటు’కు డీఎల్జారీ ప్రక్రియ
● త్వరలో అమల్లోకి నూతన విధానం అనంతపురం సెంట్రల్: రవాణా శాఖలో కీలకమైన డ్రైవింగ్ లైసెన్స్(డీఎల్) మంజూరు ప్రక్రియ త్వరలో ప్రైవేటు చేతుల్లోకి చేరనుంది. దరఖాస్తు చేసుకునే వారికి శిక్షణతో పాటు లైసెన్స్ మంజూరు చేసే అధికారాలు కూడా ప్రైవేటు వారికే కల్పించనున్నారు. రవాణా శాఖ ద్వారా వాహనదారులకు అందిస్తున్న సేవల్లో డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు ప్రధానమైనది. రోజూ వందల మంది వాహనదారులు డీఎల్, ఎల్ఎల్ఆర్ టెస్ట్ల కోసం రవాణా శాఖ కార్యాలయానికి వస్తుంటారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో ఆటోమేటిక్ టెస్ట్ డ్రైవ్ సెంటర్ ద్వారా, తాడిపత్రి, గుంతకల్లు, కళ్యాణ దుర్గం ప్రాంతీయ కార్యాలయాల్లో ఫిజికల్ టెస్ట్ల ద్వారా డీఎల్ మంజూరు చేస్తున్నారు. జిల్లాకు మూడు కేంద్రాలు... జనాభా ప్రాతిపదికన డ్రైవింగ్ టెస్ట్ లైసెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. 5 లక్షల నుంచి 6 లక్షలకు ఓ సెంటర్ ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ లెక్కన జిల్లాలో మూడు సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. జిల్లాలో ఎక్కడైనా సెంటర్లు ఏర్పాటు చేయవచ్చని, ఇందుకు ఫిబ్రవరి 26 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు డీటీసీ వీర్రాజు తెలిపారు. రెండు ఎకరాల స్థలం, ఏదైనా ఎన్జీఓ, ఆర్గనైజేషన్ పేరుతో ఫర్మ్, రూ. 50 లక్షల ష్యూరిటీ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ నుంచి సర్టిఫికెట్ తదితర నిబంధనలు ఉన్నాయి. ఇప్పటికే రెండు దరఖాస్తులు అందగా.. మరో రెండు పరిశీలనలో ఉన్నాయి. టీడీపీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యేకు ఒకటి దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. నిర్వీర్యం దిశగా రవాణా శాఖ... రవాణా శాఖ ద్వారా అందిస్తున్న సేవలన్నీ ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం అవుతున్నాయి. ఇప్పటికే వాహన రిజిస్ట్రేషన్ను ఆయా షోరూంలకు, ఫిట్నెస్ ప్రక్రియను శివశంకర్ ఎంటర్ప్రైజెస్కు అప్పగించారు. తాజాగా డ్రైవింగ్ లైసెన్స్లు జారీ ప్రక్రియను కూడా ప్రైవేటుకు అప్పజెబుతుండడం గమనార్హం. దీంతో ఇకపై వాహనదారులు ఆర్టీఏ కార్యాలయానికి రావాల్సిన పని ఉండదు. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకే ప్రైవేటుకు అప్పజెబుతున్నట్లు చెబుతున్నా.. ప్రైవేటు ఏజెన్సీలపై పర్యవేక్షణ బాధ్యతలు ఆర్టీఏ అధికారులకు లేకపోవడం చూస్తే అక్రమాలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
‘సాయం’ అందేది ఎన్నడు?
రాయదుర్గం: రైతు ఆర్థిక అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం వర్తించక జిల్లాలోని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్హత కలిగిన రైతులకు ఏటా రూ.6 వేలు ప్రయోజనం చేకూరేలా.. మూడు విడుతలుగా రూ.2 వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ పథకం కింద లబ్ధిదారుల వివరాలు నమోదుకు 2019, జనవరి 31నాటికి తుది గడువును విధించారు. దీంతో జిల్లాలోని 31 మండలాల్లో 4.20 లక్షల మంది రైతులు ఉండగా దరఖాస్తు చేసుకున్న వారిలో 2,75,642 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. మిగిలిన వారు అప్పటి నుంచి నేటి వరకూ పథకం లబ్ధి కోసం ఎదురు చూస్తున్నారు. విశిష్ట సంఖ్య వచ్చినా నిరాశే.. కేంద్ర ప్రభుత్వ పథకం ఏదీ పొందాలన్నా విశిష్ట గుర్తింపు కార్డు ఉండేలా కార్యచరణ చేపట్టారు. ఈ మేరకు ప్రతి రైతుకు ఆధార్ తరహా 11 అంకెలతో కూడిన సంఖ్యను కేటాయించారు. పోటీపడి రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ విశిష్ట సంఖ్య పొందితే కిసాన్ సమ్మాన్ పథకం తప్పక వర్తిస్తుందని ఆశపడ్డారు. కానీ నిరాశే ఎదురైంది. దీనికి తోడు పెట్టుబడి సాయం అందించడంలోనూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కొర్రీలు విధించాయి. అర్హత జాబితా నుంచి చాలా మందిని తొలగిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పీఎం కిసాన్– రైతు భరోసా పథకం ద్వారా ఏకంగా 2.94 లక్షల మందికి రూ.200.20 కోట్లకు పైగా సాయం అందింది. కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా కొత్త లబ్ధిదారులకు అవకాశం కల్పించాలని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా నాన్చుడు దోరణి అవలంభిస్తూ వచ్చింది. ఈ అంశాన్ని చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేయడంతో కొత్త లబ్ధిదారుల ఎంపిక కాస్త అటకెక్కింది. పీఎం కిసాన్ నమ్మాన్ నిధి కోసం రైతుల ఎదురుచూపు 2019 జనవరి 31 తర్వాత ఆగిన లబ్ధిదారుల ఎంపిక పట్టించుకోని చంద్రబాబు సర్కార్ జిల్లాలో మొత్తం రైతులు ః 4.20 లక్షల మంది పీఎం కిసాన్లబ్ధిదారులుః 2,75,642 మంది -
వైఎస్ జగన్ ప్రతిష్టకు భంగం కలిగిస్తే ఊరుకోం
అనంతపురం సెంట్రల్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టకు భంగం కలిగించాలని చూస్తే సహించబోమని ఆ పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు చవ్వా రాజశేఖరరెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియాల్లో అసత్య, నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అనంతపురం రెండో పట్టణ పోలీసులకు పార్టీ లీగల్సెల్ జిల్లా అధ్యక్షుడు ఉమాపతితో కలసి బుధవారం ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. మావోయిస్టులతో కలిసి చంద్రబాబు, పవన్కళ్యాణ్ను చంపేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి కుట్ర చేస్తున్నట్లు ఎక్స్, ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ వేదికలుగా కొందరు టీడీపీ నాయకులు దుష్ప్రచారం సాగిస్తున్నారన్నారు. అసత్య, నిరాధరమైన వీడియోను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఈ తరహా కుట్రలకు తెరతీశారని మండిపడ్డారు. ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టి అవాస్తవాలను వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదరు వీడియో మూలాలను డిజిటల్ ఫొరెన్సిక్ విశ్లేషణ ద్వారా గుర్తించి వాటిని తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రాజేష్రెడ్డి, అనిల్కుమార్గౌడ్, మహేష్గౌడ్, హనుమంతరెడ్డి, రషీద్ఖాన్, శ్రీనివాసులు, లీగల్సెల్ నాయకులు గౌని నాగన్న, శ్రీనివాసరెడ్డి, వెంకటరాముడు, నాగరాజుబాబు, నారప్పరెడ్డి, పద్మావతి, కవితారెడ్డి, జ్యోతి, రేవతి తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియాలో విష ప్రచారాలు బాధాకరం కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకుల డిమాండ్ -
అధ్యక్షా! మైదానాల్లేవ్.. మొక్కలు ఎక్కడ నాటాలి?
కళ్యాణదుర్గం రూరల్: ‘అధ్యక్షా! కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రభుత్వ బడుల్లో మైదానాల్లేవ్.. ఇక మొక్కలు ఎక్కడ నాటాలి?’ అంటూ విద్యాశాఖ మంత్రిపై ప్రతిపక్ష సభ్యురాలు తలారి అభిజ్ఞ ధ్వజమెత్తారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతి వేదికగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో బుధవారం నిర్వహించిన మాక్ అసెంబ్లీ సమావేశంలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ.. ప్రతి పాఠశాలలోనూ ప్రతి విద్యార్థీ ఓ మొక్కను నాటి సంరక్షించేలా చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు జీఓ పాస్ చేయాలని కోరారు. ఈ అంశాన్ని మాక్ అసెంబ్లీలో కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన రమేష్, చంద్రకళ దంపతుల కుమార్తె అభిజ్ఞ ఆక్షేపించారు. ‘ప్రతి విద్యార్థి మొక్క నాటాలని జీఓ జారీ చేయాలనడం సబబుగానే ఉన్నా... మా నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విరామ సమయంలో క్రీడలు ఆడుకునేందుకు మైదానాలూ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో మొక్కలు ఎక్కడ నాటాలో గౌరవ మంత్రివర్యులు చెప్పాలి’. ముందుగా పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగు పరిస్తే... ఆ తర్వాత అన్నీ సర్దుకుపోతాయి. ఆ దిశగా ఇప్పటికై నా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని చురకలు అంటించేలా మాట్లాడారు. మాక్ అసెంబ్లీ సమావేశంలో దుర్గం నియోజకవర్గ విద్యార్థిని ఆసక్తికర ప్రశ్న -
రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేయాలి
● కలెక్టర్ ఆనంద్ అనంతపురం అర్బన్: ‘‘ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అత్యున్నతమైనది. మహోన్నతమైన రాజ్యాంగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలి. ప్రజలకు బాధ్యతగా మెరుగైన సేవలు సత్వరం అందించాలి’’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో రాజ్యాంగ ప్రవేశిక ఆమోద దినం నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశ ప్రజల మదిలో ఉన్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా మనమంతా పేదల అభ్యున్నతి, సంక్షేమానికి అంకితభావంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. అరటి రైతులను ఆదుకుంటాం శింగనమల (నార్పల): జిల్లాలో అరటి రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం నార్పల మండలంలోని గడ్డం నాగేపల్లి పరిధిలో అరటి పంటను పరిశీలించారు. పంట సాగు విధానంపై రైతులతో ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయిస్తామన్నారు. అరటి నాణ్యత పెరగడానికి ఏం చేయాలన్న దానిపై ప్రణాళిక రూపొందించాలని ఉద్యాన శాఖాధికారులకు సూచించారు. ఒక పంటను పదేపదే సాగు చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయని, పంట మార్పిడి చేయాలన్నారు. రైతుల వద్ద తీసుకునే అరటికి కేజీ రూ.6, ఎగుమతి చేసే అరటికి రూ.8 అందించాలని కంపెనీల నిర్వాహకులకు సూచించామన్నారు. తీవ్రంగా నష్టపోయామని రైతులు విన్నవించగా, విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. జిల్లా ఉద్యాన అధికారి ఉమాదేవి, ఏపీఎంఐపీ ఏపీడీ ధనంజయ తదితరులు ఉన్నారు. ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించండి అనంతపురం సిటీ: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చిలో ప్రారంభం కానున్నట్లు డీఈఓ ప్రసాద్బాబు బుధవారం తెలిపారు. ఇందుకు సంబంధించి విద్యార్థులు డిసెంబర్ ఒకటి నుంచి 15వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. ఏపీ ఆన్లైన్ సేవా కేంద్రం లేదా ఆన్లైన్ పేమెంట్ గేట్వే ద్వారా నేరుగా చెల్లించవచ్చని వివరించారు. అపరాధ రుసుము లేకుండా డిసెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు, రూ.25 అపరాధ రుసుముతో 11 నుంచి 12వ తేదీ వరకు, రూ.50తో 13 నుంచి 15 వరకు చెల్లించవచ్చన్నారు. పరీక్ష ఫీజు వివరాలకు వెబ్సైట్ www.apopenschool.ap.gov.in చూడాలని సూచించారు. దరఖాస్తు గడువు పొడిగింపుఅనంతపురం సిటీ: జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీస్ బాలికల ఎయిడెడ్ పాఠశాల, ఆర్సీఎం ఎయిడెడ్ ప్రైమరీ పాఠశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు గడువును డిసెంబర్ 10వ తేదీ వరకూ పొడిగించినట్లు వెల్లడించారు. విందు భోజనం తిని 20 మందికి అస్వస్థత ఓడీచెరువు: మండల పరిధిలోని బత్తినపల్లిలో బుధవారం జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొని విందుభోజనం ఆరగించిన వారిలో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కావడంతో బంధువులు వారిని ఓడీచెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఏడుగురిని కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని, బత్తినపల్లిలోనూ వైద్య శిబిరం ఏర్పాటు చేశామని స్థానిక వైద్యుడు కమల్ రోహిత్ తెలిపారు. అయితే కలుషితమైంది ఆహారమా...నీరా అన్న విషయం తెలియాల్సి ఉందన్నారు. -
మా డబ్బు తిరిగివ్వండి!
రాప్తాడు/రాప్తాడు రూరల్: రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి పంచాయతీ చిన్మయనగర్ సమీపంలోని జగనన్న కాలనీలో రౌడీషీటర్, టీడీపీ నాయకుడు ఉప్పర శ్రీనివాసులు నుంచి ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో ఆందోళన నెలకొంది.‘ప్లాట్లు వద్దు, ఏమీ వద్దు.. మా డబ్బులు మాకు తిరిగివ్వండి’ అంటూ నిలదీసినట్లు తెలి సింది. వివరాలు.. చిన్మయనగర్ సమీపంలోని జగనన్న కాలనీలో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అనంతపురం నగరానికి చెందిన 650 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనంతపురం, రాప్తాడు ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, పరిటాల సునీత ప్రధాన అనచరుడు, రౌడీషీటర్ ఉప్పర శ్రీనివాసులు ఈ జగనన్నకాలనీలో ‘పరిటాల సునీతమ్మ కాలనీ’ పేరుతో బోర్డు ఏర్పాటు చేసి మొత్తం భూమిలో సెంటున్నర ప్రకారం 512 ప్లాట్లు వేసి లేఔట్ తయారు చేసి బేరంపెట్టాడు. ఒక్కో ప్లాటు రూ. 2 లక్షల చొప్పున ఇప్పటికే దాదాపు 300 ప్లాట్లు అమ్మేశాడు. ఈ వైనంపై ‘సాక్షి’లో మంగళవారం ‘పేదల ప్లాట్లపై పచ్చ రాబందు’ శీర్షికతో ప్రచురితమైన కథనం కలకలం రేపింది. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. అసలు విషయం తెలియక, ఎవరో చెప్పిన మాటలు విని ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆ ప్రాంతానికి వచ్చి ఆరా తీశారు. తక్కువ ధరకు వస్తుందనే ఆశతో ప్లాట్లు కొనుగోలు చేశామని భవిష్యత్తులో ఇవి ఉంటాయా.. లేదంటే ప్రభుత్వం తీసుకుంటుందా అంటూ వాపోయినట్లు తెలిసింది. తొంగిచూడని అధికారులు కలెక్టరేట్కు 5 కిలోమీటర్ల దూరంలోనే ప్రభుత్వ ఆస్తిని పబ్లిక్గా బేరం పెట్టి అమ్ముతున్నా అధికారులు ఆవైపు తొంగిచూడక పోవడం అనుమానాలకు తావిస్తోంది. అటు కార్పొరేషన్ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు తప్పితే ఈ ప్రాంతాన్ని పరిశీలించకపోవడం గమనార్హం. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఉన్నతాధికారులు కూడా వెనుకడుగు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు బాధితులు కలెక్టర్ను కలిసేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది. తమకు కేటాయించిన ప్లాట్లను అమ్మకాలు చేశారని, విచారించి ప్లాట్లు తిరిగి ఇప్పించాలంటూ విన్నవించనున్నట్లు సమాచారం. ఎవరూ రారు.. మేం చూసుకుంటాం! ఉప్పర శ్రీనివాసులు నుంచి ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో కొందరు ఆయనతో పాటు అనుచరులను కలిసినట్లు తెలిసింది. ‘రేప్పొద్దున ప్రభుత్వం వీటిని తీసుసుకుంటే మా పరిస్థితి ఏమిటి? ప్లాట్లు వద్దు, మా డబ్బు మాకివ్వండి’ అని నిలదీయగా.. ‘మీ ప్లాట్ల జోలికి ఎవరూ రారు. ఎవరు వచ్చినా మేము చూసుకుంటాం’ అని అభయమిచ్చినట్లు తెలిసింది. రాప్తాడు మండలం చిన్మయనగర్ జగనన్న కాలనీకి బాధితుల క్యూ మీ ప్లాట్ల జోలికి ఎవరూ రారని చెబుతున్న అక్రమార్కులు -
సోషలిజం వైపు అందరి చూపు
● సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీరాఘవులు అనంతపురం అర్బన్: పెట్టుబడిదారీ విధానాల దుర్లక్ష్యాలతో యావత్ ప్రపంచం ఇబ్బందుల్లో పడుతోందని, ఇలాంటి తరుణంలో దేశాలన్నీ సోషలిజం వైపు దృష్టి సారించాయని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ‘సోషలిజం విశిష్టత– సామ్రాజ్యవాద వైఫల్యం’ అంశంపై సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అనంతపురంలోని లలిత కళాపరిషత్లో బుధవారం అవగాహన సదస్సు జరిగింది. అంతకు ముందు స్థానిక ఆర్ట్స్ కళాశాల నుంచి లలిత కళాపరిషత్ వరకు రెడ్ కవాతు నిర్వహించారు. సదస్సులో బీవీ రాఘవులుతో పాటు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రాంభూపాల్ మాట్లాడారు. పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రజల సమస్యలను పరిష్కరించకపోగా మరింత జఠిలం చేసిందన్నారు. భారత దేశంలో ఈ విధానం వల్ల ఒక్క శాతంగా ఉన్న ధనికుల వద్ద 51 శాతం దేశ సంపద కేంద్రీకృతమైందన్నారు. ఒక వైపు సంపన్నులు సంపద పెంచుకుంటూ ఉంటే మరో వైపు పేదరికం పెరిగిపోతోందన్నారు. 129 దేశాల ఆకలి సూచికలో మన దేశం 124వ స్థానంలో ఉండడం బాధాకరమన్నారు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ప్రజలందరికీ ఆక్షరాస్యత, సొంత ఇల్లు, వైద్యం వంటి కనీస సదుపాయాలను ప్రభుత్వాలు అందించలేకపోయాయని విమర్శించారు. 1917లో రష్యాలో ఏర్పడిన సోషలిస్టు ప్రభుత్వం అప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న బ్రిటన్, అమెరికాకు దీటుగా పలు విజయాలను సాధించిందన్నారు. అలాంటి వ్యవస్థ కావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారన్నారు. అమెరికాలోనే పలు నగరాలకు మేయర్లుగా సోషలిస్టు నాయకులు ఎన్నికకావడమే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వ పాలనలో విఫలమైందని రాంభూపాల్ విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోలేకపోతోందన్నారు. 12 గంటల పని విధానం అమలు దుర్మార్గమన్నారు. సదస్సులో సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప, రాష్ట్ర నాయకులు ఓబులు, జిల్లా నాయకులు నాగేంద్రకుమార్, బాలరంగయ్య, చంద్రశేఖర్రెడ్డి, ఆర్డీనాయుడు, ముత్తుజా, రామిరెడ్డి, వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నత స్థాయికి ఎదగాలి
అనంతపురం అర్బన్: కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకుంటే మెరుగైన ఫలితాలు ఉంటాయని, ప్రతి ఒక్కరూ బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యా శాఖ ఆధ్వర్యంలో పలు పాఠశాలల్లో వక్తృత్వ, వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన 15 మంది విద్యార్థులను బుధవారం కలెక్టర్ తన చాంబర్లో అభినందిస్తూ జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలను అందించారు. కార్యక్రమంలో డీఈఓ ప్రసాదరావు, ఏపీసీ శైలజ తదితరులు పాల్గొన్నారు. పతాక దినోత్సవం నిధికి విరాళాలివ్వండి సాయుధ దళాల పతాక దినోత్సవం నిధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ ఓ.ఆనంద్ పిలుపునిచ్చారు. బుధవారం కలెక్టరేట్లోని మినీకాన్ఫరెన్స్ హాల్లో సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయుధ దళాల ఫ్లాగ్డే సంక్షేమ నిధికి సంబంధించిన కార్ ఫ్లాగ్, స్టిక్కర్లను అధికారులతో కలసి కలెక్టర్ ఆవిష్కరించి, మాట్లాడారు. సైనిక సంక్షేమ అధికారి తిమ్మప్ప మాట్లాడుతూ.. విరాళాలు ఇవ్వదలిచిన వారు జిల్లా సైనిక సంక్షేమ అధికారి, అనంతపురం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నెంబరు 6207 695 6433, ఐఎఫ్ఎస్సీ కోడ్ BIN0021438 కు పంపించాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎ.మలోల, బీసీ సంక్షేమాధికారి కుష్బూకొఠారి, మైనారిటీ సంక్షేమాధికారి రామసుబ్బారెడ్డి, డీఐపీఆర్ఓ బాలకొండయ్య పాల్గొన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ప్రధానమంత్రి ఆదర్శ గ్రామీణ యోజన పథకం కింద ఎంపికై న గ్రామాల్లో మంజూరైన అభివృద్ధి పనులు నెలరోజుల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాస్థాయి ప్రాజెక్ట్ అప్రైజల్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మొత్తం 84 పనులు ఆమోదించగా పెండింగ్లో ఉన్న 24 పనులను నెలలో పూర్తి చేసి బిల్లులను జిల్లా పరిషత్కు పంపించాలన్నారు. రెండవ దశలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కణేకల్లు మండలం గరుడచేడు పంచాయతీ మీనహళ్లి, పెద్దవడుగూరు మండలం పెనకలపాడు పంచాయతీ కోడూరు ఎంపికయ్యాయన్నారు. ఈ గ్రామాల్లో అభివృద్ధి పనులకు చర్యలు తీసుకోవాలని సూచించారు. శిథిలావస్థ గదుల్లో బోధన వద్దు పాఠశాలల్లో శిథిలావస్థలో ఉన్న గదుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహించరాదని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. వాటి మరమ్మతుకు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసిన తాగునీటి శుద్ధి (ఆర్ఓ) ప్లాంట్లు పనిచేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో సంక్షేమ, విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ బడిఈడు పిల్లలు కచ్చితంగా బడిలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మునిసిపల్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థులకు కలెక్టర్ ఆనంద్ సూచన -
