Anantapur District News
-
జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆకాశం మేఘావృతమై పలు మండలాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైంది. నైరుతి దిశగా గంటకు 6 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
‘తల్లికి వందనం’.. తప్పులతో ఎగనామం పెద్దవడుగూరు: ‘తల్లికి వందనం’ వివరాల నమోదు తప్పులతడకగా ఉండటంతో అర్హత కలిగిన పలువురికి పథకం వర్తించలేదు. ఎవరో చేసిన తప్పిదాలకు తమకు లబ్ధి చేకూరకుండా ఎగనామం పెట్టారని బాధితులు వాపోతున్నారు. వ్యవసాయ భూమి తక్కువ ఉన్నా 10 ఎకరాలకు పైబడి ఉందని అనర్హుల జాబితాలో చేర్చారని పెద్దవడుగూరు మండలం ముప్పాలగుత్తికి చెందిన ఆదినారాయణ, లక్ష్ముంపల్లికి చెందిన రెడ్డిపల్లి సుధాకర్రెడ్డి, పుల్లన్న తెలిపారు. సుధాకర్రెడ్డికి 3 ఎకరాల పొలం ఉంటే.. పది ఎకరాలు ఉన్నట్లు చూపారు. ముప్పాలగుత్తి గ్రామంలో చంద్రశేఖర్ అనే వ్యక్తికి వ్యవసాయ భూమి లేకున్నా అనర్హుల జాబితాలో పేరు వచ్చింది. ధనలక్ష్మి, సుజాతకు కూడా భూమి తక్కువ ఉన్నా ఎక్కువగా ఉన్నట్లు నమోదవడంతో లబ్ధి పొందలేకపోయారు. మరికొందరికి ఇద్దరు పిల్లలు ఉన్న చోట ఒకరికి మాత్రమే రూ.13వేలు వర్తింపజేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులను వివరణ కోరగా తక్కువ భూమి ఉన్నా.. రీ సర్వే జరిగిన గ్రామాల్లో వారి భూముల సమస్యలను అలాగే పెట్టుకోవడం వల్ల జాయింట్ ఎల్పీఎం కింద భూములు ఉన్న రైతులు అనర్హులుగా మారిపోయారని తహసీల్దార్ ఉషారాణి తెలిపారు. మండలంలోని 15 గ్రామ సచివాలయాల్లో దాదాపు 6,088 మందికి పథకం వర్తించగా.. 808 మందిని అనర్హుల జాబితాలో ఉంచారు. అర్హత ఉన్నా డబ్బు పడని వారి నుంచి అర్జీలు స్వీకరించి.. పరిష్కారం చేస్తామని ఎంపీడీఓ బారన్సాహెబ్ తెలిపారు. రీకౌంటింగ్ గడువు ఈ నెల 19 అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించి రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్కు ఈ నెల 19లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ప్రసాద్బాబు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందనాయక్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. రీ కౌంటింగ్కు రూ.500, రీ వెరిఫికేషన్ ద్వారా జవాబుపత్రాలు పొందేందుకు రూ.1000 ఫీజు చెల్లించాలన్నారు. పాఠశాల హెచ్ఎం లాగిన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. వ్యక్తిగత దరఖాస్తులు స్వీకరించబోమని తెలియజేశారు. -
నేడు దివ్యాంగుల రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమం
అనంతపురం అర్బన్: నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శనివారం ఉదయం దివ్యాంగుల రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. కార్యక్రమ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమ నిర్వహణపై కలెక్టర్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు కార్యక్రమం ఉంటుందన్నారు. ఉదయం 6.30 గంటలకే పరేడ్ మైదానం చేరుకునేలా చూడాలన్నారు. పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మైదానంలో కనీస సౌకర్యాలు ఉండాలన్నారు. కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ, డీఆర్ఓ ఎ.మలోల, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ వినోద్, డీఎంహెచ్ఓ ఈబీదేవి, నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, ఆర్డీఓలు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మునిసిపల్ కమిషనర్లు, ఆయుష్ అధికారులు, యోగా గురువులు పాల్గొన్నారు. -
బుద్ధి తెచ్చుకో బాబూ..
● కొమ్మినేని అరెస్టు అన్యాయం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత అనంతపురం కార్పొరేషన్: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్టుపై సుప్రీంకోర్టు ఉత్తర్వులతోనైనా సీఎం చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని, ప్రజా ప్రయోజనాలపై దృష్టిసారించాలని, లేని పక్షంలో చరిత్రహీనుడుగా నిలిచిపోతారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సాక్షి టీవీ డిబేట్లో విశ్లేషకులు వ్యాఖ్యలు చేస్తే కొమ్మినేని శ్రీనివాసరావుపై కేసు ఏవిధంగా నమోదు చేస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు నియంత పాలనకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని పేర్కొన్నారు. ఇటీవల సాక్షి టీవీలో జరిగిన ఓ డిబేట్ కార్యక్రమంలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో అలజడి వాతావరణం సృష్టించారన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టులో కూటమి ప్రభుత్వం కనీస నిబంధనలను పాటించలేదన్న విషయం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా స్పష్టమైందని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్బుక్ రాజ్యాంగానికి ఈ తీర్పు కచ్చితంగా చెంపపెట్టని అభివర్ణించారు. ఇదే సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిపై కూడా దుష్ప్రచారం చేశారని, కుట్రపూరితకంగా సాక్షి కార్యాలయాలపై దాడి చేశారని, తక్షణం వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరారు. బీ ఫార్మసీ ఫలితాలు విడుదల అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించిన బీ ఫార్మసీ ఒకటో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–23) రెగ్యులర్, సప్లిమెంటరీ , (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి. నాగప్రసాద్ నాయుడు శుక్రవారం విడుదల చేశారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలని కోరారు. మద్యం షాపుల దరఖాస్తుకు 19న చివరి గడువు అనంతపురం: మద్యం షాపుల నిర్వహణకు సంబంధించి ఈ నెల 19 తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలని ప్రొహిబిషన్ ఎకై ్సజ్ జిల్లా అధికారి రామ్మోహన్రెడ్డి తెలిపారు. తాడిపత్రి మున్సిపాలిటీలో మూడు, కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ఒకటి, పెద్దవడుగూరులో ఒకటి చొప్పున మద్యం షాపుల నిర్వహణకు సంబంధించి ఆఫ్లైన్ లేదా, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నాన్ రీఫండబుల్ కింద రూ.2లక్షలు డిపాజిట్ చేయాలి. ఈ నెల 21న జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో లాటరీ ప్రక్రియ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు. ‘పచ్చ’ నేతల ఇసుక మేత ● అడ్డుకున్న నిదనవాడ రైతులు శింగనమల: పచ్చ నేతలు బరితెగించారు. పెన్నానదిలో ఇసుకను అక్రమంగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతుండడంతో రైతులు తిరగబడ్డారు. ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. పెద్దవడుగూరు మండలానికి చెందిన టీడీపీ నాయకులు చిత్రచేడు వైపున పెన్నానది పరివాహక ప్రాంతంలో ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి శింగనమల మండలం నిదనవాడ సమీపంలోని పెన్నానది పరివాహక ప్రాంతంపై కన్నుపడింది. రెండు రోజుల నుంచి యథేచ్ఛగా జేసీబీని పెట్టి ఇసుకను తవ్వి టిప్పర్లద్వారా తరలించారు. విషయం తెలుసుకున్న నిదనవాడ రైతులు పార్టీలకతీతంగా ముందుకు వచ్చి ఇసుకాసురులకు చెక్పెట్టారు. అక్రమంగా పెద్దపెద్ద గుంతలు తవ్వి ఇసుక తరలిస్తే భూగర్భజలం తగ్గిపోతుందని వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న శింగనమల సీఐ కౌలుట్లయ్య సిబ్బందితో వచ్చి ఇసుక కోసం తీసిన గుంతలను పరిశీలించారు. ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలి
కళ్యాణదుర్గం: ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయకపోతే సీఎం చంద్రబాబు ప్రజల దృష్టిలో చరిత్రహీనులవుతారని ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ నదీం అహమ్మద్ అన్నారు. ఆర్డీటీ పరిరక్షణ కోసం మాజీ ఎంపీ తలారి రంగయ్య చేపట్టిన పాదయాత్ర శుక్రవారం కంబదూరు మండలం డీసీ పల్లిలో సాగింది. వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరం స్వర్ణలతతో కలసి నదీం పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలారి రంగయ్యతో కలసి వారు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు అన్ని కులాలతో పాటు స్వచ్ఛంద సంస్థల హక్కులను దోచుకుతినడం పరిపాటిగా మారిందన్నారు. పేదల అభ్యున్నతి కోసం పరితపిస్తున్న ఆర్డీటీ కార్యక్రమాలకు విదేశీ నిధులే ముఖ్యమన్నారు. ఎన్నికల ముందు సీట్ల కోసం, అధికారం చేపట్టిన తర్వాత మంత్రి పదవుల కోసం వారాల తరబడి చర్చలు జరిపిన బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు.. నిస్వార్థ సేవలు అందిస్తున్న ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ అంశంపై పెదవి విప్పకపోవడం దుర్మార్గమన్నారు. ఆర్డీటీ అనేది మతానికి సంబంధించినది కాదని, కేవలం మానవత్వానికి సంబంధినదని గుర్తించాలన్నారు. 55 ఏళ్లుగా తలెత్తని సమస్య కూటమి ప్రభుత్వంలోనే ఎందుకు వచ్చిందని నిలదీశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏనాడూ ఆర్డీటీకి ఇంతటి కష్టం రాలేదన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, పార్టీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు, జెడ్పీటీసీ గుద్దెళ్ల నాగరాజు, ఎంపీపీ భీమేష్, మండల కన్వీనర్ హనుమంతరాయుడు, పార్టీ జిల్లా కార్యదర్శి ములకనూరు తిమ్మరాయుడు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గంగాధరతో పాటు ఆర్డీటీ లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లేకపోతే చరిత్ర హీనులవుతారు ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ నదీం, మాజీ ఎంపీ తలారి రంగయ్య -
పనులు వేగవంతం చేయండి : హెచ్చెల్సీ ఎస్ఈ
కణేకల్లు: హెచ్చెల్సీ ఆధునీకీకరణ పనులు వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లను ఎస్ఈ పురంధరరెడ్డి ఆదేశించారు. యర్రగుంట శివారులోని 137 కిలోమీటర్ వద్ద జరుగుతున్న యూటీ (అండర్ టన్నెల్) పనులతో పాటు బొమ్మనహళ్ మండలంలో 115 నుంచి 130 కిలోమీటర్ మధ్య చేపట్టిన హెచ్చెల్సీ లైనింగ్ పనులను ఈఈ వెంకటేశ్వర్లు, డీఈఈ దివాకరరెడ్డి, క్వాలిటీ కంట్రోల్ డీఈఈ చంద్రశేఖర్, జేఈలు ఓబుళపతి, రమణరెడ్డితో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. యూటీ వద్ద వర్షపు నీరు నిలవడంతో వాటిని పూర్తిగా బయటికి పంపింగ్ చేయాలని సూచించారు. మంగళవారం స్లాబ్ వేస్తున్నట్లు కాంట్రాక్టర్ తెలిపారు. 115, 117, 155, 169 కిలోమీటర్ వద్ద జరుగుతున్న డీఎల్ఆర్బీ (బ్రిడ్జీ) పనుల్లో నాణ్యత లోపించరాదని ఆదేశించారు. అనంతరం కణేకల్లు చెరువు అవుట్ఫాల్ రెగ్యులేటర్, మోపిడి వద్ద ఎంపీఆర్, పీఏబీఆర్ రెగ్యులేటర్ పనులను పరిశీలించారు. నిర్ణీత గడువు లోపు పనులన్నీ పూర్తి కావాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. నిరుద్యోగులకు కంప్యూటర్ శిక్షణ అనంతపురం సెంట్రల్: నిరుద్యోగ యువతీయువకులకు అనంతపురంలోని ఏఏఫ్ ఎకాలజీ సెంటర్లో 60 రోజుల పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఈ మేరకు ఆ సెంటర్ డైరెక్టర్ వై.వి.మల్లారెడ్డి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కంప్యూటర్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీసు, లైఫ్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లిషు, కస్టమర్ రిలేషన్ షిప్ అంశాల్లో శిక్షణ ఇస్తారు. 20 నుంచి 30 సంవత్సరాల్లోపు వయస్సు, ఇంటర్ ఉత్తీర్ణత, డిప్లమో, డిగ్రీ, ఇంజినీరింగ్ పాస్/ఫెయిల్ అయిన వారు అర్హులు. ఈ నెల 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. శిక్షణ కాలంలో మధ్యాహ్నం ఉచిత భోజన సదుపాయం ఉంటుంది. పూర్తి వివరాలకు 73969 50345లో సంప్రదించవచ్చు. బెంగళూరు–బీదర్ మధ్య రైళ్లు గుంతకల్లు: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బెంగళూరు–బీదర్ మధ్య ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. ఈ నెల 15 నుంచి 29 వరకు శుక్ర, ఆదివారాల్లో (5 సర్వీసులు మాత్రమే) రాకపోకలు సాగిస్తుందని వెల్లడించారు. 15న బెంగళూరు జంక్షన్ నుంచి రాత్రి 9.15 గంటలకు ఎక్స్ప్రెస్ రైలు (06539) బయలుదేరి బీదర్ జంక్షన్కు మరుసటి రోజు ఉదయం 11.30 గంటలకు చేరుతుందన్నారు. తిరిగి ఈ రైలు బీదర్లో మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి బెంగళూరుకు మరుసటి తెల్లవారుజూమున 4 గంటలకు చేరుతుందని తెలిపారు. ఈ రైలు ఈ నెల 16 నుంచి 30 వరకు ప్రతి శని, సొమవారాల్లో రాకపోకలు సాగిస్తున్నట్లు తెలిపారు. ఈ రైలు యలహంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయంరోడ్డు, రాయచూర్, కృష్ణ, యద్గారి, వాడి, షాహబాద్, కలబురిగి, హమ్నాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు. ఈ రైలు 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్బోగీలతోపాటు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయని పేర్కొన్నారు. -
కుక్కల దాడిలో గొర్రెల మృతి
పుట్లూరు: వీధి కుక్కల దాడిలో 37 గొర్రెలు మృతి చెందాయి. వివరాలు.. పుట్లూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు గొర్రెల పెంపకం చేపట్టి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గ్రామ సమీపంలోని చెరువు కట్ట వద్ద గొర్రెలను దొడ్డిలో ఉంచేవాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి గొర్రెలను దొడ్డిలో వదిలి ఇంటికెళ్లి నిద్రించాడు. శుక్రవారం ఉదయం అక్కడకు చేరుకునేలోపు దాదాపు 10 కుక్కలు చుట్టుముట్టి గొర్రెలపై దాడి చేస్తుండడాన్ని గమనించి, వాటి అదలించేలోపు 37 గొర్రెలు మృతి చెందాయి. జీవనాధారంగా ఉన్న గొర్రెల మృతితో శ్రీనివాసులు కన్నీటిపర్యంతమయ్యాడు. అప్పులు చేసి ఇటీవల గొర్రెలను కొనుగోలు చేశానని, ఘటనతో రూ.3 లక్షలు నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ అలివేలమ్మ, డిప్యూటీ తహసీల్దార్ మహబూబ్బాషా, వీఆర్వో వెంకటనారాయణ, పంచాయతీ కార్యదర్శి సంధ్య అక్కడకు చేరుకుని పరిశీలించారు. పశువైద్యాధికారితో పంచనామా నిర్వహించి, నివేదిక సిద్ధం చేయించారు. గొర్రెల మృతితో నష్టపోయిన శ్రీనివాసులును ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని గ్రామస్తులు డిమాండ్ చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు -
అటవీ భూమిపై అక్రమార్కుల కన్ను
ప్రభుత్వ అటవీ భూములపై కన్నేసిన స్వార్థపరులు ఎడారి నివారణలో భాగంగా 15 ఏళ్లుగా పెంచుతున్న పచ్చని చెట్లను కూకటి వేళ్లతో సహా పెకలించేస్తున్నారు. ఈ దౌర్జన్యంపై గత సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గ్రామస్తులు ఫిర్యాదు చేయడం గమనార్హం. కణేకల్లు: బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లో వేదవతి హగరి పరివాహక ప్రాంతంలోని అటవీ శాఖ పరిధిలో ఉన్న వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు విస్తరించి ఎడారిని తలపిస్తున్నాయి. ఆషాడంలో గాలులకు ఈ ఇసుక తెరలు తెరలుగా ఎగిసి మేటలు మరింత విస్తరిస్తూ వచ్చాయి. దీంతో 15 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం ఎడారి నివారణలో భాగంగా కళేకుర్తి, మాల్యం, తుంబిగనూరు, మీన్లహళ్లి, బిదరకుంతంతో పాటు వివిధ గ్రామాల్లో పెద్ద ఎత్తున మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టింది. మొక్కలు ఇప్పుడు భారీ వృక్షాలై కనుచూపు మేర పచ్చదనం నిండుకుంది. ఈ చెట్లతో ఇసుక దిబ్బలు ముందుకు కదలడం లేదు. టీడీపీ కార్యకర్తల బరితెగింపు కళేకుర్తి గ్రామ శివారులో హెచ్చెల్సీ అక్విడెక్ట్ కుడివైపున వేదవతి హగిరి ఒడ్డు ఉన్న ఎడారి ప్రాంతంపై కళేకుర్తి గ్రామానికి చెందిన కొందరు టీడీపీ కార్యకర్తల కన్నుపడింది. ఈ భూమి పంటల సాగుకు చాలా అనువుగా ఉండటంతో ఎలాగైనా కబ్జా చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా ఐదారు రోజుల క్రితం సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలోని భారీ వృక్షాలను కూకటి వేళ్లతో సహా పెకలించి జేసీబీ సాయంతో వాటి ఆనవాళ్లు లేకుండా మాయం చేస్తూ భూమిని చదును చేసి సాగుభూమిగా మార్చుకున్నారు. ఈ దుశ్చర్యపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెరవెనుక అటవీ అధికారి? అటవీ శాఖ పరిధిలోని భూముల్లో పచ్చని చెట్లను నరికివేత వెనుక స్థానిక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హస్తమున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. రిజర్వ్ ఫారెస్ట్లో కొందరు చెట్లను రెండేళ్ల క్రితం నరికేసి సాగుభూమిగా మార్చుకుని పంటలు పండిస్తున్నారు. తాజాగా మరో 10 ఎకరాల్లోని రిజర్వ్ ఫారెస్ట్ కబ్జాకు గురైంది. ఈ అక్రమాల వెనుక సదరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కు పెద్ద మొత్తంలో లెక్క ముట్టినట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. సాగు ముసుగులో వ్యాపారం వేదవతి హగిరి ఒడ్డున ఉన్న ఇసుక భూములు ప్రస్తుతం సారవంతమైన భూములుగా మారాయి. ఒకప్పుడు దేనికి పనికిరాని ఈ భూముల్లో వేరుశనగ, వరి పంటలు సాగు చేస్తే అధిక దిగుబడి సాధ్యమని ఇటీవల రైతులు నిరూపించారు. దీంతో ఈ భూమికి భారీగా డిమాండ్ నెలకొంది. ఎకరా భూమి రూ.12లక్షల వరకు ధర పలుకుతున్నట్లు సమాచారం. ఈ వేదవతి హగిరి ఒడ్డున ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూములను ఇప్పటికే చాలా మంది కబ్జా చేసి సాగు భూమిగా మార్చేసుకున్నారు. పంటల సాగు ముసుగులో అనధికారిక అగ్రిమెంట్లతో భూమి విక్రయాలూ ఊపందుకున్నాయి. పట్టించుకోకపోతే అడవులు మాయం ఎడారి నివారణలో భాగంగా ఓ వైపు అధికారులు విస్తారంగా మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తుంటే.. మరో వైపు కొందరు తమ స్వార్థం కోసం భారీ చెట్లను నరికేస్తున్నారు. పట్టపగలే రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో చెట్ల నరికేస్తున్నా అటవీ, రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు స్పందించకపోతే భవిష్యత్తులో అడవి మాయమై కళేకుర్తి ప్రాంతం ఎడారిగా మారుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్కు ఫిర్యాదు రిజర్వ్ ఫారెస్ట్లో భారీ వృక్షాల నరికివేత అంశం, పరోక్షంగా సహకరిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తీరుపై గత సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో జిల్లా అధికారుల ద్వారా కలెక్టర్ దృష్టికి కళేకుర్తి వాసులు తీసుకెళ్లారు. తక్షణమే ఈ అంశంపై స్పందించి అటవీ ప్రాంత పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎంతటి వారినైనా ఉపేక్షించబోం కళేకుర్తి గ్రామంలో కొందరు స్వార్థపరులు పోటీ పడి రాత్రికిరాత్రే చెట్లు నరికేస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక విచారణ చేపట్టి చెట్లను నరికేస్తున్న వారిని గుర్తించాం. ఫారెస్ట్ యాక్ట్ 1967 ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. బీట్ ఆఫీసర్పై వచ్చిన ఆరోపణలు పూర్తి అవాస్తవం. పచ్చని చెట్లను పరిరక్షించే బాధ్యత ప్రతి పౌరునిపై ఉంది. చెట్లను నరికేసి ఎడారిగా మార్చొద్దని ప్రజలకు మనవి చేస్తున్నాం. – దామోదరరెడ్డి, డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, రాయదుర్గం ఎడారి నివారణలో భాగంగా 15 ఏళ్లుగా పెంచుతున్న చెట్లు టీడీపీ కార్యకర్త దుశ్చర్యకు మాయమైన 10 ఎకరాల్లోని పచ్చని చెట్లు కలెక్టర్కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు -
బదిలీ టీచర్లకు ‘స్పౌజ్’ తంటా
అనంతపురం ఎడ్యుకేషన్: దంపతులిద్దరూ ఉద్యోగులై ఉండి వేర్వేరు ప్రాంతాల్లో ఉంటే కుటుంబ పరంగా ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం మానవీయకోణంలో ఆలోచించి ‘స్పౌజ్’ పాయింట్ల పద్ధతి తీసుకొచ్చింది. దీనిద్వారా బదిలీల్లో భార్య/భర్తలో ఒకరు ఐదు పాయింట్లు పొందవచ్చు. ‘స్పౌజ్’ కోటాలో బదిలీ అయ్యే భర్త లేదా భార్య పని చేస్తున్న సమీపంలోకి వెళ్లాలి. ఇద్దరూ వెళ్లొచ్చేందుకు సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధానాన్ని ఎప్పటి నుంచో అమలు చేస్తోందని అధికారులు చెబుతున్నారు. అయితే ‘స్పౌజ్’ కోటాలో పాయింట్లు పొందిన చాలామంది భర్త/భార్య పని చేస్తున్న సమీపానికి కాకుండా జిల్లా కేంద్రానికి లేదా వారికి అనుకూలమైన స్కూళ్లకు వెళ్లడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో చాలామంది జిల్లా సరిహద్దు మండలాల్లో పని చేస్తున్నా.. వారి భాగస్వాములు మాత్రం ‘స్పౌజ్’ పాయింట్లు పొంది జిల్లా కేంద్రం, పట్టణాల చుట్టుపక్కల ప్రాంతాల్లోనే పని చేస్తున్నారు. ‘స్పౌజ్’ సమీపంలోకి వెళ్లాల్సిందే! తాజాగా జరుగుతున్న ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్లో ‘స్పౌజ్’ నిబంధనలను విద్యాశాఖ అధికారులు పక్కాగా అమలు చేస్తున్నారు. భార్య, భర్త పని చేస్తున్న స్కూల్లో ఖాళీగా ఉంటే కచ్చితంగా అక్కడికి పోవాల్సిందే. అక్కడ ఖాళీ లేకపోతే సమీప స్కూళ్లు, మండలం, ఆ తర్వాత పక్క మండలాలకు వెళ్లాల్సి ఉంది. ఒకే స్కూల్కు అంటే మరీ ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో టీచర్లు తక్కువ సంఖ్యలో ఉంటారని, ఈ నేపథ్యంలో అవసరాలకు దంపతులిద్దరూ ఒకేసారి సెలవు పెట్టుకోవడం ఇబ్బందిగా ఉంటుందని బాధిత టీచర్లు వాపోతున్నారు. పాయింట్లు ఉన్నా దూర ప్రాంతాలకు.. ఎక్కువ పాయింట్లు ఉండికూడా దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. కూడేరు మండలం గొట్కూరులో పని చేస్తున్న శ్రీదేవికి స్పౌజ్ పాయింట్లతో కలిపి 42.6 పాయింట్లు ఉన్నాయి. ఈమెభర్త శ్రీనివాసరెడ్డి ఇటీవల గణితం స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతి పొంది బొమ్మనహాళ్ మండలం గోవిందవాడకు వెళ్లారు. దీంతో శ్రీదేవి కూడా అక్కడికి పోవాల్సిందేనంటూ అధికారులు తేల్చి చెప్పడంతో ఆమె కూడా బొమ్మనహాళ్ మండలానికి వెళ్లారు. 35, 36 పాయింట్లు ఉన్న జనరల్ టీచర్లకు అనంతపురం చుట్టుపక్కన 16 శాతం హెచ్ఆర్ఏ స్కూళ్లు వచ్చాయి. తాడిపత్రి, హిందూపురం, గుంతకల్లు, కదిరి, ధర్మవరం, పెనుకొండ, కళ్యాణదుర్గం, గుత్తి ప్రాంతాల్లో ఎక్కువమంది ‘స్పౌజ్’ టీచర్లు పాయింట్లు ఎక్కువ ఉన్నాకూడా భర్త/భార్య పని చేస్తున్న కారణంగా దూరంగా వెళ్లారు. ● ఉరవకొండ మండలంలో భర్త పని చేస్తున్న స్కూల్లో ఖాళీగా ఉండడంతో ‘స్పౌజ్’ పాయింట్లు పొందిన భార్య పక్కన మరో స్కూల్ను కోరుకుంది. కొందరు అభ్యంతరం చెప్పడంతో భర్త పని చేస్తున్న స్కూల్కు వెళ్లాల్సి వచ్చింది. ● రాష్ట్ర కేడర్ కల్గిన ఉద్యోగులు జిల్లాలో పని చేస్తుంటే ‘స్పౌజ్’ కింద వారి సమీపంలోకి వెళ్లాల్సిందేనంటూ అధికారులు తేల్చి చెప్పారు. ఈ క్రమంలో నార్పలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ భార్య అనంతపురం రూరల్ మండలంలో కోరుకోవాలని చూసినా...డీఈఓ ఒప్పుకోలేదు. ● శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం పిన్నదరిలో భర్త సోషల్ టీచరుగా పని చేస్తున్నారు. భార్య దాడితోటలో ఎస్జీటీగా పని చేస్తోంది. పిన్నదరికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న బత్తలపల్లి మండలం మాల్యవంతం ఇవ్వాలని కోరినా.. మండలం వేరే అవుతున్న కారణంగా ఇవ్వడానికి సాధ్యంకాదని డీఈఓ తేల్చి చెప్పారు. తప్పనిసరిగా ‘స్పౌజ్’ సమీపంలోకి వెళ్లాల్సిందే ‘స్పౌజ్’ పాయింట్లు పొందినవారికంటే జనరల్ టీచర్లకు సౌకర్యవంతమైన స్కూళ్లు ఎక్కువ పాయింట్లు ఉన్నా దూరానికి వెళ్తున్న ‘స్పౌజ్’ టీచర్లు నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్న విద్యాశాఖ తలలు పట్టుకుంటున్న ‘స్పౌజ్’ టీచర్లు స్పష్టమైన ఆదేశాలు ‘స్పౌజ్’ పాయింట్లు పొందిన వారు ఇష్టానుసారంగా స్థానాలు కోరుకునేందుకు లేదు. ప్రత్యేకించి ఈ విషయంలో కమిషనర్ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. ‘స్పౌజ్’ పని చేస్తున్న స్కూల్కు సమీపంలోకి వెళ్లాల్సిందే. ఇందులో ఎవరికీ మినహాయింపు ఉండదు. – ఎం.ప్రసాద్బాబు డీఈఓ -
తప్పని జాగరణ
అనంతపురం ఎడ్యుకేషన్: సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీల)కు జరుగుతున్న బదిలీల కౌన్సెలింగ్లో జాగరణ తప్పడం లేదు. వరుసగా మూడోరోజూ పడిగాపులు కాశారు. శుక్రవారం సీరియల్ నంబరు 1001 నుంచి 1800 దాకా పిలిచారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ రాత్రంతా కొనసాగింది. పరిశీలకులు సుబ్బారావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబు దగ్గరుండి పర్యవేక్షించారు. మరోవైపు తమకు అన్యాయం జరుగుతోందంటూ భాషాపండితులు నిరసన తెలియజేశారు. ఏటా బదిలీలు, సర్దుబాటు పేరుతో మానసిక వేదనకు గురి చేస్తున్నారని, శాశ్వత పరిష్కారం చూపాలంటూ ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కౌన్సెలింగ్ను అడ్డుకోవడంతో ఆగిపోయింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళనకారులను బయటకు వెళ్లాలని చెప్పడంతో...కౌన్సెలింగ్కు ఆటంకం కల్గించకుండా శాంతియుత నిరసన తెలియజేస్తామని చెప్పి ప్లకార్డులు పట్టుకుని వేదికపై కూర్చున్నారు. మధ్యాహ్నం వరకు ఈ నిరసన కొనసాగింది. ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలగజేసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పరిశీలకులు, డీఈఓ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
అధిక ధరకు విక్రయిస్తే చర్యలు
ఈ–స్టాంప్ల విక్రయాలకు సంబంధించి విక్రయదారులకు కమీషన్ను రిజిస్ట్రేషన్ శాఖ చెల్లిస్తోంది. కాబట్టి అధిక ధరకు వారు విక్రయించరాదు. అలా కాదని అధిక ధరకు విక్రయించే వారి లైసెన్సు రద్దు చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. నాన్ జ్యుడీషియల్ స్టాంప్ల కొరతపై ఇప్పటికే ఐజీ కార్యాలయానికి నివేదిక అందజేశాం. వచ్చే నెల మొదటి వారంలో నాన్ జ్యుడీషియల్ స్టాంపులు జిల్లా వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటాం. – విజయలక్ష్మి, డీఐజీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ -
కూటమి సర్కారు పుణ్యమా అని అన్నదాతలు దగాకు గురవుతున్నారు. ప్రస్తుత ఖరీఫ్లో సబ్సిడీ వేరుశనగ విత్తనకాయల పంపిణీలోనూ అన్యాయం చేస్తున్నారు. సర్కారుకు చిత్తశుద్ధి లేకపోవడం, అధికారుల కక్కుర్తి, ఏజెన్సీల ధనదాహం వెరసీ రైతులకు నాసిరకం విత్తనకాయలు అంటగట్టి నిలువునా
సాక్షి ప్రతినిధి, అనంతపురం: విత్తన కాయలను రైతుల దగ్గర కొని, శుద్ధి చేసి నాణ్యమైన వాటిని అందించే బాధ్యత ఏపీసీడ్స్ కార్పొరేషన్ది. అయితే, కొన్ని రోజులుగా విత్తన వేరుశనగను సేకరించి.. వాటిని శుద్ధి చేసే బాధ్యతలను కొన్ని ఏజెన్సీలకు అప్పజెబుతున్నారు. ఇక్కడే మతలబు మొదలైంది. సాధారణంగా ఏజెన్సీలకు ఏపీ సీడ్స్ కార్పొరేషన్ అనుమతులు ఇచ్చిన తర్వాతే విత్తన కాయల శుద్ధి, సరఫరా జరగాలి. కానీ కొన్ని ఏజెన్సీలకు అనుమతులు ఇవ్వకముందే విత్తనకాయల సరఫరా మొదలుపెట్టాయి. వాస్తవానికి శుద్ధి చేసిన తర్వాత నాణ్యమైన విత్తనకాయలను మాత్రమే రైతు సేవా కేంద్రాల (ఆర్ఎస్కేల)కు తరలించాలి. అక్కడ రైతులకు పంపిణీ చేస్తారు. అయితే.. ఏమాత్రమూ ప్రాసెసింగ్ (శుద్ధి) చేయకుండానే నాసిరకం కాయలను సంచుల్లో నింపి పంపిస్తున్నారు. ఏజెన్సీలు, అధికారుల కుమ్మక్కు రైతులకు నాణ్యమైన విత్తనకాయలు అందేలా చూడాల్సిన ఏపీ సీడ్స్ కార్పొరేషన్ అధికారులు ఏజెన్సీలతో కుమ్మకై ్క తమ బాధ్యతలను గాలికొదిలేశారు. విత్తన కాయలు శుద్ధి అవుతున్నాయా, నాణ్యతగా ఉన్నాయా, లేదా అనేది ఎక్కడా పరిశీలించలేదు. ఏజెన్సీలు విత్తనకాయలను శుద్ధి చేసేందుకు అవసరమైన యంత్ర పరికరాలు ఉన్నాయో, లేదో వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించిన అనంతరం వాటికి అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. కానీ వారు కూడా సరఫరా ఏజెన్సీల ఇష్టారాజ్యానికి వదిలేశారు. అసలు ఏమాత్రమూ శుద్ధి చేయకుండానే ఇప్పటివరకు రెండు జిల్లాల్లో పెద్దఎత్తున విత్తన కాయలను ఆర్ఎస్కేలకు చేర్చారు. అక్కడక్కడ అనుమానం వచ్చిన చోట్ల ఆర్ఎస్కే సిబ్బంది విత్తనకాయలను పరిశీలించి..నాణ్యత లేనివాటిని వెనక్కి పంపిస్తున్నారు. దరఖాస్తు చేయకముందే అనుమతి ఇచ్చారట! ఉమ్మడి అనంతపురం జిల్లాలో సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీలో భాగంగా విత్తన శుద్ధి, ప్యాకింగ్, సరఫరాకు సంబంధించి మొత్తం 18 ఏజెన్సీలకు అనుమతులు మంజూరు చేశారు. ఇప్పటికే రైతులకు విత్తన పంపిణీ మొదలుపెట్టారు. అయితే..అనుమతులు రాకముందు నుంచే కొన్ని ఏజెన్సీలు విత్తనకాయల సరఫరా మొదలుపెట్టడం గమనార్హం. అధికారులు భరోసా ఇవ్వడం వల్లే ఇలా చేశాయన్నది స్పష్టమవుతోంది. ఈ ఏజెన్సీల్లో కదిరిలోని శ్రీ కార్తికేయ ఆగ్రో సీడ్స్ తో పాటు మరికొన్ని ఉన్నాయి. వాస్తవానికి ఇవి గత నెల 31న అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అయితే..అంతకుముందే అంటే మే 26, 27వ తేదీనే అనుమతి ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. దరఖాస్తు చేయకముందే అనుమతి ఎలా ఇచ్చారన్నది అంతుపట్టని విషయం. పైగా ఈ ఏజెన్సీలకు ఫీల్డ్ సూపర్వైజర్ను కూడా సీడ్ కార్పొరేషన్ డీఎం నియమించడం అనుమానాలకు తావిస్తోంది. పావగడ నుంచి విత్తనకాయలు ఉమ్మడి అనంతపురం జిల్లా సీడ్ కార్పొరేషన్ అధికారికి కర్ణాటకలోని పావగడ వద్ద ఓ విత్తన శుద్ధి ప్లాంటు ఉన్నట్టు సమాచారం. అక్కడి నుంచి విత్తనకాయలను అనుమతులు లేకుండా ఏజెన్సీలకు సరఫరా చేసి.. అక్కడి నుంచి రైతులకు ఇస్తున్నట్టు తెలుస్తోంది. విత్తనకాయల శుద్ధి, నాణ్యతపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు గానీ, కలెక్టర్ల పరిధిలో గానీ ఎలాంటి తనిఖీలు లేకపోవడంతో రైతులు దగాకు గురవుతున్నారు. ఏజెన్సీలు, సీడ్ కార్పొరేషన్ అధికారులు ‘ఆడిందే ఆట.. పాడిందే పాట’ అన్న చందాన వ్యవహారం నడుస్తోంది. ప్రొద్దుటూరుకు చెందిన సుబ్రమణ్యేశ్వర ఆగ్రోసీడ్స్ సంస్థను అడ్డుపెట్టుకుని ఇక్కడ సీడ్ కార్పొరేషన్ అధికారి భారీ దందా చేస్తున్నట్టు తెలిసింది. ఉమ్మడి అనంత జిల్లాకు కావాల్సిన వేరుశనగ విత్తన కాయలు టెండర్లో క్వాలిఫై అయ్యారని ఇచ్చారట.. విత్తన కాయల పంపిణీలో అక్రమాలపై సీడ్ కార్పొరేషన్ డీఎం రామసుబ్బయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఆయన తికమక సమాధానాలు ఇచ్చారు. క్వాలిఫై అయింది కాబట్టి సుబ్రమణ్యేశ్వర ఆగ్రో సీడ్స్ తరఫున ఏజెన్సీకి ఇచ్చామని ఒకసారి, అవి వ్యవసాయశాఖ ఇచ్చిన అనుమతులని మరోసారి చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రావడం ఆలస్యమైందని ఆయన చెప్పడం కొసమెరుపు. దీంతో మొత్తం వ్యవహారంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటివరకూ సరఫరా అయినవిఇంకా రావాల్సినవిఉమ్మడి అనంతపురం జిల్లాలో వేరుశనగ పంట సాగు2.40లక్షలు పైనేరైతులుశెనిక్కాయ మాటున డబ్బుల గుటుక్కు అనుమతులు రాకముందే ఏజెన్సీల నుంచి విత్తన కాయల సరఫరా 31న ఏజెన్సీలు దరఖాస్తు చేస్తే 26నే అనుమతులు! ప్రాసెసింగ్ చేయకుండానే విత్తనకాయల సరఫరా మొత్తం వ్యవహారంలో ఓ అధికారిపై తీవ్ర విమర్శలు కాసుల కక్కుర్తితో రైతులను నిండా ముంచుతున్న వైనం -
వివాహిత హత్య కేసులో వీడిన మిస్టరీ
పుట్లూరు: గత ఏడాది అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వివాహిత కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. భర్తే కాలయముడై ఆమెను హతమార్చినట్లుగా నిర్ధారించి, నిందితుడిని అరెస్ట్ చేశారు. పుట్లూరు పీఎస్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ సత్యబాబు వెల్లడించారు. కర్ణాటకలోని బీదర్ జిల్లా దింబల్గుడి గ్రామానికి చెందిన సంగీత (21), నాగరాజు దంపతులు బతుకు తెరువు కోసం పుట్లూరు మండలానికి వలస వచ్చారు. ఎ.కొండాపురం గ్రామంలో నివాసముంటూ కూలి పనులతో జీవనం సాగించేవారు. గత ఏడాది అక్టోబర్ 15న సంగీత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గొంతు నులిమి హతమార్చినట్లుగా అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ దిశగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి పక్కా ఆధారాలతో గురువారం భర్త నాగరాజును అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేశారు. దీంతో తన భార్యపై అనుమానంతో గొంతు నులిమి తానే హతమార్చినట్లుగా అంగీకరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. గత ఏడాది అక్టోబర్లో ఘటన నిందితుడి అరెస్ట్ -
ఏఎస్పీ ఆదేశాలు బేఖాతర్
● తాడిపత్రి పోలీసుల తీరుతో విసిగిపోయిన జనం తాడిపత్రి టౌన్: ‘కేసు నమోదు చేయాలంటే టీడీపీ నేతల సిఫారసు ఉండాలి. లేకపోతే ఎవరూ చెప్పినా వినేది లేదు’ అంటూ తాడిపత్రి పోలీసులు బాహటంగానే చెబుతుండడంతో పట్టణ ప్రజలు విసిగిపోయారు. ఇంట్లో చోరీ జరిగి 30 రోజులు గడిచినా కేసు నమోదు చేయని ఘటననే ఇందుకు నిదర్శనం. వివరాల్లోకి వెళితే.. టైలర్స్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసముంటున్న హరికృష్ణ, అశ్వని దంపతులు గత నెల 13న ఇంట్లో లేని సమయంలో దుండగులు చొరబడి బీరువాలోని 12 తులాల బంగారు నగలు అపహరించారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని వేడుకున్నారు. అయినా నేటికీ కేసు నమోదు చేయడంలో పోలీసులు ఉదాసీనత కనబరుస్తున్నారు. నెల రోజులుగా ప్రతి రోజూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోక పోగా ఇటీవల బెదిరింపు ధోరణితో దుర్భాషలాడుతుండడంతో బాధితుల ఆవేదనకు అంతు లేకుండాపోయింది. ఇదే అంశంపై రెండు సార్లు ఏఎస్పీ రోహిత్కుమార్ను కలిసి విన్నవిస్తే కేసు నమోదు చేయాలని ఆయన స్వయంగా పట్టణ పోలీస్ అధికారులను ఆదేశించారు. అయినా కేసు నమోదులో పోలీసులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం తాడిపత్రిలో ఈ అంశమే హాట్ టాపిక్గా మారింది. సర్వజనాస్పత్రిలో భద్రతా ప్రమాణాలు నిల్ ● తేల్చి చెప్పిన భద్రతా కమిటీ సభ్యులు అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో భద్రతా ప్రమాణాలు ఏమాత్రం లేవని, అత్యంత కీలకమైన ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ వృథాగా ఉందని, సీసీ కెమెరాలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో పాటు సెక్యూరిటీ అంతంత మాత్రంగానే ఉందని సెక్యూరిటీ వింగ్ ఆడిట్ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. శుక్రవారం సెక్యూరిటీ వింగ్ ఆడిట్ కమిటీ సభ్యులైన డీఎస్పీ సాయిరాం (విజయవాడ), ఏఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి, డిప్యూటీ ఫైర్ ఆఫీసర్ లింగమయ్య, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసులు, ఆర్డబ్ల్యూఎస్, విద్యుత్ శాఖాధికారులు ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో భద్రతా ప్రమాణాలపై తనిఖీ చేశారు. రూ.2.2 కోట్లతో ఏర్పాటు చేసిన ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ నిరుపయోగంగా ఉన్నట్లు గుర్తించారు. ఆస్పత్రిలో అగ్రిప్రమాదం జరిగితే ప్రస్తుతం ఉన్న ఫైర్ ఫైటింగ్ సిస్టమ్తో ఎలాంటి ఉపయోగమూ ఉండదనే నిర్ధారణకు వచ్చారు. అలాగే ఆస్పత్రిలో సీసీ కెమెరాలు పూర్తిగా లేవని తెలుసుకున్నారు. వివిధ వార్డులకు సెక్యూరిటీ లేకపోవడాన్ని గమనించారు. పార్కింగ్కు స్థలం లేదని, బైక్లు, కార్లు, అంబులెన్స్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉందని గుర్తించారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రి, వైద్య కళాశాల చుట్టూ ప్రహరీని పకడ్బందీగా ఉంచేలా చూడాలన్నారు. అనంతరం డీఎస్పీలు సాయిరాం, నీలకంఠేశ్వర రెడ్డి సూపరింటెండెంట్ను కలిశారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సీసీ కెమెరాలు అదనంగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాయిస్ సీసీ కెమెరాలను అందుబాటులో తేవాలన్నారు. అదేవిధంగా వైద్యులపై దాడులకు పాల్పడితే వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసేలా చట్టాలున్నాయన్న బోర్డులను వివిధ వార్డుల్లో ఏర్పాటు చేయాలన్నారు. -
యోగాతో ఒత్తిడి దూరం
బుక్కరాయసముద్రం: యోగా ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని ఏపీఎస్పీ 14వ బెటాలియన్ కమాండెంట్ ప్రభుకుమార్ పేర్కొ న్నారు. గురువారం మండల పరిధిలోని జంతలూరు వద్ద ఉన్న బెటాలియన్లో ‘యోగాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ ప్రభుకుమార్ మాట్లాడుతూ నిత్యం ధ్యానం, యోగా చేస్తే మంచి ఆరోగ్యంపొందవచ్చన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ దేవి, అడిషనల్ కమాండెంట్ కేశవరెడ్డి, యోగా శిక్షక్ పతాంజలి డిస్ట్రిక్ ప్రొప్రయిటర్ డాక్టర్ రవి ప్రసాద్, డీఎస్పీలు ప్రసాద్రెడ్డి, వెంకటశివారెడ్డి పాల్గొన్నారు.నా పిల్లిని చంపార్సార్● పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి ఫిర్యాదుగార్లదిన్నె: తాను పెంచుకుంటున్న పిల్లిని చంపారంటూ కొందరిపై ఓ వ్యక్తి గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి వివ రాల మేరకు.. మండల పరిధిలోని క్రిష్ణాపురానికి చెందిన రామాంజనేయులు తన ఇంట్లో పిల్లిని పెంచుకుంటున్నాడు. ఇటీవలే అది పిల్లలకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఇంటి వద్ద చెట్టుపై ఉన్న పిల్లిని గురువారం కల్లూరుకు చెందిన కొంత మంది వేటగాళ్లు పట్టుకొని చంపేశారు. ఈ క్రమంలో ఆవేదన చెందిన రామాంజనేయులు.. మూగజీవాన్ని చంపిన వేటగాళ్లపై చర్యలు తీసుకోవాలని గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.రెవెన్యూలో బది‘లీలలు’● 9న జారీ చేసిన ఉత్తర్వుల్లో మార్పులు● అదే తేదీతో తిరిగి ఉత్తర్వుల జారీఅనంతపురం అర్బన్: గడువు ముగిసినా రెవెన్యూశాఖలో బది‘లీలలు’ కొనసాగించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. తాజాగా 11 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 8 మంది సీనియర్ అసిస్టెంట్లకు స్థానచలనం కల్పించారు. డీటీలు, ఎస్ఏల బదిలీలకు సంబంధించి ఈనెల 9వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుల్లో మార్పులు చేర్పులు చేశారు. అయితే, అదే తేదీపైనే ఉత్తర్వులను జారీ చేయడం గమనార్హం. రాజకీయ సిఫార్సుల మేరకు డీటీలు, ఎస్ఏల బదీలీల్లో మార్పు చేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.మార్పులు ఇలా..ఈనెల 9వ తేదీన 32 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 38 మంది మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సీనియర్ అకౌంటెంట్లను బదిలీ చేశారు. తాజాగా 9వ తేదీనే పొందుపరుస్తూ ప్రస్తుతం జారీ చేసిన 11 మంది డీటీలకు సంబంధించిన బదిలీ ఉత్తర్వుల్లో... డీటీలు టి.కె.చంద్రశేఖర్రావు, ఎం.ఆంజనేయప్రసాద్, ఎం.కె.సూర్యనారాయణ, టి.బసవకుమార్, ఇ.వెంకటేశ్వర్లు స్థానాలను మార్పు చేశారు. అదే విధంగా 8 మంది ఎస్ఏల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వుల్లో... జి.జీవన్ విజయ్ కుమార్, కె. వెంకటరామిరెడ్డి, వి.సందీప్, ఆర్.రాజేష్కుమార్కు స్థానాలు మార్పు చేశారు.జిల్లా అంతటా వర్షం● విడపనకల్లులో అత్యధికంగా 91.2 మి.మీ వర్షపాతం● రాగల రెండు రోజులూజిల్లాకు వర్షసూచనఅనంతపురం అగ్రికల్చర్: జిల్లాపై నైరుతి రుతుపవనాలు ప్రభావం చూపుతున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు 30 మండలాల పరిధిలో 18.4 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా విడపనకల్లు మండలంలో 91.2 మి.మీ వర్షపాతం నమోదైంది. కణేకల్లు 59 మి.మీ, ఉరవకొండ 40.6, డి.హీరేహాళ్ 40, బెళుగుప్ప 36.4, యాడికి 27.8, శింగనమల 26.2, కళ్యాణదుర్గం 25.4, గుత్తి 22.8, గుంతకల్లు 21.4, అనంతపురం అర్బన్ 21.4, రాయదుర్గం 20.4, గార్లదిన్నె 19.2, వజ్రకరూరు, అనంతపురం రూరల్ 18.2, బుక్కరాయసముద్రం 16.2 , గుమ్మఘట్ట 14.8, కుందుర్పి 10.6, బ్రహ్మసముద్రం 10 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. పంటల సాగుకు ఈ వర్షాలు ఊతమిస్తాయని అధికారులు తెలిపారు. రాగల రెండు రోజులు కూడా జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. -
న్యాయం జరిగే వరకూ పోరాటం
● మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలి ● ఎమ్మెల్సీ కుంభా రవిబాబు ● బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతాం: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ‘అనంత’ ● పార్టీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో నగరంలో నిరసన ర్యాలీ అనంతపురం కార్పొరేషన్: తమ బిడ్డ తన్మయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు ఆలస్యంగా స్పందించారని, దర్యాప్తు ముమ్మరం చేయడంలో వెనుకంజ వేశారని, తన్మయిది ప్రభుత్వ హత్యేనని ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో గురువారం నగరంలో జరిగిన నిరసన ర్యాలీకి ఉమ్మడి అనంత పురం జిల్లా నుంచి నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ముందుగా అంబేడ్కర్, దివంగత నేత వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్, సూర్యనగర్ సర్కిల్, సంగమేశ్వర సర్కిల్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. కలెక్టరేట్ ముందు బైఠాయించారు. ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంతలు తన్మయి తండ్రి లక్ష్మీపతితో కలసి కలెక్టరేట్లో ఆర్డీఓ మలోలకు వినతి పత్రం సమర్పించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ జూన్ 3న తన్మయి అదృశ్యమై 7న శవమై కన్పించిందన్నారు. ఫోరెన్సిక్ రిపోర్టులో 5నే తన్మయిని చంపేసి ఉండొచ్చని తెలియ జేశారన్నారు. ఈ క్రమంలో రెండు రోజుల పాటు యువతి ఎవరి ఆధీనంలో ఉందనే వివరాలను పోలీసులు ఎందుకు తెలపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సగటున రోజుకు ఇద్దరు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు.తన్మయి కుటుంబ సభ్యులు నలుగురిపై అనుమానం వ్యక్తం చేశారని, వారిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు యువతి మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్కు తీరిక లేదా..? యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ మాట్లాడుతూ కలెక్టరేట్కు కూతవేటు దూరంలోని రామకృష్ణ కాలనీలో తన్మయి కుటుంబం ఉంటోందని, కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించే తీరిక కూడా కలెక్టర్కు లేదా అని ప్రశ్నించారు. గిరిజన కుటుంబానికి జరిగిన అన్యాయంపై వినతి పత్రం అందించేందుకు వస్తున్నామని చెబితే కలెక్టర్ పత్తా లేకుండా పోయారన్నారు. దీన్ని బట్టి దళితులు, గిరిజనుల పట్ల ఏ స్థాయిలో చిన్నచూపు వైఖరి ప్రదర్శిస్తున్నారో అర్థమవుతోందన్నారు. గిరిజనలు, దళితులకు న్యాయం చేస్తామని గతంలో నారా లోకేష్ చెప్పారని,వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు మహిళలకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తన్మయి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసబాబు నాయక్, ‘ట్రైకార్’ మాజీ చైర్మన్ గుండా సురేంద్ర పేర్కొన్నారు. అనంతరం రామకృష్ణ కాలనీలోని తన్మయి నివాసానికి వెళ్లి మృతురాలి తల్లిదండ్రులను ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షులు, తదితరులు పరామర్శించారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యులు అశ్వర్థ్ నాయక్, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహులు, పార్టీ ఎస్టీ సెల్ నాయకులు సాకే శ్రీనివాసులు, గోవింద్నాయక్, మిద్దె నగేష్, గుజ్జల శివ, గుజ్జల లక్ష్మణ్కుమార్, సాకే రాజశేఖర్, రాజు నాయక్, మోహన్ నాయక్, గౌతం నాయక్, అంజనమూర్తి, సాకే శివశంకర్, ఆదిశేషు, మహిళా నాయకురాళ్లు చంద్రలేఖ, శోభాబాయి, శోభారాణి, దేవి, ఉష, భారతి పాల్గొన్నారు. గిరిజన యువతి దారుణ హత్య విషయంలో ఓ సీఐను సస్పెన్షన్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసే వరకూ పోరాటం ఆపమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత స్పష్టం చేశారు.ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఐదు సెంట్ల స్థలం ఇవ్వాలన్నారు. రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఆ ప్రాంతంపై టీడీపీకి పట్టుండడంతో ఎవరూ నోరు మెదపడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయన్నారు. ఏడాది కూటమి పాలనలో 188 మందిపై అత్యాచారాలు జరిగాయని, అందులో 15 మంది మహిళలు హత్యకు గురయ్యారని చెప్పారు. బాధ్యత గల పదవిలో ఉన్న హోంమంత్రి అనిత హత్యలు జరుగుతుంటే తన వద్ద లాఠీ లేదు, తుపాకీ లేదు అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారని, ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి లేదని దుయ్యబట్టారు. -
పక్కా ప్లాన్తోనే దాడి..
పోలీసులు ఆటంకాలు సృష్టించినా...వైఎస్సార్సీపీ కార్యకర్తలు కొందరు పేరూరుకు చేరుకున్నారు. అయితే ముందస్తు ప్రణాళిక ప్రకారం అక్కడే మకాం వేసిన టీడీపీ అల్లరిమూకలు వైఎస్సార్సీపీ కార్యకర్తలు వెళ్లిన వాహనాలపై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీ రౌడీలు రాళ్లు రువ్వగా.. వాహనాలు ధ్వంసమయ్యాయి. టీడీపీ సంబరాలు.. వైఎస్సార్సీపీ నేతల పర్యటన గురించి తెలిసిన వెంటనే గొడవలకు ప్లాన్ చేసిన టీడీపీ నేతలు.. ఉన్నఫలంగా పేరూరులో సంబరాలు చేశారు. తల్లికి వందనం విడుదల సందర్భంగా ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చి మద్యం తాగి నానా రభస చేశారు. -
తెల్లవార్లూ టీచర్ల కౌన్సెలింగ్
అనంతపురం ఎడ్యుకేషన్: ఎస్జీ టీచర్ల కౌన్సెలింగ్ తెల్లవార్లూ కొనసాగింది. తొలిరోజు 350 మంది పూర్తవగా... రెండోరోజు గురువారం సీరియల్ నంబరు 351 నుంచి 1,000 దాకా పిలిచారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ తెల్లవార్లూ కొనసాగింది. కాగా శుక్రవారం ఉదయం 11 గంటలకు సీరియల్ నంబరు 1,001 నుంచి 1,800 వరకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. టీచరుపై రెచ్చిపోయిన పరిశీలకులు ‘బొచ్చు గాడివి నీకేం సమాధానం చెప్పాలి’ అంటూ ఉపాధ్యాయ బదిలీ కౌన్సెలింగ్లో పరిశీలకులుగా వచ్చిన జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు గురువారం ఓ టీచరుపై రెచ్చిపోయారు. దీంతో కౌన్సెలింగ్ కేంద్రంలో కొద్దిసేపు తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు...తనకల్లు మండలంలో ప్రభాకర్ టీచరుగా పని చేస్తున్నారు. ఈయన భార్య స్పౌజ్ పాయింట్లు వాడుకున్నారు. ఈ క్రమంలో కౌన్సెలింగ్ సమయంలో భర్త పని చేస్తున్న తనకల్లు మండలంలోనే కోరుకోవాలంటూ అధికారులు సూచించారు. ఈ సమయంలో కలగజేసుకున్న భర్త ప్రభాకర్... సర్ తనకల్లు మండలం కాకుండా పక్క మండలం కదిరి రూరల్లో ఇచ్చేలా చూడాలని కోరారు. అలా కుదరదని ‘స్పౌజ్’ విషయంలో అందరికీ ఒకే నిబంధన పాటిస్తున్నామంటూ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో సదరు టీచర్.. ‘అన్నీ కరెక్ట్గా చేశామంటున్నారు.. అలా చేసినట్లు రాతపూర్వకంగా ఇవ్వండి’ అంటూ అడిగారు. దీంతో అక్కడే ఉన్న పరిశీలకులు సుబ్బారావు రెచ్చిపోయారు. ‘నువ్వు బొచ్చుగాడివి అడిగితే మేము చెప్పాలా’ అని మాట్లాడారు. సదరు టీచరు కూడా అంతేస్థాయిలో సమాధానం ఇచ్చారు. సాధారణ టీచరుకు ఇచ్చే గౌరవం ఇదేనా.. అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, డీఈఓ కార్యాలయ సిబ్బంది అంతా వేదికపైకి దూసుకురావడంతో కాసేపు గందరగోళం నెలకొంది. అందరూ సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది. -
అన్యాయం జరిగినా స్పందించకూడదా?
