breaking news
Anantapur District News
-
అధిక బరువు మోయలేక.. మొరాయింపు!
కళ్యాణదుర్గం: ఓవర్ లోడు వేస్తే ఎక్కడ పడితే అక్కడే ఆగిపోతామంటూ కళ్యాణదుర్గం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులు బ్రేక్ డౌన్ అవుతున్నాయి. శనివారం కళ్యాణదుర్గం నుంచి అనంతపురానికి ప్రయాణికులతో బయలుదేరిన ఏపీ02 టీసీ 7979 సర్వీసు బస్సు శనివారం స్థానిక అక్కమాంబ కొండ సమీపంలోకి చేరుకోగానే మొరాయించింది. దీంతో ప్రయాణికులను మరో బస్సులో ఎక్కించి గమ్యస్థానానికి చేర్చారు. సీ్త్రశక్తి పథకం కారణంగా సామర్థ్యానికి మించి ప్రయాణికులు బస్సు ఎక్కడమే ఇందుకు కారణమని ఈ సందర్భంగా పలువురు వాపోయారు. -
అంతర్ జిల్లా దొంగల అరెస్ట్
అనంతపురం సెంట్రల్: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను అనంతపురం సీసీఎస్, మూడో పట్టణ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. పట్టుబడిన నిందితుల్లో అనంతపురంలోని నవోదయకాలనీకి చెందిన బాషా అలియాస్ కురబ రామాంజనేయులు, వైఎస్సార్ కడప జిల్లా శ్రీరామ్నగర్కు చెందిన వల్లెపు ప్రసాద్ ఉన్నారు. వీరి నుంచి రూ. 25 లక్షలు విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కడప, గుత్తి, బుక్కరాయసముద్రం, అనంతపురం తదితర ప్రాంతాల్లో పలు దొంగతనాల కేసులు ఉన్నాయి. బేల్దారి పనులతో జీవనం సాగించే బాషా జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు తెరలేపాడు. గతంలో అనంతపురం నాల్గో పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి జైలు పంపారు. పోక్సో యాక్ట్ కింద పామిడి పీఎస్లో ఇతనిపై కేసు నమోదైంది. ఈ కేసులో కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో వల్లెపు ప్రసాద్తో పరిచయం ఏర్పడింది. జైలు నుంచి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరూ కలసి పలు దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో బాషా ఇంట్లో దాచిన మొత్తం చోరీ సొత్తును విక్రయించేందుకు శనివారం విక్రయించేందుకు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా నడిమివంక వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులకు పట్టుబడ్డారు. విచారణ అనంతరం నిందితులను అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. కార్యక్రమంలో త్రీటౌన్సీఐ రాజేంద్రనాథ్యాదవ్, సీసీఎస్ సీఐలు జయపాల్రెడ్డి, శేషగిరి, రాగిరి రామయ్య, ఎస్ఐలు రాజశేఖరరెడ్డి, తులశన్న తదితరులు పాల్గొన్నారు. రూ. 25 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాల స్వాధీనం -
మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల జాప్యాన్ని అరికట్టాలి
అనంతపురం: ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగులు, పోలీసుల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల మంజూరులో నెలకొన్న జాప్యాన్ని అరికట్టాలని ఏపీఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జక్కుల మాధవ్ కోరారు. ఈ మేరకు ఏపీఎన్జీఓ నాయకులతో కలసి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరికి శనివారం విన్నవించారు. ఏడు నెలలుగా ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగులు, పోలీసులకు సంబంధించి మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల మంజూరులో చోటు చేసుకున్న జాప్యాన్ని వివరించారు. ఈ అంశంపై స్పందించిన డాక్టర్ మల్లేశ్వరి మాట్లాడుతూ.. నెల రోజుల్లోపు సమస్యకు పరిష్కారం చూపుతానని అన్నారు. కార్యక్రంమలో పుట్టపర్తి జిల్లా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు లింగా రామ్మోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్ బాబు, అనంతపురం జిల్లా సెక్రెటరీ రవికుమార్, పుట్టపర్తి జిల్లా కార్యదర్శి ఈశ్వర్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీధర్ బాబు, ప్రవీణ్, వంశీ, హరికృష్ణ, పుట్టపర్తి సిటీ అధ్యక్షుడు దేవేంద్ర, సూరి తదితరులు పాల్గొన్నారు. -
ఎద్దుల బండి బోల్తా.. రైతు మృతి
కళ్యాణదుర్గం రూరల్: ఎద్దుల బండి బోల్తాపడిన ఘటనలో ఓ రైతు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... కంబదూరు మండలం మర్రిమాకులపల్లికి చెందిన రైతు రామాంజనేయులు (58) శనివారం ఎద్దుల బండి కట్టుకుని పొలానికి బయలుదేరాడు. తోటలోకి వెళుతుండగా చక్రం గొయ్యిలో పడి బండి బోల్తాపడింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన రామాంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య జయమ్మ, నలుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఘటనపై కంబదూరు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. బంగారు నగల అపహరణ గుత్తి: స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో శనివారం పట్టపగలే ప్రయాణికురాలు సంధ్యారాణి వద్ద నుంచి విలువైన బంగారు ఆభరణాలను దుండగులు అపహరించారు. అనంతపురం నివాసి సంధ్యారాణి ఆర్టీసీ బస్సులో గుత్తి బస్టాండ్కు చేరుకున్నారు. చిక్కేపల్లికి వెళ్లేందుకు మరో బస్సు ఎక్కిన తర్వాత తన బ్యాగ్ను పరిశీలించుకున్నారు. అందులో ఉంచిన చైన్, ఉంగరం, కమ్మలు మొత్తం ఆరు తులాల బరువున్న బంగారు నగలు కనిపించకపోవడంతో ఆందోళనకు గురైన ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బస్సులోని ప్రయాణికులందరినీ తనిఖీ చేసినా ఫలితం లేకపోయింది. ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
అర్ధరాత్రి దొంగల బీభత్సం
రాయదుర్గం టౌన్: స్థానిక వేణుగోపాలస్వామి ఆలయం వద్ద శుక్రవారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. బొలెరో వాహనంలో వచ్చిన కొత్త వ్యక్తులను గమనించిన స్థానిక యువకులు కొందరు అనుమానంతో ప్రశ్నించారు. ఆ సమయంలో వారిపై రాళ్లు రువ్వి బొలెరో వాహనంలో ఉడాయించారు. తక్షణమే సమాచారం అందుకున్న పోలీసులు పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. అప్పటికే దుండగులు బళ్లారి రోడ్డు వైపు నుంచి వాహనాన్ని తరలించినట్లు ఫుటేజీల్లోని దృశ్యాలు స్పష్టం చేశాయి. పందుల దొంగతనానికి వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు సీఐ జయనాయక్ తెలిపారు. కారు ఢీ – వ్యక్తి మృతి గుత్తి రూరల్: కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. కర్నూలు జిల్లా దేవనకొండకు చెందిన పరమేశ్వరాచారి, రాము శనివారం గుత్తి మండలం బాచుపల్లిలో గృహ నిర్మాణ పనికి వచ్చారు. ఈ క్రమంలో టిఫెన్ చేసేందుకు బాచుపల్లి వద్ద 44వ జాతీయ రహదారి పక్కన ద్విచక్ర వాహనాన్ని ఆపి రోడ్డు దాటుతుండగా రోగిని అత్యవసర చికిత్స కోసం కర్నూలుకు తరలిస్తున్న కారు శరవేగంగా వచ్చి పరమేశ్వరాచారిని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన పరమేశ్వరాచారిని స్థానికుల సాయంతో రాము వెంటనే గుత్తిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు... ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నారు. రైలు కింద పడి వృద్ధుడి..తాడిపత్రి రూరల్: స్థానిక చల్లవారిపల్లి రైల్వేస్టేషన్ మార్గం మధ్యలో శనివారం తెల్లవారుజామున రైలు కింద పడి 65ఏళ్ల వృద్ధుడు మృతి చెందాడు. ఈ మేరకు రైల్వే హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ వెల్లడించారు. లోకో పైలెట్ సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి వృద్ధుడి మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మిస్సింగ్ కేసులో సంబంధీకులు ఎవరైనా ఉంటే సంప్రదించాలని తాడిపత్రి రైల్వే పోలీసులు కోరారు. వివాహిత బలవన్మరణం గుమ్మఘట్ట (రాయదుర్గం రూరల్): మండలంలోని 74ఉడేగోళం గ్రామానికి చెందిన మద్దానమ్మ(45) ఆత్మహత్య చేసుకుంది. భర్త గంగాధర, ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి జాతరలో బయలు నాటకం ఆడంబరాలకు వెళ్లరాదని చెప్పిన భర్త పెడచెవిన పెట్టడంతో మనస్తాపానికి లోనైన ఆమె ఇంట్లో ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే రాయదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై అర్బన్ సీఐ జయనాయక్ కేసు నమోదు చేశారు. పోక్సో కేసు నమోదు పామిడి: మండలంలోని రామగిరి దిగువతండాకు చెందిన సెటానాయక్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వివరాలను శనివారం వెల్లడించారు. 3వ తరగతి చదువుతున్న చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడడంతో బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం సెటా నాయక్పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, ప్రమాదంలో గాయపడి అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని పామిడి పీఎస్కు తరలించారు. -
పీడియాట్రిక్ సర్జరీ విభాగానికి పీజీ సీట్ల మంజూరు
అనంతపురం: స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాలలోని పీడియాట్రిక్ సర్జరీ విభాగానికి కొత్తగా నాలుగు పీజీ సీట్లు మంజూరయ్యాయి. 2025 –26 విద్యా సంవత్సరానికి గాను ఈ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ సందర్భంగా పీడియాట్రిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ జి చలపతి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి మృదుల, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సి స్వాతి, ట్యూటర్ డాక్టర్ భాస్కర్, ఎన్ఎంసి కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్, డాక్టర్ ప్రవీణ్ దీన్, డాక్టర్ ప్రవీణ తదితరులు ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎం విజయశ్రీ, సూపరింటెండెంట్ ఆచార్య డాక్టర్ మల్లీశ్వరిను శనివారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సూపర్ స్పెషాలిటీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆచార్య డాక్టర్ బెనెడిక్ట్, వైస్ ప్రిన్సిపళ్లు డాక్టర్ షంషాద్ బేగం, డాక్టర్ ఎస్ షారోన్ సోనియా, డాక్టర్ టి మధు, అనాటమీ విభాగాధిపతి డాక్టర్ ఉమామహేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. -
‘డాష్ బోర్డు’ లోపాల దిద్దుబాటుకు చర్యలు
అనంతపురం క్రైం: డ్రైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) డ్యాష్ బోర్డులోని లోపాలను సరిదిద్దుకునే చర్యలను సంబంధిత అధికారులు చేపట్టారు. డ్యాష్ బోర్డులో నమోదువుతున్న యూఎల్బీ హాజరు గణాంకాల ఆధారంగా శానిటేషన్ విభాగంలోని కార్మికులకు వేతనాలు మంజూరవుతూ ఉంటాయి. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలోని శానిటేషన్ విభాగంలో మొత్తం సిబ్బంది పనుల్లో పాలు పంచుకుంటుండగా హాజరు నమోదులో మాత్రం 0 శాతం నమోదైంది. ఈ అంశాన్ని ‘తప్పుల తడకగా డ్యాస్ బోర్డు’ శీర్షికన ఈ నెల 16న ‘సాక్షి’లో వెలువడిన కథనంపై అనంతపురం నగరపాలక సంస్థ అధికారులు స్పందించి మంగళగిరిలోని మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం ఆరు సర్కిళ్లు ఉండగా, 645 మంది పారిశుద్ధ్య కార్మికులు రోజూ విధుల్లో పాల్గొంటున్నారని, సాంకేతిక లోపాల కారణంగా ఆన్లైన్ హాజరు నమోదులో జాప్యం చోటు చేసుకున్నట్లుగా అక్కడి అధికారులు అంగీకరించారు. ఈ లోపాన్ని సరి చేస్తున్నట్లు వివరించారు. ఇద్దరికి ఉమ్మడిశెట్టి అవార్డులు అనంతపురం కల్చరల్: ఉమ్మడిశెట్టి సత్యాదేవి సాహితీ పురస్కారానికి ఈ ఏడాది ప్రగతిశీల దృక్ఫథం కలిగిన శ్రీకాకుళానికి చెందిన కవి, ఉపాధ్యాయుడు కంచరాన భుజంగరావును ఎంపిక చేసినట్లు నిర్వాహక సంస్థ అధ్యక్షుడు డాక్టర్ రాధేయ తెలిపారు. వివరాలను శనివారం ఆయన వెల్లడించారు. భుజంగరావు రాసిన ‘గీసి చెరిపే బొమ్మ’ కవితా సంపుటిని పురస్కారానికి న్యాయనిర్ణేతలు ఎంపిక చేశారన్నారు. అలాగే ఒంగోలుకు చెందిన యువ కథా రచయిత చరణ్ పరిమిని ఉమ్మడిశెట్టి సతీష్కుమార్ జాతీయ యువ పురస్కారానికి ఎంపిక చేసినట్లు వివరించారు. వీరిద్దరికి త్వరలో అనంత వేదికగా జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని, నగదు బహుమతిని అందజేయనున్నట్లు పేర్కొన్నారు. పని మనిషే నగలు ఎత్తుకెళ్లింది ● చోరీ కేసులో మిస్టరీని ఛేదించిన పోలీసులు గుత్తి: స్థానిక తాడిపత్రి రోడ్డులో నివాసముంటున్న లింగాల రాధా ఇంట్లో మూడు మాసాల క్రితం 22 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన బాధితురాలు మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన సీఐ రామారావు, ఎస్ఐలు సురేష్, అమీర్ ఖాన్ లోతుగా విచారణ చేపట్టి ఇందులోని మిస్టరీని ఛేదించారు. రాధా ఇంట్లో పని చేస్తున్న బెస్త సంధ్యానే చోరీ చేసినట్లుగా నిర్ధారించుకుని శనివారం అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి 17 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. 5 తులాల నగలను యూనియన్ బ్యాంకులో తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నట్లు నిందితురాలు అంగీకరించింది. సంధ్యాపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
వైభవంగా గవిమఠం బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ: గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం ఉరవకొండలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం స్వామి వారి మూలవిరాట్కు అభిషేకాలు, పూజలు నిర్వహించారు. పీఠాధిపతులు జగద్గురు చెన్నబసవరాజేంద్రస్వామి, ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి, మఠం అసిస్టెంట్ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ ఆధ్వర్యంలో కంకణధారణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. గవిమఠం ఆవరణ నుంచి పవిత్ర గంగాజలాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం కంకణ మండపంలోని కుండల్లో మట్టి వేసి నవధాన్యాలు ఉంచారు. బ్రహ్మోత్సవాలు ముగిసే లోపు మట్టికుండల్లో ధాన్యాలు బాగా పండితే ఈ ఏ డాది పంటలు చేతికొచ్చి రైతులు సుభిక్షంగా ఉంటారని భక్తుల విశ్వాసం. కార్యక్రమంలో గవిమఠం సిబ్బంది నారాయణస్వామి, గోపి, మధు, వీరశైవ సంఘం నాయకులు నిరంజన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ‘సమర శంఖం’ విజయవంతం చేయండి అనంతపురం ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) చేపడుతున్న దశలవారీ ఉద్యమంలో భాగంగా ఈ నెల 25న విజయవాడలో తలపెట్టిన ‘సమర శంఖం’ను విజయవంతం చేయాలని జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. శనివారం నగరంలో ‘సమర శంఖం’ పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు పలు హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. మెరుగైన పీఆర్సీ ఇస్తామని ఇప్పటిదాకా కనీసం కమిటీ కూడా వేయకపోవడం దారుణమన్నారు. మధ్యంతర భృతి కూడా ప్రకటించకపోవడం సమంజసం కాదన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు మెమో 57 మేరకు పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశ పెట్టాలన్నారు. పెండింగ్ డీఏలు వెంటనే ప్రకటించాలన్నారు. పదవీ విరమణ పొందే ఉద్యోగులకు మరుసటి రోజే సౌలభ్యాలు అందేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్టీయూ నగర ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, నాయకులు ఫణి భూషణ్, పెద్దన్న, వన్నూరప్ప, విరుపాక్షి గౌడ్, జయరాం నాయుడు, నాగభూషణం నాయుడు, నారాయణస్వామి, నాగభూషణ, రాజన్న, రామకృష్ణ, శ్రీనివాసులు పాల్గొన్నారు. శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి ఆత్మకూరు: సమస్యాత్మక గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సిబ్బందిని ఎస్పీ జగదీష్ ఆదేశించారు. శనివారం ఆత్మకూరు పీఎస్ను ఎస్పీ తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ పరిసరాల సరిశుభ్రత, సీసీ కెమెరాల పనితీరు, లాకప్ గది, భద్రతా ప్రమాణాలతో పాటు పలు రికార్డులు పరిశీలించారు. పెండింగ్ కేసుల దర్యాప్తులపై ఆరా తీశారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ వివాదాస్పద అంశాలు ముందుగానే గుర్తించి సమన్వయ సమావేశాల ద్వారా పరిష్కరించాలని సూచించారు. ఫ్రెండ్లీ పోలిసింగ్ అమలు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక డ్రైవ్ చేపట్టి డ్రంకెన్ డ్రైవ్ నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ నేరాలపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలను కోర్టు ఆదేశాల మేరకు వేలం వేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐ గౌతమ్, సిబ్బంది పాల్గొన్నారు. -
రెచ్చిపోతున్న మట్టి దొంగలు
కణేకల్లు: రాయదుర్గం నియోజకవర్గంలో మట్టి దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో విచ్చల విడిగా మట్టి తవ్వి అక్రమంగా తరలిస్తున్నారు. చివరకు తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) గట్టుకు ఉన్న మట్టిని సైతం వదలడం లేదు. తాజాగా కణేకల్లు మండలం మాల్యం గ్రామశివారులో హెచ్చెల్సీ గట్టు మట్టిని కొందరు అక్రమంగా తరలిస్తున్నారు. పట్టపగలే జేసీబీ, ట్రాక్టర్లను పెట్టి కాలువ మట్టిని ఎడాపెడా తవ్వేస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సమీప భూమిలో పెద్ద గుంతను పూడ్చటానికి ఓ వ్యక్తి ఏకంగా హెచ్చెల్సీ గట్టు మట్టిపై కన్నేశాడు. గత రెండ్రోజుల నుంచి యథేచ్ఛగా మట్టి తవ్వి భూమిలోకి డంప్ చేస్తున్నాడు. నీటి ఉధృతి పెరిగినప్పుడు హెచ్చెల్సీకి గండిపడితే దాన్ని పూడ్చేందుకు మట్టి అవసరమవుతుంది. ఆ సమయంలో మట్టి అందుబాటులో లేకపోతే సుదూర ప్రాంతం నుంచి మట్టిని తరలించాల్సి వస్తోంది. గట్టు దెబ్బతింటే నీరంతా వృథా అయ్యి తీరని నష్టం వాటిల్లుతుందని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. గట్టు బలహీనపడకుండా అధికారులు పరిరక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. హెచ్చెల్సీ గట్టు మట్టినీ వదలని వైనం -
● జన జాతర
కనగానపల్లి: దాదులూరు జన సంద్రమైంది. పోతలయ్యస్వామి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఉత్సవాల్లో భాగంగా శనివారం పోతలయ్య, చెన్నేకేశవస్వాముల జ్యోతుల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని పోతలయ్య, బంగారు లింగమయ్య, చెన్నేకేశవస్వాములను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు జ్యోతులు, బోనాలు ఎత్తుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివార్లకు సమర్పించారు. సాయంత్రం చుట్టు పక్కల గ్రామాల్లోని ప్రజలు, రైతులు ఎద్దులు, ట్రాక్టర్లతో పన్నేరు బండ్లు కట్టి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్ణాటకలోని బెంగళూరు, బళ్లారి, పావగడ తదితర ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. జాతర సందర్భంగా ఆలయ గోపురాలు, ప్రాకారాలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ఆవరణలో వందలాది మిఠాయి, గాజులు, బొమ్మల దుకాణాలు వెలిశాయి. పోతలయ్యస్వామి పరుషలో ప్రధాన ఘట్టమైన గావుల మహోత్సవాన్ని ఆదివారం తెల్లవారుజామున నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఫాల్గుణ శుద్ధ పంచమి గడియల్లో జరిగే ఈ కార్యక్రమంలో తొమ్మిది మంది పోతురాజులు మేకపోతు పిల్లల మెడలను నోటితో కొరికి స్వామివారికి బలి ఇస్తారు. ఈ మహత్తర ఘట్టాన్ని తిలకించేందుకు వచ్చే భక్తులు తెల్లవార్లూ ఆలయం వద్దే వేచి ఉంటారు. కార్యక్రమం అనంతరం భక్తులు వందలాది పొట్టేళ్ల్లు, మేకపోతులను స్వామికి సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైభవంగా పోతలయ్య, చెన్నకేశవుల జ్యోతుల మహోత్సవం భక్త జనసంద్రమైన దాదులూరు.. నేడు గావుల మహోత్సవం -
సృజనకు పదును పెడదాం
అనంతపురం కల్చరల్: చిన్నారులు సెల్ఫోన్కు బానిసలు కాకుండా తమలోని సృజనకు పదునుపెట్టాలని వక్తలు పిలుపు నిచ్చారు. పిల్లలను చదువుతో పాటు కళల్లోనూ ప్రోత్సహించాలని సూచించారు. విలువైన సమయం వృథా చేసుకోకుండా బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునేలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులు, తల్లిదండరుల కోరారు. ‘అనంత బాలోత్సవం – పిల్లల పండుగ–6’ శనివారం అనంతపురం ఎస్ఎస్బీఎన్ కళాశాలలో ప్రారంభమైంది. రెండురోజులపాటు సాగే పండుగకు నాట్యాచార్యులు సంధ్యామూర్తి, పట్నం శివప్రసాద్ శిష్యబృందాల స్వాగత శాసీ్త్రయ నృత్యాలతో శ్రీకారం చుట్టారు. తొలిరోజు శాసీ్త్రయ, జానపద నృత్యాలు, ఫోక్, లలిత సంగీతం, వివిధ రకాల వేషధారణలు, సందేశాత్మక నాటికలతో చిన్నారులు అలరించారు. వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం, బొమ్మల తయారీలో సృజనను కనబరిచారు. పత్రికా పఠనంతో పాటు సైన్సు ప్రయోగాలతో చిన్నారులు అబ్బురపరిచారు. ముఖ్యంగా ఇటీవల పార్లమెంటు వరకు వెళ్లి వచ్చిన చిన్నారి సుంకర నవని ‘అమ్మ పేరు మీద ఓ చెట్టు నాటుదాం .. పర్యావరణాన్ని కాపాడుకుందాం’ అంటూ ప్రత్యేక స్టాల్ నిర్వహించి అధికారుల ప్రశంసలందుకుంది. బాలోత్సవ కమిటీ సభ్యులు శ్రీనివాసరావు, కత్తి విజయ్కుమార్, పట్నం శివప్రసాద్, జూటూరు షరీఫ్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. తొలిరోజు విజేతలుగా నిలిచిన చిన్నారులకు సర్టిఫికెట్లు, జ్ఞాపికలనందించారు. మధుర జ్ఞాపకంగా మార్చుకోండి.. అందమైన బాల్యాన్ని ఒత్తిడితో కాకుండా మనో విజ్ఞానాన్ని కల్గించే కళలు, ఆటపాటలతో మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలని వక్తలు సూచించారు. బాలోత్సవం కమిటీ చైర్పర్సన్ షమీమ్ షఫీవుల్లా, ముఖ్య అతిథులుగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, జిల్లా విద్యా శాఖ అధికారి (డీఈఓ) ప్రసాదబాబు, ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, ఐద్వా నాయకురాలు సావిత్రి ప్రసంగించారు. కార్యక్రమంలో ఎల్కేపీ కళాకారులు, విశ్రాంత ఉపాధ్యాయులతో పాటు కళాకారులు, విద్యావేత్తలు, మాజీ సైనికులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ‘అనంత బాలోత్సవం–6’లో వక్తల పిలుపు -
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ వార్షిక పరీక్షలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధమైంది. సోమవారం ప్రారంభమై మార్చి 24 వరకు జరగనున్నాయి. జిల్లాలో మొత్తం 64 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 48,146 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో మొదటి సంవత్సరం జనరల్ 22,366 మంది, ఒకేషనల్ 2,202 మంది, ద్వితీయ సంవత్సరం జనరల్ 21,613 మంది, ఒకేషనల్ 1,965 మంది రాయనున్నారు. 64 మంది చీప్ సూపరింటెండెంట్లు, 64 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 14 మంది కస్టోడియన్లు, రెండు ఫ్లయింగ్స్వాడ్ బృందాలు, నాలుగు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలతో పాటు 1,051 మంది ఇన్విజిలేటర్లను నియమించారు. 64 కేంద్రాల్లో 917 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను ఆర్ఐఓ కార్యాలయం, కలెక్టరేట్, గుంటూరులోని ఇంటర్ బోర్డు కార్యాలయానికి అనుసంధానం చేశారు. నేరుగా వారు జిల్లాలో ఏ కేంద్రాన్నయినా సీసీ కెమెరాలో పరిశీలించవచ్చు. రేపటి నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు -
15 ఎకరాల పశుగ్రాసం దగ్ధం
బొమ్మనహాళ్: మండలంలోని ఉద్దేహాళ్లో శుక్రవారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో రైతు బోయ రమేష్కు చెందిన 15 ఎకరాల్లోని పశుగ్రాసం కాలి బూడిదైంది. గుర్తు తెలియని వ్యక్తి బీడీ తాగి పారేడయంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఘటనతో రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు. మంటలు చెలరేగుతున్న సమయంలో గ్రామస్తులు అక్కడకు చేరుకుని ఆర్పేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సమాచారం అందుకున్న రాయదుర్గం అగ్నిమాపక కేంద్రం సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసే లోపు పశుగ్రాసం పూర్తిగా కాలిపోయింది. -
బురదలో కూరుకుపోయి చిరుత మృతి
రాయదుర్గం టౌన్: స్థానిక వేంకరటరమణస్వామి ఆలయ సమీపంలోని కొండపై ఉన్న ఏనుగుల బావిలో శుక్రవారం తెల్లవారుజామున ఓ చిరుత మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న జిల్లా అటవీశాఖ అధికారి చక్రపాణి, రేంజ్ ఆఫీసర్ రామచంద్రుడు, డిప్యూటీ రేంజర్ దామోదర్రెడ్డి, పశు వైద్యాధికారి సూర్యనారాయణరెడ్డి, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. చిరుత కళేబరాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం బొందనకల్లు అటవీ క్షేత్రానికి తరలించారు. పోస్టు మార్టం అనంతరం శరీర భాగాలు సక్రమంగా ఉన్నాయని, ఎలాంటి గాయాలు లేవని నిర్ధారణ అయింది. దాహం వేసిన చిరుత బావిలో నీరు తాగేందుకు వెళ్లి బురదలో కూరుకుపోయి మృతి చెందినట్లుగా డీఎఫ్ఓ తెలిపారు. -
సీమ నీటికోసం మరో ఉద్యమం