తాడిపత్రిలో ‘తమ్ముళ్ల’ పేకాట పంచాయితీ
తాడిపత్రి టౌన్: తాడిపత్రిలో జేసీ ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఇన్నాళ్లూ ప్రతిపక్ష పార్టీనే టార్గెట్ చేసి నానా రచ్చ చేసిన జేసీ వర్గీయులు... తాజాగా సొంతపార్టీ నేతలనే టార్గెట్ చేశారు. ముందునుంచీ వైరివర్గంగా ఉంటున్న ‘కాకర్ల’ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం తాడిపత్రి మండల పరిధి లోని హునాపురం గ్రామ సమీపంలో ఉన్న టీడీపీ నాయకుడు కాకర్ల రంగనాఽథ్కు చెందిన మామిడి తోటపై పోలీసులు దాడి చేశారు. అక్కడ పేకాట ఆడుతున్న 16 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.89,020 నగదు, మూడు కార్లు, 13 మోటార్ సైకిళ్లు, 11 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు దాడి చేసిన సమయంలో చాలా మంది పారిపోయారని, వారిలో కాకర్ల సోదరుడు, బంధువులు ఉన్నారని, వారిని కావాలనే పోలీసులు వదిలేశారని జేసీ ప్రభాకర్రెడ్డి వర్గీయులు ఆరోపించారు. దాదాపు వంద మంది జేసీ అనుచరులు ఏఎస్పీ కార్యాలయం వద్దకు వెళ్లి కాకర్ల సోదరుడితో పాటు కుటుంబీకులను అరెస్ట్ చేయాలని ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో ఒక్కసారిగా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే టీడీపీ పెద్దల సూచనలతో ఆందోళన చేయకుండానే జేసీ వర్గం నాయకులు అక్కడి నుంచి నిష్క్రమించారు. అనంతరం మంగళవారం రాత్రిపొద్దుపోయాక తాడిపత్రి అప్గ్రేడ్ స్టేషన్ సీఐ శివగంగాధర్రెడ్డి 16 మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అరెస్టయిన వారిలో కాకర్ల జగన్నాథ్, కాకర్ల రంగనాథ్, కాకర్ల చంద్ర, గాలి సురేష్ రెడ్డి, తమ్మినేని శివకృష్ణ, షేక్ మహబూబ్ బాషా,రామినేని భాస్కర్, ఎల్లనూరు శివకృష్ణ, కోడూరు శ్రీనివాసులు, కడవకల్లు నాగేంద్ర, మీసాల విష్ణు, మారినేని కృష్ణమోహన్, కూచివారిపల్లి పట్టాభిరామయ్య, గన్నె నరేష్ కుమార్ నాయుడు, మాలపాటి లోకేశ్వర రెడ్డి, గుత్తి రవి కుమార్ ఉన్నట్లు ప్రకటించారు. అయితే పోలీసులు జేసీ ఒత్తిడితోనే తన వర్గంపై కేసు అక్రమ కేసులు నమోదు చేశారని టీడీపీ నాయకుడు కాకర్ల వర్గం ఆరోపించింది. మొత్తంగా తాడిపత్రిలో తమ్ముళ్ల పేకాట పంచాయితీ చర్చనీయాంశంగా మారింది. పాలవాయిలో వెలుగు అధికారుల పర్యటన కళ్యాణదుర్గం: ‘యానిమేటర్ భర్త చేతివాటం’ శీర్షికన ఈ నెల 22న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై వెలుగు అధికారులు స్పందించారు. మండలంలోని పాలవాయి గ్రామంలో ఓ వ్యక్తి బోగస్ సంఘాలను ఏర్పాటు చేసుకుని తప్పుడు రికార్డులు సృష్టించాడు. రూ.30 లక్షలు స్వాహా చేశాడు. ఈ విషయంపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే మంగళవారం ఏపీఎం నారాయణస్వామి పాలవాయిలో పర్యటించారు. గతంలో పనిచేసిన యానిమేటర్ అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. అధికారులు విచారణకు వెళ్లిన సమయంలో యానిమేటర్ లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇక.. రూ. లక్షలు స్వాహా జరిగిన సమయంలో పనిచేసిన సీసీలు తమ పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. ‘చంద్రబాబు రైతులను పట్టించుకోవడం లేదు’ యాడికి: సీఎం చంద్రబాబు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదంటూ ఓ రైతు మండిపడ్డారు. మంగళవారం యాడికి రైతు సేవా కేంద్రం వద్ద ‘రైతన్నా.. మీ కోసం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమాన్ని ఏఓ మహబూబ్బాషా పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఆదినారాయణ నాయుడు అనే రైతు మాట్లాడుతూ గత ఏడాది తన పొలంలో సాగు చేసిన పంటకు ఇన్పుట్ సబ్సిడీ ప్రీమియం చెల్లించినా నష్ట పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే ఈ ఏడాది బీమా ప్రీమియం కట్టలేదన్నాడు. గతంలో ప్రభుత్వమే ఇన్పుట్ సబ్సిడీ ప్రీమియం కట్టి రైతులకు నష్ట పరిహారం అందజేసిందని, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం రైతులను పట్టించుకోలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. -
ఐసీడీఎస్లో కలకలం
● శిశుగృహలో చిన్నారి మృతికి కారణమైన ఉద్యోగులపై వేటు ● ఒకేసారి ఏకంగా ఏడుగురి తొలగింపు ● కలెక్టర్ నిర్ణయంపై సర్వత్రా హర్షం అనంతపురం సెంట్రల్: మహిళా,శిశు సంక్షేమశాఖలో కలకలం రేగింది. అనాథ పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్న శిశుగృహలో పనిచేస్తున్న మొత్తం సిబ్బందిని తొలగిస్తూ కలెక్టర్ ఆనంద్ నిర్ణయం తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత నెల 2న శిశుగృహలో ఆశ్రయం పొందుతున్న చిన్నారి నిరూప్ మృతి ఘటన పర్యవసానంగా వారిపై వేటుపడింది. ఐసీడీఎస్ చరిత్రలోనే ఒకేసారి.. ఒక విభాగంలో పనిచేస్తున్న అందరినీ తొలగించిన దాఖలాలు లేవు. కలెక్టర్ ఆనంద్ తీసుకున్న నిర్ణయంతో శిశుగృహ మొత్తం ప్రక్షాళన జరిగినట్లయింది. మేనేజర్ దీప్తితో పాటు సోషల్ వర్కర్ లక్ష్మిదేవి, ఏఎన్ఎం గుణవతి, ఆయాలు, ఆదిలక్ష్మి, నూర్జహాన్, ప్రభావతి, వాచ్మెన్ రాజశేఖర్ను తొలగించారు. విభేదాలతో చిన్నారుల సంక్షేమం గాలికి.. మగబిడ్డకు జన్మనిచ్చిన కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన ఓ మహిళ కాసేపటికే పసికందును వదులుకోవడానికి సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు పసికందును అక్కున చేర్చుకొని జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో చికిత్సలు అందించిన అనంతరం శిశుగృహలో అప్పగించారు. అయితే ఇక్కడ ఆశ్రయం పొందుతున్న చిన్నారుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాల్సిన సిబ్బంది నిత్యం విభేదాలతో గొడవలకు దిగేవారు. ఇదే క్రమంలో ఈ ఏడాది అక్టోబర్ 2న ఓ ఆయా ఉన్న ఫళంగా విధులకు హాజరుకాలేదు. పరిస్థితిని చక్కదిద్దాల్సిన మేనేజర్ దీప్తి పట్టించుకోలేదు. విధుల్లో ఉన్న ఒక్క ఆయా అందరినీ చూసుకోలేకపోవడంతో ఆకలితో అలమటించి చిన్నారి నిరూప్ మృతి చెందాడు. విషయాన్ని బయటకు పొక్కకుండా గుట్టుచుప్పుడు కాకుండా శ్మశానవాటికలో ఖననం కూడా చేయడం విమర్శలకు దారి తీసింది. కనీసం కలెక్టర్, ఆ శాఖ డైరెక్టరేట్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వలేదు. దీనిపై ‘సాక్షి’లో కథనం రావడంతో స్పందించిన ఐసీడీఎస్ రాష్ట్ర డైరెక్టర్ వేణుగోపాల్రెడ్డి జిల్లాకు వచ్చి ఘటనపై ఆరా తీశారు. కలెక్టర్ ఆనంద్ త్రిసభ్య కమిటీని నియమించారు. పై అధికారులకు సమాచారం ఇవ్వలేదనే కారణంతో వెంటనే అప్పటి పీడీ నాగమణిని సస్పెండ్ చేశారు. శభాష్ కలెక్టర్.. తాజాగా శిశుగృహ విషయంలో కలెక్టర్ ఆనంద్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. తొలినుంచి శిశుగృహ సిబ్బందిపై అవినీతి ఆరోపణలున్నాయి. ఓ ఎన్ఆర్ఐ మహిళను బంగారు, డబ్బులు డిమాండ్ చేసిన ఘటనలో ఏకంగా కేంద్ర మంత్రి వరకూ ఫిర్యాదుల వెళ్లాయి. హిందూపురం పట్టణానికి చెందిన మహిళతో నగరంలోని ఓ బంగారు దుకాణంలో నెక్లెస్ కొనుగోలు చేయించుకున్న వైనం వెలుగుచూసింది. తరుచూ అవినీతి ఆరోపణలు వస్తున్నా గతంలో పనిచేసిన ఐసీడీఎస్ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో వారు ఆడిందే ఆట.. పాడిందే పాట చందాన మారింది. చివరికి చిన్నారి ప్రాణం బలి తీసుకున్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ అనంతరం కలెక్టర్ ఆనంద్ శిశుగృహ సిబ్బందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. శిశుగృహలో చిన్నారులకు ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయంగా వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలను నియమించిన తర్వాత వేటు వేశారు. త్వరలో శిశుగృహలో నూతనంగా సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. -
తీవ్ర సంక్షోభంలో అన్నదాత
అనంతపురం:జిల్లాలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, మాజీ ఎంపీ తలారి రంగయ్య, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి అన్నారు. జిల్లాలో అరటి రైతులను ఆదుకోవాలనే ప్రధాన డిమాండ్తో మంగళవారం కలెక్టర్ ఓ. ఆనంద్ను కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో రైతులు పడుతున్న కష్టాలను కలెక్టర్కు వివరించారు. ఎకరా అరటి సాగుకు రూ.1.50 లక్షల పెట్టుబడి పెడితే.. కనీసం రూ.5 వేలు కూడా రైతుకు అందడం లేదని పేర్కొన్నారు. దీంతో దిక్కుతోచని స్థితిలో పొలాల్లోనే ట్రాక్టర్తో అరటి పంటను దున్నేస్తున్న పరిస్థితిని వివరించారు. దిగుబడి వచ్చిన అరటి గెలలను కలెక్టర్కు చూపించారు. ప్రభుత్వం స్పందించకపోతే కలెక్టరేట్ ఎదుటే అరటికాయలు అమ్మి నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. తక్షణమే అరటిని కొనుగోలు చేయాలి.. జిల్లా నుంచి రైతుల వలసలు అనివార్యమయ్యే పరిస్థితి ఏర్పడిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి వాపోయారు. జిల్లాలో సుమారు 40 వేల ఎకరాల్లో అరటి సాగైతే 8 లక్షల టన్నుల దిగుబడి వస్తోందన్నారు. టన్ను కేవలం రూ.1,000 నుంచి రూ.2,000 పలుకుతుండడంతో రైతు పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ప్రస్తుతం అరటి రైతులు గిట్టుబాటు ధర లేక పంటలను తోటల్లోనే వదిలేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి అరటిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కనీస మద్దతు ధర కల్పించి రైతుల వద్దే నేరుగా ధాన్యాన్ని కొనుగోలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అరటి ఎగుమతి చేయడానికి ప్రత్యేకంగా కిసాన్ రైల్ను ఏర్పాటు చేసి ఢిల్లీకి తరలించిన పరిస్థితి ఉండేదని ఆయన వివరించారు. ఆ ఫ్లెక్సీలు ఏమయ్యాయో? ఇటీవల జిల్లా కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించిన సమయంలో టీడీపీ నాయకులు ఇక్కడ పెద్ద ఫ్లెక్సీ కట్టారని, రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పిస్తున్నామని ప్రగల్భాలు పలికారని, నేడు ఆ ఫ్లెక్సీలు ఎక్కడ ఉన్నాయో అంటూ మాజీ ఎంపీ, పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య ఎద్దేవా చేశారు. అరటికి కనీస మద్దతు ధర ఎందుకు కల్పించడం లేదని నిలదీశారు. తమ ప్రభుత్వ హయాంలో నేరుగా పంట ఉత్పత్తులను కొనుగోలు చేసి మద్దతు ధర కల్పించామన్నారు. ఇప్పుడు అరటికి కనీస మద్దతు ధరతో కొనుగోలు చేసినట్లు కనీసం ఒక్క చోటైనా చూపించండి అంటూ సవాలు విసిరారు. రైతులకు ఏం చేశారో చెప్పాలి.. అరటి పంటను పొలాల్లో ట్రాక్టర్తో దున్నేస్తుంటే బాధేస్తోందని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి అన్నారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అనే విధానంతో పాలన సాగిస్తూ రైతన్నలను చిన్నచూపు చూస్తున్నారన్నారు. జిల్లాలో అరటి రైతన్న కుదేలవుతున్నాడన్నారు. హార్టికల్చర్ వైపు వెళ్లాలంటేనే రైతులు నిరుత్సాహపడుతున్నారని, ఈ అంశాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ‘మీ కోసం రైతన్నా’ అంటూ డ్రామాలకు తెరతీసిందని దుయ్యబట్టారు. 18 నెలల కాలంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, గిట్టుబాటు ధర ఇచ్చారా? రాయితీలు ఇచ్చారా అనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ నాగరత్నమ్మ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్ రెడ్డి, పంచాయతీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్ర రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, మారుతీ నాయుడు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, శివశంకర్ నాయక్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస నాయక్, పార్టీ వ్యవసాయ విభాగం రాష్ట్ర కార్యదర్శి తరిమెల వంశీ గోకుల్ రెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు వై. నారాయణ రెడ్డి, జెడ్పీటీసీలు భోగాతి ప్రతాప్ రెడ్డి, నీలం భాస్కర్, బొమ్మల శ్రీరామిరెడ్డి, ముసలన్న, మండల కన్వీనర్లు పూల ప్రసాద్, కన్వీనర్ ఎల్లా రెడ్డి, కన్వీనర్ గువ్వల శ్రీకాంత్ రెడ్డి, ఖాదర్ వలి, శివశంకర్, మహేష్ రెడ్డి, కల్లూరు సూర్యనారాయణ రెడ్డి, చికెన్ నారాయణ స్వామి, శ్రీనివాస రెడ్డి, తిమ్మాపురం రాఘవ రెడ్డి, చింత కుంట మల్లికార్జున రెడ్డి, ఎల్లుట్ల శేఖర్, బాలరాజు, తిరుపతయ్య, భయేశ్వర రెడ్డి, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబుకు పెత్తందార్లపై ఉన్న ప్రేమ రైతన్నలపై లేదు అన్నదాతను ఆదుకోకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామి రెడ్డి ధ్వజం పార్టీ నేతలు శైలజానాథ్, రంగయ్య, విశ్వతో కలిసి కలెక్టర్కు వినతి పత్రం -
పెన్షనర్లు.. అష్టకష్టాలు
● రిటైర్డ్ ఉద్యోగుల జీవితాలతో చంద్రబాబు సర్కారు చెలగాటం ● బెనిఫిట్లు అందించడంలో తాత్సారం ● 30 ఏళ్లలో ఇలా లేదంటున్న పెన్షనర్లు అనంతపురం అర్బన్: చంద్రబాబు పాలనలో ప్రభుత్వ పెన్షనర్ల కష్టాలు చెప్పనలవిగా మారాయి. ఉద్యోగ విరమణ చేసిన తరువాత ఆర్థిక ప్రయోజనాలు అందక తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. చేతిలో డబ్బు లేక కొందరు పెన్షనర్లు ఇళ్లలో జరగాల్సిన శుభకార్యాలయాలను సైతం వాయిదా వేసుకుంటున్నారు. గ్రాట్యూటీ రూ.94.88 కోట్లు పెండింగ్ ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ప్రభుత్వం గ్రాట్యుటీ కింద గరిష్టంగా రూ.16 లక్షలు చెల్లి స్తుంది. జిల్లాలో గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు వివిధ హోదాల్లో 593 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందినట్లు సమాచారం. వీరికి గ్రాట్యుటీ రూపంలో అందాల్సిన రూ.94.88 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇక.. సర్వీసులో ఉండగా ఉద్యోగులు మిగుల్చుకున్న ఎర్న్ లీవ్లకు (ఈఎల్) రిటైర్మెంట్ సమయంలో డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కో ఉద్యోగి దాదాపు 300 రోజులు (పది నెలలు) ఎర్న్ లీవులను వెనక్కి ఇస్తారు. ఈ క్రమంలో ఒక్కో ఉద్యోగికి సగటున రూ.8 లక్షలుగా 593 మందికి రూ.47.44 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించకుండా పెండింగ్ ఉంచిందని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధం.. రిటైర్మెంట్ బెనిఫిట్లను ప్రభుత్వం చెల్లించకపోవడంపై కొందరు పెన్షనర్లు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రెవెన్యూ శాఖలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన కొందరు కోర్టులో కేసు వేసేందుకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. ఉద్యోగి రిటైర్మెంట్ తరువాత బెనిఫిట్లను ప్రభుత్వం మూడు నెలలకు మించి పెండింగ్లో ఉంచరాదని సుప్రీం కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయడం లేదని పెన్షనర్ల సంఘం నాయకులు చెబుతున్నారు. పెన్షనర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. 18 నెలలుగా రిటైర్మెంట్ బెనిఫిట్లు అందలేదు. 30 ఏళ్ల సర్వీసులో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు. ఉద్యోగి రిటైర్ అయిన 3 నెలల్లోపు బెనిఫిట్లు చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు. ప్రభుత్వం నుంచి డబ్బులు రాక పెన్షనర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. – శీల జయరామప్ప, పెన్షనీర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి -
అంతా మా ఇష్టం
● ఉండబండ వీరభద్రేశ్వరాలయంలో సిబ్బంది, అర్చకుల ఇష్టారాజ్యం ● గర్భగుడికి తాళం వేయడంపై సర్వత్రా విమర్శలు విడపనకల్లు: మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఉండబండ వీరభద్రస్వామి దేవాలయంలో అంతా ఇష్టారాజ్యంగా మారింది. మంగళవారం ఏకంగా అర్చకులు గర్భగుడికి తాళం వేశారు. దీంతో భక్తులు ఆలయ ఆవరణంలోనే కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించి వెళ్లిపోయారు. ఆలయ కార్యకలాపాలు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్నా భక్తులకు కనీస సౌకర్యాలు కూడా లేకుండా పోయాయి. ఆలయంలో పది మంది వరకూ అర్చకులు, 8 మంది దేవదాయ శాఖ సిబ్బంది ప్రతి నెలా దేవుని సొమ్మును జీతంగా తీసుకుంటున్నా అందుబాటులో ఉండటం లేదని భక్తులు వాపోతున్నారు. దేవదాయ శాఖ అధికారులు ఆడిందే ఆట.. పాడిందే పాట చందాన మారిందని మండిపడుతున్నారు. ఆలయ ఈఓ ఎక్కడ ఉంటారో కూడా తెలియడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులైనా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
రైతులను తక్షణమే ఆదుకోవాలి
● ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ఉరవకొండ: పంటలకు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న రైతులను తక్షణమే ఆదుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో మొక్కజొన్న, మినుములు, శనగలు, పత్తి, అరటి, మిర్చితో పాటు ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా పోయిందన్నారు. దీనికి తోడు అన్నదాత సుఖీభవ పథకం అందకపోవడంతో రైతులపై ఆర్థిక భారం పెరిగిపోతోందన్నారు. పంటకు చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక ఈ 18 నెలల కాలంలోనే వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం క్వింటా రూ.2,400 మద్దతు ధర ప్రకటించిందని, అయితే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో అంతులేని నిర్లక్ష్యం కనబరుస్తూ రైతులను దగా చేస్తోందని మండిపడ్డారు. ఇదే అవకాశంగా భావించిన దళారులు క్వింటా మొక్కజొన్నను రూ.1,400కు మించి కొనుగోలు చేయడం లేదన్నారు. విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకోకుండా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పెట్టుబడుల సేకరణ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ విదేశీ పర్యటనలు సాగిస్తున్నారని విమర్శించారు. యోగా డే పేరుతో రూ.300 కోట్లను వృథాగా ఖర్చు పెట్టారన్నారు. ఇప్పటికై నా రైతాంగ సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. బాల్య వివాహాలు లేని జిల్లాగా మారుద్దాం ● జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి రాజశేఖర్రాబు రాప్తాడు రూరల్: బాల్య వివాహాలు లేని జిల్లాగా అనంతను మారుద్దామని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (డీసీఎల్ఏ) కార్యదర్శి, న్యాయమూర్తి రాజశేఖర్బాబు పిలుపునిచ్చారు. అనంతపురం రూరల్ పరిధిలోని కురుగుంట కేజీబీవీలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ‘బేటీ బచావో బేటీ పడావో’, ‘బాల్య వివాహాలు అరికట్టడం’ అంశాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చిన్న వయసులోనే ఆడ పిల్లలకు పిల్లలకు పెళ్లిళ్లు చేయడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. ఉన్నతస్థాయికి చేరుకోవడమే లక్ష్యంగా బాగా చదువుకోవాలని సూచించారు. ఐసీడీఎస్ ఇన్చార్జ్ పీడీ అరుణకుమారి మాట్లాడుతూ.. బాలల రక్షణ చట్టాలపై చైతన్య పరిచేలా జిల్లాలోని 32 కేజీబీవీల్లో 16 రోజుల పాటు ఈ అవగాహన సదస్సులు కొనసాగుతాయన్నారు. లోక్ అదాలత్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇలాంటి కార్యక్రమాలు బాలికల్లో చైతన్యం తెస్తాయన్నారు. అనంతరం విద్యార్థినులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మిషన్ వాత్సల్య కోఆర్డినేటర్ బీఎన్ శ్రీదేవి, చైల్డ్హెల్ప్ లైన్ జిల్లా సమన్వయకర్త కృష్ణమాచారి, కేజీబీవీ ప్రిన్సిపాల్ నర్మద, లీగల్ ఆఫీసర్ సంధ్యారాణి, రెడ్స్ ఎన్జీఓ సీఈఓ భానూజ పాల్గొన్నారు. -
సైన్స్ సెంటర్లో నేటి నుంచి శిక్షణ