● ‘సాక్షి’ పత్రికలో రాకుంటే దారుణం బయటకు వచ్చేదేకాదు ● మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి రాప్తాడురూరల్: ‘దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఒక దళిత మైనర్ బాలికకు ఘోరమైన అన్యాయం జరిగింది. బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పరామర్శించేందుకు వెళ్తుంటే పోలీసులతో అడ్డుకుంటారా.. మేమేమైనా టెర్రరిస్టులమా..’ అని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నగర శివారు లోని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మాట్లాడుతూ 14 ఏళ్ల దళిత బిడ్డను 18 మంది అఘాయిత్యం చేసిన ఘటనపై స్పందించి అండగా నిలిచేందుకు వస్తే అరెస్ట్ చేశారన్నారు. దీన్ని బట్టి రాష్ట్రంలో ఎలాంటి ప్రజాస్వామ్యం ఉందో, ఈ ప్రాంతంలో ఎలాంటి పాలన సాగుతోందో అర్థమ వుతోందన్నారు. హోం మంత్రి, ఈ ప్రాంతంలోని ఎస్సీ శాసనసభ్యులు ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. టీవీలో ఎక్కడో ఏదో మాట్లాడారంటూ అరెస్ట్లు చేస్తున్న ప్రభుత్వం, దళిత బిడ్డకు జరిగిన అన్యాయంపై ఎందుకు స్పందించలేదన్నారు. దీనిపై గవర్నరును కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. దళితురాలిగా పుట్టడమే నేరమా.. దళితులుగా పుట్టడం తప్పా అందులోనూ బాలికగా పుట్టడం నేరమా అని మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ప్రశ్నించారు. దళిత బాలికపై అఘాయిత్యానికి పాల్పడినందుకు పేరూరులో విజయోత్సవాలు చేసుకున్నారా.. లేదంటే తమ దెబ్బకు ఎవరినీ రానీ యలేదన్నందుకు విజయోత్సవాలు చేసుకున్నారా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా ఆ గ్రామానికి వెళ్లి తీరతామన్నారు. దీనిపై ప్రత్యేక జ్యుడీషియల్ విచారణ జరగాలన్నారు. ‘సాక్షి’ పత్రికలో వార్త వస్తే తప్ప ఈ ఘోరం వెలుగులోకి రాలేదని వాపోయారు. ప్రత్యేక పాస్పోర్ట్ కావాలా.. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తుంటే ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి అడ్డుకున్నారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి తెలిపారు. ఆ ప్రాంతాలకు వెళ్లేందుకు వీసాలు తీసుకోవాలా.. పాస్పోర్టులు ఉండాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామూహిక అత్యాచారం కేసులో నిందితుల బంధువులు, టీడీపీ శ్రేణులు, పరిటాల సునీత బంధువులు పేరూరులో తమ వాహనాలపై రాళ్లతో దాడి చేసి భయోత్పాతం సృష్టించారన్నారు. పరిటాల సునీత అండతోనే కర్రలు, ఇతర మారణాయుధాలతో వీరంగం సృష్టించారన్నారు. పోలీసులు సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. 2014–2019 మధ్య జరిగిన అన్యాయాలు, దౌర్జన్యాలను ప్రశ్నించిన తనను రామగిరి మండలంలోకి అడుగు పెట్టనివ్వలేదని, దాని ఫలితం అనుభవించారన్నారు. మహిళా ఎమ్మెల్యేగా ఉన్న సునీత ఇలాంటి ఘటనలను ప్రోత్సహించడం దురదృష్టకరమన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, వైఎస్సార్ సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, మధుమతి రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ నాయకులు పెన్నోబులేసు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యానికి పండిట్లు బలి
అనంతపురం ఎడ్యుకేషన్: డీఈఓ పూల్లో ఉన్న బాషా పండితుల ఇబ్బందులను కూటమి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. అదే సమయంలో ఉపాధ్యాయ సంఘాలూ స్పందించడం లేదు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ గురువారం స్థానిక పంగల్రోడ్డులోని ఆర్డీటీ సమ్మిళిత పాఠశాలలో జరుగుతున్న ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్ను డీఈఓ పూల్లో ఉన్న పండిట్లు అడ్డుకున్నారు. అరగంటకు పైగా బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్ను ఘెరావ్ చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ.. డీఈఓ పూల్లో ఉన్న పండిట్లను రెండేళ్లకోసారి బలవంతపు బదిలీలు చేస్తున్నారన్నారు. గత ఆరేళ్లలో ఇది నాలుగోసారి బదిలీ అన్నారు. గత రెండేళ్లలో సర్దుబాటు పేరుతో మరొక చోటుకి పంపారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,300 మంది పండిట్లు డీఈఓ పూల్లో ఉంటే ఉమ్మడి జిల్లాలోనే 111 మంది ఉన్నారన్నారు. వీరిలో తెలుగు 89 మంది, హిందీ 14, ఉర్దూ ఏడుగురు, కన్నడ ఒకరు ఉన్నారన్నారు. ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించగా... 2024, డిసెంబర్ 20న జస్టిస్ మన్మధరావు ధర్మాసనం (సింగిల్ బెంచ్) పండితులకు అనుకూలంగా తుది తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. 2019 నుంచి అందాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించి 3 నెలల గడువులో ప్రమోషన్ ఇవ్వాలంటూ ఆదేశించారన్నారు. పలుమార్లు విద్యా శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదున్నారు. ఇంతలో ఎస్జీటీ సంఘాల నాయకులు స్టేటస్ కో తెచ్చి సమస్యను మరింత జటిలం చేశారని వాపోయారు. ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తే సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని చివరకు పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వ తీరుతో వలస కార్మికుల్లాగా బతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా సరైన న్యాయం చేయాలని కోరారు. ఎస్జీటీల బదిలీల అనంతరం చర్యలు తీసుకుంటామంటూ ఆర్జేడీ హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. సర్దుబాటు పేరుతో రెండేళ్లకోసారి బదిలీ అవుతున్న డీఈఓ పూల్లోని పండిట్లు ఆరేళ్లలో నాలుగోసారి బదిలీ అవుతున్నామంటూ ఆవేదన పాఠశాల విద్య ఆర్జేడీని అడ్డుకున్న పండిట్లు -
ఎండోమెంటు ఏసీకి సన్మానం
అనంతపురం కల్చరల్: జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్గా బుధవారం బాధ్యతలు స్వీకరించిన తిరుమలరెడ్డిని జిల్లా అర్చక సంఘాలు గురువారం ఘనంగా సత్కరించాయి. జిల్లాలోని ఆలయాల్లో నెలకొన్న సమస్యలన్నీ సందర్భంగా అర్చక సంఘాల ప్రతినిధులను ఆయన అడిగి తెలుసుకున్నారు. జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షుడు వైపీ ఆంజనేయులు మాట్లాడుతూ... గత ఏసీ వైఖరి వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని, సమస్యల పరిష్కారానికి కొత్తగా బాధ్యతలు తీసుకున్న ఏసీ సానుకూలంగా స్పందిస్తున్నారంటూ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అర్చక సమాఖ్య సభ్యులు శ్రీనివాసులు, చంద్రమౌళి, తిరుపతయ్య, మధుసూదనాచార్యులు, తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలు, హాస్టళ్లకు సన్నబియ్యం పంపిణీ అనంతపురం అర్బన్: జిల్లాలోని 1,715 ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు, 183 సంక్షేమ వసతి గృహాలకు 25 కిలోల సంచుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రమేష్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పంపిణీ ప్రక్రియలో అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రతి సంచిపైన క్యూఆర్ కోడ్ జతపర్చామన్నారు. దానిని స్కాన్ చేయడం ద్వారా బియ్యానికి సంబంధించి పూర్తి వివరాలు, ధాన్యం పండించిన రైతుల వివరాలు, నాణ్యత పరిశీలించిన సిబ్బంది సమాచారం తెలుసుకోవచ్చన్నారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, వార్డన్లు చూడాలని సూచించారు. -
ఆర్డీటీపై ఆంక్షలు ఎత్తివేయాలి
కళ్యాణదుర్గం: ఆర్డీటీకి విదేశీ నిధులు అందకుండా విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ డిమాండ్ చేశారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలంటూ మాజీ ఎంపీ తలారి రంగయ్య చేపట్టిన ఆర్డీటీ పరిరక్షణ పాదయాత్రకు గురువారం ఆయనతో పాటు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మద్దతు తెలిపి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి ఆర్డీటీ వరదాయినిగా ఉందన్నారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా కార్యక్రమాలను చేపడుతూ పేదలకు అన్ని విధాలుగా అండగా ఉందన్నారు. ఆర్డీటీని కాపాడుకునేందుకు జిల్లాలో ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధులు, సీఎం చంద్రబాబు ఇప్పటికై నా కళ్లు తెరవాలన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి ఆర్డీటీకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. ఆర్డీటీకి విదేశీ నిధులు అందకుండా తీసుకొచ్చిన నల్ల చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో ఆర్డీటీ లేకపోతే జరిగే నష్టాన్ని గుర్తించి ఆ సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కోసం రంగయ్య పాదయాత్ర చేపట్టడం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వమే స్వయంగా వచ్చి పాదయాత్రను అడ్డుకునేందుకు యత్నించినా ప్రజల సహకారంతో రంగయ్య పాదయాత్ర ముందుకెళ్తోందన్నారు. ప్రజలు సమైక్యంగా పాదయాత్రకు కదలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, పార్టీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు, జెడ్పీటీసీ గుద్దెళ్ల నాగరాజు, ఎంపీపీ భీమేష్, మండల కన్వీనర్ హనుమంతరాయుడు, పార్టీ జిల్లా కార్యదర్శి ములకనూరు తిమ్మరాయుడుతో పాటు పలువురు కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ఆర్డీటీ లబ్ధిదారులు పాల్గొన్నారు. విదేశీ నిధులు రాకుండా అడ్డుకట్ట వేయడం దారుణం ఆర్డీటీని కాపాడుకునేందుకు ఇప్పటికై నా సీఎం చంద్రబాబు కళ్లు తెరవాలి మాజీ మంత్రి శంకరనారాయణ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ -
మందుబాబుల మధ్య ఘర్షణ
● బీరు బాటిల్తో పొడవడంతో ఒకరికి గాయాలు గుంతకల్లు టౌన్: స్థానిక రైల్వేస్టేషన్ రోడ్డులోని వైన్ షాపు వద్ద గురువారం సాయంత్రం ఇద్దరు మందు బాబుల మధ్య ఘర్షణ చోటు చేసుకుని, ఒకరిపై హత్యాయత్నం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఆచారమ్మ కొట్టాలకు చెందిన మధు గురువారం మద్యం బాటిల్ కొనుగోలు చేసి బయటకు వస్తుండగా ‘బెగ్గర్లు కూడా తాగని చీప్ లిక్కర్ తాగుతున్నావా?’ అంటూ కాలవగడ్డ ప్రాంతానికి చెందిన సుధాకర్ హేళనగా మాట్లాడాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. ఆవేశానికి లోనైన సుధాకర్ పక్కనే ఉన్న బీరుబాటిల్ తీసుకునిబద్ధలుగొట్టి మధుపై దాడికి ప్రయత్నించాడు. తప్పించుకుని పారిపోతున్న మధుపై వెనుక నుంచి బీరుబాటిల్ ముక్కతో బలంగా పొడవడంతో తీవ్ర గాయమైంది. క్షతగాత్రుడిని స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న సీఐ మనోహర్ ఘటనపై ఆరా తీసి, బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిరుద్యోగులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్ ● రూ.8 లక్షలు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన దేరవకొండ ఏఎస్పీ మౌనిక దేవరకొండ (నల్లగొండ): ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి రూ.17లక్షలు వసూలు చేసి పరారైన నిందితుడిని గురువారం నల్లగొండ జిల్లా దేవరకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను దేవరకొండ ఏఎస్పీ మౌనిక గురువారం విలేకరులకు వెల్లడించారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన మాదిన్నె కృష్ణ అలియాస్ వేణుగోపాలరెడ్డి 2021లో దేవరకొండకు వలస వచ్చి బీఎన్ఆర్ కాలనీలో నివాసమేర్పరుచుకున్నాడు. తాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రాజెక్టు ఆఫీసర్గా ఉద్యోగం చేస్తున్నట్లు చుట్టుపక్కల వారిని నమ్మించాడు. తాను పనిచేస్తున్న శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కాలనీకి చెందిన ముడావత్ స్వాతి, ఆమె భర్త రమేష్, షేక్ సైదాబేగం, ఆమె కుమారుడు షేక్ తబ్రీజ్కు నమ్మబలికి వారి వద్ద నుంచి సుమారు రూ.17లక్షలు వివిధ దఫాలుగా తీసుకున్నాడు. డబ్బులు ఇచ్చిన వారు ఉద్యోగాల విషయం ఏమైందంటూ అడిగినప్పుడల్లా టైం పడుతుందని చెబుతూ కాలం వెళ్లదీశాడు. ఇటీవల వారు గట్టిగా నిలదీయడంతో ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లాడు. దీంతో బాధితులు ఈ ఏడాది మార్చి 1న దేవరకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఏపీలోని అనంతపురం జిల్లాలో వేణుగోపాలరెడ్డిని అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి రూ.8లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, కృష్ణ గతంలో తన భార్యతో కలిసి ఖమ్మం జిల్లా తనికెళ్ల గ్రామంలో టైలరింగ్తో జీవనం కొనసాగించేవాడని, టైలరింగ్ ద్వారా వచ్చే డబ్బులు సరిపోక అక్కడ కొద్దిమందితో కలిసి చిట్టీలు నిర్వహించి అక్కడి నుంచి అనంతపురానికి ఉడాయించినట్లు ఏఎస్పీ తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ పలువురిని మోసం చేసి దేవరకొండకు వచ్చాడన్నారు. కేసును ఛేదించిన పోలీస్ సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. సమావేశంలో సీఐ నర్సింహులు, ఎస్ఐలు కోటేష్, నారాయణరెడ్డి, పోలీస్ సిబ్బంది సతీష్, రాజారాం, అంజి, వెంకన్న, చాంద్పాషా, సింహాద్రి పాల్గొన్నారు. -
హంద్రీ–నీవా కాలువ గట్టుకు మరమ్మతులు
కూడేరు: మండలంలోని తిమ్మాపురం వద్ద హంద్రీ–నీవా 235.500 కిలోమీటర్ వద్ద కాలువ గట్టుకు ఎర్ర మట్టిని తోలి మరమ్మతులు చేశారు. ఈ గట్టు మట్టిని కాలువ లైనింగ్ పనుల కోసమని కాంట్రాక్టర్ జేసీబీతో తవ్వి తరలించడం గట్టు మొత్తం గుంతలమయమైంది. దీంతో కాలువ ఎగున ఉన్న ఓబిరెడ్డి కుంటలోకి వర్షం చేరుకుంటే కోతకు గురయ్యే ప్రమాదం ఉండేది. అలాగే దిగువన కాలువకు మట్టి తీయడంతో దెబ్బతిని తిమ్మాపురం గ్రామం ముంపునకు గురయ్యే ప్రమాదముంది. ఈ అంశాలపై ‘హవ్వా..ఇదేం లైనింగ్’ శీర్షికతో ఈ నెల 9న ‘సాక్షి’లో కథనం వెలువడింది. దీనిపై స్పందించిన హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులు.. ప్రమాదకరంగా మారిన కాలువ గట్టుకు రాళ్ల చట్టం ఏర్పాటు చేసి ఎర్రమట్టితో చదును చేయించారు. రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని వృద్ధుడి మృతి గుంతకల్లు టౌన్: స్థానిక రైల్వేస్టేషన్ 6వ ఫ్లాట్ఫాంలోని వెయిటింగ్ హాల్ వద్ద గురువారం ఉదయం ఓ గుర్తు తెలియని ఓ వృద్ధుడు మృతి చెందాడు. అనారోగ్యంతో మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఆచూకీ తెలిసిన వారు 9866144616 నంబర్కు సమాచారం అందించాలని జీఆర్పీ ఎస్ఐ మహేంద్ర ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వ్యక్తి మృతి కేసులో ఐదుగురికి రిమాండ్ రాప్తాడు రూరల్: ఇంటి ఎదుట రోడ్డు స్థలం విషయంలో గొడవ చోటు చేసుకుని ప్రత్యర్థులు తోసేయడంతో కిందపడి వృద్ధుడు మృతి చెందిన కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. అనంతపురం రూరల్ సీఐ శేఖర్ తెలిపిన మేరకు... రాచానపల్లి పంచాయతీ నల్లనరసింగయ్యకాలనీలో నివాసముంటున్న కోనయ్య కుమార్తె విదేశాల్లో స్థిరపడింది. తనకున్న 5 సెంట్లకు పైగా స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాలని తండ్రికి తెలపడంతో మూడు రోజుల క్రితం ఆ ప్రాంతాన్ని కోనయ్య శుభ్రం చేయించి, మార్కింగ్ వేయిస్తున్న సమయంలో రోడ్డు స్థలాన్ని ఆక్రమించారంటూ పక్కనే నివాసముంటున్న గంగాధర్, ఆయన బంధువులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో వారు కోనయ్యను తోసేయడంతో వెనుక వైపు కిందకు పడిన ఆయన తలకు తీవ్ర గాయమైంది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు నాగరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు...గంగాధర్తో పాటు మరో నలుగురిని గురువారం అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. పశుశాఖ జాబితాలు పట్టుకొచ్చిన ప్రత్యేకదూత ● ఇంకా వెల్లడి కాని వ్యవసాయశాఖ ఏడీఏల బదిలీలు అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయ, దాని అనుబంధశాఖల్లో జరుగుతోన్న ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ప్రసహనంగా కొనసాగుతోంది. నిబంధనలు గాలికి వదిలి ఇష్టారాజ్యంగా బదిలీ ఉత్తర్వులు వెల్లడైనట్లు ఉద్యోగ వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి బదిలీ ప్రక్రియను గందరగోళంగా మార్చినట్లు చెబుతున్నారు. ఈ నెల 9 నాటికే బదిలీ ప్రక్రియ ముగిసినట్లు ప్రభుత్వం ప్రకటించినా ఇంకా కొన్ని జాబితాలు వెల్లడి కాకపోవడం విశేషం. వ్యవసాయశాఖ ఏఓల జాబితాలో కొన్ని మార్పులు చేర్పులతో గురువారం రెండోసారి విడుదల చేశారు. ఇక ఏడీఏల జాబితా వెనక్కి తీసుకుని మూడు రోజులవుతున్నా విడుదల చేయకపోవడం గమనార్హం. ఇక పశుసంవర్ధకశాఖలో వింత పోకడ కనిపించింది. డిప్యూటీ డైరెక్టర్లు (డీడీ), అసిస్టెంట్ డైరెక్టర్లు (ఏడీ), పశువైద్యులు (వీఏఎస్) బదిలీ జాబితా అలా విడుదల చేసి తక్షణమే అభయెన్స్ పెట్టడంతో అయోమయం నెలకొంది. తిరిగి జాబితాను మెయిల్ లేదా అన్లైన్ లేదా సర్కులర్ రూపంలో పంపాల్సిన డైరెక్టరేట్ అధికారులు... విజయవాడ నుంచి ప్రత్యేకదూత ద్వారా గురువారం జాబితాలను జిల్లా జేడీ కార్యాలయానికి చేర్చడం విడ్డూరంగా ఉంది. అయినా బదిలీ జాబితా అధికారికంగా విడుదల చేయకపోవడంతో ఉద్యోగుల్లో టెన్షన్ కొనసాగుతోంది. నిబంధనలు, పారదర్శకతకు పాతరేయడంతో బదిలీల సమస్య ఇలా తయారైందని ఉద్యోగ వర్గాలు వాపోతున్నాయి. ప్రజాప్రతినిధుల సిఫారసులు, పలుకుబడితో పాటు కొన్ని స్థానాలు, కొందరు వ్యక్తుల కోసం పెద్ద మొత్తంలో డబ్బు చేతులు మారినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఇన్చార్జ్ల పాలనకే మొగ్గు
అనంతపురం అర్బన్: జిల్లా యంత్రాంగంలో అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖలో ఇన్చార్జ్ల పాలన సాగిస్తే ప్రజలకు సత్వర సేవలు అందక ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ విషయం అధికారులకు తెలిసినా మండల స్థాయిలో ఇన్చార్జ్ల పాలనకు తెరదించే దిశగా చర్యలు చేపట్టలేదనే విమర్శలు రెవెన్యూ వర్గాల నుంచే వస్తున్నాయి. ఈ నెల 9వ తేదీతో బదిలీల ప్రక్రియ ముగిసినా... దీర్ఘకాలికంగా ఇన్చార్జ్ల పాలన సాగుతున్న కూడేరు, విడపనకలు, వజ్రకరూరు, కణేకల్లు, యల్లనూరు మండలాలకు తహసీల్దార్లను నియమించలేదు. దీంతో ఆయా మండలాల్లో ఇన్చార్జ్ల పాలన తప్పనిసరి అయింది. ఇక అనంతపురం ఆర్డీఓ కార్యాలయంలో డివిజన్ పరిపాలనాధికారి పోస్టులోనూ ఎవరినీ నియమించలేదు. దీన్ని బట్టి చూస్తే మండలాల్లో ఇన్చార్జ్ల పాలనకే ఉన్నతాధికారులు మొగ్గు చూపించినట్లుగా స్పష్టమవుతోంది. ఇక బదిలీల ప్రక్రియ ముగిసినప్పటికీ... రెండో విడతగా డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్ల బదిలీలు చేపట్టి (9న జారీచేసిన ఉత్తర్వుల్లో మార్పులు చేర్పులతో) అదే రోజు మరోమారు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం కొరవడిన స్పష్టత జిల్లాలో ఎనిమిది మంది తహసీల్దార్ల బదిలీలకు సంబంధించి ఈనెల 4న ఉత్తర్వులు జారీ చేశారు. అందులో పుట్లూరు తహసీల్దారుగా ఉన్న శేషారెడ్డిని కలెక్టరేట్ కో–ఆర్డినేషన్ విభాగం సూపరింటెండెంట్గా నియమించారు. ఆ స్థానంలో ఉన్న యుగేశ్వరిదేవిని డి.హీరేహల్ తహసీల్దారుగా నియమించారు. అక్కడున్న అనిల్కుమార్ (దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు) బెలుగుప్పకు బదిలీ చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే బదిలీలకు సంబంధించి ఈనెల 9న జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టత కొరవడింది. కలెక్టరేట్ కో–ఆర్డినేషన్ విభాగం సూపరింటెండెంట్గా నియమించిన శేషారెడ్డిని బుక్కరాయసముద్రం మండలం తహసీల్దారుగానూ... అక్కడున్న పుణ్యవతిని పుట్లూరుకు బదిలీ చేశారు. కలెక్టరేట్ కో–ఆర్డినేషన్ సూపరింటెండెంట్ స్థానానికి ఎవరిని నియమించలేదు... అక్కడున్న యుగేశ్వరిదేవి డి.హీరేహాల్ తహసీల్దారుగా నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయలేదు. ఆమె నియామక ఉత్తర్వులు రద్దు చేస్తే డి.హీరేహాల్ మండలంలో ఇన్చార్జి పాలనలోకి తీసుకురావాలి. రద్దు చేయకపోతే కో–ఆర్డినేషన్ విభాగం బాధ్యతలు మరొకరికి అదనంగా అప్పగించాల్సి ఉంటుంది. నిబంధన గాలికి డిప్యూటీ తహసీల్దార్ల బదిలీల ప్రక్రియలో ఒకే స్టేషన్లో ఐదేళ్లు సర్వీసు పూర్తి నిబంధన గాలికొదిలేశారు. కొందరికి ఇక్కడిక్కడే పోస్టింగ్ ఇచ్చారు. అధికారుల వద్ధ సీసీ (క్యాంపు క్లర్క్)లుగా ఉన్న కొందరి భార్యలు కూడా రెవెన్యూలో విధులు నిర్వర్తిస్తున్నారు. బదిలీల ప్రక్రియలో వీరికి స్థానచలనం కల్పించలేదనే విమర్శలు రెవెన్యూవర్గాల నుంచే వస్తుండడం గమనార్హం, ప్రజాప్రతినిధుల ‘కనుసన్నల్లో’ తహసీల్దార్ల నియామకాలు పూర్తిగా ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయనేది రెవెన్యూవర్గాల వాదన. ప్రధానంగా కొన్ని నియోజకవర్గాల పరిధిలో తహసీల్దారుగా ప్రజాప్రతినిధులు సూచించిన వారినే అధికారులు నియమించాలి. అలాకుండా అధికారులు సొంత నిర్ణయంతో తహసీల్దార్లను నియమిస్తే పరిస్థితి మరోలా ఉంటుంది. అలా నియమితులైన వారు విధుల్లోకి చేరకుండానే వెనుతిరగక తప్పదు. ఐదు మండలాలకు తహసీల్దార్లను నియమించలేదు ఆర్డీఓ కార్యాలయ డీఏఓ పోస్టూ ఖాళీ డీటీల బదిలీల్లో ఐదేళ్ల నిబంధన గాలికి ప్రక్రియ ముగిశాక కూడా బదిలీలు -
ప్రభుత్వ అలసత్వంతోనే దారుణాలు
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం అలసత్వంతోనే మృగాళ్లు దారుణాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. చట్టాలను అమలు చేయాల్సిన పోలీసులు తమ విధుల్లో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి కనువిప్పు కల్గించేలా వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో గురువారం నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బుధవారం స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఎస్టీ సెల్ నాయకుల ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘అనంత’ మాట్లాడుతూ రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో పాశవికంగా అత్యాచారానికి గురైన బాలిక.. తనకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పడానికి కూడా భయపడుతోందంటే రాష్ట్రంలో పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే ఉమ్మడి అనంతపురం జిల్లాలో మూడు హృదయ విదారక ఘటనలు జరిగాయన్నారు. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చూసేందుకు, చంద్రబాబు ప్రభుత్వానికి కనువిప్పు కల్గించేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఉద్యమ కార్యాచరణ రూపొందించామన్నారు. పార్టీ వివిధ విభాగాల సమన్వయంతో ఇటీవల పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టామని, దీనిపై ఎస్పీ జగదీష్ స్పందించి సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఓ యువతికి అన్యాయం జరిగితే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షలతో పాటు ఇంట్లో ఒకరికి ఉద్యోగం, 5 సెంట్ల స్థలం ఇచ్చి ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వంలో తీరని అన్యాయానికి గురైన వారికి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం కనీస చర్యలు కూడా తీసుకోలేదని దుయ్యబట్టారు. కనీసం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించలేదంటే చంద్రబాబు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంతో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ క్రమంలో బాధిత గిరిజన కుటుంబానికి, మైనర్ బాలికకు అండగా నిలిచి, వారికి న్యాయం జరిగే వరకు పోరాడాలని నిశ్చయించామన్నారు. భవిష్యత్తులో ఎవరైనా దుశ్చర్యలకు పాల్పడితే ఇబ్బందులు తప్పవని, మృగాళ్లకు శిక్షపడే వరకు వైఎస్సార్ సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. భారీ ర్యాలీకి తరలిరండి... గురువారం ఉదయం 10 గంటలకు నగరంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి సప్తగిరి, సంగమేశ్వర్ సర్కిల్ మీదుగా కలెక్టరేట్ వరకు జరిగే ర్యాలీలో ఎస్టీ సెల్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మూడే శ్రీనివాస్ నాయక్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఎస్టీలు తరలిరావాలని ఆయన కోరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాకే శ్రీనివాసులు, గోవింద్ నాయక్, ప్రధాన కార్యదర్శి గుజ్జల శివ, నగరాధ్యక్షులు గుజ్జల శివయ్య, సాకే రాజశేఖర్, రాజు నాయక్, సాకే మురళీ, సాకే ఆనంద్, ముంగా ప్రదీప్, సాకే నాగార్జున తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్లో భగ్గుమన్న విభేదాలు
● మధ్యలోనే అలిగి వెళ్లిపోయిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అనంతపురం టవర్క్లాక్: అనంతపురంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సమావేశానికి ముఖ్యఅతిథిగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల హాజరయ్యారు. సీనియర్లను స్టేజీ పైకి పిలవనందుకు నిరసన తెలుపుతూ సీనియర్ నాయకుడు ఫిరోజ్ఖాన్ కింద కూర్చున్నారు. అది గమనించిన షర్మిల కూడా వేదిక దిగొచ్చి కుర్చీపై కూర్చున్నారు. కాసేపటికి సమావేశం ప్రారంభం కాగా.. నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. గుంతకల్లు నియోజకవర్గ నాయకులు ప్రభాకర్, నబీరసూల్ మధ్య గొడవ తారస్థాయికి చేరుకుని.. నబీరసూల్పై ప్రభాకర్ చేయి చేసుకున్నారు. వారికి నచ్చజెప్పి సమావేశం కొనసాగించారు. షర్మిల మాట్లాడుతూ జిల్లాలో నాయకత్వ లోపంతో పార్టీ అభివృద్ధి కాలేదని, ఇక్కడి సమస్యలపై అధిష్టానంతో చర్చించి త్వరలోనే అన్ని కమిటీలు వేస్తామని అన్నారు. ఈ క్రమంలోనే మళ్లీ గొడవ జరిగింది. డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి జిల్లాలోని నాయకులను కలుపుకొని పోలేదంటూ పలువురు మండిపడ్డారు. దీంతో షర్మిల సమావేశం మధ్యలోనే ఆపేసి అలిగి వెళ్లిపోయారు. -
వరుణ దేవా.. పంటలు బాగా పండేలా చూడు
కూడేరు: ‘వరుణ దేవా కరుణించు. వర్షాలు సమృద్ధిగా కురిపించు. పంటలు బాగా పండేలా చేసి రైతులు ఆర్థికంగా ఎదిగేలా చూడు’ అంటూ కలెక్టర్ వినోద్ కుమార్ ప్రార్థించారు. ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం కూడేరు మండలం కొర్రకోడులో వ్యవసాయాధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి కలెక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎద్దులు, నాగలి, భూమికి పూజలు నిర్వహించారు. నాగలి పట్టి వేరుశనగ విత్తును ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు అధికంగా కురిసే అవకాశాలున్నాయన్నారు. జిల్లాలో విత్తన వేరుశనగ పంపిణీ ఇప్పటికే మొదలైందని, రైతులకు విత్తన కొరత లేకుండా చర్యలు చేపట్టామన్నారు. రైతులు యాజమాన్య పద్ధతుల ద్వారా పంటలు సాగు చేసి అధిక దిగుబడులు సాధించాలని తెలియజేశారు. చిరుధాన్యాల పంటల సాగుకు ఆసక్తి చూపాలన్నారు. పలువురు రైతులకు మినీ కిట్స్, భూసార పరీక్షల కార్డులను అందజేశారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిప్పే నాయక్, జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.విజయవాడ వెళ్లిన కలెక్టర్అనంతపురం అర్బన్: కలెక్టర్ వి.వినోద్కుమార్ బుధవారం విజయవాడకు బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వం ఏర్పాటై గురువారానికి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసేందుకు కలెక్టర్ విజయవాడ వెళ్లినట్లు సమాచారం. ఆయన తిరిగి 13న విధులకు హాజరవుతారని తెలిసింది.‘ఉపాధి’లో 16 రకాల పండ్ల తోటల పెంపకంఅనంతపురం టౌన్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 16 రకాల పండ్ల తోటల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ సలీంబాషా తెలిపారు. జిల్లాలో 8,051 ఎకరాల్లో పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టే విధంగా లక్ష్యం నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మామిడి, చీనీ, నిమ్మ, జామ, తైవాన్ జామ, సపోట, కొబ్బరి, అల్లనేరేడు, చింత, సీతాఫలం, దానిమ్మ, అంజూరా, యాపిల్బేర్, అవకాడో, పనస, డ్రాగన్ఫ్రూట్తో పాటు గులాబీ, మల్లె, మునగ తదితర పంటల సాగు కోసం అనుమతులను మంజూరు చేశారన్నారు. ఐదెకరాల్లోపు మెట్ట భూములున్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు.జీడిపల్లి రిజర్వాయర్ను పరిశీలించిన ట్రైనీ కలెక్టర్లుబెళుగుప్ప: మండలంలోని జీడిపల్లి రిజర్వాయర్తో పాటు పరివాహక ప్రాంతంలోని కోనంపల్లి గ్రామంలో పంటలు, నీటి వినియోగాన్ని ట్రైనీ కలెక్టర్లు పరిశీలించారు. ఏపీ దర్శన్ కార్యక్రమంలో భాగంగా ట్రైనీ కలెక్టర్లు సచిన్రహర్, నరేంద్ర పాడల్, పృథ్వీరాజ్కుమార్, సందీప్ రఘువంశీ, నాగ వెంకటసహిత్, పర్హిన్ జాహిద్, మనీషా బుధవారం జీడిపల్లి పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఆర్డీఓ వసంతబాబు, తహసీల్దార్ అనిల్కుమార్ స్వాగతించారు. కోనంపల్లి వద్ద బోరుబావుల కింద సాగు చేసిన వేరుశనగ పంటకు నీటి వినియోగంపై డ్రిప్, స్ప్రింక్లర్ల పనితీరును ఉద్యాన శాఖ అధికారి ఫిరోజ్ఖాన్ను అడిగి తెలుసుకున్నారు. జీడిపల్లి రిజర్వాయర్కు సంబంధించిన అంశాలను హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ రాజాస్వరూప్, ఈఈ శ్రీనివాసులు వివరించారు. కార్యక్రమంలో మండల హార్టికల్చర్ అధికారి కృష్ణతేజ, ఎంఐఓ మల్లేష్, హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులు పాల్గొన్నారు. -
అత్యాచారాలు..హత్యలు..కబ్జాలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: భూకబ్జాలు, ఆక్రమణలు, హత్యలు, అత్యాచారాలకు కూటమి సర్కారు కేరాఫ్గా మారింది. చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టి గురువారానికి ఏడాది పూర్తయిన నేపథ్యంలో.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే చర్చ సాగుతోంది. ఏడాదిలోనే సర్కారు భారీ వైఫల్యాలను మూటగట్టుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని, మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్న భావన అందరిలోనూ నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో బడు లకు పిల్లలను పంపాలంటేనే బాలికల తల్లిదండ్రులు భయపడుతున్నారు. మితిమీరిన రాజకీయ జోక్యంతో పోలీసులు నిశ్చేష్టులై చూస్తుండడంతో సామాన్యులకు న్యాయం అందని ద్రాక్షగా మారింది. చెరపట్టిన మైనింగ్ మాఫియా హిందూపురం మొదలు తాడిపత్రి వరకూ అన్ని నదు లనూ, వంకలనూ టీడీపీ నేతలు చెరపట్టారు. చిత్రావతి, హగరి నదులు ఇప్పటికే రూపు మారిపోయాయి. ఇక కొండలు, గుట్టలు ఏడాదిలోనే మాయమయ్యాయి. మైనింగ్, రెవెన్యూ శాఖలు ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ఎప్పుడో మానేశాయి. సూపర్ సిక్స్ మోసం.. ‘ఆరు పథకాలు మీ జీవితాలనే మారుస్తాయంటూ’ ఎన్నికల ముందు ప్రచారం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని గాలికొదిలారు. ‘అమ్మఒడి’ లేదు, ‘ఉచిత గ్యాస్ సిలిండర్లు’ లేవు, రైతు సాయం లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఇంటికో ఉద్యోగం లేదు. ఒక్కటంటే ఒక్క పథకమూ లేదు. పేట్రేగుతున్న రౌడీషీటర్లు అధికార అండతో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో రౌడీషీటర్లు పేట్రేగిపోతున్నారు. సామాన్యుల ఇళ్ల స్థలాలను కబ్జా చేస్తున్నారు. ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారు. ఖాళీ స్థలాలు కనిపిస్తే కంచె వేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కలుగుల్లో దాక్కున్న రౌడీషీటర్లందరూ చంద్రబాబు సర్కారు పుణ్యమా అని నేడు దర్జాగా తిరుగుతూ రెచ్చిపోతున్నారు. ఏడాదిలో నాలుగు హత్యలు ఒక్క ఏడాదిలోనే ఉమ్మడి అనంతపురం జిల్లాలో నాలుగు హత్యలు జరిగాయి. వీటన్నింటి వెనుకా టీడీపీ వర్గీయులే ఉండటం గమనార్హం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే హిందూపురంలో మల్లికార్జున దారుణ హత్యకు గురయ్యారు. పాపిరెడ్డిపల్లెలో లింగమయ్యపై టీడీపీ నాయకులు దాడి చేసి చంపేశారు. రాప్తాడు మండలంలో దంపతులు ముత్యాలమ్మ, నారాయణరెడ్డిని పట్టపగలే నరికి హత్య చేశారు. మహిళల్లో ఆందోళన.. రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో దళిత మైనర్ బాలికను 14 మంది సామూహిక అత్యాచారం చేసిన ఘటన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అంతేకాదు ఇంటర్ విద్యార్థిని తన్మయిని అతి కిరాతకంగా చంపి పొలాల్లో పడేసిన ఘటన జిల్లా ప్రజలను నివ్వెరపోయేలా చేసింది. తాడిపత్రిలో ఐచర్ వాహనంలో ఓ బాలిక, పుట్లూరు మండలంలో మరో బాలిక అత్యాచారానికి గురయ్యారు. మద్యం ఏరులు.. గతంలో ప్రభుత్వ పర్యవేక్షణలోనే మద్యం విక్రయాలు జరిగేవి. అప్పట్లో బహిరంగ మద్యంపై ఉక్కుపాదం మోపారు. కానీ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపులకు వేళాపాళా లేకుండా పోయింది. బెల్టుషాపులు, పర్మిట్రూములతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. విచ్చలవిడిగా మద్యం అందుబాటులో ఉంటుండటంతో పల్లెలు మత్తులో జోగుతున్నాయి. కరెంటు బిల్లులతో లబోదిబో.. అధికారంలోకి వస్తే ఒక్కపైసా కరెంటు చార్జీ పెంచబోనని చెప్పిన చంద్రబాబు.. కరెంటు చార్జీలు పెంచి సామాన్యుల నడ్డివిరిచారు. రూ.800 బిల్లు వచ్చే మధ్యతరగతి కుటుంబానికి ఇప్పుడు రూ.1,500 వస్తోంది. కరెంటు చార్జీల పెంపుతో జనం అల్లాడిపోతున్నారు. కూటమి పాలనకు ఏడాది అనతి కాలంలోనే దారుణాలకు కేంద్రబిందువుగా ఉమ్మడి జిల్లా పూర్తిగా అదుపుతప్పిన శాంతిభద్రతలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన బాలికపై సామూహిక అత్యాచార ఘటన జిల్లావాసులను భయభ్రాంతులకు గురి చేసిన గిరిజన యువతి దారుణ హత్య -
నిర్మాణాలు పూర్తి చేయాలి
గత ప్రభుత్వంలో ‘నాడు–నేడు’ కింద గ్రామంలో పాఠశాలలో తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. పనులు వేగవంతంగా జరిగాయి. ప్రభుత్వం మారడంతో పనులు ఆగిపోయాయి. అసౌకర్యాల మధ్యనే విద్యార్ధులు చదువుకోవాల్సి వస్తోంది. అర్ధంతరంగా ఆగిన భవన నిర్మాణాలను పూర్తి చేయాలి. – దేవరెడ్డి, ఉంతకల్లు గ్రామం, బొమ్మనహాళ్ మండలం ప్రభుత్వ బడులను పట్టించుకోలేదు గత ప్రభుత్వంలో నాడు–నేడు కార్యక్రమంతో అన్ని పాఠశాలల్లోనూ మౌళిక వసతులు కల్పించింది. అదనపు తరగతి గదుల నిర్మాణాలు చాలా స్కూళ్లలో 10–20 శాతం మాత్రమే పెండింగ్ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బడులను అసలే పట్టించుకోలేదు. నిధులు మంజూరు చేస్తే పెండింగ్లో ఉన్న గదులన్నీ అందుబాటులోకి వస్తాయి. – కుళ్లాయిస్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి -
టీచర్ల సహనానికి కౌన్సెలింగ్
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖ ఉన్నతాధికారులు మళ్లీ టీచర్ల సహనానికి పరీక్ష పెట్టారు. స్థానిక పంగల్రోడ్డులోని ఆర్డీటీ స్కూల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీల కౌన్సెలింగ్ తొలిరోజు మంగళ వారం రసాభాస నడుమ రాత్రి 10.30 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి దాటినా కొనసాగిన విషయం తెలిసిందే. అయితే, అప్పటికీ జనరల్, ప్రిఫరెన్షియల్ కేటగిరీలకు సంబంధించి సాంకేతిక సమస్యలు తలెత్తడం.. వాటిని సరి చేసే అవకాశం రాష్ట్ర అధికారులకే ఉండడంతో చేసేదిలేక అర్ధరాత్రి దాటిన తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియను ఉన్నతాధికారులు వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు అని చెప్పి... బుధవారం ఉదయం 11 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని,జాబితాలోని 1 నుంచి 500 సంఖ్య వరకు హాజరుకావాలంటూ ఉదయాన్నే ఉపాధ్యాయులకు మెసేజ్లు పంపారు. తర్వాత 2 గంటలకు వాయిదా వేశారు. అప్పటికీ స్పష్టత రాకపోవడంతో చివరకు సాయంత్రం 4 గంటలకు 1 నుంచి 350 సంఖ్య వరకు రావాలంటూ మెసేజ్లు పెట్టారు. ఎట్టకేలకు 4.30 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. కౌన్సెలింగ్ ప్రక్రియను పాఠశాల విద్య రీజనల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్ పరిశీలించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆయన దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు. వెబ్ ఆప్షన్ల బహిష్కరణ.. భాషా పండితుల (ఎల్పీ) బదిలీల్లో భాగంగా బుధవారం రాత్రి ఫైనల్ సీనియార్టీ జాబితా విడుదల చేశారు. అయితే, ఫిర్యాదులు స్వీకరించ కుండానే వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేయడంపై భాషా పండితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రక్రియను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. గుంతలో పడి టీచర్కు గాయాలు రాత్రి దాకా సాగుతున్న కౌన్సెలింగ్ ప్రక్రియ టీచర్లకు లేని తిప్పలు తెచ్చిపెడుతోంది. కౌన్సెలింగ్ కేంద్రం వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకున్న ప్రమాదంలో ఓ టీచర్కు గాయాలయ్యాయి. వివరాలు.. బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న సోషల్ టీచర్ పి. రామిరెడ్డి, బుక్కపట్నంలో ఎస్జీటీగా పని చేస్తున్న సుధారాణి దంపతులు. భార్య కౌన్సెలింగ్ నేపథ్యంలో బుధవారం పంగల్రోడ్డులోని ఆర్డీటీ స్కూల్కు రామిరెడ్డి వచ్చారు. రాత్రి కావడంతో భోజనం కోసమని కేంద్రం నుంచి బయటకు వెళ్తూ చీకట్లో ప్రమాదవశాత్తు గుంతలో పడ్డారు. చేతికి తీవ్ర గాయాలైన ఆయనను తోటి టీచర్లు నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. నేడు కౌన్సెలింగ్ ఇలా... క్రమ సంఖ్య 351 నుంచి 700 వరకు ఉన్న ఎస్జీటీలకు గురువారం ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు, క్రమ సంఖ్య 701 నుంచి 1,000 వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి కౌన్సెలింగ్ ఉంటుందని డీఈఓ ప్రసాద్ బాబు తెలిపారు ● నేడు వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ● జిల్లా అధ్యక్షుడు అనంత వెల్లడి -
‘సాక్షి’ కార్యాలయాలపై దాడి హేయం
● ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి ఉరవకొండ: కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగడుతున్న ‘సాక్షి’ మీడియాపై కక్ష కట్టి దాడులు చేయడం దుర్మార్గమని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కేఎస్సార్ లైవ్ షో ద్వారా ఎన్నో ప్రజా సమస్యలు వెలుగులోకి తెస్తున్న సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ రాజకీయ కక్షలో భాగమేనని అన్నారు. ఓ వ్యక్తి చేసిన వివాదస్పద వ్యాఖ్యల ఆధారంగా కేఎస్సార్ను అరెస్ట్ చేయడం సబబు కాదన్నారు. మహిళలపై పట్టపగలే అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టించుకోని పోలీసులు.. కేఎస్సార్ విషయంలో ఆగమేఘాలపై స్పందించడం కుట్రలో భాగమేనని మండిపడ్డారు. నీట మునిగి యువకుడి మృతికూడేరు: రిజర్వాయర్లో ప్రమాదవశాత్తు నీట మునిగి ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. అనంతపురంలోని రంగారెడ్డి కాలనీకి చెందిన ప్రసాద్, విశాల దంపతులకు కుమారుడు భరత్కుమార్ (22) బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం రావడంతో వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో స్నేహితులు ఉమామహేష్, అనిల్తో కలసి బుధవారం పీఏబీఆర్ సందర్శనకు వెళ్లారు. సరదాగా నీటిలో ఈత కొడుతుండగా లోతుగా ఉన్న ప్రాంతానికి చేరుకున్న భరత్ నీట మునిగాడు. స్నేహితులు గాలించి వెలికి తీసేలోపు ఊపిరి ఆడక మృతిచెందాడు. ఘటనపై కూడేరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
‘ప్రిఫరెన్షియల్’లో దుర్వినియోగం
అనంతపురం ఎడ్యుకేషన్: డీఈఓ కార్యాలయ సిబ్బంది నిర్వాకం కారణంగా ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల్లో ప్రిఫరెన్షియల్ కేటగిరీ దుర్వినియోగమైందని డీఈఓ ప్రసాద్బాబుకు పలువురు ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను బుధవారం డీఈఓను కలిసి అందజేశారు. నగరంలోని కేఎస్ఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎస్ఏ ఇంగ్లిష్కు సంబంధించి ఆరు పోస్టులుండగా కొత్త బదిలీల చట్టం ప్రకారం 50 శాతం అంటే మూడు పోస్టులు ప్రిఫరెన్షియల్ కేటగిరీకి చూపించాల్సి ఉందన్నారు. అయితే ఏకంగా ఐదు పోస్టులను ఇచ్చారన్నారు. ఈ కారణంగా సీనియారిటీ జాబితాలో ఉన్న టీచర్లకు నష్టం వాటిల్లిందని మండిపడ్డారు. పీహెచ్ (అంధులు) కేటగిరీ కింద ధర్మవరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఆదిమూలం శ్రీనివాసులు పీహెచ్ కేటగిరీని వదిలి జనరల్ కేటగిరీకి దరఖాస్తు చేసుకుంటున్నట్లు తన ఇష్టపూర్వక లేఖను సమర్పించారన్నారు. ఈ లెక్కన ఆయన పేరును జనరల్ కేటగిరీలో చూపిస్తే తర్వాత ఉన్న మహిళా టీచర్ను బాలికల పాఠశాలకు కేటాయించకుండా పురుష టీచరును నియమించారన్నారు. చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న జెడ్పీ యాజమాన్య టీచర్లు తిరిగి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలను ఎంచుకున్నారన్నారు. అక్రమ బదిలీలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. తర్వాత సీనియారిటీలో ఉన్న అర్హులైన ఉపాధ్యాయులకు ఆ స్థానాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కార్యాలయ సిబ్బంది నిర్వాకంపై డీఈఓకు ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయులు -
పరాకాష్టకు రెడ్బుక్ పాలన
ఉరవకొండ: రాష్ట్రంలో రెడ్బుక్ పాలన పరాకాష్టకు చేరిందని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఉరవకొండలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ‘సాక్షి’ మీడియాపై కక్ష సాధింపులకు దిగడం హేయమన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రభుత్వ అక్రమాలు, దురాగతాలపై ప్రశ్నిస్తున్న ‘సాక్షి’ మీడియాపై సీఎం చంద్రబాబు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఓ డిబేట్లో జర్నలిస్ట్ చేసిన వాఖ్యలను ప్రణాళిక ప్రకారం వివాదాస్పదం చేశారన్నారు. ఆ వ్యాఖ్యలతో సంబంధం లేకున్నా సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్టు చేశారన్నారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రెచ్చగొట్టే ధోరణితో టీడీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. ‘సాక్షి’ యాజమాన్యంతో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతికి ఆపాదిస్తూ అత్యంత దారుణంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడంతోనే ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులకు తెగబడ్డారన్నారు. కూటమి ఏడాది పాలనపై వైఎస్సార్సీపీ నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష ప్రజా స్పందన వచ్చిందని, దీన్ని జీర్ణించుకోలేక మీడియాపై దాడులకు పక్కా ప్రణాళిక రచించారన్నారు. పోలీసుల వైఫల్యంతోనే తన్మయి హత్య అత్యంత దారుణంగా హత్యకు గురైన గిరిజన విద్యార్థిని తన్మయి కేసులో పోలీసుల వైఫల్యం కన్పిస్తోందని ‘విశ్వ’ పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతలే కీచకులుగా మారి మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు ఏడాది పాలనలో 188 మంది మహిళలపై లైగింక దాడులు జరిగాయన్నారు. ఇంత జరుగుతున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్లు మూసుకున్నారా అని ప్రశ్నించారు. మహిళలపై జరుగుతున్న దాడులకు బాధ్యత వహించి హోం మంత్రి అనిత వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
గాయపడిన మహిళా ఉద్యోగి మృతి
ఓర్వకల్లు: రోడ్డు ప్రమాదంలో గాయపడిన గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగి చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం జిల్లా వెంకటాంపల్లి గ్రామానికి చెందిన చంద్రారెడ్డి భార్య ముకుంద ప్రియ కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని నన్నూరు గ్రామ సచివాలయం–2లో అగ్రికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. భర్త చంద్రారెడ్డి ఆర్మీకి వెళ్లడంతో కర్నూలులో ఉంటున్న తల్లిదండ్రుల వద్ద నివాసముంటున్న ఆమె రోజూ కర్నూలు నుంచి స్కూటీపై విధులకు వెళ్లి వచ్చేవారు. ఈ క్రమంలో గత నెల 20న విధులకు వెళ్తుండగా రోడ్డుపై నిలబడిన లారీని ఢీకొని గాయపడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందారు. -
పేరుకే ‘మహా ప్రస్థానం’
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో నాలుగు మహాప్రస్థానం వాహనాలు ఉండగా ఇందులో ఏ ఒక్కటీ అత్యవసరం సమయంలో నిరుపేదలకు ఉపయోగ పడడం లేదు. సర్వజనాస్పత్రికి చికిత్స కోసం వచ్చిన కంబదూరు మండలం పి.వెంకటాంపల్లికి చెందిన హరిజన మారెక్క(48) బుధవారం మృతి చెందింది. దీంతో వార్డు గోడలపై ఉన్న మహాప్రస్థానం వాహనం కోసం ఉదయం 9.30 గంటలకు మృతురాలి కుటుంబసభ్యులు ఫోన్ చేశారు. అయితే మహాప్రస్థానం వాహనం అందుబాటులో లేదని, రావడానికి రాత్రి 7 గంటలవుతుందని డ్రైవర్ నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ ఫోన్ కట్ చేశాడు. దీంతో మారెక్క కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులను సంప్రదించారు. బాధితుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ అంబులెన్స్ నిర్వాహకులు పెద్ద మొత్తంలో డిమాండ్ చేశారు. పలుమార్లు ప్రాధేయపడిన తర్వాత చివరకు రూ.5,500తో ఒప్పుకుని మృతదేహాన్ని తరలించేందుకు ముందుకు వచ్చారు. ఆస్పత్రిలో రోజూ 6 నుంచి 10 మంది మృత్యువాత పడుతున్నారు. ఈ మృతదేహాలను తరలించేందుకు గత ప్రభుత్వంలో అప్పటి ఎంపీ తలారి రంగయ్య తన కోటా నిధుల్లో నుంచి రూ.10 లక్షలు వెచ్చించి మహాప్రస్థానం వాహనాన్ని సమకూర్చారు. ఈ వాహనాన్ని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. అయితే ఆ వాహనానికి ఇంధనం సమకూర్చకపోవడంతో మూలన పడింది. ఇదే విషయమై ఆస్పత్రి అడ్మినిస్ట్రేటర్ మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ.. త్వరలో వాహనం రెగ్యులర్గా తిరిగేందుకు ప్రత్యేక బడ్జెట్ను ఏర్పాటు చేసేలా కలెక్టర్కు విన్నవించనున్నట్లు పేర్కొన్నారు. -
ఆర్డీటీతో ముడిపడిన పేదల భవిష్యత్తు
కళ్యాణదుర్గం: ఆర్డీటీ పరిరక్షణ అనేది కరువు ప్రాంత అభివృద్ధి, పేదల భవిష్యత్తుతో ముడిపడి ఉందని శింగనమల వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి డాక్టర్ శైలజనాథ్ అన్నారు. సంస్థకు ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయించే అంశంపై టీడీపీ నేతలు ఢిల్లీకి వెళ్లి మాట్లాడలేరని, కనీసం సీఎం చంద్రబాబును సైతం ప్రశ్నించలేని స్థితిలో జిల్లా ప్రజాప్రతినిధులు ఉన్నారని మండిపడ్డారు. మాజీ ఎంపీ రంగయ్య చేపట్టిన ఆర్డీటీ పరిరక్షణ పాదయాత్ర బుధవారం కంబదూరు మండలం ఓబిగానిపల్లి గేట్ వద్ద కు చేరుకుంది. ఈ సందర్భంగా మీడియాతో శైలజనాథ్ మాట్లాడారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ అంశంపై కూటమి నేతలు ఎకసెక్కాలు చేస్తుండడం సిగ్గుచేటన్నారు. కేవలం రాజకీయం కోసమే పాదయాత్ర చేస్తున్నారంటూ టీడీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం రాజకీయాల కోసమే కూటమి ఏర్పడిందనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించాలన్నారు. జిల్లాలో ఆర్డీటీ ద్వారా లబ్ది పొందిన అనేక మంది పాదయాత్రలో పాల్గొంటున్నారని, వారే కాక స్థానిక ఎమ్మెల్యే కూడా నడిస్తే తామేమీ వద్దనమని అన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కోసం రెండోసారి కూడా దరఖాస్తు చేసుకోవాలనే ఆలోచన కూడా కొనసాగుతోందన్నారు. రెండో సారి దరఖాస్తు చేసుకుంటే ఇక మీ గొప్పతనం ఏముంటుందని ప్రశ్నించారు. పేదలు జీవించే హక్కును పాదయాత్ర నిర్ధారిస్తోందన్నారు. వారు చదువుకునే హక్కు...జీవించే హక్కును రంగయ్య ఆధ్వర్యంలో జరుగుతున్న పాదయాత్ర స్పష్టీకరిస్తుందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడూ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ ఆగలేదని గుర్తు చేశారు. ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ఏ తీసుకురావాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉందన్నారు. ఆర్డీటీకి తామంతా తోడున్నామని, అవసరమైతే అనంతపురం వరకూ పాదయాత్ర చేపట్టి ఆర్డీటీ పరిరక్షణ ఆవశ్యకతపై ప్రజలను చైతన్య పరుస్తామన్నారు. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ... ఆర్డీటీ మూతపడితే ఇక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ.. జిల్లాకు జీవనాడిగా ఉన్న ఆర్డీటీని కాపాడుకునేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యుడు రమేష్గౌడ్ మాట్లాడుతూ... 55 ఏళ్లుగా పేదలకు నిస్వార్థ సేవలందిస్తున్న ఏకై క సంస్థ ఆర్డీటీనే అని కొనియాడారు. చేయి చేయి కలిపి ఆర్డీటీని కాపాడుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, పార్టీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు, జెడ్పీటీసీ గుద్దెళ్ల నాగరాజు, పార్టీ కన్వీనర్ హనుమంతరాయుడు, ఎంపీపీ భీమేష్, సర్పంచ్ సంధ్యాహరినాథ్, జిల్లా కార్యదర్శి ములకనూరు తిమ్మరాయుడుతో పాటు అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ఆర్డీటీ లబ్ధిదారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కళ్యాణదుర్గం రూరల్: రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని సాకే శైలజనాఽథ్ విమర్శించారు. కళ్యాణదుర్గంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నేతలతో కలసి బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీ నేతల దౌర్జన్యాలు, అరాచకాలను వెలుగులోకి తీసుకువచ్చారన్న అక్కసుతో సాక్షి టీవీ, పత్రికపై అక్కసు వెళ్లగక్కడం సరికాదన్నారు. రెండు రోజుల క్రితం అనంతపురంలోని సాక్షి ప్రధాన కార్యాలయంపై టీడీపీ నాయకులు సాగించిన దాడి యత్నాన్ని ఖండించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయని చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారని మండిపడ్డారు. సాక్షి కార్యాలయాలపై దాడులు, వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు దిగడంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు మంచి చేయడంపై ఈ పాలకులకు లేదన్నారు. అవసరమైతే అనంతపురం వరకూ పాదయాత్ర మాజీ మంత్రి సాకే శైలజనాథ్ -
‘కూటమి’ తీరుతో సీమ ప్రాజెక్టులు నిర్వీర్యం
● రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరయ్య ధ్వజం అనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వ పెద్దల తీరుతో రాయలసీమ ప్రాజెక్ట్లు నిర్వీర్యమవుతున్నాయని రైతు సంఘం రాష్ట్ర అధక్షుడు ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. స్థానిక ఆ సంఘం కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమకు నీరు ఇస్తామని తప్పుడు ప్రచారంతో గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ను ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టేందుకు సీఎం చంద్రబాబు అత్యుత్సాహం చూపుతున్నారని, ఈ ఉత్సాహం కుమారుని ప్రయోజనం కోసమా? లేక కమీషన్ల కోసమా అనేది సీఎం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తే రాయలసీమ జిల్లాల్లోని హంద్రీ–నీవా, గాలేరి–నగరి, వెలుగొండ ప్రాజెక్టులు పూర్తయి ప్రతి ఎకరాకూ నీరు అందుతుందన్నారు. అలా కాదని రూ.82 వేల కోట్లు వ్యయంతో చేపట్టే బనకచెర్ల ప్రాజెక్ట్ కేవలం కమీషన్ల కోసమే తప్ప రైతుల ప్రయోజనం కోసం ఎంత మాత్రం కాదనేది స్పష్టతమవుతోందన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ఇష్టానుసారంగా వాగ్ధానాలు చేయడం... అధికారం చేజిక్కించుకున్న తరువాత వాటిని గాలికి వదిలేయడం చంద్రబాబుకు పరిపాటిగా మారిందన్నారు. హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ చేయడం ద్వారా రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. అంబానీ, ఆదానీలకు రూ.16 లక్షల కోట్ల అప్పలు రద్దు చేస్తారు కానీ... అన్నం పెట్టే రైతులకు 90 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించలేని అసమర్థ ప్రభుత్వం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. రైతాంగ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు కాటమయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున, ఆర్గనైజింగ్ కార్యదర్శి వన్నారెడ్డి, నాయకులు వెంకటరాముడు, సూరి, తదితరులు పాల్గొన్నారు. -
తాగుడు మానేయమంటే ఉరేసుకున్నాడు
గుంతకల్లు: పాత గుంతకల్లు ప్రాంతానికి చెందిన వడ్దే రంగముని, సుజాత దంపతుల కుమారుడు వడ్దే రాజేష్ (20) ఆత్మహత్య చేసుకున్నాడు. డెకరేషన్ పనులతో కుటుంబానికి చేదోడుగా నిలిచిన రాజేష్... ఏడాదిగా మద్యానికి బానిసయ్యాడు. తల్లిదండ్రులు ఎంత చెప్పినా తన ప్రవర్తనను మార్చుకోలేదు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న రాజేష్ను తల్లిదండ్రులు మందలించారు. దీంతో అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వారి సాయంతో రాజేష్ను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఘటనపై గుంతకల్లు రెండో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అధినేతతో ప్రవాసాంధ్రుల భేటీ
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ప్రవాసాంధ్రులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారి వెంట వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ గ్లోబల్ వింగ్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి ఉన్నారు. వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రవాసాంధులను వైఎస్ జగన్కు ఆయన పరిచయం చేశారు. పార్టీ అధినేతను కలసిన వారిలో ఇలియాస్ (వైఎస్సార్సీపీ గల్ఫ్ కన్వీనర్), మర్రి కళ్యాణ్ (కో–కన్వీనర్, కువైట్), జాఫర్ హుస్సేన్ (కో–కన్వీనర్, ఖతార్), వీపీ రామచంద్రారెడ్డి(అడ్వైజర్, కువైట్), గజ్జల నర్సారెడ్డి (అడ్వైజర్, కువైట్), షేక్ సబ్దర్ (ఈసీ, కువైట్), షేక్ ఇలాహి (కమిటీ సభ్యుడు, సౌదీ అరేబియా), చంద్రలేఖ, శ్రీనివాసరెడ్డి (అట్లాంటా, యూఎస్ఏ), సాయికొప్పినేని (మెల్బోర్న్, ఆస్ట్రేలియా) ఉన్నారు. -
మొండిగా ముందుకు..