● విద్యార్థి, యువత ముందుకు రావాలి ● మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పిలుపు అనంతపురం: రాయలసీమకు హక్కుగా దక్కాల్సిన నీటి కోసం మరో ఉద్యమం తప్పదని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ అన్నారు. మేల్కోకుంటే మరో 15 ఏళ్లలో తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరకదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు, యువత ముందుకొచ్చి నీటి హక్కు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ)లో విద్యార్థులతో సమావేశమై నీటి సమస్యపై చర్చించి, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రతినబూనారు. రాయలసీమకు దక్కాల్సిన జలాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శైలజానాథ్ మాట్లాడుతూ తమ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే విషయంలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు ముందుచూపుతో వ్యవహరిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. కర్ణాటకలో గతంలో ఆల్మట్టి డ్యాం ఎత్తు 506.84 మీటర్ల నుంచి 519.24 మీటర్ల ఎత్తుకు పెంచారని, తాజాగా డ్యాం ఎత్తును 524 మీటర్లకు పెంచుతున్నా పట్టనట్టుగా వ్యవహరిస్తుండటం విచారకరమన్నారు. గతంలో 124 టీఎంసీల నిల్వ సామర్థం ఉంటే ఇప్పుడు 240 టీఎంసీల సామర్థ్యానికి పెంచుతున్నారన్నారు. దీనివల్ల మన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. రాయలసీమలోని గాలేరు నగరి, తెలుగు గంగ, వెలిగొండ, హంద్రీ–నీవా అన్నీ శ్రీశైలం ప్రాజెక్ట్పైనే ఆధారపడి ఉన్నాయన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచి రోజుకు 4 టీఎంసీలు తరలించేలా చేశారన్నారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక 80 వేల క్యూసెక్కులకు పెంచారని కొనియాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తెలుగు గంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్ వెలుగోడు, సోమలశిల ప్రాజెక్టులకు మంచి జరిగే ఆలోచనను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పించారన్నారు. 2024లో ఎన్నికల సమయం వరకు పనులు జరిగాయన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఆ పనులు నిలిపేశారన్నారు. ఇటీవల రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం కోసం చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేయించానని గర్వంగా చెప్పారన్నారు. ఈ వ్యాఖ్యలను చంద్రబాబు ఖండిస్తారనుకుంటే విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. 20 టీఎంసీల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవసరమా? అని ప్రశ్నించేలా చంద్రబాబు మాట్లాడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా 800 అడుగుల నుంచే నీటిని తీసుకెళ్లకపోతే రాయలసీమ ఎడారిబారిన పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీమ క్షేమం కోరేవాళ్లు రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేసేలా పనులు చేయాలని అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హంద్రీ–నీవా సామర్థ్యం పెంచితే.. చంద్రబాబు వచ్చాక మళ్లీ తగ్గించడం ద్రోహమే అవుతుందన్నారు. గతంలో రాయలసీమకు కేటాయించిన ఎయిమ్స్ను మంగళగిరికి తరలించేశారన్నారు. కర్నూలు నుంచి హైకోర్టు.. కడప నుంచి సహకార బ్యాంకు తరలించేశారని గుర్తు చేశారు. ఉక్కు పరిశ్రమకు ఊసే లేకుండా చేశారన్నారు. రాయలసీమ నీటి అవసరాలు తీర్చేలా ప్రభుత్వ విధానాలు, నిధుల కేటాయింపులు ఉండాలని, ఇందుకోసం ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బండ్లపల్లి ప్రతాప్రెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు గెలివి జయచంద్రారెడ్డి, పి.హేమంత్కుమార్, చిగండి రమేష్, కై లాష్, ఎస్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ నాయక్, తేజేశ్వరరెడ్డి, శివ, వీరూ యాదవ్, సురేష్, బీదర జయచంద్రారెడ్డి (న్యాయవాది), యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. -
●గవి మఠం.. గజరాజు ఆగమనం
ఉరవకొండ: ఏనుగమ్మ ఏనుగు... మావూరు వచ్చింది ఏనుగు అంటూ ఉరవకొండలో చిన్నారులు సందడి చేశారు. వివరాల్లోకి వెళితే.. గవిమఠానికి చెందిన ఏనుగు శుక్రవారం ఉరవకొండకు చేరుకుంది. గవిమఠానికి సంబంధించి కర్ణాటకలోని తుమకూరులో ఉన్న మఠం నుంచి ప్రత్యేక వాహనంలో ఏనుగును తీసుకువచ్చి ఉత్సవాలు ముగిసిన అనంతరం తిరిగి తుమకూరులోని మఠానికి చేర్చడం ఆనవాయితీగా వస్తోంది ఈ క్రమంలో శుక్రవారం గవిమఠానికి చేరుకున్న ఏనుగు పీఠాధిపతి, ఉత్తరాధికారి ఆశీస్సులు తీసుకుని పురవీధుల్లో సందడి చేసింది. చాలామంది ఏనుగుకు పండ్లు అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు. -
వైఎస్సార్సీపీ నేత దుర్మరణం
● తట్రకల్లు వద్ద చెట్టును ఢీకొన్న కారు ఉరవకొండ: చెట్టును కారు ఢీకొన్న ఘటనలో వైఎస్సార్సీపీ నేత దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండ పట్టణానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు జంగ్లీ నగేష్ శుక్రవారం ఉదయం తన భార్య రేణుకతో కలసి కర్నూలు జిల్లా డోన్లో సమీప బంధువుల ఇంట జరిగే శుభకార్యానికి కారులో బయలుదేరారు. వజ్రకరూరు మండలం తట్రకల్లు గ్రామ సమీపంలోకి చేరుకోగానే కారు ముందు టైర్లు పంచరు కావడంతో ఒక్కసారిగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. అటుగా వెళుతున్న వారు ప్రమాదాన్ని గుర్తించి, వెంటనే 108 కు సమాచారం అందించారు. 108 సిబ్బంది అక్కడకు చేరుకునేలోపు నగేష్ మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రేణుకను వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదంలో నగేష్ మృతి చెందిన విషయం తెలియగానే ఉరవకొండ వైఎస్సార్సీపీ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ఆగమేఘాలపై ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి చేరుకున్నారు. మార్చురీలో ఉంచిన నగేష్ మృతదేహానికి నివాళులర్పించారు. మృతుడి ఇద్దరు కుమారులతో పాటు తండ్రి సిద్దప్పను ఓదార్చారు. ఆయన వెంట పార్టీ నాయకులు వీరన్న, అశోక్, ఈడిగ ప్రసాద్, బసవరాజు, బూదగవి ధనంజయ, ఓబన్న, ఎర్రిస్వామిరెడ్డి, వన్నూరు సాహెబ్, పచ్చి రవి, సతీష్, ఇర్ఫాన్ ఉన్నారు. చెక్ బౌన్స్ కేసులో ముద్దాయికి ఏడాది జైలు తాడిపత్రి రూరల్: చెక్ బౌన్స్ కేసులో ముద్దాయికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ స్థానిక జేఎఫ్సీఎం న్యాయస్థానం తీర్పు వెలువరించింది. వివరాలను ఈ కేసులో వాది తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కృష్ణయ్య వెల్లడించారు. గన్నెవారిపల్లి కాలనీకి చెందిన దామోదర్ వద్ద నంద్యాల జిల్లా అంకిరెడ్డిపల్లికి చెందిన శివనాగేశ్వరరెడ్డి అప్పుగా తీసుకున్న నగదు చెల్లింపులకు సంబంధించి అప్పట్లో ఇచ్చిన బ్యాంక్ చెక్ బౌన్స్ అయింది. దీంతో 2018లో బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. నేరం రుజువు కావడంతో ముద్దాయి శివనాగేశ్వరరెడ్డికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి అనిల్కుమార్ నాయక్ శుక్రవారం తీర్పు వెలువరించారు. -
కళ్యాణదుర్గం ఆర్అండ్బీ డివిజన్ రద్దు
కళ్యాణదుర్గం రూరల్: జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన కళ్యాణదుర్గంలో రోడ్లు, భవనాల శాఖ డివిజన్ రద్దయ్యింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి అందరినీ షాక్కు గురిచేసింది. ఇక్కడ డివిజన్ రద్దు చేసి శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లాకు కొత్తగా డివిజన్ ఏర్పాటు చేసినట్లు గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం.. కళ్యాణదుర్గం ప్రాంత వాసులకు డివిజన్ రద్దుతో అన్యాయం చేసిన విషయం గురించి చెప్పకపోవడం గమనార్హం. కళ్యాణదుర్గం నియోజవర్గం వెనుకబడిన ప్రాంతం కావడంతో 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రహదారుల, భవనాల శాఖ డివిజన్ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఈ శాఖ ద్వారా కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల పరిధిలో రోడ్ల నిర్మాణాలు జరిగాయి. డివిజన్ కార్యాలయంలో 24 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ డివిజన్ రద్దుతో పాటు ఇందులో పనిచేసే ఉద్యోగులందరినీ హిందూపురానికి తరలించారు. ఇక నుంచి రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల ప్రజలు ఆర్అండ్బీ సేవల కోసం అనంతపురం వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతున్నా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటంపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. హిందూపురానికి ఉద్యోగుల బదిలీ కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంత ప్రజలకు తప్పని ఇక్కట్లు ప్రేక్షక పాత్ర వహిస్తున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు -
ఇసుకాసురులపై చర్యలు
రామగిరి: పేరూరు సమీపంలోని పెన్నానది నుంచి ఇసుకను తోడేస్తున్న అక్రమార్కులపై పోలీసులు ఎట్టకేలకు చర్యలకు ఉపక్రమించారు. గత కొన్ని నెలలుగా ఇసుకను తవ్వుతూ సొమ్ము చేసుకుంటున్న వైనంపై ‘పెన్నమ్మకు గర్భశోకం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు... రామగిరి ఎస్ఐ ప్రదీప్రాజ్ శుక్రవారం పెన్నానది పరీవాహక ప్రాంతంలో నిఘా వేశారు. అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తీసుకెళ్తున్న ఏడు ట్రాక్టర్లతో పాటు జేసీబీ వాహనాన్ని స్వాధీనం చేసుకొని, పోలీస్ స్టేషన్కు తరలించారు. సాయంత్రం వాహనదారులందరినీ తహసీల్దార్ కార్యాలయంలో బైండోవర్ చేశారు. జేసీబీ వాహనానికి రూ.10 వేలు, ఒక్కో ట్రాక్టర్కు రూ.5వేలు చొప్పున జరిమానా విధించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ అనుమతులు లేకుండా ఎవరైనా ఇసుక తరలిస్తే చర్యలు కఠనంగా ఉంటాయని హెచ్చరించారు. -
లంచం ఇవ్వలేదని దాడికి యత్నం
● అనంతపురం సచివాలయం–3 అడ్మిన్ తీరుపై బాధితుల ఫిర్యాదు అనంతపురం క్రైం: అడిగినంత లంచం ఇవ్వలేదన్న అక్కసుతో అనంతపురం నగర పాలక సంస్థ పరిధిలోని సచివాలయం– 3 అడ్మిన్ చెలరేగిపోయాడు. ఈ అంశం నగర పాలక సంస్థ రెవెన్యూ విభాగంలో హాట్టాపిక్గా మారింది. బాధితులు తెలిపిన మేరకు... స్థానిక వినాయకనగర్లోని 3వ సచివాలయం పరిధిలో డోరు నంబరు 19–1–37 ఇంటిని చిత్రచేడు రాఘవ కొనుగోలు చేశారు. గుత్తలు తన పేరు మీద మార్పించే పనిని తన వద్ద గుమస్తాగా పని చేస్తున్న సే ఎర్రిస్వామికి అప్పగించారు. దీంతో ఆయన నేరుగా సంబంధిత సచివాలయ అడ్మిన్ రవికుమార్ను కలసి సంప్రదించడంతో పని పూర్తి చేయడానికి తనకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇదే విషయాన్ని తన యజమాని దృష్టికి ఎర్రిస్వామి తీసుకెళ్లి రూ.20 వేలు చెల్లించి పని పూర్తి చేయించాడు. ఆ తర్వాత మిగిలిన రూ.30 వేలు ఇవ్వలేదంటూ ఎర్రిస్వామి ద్విచక్ర వాహనాన్ని లాక్కొని దాడికి ప్రయత్నించడంతో బాధితులు నేరుగా శుక్రవారం ఇన్చార్జ్ కమిషనర్ రాజశేఖర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును అధికారులు సీరియస్గా పరిగణించారు. కాగా, తాను తీసుకుంటున్న ప్రతి లంచంలోనూ కమిషనర్ స్థాయి అధికారికి సైతం వాటా చెల్లించాల్సి ఉంటుందని రవి తెలిపినట్లు బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. పది మంది విద్యార్థులు డీబార్ అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో మాస్కాపీయింగ్కు పాల్పడుతూ పట్టుబడిన పది మంది విద్యార్థులను డీబార్ చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ తెలిపారు. హిందూపురం బాలయేసు డిగ్రీ కళాశాలలో ఒకరు, బాలాజీ విద్యా మందిర్లో ముగ్గురు, కళ్యాణదుర్గం జ్యోతిర్మయి మహిళా డిగ్రీ కళాశాలలో ఐదుగురు, అనంతపురం నగరం శ్రీచైతన్య డిగ్రీ కళాశాలలో ఒకరిపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
రైతులపై తీవ్ర నిర్లక్ష్యం
రైతులను ఆదుకుంటామని చెప్పడం తప్ప చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదు. అన్నదాత సుఖీభవ పథకం కింద సంక్రాంతికి జమ కావాల్సిన పెట్టుబడి సాయం సొమ్ము నెల దాటిపోయినా జమకాలేదు. వ్యవసాయ పెట్టుబడుల కోసం అవస్ధలు పడుతున్నాం. ప్రైవేట్ వ్యక్తుల వద్ద వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందేంది. ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తోంది. – హనుమేష్, దేవగిరి, బొమ్మనహాళ్ మండలం -
చుక్కలు చూపుతున్నారు
నాకు 8 ఎకరాల పొలం ఉంది. ఎన్నికల ముందు రైతులను ఆదుకుంటానని చెప్పిన చంద్రబాబు గెలిచిన తర్వాత ఆ మాటపై నిలబడటం లేదు. ఖరీఫ్లో విత్తనాలు మొదలుకుని యూరియా పంపిణీ వరకు చుక్కలు చూపిస్తూనే ఉన్నాడు. నాకు ఒక్కసారి మాత్రమే పీఎం కిసాన్ – అన్నదాత సుఖీభవ కింద రూ.7వేలు జమ అయ్యింది. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ సమస్య ఉన్నా ఆర్బీకేల వద్దకు వెళ్లి పరిష్కరించుకునేవాళ్లం. ఇప్పుడు సమస్య ఉంటే సమాధానం ఇచ్చేవారే లేరు. – అశోక్రెడ్డి, రైతు, కడదరకుంట, కళ్యాణదుర్గం మండలం -
పీపీపీ విధానాన్ని ఆర్టీసీ పీకకు చుట్టొద్దు
● ధర్నాలో ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు అనంతపురం క్రైం: పీపీపీ విధానాన్ని ఆర్టీసీ పీకకు చుట్టరాదంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. పీపీపీ విధానంలో విద్యుత్ బస్సులను ఆర్టీసీలో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ శుక్రవారం అనంతపురం డిపో ఎదుట యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. యూనియన్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.నార్జునరెడ్డి, రాష్ట్ర మెయింటెనెన్స్, కమిటీ సభ్యుడు సి.నబీరసూల్, జోనల్ అధ్యక్షుడు పి.ఎస్.ఖాన్, జోనల్ ప్రచార కార్యదర్శి డి.ఓ. రత్నం, నాయకులు ఎ.ఎల్. కుమార్, కె. కొండయ్య, జిల్లా అధ్యక్షుడు ఆర్.విజయ భాస్కర్ రెడ్డి తదితరులు మాట్లాడారు. విద్యుత్ బస్సుల పేరుతో డిపోలను ఖాళీ చేయించే విధానం సరికాదన్నారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రైవేట్ ఆపరేటర్లకు ఆర్టీసీని కట్టబెట్టేందుకు ప్రభుత్వం సిద్ధపడడం సిగ్గు చేటన్నారు. ఈ విధానాన్ని తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా రవాణా వ్యవస్థ ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలన్నారు. ఆర్టీసీకి చెందిన విలువైన ఆస్తులను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించే ఆలోచనను విరమించుకోవాలని హితవు పలికారు. ఆర్టీసీలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. -
భూసేకరణ వేగవంతం చేయండి
అనంతపురం అర్బన్: ప్రాజెక్టులకు భూ సేకరణ, భూ బదలాయింపు ప్రక్రియలు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులు, రైల్వే, తదితర ప్రాజెక్టుల భూసేకరణపై జేసీ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న భూసేకరణ కేసులు, భూ బదలాయింపు ప్రతిపాదనల్లో పురోగతి సాధించాలని ఆదేశించారు. భూ సంబంధిత వ్యవహారాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తూ సమన్వయంతో పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో ఎన్హెచ్ పీడీ తరుణ్, నెడ్క్యాప్ అధికారి కిషోర్, భూ విభాగం సూపరింటెండెంట్ రియాజుద్ధీన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 13 మంది ఎస్ఏలకు వీఆర్ఓలుగా రివర్షన్ అనంతపురం అర్బన్: గ్రేడ్–1 వీఆర్ఓగా ఉంటూ సీనియర్ అసిస్టెంట్ (ఎస్ఏ)గా పదోన్నతి పొందిన 13 మంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం శాఖపర పరీక్షలు పూర్తి చేయని కారణంగా రివర్షన్ ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేడ్–1 వీఆర్ఓలు కండిషన్ మీద సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు. నిబంధనల ప్రకారం నిర్ణీత గుడువులోగా రెవెన్యూ పరీక్షలు 1, 2, 3, సర్వే శిక్షణ (42 రోజులు), క్రాప్ శాంపలింగ్, అకౌంట్స్ పరీక్ష పూర్తి చేయాల్సి ఉంది. అయితే వాటిని పూర్తి చేయని కారణంగా ఎస్ఏ పదోన్నతి రద్దు చేసి తిరిగి వీఆర్ఓ గ్రేడ్–1గా రివర్షన్ ఇచ్చారు. రివర్షన్ పొందింది వీరే... శ్రీసత్యసాయి జిల్లాలో బి.ఒన్నూరప్ప, కె.శ్రీనివాసులు, హెచ్.ఎస్.రామకృష్ణ, కె.ఉమా మంజూనాథ్రావు, సి.జయప్రకాష్, కె.హరిప్రసాద్, వి.సత్యనారాయణ, వి.శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఇక అనంతపురం జిల్లాలో వై.శ్రీనివాసులు, టి.వెంకటేసులు, జె.లక్ష్మిదేవి, ఎన్.రామూర్తి, పి.గోవిందరెడ్డి ఉన్నారు. హంద్రీ–నీవా సీఈగా కబీర్బాషా అనంతపురం సెంట్రల్: హంద్రీ–నీవా సీఈగా కర్నూలు సీఈ కబీర్బాషాకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 30తో సీఈ నాగరాజ ఉద్యోగ విరమణ చేసిన విషయం విదితమే. అయితే తన పదవీకాలాన్ని పొడిగించాలని ప్రభుత్వానికి ఆయన దరఖాస్తు చేసుకున్నారు. అక్కడి నుంచి నిర్ణయం వెలువడటానికి ఆలస్యమవుతుండటంతో.. పరిపాలనా సౌలభ్యం కోసం తాత్కాలికంగా కర్నూలు సీఈకి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. వసూలు చేసిన డబ్బు వెనక్కు అనంతపురం అర్బన్: కలెక్టరేట్లో అవినీతికి పాల్పడిన ఉద్యోగి.. బాధితులకు డబ్బు వెనక్కు ఇచ్చేశాడు. ఒక అధికారి వద్ద సీసీగా ఉన్న వ్యక్తి భూముల ఫైళ్లు క్లియరెన్స్ చేయిస్తానని పలువురి వద్ద డబ్బులు వసూలు చేశాడు. దీనిపై ‘కలెక్టరేట్లో అవినీతి అనకొండ’ శీర్షికన ‘సాక్షి’లో ఈ నెల ఐదో తేదీన ప్రచురితమైన కథనం చర్చనీయాంశమైంది. సీసీపై సదరు అధికారి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఆయన బాధితుల్లో ఒకరైన మదనపల్లికి చెందిన సీఎం సమీప బంధువుకు రూ.2 లక్షలు, యాడికి మండలం కంబాలపాడుకు చెందిన వ్యక్తికి రూ.30 వేలు వెనక్కు ఇచ్చేసినట్లు సమాచారం. అదే క్రమంలో బెంగళూరుకు చెందిన పార్టీతో డబ్బు విషయమై మాట్లాడుకున్నట్లు తెలిసింది. సోలార్ సమస్యలా.. 1912కు తెలపండి అనంతపురం టౌన్: సోలార్ విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. కాల్ సెంటర్లో సోలార్ విద్యుత్ సమస్యలను సైతం ఫిర్యాదు చేసే స్కౌకర్యాన్ని నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులను నిర్దిష్ట గడువులోపు పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. -
నేటి నుంచి ‘బాలోత్సవం’
అనంతపురం కల్చరల్: రెండు రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా సాగే బాలోత్సవానికి అనంతపురం సిద్ధమైంది. శనివారం నగరంలోని ఎస్ఎస్బీఎన్ పాఠశాల ప్రాంగణంలో ఈ వేడుకలను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఏర్పాట్లను శుక్రవారం బాలోత్సవం కమిటీ కమిటీ చైర్పర్సన్ షమీమ్ షఫీవుల్లా, ఐద్వా సావిత్రి, కార్యదర్శి శ్రీనివాసరావు పరిశీలించారు. శని, ఆదివారాల్లో సాగే ఈ వేడుకలకు 150కి పైగా పాఠశాలలకు చెందిన 6 వేల మందికి పైగా విద్యార్థులు పాల్గొనే అవకాశముందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అకడమిక్ (విద్యా సంబంధమైనవి), కల్చరల్ (కళలకు సంబందించినవి)తో పాటు వివిధ క్రీడా పోటీలు ఉంటాయన్నారు. అక్కడికక్కడే విజేతలను ప్రకటించి కవులు, మేధావుల చేతుల మీదుగా బహుమతులను అందజేస్తామన్నారు. పోటీల్లో పాల్గొనేందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని, టిఫెన్, భోజనం ఉచితంగానే అందజేస్తామని పేర్కొన్నారు. -
రారండోయ్ జాతర చూద్దాం
● నేటి నుంచి దాదులూరు పరుష ● సుదూర ప్రాంతాల నుంచి తరలిరానున్న భక్తులు కనగానపల్లి: ఐదు దశాబ్దాలుగా ఏటా జరుగుతున్న దాదులూరు పోతలయ్యస్వామి జాతరకు సర్వం సిద్ధమైంది. ఏటా మహా శివరాత్రి తర్వాత నిర్వహించే ఈ జాతరలో పాల్గుణ శుద్ధ పంచమి రోజున నిర్వహించే పోతలయ్యస్వామి గావుల మహోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. మూడు రోజుల పాటు జరిగే పోతలయ్యస్వామి జాతరకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచే కాకుండా బెంగళూరు, పావగడ వంటి సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఆలయ ప్రాశస్థ్యం 44వ నంబరు జాతీయ రహదారి పక్కన దాదులూరులో వెలసిన పోతలయ్య స్వామి ఆలయాన్ని రెండు గోపుర ప్రాకారాలతో నిర్మించారు. ఇందులో పోతలయ్య, చెన్నకేశవస్వామి రూపాల్లో శివ, నారాయణలు పక్క పక్కనే కొలువు దీరి ఉండటం విశేషం. వీరితో పాటు లింగమయ్యస్వామి కూడా ఇక్కడే కొలువుదీరి ఉన్నారు. జాతరకు పోతలయ్య, చెన్నకేశవ స్వామి కాపులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహిస్తారు. ఇక పోతలయ్యస్వామికి ప్రత్యేకంగా నిర్వహించే గావుల మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు. నేటి నుంచి మూడు రోజుల పాటు జాతర పోతలయ్యస్వామి జాతర శుక్రవారం నుంచి మూడు రోజులు పాటు జరుగుతుందని ఆలయ ధర్మకర్త రామలింగారెడ్డి తెలిపారు. తొలిరోజు జరిగే యలవగంప ఊరేగింపుతో జాతర ప్రారంభమవుతుందన్నారు. రామగిరి మండలం గంతిమర్రి నుంచి ప్రారంభమయ్యే ఈ ఊరేగింపు ద్వారా పోతలయ్యస్వామి కాపులు.. స్వామి వారి ఆభరణాలను బుట్టలో తీసుకొని వచ్చి అలంకరిస్తారు. రెండో రోజు శనివారం పోతలయ్య, చెన్నకేశవ స్వాములకు జ్యోతుల మహోత్సవం ఉంటుంది. ఈ సందర్భంగా చుట్టు పక్కల గ్రామాల్లోని రైతులు, భక్తులు పలహారపు బండ్లతో ఆలయ చుట్టూ తిప్పుతారు. మూడో రోజు ఆదివారం వేకువజామునే తొమ్మిది మంది పోతరాజులతో స్వామి వారికి మేక పిల్లలను బలి ఇచ్చే గావుల మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. జాతరకు వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని పోలీస్, రెవెన్యూ అధికారుల సహకారంతో గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. -
పెన్నమ్మకు గర్భశోకం
దేశంలోనే అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఉమ్మడి అనంత రెండోస్థానంలో ఉంది. ఇలాంటి ప్రాంతంలో తాగు, సాగునీటి కష్టాలూ అధికమే. అందుకే ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టాలి. భూగర్భజలమట్టం పెంపునకు చర్యలు తీసుకోవాలి. కానీ కొందరు ఇసుక కోసం నదులను చెరబడుతూ కొద్దిపాటి జలమట్టాన్ని అడుగంటేలా చేస్తున్నారు. ఫలితంగా పల్లెల్లో అప్పుడే దాహం కేకలు వినిపిస్తున్నాయి. పట్టించుకోవాల్సిన పాలకులు చేష్టలుడిగి చూస్తుండగా... జనం గుక్కెడు నీటికోసం అల్లాడిపోతున్నారు. రామగిరి: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ కొలువుదీరాక ప్రకృతి వనరులకు ప్రమాదం ఏర్పడింది. అక్రమార్జనే ధ్యేయంగా కొందరు సహజ వనరులను కొల్లగొడుతున్నారు. ముఖ్యంగా ఇసుక కోసం నదులను గుల్ల చేస్తుండడంతో అవి రూపురేఖలు కోల్పోయాయి. ఇసుకాసురులు పెన్నానదిని ఆదాయ వనరుగా మార్చుకుని పగలు, రాత్రి తేడా లేకుండా వందలాది వాహనాల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా..పెన్నమ్మకు గర్భశోకం ఏర్పడింది. అంతేకాకుండా నదీపరీవాహక ప్రాంతంలో భూగర్భజలమట్టం అడుగంటిపోగా తాగు, సాగునీటి కష్టాలతో జనం అల్లాడిపోతున్నారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న రామగిరి మండలంలోని పేరూరులో పరిస్థితి మరింత దారుణంగా మారింది.పెన్నాను చెరబట్టిన ఇసుకాసురులు..పేరూరులో అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ (పేరూరుడ్యాం) దిగువన పెన్నానది ప్రవహిస్తోంది. ప్రస్తుతం నీటి ప్రవాహం లేకపోవడంతో ఇసుక మేటలు కనిపిస్తున్నాయి. నాణ్యమైన ఇసుక ఇక్కడ పుష్కలంగా లభిస్తోంది.దీంతో కొందరు నదిలోని ఇసుకను అక్రమంగా తరలిస్తూ భారీగా ఆర్జిస్తున్నారు. ఇసుకాసురుల ధన దాహానికి ఆ ప్రాంతంలో భూగర్భజలమట్టం పూర్తిగా పడిపోగా.. బోర్లన్నీ ఎండిపోయాయి. సాగులేక పొలాలన్నీ బీళ్లుగా మారగా...గొంతు తడిపే గుక్కెడు నీటికోసం జనం అల్లాడిపోతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో జనం వలసబాట పట్టారు.రోజూ వందలాది ట్రాక్టర్లలో ఇసుక రవాణారామగిరి మండలం కర్ణాటక సరిహద్దులో ఉంటుంది. ఇక్కడ ప్రజాప్రతినిధులు ‘మేం చేసిందే చట్టం.. చెప్పిందే న్యాయం’ అన్నట్లుగా వ్యవహరిస్తుండగా.. వారి అనుచరులు, అధికార పార్టీ నేతలు పేట్రేగిపోతున్నారు. రామగిరి ప్రాంతంలోని సోలార్ ప్లాంట్లు, సమీపంలోని కర్ణాటక ప్రాంతంలోని సోలార్ ప్రాజెక్టులకు ఇసుక భారీగా అవసరం కావడంతో వారు పెన్నానదిపై కన్నేశారు. నదిని చెరబట్టి రాత్రి, పగలు తేడా లేకుండా జేసీబీ వాహనాలతో తవ్వుకుంటూ రోజూ వందలాది వాహనాల్లో అక్రమంగా తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు.సమాధులనూ వదలని వైనంపేరూరుకు ప్రత్యేకంగా శ్మశాన వాటిక లేకపోవడంతో గ్రామంలో ఎవరైనా, ఏ కులానికి సంబంధించిన వారైనా తనువు చాలిస్తే పెన్నా ప్రాంతంలో పూడుస్తారు. అయితే ఇసుక తోడేళ్లు శ్మశానాలను, పూడ్చిన శవాలను వదలకుండా పుర్రెలున్న వాటినికూడా ఇసుకతోపాటు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద పెద్ద గుంతలు పడి ఎవరి సమాధి ఎక్కడుందో తెలియక ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.గుక్కెడు నీటికోసం తీవ్ర ఇబ్బందులుప్రస్తుతం వేసవి సమీపిస్తుండడంతో ఆప్రాంతంలో గుక్కెడు నీటికోసం గ్రామీణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇసుకాసురుల ధన దాహానికి పెన్నా ఛిద్రంకాగా, భూగర్భజల మట్టం భారీగా పడి పోయింది. ఫలితంగా సమీపంలో ఉన్న కనగానపల్లి, కంబదూరు, ఆత్మకూరు, మండలాల్లో సైతం బోరు బావులు ఎండిపోయాయి. రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫిబ్రవరిలోనే తాగునీటి తిప్పలు పడుతుంటే...మే, జూన్ మాసాల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం భయపడిపోతున్నారు.పట్టించుకోని అధికారులు..రామగిరి మండలం కర్ణాటక సరిహద్దులో ఉండడంతో జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నా.. స్థానిక అధికారులు తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. రోజూ వందలాది ఇసుక ట్రాక్టర్లు పోలీస్స్టేషన్, తహసీల్దార్ కార్యాలయాల ముందు నుంచే వెళ్తున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. ఇప్పటికై నా ఇసుక అక్రమ రవాణాపై అధికారులు చర్యలు తీసుకోకపోతే చుట్టు పక్కల గ్రామాల ప్రజలతో కలిసి ప్రజాఉద్యమాన్ని చేపడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.గేట్ల పేరుతో కాసిన్ని నీటినీ వదిలేసి...2023లో వరుణుడు కరుణించడంతో పెన్నా ప్రవహించింది. అప్పటి నుంచి ఎగువ ప్రాంతాల్లో వర్షం కురిస్తే పెన్నాలో కాసిన్ని నీళ్లు కనిపించేవి. ఈక్రమంలో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు అధికారులు పేరూరు డ్యాంలో నీరు నిల్వ ఉంచారు. తాగునీటి సమస్య ఉత్పన్నమైతే ఈ నీటిని వాడుకోవచ్చని భావించారు. డ్యాంలో నీరుండటంతో సమీప ప్రాంతాల్లోనూ భూగర్భజలమట్టం సమృద్ధిగా ఉండేది. కానీ పేరూరు డ్యాం గేట్ల మరమ్మతుల పేరుతో ఇక్కడి ప్రజాప్రతినిధులు డ్యాంలోని నీరంతా వదిలేశారు. దీంతో ఈ ప్రాంత వాసులకు కన్నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. -