అనంతపురం సిటీ: జిల్లాలోని ప్రభుత్వ యాజమాన్యం పరిధిలోని అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉన్నత పాఠశాలల హెచ్ఎంలు, ల్యాబ్ ఇన్చార్జ్ ఉపాధ్యాయులకు బుధవారం నుంచి అనంతపురంలోని సైన్స్ సెంటర్లో శిక్షణ తరగతులు ప్రారంభించనున్నారు. ఈ మేరకు సైన్స్ సెంటర్ జిల్లా అధికారి బాలమురళీకృష్ణ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అటల్ టింకరింగ్కు సంబంధించి ల్యాబ్ నిర్వహణ, నిధుల వినియోగం, ప్రాజెక్టుల తయారీ, రికార్డుల నిర్వహణ వంటి అన్ని అంశాలపై నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. పాముకాటుతో యువరైతు మృతి పుట్లూరు: మండలంలోని చింతకుంట గ్రామానికి చెందిన యువరైతు యలగాని ప్రతాప్ (30) పాముకాటుతో మృతిచెందాడు. గ్రామ సమీపంలో ఉన్న పత్తి పొలానికి నీరు పెట్టడానికి మంగళవారం ఉదయం వెళ్లిన సమయంలో పాము కాటుకు గురయ్యాడు. విషయాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయనకు భార్య శరణ్య, ఐదు నెలల కుమార్తె ఉంది. కాగా, భర్త మృతిపై శరణ్య అనుమానాలు వ్యక్తంచేస్తూ ఫిర్యాదు చేయడంతో ఆ దిశగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వివాహిత బలవన్మరణం పెద్దపప్పూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. గార్లదిన్నె మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన అనిత (30)కు ఎనిమిదేళ్ల క్రితం పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటకు చెందిన మంగల శ్రీరాములుతో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని నెలల క్రితం దంపతుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకోడంతో అనిత పుట్టింటికి చేరుకుంది. ఆ సమయంలో పెద్దలు పంచాయితీ చేసి సర్దిచెప్పడంతో తిరిగి భర్త వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో భర్త వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో జీవితంపై విరక్తి చెందిన అనిత.. మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చిన్నారుల ఏడుపులను విన్న స్థానికులు ఇంటి తలుపులు తెరిచి చూడడంతో విషయం వెలుగు చూసింది. కాగా, అప్పటికే భర్త, అత్తమామలు పరారయ్యారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గంజాయి ముఠా అరెస్ట్ అనంతపురం సెంట్రల్: విశాఖపట్నం నుంచి గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యులను మంగళవారం అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం త్రీటౌన్ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను సీఐ రాజేంద్రనాథ్యాదవ్ వెల్లడించారు. పట్టుబడిన వారిలో అనంతపురంలోని ఎర్రనేల కొట్టాలకు చెందిన రహమత్, ఆరో రోడ్డులో నివాసముంటున్న అస్లాంబాషా, 3వ రోడ్డుకు చెందిన రవికుమార్, టీవీ టవర్ ప్రాంతానికి చెందిన సాలోమన్, తపోవనంలో నివాసముంటున్న జ్యోతుల ప్రవీణ్కుమార్, కళ్యాణదుర్గం బైపాస్ ప్రాంతానికి చెందిన దినేష్గౌడ్, బెళుగుప్పకు చెందిన మనోజ్కుమార్ ఉన్నారు. వీరి నుంచి 4.5 కిలోల గంజాయి, 8 సెల్ఫోన్లు, రూ. 2,700 నగదు, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కురుగుంటకు చెందిన హాజీ రహమత్ అలియాస్ బువమ్మతో కలసి మనోజ్కుమార్, షేక్ అస్లాంబాషా ఇటీవల విశాఖపట్నం జిల్లా తునికి వెళ్లి అక్కడ ఓ వ్యక్తి నుంచి కిలో రూ. 5వేలు చొప్పున 10 కిలోల గంజాయిని కొనుగోలు చేసి అక్రమంగా రైలులో అనంతపురానికి తీసుకువచ్చారు. ఇందులో నాలుగు కిలోల గంజాయిని కర్ణాటకలోని బాగేపల్లిలో విక్రయించారు. 100 గ్రాముల చొప్పున పొట్లాలుగా కట్టి నగర పరిసరాల్లో ప్యాకెట్ రూ.2 వేలు చొప్పున విక్రయించేందుకు చూస్తుండగా పక్కా సమాచారంతో అరెస్ట్ చేసినట్లు సీఐ వివరించారు. -
ఒత్తిళ్లు తాళలేక లైన్మెన్ ఆత్మహత్యాయత్నం
ఉరవకొండ: అధికారిక ఒత్తిళ్లు తాళలేక స్థానిక శివరామిరెడ్డి, డ్రైవర్స్, తదితర కాలనీల విద్యుత్ శాఖ లైన్మెన్ ఎన్.రమేష్ మంగళవారం కార్యాలయంలోనే పురుగుల మందు తాగాడు. గమనించిన సహచర ఉద్యోగులు వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి వైద్యులు రెఫర్ చేశారు. కాగా, విద్యుత్ బిల్లుల బకాయిలు కట్టించాలంటూ కొన్ని నెలలుగా రమేష్పై ఉన్నతాధికారులు ఒత్తిళ్లు ఎక్కువయ్యాయని, అయితే అతనికి కేటాయించిన కాలనీల్లో ఎక్కువ శాతం మంది పేద, బడుగు వర్గాలు వారు ఉండటంతో వారు సమయానికి బిల్లులు చెల్లించకపోయేవారుగా తెలుస్తోంది. ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక అఘాయిత్యానికి పాల్పడినట్లుగా సమాచారం. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. -
రుణాలు ఇస్తామంటూ మహిళలకు కుచ్చుటోపీ
● ఒక్కొక్కరితో రూ.3 వేలు వసూలు చేసి ఉడాయించిన మోసగాళ్లు రాయదుర్గం టౌన్: స్థానిక ముత్తరాసి కాలనీ, శనీశ్వరాలయం, గ్యాస్ గోడౌన్ ఏరియాతో పాటు మండలంలోని ఆయతపల్లి గ్రామంలో రుణాలు మంజూరు చేస్తామంటూ ఒక్కో మహిళతో రూ.3 వేలు చొప్పున ఇద్దరు వ్యక్తులు వసూలు చేసుకుని ఉడాయించారు. ‘ఉషోదయ ఫైనాన్స్ కంపెనీ నుంచి వచ్చాం. రూ.55 వేల నుంచి రూ.2 లక్షల వరకూ రుణాలు ఇస్తాం. క్రమం తప్పకుండా కంతులు చెల్లిస్తే చాలు’ అంటూ మోసానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. మోసపోయి ఇప్పటి వరకూ బయట పడిన వారిలో ముత్తరాసికాలనీకి చెందిన రాజి, చౌడమ్మ, ముత్యమ్మ, అనంతమ్మ, కృష్ణమ్మ, సరస్వతి, గంగమ్మ, లోకమ్మ తదితరులు మొత్తం 11 మంది ఉన్నారు. తీసుకున్న రుణానికి సంబంధించి నెలవారీ కంతులు చెల్లించే అవకాశం ఉంటుందని నమ్మించి గత శనివారం ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరితో రూ.3 వేలు చొప్పున వసూలు చేసుకుని గిఫ్ట్ కింద ఓ నాసిరకం ఫ్యాన్ను అంటగట్టి వెళ్లారని బాధితులు వాపోయారు. ఆ తర్వాత రుణం కోసం వారిచ్చిన ఫోన్ నంబర్కు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తోందని, దీంతో తాము మోసపోయినట్లుగా గుర్తించామని వివరించారు. మోసగాళ్లపై చర్యలు తీసుకుని తమ డబ్బు వెనక్కు ఇప్పించాలని కోరారు. -
వారసత్వ సంపదను కాపాడుకుందాం
● కలెక్టర్ ఆనంద్ అనంతపురం కల్చరల్: వారసత్వ సంపదను కాపాడుకోవడం అందరి బాధ్యత అని కలెక్టర్ ఆనంద్ అన్నారు. నగరంలో వారం రోజులుగా సాగుతున్న ప్రపంచ వారసత్వ వారోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా స్థానిక కల్లూరు సుబ్బారావు పురావస్తు ప్రదర్శన శాలలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు అందించిన సహకారం ఎంతో ప్రోత్సాహమిచ్చిందన్నారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులనందించారు. న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన కవులు, రచయితలను సత్కరించారు. కార్యక్రమంలో పురావస్తు శాఖ ఏడీ స్వామినాయక్, పర్యాటక శాఖ అధికారి జయకుమార్, డిస్కవర్ ఏజీ అనిల్కుమార్రెడ్డి, లేడీస్క్లబ్ సెక్రటరీ పద్మానారాయణరెడ్డి, ఇన్నర్వీల్ జయంతి, ఇంటాక్ కన్వీనర్ రాంకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అజ్ఞాతంలోకి చిట్టీ నిర్వాహకురాలు
● లబోదిబోమంటున్న బాధితులు గుంతకల్లు టౌన్: స్థానిక ధర్మవరం రైల్వేగేట్ ప్రాంతంలో నివాసముంటున్న చిట్టీ నిర్వాహకురాలు దిల్షాద్ తన ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. చిట్టీ కట్టించుకుని డబ్బులు ఇవ్వకపోవడంతో గత ఆదివారం ఆమె ఇంటి ఎదుట బాధితులు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఐపీ నోటీసులు పంపిస్తానని, తననేమీ ఎవరూ ఏమీ చేయలేరంటూ దిల్షాద్ బెదిరింపులకు దిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేసినా బాధితులు వినలేదు. దాదాపు ఐదు గంటలకు పైగా దిల్షాద్ ఇంటి ఎదుటే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చివరకు తన ఇంటిని విక్రయించి డబ్బు చెల్లిస్తానంటూ పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకున్న దిల్షాద్ సోమవారం రాత్రికి రాత్రే తన ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న బాధితులు అరుణమ్మ, చాంద్బీ, షాకీరా, మంజుల, శ్రీమేఘన, పర్వీన్, రాబర్ట్, రాబియా తదితరులు మంగళవారం మరోసారి దిల్షాద్ ఇంటి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు విజయజ్యోతి, కేజీఎన్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ మాలిక్ సాహెబ్, కాంగ్రెస్ నాయకులు మహేంద్ర, ఫిరోజ్ఖాన్ తదితరులు మద్దతు తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకూ రోజూ దిల్షాద్ ఇంటి ఎదుట నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. -
హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించారు
● పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత కుటుంబసభ్యులు కళ్యాణదుర్గం రూరల్: కుటుంబ పరువు కోసం తమ కుమారుడిని హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ బాధిత కుటుంబసభ్యులు మంగళవారం కళ్యాణదుర్గం పీఎస్లో ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో వారు మాట్లాడారు. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన తొలిచేటి గోవిందు కుమార్తె తరుచూ బ్రహ్మసముద్రం మండలం యానకల్లులోని వారి బంధువుల ఇంటికి వచ్చేదని, ఈ క్రమంలో యానకల్లుకు చెందిన బోయ ఆనంద్తో అయిన పరిచయం ప్రేమగా మారిందని గుర్తు చేశారు. ఈ విషయం యువతి కుటుంబసభ్యులకు తెలియడంతో వారు తమ బంధువుల యువకుడికి ఇచ్చి పెళ్లి జరిపించారన్నారు. ఆ తర్వాత యువతి ప్రేమ విషయం తెలుసుకున్న భర్త ఆమెకు విడాకులు ఇచ్చాడని, నాలుగు రోజుల క్రితం బెంగళూరులో ఉన్న ఆనంద్కు ఆ యువతి ఫోన్ చేసి కళ్యాణదుర్గం వస్తే పెళ్లి చేసుకుందామని తెలిపిందన్నారు. దీంతో ఈ నెల 21న కళ్యాణదుర్గానికి వచ్చిన ఆనంద్ బైపాస్ వద్ద పురుగుల మందు సేవించి.. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాదని ఆనంద్ తండ్రి వెంకటేశులు, అతని సోదరి వరలక్ష్మి పేర్కొన్నారు. ఈ అంశంలో లోతైన దర్యాప్తు చేపట్టి వాస్తవాలు నిగ్గుతేల్చాలంటూ బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
‘ఎస్ఐఆర్’పై అవగాహన ఉండాలి
● ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పనిసరి ● అధికారులకు డీఆర్ఓ మలోల ఆదేశం అనంతపురం అర్బన్: ఓటరు జాబితా సవరణకు సంబంధించి త్వరలో చేపట్టనున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సంబంధిత అధికారులను డీఆర్ఓ మలోల ఆదేశించారు. ఎస్ఐఆర్పై కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్ఓ), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఏఈఆర్ఓ), ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ల (ఈడీటీ)లతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఎస్ఐఆర్ నిర్వహణ షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ త్వరలో విడుదల చే యనుందన్నారు. గతంలో స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్ ) నిర్వహించే వారని గుర్తు చేశారు. ప్రస్తుతం దాని స్థానంలో ఎస్ఐఆర్ను ప్రవేశపెట్టినట్లు వివరించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఇందులో ఏవైనా సందేహాలు తలెత్తితే నివృత్తి చేసుకున్న తరువాతే నిర్ణయం తీసుకోవాలన్నారు. తొందరపాటు నిర్ణయాలతో తలెత్తే ఇబ్బందులకు సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సమావేశంలో ఈఆర్ఓలుగా ఉన్న ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, ఏఈఆర్ఓలుగా ఉన్న తహసీల్దార్లు, ఎన్నికల విభాగం డీటీలు పాల్గొన్నారు. -
ఎస్ఆర్ఐటీకి మరో ప్రతిష్టాత్మక గుర్తింపు
బుక్కరాయసముద్రం: మండలంలోని రోటరీపురం వద్ద ఉన్న ఎస్ఆర్ఐటీ (అటానమస్) ఇంజినీరింగ్ కళాశాలకరు మరో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించిందని ఆ కళాశాల కరెస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి తెలిపారు. మంగళవారం ఎస్ఆర్ఐటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కళాశాలలో 5 బీటెక్ కోర్సులకు టైర్–1 కింద నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు దక్కిందన్నారు. ఈ గుర్తింపుతో రాయలసీమ జిల్లాల్లోనే నంబర్–1 స్వయం ప్రతిపత్తి ఇంజినీరింగ్ కళాశాలగా ఖ్యాతి దక్కిందన్నారు. 2017లో న్యాక్ ఏ–గ్రేడ్, 2018లో మూడు బీటెక్ కోర్సులకు (ఎన్బీఏ) టైర్–2 గుర్తింపు, 2019లో స్వయం ప్రతిపత్తి (అటానమస్) హోదా లభించిందని గుర్తు చేశారు. తాజాగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈఈ), సివిల్ ఇంజినీరింగ్ (సీఐవీ), మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంఈసీ) కోర్సులకు (ఎన్బీఏ) టైర్–1 గుర్తింపు దక్కడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సమావేశంలో కళాశాల వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రంజిత్రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ బాలకృష్ణ పాల్గొన్నారు. -
మనల్నెవడ్రా ఆపేది!
అనంతపురం టౌన్: జిల్లా వ్యాప్తంగా అక్రమంగా ఖనిజాన్ని తవ్వి తరలించేస్తున్నారు. గతంలో భారీగా జరిమానాలు విధించి సీజ్ చేసిన క్వారీల్లో సైతం తవ్వకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ‘ప్రభుత్వం మాదే మమ్మల్ని ఎవడ్రా ఆపేది’ అన్న రీతిలో టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ జేబులు నింపుకుంటున్నారు. విషయం గనులశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదు. స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదులు అందినా క్వారీల వైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లకు తలొగ్గి మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిగో సాక్ష్యం.. శెట్టూరు మండలం యాటకల్లు గ్రామ సమీపంలో కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన డి.శివప్రసాద్ 1.07 హెక్టార్లలో రోడ్డు మెటల్ క్వారీకి లీజు తీసుకున్నాడు. గనుల శాఖకు ఎలాంటి రాయల్టీ చెల్లించకుండా దాదాపు 6,700 క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్ను అక్రమంగా తవ్వేశాడు. గనులశాఖ అధికారులు 2024 మేలో క్వారీని పరిశీలించి రూ.43 లక్షల మేర నిర్వాహకునికి జరిమానా నోటీసులు జారీ చేసి క్వారీని సీజ్ చేశారు. ప్రస్తుతం క్వారీ నిర్వాహకుడు కళ్యాణదుర్గానికి చెందిన ప్రజాప్రతినిధి అండతో యథేచ్ఛగా తవ్వకాలు చేపడుతున్నాడు. గనులశాఖ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా క్వారీ వైపు కన్నెత్తి చూడడం లేదంటే ఏస్థాయిలో అధికార బలాన్ని ప్రదర్శిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. చట్టరీత్యా నేరం అక్రమంగా తవ్వకాలు చేపడుతున్న క్వారీలకు జరిమానాలు విధించాం. వాటిని చెల్లించిన తర్వాతే మళ్లీ కార్యకలాపాలు చేపట్టాలి. పైసా చెల్లించకుండా తవ్వకాలు చేయడం చట్టరీత్యా నేరం. విచారణ చేపట్టి నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. – ఆదినారాయణ, డిప్యూటీ డైరెక్టర్, గనులశాఖ గతంలో సీజ్ చేసిన క్వారీల్లో మళ్లీ తవ్వకాలు జరిమానా వేసిన వాటిల్లోనూ దందా శెట్టూరు మండలం యాటకల్లులో వేల క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్ తరలింపు అటు వైపు కన్నెత్తి చూడని అధికారులు చియ్యేడు గ్రామ పొలం సర్వే నం. 231లో హెక్టార్ భూమిలో రోడ్డు మెటల్ క్వారీకి ఎం. గాయత్రి పేరిట లీజు తీసుకున్నారు. రాయల్టీ చెల్లించకుండా భారీ ఎత్తున మెటల్ను తరలించడంతో గతంలో గనులశాఖ, విజిలెన్సు అధికారుల బృందం సంయుక్తంగా క్వారీని పరిశీలించింది. అక్రమాలకు పాల్పడినట్లు నిర్ధారించి రూ. 76 లక్షల మేర నిర్వాహకులకు జరిమానా విధించి క్వారీని సీజ్ చేసింది. నిర్వాహకులు మాత్రం పైసా కూడా చెల్లించకుండానే ఇటీవల క్వారీలో తవ్వకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇది అనంతపురం రూరల్ మండలం క్రిష్ణంరెడ్డిపల్లి సమీపం చియ్యేడు పొలం సర్వే నంబర్ 231లో ఏర్పాటైన రోడ్డు మెటల్ క్వారీ. ఇక్కడ ఒక హెక్టార్లో రోడ్డు మెటల్ తవ్వకాలకు లీజు పొందిన ఎం.జ్ఞానేశ్వర్ గనులశాఖకు ఎలాంటి రాయల్టీ చెల్లించకుండానే వేల క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్ను తవ్వి తరలించేశాడు. 2022 మార్చి 10న గనులశాఖ అధికారులు క్వారీని తనిఖీ చేసి రూ.1.31 కోట్ల మేర ఖనిజాన్ని అక్రమంగా తరలించారని నిర్ధారించి క్వారీని సీజ్ చేశారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే క్వారీలో మళ్లీ తవ్వకాలు ప్రారంభించిన నిర్వాహకుడు.. ఇప్పటికే వేల క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్ను అక్రమంగా తరలించేశాడు. -
ఆశావాద దృక్పథంతో పనిచేయాలి
● అధికారులకు ఎల్బీఎస్ఎన్ఏఏ డైరక్టర్ శ్రీరామ్ తరణికంటి ఆదేశం అనంతపురం అర్బన్: వికసిత్ భారత్ సాధనే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఆశావాద దృక్పథంతో పనిచేయాలని జిల్లా అధికారులకు ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్బీఎస్ఎన్ఏఏ) డైరెక్టర్ శ్రీరామ్ తరణికంటి సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో కలెక్టర్ ఓ.ఆనంద్, డీఆర్ఓ ఎ.మలోలతో కలసి జిల్లా అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. పాలనా వ్యవహారాల్లో విశేష అనుభవం ఉన్న జిల్లా అధికారుల సలహాలు, సూచనలు తీసుకుని ఐఏఎస్ అధికారులకు ఇచ్చే శిక్షణలో మార్పులు, చేర్పులు చేస్తున్నట్లు తెలిపారు. సమస్య ఏదైనా ప్రాక్టికల్గా ఆలోచించి ఆచరణలో పెడితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. 30 ఏళ్ల అనుభవం ఉన్న జిల్లా అధికారులకు సృజనాత్మకత జోడించేందుకు ముస్సోరీలో శిక్షణ ఇస్తే ప్రయోజనకంగా ఉంటుందని డీఆర్ఓ కోరగా.. అంశాన్ని పరిశీలిస్తామన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సౌత్ జోన్ క్రికెట్ జట్టుకు క్రీడాకారుల ఎంపిక అనంతపురం కార్పొరేషన్: అండర్ –14 సౌత్ జోన్ క్రికెట్ జట్టుకు జిల్లాకు చెందిన ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ సంఘం సోమవారం జట్టును ప్రకటించింది. ఎంపికై న వారిలో మోక్షన తేజ్(కళ్యాణదుర్గం), హేమచంద్రా నాయక్ (అనంతపురం), పంకజ్ (గుత్తి), కె.రోహిత్ (హిందూపురం) కీలక జట్టులో చోటు దక్కించుకోగా, క్రిటిక్ సాయి (పరిగి) స్టాండ్బైగా ఎంపికయ్యాడు. వ్యక్తి బలవన్మరణంఅనంతపురం సెంట్రల్: జిల్లా కేంద్రంలోని పీటీసీ ఫ్లై ఓవర్ పైనుంచి కిందకు దూకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 45 సంవత్సరాలున్న వ్యక్తి గుంతకల్లుకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్లో జనరల్ టికెట్ తీసుకున్నాడు. అంతకు మించి అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. సమాచారం అందుకున్న మూడో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, మృతదేహాన్ని సర్వజనాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని సీఐ రాజేంద్రనాథయాదవ్ కోరారు. యువతి ఆత్మహత్యగుంతకల్లు: స్థానిక ధర్మవరం రైల్వే ఎల్సీ గేట్ సమీపంలో గూడ్స్ రైలు కింద పడి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. జీఆర్పీ పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లులోని హనుమేష్ నగర్కు చెందిన వీరన్న, సుంకమ్మ దంపతులకు నలుగురు కుమార్తెలు కాగా, వీరిలో చిన్న కుమార్తె లక్ష్మి (20) మానసిక సమస్యతో బాధపడుతోంది. దీంతో తరచూ ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయేది. కుటుంబసభ్యులు చికిత్స చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లిన లక్ష్మి... ఉదయం 11.30 గంటల సమయంలో ధర్మవరం గేట్ సమీపంలో గూడ్స్ రైలు వెళ్తున్న పట్టాలపై పడుకుని ఆత్మహత్య చేసుకుంది. మొండెం నుంచి తల వేరుపడింది. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికతాడిపత్రి టౌన్: జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టులో తాడిపత్రికి చెందిన అయేషా ఎంపికై ంది. ఈ మేరకు కోచ్ నరసింహ సోమవారం వెల్లడించారు. ఈ నెల 22 నుంచి 24 వరకు మచిలీపట్నంలో జరిగిన ఎస్జీఎఫ్ అండర్ 14 బాలికల విభాగంలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లుగా వివరించారు. జాతీయ స్థాయి పరుగు పోటీలకు ఎంపిక గుంతకల్లు రూరల్: ఉత్తరప్రదేశ్లోని లక్నోలో డిసెంబర్ 11 నుంచి జరిగే జాతీయ స్థాయి పరుగు పోటీలకు గుంతకల్లు మండలం నరసాపురం జెడ్పీహెచ్ఎస్ పదో తరగతి విద్యార్థిని వర్షిత ఎంపికై ంది. అండర్–17 విభాగంలో ఎంపికై న వర్షితను ఆ పాఠశాల హెచ్ఎం మరియమ్మ, పీడీ చల్లా ఓబులేసు, ఇతర ఉపాధ్యాయులు సోమవారం అభినందించారు. నేటి నుంచి విద్యాశాఖ అధికారుల బడిబాట అనంతపురం సిటీ: జిల్లాలో పాఠశాలల పనితీరును పర్యవేక్షించేందుకు మంగళవారం నుంచి విద్యాశాఖ అధికారులు బడిబాట పట్టనున్నారు. ఇటీవల నిర్వహించిన వెబెక్స్ సమావేశంలో కమిషనరేట్ జారీ చేసిన ఆదేశాల మేరకు రూట్మ్యాప్ను విద్యాశాఖ అధికారులు సిద్ధం చేశారు. బోధనాంశాలు, పాఠశాలల ప్రగతి, విద్యార్థుల పురోగతి, గడువులోపు సిలబస్ పూర్తి చేయడం, పదో తరగతి పరీక్షల నిర్వహణ, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుల జారీ, పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన, ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పరిశీలన, మెరుగైన ఫలితాలను సాధించడమే లక్ష్యంగా జిల్లా, మండల విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఎప్పటికప్పుడు నివేదికలు సిద్ధం చేసి పాఠశాల కమిషనరేట్కు పంపనున్నారు. అలాగే విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయుల పని తీరును మదింపు చేయాలని జిల్లా, మండల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. -
కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు నిర్మించాలి
● అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశం అనంతపురం అర్బన్: పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలు, సచివాలయాలు, దేవాలయాలు, ఆర్టీసీ బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు నిర్మించడంతో పాటు ప్రతి శుక్రవారం అందరూ డ్రై డే పాటించేలా చూడాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన జిల్లా వాటర్, శానిటేషన్ మిషన్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ప్రతి పంచాయతీలోనూ రెండు చొప్పున వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయడంతో పాటు నిర్మాణాలూ పూర్తి చేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా 60 గ్రామాల్లో వ్యక్తిగత సోక్పిట్ల కోసం పరిపాలన అనుమతులు తీసుకుని డిసెంబరు 20 నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. జనవరి మూడో శనివారం నాటికి మరో 100 గ్రామాలకు పరిపాలన అనుమతులు తీసుకుని ఫిబ్రవరి 20వ తేదీలోపు సోక్పిట్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో పాడైన బోరుబావులకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఒక గార్బెజ్ పాయింట్ను గుర్తించి చెత్తనూ పూర్తిగా తొలగించి, అక్కడ మొక్కలు నాటాలన్నారు. డ్వామా, పంచాయతీ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్, డీపీఓ నాగరాజునాయుడు, డ్వామా పీడీ సలీమ్బాషా, జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, హెచ్చెల్సీ ఎస్ఈ సుధాకర్రావు, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ విశ్వనాథరెడ్డి, వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ పాల్గొన్నారు. -
గ్రేడ్–1 మున్సిపాలిటీగా రాయదుర్గం
రాయదుర్గంటౌన్: ప్రథమ శ్రేణి (గ్రేడ్–1) మునిసిపాలిటీగా రాయదుర్గంను అప్గ్రేడ్ చేస్తూ సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు కమిషనర్ దివాకర్రెడ్డి తెలిపారు. దీనిపై మున్సిపల్ చైర్మన్ పొరాళ్ల శిల్ప హర్షం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేయాలని గత నెలలో జరిగిన కౌన్సిల్ మీట్లో తీర్మానించి ప్రభుత్వానికి నివేదించినట్లు గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ పాలకవర్గంలో ప్రథమ శ్రేణి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ కావడం తమకు గర్వంగా ఉందన్నారు. 1963 అక్టోబర్1న రాయదుర్గం పురపాలక సంఘం ఏర్పాటైంది. 2001 మే 18న ద్వితీయ శ్రేణి మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయింది. తాజాగా ప్రథమశ్రేణికి చేరడంతో పట్టణంలో సౌకర్యాల కల్పనతో పాటు నిధుల వెసులుబాటు కలిగి అభివృద్ధికి మరింత అవకాశం ఉంటుంది. ముగిసిన సత్యసాయి శత జయంతి వేడుకలు ప్రశాంతి నిలయం: సత్యసాయి శత జయంతి వేడుకలు సోమవారంతో ముగిశాయి. నవంబర్ 13 నుంచి 24వ తేదీ వరకు జరిగిన వేడుకల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్తో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. అలాగే దేశ విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సత్యసాయి సేవా సెంటర్లను కలుపుతూ ప్రపంచ సదస్సును నిర్వహించింది. నవంబర్ 18న జరిగిన సత్యసాయి రథోత్సవం భక్తులను సాయినామంతో పులకింపజేసింది. 22న జరిగిన సత్యసాయి విద్యాసంస్థల 44వ స్నాతకోత్సవ సంబరం అంబరమంటింది. 23న సత్యసాయి శత జయంతితో బాబా భక్తకోటి మురిసిపోయింది. లక్షలాది భక్తులు ఒక్కచోట చేరి సత్యసాయికి ఆత్మనివేదనను అర్పించుకున్నారు. చిత్రావతి నదిపై, సత్యసాయి హిల్వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన లేజర్ షోలు భక్తులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఉత్సవాల సందర్భంగా సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 15 లక్షల మందికి అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. 40 శాతం సబ్సిడీతో విత్తన వేరుశనగ అనంతపురం అగ్రికల్చర్: రబీ పంటగా నీటి వసతి కింద వేరుశనగ సాగు చేసే రైతులకు 40 శాతం సబ్సిడీతో విత్తనం అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జిల్లాకు 7,300 క్వింటాళ్లు కేటాయించగా అందులో కే–6 రకం 6 వేల క్వింటాళ్లు, టీసీజీఎస్–1694 రకం 1,300 క్వింటాళ్లు కేటాయించినట్లు వ్యవసాయ, ఏపీ సీడ్స్ అధికారులు తెలిపారు. క్వింటా పూర్తి ధర రూ.9,200 కాగా అందులో 40 శాతం రూ.3,680 పోనూ రూ.5,520 ప్రకారం రైతులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక్కో రైతుకు గరిష్టంగా 30 కిలోలు కలిగిన మూడు బస్తాలు పంపిణీ చేస్తామని తెలిపారు. నీటి వసతి కలిగిన రైతులు ఆర్ఎస్కేల్లో తమ పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వేరుశనగ విత్తుకునేందుకు ఈనెల 15 నుంచి డిసెంబర్ 15 వరకు అనుకూలమని శాస్త్రవేత్తలు తెలిపారు. -
అన్నదాత ఆక్రందనలు పట్టవా?
అనంతపురం: వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు.. అదే సిద్ధాంతంతో అన్నదాతలను నట్టేట ముంచుతున్నారని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ విమర్శించారు. ఆయన సోమవారం అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, ఒక్క క్వింటాలు ధాన్యాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు చేసిన దాఖలాలు లేవని తెలిపారు. అన్నదాతల ఆక్రందనలు పట్టించుకోవడం లేదన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అరటి తోటలను పంట ఉండగానే ట్రాక్టర్లతో దున్నేస్తున్న పరిస్థితి చూస్తున్నామన్నారు. అరటి కిలో ఒక్క రూపాయికి కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపించడం లేదన్నారు. అరటి, ఉల్లి, మొక్కజొన్న, వరి ధాన్యం ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతన్నలు ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు పంచ సూత్రాలు వల్లె వేయడం శోచనీయమన్నారు. శాసీ్త్రయ వ్యవసాయం అంటూనే 99 పైసలకే కారు చౌకగా భూములను కార్పొరేట్కు కట్టబెడుతున్నారని విమర్శించారు. యూరియా బ్లాక్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నా పట్టించుకోవడం లేదన్నారు. వైఎస్సార్ హయాంలో వ్యవసాయం పండుగ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదని, ఉచిత విద్యుత్ పథకంతో రైతన్నలకు వెలుగు వచ్చిందని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనూ అన్నదాతలకు తోడుగా నిలిచారన్నారు. రైతు భరోసా కేంద్రాలు, ఉచిత విద్యుత్, ధరల స్థిరీకరణ నిధి, ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా పథకాల ద్వారా అన్నదాతలకు దన్నుగా నిలిచారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఇవన్నీ ఏమీ లేవన్నారు. దాదాపు రూ.600 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ రైతులకు చెల్లించాల్సి ఉన్నా..పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. సంపద సృష్టి అంటే అప్పులు చేయడమేనని చంద్రబాబుకు తెలుసని, రైతులను ఆదుకునే మనసు లేదని విమర్శించారు. గత చంద్రబాబు ప్రభుత్వంలో అనంతపురం జిల్లాలో ఏకంగా 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేశారు. రోమ్ నగరం తగలబడుతుంటే.. ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తి తరహాలో చంద్రబాబు పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి రోజూ ప్రత్యేక విమానాల్లో లగ్జరీగా తిరుగుతున్నారని, ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతన్నలకు తోడుగా వైఎస్సార్సీపీ నిలుస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అరటి, వేరుశనగ పంటలకు గిట్టుబాటు ధర దక్కేలా ఉద్యమ కార్యాచరణ చేపడతామన్నారు. నేడు కలెక్టర్ దృష్టికి రైతుల సమస్యలు శింగనమల: నియోజకవర్గ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను మంగళవారం కలెక్టర్ ఆనంద్ను కలిసి వివరించనున్నట్లు మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త సాకే శైలజానాథ్ తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వంలో గిట్టుబాటు ధరలు లేక అరటి, మొక్కజొన్న, తదితర పంటల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ క్రమంలో అన్నదాతల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టర్ను కలుస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొంటున్నట్లు తెలిపారు. రైతులు, నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్సీపీ శ్రేణులు హాజరుకావాలని కోరారు. చంద్రబాబు రైతు వ్యతిరేకి గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదు విలేకరులతో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ -
పెళ్లిలో జగనన్న పాట.. వద్దన్న పోలీసులపై ప్రజల ఆగ్రహం
కూడేరు: పెళ్లి ఊరేగింపులో జగనన్న డీజే పాట రావడంతో కూడేరు పోలీసులు ఆగమేఘాలపై అక్కడకు చేరుకుని ఊరేగింపును అడ్డుకున్నారు. వైఎస్ జగన్ పాటను పెట్టరాదంటూ హుకుం జారీ చేశారు. దీంతో పోలీసులపై స్థానికులు తిరగబడ్డారు. ఈ ఘటన కూడేరు మండలం కలగళ్లలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు... కలగళ్లలో వడ్డే శ్రీకాంత్, రూప వివాహం ఆదివారం జరిగింది. అదే రోజు రాత్రి ఊరేగింపులో కుటుంబసభ్యులు డీజే ఏర్పాటు చేసి బంధు మిత్రులతో కలసి సరదాగా డ్యాన్స్ చూస్తూ సందడి చేయసాగారు. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రూపొందించిన పాట ప్లే కావడంతో పిల్లలు, యువత రెట్టింపు ఉత్సాహంతో ఈలలు వేస్తూ స్టెప్పులు వేశారు.ఈ విషయంపై గిట్టని వారి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆగమేఘాలపై కలగళ్లకు చేరుకుని డీజే పెట్టరాదంటూ రెండు గంటల పాటు అడ్డుకున్నారు. దీంతో వేడుక జరుపుకోవడం కూడా నేరమేనా? అని పెళ్లి వారు వాదనకు దిగారు. అయితే వైఎస్ జగన్ పాటలు పెట్టరాదని పోలీసులు చెప్పడంతో పోలీసుల తీరుపై పెళ్లి వారితో పాటు పలువురు గ్రామస్తులు మండిపడ్డారు. ఇదే గ్రామంలో టీడీపీ వారు పెళ్లి ఊరేగింపులో డీజే పెట్టి టీడీపీ పాటలు పెట్టి సంబరాలు జరుపుకున్నారని, ఆ రోజు లేని అభ్యంతరం ఈ రోజు ఎందుకు వచ్చిందని నిలదీశారు. ప్రజలు తిరగబడడంతో పోలీసులు మారుమాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
రోడ్డు ప్రమాదంలో వీఆర్ఏ మృతి
గార్లదిన్నె: మండల పరిధిలోని యర్రగుంట్ల వీఆర్ఏ వెంకటరాముడు (51) సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసులు, బంధువులు తెలిపిన మేరకు.. వెంకటరాముడు గత కొన్నేళ్లుగా యర్రగుంట్ల వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం గార్లదిన్నె తహసీల్దార్ కార్యాలయంలో విధులు ముగించుకొని ద్విచక్రవాహనంలో ఇంటికి బయలుదేరారు. మార్గమధ్యంలో మర్తాడు క్రాస్ వద్ద ద్విచక్రవాహనం అదుపు తప్పి రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి గార్లదిన్నె పీహెచ్సీకి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే వెంకటరాముడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం ఉన్నట్లు తెలిసింది. -
జయహో దీపిక..
క్రికెట్లో భారత అమ్మాయిలు అదరగొడుతున్నారు. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో వన్డే ప్రపంచకప్ గెలిచి నెల తిరగకముందే ఉమ్మడి జిల్లాకు చెందిన దీపిక నేతృత్వంలో మరో ప్రపంచకప్ మన సొంతమైంది. అది కూడా అంధ మహిళల టీ20 విభాగంలో మొట్టమొదటి ప్రపంచకప్ కావడం గమనార్హం. ప్రస్తుతం దేశంలోని అందరి దృష్టి టీసీ దీపికపై పడింది. ఎవరీ దీపిక? ఏ ప్రాంతానికి చెందిన వారనేది హాట్టాపిక్గా మారింది. ఈ క్రమంలో దీపిక గురించి తెలుసుకోవాలంటే శ్రీసత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి పంచాయతీ తంబాలహట్టి గ్రామానికి చేరుకోవాల్సిందే. నిరుపేద కుటుంబానికి చెందిన దీపిక తల్లిదండ్రులు చిత్తమ్మ, చిక్కతిమ్మప్ప వ్యవసాయ కూలి పనులతో జీవనం సాగిస్తున్నారు. దీపిక ఐదు నెలల ప్రాయంలో ఉన్న సమయంలో చేతి వేలు గోరు తగిలి ఒక కంటి చూపు పోయింది. కొన్నాళ్లు తల్లిదండ్రులు బాధపడినా.. ఆ తర్వాత పాపకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం ఎంత కష్టమైనా తామే పడాలని నిర్ణయించుకున్నారు. కన్నడ మాధ్యమంలోనే విద్యాభ్యాసందీపిక స్వగ్రామం కర్ణాటక సరిహద్దున ఉండడంతో కర్ణాటకలోని తుమకూరు జిల్లా దొడ్డ బాణగెరలోని సర్కారీ ప్రౌఢశాలలో 1 నుంచి 4వ తరగతి వరకూ చదువుకుంది. కంటి చూపు సక్రమంగా లేకపోవడంతో స్థానిక ఉపాధ్యాయుల సహకారంతో 2012 –13లో తుమకూరు జిల్లా కుణిగల్లోని అంధుల పాఠశాలలో 5 నుంచి 7వ తరగతి వరకూ చదువుకుంది. అనంతరం మైసూరులోని రంగారావు మెమోరియల్ స్కూల్ ఫర్ డిసేబుల్డ్లో చేరి 8 నుంచి 10వ తరగతి వరకు, ఆ తరువాత శిర తాలుకా బరగూరులోని జ్ఞాన జ్యోతిలో పీయూసీ (ఇంటర్) పూర్తి చేసింది. అనంతరం బెంగళూరులోని విజయనగర ఫస్ట్గ్రేడ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది.టీ–20 ప్రపంచకప్లో అజేయంగా...శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా ఈ ఏడాది నవంబర్లో అంధ మహిళల క్రికెట్ టీ–20 ప్రపంచ కప్ టోర్నీ జరిగింది. ఈ పోటీల్లో ప్రాతినిథ్యం వహించిన భారత జట్టుకు దీపికనే కెప్టెన్గా వ్యవహరించి, అన్ని మ్యాచ్ల్లోనూ జట్టును విజయతీరాలకు చేరేలా సభ్యులను దిశానిర్దేశనం చేస్తూ జట్టును ఫైనల్స్కు చేర్చింది. ఈ నెల 23న జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టుతో తలపడిన నేపాల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నిర్ణీత 12.1 ఓవర్లలోనే 117 పరుగులు సాధించి విజయకేతనం ఎగురవేసింది.క్రీడలో రాణించింది ఇలా.. 2016లో మైసూరులో 8వ తరగతి చదువుతుండగా పాఠశాల స్థాయిలో క్రికెట్ పోటీ నిర్వహించారు. ఇందులో ఏకంగా 100 పరుగులు చేసిన దీపికలోని క్రీడాప్రతిభను ఉపాధ్యాయులు గుర్తించి, ఆ దిశగా ఆమెను ప్రోత్సహిస్తూ వచ్చారు. అదే ఏడాది బెంగళూరు వర్సెస్ మైసూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో దీపిక 3 వికెట్లు తీయడంతో పాటు 78 పరుగులు చేసింది. ఇదే ఆమెలోని ఆత్మవిశ్వాసం పెంపొందేందుకు తొలి మెట్టుగా మారింది. ఇంటి ఆర్థిక పరిస్థితి సక్రమంగా లేకపోవడానికి తోడు సరైన ఆర్థిక ప్రోత్సాహం లేక కొన్ని రోజుల పాటు జిల్లా స్థాయి క్రికెట్కే పరిమితమైంది. పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సమయంలో బెంగళూరులోని ఐడీఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన టోర్నీలో పాల్గొన్న దీపిక ఏకంగా మరో సెంచరీతో బెంగళూరులోని సమర్థనం సంస్థ దృష్టిని ఆకర్షించింది. సంస్థ నిర్వాహకులు వెంటనే దీపిక తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడి క్రికెట్లో ఉన్నతశ్రేణి శిక్షణ ఇప్పించేందుకు అయ్యే ఖర్చు భరించారు. అప్పటి నుంచి దీపిక వెనుతిరిగి చూడలేదు. వరుస మ్యాచ్ల్లో రాణిస్తూ భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ స్థాయికి ఎదిగింది.కలెక్టర్ కావాలని ఉంది..నా ప్రతి విజయం వెనుక అమ్మ, నాన్న ప్రోత్సాహం మరువలేను. చిన్నప్పటి నుంచి కలెక్టర్ కావాలని నా ఆశ. అయితే పేదరికం కారణంగా యూపీఎస్సీకి సిద్ధం కాలేకపోతున్నా. ప్రభుత్వం కానీ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కానీ సహకరిస్తే ఈ కలను సాకారం చేసుకుని ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తా. – టీసీ దీపిక, తంబాలహట్టి, అమరాపురం మండలం -
పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి
కళ్యాణదుర్గం రూరల్: రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆర్డీఓ వసంతబాబును కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పంటలను కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మార్కెట్లో వ్యాపారులు, దళారులు సిండికేట్గా ఏర్పడి తక్కువ ధరతో పంటను కొనుగోలు చేస్తున్నారన్నారు. ఫలితంగా జిల్లాలో మొక్కజొన్న, అరటి రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అలాగే యాటకల్లు, ఐదుకల్లు గ్రామాల మధ్య కొండల్లో అక్రమంగా సాగుతున్న మైనింగ్ను అరికట్టాలని కోరారు. అక్రమంగా మైనింగ్ చేస్తున్న టీడీపీ నేతలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసులు, జెడ్పీటీసీ బొమ్మన్న, రైతు విభాగం నేత నరేంద్రరెడ్డి, అభిలాష్రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ ఎర్రంపల్లి కృష్ణమూర్తి, కన్వీనర్లు గోళ్ల సూరి, చంద్రశేఖర్రెడ్డి, ఎంఎస్ హనుమంతురాయుడు, రామాంజినేయులు, మురళి, అంజి, కృష్ణారెడ్డి, దొడగట్ట నారాయణ, పాతలింగ, మల్లి, చరణ్, రామచంద్ర, బసవరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కళ్యాణదుర్గంలోని అంబేడ్కర్ సర్కిల్లో సోమవారం ఆయన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ సుఽధీర్, కౌన్సిలర్ లక్షన్న, బిక్కిహరి, సురేష్, జాకరీర్, గంగాధర్, హబీబ్, లత, హలీం, అరుణ, తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ -
కుప్పకూలిన ఒడిశా
● 124 పరుగులకు ఆలౌట్ ● రాణించిన లోహిత్, కార్తీక్ రెడ్డి ● అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీ అనంతపురం కార్పొరేషన్: ఆంధ్ర బౌలర్లు లోహిత్, కార్తీక్ రెడ్డి విజృంభించడంతో ఒడిశా జట్టు 124 పరుగులకు కుప్పకూలింది. దీంతో ఆంధ్ర జట్టుకు 158 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. ఆర్డీటీలోని రాయలసీమ క్రికెట్ మైదానంలో కూచ్ బెహర్ ట్రోఫీ అండర్–19 మ్యాచ్లో రెండో రోజు ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్ 246/7తో ప్రారంభించి 282 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జట్టులో ఏఎన్వీ లోహిత్ 71 పరుగులు చేశాడు. తడబడిన ఓడిశా.. అనంతరం బరిలో దిగిన ఒడిశా జట్టు ఆరంభం నుంచే తడబడింది. 63.1 ఓవర్లలో 124 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆంధ్ర బౌలర్లు ఏఎన్వీ లోహిత్ 37/4, కార్తీక్ రెడ్డి 47/4తో ఒడిశాను కట్టడి చేశారు. ఓడిశా జట్టులో సుభాసిస్ మల్లిక్ 40, ప్రశాంత్ మోక్షిత్ 35 పరుగులు చేశారు. అనంతరం ఆంధ్ర జట్టు ఆట ముగిసే సమయానికి 15 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది. -
ఏ మొహం పెట్టుకుని రైతుల ముందుకొస్తావ్?
● సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వర రెడ్డి ధ్వజం ఉరవకొండ: సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఒక్క రోజైనా రైతుల గురించి ఆలోచించని చంద్రబాబు నేడు ఏ మొహం పెట్టుకుని వారి ముందుకొస్తారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వర రెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఒక్క గింజ అయినా కొన్నారా అని నిలదీశారు. అరటి రైతుల ఆవేదన ఈ ప్రభుత్వానికి కన్పించదా అంటూ ప్రశ్నించారు. గతంలో అరటి టన్ను రూ.25 వేలు పలికితే నేడు రూ. 2 వేలు కూడా పలకడం లేదని, దీంతో అన్నదాతల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. టమాట, ఉల్లి రైతుల పరిస్థితి కూడా ఇలాగే ఉందన్నారు. పత్తికి ప్రభుత్వం క్వింటా రూ.7 వేలు మద్దతు ధర ప్రకటించినా ఎక్కడా కొనుగోలు మాత్రం చేయడం లేదని దుయ్యబట్టారు. జిల్లాలో ఈ ఏడాది మొక్కజొన్న పంటను 5 లక్షల ఎకరాల్లో సాగు చేశారని, ప్రభుత్వం క్వింటాకు రూ. 2,400 మద్దతు ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని విమర్శించారు. చాలా ప్రాంతాల్లో రైతులు క్వింటా రూ. 1,600కే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ కింద ఏడాదికి రూ.20 వేల చొప్పున అందించాల్సి ఉండగా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో ఇప్పటి వరకూ కేవలం రూ.10 వేలు చెల్లించారని, ఇంకా రూ. 30 వేలు చెల్లించకుండా మోసగించారని మండిపడ్డారు. రబీలో జిల్లాలోనే అత్యధికంగా ఉరవకొండ ప్రాంతంలో పప్పుశనగ సాగు చేస్తారని, అయితే చంద్రబాబు ప్రభుత్వం రాయితీపై విత్తనం అందించకపోవడంతో రైతులు బయటి మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వచ్చిందని వాపోయారు. విత్తనం వేసి కలుపులు తీసే సమయంలో రైతులను మభ్యపెట్టడానికి విత్తనం ఇస్తున్నట్లు డ్రామా ఆడి చివరికి వాటిని కూడా టీడీపీ నేతలు అమ్ముకొనేలా చేశారన్నారు. వైఎస్ జగన్ హయాంలోనే రైతు సంక్షేమం.. గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో ఉద్యాన రైతులకు అడుగడుగునా అండగా నిలిచారని ‘విశ్వ’ గుర్తు చేశారు. పంటలను ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేసి రైతులకు మేలు చేశారన్నారు. జగనన్న హయాంలో 54 లక్షల మంది రైతులకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించి ఆదుకుందని, చంద్ర బాబు ప్రభుత్వంలో మాత్రం ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులే చెల్లించాలని చెప్పడంతో కేవలం 19 లక్షల మంది మాత్రమే చెల్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. హార్టికల్చర్ రైతులకు కోట్లాది రూపాయలు ఇన్సూరెన్స్ రూపంలో వైఎస్ జగన్ అందించారని కొనియాడారు. గ్రామాల్లోనే రైతులకు ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు అందించి కష్టం లేకుండా చూశారన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఈడిగప్రసాద్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తులూరు అశోక్, పార్టీ రాష్ట్ర నాయకులు హవళిగి భరత్రెడ్డి, బసవరాజు, ఓబన్న, రాజేష్, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు సిద్దార్థ్, పార్టీ నాయకులు జిలాన్, ఆసీఫ్, పచ్చిరవి తదితరులు పాల్గొన్నారు. -
తిరుగుతూనే ఉన్నాం.. కనికరించండి
● పరిష్కార వేదికలో ప్రజల వేడుకోలు ● వివిధ సమస్యలపై 450 వినతులు అనంతపురం అర్బన్: ‘ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము.. కనికరించి మా సమస్యలు పరిష్కరించండి’ అంటూ అధికారులను ప్రజలు వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ ఓ.ఆనంద్తో పాటు డీఆర్ఓ ఎ.మలోల, ఎఫ్ఎస్ఓ జి.రామకృష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, మల్లికార్జునరెడ్డి, రమేష్రెడ్డి, వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి 450 వినతులు అందాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. నిర్ణీత వ్యవధిలో సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించాలన్నారు వినతుల్లో కొన్ని... ● శింగనమల మండలం వెస్ట్ నరసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తగినన్ని తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని, గ్రామంలో సర్వే నంబరు 152–1లో 2.98 ఎకరాల గ్రామ కంఠం భూమిని పాఠశాలకు కేటాయించాలని కృష్ణారెడ్డి, గ్రామస్తులు కోరారు. ● సర్వజనాస్పత్రిలో సర్జన్ డాక్టర్ నాగప్రసాద్ సుదీర్ఘకాలంగా విధులకు హాజరు కాకపోయినా వేతనం మాత్రం తీసుకుంటున్నారని జైభీమ్ రావ్ భారత్పార్టీ జిల్లా అధ్యక్షుడు రామప్పనాయక్ ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవాలన్నారు. ● అట్రాసిటీ కేసు బాధితులకు ఎక్స్గ్రేషియాకు సంబంధించి రిలీఫ్ ఫండ్ విడుదల చేయాలని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు నెరమెట్ల ఎల్లన్న కోరాడు. ● ముసలివారమనే కనికరం కూడా లేకుండా ఇంటి నుంచి తమ కోడలు వెళ్లగొడుతోందని, తగిన చర్యలు తీసుకోవాలని రాప్తాడుకు చెందిన వృద్ధ దంపతులు నాగన్న, నాగమ్మ విజ్ఞప్తి చేశారు. ఇద్దరు కుమారులు సంతానం కాగా, ఇద్దరికీ పెళ్లయ్యిందన్నారు. రాప్తాడులో ఆటో స్టాండ్ పక్కనే రూ.8 కోట్ల విలువ చేసే రెండున్నర ఎకరాల పొలాన్ని ఇద్దరు కుమారులకు పంచి ఇవ్వడంతో పాటు మూడు సెంట్లలో మూడు ఇళ్లు కట్టించామన్నారు. ఇటీవల ఒక కుమారుడు చనిపోగా, అప్పటి నుంచి అతని భార్య తమను ఇంటి నుంచి వెళ్లగొడుతోందని వాపోయారు. తగిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. -
5, 12న షీప్ సొసైటీల ఎన్నికలు
అనంతపురం అగ్రికల్చర్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గొర్రెలు, మేకల పెంపకందారుల ప్రాథమిక సహకార సంఘాల (షీప్ సొసైటీ) ఎన్నికల నిర్వహణకు పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో షీప్ డెవలప్మెంట్ విభాగం అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకూ 350 సొసైటీలు రిజిష్టర్ చేసుకోగా... ఇందులో డిపార్ట్మెంట్ యూనియన్ పరిధిలో 215 సొసైటీలు ఉన్నట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఉమ్మడి జిల్లా పరిధిలో 130 సంఘాలకు ఎన్నికలు పూర్తికాగా, పెండింగ్లో ఉన్న అనంతపురం జిల్లాలో 39 సొసైటీలకు, సత్యసాయి జిల్లాలో 45 సొసైటీలకు డిసెంబర్ 5, 12న రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. కోర్టు పరిధిలో ఉన్న మదిగుబ్బ సొసైటీకి ఎన్నిక నిర్వహించడం లేదు. ఎన్సీడీసీ కింద రుణాలు తీసుకుని డిఫాల్టర్లుగా మారిన వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని అధికారులు పేర్కొన్నారు. మహిళా దొంగకు దేహశుద్ధి● మరో ఇద్దరి పరారీ గుత్తి: స్థానిక స్పందన శారీ సెంటర్లో సోమవారం ముగ్గురు మహిళా దొంగలు చీరలు అపహరిస్తూ నిర్వాహకులు శ్రీనివాసులు, అభి, సిబ్బందికి పట్టుబడ్డారు. వీరిలో ఇద్దరు తప్పించుకుని పారిపోయారు. పట్టుబడిన ఓ మహిళను అక్కడున్న మహిళలు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. రూ. 20 వేలు విలువైన చీరలను కట్టెల బ్యాగులో పెట్టుకుని వెళ్లిపోయేందుకు ప్రయత్నించినట్లుగా సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పోలీసులు స్వాధీనం చేసుకుని, లోతైన విచారణ చేపట్టారు. వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ‘సంకల్ప్’● ఆర్ఐఓ వెంకటరమణ నాయక్ అనంతపురం సిటీ: ఇంటర్మీడియట్లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా సోమవారం నుంచి సంకల్ప్ కార్యక్రమం ప్రారంభమైందని ఆర్ఐఓ వెంకటరమణ నాయక్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యాచరణ 2026 ఫిబ్రవరి 20వ తేదీ వరకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థుల్లో అభ్యసనా లోపాలను గుర్తించి, వారిపై వ్యక్తిగత శ్రద్ధ వహించేలా ఇప్పటికే ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. అలాగే సంకల్ప్ షెడ్యూల్ సక్రమంగా అమలయ్యే అంశంపై నిరంతర నిఘా ఉంటుందన్నారు. డీవీఈఓలు వారానికి మూడు కళాశాలలు, ప్రాంతీయ సంచాలకుడు వారానికి రెండు కళాశాలలు సందర్శించి, సంకల్ప్ షెడ్యూల్పై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 1 నుంచి 20 వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు ఉంటాయన్నారు. ఫిబ్రవరి 20 నుంచి ప్రత్యేక రివిజన్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. విద్యార్థుల ఫలితాలకు ప్రిన్సిపాళ్లు, కేర్ టేకర్లు, సబ్జెక్టు అధ్యాపకులు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. -
ప్రేమమూర్తి.. నిత్యస్ఫూర్తి
ప్రశాంతి నిలయం: దేహం నిండుగా సాయి తత్వాన్ని నింపుకుని ఇలవేల్పు సత్యసాయికి అశేష భక్తకోటి ‘సాయిరాం’ అంటూ శతసహస్ర వందనాలు తెలపగా.. వేడుకలకు హాజరైన అతిరథ మహారథులు సాయిభక్తుల సంకల్పాన్ని చూసి అచ్చెరువొందగా.. పుట్టపర్తి వేదికగా హిల్వ్యూ స్టేడియంలో జరిగిన సత్యసాయి శతవర్ష జయంతి వేడుకలు ఓ విశ్వవేడుకను తలపించాయి. ఇసుకవేస్తే రాలనంతగా స్టేడియం నిండిపోయింది. ఆదివారం ఉదయం నుంచే భక్తులు హిల్వ్యూస్టేడియానికి క్యూ కట్టారు. ఉదయం 9 గంటలకు సత్యసాయి స్వర్ణ రథోత్సవంతో శత వర్ష జయంతి వేడుకలు ప్రారంభించారు. ప్రశాంతి నిలయం నుంచి స్వర్ణరథంపై సత్యసాయే భౌతికంగా ఆశీనులయ్యారా అనిపించేలా ఏర్పాటు చేసిన చిత్రపటాన్ని కొలువుదీర్చి ఊరేగించారు. హిల్వ్యూ స్టేడియం వేదిక వరకు స్వర్ణ రథోత్సవం సాగింది. దేశంలోని అన్ని రాష్ట్రాల సత్యసాయి సేవా సంస్థల సభ్యులు, సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్కు చెందిన ఆయా దేశాల సభ్యులు సత్యసాయి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతూ బాబా బోధనలను, మానవతా విలువలను, వారివారి ప్రాంతాల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రదర్శనతో ముందు నడవగా.. వెనుక వేదపండితుల వేదఘోష.. ఆ వెనుక సత్యసాయి స్వర్ణ రథం కదిలింది. సత్యసాయి స్వర్ణ రథం మైదానంలోకి అడుగిడగానే భక్తులందరూ ఆధ్యాత్మిక పరవశంతో ‘ఓం సాయిరాం, జై సాయిరాం’ అంటూ నినదించారు. ప్రముఖ గాయకుడు మనో ‘కదిలింది.. కదిలింది..సాయి రథం.. స్వర్ణ రథం’ అంటూ పాడిన గీతానికి భక్తులు పరవశిస్తూ స్వర్ణ రథం వెంట నడిచారు. ప్రముఖ స్వరకారుడు శివమణి లయబద్ధంగా సృష్టించిన స్వరాల నడుమ రథోత్సవం ఓ దివ్య వేడుకను తలపించింది. సేవకు ప్రతిరూపం సత్యసాయి సత్యసాయి బాబా అహింస, ప్రేమ, నిస్వార్థ సేవలకు ప్రతిరూపమని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. ‘లవ్ ఆల్.. సర్వ్ ఆల్’, ‘హెల్ప్ ఎవర్.. హర్ట్ నెవర్’’ అన్న సత్యసాయి నినాదాలు కోట్లాది హృదయాలను సేవ వైపు కదిలించాయన్నారు. అంతకుముందు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు ప్రారంభోపన్యాసం చేశారు. సత్యసాయి కారణ జన్ముడని, పుట్టపర్తిలో పుట్టి తన జీవనయాత్రను ప్రారంభించి.. ఇక్కడే నిర్యాణం పొందారని, తన జననానికి, కర్మలను ఆచరించేందుకు పుట్టపర్తినే ఎంచుకోవడం ఈ ప్రాంత విశిష్టతను తెలియజేస్తుందన్నారు. త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ సత్యసాయి బాబా మానవాళి శ్రేయస్సు కోసం ఏడు దశాబ్దాల క్రితం స్థాపించిన సత్యసాయి ట్రస్ట్ నేడు ప్రపంచ వ్యాప్తంగా సేవా ఉద్యమంగా మారిందన్నారు. మానవతా విలువల వికాసానికి సత్యసాయి చేసిన సేవలు అపూర్వమన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సత్యసాయి అవతార పురుషుడని, మానవతా విలువలను, ఆధ్యాత్మిక చింతనను బోధిస్తూ నూతన అధ్యాయం లిఖించారని కొనియాడారు. ప్రజలకు ఆయన చేసిన సేవలు వెలకట్ట లేనివన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతూ ప్రజలలో దేవుడిని చూస్తూ.. మానవ సేవయే మాధవ సేవ అని నిరూపించిన మహానుభావుడు సత్యసాయి అని అభివర్ణించారు. సత్యసాయి లక్ష్యాలను, ఆశయాలను మరింత విస్తరించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వేడుకలలో భాగంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల బాలవికాస్ చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలతో మైమరిపించారు. ఘనంగా సత్యసాయి శత వర్ష జయంతి పుట్టపర్తిలో అంబరమంటిన సంబరం సత్యసాయి నామస్మరణతో పులకించిన భక్తజనం -
చిట్టీల పేరుతో మోసం
గుంతకల్లు టౌన్: స్థానిక ధర్మవరం రైల్వేగేట్ ప్రాంతంలో నివాసముంటున్న దిల్షాద్ అనే మహిళ చిట్టీల వ్యాపారంతో తమను మోసం చేసిందంటూ పలువురు బాధితులు ఆదివారం ఆమె ఇంటి ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ బైఠాయించారు. ఇలాహి ఫొటో స్టూడియోతో పాటు కొన్నేళ్లుగా చిట్టీలను దిల్షాద్ నిర్వహిస్తోంది. ఆమె వద్ద అరుణమ్మ, మేఘన, పర్వీన్, అలీమా, షాహీన్, చాంద్బీ, రాబర్ట్, మంజుల, రాబియా, వెంకటరాముడు తదితరులు చిట్టీలు కట్టారు. గడువు ముగిసినా డబ్బు ఇవ్వకపోవడంతో బాధితులు నేరుగా కలిసి ఆరా తీశారు. ఆ సమయంలో దిల్షాద్ ఎదురు బెదిరింపులకు దిగింది. ఐపీ నోటీసులు పంపిస్తానని, తననేమీ చేయలేరంటూ హెచ్చరికలు జారీ చేసింది. పిల్లల పెళ్లిళ్లు, చదువులు, ఇతర అవసరాల కోసం చిట్టీలు వేసి మోసపోయామని, తమకు న్యాయం చేయాలని బాధితులు ఆదివారం ఆమె ఇంటి ఎదుట బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించినా బాధితులు వినలేదు. దాదాపు ఐదారు గంటలపాటు అక్కడే భీష్మించారు. ఆందోళనకు ఎమ్మార్పీఎస్ నాయకురాలు విజయజ్యోతి, తదితరులు మద్దతు పలికారు. చిట్టీలు కట్టిన వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను కాపాడాలని ఎస్పీని కోరుతూ దిల్షాద్ సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. నిర్వాహకురాలి ఇంటి ఎదుట బాధితుల ధర్నా -
మాతృ వందనం నమోదుకు కష్టాలు
తాడిపత్రి రూరల్: జిల్లాలో ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. సర్వర్తో పాటు సెల్ఫోన్లలో సాంకేతిక కారణాలతో గర్భిణులు, నవజాతి శిశువుల వివరాల నమోదు అరకొరగానే సాగుతోంది. జిల్లాలో నేటి వరకూ కేవలం 4,725 మంది లబ్ధిదారులను మాత్రమే ఎన్రోల్మెంట్ చేశారు. నమోదుకు ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో అంగన్వాడీ టీచర్లు తల పట్టుకుంటున్నారు. మొదటికాన్పుకు రూ.5 వేలు... మాతృవందనం పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన మహిళలు గర్భం దాల్చిన సమయంలో, జన్మనిచ్చిన తరువాత పోషకాహారం, మందుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థికసాయం అందిస్తోంది. మొదటి కాన్పు అయితే వారి బ్యాంకు ఖాతాల్లో రూ.5 వేలు జమచేస్తారు. అందులో భాగంగానే గర్భిణిగా నమోదు చేసుకున్న సమయంలో రూ.1000, బిడ్ట జన్మించినప్పుడు రూ.2 వేలు, బిడ్డకు టీకాలు వేయించే సమయంలో మరో రూ.2 వేలు అందిస్తారు. రెండో కాన్పులో ఆడపిల్ల పుడితే మరో రూ.6 వేలు జమచేస్తారు. అరకొరగానే నమోదు మాతృ వందనం పథకం అమలు కోసం ఐసీడీఎస్ ప్రాజెక్టులోని కొందరు సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చారు. వారు మరికొందరు అంగన్వాడీ టీచర్లకు కొంత మేరకు తర్ఫీదు ఇచ్చారు. వారి ద్వారా అంగన్వాడీ సెంటర్లకు చెందిన టీచర్లు తమ వద్ద ఉన్న సెల్ఫోన్లల్లో యాప్లు వేసుకొని మాతృ వందనం కింద లబ్ధిదారుల వివరాలను నమోదు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సెల్ఫోన్లతో పాటు తమ వద్ద ఉన్న సెల్ఫోన్ల ద్వారా సైతం వివరాల నమోదు కోసం ప్రయత్నిస్తున్నా ఫలించడం లేదు. సర్వర్తో పాటు సెల్ఫోన్లల్లోని సాంకేతిక కారణాలతో అంగన్వాడీ టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంగన్వాడీ సెంటర్లల్లోని రొటిన్ కార్యక్రమాలను పక్కనబెట్టి సెల్ఫోన్లతో కుస్తీ పడుతున్నా గర్భిణులు, నవజాతి శిశువుల నమోదు అరకొరగానే జరుగుతోంది. అంగన్వాడీలపై ఒత్తిడి మాతృ వందనం పథకం నమోదులో జరుగుతున్న జాప్యంపై ఉన్నతాధికారుల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక అంగన్వాడీ టీచర్లను గ్రూపులుగా చేసి ఒక సెంటర్కు రప్పించి వారిచేత సూపర్వైజర్ల ఆధ్వర్యంలో నమోదు పక్రియ చేస్తున్నారు. సెల్ఫోన్ల స్థానంలో ల్యాప్ట్యాప్ల ద్వారా గర్భిణులు, నవజాతి శిశువుల నమోదు ప్రక్రియ చేయిస్తున్నారు. లబ్ధిదారుల ఎదురుచూపు జిల్లాలో పెద్ద సంఖ్యలో గర్భిణులు మాతృ వందనం పథకం కింద అందే ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది జూన్ నుంచి వైద్యశాఖ నుంచి సమగ్ర శిశు సంక్షేమశాఖకు బదలాయించింది. ఇప్పటికే పలు యాప్లతో పనిభారం పెరిగి పలు ఇబ్బందులు పడుతున్నామని, నూతన బాధ్యతలు తలకు మించిన భారమయ్యాయని అంగన్వాడీ టీచర్లు వాపోతున్నారు. సక్రమంగా పనిచేయని సెల్ఫోన్లతో ఉన్న యాప్లకు తోడు మాతృ వందన యోజన పథకం కింద అదనంగా వచ్చిన యాప్తో ఎలా వివరాలు నమోదు చేయాలని అంగన్వాడీ టీచర్లు ఆందోళన చెందుతున్నారు. పాత సెల్ఫోన్ల స్థానంలో కొత్తవాటిని పంపిణీ చేయాలని ఈ ఏడాది ఆగస్టులో అంగన్వాడీ టీచర్లు మూకుమ్మడిగా సెల్ఫోన్లను సీడీపీఓలకు అందజేశారు. కొత్త సెల్ఫోన్లను త్వరలో ఇస్తామని బూటకపు హామీలు ఇచ్చి తమపై ఒత్తిడి తెచ్చి మరి ఇచ్చిన సెల్ఫోన్లను తిరిగి తీసుకునేటట్టు చేశారని, నాలుగు నెలలు కావస్తున్నా కొత్తసెల్ఫోన్లను ఇవ్వకుండా డొక్కు సెల్ఫోన్లతో పనిచేయాలని ఒత్తిడులు తెస్తున్నారని వాపోతున్నారు. తాడిపత్రి ఫస్ట్ .. కణేకల్లు లాస్ట్ జిల్లాలోని 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో పీఎంఎంవీవై పథకం కింద శనివారం వరకు మొత్తం 4,725 మంది లబ్ధిదారుల వివరాలు మాత్రమే నమోదు చేశారు. అందులో తాడిపత్రి ప్రాజెక్టు 1855తో మొదటిగా ఉండగా కణేకల్లు ప్రాజెక్టు కేవలం 110 లబ్ధిదారుల ఎన్రోమెంట్తో చివరి స్థానంలో ఉంది. సక్రమంగా పనిచేయని సెల్ఫోన్లు ఇబ్బందులు పడుతున్న అంగన్వాడీ టీచర్లు జిల్లాలో నేటికీ కేవలం 4,725 మంది మాత్రమే నమోదు ఆర్థికసాయం కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు -
శత ఉత్సవం.. భక్తజన సంబరం