● ఫిర్యాదులను పట్టించుకోకుండా ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్కు సిద్ధమైన విద్యాశాఖ ● అడ్డుకున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల్లో అత్యధికులైన సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీల్లో విద్యాశాఖ అధికారులు సీనియార్టీ జాబితాలో అసంబద్ధాలు తొలగించకుండానే మొండిగా ముందుకు వెళ్లాలని చూశారు. అయితే, ఫిర్యాదులను పట్టించుకోకుండా కౌన్సెలింగ్కు సిద్ధమవడంతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు అడ్డుకోవడంతో గందరగోళం నెలకొంది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక పంగల్రోడ్డులోని ఆర్డీటీ స్కూల్ లో సీరియల్ నంబరు 1 నుంచి 350 వరకు ఉన్న టీచర్లకు బదిలీలు చేపడతామని విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. దీంతో ఉమ్మడి జిల్లా నలుమూల నుంచి ఉరుకులు, పరుగులతో ఎస్జీటీలు కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. తీవ్ర ఇబ్బందులు.. కౌన్సెలింగ్ కేంద్రంలో తాగేందుకు కూడా నీటి వసతి కల్పించకపోవడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో సాంకేతిక కారణాలు అంటూ, ఉన్నతాధికారుల నుంచి లింక్ రాలేదంటూ రాత్రి 9 గంటల దాకా గడిపారు. ఎట్టకేలకు 9.30 గంటల సమయంలో కౌన్సెలింగ్ ప్రారంభిస్తున్నట్లు డీఈఓ ప్రసాద్బాబు మైకుద్వారా ప్రకటించారు. ముందుగా జాబితాలోని 1 నుంచి 30 మంది టీచర్లు రావాలని పిలవగా.. ఉపాధ్యాయ సంఘాల నాయకులు అడ్డుకున్నారు. అనేక ఫిర్యాదులు ఇచ్చినా అవేవీ పట్టించుకోకుండా సీనియార్టీ జాబితాలో మార్పు చేయకుండా ఎలా కౌన్సెలింగ్ నిర్వహిస్తారంటూ నిలదీశారు. ఒక టీచరుకు 32 పాయింట్లు రావాల్సి ఉండగా 27 పాయింట్లు వచ్చాయని, రెండుసార్లు రీఅపోర్స్మెంట్కు గురైన మరో టీచరుకు రావాల్సిన 7 ప్రత్యేక పాయింట్లు వేయలేదని, తాత్కాలిక సీనియార్టీ జాబితాలో ఉన్న స్పౌజ్ పాయింట్లు ఫైనల్ జాబితాలో కనిపించడం లేదని.. ఇలా పదుల సంఖ్యల్లో సమస్యలు ఉన్నాయన్నారు. దీంతో సీనియార్టీలో వందలు, వేలల్లో తేడా వస్తోందంటూ వాపోయారు. ఇవేవీ పరిష్కరించకుండా వారిని అన్యాయం చేస్తారా అని నిలదీశారు. కమిషనర్ నుంచి అనుమతులు తీసుకుని వాటన్నింటినీ పరిష్కరించిన తర్వాతనే కౌన్సెలింగ్ జరపాలంటూ పట్టుబట్టారు. ఇంతలో విద్యాశాఖ అధికారులు పోలీసులకు సమాచారం అందించగా.. రాప్తాడు పోలీసులు చేరుకున్నారు. అయినా నాయకులు వెనక్కి తగ్గలేదు. నిబంధనల మేరకు రావాల్సిన పాయింట్లు వేసే వరకు జరపకూడదంటూ తెగేసి చెప్పారు. దీంతో డీఈఓ పలుమార్లు ఆర్జేడీ, రాష్ట్ర అధికారులతో ఫోన్లో మాట్లాడాల్సి వచ్చింది. 150 మందికి మాత్రమే కౌన్సెలింగ్ తొలి 150 మందికి సంబంధించిన సీనియార్టీలో ఎలాంటి సమస్యలు లేకపోవడంతో చివరకు ఆ 150 మందికి మాత్రమే జరుపుతామన్నా సంఘాల నాయకులు ఒప్పుకోలేదు. చివరకు పలువురి జోక్యంతో వారికి కౌన్సెలింగ్ చేసేందుకు ఒప్పుకున్నారు. ఇదే విషయాన్ని డీఈఓ ప్రకటించారు. అయితే వారికి కూడా బుధవారం ఉదయం ఫైనల్ సీనియార్టీ జాబితాలో మార్పులు చేసి ప్రకటిస్తామని వెల్లడిస్తామన్నారు. దీంతో మధ్యాహ్నం నుంచి పడిగాపులు కాసిన వారు ఉసూరుమంటూ వెనుతిరిగారు. -
టీడీపీ నేతల బరితెగింపు
● పలువురిపై కర్రలతో దాడి ● దానిమ్మ చెట్ల నరికివేతగుమ్మఘట్ట: మండలంలోని జె.వెంకటంపల్లి గ్రామంలో టీడీపీ నేతలు బరి తెగించారు. గ్రామ సమీపంలో రస్తా విషయంగా గొడవపడి నలుగురిపై కట్టెలతో విచక్షణారహితంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండ 6 సంవత్సరాల వయస్సున్న 30 దానిమ్మ చెట్లను నరికి వేశారు. బాధితులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన ఈశ్వరరెడ్డి, హనుమంతరెడ్డి అన్నదమ్ములు. వీరి పొలం నుంచి అదే గ్రామానికి చెందిన తమ పొలాలకు దారి ఉందని టీడీపీ నాయకులు సందీప్, వినయ్ దివాకరరెడ్డి గొడవ పడేవారు. ఈ విషయంపై ఐదేళ్లుగా కోర్టు పరిధిలో వివాదం నడుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతలు చెలరేగిపోయారు. ఈ క్రమంలో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మంగళవారం తోటలో హనుమంతరెడ్డి ఒక్కడే ఉన్నాడనే విషయం తెలుసుకుని వినయ్, సందీప్, దివాకర్రెడ్డి, ఈశ్వరరెడ్డి, కమలమ్మ, సువర్ణమ్మ చుట్టుముట్టి కట్టెలతో మూకుమ్మడిగా దాడి చేశారు. అక్కడికి సమీపంలో ఉన్న రంగారెడ్డి, ఆయన భార్య అనంతమ్మ అడ్డుకోబోవడంతో వారిపై కూడా దాడికి తెగబడ్డారు. అనంతరం 30 దానిమ్మ చెట్టను అడ్డంగా నరికి వేశారు. విషయం తెలుసుకున్న హనుమంతరెడ్డి సోదరుడు ఈశ్వరరెడ్డి అక్కడకు చేరుకోవడంతో ఆయనను సైతం చుట్టుముట్టి దాడి చేసి గాయపరిచారు. క్షతగాత్రులను స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా రాయదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న రంగారెడ్డిని మెరుగైన చికిత్స కోసం అనంతపురానికి తీసుకెళ్లారు. కాగా, ఘటనపై దాడి చేసిన వారితో పాటు బాధితులపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం వివాదస్పదమైంది. దాడికి పాల్పడిన టీడీపీ నేతలకు పోలీసులు అండగా నిలుస్తున్నారనే విమర్శలు గ్రామంలో వ్యక్తమయ్యాయి. -
ఆటో బోల్తా .. ఒకరి మృతి
కూడేరు: మండలంలోని జల్లిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురంలోని కోర్టు రోడ్డులో నివాసముంటున్న ఆనంద్, శివవేణి (28) దంపతులు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ నేపథ్యంలో ఇద్దరు పిల్లలు, మరో ఇద్దరు మహిళలతో కలసి ఆనంద్ దంపతులు, సొంత ఆటోలో పీఏబీఆర్ చూసేందుకు వెళ్లారు. అక్కడే భోజనం ముగించుకుని సరదాగా గడిపిన అనంతరం తిరుగు ప్రయాణమైన వారు జల్లిపల్లి సమీపంలోకి రాగానే ఉన్నఫళంగా రోడ్డుకు అడ్డంగా వచ్చిన గేదెను తప్పించే క్రమంలో ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఘటనలో శివవేణి అక్కడికక్కడే మృతి చెందింది. ఆనంద్కు తీవ్ర గాయాలయ్యాయి. పద్మ, సుంకమ్మ, ఇద్దరు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను హైవే అంబులెన్స్లో సర్వజనాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
ఇంకెన్నాళ్లు పస్తులుంచుతారు?
అనంతపురం అర్బన్: ‘శరీర కష్టంతో బతుకుతున్న మమ్మలి ఇంకెంత కాలం పస్తులుంచుతారు? నాలుగున్నర నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే కుటుంబాలను ఎలా పోషించుకోవాలి? కనికరం లేని ఈ ప్రభుత్వానికి మా ఉసురు తగలకపోదు’ అంటూ శ్రీరామరెడ్డి తాగునీటి సరఫరా పథకం కార్మిక కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. సమస్యలు పరిష్కరించాలంటూ కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం కలెక్టరేట్ ఎదుట కార్మికులు బైఠాయించి ధర్నా చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఎర్రిస్వామి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్, అధ్యక్షురాలు నాగమణి, నీటి ప్రాజెక్టు కార్మిక సంఘం కార్యదర్శి రాము మాట్లాడారు. నీటి ప్రాజెక్టు కార్మికుల సమస్యలను ప్రభుత్వం, అధికారులు విస్మరిస్తున్నారని మండిపడ్డారు. పరిష్కరించాలన్న చిత్తశుద్ధి ఏ ఒక్కరిలోనూ కనిపించడం లేదన్నారు. రెండు నెలలుగా సమ్మె చేస్తున్నా కనీసంగానూ స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఫేజ్–1 ట్రంక్లైన్ కార్మికులకు నాలుగున్నర నెలల వేతనాలు, 24 నెలల పీఎఫ్ చెల్లించాల్సి ఉందన్నారు. కార్మికుల వేతనం నుంచి కోత విధించిన రూ.2,500ను తక్షణమే చెల్లించాలన్నారు. ఫేజ్–4 రాయదుర్గం, కళ్యాణదుర్గం కార్మికులకు సంబంధించి గతంలో జరిగిన ఒప్పందాన్ని అమలు చేయాలన్నారు. కార్మికుల సంఖ్యను తగ్గించరాదని డిమాండ్ చేశారు. తాగునీటి సంస్థలకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. గ్రాట్యూటీ, ఈఎస్ఐ అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో నీటి ప్రాజెక్టు కార్మిక సంఘం నాయకులు నారేష్, నాగరాజు, రామాంజనేయులు, కార్మికుల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. శ్రీరామరెడ్డి తాగునీటి సరఫరా పథకం కార్మికుల ఆవేదన నాలుగున్నర నెలలుగా అందని వేతనం కుటుంబ సభ్యులతో కలెక్టరేట్ ఎదుట ధర్నా -
జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. నైరుతి దిశగా గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
తుంగభద్ర డ్యాం కళకళ సాక్షి, బళ్లారి: తుంగభద్ర డ్యాం కళకళలాడుతోంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తాగు, సాగు నీరందించే ఈ జలాశయంలో రోజు రోజుకూ నీటిమట్టం పెరుగుతోంది. ఎగువన పశ్చిమ కనుమలు, శివమొగ్గ జిల్లాలో జోరుగా వర్షాలు కురవడంతో డ్యాంకు నీటి ప్రవాహం పెరిగింది. జలాశయం సామర్థ్యం వంద టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 25 టీఎంసీలకు చేరినట్లు డ్యాం అధికారులు తెలిపారు. రాబోయే వారం రోజుల్లో మరో 15 టీఎంసీలు నీరు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దాడులకు దిగిన వారిపై చర్యలు తీసుకోండి ● ఎస్పీకి జర్నలిస్టుల ఫిర్యాదు అనంతపురం: ‘సాక్షి’ చానల్ డిబేట్లో జరిగిన సంఘటనను సాకుగా తీసుకుని ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులకు దిగిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సాక్షి బ్యూరో ఇన్చార్జ్ గుండం రామచంద్రా రెడ్డి, బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్, సాక్షి టీవీ కరస్పాండెంట్ శివా రెడ్డి కోరారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ పి. జగదీష్కు మంగళవారం ఫిర్యాదు అందజేశారు. డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణం రాజు తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించగా.. దాన్ని సాక్షి చానల్కు ఆపాదించడమే కాక ‘సాక్షి’ కార్యాలయంపై దాడికి దిగడం దారుణమన్నారు. ఈ ఘటన వెనుక రాజకీయ ప్రమేయం ఉందన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారించి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఉద్దేశపూర్వకంగానే జన సమీకరణ చేసి పత్రికా కార్యాలయాలపై దాడి చేయడం పత్రికా స్వేచ్ఛకు విఘాతం కల్పించడమేనని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. -
ఆర్డీటీ మూతపడితే చరిత్ర హీనులవుతారు
కుందుర్పి: రాయలసీమ ప్రాంతంలో పేదరికాన్ని రూపుమాపేందుకు 55 ఏళ్లుగా ఎన్నో విశిష్ట సేవలు అందిస్తున్న ఆర్డీటీని మూతపడేలా చేస్తే చరిత్ర హీనులు కాకతప్పదని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ (పీఆర్) విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి హెచ్చరించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల చాంబర్లలోని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలను తొలగించడంపై టీడీపీ నాయకులకు ఉన్న శ్రద్ధ ఆర్డీటీని కాపాడటంలో లేదని మండిపడ్డారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలనే డిమాండ్తో కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య చేపట్టిన పాదయాత్ర మంగళవారం కుందుర్పి మండలం కరిగానిపల్లికి చేరుకుంది. యాత్రకు రవీంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కరిగానిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతాంగానికి ఆర్డీటీ అన్ని రకాలుగా చేదోడు ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టక మునుపే జిల్లాలో ఆర్డీటీ ద్వారా మహోన్నత సేవా కార్యక్రమాలను డాక్టర్ ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ చేపట్టారన్నారు. అలాంటి సంస్థకు విదేశీ నిధులు అందకుండా గొంతు కోసే దుర్మార్గమైన చర్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెరతీశాయని మండిపడ్డారు. ఆర్డీటీ కోసం ప్రజలలో చైతన్యం తీసుకువచ్చేందుకు డాక్టర్ తలారి రంగయ్య చేపట్టిన పాదయాత్రను అడ్డుకునేందుకు టీడీపీ పెద్దలు విశ్వ ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటన్నారు.నిజంగా ఈ ప్రాంత అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే ఆర్డీటీని కాపాడుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో పాటు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, పార్టీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, రాయదుర్గం మున్సిపల్ మాజీ చైర్మన్ గౌని ఉపేంద్రారెడ్డి, సత్యనారాయణరెడ్డి, చంద్రశేఖర్రెడ్డి, ఎనుములదొడ్డి సర్పంచ్ విజయ్తో పాటు పలువురు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ పీఆర్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస -
‘జన్విత’లో మహిళ మృతి
అనంతపురం మెడికల్: నగరంలోని సూర్యనగర్లో ఉన్న జన్విత ఆస్పత్రిలో ఓ మహిళ మృతి వివాదాస్పదంగా మారింది. మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. వివరాలు.. అనారోగ్యంతో బాధపడుతున్న గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామానికి చెందిన హుస్సేన్బీ (48) ఈ నెల 7న జన్విత ఆస్పత్రిలో చేరింది. ఆమె గర్భసంచిలో గడ్డ ఉన్నట్లుగా గుర్తించిన వైద్యురాలు మరుసటి రోజున శస్త్రచికిత్స చేసి తొలగించారు. మంగళవారం కడుపు ఉబ్బరంగా ఉందంటూ బాధపడుతుండడంతో స్కాన్కు రెఫర్ చేశారు. కాగా, స్కాన్ తీయించుకుని ఆస్పత్రికి చేరుకోగానే హుస్సేన్బీ మృతి చెందింది. కార్డియాక్ అరెస్ట్తో మృతి చెందినట్లు అదే ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. కాగా, మృతికి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళనకు దిగడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సర్దిచెప్పారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబ దేవి సదరు ఆస్పత్రికి చేరుకుని మృతిపై ఆరా తీశారు. -
ఆపన్నహస్తం కోసం బాలుడి ఎదురుచూపు
పెద్దపప్పూరు: కూలి పనికి వెళితే తప్ప పూటగడవని నిరుపేద కుటుంబానికి పెద్ద కష్టమే వచ్చిపడింది. వివరాలు.. పెద్దపప్పూరు మండలం శింగనగుట్టపల్లికి చెందిన రామ్మోహన్, రేణుక దంపతులకు 12 ఏళ్ల వయసున్న కుమారుడు సంతోష్ ఉన్నాడు. చదువులో ప్రతిభ కనబరిచి మూడు నెలల క్రితం లేపాక్షిలోని గురుకుల పాఠశాలలో ఆరో తరగతిలో అడ్మిషన్ పొందాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో తల్లిదండ్రులు బెంగళూరులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు లింపోబ్లాస్టిక్ లుకేమియా అనే క్యాన్సర్తో బాధపడుతున్నట్లుగా నిర్ధారించి హైదరాబాద్లోని బసవతారకం ఆస్పత్రికి రెఫర్ చేశారు. ప్రస్తుతం ఆ బాలుడి చికిత్సకు రూ.15 లక్షలు అవసరం కాగా, గ్రామస్తులు రూ.2లక్షలను పోగు చేసి అందజేశారు. దాతలు సహకరిస్తే తమ కుమారుడి ప్రాణాలు దక్కుతాయని నిరుపేద తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఆపన్న హస్తమందించి ఆదుకోవాలని కోరుతున్నారు. మానవతావాదులు ఎవరైనా స్పందించి 63000 49974 నంబర్కు ఫోన్పే ద్వారా ఆర్థిక సాయం అందించాలని అభ్యర్థిస్తున్నారు. -
తూకంలో బురిడీ
● స్టోర్లలో బియ్యం నొక్కేస్తున్న కొందరు డీలర్లు ● రెండు కిలోల నుంచి ఐదు కిలోల మేర కోత ● అధికారుల పర్యవేక్షణ కరువు అనంతపురం అర్బన్: ప్రజా సంక్షేమానికి పాతర వేస్తూ, డీలర్ల స్వప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ బియ్యం, సరుకులు నొక్కుడుకు కూటమి ప్రభుత్వం రాచబాట వేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బియ్యం తూకం తక్కువగా ఇస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో 1,645 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. గతంలో వీటి పరిధిలో 405 ఎండీయూ వాహనాలు ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తూ వచ్చాయి. రేషన్ కార్డులకు బియ్యం, ఇతర సరుకుల కోటాను డీలర్ల నుంచి ఎండీయూ నిర్వాహకులు తీసుకుని ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసేవారు. ఈ విధానంలో డీలర్ కోటా మేరకు ఎండీయూకి బియ్యం కచ్చితమైన తూకం ఇచ్చేవారు. దీంతో డీలర్లకు బియ్యం, కంది పప్పు, చక్కెర మిగుల్చుకునే అవకాశం ఉండేది కాదు. కూటమి ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికి స్టోర్ ద్వారా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం డీలర్లు కార్డుదారులను తూకాల్లో బురిడీ కొట్టిస్తున్నారు. రెండు నుంచి 5 కిలోలు వరకూ బియ్యం తక్కువగా, మిగతా సరుకులు ఇవ్వకుండా మిగుల్చుకుంటున్నారు. అధికారులు స్టోర్లను తనిఖీ చేస్తారే తప్ప స్టోర్ నుంచి లబ్ధిదారులు తెచ్చే బియ్యం తూకం గురించి పట్టించుకోవడం లేదు. వాటిని తూకం వేస్తే డీలరు ఎన్ని కిలోలకు ఎన్ని కిలోలు తక్కువగా ఇస్తున్నారనేది బయపడుతుందని పలువురు చెబుతున్నారు. బ్లాక్మార్కెట్కు.. తూకం తేడాతో మిగుల్చుకున్న సరుకులను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. అనుమానం రాకుండా బియ్యాన్ని కొత్త సంచుల్లో ఉంచి తరలిస్తున్నారు. ఈ బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా కొందరు వ్యక్తులు ఉంటున్నారు. కిలో రూ.10 నుంచి రూ.12తో కొనుగోలు చేసి కర్ణాటక, ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. -
మహిళలపై అత్యాచారాలు, దాడులను ఉపేక్షించం
అనంతపురం: అనంతపురం రేంజ్ పరిధిలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు, దాడుల ఘటనలు పెరిగిపోతున్నాయని డీఐజీ డాక్టర్ షెముషి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు డీఐజీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. చిన్నపిల్లలు, మహిళలు, బలహీనులపై ఎవరైనా అత్యాచారాలు, దాడులకు పాల్పడితే ఉపేక్షించబోమని హెచ్చరించారు. పాశవిక ఘటనల్లో పాలుపంచుకునే వారికి ప్రభుత్వ పథకాలు, రాయితీలు అందకుండా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామన్నారు. రౌడీషీట్లు తెరిచి, జిల్లా నుంచి బహిష్కరించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కొంతమంది రౌడీషీటర్లు అమాయకులను బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
న్యాయం జరగకపోతే చావే దిక్కు
అనంతపురం: గిరిజన విద్యార్థిని దారుణ హత్యపై ప్రజాగ్రహం పెల్లుబికింది. యువతిని అతి కిరాతకంగా చంపిన వైనంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. రాస్తారోకోలు చేపట్టారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. దుండగులను కఠినంగా శిక్షించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.తోడుగా మేమున్నామంటూ..బాధిత గిరిజన కుటుంబానికి వైఎస్సార్ సీపీ బాసటగా నిలిచింది. తోడుగా మేమున్నామంటూ కదం తొక్కింది. సోమవారం నగరంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఎస్పీ కార్యాలయం మెయిన్ గేట్ ముందు రెండు గంటల సేపు ధర్నా చేశారు. హతురాలు తన్మయి తల్లిదండ్రులతో కలిసి జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, నగర మేయర్ వసీం సలీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా టాస్క్ఫోర్స్ సభ్యులు రమేష్ గౌడ్, పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే సహించేది లేదన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏమయ్యారంటూ నిలదీశారు. విద్యార్థిని తన్మయిని దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నరేష్ అనే వ్యక్తిపై అనుమానం ఉందని బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు. ఎస్పీకి వినతిపత్రం అందించేందుకు వెళ్తుండగా పోలీసులు గేట్లు మూసివేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, నేతలకు మధ్య తోపులాట జరిగింది. వైఎస్సార్సీపీ కండువా వేసుకున్న వారిని లోపలికి అనుమతించేది లేదంటూ అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశులు విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్తో వాదించారు. కలెక్టర్ కార్యాలయంలోకే పార్టీ కండువా వేసుకుని ప్రజల సమస్యలపై విన్నవించేందుకు వెళ్తామని పేర్కొనడంతో అనుమతించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి,పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు దాదు, నాయకులు శివ శంకర్ నాయక్,అనుబంధ విభాగాల అధ్యక్షులు అమర్ నాథ రెడ్డి,చంద్రశేఖర్ యాదవ్, శ్రీనివాస నాయక్, టీటీడీ మాజీ మెంబర్ అశ్వర్థ నాయక్, కార్పొరేటర్లు రహంతుల్లా, ఇషాక్, కమల్ భూషణ్, అనిల్ కుమార్ రెడ్డి, సాకే చంద్రలేఖ, శేఖర్ బాబు, శ్రీనివాసులు, విద్యార్థి నాయకులు మంజునాథ రెడ్డి, వెంకటేశ్, కైలాష్, రాహుల్ రెడ్డి, నిశాంత్రెడ్డి, అశోక్, శేఖర్, ప్రశాంత్,సాయి నితిన్, అంజన్ రెడ్డి, ఫయాజ్ బాషా, మహిళా నేతలు ప్రియాంక, భారతి, మహేశ్వరి, సల్మా, చంద్రగిరి రాధా, పార్వతి, సుజాత రెడ్డి, అంజలి, శోభ, రాంప్రసాద్, ఎంఎస్ఎస్ సాదిక్, సాకే కుళ్లాయిస్వామి, గోవింద్ నాయక్, గిరిజన విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నగర అధ్యక్షుడు శ్రీనివాసులు, గుజ్జల శివయ్య, ఆనంద్, సురేంద్ర, మోహన్ నాయక్, శివ, కావాడి వీర, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.సీపీఎం రాస్తారోకోఎస్పీకి వినతిపత్రం అందించిన అనంతరం తన్మయి తల్లి అరుణ, నాయకులు మీడియాతో మాట్లాడారు. తమ ఒక్కగానొక్క బిడ్డనూ పొట్టన పెట్టుకున్నారని అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మంగళవారం రాత్రి తన్మయి బయటకు వెళ్లింది. రాత్రంతా వెతికినా కనిపించలేదు. బుధవారం ఉదయం పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాం. అనుమానితుడి పేరు చెప్పి వాడి ఫోన్ నంబర్ కూడా ఇచ్చాం. వాడే మా అమ్మాయికి చివరి ఫోన్ చేశాడని చెప్పాం. అయినప్పటికీ ఘోరాన్ని ఆపలేకపోయారు. పోలీసుల వైఫల్యం వల్లే బిడ్డను కోల్పోయాం. నా బిడ్డ ఎంతటి వేదన పడిందో.. వాడు కూడా అలాగే నరకయాతన అనుభ వించాలి. మాకు న్యాయం జరగకపోతే చావే దిక్కు’ అంటూ అరుణ వాపోయారు.అనంతపురం అర్బన్: గిరిజన విద్యార్థిని తన్మయిని హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు సోమవారం స్థానిక టవర్క్లాక్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి రామిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వరుస ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. విద్యార్థిని తన్మయి హత్య, ఏడుగుర్రాలపల్లిలో బాలికపై అత్యాచారం అత్యంత దారుణమన్నారు. ఏడుగుర్రాలపల్లి ఘటనలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సింది పోయి బెదిరింపులకు పాల్పడడం చూస్తే పోలీసులు నిందితులకు అనుకూలంగా పనిచేస్తున్నారనేది స్పష్టమవుతోందన్నారు. ఎవరిని రక్షించడానికి ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖర్రెడ్డి, వలి, ప్రకాష్, మసూద్, ఇర్ఫాన్, లక్ష్మినరసమ్మ, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. -
మా బాధలు చూడండి
అనంతపురం అర్బన్: ‘సార్... మా బాధలు చూడండి. సమస్యల పరిష్కారం కోసం తిరుగుతూనే ఉన్నాం. వాటిని పరిష్కరించి మాకు న్యాయం చేయండి’ అంటూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అధికారులకు పలువురు విన్నవించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 563 వినతులు అందాయి. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో పాటు డీఆర్ఓ ఎ.మలోల, డిప్యూటీ కలెక్టర్లు రామకృష్ణారెడ్డి, ఆనంద్, వ్యవసాధికారి ఉమామహేశ్వరమ్మ అర్జీలు స్వీకరించారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో జేసీ సమీక్షించారు. -
మహిళల మాన ప్రాణాలకు రక్షణ కల్పించలేరా?
అనంతపురం కార్పొరేషన్: ‘బిహార్లోని చంబర్ లోయకంటే కూడా ఏపీలో మహిళలపై అత్యాచారాలు పెచ్చుమీరాయి. మహిళలు, యువతుల మాన ప్రాణాలకు రక్షణ కల్పించలేని నిస్సహాయ స్థితిలో పోలీసు శాఖ ఉంది’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. సోమవారం నగరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు, బాలికలు, చిన్నారులకు రక్షణ కల్పించకపోతే వైఎస్సార్ సీపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో యువత ఏదైనా పోస్టులు పెడితేనే చర్యలు తీసుకునే పోలీసులు.. మహిళల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదన్నారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే దారుణ హత్య.. అనంతపురంలోని రామకృష్ణ కాలనీకి చెందిన తన్మయి తప్పిపోయిందని ఈ నెల 3న బాధిత తల్లిదండ్రులు వన్టౌన్ పోలీసులను ఆశ్రయిస్తే వారు పట్టించుకోలేదన్నారు. ఈ క్రమంలోనే ఐదు రోజుల తర్వాత తన్మయి శవమై తేలిందన్నారు. పోలీసుల అలసత్వం కారణంగానే యువతి దారుణ హత్యకు గురైందని తెలిపారు. బాధిత యువతి తల్లిదండ్రులు అనుమానితుడి పేరు చెప్పినా అరెస్టు చేయకుండా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారన్నారు. రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో అధికార పార్టీకి చెందిన వారి ప్రమేయంతోనే బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని, దీనిపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం కావడంతో, దీన్ని ఆసరాగా తీసుకున్న మృగాళ్లు నిత్యం ఏదో ఒక చోట మహిళలు, బాలికలు, యువతులపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఏడాది కూటమి పాలనలో 188 అత్యాచార ఘటనలతో పాటు 15 మంది హత్యలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మిస్సింగ్లపై మాట్లాడండి పవన్.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడో తెలంగాణాలో అత్యాచారం జరిగితే ఏపీలో అటువంటి పరిస్థితులు తలెత్తకూడదని ‘దిశ’ పోలీసు స్టేషన్, యాప్ను ప్రవేశపెట్టి మహిళలకు అండగా నిలిచారని ‘అనంత’ గుర్తు చేశారు. అప్పట్లో పవన్ కల్యాణ్, చంద్రబాబు రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని నానా యాగీ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కేవలం అనంతపురం జిల్లాలోనే 72 మంది మిస్ అయ్యారని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీనిపై మాట్లాడాలని సూచించారు. ఆదాయాలకు జీ హుజూర్.. ఆదాయం తెచ్చిపెట్టే సెటిల్మెంట్లకు పోలీసులు జీ హుజూర్ అంటున్నారని ‘అనంత’ విమర్శించారు. జిల్లాలో ఎస్పీ, డీఎస్పీలు చెబితే వినే స్థితిలో సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు లేరని, ప్రజాప్రతినిధులే బాస్లన్న ధోరణితో నడుచుకుంటున్నారని దుయ్యబట్టారు. మేయర్ వసీం చాంబర్లో దౌర్జన్యం, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి చింతకుంట మధుపై దాడి, సచివాలయ ఉద్యోగిపై దాడిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు స్పందించడం లేదని, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా కేసు నమోదు చేయకపోతే ఎలాగని ప్రశ్నించారు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు ఐదేళ్లకోసారి మారతారని, డీజీపీ మరికొన్ని నెలల్లో పదవీ విరమణ పొందుతారని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఆయన హితవు పలికారు. మంత్రి బంధువులకే దిక్కులేదు.. ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ‘అనంత’ నగరంలో కూటమి ప్రజాప్రతినిధుల నిర్వాకంతో ఆందోళనకర వాతావరణం నెలకొందన్నారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి భరత్ బంధువులైన శ్రీనివాస్గుప్తా, వెంకటేష్ గుప్తాల స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారని సాక్షాత్తు బాధితులే చెప్పారన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధి, మరో నాయకుడు ఇద్దరూ నేర చరిత్ర కల్గిన వారని, ఎవరికి వారు కింగ్ మేకర్లుగా మారాలనుకుని ఫిర్యాదులు చేసుకున్నారన్నారు. విచ్చలవిడిగా మట్కా, ఎంఆర్పీ కంటే అధికంగా మద్యం విక్రయాలు, భూ దందాల ఘటనలు ఎక్కువయ్యాయన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లెమీద నరసింహులు, నాయకులు నార్పల సత్యనారాయణ రెడ్డి, మల్లెల వేణు, చామలూరు రాజగోపాల్, కార్పొరేటర్ శేఖర్బాబు తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపాటు -
బెల్టుషాపులు బంద్ చేయించి గ్రామంలోకి అడుగు పెట్టండి
గుంతకల్లు: గ్రామాల్లో బెల్టుషాపులు బంద్ చేయిస్తే తాము నాటుసారా తయారీని మానుకుంటామని ఎకై ్సజ్ పోలీసులతో గుంతకల్లు మండలం పులగుట్టపల్లి పెద్దతండా వాసులు వాగ్వాదానికి దిగారు. పులగుట్టపల్లి పెద్ద తండాలో ఆదివారం సాయంత్రం గుంతకల్లు ఎకై ్సజ్ అధికారులు వెంకటేష్, గోపాల్నాయక్, నాగరాజు తనిఖీలు చేపట్టారు. లాలూస్వామి నాయక్ ఇంట్లో పది లీటర్ల నాటుసారాను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో లాలూస్వామి నాయక్ వాగ్వాదానికి దిగాడు. అదే సమయంలో కృష్ణానాయక్, నెట్టప్పనాయక్, బాలాజీనాయక్తో పాటు సీఆర్పీఎఫ్ జవాన్ శేఖర్నాయక్ అక్కడకు చేరుకుని లాలూస్వామి నాయక్కు మద్దతుగా నిలిచారు. బెల్టుషాపులు బంద్ చేయించకుండా మరోసారి గ్రామంలోకి కాలుపెడితే పొలిమేర కూడా దాటలేరంటూ హెచ్చరించారు. ఘటనపై ఎకై ్సజ్ సీఐ శివసాగర్ను వివరణ కోరగా... జరిగిన ఘటన వాస్తవమేనని అంగీకరించారు. ఇప్పటికే లాలూస్వామి నాయక్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. మంగళవారం పూర్తి స్థాయిలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
జీవితంలో యోగా భాగం కావాలి
అనంతపురం కార్పొరేషన్: ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఓ భాగం కావాలని, తద్వారా ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ అన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా సోమవారం నగరంలోని వివిధ సచివాలయాల పరిధిలో ర్యాలీలు నిర్వహించారు. 65వ సచివాలయం పరిధిలో జరిగిన ర్యాలీలో కలెక్టర్ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, డిప్యూటీ కమిషనర్ డాక్టర్ పావని, ఎస్ఈ చంద్రశేఖర్, తహశీల్దార్ హరికుమార్, కార్పొరేటర్లు శేఖర్ బాబు, టీవీ చంద్రమోహన్ రెడ్డి, పలువురు యోగా గురువులు పాల్గొన్నారు. -
ఆర్డీటీ లేని ప్రాంతాన్ని ఊహించలేం
కుందుర్పి: ఆర్డీటీ లేని ప్రాంతాన్ని ఊహించలేమని కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చలేని పాలకులు.. ఆవు లాంటి ఆర్డీటీని జిల్లా నుంచి తరిమేసే కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. రంగయ్య చేపట్టిన ఆర్డీటీ పరిరక్షణ పాదయాత్ర సోమవారం ఆరో రోజు కుందుర్పి మండలం యర్రగుంటకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆర్డీటీనీ కాపాడుకుని తీరుతామని మరోసారి స్పష్టం చేశారు.ఈ ప్రాంతంలో ఆర్డీటీ సేవలు ఆగిపోతే జరిగే నష్టాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తనను అరెస్ట్ చేసినా... చైతన్యవంతులైన ప్రజలే ఆర్డీటీని కాపాడుకుంటారని అన్నారు. గ్రామానికి చెందిన చిట్టెమ్మ మాట్లాడుతూ.... తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, షుగర్ వ్యాధితో బాధపడుతున్న తాను ఇప్పటి వరకూ ఆర్డీటీ ఆస్పత్రిలోనే ఉచితంగా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇటీవల విదేశీ నిధులు రాకపోవడంతో ఆస్పత్రిలో మందుల కొరత కారణంగా డబ్బులు ఖర్చు పెట్టి బయట కొనాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీటీ లేకపోతే తన ఇద్దరు పిల్లల పెళ్లిళ్లు ఎలా చేయాలో అర్థం కావడం లేదని కన్నీరు పెట్టుకున్నారు. ● ఆర్డీటీ సేవల పునరుద్ధరణకు తలారి రంగయ్య సాగిస్తున్న పోరాటాన్ని అడ్డుకునేందుకు పోలీసులను పావుగా వాడుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ అన్నారు. పాదయాత్ర అపిలేపల్లికి చేరుకున్న సందర్భంగా ఆయన తలారి రంగయ్యను కలసి సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాటాడారు. ఆర్డీటీ లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా పనిచేస్తున్న ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శిలు తిప్పేస్వామి, తరిమెల గోకుల్రెడ్డి, పార్టీ నేత మాదినేని ఉమామహేశ్వరనాయుడు, ఎంపీపీ కమలానాగరాజు, పార్టీ మండల కన్వీనర్ హనుమంతరాయుడు, మున్సిపల్ చైర్మన్ రాజ్కుమార్, పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, అనంతపురం మార్కెట్ యార్డు మాజీ చైర్మెన్లు ఫయాజ్, సత్యనారాయణరెడ్డి, గార్లదిన్నె నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఆరో రోజు పాదయాత్రలో మాజీ ఎంపీ తలారి రంగయ్య -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం : కలెక్టర్
అనంతపురం రూరల్: యోగాతో మానసికోల్లాసంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని కలెక్టర్ వినోద్కుమార్ అన్నారు. ఆదివారం శిల్పారామంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ... ఈ నెల 14న అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి, నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, తహసీల్దార్ అందే హరికుమార్ తదితరులు పాల్గొన్నారు. నేడు యోగా ర్యాలీలు నిర్వహించండి అనంతపురం అర్బన్: యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లావ్యాప్తంగా సచివాలయాల పరిధిలో సోమవారం ఉదయం 7 నుంచి 8 గంటల వరకూ యోగాపై ప్రజలను చైతన్య పరిచేలా ర్యాలీలు నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. యోగా ర్యాలీ నిర్వహణపై కలెక్టర్ ఆదివారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. సచివాలయ ఉద్యోగులు తమ పరిధిలోని ఇంటింటికీ వెళ్లి ప్రజలకు యోగాపై చైతన్య పరిచి ర్యాలీలో పాల్గొనేలా చొరవ తీసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో యోగా ర్యాలీలు విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. -
ఉదిరిపికొండలో ట్యాంకర్లతో నీటి సరఫరా
కూడేరు: ఉదిరిపికొండలో ట్యాంకర్లతో అధికారులు నీటి సరఫరా చేపట్టారు. ‘తార స్థాయికి దాహం కేకలు’ అనే శీర్షికతో ‘సాక్షి’ దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనానికి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. కూడేరు మండల పరిధిలోని ఉదిరిపికొండలో రెండు ట్యాంకర్లు ఏర్పాటు చేసి మంచి నీటిని సరఫరా చేశారు. అదే విధంగా సత్యసాయి తాగునీటి ప్రాజెక్ట్ నుంచి కూడా నీటిని సరఫరా చేశారు. గ్రామంలో అదనంగా బోరు కూడా వేయిస్తామని అధికారులు తెలిపారు. 20 రోజులుగా ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఎట్టకేలకు నీరు సరఫరా కావడంతో సమస్య కొంత వరకు తీరింది. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. -
మట్టి లేదు.. పరీక్షలూ లేవు!
అనంతపురం అగ్రికల్చర్: ఈ సారి మట్టి నమూనాలు సేకరించలేదు. భూసార పరీక్షలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు 25,107 భూసార పరీక్షలు చేపట్టాలని కమిషనరేట్ నుంచి లక్ష్యం నిర్దేశించారు. ఈ క్రమంలో మే నెలాఖరు నాటికి 31 మండలాల నుంచి ఆర్ఎస్కేల వారీగా కేటాయింపుల మేరకు మట్టి నమూనాలు సేకరించాలని వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ ఏప్రిల్ 26న ఆదేశాలు ఇచ్చారు. జూన్ నుంచి విరామం లేకుండా మట్టి పరీక్షలు నిర్వహించి సకాలంలో రైతులకు హెల్త్కార్డులు ఇవ్వాలని భూసార పరీక్షా కేంద్రం ఏడీఏ, ఏఓలకు దిశా నిర్దేశం చేశారు. కానీ జూన్ మొదటి వారం ముగిసినా ఇప్పటి వరకు మండలాల నుంచి మట్టి నమూనాలు రాకపోవడం గమనార్హం. కేవలం ఆత్మకూరు మండలం నుంచి కొన్ని శ్యాంపిల్స్ వచ్చినట్లు ప్రయోగశాల అధికారులు తెలిపారు. ప్రయోగశాలలో మట్టి పరీక్షలు ఇంకా మొదలు పెట్టనేలేదు. 12 రకాల పరీక్షలు.. రైతులకు ఎరువుల ఖర్చు తగ్గించి లాభసాటి వ్యవసాయం కోసం మట్టి పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి ఆర్ఎస్కే పరిధిలో తప్పనిసరిగా నిబంధనల మేరకు మట్టి నమూనాలు సేకరించి పంపాలి. ఒక్కో మట్టి నమూనా నుంచి 12 రకాల పరీక్షలు నిర్వహించి పోషకాలు విశ్లేషిస్తారు. పీహెచ్ (భూమి స్థితి) శాతం, ఎలెక్ట్రికల్ కండక్టర్ (ఈసీ), ఆర్గానిక్ కర్బన్ (ఓసీ), నైట్రోజన్ (ఎన్), ఫాస్పరస్ (పీ), పొటాష్ (కే), సల్ఫర్, బోరాన్, ఐరన్, కాపర్, జింక్, మాంగనీస్ లాంటి స్థూలపోషకాలు (మ్యాక్రో న్యూట్రియంట్స్), అలాగే సూక్ష్మపోషకాలు (మైక్రో న్యూట్రియంట్స్) శాతం విశ్లేషిస్తారు. ఆ తర్వాత రైతులు సాగు చేసే పంటలను బట్టి వాడాల్సిన ఎరువులను హెల్త్కార్డు ద్వారా సిఫారసు చేస్తారు. అయితే, కీలకమైన వేసవిలో మట్టి సేకరణ జరగకపోవడంతో ఈ సారి మట్టి పరీక్షలకు ప్రాధాన్యత లేకుండా పోయింది. ఇప్పటికే వర్షాలు కురవడం, ఖరీఫ్ పంటల సాగుకు సమయం సమీపించడంతో భూసార పరీక్షల ద్వారా పెద్దగా ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. మరోవైపు ఇష్టారాజ్యంగా మట్టిని సేకరించి పంపడం, ప్రయోగశాలలో కూడా తూతూ మంత్రంగా పరీక్షలు చేపట్టడం వల్ల రైతులకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదనే విమర్శలూ లేకపోలేదు. ఈ ఏడాది 25,107 భూసార పరీక్షలు లక్ష్యం ఇప్పటి వరకు మట్టి నమూనాల సేకరణ శూన్యం -
‘కరూరు’లో కంది!
‘దుర్గం’లో వేరుశనగ.. అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో పంటల సాగులో ప్రాంతాల వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తోంది. భూమి నైజం, నీటి లభ్యతను బట్టి వివిధ రకాల పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జిల్లా వ్యాప్తంగా వేరుశనగ పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గినా కొన్ని మండలాల్లో సాగు అధికంగానే ఉంటోంది. ఇందులో రాయదుర్గం మండల వ్యాప్తంగా రైతులు ఏకంగా 13,953 హెక్టార్ల భారీ విస్తీర్ణంలో వేరుశనగ సాగు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఆ తర్వాత గుత్తిలో 11,357 హెక్టార్లు, గుమ్మఘట్టలో 11,034 హెక్టార్లు, గుంతకల్లులో 10,753 హెక్టార్లు, శెట్టూరులో 10,551 హెక్టార్ల భారీ విస్తీర్ణంలో వేరుశనగ సాగు చేయనున్నట్లు చెబుతున్నారు. ఈ ఖరీఫ్లో ఓవరాల్గా 1,82,004 హెక్టార్లలో వేరుశనగ సాధారణ సాగుగా లెక్క వేశారు. డి.హీరేహాల్, కణేకల్లు, వజ్రకరూరు, ఉరవకొండ, కళ్యాణదుర్గం, ఆత్మకూరు, కూడేరు, రాప్తాడు, కుందుర్పి, కంబదూరు మండలాల్లోనూవేరుశనగ సాగు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. పెద్దవడుగూరుదే అగ్రస్థానం.. ఇక నల్లరేగడి భూముల్లో ఖరీఫ్ పంటగా పత్తి పంట 44,001 హెక్టార్లలో సాగు చేస్తారని అంచనా వేశారు. ఇందులోనూ 15 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పత్తి సాగుతో పెద్దవడుగూరు మండలం అగ్రస్థానంలో నిలుస్తోంది. ఆ తర్వాత యాడికిలో 4,533 హెక్టార్లు, పామిడిలో 3,755 హెక్టార్లు, తాడిపత్రిలో 3,540 హెక్టార్లు, గుత్తి, డి.హీరేహాల్ మండలాల్లో 3,900 హెక్టార్లు చొప్పున పత్తి సాగు చేసే అవకాశం ఉంది. కణేకల్లు, బొమ్మనహాల్, విడపనకల్లు, పెద్దపప్పూరు, వజ్రకరూరు, శింగనమల, పుట్లూరు, యల్లనూరు తదితర మరో 22 మండలాల్లో కూడా పత్తి సాగవుతోంది. కందిపైనే మక్కువ.. గత ఖరీఫ్లో 1.03 లక్షల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో కంది సాగుతో చరిత్ర సృష్టించిన రైతులు ఈ ఏడాది కూడా కంది సాగుపైనే దృష్టి పెట్టారు. ఈ ఖరీఫ్లో 55,296 హెక్టార్లలో కంది సాగులోకి వస్తుందని అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా వజ్రకరూరు మండలంలో 8 వేల హెక్టార్లు, గుంతకల్లులో 5,500 హెక్టార్లు, కళ్యాణదుర్గంలో 4 వేల హెక్టార్లు, అనంతపురంలో 3,500 హెక్టార్లు, ఉరవకొండలో 3,400 హెక్టార్లు, బెళుగుప్పలో 3,300 హెక్టార్లు, రాప్తాడులో 3 వేల హెక్టార్లలో సాగులోకి వచ్చే అవకాశం ఉంది. జిల్లాలోని 31 మండలాల్లోనూ అంతర సాగుగా కంది పంట వేయనున్నట్లు సమాచారం. రెట్టింపు స్థాయిలో మొక్కజొన్న సాగు.. ఈ ఖరీఫ్లో మొక్కజొన్న పంట 14,563 హెక్టార్లలో సాగులోకి వచ్చే అవకాశాలున్నాయి. గతంతో పోల్చుకుంటే ఇది రెట్టింపు స్థాయిలో ఉండడం విశేషం. పెద్దపప్పూరులో అత్యధికంగా 2,300 హెక్టార్లు, యాడికిలో 1,500 హెక్టార్లు, పుట్లూరులో 1,500 హెక్టార్లు, కణేకల్లులో 1,200 హెక్టార్లు, గుమ్మఘట్టలో 1,100 హెక్టార్లలో రైతులు మొక్కజొన్న సాగు చేస్తారని అంచనా వేశారు. రాయదుర్గం, తాడిపత్రి, అనంతపురం సబ్ డివిజన్లలోనూ మొక్కజొన్న సాగు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే ఈ ఏడాది 16,293 హెక్టార్లలో ఆముదం సాగులోకి రానున్నట్లుగా అంచనా వేశారు. ఇందులో కళ్యాణదుర్గం మండలంలో అత్యధికంగా 2,300 హెక్టార్లు, కూడేరులో 2,200 హెక్టార్లు, ఆత్మకూరులో 1,800 హెక్టార్లు, బెళుగుప్పలో 1,700 హెక్టార్లతో పాటు మరో 20 మండలాల్లో ఆముదం సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారు. ఇక కణేకల్లులో ఎప్పటిలాగానే వరి సాగుపైనే రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఖరీఫ్లో మొత్తం 20 వేల హెక్టార్లలో వరి సాగులోకి రానున్నట్లుగా అధికారులు అంచనా వేయగా... ఇందులో అత్యధికంగా కణేకల్లు మంలడం 5 వేల హెక్టార్లు ఉండడం విశేషం. ఆ తర్వాత బొమ్మనహాల్ మండలంలో 3,400 హెక్టార్లు, గార్లదిన్నె మండలంలో 1500 హెక్టార్లు, శింగనమల మండలంలో 1,200 హెక్టార్లు, పామిడి మండలంలో 1,100 హెక్టార్లతో పాటు రాయదుర్గం, ఉరవకొండ, అనంతపురం సబ్డివిజన్ల పరిధిలోనూ వరి నాట్లు వేయనున్నారు. 14వేల హెక్టార్లలో మిగిలిన పంటలు.. అనంతపురం, యాడికి, పెద్దవడుగూరు, పామిడి, బొమ్మనహాల్ మండలాల్లో జొన్న పంట, డి.హీరేహాల్, పెద్దవడుగూరు మండలాల్లో కొర్ర, బ్రహ్మసముద్రంలో పెసర, పుట్లూరులో మినుము, నార్పలలో అలసంద లాంటి పంటలు కాస్త ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఉరవకొండ, రాయదుర్గం, గుత్తి సబ్ డివిజన్ల పరిధిలో ఎండుమిరప 18 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగులోకి రావచ్చని అంచనా వేశారు. జిల్లా వ్యాప్తంగా 14 వేల హెక్టార్లలో టమాట, రాయదుర్గం డివిజన్లో వెయ్యి హెక్టార్లలో ఉల్లి పంట సాగు చేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఖరీఫ్ పంటల సాగులో ప్రాంతాల వైవిధ్యం కళ్యాణదుర్గంలో అత్యధికంగా ఆముదం సాగు 15 వేల హెక్టార్లతో పత్తికి కేరాఫ్గా నిలిచిన పెద్దవడుగూరు మొక్కజొన్న సాగుకు ఖ్యాతిగాంచిన పెద్దపప్పూరు కణేకల్లులో వరి సాగే అత్యధికం -
వారిని ఎన్కౌంటర్ చేయాలి
● ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ అనంతపురం టవర్క్లాక్: రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో బాలికను బెదిరించి సామూహిక అత్యాచారంతో గర్భవతిని చేసిన కామాంధులను ఎన్కౌంటర్ చేయాలని, ఇందుకు అవసరమైతే చట్టంలో మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా ఆదివారం అనంతపురంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. దళిత బాలికను బెదిరించి ఆరు నెలల పాటు 17 మంది యువకులు అత్యాచారం చేశారని తెలిపారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించి, న్యాయం చేకూరేలా కామాంధులను బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సోమవారం ఏడుగుర్రాలపల్లిలో పర్యటించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి దళిత సంఘాలు తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు నరేష్ కొడవండ్ల, బీకేఎస్ ఆనంద్, ఓబులేసు, చంద్ర, వన్నూరుస్వామి, మదమంచి శ్రీనివాసులు, రామకృష్ణ, దావిదు, సూర్యనారాయణ, ఎర్రిస్వామి, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ● దళిత బాలికపై అత్యాచారం చేసి గర్భవతిని చేసిన వారికి ఉరి శిక్ష వేయాలని ప్రభుత్వాన్ని ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు నెరమెట్ట యల్లన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం అనంతపురంలోని అంబేడ్కర్ విగ్రహ వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారాన్ని చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్ఈఎఫ్ నాయకులు రామచంద్ర, కేపీ నారాయణస్వామి పాల్గొన్నారు. నేడు షైనింగ్ స్టార్స్ అవార్డుల పంపిణీ అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చాటి ‘షైనింగ్ స్టార్స్’గా ఎంపికై న విద్యార్థులకు సోమవారం అనంతపురంలోని మూడో రోడ్డులో ఉన్న జీఆర్ ఫంక్షన్ హాల్లో అవార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు డీఈఓ ప్రసాద్బాబు ఆదివారం వెల్లడించారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. జిల్లాలో 184 మంది పదో తరగతి విద్యార్థులు, 35 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు అవార్డులకు ఎంపికయ్యారు. ఒక్కొక్కరికి రూ.20 వేల నగదు పురస్కారం అందజేయనున్నారు. విద్యార్థులు ఆయా స్కూళ్ల యూనిఫాంతో ఉదయం 9 గంటల్లోపు వేదిక వద్దకు చేరుకోవాలి. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకూ భోజన వసతి కల్పించారు. ముఖ్య అతిథులుగా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ హాజరు కానున్నారు. తన్నుకున్న ‘తమ్ముళ్లు’గార్లదిన్నె: మండలంలోని కనుంపల్లికి చెందిన టీడీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర దాడులతో రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్తలు ప్రసాద్, కుమార్, వెంకటలక్ష్మికి అదే పార్టీకి చెందిన రాము, సంతోష్, ఇందు, నల్లమ్మతో విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని ఆదివారం ఇరు వర్గాలు రాళ్లు, కట్టెలతో దాడులు చేసుకున్నారు. ఘటనలో గాయపడిన ఇరు వర్గాల వారినీ స్థానికులు 108 ద్వారా సర్వజనాస్పత్రికి తరలించారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. డెడ్ స్టోరేజీకి ‘పీఏబీఆర్’ నీటి మట్టం కూడేరు: మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లో నీటి మట్టం గణనీయంగా తగ్గుతోంది. రిజర్వాయర్కు ఇన్ఫ్లో లేదు. ఉమ్మడి జిల్లాలోని తాగునీటి పథకాలకు, నీటి ఆవిరి, లీకేజీల కారణంగా రోజుకు 80 క్యూసెక్కుల వరకు నీరు బయటకెళుతోంది. దీంతో రోజురోజుకూ నీటి మట్టం తగ్గుతోంది. రిజర్వాయర్ వాస్తవ నీటిమట్టం 11.1 టీఎంసీలు కాగా.. ఆదివారం నాటికి 2.3 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో తాగునీటి కష్టాలు తప్పవని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
● ఇదేనా సంపద సృష్టి!