ప్రతి లే అవుట్ క్రమబద్ధీకరణకు చర్యలు
● అహుడా వైస్ చైర్మన్ విష్ణుచరణ్ ఆదేశం అనంతపురం క్రైం: అహుడా పరిధిలోని ప్రతి లే అవుట్నూ క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను అనంతపురం – హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అహుడా) వైస్ చైర్మన్ సి. విష్ణుచరణ్ ఆదేశించారు. లే అవుట్ల క్రమబద్ధీకరణ అంశంపై గురువారం అనంతపురంలోని అహుడా కార్యాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. అహుడా చైర్మన్ టి.సి. వరుణ్, సెక్రటరీ జి. రామకృష్ణారెడ్డి పాల్లొన్నారు. ఈ సందర్భంగా విష్ణుచరణ్ మాట్లాడుతూ.. ఎంఐజీ లే అవుట్లలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని, ప్రతి ఫ్లాట్ కొనుగోలుదారునికి మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనధికార లేఅవుటు, ప్లాట్ల నియంత్రణ పథకం (ఎల్ఆర్ఎస్–2020) కింద క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిన నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలన్నారు. అక్రమంగా లే అవుట్లు వేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఎంఐజీ పేమెంట్లు, రిజిస్ట్రేషన్ల అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో అహుడా పీఓ ఇషాక్, ఇంజినీర్ దుష్యంత్, ఈఓ అరుణ కుమారి, ఏఓ రవిచంద్రన్, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్, జేపీఓ హరీష్ చౌదరి, డీఈ రేవంత్, సర్వేయర్ శరత్ తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి గవిమఠం బ్రహ్మోత్సవాలు
ఉరవకొండ: ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగున ఉన్న కర్ణాటకకూ తలమానికంగా ఉరవకొండలోని గవిమఠం నిలుస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల పరిధిలో 770 ఉపమఠాలు, రూ.కోట్ల విలువైన స్థిరాస్తులతో నిత్యమూ శివనామస్మరణతో విరాజిల్లుతున్న ప్రసిద్ధి గాంచిన ఈ శైవక్షేత్రంలో ఈ నెల 21 నుంచి చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో మఠం పీఠాధిపతి జగద్గురు చెన్నబసవ రాజేంద్రస్వామి, ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ నేతృత్వంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 21న కంకణ ధారణతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. 22న నాగభరణ ఉత్సవం, 23న నెమలి వాహనోత్సవం, 24న గవిమఠ సంస్థాన 8వ పీఠాథిపతి చెన్నబసవ రాజేంద్రస్వామి అడ్డ పల్లకీ ఉత్సవం, 25న మహా గణారాధన, బసవేశ్వర వాహనోత్సవం, 26న బ్రహ్మరథోత్సవం, 27న లంకాదహనం, 28న అశ్వవాహనోత్సవం, వసంతోత్సవం ఉంటాయి. తరలి వచ్చే భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఇన్చార్జ్ ఈఓ గంజి మల్లికార్జున ప్రసాద్ తెలిపారు. -
జంట హత్యల కేసులో నిందితుల అరెస్ట్
శింగనమల: ఇటీవల సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను గురువారం శింగనమల పోలీస్స్టేషన్లో సీఐ కౌలుట్లయ్య విలేకరులకు వెల్లడించారు. ఆయన తెలిపిన మేరకు... శింగనమల మండలం తరిమెల గ్రామానికి చెందిన దండోరా నల్లప్పకు ఇద్దరు భార్యలు. నల్లప్ప మరణించిన తరువాత ఆయనకు చెందిన భూమితో పాటు ఇంటిని చిన్న భార్య దండోరా ఎల్లమ్మ, ఆమె కుమారుడు దండోరా అంబేడ్కర్ అలియాస్ చిన్న తమ పేరున మార్చుకున్నారు. తమకు తెలియజేయకుండానే ఇలా చేయడంతో పెద్ద భార్య లక్ష్మీదేవి, ఆమె కుమారులు దండోరా మాదిగ జగ్జీవన్ రాం అలియాస్ మోహన్, దండోరా ఓంకార్ అలియాస్ పెట్టి రగిలిపోయారు. ఎల్లమ్మ, ఆమె కుమారుడిపై కక్ష పెంచుకున్నారు. ఈ నెల 2న రాత్రి 10.30 గంటల సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ఎల్లమ్మ, చిన్నను తమ స్నేహితులైన గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు, పెద్దవడుగూరు మండలం వీరేపల్లికి చెందిన మండ్ల సాయి కిరణ్తో కలిసి మోహన్, పెట్టి హతమార్చి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలించారు. రాబడిన సమాచారం మేరకు ఈనెల 18న సాయంత్రం నాలుగు గంటల సమయంలో పాత కల్లూరు–తరిమెల రోడ్డు మార్గంలోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో శింగనమల, గార్లదిన్నె, నార్పల ఎస్ఐలు విజయకుమార్, మహమ్మద్ గౌస్, సాగర్, ఏఎస్ఐ చితంబరయ్య తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నూతన కార్యాలయం పరిశీలన
అనంతపురం: నగరంలోని హెచ్చెల్సీ కాలనీలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలోని మెటీరియల్ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకెళ్లారు. నిర్మాణ సామగ్రిని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మొత్తం రూ.40 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు నిర్ధారించారు. పరిశీలించిన వారిలో పార్టీ పార్లమెంట్ పరిశీలకులు నరేష్ రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, నియోజకవర్గ సమన్వయకర్తలు వై. విశ్వేశ్వర రెడ్డి, తలారి రంగయ్య, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.వెంకట్రామి రెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, మేయర్ వసీం సలీం, రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్ తదితరులు ఉన్నారు. -
తక్కువ ధరకే ఫార్చునర్ కారు అంటూ టోకరా
అప్రమత్తంగా ఉండాలి కళ్యాణదుర్గం: తక్కువ ధరకే ఫార్చునర్ కారు వస్తుందంటూ సైబర్నేరగాళ్లు ఆన్లైన్ ద్వారా ఓ అమాయకుడికి ఆశ చూపి రూ.24 లక్షలకు టోకరా వేశారు. ఈ ఘటన కళ్యాణదుర్గం మండలంలో వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం వట్లూరు గ్రామానికి చెందిన భీముడు అజిత్కుమార్ ‘ఓఎల్ఎక్స్’లో ఓ ఫార్చునర్ కారు రూ.24 లక్షలకే వస్తుందంటూ పోస్టు పెట్టాడు. ఈ పోస్టు చూసిన వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన వేణుగోపాల్రెడ్డి కారు కోసం అజిత్ కుమార్తో బేరం కుదుర్చుకున్నాడు. ఈ వ్యవహారంలో అజిత్ కుమార్ హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఉప్పొంక గ్రామానికి చెందిన తూర్పు త్రిశాంత్ను రంగంలోకి దింపాడు. ఈ క్రమంలో వేణుగోపాల్రెడ్డి ద్వారా రూ.24 లక్షలను తూర్పు త్రిశాంత్ పేరిట కళ్యాణదుర్గంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాకు జమ చేయించాడు. అనంతరం ఓఎల్ఎక్స్లో ఫార్చునర్ కారు పెట్టినందుకు ఒరిజనల్ ఓనర్ అకౌంట్కు రూ.10 వేలు ఫోన్ పే ద్వారా చెల్లించి.. మిగిలిన డబ్బుతో ఉడాయించేశాడు. కారు కోసం వేణుగోపాల్రెడ్డి.. అజిత్కుమార్కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. తనను మోసం చేశారని గ్రహించాడు. బాధితుడు ఆ జిల్లాలో ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా కేసు విచారణ జరుగుతోంది. వచ్చిన సొమ్ముతో అజిత్, త్రిషాంత్ కర్ణాటకకు వెళ్లి ఓ జ్యువెలరీ షాపులో బంగారం కొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో నేరగాళ్ల కోసం విజయవాడ సైబర్ క్రైం పోలీసులు రెండు రోజుల క్రితం కళ్యాణదుర్గం వచ్చి విచారణ జరిపినట్లు సమాచారం. పక్కా ప్లాన్తో మోసాలు భీముడు అజిత్ కుమార్ అమాయకులను లక్ష్యంగా చేసుకుని పక్కా ప్రణాళికతో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతనికి ఏకంగా పలు రకాల చిరునామాలతో ఐదు ఆధార్ కార్డులు ఉన్నట్లు తేల్చారు. ఇలాంటి కేసుల్లో న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొనేందుకు తన సోదరితో పాటు ఐదుగురు అడ్వకేట్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఏ సమస్య వచ్చినా అజిత్కుమార్ను అరెస్టు చేయకుండా అడ్వకేట్లే కాపాడుతుంటారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలోనే సైబర్ మోసంపై ఓ సీఐ.. అజిత్కుమార్కు ఫోన్ చేయగా..‘గాలిని పట్టుకోగలవా?! నీకు దమ్ముందా’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టోకరా వేసిన అజిత్ కుమార్, త్రిషాంత్ (ఫైల్) ఇటీవల కాలంలో ప్రజలు అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. అధిక ఆదాయం పొందవచ్చని మోసపోతున్నారు. ఏటీఎంల వద్ద అమాయకుల కార్డులను మార్చి డబ్బు కాజేస్తున్నారు. అలాగే ఓఎల్ఎక్స్లో మంచి కార్లు ఉన్నాయంటూ ఆశజూపి రూ.లక్షలు కొల్లగొట్టేస్తున్నారు. ఇలాంటి వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. – రవిబాబు, డీఎస్పీ, కళ్యాణదుర్గం -
బాంబులు పెట్టాం..12:05కు పేలుతాయ్
అనంతపురం/ఉరవకొండ/గుంతకల్లు/ధర్మవరం: తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులతో పాటు ఉమ్మడి జిల్లాలోని కోర్టులకూ బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. అనంతపురం జిల్లా కోర్టుతో పాటు ఉరవకొండ, గుంతకల్లు, ధర్మవరం కోర్టులకు బుధవారం బెదిరింపుల ఈమెయిల్స్ అందాయి. ‘కోర్టు ఆవరణలో ఆర్డీఎక్స్ ఐఈడీలు అమర్చాం. అవి రిమోట్ కంట్రోల్ ద్వారా సరిగ్గా మధ్యాహ్నం 12:05 గంటలకు పేలుతాయ’ని ఈమెయిల్స్లో పేర్కొన్నారు. దీంతో న్యాయమూర్తులు, సిబ్బంది ముందు జాగ్రత్తగా కక్షిదారులను కోర్టుల నుంచి ఖాళీ చేయించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్లతో రంగంలోకి దిగిన పోలీసులు కోర్టు భవనాలతో పాటు ప్రాంగణాల్లో అణువణువూ తనిఖీ చేశారు. ఎలాంటి పేలుడు పదార్థాలూ లభించలేదు. దీంతో ఇవన్నీ నకిలీ బెదిరింపులని పోలీసులు ప్రకటించారు. ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవడానికి సైబర్ క్రైమ్ పోలీసులు ఐపీ అడ్రెస్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గత నెలలోనూ అనంతపురం కోర్టుకు బాంబు బెదిరింపు వచ్చింది. మళ్లీ అలాంటి బెదిరింపులే రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బెదిరింపు ఈ– మెయిల్స్తో కోర్టుల్లో కలకలం పోలీసుల విస్తృత తనిఖీలు ఉత్తుత్తి బెదిరింపులని నిర్ధారణ -
దిగుబడి.. దోబూటులాడి
ఫలరాజు మామిడి ఈసారి ‘అనంత’ అన్నదాతల్లో గుబులు రేకెత్తిస్తోంది. ఎక్కడ చూసినా తోటల్లో విపరీతమైన పూత రావడం, రాలిపోవడం, మళ్లీ వస్తుండడంతో ఫలసాయం ఏ మేరకు వస్తుందనే బెంగ పట్టుకుంది. రైతుల్లోనే కాదు ఉద్యానశాఖ అధికారులు, ఉద్యాన శాస్త్రవేత్తలకు కూడా అంతుబట్టని పరిస్థితి నెలకొంది. మామిడి తోటల స్థితిగతులు, దిగుబడులు, మార్కెటింగ్ అంశాల గురించి ఉద్యానశాఖ అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా ఈ సారి మామిడి తోటల పంటకాలం గతి తప్పే ప్రమాదం పొంచి ఉన్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో చీనీ తర్వాత మామిడి ఎక్కువగా సాగు చేశారు. ఈ–క్రాప్ నివేదిక ప్రకారం ఈసారి 35 వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించాయి. 80 శాతం బేనిషా, మిగతా 20 శాతం తోతాపురి, ఖాదర్, బెంగళూరు, మల్లిక, ఇతర్రతా రసాలు సాగులో ఉన్నాయి. పంట పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తున్నా దిగుబడులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చిన్నా పెద్దా, పాత తోటలు, అటవీప్రాంతంలో ఉన్న మామిడి చెట్లన్నీ విపరీతంగా పూత పట్టినట్లు చెబుతున్నారు. అయితే డిసెంబర్, జనవరి 15 లోపు పూర్తిగా పూత పట్టాల్సిన మామిడి ఈసారి ఫిబ్రవరిలో రావడం వల్ల చాలా ఆలస్యం కావడంతో దిగుబడులపై ఆందోళన కనిపిస్తోందని అంటున్నారు. దాదాపు 70 శాతం తోటలు ఈపాటికి పిందె, కాయ దశలో ఉండాల్సి ఉండగా అందుకు భిన్నంగా 30 శాతం తోటలు మాత్రమే పిందె దశకు చేరుకున్నట్లు చెబుతున్నారు. ఈసారి చలికాలం మరీ ఎక్కువ రోజులు కొనసాగడం, ఇప్పుడు కూడా ఉదయం పూట కనిష్ట ఉష్ణోగ్రతలతో శీతల వాతావరణం ఉన్నందున పూత అధికంగా వస్తున్నట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్న సమయంలో ఎండలు కనిపిస్తుండటంతో పూత రాలడం, మళ్లీ పూత పడుతూ ఉండటంపై దిగుబడుల పరిస్థితి ఏంటో అంతుచిక్కడం లేదంటున్నారు.చీడపీడలు ఆశించే అవకాశంవిచిత్ర వాతావరణం నడుమ మామిడి తోటల్లో పూత చాలా ఆలస్యంగా రావడం వల్ల మొదట్లో తేనెమంచు పురుగు, గొంగళి పురుగు ఆశించి దెబ్బతీసే పరిస్థితి కనిపించింది. అయితే పూత నుంచి పిందె, కాయ, పండు కావడం చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున చివర్లో పండుఈగ నష్టం కలగజేసే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. ఏప్రిల్లో మార్కెట్లోకి రావాల్సిన మామిడి ఈసారి ఆలస్యం అయ్యే అవకాశం ఉండగా.. జూలైలో గాలులు మొదలయ్యే నాటికి పండుఈగ దాడి చేసి నష్టం కలిగించ వచ్చంటున్నారు. జూన్, జూలై వర్షాలు మొదలు మార్కెట్ కూడా పడిపోవచ్చని చెబుతున్నారు. ఇప్పుడు పూత రావడం వల్ల ఏప్రిల్, మేలో ఈదురుగాలులు, అకాల వర్షాలకు పిందెలు రాలిపోయే పరిస్థితి కూడా ఉండవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం కావడం, అలాగే కేవలం 15 రోజులు ఉండాల్సిన పూత దశ ఇప్పుడు 20 రోజులకు పైగా పెరగడం వల్ల మామిడి పరిస్థితిపై అర్థం కావడం లేదని అధికారులు చెబుతున్నారు. అనంతపురం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మామిడి తోటల పరిస్థితి ఇలాగే ఉందని చెబుతున్నారు. -
మామిడి తోటకు నిప్పు
పుట్లూరు: మండలంలోని బాలాపురం సమీపంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రచార విభాగం మండల కన్వీనర్ పవన్కుమార్ మామిడి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎల్లుట్ల గ్రామానికి చెందిన పవన్కుమార్ బాలాపురం సమీపంలో ఉన్న 4 ఎకరాల్లో 15 సంవత్సరాలుగా మామిడి తోటను సాగు చేస్తున్నాడు. వారం రోజుల క్రితం శ్రీశైలం వెళ్లి తిరిగి వచ్చాడు. బుధవారం తోట వద్దకు వెళ్లగా జరిగిన నష్టాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేఽశాడు. ఘటనతో పూత దశలో ఉన్న 70 మామిడి చెట్లు మాడిపోయాయని, డ్రిప్పు పరికరాలు విద్యుత్ మోటార్, కేబుల్ కాలిపోయిందని వివరించాడు. రూ. 2 లక్షల మేర నష్టం వాటిల్లిందని వాపోయాడు. 23న కలెక్టరేట్ ఎదుట కౌలు రైతుల నిరసన అనంతపురం అర్బన్: అన్నదాత సుఖీభవ కింద ప్రతి కౌలు రైతుకూ రూ.20 వేలు ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని కౌలు రైతు, రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఆ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిరసన దీక్ష పోస్టర్లను వారు విడుదల చేసి, మాట్లాడారు. నూతన కౌలు చట్టం చేయాలని, ఎలాంటి షరతులు లేకుండా పంట రుణాలు, సబ్సిడీ విత్తనాలు, పురుగు మందులు ఇవ్వాలన్నారు. కౌలు రైతులు పండించిన పంటలను వారి పేరున కొనుగోలు చేసి ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుకు సంబంధించి వారి కుటుంబానికి రూ.25 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. డిమాండ్ల సాధనలో భాగంగా ఈ నెల 23, 24 తేదీల్లో కలెక్టరేట్ ఎదుట 36 గంటల నిరసన దీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం, రైతు సంఘం జిల్లా కార్యదర్శులు బాలరంగయ్య, చంద్రశేఖర్రెడ్డి, నాయకులు బీహెచ్రాయుడు, వెంకటేషులు, సురేష్, సుంకన్న, తదితరులు పాల్గొన్నారు. -
పప్పుశనగ రైతు కష్టాలు పట్టని మంత్రి
ఉరవకొండ: రబీ సీజన్లో పప్పుశనగ సాగు చేసిన రైతుల కష్టాలు మంత్రి పయ్యావుల కేశవ్కు పట్టడం లేదని వైఎస్సార్సీపీ నాయకులు విమర్శించారు. పంట దిగుబడులు కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అంతులేని నిర్లక్ష్యం కనబరుస్తూ రైతులను నష్టాల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. పప్పుశనగ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ఆదేశాలతో బుధవారం ఉరవకొండలోని ఏడీఏ కార్యాలయం ఎదుట రైతులతో కలసి వైఎస్సార్సీపీ నాయకులు ధర్నా చేపట్టారు. పార్టీ రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు మేకల సిద్దార్థ్, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తూలురు అశోక్, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి బోయ సుశీలమ్మ మాట్లాడుతూ... జిల్లాలోనే అత్యధికంగా ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు, విడపనకల్లు, బెళుగుప్ప, ఉరవకొండ మండలాల్లో పప్పుశనగ సాగును రైతులు సాగు చేస్తుంటారని పేర్కొన్నారు. పక్షం రోజుల క్రితమే కోతలు పూర్తి చేసి పంట దిగుబడులను పొలాల్లో రైతులు నిల్వ చేశారన్నారు. దిగుబడి ఆశాజనకంగా ఉన్నా బహిరంగ మార్కెట్లో గిట్టుబాటు ధర లేకపోవడంతో ప్రభుత్వ మద్దతు ధర కోసం రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. అయితే మద్దతు ధర ప్రకటించినా.. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం ఉదాసీన వైఖరి అవలంభిస్తోందని, దీనికి తోడు పప్పుశనగ రైతుల కష్టాలను మంత్రి పయ్యావుల కేశవ్ పట్టించుకోకపోవడంతో దళారులు చెలరేగిపోతున్నారన్నారు. క్వింటా రూ.4 వేల చొప్పున అడుగుతుండడంతో రైతులు నష్టానికే పంటను అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి క్వింటా రూ.7వేలతో పప్పుశనగ కొనుగోలు చేసేలా కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఈఓ భరత్కు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఈడిగ ప్రసాద్, పార్టీ మండల, రూరల్ కన్వీనర్లు ఓబన్న, ఎర్రిస్వామిరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఏసీ ఎర్రిస్వామి, బసవరాజు, వజ్రకరూరు కన్వీనర్ సోమశేఖర్రెడ్డి, రూరల్ పరిశీలకులు డిష్ సురేష్, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి కౌడిగి గోవిందు, నాయకులు దయ్యాల నాగరాజు, శ్రీనివాసులు, చిదంబరి, ఈశ్వర్, షెక్షానుపల్లి రమేష్, మోపిడి ప్రసాద్, వడ్డె ఆంజనేయులు, జోగి హనమంతు, పచ్చి రవి, మహనంది తదితరులు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో నిర్లక్ష్యం పనికిరాదు క్వింటా రూ.7 వేలతో కొనుగోలు చేయాలి ఏడీఏ కార్యాలయం ఎదుట ధర్నాలో వైఎస్సార్సీపీ నేతలు -
రైతులకు లబ్ధిచేకూర్చడమే లక్ష్యం
● డ్రోన్ సేవలందించాలి : కలెక్టర్ అనంతపురం అర్బన్: రైతులకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా చర్యలు ఉండాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిసాన్ డ్రోన్ ఉబరైజేషన్ కింద 4,256 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వీరందరికీ డ్రోన్ సేవలు అందించాలని ఆదేశించారు. ఏపీఎఫ్ఆర్ (ఏపీ ఫార్మర్ రిజిస్ట్రీ) పెండింగ్ ఈ నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన కింద ప్రణాళిక రూపొందించుకుని కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఏపీఎంఐపీకి సంబంధించి నాన్సబ్సిడీ కలెక్షన్ల విషయంలో లక్ష్యాన్ని వందశాతం చేరుకోవాలని చెప్పారు. అరటి, దానిమ్మ, మిరప, తదితర ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి రవి, ఉద్యాన శాఖ అధికారి ఉమాదేవి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, మార్క్ఫెడ్ డీఎం పెన్నేశ్వరి, డీఆర్డీఏ పీడీ శైలజ, పశుసంవర్ధక శాఖ జేడీ ప్రేమ్చంద్, మార్కెటింగ్ ఏడీ రాఘవేంద్రకుమార్, డీసీఓ అరుణకుమారి, ఆత్మా పీడీ పద్మలత, ఎల్డీఎం నరేష్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. నేడు విజయవాడకు కలెక్టర్ సెన్సస్–2027 (జనాభా లెక్కల)పై విజయవాడలో ఈ నెల 20న నిర్వహించనున్న ఒక్క రోజు శిక్షణకు కలెక్టర్ ఆనంద్ గురువారం బయలుదేరి వెళ్లనున్నారు. కలెక్టర్తో పాటు డీఆర్ఓ మలోల కూడా శిక్షణకు హాజరుకానున్నారు. వారు తిరిగి 21వ తేదీ విధులకు హాజరు కానున్నారు. -
రైతులకు చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు
అనంతపురం అర్బన్: అధికారం చేపట్టినప్పటి నుంచి రైతులకు చంద్రబాబు ప్రభుత్వం వెనుపోటు పొడుస్తూనే ఉందని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున విమర్శించారు. బుధవారం అనంతపురంలోని ఆ సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు చిన్నప్ప యాదవ్, ఇతర నాయకులతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ రైతులను అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని మండిపడ్డారు. ఈ నెల 14న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సరిపడ నిధులు కేటాయించకుండా పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన అన్నదాత సుఖీభవ, విత్తన రాయితీ, పంటల బీమా, వడ్డీ రాయితీ, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, ప్రకృతి విపత్తుల పరిహారం, ధరల స్థిరీకరణ వంటి కీలక అంశాలకు సైతం సరైన నిధులు కేటాయించకపోవడం చూస్తుంటే రైతుల విషయంలో చంద్రబాబు సర్కారు ఎంత నిర్ధయగా వ్యవహరిస్తోందో అర్థమవుతోందన్నారు. ఎరువులు, పురుగు మందులపై సబ్సిడీలు తగ్గించడంతో రైతులపై తీరని ఆర్థిక భారం పడుతోందన్నారు. యూరియా అందుబాటులో లేక అవస్థలు పడుతున్నారన్నారు. పీఎం కిసాన్ పథకాన్ని రూ.6 వేల నుంచి రూ.12 వేలకు పెంచుతామని ఇచ్చిన మాట తప్పారని గుర్తు చేశారు. రైతు వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఈ నెల 23న తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులకు పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు బండి రామకృష్ణ, రవీంద్ర, బాషా, వీరనారప్ప, తదితరులు పాల్గొన్నారు. బడ్జెట్లో నిధుల కేటాయింపులో అన్యాయం 23న జిల్లావ్యాప్తంగా నిరసనలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్లికార్జున -
సబ్స్టేషన్లలోనే ఈవీ చార్జింగ్
విద్యుత్ వాహనాలు వాడుతున్న వారికి గుడ్న్యూస్. ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్పీడీసీఎల్), నూతన, పునరుత్పాదక ఇంధన అభివృద్ధి కార్పొరేషన్ ఆఫ్ ఏపీ (నెడ్క్యాప్) సంయుక్తంగా కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇందులో భాగంగా జిల్లాలోని విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద విద్యుత్ వాహన చార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నాయి. సరిపడా ఖాళీ స్థలమున్న సబ్స్టేషన్ల పరిధిలో చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నాయి. విద్యుత్ వాహనదారుల డిమాండ్కు అనుగుణంగా చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసేలా రెండు సంస్థల అధికారులు చర్యలు చేపట్టారు. అనంతపురం టౌన్: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) క్రేజ్ వేగంగా పెరుగుతోంది. టాటా మోటార్స్ తర్వాత, ఎక్స్వీ 9ఈ, బీఈ 6ఈ వంటి పవర్ఫుల్ వాహనాలను భవిష్యత్త అవసరాలకు అనుగుణంగా మహీంద్రా మోటార్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తోంది. ఇక ద్విచక్ర వాహనాల సెగ్మెంట్లోనూ ఓలా, హోండా, హీరో, ఏథర్ తదితర కంపెనీలు తమ కొత్త మోడళ్లను విడుదల చేస్తూనే ఉన్నాయి. దీంతో భవిష్యత్లో పెరిగే ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ చార్జింగ్ పాయింట్ల అవసరమూ చాలా ఉంది. ఈ క్రమంలో విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద సొంత ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు ఏపీఎస్పీడీసీఎల్ సంస్థ కసరత్తు మొదలు పెట్టింది. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇందు కోసం 10 విద్యుత్ సబ్స్టేషన్లను గుర్తించారు. తొలి విడతలో భాగంగా రూ.7 కోట్ల నిధులతో జాతీయ రహదారుల పక్కనే ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ల ఖాళీ స్థలాల్లో చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనున్నారు.చార్జింగ్ పాయింట్ల వద్దనే క్యాంటీన్లుఇప్పటికే గుత్తి నుంచి తాడిపత్రికి వెళ్లే మార్గంలోని 67వ జాతీయ రహదారిపై రాయలచెరువు, 44వ జాతీయ రహదారిపై మిడుతూరు, హంపాపురం, చైన్నె మార్గంలోని 42వ జాతీయ రహదారిపై ఇటుకలపల్లి, అనంతపురంలోని విద్యుత్ శాఖ డీ–5 సెక్షన్ (బళ్లారి బైపాస్), ఉరవకొండ, కూడేరు, రాయదుర్గంకు వెళ్లే మార్గంలోని కళ్యాణదుర్గం, గుత్తి, తాడిపత్రిలోని విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద చార్జింగ్ పాయింట్ల ఏర్పాటుకు స్థల పరిశీలన పూర్తయింది. ఆయా విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద ఏర్పాటు చేయనున్న చార్జింగ్ పాయింట్ల వద్ద వాహనదారుల కోసం ప్రత్యేకంగా క్యాంటీన్లనూ ఏర్పాటు చేయనున్నారు. అక్కడున్న ఖాళీ స్థలాన్ని బట్టి పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మార్చి ఆఖరు లోపు కొన్ని, మే ఆఖరులోపు మిగిలినవన్నీ పూర్తి చేసేలా పనులు వేగవంతం చేశారు. -
రంజాన్ మాసంలో అంతా మంచి జరగాలి
అనంతపురం: పవిత్ర రంజాన్ మాసం బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముస్లింలకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. మనిషిలోని చెడు భావనలు, అధర్మం, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని పేర్కొన్నారు. జేఈఈ మెయిన్స్లో గుంతకల్లు విద్యార్ధి ప్రతిభ గుంతకల్లు: జేఈఈ మెయిన్స్లో గుంతకల్లుకు చెందిన ఐ.అభిషేక్ కాంత్ ప్రతిభ చాటాడు. సోమవారం విడుదల చేసిన ఫలితాల్లో 99.99 పర్సంటైల్ సాధించాడు. స్థానిక రైల్వే స్టేషన్లో సీనియర్ సెక్షన్ ఆఫీసర్ రవికాంత్, ఫిజికల్ సైన్స్ టీచర్ సరిత దంపతుల కుమారుడైన అభిషేక్ విజయవాడలోని చైతన్య ఐఐటీ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. బడి వేళకు బస్సు నడపరా? కణేకల్లు: బడి వేళకు బస్సులు రావడం లేదు. రోజూ ఆలస్యంగానే వెళ్లాల్సి వస్తోంది. పాఠాలు కోల్పోతున్నారు. చదువులో వెనుకబడిపోతున్నారు. సహనం నశించిన విద్యార్థులు ఆర్టీసీ అధికారులపై నిరసనాగ్రహం వ్యక్తం చేశారు. నాగేపల్లిలో ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. దాదాపు 80 మంది విద్యార్థులు మాల్యం గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 8, 9, 10వ తరగతులు చదువుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు తరగతులు ప్రారంభమవుతాయి. పాఠశాల సమయానికి బస్సు నడుపుతామని చెప్పిన ఆర్టీసీ అధికారులు ఆలస్యంగా పంపుతున్నారు. గ్రామానికి 9 గంటలపైన బస్సు వస్తోంది. దీంతో కొంతమంది విద్యార్థులు కాలినడకన పాఠశాలకు వెళ్తున్నారు. తమ చదువులకు ఆటంకం కలుగుతోందని ఆర్టీసీ డిపో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. పరీక్షలు దగ్గరపడుతున్నా ఎటువంటి చర్యలూ చేపట్టకపోవడంతో విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బుధవారం ఆలస్యంగా నాగేపల్లికి బస్సు రావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అడ్డుకున్నారు. రోడ్డుపై ముళ్లకంపలు వేసి గంటపాటు రాస్తారోకో చేశారు. విద్యార్థులంటే లెక్కలేదా..? మా జీవితాలతోనే ఆటలాడతారా? అంటూ మండిపడ్డారు. ఆందోళన గురించి డ్రైవర్, కండక్టర్ రాయదుర్గం డిపో మేనేజర్కు ఫోన్ ద్వారా తెలియజేశారు. ఇక మీదట పాఠశాల వేళకు తప్పకుండా బస్సు నడుపుతామని డీఎం హామీ ఇవ్వడంతో విద్యార్థులు శాంతించి రాస్తారోకో విరమించారు. -