● నేడు సత్యసాయి శత జయంత్యుత్సవం ● ఏర్పాట్లు పూర్తి చేసిన సత్యసాయి ట్రస్ట్ ● ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి ప్రశాంతి నిలయం: భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న ప్రేమమూర్తి భగవాన్ సత్యసాయి శతజయంతి వచ్చేసింది. ఆదివారం హిల్వ్యూ స్టేడియంలో వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే సత్యసాయి మహాసమాధిని, సాయికుల్వంత్ సభా మందిరాన్ని ప్రత్యేక ఫల, పుష్ప దళాలతో తీర్చిదిద్దారు. ప్రశాంతి నిలయం విద్యుత్ కాంతుల నడుమ వెలిగిపోతోంది. వేడుకలకు ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హాజరై భక్తులనుద్దేశించి ప్రసంగించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డి కార్యక్రమంలో పాల్గొననున్నారు. వేడుకల నిర్వహణ ఇలా... ప్రపంచ ఆధ్యాత్మిక గురు సత్యసాయి శతజయంతి వేడుకలు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కానున్నాయి. హిల్వ్యూ స్టేడియంలో సత్యసాయి స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తారు. ఉదయం 9.30 గంటలకు విద్యార్థుల వేదపఠనం, 9.40 గంటలకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజు ప్రారంభోపన్యాసం చేస్తారు. 9.50 గంటలకు తమిళనాడు బాలవికాస్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన, 9.55కు కర్ణాటక బాలవికాస్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన, 10 గంటలకు రాష్ట్ర మంత్రి నారాలోకేష్ ప్రసంగం, 10.05 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగం, 10.15కు ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగం, 10.25గంటలకు ముఖ్య అతిథి భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రసంగం, సత్యసాయి జయంతి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు సత్యసాయి జోలోత్సవం నిర్వహిస్తారు. అనంతరం ది ఎటర్నల్ ‘సింపోనియం ఆఫ్ సెల్ఫ్లెస్ లవ్’ పేరుతో కచేరీ ఉంటుంది. -
సత్యసాయి మార్గం అనుసరణీయం
ప్రశాంతి నిలయం: సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవ సంబరం అంబరమంటింది. శనివారం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, గౌరవ అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. తొలుత సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థుల బ్రాస్బ్యాండ్ నడుమ అతిథులు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు, యూనివర్సిటీ అకడమిక్ కౌన్సిల్, మేనేజ్మెంట్ కౌన్సిల్ సభ్యులు ప్రత్యేక వేదిక వద్దకు చేరుకున్నారు. యూనివర్సిటీ చాన్సలర్ చక్రవర్తి స్నాతకోత్సవాన్ని ప్రారంభించారు. వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రాఘవేంద్ర ప్రసాద్ ప్రారంభోపన్యాసం చేశారు. సత్యసాయి ఆశయాలు, బోధనలను అనుసరించి మానవతా విలువలు, శాస్త్రసాంకేతికతతో కూడిన ఆదర్శ విద్యను ఆధునిక గురుకుల విద్యావిధానం ద్వారా సత్యసాయి విద్యాసంస్థల్లో అందిస్తూ అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నామన్నారు. సమసమాజ స్థాపన మీ వల్లే సాధ్యం! ‘సత్యసాయి విద్యాసంస్థలు మానవతా విలువలు, ఆధ్యాత్మికతతో కూడిన విద్యనందించడం గొప్ప విషయం. స్నాతకోత్సవంలో సత్యసాయి విద్యార్థులను చూస్తుంటే సమసమాజ స్థాపన మీ వల్ల సాధ్యమవుతుందన్న భావన కలుగుతోంది’ అని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. అందరూ సమానమని చెప్పే సత్యసాయి బోధనలను దేశ విదేశాలకు తీసుకెళ్లడానికి ఇక్కడి విద్యార్థులు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎదగాలన్నారు. శాస్త్రసాంకేతికత ఆధారంగా నూతన అవిష్కరణలవైపు దృష్టి సారించాలన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. వైభవంగా సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవం ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉపరాష్ట్రపతి 20 మందికి బంగారు పతకాలు, 14 మందికి డాక్టరేట్లు, 521 మందికి డిగ్రీల ప్రదానం ప్రశాంతి నిలయం: ‘అందరినీ ప్రేమించు...అందరినీ సేవించు’ అని చెప్పడంతో పాటు పాటించిన సత్యసాయి మార్గం అందరికీ అనుసరణీయమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రశాంతి నిలయంలో జరుగుతున్న సత్యసాయి శతజయంతి వేడుకల్లో శనివారం ఆమె పాల్గొన్నారు. ఉదయం ప్రత్యేక విమానంలో పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయం చేరుకున్న రాష్ట్రపతి ముర్ము.. నేరుగా ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ సభా మందిరానికి చేరుకుని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం పూర్ణచంద్ర ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వెంటాడుతున్న ‘పాపం’పేట అక్రమాలు
● వీఆర్ఓ రఘుయాదవ్కు ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ నోటీసు ● కఠినమైన చర్యలు తప్పవా? రాప్తాడు రూరల్: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన అనంతపురం శివారులోని పాపంపేట భూ కబ్జా వ్యవహారంలో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. తప్పుడు పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేసి అక్రమార్కులకు అండగా నిలబడడాన్ని కలెక్టర్ ఆనంద్ సీరియస్గా పరిగణించారు. ఈ క్రమంలో ఇప్పటికే మండల సర్వేయర్ రఘునాథ్, పాపంపేట వీఆర్ఓ రఘుయాదవ్ పాత్రపై విచారణ పూర్తయింది. మరోవైపు తన సంతకాన్ని రాచూరి వెంకటకిరణ్ అనే వ్యక్తి ఫోర్జరీ చేశారని వీఆర్ఓ వివరణ ఇచ్చారు. దీంతో ఆర్డీఓ కేశవనాయుడు అనంతపురం రూరల్ పోలీస్స్టేషన్లో రాచూరి వెంకటకిరణ్పై ఫిర్యాదు చేయగా.. క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఆర్డీఓ నివేదిక ఆధారంగా రెండు రోజుల కిందట కలెక్టర్ ఆనంద్.. వీఆర్ఓ రఘుయాదవ్కు ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ నోటీసు జారీ చేశారు. గతంలో చాలా సందర్భాల్లో వచ్చిన ఆరోపణలపై సస్పెన్షన్ వేటు వేసేవారు. కేవలం సస్పెన్షన్లతో భయం ఉండదని భావించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే వీఆర్ఓ రఘుయాదవ్కు ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ నోటీసు జారీ చేశారు. దీన్నిబట్టి చూస్తుంటే వీఆర్ఓ మెడకు ఉచ్చు పూర్తిగా బిగుస్తున్నట్లు అర్థమవుతోంది. ఎలా వెలుగులోకి వచ్చిందంటే..? కొందరు ఆర్టీఐ చట్టం ద్వారా సమాచారం కోరడంతో మండల సర్వేయర్ రఘునాథ్, వీఆర్ఓ రఘుయాదవ్లు జారీ చేసిన తప్పుడు పొజిషన్ సర్టిఫికెట్ల వ్యవహారం వెలుగు చూసింది. వివిధ సర్వే నంబర్లలో 176.82 ఎకరాల్లో రాచూరి కుటుంబ సభ్యులు, వారిద్వారా జీపీఏ చేయించుకున్న వారి ఆధీనంలో ఉన్నట్లు మండల సర్వేయర్ పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఆరు సర్వే నంబర్లలో 29.96 ఎకరాల్లో రాచూరి వెంకటకిరణ్ అనుభవంలో ఉన్నాడంటూ 2024 ఆగస్టు 13న అప్పటి పాపంపేట వీఆర్ఓ రఘుయాదవ్ పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చారు. వీరిద్దరూ ఇచ్చిన నివేదికల ఆధారంగానే అక్రమార్కులు మ్యుటేషన్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. బయటపడ్డాక.. బుకాయింపు పొజిషన్ల సర్టిఫికెట్ల జారీ వ్యవహరం వెలుగులోకి వచ్చిన తర్వాత తన సంతకాలు ఫోర్జరీ చేశారని వీఆర్ఓ బుకాయిస్తున్నారు. దాదాపు ఏడాది కిందట సంతకాలు చేసినట్లు తెలిసినా.. ఇన్ని రోజులు మౌనంగా ఉండడానికి కారణం, కనీసం పై అధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆయన తప్పించుకునే అవకాశం లేదని చార్జెస్ నోటీసుకు ఏది జవాబు ఇచ్చినా ఇరుక్కోవడం తథ్యమని, కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యవహారాల్లో అత్యంత జాగ్రత్తగా మసలుకునే విధంగా గుణపాఠం చెప్పాలని, తప్పుడు నివేదికలు ఇచ్చిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని పాపంపేట భూముల బాధితులు కోరుతున్నారు. కాగా మండల సర్వేయర్ రఘునాథ్కు కూడా చార్జెస్ నోటీసు జారీ చేస్తారని తెలిసింది. -
ప్రతిభకు పట్టం..
స్నాతకోత్సవంలో భాగంగా సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ పరిధిలోని వివిధ విభాగాల్లో ప్రతిభ చాటిన 20 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. బంగారు పతకాలు పొందిన వారిలో గుండా నవ్యసాయి, సాయి శ్రీరాం, బెల్లపురవ్వల శ్రేయ, చెరుకూరి సాయి కార్తీక్, సానియా, అనిరుధ్ బండారి, ప్రియాన్షు చెత్రి, సాయి శరణ్య, సాయి సుమిత్ర దోర, గుడ్ల నటరాజ్, ముని లింబు, ప్రశాంత్, పంచాంగం నరసింహమూర్తి, హరిశ్రీ నారాయణ, ఆరాధ్య, సాయి గణేష్, ఆశిష్దీప్ చెత్రి, రాజ్కుమార్ ఠాకూర్, విక్రమ్ కృష్ణ, రితురాజ్ ప్రదాన్ తదితరులు ఉన్నారు. మరో 14 మందికి పరిశోధన రంగంలో డాక్టరేట్లు, 521 మందికి డిగ్రీ పట్టాలను ముఖ్య అతిథి, భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ చేతుల మీదుగా అందజేశారు. జాతీయ గీతాలాపన అనంతరం చాన్సలర్ చక్రవర్తి స్నాతకోత్సవం ముగించారు. కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజు, ట్రస్ట్ సభ్యులు నాగానంద, డాక్టర్ మోహన్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
నేడు రాప్తాడుకు జగన్
● తోపుదుర్తి రాజశేఖరరెడ్డి కుమార్తె వివాహానికి హాజరుకానున్న మాజీ సీఎం ● లింగనపల్లి రోడ్డు వద్ద హె లిప్యాడ్● ఏర్పాట్లను పర్యవేక్షించిన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి రాప్తాడు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం రాప్తాడుకు రానున్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖరరెడ్డి, తోపుదుర్తి నయనతారెడ్డి దంపతుల కుమార్తె మోక్షిత విష్ణుప్రియారెడ్డి, తేజేష్ రెడ్డిల వివాహం రాప్తాడులో జరగనుంది. ఇందుకోసం 44వ జాతీయ రహదారి హెచ్పీ పెట్రోలు బంక్ ఎదురుగా కల్యాణ వేదికను అద్భుతంగా సిద్ధం చేశారు. ఈ వివాహానికి వైఎస్ జగన్ హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. బెంగళూరులో ఉదయం 10 గంటలకు యలహంక నుంచి బయల్దేరి 10.20 గంటలకు జక్కూరు ఏరోడ్రోమ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఉదయం 11.30 గంటలకు రాప్తాడులోని లింగనపల్లి రోడ్డు హెలిప్యాడ్కు చేరుకుంటారు. 11.40 గంటలకు రోడ్డు మార్గంలో బయల్దేరి 11.55కు కల్యాణమండపం చేరుకుంటారు. 12.15 గంటల వరకు పెళ్లి వేడుకల్లోనే ఉంటారు. మధ్యాహ్నం 12.30కు రాప్తాడు హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 1.30 గంటలకు బెంగళూరుకు చేరుకుంటారు. వివాహానికి హాజరయ్యే జగన్ను చూసేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. అందుకు తగిన సౌకర్యాలు, హెలిప్యాడ్ ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పరిశీలించారు. -
‘మాక్ అసెంబ్లీ’ ఎంపికలో గందరగోళం
తాడిపత్రిటౌన్: రాష్ట్ర విద్యాశాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మాక్ అసెంబ్లీ’ విద్యార్థుల ఎంపిక ప్రక్రియ గందరగోళంగా మారింది. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక్కో నియోజకవర్గంలోని ఆయా ఉన్నత పాఠశాలల్లో 8, 9, 10వ తరగతి విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థుల్లో నియోజకవర్గం నుంచి ఒక విద్యార్థిని ఎంపిక చేసి ఈనెల 26న విజయవాడలో నిర్వహించనున్న మాక్ అసెంబ్లీకి పంపనున్నారు. అయితే తాడిపత్రి నియోజకవర్గంలో విద్యార్థుల ఎంపికలో గందరగోళం చోటు చేసుకుంది. మూడు రోజలు క్రితం మాక్ అసెంబ్లీకి తాడిపత్రి పట్టణానికి చెందిన ప్రకాశం హైస్కూల్లో 9వతరగతి చదువుతున్న నాగమల్లికార్జునను అధికారులు ఎంపిక చేశారు. అయితే శనివారం ఉన్నఫలంగా యాడికి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న అనిల్కుమార్ను మాక్ అసెంబ్లీకి పంపుతున్నట్లు అధికారులు ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివిధ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన నాగమల్లికార్జునను కాదని తృతీయస్థానంలో నిలిచిన అనిల్కుమార్ను ఎలా ఎంపిక చేస్తారని నాగమల్లికార్జున తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎంఈఓ నాగరాజును ‘సాక్షి’ వివరణ కోరగా విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. కణేకల్లు: మాక్ అసెంబ్లీ ఎంపికకు రాయదుర్గం పట్టణంలో వ్యాసరచన, వకృత్వపోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో యర్రగుంట జెడ్పీ హైస్కూల్కు చెందిన హేమలత మొదటి బహుమతి సాధించింది. ఈమెను నవంబర్ 26న అమరావతిలో జరగనున్న రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీకి ఎంపిక చేశారు. ఆదివారం అమరావతికి హేమలత బయలుదేరాల్సిన సమయంలో విద్యాశాఖ అధికారులు పేరును తారు మారు చేశారు. హేమలతకు బదులు రెండోస్థానంలో ఉన్న లింగదాళ్కు చెందిన గంగోత్రిని ఎంపిక చేశారు. మాక్ అసెంబ్లీకి రెడీ కావాలని ఆ విద్యార్థికి కబురు పెట్టారు. దీంతో పోటీల్లో టాపర్గా నిలిచిన హేమలత కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారడంతో విద్యాశాఖ అధికారులు కంగుతిన్నారు. నాగ మల్లికార్జున హేమలత -
ఆలరించిన ‘సాయి కథ’
ప్రశాంతి నిలయం: సత్యసాయి బాల్యం...అవతార వైభవం..సేవా, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని వివరిస్తూ విద్యార్థులు నిర్వహించిన సంగీత కచేరీ భక్తులను ఎంతగానో అలరించింది. సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం సత్యసాయి హయ్యర్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు, సిబ్బంది ‘సాయి కథ’ పేరుతో కచేరీ నిర్వహించారు. సత్యసాయిని కీర్తిస్తూ కొందరు గీతాలు ఆలపించగా..మరికొందరు అత్యాధునిక సంగీత వాయిద్యాలతో భక్తులను ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడించారు. అరటికి గిట్టుబాటు ధర కల్పించాలి రాప్తాడు: అరటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని హార్టికల్చర్ అధికారులకు జేసీ శివ్ నారాయణ శర్మ సూచించారు. శనివారం గొందిరెడ్డిపల్లిలో రైతు మిడతల శీనయ్య అరటికి గిట్టుబాటు ధర లేదని 3 ఎకరాల్లో పంట తొలగించాడు. విషయం తెలుసుకున్న జేసీ శివ్ నారాయణ శర్మ, హర్టికల్చర్ అధికారులతో కలిసి గొందిరెడ్డిపల్లిలో తొలగించిన అరటి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అరటి రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధరలు వచ్చేలా చూడాలని హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి నివేదిక పంపి గిట్టుబాటు ధరతో పాటు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేశారు. కార్యక్రమంలో డీడీ ఉమాదేవి, తహసీల్దార్ విజయ కుమారి పాల్గొన్నారు. -
సెల్ఫోన్లు పనిచేయడం లేదు
ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకంపై అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇవ్వలేదు. వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు యాప్కు సపోర్టు చేయడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుస్తీ పడితే ఒక లబ్ధిదారురాలి వివరాలు ఎన్రోల్మెంట్ చేయడం కష్టంగా ఉంది. సూపర్వైజర్లు మాత్రం టీచర్లపై వత్తిడి తెస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. యాప్పై వెంటనే టీచర్లకు శిక్షణ ఇవ్వాలి. సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి. – రమాదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి,అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ -
సుబ్బరాయసాగర్ షట్టర్లు ఎత్తేందుకు నిపుణుల రాక
పుట్లూరు: మండలంలోని సుబ్బరాయసాగర్ వద్ద షట్టర్లు పైకి లేవకపోవడంతో నాలుగు రోజులుగా హెచ్చెల్సీ అధికారులు మరమ్మతు పనులు చేపడుతున్నారు. సాగర్ నుంచి చెరువులకు నీటిని సరఫరా చేయడానికి షట్టర్లు ఎత్తిన సమయంలో పూర్తిస్థాయిలో లేవకపోవడంతో సమస్య ఏర్పడింది. సమస్య పరిష్కారం కోసం శివమొగ్గకు చెందిన ఇంజినీరింగ్ నిపుణులను శనివారం రప్పించారు. వారు సమస్యను పరిశీలించిన తర్వాత షట్టర్లను పైకి లేపడానికి అవసరమైన పరికరాలను తాడిపత్రి ఆటోనగర్లో సిద్ధం చేయించారు. వాటి ద్వారా షట్టర్లను ఎత్తడానికి ప్రయత్నాలు చేపడుతున్నట్లు హెచ్చెల్సీ అధికారులు తెలిపారు. పీఏబీఆర్లో ఆగిన జల విద్యుదుత్పత్తి కూడేరు: మండల పరిధిలోని పీఏబీఆర్ జలాశయం వద్ద ఏర్పాటైన ఏపీ జెన్ కో జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు ఏపీ జెన్కో ఏడీ కేశవయ్య తెలిపారు. విద్యుత్ తయారు చేసే టర్బైన్లో సమస్య తలెత్తి అందులోకి నీరు వస్తోందని పేర్కొన్నారు. ఇరిగేషన్ అధికారులు 450–750 క్యూసెక్కుల లోపు నీటిని విడుదల చేయడంతో ఒక టర్బైన్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వచ్చామన్నారు. రెండున్నర నెలలో 16.59 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయిందన్నారు. సాంకేతిక నిపుణులకు సమాచారమిచ్చామని, వారు వచ్చి టర్బైన్కు మరమ్మతులు చేపడితే తిరిగి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామన్నారు. -
రాష్ట్రస్థాయికి తొమ్మిది నమూనాల ఎంపిక
అనంతపురం సిటీ: ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించాలంటే పుస్తక పరిజ్ఞానం ఒక్కటే సరిపోదని సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ అన్నారు. పోటీని తట్టుకోవాలన్నా.. ఏ రంగంలోనైనా రాణించాలన్నా తొలుత నైపుణ్యం అవసరమన్నారు. బుక్కరాయసముద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో శనివారం నిర్వహించిన వ్యక్తిగత నైపుణ్య పోటీలకు జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన సుమారు 800 మంది విద్యార్థులు హాజరై 250కు పైగా ప్రాజక్ట్ నమూనాలు ప్రదర్శించారు. జీసీడీఓ కవిత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏపీసీ శైలజ, డిప్యూటీ డీఈఓ శ్రీనివాసరావు, జిల్లా ఒకేషనల్ అధికారి వెంకటరమణ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం తొమ్మిది నమూనాలను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. అనంతరం విద్యార్థులను అభినందిస్తూ, వారికి మెమొంటోలు, ప్రశంసాపత్రాలు అందించారు. -
జాబ్ కార్డులు గల్లంతు!