గుంతకల్లు: తాము అధికారంలోకి వస్తే సంపద సృష్టి చేసి ప్రజలకు పంపిణీ చేస్తామని హామీనిచ్చిన కూటమి పెద్దలు... అధికారం చేపట్టిన తర్వాత కంటికి కనిపించని దోపిడీకి తెరలేపారు. ఒకే దూరం.. ఒకే రకమైన ఆర్టీసీ బస్సులో ప్రయాణానికి రూ.10 వ్యత్యాసంతో చార్జీలు వసూలు చేయడమే ఇందుకు నిదర్శనం. గుంతకల్లుకు చెందిన ఓ ప్రయాణికుడు ఆదివారం ఉదయం పల్లె వెలుగు బస్సులో బురుజల మీదుగా 35 కి.మీ. దూరంలో ఉన్న పత్తికొండకు వెళ్లాడు. ఇందుకు గాను టికెట్ ధర రూ.40 చెల్లించాడు. అక్కడ పని ముగించుకున్న అనంతరం సాయంత్రం పల్లె వెలుగు బస్సులోనే బురుజల మీదుగా గుంతకల్లుకు చేరుకున్నాడు. ఇందుకు గాను టికెట్ ధర రూ.50 చెల్లించాడు. ఉదయం రూ.40 తీసుకున్నారు... సాయంత్రం రూ.50 తీసుకుంటున్నారు ఎందుకంటూ కండక్టర్ను నిలదీయడంతో ఉదయం 35 కి.మీ. దూరం ఉందని, సాయంత్రం 40 కి.మీ. దూరం ప్రయాణించాల్సి వస్తోందని కండక్టర్ తెలపడంతో ప్రయాణికులు అవాక్కయారు. ఈ వ్యత్యాసం వెనుక ఉన్న దోపిడీ ప్రభుత్వ పెద్దలకే తెలియాలని విమర్శలు గుప్పించారు. -
కష్టాల ‘యోగ’ం
బొమ్మనహాళ్: ప్రచార ఆర్భాటానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్న కూటమి సర్కార్ తీరుతో అధికారులకు ఇక్కట్లు తప్పడం లేదు. ప్రతి పనికీ సర్వేల పేరుతో ఇటు సచివాలయ సిబ్బందిని, అటు ప్రజలనూ ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో పని ఒత్తిడికి లోనైన సచివాలయాల కార్యదర్శుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. తాజాగా యోగ యాప్ అంటూ ఇంటింటికీ వెళ్లి సర్వే చేయాలంటూ జారీ అయిన ప్రభుత్వ ఆదేశాలతో సచివాలయ ఉద్యోగులకు కష్టాల ‘యోగ’ం రెట్టింపయింది. ఫేస్ రికగ్ననైజేషన్తో తిప్పలు సచివాలయ కార్యదర్శులు తమ పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లి యోగా యాప్ చూపించి వారు వస్తారో లేదో తెలుసుకుని వివరాలు నమోదు చేయాలి. హాజరయ్యేందుకు ఆసక్తి చూపితే వివరాల నమోదు సమయంలో వారి ఫోన్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేసి సబ్మిట్ చేయాల్సి దరఖాస్తు పూర్తి చేసినట్లే. ఇంత వరకూ అంతా బాగున్నా... నో ఆప్షన్ పెడితే... ఆ కుటుంబంలో ఎవరో ఒకరిది ఫేష్ రికగ్ననైజేషన్ లేదా బయోమెట్రిక్తో వివరాలు పూర్తి చేయాల్సి ఉంది. నో ఆప్షన్ కింద వివరాలు నమోదు చేయడం కార్యదర్శులకు చుక్కలు చూపిస్తోంది. ‘కార్యక్రమంలో పాల్గొనడం తమకు ఆసక్తి లేదంటే ఫొటో తీస్తారా? బయోమెట్రిక్ కావాలని అడుగుతారా? అసలు ఎందుకివ్వాలి? ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోండి?’ అంటూ గృహ యజమానులు అసహనం వ్యక్తం చేస్తుండడంతో వారికి నచ్చచెప్పుకోలేక కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. అసలే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేపర్లు, సోషల్ మీడియాల్లో వార్తలు వస్తున్నాయని, ప్రభుత్వం, పోలీసులు, అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్న తరుణంలో ఓటీపీలు అడగడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఓ వైపు శిక్షణ... మరోవైపు పోటీలు మూడు రోజుల క్రితం యోగాంధ్ర యాప్లో పంచాయతీల్లో యోగాసనాలపై మహిళలు, పురుషులకు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇచ్చినట్లు వివరాలు నమోదు చేయాలని నిబంధన పెట్టారు. ఒక వైపు మండల స్ధాయిలో మాస్టర్స్ ట్రైనర్స్తో శిక్షణా కార్యక్రమాలునిర్వహిస్తున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత సచివాలయ స్ధాయిలో యోగా తరగతులు నిర్వహించాలని అధికారులు ఇప్పటికే సూచించారు. ఇది పూర్తి కాకుండానే పంచాయతీల పరిధిలో పోటీలు ఎలా పెట్టాలో, శిక్షణ లేని వారు పోటీల్లో ఎలా పాల్గొంటారో అర్ధం కావడం లేదని సచివాలయ కార్యదర్శులు వాపోతున్నారు. యోగా డే యాప్ సర్వే పేరుతో కార్యదర్శులకు సర్కార్ టార్గెట్లు ఓటీపీలతో తప్పని ఇక్కట్లు ప్రజా సేవలకు దూరంగా... ఒక్కో సచివాలయ పరిధిలో వేలాది మందిని సర్వే చేసి యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటున్నదీ.. లేనిది వివరాలు నమోదు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుందో ఉన్నతాధికారులకే ఓ అంచనా లేదు. అన్నీ బాగుండి సర్వర్ మొరాయించకపోతే పూర్తి చేయడానికి ఒక్కో వ్యక్తి దగ్గర కనీసం 10 నిమిషాల సమయం పడుతోంది. దీంతో కార్యదర్శులు ప్రజా సేవలకు దూరంగా ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం సచివాలయల వద్దకు రేషన్కార్డులు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇలాంటి తరుణంలో సర్వేల పేరుతో కార్యదర్శులు అందుబాటులో లేకపోవడంతో అర్జీదారులు ఇబ్బందులు పడుతున్నారు. -
మాట తప్పిన కూటమి ప్రభుత్వం
అనంతపురం ఎడ్యుకేషన్: ఎస్జీటీల బదిలీలు మ్యానువల్ కౌన్సెలింగ్ ద్వారా చేపడతామన్న ప్రభుత్వం మాట తప్పిందంటూ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన గళం వినిపించారు. ఇందులో భాగంగా డీఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ గత నెల 19, 20 తేదీల్లో ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులతో ప్రభుత్వం జరిపిన చర్చల సందర్భంగా ఎస్జీటీలకు మాన్యువల్ కౌన్సెలింగ్ అమలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ఇప్పుడు వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించడం అన్యాయమన్నారు. వేలాది మంది బదిలీలు కావా ల్సిన నేపథ్యంలో వెబ్ఆప్షన్లు ఇవ్వడం ఇబ్బందిగా ఉంటుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెబ్ కౌన్సెలింగ్కు అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. ఎన్ని రోజులైనా నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ విషయమై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్ బాబును కలిసి వినతిపత్రం అందజేశారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని డీఈఓ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గౌడ్, ‘ఆప్టా’ జిల్లా అధ్యక్షులు గోపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం, యూటీఎఫ్ లింగమయ్య, గోవిందరాజులు, జయ చంద్రారెడ్డి, సుధాకర్, ఎస్టీయూ రమణారెడ్డి, రామాంజనేయులు, ఎ. హరి ప్రసాద్ రెడ్డి, ‘అపస్’ ఎర్రిస్వామి, ఏపీటీఎఫ్ వెంకటేశులు, సిరాజుద్దీన్, ఏపీటీఎఫ్ (1938) శ్రీనివాస్ నాయక్, శ్రీనివాసులు, విశ్వనాథ్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, పీఆర్టీయూ విష్ణు వర్ధన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, తిమ్మారెడ్డి కేశవరెడ్డి, హెచ్ఎం అసోసియేషన్ జయరామిరెడ్డి, ఎస్ఎల్ టీఏ శివానందరెడ్డి, పీడీ అసోసియేషన్ శ్రీనివాసులు, కేశవ మూర్తి, నరసింహారెడ్డి, ప్రభాకర్, ఎన్టీఏ జయరాం నాయక్, ఆర్జేయూపీ రామాంజనేయులు, బీసీటీఏ వరదరాజులు, గిరిజన ఉపాధ్యాయ సంఘం శివయ్య, రవీంద్ర నాయక్, పీఎస్హెచ్ం అసోసియేషన్ మర్రి స్వామి, ఆర్యూపీపీ ఎర్రి స్వామి, తులసి రెడ్డి, వైఎస్సార్ టీఏ నాయకులు వెంకటరమణ, రవీంద్రారెడ్డి రాధాకృష్ణారెడ్డి, గోవిందరెడ్డి, బీటీఏ ఓబులేసు, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఎస్జీటీల కౌన్సెలింగ్ మ్యానువల్గానే చేపట్టాలి అనంతపురం ఎడ్యుకేషన్: టీచర్ల బదిలీల్లో భాగంగా ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్ మ్యానువల్గానే చేపట్టాలని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయనను అనంతపురం నగరంలో పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఎస్జీటీల కౌన్సెలింగ్లో మ్యానువల్ పద్ధతి పాటించే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఎదురయ్యే సమస్యలను విన్నవించారు. ఈ విషయంపై ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, నాయకులు రాధాకృష్ణారెడ్డి, జీవీ రమణప్ప, గంగాధర్ రెడ్డి రవీంద్రరెడ్డి తదితరులు ఉన్నారు. -
హవ్వ.. ఇదేం లైనింగ్!
కూడేరు: జిల్లా రైతాంగం వద్దు బాబోయ్ అని మొత్తుకుంటున్నా చంద్రబాబు సర్కారు హంద్రీ–నీవా లైనింగ్ పనులకు శ్రీకారం చుట్టింది. తమ అనుయాయ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ప్రజా సంఘాలు, ప్రతిపక్షాల వినతులను సైతం పక్కకు పెట్టేసింది. పోనీ.. లైనింగ్ పనులనైనా సరిగా చేపడుతున్నారా.. అంటే అదీ లేదు. తూతూమంత్రంగా అక్కడి మట్టిని ఇక్కడ వేస్తూ నాసిరకంగా పనులు చేస్తున్నారు. కాంట్రాక్టర్ల ఘన కార్యంతో రైతులే కాకుండా సాధారణ ప్రజలు కూడా భవిష్యత్తులో ఇబ్బందులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కూడేరు మండలంలో చేపడుతున్న లైనింగ్ పనులను చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. ఇష్టం వచ్చినట్లుగా.. హంద్రీ–నీవా కాలువ లైనింగ్ పనులను కాంట్రాక్టర్లు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా చేపడుతున్నారు. బయట నుంచి ఎర్రమట్టి తెచ్చి లైనింగ్ చేయాల్సి ఉన్నా.. కాంట్రాక్టర్లు ఏకంగా కాలువ గట్టు మట్టినే జేసీబీతో తవ్వి పనులు చేస్తున్నారు. కూడేరు మండల పరిధిలోని తిమ్మాపురం పై భాగాన హంద్రీ–నీవా కాలువ 235.500 కి.మీ వద్ద ఇలా జరుగుతోంది. కాలువ గట్టు పైభాగాన ఓబిరెడ్డి కుంట ఉంది. వర్షం వస్తే ఎంఎంహళ్లి, పి.నారాయణపురం గ్రామాల వంకల ద్వారా నీరు వచ్చి ఈ కుంటలో చేరుతుంది. 2015–17 మధ్య కాలంలో కాలువ గట్టు కోతకు గురికాకుండా రాతి కట్టడం కట్టి, మధ్యలో నల్లమట్టి వేసి ఇరువైపులా ఎర్రమట్టి వేశారు. ప్రస్తుతం కాంట్రాక్టర్లు ఆ కాలువ గట్టు మట్టినే జేసీబీతో తవ్వి హంద్రీ–నీవా లైనింగ్ చేస్తున్నారు. దీంతో కాలువ గట్టుకు గుంతలు ఏర్పడ్డాయి. ఇంత జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఓబిరెడ్డి కుంట నుంచి వచ్చే నీటి ప్రవాహానికి కాలువ గట్టు దెబ్బతినే ప్రమాదముంది. అలా జరిగితే హంద్రీ–నీవా గుండా ప్రవహించే నీరు దిగువన ఉన్న తిమ్మాపురం గ్రామాన్ని ముంచెత్తే ప్రమాదముంది. ఉన్నతాధికారులైనా స్పందించి గట్టు మట్టిని తవ్వకుండా బయట నుంచి మట్టి తెచ్చేలా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇష్టారాజ్యంగా హంద్రీ–నీవా లైనింగ్ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు పట్టించుకోని అధికారులు మండిపడుతున్న ప్రజలు పర్యవేక్షణ లేకపోవడంతోనే.. అధికారులు సక్రమంగా పర్యవేక్షణ చేయకపోవడంతోనే కాంట్రాక్టర్లు నాసిరకంగా పనులు చేస్తున్నారు. ఎక్కడైనా కాలువ గట్టు దెబ్బతిని ఉంటే మట్టితో బాగు చేయాలి. కానీ కాంట్రాక్టర్లు గట్టుకు గుంతలు పెడితే భద్రత ఎలా ఉంటుంది? కాలువ పై భాగాన ఓబిరెడ్డి కుంట ఉంది. అందులోకి వర్షం నీరు పెద్ద ఎత్తున చేరి కాలువ వైపు ప్రవహిస్తుంది. జేసీబీతో గుంతలు పెట్టడంతో కాలువ గట్టు భవిష్యత్తులో కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. నీరు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి ప్రవేశిస్తే రైతులు నష్ట పోవాల్సి వస్తుంది. – మేరీ నిర్మలమ్మ, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు, కూడేరు మండలం కాంట్రాక్టర్ల లబ్ధికే పనులు అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లకు ఆర్థికంగా లబ్ధి చేకూర్చేందుకే లైనింగ్ పనులు చేస్తున్నట్లుగా ఉంది. పనులను నాణ్యతగా చేయకపోగా ఉన్న కాలువ గట్టును పాడు చేయడం అన్యాయం. బయట నుంచి మట్టి తెచ్చి లైనింగ్ పనులు చేయాలి. నాసిరకంగా పనులు చేసుకొని పోతే భవిష్యత్లో కాలువ గట్లు తెగి పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు దెబ్బతింటాయి. లైనింగ్ పనులతో భూగర్భ జలాలు అడుగంటి రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. – రాయుడు, జిల్లా కోశాధికారి, అఖిల భారత రైతు కూలీ సంఘం -
రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు
గుత్తి: గంజాయి అక్రమ రవాణాపై రైల్వే పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమంలో ఆదివారం గుత్తి రైల్వే స్టేషన్లో జీఆర్పీ ఎస్ఐ నాగప్ప ఆధ్వర్యంలో జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇకపై రోజూ తనిఖీలు చేపట్టనున్నామని, ఇందుకు ప్రయాణికులు సహకరించాలని ఈ సందర్భంగా ఎస్ఐ నాగప్ప విజ్ఞప్తి చేశారు. రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి గుత్తి: స్థానిక జీఆర్పీ పరిధిలోని జక్కలచెరువు – రాయలచెరువు రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం ఉదయం రైలు నుంచి జారిపడి ఓ ప్రయాణికుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ ఎస్ఐ నాగప్ప, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడిని తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం చౌదరిపల్లికి చెందిన వెంకటయ్యగా గుర్తించారు. రైలులో తలుపు వద్ద నిలబడి ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు జారి కింద పడినట్లుగా ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. మృతదేహాన్ని గుత్తిలోని ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. తాడిపత్రిలో పట్టపగలే చోరీతాడిపత్రిటౌన్: స్థానిక రూరల్ పీఎస్ పరిధిలోని సాయినగర్లో ఆదివారం పట్టపగలే చోరీ జరిగింది. సాయినగర్లో నివాసముంటున్న కుళ్లాయిరెడ్డి ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గుర్తించిన ఓ దుండగుడు వంట గదిలోని కిటికి గ్రిల్ తొలగించి లోపలకు ప్రవేశించాడు. అక్కడే ఉన్న తాళాలు తీసుకుని బీరువా తెరిచి అందులోని ఒక బంగారు చైన్, నల్లపూసల దండ, కమ్మలు మొత్తం ఎనిమిది తులాల బంగారంతో పాటు వెండి సామగ్రిని అపహరించాడు. ఆలస్యంగా ఇంటికి చేరుకున్న కుళ్లాయిరెడ్డి కుటుంబసభ్యుల నుంచి సమాచారం అందుకున్నయ సీఐ శివగంగాధరరెడ్డి అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. గంజాయి తరలింపుదారుల అరెస్ట్ అనంతపురం సిటీ: రైలులో గంజాయి తరలిస్తూ అనంతపురం రైల్వే స్టేషన్లో ఇద్దరు యువకులు రైల్వే పోలీసులకు పట్టుబడ్డారు. జీఆర్పీ ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఆర్పీఎఫ్ ఎస్ఐ పవన్కుమార్రెడ్డి తెలిపిన మేరకు... అందిన సమాచారం మేరకు ఆదివారం ఉదయం అనంతపురం రైల్వే స్టేషన్లో జీఆర్పీ, ఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. భువనేశ్వర్ నుంచి వచ్చిన రైలులో అనంతపురంలో దిగిన ప్రయాణికుల బ్యాగ్లు పరిశీలించారు. సమయంలో రెండు బ్యాగ్లో 24 కిలోల గంజాయిని గుర్తించి, సంబంధీకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వారిని అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో రాప్తాడు మండలం సీపీఐ కాలనీ, కంబదూరు కొట్టాలకు చెందిన బిస్కట్ ఫయాజ్, బిస్కట్ మహబూబ్పీరా ఉన్నారు. వీరు భువనేశ్వర్ నుంచి గంజాయి తెచ్చి ఎక్కువ ధరకు అమ్మేవారని విచారణలో నిర్దారణ అయినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.1.20 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు ఎస్ఐలు పవన్కుమార్రెడ్డి, వెంకటేశ్వర్లు తెలిపారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్గా డాక్టర్ సత్యనారాయణ అనంతపురం మెడికల్: ప్రభుత్వ వైద్య కళాశాల నూతన ప్రిన్సిపాల్గా డాక్టర్ కేవీవీ సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జీఎంసీలోని న్యూరో సర్జరీ విభాగాధిపతిగా ఉన్న ఆయనను తాత్కాలిక అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. అలాగే అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ కింద ఇక్కడ పని చేస్తున్న ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్యరావును ఒంగోలు ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్గా నియమించారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్గా ఉన్న డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావును కడప జీజీహెచ్కు బదిలీ చేశారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్గా ఇంకా ఎవరినీ నియమించలేదు. -
ఆర్డీటీకి అవాంతరాలు సృష్టించడం దారుణం
శెట్టూరు: ‘ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక రాష్ట్రంలోనూ ఆర్డీటీ సేవలు అందిస్తోంది. పేద ప్రజల బాగు కోసం 55 ఏళ్లుగా నిస్వార్థంగా పనిచేస్తోంది. అలాంటి సంస్థకు అవాంతరాలు సృష్టించడం దారుణం’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ కోసం మాజీ ఎంపీ తలారి రంగయ్య చేస్తున్న పాదయాత్రకు శెట్టూరు మండలం చెర్లోపల్లిలో ‘అనంత’ సంఘీభావం తెలి పారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. రంగయ్య పాదయాత్రను టీడీపీ నాయకులు అడ్డుకోవాలని చూస్తుండటం హేయమన్నారు. పేదల బాగు కోసం కృషి చేస్తున్న ఆర్డీటీకి బీజేపీ మతం రంగు పులిమిందన్నారు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలోనే ఆర్డీటీకి నోటీస్ ఇచ్చినట్లు గుర్తుచేశారు. లోకేష్ తన పాదయాత్ర సమయంలో మాంఛో ఫెర్రర్కు తప్పకుండా సాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. టీడీపీ ప్రజాప్రతినిధులు, బీజేపీ మంత్రి కూడా ఆ విషయాన్ని చెప్పినట్లు గుర్తుచేశారు. ఢిల్లీలో ప్రధాని మోదీని, కేంద్ర హోం మంత్రిని కలిసిన మంత్రి లోకేష్ ఆర్డీటీ గురించి ఎందుకు చెప్పలేదని నిలదీశారు. 3 నెలల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా కూటమి నేతలు పట్టించుకోవడం లేదని, వారి చేతకానితనం వల్లే ఆర్డీటీకి ఈ దుస్థితి దాపురించిందని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, పార్టీ నేత మాదినేని ఉమా మహేశ్వర నాయుడు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, ఎంపీపీ సోమనాథ్రెడ్డి, వైస్ ఎంపీపీ ముత్యాలు, పార్టీ మండల కన్వీనర్ ఎంఎస్ రాయుడుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. నేతల సంఘీభావం.. రంగయ్య పాదయాత్రకు ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మంగమ్మ, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా నేత చవ్వా రాజశేఖర్రెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు. పేదల అభ్యున్నతికి పాటుపడుతున్న ఆర్డీటీకి అండగా నిలవకపోతే కూటమి పాలకులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని వారు విమర్శించారు. -
ప్రతి విద్యార్థికీ మిత్ర కిట్లు అందించాలి
బత్తలపల్లి: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను ప్రతి విద్యార్థికీ అందేలా చొరవ తీసుకోవాలని ఉమ్మడి జిల్లా నోడల్ ఆఫీసర్, విద్యాశాఖ జేడీ సుబ్బారావు పేర్కొన్నారు.బత్తలపల్లిలోని ఎమ్మార్సీలో పంపిణీకి సిద్దంగా ఉన్న మిత్ర కిట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. అందిన పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బూట్లు, సాక్సులు, డిక్షనరీలు, బ్యాగులు, బెల్ట్ల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదన్నారు. నిర్ణీత సమయంలోపు కిట్ల పంపిణీ ప్రక్రియ పూర్తి కావాలని ఎంఈఓలను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈఓ సుధాకర్నాయక్, ఎమ్మార్సీలు గోవిందరెడ్డి, వెంకటరమణ, సునీత, మంజుల, ఉపాధ్యాయ సంఘాల నాయకులు బుక్కచెర్ల రామకృష్ణారెడ్డి, నరసింహమూర్తి, షరీఫ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. రెవెన్యూభవన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.ఈఏపీసెట్లో 15,137 మంది అర్హతఅనంతపురం ఎడ్యుకేషన్: ఏపీ ఈఏపీ సెట్లో 15,137 మంది అర్హత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో 10,659 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 4,478 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఆదివారం ఈ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి మొత్తం 16,658 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. 10,659 మంది అర్హత సాధించారు.అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో...అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి సంబంధించి మొత్తం 5,656 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో మొత్తం 4,478 మంది అర్హత సాధించారు.సత్తా చాటిన నితిన్ అగ్నిహోత్రిఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్లో సత్తా చాటిన ‘అనంత’ కుర్రాడు నితిన్ అగ్నిహోత్రి ఏపీఈఏపీసెట్లోనూ తనకు ఎదురులేదని నిరూపించాడు. 94.1576 మార్కులతో రాష్ట్రంలో 5వ ర్యాంకు సాధించి ప్రశంసలందు కున్నాడు. ఈ విద్యార్థి జేఈఈ మెయిన్స్లో 99.997 పర్సంటైల్, అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 183వ ర్యాంకు సాధించాడు. అనంతపురం నగరానికి చెందిన నితిన్ అగ్నిహోత్రి తండ్రి భూపతి శ్రీకాంత్ బిల్డర్ కాగా, తల్లి పాలసముద్రం కల్యాణి గృహిణి. ఈఏపీసెట్లో 5వ ర్యాంకు సాధించడం పట్ల సంతోషంగా ఉందని నితిన్ పేర్కొన్నాడు. అడ్వాన్స్డ్ ఫలితాల ఆధారంగా ఐఐటీ మద్రాస్లో జాయిన్ కావాలనుకుంటున్నట్లు వెల్లడించాడు.● ఏపీ ఈఏపీసెట్ అగ్రికల్చర్,ఫార్మసీ విభాగంలో అనంతపురం నగరానికి చెందిన కూరపాటి సైనారెడ్డి సత్తాచాటింది. 300 మార్కులకు 287 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 71వ ర్యాంకు దక్కించుకుంది. ఈ అమ్మాయి విజయవాడ నారాయణ కళాశాలలో ఇంటర్ చదివింది. తండ్రి కూరపాటి నరసింహారెడ్డి విద్యాశాఖలో పీడీగా పని చేస్తుండగా, తల్లి ధనలక్ష్మీ ఐసీడీఎస్లో సూపర్వైజర్గా పని చేస్తున్నారు.429 మందికి ఎస్ఏలుగా పదోన్నతిఅనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 429 మంది ఎస్జీటీలకు ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, మునిసిపల్ కార్పొరేషన్ యాజమాన్య పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ కేడర్ పదోన్నతులు లభించాయి. ఇందులో పీఎస్హెచ్ఎంలుగా 141 మంది (కన్నడ 1, తెలుగు 130, ఉర్దూ 10) ఉన్నారు. అలాగే ఎస్ఏ ఇంగ్లిష్ 46 మంది, హిందీ 01, తెలుగు 01, ఉర్దూ 01, బీఎస్ (తెలుగు) 38 మంది, బీఎస్ (ఉర్దూ) 04, గణితం (తెలుగు) 80 మంది, గణితం (ఉర్దూ) 05, పీడీ (తెలుగు) 06, పీఎస్ (కన్నడ) 01, పీఎస్ (తెలుగు) 46, పీఎస్ (ఉర్దూ) 01, సోషల్ (కన్నడ) 02, సోషల్ (తెలుగు) 50, సోషల్ (ఉర్దూ) ఆరుగురికి పదోన్నతి కల్పించారు. వీరితో పాటు ఇటీవల తప్పనిసరి, రిక్వెస్ట్ బదిలీలైన స్కూల్ అస్టెంట్లందరూ ఆదివారం వారి పాత పాఠశాలల్లో రిలీవ్ అయ్యారు. సోమవారం కొత్త స్కూళ్లల్లో రిపోర్ట్ చేసుకోనున్నారు.ఎస్జీటీలకు నేడు వెబ్ ఆప్షన్లుఎస్జీ టీచర్ల బదిలీల్లో భాగంగా సోమవారం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. మ్యానువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని టీచర్లు, సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం వెబ్ కౌన్సెలింగ్కే మొగ్గు చూపింది. ఆసక్తి ఉన్న వారు వ్యక్తిగతంగా వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. మరోవైపు ప్రతి మండల ఎమ్మార్సీల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లోకి వెళ్తే... సిబ్బంది వెబ్ ఆప్షన్లు నమోదు చేస్తారని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. -
తారస్థాయికి దాహం కేకలు
కూడేరు: మండల పరిధిలోని పీఏబీఆర్ వద్ద ఏర్పాటైన శ్రీరామిరెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ నుంచి సీపీడబ్ల్యూఎస్ పథకం ద్వారా మంచినీటి సరఫరా 8 రోజులుగా ఆగిపోయింది. ప్రాజెక్ట్లో మోటర్లకు ఏర్పాటు చేసిన ప్యానెల్ బోర్డు పని చేయకుండా పోయింది. కాంట్రాక్టర్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు మరమ్మతుల గురించి పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొలాలు, ఏటి వద్ద నుంచి ద్విచక్ర వాహనాలు, ఎద్దుల బండ్లు, ఆటోలు, ట్రాక్టర్లలో అవస్థలు పడుతూ నీటిని తెచ్చుకుంటున్నారు. కూడేరు మండలంలో సుమారు 42 వేల మందికి ‘సీపీడబ్ల్యూఎస్’ ద్వారా సరఫరా అయ్యే నీరే దిక్కు. ప్రాజెక్ట్ నుంచి పైపులైన్ ద్వారా రోజూ 3,053 కిలో లీటర్ల మంచి నీరు సరఫరా అవుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉరవకొండ మండలంలో కూడా కొన్ని గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారు. దాహార్తి తీర్చే ప్రాజెక్ట్ నుంచి ఉన్నట్లుండి నీటి సరఫరా ఆగిపోవడంతో ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. గత్యంతరం లేక సోమవారం కూడేరుకు చెందిన మహిళలు ఖాళీ బిందెలతో జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. శుక్రవారం ముద్దలాపురంలో ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు కూడా జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. శనివారం ఉదిరిపికొండ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. నీటి కోసం ప్రజలు ఆందోళన చేపడుతున్నా స్పందన కరువైంది. ఇప్పటికైనా తగిన చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు. వారం రోజులుగా నిలిచిన ‘సీపీడబ్ల్యూఎస్’ నీటి సరఫరా 28 గ్రామాల ప్రజలకు ఇక్కట్లు -
పట్టపగలే దోపిడీ
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజు నుంచి ‘తెలుగు తమ్ముళ్లు’ సహజ వనరులను కొల్లగొడుతున్నారు. అధికారమే అనుమతులుగా భావించి ప్రభుత్వానికి పైసా పన్ను చెల్లించకుండా దోచుకుంటున్నారు. ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబం పేరు చెప్పుకుంటూ దందా సాగిస్తున్నారు. రెవెన్యూ, పోలీస్, భూగర్భ గనులశాఖ అధికారులు ఆవైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలున్నాయి. కిందిస్థాయి ఉద్యోగులకు మామూళ్లు ముట్ట చెబుతున్నట్లు తెలిసింది. రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం కృష్ణమరెడ్డిపల్లి సమీపంలోని పెద్దకొండ, ఆలమూరు జగనన్న కాలనీ పక్కన ఉన్న ఎర్ర కొండ, నరసనాయనికుంట గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి ధ్వజస్తంభం గుట్ట (తాటిచెర్ల పొలం)ల్లో టీడీపీ నాయకుల ఎర్ర మట్టి అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఇప్పటికే కొండ గుట్టలను నామరూపాల్లేకుండా చేసి కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారు. తాజాగా పూల కుంట సమీపంలోని దుర్గం గ్రామానికి వెళ్లేదారిలో ఉన్న గుట్టను కొల్లగొడుతున్నారు. పూలకుంట ఊరి చరిత్రలో ఈ గుట్ట నుంచి ఇప్పటిదాకా కనీసం ఒక్కరాయిని కూడా ఎవరూ తరలించలేదు. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చిన అనతి కాలంలోనే ఎకరాల విస్తీర్ణంలో పెద్దపెద్ద గుంతలు తవ్వి వందలాది టిప్పర్ల మట్టిని తరలించారు. ‘పెద్దకొండ’ను కొల్లగొట్టారు.. ఇప్పటికే కృష్ణంరెడ్డిపల్లి సమీపంలోని చియ్యేడు పొలం 231 సర్వే నంబరులోని ‘పెద్దకొండ’ను కొల్లగొట్టారు. ఇక్కడి నుంచి రోజూ 80–90 ట్రిప్పుల దాకా మట్టిని తరలించి సొమ్ము చేసుకున్నారు. ఇందులో కృష్ణమరెడ్డిపల్లికి చెందిన తిరుపాలు, అనంతయ్య కీలకంగా వ్యవహరించినట్లు ఆ ప్రాంతమంతా కోడై కూస్తోంది. ఈ కొండతో పాటు చియ్యేడు పాఠశాల వద్ద, దర్గాకు వెళ్లేదారిలోనూ పెద్దపెద్ద గుంతలు పెట్టారు. చూస్తేనే భయపడేలా ఈ గుంతలు కనిపిస్తాయి. పత్రికల్లో వరుస కథనాలు రావడంతో ఇక్కడ తాత్కాలికంగా మట్టి తవ్వకాలకు బ్రేక్ వేశారు. తాజాగా పూలకుంట గుట్టపై కన్ను.. మట్టి తినడంతో ఆరితేరిన ‘తెలుగు తమ్ముళ్లు’ ఇటీవల పూలకుంట గుట్టపై కన్నేశారు. ఇక్కడి నుంచి రోజూ పట్టపగలే మట్టిని తరలిస్తున్నారు. నిత్యం లక్ష రూపాయల వరకు జేబుల్లోకి వేసుకుంటున్నట్లు తెలిసింది. కృష్ణమరెడ్డిపల్లికి చెందిన తిరుపాలు ఇందులో సూత్రధారి అనే ఆరోపణలున్నాయి. ఆయనతో పాటు వడ్డే రమేష్ అనే వ్యక్తి, పూలకుంట గ్రామానికి చెందిన వేమారెడ్డి జేసీబీలు పెట్టినట్లు తెలిసింది. పూలకుంట గ్రామంలో 12 అడుగుల రోడ్లున్నాయి. మట్టి టిప్పర్ల తాకిడితో ఎదురుగా ద్విచక్ర వాహనాలు వచ్చినా ఇబ్బంది పడే పరిస్థితి నెలకొంది. భారీ లోడుతో వెళ్లే టిప్పర్లతో గ్రామస్తులు రోజూ ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే పరిటాల కుటుంబం పేరు చెబుతుండడంతో ప్రశ్నించడానికి స్థానికులు భయపడుతున్నారు. కాగా ఈ ప్రాంతంలో వీఆర్ఏ పాత్రపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమదందా వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లి.. వీఆర్ఏను అప్రమత్తం చేసిన ప్రతిసారీ ఆయనే ముందుగా అక్రమార్కులకు ఉప్పందిస్తు న్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. పూలకుంటలో ఎర్రమట్టి దందాపై వివరణ కోరేందుకు భూగర్భ గనుల శాఖ డీడీ గ్రంధి వెంకటేశ్వర్లును ఫోన్లో సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు. పూలకుంట టు అనంతపురం యథేచ్ఛగా ఎర్రమట్టి అక్రమ రవాణా రోజూ రూ. లక్షకు పైగా ఆదాయం ప్రధాన సూత్రధారి కృష్ణమరెడ్డిపల్లి వాసి ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబం పేరు చెప్పుకుంటూ దందా మామూళ్ల మత్తులో రెవెన్యూ, పోలీస్, భూగర్భ గనులశాఖ అధికారులు -
దళిత ఎమ్మెల్యేల నోరు మూగబోయిందా?
అనంతపురం ఎడ్యుకేషన్:‘రామగిరి మండలంలోని గ్రామంలో దళిత మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో వాస్తవాలు వెలుగులోకి వస్తోంటే ఇది అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతున్న రాష్ట్రమా... లేక రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతున్న దుర్మార్గపు ప్రపంచమా అనేది తెలియడం లేదు. ఇంత జరుగుతున్నా జిల్లాలోని దళిత ఎమ్మెల్యేలు, నాయకులు ఎందుకు మాట్లాడడం లేదో అర్థం కావడం లేదు. వారి నోరు మూగబోయిందా.. మాట గొంతుదాటి బయటకు రావడం లేదా’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ప్రశ్నించారు. స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామగిరి మండలం పరిటాల కుటుంబం కబంధహస్తాల్లో ఉందన్నారు. బాలికపై అఘాయిత్యం జరిగిన రామగిరి మండలంలోని గ్రామం పరిటాల పెత్తనంతో 40 ఏళ్లుగా ప్రజాస్వామ్యం చూడలేదన్నారు. ‘అక్కడ పరిటాల వారు చెప్పిందే వేదం.చేసిందే శాసనం.అదే చట్టం’ అన్నారు. గ్రామంలో పరిటాల రాజ్యాంగం అమలవుతోందన్నారు. ఆ గ్రామంలో సూడో నక్సలైట్లు, కిరాయి హత్యలు చేసేవారు, రౌడీషీటర్లంతా పరిటాల సైన్యమన్నారు. ఇలాంటి గ్రామంలో ఒక దుర్మార్గుడు మైనర్ బాలికను బెదిరించి లొంగ దీసుకుని వీడియో తీసి... ఆ వీడియోను బయట పెడతానంటూ బెదిరించి బలత్కారం చేశాడన్నారు. తర్వాత బ్లాక్మెయిల్ చేసి 14 మంది ఆ బాలికపై అత్యాచారం చేశారన్నారు. చివరకు వీడియో తీసిన వాడి తండ్రి కూడా బాలికపై కన్నేసి బలాత్కరించాడని వాపోయారు. ఏడాదికాలంగా బాలికను చిత్రవధకు గురి చేశారన్నారు. ఆ బాలిక గర్భం దాల్చిన ఆర్నెల్ల తర్వాత ఆనోట, ఈనోట పడి ‘సాక్షి’ మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలిసిందన్నారు. వాస్తవాలు వెలుగులోకి వస్తుంటే సభ్యసమాజం సిగ్గుపడే విధంగా ఉందన్నారు. ఒక మహిళ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం, ఒక మహిళ ఎస్పీగా ఉన్న జిల్లాలో మైనర్ బాలికపై అత్యంత దారుణంగా నెలల తరబడి అత్యాచారం జరిగితే ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. చీమ చిటుక్కుమన్నా పరిటాల కుటుంబానికి సమాచారం చేరవేసే గ్రామస్తులు ఇంతటి దారుణ ఘటన గురించి చెప్పకుండా ఉంటారా అనే అనుమానం వ్యక్తం చేశారు. కీచకుల మెడలో చెప్పుల హారాలు వేయించి ఊరేగించేలా చూడాలని కోరారు. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్కు ఈ ఘటన తెలీకుండా ఉంటుందా అని ప్రశ్నించారు. మరి ఇన్ని రోజులు ఎందుకు బయట పెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసుపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, గోవిందరెడ్డి, పెన్నోబులేసు, ఆలమూరు ఓబులేసు, మీనుగ నాగరాజు, సాకే వెంకటేష్, విశ్వనాథరెడ్డి, ఈశ్వరయ్య పాల్గొన్నారు. సభ్యసమాజం సిగ్గుపడేలా దళిత మైనర్ బాలికపై అత్యాచారం ఇంత జరిగినా దళిత ప్రజాప్రతినిధులు మిన్నకుండిపోవడం అన్యాయం ఎస్పీ గారూ.. నిష్పక్షపాతంగా విచారించండి రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
ప్రమోషన్లపై అనాసక్తి
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపాలిటీ, మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్ల పోస్టులకు పదోన్నతులు తీసుకునేందుకు ఎస్జీటీలు ఆసక్తి చూపలేదు. వాస్తవానికి ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిలిచినా... చాలా సబ్జెక్టులకు ఒక్కరు కూడా హాజరుకాకపోవడం విశేషం. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయి శుక్రవారం సాయంత్రం మొదలైన పదోన్నతుల కౌన్సెలింగ్ శనివారం ఉదయం 10 గంటల వరకు సాగింది. ఇందులో జిల్లా పరిషత్ పాఠశాలలకు సంబంధించిన సోషల్ సబ్జెక్టులో 44 ఖాళీలుంటే కేవలం నలుగురే పదోన్నతి తీసుకున్నారు. అలాగే పీఎస్ హెచ్ఎం పోస్టులకు సంబంధించి కూడా 45 ఉంటే కేవలం ఐదుగురు విల్లింగ్ ఇచ్చారు. చాలా పోస్టులు మిగిలిపోవడంతో ఆర్జేడీ శామ్యూల్ రాష్ట్ర అధికారులతో మాట్లాడి స్పష్టత తీసుకున్నారు. ఆసక్తి ఉంటే వీరి తర్వాత వారిని కూడా పిలిచేలా అనుమతులు పొందారు. ఈ క్రమంలో ఆయా సబ్జెక్టులకు అర్హులైన ఎస్జీటీలకు ఎంఈఓల ద్వారా సమాచారం అందించి సాయంత్రం 4 గంటలకు కౌన్సెలింగ్కు హాజరుకావాలని సూచించారు. సాయంత్రం 5.30కు ఆ రెండు కేడర్ పోస్టులకు కౌన్సెలింగ్ నిర్వహించగా... సోషల్లో ఎస్సీ కోటాలో కొన్ని తప్ప తక్కిన అన్ని పోస్టులూ భర్తీ అయ్యాయి. పీఎస్హెచ్ఎం పోస్టులకు రాత్రి 11 గంటల సమయానికి 16 మంది పదోన్నతులు పొందారు. బదిలీ అయిన ఎస్ఏల వివరాలు లేవట! స్కూల్ అసిస్టెంట్ల కేడర్కు సంబంధించి అన్ని సబ్జెక్టుల్లోనూ తప్పనిసరి, రిక్వెస్ట్ బదిలీలు పూర్తయ్యాయి. ఉత్తర్వులు కూడా జనరేట్ అయ్యాయి. ఇవన్నీ శుక్రవారం తెల్లవారుజామునే పూర్తయ్యాయి. అయితే జిల్లాలో ఏ సబ్జెక్టులో ఎంతమంది బదిలీ అయ్యారనే సమాచారం శనివారం రాత్రి వరకు విద్యాశాఖ అధికారులు చెప్పకపోవడం విశేషం. ఈ వివరాలు ఇంకా తమకు రాలేదంటూ డీఈఓ చెప్పారు. కాగా స్కూల్ అసిస్టెంట్ కేడర్ టీచర్లందరూ శనివారం రిలీవ్ అయ్యి ఆదివారం కొత్తస్థానాల్లో చేరాలనే ఆదేశాల్లో మార్పు చేశారు. పాతస్థానాల్లో ఆదివారం (నేడు) రిలీవ్ అయ్యి సోమవారం కొత్త స్కూళ్లల్లో చేరాలంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పదోన్నతులు తీసుకునేందుకు ముందకురాని ఎస్జీటీలు 44 ‘సోషల్’ పోస్టులకు నలుగురే ఆసక్తి పీఎస్హెచ్ఎం పోస్టుల్లోనూ అదే తీరు నేడు ఎస్జీటీలకు వెబ్ ఆప్షన్లు ఎస్జీ టీచర్ల బదిలీలకు ఆదివారం వెబ్ ఆప్షన్లు పెట్టుకోనున్నారు. మ్యానువల్గా కాకుండా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ క్రమంలో ఎంఈఓల కార్యాలయాల్లో 10 కంప్యూటర్లు సిద్ధంగా ఉంచుకోవాలంటూ రాష్ట్ర అధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఆయా మండలాల పరిధిలోని టీచర్లందరికీ అక్కడే వెబ్ ఆప్షన్లు పెట్టుకునే సదుపాయం కల్పించనున్నారు. ఎంఈఓ కార్యాలయాల్లో సరైన వసతి లేకపోతే సమీపంలోని స్కూల్లో ఏర్పాటు చేసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈక్రమంలో ఎంఈఓలందరూ అప్రమత్తమయ్యారు. మరోవైపు ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్ మ్యానువల్గా నిర్వహించాలంటూ ఆదివారం ఐక్య ఉపాధ్యాయ సంఘాల వేదిక డీఈఓ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చింది. -
‘షైనింగ్ స్టార్స్’కు ఏర్పాట్లు చేయండి
● అధికారులకు కలెక్టర్ ఆదేశం అనంతపురం అర్బన్: ‘షైనింగ్ స్టార్స్’ కార్యక్రమాన్ని ఈ నెల 9న నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘షైనింగ్ స్టార్స్’ కింద 184 మంది పదో తరగతి, 35 మంది ఇంటర్ విద్యార్థులను ఎంపిక చేశారన్నారు. వీరందరికీ మెడల్, సర్టిఫికెట్, రూ.20 వేల నగదు అందజేయాలన్నారు. కార్యక్రమ నిర్వహణకు వేదిక గుర్తించి ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఈనెల 12కు ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు కొత్తగా అనుమతులు మంజూరు చేసి ప్రారంభోత్సవాలు చేపట్టాలన్నారు. న్యూరో సర్జరీ విభాగానికి నాలుగు పీజీ సీట్లు అనంతపురం కార్పొరేషన్: నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని న్యూరో సర్జరీ విభాగానికి నాలుగు పీజీ సీట్లు మంజూరు చేస్తూ ఎన్ఎంసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్య రావు హర్షం వ్యక్తం చేశారు. రోగులకు మరింత నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. ఈ సంవత్సరం నుంచే పీజీ సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ నెల నుంచి విద్యార్థులు చేరతారన్నారు. నూతన ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుందన్నారు. రానున్న ఏడాది పీడియాట్రిక్ సర్జరీలోనూ పీజీ సీట్లు వస్తాయని ప్రిన్సిపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో వైద్య కళాశాల ఏ గ్రేడ్ పరిధిలోకి వస్తుందని, ఆ దిశగా అంకితభావంతో పని చేస్తామని తెలిపారు. కాగా, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అప్పటి స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రత్యేక చొరవతో వైద్య కళాశాల బలోపేతమైంది. ఏళ్ల తరబడి ఆచరణకు నోచుకుని సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. న్యూరో, కార్డియోలతో కలుపుకుని 7 స్పెషాలిటీ వైద్య సేవలు ప్రజలకు అందేలా చర్యలు చేపట్టారు. దీంతో పాటు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్య రావు చొరవతో వైద్య కళాశాలకు మహర్దశ పట్టింది. ఇప్పటి వరకు 120కి పైగా పీజీ సీట్లు వచ్చాయి. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల విడుదల అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మొదటి సంవత్సరంలో అనంతపురం జిల్లా రాష్ట్రంలో 14వ స్థానంలో నిలవగా, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 7వ స్థానం దక్కించుకుంది. మొదటి సంవత్సరం ఫలితాల్లో 7,404 మంది విద్యార్థులకు గాను 3,336 మంది (45 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 4,545 మంది విద్యార్థులకు గాను 3,128 మంది (69 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ ఫలితాలకు సంబంధించి మొదటి సంవత్సరంలో 925 మంది విద్యార్థులకు గాను 375 మంది (41 శాతం) ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 21వ స్థానంలో నిలవగా, ద్వితీయ సంవత్సరంలో 428 మందికి గాను 275 మంది 64 శాతం ఉత్తీర్ణతతో 14వ స్థానంలో నిలిచింది. -
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం
కూడేరు: ఎన్సీసీ నగర్ సమీపాన అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కన చెట్ల పొదల్లో శనివారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో సీఐ రాజు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. ముఖం భాగాన్ని పురుగులు తినేయడంతో గుర్తు పట్టలేని విధంగా ఉంది. శరీరంపై ఎక్కడా గాయాలు లేవు, ఆమె చుట్టూ ఎలాంటి రక్తపు ఆనవాళ్లు లేవు. మహిళ ఎరుపు, తెలుపు రంగుతో కూడిన పంజాబీ డ్రస్ ధరించి ఉంది. 25–30 ఏళ్లలోపు వయసు ఉండొచ్చు. మహిళ మృతికి సంబంధించి పోలీసులకు ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలూ లభించలేదు. మృతదేహాన్ని బట్టి చూస్తే నాలుగైదు రోజులు క్రితం చనిపోయి ఉండవచ్చని పోలీసులు అంచనాకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. మహిళ ఆత్మహత్య చేసుకుందా? లేదా ఎక్కడైన హత్య చేసి మృతదేహాన్ని ఇక్కడ పడేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘర్షణలో యువకుడి మృతి గార్లదిన్నె: ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందారు. పోలీసులు, 108 సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెనకచెర్ల గ్రామానికి చెందిన దివాకర్, యశ్వంత్ శనివారం ఘర్షణ పడ్డారు. కోపోద్రిక్తుడైన దివాకర్ కట్టెతో దాడి చేయడంతో యశ్వంత్ (18) స్పృహతప్పి పడిపోయాడు. స్థానికుల సమాచారంతో 108 వాహన సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని యశ్వంత్ను అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి యశ్వంత్ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘర్షణకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
సెమీస్కు జూనియర్ మహిళల హాకీ జట్టు
ధర్మవరం: భీమవరంలో జరుగుతున్న 15వ రాష్ట్రస్థాయి జూనియర్ మహిళల హాకీ పోటీల్లో శ్రీసత్యసాయి జిల్లా మహిళల హాకీ జట్టు సెమీ ఫైనల్కు చేరిందని హాకీ జిల్లా ప్రధానకార్యదర్శి సూర్యప్రకాష్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ కోచ్ హసేన్ తెలిపారు. జిల్లా మహిళల హాకీ జట్టు క్రీడాకారులు శనివారం నెల్లూరు జిల్లా జట్టుపై 11–0 గోల్స్ తేడాతో గెలుపొందారు. జట్టులో నసీమా మూడు గోల్స్, నవ్యశ్రీ మూడు గోల్స్, మాధురి బాయి రెండు గోల్స్, పవిత్ర, వైష్ణవి, వర్ష ఒక్కొక్క గోల్ వేసి రెండో విజయాన్ని కై వసం చేసుకున్నారు. మధ్యాహ్నం మూడో లీగ్ మ్యాచ్లో తిరుపతి జిల్లాతో 3–1 గోల్స్ తేడాతో గెలుపొంది సెమీ ఫైనల్కు చేరుకున్నారు. సెమీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం ఉదయం అనంతపురం జిల్లా జట్టుతో తలపడనుందని తెలిపారు. క్రీడాకారుల వెంట మేనేజర్ అరవింద్గౌడ్, కోచ్ మారుతికుమార్ ఉన్నారు. -
దర్శన టికెట్లపై అర్చకుల అభ్యంతరం
గుత్తి: తొండపాడు బొలికొండ రంగనాఽథస్వామి దర్శనానికి టికెట్ల విధానాన్ని ప్రవేశపెట్టడంపై అర్చకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేవాలయం వద్ద శనివారం అర్చకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు, భక్తులు అధికంగా దైవ దర్శనానికి వస్తారన్నారు. కరువుకు నిలయమైన ఇలాంటి ప్రాంతంలో దైవ దర్శనానికి టికెట్ల విధానం అమలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అదీగాక అధికారులు ఏకపక్షంగా టికెట్ల విధానం అమలు చేయడానికి సిద్ధమయ్యారన్నారు. కనీసం అర్చకులు, గ్రామ పెద్దలను కూడా సంప్రదించలేదన్నారు. వెంటనే టికెట్ల విధానం యోచనను విరమించుకోవాలన్నారు. కట్నం కోసం వేధింపులు యాడికి: అదనపు కట్నం కోసం భర్త, మామ వేధిస్తున్నారని ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. చందన గ్రామానికి చెందిన దళవాయి ఐశ్వర్యకు నార్పల మండలం కేశేపల్లికి చెందిన కుళ్లాయప్ప కుమారుడు విష్ణువర్దన్తో ఏడాది కిందట ప్రేమ వివాహమైంది. అయితే గత కొంతకాలంగా భర్తతో పాటు మామ కట్నం తేవాలని వేధిస్తుండటంతో భరించలేకపోయిన ఐశ్వర్య పుట్టింటికి వచ్చేసింది. బంధువుల ద్వారా పంచాయితీ చేసినా సమస్య పరిష్కారం కాకపోవడం, వేధింపులు మళ్లీ పెరగడంతో ఐశ్వర్య శనివారం యాడికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
విద్యుత్ షాక్తో కాంట్రాక్ట్ కార్మికుడికి తీవ్రగాయాలు
గుంతకల్లు: పట్టణంలోని డీ–1 కార్యాలయంలో పోల్ టు పోల్ కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్న మస్తాన్వలి విద్యుత్ షాక్తో తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. శనివారం పాతగుంతకల్లులోని బీసీ హాస్టల్ సమీపాన విద్యుత్ స్తంభాల్లో ఏర్పడిన విద్యుత్ సమస్యను పరిష్కారించడానికి లైన్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లుతో మస్తాన్వలి ఎల్సీ తీసుకున్నాడు. అనంతరం పోల్ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో మస్తాన్వలి కుడి చేతి రెండు వేళ్ల తెగిపోగా.. కుడికాలుకు పెద్ద గాయమైంది. వెంటనే అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఏడీ నాగేంద్ర మస్తాన్వలిని పరామర్శించి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకోండి పోల్ టు పోల్ కాంట్రాక్ట్ కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విద్యుత్ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు శ్రీనివాసులు, పట్టణ కార్యదర్శి మారుతీప్రసాద్ డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మస్తాన్వలిని వారు పరామర్శించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గతంలో కూడా రాజా అనే కార్మికుడు విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రమాదాలకు గురై చాలామంది కార్మికులు మంచానపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాలికపై అత్యాచారం అమానుషం అనంతపురం అర్బన్: రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో దళిత బాలికపై జరిగిన అత్యాచారం అమానుషమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్ అన్నారు. శనివారం అనంతపురంలోని గణేనాయక్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఘటనకు కారణమైన వారు ఏ పార్టీకి చెందినవారైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత బాలిక కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. పేదరికాన్ని, సామాజిక వెనుకబాటును అవకాశంగా తీసుకుని దళిత బాలికపై ఆరు నెలలుగా 14 మంది అత్యాచారానికి పాల్పడడం సభ్య సమాజానికే సిగ్గుచేటన్నారు. నిస్సహాయ బాధిత బాలికకు అండగా నిలవాల్సిన సమయంలో ప్రధాన రాజకీయ పార్టీలు విమర్శలు చేసుకోవడం నిందితులకే తోడ్పుతుందనే విషయం గుర్తించాలన్నారు. ఈ దుర్మార్గ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు. అలకబూని.. ఇంటి నుంచి వెళ్లిపోయిన విద్యార్థి ధర్మవరం అర్బన్: ఎంసెట్ మార్కుల విషయంలో తల్లిదండ్రులు మందలించారని ఓ విద్యార్థి అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని వెతికి పట్టుకొచ్చి తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని టీచర్స్కాలనీకి చెందిన నారాయణస్వామి కుమారుడు రాజు ఇటీవల ఎంసెట్ రాశాడు. పరీక్ష కీ ఆధారంగా 35 మార్కులు వచ్చాయి. సరిగా చదవలేదంటూ తల్లిదండ్రులు మందలించడంతో అలిగిన రాజు శుక్రవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తెలిసిన చోట్లల్లా వెదికినా ఎక్కడా కనపడలేదు. శనివారం ఉదయం టూటౌన్ సీఐ రెడ్డప్పకు ఫిర్యాదు చేశారు. ఆయన తన సిబ్బందితో గాలింపు చేపట్టి విద్యార్థి తన స్నేహితుడు ఇంటిలో ఉన్నాడని తెలుసుకుని, పట్టుకొచ్చి తండ్రి నారాయణస్వామికి విద్యార్థిని అప్పగించారు. -
ఆర్డీటీ లైసెన్స్ పునరుద్ధరించేదాకా పాదయాత్ర
శెట్టూరు: పేదల కోసం పాటుపడే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ)కి లైసెన్స్ పునరుద్ధరించిన రోజే తాను పాదయాత్ర విరమిస్తానని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య స్పష్టం చేశారు. ఆయన చేపట్టిన ఆర్డీటీ పరిరక్షణ పాదయాత్ర శనివారం శెట్టూరు మండలంలో కొనసాగింది. యాటకల్లులో పాదయాత్రకు మహిళలు, ప్రజలు, ఆర్డీటీ లబ్ధిదారులు ఘన స్వాగతం పలికారు. కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు మండలాల నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పాదయాత్రకు మద్దతునిచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తలారి రంగయ్యా మాట్లాడారు. అట్టడుగు వర్గాల ప్రజలకు ఆర్థిక చేయూత.. సామాజిక గుర్తింపు, ఉచితంగా ఉన్నత చదువులు, వైద్య సేవలు, గృహనిర్మాణాలు, వ్యవసాయాభివృద్ధికి ఆర్డీటీ ఎంతగానో తోడ్పాటునందిస్తోందన్నారు. అలాంటి ఆర్డీటీకి విదేశీ నిధులు రావడం ఆగిపోతే ట్రస్టు సేవలు నిలిచిపోతాయని, అప్పుడు పేదలు మరింత దుర్భర బతుకులు వెళ్లదీయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా భయపడేది లేదన్నారు. ఆర్డీటీకి నిధులు కొనసాగేలా ఉత్తర్వులు ఇచ్చిన రోజు ధన్యవాదాలు తెలిపి తన పాదయాత్ర విరమిస్తానని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి, నాయకుడు మాదినేని ఉమా మహేశ్వర నాయుడు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, మండల కన్వీనర్ ఎంఎస్ రాయుడు, ఎంపీపీ సోమనాథ్రెడ్డి, మాజీ ఎంపీపీ రామభీమప్ప, వైస్ ఎంపీపీ ముత్యాలు, చెవుల కిష్టప్ప, పార్టీ అనుబంధ నాయకులు పాల్గొన్నారు. ఆర్డీటీ పరిరక్షణ పాదయాత్రలో మాజీ ఎంపీ తలారి రంగయ్య -
ఆ కార్యాలయంలోనే కిరికిరి!