అభివృద్ధి పనులు పూర్తి చేయండి
● అధికారులకు కలెక్టర్ ఆనంద్ ఆదేశం అనంతపురం అర్బన్: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు మార్చి 31లోపు పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ శాఖల అధికారులను కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. అభివృద్ధి పనులపై బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, సమగ్ర శిక్ష, మైనర్ ఇరిగేషన్, తదితర ఇంజనీరింగ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. రోడ్లు, బ్రిడ్జిలు, విలేజ్ హెల్త్ క్లీనిక్ భవనాల నిర్మాణ పనులు మార్చి నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి సంబంధించి స్థల సమస్యలను పరిష్కరించాలన్నారు. మార్చిలోపు ఎన్హెచ్ఎం (నేషనల్ హెల్త్ మిషన్) స్కీమ్ పనులు పూర్తి చేయకపోతే నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. ఎంపీల్యాడ్స్ నిధుల కింద మంజూరైన పనులు చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు. కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్కు సంబంధించి 342 పూర్తయ్యే దశలో ఉండగా, 42 పనులు ప్రారంభించాల్సి ఉందన్నారు. పీఎంశ్రీ, పీఎంఅజయ్, ఆర్థిక సంఘం, ఎంపీ ల్యాడ్స్, సాస్కి, జలజీవన మిషన్, తదితర పథకాలకు సంబంధించిన పనులు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో ఆర్అండ్బీ ఎస్ఈ మురళీకృష్ణ, సీపీఓ అశోక్కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్, పీఆర్ ఎస్ఈ సుబ్బరాయుడు, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ శేషాద్రి శేఖర్, మైనర్ ఇరిగేషన్ ఎస్ఈ విశ్వనాథరెడ్డి,హెచ్ఎల్సీ ఎస్ఈ సుధాకర్రావు, ఇతర అధికారులు పాల్గొనారు. -
టీచర్లతో సర్కార్ బంతాట
సుదూర ప్రాంతాలకు బదిలీ ఇలా.. అనంతపురం ఎడ్యుకేషన్: మినిమం టైం స్కేల్ (ఎంటీఎస్) కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులపై చంద్రబాబు ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. సొంత మండలాలు, సమీప ప్రాంత పాఠశాలల్లో పనిచేస్తున్న వీరిని బలవంతంగా సుదూర ప్రాంతాలకు బదిలీ చేసింది. దీంతో సదరు ఉపాధ్యాయులు విధులకు వెళ్లి వచ్చే క్రమంలో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. వారి ప్రాణాలకు రక్షణ లేకుండాపోతోంది. ఊహించని ప్రమాదాలతో కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. వెలుగులు నింపిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం డీఎస్సీ–1998, 2008 క్వాలిఫైడ్ అభ్యర్థులు న్యాయం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూశారు. ఎంతమంది సీఎంలు మారినా వీరి జీవితాలు మారలేదు. పాదయాత్రలో తనను కలిసిన క్వాలిఫైడ్ అభ్యర్థులకు న్యాయం చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఎంటీఎస్ టీచర్లుగా తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఎంతమంది ప్రజాప్రతినిధులు, నాయకుల వద్దకు వెళ్లినా తమ గోడు పట్టించుకోలేదని, అలాంటిది వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాత తమ జీవితాల్లో వెలుగులు నింపారని ఆనందపడ్డారు. ఈ క్రమంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో డీఎస్సీ–1998 క్వాలిఫైడ్ అభ్యర్థులు 470 మంది, డీఎస్సీ–2008 అభ్యర్థులు 190 మందికి ఎంటీఎస్ టీచర్లుగా అవకాశం వచ్చింది. నాడు సమీపంలోనే విధులు ఎంటీఎస్ టీచర్లకు రూ.32 వేలు వేతనం నిర్ణయించారు. జీతాలు తక్కువగా ఉన్న కారణంగా వీరిని వీలైనంత వరకు వారి సొంతమండలం, లేదా పక్క మండలాల్లోనే ఉంచేలా చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం గత ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వు జారీ చేసింది. ఇంటికి అందుబాటులో ఉన్న స్కూళ్లు కావడంతో వారుకూడా ఆనందంగా విధులు నిర్వహించారు. నేడు కక్ష కట్టి.. దూరానికి నెట్టి.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 జూన్లో బదిలీలు జరిగాయి. సాధారణ టీచర్లతో పాటు ఎంటీఎస్ టీచర్లనూ బదిలీ చేశారు. అయితే వీరి బదిలీలు ఎలా ఉన్నాయంటే 85 శాతం మందికి పైగా టీచర్లందరినీ సరిహద్దు మండలాలకు కేటాయించారు. వీరిపట్ల కనీస దయ చూపకుండా కక్షకట్టినట్లు వ్యవహరించారు. అంతకుముందు వీరు పని చేస్తున్న స్థానాలన్నీ ఖాళీలుగా చూపించగా, ఇప్పుడు మాత్రం పతి మండలంలోనూ అరకొరగా 1–2 మాత్రమే చూపించారు. రెగ్యులర్ టీచర్ల బదిలీలు పూర్తయిన తర్వాత ఏర్పడిన ఖాళీలకు మాత్రమే వీరిని బదిలీ చేశారు. వేడుకున్నా.. వేదనే మిగిలింది తక్కువ జీతాలు రావడం, ముఖ్యంగా 1998 డీఎస్సీ అభ్యర్థులు దాదాపు రిటైర్డ్ వయసులో ఉన్నామని కుటుంబాలను వదిలి అంతదూరం వెళ్లలేమని గగ్గోలు పెట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదని వాపోయారు. అలాగని కుటుంబాలను బదిలీ అయిన చోట పెట్టాలంటే ఆర్థికంగా ఇబ్బంది అవుతుందని వేడుకున్నా ప్రభుత్వం వినలేదని ఎంటీఎస్ టీచర్లు వాపోతున్నారు. ఈక్రమంలో ఆరోగ్యం సహకరించక కొందరు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. మరికొందరు రవాణాకు నెలకు రూ.10 వేల దాకా ఖర్చు చేస్తున్నారు. ఇంకొందరు వయసు మీదపడినా ఒంటరిగానే బదిలీ పాఠశాలల దగ్గర్లో గదులు తీసుకుని ఉంటున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం తమ పట్ల దయ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఓడీ చెరువులో 19 మంది ఎంటీఎస్ టీచర్లు పని చేస్తుండగా.. ఇప్పుడు రెండు పోస్టులు మాత్రమే ఖాళీలు చూపించారు. తక్కిన 17 మంది దూర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. అలాగే అమడగూరులో 11 మందికిగాను రెండు, కదిరి, ముదిగుబ్బ, తనకల్లు మండలాల్లో 9 మందికి గాను రెండు, తలుపుల మండలంలో 8 మంది పని చేస్తుంటే రెండు పోస్టులు మాత్రమే ఖాళీ చూపించారు. మిగిలిన వారందరినీ జిల్లా సరిహద్దు మండలాలైన మడకశిర, గుడిబండ, రొళ్ల, అమరాపురం, అగళి మండలాలకు బదిలీ చేశారు. అలాగే అనంతపురం జిల్లా తాడిపత్రి, బుక్కరాయసముద్రం, నార్పల, గార్లదిన్నె, శింగనమల, రాప్తాడు, ఆత్మకూరు, కూడేరు మండలాల్లో పని చేస్తున్న ఎంటీఎస్ టీచర్లను కర్ణాటక సరిహద్దు డీ.హీరేహాళ్, రాయదుర్గం, బొమ్మనహాళ్, గుమ్మఘట్ట, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి తదితర మండలాలకు బదిలీ చేశారు. ఎంటీఎస్ టీచర్లను బలవంతంగా దూర ప్రాంతాలకు బదిలీ చాలీచాలని జీతాలపై గగ్గోలు పెట్టినా పట్టించుకోని సర్కార్ విధులకు బైకుల్లో వెళ్తూ ప్రమాదాల బారినపడుతున్న టీచర్లు మరోమారు తెరపైకి ఎంటీఎస్ టీచర్ల బదిలీల వ్యవహారం ఇక్కడ విగజీవిగా కనిపిస్తున్న వ్యక్తి పేరు ఆదినారాయణ. ఎంటీఎస్ టీచరుగా పని చేస్తున్నారు. సొంతూరు శ్రీసత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారిపల్లి కాగా గత ఏడాది జూన్లో జరిగిన బదిలీల్లో గుడిబండ మండలం మోపురుగుండు స్కూల్కు వెళ్లారు. ఈయనతో పాటు గుడిబండ మండలం దిన్నెహట్టి స్కూల్లో పని చేస్తున్న ఎంటీఎస్ టీచరు తుమ్మలప్ప (అమడగూరు మండలానికి చెందిన) ఇద్దరూ మంగళవారం బైకులో వెళ్తుండగా పరిగి మండలం ధనాపురం క్రాస్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదినారాయణ సంఘటన స్థలంలోనే మృతి చెందగా తుమ్మలప్పకు కాలు విరిగింది. వీరి సొంత మండలాల నుంచి దాదాపు 140 కిలోమీటర్ల దూరానికి బదిలీ చేయడంతో ప్రాణాలమీదకు వచ్చింది. -
ఎరువుల దుకాణం లైసెన్స్ రద్దు
అనంతపురం అగ్రికల్చర్: రైతులు కొనుగోలు చేసిన ఎరువులకు బిల్లులు ఇవ్వలేదనే కారణంతో అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్డులో ఉన్న సాయి గణేష్ ఆగ్రో ఏజెన్సీస్ దుకాణం లైసెన్స్ను రద్దు చేస్తూ ఏడీఏ అల్లాఫ్ అలీఖాన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ మేరకు ఉత్తర్వులను దుకాణం యజమాని సురేష్కుమార్రెడ్డికి ఏఓ వెంకటకుమార్ అందజేశారు. గతేడాది అక్టోబర్ 18న కూడేరు మండలానికి చెందిన రైతు లక్ష్మీనారాయణ కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో వివరించారు. -
ఏసీబీ ఇన్స్పెక్టర్ అంటూ దందా
● కేటుగాడిని అరెస్ట్ చేసిన పోలీసులు రాప్తాడురూరల్: ఏసీబీ ఇన్స్పెక్టర్ హమీద్ఖాన్ అంటూ పలువురికి ఫోన్ చేసి బెదిరించి డబ్బు వసూలు చేసిన కేటుగాడిని అనంతపురం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ శేఖర్ మీడియాకు వెల్లడించారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం చెర్లోపల్లికి చెందిన వైదం మహేష్ ప్రైవేట్ డ్రైవరుగా పని చేస్తున్నాడు. ఆర్థిక అవసరాలు ఎక్కువ కావడంతో వాటిని తీర్చుకునేందుకు నకిలీ ఏసీబీ సీఐ అవతారం ఎత్తాడు. ఈక్రమంలో ఇన్స్ట్రాగాంలో ఏసీబీ ఇన్స్పెక్టర్ హమీద్ఖాన్ ఫొటోను డౌన్లోడ్ చేసుకుని డీపీగా పెట్టుకున్నాడు. అనంతపురం రూరల్ మండలం నందమూరినగర్కు చెందిన శివరామ్ అనే వ్యక్తి పాతకార్ల అమ్మకాలు, కొనుగోలు వ్యాపారం చేస్తుంటాడు. ఇటీవల శివరామ్కు ఫోన్ చేసిన వైదం మహేష్ ‘ఏసీబీ సీఐ హమీద్ఖాన్’గా పరిచయం చేసుకున్నాడు. కార్ల వ్యాపారం నిబంధనల మేరకు చేయడం లేదంటూ బెదిరించి రూ.4,500 తన ఖాతాకు వేయించుకున్నాడు. అనుమానం వచ్చిన బాధితుడు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు బుధవారం అనంతపురం ఆర్టీసీ బస్టాండు సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వైదం మహేష్ను అదుపులోకి తీసుకుని విచారించారు. శివరామ్తో పాటు అనంతపురంలో మరో వ్యక్తితో రూ.1,300, తాడిపత్రిలో ఇంకో వ్యక్తితో రూ.19 వేలు ఇలానే బెదిరించి వసూలు చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్కు ఆదేశించారు. ఎస్కేయూలో పైసా వసూల్అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో చిరుద్యోగులకు జీతాలు పెంచుతామంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇక్కడ మినిమం స్కేలు ఉద్యోగులు 220 మంది మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. నామమాత్రపు జీతంతో చేరిన వీరికి ప్రస్తుతం రూ.15,850 ఇస్తున్నారు. ఎన్నో దఫాలుగా జీతాలు పెంపుదల చేయాలని యూనివర్సిటీ యాజమాన్యానికి విన్నవిస్తూ వచ్చారు. గత వీసీ ప్రొఫెసర్ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి హయాంలో రూ.4 వేలు జీతం పెంపుదల చేయాలని నిర్ణయించారు. అయితే అప్పటి ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇందుకు నిరాకరించారు. దీంతో ఆ అంశం మరుగునపడింది. తాజాగా రూ.5వేలు చొప్పున జీతం పెంపుదల చేస్తామంటూ మినిమం స్కేల్ ఉద్యోగుల్లో కొందరు దళారీ అవతారమెత్తారు. అమరావతి సెక్రెటేరియట్లో ఉన్నత విద్య విభాగం నుంచి జీఓ తీసుకు రావడానికి డబ్బు ఖర్చు అవుతుందంటూ.. ఇందుకు గాను ఒక్కొక్కరు రూ.10వేలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. అలా అందరూ కలిసి ముందుకు వస్తేనే పెంపుదల సాధ్యమవుతుందని నమ్మబలికారు. ‘సార్’ (యూనివర్సిటీ కీలకాధికారి) చెప్పారు.. ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది అంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. ఎవరైనా ఇవ్వకపోతే ఉద్యోగుల జాబితా నుంచి పేరు తీసివేయిస్తామని, పెరిగిన జీతం ఇచ్చేది ఉండదని అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు ఐదారుగురు మినహా మిగిలిన అందరూ ఫోన్పే, నగదు రూపంలో మొత్తం రూ. 21.50 లక్షల దాకా చెల్లించారు. ఈ డబ్బు వసూలులో ముగ్గురు ఉద్యోగులు కీలకంగా వ్యవహరించారు. సెక్రటేరియట్లో జీఓ తేవడానికి డబ్బు వసూలు చేయాల్సిన అవసరం లేకున్నా.. ఇలా అనధికారికంగా వసూళ్లకు పాల్పడటం.. కీలకాధికారి పాత్ర ఉండటం వర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. జీతం పెంచుతామని చిరుద్యోగులకు ఎర ఒక్కొక్కరితో రూ.10వేల చొప్పున కలెక్షన్ వర్సిటీ కీలకాధికారి కనుసన్నల్లోనే వ్యవహారం -
దిగుబడి తగ్గిపోతుంది
మామిడితో తోటలో విపరీతంగా పూత వచ్చినా అందులో 20 శాతం కూడా నిలబడే పరిస్థితి లేదు. దీంతో ఈసారి మామిడి దిగుబడి తగ్గిపోయేలా కనిపిస్తోంది. ఫిబ్రవరి చివరికి వచ్చినా ఇంకా పూత వస్తోంది. అంతా మగపూత కావడంతో ఉపయోగం లేకుండా పోతోంది. ఏడాదికి రూ.10 లక్షలు చొప్పున 15 ఎకరాల మామిడి తోట కౌలుకు తీసుకున్నాను. ఇక ఎరువులు, మందులు ఇతరత్రాఖర్చులు రూ.5 లక్షలు వరకూ ఖర్చు చేశాను. నష్టం తప్పేలా లేదు. – శ్రీనివాసులు, రైతు, ఇల్లూరు, గార్లదిన్నె మండలం -
పచ్చ దండులో ‘ఈ–స్టాంప్’ గుబులు
కళ్యాణదుర్గం: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ–స్టాంప్ల కుంభకోణం ‘పచ్చ’ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఈ–స్టా్ంప్ పేరుతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టిన నేతలు స్థానికంగా వ్యవస్థలను మేనేజ్ చేసి ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు యత్నించారు. దీంతో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య ఈ–స్టాంప్ కుంభకోణంపై పిల్ వేయగా.. హైకోర్టు విచారణకు స్వీకరించింది. అంతేకాకుండా ఈ వ్యవహారంలో ప్రభుత్వ కార్యదర్శితోపాటు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, మరో 11 మందికి గత ఏడాది డిసెంబర్ 14న హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు బుధవారం హైకోర్టు ఎదుటకు రానుంది. స్టాంపు డ్యూటీ ఎగ్గొట్టిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు చెందిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలోనూ కాంట్రాక్టు కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ గత ఏడాది యూనియన్ బ్యాంక్ నుంచి రూ.900 కోట్ల మేర రుణం తీసుకుంది. ఆస్తులు తనఖా పెట్టి ఆ గ్యారెంటీతో రుణాలు తీసుకోవాలి. దీనికోసం ముందుగా స్టాంప్ డ్యూటీ చెల్లించి తనఖా వివరాలు పొందుపరిచి ఈ–స్టాంప్ పొందాలి. రిజిస్ట్రేషన్ ఫీజు, యూజర్ చార్జీలు చెల్లించాలి. బ్యాంకు రుణంలో 0.5 శాతం స్టాంప్ డ్యూటీ కింద కంపెనీ చెల్లించాల్సి ఉంది. అంటే రూ.900 కోట్ల రుణానికి రూ.4.5 కోట్ల స్టాంప్ డ్యూటీ ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే ఎస్ఆర్సీ కంపెనీ మాత్రం నాలుగు డాక్యుమెంట్ల ద్వారా మొత్తం రూ.1,51,700 మాత్రమే చెల్లించింది. అంటే రూ.4,48,48,300 మేర స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు చెల్లించకుండా మోసగించింది. ఈ వ్యవహారమంతా కళ్యాణదుర్గంలోని మీ–సేవ నిర్వాహకుడు బాబు (యర్రప్ప) ద్వారా చేయించారు. ప్రభుత్వానికి ఈ–స్టాంప్ రూపంలో 0.5 శాతం మొత్తాన్ని చెల్లించాల్సి ఉండగా.. రూ.కోట్లలో ఉన్న రుణ మొత్తాన్ని బాగా తగ్గించి చూపారు. ఇలా జనరేట్ అయిన డాక్యుమెంట్లో స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని ఫ్యాబ్రికేట్ చేసి నిబంధనల ప్రకారం ఎంత చెల్లించాలో ఆ మొత్తాన్ని పొందుపరచి మరో ప్రింట్ తీసి కంపెనీ ప్రతినిధులకు అందించారు. దీన్ని యూనియన్ బ్యాంక్కు సమర్పించి రూ.900 కోట్ల రుణం తీసుకుని మోసగించారు. అంతర్మథనంలో ఎమ్మెల్యే అమిలినేని ఈ–స్టాంప్ కుంభకోణంలో ప్రతివాదిగా ఉన్న కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఈ వ్యవహారం నుంచి ఎలా బయటపడాలన్న అంశంపై హైకోర్టు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. స్థానిక పోలీసులతో కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశిస్తే ఎలా ఎదుర్కోవాలన్న దానిపై తీవ్రస్థాయిలో చర్చించినట్లు సమాచారం. అయితే బుధవారం ఈ–స్టాంప్ల కుంభకోణంపై హైకోర్టు వివరణ ఇవ్వాలని ఆదేశించడంతో కేసులో ప్రతివాదులు నేరుగా కోర్టుకు హాజరవుతారా లేదా అన్న సంశయం అందరిలోనూ నెలకొంది. కుంభకోణంపై నేడు హైకోర్టులో విచారణ ఈ కేసులో ఇప్పటికే 13 మందికి హైకోర్టు నోటీసులు ప్రతివాదులు హాజరవుతారా..? అంతర్మథనంలో కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని -
‘లీప్’ యాప్ లోనే ఉత్తర్వులు
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షల నిర్వహణలో కీలకంగా ఉండే ఇన్విజిలేటర్ల నియామకాలకు సంబంధించి గతంలో మాదిరి పూర్తి జాబితాలు వెలువడవు. ఎవరినైతే నియమించారో వారికి మాత్రమే లీప్ యాప్లోనే ఉత్తర్వులు వెలువడతాయి. తొలిసారి రాష్ట్రస్థాయిలో ఇన్విజిలేటర్ల నియామకాలు చేపట్టనున్నారు. మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి ఇన్విజిలేటర్ల నియామకాల ప్రక్రియపై కసరత్తు జరుగుతోంది. తొలిసారి ప్రైవేట్ పాఠశాలల టీచర్లకు భాగస్వామ్యం కల్పిస్తున్నారు. 75 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న టీచర్లు, 25 శాతం ప్రైవేట్ పాఠశాలల టీచర్లను తీసుకోనున్నారు. ఇప్పటికే మొత్తం టీచర్ల జాబితాను రాష్ట్ర అధికారుల నుంచి నేరుగా ఎంఈఓలు, డెప్యూటీ ఎంఈఓలకు పంపారు. 7,615 మంది ప్రభుత్వ టీచర్లు, 4,148 మంది ప్రైవేటు టీచర్ల జాబితాలను పంపి రిమార్కులు అడిగారు. వీరిలో ఎంఈఓల జాబితాలో 2,894 మంది ప్రభుత్వ టీచర్లు, 2,462 మంది ప్రైవేట్ టీచర్లు ఉండగా, డీవైఈఓల జాబితాలో 4,721 మంది ప్రభుత్వ టీచర్లు, 1,686 మంది ప్రైవేట్ టీచర్లున్నారు. వీరికి మినహాయింపు పాలిచ్చే తల్లులు, గత పరీక్షల్లో దుర్వినియోగానికి పాల్పడినవారు, ప్రైవేట్ ట్యూషన్లలో పాల్గొంటున్నవారు, ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు, సస్పెన్షన్కు గురైనవారు, గర్భిణులు, క్రమశిక్షణ చర్యలు పెండింగ్లో ఉన్నవారు, అలాగే తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, షుగర్, హీమోఫీలియా, తలసీమియాతో బాధపడుతున్న పిల్లలున్న టీచర్లకు మినహాయింపు ఉంటుంది. ఇలాంటి కేసులను పరిశీలించిన ఎంఈఓలు, డీవైఈఓలు సంబంధిత ఆధారాలను జతచేసి మినహాయింపునకు సిఫార్సు చేస్తున్నారు. 60 ఏళ్లు నిండిన టీచర్లు, ఐదేళ్ల సర్వీస్ పూర్తికాని టీచర్లను పరిగణనలోకి తీసుకోరు. ఎంఈఓ, డీవైఈఓల నుంచి డీఈఓ లాగిన్కు వచ్చిన జాబితాలను డీఈఓ ప్రసాద్బాబు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఇక్కడి నుంచి జాబితాను డైరెక్టరేట్కు పంపనున్నారు. లాంగ్వేజ్ పరీక్షలకు నాన్ లాంగ్వేజ్ టీచర్లు, నాన్ లాంగ్వేజ్ పరీక్షలకు లాంగ్వేజ్ టీచర్లు లాంగ్వేజ్ పరీక్షలైన తెలుగు, ఇంగ్లిష్, హిందీ పరీక్షల రోజుల్లో నాన్ లాంగ్వేజెస్ గణితం, సైన్సు, సోషల్ టీచర్లను ఇన్విజిలేటర్లుగా నియమించనున్నారు. అలాగే నాన్ లాంగ్వెజెస్ పరీక్షలకు లాంగ్వెజ్ టీచర్లను నియమించనున్నారు. తప్పులు లేకుండా జాబితా డైరెక్టరేట్ నుంచి నేరుగా ఎంఈఓ, డీవైఈఓలకు టీచర్ల జాబితాలు చేరాయి. వారు పరిశీలించి నిబంధనల మేరకు అనర్హులైన వారిని తప్పించి జాబితాలను డీఈఓ కార్యాలయానికి పంపారు. మేము ఇక్కడ మరోమారు పూర్తిస్థాయిలో పరిశీలించి, ,ఎవరైనా అనర్హులుంటే వారిని తీసేసి డైరెక్టరేట్కు పంపుతాం. సాధ్యమైనంత వరకు తప్పులులేని జాబితాను పంపేందుకు చర్యలు తీసుకుంటాం. డైరెక్టరేట్ నుంచి ఆన్లైన్ ద్వారా నియమామ ఉత్తర్వులు జనరేట్ చేసి నేరుగా లీప్ యాప్కు అనుసంధానం చేస్తారు. టీచర్ల మొబైల్ నుంచే ఉత్తర్వులు డౌన్లోడు చేసుకోవచ్చు. – ఎం.ప్రసాద్బాబు డీఈఓ -
పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం
● భార్య కాపురానికి రాలేదని అఘాయిత్యం గుమ్మఘట్ట: భార్య కాపురానికి రాలేదని భర్త పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు... రాయదుర్గం మండలం వడ్రహొన్నూరు గ్రామానికి చెందిన దివ్యాంగుడు చౌడప్పకు 18 ఏళ్ల క్రితం డి.హిరేహాళ్ మండలం కల్యం గ్రామానికి చెందిన పార్వతితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తాగుడుకు బానిసైన చౌడప్ప జులాయిగా మారడంతో భార్య కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేది. ఈ క్రమంలో భర్త వేదింపులు తారస్థాయికి చేరుకోవడంతో ఆరు నెలల క్రితం ఆమె పుట్టింటికి చేరుకుంది. కాపురానికి రావాలని భార్యను ప్రాధేయపడినా ఆమె అంగీకరించకపోవడంతో మంగళవారం ఉదయం రాయదుర్గం పోలీస్ స్టేషన్కు చేరుకుని తన శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు. సకాలంలో గుర్తించిన పోలీసులు అడ్డుకున్నారు. ఘటనపై అర్బన్ సీఐ జయనాయక్ విచారణ చేపట్టారు. మహిళ హత్య అనంతపురం సెంట్రల్: అనుమానం ఓ మహిళ హత్యకు దారి తీసింది. ఈ ఘటన అనంతపురం నగరంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... కోవూరునగర్లో సోమవారం రాత్రి ఇమ్రాన్, జాఫర్ కుటుంబాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. పొరుగింటిమహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వర్క్ఫ్రం హోం విధానంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఇమ్రాన్పై సదరు మహిళ బంధువులు దాడి చేశారు. ఆ సమయంలో ఇమ్రాన్ తల్లి గౌసియా (59) అడ్డుకోబోవడంతో ఆమైపె కూడా దాడి చేశారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన గౌసియాను కుటుంబసభ్యులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు.పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం ఆమె మృతి చెందింది. ఘటనపై భాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాల్గో పట్టణ సీఐ జగదీష్ తెలిపారు. కారు ఢీకొని వ్యక్తి మృతి డి.హీరేహాళ్(బొమ్మనహాళ్): కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... డి.హీరేహాళ్ గ్రామానికి చెందిన పూజారి రుద్ర (48) మంగళవారం సాయంత్రం కుంటు మారెమ్మ ఆలయం వద్ద రోడ్డు దాటుతుండగా బెంగళూరు నుంచి బళ్లారి వైపుగా వెళుతున్న కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన పూజరి రుద్రను చికిత్స నిమిత్తం బళ్లారిలోని విమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గురుప్రసాదరెడ్డి తెలిపారు. -
పూర్తిస్థాయిలో అధికార దుర్వినియోగం
లక్ష్మీప్రసాద్ అనే వ్యక్తి అనంతపురంలో ప్రజలకు పెద్దగా తెలియదు. శివపార్వతుల కల్యాణ మహోత్సవానికి 30 వేల మందిని సమీకరించడానికి రూ.2 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఇందుకుగానూ ఎక్కువ శాతం నిధులు స్థానికంగా సమీకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజకీయం కోసం లక్ష్మీప్రసాద్ ఏ కార్యక్రమమైనా చేసుకోవచ్చు. అయితే దీనికి డీఆర్డీఏ పీడీగా ఉన్న తన భార్య శైలజ పూర్తిగా సహకరించారనేది వివాదాస్పద అంశం. ఎస్ఎస్ఏ ఏపీసీగా ఉన్న శైలజ, తన భర్త టీడీపీలో చురుగ్గా ఉండటంతో డీఆర్డీఏ పీడీగా అదనపు బాధ్యతలు తెప్పించుకోగలిగారు. శైలజ డ్వాక్రా సంఘాలను ఈ కార్యక్రమానికి రావాలని తన అధికారుల ద్వారా ఒత్తిడి చేయించి రప్పించగలిగారని తెలుస్తోంది. అందుకే నగరంలోని డ్వాక్రా మహిళలు కార్యక్రమానికి వచ్చారని సమాచారం. అలాగే ఓ జిల్లా అధికారి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడంతో పాటు పూర్తిగా సహకరించారు. వీరిద్దరూ జన సమీకరణతో పాటు ఈ కార్యక్రమానికి విరాళాలు కూడా భారీగా వచ్చేలా తెర వెనుక ప్రయత్నం చేశారనేది ప్రధాన ఆరోపణ. భక్తి ముసుగులో చేసిన ఈ రాజకీయానికి అధికారులు భాగస్వాములు కావడం అనేది ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమానికి ఆహ్వానం కోసం లక్ష్మీప్రసాద్ చాలామందికి ఫోన్లు చేయడం, వ్యక్తిగతంగా కలవడం.. అదే సందర్భంలో ‘మీ ఆశీర్వాదం ఉండాలి’ అని కోరడం భవిష్యత్ రాజకీయాల కోసమేనని తెలుస్తోంది. -
ఆర్డీటీ కోసం ఉద్యమం ఉధృతం
అనంతపురం అర్బన్: ఆర్డీటీని కాపాడుకునేందుకు ఉద్యమాలను ఉధృతం చేస్తామని అఖిలపక్ష కమిటీ నాయకులు స్పష్టం చేశారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేసే వరకూ ఉద్యమాలు ఆగవని హెచ్చరించారు. ఇప్పటికై నా జిల్లా మంత్రులు, ఎంపీలు ఆర్డీటీపై కపట ప్రేమను వీడి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్కు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయకపోవడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడిలో భాగంగా మంగళవారం అనంతపురంలోని క్లాక్టవర్ నుంచి ర్యాలీగా పోస్టల్, బీఎస్ఎన్ఎల్ కార్యాలయాల వద్దకు అఖిలపక్ష కమిటీ నాయకులు చేరుకుని రోడ్డు మీద బైఠాయించి ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష కమిటీ కన్వీనర్ సాకే హరి, సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు, తదితరులు మాట్లాడారు. 60 ఏళ్లుగా పేదలకు విద్య, వైద్య, ఆర్థికాభివృద్ధి సాధనకు పాటుపడుతున్న ఆర్డీటీని జిల్లా నుంచి పంపించేయాలని చూడడం సిగ్గుచేటన్నారు. ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయిస్తామని మాటిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఎక్కడున్నావంటూ ప్రశ్నించారు. లక్షల మంది పేదలకు జీవనాధారమైన ఆర్డీటీ అంశంపై పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాల్లో ఏ ఒక్కరూ చర్చ లేవనెత్తకపోవడంతో పాలకుల నిజ స్వరూపం బయటపడిందన్నారు. నిజాయితీతో, నిబద్ధతతో సేవలందిస్తున్న ఆర్డీటీని కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటాలకై నా సిద్ధమన్నారు. అఖిలపక్ష కమిటీ చేపడుతున్న ఉద్యమాలకు అన్నివర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ, సీపీఐఎంఎల్ లిబరేషన్, ఐఎఫ్టీయూ, ప్రజాసంఘాల నాయకులు రమణయ్య, ఇమాం, వేమన, సురేష్, కుంటిమద్ధి ఓబులేసు, ఐఎంఎం బాషా, సుగమంచి శ్రీనివాసులు, శిరిషాల అంజి, హరినాథరెడ్డి, వసంతకుమార్, రాజేష్, హనుమంతు, కృష్ణారెడ్డి, వెంకటేష్, విశ్వనాథ్, ముసలయ్య, ముత్యాలమ్మ, శాంతమ్మ, నారాయణస్వామి, ఓబులేసు, సూర్యనారాయణ, ఆది, రామాంజనేయులు, నాగముని, హనుమంతు, మారెన్న, తదితరులు పాల్గొన్నారు. ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయిస్తామన్న మంత్రి లోకేష్ ఎక్కడ? ఆర్డీటీపై మంత్రులు, ఎంపీలు కపటప్రేమ వీడాలి అఖిలపక్ష కమిటీ నాయకులు -