● జిల్లా వ్యాప్తంగా 26 వేల ఉపాధి జాబ్కార్డుల తొలగింపు ● తొలగింపులో రాజకీయ కుట్ర అనంతపురం టౌన్: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీ ణ ఉపాధి పథకంలో పని చేస్తున్న శ్రామికుల జాబ్కార్డుల తొలగింపు పక్రియను చంద్రబాబు ప్రభుత్వం చేపట్టింది. శ్రామికులకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా జాబ్కార్డుల తొలగింపుల పక్రియను చేపట్టింది. ఒక్క రాప్తాడు గ్రామంలోనే ఏకంగా 500కు పైగా జాబ్ కార్డులను ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం గమనార్హం. క్షేత్రస్థాయిలో ఉపాధి శ్రామికులతో చర్చించి వారి వివరణ తీసుకున్న తర్వాత జాబ్కార్డులను తొలగించాల్సి ఉండగా... ఇందుకు విరుద్ధంగా రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి ఇష్టానుసారంగా జాబ్ కార్డులను తొలగించారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. జిల్లాలో 5.38 లక్షల మంది శ్రామికులు జిల్లా వ్యాప్తంగా 3.16లక్షల జాబ్కార్డులు, 5.38లక్షల మంది ఉపాధి శ్రామికులు ఉన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉపాధి శామ్రికుల జాబ్కార్డుతో ఆధార్ అనుసంధానం, ఈ–కేవైసీ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇదే అదనుగా ఉపాధి శ్రామికుల ప్రమేయం లేకుండానే జాబ్కార్డులను తొలగించేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 90 వేల మందిపై వేటు జిల్లా వ్యాప్తంగా ఉపాధిహామి పథకంలో పని చేస్తున్న శ్రామికుల కుటుంబాలకు సంబంధించి 26 వేల జాబ్కార్డులను తొలగించారు. ఈ లెక్కన దాదాపు 90వేల మందికి పైగా శ్రామికుల జాబ్కార్డులు మాయమయ్యాయి. కొన్ని నెలలుగా ఉపాధి పనులకు రావడం లేదని? జాబ్కార్డు ఉన్న స్థానికంగా అందుబాటులో లేరంటూ మరి కొందరి జాబ్కార్డులను తొలగించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రాజకీయ కుట్రలతోనే చాల మంది జాబ్కార్డులను కోల్పోవాల్సి వచ్చిందంటూ ఉపాధి శ్రామికులు వాపోతున్నారు. -
పిల్లలు చిన్న పదాలు కూడా రాయలేకపోతున్నారు
● డీఈఓ ప్రసాద్ బాబు ఆవేదన అనంతపురం సిటీ: ‘ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు చిన్న పదాలు కూడా రాయలేకపోతున్నారు. చదవలేకపోతున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. విధి నిర్వహణలో ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో పని చేసి పిల్లలందరూ చదివేలా.. రాసేలా శిక్షణ ఇవ్వండి. అంతకంటే ముందు పిల్లల్లో క్రమశిక్షణ, చిన్న పెద్ద గౌరవం లేకుండాపోతోంది. ఉపాధ్యాయులపై తిరగబడే పరిస్థితి వస్తోంది. వారికి నైతిక విలువల గురించి నేర్పించండి ’ అని జిల్లా విద్యాశాఖాధికారి కడప ప్రసాద్బాబు ఉపాధ్యాయులకు సూచించారు. అనంతపురం బుడ్డప్పనగర్లోని రాజేంద్రప్రసాద్ మున్సిపల్ స్కూల్లో శనివారం అర్బన్, రూరల్ పరిధిలోని 11 కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు. కాంప్లెక్స్ సమావేశాలను డీఈఓ పరిశీలించారు. పిల్లల్లో నేరప్రవృత్తి పెరిగిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను గారభంగా కాకుండా క్రమశిక్షణ, విలువలతో పెంచాలని సూచించారు. ఏపీఓ మంజునాథ, పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ఆర్యూపీపీ రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పది ఫెయిల్ అయిన వారికి మరో అవకాశం అనంతపురం సిటీ: గతంలో పదో తరగతి ఫెయిల్ అయి తిరిగి పరీక్ష రాసే అవకాశం లేక అర్ధంతరంగా చదువు ఆపేసిన విద్యార్థుల కోసం సార్వత్రిక విద్యాపీఠం మంచి అవకాశం కల్పించినట్లు డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. అలాంటి విద్యార్థులు సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఫెయిలైన సబ్జెక్టులు రాసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు తాము చదివిన పాఠశాలలోగాని, ఆంధ్రప్రదేశ్ విద్యాపీఠం వెబ్సైట్ www.apopenschool.ap.gov.in లో నేరుగా జిల్లా పేరు, స్కూల్ పేరు సెలక్ట్ చేసి అడ్మిషన్ పొందవచ్చన్నారు. అందుకు అడ్మిషన్ ఫీజు కింద రూ.300 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. రసవత్తరంగా బాస్కెట్బాల్ పోటీలు నూజివీడు: నూజివీడులో నిర్వహిస్తున్న ఎస్జీఎఫ్ బాలుర, బాలికల అండర్–17 రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి 13 బాలుర జట్లు, 13 బాలికల జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. బాలికల విభాగంలో వైజాగ్ జట్టు అనంతపురంపై గెలుపొందింది. బాలుర విభాగంలో అనంతపురం జట్టు పశ్చిమగోదావరిపై 32–8తో విజయం సాధించింది. అలాగే మరోమ్యాచ్లో అనంతపురం జట్టు విజయనగరంపై 29–0 గెలుపొందింది. క్వార్టర్ ఫైనల్స్లో గుంటూరు జట్టు అనంతపురంపై 35–17 తేడాతో విజయం సాధించింది. కృష్ణా, తూర్పుగోదావరి, గుంటూరు, వైజాగ్ జట్లు సెమీస్కు చేరాయి. ఇళ్లు పరిశీలించాకే విద్యుత్ కనెక్షన్ అనంతపురం టౌన్: విద్యుత్ కొత్త కనెక్షన్ల కోసం కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకునే వినియోగదారుల ఇళ్లను క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి విద్యుత్ వినియోగం ఏ మేరకు ఉంటుందో అంచనా వేసి విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని విద్యుత్శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ ఒక ప్రకటనలో సిబ్బందికి సూచించారు. జిల్లా వ్యాప్తంగా చాల మంది విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయి విచారణ చేపట్టకుండా తక్కువ కాంట్రాక్టు లోడ్తో విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇలా చేస్తే భవిష్యత్లో వినియోగదారులు మరో మారు కాంట్రాక్టు లోడ్కు అదనంగా చెల్లించే పరిస్థితి వస్తుందన్నారు. కొత్త విద్యుత్ కనెక్షన్కు దరఖాస్తు చేసుకున్న వెంటనే సంబంధించిన లైన్మెన్లు వినియోగదారుని ఇంటిని పరిశీలించి డబుల్, సింగల్ బెడ్రూం, డూప్లెక్స్ ఇళ్లా అని పరిశీలించి ఏమేర విద్యుత్ వినియోగం ఉంటుందో అంచనా వేసి ఎన్ని కిలోవాట్లు విద్యుత్ అవసరం ఉంటుందో ఆమేరకు డిపాజిట్ కట్టించాలన్నారు. ఇష్టారాజ్యంగా విద్యుత్ కనెక్షన్లు తక్కువ కాంట్రాక్టు లోడ్తో మంజూరు చేస్తే విద్యుత్ సిబ్బందిపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదే విషయంపై విద్యుత్ ఏఈలు సిబ్బందికి అవగాహన కల్పించాలని కోరారు. 29న క్రికెట్ సంఘం ఎన్నికలు అనంతపురం కార్పొరేషన్: అనంతపురం క్రికెట్ సంఘం ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను ఆ సంఘం కార్యదర్శి భీమలింగారెడ్డి ఓ ప్రకటనలో విడుదల చేశారు. క్రికెట్ సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారిలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ నెల 24న నామినేషన్ల స్వీకరణ, 25న నామినేషన్ల స్క్రూట్నీ, అదే రోజు సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల జాబితా విడుదల, 26న ఉదయం 10 గంటల నుంచి 4 గంటలలోపు విత్ డ్రా, 26న సాయంత్రం 5 గంటలకు ఎన్నికల బరిలో దిగే వారి జాబితా విడుదల, 29న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. అదే రోజున మధ్యాహ్నం 1 గంటకు ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నారు. -
అధికారుల తప్పు.. విద్యార్థులకు శిక్ష
పుట్లూరు: ఆర్టీసీ అధికారులు విద్యార్థుల కోసం సమయానికి బస్సును నడపకపోవడంతో శనివారం కోమటికుంట్ల, గరుగుచింతపల్లి, గోపురాజుపల్లి గ్రామాల విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. రోజూ ఉదయం, సాయంత్రం విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచారు. అయితే శనివారం మండలంలోని అన్ని పాఠశాలలకు కాంప్లెక్స్ సమావేశాలను విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో సాయంత్రం పాఠశాలల్లో ఉండాల్సిన విద్యార్థులను మధ్యాహ్నమే ఇళ్లకు పంపించారు. గ్రామాలకు వెళ్లడానికి ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ గరుగుచింతలపల్లి బస్సు రాకపోవడంతో విద్యార్థులు కాలినడకన ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులను సురక్షితంగా ఇళ్లకు చేరేలా చర్యలు తీసుకోవాల్సిన ఉపాధ్యాయులు ఈ విషయంపై ఆర్టీసీ అధికారులకు సమాచారం ఇచ్చామనిచెప్పి చేతులు దులుపుకుంటున్నారు. మహిళ ప్రాణాలు కాపాడిన పోలీసులు గుమ్మఘట్ట: ఓ మహిళ ప్రాణాలను పోలీసులు కాపాడిన ఘటన మండలంలోని బైరవానితిప్ప ప్రాజెక్టులో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు .. రాయదుర్గం పట్టణానికి చెందిన లక్ష్మీకి ప్రభుతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. బెంగళూరుకు వలస వెళ్లి కూలి పనులు చేసుకుని జీవనం సాగించేవారు. అయితే తాగుడుకు బానిసైన భర్త రోజూ భార్యతో గొడవ పడుతుండటంతో పోరు పడలేక అక్కడ నుంచి రాయదుర్గం పట్టణంలోని తల్లి అజ్జమ్మ వద్దకు చేరుకుని తన బాధ చెప్పుకుంది. భర్త దగ్గరే ఉండాలని తల్లి నచ్చచెప్పింది. భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో విరక్తి చెందిన లక్ష్మీ బీటీప్రాజెక్టులో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. బీటీపీకి చేరుకున్న ఆత్మహత్యకు యత్నిస్తుండగా గమనించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. వెంటనే ఘటన స్థలికి చేరుకున్న ఎస్ఐ ఈశ్వరయ్య ఆమెను రక్షించి తల్లి అజ్జమ్మకు అప్పగించారు. మహిళ ప్రాణం కాపాడడంతో ఎస్ఐ ఈశ్వరయ్య, పోలీస్ సిబ్బందిని రూరల్ సీఐ వెంకటరమణ అభినందించారు. -
ఉద్యోగులను బానిసలుగా చూడొద్దు
● హంస రాష్ట్ర అధ్యక్షుడు అరవపాల్ అనంతపురం మెడికల్: నిబంధనల పేరుతో ఉద్యోగులను బానిసలుగా చూస్తే ఊరుకునేది లేదని, ప్రజారోగ్యం కోసం పాటుపడుతున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హంస రాష్ట్ర అధ్యక్షుడు అరవపాల్ డిమాండ్ చేశారు. శనివారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో హంస అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా అరవపాల్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే కొందరు ఉద్యోగులు ఎఫ్ఆర్ఎస్ వేయాలన్న ఆత్రుతతో అధిక ఒత్తిళ్లు, తదితర కారణాలతో కొందరు ప్రాణాలు కోల్పోయిన వారూ ఉన్నారని చెప్పారు. ఎఫ్ఆర్ఎస్ విధానంపై ప్రభుత్వం పునరాలోచించి, వైద్య శాఖ సిబ్బందికి మినహాయింపు ఇవ్వాలని లేని పక్షంలో ఆందోళనకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. రీ డిప్లాయ్మెంట్ పేరుతో ఉద్యోగులను బానిసలకంటే హీనంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో హంస జిల్లా అధ్యక్షుడు షఫీ, కార్యదర్శి సంగ వేణుగోపాల్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పామన్న, కోశాధికారి కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు అరుణకుమారి, కార్యనిర్వహణ కార్యదర్శి డీ మహేంద్ర, నాయకులు భక్తర్ వలీఖాన్, ఎల్లప్ప, సుదర్శన్రెడ్డి, మంజుల, తదితరులు పాల్గొన్నారు. -
చదువుపై ఆసక్తి లేక.. భవిష్యత్తుపై బెంగతో..
● ఇంజినీరింగ్ విద్యార్థి బలవన్మరణం తాడిపత్రి రూరల్/పెద్దపప్పూరు: మండలంలోని కోమలి రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం అహమ్మదాబాద్ నుంచి తిరుచనాపల్లికి వెళుతున్న ఎక్స్ప్రెస్ రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కో–పైలెట్ నుంచి సమాచారం అందుకున్న తాడిపత్రి ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్, కానిస్టేబుల్ సుబ్బారెడ్డి అక్కడకు చేరుకుని, పరిశీలించారు. అదే సమయంలో మృతుడి జేబులోని సెల్ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి మాట్లాడారు. దీంతో మృతుడు పెద్దపప్పూరు మండలం తబ్జుల గ్రామానికి చెందిన రామాంజులు కుమారుడు వంశీ (21)గా నిర్ధారణ అయింది. జరిగిన విషయాన్ని ఫోన్లోనే మృతుడి సోదరుడు మహేష్కు తెలపడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. చిత్తూరులో ఉన్న శ్రీవెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, టెక్నాలజీ (ఎస్వీసీఈటీ)లో బీటెక్ చేస్తున్న వంశీ.. ఆరు నెలల క్రితం ఇంటికి వచ్చాడని, అయితే చదువుపై ఆసక్తి లేకపోవడంతో తిరిగి కళాశాలకు వెళ్లలేదని వివరించారు. ఈ క్రమంలోనే భవిష్యత్తుపై బెంగతో మనోవేదనకు లోనడయ్యాడన్నారు. శుక్రవారం పొలానికి వెళుతున్నట్లు ఇంట్లో ద్విచక్రవాహనంపై బయలుదేరి ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
కుక్కల దాడిలో గొర్రె పిల్లల మృతి
విడపనకల్లు: వీధి కుక్కల దాడిలో 18 గొర్రె పిల్లలు మృతి చెందిన ఘటన విడపనకల్లు మండలం హవళిగి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కురుబ రవి, గురుస్వామి శుక్రవారం ఉదయం 65 గొర్రె పిల్లలను స్థానిక జెడ్పీ హైస్కూల్ వద్ద పొలంలో ఏర్పాటు చేసిన దొడ్డిలో భద్రపరిచి మిగిలిన గొర్రెలను మేపునకు అటవీ ప్రాంతంలోకి తోలుకెళ్లారు. ఎవరూ లేని సమయంలో కుక్కలు దొడ్డిలోకి చొరబడి 18 గొర్రె పిల్లలను కొరికి చంపేశాయి. మిగిలినవి గాయాల పాలయ్యాయి. గమనించిన స్థానికులు కుక్కలను తరిమికొట్టారు. దాదాపు రూ.లక్ష మేర నష్టం వాటిల్లినట్లు బాధిత కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు. -
జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. చలి వాతావరణం కొనసాగుతోంది. ఈశాన్యం దిశగా గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
‘మీ డబ్బు.. మీ హక్కు’పై అవగాహన కల్పించండి అనంతపురం అర్బన్: లావాదేవీలు నిర్వహించకపోవడంతో ఖాతాల్లో నిలిచిపోయిన సొమ్మును డిపాజిటర్లు లేదా వారి వారసులకు చేర్చాలనే లక్ష్యంతో చేపట్టిన ‘మీ డబ్బు.. మీ హక్కు’ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ బ్యాంకర్లకు సూచించారు. జేసీ శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో లీడ్ బ్యాంక్ మేనేజర్ నరేష్రెడ్డి, బ్యాంకర్లతో కలిసి ‘మీ డబ్బు.. మీ హక్కు’ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమంపై ఖాతాదారులకు అవగాహన కల్పించాలని చెప్పారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ జిల్లాలో క్లెయిమ్లు కాని ఖాతాలు మొత్తం 4.87 లక్షలు ఉన్నాయన్నారు. వీటిలో రూ.107.65 కోట్లు నిల్వ ఉందన్నారు. వీటిలో వ్యక్తిగత డిపాజిటర్ల ఖాతాల్లో రూ.86.74 కోట్లు, సంస్థాగత ఖాతాల్లో రూ.8.80 కోట్లు, ప్రభుత్వ ఖాతాల్లో రూ.12.1 కోట్లు ఉన్నాయన్నారు. క్లెయిమ్లు కాని ఈ డిపాజిట్లను తిరిగి పొందేందుకు ప్రజలకు బ్యాంకులు సులభమైన మార్గాలను అందుబాటులో ఉంచాయన్నారు. ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కెనరా బ్యాంక్ ప్రధాన బ్రాంచ్ డీఎం హేమంత్, ఎస్బీఐ చీఫ్ మేనేజర్ శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు అండగా ఉంటాం
అనంతపురం మెడికల్: టీడీపీ నాయకులు కారు ఢీకొని తీవ్రంగా గాయపడి ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న పాతూరుకు చెందిన బాషా, ఆజాద్నగర్కు చెందిన ఇబ్రహీంలను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి శుక్రవారం పరామర్శించారు. అండగా ఉంటామని బాధితులకు భరోసా కల్పించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు. రోడ్డు ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ సీఐ వెంకటేష్ నాయక్ను కోరారు. 31 మందికి ఉద్యోగోన్నతి అనంతపురం రూరల్: పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ గ్రేడ్–1గా ఉన్న 31 మందికి గ్రామ, వార్డు సచివాలయ ఆఫీసర్ ( మండల స్థాయి అధికారులు)గా ఉద్యోగోన్నతి కల్పించినట్లు జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) నాగరాజునాయుడు తెలిపారు. ప్రమోషన్ పొందిన వారికి త్వరలోనే మండలాలు కేటాయిస్తామన్నారు. మండల స్థాయి అధికారులుగా పదోన్నతి పొందిన వారు వారికి కేటయించిన మండలంలో గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు పోర్టల్లో నమోదు చేసుకోవాలి అనంతపురం మెడికల్: జిల్లాలో నూతనంగా ప్రారంభించే ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోంలు, క్లినిక్ల నిర్వాహకులు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ రిజిస్ట్రేషన్ కోసం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబ దేవి శుక్రవారం ఓ ప్రకటనలో సూచించారు. పోర్టర్లో నమోదు చేసుకోని వారు ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ను అనుసరించి ఆస్పత్రి అనుమతి, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులని తెలిపారు. ఇప్పటికే నిర్వహణలో ఉన్న ఆస్పత్రుల వారు కూడా 15 రోజుల్లో తప్పనిసరిగా పోర్టల్లో నమోదు చేయాలన్నారు. లేనిపక్షంలో వారి లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు. యాత్రికులు జాగ్రత్తలు తీసుకోవాలి శబరిమలకు వెళ్లే యాత్రికులు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని డీఎంహెచ్ఓ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. నదుల్లో స్నానం ఆచరించేటప్పుడు ముక్కు మూసుకుని, నది నీరు ముక్కులోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా ఎటువంటి ఇన్ఫెక్షన్సూ దరి చేరవన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శుల నియామకం అనంతపురం: వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా తాడిపత్రికి చెందిన కంచం రామ్మోహన్రెడ్డి, గూడూరు సూర్యనారాయణరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అక్రమ లేఅవుట్లకు సహకరిస్తే చర్యలు ● డీపీఓ హెచ్చరిక అనంతపురం రూరల్: పంచాయతీ అధికారులు అక్రమ లే అవుట్లకు సహకరిస్తే చర్యలు తప్పవని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) నాగరాజు నాయుడు హెచ్చరించారు. శుక్రవారం అక్రమ లేఅవుట్లపై ‘తమ్ముళ్ల రియల్ దందా’ శీర్షికన ‘సాక్షి’లో వెలువడిన కథనానికి ఆయన స్పందిచారు. అహుడా అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమని అన్నారు. అలాంటి వెంచర్లను ఎప్పటిక్పప్పుడు అడ్డుకోవాల్సిన బాధ్యత పంచాయతీ అధికారులపై ఉందన్నారు జిల్లాలో కొంతమంది పంచాయతీ కార్యదర్శులు రియల్ ఎస్టేట్ వ్యాపారుల పట్ల ఉదాసీనత ప్రదర్శించడం తగదన్నారు. పంచాయతీ ఆదాయాలకు గండికొట్టే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి పంచాయతీ, ఆత్మకూరు మండలం వడ్డుపల్లి పంచాయతీల్లో వెలసిన అక్రమ లేఅవుట్లపై నివేదిక ఇవ్వాలని ఆయా పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. -
పారిశుధ్య కార్మికుడిపై టీడీపీ నేతల దాడి
అనంతపురం క్రైం: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న కదిరప్పపై టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన కదిరప్పను స్థానికులు ఆస్పత్రికి చేర్చారు. బాధితుడు తెలిపిన మేరకు.. అనంతపురంలోని వేణుగోపాల్ నగర్లో శుక్రవారం చెత్త సేకరణకు వెళ్లిన సమయంలో స్థానిక టీడీపీ బూత్ కన్వీనర్ గోపి ఇంటి వద్ద వారు పెంచుకుంటున్న కుక్క కదిరప్పపై దాడి చేసింది. గతంలో మూడు సార్లు కరిచింది కూడా. ప్రస్తుతం నగర పాలక సంస్థ పరిధిలో వీధి కుక్కల బెడదను తగ్గించేందుకు అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టడంతో వారి దృష్టికి వేణుగోపాల్ నగర్లో తరచూ ఇబ్బంది పెడుతున్న కుక్క గురించి కదిరప్ప తీసుకెళ్లాడు. దీంతో శుక్రవారం కుక్కను పట్టుకునేందుకు బండిని వేణుగోపాల్ నగర్కు పంపారు. టీడీపీ నేత గోపి ఇంటి వద్ద కుక్కను బంధించ పోతుండగా ఆయన అడ్డుకున్నాడు. ఆ సమయంలో కుక్కలను పట్టేవారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో కదిరప్ప జోక్యం చేసుకుని సర్దిచెబుతూ గతంలో పలుమార్లు తనపై కుక్క దాడి చేసి గాయపరిచిందని, ఇదే విషయాన్ని తాను వారికి తెలిపినట్లుగా వివరించాడు. దీంతో కదిరప్ప మీద గోపి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కులం పేరుతో దూషిస్తూ టీడీపీ నేతలు కె.నాగరాజు, మహమ్మద్ రఫీ, రాజా, మురళితో కలసి కర్రలతో దాడికి తెగబడ్డాడు. స్థానికులు అడ్డుకుని గాయపడిన కదిరప్పను ఆస్పత్రికి చేర్చారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు పేర్కొన్నాడు. కాగా, కదిరిప్పపై దాడిని కార్మిక సంఘాల నేతలు ఖండించారు. బాధితుడికి న్యాయం చేయకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