అనంతపురం ఎడ్యుకేషన్: టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో అక్రమ పాయింట్ల విషయంలో వేళ్లన్నీ విద్యాశాఖ కార్యాలయం వైపే చూపిస్తున్నాయి. ఇప్పటికే హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లలో కొందరు అక్రమ మార్గాన పాయింట్లతో లబ్ధి పొందారు. తాజాగా ఎస్జీటీల్లోనూ కుప్పలుతెప్పలుగా ఇదేదారిని ఎన్నుకున్నారు. తప్పుడు పాయింట్లు పొందుతున్న వారిపై కొందరు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా వారిని అలానే కొనసాగిస్తుండడం పట్ల విద్యాశాఖ ఉద్యోగులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఫిర్యాదు చేసేందుకు ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా వెనకడుగు వేస్తున్నారు. ఇదెట్టా.. ఇదెట్టా.. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన బదిలీ చట్టం మేరకు ఒక హైస్కూల్లో ఒక సబ్జెక్టులో 50 శాతానికి మించి ప్రిఫరెన్షియల్ కేటగిరీ టీచర్లు ఉండకూడదు. మరి అనంతపురంలోని కేఎస్ఆర్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆరు ఇంగ్లిష్ పోస్టులు ఉన్నాయి. వీరిలో ఇప్పటికే ఇద్దరు ప్రిఫరెన్షియల్ కేటగిరీ టీచర్లు ఉన్నారు. తాజా బదిలీల్లో మరో ఇద్దరు ప్రిపరెన్షియల్ కేటగిరీ టీచర్లు వచ్చారు. అంటే ఆరుగురులో నలుగురు వారే ఉన్నారు. ఇదెలా సాధ్యమో అర్థం కావడంలేదు. అందులోనూ ఓ టీచరు నిబంధనల విరుద్ధంగా ఈ కేటగిరిలోకి వచ్చాడు. ● నార్పల మండలంలో పని చేస్తున్న ఓ టీచరుకు ఎలాంటి సర్జరీ జరగలేదు. అయినా సర్జరీ చేయించుకున్నట్లు నకిలీ సర్టిఫికెట్ పొంది నగరంలోని ఓ స్కూల్కు వచ్చారు. ● ప్రభుత్వ యాజమాన్యాల స్కూళ్లల్లో పని చేస్తున్న జెడ్పీహెచ్ఎస్ టీచర్లు... తప్పనిసరి బదిలీ అయితే వారి యాజమాన్యానికే వెళ్లాలి. ఎవరైనా రిక్వెస్ట్గా వెళ్లాల్సి వచ్చినా వారి యాజమాన్యాలకే వెళ్లాలి, లేదంటే చివరగా తాను పని చేస్తున్న పాఠశాలకు ఆప్షన్ ఇచ్చుకోవాలి. అలాకాకుండా ఓ టీచరు రిక్వెస్ట్ బదిలీపై నగరంలోని ఓ స్కూల్కు వచ్చారు. ● కుందుర్పి మండలం వడ్డుపాళ్యం పాఠశాలలో పని చేసే ఓ టీచరు కాలికి శస్త్ర చికిత్స జరిగింది. 69 శాతం వరకు వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ పొందారు. ఇటీవల ఈయన వైకల్యశాతం 59 ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. అదనంగా 7 స్పెషల్ పాయింట్లు పొందారు. ఇంత వైకల్యశాతం ఉన్న వ్యక్తి క్రికెట్, ఇతర క్రీడలు బ్రహ్మాండగా ఆడతాడు. ఇదెలా సాధ్యయో ఆయనకు, సర్టిఫికెట్ ఇచ్చిన వైద్యులకు తెలియాలి. ఈ విషయంపై ఎంఈఓను వివరణ కోరగా.. ‘‘ఆయన వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ పొందుపరిచాడు కానీ క్రికెట్ బాగా ఆడతాడు. ఇది ఆశ్చర్యమే’’నంటూ పేర్కొన్నారు. ● కళ్యాణదుర్గం మండలంలో పని చేస్తున్న పీఎస్ టీచరు స్టేషన్ పాయింట్లు అక్రమంగా వేసుకున్నాడంటూ స్వయంగా ఎంఈఓ తన లాగిన్లో తొలగించి డీఈఓ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఏం జరిగిందో కానీ మండలంలో తొలగించిన పాయింట్లు జిల్లాలో యాడ్ అయ్యాయి. ఆ పాయింట్లతో సదరు టీచరు కాలువపల్లికి కోరుకుని బదిలీ అయ్యారు. ● విడపనకల్లు మండలంలో పని చేస్తున్న ఓ మహిళా టీచరు భర్త... ధర్మవరం రూరల్ పరిధిలోని ఓ స్కూల్లో పని చేస్తూ గతనెల 31 రిటైర్డ్ అయ్యారు. ఈమె నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తులో స్పౌజ్ పాయింట్లు వేసుకున్నారు. తర్వాత ఆమె ఆలోచించి స్పౌజ్ పాయింట్లు తొలగించాలంటూ అర్జీ పెట్టుకున్నారు. ఈ క్రమంలో తాత్కాలిక జాబితాలో తొలగినా ఫైనల్ సీనియార్టీ జాబితాలో మళ్లీ ఆ పాయింట్లు కనిపించాయి. ఇదెలా సాధ్యం అని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఆరోపణలు రావడంతో మళ్లీ ఆ పాయింట్లను తొలగించాల్సి వచ్చింది. విద్యాశాఖ కార్యాలయంలోనే అక్రమాలు జరుగుతున్నాయంటున్న ఉపాధ్యాయులు ఫిర్యాదుకు ఉపాధ్యాయ సంఘాల నేతల వెనకడుగు -
విత్తన నాణ్యతతోనే అధిక దిగుబడులు
● భారత నూనె గింజల పరిశోధనా స్థానం డైరెక్టర్ మాథూర్ కూడేరు: పంటల సాగులో విత్తనం నాణ్యతగా ఉంటేనే అధిక దిగుబడులు సాధించడానికి అవకాశముంటుందని భారత నూనె గింజల పరిశోధనా స్థానం (ఐఐఓఆర్) డైరెక్టర్ డాక్టర్ ఆర్కే మాథూర్ అన్నారు. ‘వికసిత్ కృషి సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్లోని భారతీయ నూనె గింజల ప్రాంతీయ పరిశోధన స్థానం, రేకులకుంట, కదిరి, కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం, మండల వ్యవసాయ శాఖ సంయుక్తంగా కూడేరు మండలం పి.నారాయణపురం గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. శాస్త్రవేత్తలు డాక్టర్ మంజునాథ్, డాక్టర్ సతీష్, డాక్టర్ విజయ శంకర్, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ చెన్నరాయుడు మాట్లాడుతూ.. యాజమాన్య పద్దతుల్లో ఆముదం పంట సాగు చేస్తే లాభాలు ఉంటాయన్నారు. అనంతరం కలగళ్ల, ఇప్పేరు, పి.నారాయణపురం రైతులకు 4 కిలోల చొప్పున ఐసీహెచ్–5 రకం ఆముద విత్తనాలను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ హనుమంతరెడ్డి, ఏఓ విజయకుమార్, రైతు సేవా కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు. రైలు ఎక్కబోతూ కిందపడి వృద్ధుడి మృతి అనంతపురం సిటీ: స్థానిక రైల్వే స్టేషన్లో కదిలుతున్న రైలు ఎక్కబోయి కింద పడి ఓ వృద్ధుడు మృతి చెందాడు. జీఆర్పీ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా యర్రగుంట్లకు చెందిన దూదేకుల సంజీవరాయుడు(60)కు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. యర్రగుంట్లలోని చిన్న కొడుకు వద్ద ఉంటున్న రాయుడు హోటల్లో పని చేసుకుంటూ కాలం వెళ్లదీసేవాడు. గురువారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి చేరుకోవడంతో కుమారుడు మందలించాడు. మనస్తాపానికి గురైన రాయుడు రాత్రికి ఇంటి నుంచి వచ్చేసి యర్రగుంట్ల రైల్వే స్టేషన్లోనే పడుకున్నాడు. శుక్రవారం ఉదయమే మచిలీపట్నం–ధర్మవరం రైలెక్కి అనంతపురానికి చేరుకుని నీళ్ల కోసమని దిగాడు. అదే సమయంలో రైలు కదులుతుండడం చూసి ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే అదుపుతప్పి పడిపోవడంతో తీవ్రంగా గాయపడిన ఆయనను 108 వాహనంలో సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ కోలుకోలేక మరణించాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
నష్టపోయిన రైతులను ఆదుకోండి
అనంతపురం సిటీ: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అరటి, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని, బాధిత రైతులను నష్ట పరిహారం అందించి అన్ని విధాల ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జెడ్పీటీసీ సభ్యులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఉద్యాన శాఖ అధికారి నరసింహారావు స్పందిస్తూ.. పూత, పిందే దశలో ఉన్న వాటికి పరిహారం వర్తించదని, చెట్లు పూర్తిగా నేలమట్టమైతేనే పరిహారం చెల్లిస్తామని చెప్పడంతో సభ్యులు ఒక్కసారిగా అగ్రహం వ్యక్తం చేశారు. ఉభయ జిల్లా స్థాయీ సంఘం–1, 2, 3, 4, 5, 6, 7 సమావేశాలు జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవన్లో శుక్రవారం జరిగింది. సీఈఓ వెంకటసుబ్బయ్య, జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, గుమ్మఘట్ట జెడ్పీటీసీ సభ్యుడు మహేష్, ఉరవకొండ జెడ్పీటీసీ సభ్యురాలు పార్వతమ్మ వేదికపై ఆశీనులయ్యారు. తొలుత వ్యవసాయ శాఖపై చర్చ సందర్భంగా మామిడి, అరటి రైతులను ఆదుకోవాలనే అంశంపై గోరంట్ల, ఓబుళదేవరచెరువు జెడ్పీటీసీ సభ్యులు పాలే జయరాం నాయక్, దామోదర్రెడ్డి మాట్లాడారు. భారీ వర్షాలతో నష్టపోయిన ఉద్యాన రైతులను ఏ విధంగా ఆదుకుంటారో తెలపాలని పట్టుబట్టారు. జెడ్పీ చైర్పర్సన్ జోక్యం చేసుకుంటూ ఎన్ని హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి, ఎన్ని చెట్లు కూలిపోయాయ్, ఎంత మంది రైతులు నష్టపోయారో వివరాలు వెల్లడించాలని సూచించారు. అయితే ఉద్యాన శాఖ అధికారి వద్ద కనీస సమాచారం లేకపోగా, పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో సభ్యులు మండిపడ్డారు. చెట్లు కూలిపోతేనే పరిహారం ఇస్తామని చెప్పడంతో .. అంతెందుకు రైతులు చస్తేనే పరిహారం ఇస్తామని ప్రకటించండంటూ ఆవేశంతో ఊగిపోయారు. రైతులకు నాణ్యమైన కందులు సరఫరా చేయాలని గుమ్మఘట్ట జెడ్పీటీసీ మహేష్, ఓడీచెరువు జెడ్పీటీసీ దామోదర్రెడ్డి డిమాండ్ చేశారు. ఏయే పంటలు సాగు చేయాలో రైతులకు అవగాహన కల్పించాలని నల్లమాడ జెడ్పీటీసీ రామచంద్రారెడ్డి కోరారు. రైతు భరోసా కేంద్రాలను ఎందుకు నిర్వీర్యం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోషణ్ పక్వాడా నిధుల స్వాహాపై చర్యలేవీ? పోషణ్ పక్వాడా నిర్వహణకు సంబంధించి ఒక్కో జిల్లాకు రూ.5 లక్షలు చొప్పున ఉమ్మడి జిల్లాకు రూ.10 లక్షలు మంజూరయ్యాయని, వీటిని సీడీపీఓలు నొక్కేసి తూతూ మంత్రంగా ముగించారని నార్పల జెడ్పీటీసీ నాగరత్నమ్మ, గోరంట్ల జెడ్పీటీసీ జయరాం నాయక్ ఆరోపించారు. ఆ భారమంతా సూపర్వైజర్ల మీద పడిందన్నారు. సీడీపీఓలపై చర్యలు తీసుకొని ప్రభుత్వం ఇచ్చిన డబ్బును సూపర్వైజర్లకు పంచాలని డిమాండ్ చేశారు. ఐసీడీఎస్ పీడీ నాగమణి స్పందిస్తూ.. వచ్చిన డబ్బును సీడీపీఓల ఖాతాల్లో జమ చేశామని ఆధారాలు చూపారు. అయితే వాళ్లు దిగమింగిన సంగతి తనకు తెలియదని, విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పేద విద్యార్థులకు న్యాయం చేయండి జిల్లాలోని అంబేడ్కర్, ఇతర గురుకుల పాఠశాలల్లో గతంలో సీట్లు అమ్ముకున్నారని, ఈసారి ఆ పరిస్థితి లేకుండా పేద విద్యార్థులకు న్యాయం చేకూరేలా చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీ నాగరత్నమ్మ కోరారు. హాస్టళ్లలో పరిస్థితులు మెరుగుపడేలా చూడాలన్నారు. సీట్లు కావాలని ఓట్లేసిన ప్రజలు ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తుంటారని, అలాంటప్పుడు వారు సిఫారసు చేస్తే కచ్చితంగా కొన్ని సీట్లు ఇచ్చేలా చూడాలని జెడ్పీ చైర్పర్సన్ సూచించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్పై చర్యలు తీసుకోండి స్థాయీ సంఘ సమావేశానికి డుమ్మా కొట్టిన ప్రభుత్వ సర్వజనాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు చర్యలు తీసుకోవాలంటూ సభ్యులు డిమాండ్ చేశారు. ఓబుళదేవరచెరువు పీహెచ్సీ కూలిపోయేందుకు సిద్ధంగా ఉందని, అయినా అదే పాడుబడిన భవనంలో వైద్య సేవలు అందిస్తుండడంపై జెడ్పీటీసీ దాము ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై జెడ్పీ చైర్పర్సన్ కల్పించుకుంటూ.. పరిస్థితిని ప్రభుత్వానికి వివరించి, కొత్త భవనాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని శ్రీసత్యసాయి జిల్లా డీఎంహెచ్ఓను ఆదేశించారు. జెడ్పీ స్థాయీ సంఘ సమావేశంలో సభ్యుల డిమాండ్ అరటి, మామిడి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని సూచన చెట్లు కూలిపోతేనే పరిహారం చెల్లిస్తామని అధికారి వివరణ -
కామాంధులను కఠినంగా శిక్షించాలి
● ఎంఈఎఫ్ జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి బండారు శంకర్ అనంతపురం టవర్క్లాక్: దళిత బాలికను గర్భవతిని చేసిన కామాంధులను కఠినంగా శిక్షించాలని ఎంఈఎఫ్ జాతీయ అదనపు ప్రధాన కార్యదర్శి బండారు శంకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఉపాధ్యాయ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రామగిరి మండలానికి చెందిన దళిత మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన కొందరు యువకులు 6 నెలల పాటు బెదిరించి అత్యాచారం చేస్తూ వచ్చారన్నారు. ఫలితంగా ఆ చిన్నారి గర్భవతి అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావుతం కాకుండా ఉండేందుకు విద్యార్థినిపై సాముహిక అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలన్నారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అనంతపురం రూరల్: యోగాంధ్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సంబంధిత అదికారులను కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. ఈ నెల 8 న శిల్పారామంలో జిల్లా స్థాయి యోగాంధ్ర కార్యక్రమం జరుగుతున్న నేపద్యంలో అక్కడ చేపట్టిన ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. శిల్పారామం పరిసరాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కేశవనాయుడు, నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి పాల్గొన్నారు. బక్రీద్ సందర్భంగా పటిష్ట భద్రత అనంతపురం: బక్రీద్ సందర్భంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఎస్పీ పి.జగదీష్ ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న మసీదులు, మదరసాలు, ఈద్గాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. సున్నిత ప్రదేశాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. బీట్లు, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలన్నారు. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ సహా ఏదైనా సోషల్ మీడియాల్లో అభ్యంతకరమైన పోస్ట్లు షేర్ చేస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ను సులభతరం చేయాలన్నారు. త్యాగానికి, సహనానికి ప్రతీకగా నిలిచిన బక్రీద్ పండుగను శాంతి సామరస్యాలు వెల్లివిరిసేలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ జిల్లాలోని ముస్లింలకు ఎస్పీ పి. జగదీష్ శుభాకాంక్షలు తెలిపారు. -
రోగులతో ఆత్మీయంగా మాట్లాడాలి
అనంతపురం అర్బన్: రోగులతో ఆత్మీయంగా మాట్లాడితే.. అదే వారి వ్యాధిని సగం తగ్గించేస్తుందని కలెక్టర్ వినోద్కుమార్ వైద్యులకు సూచించారు. దేవునిగా భావించే వైద్యుల మాటకు అంత శక్తి ఉంటుందని పేర్కొన్నారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో పీహెచ్సీ, యూపీహెచ్సీ, ఎన్టీఆర్ వైద్యసేవ ఆస్పత్రుల వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులు, సిబ్బంది ప్రొఫెషనల్గా ఉండాలన్నారు. రోగులను స్నేహభావంతో పలకరించాలని చెప్పారు. ఆస్పత్రి సిబ్బందికి ఈ విషయాన్ని చెప్పాలన్నారు. ఫార్మసిస్టులు ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందించే వైద్యసేవల మీద ఆర్టీజీఎస్ ద్వారా ప్రజల నుంచి ప్రభుత్వం ఫీడ్బ్యాక్ తీసుకుంటోందన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని తనిఖీ చేస్తాన్నారు. వైద్యులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ రోగులతో వ్యవహరించే తీరు మెరుగుపరచుకోవాలని సూచించారు. సమావేశంలో డీఎంహెచ్ఓ ఈబీ దేవి, ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో–ఆర్డినేటర్ కిరణ్కుమార్రెడ్డి, వైద్యులు పాల్గొన్నారు. -
చింతకుంట మధుపై దాడి
అనంతపురం: వైఎస్సార్సీపీ నేత చింతకుంట మధుపై టీడీపీ నేతలు మూకుమ్మడిగా దాడి చేశారు. బాధితుడు తెలిపిన మేరకు... నగరంలోని 39వ డివిజన్ పరిధిలో శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. మేయర్ వసీంతో పాటు కార్పొరేటర్లు, పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. మేయర్ మొక్కలు నాటి వెళ్లిన అనంతరం కార్పొరేటర్ చింతకుంట సుశీలమ్మ కుమారుడు, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు వద్దకు స్థానిక టీడీపీ నేతలు మోహన్ కుమార్, అఖిల్, ఏఆర్ కానిస్టేబుల్ నరేంద్రతో పాటు మరో పది మంది వచ్చి వాదనకు దిగారు. ఆగ్రహంతో ఊగిపోతూ మధును చుట్టుముట్టి విచక్షణారహితంగా దాడిచేశారు. అక్కడే ఉన్న సచివాలయ ఉద్యోగులను సైతం దూషించారు. కూటమి ప్రభుత్వంలో నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో వైఎస్సార్సీపీ వారు ఎలా పాల్గొంటారు.. వారిని ఎలా మీరు రానిస్తారు అంటూ రెచ్చిపోయారు. దాడి హేయం చింతకుంట మధుపై టీడీపీ నేతలు దాడి చేయడం హేయమని మేయర్ వసీం ఖండించారు. దాడి విషయం తెలుసుకున్న మేయర్తో పాటు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డి, బాధితుడు చింతకుంట మధుతో కలిసి నాలుగో పట్టణ పోలీస్స్టేషన్కు చేరుకున్నారు. సీఐకి ఫోన్ చేస్తే తాను సెలవులో ఉన్నానని చెప్పారు. ఎస్ఐ వద్దకు వెళ్తే ఆయన ఆ సమయంలో భోజనం చేస్తున్నారు. దాదాపు గంట సేపటి తర్వాత బాధితుడి నుంచి ఫిర్యాదు స్వీకరించారు. అనంతరం మేయర్ విలేకరులతో మాట్లాడారు. ఫిర్యాదు తీసుకోవడానికి ఇబ్బంది పడేటప్పుడు.. ఉద్యోగం ఎందుకు చేయాలని ప్రశ్నించారు. గత ఐదేళ్ల పాలనలో అప్పటి అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఏనాడూ కబ్జాలు, దౌర్జన్యాలను ప్రోత్సహించలేదన్నారు. నేడు కూటమి పాలనలో నగరంలో అరాచకాలు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా పత్రికల్లో వస్తున్న వార్తలే ఇందుకు నిదర్శనమన్నారు. ఇటీవల తన చాంబర్లోకి సైతం టీడీపీ నేతలు దౌర్జన్యంగా ప్రవేశిస్తే ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. నాడు ఎస్పీ కఠినంగా వ్యవహరించి ఉంటే నేడు ఇలాంటి ఘటనలు జరిగి ఉండేవి కాదన్నారు. చింతకుంట మధుపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్ర, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ ఆలమూరు శ్రీనివాసరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులేసు, యువజన విభాగం స్పోక్స్పర్సన్ మారుతీ నాయుడు, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు దాదా ఖలందర్, ఎస్సీ సెల్ జిల్లా జనరల్ సెక్రెటరీ కుళ్లాయి స్వామి, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాకే శ్రీనివాసులు, టౌన్ సెక్రెటరీ సురేంద్ర రెడ్డి, కార్పొరేటర్స్ సంపంగి రామాంజినేయులు, కమల్, మైనార్టీ నాయకులు రఫీ, వైసీపీ నాయకులు అనిల్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు -
సీపీఆర్తో ప్రాణం నిలిపారు!
కదిరి టౌన్: కరెంటు షాక్కు గురైన విద్యార్థి చనిపోయాడని అందరూ అనుకున్నారు. కుటుంబ సభ్యుల రోదనలు కూడా మిన్నంటాయి. అదే సమయంలో అక్కడే ఉన్న కానిస్టేబుల్ దేవేంద్ర సీపీఆర్ చేసి విద్యార్థి ప్రాణాలు నిలిపారు. ఈ ఘటన కదిరి పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు... పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సమీపంలో నూతనంగా గృహ నిర్మాణాన్ని స్థానికుడు ఆంజనేయులు చేపట్టాడు. ఆయన కుమారుడు నరసింహులు శుక్రవారం ఇంటిపైకి ఎక్కిన సమయంలో పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ లైనును ప్రమాదవశాత్తు తాకడంతో షాక్కు గురయ్యాడు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతను మృతి చెందాడని భావించిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ దేవేంద్ర వెంటనే సీపీఆర్ చేయడంతో ప్రాణాలు నిలిచాయి. తర్వాత బాలుణ్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. కాగా, విద్యార్థి నరసింహులు పట్టణంలోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. కో–ఆపరేటివ్ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి అనంతపురం అగ్రికల్చర్: రాష్ట్ర సహకార యూనియన్ ఆధ్వర్యంలో డిప్లొమా ఇన్ కో–ఆపరేటివ్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (డీసీఎం, సీఏ) కోర్సు ప్రవేశానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు అనంతపురంలోని రాయలసీమ సహకార శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్ బి.శ్రీనివాసులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎంపికై నా అభ్యర్థులకు 10వ బ్యాచ్ కింద 24 వారాలు శిక్షణ ఉంటుంది. సహకార సంస్థలు, సంఘాల్లో పనిచేయాలనుకున్న వారు ఈ కోర్సు తప్పని సరిగా పూర్తి చేసి ఉండాలి. 10వ తరగతి ఉత్తీర్ణత, ఇంటర్.. సమాన అర్హత కలిగిన వారు అర్హులు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 29వ తేదీలోపు స్థానిక రామ్నగర్లో ఉన్న శిక్షణా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు 94907 41137లో సంప్రదించవచ్చు. 8న డిగ్రీ ఇన్స్టంట్ పరీక్ష అనంతపురం: ఎస్కేయూ పరిధిలో డిగ్రీ ఐదో సెమిస్టర్లో ఒక సబ్జెక్టు ఫెయిల్ అయిన విద్యార్థులకు ఈ నెల 8న అనంతపురంలోని కేఎస్ఎన్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఇన్స్టంట్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ జీవీ రమణ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుంది. ఇప్పటి వరకూ పరీక్ష ఫీజు చెల్లించని వారు రూ.2,200 చలానా, పాత హాల్టికెట్ తీసుకుని పరీక్ష కేంద్రానికి నేరుగా హాజరు కావచ్చు. ఈ అంశంపై పూర్తి వివరాలను ఆయా కళాశాల ప్రిన్సిపాళ్లను అడిగి తెలుసుకోవచ్చు. కాగా, హిందూపురంలోని ఓ పరీక్ష కేంద్రంలో ఎస్కేయూ యూజీ రెండో సెమిస్టర్ పరీక్షలో మాస్కాపీయింగ్కు పాల్పడిన ఓ విద్యార్థిని డీబార్ చేసినట్లు ప్రొఫెసర్ జీవీ రమణ తెలిపారు. -
ముస్లింలకు అల్లా ఆశీస్సులుండాలి
అనంతపురం కార్పొరేషన్: ముస్లింలకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీక బక్రీద్ అని, ఈ పండుగ పర్వదినాన ముస్లింలకు అల్లా ఆశీస్సులుండాలని ఆకాంక్షించారు. బక్రీద్ పర్వదినం రోజున ఖుర్బానీ ఇచ్చే ముస్లింలకు ఎంతో పుణ్యఫలం లభిస్తుందన్నారు. త్యాగం మనిషిని ఉన్నతుడిని చేస్తుందని, దైవ పరీక్షలో కట్టుకున్న భార్యను వదిలి, కన్నకొడుకు ప్రాణాలు బలిచ్చేందుకు సిద్ధపడిన మహనీయుని త్యాగానికి గుర్తుగా ముస్లింలు బక్రీద్ పర్వదినాన్ని జరుపుకుంటారని తెలిపారు.కలెక్టర్ బక్రీద్ శుభాకాంక్షలుఅనంతపురం అర్బన్: ముస్లింలకు కలెక్టర్ వినోద్కుమార్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ను ఆనందంగా జరుపుకోవాలని, అల్లా కృపతో జిల్లా సుభిక్షంగా ఉండాలని ఆకాక్షించారు.తాగునీటి సమస్యపై స్పందించరేం?కూడేరు: ముద్దలాపురం ఎస్సీ కాలనీవాసులు తాగునీటి కోసం శుక్రవారం అనంతపురం – బళ్లారి జాతీయరహదారిపై నిరసన చేపట్టారు. సాయంత్రం ఆరు గంటల నుంచి అరగంటపాటు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. పలువురు దళితులు మాట్లాడుతూ పీఏబీఆర్ నుంచి సీపీడబ్ల్యూఎస్ ప్రాజెక్టు ద్వారా సరఫరా కావాల్సిన తాగునీరు తమ కాలనీకి 15 రోజులుగా నిలిచిపోయిందన్నారు. దీనికితోడు పంచాయతీ నీరు కూడా రావడం లేదన్నారు. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఏ ఒక్కరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో తహసీల్దార్ మహబూబ్ బాషా, సీఐ రాజు వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. మోటార్ల సమస్య వల్ల తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగిందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. తాత్కాళికంగా ట్యాంకర్తో నీరు సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో కాలనీవాసులు ఆందోళన విరమించారు. -
అర్ధరాత్రి దాకా పదోన్నతుల కౌన్సెలింగ్
అనంతపురం ఎడ్యుకేషన్: ఎస్జీటీ కేడర్ నుంచి స్కూల్ అసిస్టెంట్ కేడర్లకు పదోన్నతులు కల్పించేందుకు శుక్రవారం అనంతపురంలో నిర్వహించిన కౌన్సెలింగ్ అర్దరాత్రి దాటేదాకా సాగింది. అన్ని యాజమాన్యాల పరిధిలోని 686 పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్ సాగింది. మున్సిపల్ పాఠశాలల్లో 304 పోస్టులు, మున్సిపల్ కార్పొరేషన్లో 52 పోస్టులు, ప్రభుత్వ పాఠశాలల్లో 26, జిల్లా పరిషత్ పాఠశాలల్లో 304 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నారు. మున్సిపల్, కార్పొరేషన్ స్కూళ్లలో పోస్టులకు 1:2, ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలల్లో పోస్టులకు 1:3 రేషియో ప్రకారం టీచర్లను సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. అన్ని యాజమాన్యాల పాఠశాలల్లోనూ పదోన్నతులకు పెద్దగా ఆసక్తి చూపలేదు. సౌకర్యవంతమైన ఖాళీలు లేకపోవడంతో చాలామంది పదోన్నతులు తీసుకోలేదు. మునిసిపల్, కార్పొరేషన్ టీచర్లకు కేఎస్ఆర్ స్కూల్లో, జిల్లా పరిషత్, ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు శారదా స్కూల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్ కౌన్సెలింగ్ను పర్యవేక్షించారు. కౌన్సెలింగ్ హాజరైన టీచర్లతో ఆప్షన్ తీసుకుని ఆన్లైన్లో నమోదు చేశారు. వారందరికీ శనివారం పదోన్నతుల ఉత్తర్వులు జనరేట్ కానున్నాయి. వీరితో పాటు బదిలీ అయిన స్కూల్ అసిస్టెంట్లు, పీఎస్హెచ్ఎంలు (స్కూల్ అసిస్టెంట్ కేడర్ టీచర్లు) అందరూ శుక్రవారం వారి పాత స్కూళ్లలో రిలీవై.. శనివారం ఉదయం కొత్త స్కూళ్లల్లో చేరాల్సి ఉంటుందని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. కాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు సంబంధించి శుక్రవారం తెల్లవారుజామున నుంచే ఉత్తర్వులు జనరేట్ అయ్యాయి. ఏ సబ్జెక్టులో ఎంతమంది బదిలీ అయ్యారనే వివరాలను రాత్రి 12 గంటలు దాటినా విద్యాశాఖ అధికారులు ప్రకటించకపోవడం గమనార్హం. దీనిపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రోస్టర్ రగడ కార్పొరేషన్ పరిధిలోని స్కూళ్లకు స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతుల విషయంలో అధికారులు రోస్టర్ పాటించడం లేదంటూ రాష్ట్రోపాధ్యాయ సంఘం నాయకులు రగడ చేశారు. రోస్టర్ సక్రమంగా పాటించాలంటూ ఆ సంఘం జిల్లా ప్రధానకార్యర్శి ఎస్.రామాంజనేయులు డిమాండ్ చేశారు. కేఎస్ఆర్ బాలికల పాఠశాలలో జరిగిన కౌన్సెలింగ్ను అడ్డుకున్నారు. అక్కడే ఉన్న ఆర్జేడీ... ఈ విషయంపై జేడీ సర్వీసెస్తో ఫోన్లో మాట్లాడి స్పష్టత ఇచ్చారు. అనంతరం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. కనీస వసతులు లేక అల్లాడిన టీచర్లు సాయంత్రంలోపు కౌన్సెలింగ్ ముగుస్తుందని ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులకు అర్ధరాత్రి దాటినా కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరీ ముఖ్యంగా ఆయా కేంద్రాల్లో కనీసం తాగునీటి వసతి కూడా కల్పించలేదు. పెద సంఖ్యలో వచ్చిన టీచర్లు సరైన వెలుతురు లేక ఇబ్బందులు పడ్డారు. వసతుల కల్పనలో విద్యాశాఖ పూర్తిగా వైఫల్యం చెందిందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడ్డారు. మున్సిపల్, కార్పొరేషన్ టీచర్లకు కేఎస్ఆర్ స్కూల్లో కౌన్సెలింగ్ జిల్లాపరిషత్, ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు శారదా స్కూల్లో.. పర్యవేక్షించిన పాఠశాల విద్య ఆర్జేడీ -
మీ ఊరి పక్కనే దాష్టీకం.. కనిపించలేదా?
● పరిటాల సునీతను ప్రశ్నించిన తోపుదుర్తి ప్రకాష్రెడ్డి రాప్తాడురూరల్: ‘నీ సొంతూరుకు సమీపంలోనే ఉన్న ఏడుగుర్రాలపల్లిలో బాలికను 14 మంది బ్లాక్మేల్ చేసి నెలల తరబడి అత్యాచారం చేసి, గర్భవతిని చేసిన దాష్టీకం దృష్టికి రాలేదా సునీతమ్మా’ అని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ప్రశ్నించారు. ఏడుగుర్రాలపల్లి ఘటనపై స్పందించిన తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ ఈ ఘటన ఆ గ్రామంలో ప్రతి ఇంటికీ తెలిసినా నీ చెవులకు సోకలేదా.. నువ్వేమైనా నిద్రపోతున్నావా అని మండిపడ్డారు. పోలీసులు, ఇంటెలిజెన్స్, స్పెషల్బ్రాంచ్ ఏమి చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒత్తిళ్లు.. ఆంక్షల తర్వాత వెలుగు చూసిన ఈ ఘటనపై తాము మాట్లాడుతున్నామన్నారు. బాలికకు అన్యాయం చేసిన వారు ఎవ్వరైనా సరే కఠినంగా శిక్షించాలన్నారు. ఒక మహిళగా కనీస స్పందన లేకుండా... ‘వైఎస్సార్సీపీ నాయకులు బాలిక విషయంలో రాజకీయాలు చేస్తున్నారు’ అని సిగ్గు లేకుండా ఎలా మాట్లాడతారని మండిపడ్డారు. నిందితులకు కఠినంగా శిక్ష పడాలంటే మీరు లాయర్లను ఏర్పాటు చేయొద్దని సునీతకు సూచించారు. బాలికకు న్యాయం చేయలేని నీవు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బయటకు రాని ఘోరాలెన్నో..? ఏడుగుర్రాలపల్లి 40 ఏళ్లుగా మీకు రిగ్గింగ్ గ్రామమని ప్రకాష్రెడ్డి అన్నారు. అంత ఏకఛత్రాధిపత్యం నడుపుతున్న గ్రామంలో బాలికకు ఇంతటి అన్యాయం జరిగినా మీకు తెలీలేదంటే ఎవరు నమ్ముతారు అని పరిటాల సునీతను ప్రశ్నించారు. రామగిరి మండలంలో తొలి గ్రామం కుంటిమద్దికి రావాలంటేనే పోలీసులు మమ్మల్ని రానివ్వడం లేదన్నారు. పోలేపల్లి గుడికి వెళ్తామంటే అడ్డుకున్నారన్నారు. పరిటాల కుటుంబం ఆధిపత్యం చలాయించే గ్రామాల్లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన ఒక్కటేనన్నారు. బయటకు రాకుండా ఎన్నిఘోరాలు.. నేరాలు జరుగుతున్నాయో అని అనుమానం వ్యక్తం చేశారు. రామగిరి బంగారు గనుల గుంతల్లో వందలాది శవాలున్నాయని గతంలో చెప్పుకునేవారని గుర్తు చేశారు. ఎక్కడెక్కడో చంపి శవాలను అక్కడేశారన్నారు. మీరంటే అలాంటి భయం ఇంకా కొనసాగుతోందన్నారు. అందుకే మాజీ ఎమ్మెల్యే అయిన తనను ఆ మండలంలోకి రానివ్వాలంటే పోలీసులు భయపడుతున్నారన్నారు. అలాంటి మీ కంచుకోటలో అకృత్యం జరిగిందన్నారు. ఒక ఆడబిడ్డకు జరిగిన అన్యాయం గురించి ఒక పత్రిక రాసిందన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా తాను నోరు విప్పి మాట్లాడితే రాజకీయం అంటగడుతున్నావంటే నువ్వు మహిళవేనా అని ప్రశ్నించారు. -
ఇసుక అక్రమ రవాణా అడ్డగింత
శింగనమల: నిదనవాడ సమీపంలోని పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి టీడీపీ నాయకులు అక్రమంగా ఇసుక తవ్వి తరలిస్తుండగా గ్రామస్తులు శుక్రవారం అడ్డుకున్నారు. వారం రోజులుగా జేసీబీతో తవ్వి ట్రాక్టర్లతో బయటకు తరలించి డంప్ చేసి, అక్కడి నుంచి టిప్పర్లతో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. అధికారులకు విషయం తెలిపినా పట్టించుకోలేదు. దీంతో గ్రామస్తులు పార్టీలకు అతీతంగా కదిలి ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్నారు. టిప్పరు, జేసీబీ, ట్రాక్టరును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ● ఇదిలా ఉండగా.. కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకులు మండలంలో దాదాపు రూ.2 కోట్లు విలువ చేసే ఇసుకను అక్రమంగా తరలించారని ప్రజలు చర్చించుకుంటున్నారు. -
నిబంధనలకు పాతర
● అనువైన స్థానాల కోసం అడ్డదారులు ● మే 31 నాటికి 40 ఏళ్లు నిండిన వారికి మాత్రమే ‘అవివాహిత మహిళ’ కేటగిరీ కింద 5 ప్రత్యేక పాయింట్లు ● బదిలీల చట్టానికి తూట్లు పొడుస్తున్న కొందరు మహిళా టీచర్లు ● పెళ్లికాకుంటే చాలు ‘అవివాహిత మహిళ’ పాయింట్లు ● చిన్న వయసు టీచర్లూ ఈ పాయింట్లు పొందిన వైనం ● ఎస్జీటీ కేటగిరిలోనే 30 మందికి పైగా అక్రమంగా పాయింట్లు అనంతపురం ఎడ్యుకేషన్: అనువైన స్థానాల కోసం కొందరు టీచర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. సమాజానికి మార్గదర్శకంగా ఉండాల్సిన గురువులే వక్రమార్గాన పాయింట్లు పొందాలని చూస్తున్నారు. నిబంధనలకు పాతరేస్తున్నారు. కొందరు అనర్హత కల్గిన మహిళా టీచర్లు ‘అవివాహిత మహిళ’ కేటగిరీ కింద పాయింట్లు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పెళ్లి కాకుంటే చాలు ఈ పాయింట్లు పొందుతున్నారు. దాదాపు 30 మంది ఎస్జీటీల సీనియార్టీ జాబితాలో ఇలాంటి టీచర్లు ఉండడం విద్యాశాఖలో కలకలం రేపుతోంది. ఎక్కువగా బ్రహ్మసముద్రం, రొళ్ల, డి.హీరేహాల్, గుమ్మఘట్ట, మడకశిర, రాయదుర్గం, అమడగూరు, కంబదూరు, అగళి, గుడిబండ, కుందుర్పి మండలాల్లో పని చేస్తున్న మహిళా టీచర్లు ఎక్కువగా అక్రమంగా పాయింట్లు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. తాత్కాలిక సీనియార్టీ జాబితాను పరిశీలించిన పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అనర్హుల జాబితాను సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. 31 నాటికి 40 ఏళ్లు నిండిన వారే అర్హులు బదిలీల చట్టం జీవో 22 ప్రకారం మే 31 నాటికి 40 ఏళ్లు నిండిన వారికి మాత్రమే ‘అన్మ్యారెడ్ ఉమెన్’ (అవివాహిత) కేటగిరీ కింద 5 స్పెషల్ పాయింట్లు పొందేందుకు అర్హులు. ఈలెక్కన 1985 మే 31కి ముందు జన్మించి ఉండాలి. అయితే 1987 నుంచి 1999 మధ్య జన్మించిన వారు దాదాపు 30 మంది దాకా అవివాహిత పాయింట్లు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. 26, 27 ఏళ్ల మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవడం విశేషం. జీఓలో చాలా స్పష్టంగా ఇచ్చినా కూడా ఇలా దరఖాస్తు చేశారంటే అడ్డదారులోల పాయింట్లు పొందేందుకేనంటూ ఇతర ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. వాటిపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే వారందరికీ ఆ పాయింట్లు తొలగిస్తామని డీఈఓ ప్రసాద్బాబు స్పష్టం చేశారు. ఎవరు సహకరించారో... ఎస్ఏ (ఫిజికల్ సైన్స్) బదిలీల్లో భాగంగా సీనియారిటీ లిస్టులో 38వ నంబర్లో ఉన్న రాఘవేంద్ర ప్రస్తుతం కళ్యాణదుర్గం మండలం తిమ్మసముద్రం ఎంపీయూపీ పాఠశాలలో పనిచేస్తున్నారు. రీఅపోర్షన్లో ఆయన పోస్ట్ పోయింది. ప్రస్తుత స్టేషన్లో 2023 నుంచి 2025 వరకు పనిచేశారు. అంతకు మునుపు స్టేషన్లో 2017 నుంచి 2023 వరకు పనిచేశారు. ప్రీవియస్ స్టేషన్ పాయింట్లు వాడుకున్నా 17.5055 రావాలి. కానీ 8 ఏళ్లు పని చేసినట్లు 24 పాయింట్లు వేసుకున్నారు. ఈ విషయం గ్రీవెన్స్ సమయంలో ఎంఈఓకు కొందరు ఫిర్యాదు చేశారు. ఎంఈఓ స్వయంగా డీఈఓ కాఆర్యలయానికికి వెళ్లి 24 పాయింట్లు తొలగించి 17.5055 మా పాయింట్లు వేయించారు. ఆ తర్వాత ఏమి జరిగిందో.. ఎవరు సహకరించారో తెలీదు కానీ 24 పాయింట్లు వేసుకున్నారు. ప్రస్తుత కౌన్సెలింగ్లో కాలువపల్లి జెడ్పీహెచ్ఎస్కు వచ్చారు. ఈయనకంటే ఎక్కువపాయింట్లు ఉన్న టీచర్లకు అన్యాయం జరిగింది. ఈ వ్యవహారంపై ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పాతిరెడ్డి డీఈఓకు ఫిర్యాదు చేశారు. -
జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. ఉక్కపోత పెరిగింది. గాలివేగం తగ్గింది. నైరుతి దిశగా గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
అపార్ ఐడీ అనివార్యం అనంతపురం: ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు దోహదపడినట్లే.. ప్రతి విద్యార్థికీ అపార్ ఐడీ అనివార్యమని డిజిటల్ ఇండియా కార్పొరేషన్ రీజనల్ నోడల్ ఆఫీసర్ రవి పాండ్య అన్నారు. అపార్ ఐడీ రూపకల్పనపై ఉన్నత విద్యామండలి, యూజీసీ సహకారంతో జేఎన్టీయూ అనంతపురంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథి రీజనల్ నోడల్ ఆఫీసర్ రవి మాట్లాడుతూ విద్యార్థుల సర్టిఫికెట్లు, మార్క్స్ మెమోలు భద్రపరిచేందుకు అపార్ ఐడీ దోహదపడుతుందన్నారు. ఇందులో ఎల్కేజీ నుంచి పీహెచ్డీ వరకు విద్యార్థికి సంబంధించిన అన్ని రకాల సర్టిఫికెట్లు, స్టడీ, ట్రాన్స్ఫర్, మైగ్రేషన్ సర్టిఫికెట్, ప్రొవిజనల్ సర్టిఫికెట్లు ఇలా ఎన్నో రకాల సర్టిఫికెట్లు భద్రపరచుకోవడానికి వీలు పడుతుందన్నారు. రాయలసీమ పరిధిలోని అన్ని యూనివర్సిటీల కోర్డినేటర్లు, జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ఉన్న 120 కళాశాలల ప్రతినిధులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి అధికారులు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ జీడీ రాజేందర్, జేఎన్టీయూ అనంతపురం ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ అంకారావు, డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతకు రిక్తహస్తం!
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు కష్టాలు రెట్టింపు అయ్యాయి. అన్నదాత సుఖీభవ పథకం అమలులో నిబంధనల తిరకాసు అన్నదాతలను తీరని ఇబ్బందులకు గురి చేస్తోంది. అధికారులు సైతం కొర్రీలతో ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రభుత్వ నిబంధనల పేరుతో సవాలక్ష సాకులు వెతికి అర్హుల్లో చాలా మందికి రిక్తహస్తం చూపేలా కార్యాచరణ చేపట్టారు. రాయదుర్గం: అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు గత ఎన్నికల సమయంలో కూటమి పెద్దలు ఇచ్చిన హామీ అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా.. బాలారిష్టాలను దాటి ముందుకు సాగడం లేదు. ఇప్పటికే అర్హులైన రైతుల ఎంపిక ప్రక్రియ పూర్తి కావస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నా... పథకం లబ్ధి పొందేందుకు రైతులకు కొత్త చిక్కులు తప్పడం లేదు. గతంలో చేపట్టిన రీసర్వేను సాకుగా చూపి అర్హుల జాబితా నుంచి చాలా మందిని తొలగించేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. ఈ కుట్ర కాస్త బహిర్గతం కావడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చిక్కుముడులు విప్పకనే తుది జాబితా! కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిసి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. పీఎం కిసాన్ యోజన కింద రూ.6 వేలతో పాటు మిగిలిన రూ.14 వేలను రాష్ట్ర ప్రభుత్వం రూ.20వేలను అందించనుంది. దీనికి వెబ్ల్యాండ్ను అనుసంధానిస్తూ పరిశీలన ప్రక్రియ చేపట్టాలని వ్యవసాయశాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇక్కడే అసలు చిక్కు మొదలవుతోంది. రీ–సర్వేల్లో భాగంగా కొందరు రైతుల ఆధార్, సెల్ నంబర్తో పాటు ఇతర వివరాలనూ అధికారుల నమోదు చేయకపోవడం, ఆన్లైన్లో భూములున్నా ఆధార్ అనుసంధానికి రెవెన్యూ అధికారులు చుక్కలు చూపడం లాంటి కారణాలు వెరసి తహసీల్ధార్, వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ రైతులు నిత్యం తిరిగి వేసారి పోతున్నారు. వెబ్ల్యాండ్లో పరిశీలన ప్రక్రియ పూర్తి కావడంతో చాలా మంది రైతులు అనర్హులుగా మిగిలిపోయారు. డి.హీరేహాళ్ మండలంలో ఓ అధికారి నిర్వాహకంతో రైతుల కష్టాలు రెట్టింపు అయ్యాయి. వెబ్ల్యాండ్లోని చిక్కుముడులను విప్పకనే తుది జాబితాకు అధికారులు సిద్ధం కావడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏడాదిగా ఇదే నాన్చుడు గత వైఎస్సార్సీపీ హయాంలో ఖరీఫ్ ఆరంభానికి ముందే రైతు భరోసా పథకం కింద అర్హులైన ప్రతి రైతుకూ పెట్టుబడి సాయాన్ని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తూ వచ్చారు. విత్తు నుంచి విపత్తుదాక వెన్నంటే నిలిచారు. ఏటా రెండు లక్షల మందికి పైగా రైతులకు రాజకీయాలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా ఐదేళ్ల పాటు రైతులకు రూ.1879.29 కోట్ల సాయాన్ని అందించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని పేరు మార్చి అన్నదాత సుఖీభవ పథకంగా నామకరణం చేసి అమలులో ఏడాది పాటు నాన్చుడు ధోరణి అవలంభిస్తూ వచ్చింది. దీనిపై అన్నదాతల్లో అసహనం వ్యక్తం కావడంతో ఓ మెట్టు దిగి వచ్చిన కూటమి సర్కార్... పథకం అమలు పేరుతో కొర్రీలు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తోంది. జిల్లాలో 4.74 లక్షల మంది రైతులుండగా వీరిలో 2,98,535 మందికి అన్నదాత సుఖీభవ పథకం వర్తించాల్సి ఉంది. అన్నదాత సుఖీభవ పథకం అమలులో కనిపించని కష్టాలు సవాలక్ష నిబంధనలతో రైతుకు తప్పని తిప్పలు అర్హుల్లో చాలా మందికి రిక్తహస్తం చూపేలా కార్యచరణ -
● ధర వింటే దిమ్మ తిరిగిపోతోంది!