చుక్కలు, 22ఏ భూముల ఫైళ్లు ఆమోదం
అనంతపురం అర్బన్: చుక్కల భూములు, 22ఏ (నిషేధిత భూముల)కు సబంధించి 253 ఫైళ్లకు కలెక్టర్ ఆమోదం తెలిపారు. ఆర్డీఓ పర్యవేక్షణలో తహసీల్దార్ల నేతృత్వంలో రెవెన్యూ సిబ్బంది ఈ నెల 12, 13 తేదీల్లో కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో చుక్కలు, 22ఏ భూముల ఫైళ్లను సిద్ధం చేశారు. 531 చుక్కలు భూముల, 22ఏ భూములకు సంబంధించి 214 ఫైళ్లను మొత్తం 745 సిద్ధం చేసి ఆమోదం కోసం కలెక్టర్కు సమర్పించారు. వీటిని పరిశీలించిన కలెక్టర్ నిబంధనల ప్రకారం ఉన్న చుక్కల భూములకు సంబంధించి 158 పైళ్లను ఆమోదించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 373 ఫైళ్లను తిరస్కరించారు. అదే విధంగా 22ఏ ఫైళ్లకు సంబంధించి 95 ఫైళ్లను ఆమోదించగా, 119 ఫైళ్లను తిరస్కరించారు. బీఎల్ఓల మెడపై ఓటర్ మ్యాపింగ్ కత్తి ● 282 మంది బీఎల్ఓలకు షోకాజ్ నోటీసు అనంతపురం అర్బన్: సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం కత్తిపెట్టి పనిచేయిస్తోంది. ఓటరు మ్యాపింగ్ చేయాలంటూ తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. ఎంత చేసినా.. తక్కువగానే చేశారంటూ బీఎల్ఓలకు (బూత్ లెవల్ అధికారులు) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో అనంతపురం అర్బన్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్ఓ), ఆర్డీఓ కేశవనాయుడు నియోజకవర్గం పరిధిలోని 282 మంది బీఎల్ఓలకు షోకాజ్ నోటీసును మంగళవారం జారీ చేశారు. ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. మ్యాపింగ్ వేగవంతానికి సూపర్వైజర్లు, బీఎల్ఓలతో పలుమార్లు సమావేశం నిర్వహించామన్నారు. పదేపదే ఆదేశాలిచ్చినప్పటికీ ఓటర్ మ్యాపింగ్ ప్రాముఖ్యతను బీఎల్ఓలు గుర్తించడం లేదన్నారు. ఇప్పటికీ 30 నుంచి 40 శాతం మాత్రమే మ్యాపింగ్ జరిగిందన్నారు. గడిచిన 24 గంటల్లో ఒక్కొక్క బీఎల్ఓ ఐదుకు మించి మ్యాపింగ్ చేయలేదని, కొందరు ఒకట్రెండు, ఇంకొందరు ఒక్క మ్యాపింగ్ కూడా చేయలేదని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కుమారస్వామిరెడ్డికి జిల్లా రిజిస్ట్రార్గా పదోన్నతి అనంతపురం టౌన్: జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సీనియర్ సబ్ రిజిస్ట్రార్గా పని చేస్తున్న సి.కుమారస్వామిరెడ్డికి జిల్లా రిజిస్ట్రార్(డీఆర్)గా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా పదోన్నతి కల్పించడంలో భాగంగా అనంతపురంలో ఎస్ఆర్గా పని చేస్తున్న కుమారస్వామిరెడ్డిని శ్రీకాకుళం జిల్లా రిజిస్ట్రార్గా నియమించారు. జిల్లాలో సబ్ రిజిస్ట్రార్గా సుదీర్ఘకాలం పాటు చిలమత్తూరు, గుంతకల్లు, తాడిపత్రి, కదిరి, అనంతపురం, పెనుకొండలో పని చేశారు. ప్రస్తుతం అనంతపురం చిట్స్ విభాగం అసిస్టెంట్ రిజిస్ట్రార్గా పని చేస్తున్న కుమారస్వామిరెడ్డి జిల్లా రిజిస్ట్రార్గా పదోన్నతి పొందారు. మరో రెండు రోజుల్లో ఆయన శ్రీకాకుళంలో బాధ్యతలు చేపట్టనున్నారు. -
భూముల రీసర్వే వేగవంతం చేయాలి : జేసీ
శింగనమల: భూముల రీ–సర్వే పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆదేశించారు. శింగనలమ మండలం చక్రాయిపేట రెవెన్యూ పరిధిలో మంగళవారం చేపట్టిన భూముల రీ–సర్వే పనులను ఆయన పరిశీలించి, మాట్లాడారు. నిర్దేశించిన సమయంలోపు పనులు పూర్తి కావాలని సిబ్బందికి సూచించారు. రీ–సర్వే నోటీసుల జారీపై రైతులతో ఆరా తీశారు. రీ–సర్వేకు సహకరించాలని రైతులను కోరారు. కార్యక్రమంలో సర్వే ఏడీ రూప్లానాయక్, తహసీల్దార్ శేషారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ నారాయణస్వామి, మండల సర్వేయర్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం శింగనమలలోని పౌరసరఫరాల శాఖ గోదామును జేసీ పరిశీలించారు. స్టాక్ రిజిస్టర్ను తనిఖీ చేశారు. ఆయన వెంట పౌర సరఫరాల శాఖ డీఎం రమేష్రెడ్డి ఉన్నారు. జీడిపల్లి రిజర్వాయర్లో చేపల వేటకు రేపు వేలం బెళుగుప్ప: మండలంలోని జీడిపల్లి గ్రామ రిజర్వాయర్లో చేపట వేట కోసం గురువారం ఉదయం 11.30 గంటలకు ఆ గ్రామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వేలం నిర్వహించనున్నారు. ఈ మేరకు పీఏబీఆర్ మత్స్య కేంద్రం అభివృద్ధి అధికారి పెద్దబాబు నాయక్ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. వేలం పాటలో పాల్గొనే వారు ఆధార్ కార్డు నకలుతో పాటు రూ. 5 వేల ధరావత్తు చెల్లించాలి. వేలం దక్కించుకున్న వారు మొత్తం సొమ్మును చెల్లించాల్సి ఉంటుంది. బ్రాహ్మణ వ్యతిరేకి చంద్రబాబు అనంతపురం: సీఎం చంద్రబాబు బ్రాహ్మణ వ్యతిరేకిగా మారారని మాజీ ప్రభుత్వ సలహాదారు (దేవాదాయ శాఖ) జ్వాలాపురం శ్రీకాంత్ విమర్శించారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు, పవన్కళ్యాణ్ను నమ్మి ఓట్లు వేసిన బ్రాహ్మణులను ఈ ప్రభుత్వం తడి గుడ్డతో గొంతు కోస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఇందుకు నిదర్శనమన్నారు. బ్రాహ్మణ సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో కనీస కేటాయింపులు కూడా లేవన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ తన డైరెక్టర్లందర్నీ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రభుత్వం ఏదో గొప్పగా ఇచ్చినట్టుగా ప్రచారం చేయాలని చెబుతుండడం సిగ్గుచేటన్నారు. ఆయనకే కనుక సిగ్గు ఉంటే ముందు కో–ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణ కో–ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు నిర్వహించి అన్ని బ్యాంకుల ద్వారా వివిధ రకాల స్కీములు అమలు చేశారని గుర్తు చేశారు. ఈ రెండేళ్లలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఏం సాధించారో శ్వేత పత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. టీడీపీకి చెందిన వారైతేనే ఇక్కడ పని చేయండి ● విడపనకల్లు వెలుగు కార్యాలయంలో ఓ అధికారి వింత పోకడ విడపనకల్లు: స్థానిక వెలుగు కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారి వింత సంస్కృతికి తెర తీశారు. ఆయన పనితీరుపై సొంత శాఖలోని పలువురు విమర్శలు చేస్తున్నారు. కార్యాలయంలో పనిచేయాలంటే టీడీపీకి చెందిన వారే ఉండాలనే కొత్త నిబంధనను తీసుకువచ్చారని వాపోతున్నారు. ఏ చిన్న ఉద్యోగి అయిన సరే టీడీపీకి చెందిన వారే ఉండాలని హుకుం జారీ చేశారన్నారు. అంతేకాక టీడీపీ బడా నేత వద్ద నుంచి ఫోన్ కాల్ చేయిస్తేనే విధుల్లో చేరనిస్తారని, లేకపోతే స్వచ్ఛందంగా ఉద్యోగం వదిలి వెళ్లాలంటూ బెదిరింపులకు దిగుతున్నారని వాపోతున్నారు. ఆయన పనితీరుతో తాము అక్కడ పనిచేయలేక పోతున్నామని, ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మైక్రో ఫైనాన్స్, మేనేజ్మెంట్ కోర్సుల్లో ఉచిత శిక్షణ అనంతపురం: మైక్రో ఫైనాన్స్, మేనేజ్మెంట్ కోర్సుల్లో ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు ఏఎఫ్ ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వైవీ మల్లారెడ్డి తెలిపారు. ఈ మేర కు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 25 రోజుల పాటు కొనసాగే ఈ శిక్షణకు 20 నుంచి 30 సంవత్సరాల్లోపు వయస్సు, డిగ్రీ ఉత్తీర్ణత, ఆపై కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు. బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్, వర్క్ ప్లేస్ ఎథిక్స్, బేసిక్ స్పోకెన్ ఇంగ్లిష్, కస్టమర్ రిలేషన్షిప్ స్కిల్స్ అంశాల్లో నైపుణ్య శిక్షణను అందిస్తారు. శిక్షణా కాలంలో మధ్యాహ్న భోజనం ఉచితం. శిక్షణానంతరం సర్టిఫికెట్ అందజేసి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. పూర్తి వివరాలకు 95024 12002, 91603 72267 లో సంప్రదించవచ్చు. -
ప్రాణం బలిగొన్న ఈత సరదా
● స్విమ్మింగ్ పూల్లో ఈత కొడుతూ మెడికో మృతి ● మృతుడు మార్కాపురం నివాసి గార్లదిన్నె: ఈత సరదా ఓ మెడికో ప్రాణాన్ని బలిగొంది. పోలీసులు తెలిపిన మేరకు... ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు మోహన్ (18) గత ఏడాది సెప్టెంబర్లో అనంతపురం మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరంలో చేరాడు. మంగళవారం ఉదయం 9 మంది సహచర విద్యార్థులతో కలిసి ట్రిప్ పేరుతో ఆటోలో గార్లదిన్నెకు వచ్చాడు. అనంతరం స్నేహితులందరూ కలసి రైల్వేగేట్ సమీపంలోని స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టేందుకు చేరుకున్నారు. కేవలం 9 అడుగుల లోతు ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఆరు అడుగులు మాత్రమే నీరున్నాయి. ఈ విషయం తెలుసుకోకుండా మోహన్ పై నుంచి తలకిందులుగా డైవ్ చేశాడు. దీంతో పూల్ అడుగు భాగానికి తల ఢీకొని అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఎంత సేపటికీ మోహన్ పైకి రాకపోవడంతో గట్టుపై ఉన్న స్నేహితులు వెంటనే స్విమ్మింగ్ పూల్లో దూకి గాలించి మోహన్ను వెలికి తీశారు. వెంటనే సీపీఆర్ చేశారు. ఫలితం దక్కకపోవడంతో హుటాహుటిన ఆటోలో గార్లదిన్నెలోని పీహెచ్సీకి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మోహన్ మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారను. ఘటనపై గార్లదిన్నె పీఎస్ ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
చల్లా భక్తి రాజకీయం
తమిళనాడులోని అరుణాచలం నుంచి ఉత్సవ మూర్తులను తీసుకొచ్చి అనంతపురంలో శివమహోత్సవం నిర్వహించారు. 30 వేల మంది భక్తులు హాజరైనట్లు ప్రచారం జరిగింది. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు కుమారుడి చేత ప్రవచనం చేయించారు.సాక్షి ప్రతినిధి అనంతపురం: తెలుగుదేశం పార్టీ నేత, ఏపీఐఐసీ డైరెక్టర్ చల్లా లక్ష్మీప్రసాద్ చేసిన శివమహోత్సవం, దాని వెనుక ఉన్న అసలు సంగతి, భర్త కోసం భార్య డీఆర్డీఏ పీడీ, ఎస్ఎస్ఏ ఏపీసీ శైలజ అధికారాన్ని దుర్వినియోగం చేసిన తీరు ఇప్పుడు అనంతపురంలో హాట్ టాపిక్గా మారింది. లక్ష్మీప్రసాద్ అలియాస్ ఆయిల్బాబు శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం నిడిగల్లు వాసి. ఈయన పామోలిన్ వ్యాపారం చేసేవారు. ఆపై రియల్ ఎస్టేట్ వ్యాపారమూ చేస్తున్నారు. ఇస్కాన్ దగ్గర భూ వివాదంలో కూడా గతంలో జోక్యం చేసుకున్నారు. అయితే ఇస్కాన్ వారితో వివాదం జరుగుతుండగానే లక్ష్మీప్రసాద్ ట్యాంకర్ కాలిపోయింది. దీంతో దేవుడి వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదని ఇస్కాన్ వారితో రాజీ పడ్డారు. ఆ భూమిని ఇస్కాన్ వారికే విక్రయించారు. ఇతను కుప్పం టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్కు అత్యంత సన్నిహితుడు. ఇతని ద్వారా చంద్రబాబు కుప్పంకు వచ్చిన ప్రతీసారి కలిసేవారు. ఇలా ఏపీఐఐసీ డైరెక్టర్ పోస్టు తెచ్చుకున్నారు. దీనికి అనంత, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలు కూడా ఇచ్చారు.టికెట్ కోసం ప్రయత్నం!అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఏడాదిన్నర వ్యవధిలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఈ క్రమంలో త్వరలో జరగనున్న నగరపాలక సంస్థ ఎన్నికల బాధ్యత నుంచి దగ్గుపాటిని తప్పించి జిల్లాలోని ఓ ఎమ్మెల్యేను ఇన్చార్జ్గా పెట్టి ముందుకు వెళ్లాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మేయర్గా లేదా 2029 ఎన్నికల్లో అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ దక్కించుకునేందుకు లక్ష్మీప్రసాద్ తెర వెనుక ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇందుకు టీడీపీ జిల్లా ఇన్చార్జ్గా ఉన్న గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర (నాని) కూడా లక్ష్మీప్రసాద్కు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ‘పుర’ పోరులోపు నగర ప్రజలకు చేరువయ్యేందుకు లక్ష్మీప్రసాద్ మహాశివరాత్రి రోజున ‘శివ మహోత్సవం’ నిర్వహించారు.నాకు తెలియదు.. నన్నడగొద్దుశివరాత్రి రోజున అనంతపురంలో నిర్వహించిన శివ మహోత్సవంలో అధికార దుర్వినియోగంపై లక్ష్మీప్రసాద్ సతీమణి, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శైలజను ‘సాక్షి’ ఫోన్లో వివరణ కోరగా...‘ఆ కార్యక్రమం గురించి నాకేమీ తెలియదు. నన్ను అడగొద్దు’ అంటూ ఫోన్ కట్ చేశారు. అయితే శివ మహోత్సవం భూమి పూజ దగ్గర నుంచి వీవీఐపీల ఆహ్వానం, కార్యక్రమ నిర్వహణ, ముగింపు వరకు దంపతులిద్దరూ హడావుడి చేశారు. అయినా ఆమె అందుకు విరుద్ధంగా వివరణ ఇవ్వడం గమనార్హం. -
ఆడబిడ్డ నిధి ఊసే లేదు
ఆడ బిడ్డల ఆశలను చంద్రబాబు సర్కారు వమ్ము చేస్తోంది. 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకూ ప్రతి నెలా రూ.1,500 ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీనిచ్చారు. అధికారం చేపట్టి 20 నెలలవుతున్నా ఈ పథకాన్ని అమలు చేయలేదు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ ఆడబిడ్డ నిధికి నిధులు కేటాయించకుండా మహిళలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది. – స్రవంతి, గృహిణి, కణేకల్లు విద్యా రంగానికి అన్యాయంచంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి సరియైన కేటాయింపులు లేవు. అంకెల గారడీతో మోసం చేశారు. పాఠశాల విద్యా రంగానికి రూ.32,308 కోట్లు మాత్రమే కేటాయించారు. గత బడ్జెట్తో పోలిస్తే ఇది 0.14 శాతం తక్కువ. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కేవలం రూ.1,500 కోట్లు, డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి గత బడ్జెట్లో కంటే తక్కువ నిధులు కేటాయించారు. మొత్తం మీద చూస్తే ఈ బడ్జెట్తో విద్యా రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీశారు. – నవీన్ యాదవ్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి, గుత్తి -
●స్పందించని మంత్రి.. ఉద్యమించిన యువత
కూడేరు: అభివృద్ధి దిశగా మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టి సారించలేదు. పలు దఫాలుగా అర్జీలు ఇచ్చినా అధికారులు స్పందించలేదు. ప్రభుత్వమూ పట్టించుకోలేదు. దీంతో విసుగు చెందిన కూడేరు మండలం కమ్మూరు గ్రామానికి చెందిన యువకులు శ్రమశక్తితో రోడ్డు మరమ్మతులకు ఉపక్రమించారు. మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కూడేరు నుంచి అరవకూరు, కమ్మూరు, కోటంక, మర్తాడు మీదుగా గార్లదిన్నెకు వాహనాలు అధిక సంఖ్యలో తిరుగుతుంటాయి. అరవకూరు నుంచి కోటంక వరకు తారు రోడ్డు కంకర తేలి, గుంతలు పడి అధ్వానంగా మారింది. ఈ అంశంపై గత ఏడాది డిసెంబర్ 29న ‘అడుగుకో గుంత’ శీర్షికన ‘సాక్షి’లో కథనం వెలువడింది. అయితే అధికారులు కానీ, మంత్రి పయ్యావుల కేశవ్ కాని స్పందించకపోవడంతో చివరకు కమ్మూరుకు చెందిన ఈశ్వరరెడ్డి, జగదీష్రెడ్డి, హేమంత్, లోకనాథ రెడ్డి, విష్ణు, అభిషేక్ రెడ్డి, రంజిత్, తమన్ సాయి, మౌని శ్రమదానంతో రోడ్డు బాగు చేసుకున్నారు. ద్విచక్ర వాహనాలపై సంచుల్లో మట్టిని తెచ్చి గుంతలను పూడ్చి చదను చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధి ఈ సర్కార్కు పట్టడం లేదని, కనీసం మంత్రి కేశవ్ కూడా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రమదానం చేపట్టిన యువకులను అభినందించారు. మట్టిని తెచ్చి గుంతలు పూడుస్తున్న దృశ్యం మట్టి వేసి చదను చేస్తున్న యువకులు -
హితాన్ని బోధించే రంజాన్
ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలతో నెలరోజుల పాటు నియమనిష్టలతో గడిపే పవిత్ర రంజాన్ మాసం రానే వస్తోంది. దాదాపు 31 సంవత్సరాల తర్వాత ఫిబ్రవరిలోనే ఈ మాసం ప్రారంభం కావడం విశేషం. మానవాళి మనుగడకు, దిశా నిర్దేశం చేసిన ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ భూమిపై ఆవిర్భావించిన రోజులనే రంజాన్ మాసంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 19 నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్న సందర్భంగా ఉపవాస దీక్షలకు ముస్లింలు సిద్ధమవుతున్నారు. ఆత్మకూరు: ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్ మాసం ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. సాధారణంగా ముస్లిం సంవత్సరాది మొహరంతో ప్రారంభమవుతుంది. ఇలా ప్రారంభమైన సంవత్సరంలో 9వ నెల రంజాన్ గా పిలువబడుతుంది. ఈ నెలలోనూ పవిత్ర దివ్య ఖురాన్ ను భూమి పైకి అల్లాహ్ పంపించినట్లుగా ముస్లింల అపార నమ్మకం. దివ్య ఖురాన్ లోని 30 అధ్యాయాలను రోజుకో అధ్యాయం చొప్పున అల్లాహ్ ఈ భూమి మీదకి పంపించడంతో రంజాన్ నెలలోనే 30 రోజులనూ పవిత్ర రోజులుగా భావిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. వాస్తవానికి దివ్య ఖురాన్ లో మానవుడు ఎలా బతకాలి? ఎలా బతకరాదనే విషయాలను అల్లాహ్ చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ప్రతి ముస్లిం ఐదు పూటల నమాజ్ చేయడంతో పాటు, కష్టాల్లో ఉన్న వాళ్లకు సహాయం చేయడం, హజ్ (మక్కా) యాత్రను పూర్తి చేయడం, ఉపవాస ప్రార్థనలు చేయడం, జకాత్ లను చెల్లించడం తదితర నియమాలను పాటిస్తే అల్లాహ్ అనుగ్రహాన్ని పొందుతాడని నమ్మకం. రోజూ పండుగే రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం ఇంటా ప్రతి రోజూ పండుగ వాతావరణం నెలకొని ఉంటుంది. కఠోరమైన ఉపవాస దీక్షలను ఆచరిస్తూనే దాన ధర్మాలతో పరుల హితాన్ని కోరుకుంటూ ఉంటారు. అమావాస్య ముగిసిన అనంతరం రెండు రోజులకు రంజాన్ మాసం ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఈ నెల 19న రంజాన్ మాసం ప్రారంభమవుతుందని ముస్లిం పెద్దలు అంటున్నారు. ఈ మాసంలో తెల్లవారుజామున 4 నుంచి 4.35 గంటల లోపు ఉపవాస దీక్షలు ( రోజా) ప్రారంభమవుతాయి. నమాజ్ అనంతరం సాయంత్రం 6.40 గంట వరకూ కనీసం లాలాజలాన్ని సైతం మింగకుండా దీక్షను భక్తిశ్రద్దలతో చేపడుతారు. దాదాపు 14 గంటల అనంతరం ఆ రోజు సాయంత్రం ఉపవాస దీక్షను విరమిస్తారు. ఉపవాసాల ప్రారంభాన్ని సహరీ అని, విరమణను ఇఫ్తార్ అని పిలుస్తారు. ఇస్లాంలో రోజా ఉన్న వారికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడాన్ని పవిత్ర కార్యంగా భావిస్తారు. రోజా సమయంలో ప్రతి రోజూ ఐదు పూటలా నమాజ్ చేస్తుంటారు. ఈ మాసం 26వ రోజున రాత్రి జాగారంతో ప్రార్థనలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముస్లింలకు చాలా ప్రత్యేక మాసం ఈ నెల 19 నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం మూడు దశాబ్దాల తర్వాత ఫిబ్రవరిలోనే ప్రారంభమైన పవిత్ర మాసం -
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు కృషి
బుక్కరాయసముద్రం: విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. మంగళవారం సాయంత్రం కొర్రపాడు ఏపీ బాలికల గురుకుల పాఠశాలలో నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థులు చదువులతో పాటు ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. 19 ఏళ్లలోపు వయసున్న పిల్లలందరికీ నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్–400ఎంజీ మాత్రలను నమిలి మింగాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈబీ దేవి, ఐసీడీఎస్ పీడీ అరుణ కుమారి, ఆర్ఐఓ వెంకటరమణ నాయక్, ఆర్బీఎస్కే పీఓ విష్ణుమూర్తి, తహసీల్దార్ శ్రీధర్మూర్తి, ఎంపీడీఓ సాల్మన్ రాజు, ఎంఈఓ లింగానాయక్, ఎంపీపీ సునీత పాల్గొన్నారు. మెరుగైన వైద్య సేవలందించాలి శింగనమల: కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు సక్రమంగా అందించాలని కలెక్టర్ ఆనంద్ వైద్యులకు సూచించారు. మంగళవారం శింగనమల కమ్యూనిటీ హెల్త్ సెంటర్, కేజీబీవీని ఆయన తనిఖీ చేశారు. -
జిల్లా అంతటా మంగళవారం పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఉదయం పూట చలి వాతావరణం తగ్గుతోంది. గంటకు 8 నుంచి 10 కి.మీ. వేగంతో ఆగ్నేయం దిశగా గాలి వీచింది.
ఈ–కేవైసీ చేయించుకోవాలి గుంతకల్లు రూరల్: రబీ సీజన్లో పంట సాగు చేసి ఈ–క్రాప్ చేయించుకున్న రైతులు తప్పనిసరిగా ఈ–కేవైసీ కూడా చేయించుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి (డీఏఓ) రవి కుమార్ సూచించారు. మంగళవారం దోనిముక్కల గ్రామంలో మండల వ్యవసాయ అధికారి లీనా వసుంధర ఆధ్వర్యంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి రవికుమార్ పంట సాగులో తీసుకోవాల్సిన మెలకువలు, డ్రోన్ యాప్ ఉపయోగాలు, ఏపీఏఐఎంఎస్ యాప్ వినియోగం, ఉపయోగాల గురించి తెలియజేశారు. తిరుపతి – రాక్సౌల్ మధ్య ప్రత్యేక రైళ్లు గుంతకల్లు: హోలీ పండగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి – రాక్సౌల్ మధ్య ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైళ్లు నడుపుతున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 21, 28, మార్చి 7వ తేదీల్లో తిరుపతి జంక్షన్ నుంచి ఉదయం 8.15 గంటలకు ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు (07051) బయలుదేరి రెండవ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు రాక్సౌల్ రైల్వేస్టేషన్కు చేరుతుందన్నారు. తిరిగి ఈ రైలు ఈ నెల 24, మార్చి 3, 10వ తేదీల్లో ఉదయం 8.30 గంటలకు రాక్సౌల్ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి రెండు రోజుల తరువాత తిరుపతి జంక్షన్కు సాయంత్రం 6.30 గంటలకు చేరుతుందన్నారు. ఈ రైళ్లు రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం, రాయచూరు, కృష్ణ, తాండురూ, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, చర్లపల్లి, ఖాజీపేట మీదుగా రాకపోకలు సాగిస్తుందన్నారు. ఈ రైళ్లల్లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్తోపాటు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉంటాయన్నారు. -
హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
కూడేరు: మండలంంలోని మరుట్ల–3వ కాలనీలో సోమవారం చితంబరేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి రాతి దూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. 14 జతల వృషభాలను పోటీలకు రైతులు తీసుకువచ్చారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తికి చెందిన రైతు బోయ చెన్నప్ప వృషభాలు ప్రథమ, కనగానిపల్లి మండలం మద్దెలచెరువు రైతు కొండయ్య వృషభాలు ద్వితీయ, బళ్లారి జిల్లా ఆంధ్రాల గ్రామానికి చెందిన రైతు వీరేష్ వృషభాలు తృతీయ, గార్లదిన్నెకు చెందిన రైతు పఠాన్ బాషా వృషభాలు నాల్గవ, చెన్నేకొత్తపల్లి రైతు సనప నాగరాజు వృషభాలు ఐదో స్థానంలో నిలిచాయి. విజేత వృషభాల యజమానులను అభినందిస్తూ నగదు పురస్కారాలతో నిర్వాహకులు సత్కరించారు. సెల్ఫోన్ రీచార్జ్కు డబ్బు ఇవ్వలేదని... డి హీరేహాళ్(రాయదుర్గం): సెల్ఫోన్ రీచార్జ్కు డబ్బు ఇవ్వకపోవడంతో క్షణాకావేశానికి లోనై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు... డి.హీరేహాళ్ మండలం కల్యం గ్రామానికి చెందిన రామకృష్ణ, లక్ష్మి దంపతుల ఏకై క కుమారుడు నవీన్ (17) తల్లిదండ్రులకు పొలం పనుల్లో చేదోడుగా ఉండేవాడు. రెండు రోజుల క్రితం సెల్ఫోన్ రీచార్జ్ కోసం ఇంట్లో డబ్బులు అడిగాడు. అయితే సంఘం కంతు చెల్లించాల్సి ఉండడంతో డబ్బు ఇవ్వడంలో తల్లిదండ్రులు జాప్యం చేశారు. దీంతో క్షణికావేశానికి లోనైన నవీన్.. సోమవారం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు బళ్లారిలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటన పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ గురుప్రసాదరెడ్డి తెలిపారు. వాతావరణానికి అనుగుణంగా పంటల సాగు ● వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జాన్సన్ బుక్కరాయసముద్రం: మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు చేపడితే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రాంతీయ సహాయ సంచాలకుడు, శాస్త్రవేత్త డాక్టర్ జాన్సన్ సూచించారు. బీకేఎస్ మండలం రెడ్డిపల్లిలోని కేవీకేలో సోమవారం 44వ శాసీ్త్రయ సలహా మండలి సమావేశం జరిగింది. ముఖ్య అతిఽథులుగా డాక్టర్ జాన్సన్తో పాటు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్సిటీ డీఈఈ డాక్టర్ ముకుంద హాజరై, మాట్లాడారు. పంటల సాగులో శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు తప్పక పాటించాలన్నారు. పంటల మార్పిడితో మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. వాతావరణానికి అనుగుణంగా చేపట్టాల్సిన వివిధ రకాల పంటల సాగుపై చర్చించారు. కార్యక్రమంలో ఆత్మాపీడీ మద్దిలేటి, వ్యవసాయ శాఖ ఏడీ రవి, గార్లదిన్నె పరిశోధనా స్థానం డైరెక్టర్ డాక్టర్ పీపీ రావు, డీహెచ్ఓ ఉమాదేవి, డాక్టర్ పద్మలత, రెడ్డిపల్లి కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లేశ్వరి, నాబార్డ్ డీడీఎం అనూరాధ, పశు సంవర్థక శాఖ ఏడీ డాక్టర్ రత్నకుమార్, కదిరి ఏఆర్ఎస్ శాస్త్రవేత్త డాక్టర్ భాస్కర్రెడ్డి, కళ్యాణదుర్గం కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ చంద్రాయుడు, రెడ్డిపల్లి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వసుంధర, రెడ్డిపల్లి ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భార్గవి, రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి డాక్టర్ విజయ శంకర్బాబు, తదితరులు పాల్గొన్నారు. -
విదేశాల నుంచి వీరాపురానికి..