జెడ్పీ ఉద్యోగులకు పదోన్నతి
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లా పరిషత్ యాజమాన్యం కింద పని చేస్తున్న తొమ్మిది మంది సీనియర్ అసిస్టెంట్లకు పాలనాధికారులు(ఏఓ)గా పదోన్నతి కల్పిస్తూ పోస్టింగ్లను కల్పించారు. ఈ మేరకు ఉత్తర్వులను జెడ్పీలోని తన చాంబర్లో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ శుక్రవారం అందజేశారు. అనంతపురంలోని జెడ్పీ కార్యాలయంలో పనిచేస్తున్న శ్రీనివాసులును జెడ్పీలోనే ఏఓగా నియమించారు. అలాగే ఏకాంబరయ్యను గోరంట్లకు, పి.సురేష్రెడ్డిని తాడిమర్రికి, పూర్ణ ఖలందర్ను వజ్రకరూరుకు, పీఆర్ క్యూసీ సబ్ డివిజన్లో పని చేస్తున్న రవిని బుక్కరాయసముద్రం, వజ్రకరూరులో పనిచేస్తున్న శ్రీధర్శర్మను కనగానపల్లికి, కదిరి పీఆర్ఐ సబ్ డివిజన్లో పని చేస్తున్న అశోక్కుమార్రెడ్డిని నల్లచెరువుకు బదిలీ చేశారు. సోమందేపల్లి నుంచి అబ్దుల్ రహిమాన్ను గుడిబండకు బదిలీ చేశారు. కార్యక్రమంలో సీఈఓ జీసీ శంకర్, డిప్యూటీ సీఈఓ జీసీ సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఖ్యాతిని చాటిచెప్పండి ● మాక్ అసెంబ్లీకి ఎంపికై న విద్యార్థులతో డీఈఓ ప్రసాద్బాబు అనంతపురం సిటీ: రాష్ట్ర స్థాయిలో జిల్లా ఖ్యాతిని చాటి చెప్పేలని మాక్ అసెంబ్లీకి ఎంపికై న విద్యార్థులకు డీఈఓ ప్రసాద్బాబు సూచించారు. జిల్లా నుంచి ఎంపికై న 8 మంది విద్యార్థులు, హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులను శుక్రవారం తన చాంబర్లో ఆయన అభినందించి, మాట్లాడారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ మునీర్ఖాన్, డిప్యూటీ డీఈఓ మల్లారెడ్డి, ఏఎస్ఓ శ్రీనివాసులు, ఏపీడీఓ మంజునాథ్, నోడల్ ఆఫీసర్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మార్చి నెలాఖరులోపు పనులన్నీ పూర్తి కావాలి ● పీఆర్ ఎస్ఈ చిన్న సుబ్బరాయుడు అనంతపురం సిటీ: ఏపీ గ్రామీణ రహదారుల ప్రాజెక్ట్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద చేపట్టిన రహదారులు, వంతెనల నిర్మాణాలను మార్చి నెలాఖరులోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను పంచాయతీరాజ్ ఇంజినీర్(ఎస్ఈ) వై.చిన్న సుబ్బరాయుడు ఆదేశించారు. అనంతపురంలోని సర్కిల్ కార్యాలయంలోని తన చాంబర్లో శుక్రవారం నిర్వహించిన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్ట్ ఈఈలు శంకరయ్య, శ్రీరాములు, డీఈఈలు మురళీ, నారాయణస్వామి, నాగేంద్రకుమార్, సుధాకర్ నాయక్, తిరుమలరెడ్డి, ఏఈఈలు హుస్సేన్బాషా, లక్ష్మీదేవి, కాంట్రాక్టర్లు హాజరయ్యారు. చేపట్టిన పనుల పురోగతిపై ఎస్ఈ ఆరా తీశారు. నిర్దేశిత గడువులోపు పూర్తి చేయకపోతే నిధులు వెనక్కు వెళ్లే ప్రమాదముందని హెచ్చరించారు. -
నేడు పుట్టపర్తికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి
పుట్టపర్తి టౌన్: సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం పుట్టపర్తికి విచ్చేస్తున్నారు. ఈ మేరకు పటిష్టమైన భధ్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో డీఐజీ డాక్టర్ షిమోషి, ఎస్పీ సతీష్కుమార్ శుక్రవారం బందోబస్త్కు వచ్చిన డీఎస్పీలు, సీఐలతో సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...రాష్ట్రపతి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి శనివారం ఉదయం 10.50 గంటలకు సత్యసాయి విమానాశ్రయం చేరుకుంటారన్నారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్లో బయలుదేరి హిల్ వ్యూ స్డేడియం చేరుకుని సత్యసాయి బాబా జయంత్యువాల్లో పాల్గొంటారన్నారు. సాయంత్రం 3.30 గంటలకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పుట్టపర్తి విమానాశ్రయం చేరుకుంటారని, అక్కడి నుంచి ప్రత్యే కాన్యాయ్లో ప్రశాంతి నిలయానికి వెళ్తారన్నారు. ఈ నేపథ్యంలో సత్యసాయి విమానాశ్రయం, కాన్వాయ్ వెళ్లే మార్గాలు, పార్కింగ్ ప్రదేశాలు, రూట్ డైవర్షన్ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి విమానాశ్రయం నుంచి సాయి కుల్వంత్ హాలుకు వెళ్లే సమయంలో బందోబస్త్పాయింట్లలలో జాగ్రత్తగా విధులు నిర్వహించాలన్నారు. అలాగే పబ్లిక్ గ్యాలరీల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసిన తర్వాతే లోపలికి పంపాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్లు, అడిషనల్ ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు ఆర్ఐలు పాల్గొన్నారు. -
సాయి సన్నిధి.. జ్ఞాన పెన్నిధి
ప్రశాంతి నిలయం: ‘‘చదువంటే జ్ఞానాన్ని సముపార్జించడం కాదు.. మనిషిలో దాగి ఉన్న దైవత్వాన్ని వెలికితీసి సమాజానికి పంచే సాధనం’’ అని బోధించిన సత్యసాయి తన విద్యాసంస్థల్లో పాఠ్యాంశాలతో పాటు మానవతా విలువలు, సనాతన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను బోధించే ఆధునిక విద్యా వ్యవస్థను రూపొందించారు. ప్రాచీన గురుకుల విద్యా విధానాన్ని అధునికీకరించి... విద్యార్థిని పరిపూర్ణంగా తీర్చిదిద్దేలా నూతన విద్యావిధానాన్ని రూపకల్పన చేశారు. సత్యసాయి ఆదర్శాలకు అనుగుణంగా నడుస్తున్న సాయి విద్యాసంస్థలు ప్రపంచంలోని మేటి విద్యాసంస్థల నరసన నిలుస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని చాటుతున్నాయి. ఇక్కడ చదువుకున్న ఎందరో విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అంతలా పేరుగాంచిన సత్యసాయి విద్యాసంస్థల 44వ స్నాతకోత్సవం శనివారం అట్టహాసంగా జరుగనుంది. ఇందుకోసం సెంట్రల్ ట్రస్టు ఏర్పాట్లు చేసింది. 1981 సంవత్సరంలో సమున్నత లక్ష్యాలతో సత్యసాయి స్థాపించిన విద్యాలయాలు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తూ నేటితో 44 వసంతాల వేడుకను జరుపుకుంటున్నాయి. 1981లో ఆవిర్భవించిన సత్యసాయి యూనివర్సిటీకి 1986లో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్లో శాశ్వత సభ్యత్వం దక్కింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏటా సమూల మార్పులతో ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యాసంస్థగా ఎదిగింది. 2002లో నేషనల్ అసోసియేషన్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్)ఏ++ గ్రేడును కేటాయిస్తూ జాతీయ స్థాయి అత్యున్నత విద్యాసంస్థగా గుర్తించింది. 2008లో సత్యసాయి డీమ్డ్ టూబీ యూనివర్సిటీ సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. నూతన ఆవిష్కరణల ద్వారా సమాజాభివృద్ధికి పాటుపడేలా విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో 2018 సంవత్సరంలో పుట్టపర్తిలోని విద్యాసంస్థలకు అనుబంధంగా ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దేశ విదేశాల్లోని అత్యున్నత వేదికలపై సత్యసాయి విద్యార్థులు తమదైన ముద్ర వేస్తూ సత్తాచాటుతున్నారు. ● సత్యసాయి విద్యాసంస్థల్లో 8:1 నిష్పత్తిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉంటారు. 90 శాతం మంది విద్యార్థులు ఏటా ఉత్తీర్ణత సాధిస్తున్నారు. ● సత్యసాయి విద్యాసంస్థల్లో బోధించే వారిలో 74 శాతం మంది పీహెచ్డీలు పూర్తి చేసిన వారే కావడం గమనార్హం. సత్యసాయి యూనివర్సిటీ పరిధిలో నాలుగు క్యాంపస్లున్నాయి. రాష్ట్రంలో పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం క్యాంపస్, అనంతపురంలోని మహిళా క్యాంపస్, కర్ణాటక రాష్ట్రంలోని ముద్దేన హళ్లి వద్ద నందగిరి క్యాంపస్, బృందావన్ క్యాంపస్లున్నాయి. ఈ నాలుగు క్యాంపస్ల ద్వారా ఏడు విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేషన్(యూజీ), ఐదు విభాగాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ), మూడు ప్రొఫెషనల్ కోర్సులను నిర్వహిస్తున్నారు. నేడు స్నాతకోత్సవం సాయి విద్యాలయాలు.. ఆధునిక దేవాలయాలు ఆదర్శంగా నిలుస్తున్న సత్యసాయి విద్యాసంస్థలు నేడు సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవం ముఖ్య అతిథిగా హాజరు కానున్న భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్టన్ 20 మందికి బంగారు పతకాలు, 18 మందికి డాక్టరేట్లు ప్రధానం నాలుగు క్యాంపస్లు.. 44 వసంతాల వేడుక.. సత్యసాయి శతజయంతి వేడుకల్లో భాగంగా శనివారం సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవం ఘనంగా జరగుంది. ప్రశాంతి నిలయంలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో స్నాతకోత్సవ వేడుకను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానున్న కార్యక్రమం 6.30 గంటలకు ముగియనుంది. ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి రాధా కృష్ణన్ హాజరై విద్యార్థులకు స్నాతకోత్సవ ఉపన్యాసం, బంగారు పతకాలు, డిగ్రీ పట్టాలు, డాక్టరేట్ల ప్రదానం ఉంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వేడుకల్లో పాల్గొననున్నారు. యూనివర్సిటీ చాన్సలర్ హోదాలో సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ చైర్మన్ చక్రవర్తి స్నాతకోత్సవాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా 20 మందికి బంగారు పతకాలు, 521 మందికి డిగ్రీపట్టాలు, 14 మంది పరిశోధన విద్యార్థులకు డాక్టరేట్లు ప్రదానం చేయనున్నారు. ఇందుకోసం పూర్ణచంద్ర ఆడిటోరియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. -
పంటల బీమా పథకాలు అస్తవ్యస్తం
అనంతపురం అగ్రికల్చర్: రబీలో పంటల బీమా పథకాలపై చంద్రబాబు సర్కారు నోరు మెదపడం లేదు. అమలులోకి వచ్చినట్లు చెబుతున్నా... రైతులు వినియోగించుకునేలా వ్యవసాయశాఖ ఇంకా బహిరంగ ప్రకటన చేయకపోవడం విశేషం. 2019–24 మధ్య కాలంలో రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఈ–క్రాప్ ఆధారంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారు ఉచితంగా వాతావరణ బీమా, ఫసల్బీమా పథకాలు అమలు చేసిన విషయం తెలిసిందే. రైతులపై నయాపైసా భారం మోపకుండా ఉచితంగా అమలు చేయడంతో పాటు నాలుగేళ్ల పాటు పెద్ద మొత్తంలో బీమా కింద పరిహారం అందించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో రాగానే గత రబీ నుంచి ఉచిత బీమా పథకాలకు మంగళం పాడింది. రైతులపై ప్రీమియం భారం మోపడంతో పాటు బీమా పథకాలను అస్తవ్యస్తంగా మార్చేశారు. 2023 ఖరీఫ్, రబీ, 2024 ఖరీఫ్, రబీకి సంబంఽధించి ఇప్పటికీ బీమా కింద రైతులకు పైసా పరిహారం ఇవ్వకుండా మోసం చేస్తున్న పరిస్థితి నెలకొంది. బీమా పథకాలపై ప్రకటనేదీ? అనధికార సమాచారం ప్రకారం ఈ రబీలో పప్పుశనగ, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, వరి పంటలకు ఫసల్బీమా, అలాగే వాతావరణ బీమా కింద టమాటకు బీమా వర్తింపజేశారు. వ్యవసాయ పంటలకు 1.5 శాతం, ఉద్యాన పంటలకు 5 శాతం చొప్పున బీమా ప్రీమియం డిసెంబర్ 15 లోపు రైతులు చెల్లించాల్సి ఉంటుంది. పప్పుశనగ ఎకరాకు రూ.450 ప్రకారం, వేరుశనగ ఎకరాకు 480, జొన్నకు రూ.315, మొక్కజొన్నకు రూ.325, వరికి రూ.630, టమాటకు రూ.1,600 ప్రకారం రైతులు ప్రీమియం చెల్లించాలి. రుణాలు పొందుతున్న రైతులు బ్యాంకుల్లోనూ, రుణాలు లేని రైతులు కామన్ సర్వీసు సెంటర్లు (సీఎస్సీ), సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ లేదా నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ (ఎన్సీఐపీ)లో తమ వాటా చెల్లించాలి. మామిడి పంటకు బీమా వర్తింపజేశారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. పంట కోత ప్రయోగాల ఫలితాలు, ఆటోమేటిక్ వెదర్ రిపోర్టు ఆధారంగా బీమా పరిహారం లెక్కించి రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే బీమా కింద నోటిఫై అయిన పంటలు, పథకం వివరాలు, ప్రీమియం, ఆఖరి గడువు తదితర అంశాలపై వ్యవసాయశాఖ ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవతున్నాయి. రబీ పంటల బీమాపై చంద్రబాబు సర్కారు మౌనం అమలులో ఉన్నా.. ప్రకటన చేయని వ్యవసాయశాఖ -
అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
బుక్కరాయసముద్రం: గిట్టుబాటు ధర లేక జిల్లా అరటి రైతులు రూ.700 కోట్ల మేర పెట్టుబడులు నష్టపోతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.రాంభూపాల్ పేర్కొన్నారు. అరటి పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం రెడ్డిపల్లిలోని అరటి తోటలను ఆయన పరిశీలించి, మాట్లాడారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ నల్లప్ప, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్రెడ్డి, నాయకులు శివారెడ్డి, శ్రీనివాసులు, నాగేంద్ర, రైతులు పాల్గొన్నారు. 1న అప్రెంటిస్షిప్ దరఖాస్తుదారుల సర్టిఫికెట్ల పరిశీలన అనంతపురం క్రైం: ఏపీఎస్ ఆర్టీసీలో అప్రెంటిస్ షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న ఐటీఐ అభ్యర్థుల సర్టిఫికెట్లను డిసెంబర్ 1న కర్నూలులోని ఆర్టీసీ జోనల్ శిక్షణ కళాశాలలో పరిశీలించనున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ నజీర్ అహమ్మద్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలి. పూర్తి వివరాలకు 08518–257025 లో సంప్రదించవచ్చు. యువకుడి ఆత్మహత్య కళ్యాణదుర్గం రూరల్: ఉద్యోగ అవకాశాలు దక్కకపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. బ్రహ్మసముద్రం మండలం ఎనకల్లు గ్రామానికి చెందిన వెంకటేశులు, వరలక్ష్మి దంపతుల ఏకై క కుమారుడు బోయ ఆనంద్(21) డిగ్రీ వరకు చదువుకుని, రెండేళ్లుగా ఉద్యోగ ప్రయత్నాలు సాగిస్తున్నాడు. అయితే అవకాశాలు దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన అతను గురువారం కళ్యాణదుర్గంలోని రాయదుర్గం బైపాస్ రోడ్డు వద్ద పురుగుల మందు తాగి, కుటుంబసభ్యులకు ఫోన్ చేసి తెలిపాడు. దీంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని ఆనంద్ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతపురంలోని జీజీహెచ్లో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నేటి నుంచి ‘ఉపాధి’ గ్రామ సభలు అనంతపురం టౌన్: ఉపాధి హామీ పథకం పనులపై శనివారం నుంచి జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలను నిర్వహించనున్నారు. ఈ మేరకు డ్వామా పీడీ సలీంబాషా శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తొలగించిన, రద్దు చేయబడిన జాబ్కార్డుల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి అర్హులైన వారివి పునరుద్ధరణకు చర్యలు తీసుకోనున్నారు. అలాగే కొత్త జాబ్కార్డులకు వినతులు స్వీకరించనున్నారు. -
మాజీ మంత్రి శైలజనాథ్కు మాతృ వియోగం
అనంతపురం : మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ తల్లి సాకే గంగమ్మ అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్సీపీ నాయకులు పలువురు అనంతపురంలోని నాయక్నగర్లో ఉన్న శైలజనాథ్ ఇంటికి చేరుకుని గంగమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించారు. రూ.9 లక్షల విలువైన ఎరువుల సీజ్ ఉరవకొండ: పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను కళ్యాణదుర్గం ఏడీఏ యల్లప్ప, ఉరవకొండ, విడపనకల్లు మండలాల వ్యవసాయాధికారులు రామకృష్ణుడు, పెన్నయ్య.. శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. సాయి ఆగ్రో ఏజెన్సీలో రూ.5,93,900, లక్ష్మీవెంకటేశ్వర ఏజెన్సీలో రూ.2,80,300, మహలక్ష్మీ ఫర్టిలైజర్స్లో రూ. 1,12,810 విలువైన అనుమతుల్లేని ఎరువుల విక్రయాలను నిలుపుదల చేస్తూ నోటీసులు జారీ చేశారు. అలాగే ఈ మూడు షాపుల్లోనూ మొత్తం రూ.9,87,900 విలువ చేసే ఎరువులను సీజ్ చేశారు. విడపనకల్లు: మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఫర్టిలైజర్ షాపులో శుక్రవారం కళ్యాణదుర్గం ఏడీఏ యల్లప్ప, స్థానిక వ్యవసాయాధికారి పెన్నయ్య తనిఖీలు చేపట్టారు. రికార్డులకు నిల్వలకు వ్యత్యాసాలను గుర్తించి 32.9 టన్నుల ఆర్గానిక్ పటాస్ ఎరువులను సీజ్ చేశారు. -
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
కళ్యాణదుర్గం: జిల్లాలో రైతులు పండించిన వివిధ రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ధ్వజమెత్తారు. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి వద్ద మొక్కజొన్న, కంది, అరటి పంటలను పార్టీ శ్రేణులతో కలసి శుక్రవారం ఆయన పరిశీలించి, రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నట్లు పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులతో రంగయ్య మాట్లాడారు. చంద్రబాబు పాలనలో ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. రూ.లక్షలు వెచ్చించి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడులు సైతం చేతికి అందడం లేదన్నారు. అరటికి ధర లేక పొలాల్లోనే దున్నేస్తున్నారంటే పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసుకోవచ్చునన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఏపీ పీఎం కిసాన్ రైలును పునరుద్ధరించి, పంట దిగుబడులను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తే కొద్ది వరకై నా రైతులకు మేలు చేకూరుతుందన్నారు. అరటి, ఆలు, ఎర్రగడ్డ, అరటి పంటలను ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్వింటా కందికి ప్రభుత్వం రూ.8 వేలు, మొక్కజొన్న క్వింటాకు రూ.2400 మద్దతు ధర ప్రకటించిందని, అయితే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రూ.6 వేలతో కంది, రూ.1,600లతో మొక్కజొన్నను వ్యాపారులు కొనుగోలు చేస్తూ రైతులను నష్టాల ఊబిలోకి నెట్టేస్తున్నారన్నారు. అమెరికా, లండన్ నుంచి విశాఖకు పరిశ్రమలు తెస్తామని రూ.లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని గొప్పలు చెబుతున్న ప్రభుత్వ పెద్దలకు రైతుల గురించి కనీసం ఆలోచించే తీరిక లేకుండా పోతోందన్నారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి డీఆర్డీఏ, వెలుగు కార్యాలయాల ద్వారాా మహిళా సంఘాల సభ్యులతో పంటల కొనుగోలుకు కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారం లోపు ఈ ప్రక్రియ చేపట్టకపోతే రైతులతో కలిసి ఉద్యమాలకు తెర లేపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శోభారాణి, జెడ్పీటీసీ బొమ్మన్న, ఎంపీపీలు మారుతమ్మ, భీమేష్, పార్టీ కన్వీనర్లు చంద్రశేఖర్ రెడ్డి, కదిరిదేవరపల్లి రాయుడు, వివిధ విభాగాల తాలూకా అధ్యక్షులు పాటిల్ అభిలాష్, పాతలింగ, స్థానిక నాయకులు కృష్ణారెడ్డి, బలరాం, కేశవరెడ్డి, గోళ్ల మోహన్రెడ్డి, భాస్కర్రెడ్డి, సత్తిరెడ్డి, సంజప్ప, అంజినరెడ్డి, కొండారెడ్డి, రామిరెడ్డి, దొడగట్ట నారాయణ, సర్పంచ్ హనుమంతప్ప, జయరామిరెడ్డి, మంజునాథ రెడ్డి, మహదేవరెడ్డి, వైఎస్ చిత్తయ్య, గణేష్, రాము, హనుమంతరెడ్డి, మల్లికార్జున, చరణ్ తదితరులు పాల్గొన్నారు. కిసాన్ రైలు సేవలను పునరుద్ధరించాలి పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలి వారంలోపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే ఉద్యమం తప్పదు మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య