బక్రీద్ సీజన్లో పొట్టేళ్లకు భారీగా డిమాండ్ పెరిగింది. సాధారణంగా మాంసం కోసం పెంచే పొట్టేళ్లను.. వాటి బరువు ఆధారంగా ధర నిర్ణయిస్తారు. కానీ బక్రీద్ పండుగ నేపథ్యంలో విక్రయించే జీవాలకు బరువుతో పని లేదు. కేవలం రూపం, వాటి ఆరోగ్యాన్ని మాత్రమే చూస్తారు. దీంతో సాధారణ ధరల కన్నా ఏకంగా నాలుగు రెట్లు ఎక్కువకు పొట్టేళ్లు అమ్ముడు పోతున్నాయి. మాములు రోజుల్లో రూ.10 నుంచి రూ.15 వేలు పలికే పొట్టేళ్ల ధర.. బక్రీద్ డిమాండ్ కారణంగా రూ.30 నుంచి రూ.50 వేలకు పెరిగింది. వాడైన చూపులు.. మెలి తిరిగిన కొమ్ములు.. బలిష్టంగా ఉన్న పొట్టేళ్లు, మేకపోతుల ధర మరింత ఎక్కువగా ఉంటోంది. దిమ్మతిరిగేలా పెరిగిన ధరలతో పండుగ ఎలా చేసుకోవాలని ముస్లింలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – ఆత్మకూరు: -
ఆర్ఎంపీ అనుమానాస్పద మృతి ● పెన్నహోబిలం గుట్టల్లో కాలిన మృతదేహం గుర్తింపు
ఉరవకొండ: ఓ ఆర్ఎంపీ అనుమానాస్పద స్థితిలో మృతదేహమై కనిపించాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఆత్మకూరు మండలం సిద్దారాంపురం గ్రామానికి చెందిన ఆవుల గోపాలరెడ్డి, సువర్ణమ్మ దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు మంజునాథ్రెడ్డి ఉన్నారు. కుమారుడు గ్రామంలోనే ఆర్ఎంపీగా గ్రామస్తులకు వైద్య సేవలు అందిస్తూ జీవనం సాగిస్తున్నాడు. మూడేళ్ల క్రితం తండ్రి మృతి చెందాడు. అప్పటి నుంచి కుటుంబ పోషణ భారం మంజునాథరెడ్డి (30)పై పడింది. కుమార్తెకు వివాహం కావడంతో కుమారుడికి పెళ్లి చేయాలని తల్లి సంబంధాలు చూస్తోంది. అయితే సంబంధాలు ఏవీ కుదరకపోవడంతో పాటు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులతో చేసిన అప్పులు తీర్చే మార్గం కానరాక జీవితంపై విరక్తి పెంచుకున్న మంజునాథ్ ఈ నెల 4న ఇల్లు విడిచి వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో ఈ నెల 5న కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆత్మకూరు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం ఉరవకొండ మండలం పెన్నహోబిలం గుట్టల్లో కాలిపోయిన ఓ మృతదేహాన్ని గమనించిన స్థానికుల సమాచారంతో సీఐ మహనంది, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. పెన్నహోబిలంలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనం ఆధారంగా మృతుడిని మంజునాథ్గా అనుమానిస్తూ సమాచారం ఇవ్వడంతో కుటుంబసభ్యులు అక్కడకు చేరుకుని నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. టీడీపీ నేతల ఇళ్ల వద్ద విత్తన కాయల రిజిస్ట్రేషన్! బుక్కరాయసముద్రం: మండలంలోని చెన్నంపల్లిలో టీడీపీ నేతలు చెప్పిన ఇళ్ల వద్ద వ్యవసాయ సిబ్బంది కూర్చొని విత్తన కాయల రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టారని వైఎస్సార్సీపీ నాయకులు వెంకటరెడ్డి ఆరోపించారు. గ్రామంలో సచివాలయం ఉండగా వ్యవసాయ అధికారులు టీడీపీ నేతలు చెప్పిన చోట రిజిస్ట్రేషన్లు చేపట్టడం దారుణమన్నారు. సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టి విత్తన పంపిణీని పారదర్శకంగా చేపట్టాలని కోరారు. బ్రెయిన్ డెడ్ బాలుడి అవయవ దానం కళ్యాణదుర్గం రూరల్: బ్రెయిన్ డెడ్ అయిన ఓ బాలుడి అవయవాలను అతడి తల్లిదండ్రులు దానం చేశారు. మృతిచెందిన తర్వాత తమ కుమారుడు మరికొంత మంది జీవితాల్లో వెలుగులు నింపుతాడనే భావంతో పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి మరీ అవయవదానానికి అంగీకరించారు. వివరాలిలా ఉన్నాయి... కళ్యాణదుర్గం మండలం గరుడాపురం – కొత్తూరు గ్రామాల మధ్య మూడు రోజుల క్రితం గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తలకు తీవ్ర గాయమై అనంతపురంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీహరి (18) బ్రెయిన్ డెడ్ అయినట్లు గురువారం వైద్యులు నిర్ధారించారు. దీంతో అతడి తల్లిదండ్రులు అనసూయమ్మ, ఈరన్న, సోదరి సింధూజ, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న జీవన్ధాన్ ఫౌండేషన్ ప్రతినిధులు... శ్రీహరి అవయవాలను దానం చేస్తే కొంతమందికి ప్రాణదానం చేయవచ్చని తల్లిదండ్రుల వద్ద ప్రస్తావించడంతో అంతటి దుఃఖంలోనూ వారు అంగీకారం తెలిపారు. దీంతో శ్రీహరి గుండె, కళ్లు, కిడ్నీలను జీవన్దాన్ ప్రతినిధులు సేకరించి అత్యవసరమైన రోగుల కోసం మెట్రో నగరాల్లోని ఆస్పత్రులకు తరలించారు. కాగా, ఇంటర్ వరకూ చదువుకున్న శ్రీహరి... కొత్తూరు గ్రామంలోనే తల్లిదండ్రులకు వ్యవసాయ వనుల్లో చేదోడుగా ఉండేవాడు. అవయవ దానం చేసేందుకు అంగీకరించిన శ్రీహరి తల్లిదండ్రులను వైద్య సిబ్బంది అభినందించారు. -
బిందెల షెడ్డులో అగ్ని ప్రమాదం
గుత్తి: మండలంలోని బాచుపల్లి జంగాల కాలనీలో నివాసముంటున్న జంగాల పుల్లయ్యకు చెందిన బిందెల షెడ్డులో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షెడ్డులో ఉంచిన చిన్న గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తు పేలింది. దీంతో మంటలు చెలరేగాయి. షెడ్డు లోపల ఉంచిన బైక్, బిందెలతో పాటు కోళ్లూ కాలిపోయాయి. అర్ధరాత్రి కావడంతో మంటలు ఆర్పడం సాధ్యం కాలేదు. దీంతో రూ.5 లక్షలు వరకు నష్ట పోయినట్లు బాధితుడు వాపోయాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ‘కౌలు రైతుల సమస్యలు పరిష్కరించండి’ వజ్రకరూరు: ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రూ.10 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కౌలు రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ వజ్రకరూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. సంఘం నాయకులు మాట్లాడుతూ... కౌలు రైతులు గుత్తలు ముందుగానే చెల్లించి పంటలు పండిస్తున్నారన్నారు. నూతన కౌలు చట్టం అమలు చేసి కౌలు రైతులందరికీ గ్రామసభల ద్వారా సీసీఆర్సీ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాధారణ రైతులకు వర్తించే అన్ని సౌకర్యాలతో పటు ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూర్చాలన్నారు. అనంతరం డిమాండ్ల కూడిన వినతి పత్రాన్ని రెవెన్యూ అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం జిల్లా అద్యక్షుడు రంగారెడ్డి, జిల్లా నాయకుడు వెంకటేష్, వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి కృష్ణమూర్తి, రైతుసంఘం జిల్లా ఉపాద్యక్షుడు విరూపాక్షి పాల్గొన్నారు. -
ముగిసిన జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు
తాడిపత్రి టౌన్: స్థానిక గురుకుల పాఠశాల ఆవరణలో గురువారం తైక్వాండో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ పోటీల్లో దాదాపు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్రెడ్డి విజేతలకు బహుమతులు అందజేసారు. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకూ రాష్ట్ర స్థాయి చాంపియన్షిప్ పోటీలు తాడిపత్రిలోని సత్యసాయి ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు తైక్వాండో సంఘం జిల్లా అధ్యక్షుడు శివయ్య తెలిపారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాల కరస్పాండెంట్ సతీష్రెడ్డి, నీలకంఠారెడ్డి పాల్గొన్నారు. వాహనం ఢీకొని వృద్ధుడి మృతి రాప్తాడు: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ వృద్ధుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... రాప్తాడు మండలం రామినేపల్లి గ్రామానికి చెందిన బుంగ లింగారెడ్డి (75), అదే గ్రామానికి చెందిన హరిజన సాకే వెంకటరమణ ద్రాక్ష కొమ్మల కటింగ్ పనితో కుటుంబాలను పోషించుకుంటున్నారు. రామినేపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై రాప్తాడు వద్ద ఉన్న పెట్రోలు బంక్ వద్దకు చేరుకుని అక్కడ తమ వాహనాలను నిలిపి మిగిలిన కూలీలతో కలసి ఆటోలో ద్రాక్ష తోటలకు వెళ్లి పనులు ముగించుకుని వచ్చేవారు. ఈ నేపథ్యంలో గురువారం గార్లదిన్నె వద్ద ద్రాక్ష కటింగ్కు వెళ్లాల్సి ఉండడంతో తన స్కూటీపై సాకే వెంకటరమణతో కలసి లింగారెడ్డి బయలుదేరాడు. తెల్లవారుజామున 5.15 గంటలకు రాప్తాడు సమీపంలోని 44వ జాతీయ రహదారిపై ఉన్న ఐచర్ షోరూమ్ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి అతి వేగంగా దూసుకొచ్చిన వాహనం ఢీకొంది. ఘటనలో బుంగ లింగారెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ తన వాహనంతో సహా ఉడాయించాడు. తీవ్రంగా గాయపడిన సాకే వెంకటరమణను స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా సర్వజనాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, బుంగ లింగారెడ్డికి భార్య లక్ష్మీదేవి, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శ్రీహర్ష తెలిపారు. -
ప్రైవేట్ వాహనదారుల ఘర్షణ
ఉరవకొండ: స్థానిక టీడీపీ ముఖ్యనేత ఆశీస్సులతో కూడేరు మండలానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు ఏడాదిగా అనంతపురం – ఉరవకొండ మార్గంలో అనధికార షటిల్ సర్వీసులు నడుపుతూ ప్రయాణికులను దోచుకుంటున్నారని లైట్ మోటార్ వెహికల్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు. గురువారం స్థానిక ఆర్టీసీ బస్టాండు వద్ద ప్రైవేట్ వాహనాలను అసోసియేషన్ సభ్యులు అడ్డుకున్నారు. ఆ సమయంలో ఇరు వర్గాల వాగ్వాదం చెలరేగి ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. అప్పులు చేసి, బంగారం కుదవ పెట్టి దాదాపు 150 మంది వాహనాలను కొనుగోలు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామన్నారు. తాము మూడు నెలలకు రూ.8.960 రోడ్ ట్యాక్స్ కట్టి, ఈఎంఐలు చెల్లిస్తున్నామన్నారు. టీడీపీ నేతల వాహనాలు కాదని ఇతరుల వాహనంలో ప్రయాణికులు ఎక్కబోతే దౌర్జన్యం చేస్తున్నారన్నారు. చివరకు ఆటోల్లో సైతం ప్రయాణికులను అనుమతించడం లేదన్నారు. తమతో పాటు గవిమఠంలోని వాహన స్టాండ్లో వాహనాలు పెట్టి క్రమ పద్ధతిలో బాడుగకు తిప్పుకుంటే అభ్యంతరం లేదన్నారు. అలా కాదని ఆర్టీసీ బస్టాండ్ వద్ద పెట్టి దోపిడీ చేయాలనుకుంటే సహించేది లేదని తేల్చి చెప్పారు. దీనిపై ఇప్పటికై నా ఆర్టీసీ, ఆర్టీఓ అధికారులు మేల్కొని చర్యలు చేపట్టాలని కోరారు. -
●ఈ కలయికకు 50 ఏళ్లు!
యాడికి: మండలంలోని రాయలచెరువులోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1974–75 విద్యాసంవత్సరంలో పదో తరగతి చదువుకున్న వారిలో 21 మంది అదే పాఠశాల వేదికగా గురువారం కలుసుకున్నారు. 50 ఏళ్ల తర్వాత కలుసుకున్న వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరి కష్టసుఖాలు మరొకరు అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు తమకు విద్యాబుద్దులు నేర్పి మృతి చెందిన నాటి గురువులు, తమ ఐదుగురు స్నేహితులకు నివాళులర్పించారు. అనంతరం పూర్వ విద్యార్థి నాగరంగయ్య మాట్లాడుతూ.. రాయలచెరువులోని నం.1 ప్రాథమికోన్నత పాఠశాలలో 9వ తరగతి వరకు చదువుకోగా... 1974లో పాఠశాలను ఉన్నత పాఠశాల అప్గ్రేడ్ చేయడంతో తాము మొదటి బ్యాచ్ విద్యార్థులుగా పాఠశాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడం గర్వంగా ఉందన్నారు. కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు నాగరంగయ్య, శివప్రసాద్, సత్యరంగయ్య, విశ్వనాథ్, శ్రీనివాసులు, రామకృష్ణ నేతృత్వం వహించగా ప్రస్తుత ప్రధానోపాధ్యాయుడు డేనియల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. -
అభిప్రాయ సేకరణ చేపట్టాలి
● కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశం అనంతపురం అర్బన్: జనాభా నిర్వహణ విధానం పాలసీపై క్యూఆర్ కోడ్ ద్వారా అభిప్రాయ సేకరణ పక్కగా చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ‘జనాభా నిర్వహణ విధానం, ప్రతి కుటుంబం ముఖ్యం, మీ అభిప్రాయం మార్గదర్శనం’ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించి, మాట్లాడారు. ఈ నెల 20వ తేదీ వరకు ప్రజల భాగస్వామ్య సంప్రదింపుతో అభిప్రాయ సేకరణ పూర్తి చేయాలన్నారు. ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, సచివాలయ సిబ్బందికి తగిన సూచనలు అందజేసి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎ.మలోల, సీపీఓ అశోక్కుమార్ పాల్గొన్నారు. యువకుడి దుర్మరణం గుత్తి: పట్టణ నడిబొడ్డున చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... యాడికి మండలం కొట్టాలపల్లికి చెందిన కార్తీక్ (24), శివరామిరెడ్డి గుత్తిలో గురువారం జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. గుత్తిలోకి చేరుకోగానే యాడికి గ్రామానికి చెందిన బషీర్, రమేష్ వెళుతున్న మరో ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొన్నారు. దీంతో రోడ్డుపై కుడి వైపు పడిన కార్తీక్ను గమనించి లారీ డ్రైవర్ బ్రేక్ వేసే లోపు చక్రం దూసుకెళ్లడంతో తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. కార్తీక్ వెనుక బైక్పై కూర్చొన్న శివరామిరెడ్డి, మరో బైక్పై ఉన్న రమేష్, బషీర్ రోడ్డుకు ఎడమ వైపు పడటంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చిన్నపాటి గాయాలతో వారు బయటపడ్డారు. మృతుడు బేల్దారి పనులతో కుటుంబానికి చేదోడుగా ఉండేవాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. పోటీలకు కవితల ఆహ్వానం అనంతపురం కల్చరల్: ఈ నెల 16నవిన్సెంట్ ఫెర్రర్ స్మారక కవితా పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సామాజిక సేవా కార్యకర్త రవికాంత్ రమణ గురువారం పోస్టర్లను కొప్పల మీనాక్షమ్మ ఫౌండేషన్ కార్యాలయంలో ఆవిష్కరించారు. తెలుగు వెలుగు సాహితీ సంస్థ టీవీరెడ్డి, ఆశ్రయ కృష్ణారెడ్డి, సంపాదకులు తోట నాగరాజు, లఘుచిత్రాల కెమెరామెన్ లింగాల పవన్ తదితరులు మాట్లాడారు. ఈనెల 16న విన్సెంట్ ఫెర్రర్ వర్ధంతి సందర్భంగా ‘ఆర్డీటీ సేవలు– అభాగ్యులకు వరాలు’ పేరిట కవితా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 10వ తేదీలోపు తమ కవితలను 73828 63523 నంబర్కు పంపాలన్నారు. -
హత్యకు పన్నాగం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం అర్బన్ నియోజకవర్గ టీడీపీలో కుమ్ములాటలు తారస్థాయికి చేరాయి. రాష్ట్రంలో కూటమి పాలనా పగ్గాలు చేపట్టి మరో వారానికి ఏడాదవుతుంది. ఇంతలోనే ‘తెలుగు తమ్ముళ్ల డిష్యుం..డిష్యుం’ విస్మయం కలిగిస్తోంది. తొలిసారి ఎమ్మెల్యే అయిన దగ్గుపాటి ప్రసాద్ వ్యవహారాలతో రోజుకో నేత విభేదిస్తున్నారు. దీంతో ఇప్పుడు అనంతపురం అర్బన్ నియోజకవర్గం అభివృద్ధికి దూరమై గ్రూపులతో అట్టుడుకుతోంది. మొన్న వెంకటేశులు.. నిన్న చంటి ఎమ్మెల్యే, ఆయన అనుచరుల తీరుపై అర్బన్ నియోజకవర్గ టీడీపీ ముఖ్య నేతలు ఒక్కొక్కరిగా విభేదిస్తూ దూరమవుతున్నారు. మొన్నటికి మొన్న మినీ మహానాడులో తనను ఎమ్మెల్యే పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేస్తూ సాకే వెంకటేశులు అనే వ్యక్తి పురుగుల మందు తాగారు. ఇప్పటికీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్నటికి నిన్న ఎమ్మెల్యే అనుచరులు తన ఇళ్లు కూల్చడానికి వచ్చారంటూ చంటి అనే టీడీపీ ముఖ్య నేత పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అధిష్టానం జోక్యం చేసుకోవడంతో ఈ వివాదం సద్దుమణిగింది. సుధాకర్నాయుడు ఫిర్యాదు కలకలం.. మొదటినుంచి అనంతపురం అర్బన్లో టీడీపీ నేతగా సుధాకర్నాయుడుకు పేరుంది. ఈయన్ని లిక్కర్ సుధాకర్ అనికూడా అంటారు. గత కొంతకాలంగా సుధాకర్కు ఎమ్మెల్యేతో విభేదాలు నెలకొన్నాయి. జిల్లా పార్టీ పరిశీలకులు కోవెలమూడు రవీంద్ర (నాని) పంచాయితీ చేసినా రాజీ కుదరలేదు. ఈ క్రమంలోనే.. తనకు ఎమ్మెల్యే అనుచరుల నుంచి ప్రాణహాని ఉందంటూ రెండు రోజుల క్రితం ఉన్నట్టుండి భార్యతో కలిసి ఎస్పీకి సుధాకర్ ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. టీడీపీకి తొలి నుంచి విధేయుడిగా ఉన్న సుధాకర్కే ఈ పరిస్థితి ఉంటే భవిష్యత్తులో తమ పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ మిగతా కేడర్లో భయం మొదలైనట్లు తెలిసింది. ఇదిలా ఉండగా గురువారం అధిష్టానం నుంచి పిలుపు రావడంతో సుధాకర్నాయుడు, ఎమ్మెల్యే దగ్గుపాటి విజయవాడ వెళ్లివచ్చారు. ఈ క్రమంలోనే రాత్రి సుధాకర్ నాయుడు అనంతపురం డీఎస్పీని కలవడం చర్చనీయాంశమైంది. తొలి నుంచీ ప్రభాకర్ చౌదరి వేరుకుంపటి.. గత సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి అనంతపురం టీడీపీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన ఎమ్మెల్యే దగ్గుపాటికి వ్యతిరేకంగా వేరుకుంపటి పెట్టి నడిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేపై అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. నియోజకవర్గంలో కబ్జాలు, మద్యం వంటి వాటిపై ఆధారాలతో సహా తెలియజేస్తున్నారు. దీంతో దగ్గుపాటి ప్రసాద్ రాజకీయంగా ఏకాకి అయ్యారని అంటున్నారు. పాలన చేపట్టి ఏడాది గడవకముందే తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారని టీడీపీ నాయకుల్లోనే చర్చ జరుగుతోంది. అనంత టీడీపీలో తారస్థాయికి కుమ్ములాటలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న ముఖ్య నాయకులు ఇటీవల ‘మినీ మహానాడు’లో పురుగుల మందు తాగిన వెంకటేశులు ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని సుధాకర్ నాయుడు ఎస్పీకి ఫిర్యాదు తొలినుంచీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వేరుకుంపటి ఎమ్మెల్యే దగ్గుపాటిపై అధిష్టానానికి ఫిర్యాదుల వెల్లువసుధాకర్ నాయుడు హత్యకు అదే పార్టీకి చెందిన మరోవర్గం పన్నాగం పన్నినట్టు తెలుస్తోంది. తన వర్గం వారిని కావాలనే వేధిస్తున్నారని సుధాకర్ నాయుడు ఎమ్మెల్యేను ప్రశ్నించడం మొదలు పెట్టడం, వైన్షాపుల వ్యవహారాల్లో తేడా రావడంతో హత్య చేయాలని భావించారనే అనుమనాలు కలుగుతున్నాయి. ఎమ్మెల్యే అనుచరుల్లో ఇద్దరు ఈ దురాగతానికి యత్నించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేకు అడుగడుగునా అడ్డు తగులుతున్నాడనే ఉద్దేశంతోనే అతన్ని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నట్టు సమాచారం. టీడీపీలోనే ఓ వర్గం నాయకుణ్ని మరో వర్గం నాయకులు చంపడానికి యత్నించడమనేది ఇప్పుడు జిల్లాలో కలకలం రేపుతోంది. దీనిపై పోలీసులు ఎలా వ్యవహరిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
విత్తన వేరుశనగ నాణ్యతగా లేకుంటే వెనక్కివ్వండి
ఆత్మకూరు: విత్తన వేరుశనగ నాణ్యతగా లేకుంటే వెనక్కివ్వాలని కలెక్టర్ వినోద్కుమార్, ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలోని పంపనూరు రైతు సేవా కేంద్రం వద్ద ఎమ్మెల్యే సునీతతో కలిసి విత్తన వేరుశనగ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విత్తన వేరుశనగ లోడ్లను వ్యవసాయ సిబ్బంది తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. నాణ్యతగా లేకుంటే వెనక్కు పంపాలని సూచించారు. ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ రైతులు విత్తన వేరుశనగ బస్తాలను పరిశీలించి తీసుకోవాలని, నాణ్యతగా లేకపోతే వెనక్కిఇవ్వాలని సూచించారు. జిల్లాకు విత్తన వేరుశనగ కేటాయింపు తక్కువగా ఉందని, రైతుల నుంచి డిమాండ్ దృష్ట్యా ఎక్కువ విత్తనం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ, ఆర్డీఓ కేశవనాయుడు, ఎస్డీసీ రామ్మోహన్, ఏడీఏ రవి, ప్రత్యేక అధికారి శ్రీనివాసులు, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఏఈఓ సుజిత పాల్గొన్నారు. మొక్కలు నాటి సంరక్షించాలి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ పేర్కొన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పంపనూరు నగర వనంలో ఎమ్మెల్యే సునీతతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారించాలన్నారు. కార్యక్రమంలో సీఎఫ్ఓ యశోదబాబు, డీఆర్ఓ మలోల, తదితరులు పాల్గొన్నారు. ఆస్తి పంచివ్వలేదని తల్లిపై దాడి పెద్దపప్పూరు: ఆస్తిలో వాటా పంచలేదనే కోపంతో తల్లిపై తనయుడు దాడి చేసిన సంఘటన పెద్దపప్పూరు మండలం గార్లదిన్నెలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. గార్లదిన్నెకు చెందిన సరస్వతికి శ్రీకాంత్ రెడ్డి, గోపాల్, వేణు సంతానం. గురువారం రెండో కుమారుడైన శ్రీకాంత్ రెడ్డి తనకు ఆస్తి పంచిలేదంటూ తల్లి సరస్వతితో ఘర్షణకు దిగాడు. తల్లిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ క్రమంలో సరస్వతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు శ్రీకాంత్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. బీటెక్ ఫలితాల విడుదల అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో బీటెక్ ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్లో నిర్వహించిన బీటెక్ రెండో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–23) రెగ్యులర్, (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ, రెండో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–23), (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి. నాగప్రసాద్ నాయుడు గురువారం విడుదల చేశారు. ఫలితాల కోసం జేఎన్టీయూ (ఏ) వెబ్సైట్ చూడాలని కోరారు. కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. నీటి తొట్టెలో పడి బాలుడి మృతి పెద్దవడుగూరు: నీటి తొట్టెలో పడి బాలుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చిత్రచేడు గ్రామంలో జరిగింది. వివరాలు.. చిత్రచేడుకు చెందిన అరుణ, ఆనంద్ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. చిన్న కుమారుడైన ఏడాదిన్నర వయసున్న అరుణ్ దీప్ గురువారం ఆడుకొంటూ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. తర్వాత ఎంత సేపటికీ లోపలికి వెళ్లలేదు. ఈ క్రమంలోనే కుటుంబసభ్యులు బయటకు రాగా.. నీటి తొట్టెలో అరుణ్ దీప్ అచేతన స్థితిలో కనిపించాడు. బయటకు తీసి వెంటనే పెద్దవడుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అరుణ్ దీప్ మృతి చెందినట్లు నిర్ధారించారు. -
నేడు జెడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా ప్రజా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు అనంతపురంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవనాల్లో శుక్రవారం నిర్వహించనున్నట్లు సీఈఓ వెంకటసుబ్బయ్య తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన స్థాయీ సంఘం–1, 2, 4, 7(ఆర్థిక, ప్రణాళిక/గ్రామీణాభివృద్ధి/విద్య, వైద్యం/ఇంజినీరింగ్ శాఖలు) సమావేశాలు ప్రధాన సమావేశ భవన్లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. అదనపు సమావేశ భవన్లో స్థాయీ సంఘం–3, 5, 6(వ్యవసాయం/ఐసీడీఎస్/సాంఘిక సంక్షేమ శాఖలు) సమావేశాలు ఆయా సంఘాల చైర్పర్సన్ల అధ్యక్షతన ప్రారంభమవుతాయని వివరించారు. గత సమావేశాల్లో ప్రజాప్రతినిధుల ప్రశ్నలకు సంబంధించిన వివరాలపై సమగ్ర సమాచారంతో అధికారులు హాజరు కావాలని సూచించారు. ● స్థాయీ సంఘ సమావేశాల్లో ఐసీడీఎస్లో పోషణ్ పక్వాడా నిర్వహణకు మంజూరైన నిధులు రూ.5 లక్షలు ఖర్చు పెట్టకుండా సీడీపీఓలు వాడుకోవడం, ఐఎస్ఓ ప్రమాణాలకు అనుగుణంగా కార్పొరేట్ హంగులతో కార్యాలయాలు ఉండాలన్న కలెక్టర్ వినోద్కుమార్ ఆశయం మేరకు ఐసీడీఎస్లో రూ.5 కోట్లతో ఆధునికీకరించిన వాటిని ఆర్నెల్లకే పీకి పడేయడంపై సభ్యులు చర్చించే అవకాశం ఉంది. ముంగారు సేద్యాలు మొదలైన కారణంగా ఇప్పటి వరకు విత్తనాలు, ఎరువుల ఊసే లేకపోవడం, పంట రుణాల రెన్యువల్, కొత్త రుణాల మంజూరు అంశాలపై సభ్యులు ప్రశ్నలు సంధించే పరిస్థితి ఉంది. కరోనా మళ్లీ కోరలు చాస్తున్న తరుణంలో వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు తీసుకోవడంలో శ్రద్ధ పెట్టకపోవడంపైనా నిలదీసే పరిస్థితి కనిపిస్తోంది. విద్యా సంవత్సరం పునఃప్రారంభం కానుండడంతో పుస్తకాల సరఫరాతో పాటు ముఖ్యంగా గురుకుల పాఠశాలల్లో సీట్ల సంఖ్యను పెంచే అంశంపైనా ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం. -
రంగయ్య పాదయాత్రపై కూటమి కుట్రలు
కళ్యాణదుర్గం: ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త, పీఏసీ సభ్యులు డాక్టర్ తలారి రంగయ్య చేపట్టిన ‘ఆర్డీటీ పరిరక్షణ మహా పాదయాత్ర’ను అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు కుట్రలకు తెరలేపారు. గురువారం ఉదయం బ్రహ్మసముద్రం మండలం కుర్లగుండ గ్రామంలో మొదలైన పాదయాత్ర మధ్యాహ్నానికి బొమ్మగానిపల్లి తండాకు చేరుకుంది. అక్కడి నుంచి బొమ్మగానిపల్లి చేరుకుని సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర తిరిగి కొనసాగాల్సి ఉంది. తమ్ముళ్లను ఉసిగొల్పిన వైనం.. రంగయ్య పాదయాత్ర టీడీపీ స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, ఆయనయ వర్గీయులకు మింగుడు పడటం లేదు. పాదయాత్రను కొనసాగిస్తే నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ మరింత బలపడుతుందని భయపడిన వారు యాత్రను అడ్డుకునేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు. తమ పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పారు. గురువారం బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి నుంచి పాదయాత్ర సాగాల్సిన రాయలదొడ్డి రహదారిపై ‘పచ్చ’ పార్టీ కార్యకర్తలు బైఠాయించారు. గో బ్యాక్ రంగయ్య అంటూ నినాదాలు చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చేందుకు ఒక్కో బైకుకు రూ.200 పెట్రోల్ వేయించడంతో పాటు క్వార్టర్ బాటిల్ సరఫరా చేసినట్లు తెలిసింది. భారీగా మోహరించిన పోలీసులు పాదయాత్రను అడ్డుకోవాలని కుట్ర పన్నిన టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో బొమ్మగానిపల్లికి చేరుకోవడంతో పోలీసు బలగాలు గ్రామానికి తరలివచ్చాయి. సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, స్పెషల్ పార్టీ సిబ్బంది పెద్ద సంఖ్యలో గ్రామంలో మోహరించారు. రంగయ్య శాంతియుత పాదయాత్రకు బుధవారం ఆటంకం కలిగించిన పోలీసుల తీరుతో వైఎస్సార్ సీపీ శ్రేణులు, ఆర్డీటీ లబ్ధిదారులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ క్రమంలోనే టీడీపీ శ్రేణులూ రావడంతో బొమ్మగానిపల్లిలో సుమారు 8 గంటల పాటు టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రయాణికులకు కష్టాలు.. మాజీ ఎంపీ తలారి రంగయ్య చేపట్టిన పాదయాత్రను అడ్డుకోవడానికి వచ్చిన టీడీపీ శ్రేణుల అత్యుత్సాహంతో సామాన్య ప్రయాణికులకు కష్టాలు తప్పలేదు. సాయంత్రం బొమ్మగానిపల్లి మీదుగా బుడిమేపల్లికి వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సుకు ‘పచ్చ’ పార్టీ కార్యకర్తలు అడ్డంగా బైఠాయించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. పోలీసులు జోక్యం చేసుకుని అరగంట తర్వాత బస్సును పంపించివేశారు. అదేవిధంగా కన్నేపల్లి, రాయలదొడ్డికి వెళ్లే వాహనదారులను సైతం వదలకపోవడంతో తీవ్ర అవస్థలు పడ్డారు. టీడీపీ శ్రేణులను ఉసిగొల్పిన ఎమ్మెల్యే అమిలినేని వర్గీయులు బైకుకు రూ.200 పెట్రోల్... ‘తమ్ముళ్ల’కు క్వార్టర్ బాటిల్ సరఫరా రోడ్డుపై బైఠాయించి హల్చల్ చేసిన ‘పచ్చ’ పార్టీ కార్యకర్తలు -
ఎస్ఏ పదోన్నతులకు సర్టిఫికెట్ల పరిశీలన
అనంతపురంం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల పదోన్నతుల్లో భాగంగా ఎస్జీటీల నుంచి స్కూల్ అసిస్టెంట్లగా పదోన్నతులు కల్పించేందుకు గురువారం సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది. స్థానిక శారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, మునిసిపల్, మునిసిపల్ కార్పొరేషన్ యాజమాన్యాల పాఠశాలల టీచర్లు హాజరయ్యారు. ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున 1:2 ప్రకారం సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచామని విద్యాశాఖ అధికారులు చెప్పినా... మొత్తం 382 పోస్టులు ఖాళీలుంటే, 372 మంది ఎస్జీటీలు రావడం విశేషం. యాజమాన్యాల వారీగా పరిశీలిస్తే... ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సబ్జెక్టులకు కలిపి 26 ఖాళీలుంటే 21 మంది ఎస్జీటీలు, మునిసిపల్ పాఠశాలల్లో 304 ఖాళీలుంటే 300 మంది, మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో 52 ఖాళీలుంటే 52 మంది హాజరయ్యారు. శుక్రవారం మండల పరిషత్ పాఠశాలల టీచర్లకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది. జిల్లాపరిషత్ స్కూళ్లలో అన్ని సబ్జెక్టులకు కలిపి 350 దాకా ఖాళీలున్నట్లు లెక్కలు తేల్చారు. మండల్ పరిషత్ టీచర్లతో పాటు ప్రభుత్వ, మునిసిపల్, కార్పొరేషన్ టీచర్లకు శుక్రవారం కూడా సర్టిఫికెట్ల పరిశీలనకు అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బదిలీ ఉత్తర్వుల కోసం స్కూల్ అసిస్టెంట్లు ఎదుచూపు బదిలీల ఉత్తర్వుల కోసం స్కూల్ అసిస్టెంట్లు ఉదయం నుంచి ఎదురుచూశారు. ముందురోజే ఆప్షన్ల ప్రక్రియ పూర్తయింది. ఆ వెంటనే ఆర్డర్స్ జనరేట్ అవుతాయని అధికారులు ప్రకటించారు. శుక్రవారం ఉదయం నుంచి రాత్రిదాకా వేలాది మంది టీచర్లు బదిలీ ఉత్తర్వులు కోసం ఎదురుచూశారు. తరచూ సెల్ఫోన్లు చూసుకోవడం, డీఈఓ కార్యాలయ సిబ్బందిని ఆరా తీయడం, ఉపాధ్యాయ సంఘాల నాయకులను వాకబు చేయడం, రాష్ట్రంలోని సంఘాల నాయకులను ఆరా తీయడం కనిపించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత జనరేట్ అయ్యే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. మొత్తం 4,589 మంది దరఖాస్తు ఉమ్మడి జిల్లాలో మొత్తం 4,589 మంది స్కూల్ అసిస్టెంట్లు బదిలీల కోసం దరఖాస్తు చేసుకుని వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. వీరిలో 2,456 మంది తప్పనిసరి, 2,133 మంది టీచర్లు రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. సబ్జెక్టుల వారీగా పరిశీలిస్తే..,. బయలాజికల్ సైన్స్ 631 మంది, ఇంగ్లిష్ 656, హిందీ 383 మంది, కన్నడ ముగ్గురు, గణితం 847 మంది, పీడీలు 262 మంది, ఫిజికల్ సైన్స్ 616 మంది, సంస్కృతం ఏడుగురు, సోషల్ 544 మంది, స్పెషల్ ఎడ్యుకేషన్ 37 మంది, తెలుగు 584 మంది, ఉర్దూ 19 మంది దరఖాస్తు చేసుకున్నారు. నేడు మండల పరిషత్ పాఠశాలల టీచర్ల సర్టిఫికెట్ల పరిశీలన పదోన్నతి పంచాయితీ ఇటీవల జరిగిన హెచ్ఎం పదోన్నతుత్లో నాట్ ఆప్టెడ్ (ప్రస్తుతం పదోన్నతి ఇష్టం లేదు) ఇచ్చిన ఓ స్కూల్ అసిస్టెంట్ ఇప్పుడు పదోన్నతి కావాలని అడుగుతున్నాడు. ఈ విషయం విద్యాశాఖలో ప్రస్తుతం హాట్టాపిక్గా మారింది. వివరాలు.. స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎం పదోన్నతులకు ఇటీవల కౌన్సెలింగ్ నిర్వహించారు. ధర్మవరం మునిసిపల్ బాలికల పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్న ఓ టీచరు... పదోన్నతి జాబితాలో ఉన్నాడు. వాస్తవానికి ఇదే స్కూల్లో హెచ్ఎం పోస్టు ఖాళీ ఉంది. తాను హెచ్ఎం పదోన్నతి తీసుకుని ఇదే స్కూల్కు రావాలని ఆయన భావించాడు. అయితే, సీనియార్టీ జాబితాలో ఈయనకంటే ముందు మరో ఇద్దరు టీచర్లు ఉన్నారు. సదరు టీచరు కౌన్సెలింగ్కు హాజరైనప్పుడు ధర్మవరం బాలికల పాఠశాల పోస్టు ఖాళీగానే ఉంది. నిబంధనల ప్రకారం 50 ఏళ్లు దాటిన పురుష టీచరు బాలికల పాఠశాల కోరుకున్నా... ఆయన వెనక (చివరిస్థానంలో ఉన్నాసరే) ఉన్న మహిళా టీచరు సదరు బాలికల పాఠశాల కోరుకుంటే ఆయన వెనక్కు రావాల్సిందే. ఆ సమయంలో మిగులుగా ఉన్న స్కూళ్లకు కేటాయిస్తారు. ఇదే విషయాన్ని సదరు టీచరుకు అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆయన పదోన్నతి వద్దని ఆప్షన్ ఇచ్చాడు. ఈ క్రమంలో సీనియార్టీ జాబితాలో ఆ టీచరు వెనుక మరో ఇద్దరు టీచర్లు ఉన్నారు. అక్కడితో ఖాళీలన్నీ పూర్తవుతాయి. ఇద్దరూ పదోన్నతి పొందారు. పురుష టీచరు తీసుకోకపోవడంతో సీనియార్టీ జాబితాలోని మూడో టీచరుకు అవకాశం కల్పించారు. తాజాగా నాట్ ఆప్టెడ్ ఇచ్చిన సదరు టీచరు రంగంలోకి దిగి డీఈఓపై ఉన్నతాధికారులతో ఒత్తిళ్లు చేయించినట్లు తెలి సింది. దిక్కు తెలీని అధికారులు... ఆయన పదోన్నతి తీసుకున్న ముగ్గురు టీచర్లను పిలిపించి చివరి టీచరు రివర్షన్ వెళ్లాలని సూచించారు. ఇందుకు సదరు టీచరు ససేమిరా అంటుండటంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్: నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో 8 కేంద్రాలు, బెంగళూరులో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రోజూ రెండు విడతలుగా ఈనెల 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. డీఈఓ పరిధిలోని కేంద్రాలకు పరిశీల కులుగా జాయింట్ డైరెక్టర్ సుబ్బారావును నియమించారు. పరీక్షలయ్యేదాకా ఆయన ఇక్కడే ఉంటూ కేంద్రాలను పరిశీలించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అన్ని కేంద్రాలకు డిపార్ట్ మెంట్ అధికారులను నియమించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. అభ్యర్థులు గంటన్నర ముందే కేంద్రాలకు చేరుకోవాలని కోరారు. డీఎస్సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు అనంతపురం అర్బన్: డీఎస్సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏడు కేంద్రాల్లో శుక్రవారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. నగరంలో ఏడు కేంద్రాలు, గుత్తి, తాడిపత్రి పట్టణాల్లో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. రెండు సెషన్లుగా పరీక్ష జరుగుతుందన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. డీఎస్సీ నిర్వహణకు జిల్లా రెవెన్యూ అధికారి ఇన్చార్జ్గా వ్యవహరిస్తారన్నారు. కేంద్రానికి ఒకరు చొప్పున ఏడు కేంద్రాలకు డిప్యూటీ కలెక్టర్లను ఇన్చార్జ్లుగా నియమించామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. డిప్యూటీ కలెక్టర్లు రోజూ పరీక్ష కేంద్రాలు తనిఖీ చేయాలని చెప్పారు. తాను కూడా పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ ఎ.మలోల, డీఎస్పీ వెంకటేషులు, డీఈఓ ప్రసాద్బాబు, కలెక్టరేట్ ఏఓ అలెగ్జాండర్, ఎస్పీడీసీఎల్ ఎస్ఈ శేషాద్రి శేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు జిల్లా పరిశీలకులుగా జేడీ సుబ్బారావు -
8 మంది తహసీల్దార్లకు స్థానచలనం
అనంతపురం అర్బన్: జిల్లాలో పలువురు తహసీల్దార్లకు స్థానచలనం కల్పిస్తూ కలెక్టర్ వి.వినోద్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ కోసం 16 మంది తహసీల్దార్లు దరఖాస్తు చేసుకున్నారు. తొలి విడతగా 8 మందిని బదిలీ చేశారు. ఖాళీ స్థానాలను భర్తీ చేయని వైనం.. జిల్లాలో కూడేరు, విడపనకల్లు, వజ్రకరూరు, కణేకల్లు, యల్లనూరు తహసీల్దార్లతో పాటు అనంతపురం ఆర్డీఓ కార్యాలయం డీఏఓ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. డీ.హీరేహాళ్ తహసీల్దారును బెళుగుప్పకు బదిలీ చేశారు. శెట్టూరు తహసీల్దారు ఈ నెల 2న ఉద్యోగ విరమణ చేశారు. ఆ స్థానంలో కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయ డీఏఓని నియమించారు. ఇన్చార్జ్ పాలనలో ఉన్న ఆరు మండలాలకు తహసీల్దార్లను, అనంతపురం ఆర్డీఓ కార్యాలయ డీఏఓని తొలివిడతలో నియమించలేదు. -
ఎస్పీ గారూ.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం?