సాక్షి, పుట్టపర్తి: ఏటా ఫిబ్రవరి నుంచి సైబీరియాలో చలికాలం మొదలవుతుంది. దీంతో వేడిని వెతుక్కుంటూ అక్కడి పక్షులు జనవరి చివరి వారంలో వీరాపురానికి వస్తాయి. ఇక్కడే సంతానోత్పత్తి పూర్తి చేసుకుని ఆగస్టు తరువాత తిరిగి పిల్లలతో సహా వెళ్లిపోతాయి. వీరాపురంలో 188 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పురాతన చెరువు వీటికి ఆవాసంగా మారింది. ఈ చెరువు కింద 80 ఎకరాల ఆయకట్టు ఉంది. చుట్టూ వందలాది చెట్లు ఉండటంతో ఎన్నో ఏళ్లుగా సైబీరియా నుంచి వేల సంఖ్యలో కొంగ జాతి పక్షులు వలస వస్తున్నాయి. వీటిని స్థానికులు ప్రేమగా ఎర్రమూతి కొంగలంటారు. కాలానికి అనుగుణంగా చెరువులోని చేపలతో పాటు ఆహారం కోసం చుట్టుపక్కల కొన్ని వందల కిలోమీటర్లు వెళ్లి తిరిగి సాయంత్రం గూటికి చేరుకుంటాయి. కొన్నేళ్లుగా గ్రామంతో ఇవి మమేకమయ్యాయి. సీజన్లో పక్షులను చూసేందుకు వచ్చే పర్యాటకులతో వీరాపురం కిటకిటలాడుతుంది. పెయింటెడ్ స్టార్క్ల జీవన శైలి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నీళ్లు గొంతు వరకు నింపుకుని పిల్ల పక్షులకు అందించేందుకు మళ్లీ మొత్తం నీటిని బయటకు తీసి ఇవ్వడం చూపరులను ఆశ్చర్యపరుస్తుంటుంది. ఆహారం కోసం చుట్టుపక్కల 50 కిలోమీటర్ల దూరంలో ఉండే చెరువులు, పంట పొలాల వైపు వెళ్లి తిరిగి సాయంత్రం గూటికి చేరుకుంటాయి. ఒక గూడులో జంట పక్షులుంటాయి. గుడ్లు పెట్టి పిల్లలను పొదిగిన తర్వాత వాటి సంరక్షణ మగపక్షి చూసుకుంటే ఆడకొంగలు బయటకు వెళ్లి చెరువుల్లో వేటాడి చేపలు, నీళ్లు తీసుకొచ్చి పిల్లలకు అందిస్తాయి. గ్రామంలోని ఇళ్ల మధ్య చెట్లపైనే సుమారు రెండు వేలకు పైగా సైబీరియరిన్ కొంగలు కనిపిస్తుంటాయి. 24 గంటలూ వాటి అరుపులతో ఎవరికై నా చిరాకు పుట్టడం సహజం. అయితే వీరాపురం గ్రామస్తులు మాత్రం వాటి అరుపులను ఆస్వాదిస్తూ బంధువుల్లా ఆదరిస్తారు. అంతేకాకుండా చెరువును వారసత్వ సంపదగా ప్రకటించారు. ఈ చెరువు నీటితో పంటు సాగుచేస్తే నీరు తగ్గిపోయి మత్స్యసంపద అంతరించి పక్షులు రాకుండా పోతాయనే భయంతో గ్రామానికి చెందిన రైతులు ఆయకట్టు పరిధిలో పంటల సాగుకు శాశ్వతంగా విరామం ప్రకటించారు. బోరు బావులు ఏర్పాటు చేసుకుని పంటలు సాగు చేస్తున్నారు. సైబీరియన్ కొంగల రాకతో గ్రామానికి మేలు జరుగుతుందని వీరాపురం వాసుల నమ్మకం. ఎవరైనా వాటికి హాని తలపెడితే అందరూ ఒక్కటవుతారు. వారిని పట్టుకుని గ్రామపెద్దల సమక్షంలో పంచాయితీ చేసి జరిమానా విధిస్తారు. కేసులు పెడతారు. గ్రామంలోని చెట్ల మీద సేద తీరుతున్న పక్షులువీరాపురం.. చిలమత్తూరు మండలంలో కర్ణాటక సరిహద్దున ఉన్న ఓ మారుమూల గ్రామం. విదేశీ జాతికి చెందిన పక్షులు ఏటా సంతానోత్పత్తి కోసం ఈ గ్రామానికి వస్తుండడంతో వీరాపురం పేరు గూగుల్లోకి ఎక్కింది. మూడు శతాబ్దాలుగా విదేశీ పక్షులతో ఆ గ్రామానికి అనుబంధం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సైబీరియా, రష్యా దేశాల నుంచి ఖండాంతరాలు దాటి శీతాకాలంలో పక్షులు వలస వస్తుండడం విశేషం. చూడముచ్చటైన పక్షులు.. అరుదైన పక్షి జాతిగా భావిస్తున్న ఈ పెయింటెడ్ స్టార్క్లు వందల సంఖ్యలో ఒక చోటుకు రావడం అద్భుతం. రష్యాలోని సైబీరియా లోయ ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 150 రకాల జాతుల పక్షులు ఉన్నాయి. సైబీరియాలో శీతాకాలం ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో అక్కడి పక్షులు వలస బాట పడుతుంటాయి. శ్రీలంక, థాయ్లాండ్, ఇండియా, వియత్నాం, చైనా తదితర దేశాలకు వలస వెళుతుంటాయి. ఆయా ప్రాంతాల్లో ఆర్నెళ్ల పాటు సేదతీరుతూ సంతానోత్పత్తి చేసుకుని తిరిగి సైబీరియాకు పయనం అవుతాయి. పెయింటెడ్ స్టార్క్ పక్షి చూడముచ్చటగా ఉంటుంది. వీటి శాసీ్త్రయ నామం ‘మిక్టీరియాలూకోసిఫల’. 3 నుంచి 3.5 అడుగుల ఎత్తు ఉంటాయి. ఎగరడానికి రెక్కలు విప్పితే ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది. సుమారు 3.5 నుంచి 4 కిలోల వరకు బరువు ఉంటుంది. ఏటా ఫిబ్రవరి మొదటి వారంలో సైబీరియా నుంచి వస్తున్న పక్షులు ఆరు నెలల తర్వాత స్వదేశానికి తిరుగు పయనం మూడు శతాబ్దాలుగా గ్రామంతో పక్షులకు విడదీయరాని అనుబంధం మేలు జరుగుతుందనే నమ్మకం.. బంధువుల్లా ఆదరిస్తూ.. జీవనశైలి ప్రత్యేకం.. వీరాపురం చేరుకోండి ఇలా.. చిలమత్తూరు నుంచి 11 కిలోమీటర్ల దూరం, హిందూపురం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో వీరాపురం ఉంది. రైలులో అయితే హిందూపురం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆ గ్రామానికి వెళ్లవచ్చు. బెంగళూరు – హైదరాబాద్ జాతీయ రహదారి మీదుగా కొడికొండ చెక్ పోస్టు చేరుకుని.. అక్కడి నుంచి చిలమత్తూరు మీదుగా వీరాపురం చేరుకోవచ్చు. -
ఆమిద్యాలలో సాగుతున్న రథోత్సవం
ఉరవకొండ రూరల్: మండలంంలోని పెద్దముష్టూరులో సిద్ధేశ్వర స్వామి రథోత్సవం సోమవారం నేత్రపర్వంగా సాగింది. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పార్వతీపరమేశ్వరుల ఉత్సవ మూర్తులను రథంపై అధిష్టంజేసి మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ ఆలయం చుట్టూ భక్తులు లాగారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. అలాగే ఆమిద్యాల గ్రామంలోనూ రామలింగేశ్వర స్వామి రథోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. నేత్రపర్వంగా సిద్ధేశ్వర స్వామి రథోత్సవం -
‘ఆడబిడ్డ నిధి’ ఊసే లేదు
అధికారంలోకి వస్తే 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ ‘ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెలా రూ.1,500 ఇస్తామని ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు హామీనిచ్చారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తోంది. ఇప్పటి వరకూ ఆడబిడ్డ నిధి ఊసే లేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నెరవేర్చాలి. గడిచిన 20 నెలలకు సంబంధించి రూ.30 వేల బకాయిలను వెంటనే చెల్లించాలి. – బోయ శివమ్మ, గృహిణి, ఉదిరిపికొండ, కూడేరు మండలం పేదలకు అన్యాయం చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదలకు తీరని అన్యాయమే జరిగింది. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారు. ముఖ్యంగా 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలంటూ నిరుద్యోగులను నట్టేట ముంచారు. నిరుద్యోగ భృతి హామీని మర్చిపోయారు. 50 ఏళ్లకే పింఛన్ ఊసేలేకుండా పోయింది. ఇప్పటికీ వితంతువులకు పింఛన్లు ఇవ్వకుండా వేధిస్తూనే ఉన్నారు. రూ.1,500 చొప్పున ఆడబిడ్డ నిధి పేరుతో అక్క, చెల్లెమ్మలను మోసం చేశారు. మహిళా సంఘాల సభ్యులకు సున్నా వడ్డీ కింద రుణాలపై స్పష్టత లేదు. రైతాంగం కోసం అరకొర నిధులు కేటాయించారు. విద్య, వైద్య రంగాలకు నిధులు కేటాయించకుండా పీపీపీ విధానాన్ని ప్రవేశ పెట్టి పేదల భవిష్యత్తుకు గండికొట్టారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.40 వేల కోట్ల బకాయిలపై ఎలాంటి ప్రకటన లేదు. ఇది మోసపూరిత బడ్జెట్. – డాక్టర్ తలారి రంగయ్య, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, కళ్యాణదుర్గం -
‘ఆటోమేషన్’తో బహుళ ప్రయోజనాలు
అనంతపురం అర్బన్: ఏపీఎంఐపీ ఆధ్వర్యంలో తీసుకువచ్చిన ఆటోమేషన్ కార్యక్రమంతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఓ.ఆనంద్ పిలుపునిచ్చారు. ‘ఆధునిక సాగు – ఏపీఎంఐపీ ఆటోమేషన్ పథకం’ పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ భవనంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్తో కలిసి కలెక్టర్ ఆవిష్కరించి, మాట్లాడారు. సూక్ష్మ నీటి సాగులో భాగంగా ఆటోమేషన్ను ప్రోత్సహించేందుకు, నీటి సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు, రైతులకు శ్రమ తగ్గించేందుకు సబ్సిడీతో కూడిన ఆర్థిక సాయాన్ని అందజేస్తున్నట్లు వివరించారు. హెక్టారుకు రూ. 40వేల సూచిక వ్యయంపై సబ్సిడీ లభిస్తుందని చెప్పారు. పూర్తి వివరాలకు ఏపీఎంఐపీ హెల్ప్ లైన్ 1800 425 2960, 79950 87057 లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్వో మలోల, ఉద్యానశాఖ డీడీ ఉమాదేవి, ఏపీఎంఐిపీ పీడీ రఘునాథరెడ్డి, జెడ్పీ సీఈఓ శివశంకర్, జిల్లా సైనిక సంక్షేమ అధికారి తిమ్మప్ప, తదితరులు పాల్గొన్నారు. మార్చిలో గుత్తికోట ఉత్సవాలు జిల్లాలో పర్యాటకరంగం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, మార్చిలో గుత్తి కోట ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా పర్యాటక కౌన్సిల్ చైర్మన్ హోదాలో కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. ఈ ఉత్సవాల నిర్వహణకు జాయింట్ కలెక్టర్ ఇన్చార్జిగా వ్యవహరిస్తారన్నారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పర్యాటక అభివృద్ధి కౌన్సిల్ సమావేశం జరిగింది. ఉరవకొండ, గుంతకల్లు, ఆత్మకూరు మండలాల్లో పర్యాటక అభివృద్ధికి స్థలాలను గుర్తించినట్లు కౌన్సిల్ దృష్టికి పర్యాటక శాఖ అధికారి జయకుమార్ బాబు తీసుకొచ్చారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. బోటింగ్ నిర్వహణకు అనుమతులను ఏపీటీడీసీ ద్వారా తెప్పించి కార్యకలాపాలను ప్రారంభించాలని చెప్పారు. ఆర్కియాలజీ మ్యూజియం, పాతకాలం నాటి జిల్లా జైలు, పీస్ మెమోరియల్ హాల్, సైన్స్ సెంటర్, శిల్పారామానికి సందర్శకులు నిరంతరం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. పార్క్ అభివృద్ధికి ప్రణాళికను సిద్ధం చేసి వారంలోపు అందించాలని చెప్పారు. లీజుకు పర్యాటక స్థలాలు అనంతపురం అర్బన్ పరిధిలోని క్యాన్సర్ ఆస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, జేఎన్టీయూ సమీపంలో పర్యాటక శాఖకు సంబంధించిన స్థలాలు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ స్థలాల్లో మంచి డీలక్స్ హోటళ్ల ఏర్పాటుకు లీజుకు ఇచ్చేందుకు నిబంధనల మేరకు ప్రాసెస్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎ.మలోల, పర్యాటక శాఖ అధికారి జయకుమార్బాబు, డీఈఓ ప్రసాద్బాబు, నగర పాలక సంస్థ కమిషనర్ జశ్వంత్రావు, డ్వామా పీడీ సలీమ్బాషా, అర్కియాలజీ ఏడీ స్వామినాయక్, కమిటీ సభ్యులు దామోదర్ గౌరంగదాస్ ప్రభు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
● జరుట్ల రామలింగేశ్వరా పాహిమాం
వజ్రకరూరు: మండలంలోని జరుట్ల రాంపురంలో వెలసిన రామలింగేశ్వరస్వామి రథోత్సవం సోమవారం సాయంత్రం వైభవంగా సాగింది. ఉదయం ఆలయంలో మూలవిరాట్కు విశేష అభిషేకాలు పెద్ద ఎత్తున జరిగాయి. మధ్యాహ్నం మడుగు తేరును లాగారు. సాయంత్రం ఆలయం నుంచి పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి రథంపై అధిష్టింపజేశారు. ప్రత్యేక పూజల అనంతరం హర నామ స్మరణతో రథాన్ని బసవన్న దే వాలయం వరకు లాగి తిరిగి యథాస్థానానికి చేర్చారు. వేలాదిగా భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు జనసంద్రమయ్యాయి. మంగళవారం వసంతోత్సవంతో ఉత్సవాలను ముగుస్తున్నట్లు ఆలయ ఈఓ అంగదాల కృష్ణయ్య తెలిపారు. -
ఆటో బోల్తా.. పలువురికి తీవ్రగాయాలు
హిందూపురం: పట్టణ శివారున శ్రీకంఠపురం చెరువు సమీపంలో సోమవారం ఆటో బోల్తాపడిన ఘటనలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. అనంతపురానికి చెందిన రవి, నాగరాజు కుటుంబసభ్యులు సోమవారం లేపాక్షిలో జరిగిన రథోత్సవంలో పాల్గొని ఆటోలో హిందూపురానికి తిరుగు ప్రయాణమయ్యారు. శ్రీకంఠపురం చెరువు సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆటో డ్రైవర్ తప్పించే క్రమంలో నియంత్రణ కోల్పోవడంతో బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న వారందరూ గాయపడ్డారు. మేళాపురానికి చెందిన గోవిందప్ప తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అనంతపురం నివాసి రవి తల, ఛాతీకి బలమైన గాయాలయ్యాయి. రెండేళ్ల చిన్నారి యజ్ఞేష్కు ఎడమ కాలు విరిగింది. పూజిత, లక్ష్మీదేవి, వర్షితకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఐసీడీఎస్లో ఖాళీ పోస్టులకు రేపు ఇంటర్వ్యూలు అనంతపురం సెంట్రల్: మిషన్ వాత్సల్య పథకం కింద శిశుగృహ, బాలసదనం, వన్స్టాప్ సెంటర్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఈ నెల 18న కలెక్టరేట్ సమీపంలోని బీసీ స్టడీ సర్కిల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐసీడీఎస్ పీడీ అరుణకుమారి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. శిశుగృహలో రెండు ఆయా పోస్టులు, ఒక చౌకదార్ పోస్టు ఖాళీగా ఉందన్నారు. బాలసదనంలో ఎడ్యుకేటర్, ఆర్ట్స్ అండ్ క్రాప్ట్ టీచర్ పోస్టు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. వన్స్టాప్ సెంటర్లో సోషల్వర్కర్, మల్టీ పర్పస్ స్టాప్ పోస్టు, సెక్యూరిటీ గార్డు పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత ఉండి.. దరఖాస్తు చేసుకోని వారు బుధవారం ఉదయం 10 గంటలకు జరిగే ఇంటర్వ్యూలకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావచ్చు. -
●శభాష్.. సమిత్
అనంతపురం ఎడ్యుకేషన్: దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఎన్ఐటీ, త్రిపుల్ ఐటీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించిన జేఈఈ మెయిన్స్లో అనంతపురానికి చెందిన కోనంకి సమిత్చౌదరి ప్రతిభ చాటాడు. సోమవారం ఈ ఫలితాలు విడుదలయ్యాయి. సమిత్చౌదరి 99.98 పర్సంటైల్ సాధించాడు. ఈ విద్యార్థి 1 నుంచి 7వ తరగతి వరకు అనంతపురం, 8వ తరగతి నుంచి విజయవాడలో చదివాడు. తల్లి టి.అరుణాదేవి పెనుకొండ బాలికల ఉన్నత పాఠశాలలో హిందీ టీచరుగాను, తండ్రి కోనంకి అశోక్కుమార్ గుడిబండ మండలం జంబులబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణితం టీచరుగాను పని చేస్తున్నారు. జేఈఈ మెయిన్స్లో ప్రతిభ చాటిన సమిత్చౌదరిని పలువురు అభినందించారు. ● జేఈఈ మెయిన్స్లో 99.98 పర్సంటైల్తో ప్రతిభ -
నీళ్లొస్తాయ్.. డంప్ చేసేద్దాం!
చెరువులోకి నీళ్లొస్తాయి. ఎప్పుడు తగ్గుతాయో తెలీదు. నీళ్లుంటే మట్టి తవ్వుకునేందుకు సాధ్యం కాదు. ఇంతలో ‘తెలుగు తమ్ముడి’కి ఓ ఐడియా వచ్చింది. నీళ్లొచ్చేలోపే చెరువు నుంచి మట్టిని తోడేస్తే పోలా? అని అనుకున్నాడు. అంతే చెరువు సమీపంలోని పొలాల్లో పెద్దపెద్ద డంపులు పెట్టేశాడు. వీలునుబట్టి అమ్ముకోవచ్చనే ఆలోచనలో ఉన్నట్టున్నాడు. ఇదీ రాప్తాడు మండలం హంపాపురం చెరువు మట్టి దందాలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ చోటా నాయకుడి నిర్వాకం. రాప్తాడురూరల్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరాక టీడీపీ నేత ఒకరు హంపాపురం చెరువును చెరబట్టారు. చెరువు నుంచి మట్టి (జీడ)ని అనుమతులు లేకుండా తవ్వి అనంతపురంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పెల్లల తయారీ కేంద్రాలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు. స్థానిక ఎమ్మెల్మే కుటుంబ సభ్యుల పేర్లు చెప్పుకుంటూ యథేచ్ఛగా చెరువు మట్టి దందా సాగిస్తున్నాడు. పెద్దపెద్ద గుంతలు తవ్వి సహజవనరులను కొల్లగొడుతూ చెరువు భద్రతను ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాడు. దీంతో స్థానిక రైతులు తిరగబడ్డారు. మట్టిని తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకుని రోడ్లపైనే అన్లోడ్ చేయించారు. ఈ విషయం కాస్తా రచ్చ అయ్యింది. జిల్లా అధికారుల దృష్టికి వెళ్లడంతో తాత్కాళికంగా మట్టి దందాకు అడ్డుకట్ట వేశారు. అయితే సదరు నాయకుడు కొంత బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్లీ రంగంలోకి దిగాడు. గుట్టుచప్పుడు కాకుండా చెరువు మట్టిని తరలించేస్తున్నాడు. పీఏబీఆర్ కుడికాలువ ద్వారా చెరువులోకి నీళ్లు వదిలే సమయం ఆసన్నం కావడంతో ముందుజాగ్రత్తగా చెరువు మట్టిని సమీప ప్రాంతాల్లో డంప్ చేస్తున్నాడు. తప్పుడు విచారణ నివేదికతో కలెక్టర్కు బురిడీ హంపాపురం చెరువు మట్టి అక్రమ రవాణాపై కొందరు గ్రామస్తులు ఇటీవల ప్రజాసమస్యల పరిష్కార వేదికలో స్వయంగా కలెక్టర్ను కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బరి తెగించి చెరువు మట్టిని కొల్లగొడుతున్నా అధికారులు కనీస చర్యలు తీసుకోలేదని వాపోయారు. అనంతరం కలెక్టర్ ఈ ఫిర్యాదును గనులు, భూగర్భ శాఖ అధికారికి పంపి విచారణకు ఆదేశించారు. అయితే వారు ఇచ్చిన విచారణ నివేదిక చూస్తే ఔరా అనిపిస్తుంది. తమ సిబ్బంది రెవెన్యూ సిబ్బందిని విచారించగా ‘కొందరు రైతులు వారి పంట పొలాలలకు ఈ చెరువు మట్టిని ఉపయోగిస్తున్నారు’ అంటూ స్వయంగా కలెక్టర్కు తప్పుడు నివేదిక ఇవ్వడం గమనార్హం. గ్రామ రైతులు వారి పంటపొలాలకు ఉపయోగించుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదని, ఓ వ్యక్తి అక్రమంగా అనంతపురం తరలిస్తున్నారని అధికారులకు ఫొటోలు, వీడియోలు చూపించినా చర్యలు తీసుకోవాల్సిన అధికారులే ఇలా తప్పుడు నివేదికలతో ఉన్నతాధికారులను బురిడీ కొట్టిస్తే ఎలా? అని గ్రామస్తులు వాపోతున్నారు. చెరువు మట్టి అక్రమ తరలింపు వ్యవహారం మైనర్ ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు, విజిలెన్స్, గనులు, భూగర్భశాఖల అధికారులందరికీ తెలుసని అంటున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు ఓసారి వచ్చి చెరువు ప్రాంతాన్ని పరిశీలించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. పొలంలో డంప్ చేసిన చెరువు మట్టి హంపాపురం చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలింపు పీఏబీఆర్ కుడికాలువకు నీళ్లొస్తాయని ‘తమ్ముడి’ తెలివి చెరువు సమీపంలోనే భారీ డంప్లు -
హరహర మహాదేవ
లేపాక్షి: ఓం నమః శివాయ, హరహర మహాదేవ అంటూ భక్తులంతా ఆ ముక్కంటిని కీర్తించగా పంచాక్షరీ నామంతో లేపాక్షి ప్రతిధ్వనించింది. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం శివపార్వతుల బ్రహ్మ రథోత్సవం వైభవంగా సాగింది. మధ్యాహ్నం ప్రత్యేక పూజల తర్వాత నాట్యమంటపంలో స్వామి వారికి మహామంగళ హారతి ఇచ్చి శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను వేదపండితులు ఊరేగింపుగా బస్టాండు వద్దకు తీసుకువచ్చి రథంలో కొలువుదీర్చారు. హరహర మహాదేవ అంటూ భక్తులు కీర్తించగా కదిలిన కై లాసవాసుని రథం ఎగువ పేటలోని రామభజన మందిరం వరకు సాగింది. రథం ముందు భాగంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, హైదరాబాద్ నుంచి వచ్చిన వెంకట అన్నమాచార్య బృందం కోలాటాలను ప్రదర్శించారు. రథం రామ భజన మందిరం వద్దకు చేరుకోగానే ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ధూళోత్సవం తర్వాత రథాన్ని యథాస్థానంలోకి తీసుకు వచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ కరణం రమానందన్, ఈఓ నరసింహమూర్తి పర్యవేక్షణలో సునీల్శర్మ ఆధ్వర్యంలో వేదపండితులు పూజ కార్యక్రమాలను నిర్వహించారు. -
కోర్టు ఉద్యోగాలకు 19న ఎంపిక పరీక్షలు
అనంతపురం: అనంతపురం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల 19న ఎంపిక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇ.భీమారావు తెలిపారు. ఈమేరకు ఆయన సోమవారం ఎంపిక పరీక్ష వివరాలను మీడియాకు వెల్లడించారు. అనంతపురం సమీపంలోని రుద్రంపేట పరిధిలోని శ్రీ బాలాజీ పీజీ కాలేజ్, పీవీకేకే ఇంజినీరింగ్ కాలేజీలో పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థులు నిర్దేశించిన సమయానికి గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ ఉద్యోగం ఎంపిక పరీక్ష మధ్యాహ్నం 12: 30కు ప్రారంభమవుతుందని, కాల వ్యవధి 90 నిమిషాలు ఉంటుందన్నారు. రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగ ఎంపిక పరీక్ష మధ్యాహ్నం 3: 30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు జరగాల్సిన పరీక్ష హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిలుపుదల చేసినట్లు పేర్కొన్నారు. తదుపరి హైకోర్టు ఆదేశాల మేరకు తేదీ వెల్లడిస్తామని చెప్పారు. అభ్యర్థుల వివరాలు జిల్లా కోర్టు వెబ్సైట్లో పొందుపరుస్తామన్నారు. అర్హులైన వారికి హాల్ టికెట్లు రాకపోతే అనంతపురం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. నులి పురుగులను నులిమేద్దాం గార్లదిన్నె: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం నిర్వహిస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ స్టేట్ మానిటరింగ్ అధికారి డాక్టర్ అనిల్కుమార్ తెలిపారు. 1 – 19 ఏళ్లలోపు ఉన్న పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. సోమవారం గార్లదిన్నె కేజీబీవీలో నులి పురుగుల నివారణ మందుల పంపిణీ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిల్కుమార్ మాట్లాడుతూ 19 ఏళ్లలోపు పిల్లలకు ఆల్బెండ జోల్ మాత్రలు వేయడం ద్వారా పేగుల్లోని పురుగులను నిర్మూలించి, రక్తహీనత, పోషకాహార లోపాన్ని అరికట్టవచ్చని చెప్పారు. కార్యక్రమంలో యూనిసెఫ్ మెంబర్ డాక్టర్ నాగేంద్ర, డాక్టర్ విష్ణు, డాక్టర్ నారాయణస్వామి, గార్లదిన్నె పీహెచ్సీ డాక్టర్ ఉదయ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బందులు రానీయొద్దు అమరాపురం: హేమావతి సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించే అగ్నిగుండ ఉత్సవానికి విచ్చేసే భక్తులకు ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ సతీష్కుమార్ పోలీసులకు సూచించారు. సోమవారం ఆయన సిద్ధేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం సీఐ రాజ్కుమార్, ఎస్ఐ వలిబాషా, సిబ్బందితో పాటు ఉత్సవ కమిటీ చైర్మన్ కరేగౌడతో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, చిన్నారుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుచేయాలన్నారు. ట్రాఫిక్ క్రమబద్దీ కరణ, ప్రసాదం కౌంటర్లు, అన్న ప్రసాద పంపిణీని ప్రత్యక్షంగా పరిశీలించారు. -
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి
తాడిపత్రి రూరల్: కంది, పప్పుశనగ, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ రైతులు సోమవారం తాడిపత్రి మార్కెట్ యార్డు వద్ద ఆందోళన చేశారు. రైతు సంఘం నాయకులు, రైతులు మాట్లాడుతూ దళారులు తక్కువ ధరకే పంట కొనుగోలు చేస్తూ దోపిడీ చేస్తున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే మద్దతు ధరతో వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మార్కెట్ యార్డు అధికారికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి రాజారామిరెడ్డి, అధ్యక్షుడు నాగరాజు, జిల్లా కమిటీ సభ్యుడు వెంకటేష్, రైతులు జయశంకర్రెడ్డి, కులశేఖర్రెడ్డి, వెంకటరమణ, మల్లికార్జునరెడ్డి, రాజేశ్వరనాయుడు, సాయినాథ్రెడ్డి, వెంకటప్రసాద్నాయుడు, చౌడయ్య, రామలింగం పాల్గొన్నారు. -
పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
అనంతపురం అర్బన్: పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్షించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పదో తరగతి పరీక్షలు, మార్చి 16 నుంచి 28 వరకు ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీఓఎస్ఎస్) పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లావ్యాప్తంగా 592 పాఠశాలలకు చెందిన 33,260 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాస్తుండగా, 71 ఓపెన్ స్కూల్కు సంబంధించి 1,045 మంది విద్యార్థులు 143 కేంద్రాల్లో పరీక్షలు రాయనున్నారన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ‘ఓపెన్’ ఇంటర్ పరీక్షలు ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 2 నుంచి 13 వరకు జరగనున్నాయని కలెక్టర్ తెలిపారు. 38 ఓపెన్ ఇంటర్మీడియెట్ స్కూల్స్ నుంచి 2,479 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. తొమ్మిది కేంద్రాల్లో నిర్వహించే పరీక్షలు సజావుగా జరిలేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక బస్సులు నడపాలి పరీక్షల సందర్భంగా విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేకంగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వేసవి దృష్ట్యా విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని, విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద ఒక ఏఎన్ఎం, ఫస్ట్ ఎయిడ్ కిట్ కచ్చితంగా ఉండాలన్నారు. కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ మలోల, డీఈఓ ప్రసాద్బాబు, పరీక్షల నిర్వహణ కమిటీ, ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి వెంకటరమణ నాయక్, నగర పాలక సంస్థ కమిషనర్ జశ్వంత్రావు, ఆర్టీసీ ఆర్ఎం శ్రీలక్ష్మి, నగర పాలక ఈఈ షాకీర్, బీసీ వెల్ఫేర్ డీడీ కుష్బు కొఠారి, కార్మి శాఖ డీసీ లక్ష్మీనరసయ్య, ఏపీఎస్పీడీసీఎల్ ఏఈ మహబూబ్బాషా తదితరులు పాల్గొన్నారు. ప్రతి విద్యార్థికీ ఆల్బెండజోల్ మాత్ర వేయాలి నులిపురుగుల నిర్మూలన కోసం ప్రతి విద్యార్థికీ నిర్దేశించిన మోతాదు మేరకు అల్బెండజోల్ మాత్ర వేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నుంచి ఈ నెల 24 వరకు చేపట్టనున్న డీ వార్మింగ్ డే పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. పిల్లల్లో నులిపురుగుల కారణంగా వివిధ ఆరోగ్య సమస్యలు వస్తాయన్నారు. జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు ఉన్న పిల్లలు 5,99,852 మంది ఉన్నారన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా మంగళవారం అన్ని విద్యాసంస్థల్లోనూ విద్యార్థులందరికీ తప్పనిసరిగా అల్బెండజోల్ మాత్రలు వేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల, ఐడీఎస్పీ నోడల్ అధికారి సురేంద్రరెడ్డి, ఆర్బీఎస్కే నోడల్ అధికారి విష్ణుమూర్తి, జిల్లా ప్రోగ్రాం అధికారి రజిత, డీఈఓ ప్రసాద్బాబు, నగర పాలక సంస్థ కమిషనర్ జశ్వంత్రావు, డీఎంఓ ఓబులు, ఆర్ఐఓ వెంకటరమణనాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సమ్మెలోకి ‘సహకార’ ఉద్యోగులు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పరిధిలో పనిచేస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్–సొసైటీ) ఉద్యోగులు సోమవారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నారు. దీని కారణంగా సొసైటీల్లో కార్యకలాపాలు నిలిచిపోతున్నాయి. పంట రుణాలు, భూములపై వ్యక్తిగత రుణాలు, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల పంపిణీ ఆగిపోనున్నాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో ఉన్న 110 సొసైటీ ఉద్యోగుల సమ్మె వల్ల డీసీసీబీ సేవలకు అంతరాయం ఏర్పడే పరిస్థితి ఉన్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు పాలనలో పోరుబాట.. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నుంచి పీఏసీఎస్ ఉద్యోగులు డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టారు. 18 నెలలుగా దశల వారీ ఉద్యమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర సహకార బ్యాంకు (ఆప్కాబ్) కమిషనర్ దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లినా సానుకూల స్పందన కనిపించలేదు. దీంతో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సోమవారం నుంచి ఉద్యోగులు సమ్మెలోకి వెళుతున్నారు. డీసీవో, డీసీసీబీ, ఆప్కాబ్ కమిషనర్ కార్యాలయాల వద్ద వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,060 సొసైటీల ఉద్యోగులు దాదాపు 9 వేల మంది రాష్ట్ర కమిషనర్ కార్యాలయం ఎదుట 13 రోజుల పాటు వంటావార్పుతో పెద్ద ఎత్తున నిరసనతో పాటు ముట్టడి చేపట్టినా చలనం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో సమ్మె నోటీసు ఇచ్చినట్లు సొసైటీ వర్గాలు తెలిపాయి. ఇక తమ సమస్యలకు పరిష్కారం లభించేదాకా ఎన్ని రోజులైనా నిరవధిక సమ్మెలో ఉంటామని జేఏసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. జీవో 36 అమలు చేయాలి.. ప్రధానంగా జీవో 36 అమలు చేయాలని, 2019, 2024 పీఆర్సీ ఇవ్వాలని, లేదంటే 50 శాతం తగ్గకుండా మధ్యంతర భృతి ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రూ.2 లక్షల గ్రాట్యుటీ సీలింగ్ ఎత్తివేయాలని, 2019 తర్వాత చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, రిటైర్డు వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, లాభనష్టాలతో సంబంధం లేకుండా సంఘాల ఉద్యోగుల జీతాలు చెల్లించాలని, రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, రూ.20 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో సమ్మెకు వెళుతున్నట్లు పీఏసీఎస్ ఉద్యోగుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులు, అసోసియేట్ ప్రెసిడెంట్ పి.హనుమంతరెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాసులు, కోశాధికారి ఎం.హనుమంతరెడ్డి తదితరులు తెలిపారు. నేటి నుంచి మూతపడనున్న సొసైటీలు నిలిచిపోనున్న రైతు రుణాలు, ఎరువుల పంపిణీ -
నేటి ‘పరిష్కార వేదిక’ రద్దు
అనంతపురం అర్బన్: కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సోమవారం నిర్వహించాల్సిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ను రద్దు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో మంత్రులు, కార్యదర్శులతో బిల్గేట్స్ బృందం సమావేశం కారణంగా పై కార్యక్రమాలను రద్దు చేసినట్లు ప్రకటించారు. కాన్ఫరెన్స్ కారణంగా జిల్లాస్థాయితో పాటు మండల, డివిజన్ స్థాయలోనూ రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అర్జీలు ఇచ్చేందుకు వ్యయప్రయాసలకోర్చి రావద్దని సూచించారు. వర్చువల్గా హాజరవ్వాలి బిల్గేట్స్ బృందంతో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంత్రులు, కార్యదర్శులతో జరగనున్న సమావేశానికి కలెక్టరేట్ నుంచి తనతో పాటు జిల్లా అధికారుల బృందం పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. ఆర్డీఓలు, మండలస్థాయి అధికారులు వర్చువల్గా హాజరు కావాలని ఆదేశించారు. టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీ విజేత ‘గంజికుంట ఈగల్స్’ వజ్రకరూరు: రాష్ట్రస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీ విజేతగా గంజికుంట ఈగల్స్ జట్టు నిలిచింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గంజికుంటలో గ్రామపెద్దల ఆధ్వర్యంలో జనవరి 14న రాష్ట్ర స్థాయి 8వ టెన్నిస్బాల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 86 జట్లు పాల్గొన్నాయి. ఆదివారం గంజికుంట ఈగల్స్ జట్టు, హోతూరు రాజా లెవెన్స్ జట్టు ఫైనల్లో తలపడ్డాయి. హోతూరు రాజా లెవెన్స్ జట్టు నిర్ణీత 16 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 128 పరుగులుచేసింది. అనంతరం గంజికుంట ఈగల్స్ జట్టు 13.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసి విజయం సాధించి, ట్రోఫీ కై వసం చేసుకుంది. మెరుపు ఇన్నింగ్స్ ఆడి 75 పరుగులు చేసిన గంజికుంట ఈగల్స్ బ్యాటర్ అసురకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇక టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రతిభ కనబరచిన సూర్య (హోతూరు రాజా జట్టు ఆటగాడు సూర్య మ్యాన్ ఆఫ్ ద సిరీస్ దక్కింది. ఎన్ఆర్ఏఐఎన్ హార్వేస్టింగ్ మిషన్ డీలర్ సుధాకర్ సోదరులు రూ.60 వేల నగదు బహుమతితోపాటు ట్రోఫీ అందించారు. రన్నరప్గా నిలిచిన హోతూరు రాజా లెవెన్స్ జట్టుకు గ్రామానికి చెందిన హాజీ సోదరులు రూ.30 వేల నగదు బహుమతితో పాటు కప్ అందజేశారు. మూడో స్థానంలో నిలిచిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ జట్టుకు గ్రామానికి చెందిన బీఆర్.అంబేద్కర్ కమిటీ వారు రూ.10వేల నగదు, కప్ అందజేశారు. కార్యక్రమంలో జీసీసీ గౌరవాధ్యక్షుడు బీపీ వీరప్ప, సర్పంచ్ జయేంద్రరెడ్డి, కార్యవర్గసభ్యులు జక్కల శ్రీని వాసులు, ఆవుల కుళ్లాయప్ప, ప్రదీప్, ఓబుళపతి, ఆర్గనైజర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అంతా మా ఇష్టం.. ● రెడ్డిచెరువుపల్లిలో టీడీపీ నేతల బరితెగింపు సాక్షి, పుట్టపర్తి: గోరంట్ల మండలం రెడ్డిచెరువుపల్లిలో టీడీపీ నేతలు బరితెగించారు. ఆదాయం కోసం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. గ్రామంలో బాగున్న పాఠశాల భవనాన్ని కూల్చి వేసి ఆగమేఘాలపై అక్కడ పంచాయతీ భవన నిర్మాణాన్ని చేపట్టారు. పాఠశాల భవనాన్ని కూల్చివేసేందుకు.. కొత్తగా పంచాయతీ భవన నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి సవిత ప్రోద్బలంతోనే ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు చెబుతుండడం గమనార్హం. పంచాయితీ భవన నిర్మాణం కోసం వేస్తున్న బేస్మెంట్ బలంగా లేదని, నాసిరకంగా నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
జయహో.. భారత్
పాక్పై విజయంతో అభిమానుల సంబరాలు అనంతపురం కార్పొరేషన్: చిరకాల ప్రత్యర్థి పాక్పై భారత్ ఎప్పుడు విజయం సాధించినా అభిమానుల్లో పట్టలేని ఆనందం. టి20 వరల్డ్ కప్లో భాగంగా ఆదివారం భారత్– పాక్ మధ్య మ్యాచ్ జరిగింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. జిల్లా కేంద్రంలో అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. సప్తగిరి సర్కిల్, టవర్క్లాక్ తదితర ప్రాంతాల్లోకి భారీగా చేరుకున్నారు. యువత బైక్ నడుపుతూ పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు. మరికొందరు జాతీయ జెండాను పట్టుకుని సందడి చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. -
●పరమేశ్వరా... పాహిమాం!