యల్లనూరు: ‘హైకోర్టు ఆర్డర్ తెచ్చుకుంటే తాడిపత్రికి పంపుతానని హామీ ఇచ్చారు. న్యాయస్థానం నుంచి ఆ మేరకు ఉత్తర్వులు తెచ్చుకుంటే ఏవేవో కారణాలు చెబుతూ అడ్డుకుంటున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యమో అర్థం కావడం లేదు. జిల్లా ఎస్పీ గారు.. హత్యా రాజకీయాలను ప్రోత్సహించొద్దు. కావాలంటే ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయండి’ అంటూ తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు యాడికి మండలంలో ‘వెన్నుపోటు దినం’ ర్యాలీలో పాల్గొనేందుకు కార్యకర్తలతో బయల్దేరిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు తెల్లవారుజామునే డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పెద్ద ఎత్తున పెద్దారెడ్డి స్వగ్రామమైన మండలంలోని తిమ్మంపల్లికి చేరుకున్నారు. ఇంటి నుంచి మాజీ ఎమ్మెల్యే బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ‘మీరు కాకుండా మీ తరఫున ఎవరైనా యాడికి వెళ్లొచ్చు’ అంటూ డీఎస్పీ తెలుపగా పెద్దారెడ్డి తన కుమారుడు హర్షవర్దన్రెడ్డిని పంపించారు. ఈ క్రమంలోనే తనను ఎస్పీ వద్దకు తీసుకెళ్లాలని పెద్దారెడ్డి పోలీసులు పట్టుబట్టగా పోలీసులు నిరాకరించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ తీరుపై విమర్శలు గుప్పించారు. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి మాట వింటూ తనపై ఎస్పీ జగదీష్ కక్ష కట్టారని మండిపడ్డారు. కోర్టు ఆర్డర్ను సైతం పక్కన పెట్టడం అన్యాయమన్నారు. పోలీసుల వరకు వస్తే చట్టాలు.. మా వరకు వస్తే సాకులు చెబుతారా అని ప్రశ్నించారు. ఎస్పీకి ఆరు సార్లు మెయిల్ పెట్టినా పట్టించుకోలేదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తాము ఎప్పుడూ ఇలా వ్యవహరించలేదన్నారు. భవిష్యత్తులో మళ్లీ అధికారంలోకి వస్తామని, అన్నీ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. ఇటీవల తిమ్మనచెరువు గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై దాడులు చేస్తే పోలీసులు కేసులు నమోదు చేయలేదన్నారు. ఇదేం ప్రజాస్వామ్యం అని పెద్దారెడ్డి దుయ్యబట్టారు. తాడిపత్రి జేసీ నాగిరెడ్డి జాగీరు కాదని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనరు వెంకటేష్నాయుడు, నాయకులు గొడ్డుమర్రి ఈశ్వర్రెడ్డి, దంతలపల్లి పెద్దిరెడ్డి, విజయభాస్కర్రెడ్డి, కల్లూరు సూరి, కొత్తపల్లి పురుషోత్తం నాయుడు, వెంకటాంపల్లి శంకర్రెడ్డి, యల్లనూరు కిరణ్, చిలమకూరు జనార్థన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించొద్దు కావాలంటే రాజీనామా చేసి టీడీపీ తరఫున పోటీ చేయండి కోర్టు అనుమతి ఇచ్చినా జేసీ మాట విని అడ్డుకుంటారా? మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ధ్వజం -
ఉద్రిక్తత నడుమ సేవ్ ఆర్డీటీ
●ఆర్డీటీ పరిరక్షణ పాదయాత్రను అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు ●ఉద్రిక్తతల మధ్య సాగిన మొదటి రోజు పాదయాత్ర కళ్యాణదుర్గం/ బెళుగుప్ప: కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య పిలుపు మేరకు బుధవారం చేపట్టిన ఆర్డీటీ పరిరక్షణ పాదయాత్రను పోలీసులు అడ్డుగడుగునా అడ్డుకున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు బెళుగుప్ప మండలం గొంచితండా నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. భారీ సంఖ్యలో హాజరైన పార్టీ శ్రేణులు, ఆర్డీటీ లబ్దిదారులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి అనుమతులు లేవంటూ గొంచితండా నుంచి బ్రాహ్మణపల్లి వరకూ అడుగడుగునా కళ్యాణదుర్గం, గుంతకల్లు, డీఎస్పీలు, ఐదుగురు సీఐలు, పెద్ద సంఖ్యలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు వాహనాలను రహదారికి అడ్డంగా పెట్టారు. పాదయాత్రను భగ్నం చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. ఒకానొక దశలో ఒక్కసారిగా తలారి రంగయ్యను చుట్టుముట్టి బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపు తప్పి ఉద్రిక్తత చోటు చేసుకుంది. రంగయ్యను తమ భుజాల మీదకు ఎత్తుకుని పోలీసుల వలయాన్ని ఛేదించుకుని కార్యకర్తలు ముందుకు సాగారు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ తొలి రోజు పాదయాత్ర గొంచి తండా నుంచి రాయదుర్గం – కళ్యాణదుర్గం ప్రధాన రహదారి మీదుగా కొత్త బ్రాహ్మణపల్లి, పాత బ్రాహ్మణపల్లి, నరసాపురం, బ్రహ్మసముద్రం మండలం కుర్లగుండ గ్రామం వరకూ సాగింది. ఆర్డీటీ పరిరక్షణ అందరి బాధ్యత గొంచితండాలో ఏర్పాటు చేసిన పాదయాత్ర ప్రారంబోత్సవ సభలో తలారి రంగయ్యతో పాటు పార్టీ జిల్లా అద్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, ఉరవకొండ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, రాయదుర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాదవ్, జెడ్పీ చైర్పర్రసన్ బోయ గిరిజమ్మ, రాష్ట్ర నాయకులు మహాలక్ష్మి శ్రీనివాస్, ఉమామహేశ్వరనాయుడు, తిప్పేస్వామి, చందన శివాజీ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్డీటీ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. కరువు జిల్లా అనంతలో పేదరికం రూపుమాపేందుకు 50 సంవత్సరాలుగా ఆర్డీటీ చేస్తున్న కృషిని కొనియాడారు. ఆర్డీటీ సేవలను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరు సరైంది కాదన్నారు. ఇప్పటికై నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఆర్డీటీకి ఎప్సీఆర్ఏను రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారు. రమనేపల్లి సర్పంచ్ రమేష్, నరసాపురం ఎంపీటీసీ సురేష్, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, పార్టీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిదులు, వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల నాయకులు, ఆర్డీటీ లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
‘రిక్వెస్ట్’ కాస్త ‘కంపల్సరీ’ అయింది
● తాడిపత్రిలోని ప్రభుత్వ స్కూల్లో పని చేస్తున్న బయాలజీ సైన్స్ టీచరు మరో 8 నెలల్లో ఉద్యోగ విరమణ పొందనున్నారు. నాలుగేళ్లుగా ఆమె ఈ స్కూల్లోనే పనిచేస్తున్నారు. ఆమె సబ్జెక్టుకు సంబంధించి అనంతపురంలో ఖాళీలు ఉండడంతో రిక్వెస్ట్ బదిలీ కింద దరఖాస్తు చేసుకున్నారు. బుధవారం వెబ్ ఆప్షన్లు ఇచ్చే క్రమంలో అనంతపురం స్కూళ్లు మాత్రమే ఆప్షన్ ఇచ్చి తర్వాత తాను పని చేస్తున్న స్కూల్ కనబరిచి సబ్మిట్ చేయబోతే సిస్టం అంగీకరించలేదు. తప్పనిసరి బదిలీల టీచర్లు లాగానే జిల్లాలో మీ సబ్జెక్టులో ఉన్న అన్ని ఖాళీలకు ఆప్షన్ ఇచ్చుకోవాలంటూ సూచన కనిపించింది. ● ఉపాధ్యాయులకు చుక్కలు చూపిస్తున్న బదిలీల సాఫ్ట్వేర్ ● రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకుంటే ‘కంపల్సరీ’గా చూపిస్తున్న వైనం -
పర్యావరణ దినోత్సవ ఏర్పాట్లు బాగుండాలి
అనంతపురం అర్బన్: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించాలని సంబంధిత అధికాలను కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. లోటుపాట్లకు తావివ్వకుండా నిర్వహణ ఏర్పాట్లు బాగుండాలన్నారు. పర్యావరణ దినోత్సవం ఏర్పాట్లపై కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో ఆయన సమీక్షించారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని నివారిద్ధామనే నినాదంతో ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించనున్నామన్నారు. ఆత్మకూరు మండలం పంపనూరు సమీపంలోని నగర వనంలో జిల్లా స్థాయి కార్యక్రమం ఉంటుందన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. గురువారం తరువాత ప్రతి రోజు ఒక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే మొక్కలు నాటే కార్యక్రమంలో తాను పాల్గొంటానన్నారు. నగర, పట్టణ ప్రాంతాల్లో అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. అనంతరం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం–2025 పోస్టర్లను కలెక్టర్, అధికారులు ఆవిష్కరించారు. సమీక్షలో అటవీశాఖ ప్లయింగ్ స్క్వాడ్ గురుప్రభాకర్, డ్వామా పీడీ సలీంబాషా, డీపీఈఓ నాగరాజు నాయుడు, జెడ్పీ సీఈఓ రామసుబ్బయ్య, నగర పాలక కమిషనర్ బాలస్వామి, కాలుష్య నియంత్రణ మండలి బోర్డు ఈఈ మునిప్రసాద్, డీసీఓ ఆరుణకుమార్, ఉద్యాన శాఖ డీడీ నరసింహారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 48 పట్టాదారు పాసు బుక్కుల రద్దు గుత్తి: మండలంలోని ఊటకల్లు రెవెన్యూ పరిధిలో గుర్తించిన 48 దొంగ పట్టాదారు పాస్ బుక్కులను సంబంధిత అధికారులు రద్దు చేశారు. గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇటీవల ఆర్డీఓ శ్రీనివాస్ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలో తహసీల్దార్ ఓబులేసు, రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ లత, వీఆర్వోలు వారం పాటు విచారణ చేశారు. మొత్తం 48 మంది దొంగ పట్టాదారు పాస్ బుక్కులు కలిగినట్లుగా గుర్తించారు. వీరిలో కొందరు ప్రభుత్వ భూములకు పాస్ బుక్కులు చేయించుకోగా, మరి కొందరు భూములు లేకున్నా పాస్ బుక్కులు పొంది రైతు భరోసా, బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. మండల వ్యాప్తంగా మరో 50 కి పైగా దొంగ పట్టాదారు పాసు బుక్కులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బుధవారం తహసీల్దార్ ఓబులేసు, రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ లతను వివరణ కోరగా ఊటకల్లులో 48 దొంగ పట్టాదారు పాసు బుక్కులను రద్దు చేసిన మాట వాస్తవమేనన్నారు. మండల వ్యాప్తంగా విచారణ చేస్తున్నామన్నారు. విచారణలో దొంగ పట్టాదారు పాసు బుక్కులు ఉన్నట్లు తేలితే రద్దు చేస్తామన్నారు. దొంగ పట్టాదారు పాసు బుక్కులతో రైతు భరోసా, బ్యాంకుల్లో పంట రుణాలు పొందిన వారిపై తదుపరి చర్యలు ఆర్డీఓ తీసుకుంటారన్నారు. -
పేదోడి ఆకలి తీరాలంటే జగన్ సీఎం కావాలి
తాడిపత్రి టౌన్: పేదోడి ఆకలి తీరాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎం కావాలని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట కార్యదర్శి సుధాకర్బాబు అన్నారు. వైఎస్ జగన్ను సీఎంగా చేసేందుక ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాడిపత్రి నియోజకవర్గం యాడికిలో బుధవారం జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... ఎన్నికల వాగ్దానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా సీఎం చంద్రబాబు అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ఈ వెన్నుపోటును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టినట్లు తెలిపారు. తాడిపత్రిలో అప్రజాసామ్యం రాజ్యమేలుతోందన్నారు. ఇక్కడ పోలీస్ వ్యవస్థ లేదన్నారు. ప్రజాస్వామ్యం అనేది కంటికి కూడా కనిపించదన్నారు. వింత పోకడలు, విచిత్ర పోకడలతో ఇక్కడ రాక్షస రాజ్యం నడుస్తోందన్నారు. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అక్రమంగా నిర్బందిస్తున్నారన్నారు. నిర్బంధాలను ఛేదించుకుని ఏదో ఒక రోజు పెద్దారెడ్డి బయటకు రావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కొనుదల రమేష్రెడ్డి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పేరం స్వర్ణలత, యువ నేత కేతిరెడ్డి హర్షవర్ధన్రెడ్డి, ముస్లిం మైనార్టీ నాయకుడు ఫయాజ్బాషా తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట కార్యదర్శి సుధాకర్బాబు -
9న రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రం ప్రారంభం
అనంతపురం: జేఎన్టీయూ (ఏ)లో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ ప్రాంతీయ కేంద్రాన్ని ఈ నెల 9న సీఎం చంద్రబాబు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జేఎన్టీయూ(ఏ) పాలక భవనాన్ని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ బుధవారం పరిశీలించారు. అడ్మిన్ బిల్డింగ్లో క్లీనింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్ పనులు, అవసరం మేరకు ఫర్నీచర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ ఎస్ఈ వి. రాజగోపాల్, జేఎన్టీయూ అనంతపురం ప్రొఫెసర్ పీఆర్ భానుమూర్తి, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి ప్రతాప రెడ్డి పాల్గొన్నారు. రైలు కిందపడి ఇద్దరి మృతి తాడిపత్రి రూరల్: మండలంలోని చల్లవారిపల్లి వద్ద బుధవారం రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని రైల్వే ఎస్ఐ నాగప్ప తెలిపారు. అందిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించామన్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు. వయస్సు 40సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందించాలని కోరారు. అనంతపురం సిటీ: స్థానిక జీఆర్పీ పరిధిలోని గార్లదిన్నె–తాటిచెర్ల రైల్వేస్టేషన్ల మధ్య రైలు ఢీకొని గుర్తు తెలియని ఓ వ్యక్తి (50) దుర్మరణం పాలయ్యాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగి ఉంటుందని జీఆర్పీ ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి పట్టాలపై ఛిద్రమై పడి ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని సర్వజనాస్పత్రిలోని మార్చురీకి తరలించామన్నారు. వ్యక్తి మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే అనంతపురం రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు. నేటి నుంచి విత్తన వేరుశనగ పంపిణీ అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో గురువారం నుంచి రాయితీ విత్తన వేరుశనగ పంపిణీ ప్రారంభిస్తున్నట్లు వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. కార్యక్రమాన్ని ఆత్మకూరు మండలం పంపనూరులో కలెక్టర్ వినోద్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే ప్రారంభిస్తారని పేర్కొన్నారు. మిగతా మండలాల్లో శుక్రవారం నుంచి మొదలవుతుందని తెలిపారు. ఒక్కో రైతుకు గరిష్టంగా 90 కిలోలు (3 బస్తాలు) పంపిణీ చేస్తామన్నారు. -
అనంతపురం–బెంగళూరు ప్యాసింజర్ రైలు ప్రారంభం
అనంతపురం సిటీ: అనంతపురం–బెంగళూరు మధ్య ప్యాసింజర్ రైలును బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. కలెక్టర్ డాక్టర్ వి.వినోద్కుమార్, ఎమ్మెల్యే సునీత, డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా, అహుడా చైర్మన్ టీసీ వరుణ్తో కలసి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పచ్చ జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. అనంతపురం నుంచి బెంగళూరుకు రూ.50కే చేరుకోవచ్చన్నారు. 12 బోగీలుంటాయన్నారు. అనంతపురం రైల్వే స్టేషన్లో వాటరింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని డీఆర్ఎంకు సూచించారు. మెమూ రైలు సాయంత్రం బెంగళూరు నుంచి అనంతపురానికి బయలుదేరేలా చూడాలని ఎమ్మెల్యే సునీత కోరారు. కార్యక్రమంలో ఆర్డీఓ గుత్తా కేశవ నాయుడు, సౌత్ సెంట్రల్ రైల్వే డీజీఎం ఉదయ్నాథ్, రైల్వే సీనియర్ డీసీఎం మనోజ్, సీనియర్ డీఎంఓ శ్రవణ్ కుమార్, సీనియర్ డీఈఈ సుదర్శన్రెడ్డి, ఏడీఆర్ఎం సుధాకర్, అనంతపురం రైల్వే స్టేషన్ మాస్టర్ అశోక్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ‘వీర’బాదుడుతో సెంచరీ అనంతపురం: వైఎస్సార్ జిల్లా కడపలో జరుగుతున్న అండర్–23 అంతర జిల్లా క్రికెట్ టోర్నీలో బుధవారం జరిగిన అనంతపురం, చిత్తూరు జట్ల మధ్య మ్యాచ్లో అనంత బ్యాటర్ కోగటం హనీష్ వీరారెడ్డి వీరబాదుడుతో బంతిని బౌండరీలు దాటించి 125 పరుగులు సాధించాడు. 69 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో చెలరేగిపోయాడు. కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన చిత్తూరు జట్టు పది వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసి ఆలౌట్ అయింది. జట్టులో లోహిత్ లక్ష్మీ నారాయణ 80 పరుగులు, కె.రెడ్డిరుషీల్ 60 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన అనంతపురం జట్టు ఓపెనర్ కోగటం హనీష్వీరారెడ్డి 125 పరుగులతో నాటౌట్గా నిలిచారు. మరో బ్యాటర్ పి.అర్జున్ టెండూల్కర్ 27 పరుగులు చేశాడు. ఈ సిరీస్లో తొలి సెంచరీ సాధించిన కోగటం హనీష్ వీరారెడ్డిని జట్టు సభ్యులు, కోచ్లు అభినందించారు. -
‘పీఎంశ్రీ’తో పాఠశాలల సమగ్రాభివృద్ధి
అనంతపురం ఎడ్యుకేషన్: పాఠశాలల సమగ్రాభివృద్ధికి పీఎంశ్రీ పథకం దోహదపడుతోందని సమగ్రశిక్ష ఏపీసీ టి.శైలజ అన్నారు. స్థానిక జిల్లా సైన్స్ సెంటర్లో మంగళవారం ఎంఈఓ–2, ఇంజినీర్లు, పీఎంశ్రీ పథకానికి ఎంపికై నా పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో రాష్ట్ర పరిశీలకులు సురేష్కుమార్తో కలసి ఆమె సమావేశమై మాట్లాడారు. పీఎంశ్రీ పథకం లక్ష్యం, ఇందుకు సంబంధించి పాఠశాలల్లో విభాగాల ఏర్పాటు అంశాలను సురేష్కుమార్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి పీఎంశ్రీ పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. పథకంలో భాగంగా అటల్ టింకరింగ్ ల్యాబ్, క్రీడా మైదానాల ఏర్పాటు, డిజిటల్ బోధన కోసం కంప్యూటర్ ల్యాబ్, శుద్ధ నీటి కోసం ఆర్వో ప్లాంట్ తదితర సౌకర్యాల ద్వారా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. అనంతరం ఏపీసీ శైలజ మాట్లాడుతూ... పీఎంశ్రీ నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్కూల్ గ్రాంటు, ఎమ్మార్సీ గ్రాంట్, సీఆర్సీ గ్రాంట్ల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని మండల విద్యాధికారులకు సూచించారు. అనంతరం పీఎంశ్రీ పాఠశాలల్లో చేపట్టిన నిర్మాణ పనుల స్థితి, యాప్లో తలెత్తే సాంకేతిక సమస్యలు... వాటి పరిష్కారం, భారత్ స్కౌట్ గైడ్స్ విభాగం ఏర్పాటుపై చర్చించారు. సమావేశంలో సమగ్రశిక్ష సూపరింటెండెంట్ మహమ్మద్ ఇక్బాల్, డీఈ జయరామ్, ఏపీఓ నారాయణస్వామి, టీసీఎస్ సాంకేతిక నిపుణుడు రాజు పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఏపీిసీ శైలజ -
●ఈ తిప్పలు పడలేకున్నాం
కూటమి పాలనలో ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తమైందని రేషన్ లబ్ధిదారులు వాపోతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎండీయూ పద్ధతిని ప్రవేశపెట్టి ఇంటి వద్దకే చేపట్టిన రేషన్ పంపిణీ విధానం ఎంతో బాగుందని, ఇప్పుడు చౌకధాన్యపు డిపోల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు మానుకుని మండుటెండలో రోజంతా వేచి ఉండాల్సి వస్తుండడంతో ఉపాధి కోల్పోవాల్సి వస్తోందని అంటున్నారు. ఈ తిప్పలు పడలేకున్నామని, ఇంటి వద్దకే రేషన్ పంపిణీ విషయం మరోసారి ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం: -
రేషన్ బియ్యం పట్టివేత
తాడిపత్రి టౌన్: స్థానిక రూరల్ పరిధిలోని గన్నెవారిపల్లి కాలనీ సమీపంలో దుర్గమ్మ గుడి వద్ద నివాసముంటున్న ముల్లా నజీర్ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 200 బస్తాల రేషన్ బియాన్ని పోలీసు, రెవెన్యూ అధికారులు సీజ్ చేసారు. అందిన పక్కా సమాచారంతో తహసీల్దార్ రజాక్వలి, సీఐ శివగంగాధర్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు చేపట్టారు. బియ్యం డంప్ చేసిన ముల్లా నజీర్, వేణుగోపాల్, గంగాధర్, చక్రపాణిపై కేసు నమోదు చేశారు. మహిళ అనుమానాస్పద మృతి కళ్యాణదుర్గం: కర్ణాటకలోని వైఎన్ హొసకోట సమీపంలో జిల్లాకు చెందిన ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. కర్ణాటక పోలీసుల నుంచి సమాచారం అందుకున్న కంబదూరు ఎస్ఐ ప్రవీణ్, సిబ్బంది మంగళవారం అక్కడకు చేరుకుని పరిశీలించారు. వైఎన్ హొసకోట సమీపంలోని గుట్టలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని పరిశీలించి, కంబదూరు మండలం చెన్నంపల్లి గ్రామానికి చెందిన వరలక్ష్మిగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కాగా, ఈ ఏడాది మే 22 నుంచి వరలక్ష్మి కనిపించడం లేదంటూ అప్పట్లో ఆమె సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మే 23న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. -
వారికి ఇంటి వద్దనే రేషన్ ఇవ్వండి
● కలెక్టర్ వినోద్కుమార్ అనంతపురం అర్బన్: వృద్ధులు, దివ్యాంగులు, నిస్సహాయస్థితిలో ఉన్నవారికి ఇంటి వద్దనే రేషన్ పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. అనంతపురంలోని కొవూరునగర్ ఆరో వార్డు పరిధిలోని 65 ఏళ్లు పైడిన వృద్ధులు, దివ్యాంగులు, మంచానికే పరిమితమైన లబ్ధిదారుల ఇళ్ల వద్దకే బియ్యం, నిత్యాసవర సరుకులు పంపిణీని కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. దివ్యాంగురాలికి సరుకులను కలెక్టర్ స్వయంగా అందజేశారు. ఇకపై 65 ఏళ్లు ౖపైబడిన వృద్ధులు, దివ్యాంగులు, నిస్సహాయులు చౌక దుకాణానికి వెళ్లాల్సిన పనిలేదన్నారు. వారికి ఇంటి వదద్దకే డీలర్లు సరుకులు చేరుస్తారన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు హరికుమార్, సీఎస్డీటీ రామకృష్ణ, డీలర్ లక్ష్మీదేవి పాల్గొన్నారు. విజిలెన్స్ తనిఖీలు గుత్తి: స్థానిక బీసీ కాలనీలోని ప్రభుత్వ చౌక ధాన్యపు దుకాణం, మెయిన్ బజారులో ఉన్న 8వ నంబర్ దుకాణాన్ని మంగళవారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. 8వ స్టోర్లో 46 చక్కెర ప్యాకెట్లు, 89 కిలోల బియ్యం స్టాక్లో నమోదు చేసిన దాని కంటే అధికంగా ఉన్నట్లుగా గుర్తించారు. కార్యక్రమంలో విజిలెన్స్ ఎస్ఐ వెంకటప్రసాద్, ఏఓ సాయి, పీఆర్ఓ ఆదినారాయణమ్మ పాల్గొన్నారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఆర్థిక సాయం అనంతపురం క్రైం: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల పొదుపు మరియు పరపతి సహకార సంఘం లిమిటెడ్ (ఏపీఆర్టీసీ సీసీఎస్) ద్వారా అర్హులైన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల సంఘం నేత రామిరెడ్డి మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీసీఎస్లో కనీసం ఐదేళ్ల సభ్యత్వం కలిగి, 63 సంవత్సరాలు వయసు నిండిన వారు అర్హులు. అనంతపురం డిపో వద్ద ఉన్న సంఘం కార్యాలయంలో ప్రతినిధులను సంప్రదించి దరఖాస్తులను పొందవచ్చు. చెరకు పంట దగ్ధం గార్లదిన్నె: మండలంలోని బూదేడులో మంగళవారం చెలరేగిన మంటల్లో చెరకు పంట దగ్ధమైంది. గ్రామానికి చెందిన శాంతరాజు మరో రైతుకు చెందిన 7 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని ఎకరాకు రూ.12 వేలు చొప్పున చెల్లించేలా ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం చెరకు పంట సాగు చేపట్టాడు. మంగళవారం ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పు రవ్వలు పడి మంటలు రాజుకున్నాయి. చూస్తుండగానే చెరకు తోటను మంటలు చుట్టుముట్టడంతో డ్రిప్ పరికరాలు, పైపులు, స్స్రింకర్లు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసేలోపు రూ.10 లక్షల మేర నష్టం జరిగినట్లు బాధిత కౌలు రైతు వాపోయాడు. -
మా వాడే.. దగ్గరకు వేయండి
అనంతపురం సిటీ: ‘అతను మా వాడే.. జిల్లా కేంద్రానికి సమీపంలోని ఏదో ఒక మండలానికి ఏఓగా వేయండి’ అంటూ జిల్లా ప్రజా పరిషత్ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్ద పని చేసే ఓ అధికారి ఫోన్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. మొన్నటి వరకు జిల్లా పరిషత్ కార్యాలయంలో పని చేసి ఎనిమిది నెలల క్రితం కళ్యాణదుర్గం నియోజకవర్గానికి బదిలీపై వెళ్లిన పరిపాలనాధికారి(ఏఓ) ఒకరు ఎలాగైనా జెడ్పీ లేదా చుట్టుపక్కల మండలాలకు చేరుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. మొన్నటి వరకూ జెడ్పీ అధికారులు, పాలకవర్గ పెద్దల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో కులం కార్డు బయటకు తీసి నేనూ మీ సామాజిక వర్గం వాడినేనంటూ డిప్యూటీ సీఎం పేషీలోని ఓ అధికారిని ఆశ్రయించి అతని ద్వారా జెడ్పీ అధికారులపై ఒత్తిడి పెంచారు. విజిలెన్స్ విచారణ కొనసాగుతుండగానే.. సదరు ఏఓ జెడ్పీలో పని చేసిన సమయంలో అప్పటి ముఖ్య అధికారుల అండ చూసుకొని బరితెగించి ప్రవర్తించాడు. పాలకవర్గం అనుమతి లేకుండానే ఏకంగా రూ.3 కోట్ల వరకు కాంట్రాక్టర్లకు చెల్లించడం అప్పట్లో దుమారం రేపింది. అందుకు ప్రతిఫలంగా భారీగానే ముడుపులు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జెడ్పీలోని ముఖ్య అధికారులు, సహచార ఉద్యోగుల పేర్లు కూడా వాడుకొని కాంట్రాక్టర్లతో డబ్బులు వసూలు చేసినట్లు సమాచారం. ఈ అంశంపై ప్రభుత్వానికి, లోకాయుక్తకు, విజిలెన్స్కు రాత పూర్వకంగా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో సమగ్ర విచారణకు విజిలెన్స్ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. ఇంకా విచారణ కొనసాగుతుండగానే తాను అనుకుంటే పాలకవర్గం, జెడ్పీ ముఖ్య అధికారులు కూడా ఏమీ చేసుకోలేరని, కోరుకున్న చోటుకు పోస్టింగ్ తెచ్చుకోకపోతే తన పేరు మార్చుకుంటానంటూ సవాళ్లు విసురుతుండడం జెడ్పీలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మండల ఏఓ బదిలీ విషయంగా జెడ్పీ అధికారులకు డిప్యూటీ సీఎం పేషీ నుంచి ఫోన్ -
బహిర్గతమైన ‘కూటమి’ విభేదాలు
అనంతపురం: ఉమ్మడి జిల్లాలో కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. టీడీపీకి చెందిన మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అవినీతి అక్రమాలను బహిర్గతం చేస్తానని బీజేపీకి చెందిన ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ మంగళవారం అనంతపురం నగరంలో ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. అలాగే రుద్రంపేట సర్కిల్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో రౌండ్టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి బీసీలను పల్లె వంచిస్తున్న తీరుపై చర్చించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఫంక్షన్ హాల్ వద్దకు ఆయన చేరుకోగానే పెద్ద సంఖ్యలో పల్లె అనుచరులు అక్కడకు చేరుకుని భయభ్రాంతులకు గురి చేశారు. ఇరువర్గాలు బాహా బాహీకి దిగాయి. నడిరోడ్డుపైనే తోపులాట చోటు చేసుకుంది. ప్రెస్మీట్, రౌండ్టేబుల్ సమావేశం విరమించుకుని వెళ్లకపోతే దారుణమైన పరిస్థితులు చూడాల్సి ఉంటుందని పల్లె అనుచరులు హెచ్చరికలు జారీ చేశారు. ఇంతలోనే పల్లె రఘునాథరెడ్డికి మద్దతుగా అక్కడకు చేరుకున్న పోలీసులు ఎలాంటి ప్రెస్మీట్లు పెట్టడానికి వీల్లేదంటూ ఆదినారాయణయాదవ్ను అడ్డుకున్నారు. అనంతరం ప్రెస్క్లబ్లో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పల్లె రఘునాథరెడ్డి భూమిని కబ్జా చేశారని ఆదినారాయణ యాదవ్ అనుచరులు ఆరోపించారు. అల్లరిమూకలను రెచ్చగొట్టి పదేపదే బీసీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. సోలార్ ప్రాజెక్ట్ కోసమని 100 ఎకరాల గిరిజనుల భూమిని ఆదినారాయణ యాదవ్ లాక్కొన్నారని పల్లె అనుచరులు ఆరోపించారు. ఇలా ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ కూటమిలోని విభేదాలను బయటపెట్టారు. అనంతలో ముదిగుబ్బ ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ ప్రెస్మీట్ను అడ్డుకున్న పోలీసులు పల్లె రఘునాథరెడ్డి అవినీతిపై రౌండ్టేబుల్ సమావేశం ఏర్పాటు పోలీసుల అండతో అడ్డుకున్న పల్లె అనుచరులు -
16 రోజులు... 209 కిలోమీటర్లు
కళ్యాణదుర్గం: ఉమ్మడి అనంతపురం జిల్లా జీవనాడి ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పురుడుపోసుకుంది. పేద ప్రజలను ఆదుకుంది. అలాంటి ఆర్డీటీకి ఇటీవల ఇబ్బందులు తలెత్తాయి. విదేశాల నుంచి సంస్థకు వచ్చే నిధులను ఆపేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న అనాలోచిత నిర్ణయం ఒక్కసారిగా పేదలను ఆందోళనలో పడేసింది. ఈ క్రమంలో ఆర్డీటీ పరిరక్షణే ధ్యేయంగా వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ‘పాదయాత్ర’కు శ్రీకారం చుట్టారు. బుధవారం నుంచి కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజ లను చైతన్య పరుస్తూ ముందుకు సాగనున్నారు. 16 రోజులు...209 కిలోమీటర్లు బెళుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి తండా (గొంచితండా) నుంచి రంగయ్య పాదయాత్ర ఈనెల బుధవారం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తంగా 16 రోజుల పాటు 209 కిలోమీటర్ల మేర కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి, కంబదూరు మండలాల్లోని 63 గ్రామాల మీదుగా యాత్ర సాగుతుంది. పాదయాత్ర మొదటి రోజు వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు, పార్టీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, శ్రేణులు పాల్గొని రంగయ్యకు సంఘీభావం తెలపనున్నారు. నేటి నుంచి తలారి రంగయ్య ‘ఆర్డీటీ పరిరక్షణ మహా పాదయాత్ర’ ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏను పునరుద్ధరించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించకపోతే 55 ఏళ్లుగా పేదలు పొందుతున్న అన్ని సేవలు, సౌకర్యాలు పూర్తిగా నిలిచిపోతాయి. పిల్లల చదువులు, ఇళ్లు, వైద్య సేవలు, మహిళా సంఘాల ప్రయోజనాలు, దివ్యాంగులు, రైతులు ఇలా అందరికీ తీరని నష్టం వాటిల్లుతుంది. ఆర్డీటీని కాపాడుకోవడానికి ప్రజలందరూ కలసికట్టుగా పోరాడాలి. సంస్థ ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ రుణం తీర్చుకునే అవకాశంలా భావించి కదలిరావాలి. – డాక్టర్ తలారి రంగయ్య, మాజీ ఎంపీ -
ఏదీ సమాచారం.. ఇదేం ఘోరం!
అనంతపురం ఎడ్యుకేషన్: టీచర్ల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి ఏ చిన్న సమాచారం కూడా బయటకు చెప్పకుండా విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పూర్తిగా గోప్యత పాటిస్తుండడంపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాదిమంది టీచర్లు బదిలీలు, పదోన్నతులకు దరఖాస్తు చేసుకున్నారు. రోజూ 3–4 సార్లు రాష్ట్ర అధికారులు వెబెక్స్లు పెట్టుకుంటూ వివిధ అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇవేవీ క్షేత్రస్థాయిలో ఉండే టీచర్లకు చేరడం లేదు. కనీసం ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉన్న గ్రూపుల్లో షేర్ చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు. పోనీ మీడియా ద్వారానైనా ఉపాధ్యాయులకు తెలియజేసే ప్రయత్నాలు చేయకపోవడంపై టీచర్లు మండిపడుతున్నారు. పొరుగు జిల్లాలకు సంబంధించి రోజూ స్వయంగా డీఈఓల పేరుతోనే వివిధ మెసేజ్లు టీచర్ల గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి తప్ప మన జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా సీనియార్టీ జాబితాలు, ఖాళీల విషయం ఏమాత్రం బయటకు చెప్పడం లేదు. రెండు రోజుల క్రితం పీఎస్హెచ్ఎంల బదిలీలయ్యాయి. ఆయా సబ్జెక్టుల్లో మిగులుగా ఉన్న స్కూల్ అసిస్టెంట్లకు పీఎస్హెచ్ఎంలుగా మంగళవారం బదిలీలు చేశారు. అయితే ఎంతమంది పీఎస్ హెచ్ఎంలుగా వెళ్లారు... ఏయే సబ్జెక్టుల వారు వెళ్లారు...వీరిలో తప్పనిసరి, రిక్వెస్ట్ బదిలీలు ఎవరు అనే సమాచారం రాత్రి 10 గంటలు దాటినా బయటకు చెప్పలేదు. తుస్...మన్న కోఆర్డినేషన్ సమావేశం బదిలీ ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజు నుంచే ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈఓ కార్యాలయం నుంచి ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. రెండోరోజు ఉపాధ్యాయ సంఘాల నాయకులు డీఈఓను అడ్డుకుని నిరసన తెలియజేశారు. డీఈఓ కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం రావడం లేదని, ఇతర జిల్లాల అధికారులు గ్రూపుల్లో పెడుతున్న సమాచారానికి అనుగుణంగా ముందుకు వెళ్లే దౌర్భాగ్యం నెలకొందంటూ వాపోయారు. ఇకపై అలా జరగదని, మరుసటి రోజే ఉపాధ్యాయ సంఘాల నాయకులతో కోఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేస్తామన్న డీఈఓ.. నేటి వరకు ఆ ఊసే ఎత్తలేదని నాయకులు మండిపడుతున్నారు. ఖాళీలు చూపించకుండానే వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలట! స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఖాళీలు ప్రదర్శించకుండానే బుధవారం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని చెబుతున్నారంటూ టీచర్లు వాపోతున్నారు. సీనియార్టీ జాబితా, ఖాళీలు ప్రకటించిన తర్వాత అభ్యంతరాలకు గడువు ఇవ్వడం లేదంటున్నారు. గుత్తి కోట జెడ్పీహెచ్ఎస్లో గణితం టీచరు ఇటీవల హెచ్ఎం పదోన్నతిపై కర్నూలు జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ పోస్టు ఖాళీ చూపించలేదు. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి బాలికల జిల్లా పరిషత్ పాఠశాలలో ఇంగ్లిష్ టీచరు జనవరిలో రిటైర్డ్ అయ్యారు. ఆ పోస్టు ఖాళీ చూపించలేదు. ఇక్కడ హిందీ ఒక పోస్టు ఖాళీగా ఉంటే రెండు పోస్టులున్నట్లు చూపించారు. బుధవారం వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలంటూ అధికారులు చెబుతున్నారు. ఉన్న ఖాళీలను చూపించకుండా, లేని ఖాళీలను చూపించిన స్కూళ్లు కోరుకుంటే జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ టీచర్లు వాపోతున్నారు. టీచర్లను ఒత్తిడికి గురి చేస్తున్నారు: ఏపీటీఎఫ్ మంగళవారం సాయంత్రం పాఠశాల సహాయకుల సీనియార్టీ, వేకెన్సీ జాబితాలు విడుదల చేసి గ్రీవెన్స్కు ఒకరోజు సమయం ఇవ్వకుండా ఉపాధ్యాయులను ఒత్తిడికి గురిచేసి వెబ్ ఆప్షన్లు ఇవ్వమని వేధిస్తున్నారని ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. సిరాజుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల నుంచి వినతిపత్రాలు స్వీకరించి సీనియారిటీ, వేకెన్సీ జాబితాల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డీఈఓ ప్రసాద్బాబుకు వినతిపత్రం అందజేశారు. బదిలీలు, పదోన్నతులకు సంబంధించి విద్యాశాఖ కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం బయటకు రాకపోవడంతో తీవ్ర గందోరగోళం నెలకొందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆడిట్ కన్వీనర్ వన్నప్ప, నాయకులు గురు రాజ్, నాగేంద్ర, ఈశ్వరయ్య, భాగ్యరాజ్, దాసరి మురళి, ఓబులేసు, చిదంబరయ్య, వెంకటరామిరెడ్డి, చక్రి, రాజశేఖర్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బదిలీలకు సంబంధించి ఎలాంటి సమాచారం బయటకు చెప్పని విద్యాశాఖ ఆందోళనలో ఉపాధ్యాయులు నేడు స్కూల్ అసిసెంట్ల బదిలీలకు వెబ్ ఆప్షన్లు ఖాళీలు చూపించలేదంటున్న టీచర్లు -
ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీల డప్పు కొట్టి.. అధికారంలోకి వచ్చాక సామాన్యులు, పేదల పొట్టకొట్టిన కూటమి సర్కారు వెన్నుపోటుకు నేటితో ఏడాది పూర్తయింది. సరిగ్గా 2024 జూన్ 4వ తేదీన ‘కూటమి’కి అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ‘మా హామీలు మీ జీవితాలనే మార్చేస
సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూటమి ప్రభుత్వం వచ్చాక ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందలేదు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇస్తామని మోసగించారు. 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని నేడు ఆ విషయమే పట్టించుకోవడం లేదు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఉచిత బస్సుకు ముహూర్తమే ఖరారు కాలేదు. ‘ఇంటింటికీ ఉద్యోగమిస్తాం.. ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు రూ.3 వేలు భృతి’ అన్నా నేటికీ అతీగతీ లేకుండా పోయింది. ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు ఇస్తామని ఇప్పటివరకూ పైసా ఇవ్వలేదు. సామాన్యుల బెంబేలు.. అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చకపోగా ఎమ్మెల్యేలు, పోలీసులు, టీడీపీ కార్యకర్తలు, సామాన్యులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. కబ్జాలు, ఆక్రమణలు, దందాలు, అక్రమ వసూళ్లకు అంతులేకపోవడంతో జనం బెంబేలెత్తుతున్నారు. ● కొత్త మద్యం పాలసీ పేరుతో ఊరూరా బెల్టుషాపులు, పర్మిట్ రూములతో ఉమ్మడి అనంత జిల్లాను మత్తులో జోగేలా చేశారు. ● హిందూపురంలో బాలకృష్ణ పీఏల అండ చూసుకుని ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ● ఫ్యాక్షన్ హత్యలు మళ్లీ పురుడుపోసుకున్నాయి. రామగిరి మండలంలో కురుబ లింగమయ్యను పచ్చ మూకలు కొట్టి చంపాయి. రాప్తాడులో నారాయణరెడ్డి, ముత్యాలమ్మను టీడీపీ నేతలు నరికి చంపారు. ● ఉమ్మడి జిల్లాలో కొండలు, గుట్టల్ని ‘తమ్ముళ్లు’ పిండిచేసి సహజ వనరులను లూటీ చేస్తున్నారు. ● చిత్రావతి, పెన్నా, వేదవతి హగరి నదుల్లో అక్రమంగా ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నా పట్టించుకునే దిక్కు లేదు. ● వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారు. ● అనంతపురం అర్బన్లో ఎవరైనా ఇళ్లు కట్టాలంటే ఎమ్మెల్యేకు ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి. ● మట్కా, గంజాయికి తాడిపత్రి నియోజకవర్గం అడ్డాగా మారిపోయింది. ● గుత్తిలో ఓ వ్యక్తిని టీడీపీ నేతలు రైలు పట్టాలపై పడుకోబెట్టి డబ్బు దండుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ● రాప్తాడులో వెంచర్లు, పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే డబ్బు ముట్టజెప్పాలని చెబుతుండటంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అటువైపు చూడటమే మానేశారు. గమనిక: చంద్రబాబు ప్రభుత్వంలో వీరిలో ఒక్కరికీ రూపాయి లబ్ధి చేకూరలేదు.. అలవిగాని హామీలతో లక్షలాది మందికి కుచ్చుటోపీ ఎన్నికల ముందు ఊరూరా ‘సూపర్సిక్స్’ ప్రచారం అధికారంలోకి వచ్చాక ఒక్క పథకమూ అమలు చేయని వైనం పైగా కబ్జాలు, ఆక్రమణలు, మోసాలు, దోపిడీలతో భయభ్రాంతులు ‘కూటమి’ పాలనను ఎండగడుతూ నేడు వైఎస్సార్ సీపీ నిరసన ర్యాలీ -
మాట తప్పిన చంద్రబాబు
అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు పెద్ద పీట వేస్తామని, బడికి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ.15 వేలు వేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చి మాట తప్పారు. అధికారంలోకి వచ్చి సంవత్సర కాలమ వుతున్నా ‘తల్లికి వందనం’ అమలు చేయలేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన ‘అమ్మ ఒడి’ పథకాన్ని చంద్ర బాబు ‘తల్లికి వందనం’గా పేరు మార్చి ఓట్లను దండుకున్నారు. ఇదిగో.. అదిగో అంటూ ఎన్నికల వరకు నెట్టుకొచ్చే ధోరణిలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లుంది. – పావని, పాలచెర్ల, రాప్తాడు మండలం -
నేడు వెన్నుపోటు దినం..
హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కూటమి సర్కారు తీరును నిరసిస్తూ ‘వెన్నుపోటు దినం’ పేరుతో వైఎస్సార్ సీపీ ర్యాలీలకు శ్రీకారం చుట్టింది. బుధవారం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించనున్నారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు కదం తొక్కనున్నాయి. ప్రభుత్వానికి కనువిప్పు కల్గిద్దాం అనంతపురం కార్పొరేషన్: వెన్నుపోటు నిరసన ర్యాలీతో ప్రభుత్వానికి కనువిప్పు కల్గిద్దామని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. బుధవారం ఉదయం 10 గంటలకు అనంతపురంలోని పాతూరు చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద నుంచి ర్యాలీ ప్రారంభమై, కలెక్టరేట్ వరకు సాగుతుందన్నారు. ఉదయం 9.30 గంటలకంతా చెన్నకేశవ స్వామి ఆలయం వద్దకు చేరుకోవాలని సూచించారు. జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లోనూ ‘వెన్నుపోటు దినం’ ర్యాలీలు ఉంటాయన్నారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, మహిళలు, యువత పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో జగనన్న సంక్షేమ విప్లవాన్ని తీసుకొచ్చారని ‘అనంత’ గుర్తు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్తో పాటు 175 హామీలను ప్రకటించిన చంద్రబాబు .. ఇంత వరకు ఒక్క హామీ కూడా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు కుట్రలను తిప్పికొడతామని, ప్రభుత్వ మెడలు వంచైనా ప్రజలకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. -
ఎవరికెంత ముట్టింది..?
● పుట్టపర్తి ప్రవాస భారతీయుడికి చీటింగ్ కేసులో పోలీసులపైనా విచారణ! సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రవాస భారతీయుడిని మోసం చేసిన కేసులో నిందితుడి నుంచి భారీగా లబ్ధి పొందిన పోలీసులపైనా ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు వివరాలు సేకరిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. తనకు రూ.12 కోట్లకు పైగా మోసం చేశారని మే 22న ప్రవాస భారతీయుడు మహేంద్రకర్ ఆర్వీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సత్యనారాయణపై పుట్టపర్తి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఎఫ్ఐఆర్ అనంతరం నిందితుడిని అరెస్టు చూప కుండా కొంతమంది టీడీపీ నాయకుల ఆదేశాల మేరకు అతని ఆస్తులను బదలాయించడం, మరికొన్ని ఆస్తులపై అగ్రిమెంట్లు చేయడం జరిగింది. దీనిపై ‘సాక్షి’లో వరుస కథనాలు వచ్చాయి. దీంతో స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో టీడీపీ నాయకులతో పుట్టపర్తి పోలీసులు రూ.50 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్టు సమాచారం. ఈ బాగోతమంతా ఒక సబ్ డివిజనల్ పోలీసు అధికారి, కొంతమంది పోలీసుల సమక్షంలోనే జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిత్యం సత్యసాయి భక్తులతో కళకళలాడే పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి కూతవేటు దూరంలోనే ఇదంతా జరగడంతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో పోలీసు అధికారులు విచారణను వేగవంతం చేశారు. రాయ‘బేరం’లో కీలక పాత్ర పోషించిన పోలీసు అధికారికి టీడీపీ నేత పల్లె రఘునాథరెడ్డి అండదండలు ఉన్నట్టు తెలు స్తోంది. ఈయన ఏరికోరి సదరు అధికారిని పుట్టపర్తికి తెచ్చుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా డీల్ కుదుర్చుకున్న రూ.50 లక్షల్లో ఉన్నతాధికారులకు ఏమైనా వెళ్లిందా అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నట్టు తెలిసింది. రెండు, మూడు రోజుల్లో ఈ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని విజయవాడకు చెందిన ఓ పోలీసు అధికారి చెప్పారు. రైతును మింగిన అప్పులు శెట్టూరు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని యాటకల్లు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్ఐ రాంభూపాల్ తెలిపిన మేరకు... యాటకల్లు గ్రామానికి చెందిన గొల్ల గోవిందప్ప (74) తన మూడెకరాల పొలంలో 8 బోర్లు వేశాడు. చివరి బోరులో నీళ్లు పడ్డాయి. అప్పటికే రూ. 5 లక్షల వరకూ అప్పులయ్యాయి. నీళ్లు పడ్డాయని, పంటలు పెట్టి అప్పులు తీర్చవచ్చనే ఉద్దేశంతో మళ్లీ రూ. లక్ష వరకూ అప్పు చేసి టమాట, వేరుశనగ సాగు చేయగా.. నష్టాలు వచ్చాయి. దీంతో గోవిందప్ప నైరాశ్యంలో కూరుకుపోయాడు. అప్పులెలా తీర్చాలో అంటూ నిత్యం మదనపడుతుండేవాడు. సోమవారం రాత్రి కూడా ఇంట్లో కుటుంబ సభ్యులతో అప్పుల విషయం చర్చించి బాధపడ్డాడు. అయితే, కుటుంబసభ్యులు గోవిందప్పకు ధైర్యం చెప్పి పడుకున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం లేచి చూసే సరికి గోవిందప్ప కనపడకపోవడంతో కుటుంబీకులు ఆందోళనతో అంతా వెతికారు. ఇంటి సమీపంలోని పాడుబడ్డ పెంకుల కొట్టంలో దూలానికి వేలాడుతూ కనిపించిన గోవిందప్పను చూసి కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు గోవిందప్పకు భార్య గొల్ల మల్లమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుమార్తెలిద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. ఉద్యోగుల ప్రవర్తన బాగుండాలి ● కలెక్టర్ వినోద్కుమార్ అనంతపురం అర్బన్: ‘విధి నిర్వహణలో ఉద్యోగుల ప్రవర్తన బాగుండాలి. ప్రజలకు సేవలందించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ సచివాలయ సిబ్బందించి ఆదేశించారు. పింఛను పంపిణీలో ఫీడ్బ్యాక్పై కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో డీఆర్డీఏ పీడీ శైలజ, డీపీఓ నాగరాజు నాయుడుతో కలిసి సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ముఖ్యంగా పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. పింఛను లబ్ధిదారుల నుంచి డబ్బు తీసుకోకూడదన్నారు. సిబ్బంది కనిపిస్తేనే లబ్ధిదారులు నమస్కారం చేసేలా ప్రవర్తన ఉండాలని సూచించారు. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీని తనిఖీ చేస్తానని, ఎక్కడైనా నిర్లక్ష్యంగా ఉన్నట్లు గుర్తిస్తే సంబంధిత ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లు, డీపీఓ, డీఆర్డీఏ పీడీపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని హితవు పలికారు. -
‘మహాత్మా.. అధికారులకు బుద్ధి ప్రసాదించు’
అనంతపురం ఎడ్యుకేషన్: ‘మహాత్మా... మా పోస్టులు మాకు కేటాయించేలా అధికారులకు మంచి బుద్ధి ప్రసాదించు’ అంటూ ఇంగ్లిష్ పదోన్నతుల టీచర్లు విన్నవించుకున్నారు. మంగళవారం స్థానిక టవర్క్లాక్ సమీపంలోని మహాత్మ గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు శారదా నగరపాలక ఉన్నత పాఠశాలలో ధర్నా చేశారు. 21 జీఓ ప్రకారం 19 మాత్రమే ఖాళీలున్నాయంటూ చెబుతున్నారని వాపోయారు. కార్యక్రమంలో పదోన్నతుల జాబితాలోని సీనియర్ ఎస్జీటీలు జి. సూర్యుడు, కోనంకి చంద్రశేఖర్, జయపాల్ నాయుడు, నరసింహులు, లింగమయ్య, మహమ్మద్ రఫి, అంజి నాయక్, గోపాల్ రెడ్డి, పీరు నాయక్, వన్నారెడ్డి పాల్గొన్నారు. ఎస్టీయూ రమణారెడ్డి, యూటీఎఫ్ గోవింద రాజులు, ఏపీటీఎఫ్–1938 శ్రీనివాసులు రెడ్డి, సత్యప్రసాద్, ఆప్టా శంకరమూర్తి మద్దతు తెలిపారు. -
రూ.18 వేలు ఎప్పుడిస్తారు సార్?
హామీలిచ్చేటప్పుడు ఆచరణ సాధ్యమా .. కాదా అని ఆలోచన చేయాలి. సీఎం పీఠంపై కూర్చున్నాక ఇప్పుడు హామీలు చూస్తుంటే భయమేస్తుంది అంటే ఎలా నమ్మాలి. ఆడబిడ్డలకు నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పిన హామీని ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలి. సీఎం సార్ నాకు ఏడాదికి రూ.18 వేలు ఇవ్వాల్సి ఉంది. ఎప్పుడిస్తారో తెలియడం లేదు. ఎప్పటికప్పుడు ఉచిత బస్సు ప్రయాణం వాయిదా వేస్తున్నారు. జగనన్న సర్కార్లో మహిళలే మహారాణులు. అమ్మ ఒడి, సున్నా వడ్డీ ద్వారా రూ.కోట్ల లబ్ధి చేకూరింది. ‘నాడు మహిళల చేతిలో డబ్బులు గల గల.. నేడు వెలవెల’ అన్న చందంగా మారింది. – మమత, ఎం.బండమీదపల్లి, రాప్తాడు మండలం -
ఈసారీ అప్పులు తప్పవేమో!
జిల్లా అంతటా మంగళవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై అక్కడక్కడా తుంపర్లు పడ్డాయి. నైరుతి దిశగా గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. రబీ సీజన్ ముగిసి, ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం నుంచి రైతులకు రూపాయి సాయం కూడా అందలేదు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకూ రూ.20 వేల పెట్టుబడి సాయం అందిస్తామని గత ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా నేటికీ ఆ వాగ్దానాన్ని అమలు చేయలేదు. ఈ నేపథ్యంలో పంటల పెట్టుబడి కోసం ఈ సారి కూడా అప్పులు తప్పేలా లేవు. – చెన్నారెడ్డి, రైతు, జంబులదిన్నె, గార్లదిన్నె మండలం -
రిలీజ్ డేట్లు తప్ప ఏమీ లేదా బాబూ?
అనంతపురం కార్పొరేషన్: ‘సూపర్ సిక్స్ హామీల అమలు విషయంలో కేవలం రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్నారు. ఆ తర్వాత ఉత్తచేతులు చూపుతున్నారు. కనీసం ఒక్క హామీని అమలు చేద్దామన్న చిత్తశుద్ధి చంద్రబాబులో కన్పించడం లేదు’ అని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. మంగళవారం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు మోసాలను ఎండగట్టేందుకు ‘వెన్నుపోటు దినం’ నిరసన ర్యాలీలకు వైఎస్సార్ సీపీ పిలుపునిచ్చిందన్నారు. శాంతియుతంగా అధికారులకు వినతి పత్రం సమర్పించి, కూటమి ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితిని తెలియజేయనున్నట్లు తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలన్నారు. కూటమి ప్రభుత్వంలో విశ్వసనీయత లోపించిందన్నారు. నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు తదితర హామీలను అమలు చేయకపోగా, అమరావతి పేరుతో రూ.1,60,000 కోట్ల అప్పులు చేశారని దుయ్యబట్టారు. అభివృద్ధి అంటే కేవలం అమరావతి మాత్రమేనా అని ప్రశ్నించారు. వెనుకబడ్డ అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్ కడప ప్రాంతాలు కన్పించడం లేదా అని విమర్శించారు. హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని తగ్గించి భవిష్యత్తు తరాలకు తీరని అన్యాయం చేశారన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లా వాసులకు ఎంతో మేలు చేసేలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని చంద్రబాబు అటకెక్కించారన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఊసే లేకుండా పోయిందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. విశాఖలో స్టీల్ ఫ్యాక్టరీని తామే తీసుకొచ్చామని టీడీపీ చెబుతోందని, ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉందా అని విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బోగాతి విజయప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ -
చంద్రబాబు పాలనలో జిల్లాలో అరాచకం కొనసాగుతోంది. లోకేష్ ఫొటోలతో కూడిన రెడ్బుక్ హోర్డింగ్లు ఏర్పాటు చేయడం ద్వారా మారణహోమంతో బీభత్సం సృష్టించడమే అజెండా అని అధికారికంగా ప్రకటించడం టీడీపీ కూటమికే చెల్లింది. తద్వారా టీడీపీ గూండాలు కర్రలు, రాళ్లతో యథేచ్ఛగా దా
● పుట్లూరు మండలం కోమటిగుంట్ల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు మనోహర్, విశ్వనాథ్, శేఖర్ తదితరులపై టీడీపీ నాయకులు కర్రలతో దాడి చేశారు. అదే సమయంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు ఎరికలయ్య(55) టీడీపీ నాయకుల్ని అడ్డుకుని నిలువరించే ప్రయత్నం చేయడంతో ఆయనపై బండరాళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. బలమైన గాయాలతో అక్కడే కుప్పకూలి ఎరికలయ్య మృతి చెందాడు. ● రాప్తాడులో వైఎస్సార్సీపీకి చెందిన చిగిచెర్ల నారాయణరెడ్డి, ముత్యాలమ్మ దంపతుల హత్య రాష్ట్రాన్నే కుదిపిసేంది. పొలం తగాదా విషయంలో ఇనుపరాడ్లు, కట్టెలు, వేట కొడవళ్లతో దాడి చేయడంతో ఘటనాస్థలంలోనే భార్య, తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో భర్త మృతి చెందారు. రాప్తాడు సమీపంలోని గంగలకుంటకు చెందిన పొలం విషయంగా దాయాదుల మధ్య నెలకొన్న వివాదంలో టీడీపీ నేతలు తలదూర్చి ఈ ఘాతుకానికి తెగబడ్డారు. రాప్తాడు మండలంలో టీడీపీ నాయకులు నిప్పు పెట్టడంతో కాలిపోయిన బోరు, డ్రిప్ పరికరాలు (ఫైల్) రాప్తాడు మండలం వరిమడుగులో స్థలం కబ్జా కోసం టీడీపీ నాయకులు ధ్వంసం చేసిన బండలు (ఫైల్) అనంతపురం: కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజా ప్రతినిధుల నుంచి సామాన్యుల వరకూ ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసకాండ కొనసాగుతోంది. ఇక ప్రైవేట్ ఆస్తుల విధ్వంసానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పచ్చ ముఠాలు రెచ్చిపోయి ఆస్తుల విధ్వంసానికి తెరతీస్తున్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, తాగునీటి ట్యాంకులు వంటి ప్రభుత్వ ఆస్తులను కూలగొట్టారు. టీడీపీ అధికార మదానికి పోలీసు శాఖ దాసోహమైంది. ప్రభుత్వ ప్రేరిపిత దాడులు కావడంతో చేష్టలుడిగి చూస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలాయి. ● సార్వత్రిక ఎన్నికల అనంతరం తాడిపత్రి పట్టణంలో వైఎస్సార్సీపీ ముస్లిం మైనార్టీ నాయకుడు ఫయాజ్ బాషా నూతనంగా గృహాన్ని నిర్మించారు. ఇందుకు సంబంధించి అన్ని అంశాలు సక్రమంగా ఉన్నాయి. మున్సిపాలిటీ అనుమతులూ ఉన్నాయి. అయినా... ఫయాజ్బాషా నిర్మించిన ఇంటిని ఆక్రమణల పేరుతో తొలగించేందుకు మునిసిపల్ అధికారులను తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి పురమాయించారు. ఇంటిని కూల్చాలని ఒత్తిడి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అధికారుల చర్యలను పలు దఫాలుగా ఫయాజ్ బాషా అడ్డుకున్నారు. దీంతో నేరుగా జేసీ ప్రభాకర్రెడ్డి రంగంలో దిగి జేసీబీని తీసుకెళ్లి ఫయాజ్బాషా ఇంటి పైకి టీడీపీ కార్యకర్తలతో రాళ్ల దాడి చేయించారు. అనంతరం టీడీపీ కార్యకర్తలపై ఫయాజ్బాషానే రాళ్ల దాడికి పాల్బడ్డారంటూ రివర్స్ కేసు నమోదు చేయించారు. ● సార్వత్రిక ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి ఇప్పటి వరకూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగుపెట్టనివ్వకుండా రెడ్బుక్ రాజ్యాంగంతో అడ్డుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో జరిగిన గొడవల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డిని, జేసీ ప్రభాకర్రెడ్డి ఇరువురినీ తాడిపత్రి వదిలి వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యాక జేసీ ప్రభాకర్రెడ్డి ఒక్కరే తాడిపత్రిలో కాలు పెట్టారు. కానీ కేతిరెడ్డి పెద్దారెడ్డిని మాత్రం పోలీసులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో తాడిపత్రికి వెళ్లడానికి హైకోర్టు నుంచి అనుమతులు తీసుకున్నా పెద్దారెడ్డిని ఇప్పటికీ అక్కడ కాలు పెట్టనివ్వడం లేదు. హైకోర్టు ఆదేశాలను సైతం ఎస్పీ పట్టించుకోలేదంటే రెడ్ బుక్ రాజ్యాంగానికి పోలీస్ వ్యవస్థ ఎంతలా దాసోహమైందో అర్థం చేసుకోవచ్చు. ● జిల్లా వ్యాప్తంగా ఖాళీ స్థలాలనే కాకుండా పట్టా స్థలాలనూ టీడీపీ నేతలు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. అడ్డుకోబోయిన సొంత దారులపై దాడులకు తెగబడుతున్నారు. చిన్నారులనే కనికరం లేకుండా ● రాయదుర్గం మండలం యర్రగుంట గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ముక్కన్న లైంగిక వేధింపులకు పాల్బడ్డాడు. మనో వేదనకు గురైన ఆ బాలిక హెచ్చెల్సీలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. అప్రమత్తమైన స్థానికులు బాలికను కాపాడారు. ముక్కన్నకు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ● గత నెలలో కేవలం రోజుల వ్యవధిలోనే 15 మంది మహిళలు, బాలికలు అదృశ్యమయ్యారు. కారణాలు ఏమైనా ఇప్పటి వరకూ కొన్ని అదృశ్యం కేసుల్లో మిస్టరీ వీడలేదు. రాక్షసత్వానికి పరాకాష్ట కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అంతులేని ఆకృత్యాలు, దౌర్జన్యకాండ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల విధ్వంసం అక్రమ కేసులు, అరెస్ట్లు, హత్యలు రెడ్బుక్ రాజ్యాంగానికి దాసోహమన్న పోలీసులు కుంటి సాకులతో కేసులు ఆగని దౌర్జన్యకాండ జిల్లాలో ఇప్పటి వరకూ 70 మందికి పైగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. రివర్స్ కేసులతో వేధింపులకు గురి చేశారు. చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కళ్యాణదుర్గంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య, పార్టీ నాయకుడు మాదినేని ఉమామహేశ్వర నాయుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామితో పాటు మొత్తం 48 మంది నాయకులు వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసేందుకు ర్యాలీగా వెళ్తుండగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కానిస్టేబుల్ లింగరాజును ప్రభావితం చేసి, ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు తప్పుడు కేసు నమోదు చేయడం గమనార్హం. చిన్నారిపై జరిగిన అఘాయిత్యాన్ని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఖండించి, నిందితులను శిక్షించాలని ప్రెస్మీట్లో కోరినందుకు కేసు నమోదు చేసి, వేధింపులకు గురి చేశారు. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్కుమార్పై దాడికి యత్నించారంటూ ఎంపీ గోరంట్లమాధవ్పై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం ఆయన బెయిల్పై విడుదలయ్యారు. విద్యుత్ బిల్లుల పెంపు అంశంపై నిరసన తెలిపేందుకు సిద్ధమైన ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డిపై ఉరవకొండలో ట్రాఫిక్కు అంతరాయంకలిగించారనే నెపంతో అక్రమ కేసు నమోదు చేశారు. గుమ్మఘట్ట మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ గౌని కాంతారెడ్డి.. ఓ యాక్సిడెంట్ కేసు విషయంలో పంచాయితీ చేసి బాధితులకు అందాల్సిన రూ.నాలుగు లక్షలను వాడుకున్నాడని తప్పుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేయించి రిమాండ్కు పంపారు. ఆత్మకూరు, రాయదుర్గం మండలం ఆయతపల్లి, బెళుగుప్ప గ్రామాల్లోని సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమంగా కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. డి.హీరేహల్ మండలంసిద్దాపురం తండాలో తాగునీటి కొళాయి విషయంగా ఘర్షణ పడి ఏడుగురు వైఎస్సార్సీపీ నాయకులపైనే రివర్స్ కేసు నమోదు చేయించి రిమాండ్కు పంపారు. డి.హీరేహల్ మండలం కళ్లెం గ్రామంలో చోటు చేసుకున్న చిన్న పాటి ఘర్షణకు రాజకీయ రంగు పులిమి 11 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసు బనాయించి రిమాండ్కు పంపారు. -
పార్టీ పటిష్టతలో అనుబంధ సంఘాలు కీలకం
అనంతపురం కార్పొరేషన్: పార్టీ పటిష్టతలో అనుబంధ సంఘాల పాత్ర ఎంతో కీలకమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ హరిప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి టి.సురేంద్రరెడ్డి అన్నారు. ఈ నెల 4న తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి సంబంధించి జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో అనుబంధ విభాగాల అధ్యక్షులతో సోమవారం వారు సమీక్షించారు. క్షేత్రస్థాయిలో పార్టీను బలోపేతం చేయడానికి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న వారికి వివిధ పదవులతో జగనన్న గుర్తింపునిచ్చారన్నారు. గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలతో మమేకమై పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో పాల్గొనేలా చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధమవ్వాలన్నారు. ప్రజల పక్షాన నిలిచి వైఎస్సార్ సీపీ అధిష్టానం దశలవారీగా పోరాటాలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 4న తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం హరిప్రసాదరెడ్డి, సురేంద్ర రెడ్డిని అనుబంధ విభాగాల అధ్యక్షులు సన్మానించారు. కార్యక్రమంలో యువజన విబాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్రెడ్డి, రాష్ట్ర నాయకులు లింగారెడ్డి, నరేంద్రరెడ్డి, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు అమర్నాథరెడ్డి, వైపీ బాబు, మల్లెమీద నరసింహులు, కురుబ దేవేంద్ర, మూడే శ్రీనివాసులు నాయక్, రాజశేఖరరెడ్డి, చంద్రశేఖర్ యాదవ్, కె శ్రీనివాసరెడ్డి, ఎం ధనుంజయ, సి.నాగప్ప, ఓబిరెడ్డి, ఎంసీ సంధ్యారాణి, శ్రీదేవి, రిలాక్స్ నాగరాజు, వై.నరేంద్రరెడ్డి, సైఫుల్లాబేగ్ పాల్గొన్నారు. -
మోసం... చంద్రబాబు నైజం
బుక్కరాయసముద్రం: ప్రజలను మోసం చేయడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ మంత్రి శైలజానాథ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వ మోసాలను ఎండగడుతూ జూన్ 4న నిర్వహించనున్న ‘వెన్నుపోటు దినం’ నిరసన ర్యాలీలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణస్వామి దేవాలయంలో పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ‘అనంత’ మాట్లాడుతూ సూపర్ సిక్స్ వాగ్దానాల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలను చంద్రబాబు మోసగించారన్నారు. హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రెడ్బుక్ పాలన సాగిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, కేసులు, హత్యాకాండకు పాల్పడుతున్నారన్నారు. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని అరాచక పాలన సాగించడం హేయమన్నారు. మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ హామీల అమలుపై కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావడానికి ‘వెన్నుపోటు దినం’ నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 4న నార్పల మండలంలో ఆందోళన, నిరసన కార్యక్రమం ఉంటుందని, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు నరేష్కుమార్రెడ్డి, అనుబంధ సంఘాల పరిశీలకులు సురేంద్ర మాట్లాడుతూ కూటమి పాలన రాష్ట్రంలో ఎల్లకాలం ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని, ఎవరూ అధైర్య పడరాదని సూచించారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ నరేష్, జెడ్పీటీసీ సభ్యుడు భాస్కర్, మేజర్ పంచాయతీ సర్పంచ్ పార్వతి, గువ్వల శ్రీకాంత్రెడ్డి, నాగలింగారెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు గువ్వల శ్రీకాంత్రెడ్డి, పూల నారాయణస్వామి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు వెంకటరెడ్డి, చికెన్ నారాయణస్వామి, సాకే నారాయణస్వామి, అనంత వెంకటరెడ్డి, కాటమయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. వెన్నుపోటు దినం నిరసన ర్యాలీని విజయవంతం చేద్దాం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత, మాజీ మంత్రి శైలజానాథ్ -
జేఈఈ అడ్వాన్స్డ్లో అదుర్స్
● ఆలిండియా ఓపెన్ కేటగిరీలో భూపతి నితిన్ అగ్రిహోత్రికి 183వ ర్యాంకు అనంతపురం ఎడ్యుకేషన్/శింగనమల: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో ‘అనంత’ విద్యార్థులు అదుర్స్ అనిపించారు. పలువురు జాతీయస్థాయి ర్యాంకులు సాధించి శభాష్ అనిపించుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఐఐటీ కళాశాలల్లో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్డ్ పరీక్షలు 12.68 లక్షల మంది విద్యార్థులు రాశారు. 2.5 లక్షల మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఐఐటీల్లో 17 వేల సీట్లు, తక్కిన సీట్లు ఎన్ఐటీ, ఐఐఐటీ, కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం విడుదలైన ఫలితాల్లో భూపతి నితిన్ అగ్నిహోత్రి 360 మార్కులకు గాను 264 మార్కులు సాధించి అఖిల భారత స్థాయి ఓపెన్ కేటగిరీలో 183 ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. అలాగే శింగనమల మండలం సీ.బండమీదపల్లి గ్రామానికి చెందిన శెట్టిపల్లి శశిధర్రెడ్డి 638, అనంతపురం నగరానికి చెందిన పి. విశాల్ 3,946, భావన 10,889, మోక్ష సాయి రెడ్డి 12,809, ఆసిఫ్ 16,099, సవిత్ కుమార్ రావు 16,884 ర్యాంకు, డి.లోకేష్ కుమార్ 114 (ఎస్సీ కేటగిరీ) ర్యాంకు, ప్రణయ్ చౌదరి 5,499 (ఈడబ్ల్యూఎస్) ర్యాంకు సాధించారు. వీరందరికీ నేరుగా ఐఐటీలో ఇంజినీరింగ్ సీట్లు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. -
గుత్తి కోట ఉత్సవాలకు రూ.50 లక్షలు
గుత్తి: వచ్చే ఏడాది జనవరిలో గుత్తి కోట ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. ఇందుకు గాను రూ.50 లక్షలు నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమాన్ని సోమవారం గుత్తి కోటపై నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ వినోద్కుమార్, జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ, డీఆర్ఓ మలోల హాజరయ్యారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా, గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయ భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ఈబీ దేవి, జిల్లా పర్యాటక అధికారి విజయకుమార్, ఆర్డీఓ శ్రీనివాస్, పలువురు జిల్లా స్థాయి అధికారులు, కమిషనర్ జబ్బార్ మియా, తహశీల్దార్ ఓబులేసు, ఎంపీడీఓ ప్రభాకర్ నాయక్, మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్బీ, మహర్షి దయానంద గురుకుల పాఠశాల ఎన్సీసీ విద్యార్థులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. -
●జనం నెత్తిన ‘రేషన్ బరువు’
ఇంటి వద్దకు వాహనం వచ్చినప్పుడు రేషన్ తీసుకుంటూ వచ్చిన కార్డుదారులకు... ఇప్పుడు ‘నెత్తిన రేషన్ బరువు’ మోయాల్సిన దుస్థితి పట్టింది. ఇంటింటికీ రేషన్ పంపిణీకి కూటమి ప్రభుత్వం మంగళం పాడి... చౌక దుకాణాల ద్వారానే అందజేసే విధానం తేవడంతో కార్డుదారులకు కష్టాలు మొదలయ్యాయి. ఇక 65 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి వద్దనే రేషన్ అందిస్తామంటూ కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రగల్బాలు పలికినా.. క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. దీంతో వృద్ధులు స్లోర్ల వద్దకు వచ్చి బియ్యం, సరుకులు తీసుకుంటున్నారు. రేషన్ పంపిణీ మొదలైన రెండో రోజు సోమవారం కూడా జిల్లావ్యాప్తంగా కార్డుదారులు అవస్థలు పడ్డారు. – అనంతపురం అర్బన్/సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ గూండాల దాడి
యాడికి: మండలంలో టీడీపీ గూండాలు బరితెగించి బోయరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నేత మారుతిపై దాడికి పాల్పడ్డారు. సోమవారం మధ్యాహ్నం బోయరెడ్డిపల్లి నుంచి తన ద్విచక్ర వాహనంపై పెన్నా సిమెంటుకు బయలు దేరిన మారుతిని పరిశ్రమ సమీపంలో ఉన్న వంక వద్ద అదే గ్రామానికి చెందిన టీడీపీ గూండాలు అడ్డుకుని కట్టెలు, పైపులతో దాడి చేశారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన మారుతి ప్రస్తుతం అనంతపురంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు భోగాతి బ్రహ్మానందారెడ్డి, మల్లికార్జున, రామకృష్ణ తదితరులు అనంతపురంలోని ఆస్పత్రికి చేరుకుని మారుతిని పరామర్శించారు. చాగల్లు రిజర్వాయర్లో అమ్మవారి విగ్రహం లభ్యం పెద్దపప్పూరు: చాగల్లు రిజర్వాయర్లో అమ్మవారి పంచలోహ విగ్రహం లభ్యమైంది. పెద్దయక్కలూరు గ్రామానికి చెందిన కొందరు జాలర్లు ఆదివారం రాత్రి చేపల వేట కోసం చాగల్లు రిజర్వాయర్ దిగువ ప్రాంతంలో వలలు వేయగా 3 అడుగుల ఎత్తు దాదాపు 30 కిలోల బరువు ఉన్న పంచలోహపు అమ్మవారి విగ్రహం లభ్యమైంది. విషయం తెలుసుకున్న పెద్దపప్పూరు గ్రామస్తులు అమ్మవారి విగ్రహాన్ని మేళతాళాలతో ఘనంగా ఊరేగించి చౌడేశ్వరిదేవి ఆలయంలో ఉంచారు. కర్ణాటక వాసి దుర్మరణం పెద్దవడుగూరు: మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై కాశేపల్లి టోల్ప్లాజా వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... కర్ణాటకలోని రాయచూర్ నుంచి పేపర్ బెడ్స్ లోడ్తో వచ్చిన ఐచర్ వాహనం అనంతపురంలో అన్లోడ్ చేసి సోమవారం తెల్లవారుజామున తిరుగు ప్రయాణమైంది. కాశేపల్లి టోల్ప్లాజా దాటగానే డ్రైవర్ ఖలీల్ నిద్ర మత్తులో జోగడంతో ముందు వెళ్తున్న గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొన్నాడు. ప్రమాదంలో రాయచూరు జిల్లా మాన్వికి చెందిన ఐచర్ క్లీనర్ మహమ్మద్ (31) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి సోదరుడు యూనస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మార్కెట్ వసూళ్లు ఆశాజనకంఅనంతపురం అగ్రికల్చర్: మార్కెట్యార్డు పరిధిలో వివిధ రకాల ఫీజు వసూళ్లు ఆశాజనకంగా ఉన్నట్లు ఆ శాఖ ఏడీ పి.సత్యనారాయణచౌదరి తెలిపారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. జిల్లాలోని9 మార్కెట్ కమిటీలు, 15 చెక్పోస్టుల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.13.49 కోట్లు వసూళ్లు లక్ష్యంగా పెట్టుకోగా మొదటి రెండు నెలల కాలంలో 18 శాతంతో రూ.2.42 కోట్లకు పైగా సాధించినట్లు వివరించారు. అందులో మే నెల టార్గెట్ రూ.1.01 కోట్లు కాగా రూ.1.03 కోట్లు వసూలైందన్నారు. -
తాగునీటి కోసం రోడ్డెక్కిన కూడేరు వాసులు
కూడేరు: మంత్రి పయ్యావుల కేశవ్ సొంత ఇలాకాలో తాగునీటి కోసం ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. తమకు తాగునీరు అందడం లేదంటూ సోమవారం కూడేరు వాసులు ధర్నా చేపట్టారు. మండల కేంద్రంలోని బోయ, కమ్మ, దళిత, కటిక వీధులు, శ్రీసత్యసాయి కాలనీల్లో పది రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయా కాలనీ వాసులు సోమవారం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమానికి అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కోశాధికారి రాయుడు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కృష్ణమూర్తి మద్దతు పలికారు. విషయం తెలుసుకున్న సీఐ రాజు అక్కడికు ఆందోళన కారులతో చర్చించారు. ఎంపీడీఓ కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడ అధికారులతో మాట్లాడుకోవాలని సూచించారు. అయితే అధికారులే వచ్చి నీటి సమస్య తీరుస్తామని హామీ ఇచ్చేంత వరకూ అక్కడి నుంచి కదిలేది లేదని మహిళలు తేల్చి చెప్పారు. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న ఎంపీడీఓ కుళ్లాయిస్వామి అక్కడకు చేరుకుని వారం రోజుల్లోపు కొత్తగా బోర్లు వేయించి, నీరు సరఫరా అయ్యేలా చేస్తామని భరోసానివ్వడంతో ఆందోళనను విరమించారు. -
అర్జీలకు త్వరితగతిన పరిష్కారం చూపాలి
● కలెక్టర్ వినోద్కుమార్ గుత్తి: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో అందే అర్జీలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశించారు. గుత్తి ఆర్ఎస్ రోడ్డులో ఉన్న వసుధా ఫంక్షన్ హాలులో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహించారు. జేసీ శివ్ నారాయణ శర్మ, డీఆర్ఓ మలోల, ఆర్డీఓ శ్రీనివాస్, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో ఉన్నతాధికారులకు అందజేశారు. మొత్తం 490 అర్జీలు అందాయి. తనకు బదిలీల్లో తీవ్ర అన్యాయం జరిగిందని అనంతపురం గిరిజన బాలుర కళాశాల హాస్టల్లో వార్డెన్గా నిధులు నిర్వహిస్తున్న అనసూయ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అవినీతికి పాల్పడి అంధురాలైన తనను తాను కోరిన గుత్తి ఎస్టీ హాస్టల్కు బదిలీ చేయలేదని విన్నవించారు. డబ్బు ముట్ట జెప్పిన వారిని కోరిన ప్రాంతానికి బదిలీ చేశారని ఆరోపించారు. న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా తదితరులున్నారు. టీబీ డ్యాంకు 20,025 క్యూసెక్కుల ఇన్ఫ్లో బొమ్మనహాళ్: కర్ణాటకలోని హొస్పేట్ వద్ద నిర్మించిన తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో పెరిగింది. సోమవారం నాటికి 20,025 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. డ్యాం ఎగువ భాగంలోని శివమొగ్గ, ఆగుంబే, తీర్థనహాళ్లి, వరనాడు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో డ్యాంకు ఇన్ఫ్లో మొదలైంది. మే మొదటి వారంలో జీరోగా ఉన్న ఇన్ఫ్లో.. నేడు 20,025 క్యూసెక్కులుగా నమోదవుతుండటం గమనార్హం. అవుట్ ఫ్లో 236 క్యూసెక్కులుగా ఉంది. ప్రసుత్తం జలాశయంలో 1,633 అడుగులకు గాను 1,597.84 అడుగులకు నీరు చేరింది. మొత్తం నీటి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా 18.860 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి 1,577.47 అడుగుల వద్ద 3.360 టీఎంసీల నీటి నిల్వతో 411 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండింది. బెంగ తీర్చేనా..?! అనంతపురం సెంట్రల్: జిల్లాకు వర ప్రదాయినిగా పేరుగాంచిన తుంగభద్ర జలాశయం ఈ ఏడాది ముందుగానే జలకళ సంతరించుకుంటుండడంపై రైతుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సారి త్వరగానే ఆయకట్టుకు సాగునీరు విడుదలవుతాయనే ఆశలు చిగురిస్తున్నాయి. సాధారణంగా జూన్ నెలాఖరు, జూలైలో డ్యాంకు ఇన్ఫ్లో ప్రారంభమవుతుంది. అయితే, ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగా పలకరించడంతో కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వారం రోజుల వ్యవధిలోనే 20 వేల క్యూసెక్కులకు ఇన్ఫ్లో చేరుకోవడం గమనార్హం. కర్ణాటకలో వర్షాలు కొనసాగితే కొన్ని రోజుల్లోనే గరిష్ట మట్టానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీబీ డ్యాం పరిధిలో హెచ్చెల్సీ కింద జిల్లాకు చాలా లబ్ధి కలుగుతోంది. దాదాపు లక్ష ఎకరాల పైగా సాగునీరు అందుతోంది. ఇలాంటి తరుణంలో డ్యాం త్వరగా నిండితే సాగు,తాగునీటికి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంపై హెచ్చెల్సీ ఎస్ఈ పురార్థనరెడ్డి మాట్లాడుతూ టీబీ డ్యాంకు జూన్లోనే ఇన్ఫ్లో వస్తుండటం శుభ పరిణామమన్నారు. కేటాయింపులు త్వరగా నిర్ణయించే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. పాము కాటుతో రైతు మృతి రాయదుర్గం టౌన్: మండలంలోని కెంచానపల్లికి చెందిన రైతు బోయ రామాంజనేయులు (70) పాము కాటుతో మృతి చెందాడు. తన వేరుశనగ పొలంలో సోమవారం మధ్యాహ్నం పనుల్లో నిమగ్నమైన సమయంలో పాము కాటు వేసింది. విషయం తెలుసుకున్న స్థానికులు రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక ఆయన మృతి చెందాడు. రామాంజనేయులుకు భార్య శివమ్మ, ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. -
అనంతలో మళ్లీ ఎడారి ఛాయలు
ఆత్మకూరు: సీఎం చంద్రబాబు తీరుతో జిల్లాలో మళ్లీ ఎడారి ఛాయలు అలుముకుంటున్నాయని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. సోమవారం ఆత్మకూరు మండలం పంపనూరు వద్ద హంద్రీ–నీవా కాలువలో లైనింగ్ పనులను రైతులు, వైఎస్సార్సీపీ నాయకులతో కలసి ఆయన పరిశీలించి, మాట్లాడారు. హంద్రీ నీవా ద్వారా 6 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే మహోన్నత లక్ష్యంతో దివంగత నేత వైఎస్సార్ హంద్రీనీవా ప్రాజెక్ట్ను చేపట్టారని గుర్తు చేశారు. 2015లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6 లక్షల ఎకరాలను రద్దు చేస్తూ జీఓ 22 ఇచ్చారన్నారు. మళ్లీ జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెరువులతో పాటు 6 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలన్న ఉద్దేశంతో 63 టీఎంసీల ప్రవాహ సామర్థ్యంతో శ్రీశైలం డ్యాం మల్యాల నుంచి కాలువను వెడల్పు చేసేలా జీఓ ఇచ్చి, పనులు మొదలు పెట్టారన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టుకు 3 టీఎంసీలు ఇచ్చి కర్నూలు ప్రజల దాహార్తిని తీర్చాలని, డోన్ ప్రాంతంలో 63 చెరువులకు2 టీఎంసీలు, శింగనమల, శింగనమల రూరల్ చెరువులకు 2.3 టీఎంసీలు కేటాయిస్తూ జీఓ ఇచ్చారన్నారు. అలాగే జీడిపల్లి నుంచి 3.7 టీఎంసీలు భైరవానితిప్ప ప్రాజెక్ట్కు, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని చెరువులకు సంబంధించి 114 చెరువులకు నీరు ఇచ్చేలా కార్యాచరణను రూపొందించారన్నారు. పేరూరు డ్యాంకు జీడిపల్లి నుంచి నీళ్లు ఇస్తూ సోమరాండ్లపల్లి , పుట్టకనుమ, తోపుదుర్తి, ముట్టాల చెరువులకూ 4.3 టీఎంసీలు కేటాయించారన్నారు. పుట్టపర్తి లిప్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా 193 చెరువులకు, కియో ఫ్యాక్టరీకి నీరు ఇచ్చే బృహత్ ప్రాజెక్ట్కు రూపకల్పన చేశారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్లన్నీ రద్దు చేస్తూ నిధుల దుర్వినియోగానికి తెరలేపిందన్నారు. గతంలో అమిలినేని సురేంద్రబాబు కాలువ మీద 20 లక్షల క్యూబిక్ మీటర్ల రాయి అమ్ముకున్నారన్నారు. ప్యాకేజ్ 2లో రూ.9 కోట్ల పనులను రూ.95 కోట్లకు బిల్లులు చేసుకున్నారని తెలిపారు. ఫ్యాకేజి 3లో రూ.40 కోట్ల పనులకు సంబంధించి రూ.105 కోట్ల బిల్లులు చేసుకున్నారని వివరించారు. హంద్రీ నీవా కాలువ లైనింగ్పనులతో రైతులకు తీరని నష్టమన్నారు. కాలువను 63 టీఎంసీలతో అనంతపురం, కర్నూలు జిల్లాలకు పరిమితం చేయాలని, జగనన్న తీసుకొచ్చిన ప్రాజెక్టులను పూర్తి చేసి చిత్తూరు, కడప జిల్లాలకు నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పిల్ల కాలువల నిర్మాణం చేపట్టి 6 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చే ఏర్పాటు చేసిన తరువాతనే లైనింగ్ పనులు చేసుకోవాలన్నారు. గండికోట నుంచి గాలేరు నగరికి అక్కడి నుంచి చిత్తూరు జిల్లాలో హంద్రీ నీవా పుంగనూరు బ్రాంచ్కెనాల్కు లిప్ట్ ఇరిగేషన్ కొనసాగించాలని దీనిని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనలో భాగంగా గ్రామ సభలు నిర్వహించాలన్నా, పాదయాత్రలు చేయాలన్నా, సభలు పెట్టాలన్నా అధికారులు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అధికారులు అనుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ నెల 9న తోపుదుర్తి గ్రామంలో తన నివాసం వద్దనే వేల మంది రైతులతో నిరాహార దీక్ష చేపడుతానని ప్రకటించారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు 63 టీఎంసీల నీరు ఇవ్వాల్సిందే లైనింగ్ పనులతో రైతులకు నష్టం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
రాయితీ విత్తనాలకు కత్తెర..
రాయితీపై ఇచ్చే విత్తనాలకు కూడా కత్తెర వేశారు. అలాగే రాయితీ కూడా కుదించి రైతులపై భారం మోపారు. ఈ రబీలో కేవలం 25 శాతం సబ్సిడీతో పప్పుశనగ అందించడంతో జిల్లా రైతులపై రూ.6 కోట్ల వరకు అదనపు భారం పడింది. ఇక ఖరీఫ్లో విత్తన వేరుశనగ, కందులు నామమాత్రంగా అందించారు. 80 శాతం రాయితీతో ప్రత్యామ్నాయం అంటూ 27 వేల క్వింటాళ్లకు గానూ 10 వేల క్వింటాళ్లతో సరిపెట్టారు. ఈ ఖరీఫ్లో కేవలం 50 వేల క్వింటాళ్లు మాత్రమే విత్తన ప్రణాళిక తయారు చేశారు. ● వైఎస్ జగన్ ప్రభుత్వం 40 శాతం రాయితీతో విత్తనం అందించింది. ఐదేళ్లలో అన్ని రకాలకు చెందిన 6.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలపై రూ.289 కోట్లు రాయితీ కల్పించడం గమనార్హం. -
ఏడాది చంద్రబాబు జమానాలో ‘అనంత’ అన్నదాత అడుగడుగునా దగా పడ్డాడు. అలవిగాని హామీలతో ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మోసానికి రైతన్న బలయ్యాడు. ఏడాది పాలనలో రైతుకు మేలు చేసే కార్యక్రమం ఒక్కటంటే ఒక్కటి కూడా చేయకుండా చేతులెత్తేయడంతో కరువ
అనంతపురం అగ్రికల్చర్: ‘అన్నదాత సుఖీభవ’ కింద ఏడాదికి రూ.20 వేల చొప్పున రైతుకు పెట్టుబడి సాయం అందిస్తామని గొప్పగా చెప్పిన చంద్రబాబు.. తీరా అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించారు. ఇదిగో అదిగో అంటూనే ఏడాది కాలం ముగించారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద మూడు విడతల్లో రూ.6 వేలు రైతుల ఖాతాల్లోకి వేసింది. కానీ చంద్రబాబు తన హామీని గాలికి వదిలేశారు. ఏడాదికి రూ.20 వేలు ఇచ్చివుంటే 2.90 లక్షల మంది వరకు రైతులకు రూ.580 కోట్లు జమ అయ్యేవి. పోనీ... పీఎం కిసాన్ రూ.6 వేలు పోను మిగిలిన రూ.14 వేలు ఇచ్చి ఉన్నా రూ.400 కోట్లకు పైగా సాయం అందేది. కానీ రూపాయి కూడా ఇవ్వకుండా రైతులకు కుచ్చుటోపీ పెట్టేశారు. ● 2019–24 మధ్య వైఎస్ జగన్ సర్కారు ఏటా పీఎం కిసాన్, రైతు భరోసా కింద రూ.13,500 ప్రకారం ఐదేళ్లలో ఒక్కో రైతుకు రూ. 67,500 ఇచ్చారు. మొత్తంగా రైతులకు రూ.1,937 కోట్ల పెట్టుబడి సాయం అందించారు. పంటల బీమాకు పాడె.. రైతులకు ఎంతగానే మేలు చేస్తున్న ఉచిత పంటల బీమా పథకానికి కూటమి సర్కారు పాడె కట్టేసింది. ప్రీమియం రూపంలో ఏటా రూ.100 కోట్లకు పైగా రైతుల నుంచి పిండేస్తోంది. 2023 ఖరీఫ్, రబీకి సంబంధించి ఉచిత పంటల బీమా పథకం కింద పెద్ద మొత్తంలో పరిహారం ఇవ్వాల్సివుండగా... తమకు సంబంధం లేదన్నట్లుగా చంద్రబాబు ఎగనామం పెట్టేశారు. 2024 ఖరీఫ్లో కూడా ఉచిత పంటల బీమా అమలు చేసినా... పరిహారంపై నోరు మెదపడం లేదు. ● 2019–24 మధ్య వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులపై పైసా కూడా ప్రీమియం భారం పడకుండా ఉచిత పంటల బీమా కింద ఏకంగా జిల్లా రైతులకు రూ.1,967 కోట్ల భారీ మొత్తంలో పరిహారం ఇచ్చింది. తొలిసారిగా ఉద్యాన రైతులకు బీమా ఇచ్చి భరోసా కల్పించారు. ఇక ప్రీమియం రూపంలో ఏటా రూ.100 కోట్ల వరకు జిల్లా రైతులకు ఆదా అయ్యేలా చేశారు. బాధిత కుటుంబాలపై నిర్లక్ష్యం.. చంద్రబాబు ఏడాది పాలనలో పంటలు పండక, అప్పుల బాధతో 45 మంది వరకు రైతులు ఆత్మహత్య చేసుకున్నా... ప్రభుత్వం చలించడం లేదు. రూ.7 లక్షలు అందించి బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. ● ఆత్మహత్య బాధిత కుటుంబాలకు గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో రెండు మూడు నెలల్లోపే రూ.7 లక్షల మేర పరిహారం ఇచ్చి అండగా నిలిచారు. అలా 280 బాధిత రైతు కుటుంబాలకు రూ.17.40 కోట్ల ఎక్స్గ్రేషియా అందించారు. గతంలో చంద్రబాబు పాలించిన 2014–19 మధ్య కాలంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు సంబంధించి 110 కుటుంబాలు ఈ జాబితాలో ఉండటం గమనార్హం. సున్నా వడ్డీ, పావలా వడ్డీ లేదు.. ఖరీఫ్, రబీలో పంట పెట్టుబడుల కోసం బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు తిరిగి చెల్లించిన రైతులకు పావలావడ్డీ ఇవ్వలేదు. రూ.లక్ష లోపు రుణం తీసుకున్న సన్నచిన్నకారు రైతులకు వడ్డీరాయితీలు కూడా ఇవ్వకుండా దాటవేస్తున్నారు. ● గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో సున్నావడ్డీ కింద రూ.72 కోట్ల వరకు వడ్డీ మాఫీ చేయడంతో 3.40 లక్షల మంది సన్న చిన్నకారు రైతులకు ప్రయోజనం కలిగింది. గిట్టుబాటు లేక నష్టాలు.. అరకొరగా చేతికొచ్చిన పంట ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నారు. చీనీ, అరటి రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్నా... ప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టలేదు. పత్తి, కంది రైతులు కూడా బాగా నష్టపోయారు. అరకొర కొనుగోలు కేంద్రాలతో మమ అనిపించేశారు. ● గత ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతులు పండించిన రూ.350 కోట్లు విలువ చేసే వ్యవసాయ ఉత్పత్తులు మద్దతు ధరతో కొనుగోలు చేసి మేలు చేకూర్చింది. రైతులకు కూటమి సర్కారు కుచ్చుటోపీ చిన్నచూపు ధోరణి ప్రదర్శిస్తున్న సీఎం చంద్రబాబు ఒక్క రూపాయి కూడా సాయం చేయని వైనం మోసంపై మండిపడుతున్న అన్నదాతలు -
ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్న ప్రభుత్వాలు
అనంతపురం అర్బన్: సంస్కరణల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై ఆర్థిక భారాలను మోపుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు విమర్శించారు. ఆస్తి పన్ను పెంపును వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక గణేనాయక్ భవన్లో ప్రభుత్వాల సంస్కరణల వల్ల ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాలపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆదానీకి దాసోహమైందని ఆరోపించారు. ఆదానీకి లబ్ధి చేకూరేలా పెంచిన విద్యుత్ చార్జీలపై ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలన్నారు. సర్దుబాటు పేరుతో రూ.18 వేల కోట్ల భారాన్ని ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం మోపిందన్నారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని, స్మార్ట్ మీటర్లను పగలకొట్టాలంటూ ఎన్నికల సమయంలో చెప్పిన కూటమి పార్టీలు అధికారంలోకి రాగానే మాట మార్చాయని మండిపడ్డారు. విద్యుత్చార్జీల పెంపు, స్మార్ట్మీటర్ల ఏర్పాటు, ఆస్తిపన్ను పెంపునకు వ్యతిరేకంగా ప్రజలందరినీ కలుపుకుని రానున్న రోజుల్లో పోరాటాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి రామిరెడ్డి, సిటిజెన్స్ ఫోరమ్ నాయకులు ఏజీరాజమోహన్, నాయకులు మత్తుజ, వెంకటనారాయణ, ప్రకాష్, గోపాల్, మసూద్, ఇర్ఫాన్ పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాబూరావు -
ప్రజా శ్రేయస్సే వైఎస్సార్ సీపీ ధ్యేయం
అనంతపురం కార్పొరేషన్: ‘ప్రజల శ్రేయస్సే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం, అభివృద్ధికి పాటుపడ్డారు. ఇప్పుడు ప్రజలను నయవంచనకు గురి చేసిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు పోరాటాలకు సిద్ధమయ్యారు. సీఎం చంద్రబాబుకు కనువిప్పు కల్గించేందుకు వెన్నుపోటు దినం నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని ఏ–7 కన్వెన్షన్లో వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు నరేష్కుమార్ రెడ్డితో కలసి ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, నగర కమిటీలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ‘అనంత’ మాట్లాడుతూ ఈ నెల 4న ఉదయం 10 గంటలకు పాతూరు చెన్నకేశవ స్వామి దేవాలయం నుంచి నిరసన ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. గాంధీ విగ్రహం, వన్టౌన్ పీఎస్ మీదుగా కలెక్టరేట్ వరకు సాగుతుందన్నారు. ర్యాలీలో పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు, తొలి సంతకాలకు వన్నె తెచ్చిన నాయకులు దివంగత నేత వైఎస్సార్, ఆయన తనయుడు వైఎస్ జగన్ అని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రస్థానమంతా వెన్నుపోటేనని విమర్శించారు. గత ఎన్నికలకు ముందు ‘సూపర్ సిక్స్’తో పాటు 175 హామీలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకూ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 1.30 లక్షల మందికి సచివాలయ ఉద్యోగాలు, 2.50 లక్షలకుపైగా వలంటీర్లకు అవకాశం కల్పించారన్నారు. జగన్ హయాంలో అభివృద్ధి పనులతో అనంతపురం నగర రూపురేఖలు మార్చేశామన్నారు. ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే మద్యం మాఫియా గతంలో మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు సంపద సృష్టించుకునేందుకు మద్యం మాఫియాకు తెరలేపారని ‘అనంత’ ధ్వజమెత్తారు. మద్యం బాటిల్పై అదనంగా ధర వసూలు చేస్తున్నారన్నారు. ప్రతినెలా మద్యం షాపుల నుంచి భారీగా ఎమ్మెల్యేలకు ముడుపులు అందుతున్నాయన్నారు. రెవెన్యూ, పోలీసు శాఖలను హస్తగతం చేసుకుని అక్రమ కేసులు, దౌర్జన్యాలు, హత్యలు చేస్తూ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారన్నారు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్.. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని వైఎస్సార్ సీపీ అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు నరేష్కుమార్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు మోసాలపై గళమెత్తుదామని, ఈ నెల 4న జరిగే వెన్నుపోటు దినం నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. చైతన్యానికి మారుపేరు అనంతపురం అని, వైఎస్సార్ సీపీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, పార్టీ జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యులు రమేష్గౌడ్, టీటీడీ మాజీ బోర్డు సభ్యులు అశ్వర్థ్ నాయక్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్ తదితరులు ప్రసంగించారు. ర్యాలీకి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు సాకే చంద్రశేఖర్, ఓబిరెడ్డి, శ్రీదేవి, మల్లెమీద నరసింహులు, చంద్రశేఖర్ యాదవ్, అమర్నాథ్ రెడ్డి, సైఫుల్లాబేగ్, శ్రీదేవి, చింతా సోమశేఖర్ రెడ్డి, నాయకులు కృష్ణవేణి, దత్తా, వెన్నం శివరామిరెడ్డి, కేశవరెడ్డి, బాకే హబీబుల్లా, పెన్నోబులేసు, చింతకుంట మధు, ఆసిఫ్, సాకే చంద్రలేఖ, సుజాత రెడ్డి, పార్వతి, భారతి, గౌని నాగన్న, జానీ, రామయ్య, తదితరులు పాల్గొన్నారు. వెన్నుపోటు దినాన్ని జయప్రదం చేద్దాం పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపు వెన్నపోటుకు బాబు బ్రాండ్ అంబాసిడర్: పార్టీ పార్లమెంట్ పరిశీలకులు నరేష్కుమార్ రెడ్డి -
హెచ్చెల్సీలో ఫెవికాల్ వీరులు
● హెచ్చెల్సీలో ఓ ఉద్యోగి 25 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఈయన తన సర్వీసులో అన్ని ప్రాంతాల్లో పనిచేసి ఉంటారని అనుకుంటే పొరపాటే. అనేక సంవత్సరాలుగా ఎస్ఈ కార్యాలయంలోనే ఉండిపోయారు. డిప్యుటేషన్ ముసుగులో ‘ఫెవికాల్’ వేసుకొని తిష్ట వేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ఇటీవల ఈయనకు ప్రత్యేకంగా గది కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. ● ఓ ఇరిగేషన్ ఉద్యోగి జిల్లా కేంద్రంలో దాదాపు 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. హెచ్చెల్సీ ఎస్ఈ కార్యాలయం, లోక్ డివిజన్, ధర్మవరం డివిజన్ అంటూ జిల్లా కేంద్రంలోనే తిరుగుతున్నారు తప్ప ఏనాడు క్షేత్రస్థాయిలో పనిచేసిన దాఖలాలు లేవు. ఇలాంటి ఉద్యోగులు హెచ్చెల్సీలో దాదాపు 25 మంది విధులు నిర్వహిస్తుండడం గమనార్హం. అనంతపురం సెంట్రల్: జిల్లాలో తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ప్రాజెక్టు కీలకమైంది. ఉమ్మడి జిల్లా మొత్తానికి తాగునీరు, దాదాపు 1.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అలాంటి ప్రాజెక్టులో పాలన పూర్తిగా గాడి తప్పుతోంది. ఉద్యోగుల నియామకాల్లో విపరీతమైన రాజకీయం సాగుతోంది. పలుకుబడి ఉన్న వాళ్లు ఎప్పుడూ కీలక స్థానాల్లో ఉంటున్నారు. పైరవీలు చేయడం... ప్రాధాన్య సీట్లను దక్కించుకోవడం పరిపాటిగా మారింది. అధికారులు కూడా వీరికే వత్తాసు పలుకు తుండటంతో చాలా మంది ఉద్యోగుల సర్వీసు మొత్తం సుదూర ప్రాంతాల్లోనే సాగుతోంది. వాస్తవానికి నీటి సరఫరా జరిగే సమయంలో పరిపాలన సౌలభ్యం దృష్ట్యా డిప్యుటేషన్లు వేసుకునే వెసులు బాటు ఉంటుంది. సరఫరా ఆగిన తర్వాత యథావిధిగా వారి స్థానాలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ హెచ్చెల్సీలో ఏళ్లుగా డిప్యుటేషన్లోనే విధులు నిర్వహిస్తున్నారు. ఓ ఉద్యోగి తన ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి జిల్లా కేంద్రంలోనే ఉంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈసారి కూడా పైరవీలకే పెద్దపీట..! బదిలీలకు ప్రభుత్వం ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూడు నుంచి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నవారికి, మ్యూచువల్, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారందరికీ బదిలీలు కావాలని ఉత్తర్వులు ఇచ్చింది. జూన్ 2 లోపు ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. హెచ్చెల్సీలో ఇప్పటి వరకూ బదిలీల గురించి అధికారికంగా ప్రకటించకపోయినా... ఇప్పటికే ఆ తంతు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ సారి కూడా పైరవీలతో కొందరు ఉద్యోగులు చక్రం తిప్పినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధుల సిఫార్సులతో కొన్ని, డిప్యుటేషన్లతో కొన్ని పోస్టులను నియమిస్తున్నట్లు తెలుస్తోంది. దీని వెనుక భారీగానే ముడుపులు ముడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ముందుకెళ్తాం ఉద్యోగుల బదిలీలు నేటిలోపు పూర్తి చేయాల్సి ఉంది. జేఈలు, డీఈలు, ఈఈల బదిలీలు ఈఎన్సీ స్థాయిలో ఉంటాయి. మిగిలిన పోస్టులకు ఎస్ఈ స్థాయిలో బదిలీలు చేస్తాం. జీఓ ప్రకారం ఉద్యోగుల బదిలీలు నిర్వహిస్తామే తప్ప ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించే పరిస్థితి ఉండదు. డిప్యుటేషన్ల రద్దు విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. – పురార్థనరెడ్డి, ఎస్ఈ, హెచ్చెల్సీహెచ్చెల్సీ ఎస్ఈ కార్యాలయం ఏళ్లుగా జిల్లా కేంద్రంలోనే విధులు డిప్యుటేషన్ ముసుగులో తిష్ట అధికారులకు బురిడీ -
గంటల తరబడి వేచి ఉన్నా..
ఈమె పేరు జయమ్మ. అనంతపురంలోని నవోదయ కాలనీవాసి. తన ఇంటి నుంచి కిలోమీటరు దూరంలో ఉన్న స్టోర్ నం. 88లో ఆదివారం రేషన్ తీసుకునేందుకు వచ్చి లైన్లో నిలబడలేక చెట్టు కిందకు వెళ్లి కూర్చుంది. ఉదయం 8.30 గంటలకు నీళ్లు వస్తే పట్టేసి వచ్చానని, ఇక్కడేమో 9 గంటలైనా రేషన్ ఇవ్వడం మొదలు పెట్టలేదని వాపోయింది. రెండు రోజులే ఇచ్చి ఆ తరువాత బియ్యం అయిపోయాయని చెబుతారనే భయంతో మొహం కూడా కడుక్కోకుండానే మొదటి రోజే వచ్చినట్లు చెప్పింది. గతంలో తమ వీధిలోకే రేషన్ బండి వచ్చేదని, కేవలం 10 నిమిషాల్లో బియ్యం, సరుకులు తీసుకునేదాన్నని గుర్తు చేసుకుంది.రేషన్ సరుకులు తీసుకోవాలంటే గంటల తరబడి క్యూలైన్లో వేచి ఉండే దుస్థితి దాపురించింది. గత ప్రభుత్వం తరహాలో ఇంటి వద్దనే రేషన్ వేయాలి. ప్రస్తుతం రేషన్ దుకాణాలు ఎప్పుడు తెరుస్తారో..ఎప్పుడు మూస్తారో అర్థం కావడంలేదు. దీంతో ఉదయం నుంచే రేషన్ దుకాణం వద్ద వేచి ఉండి బియ్యం తెచ్చుకున్నా. మా ఇంటి నుంచి రేషన్ షాపు కి.మీ దూరంలో ఉండడంతో చాలా ఇబ్బందిగా ఉంది.– రాజేశ్వరి, గుంతకల్లుఅనంతపురం అర్బన్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి పేదలను కష్టాలు నీడలా వెంటాడుతున్నాయి. తాజాగా రేషన్ కష్టాలు మొదలయ్యాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ కోసం కార్డుదారులు ఎప్పుడూ ఇబ్బంది పడిన దాఖలాలు లేవు. ఇంటి వద్దకు ఎండీయూ వాహనం వచ్చినప్పుడు బియ్యం, నిత్యావసర సరుకులు తెచ్చుకునేవారు. అయితే, కూటమి ప్రభుత్వం ఎండీయూ వాహన వ్యవస్థకు మంగళం పాడి చౌక దుకాణాల ద్వారానే సరుకుల పంపిణీకి తెరలేపడంతో పేద ప్రజలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం మొదటి రోజే చుక్కలు కనిపించాయి. ‘ఉదయమే ఇంటి పనులను వదిలేసుకుని చౌక దుకాణాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి వచ్చింది.. మాకేం కర్మ పట్టిందిరా స్వామి’ అంటూ పలువురు వాపోయారు.8 గంటలకూ తెరచుకోని స్టోర్లు..ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ పంపిణీ చేయాలని డీలర్లకు అధికారులు ఆదేశాలిచ్చారు. అయితే జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల ఉదయం 8 గంటలకు చౌక దుకాణాలు తెరుచుకోలేదు. అప్పటికే రేషన్ తీసుకునేందుకు వచ్చిన కార్డుదారులు దుకాణాల వద్ద పడిగాపులు కాశారు. డీలర్లు నింపాదిగా 9 గంటల తరువాత పంపిణీ ప్రారంభించారు.ఇబ్బంది పడ్డ వృద్ధులు, మహిళలు..సరుకులు తీసుకునేందుకు చౌక దుకాణాల వద్దకు వచ్చిన ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు లైన్లలో నిలబడలేక తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. రాప్తాడు మండలం చిన్మయానగర్లో చౌక దుకాణం వద్ద చాలా ఆలస్యంగా పంపిణీ ప్రారంభించారు. ఉదయమే వచ్చిన కార్డుదారులు లైన్లో నిలబడలేక సంచులను వంతులుగా పెట్టి కూర్చున్నారు.రెండు రోజులకు మించి ఇవ్వరు..!చౌక దుకాణాల్లో ఒకటో తేదీ నుంచి 15 తేదీ వరకు రేషన్ పంపిణీ చేయాలని అధికారులు ఆదేశించారు. అయితే క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని కార్డుదారులు అంటున్నారు. బియ్యం, సరుకులు రెండు రోజులకు మించి ఇవ్వరని చెబుతున్నారు. ఆ తరువాత వస్తే అయిపోయాయని అంటారని, అందుకే పనులు వదిలేసుకుని మరీ బియ్యం తీసుకునేందుకు మొదటిరోజే వచ్చామని పేర్కొంటున్నారు. డీలర్లు కచ్చితంగా 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేసేలా అధికారులు చూడాలని, అలా ఇవ్వని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్డుదారులు కోరుతున్నారు. -
నేడు గుత్తిలో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం గుత్తి పట్టణంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు.గుత్తిలో పత్తికొండ రోడ్డులోని వసుధ ఫంక్షన్ హాలులో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని పేర్కొన్నారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలని సూచించారు. గుత్తి పట్టణ, మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాటు తుపాకీ స్వాధీనం రాయదుర్గంటౌన్: ఓ వ్యక్తి అక్రమంగా తీసుకెళ్తున్న నాటు తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాయదుర్గం రూరల్ సర్కిల్ కార్యాలయంలో సీఐ వెంకటరమణ విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. డీ హీరేహాళ్ మండలంలోని పాత హడగలి గ్రామం వద్ద సీఐ వెంకటరమణ పర్యవేక్షణలో ఆదివారం ఎస్ఐ గురుప్రసాద్ వాహన తనిఖీ చేపట్టారన్నారు. ఈ క్రమంలోనే పాత హడగలి వైపు మోటార్ సైకిల్పై వెళ్తున్న కర్ణాటక రాష్ట్రం మొలకాల్మూరు తాలూకా కోనాపురం గ్రామా నికి చెందిన బోయ గంగన్న పోలీసులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించాడన్నారు. అనుమానంతో గంగన్నను పట్టుకుని వాహనాన్ని తనిఖీ చేయగా నాటు తుపాకీ, నల్ల మందు లభ్యమయ్యాయన్నారు. డీ హీరేహాళ్ మండలం కూడ్లూరు గ్రామంలోని ఓ దానిమ్మ తోటలో గంగన్న మామ నాగరాజు పనిచేస్తున్నాడన్నారు. తోటలో తిరుగుతున్న అడవి పందుల నుంచి కాపాడాలని చెప్పడంతో తన గ్రామానికే చెందిన బసవ అనే వ్యక్తితో నాటు తుపాకీ, నల్లమందును తీసుకుని గంగన్న కూడ్లూరుకు వెళ్తున్నట్లు వెల్లడైందన్నారు. వాటిని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఏమ్మా.. రేషన్ బియ్యం అన్నం బాగా ఉంటోందా? ● లబ్ధిదారుని ఆరా తీసిన కలెక్టర్ కూడేరు: ‘ఏమ్మా బియ్యం నాణ్యతగా ఉన్నాయా.. అన్నం బాగా అవుతోందా’ అంటూ కలెక్టర్ వినోద్కుమార్ రేషన్ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం కలెక్టర్ మండల పరిధిలోని కమ్మూరులోని రేషన్ షాపులో సరుకుల పంపిణీని తనిఖీ చేశారు. సక్రమంగా సరుకులు పంపిణీ చేయాలని డీలర్ను ఆదేశించారు. అనంతరం పలువురు కార్డుదారుల ఇళ్ల వద్దకు వెళ్లి బియ్యంపై ఆరా తీశారు. చిట్టెమ్మ అనే మహిళ ఇంట్లో రేషన్ బియ్యంతో వండిన అన్నం తిన్నారు. అక్కడే ఉన్న మల్లేష్ కుమార్తె దీక్షను ఏం చదువుతున్నావమ్మా అంటూ పలకరించారు. పదిలో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు దీక్ష తెలపగా.. సప్లిమెంటరీలో ఉత్తీర్ణత సాధించాక ఉన్నత చదువులు చదవాలని, ‘అనంత ఆణిముత్యాలు’ పథకం ద్వారా చదివిస్తామని భరోసా ఇచ్చారు. బాలికలు మధ్యలోనే చదువులు మానేయరాదని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కేశవ నాయుడు, తహసీల్దార్ మహబూబ్ బాషా, సీఎస్డీటీ లక్ష్మీదేవి తదితరులు వీఆర్ఓ రామకృష్ణ పాల్గొన్నారు. -
వంచకుడిపై చర్యలు తీసుకోండి
● పోలీసులను ఆశ్రయించిన యువతి ● న్యాయం చేయలేదంటూ సోషల్ మీడియా వేదికగా వీడియో గుమ్మఘట్ట: ప్రేమ పేరుతో తనను లోబర్చుకుని మోసం చేసిన యువకుడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఓ యువతి ఆశ్రయించింది. బాధితురాలు తెలిపిన మేరకు... గుమ్మఘట్ట మండలం పూలకుంటకు చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా, వ్యవసాయ కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. వీరి పెద్ద కుమార్తె జిల్లా సరిహద్దున ఉన్న కర్ణాటకలోని మొలకాల్మూరులో ఇంటర్ పూర్తి చేసింది. ఈ క్రమంలో ఆమెను ప్రేమ పేరుతో సొంత గ్రామానికి చెందిన నాగప్ప, నాగమ్మ దంపతుల కుమారుడు సురేష్ లోబర్చుకున్నాడు. పెళ్లి పేరుతో మూడేళ్ల పాటు తన చుట్టూ తిప్పుకున్నాడు. ఆమె అడిగిన ప్రతిసారీ తన అన్న పెళ్లి జరిగేంత వరకూ ఓపిక పట్టాలని నచ్చచెబుతూ వచ్చాడు. ఈ క్రమంలో నెల రోజుల క్రితం యువకుడి అన్నకు పైళ్లెంది. దీంతో పది రోజుల క్రితం ఆమె నిలదీయడంతో యువకుడు ముఖం చాటేశాడు. దీంతో తాను మోసపోయినట్లుగా నిర్ధారించుకున్న ఆమె విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లింది. వారు స్పందించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. అయినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుండగా తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై ఎస్ఐ ఈశ్వరయ్యను వివరణ కోరగా విచారిస్తున్నామని తెలిపారు. తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం అనంతపురం/అనంతపురం క్రైం: జిల్లా కేంద్రం చుట్టుపక్కల భూమి తమవేనంటూ తెలుగు తమ్ముళ్లు దౌర్జన్యానికి తెరలేపారు. బాధితులు తెలిపిన మేరకు... కక్కలపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 144/2ఏలో మొత్తం 1.76 ఎకరాల్లో ఆర్.కృష్ణారెడ్డి కుమారుడు హనుమంతరెడ్డికి 0.73 సెంట్లు, మహమ్మద్ షఫీ కుమారుడు సయ్యద్ షామీర్కు 0.58 సెంట్లు, మహేష్బాబు భార్య జి.విజయలక్ష్మికి 0.08 సెంట్లు, షేక్ మహబూబ్బాషా కుమారుడు షేక్ ఇమాం బాషాకు 0.08 సెంట్ల స్థలం ఉంది. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు గత 20 సంవత్సరాలుగా పక్కాగా ఉన్నాయి. వీటి ఆధారంగా బ్యాంక్ రుణాలు సైతం పొందారు. ఆ స్థలంలో నీటి బోర్లు, కాంపౌండ్ వాల్, షెడ్డు, డోర్ నంబర్లు, కరెంట్ బిల్లులూ ఉన్నాయి. గత నెల 28న సర్వేయర్ ఉమామహేశ్వర్ ఫోన్ చేసి హద్దులు చూపిస్తానని తెలపడంతో వారు హక్కుదారులు అక్కడకు వెళ్లారు. అప్పటికే ప్రహరీని జేసీబీతో కూల్చివేసి స్థలాన్ని కబ్జా చేసుకునే ప్రయత్నం సాగుతుంటే అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అనంతపురం నియోజకవర్గ ప్రజాప్రతినిధికి చెందిన 50 మంది అనుచరులు దౌర్జన్యానికి దిగారు. ఆ భూమి తమదంటూ దుర్భాషలాడుతూ హక్కుదారులను పక్కకు లాగేశారు. బాధితులు వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని కూల్చివేతలను అడ్డుకున్నారు. కానీ, ఇప్పటి వరకూ దౌర్జన్యపరులపై ఎలాంటి చర్యలూ లేవు. అలాగే కియా కార్ల షోరూం వెనుక ఉన్న ఎకరాలోపు స్థలంలో కుటుంబ సభ్యులపై అనంతపురం, రాప్తాడు ప్రజాప్రతినిధులకు చెందిన ముఖ్య అనుచరులు దాడి చేశారు. నగరంలోని అరవిందనగర్కు చెందిన వెంకటేశ్ ప్రసాద్ గుప్తాకు చెందిన ఈ స్థలం అత్యంత విలువైనది. దీనిపై కన్నేసిన టీడీపీ నేతలు శనివారం ఆ స్థలం వద్దకెళ్లి కబ్జాకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న వెంకటేశ్ ప్రసాద్ గుప్తా, అతని కుమారులు ప్రణీత్, సాయినాథ్ అక్కడకు చేరుకోవడంతో టీడీపీ నేతలు దాడికి తెగబడ్డారు. ఘటనలో వెంకటేశ్ప్రసాద్ గుప్తా చెవికి తీవ్ర గాయమైంది. బాధితులు డయల్ 100కు సమాచారం ఇవ్వడంతో నాల్గో పట్టణ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే టీడీపీ నేతలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, తీవ్రంగా గాయపడిన వెంకటేష్ ప్రసాద్ ప్రస్తుతం కర్నూలులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై నాల్గోపట్టణ సీఐ కె.సాయినాథ్ మాట్లాడుతూ.. భూ వివాదాలపై ప్రాథమికంగా విచారణ చేపడతామన్నారు. బాధితులకు రాత్రి, ఉదయం ఫోన్ చేసి విచారణకు రావాలని సూచించామని, వారిచ్చే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. -
పడిపోయిన నిమ్మ ధరలు
తాడిపత్రి రూరల్: కేవలం రెండు వారాల వ్యవధిలో నిమ్మ కాయల ధరలు అమాంతం పడిపోయాయి. గత నెలలో బస్తా నిమ్మకాయల ధర రూ.5 వేలు ఉండగా ఆదివారం నాటికి రూ.1,000 నుంచి రూ.1,500కు పడిపోయింది. మారిన వాతావరణ పరిస్థితులు, కురుస్తున్న వర్షాల వల్ల నిమ్మ ధరలు తగ్గినట్లుగా తెలుస్తోంది. నాలుగు మండలాల్లో విస్తారంగా నిమ్మ సాగు తాడిపత్రి, పెద్దపప్పూరు, యాడికి, పుట్లూరు మండలాలతోపాటు వైఎస్సార్ కడప జిల్లా సరిహద్దులోని రైల్వే కొండాపురం మండలంలోని పలు గ్రామాల్లో నిమ్మ సాగు విస్తారంగా ఉంది. ఆయా ప్రాంతాల నుంచి తాడిపత్రిలోని మార్కెట్ యార్డుకు నిమ్మ కాయలను మంగళ, శుక్ర, ఆదివారాల్లో రైతులు తీసుకువస్తుంటారు. బస్తాలో 1,000 నుంచి 1,100 వరకు నిమ్మకాయలు ఉంటాయి. కాయ నాణ్యత, సైజును బట్టి మూడు రకాలుగా విభజించి వేలం వేస్తారు. వేలంలో కొనుగోలు చేసిన వ్యాపారులు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇక్కడ ధర గిట్టుబాటు కాకపోతే రైతులు జిల్లాలోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. మార్కెట్లో తగ్గిన నిమ్మకాయల ధరలు.. గత ఏడాది ఇదే సమయానికి నిమ్మ ధరలు రైతులకు కాస్త వెసులుబాటుగా ఉండేది. అప్పట్లో బస్తా రూ.2వేల నుంచి రూ.3వేల వరకు అమ్ముడు పోయింది. ఈ ఏడాది రుతు పవనాలు వారం రోజులు ముందుగా జిల్లాను పలకరించాయి. దీంతో ఆకాశం మబ్బులు కమ్ముకోవడం, వాతావరణ పరిస్థితులు చల్లబడటంతో నిమ్మ ధరలు అమాంత పడిపోయినట్లుగా తెలుస్తోంది. బస్తా రూ.5వేల నుంచి రూ.1,500 లోపు ఆందోళనలో రైతులు మరింత తగ్గుతాయి నేను తాడిపత్రిలోని మార్కెట్లో డైలీ నిమ్మకాయలు అమ్ముతుంటాను. గత నెలలో రూ.20కి 5 కాయలు అమ్మేవాళ్లం. ఇప్పుడు రూ.10కే 5 కాయలు ఇస్తున్నాం. పరిస్థితి చూస్తుంటే నిమ్మకాయల ధరలు మరింత తగ్గే అవకాశముంది. – రసూల్బీ, వ్యాపారి, తాడిపత్రి -
ద్రోహులను పార్టీ ఉపేక్షించదు
● పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అనంతపురం ఎడ్యుకేషన్: వైఎస్సార్సీపీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల పార్టీ క్రమ శిక్షణ నూతన కమిటీని అధిష్టానం నియమించిందన్నారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చైర్మన్గా ఉన్న కమిటీలో సభ్యులుగా తనతో పాటు తానేటి వనిత, రెడ్డిశాంతి, అనిల్కుమార్ ఉన్నారన్నారు. ఇటీవల జరిగిన కమిటీ తొలి సమావేశంలో కొన్ని తీర్మానాలు, నిర్ణయాలు, విధివిధానాలు రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆశయం మేరకు ప్రజలతో పార్టీ కేడర్ ఉండాలన్నారు. పార్టీకి వెన్నుపోటు పొడిచినా, ఇతర పార్టీలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్న వారిలో పార్టీ మార్పు కోరుతోందని, అయినా వారు మారకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 125 మందిపై చర్యలు తీసుకోగా, ఇందులో తన సొంత నియోజకవర్గానికి చెందిన ఐదుగురు ఉన్నారన్నారు. బహిష్కరణకు గురైన వారిలో మార్పు రాకుండా అదే పంథాను కొనసాగిస్తుంటే మాత్రం చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. వారిని సమర్థించే నాయకత్వంపైన కూడా చర్యలుంటాయన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో మెరిసిన సోనాక్షి అనంతపురం: సంయుక్త భారతీయ ఖేల్ ఫౌండేషన్ (ఎస్బీకేఎఫ్) ఆధ్వర్యంలో గోవా వేదికగా గత నెల 30 నుంచి రెండు రోజుల పాటు సాగిన జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో నిర్వహించగా.. రోలర్ స్కేటింగ్ విభాగంలో జిల్లాకు చెందిన చిన్నారి ప్రతిభ చాటింది. అండర్–5 కేటగిరిలో ఏకంగా రెండు బంగారు పతకాలను కైవసం చేసుకున్న బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన కె.వేణుగోపాల్, మౌనిక దంపతుల కుమార్తె సోనాక్షిని ఆమె చదువుతున్న మాంటిస్సోరి పాఠశాల యాజమాన్యం ఆదివారం అభినందించింది. ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ బదిలీ అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ కర్నూలుకు బదిలీ అయ్యారు. ఆదివారం ఉదయం ఉత్తర్వులు రాగా...మధ్యాహ్ననికి ఆయన రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో వైఎస్సార్ కడప జిల్లాలో పనిచేస్తున్న వెంకటేశును నియమించారు. అలాగే డీఈఓ కార్యాలయంలో పని చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణయ్య రెండు రోజుల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. మరో పోస్టు కొద్ది రోజులుగా ఖాళీ ఉంది. దీంతో ఈ రెండు స్థానాలను అధికారులు భర్తీ చేశారు. వైఎస్సార్ కడప జిల్లా డీఈఓ కార్యాలయంలో ఏడీగా పని చేస్తున్న మునీర్ఖాన్, కర్నూలు జిల్లా డీఈఓ కార్యాలయంలో ఏడీగా పని చేస్తున్న శ్రీనివాసులును ఇక్కడికి బదిలీ చేశారు. అలాగే ఇక్కడి డీఈఓ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పని చేస్తున్న సరళను కర్నూలు డీఈఓ పరిధిలోని పాఠ్యపుస్తకాల విభాగానికి బదిలీ చేశారు. ప్రమాదంలో వివాహిత మృతి రాయదుర్గం టౌన్: మండలంలోని కదరంపల్లి సమీపంలో చోట చేసుకున్న ప్రమాదంలో ఓ వివాహిత మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు... ఆవులదట్ల గ్రామానికి చెందిన వివాహిత కవిత(28) ఆదివారం తన సోదరుడు నవీన్తో కలిసి ద్విచక్ర వాహనంపై గుండ్లపల్లికి బయల్దేరారు. కదరంపల్లి టోల్గేట్ సమీపంలోకి చేరుకోగానే వెనుకనే ఆర్బీ వంక గొల్లలదొడ్డి గ్రామం నుంచి కెంచానపల్లిలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళుతున్న శివప్ప ఢీకొన్నాడు. ప్రమాదంలో బలమైన గాయమైన కవితను ఆస్పత్రికి తరలించేలోపు మృతి చెందింది. నవీన్తో పాటు ప్రమాదానికి కారణమైన శివప్ప, అతని తాత ఉలెప్పకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆస్పత్రికి స్థానికులు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఉలెప్పను అనంతపురానికి తీసుకెళ్లారు. కాగా, మృతురాలు కవితకు భర్త నాగరాజు, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. -
కమ్ముకుంటున్నా.. కరుణించట్లేదు!
అనంతపురం అగ్రికల్చర్: ఆశల నైరుతి రుతుపవనాలు ఈ సారి చాలా ముందుగానే గత నెల 26న ప్రవేశించడంతో అన్నదాతలు సంబరపడ్డారు. ఖరీఫ్ సాగుకు ఇబ్బంది లేకుండా విస్తారంగా వర్షాలు పడతాయని ఆశించారు. కానీ... ‘నైరుతి’ ప్రవేశించి వారం కావొస్తున్నా ప్రభావం మాత్రం చూపడం లేదు. రుతుపవనాలు రాకమునుపు జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురిశాయి. ‘నైరుతి’ ప్రవేశించాక అనుకూల వాతావరణం మధ్య మంచి వర్షాలు కురుస్తాయని ఆశించినా ఆ పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. వారం రోజులుగా అక్కడక్కడా తేలికపాటి మినహా ఎక్కడా మంచి వర్షపాతం నమోదు కాలేదు. 15 నుంచి 20 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల ధాటికి మేఘాలు చెదిరిపోతున్నాయి. ఈ క్రమంలో మూడు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. 36 నుంచి 38 డిగ్రీలు, రాత్రిళ్లు 23 నుంచి 26 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. ఈ నెల 15 నుంచి... జూలై నెలంతా ఖరీఫ్ కింద పంటల సాగుకు అనుకూలమని శాస్త్రవేత్తలు, అధికారులు చెబుతున్నారు. మరోపక్క వ్యవసాయశాఖ, ఏపీ సీడ్స్ రాయితీ విత్తన పంపిణీ మొదలు పెట్టకపోవడం.. కూటమి సర్కారు నుంచి ఇప్పటివరకు ఎలాంటి సాయం లేక సాగుకు రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కాగా రాగల రెండు రోజులు జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం.విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు అక్కడక్కడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. ఇంకా మొదలు కాని ‘నైరుతి’ ప్రభావం గాలి వేగానికి చెదిరిపోతున్న మేఘాలు