మహాశివరాత్రి వేడుకలు అంబరమంటాయి. జిల్లా అంతటా ఆదివారం శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. ఓం నమఃశివాయ, హరహర మహాదేవ శంభో శంకర.. నామస్మరణతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. ఉదయం నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. పార్వతీ పరమేశ్వరుల కల్యాణోత్సవం కమనీయంగా సాగింది. మహా శివరాత్రి పర్వదిన ప్రాముఖ్యతను పండితులు వివరించారు. భక్తులు ఉపవాస దీక్షతో పాటు రాత్రంతా జాగారం చేసి పరమ శివుని సేవలో తరించారు. ఆలయాలతో పాటు ప్రత్యేక శిబిరాల వద్ద మహాశివరాత్రి వేడుకలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. – అనంతపురం కల్చరల్ -
అప్పుల ఊబిలోకి నెట్టే బడ్జెట్
ఉరవకొండ: అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్ రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టే విధంగా ఉందని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన అనంతపురంలోని తన స్వగృహంలో రాష్ట్ర బడ్జెట్పై మీడియాతో మాట్లాడారు. రూ.3.32 లక్షల కోట్ల వార్షిక బడ్జెట్లో తాజాగా రూ.లక్ష కోట్ల వరకు అప్పులు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా తేటతెల్లం చేశారన్నారు. నిధులు ఎలా తెస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ద్రవ్యలోటు కూడా ఈస్థాయిలో ఎన్నడూ చూడలేదన్నారు. ఆర్థికవేత్తలు సైతం రాష్ట్ర బడ్జెట్ను చూసి విస్మయం వ్యక్తం చేస్తున్నారని, ఇది మరింత అప్పుల ఊబిలో నెట్టే బడ్జెట్గా ప్రజలు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. ఆర్థిక మంత్రి కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో పచ్చి అబద్ధాలతో మభ్యపెట్టారన్నారు. గ్లోబల్ హార్టికల్చర్ హబ్ అంటున్న ప్రభుత్వం.. హర్టికల్చర్ రైతులకు ఏం చేశారో చెప్పాలన్నారు. బడ్జెట్లో ధరల స్థిరీకరణ నిధికి రూ.500 కోట్లు మాత్రమే కేటాయించారంటే రైతుల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందన్నారు. ప్రభుత్వ హామీలు అరకొరగా సాగుతున్నట్టే బడ్జెట్ కూడా అరకొరగానే అమలు జరుగుతుందన్నారు. ఇప్పటికే రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని, సూపర్ సిక్స్ హామీలు కూడా ప్రజల ఆలోచనల నుంచి తొలగించాలన్న భావనతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. విద్య, వైద్యంతో పాటు గ్రామీణ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారన్నారు. గత వైఎస్ జగన్ పాలనను విమర్శించడంతోనే చంద్రబాబు ప్రభుత్వానికి సమయం సరిపోతోందన్నారు. ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్ రూ.2.75లక్షల కోట్లు సంక్షేమ పథకాల ద్వారా ప్రజల ఖాతాలకు నేరుగా అందించారని గుర్తు చేశారు. ప్రజల కొనుగోలు శక్తి పెంచి ఆర్థికంగా వారిని బలోపేతం చేశారన్నారు. రైతులకు రైతు భరోసా, ఇన్సూరెన్స్ లాంటివి అందించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం తన మూడవ బడ్జెట్లో కూడా సూపర్ సిక్స్ హామీలకు మొండి చెయ్యి చూపిందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర బడ్జెట్పై వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి ధ్వజం -
సేవాలాల్ మార్గంలో పయనించాలి
గుత్తి రూరల్: సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సూచించారు. సేవాగఢ్లో మూడు రోజులుగా జరుగుతున్న సేవాలాల్ మహరాజ్ 287వ జయంత్యుత్సవాలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు ప్రాకారోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకుడు మారుతీప్రసాద్ ఆధ్వర్యంలో ఉదయం నుంచి స్వామివారికి సుప్రభాతం, పంచామృతాభిషేకం, అర్చన, మహా మంగళహారతితో పాటు ప్రత్యేక పూజలు చేశారు. సేవాలాల్ మహరాజ్కు కుంభాభిషేకం జరిపించారు. ఉత్సవ విగ్రహాన్ని తోలారం గుర్రంపై ఊరేగించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సేవాలాల్ మాలధారులు ఇరుముడులు సమర్పించారు. ఆలయం ఎదుట ఉన్న హోమం కట్టపై మహా భోగ్ (హోమం) నిర్వహించారు. 108 మంది కన్యలచే పూర్ణ గంగ కలశోత్సవం నిర్వహించారు. బంజారాలు సంప్రదాయ దుస్తులతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ప్రాకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జేసీ విష్ణుచరణ్ మాట్లాడుతూ సేవాగఢ్ ఎంతో పవిత్రమైన పుణ్య స్థలమన్నారు. సేవాలాల్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. ఆలయ అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. అనంతరం ఉత్సవాలు విజయవంతం కావడానికి సహకరించిన ప్రభుత్వ ఆధికారులను జేసీ అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ అప్పా వెంకటేష్, సంత్ సేవాలాల్ ట్రస్టు అధ్యక్షుడు జగన్నాథరావు, ఉపాధ్యక్షుడు కేశవనాయక్, సభ్యులు రవీంద్రనాయక్, అశ్వత్థనాయక్, సీఐ రామారావు, ఎస్ఐ అమీర్ఖాన్ పాల్గొన్నారు. ● సేవాగఢ్లోని సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ ఆలయాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ దర్శించుకున్నారు. మంత్రికి ట్రస్టు సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఆలయ ఆవరణలో జరిగిన మహాభోగ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ముగిసిన జయంత్యుత్సవాలు -
రెవెన్యూ క్లినిక్లో అందని భూ చికిత్స
అనంతపురం అర్బన్: భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘రెవెన్యూ క్లినిన్’లో అర్జీలకు మొక్కుబడిగా పరిష్కారం లభిస్తోంది. ఈ విషయాన్ని అధికారిక నివేదిక స్పష్టం చేస్తోంది. అందిన అర్జీలు వందల్లో ఉంటే పరిష్కరించిన అర్జీలు పదుల సంఖ్యలో ఉండడం గమనార్హం. గత ఏడాది డిసెంబర్ 26న రెవెన్యూ క్లినిక్ ప్రారంభించారు. ప్రతి సోమవారం పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ను కూడా నిర్వహిస్తున్నారు. భూ సమస్యలపై అప్పటి నుంచి అంటే దాదాపు రెండు నెలల వ్యవధిలో అందిన అర్జీల సంఖ్య 944 కాగా.. పరిష్కరించిన అర్జీలు 59గా నివేదికలో పేర్కొన్నారు. 95 శాతం మండలస్థాయివే.. రెవెన్యూ క్లినిక్లో అందుతున్న అర్జీల్లో 95 శాతం మండలస్థాయిలో పరిష్కారం కావాల్సినవే ఉంటున్నాయి. ఇప్పటి వరకు అందిన 944 అర్జీల్లో జిల్లాస్థాయిలో పరిష్కారం కావాల్సినవి 48 మాత్రమే (22ఏ) ఉన్నాయి. మిగిలిన అన్ని సమస్యలూ తహసీల్దారు స్థాయిలో పరిష్కరించాల్సినే కావడం గమనార్హం. సత్వర పరిష్కారం ఎక్కడ..? భూ సమస్యలపై అర్జీలను మండలస్థాయిలో స్వీకరించినా.. మండలస్థాయి యంత్రాంగం జిల్లా కేంద్రానికి వచ్చి ఇక్కడ తీసుకున్నా... పరిష్కారం కల్పించడంలో జరుగుతున్న జాప్యంలో ఎలాంటి మార్పూ లేదు. అర్జీలకు సత్వర పరిష్కారం కనిపించడం లేదు. ఇప్పటి వరకు అందిన వాటిలో 687 అర్జీల పరిషారానికి చర్యలు తీసుకున్నామంటూ (యాక్షన్ టు బీ టేకెన్) చూపిస్తున్నారు. అవి ఎప్పటికి పరిష్కరిస్తారనేది అధికారులకే తెలియాలి. మిగిలిన వాటిలో 12 జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (డీఎల్ఎస్ఏ)కు పంపించారు. సచివాలయాలకు 89 పంపగా, ఆన్లైన్ రెవెన్యూ కోర్టు మేనేజ్మెంట్ కింద 49 రిజిస్టర్ చేశారు. సివిల్ వివాదాలకు సంబంధించి 48 సమస్యలు ఉన్నాయి. మండలం, డివిజన్ను వదిలేసి.. ప్రజల నుంచి వారి సమస్యలపై అర్జీలు స్వీకరించేందు కోసం ప్రత్యేకంగా ప్రతి సోమవారం మండల, డివిజన్, జిల్లాస్థాయిలో పరిష్కార వేదిక నిర్వహిస్తున్నారు. అయితే రెవెన్యూ క్లినిక్ను ప్రారంభించిన తరువాత సోమవారం రోజున తహసీల్దార్లు మండలాన్ని.. ఆర్డీఓలు డివిజన్ను వదిలేసి సిబ్బందితో జిల్లా కేంద్రానికి వస్తున్నారు. దీంతో మండలస్థాయిలో అర్జీల స్వీకరణ బాధ్యతను డిప్యూటీ తహసీల్దారుకు అప్పగిస్తున్నారు. మండలంలో తహసీల్దారు లేకపోవడంతో అక్కడికి వెళ్లినా ప్రయోజనం లేదంటూ ప్రజలు వ్యయప్రయాసలకోర్చి తప్పనిసరై జిల్లా కేంద్రానికి వస్తున్నారు. భూ సమస్యలపై వినతుల వెల్లువ రెండు నెలల్లో అర్జీలు 944, పరిష్కారం 59 మాత్రమే ఐదు మండలాల నుంచే 370 అర్జీలు -
తప్పుల తడకగా ‘డ్యాష్ బోర్డు’
మోసపూరిత బడ్జెట్ సీఎం చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పసలేదు. అబద్ధపు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం అంకెల గారడీతో ప్రజలను మోసం చేస్తోంది. సూపర్సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500, యువతకు నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేకపోవడం సిగ్గుచేటు. పెండింగ్లో ఉన్న ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్ షిప్ బకాయిల చెల్లింపులకు అరకొరగా నిధులు కేటాయించి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాట మాడుతోంది. అన్నదాతను ఆదుకునే ఆలోచనే ఈ ప్రభుత్వానికి లేదని బడ్జెట్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఉద్యోగులకు సంబంధించి ఐఆర్, వేతన సవరణ, పెండింగ్ బకాయిల నిధుల గురించి ప్రస్తావించకుండా వారిని కూడా మోసం చేశారు. – వై.వెంకటరామిరెడ్డి, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే యువతను దగా చేస్తున్న ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం యువతను దగా చేస్తోంది. రాష్ట్ర బడ్జెట్లో నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించకపోవడం... జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం మోసానికి పరాకాష్ట. ఎన్నికల సమయంలో యువతకు స్పష్టమైన హామీలు ఇచ్చిన చంద్రబాబు... అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని అమలు చేకుండా మోసం చేస్తున్నారు. ఏటా జనవరి 1న జాబ్క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పడంతో ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువత కోచింగ్ కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యం.. నిరుద్యోగ యువతను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఉద్యోగ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతి హామీల అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం. – సంతోష్ , ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కడుపునొప్పి తాళలేక యువకుడి ఆత్మహత్య గుంతకల్లు రూరల్: కడుపునొప్పి తాళలేక ఇర్ఫాన్ (18) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం గుంతకల్లులో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు .. స్థానిక కసాపురం రోడ్డులో అయ్యప్పస్వామి దేవాలయం ముందు భాగంలో నివాసం ఉంటున్న రహిమాన్, ఖాశీంబీ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రులు హోటల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పెద్ద కుమారుడు కియాలో పని చేస్తుండగా చిన్న కుమారుడైన ఇర్ఫాన్ ఇంటర్ ఫెయిల్ కావడంతో రెండేళ్లుగా ఇంటివద్దనే ఉంటున్నాడు. గత కొద్ది కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈక్రమంలో ఈనెల 13న రహిమాన్, ఖాశీంబీ తమ బంధువుల ఇంటికి కర్నూలుకు వెళ్లి శనివారం అర్ధరాత్రి సమయంలో తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇంటి బయట నుంచి ఎంత పిలిచినా కుమారుడు తలుపు తీయలేదు. అనుమానం కలిగిన తల్లిదండ్రులు తలుపు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా కుమారుడు ఉరి తాడుకు వేళాడుతూ విగత జీవిగా కనిపించాడు. ఆదివారం ఉదయం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కసాపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అనంతపురం క్రైం: ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు తెరిస్తే చాలు కాగిత రహిత పాలన అంటూ ఊదర కొడుతుంటారు. అయితే ఆయన మాటలకు చేతలకు ఏం సంబంధం ఉండదని ఎన్నోసార్లు రుజువైంది. కమిషనర్, డ్రైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) డ్యాష్బోర్డ్ కూడా దాన్నే స్పష్టం చేస్తోంది. ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సేవల వివరాలను ఎప్పటికప్పుడు డ్యాష్ బోర్డులో అందుబాటులో ఉంచాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ వివరాలన్నీ సమగ్రంగా పొందుపరిచేవారు. సచివాలయాల వ్యవస్థను తీసుకువచ్చాక, ఈ పరిస్థితి మరింత మెరుగ్గా సాగింది. అయితే కూటమి ప్రభుత్వంలో డ్యాష్ బోర్డు తప్పుల తడకగా మారింది. సిబ్బంది ఉన్నా హాజరు శాతం సున్నా... డ్యాష్బోర్డ్లో నమోదువుతున్న యూఎల్బీ హాజరు గణాంకాలు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో శానిటేషన్ విభాగం పనితీరుపై సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి. అనంతపురం నగరంలో శానిటేషన్ విభాగంలో మొత్తం 586 మంది సిబ్బంది ఉండగా హాజరులో 0 శాతంగా చూపించారు. ఇందులో 450 మంది పీహెచ్ వర్కర్లు, 35 మంది డ్రైవర్లు, 60 మంది లోడర్లు, 41 మంది సూపర్ వైజర్లు ఉన్నారు. గుత్తి 92 మంది, గుంతకల్ 200 మంది, కళ్యాణదుర్గం 57 మంది, రాయదుర్గం 128 మంది, తాడిపత్రి 172 మంది ఉన్నా జీరో శాతంగా నమోదైంది. ఇదే పరిస్థితే శ్రీసత్యసాయి జిల్లాలోనూ కనిపిస్తోంది. ధర్మవరం 198 మంది, హిందూపురం 314 మంది, కదిరి 175 మంది, మడకశిర 29 మంది, పుట్టపర్తి 62 మంది ఉన్నా సిబ్బంది హాజరు శాతం సున్నాగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతోనే.. వందలాది మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ హాజరు నమోదు లేకపోవడం శానిటేషన్ సేవలు స్తంభించాయా లేక అటెండెన్స్ నమోదు చేయలేదా అన్న అనుమానాలకు తావిస్తోంది. ఈ గణాంకాలు పూర్తిస్థాయిలో అప్డేట్ కాలేదని భావించినా కార్యాలయాల్లో ఏరోజుకారోజు నమోదు చేయాల్సిన సిబ్బంది హాజరు వివరాలపై నిర్లక్ష్యంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. బయోమెట్రిక్ లేదా ఆ్లైన్ అటెండెన్స్ వ్యవస్థ సక్రమంగా పర్యవేక్షించకపోవడం, స్థానిక స్థాయిలో అధికారులు రోజువారీ సమీక్షలు చేయకపోవడం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఇలా జరుగుతోందని అంటున్నారు. కీలక సేవలపై ప్రతికూల ప్రభావం శానిటేషన్ సిబ్బంది హాజరును సున్నాగా చూపబడటంతో చెత్త సేకరణ, డ్రైనేజీ శుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణ వంటి కీలక సేవలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా దోమల వ్యాప్తి, చెత్త పేరుకుపోవడం, సంక్రమణ వ్యాధుల ప్రమాదం పెరగవచ్చు. అందువల్ల సీడీఎంఏ స్థాయిలోనే తక్షణ సమీక్ష నిర్వహించి, రోజువారీ హాజరు నమోదు తప్పనిసరి చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవడం అవసరం. డ్యాష్బోర్డ్లోని గణాంకాలు కేవలం సంఖ్యలు కాకుండా పట్టణ శుభ్రత వ్యవస్థలో ఉన్న లోపాలను బహిర్గతం చేస్తున్న హెచ్చరిక సంకేతాలుగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిండు ప్రాణాన్ని బలిగొన్న యూటర్న్పోటాపోటీగా రాతి దూలం పోటీలు సీడీఎంఏ డ్యాష్బోర్డులో శానిటేషన్ సిబ్బంది హాజరు చూపని అధికారులు కీలక సేవలపై ప్రతికూల ప్రభావం పట్టించుకోని ఉన్నతాధికారులు రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి -
శభాష్ విష్ణు భగవాన్
యాడికి: మండలంలో పోలీసు కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న విష్ణు భగవాన్ 22 ఏళ్లుగా నాణేలను సేకరిస్తూ అందరి మన్ననలనూ పొందుతున్నారు. దక్షిణ భారతదేశంలో విజయనగర రాజుల పాలన అప్రతిహతంగా సాగింది. తుంగభద్ర నదీ తీరాన సంగమ, సాళువ, తుళువ, ఆరవీడు రాజ వంశాలు పాలించాయి. తుళువ వంశస్తుడైన కృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థాయికి చేరుకుంది. విజయ నగర కాలంలో బంగారు నాణేలను చలామణి చేశారు. మొదటి హరిహర రాయలుగా బుక్కరాయలు, రెండో హరిహర రాయలుగా శ్రీకృష్ణ దేవరాయలు, చివరిగా చంద్రకోటను పాలించిన వెంకటపతిరాయలు బంగారు నాణేలను వినియోగించారు. ఈ అపురూపమైన బంగారు నాణేలను విష్ణు భవగాన్ ఎంతో కష్టపడి సేకరించారు. వివిధ పాఠశాలలు, కళాశాలల్లో పుర ప్రజలు, విద్యార్థులు కోసం ఉచితంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆదివారం మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఆనాడు కర్ణాటక రాష్ట్రంలో ఒక వైపు శివపార్వతులు, మరో వైపు ప్రతాప దేవరాయులు ఉన్న బంగారు నాణాన్ని యాడికిలో ప్రదర్శించారు. 22 ఏళ్లుగా నాణేల సేకరణ ఉచిత ప్రదర్శనల ద్వారా ఆదర్శం -
పాముకాటుతో రైతు మృతి
పుట్టపర్తి టౌన్: పాముకాటుతో యవ రైతు మురళీ (35) మృతి చెందిన సంఘటన పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధి రాయలవారిపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాయలవారిపల్లికి చెందిన రామప్ప, చిన్నాగమ్మ దంపతుల కుమారుడు మురళీ తన పొలంలో దోస పంట సాగు చేశారు. ఆదివారం ఉదయం తన భార్యతో కలసి తన పొలంలో వేసిన దోస పంటకు మందుల పిచికారీకి వెళ్లాడు. పని ముగించుకొని మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసిన అనంతరం వాంతులు, వీరేచనాలు కావడంలో కుటుంబ సభ్యులు వెంటనే సత్యసాయి సూపర్ ఆస్పత్రికి తరలించారు. వైద్యం చేస్తుండగానే మృతి చెందారు. పాము కాటుతో మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. -
ఆటో బోల్తా.. ఒకరి మృతి
రాయదుర్గంటౌన్: మండల పరిధిలోని భూపసముద్రం వద్ద అనంతపురం ప్రధాన రహదారిపై ఆదివారం సాయంత్రం ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు చనిపోయాగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా కర్ణాటకలోని నాయకనహట్టి పంచాయితీ పరిధిలోని మల్లూరహళ్లి గ్రామవాసులు. ఒకే కుటుంబానికి చెందిన 14 మంది సభ్యులు మల్లూరుహళ్లి గ్రామం నుంచి డీజల్ ఆటోలో రాయదుర్గం మండలం జుంజుంరాపల్లి గ్రామంలోని చిత్రకొండపై వెలసిన అరుడ మల్లేశ్వరస్వామి ఆలయంలో జరిగే శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొనేందుకు బయల్దేరారు. అయితే భూపసముద్రం వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్కు సైడ్ ఇచ్చే క్రమంలో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఉచ్చప్ప (50) మృతి చెందారు. అలాగే రమేష్ (6) తీవ్ర రక్తగాయాలు కాగా సంగీత (22)కు స్వల్ప గాయాలయ్యాయి. ఆటోలో ప్రయాణిస్తున్న మిగతా ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. రమేష్ కూడా పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వైదులు సిఫార్సు చేయడంతో క్షతగాత్రులను కర్ణాటకలోని చిత్రదుర్గంకు తరలించారు. ఈ ఘటనపై ఎస్ఐ ప్రసాద్ కేసు నమోదు చేసుకున్నారు. గాయపడిన బాలుడు రమేష్, మృతుడు ఉచ్చప్ప ఇద్దరికి గాయాలు -
ఇది డొల్ల బడ్జెట్
సంక్షేమం, అభివృద్ధి రెండూ లేని అప్పుల డొల్ల బడ్జెట్. అమరావతి నిర్మాణమే అన్ని సమస్యలకూ పరిష్కారమని రాష్ట్ర బడ్జెట్ తేల్చేయడం దారుణం. వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు కేటాయింపులో మొండి చేయి చూపించారు. ప్రాజెక్ట్లు పూర్తి చేయకుండా.. నీళ్లు లేకుండా రాయలసీమ హార్టికల్చర్ హబ్ ఎలా చేస్తారు? రాయలసీమలో కడప ఉక్కు, వెనకబడిన ప్రాంతాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ప్రస్తావనే లేదు. – కేవీ రమణ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
అపు‘రూపం’... పాదరస శివలింగం
● నేడు ఆలయంలో ప్రత్యేక పూజలురాయదుర్గంటౌన్: శివలింగం అంటే తెలియని వారు, చూడని వారు ఉండరు. అయితే పాదరస శివలింగాన్ని చూశారా అంటే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే పాదరసాన్ని ఘనరూపంలో చూడలేం కాబట్టి!. అయితే ఇలాంటి అపు‘రూప’మైన శింగలింగాన్ని రాయదుర్గం పట్టణంలోని శ్రీరాజ విద్యాశ్రమంలో చూడవచ్చు. దేశంలోనే ప్రథమంగా 1974లో అప్పటి ఆశ్రమ పీఠాధిపతి జీవన్ముక్తస్వాములు, జడసిద్దేశ్వర సరస్వతీ స్వాముల వారు రాయదుర్గంలో పాదరస శివలింగాన్ని ప్రతిష్టించారు. జీవన్ముక్తస్వామి రసవాదుల్ని పిలిపించి రెండు నెలలు అహర్నిశలు కృషి చేసి రుద్రమంత్ర జపాలతో ఏడు కిలోల పాదరసాన్ని మూలికాదులతో ఘనీభవింప చేసి లింగాకృతినిచ్చారు. ఈ శివలింగం 14 సెంటీమీటర్ల ఎత్తు, 25 సెంటీమీటర్ల చుట్టుకొలత కలిగి ఉంది. పాణిపటాన్ని మాత్రం నల్లరాతితో కర్ణాటకలోని రాణిబెన్నూరులో తయారు చేయించి ప్రతిష్టించారు. ఆదివారం శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. మహా శివరాత్రి రోజు శివలింగాన్ని తాకే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తారు. నీళ్లడిగి.. నిలువునా దోచి ● గుంతకల్లులో కి‘లేడీల’ బ్యాచ్ హల్చల్ గుంతకల్లుటౌన్: పట్టణంలో కిలాడీ మహిళల బ్యాచ్ హల్చల్ చేసింది. ఓ మహిళ ఇంటికి వెళ్లి నీళ్లు అడిగి.. ఆమెను మాటల్లో దించి నగలు, నగదుతో ఉడాయించింది. వివరాల్లోకెళితే... హౌసింగ్బోర్డు నాగసముద్రం బావి వీధికి చెందిన సరస్వతి రోజుమాదిరిగానే శనివారం ఉదయం ఆకుకూరలు అమ్ముకుని ఇంటికి చేరుకుంది. కొద్ది సేపటి తర్వాత ఆరుగురు మహిళలు ఆమె ఇంటికి వచ్చి తాగడానికి నీళ్లు కావాలని హిందీలో అడిగారు. నీరు తాగేందుకు గ్లాసులు ఇవ్వగా అందుకు వారు నిరాకరించి.. దోసిట్లో పోయాలని కోరారు. సరే అని నీరు పోస్తుండగా వారంతా చుట్టూ చేరి ఆమెతో మాటలు కలిపారు. ఆరుగురిలో ఒక మహిళ ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళాలు తెరిచి.. అందులో భద్రపరిచిన ఆరు గ్రాముల బంగారు కమ్మలు, 30 తులాల వెండి, రూ.5 వేల నగదుతో ఉడాయించింది. ఆ తర్వాత మిగిలిన ఐదుగురు మహిళలు అక్కడి నుంచి తప్పించుకున్నారు. కొద్దిసేపటి తరువాత ఇంట్లోకి వెళ్లి సరస్వతి చూడగా బీరువాలు తెరిచి ఉండటంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని, భర్త అంజికి సమాచారమిచ్చింది. నిందితులు మిల్లు ఏరియా మీదుగా వెళ్లినట్లు సమాచారం రావడంతో ఆ వైపు గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో బాధితులు పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. కాగా ఆరుగురు ముఠా సభ్యులు మహారాష్ట్ర సాంగ్లీ ప్రాంతానికి చెందిన వారని సమాచారం. -
ఎస్టీల సమస్యలపై నిర్లక్ష్యం వద్దు
● గిరిజనులకు విరివిగా రుణాలు అందించాలి ● జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్అనంతపురం ఎడ్యుకేషన్: ఎస్టీల సమస్యలపై నిర్లక్ష్యం ప్రదర్శించొద్దని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, గిరిజన నాయకులతో కలెక్టర్ ఓ.ఆనంద్, ఎస్పీ పి.జగదీష్, రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు పి. వెంకటప్పతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్టీ కమిషన్కు కొన్ని ఫిర్యాదులు వచ్చాయని, వాటిని కచ్చితంగా పరిష్కరించాలన్నారు. ఎస్టీ, ఎస్సీ కాలనీల్లో విద్యుత్ సౌకర్యాలు పూర్తి స్థాయిలో నాణ్యతగా కల్పించాలన్నారు. తండాల్లో రోడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆత్మకూరు మండలం మదిగుబ్బలో సుమారు 2 వేల మంది ప్రజలు ఉన్నారని, ఇప్పటిదాకా సరైన రోడ్డు సదుపాయం లేకపోవడం బాధాకరమన్నారు. వెంటనే రోడ్డు వేయాలని ఆదేశించారు. సేవాలాల్ జయంతికి రూ. 50 లక్షల నిధులు విడుదల చేశారని, మరిన్ని నిధులు విడుదల చేయాలన్నారు. మదిగుబ్బ గ్రామంలో ఫ్లోరైడ్ వాటర్ ఉందని, తండాకు పైప్ లైన్ ఏర్పాటు చేయలేదన్నారు. ఎస్టీలకు విరివిగా బ్యాంకు రుణాలు అందించాలన్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసిందన్నారు.కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కుసుమ్ అమలు మొదలైందన్నారు. ఎస్టీలకు పూర్తి స్థాయిలో పథకాల లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజన నాయకులు మాట్లాడుతూ సేవాగడ్ను టూరిజం హబ్గా అభివృద్ధి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ ఏ.మలోల, ఆర్డీఓ కేశవనాయుడు, డీటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు, సీపీఓ అశోక్ కుమార్, జెడ్పీ సీఈఓ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. గిరిజనులకు అండగా అంటాం రాప్తాడు రూరల్/ఆత్మకూరు: గిరిజనులకు అండగా ఉంటామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ అన్నారు. శనివారం ఆయన కురుగుంట సేవాలాల్ కాలనీతో పాటు ఆత్మకూరు మండలంలోని మదిగుబ్బ తండాలో పర్యటించారు. గిరిజనులతో సమావేశం నిర్వహించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎస్టీలు తమ సమస్యలను ncstgrams.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ నరసింహ, తహసీల్దార్లు మోహన్ కుమార్, లక్ష్మినాయక్, ఎంపీడీఓలు లక్ష్మినరసింహ, దివాకర్, ఏఐబీఎస్ఎస్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ బాన్నోత్ చక్రి నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
సేవాలాల్ను ఆదర్శంగా తీసుకోవాలి
గుత్తి రూరల్: దేశంలో ధర్మం, సమాజాభివృద్ధి, గో సంరక్షణకు పాటుపడి బంజారాల ముద్దు బిడ్డగా విరాజిల్లుతున్న సేవాలాల్ మహరాజ్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సంత్ శ్రీ సేవాలాల్ ట్రస్టు అధ్యక్షుడు జగన్నాథరావు, జాతీయ ఎస్టీ కమిషన్ జాటోత్ హుస్సేన్ నాయక్ పిలుపునిచ్చారు. గుత్తి మండలం చెర్లోపల్లి పంచాయతీ సేవాగఢ్లో శనివారం రాత్రి సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ 287వ జయంత్యుత్సవాలు ఘనంగా నిర్వహించారు. ట్రస్టు అధ్యక్షుడు జగన్నాథరావు జ్యోతి ప్రజ్వలన చేసి, టెంకాయ కొట్టి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్టు అధ్యక్షుడు మాట్లాడుతూ సేవాలాల్ మహరాజ్ జీవన విధానాన్ని గిరిజనులు అలవర్చుకోవాలన్నారు. జల్ (నీరు), జమీన్ (భూమి), జంగల్ (అడవి) అనే నినాదంతో సేవాలాల్ గిరిజనుల హక్కుల కోసం పోరాడారన్నారు. అంతటి మహనీయుని ఆలయం దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. సేవాగఢ్ను పవిత్ర పుణ్యక్షేత్రం చేసేందుకు కృషి చేస్తామన్నారు. బంజారా నాయకులతో కలసి విద్యా హబ్గా చేస్తామన్నారు. ట్రస్టు ఉపాధ్యక్షుడు కేశవనాయక్ మాట్లాడుతూ సేవాగఢ్ ఆలయ అభివృద్ధిని తాము ముందుండి నడిపిస్తామని చెప్పారు. ఇక్కడ బంజారా యూనివర్సిటీ, ఇంజినీరింగ్ కళాశాలతో పాటు పలు విద్యా సంస్థలను ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ఉత్సవాలకు వచ్చిన ముఖ్య అతిథులను బంజారాల సంప్రదాయ తలపాగ (పగిడి)లతో ప్రత్యేకంగా సన్మానించారు. సన్మార్గంలో నడవండి బంజారాలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సన్మార్గంలో నడవాలని భారత్ సాధు సమాజ్ గురూజీ చేతన్ గిరి మహరాజ్ సూచించారు. బంజారాలు ముందుగా సేవాలాల్ మహరాజ్ ఉత్సవ విగ్రహాలతో అలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం విగ్రహాన్ని ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలకు రాష్ట్రం నుంచే కాక తెలంగాణ, కర్ణాటక, మహరాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలి రావడంతో ఆలయ పరిసరాలన్ని కిటకిటలాడాయి. ఉత్సవాలలో వర్కింగ్ ప్రెసిడెంట్ రవీంద్రనాయక్, బంజారా ముఖ్యనేతలు అశ్వత్థనాయక్, శేఖర్నాయక్, హరిలాల్ నాయక్, ఠాగూర్ నాయక్, ఎంపీడీఓ ప్రభాకర్నాయక్, తహసీల్దార్ పుణ్యవతి, డిప్యూటీ ఎంపీడీఓ నరసింహారెడ్డి, ఫైర్ ఆఫీసర్ అశ్వర్థ, డీఎస్పీ శ్రీనివాస్, గుత్తి సీఐ రామారావు, ఎస్ఐలు సురేష్, అమీర్ఖాన్ ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షించారు. -
ఆర్డీటీని కాపాడుకుందాం
● ఉద్యమాలతోనే అది సాధ్యం ● చంద్రబాబు ప్రభుత్వం స్పందించాలి● రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు రమేష్ గౌడ్ ప్రసంగానికి అడుగడుగునా అడ్డంకులు రౌండ్ టేబుల్ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్గౌడ్ ప్రసంగానికి టీడీపీ నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. రమేష్గౌడ్ మాట్లాడుతూ ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రెన్యూవల్ చేయించడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దీనివల్ల ఉమ్మడి జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో పేదలకు సంస్థ సేవలు దూరమయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఈ క్రమంలో సుధాకర్ యాదవ్ జోక్యం చేసుకుని సమావేశాన్ని రసాభాసగా మార్చాడు. అతని తీరును సమావేశంలో పాల్గొన్న ఇతర పార్టీలు, ప్రజాసంఘాల నేతలు తప్పుబట్టారు. ‘వాస్తవాలు మాట్లాడితే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు? ఆర్డీటీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది నిజం కాదా?’ అంటూ నిలదీశారు. దీంతో సుధాకర్ యాదవ్ తోక ముడిచాడు. అనంతపురం టవర్క్లాక్: ఉద్యమాలు చేసైనా ఆర్డీటీని కాపాడుకుందామని వక్తలు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ప్రెస్క్లబ్లో సీపీఐ ఆధ్యర్యంలో అఖిల పక్ష నాయకుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు దేవరగుడి జగదీష్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఓ. నల్లప్ప, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, ముతవల్లి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షకీల్ షఫి, ఇస్సాక్, రాష్ట్ర కార్యదర్శి జాఫర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ మాట్లాడుతూ జిల్లాలో పేద పిల్లలను ఆర్డీటీ సంస్థ అక్కున చేర్చుకుని చదివించిందన్నారు. పేదల కోసం ఆసుపత్రులు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించారన్నారు. దివ్యాంగులకు సహాయ సహకారాలు అందించి వారిలో మనోధైర్యం నింపారన్నారు. క్రీడాభివృద్ధికి విశేష కృషి చేసి పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రోత్సహించారన్నారు. అటువంటి సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఆర్డీటీ కోసం ఏ కార్యక్రమాలు చేసినా వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తుందని తెలిపారు. సీఎం చంద్రబాబు స్పందించాలి.. మేయర్ వసీం మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆర్డీటీ ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరణ అంశంపై కేంద్రంతో మాట్లాడాలన్నారు. చంద్రబాబు రూ. 400 కోట్ల బడ్జెట్ కేటాయించి ఆర్డీటీని కాపాడాలన్నారు. డిప్యూటీ మేయర్ కోగటం విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేయించలేదన్నారు. వీధి పోరా టాలతో లక్ష్యం సాధించలేమని, చలో అమరావతికి పిలుపునివ్వాలని సూచించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఆర్డీటీ లేని అనంతపురం జిల్లాను ఊహించుకోలేమన్నారు. సంస్థకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించినా చంద్రబాబు ప్రభుత్వం తప్పు పడుతోందని విమర్శించారు. ఆర్డీటీని కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలకు నష్టం వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు దేవరగుడి జగదీష్ మాట్లాడుతూ ఆర్డీటీని కాపాడుకునేందుకు చేసే ఉద్యమాల్లో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొనాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప మాట్లాడుతూ బలమైన ఉద్యమాలతోనే ఆర్డీటీని కాపాడుకోగలమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి ఆర్డీటీని కాపాడాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి వేమన, పులి కిష్ట, మాజీ సైనిక అధికారి షేకన్న, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నాయకులు ఓబిరెడ్డి, కార్పొరేటర్ చంద్రలేఖ, నాయకురాలు కమర్ తాజ్, సీపీఐ నాయకుడు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
దామోదరం సంజీవయ్య గొప్ప నాయకుడు
అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య గొప్ప నాయకుడని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో దామోదరం సంజీవయ్య 105వ జయంత్యుత్సవం నిర్వహించారు. ముందుగా సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ 1920లో కుల వివక్ష ఎక్కువగా ఉండేదన్నారు. ఆ సమయంలో దామోదరం సంజీవయ్య పడిన కష్టాలు మాటల్లో చెప్పలేమన్నారు. పేద కుటుంబంలో జన్మించిన ఆయన ఎన్నో పదవులు చేపట్టారన్నారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు పి.వెంకటప్ప మాట్లాడుతూ పేద కుటుంబం నుంచి వచ్చిన గొప్ప వ్యక్తి దామోదరం సంజీవయ్య అని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు బాగా చదువుకోవాలన్నారు. డీఆర్ఓ మలోల మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య అడుగు జాడల్లో మనమందరం నడవాలన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ జశ్వంత్ రావు, నాయీబ్రాహ్మణ, పద్మశాలి, విశ్వబ్రాహ్మణ, బెస్త కార్పొరేషన్ల డైరెక్టర్లు ఆదినారాయణ, పి.లక్ష్మీ నరసింహులు, రంగాచారి, పవన్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ కుష్బూ కొఠారి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.రామ్మోహన్రెడ్డి, ఐఅండ్పీఆర్ డీఐపీఆర్ఓ ఎ.బాలకొండయ్య కుల సంఘాల నాయకులు దాస్, విద్యార్థులు పాల్గొన్నారు. రాడ్తో కొట్టి చైన్ లాక్కెళ్లాడు బుక్కరాయసముద్రం: మండల కేంద్రం బుక్కరాయసముద్రంలో శనివారం ఓ మహిళపై అగంతకుడు రాడ్తో దాడిచేసి, ఆమె మెడలోని బంగారు చైన్ను లాక్కెళ్లాడు. పోలీసులు తెలిపిన మేరకు... మండల కేంద్రానికి చెందిన ముత్యాల వెంకటేశు భార్య శ్రీదేవి నార్పల క్రాసింగ్లోని గాంధీనగర్ కాలనీ సమీపంలో టీ కేఫ్, క్యాంటీన్ నిర్వహిస్తోంది. శనివారం సాయంత్రం షాపులో ఉండగా ఓ అపరిచిత వ్యక్తి వచ్చి ఇనుప రాడ్డుతో తలపై, చేతలపై దాడిచేసి.. ఆమె మెడలో ఉన్న 4 తులాల బంగారు చైన్ లాక్కునిపోయాడు. స్థానికులు గమనించి దాడిలో గాయపడిన శ్రీదేవిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని సీఐ పుల్లయ్య, ఎస్ఐ రాంప్రసాద్ పరిశీలించారు. దుండగుడు లాక్కెళ్లిన బంగారు చైన్ రూ.6 లక్షల వరకు విలువ ఉంటుందని బాధితులు పేర్కొన్నారు. నిందుతుని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
ప్రభుత్వం వల్లే ఎఫ్సీఆర్ఏ ఆగిపోయింది
● ఆర్డీటీ సేవలు కొనసాగించాలి ● మాజీ ఎంపీ తలారి రంగయ్య బ్రహ్మసముద్రం: ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేదరికాన్ని పారదోలేందుకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్డీటీ సంస్థకు చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ కాకుండా ఆగిపోయిందని వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తలారి రంగయ్య దుయ్యబట్టారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ పునరుద్ధరించాలని, త్రిబుల్ ఇంజిన్ సర్కార్కు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ శనివారం బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లి వద్ద ఉన్న తిమ్మప్ప కొండకు వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి రంగయ్య మెట్ల మార్గంలో కాలినడన ‘సేవ్ ఆర్డీటీ’ నినాదంతో వెళ్లారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు తలారి రంగయ్య మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ఏప్రిల్ 21 నుంచి ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ అంశంలో ఇబ్బందులు తలెత్తాయన్నారు. అప్పటి నుంచి వైఎస్సార్సీపీ ప్రజల తరఫున ఆర్డీటీ సంస్థ కోసం పోరాటం చేస్తోందన్నారు. మే నెలలో బైక్ ర్యాలీ చేపట్టి నియోజకవర్గ ప్రజలను చైతన్యవంతులను చేశామని, జూన్లో పాదయాత్ర ద్వారా నేతలకు కనువిప్పు కలిగేలా చేశామని చెప్పారు. ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా 1969 నుంచి పేదరికాన్ని రూపుమాపుతున్న సంస్థపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కక్ష సాధింపునకు దిగాయన్నారు. రెన్యువల్ వస్తుందని చంద్రబాబు, లోకేష్తో చర్చించామని టీడీపీ నేతలు కల్లబొల్లి మాటలతో ప్రజలను మభ్య పెట్టారని మండిపడ్డారు. ఆర్డీటీ సేవలు ఆగిపోతే వైద్యం, వ్యవసాయ, మహిళా రంగాలకు తీరని నష్టం కలుగుతుందన్నారు. ప్రస్తుతం పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఏకతాటిపైకి వచ్చి ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ అంశంపై నిర్ణయం తీసుకోవాలన్నారు. లేని పక్షంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మరోసారి సేవ్ ఆర్డీటీ కార్యక్రమం పేరుతో శాంతియుత ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు ములకనూరు తిమ్మరాయుడు, దొడగట్ట నారాయణ, డాక్టర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బొమ్మయ్య, లీగల్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు హనుమంతరెడ్డి, యాక్టివిటీ జిల్లా కార్యదర్శి యర్రంపల్లి కృష్ణమూర్తి, యూత్ విభాగం రాష్ట్ర కార్యదర్శి రామాంజినేయులు, ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక కార్యదర్శి టైలర్ వన్నూరుస్వామి, పార్టీ కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం మండలాల కన్వీనర్లు గోళ్ల సూరి, పాలబండ్ల చంద్రశేఖర్రెడ్డి, ఎంపీపీలు చంద్రశేఖర్రెడ్డి, భీమేష్, సీనియర్ నాయకుడు వన్నూర్రెడ్డి, వివిధ విభాగాల తాలూకా అధ్యక్షులు నాగలక్ష్మి, అభిలాష్ రెడ్డి, నరసింహులు, తిప్పేస్వామి, నరేష్, రామిరెడ్డి, మంజు, భాస్కర్, మల్లికార్జున, పాండు, కై రేవు గంగాధర్, వైస్ ఎంపీపీ వెంకటేష్ నాయక్, గోపాల్ రెడ్డి, బసవరాజు, రాము, కేశవ్గౌడ్, కొండాపురం రాము, రామ్మోహన్, గంగాధర్, జిన్నా మల్లికార్జున, తిమ్మారెడ్డి, శంకర్ నాయక్, జానీ, మల్లికార్జునతో పాటు అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పేదల వ్యతిరేక బడ్జెట్
ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన 2026–2027 బడ్జెట్ పేదల వ్యతిరేక బడ్జెట్గా కనిపిస్తోంది. గత ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కన్నా ఎక్కువ సంక్షేమం అందిస్తామని చెప్పిన చంద్రబాబు, పవన్కళ్యాణ్.. చివరకు మేనిఫెస్టోలోని హామీలనే అమలు చేయలేని పరిస్థితికి వచ్చారు. ‘చంద్రబాబు వల్ల స్వర్ణాంధ్ర సాకారం అవుతోంది.. నారా లోకేష్ నాయకత్వంలో విద్యారంగం మెరుగవుతోంది.. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో గ్రామీణాభివృద్ధి పరుగు పెడుతోంది’ అంటూ డబ్బా కొట్టుకున్నారు. గడిచిన 20 నెలల్లో ఈ రాష్ట్రంలో స్వర్ణాంధ్ర కాదు.. నేరాంధ్ర.. అప్పులాంధ్ర.. కబ్జాంధ్ర.. దోపిడీ ఆంధ్రగా సాకారమైంది. ఏరుదాటే వరకు ఓడ మల్లన్న.. ఏరుదాటాక బోడిమల్లన్న అనేలా చంద్రబాబు పాలన సాగుతోంది. అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్రంలో 53.58 లక్షల మంది రైతులకు రూ.10,700 కోట్లు అవసరమైతే రూ.6600 కోట్లు మాత్రమే కేటాయించారు. 12వ పీఆర్సీ గురించి ప్రస్తావనే లేదు. 50 ఏళ్లకే పింఛన్ అమలు లేదు. నిరుద్యోగ భృతిపై అతీగతీ లేదు. హంద్రీ–నీవా ద్వారా 40 టీఎంసీల కృష్ణాజలాలను తొలిసారిగా తరలించామని పయ్యావుల కేశవ్ అసెంబ్లీ సాక్షిగా పచ్చి అపద్ధాలు చెప్పారు. రైతులు, యువత, విద్యార్థి, మహిళలు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు మరోసారి మోసం జరిగింది. – అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
యువతకు కుచ్చుటోపీ
‘రాష్ట్రంలో యువతకు 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తాం. లేకపోతే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తాం’ అంటూ సూపర్ సిక్స్లో భాగంగా హామీ ఇచ్చారు. 20 నెలలు దాటినా ఒక్క నిరుద్యోగికీ పైసా ఇవ్వలేదు. బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. అయినా సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా అమలు చేశామని ప్రసంగించడం యువతను వంచించడమే. గడిచిన కాలానికి గాను ప్రతి నిరుద్యోగికీ చంద్రబాబు ప్రభుత్వం రూ.60 వేలు బాకీ పడింది. – సాకే చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు -
నిరాశ మిగిల్చిన బడ్జెట్
జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఉదయం చలి వాతావరణం కొనసాగింది. ఆగ్నేయం దిశగా గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. మంత్రి కేశవ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2026–27 వార్షిక బడ్జెట్లో అంకెల గారడి తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. బడ్జెట్లో బడుగు, బలహీన వర్గాలతో పాటు మహిళలు, నిరుద్యోగులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. – వై.శివరామిరెడ్డి, ఎమ్మెల్సీ -
పీఆర్సీ సాధనకు చలో విజయవాడ
● యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్కుమార్ ఉరవకొండ: పీఆర్సీ సాధనకు చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులకు యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్కుమార్ పిలుపునిచ్చారు. యూటీఎఫ్ తలపెట్టిన రణభేరి 2.0 కార్యక్రమంపై చేపట్టిన ప్రచార జాతా ఉరవకొండలోని ఆ శాఖ ప్రాంతీయ కార్యాలయం వద్ద శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సురేష్కుమార్తో పాటు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దేవేంద్రమ్మ మాట్లాడారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతన సవరణ బిల్లు, నూతన పీఆర్సీ నియాకంపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. 29 శాతం ఐఆర్ను ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని కోరారు. డీఎస్సీ 2023 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై ఈ నెల 17న విజయవాడలో తలపెట్టిన రణభేరి కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ సభ్యులు రమణయ్య, సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కోటీశ్వరప్ప, ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్య, నాయకులు రాఘవ, సంజీవ, శేఖర్, సుబ్బరాయుడు, చంద్రమోహన్, రామాంజనేయులు, బండయ్య, రాష్ట్ర కౌన్సిలర్లు గోవిందరాజులు, లింగమయ్య, తదితరులు పాల్గొన్నారు. కళ్యాణదుర్గం: ఉపాధ్యాయ సమస్యలపై ఈ నెల 17న విజయవాడలో తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూటీఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గంలోని నార్త్ ప్రైమరీ పాఠశాలలో శుక్రవారం జీపు జాత పోస్టర్లను యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు సురేష్కుమార్, రాష్ట్ర కార్యదర్శి దేవేంద్రమ్మ ఆవిష్కరించి, మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరప్ప, ప్రధాన కార్యదర్శి ఈశ్వరయ్యతో పాటు స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
ముగిసిన బార్ కౌన్సిల్ ఎన్నికలు
అనంతపురం: ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం సజావుగా ముగిశాయి. అనంతపురం జిల్లా కోర్టులో 883, కదిరిలో 101, పెనుకొండలో 65, హిందూపురంలో 100, కళ్యాణదుర్గంలో 49, రాయదుర్గంలో 50, ఉరవకొండలో 15, ధర్మవరంలో 83, పుట్టపర్తిలో 20, మడకశిరలో 28, తాడిపత్రిలో 73, గుత్తిలో 92, గుంతకల్లులో 108 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతపురం జిల్లా నుంచి ఆలూరి రామిరెడ్డి, బడా నారాయణరెడ్డి, రాంకుమార్, జక్కల శ్రీనివాసులు పోటీ చేశారు. అనంతపురం జిల్లా కోర్టులో తొలిసారిగా భారీ ఎత్తున ఓట్లు పోలవ్వడం విశేషం. బార్ కౌన్సిల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రేపటి నుంచి హేమావతి బ్రహ్మోత్సవాలు అమరాపురం: మండలంలోని హేమావతిలో వెలసిన హెంజేరు సిద్ధేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఏటా అంగరంగ వైభవంగా సాగుతుంటాయి. ఈ క్రమంలో ఈ నెల 15 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో ఆదివారం అఖండ పూజలు, విశేష అభిషేకాలు, భజనలు, కీర్తనలు ఉంటాయి. 16న భానుపల్లకి, ధూళోత్సవం, అన్నసంతర్పణ, 17న అగ్నిగుండం ప్రవేశం, ముత్యాలపల్లకీ ఉత్సవం, వివిధ రకాల పుష్పాలంకరణ ఉంటుంది. 18న సాయంత్రం సిడిమాను ఉత్సవం, అన్నసంతర్పణ, రాత్రికి ముత్యాలపల్లకీ ఉత్సవం, 19న చిన్న రథోత్సవం, రాత్రి ముత్యాల పల్లకీ ఉత్సవం, 20న బ్రహ్మరథోత్సవం, అన్నసంతర్పణ, 21న వసంతోత్సవం, 22న శయనోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాలకు తరలి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కూడా ఆ రాష్ట్రం నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనుంది. వ్యక్తి బలవన్మరణం పరిగి: మండలంలోని శ్రీరంగరాజుపల్లికి చెందిన శ్రీరాములు(43) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో మానసిక ఒత్తిళ్లతో సతమతమవుతూ తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ కుటుంబసభ్యులు, స్నేహితుల వద్ద వాపోయేవాడు. గత బుధవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకెళ్లిన ఆయన తిరిగి రాలేదు. అప్పటి నుంచి బంధువులు, స్నేహితులు గాలిస్తూనే ఉన్నారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ లోకేషన్ ఆధారంగా శ్రీరాములు ఆచూకీ గుర్తించిన పోలీసులు వెంటనే గ్రామ శివారులోని పొలం వద్దకు చేరుకున్నారు. అప్పటికే మామిడి చెట్టుకు వేసుకున్న ఉరికి విగత జీవిగా వేలాడుతున్న శ్రీరాములు మృతదేహాన్ని కిందకు దించి, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తల్లి హనుమక్క ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసు లాంఛనాలతో జాగిలానికి అంత్యక్రియలు పుట్టపర్తి టౌన్: వయోభారం కారణంగా పోలీసు విశ్రాంత జాగిలం శాండి శుక్రవారం మృతి చెందింది. జిల్లా పోలీస్ శాఖలో 2013 నుంచి 2024 వరకు విశిష్ట సేవలు అందించిన ఈ జాగిలం పేలుడు పదార్థాలను గుర్తించడంలో నేర్పరి. గత ఏడాది నవంబర్ 30న పదవీ విరమణ పొందింది. జాగిలం మృతి చెందిన విషయం తెలియగానే ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐలు మహేష్, వలి, రవికుమార్ తదితరులు శాండీ కలేబరంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో డాగ్ స్క్వాడ్ సిబ్బంది చెన్నప్ప, బీడీటీం సిబ్బంది పాల్గొన్నారు. -
పేదలంటే బాబుకు ‘కళ్ల’ మంట!
● ఆగిన సీఎం ఐ కేర్ కేంద్రాల సేవలు ● కళ్లజోడు నమోదు ప్రక్రియ బంద్ ● ప్రభుత్వ నిర్ణయంతో బాధితులకు తప్పని అవస్థలు కళ్యాణదుర్గం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యం అందని ద్రాక్షగానే మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. నెట్ వర్క్ ఆస్పత్రులకు బకాయిలు పేరుకుపోవడంతో ఇప్పటికే ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు అందకుండా పోయాయి. తాజాగా సీఎం ఐ కేర్ సెంటర్ల నిర్వహణలోనూ చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తిసింది. ఫలితంగా కంటి జబ్బులతో బాధపడుతున్న వారికి చికిత్సలు అందకుండా పోతున్నాయి. ప్రస్తుతం ఈ సెంటర్లను చంద్రబాబు ప్రభుత్వం మూసివేసింది. గద్దెనెక్కిన మూడు నెలల్లోనే ఈ పథకానికి మంగళం పాడేయగా... ప్రస్తుతం సెంటర్లు ఒక్కొక్కటిగా మూత పడుతున్నాయి. దీంతో నేత్ర పరీక్షలు చేయించుకోలేక, కళ్లజోళ్లు పొందే అవకాశం కోల్ఫోయిన పేద, మధ్య తరగతి ప్రజల ఇబ్బందులు వర్ణనాతీతమయ్యాయి. కష్ట కాలంలోనూ ఆగని వైద్య సేవలు వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా 2017లో చంద్రబాబు అమలు చేసిన సీఎం ఐ కేర్ సెంటర్లను నిబద్ధతతో కొనసాగిస్తూ వచ్చారు. వైఎస్సార్ కంటి వెలుగు పథకం పేరుతో సరికొత్త హంగులు అద్ది మరింత విస్తరించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకుండా కంటి వైద్య సేవలను అందజేస్తూ వచ్చారు. ఇందు కోసం రూ. కోట్లు విలువ చేసే అత్యాధునిక ఫండస్ మిషన్, ఏఆర్ మిషన్లను అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు సమకూర్చారు. ప్రతి కేంద్రంలోనూ ఒక ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ను నియమించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వీరు విశిష్ట సేవలు అందించారు. పరీక్షల అనంతరం అవసరమైన వారికి రెండు వారాల్లోపు కళ్లజోళ్లను ఆశా కార్యకర్తల ద్వారా నేరుగా ఇంటి వద్దకే అందించారు. ఈ పథకం కింద అప్పట్లో రోజుకు 100 మందికి పైగా కళ్యాణదుర్గం సీహెచ్సీలో ఓపీ జరిగింది. -
ఐ కేర్ సెంటర్లను కొనసాగించాలి
సీఎం ఐ కేర్ సెంటర్లను కొనసాగించాలి. గ్రామీణ ప్రజలు ఎక్కువగా కంటి జబ్బులతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఈ కేంద్రాలను మూసేయడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వాసుపత్రిలో కంటి పరీక్షలు చేయించుకుడిని ఉచితంగా కళ్లాద్దాలు తీసుకున్నా. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎవరికీ కళ్లాద్దాలు ఇవ్వడం లేదు. నేను కూడా ఇటీవల రూ.వెయ్యి ఖర్చుతో కొత్త కళ్లాద్దాలను బయట కొనుగోలు చేశాను – అంజినప్ప, ముప్పులకుంట, బ్రహ్మసముద్రం మండలం -
మెడికల్ మాఫియాను అరికట్టాలి
● నేడు ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద నిరసనలు ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్ గుంతకల్లు: ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న మెడికల్ మాఫియాకు అడ్డుకట్టు వేయాలని ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీపీపీ విధానంతో వైద్యాన్ని మరింత ఖరీదుగా మార్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజల జీవించే హక్కుపై మెడికల్ మాఫియా పరోక్షంగా దాడి చేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. నాణ్యత లేని, కల్తీ మందులు విచ్చలవిడిగా విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నాయని మండిపడ్డారు. కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స కోసం వెళితే... లేనిపోని పరీక్షలు, మందులు రాసి రూ.వేలల్లో బిల్లులు చేస్తున్నారని ఆరోపించారు. తీరా రోగాన్ని నయం చేయలేక రెఫరల్ పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులకు పంపి కమీషన్లు దండుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో డ్రగ్ కంట్రోల్ వ్యవస్థను బలోపేతం చేయాలని, కార్పొరేట్ ఆస్పత్రుల దందాపై స్వతంత్ర విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా శనివారం జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల ఎదుట తలపెట్టిన నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఎం.వీరభద్రస్వామి, బి.మహేష్, ఈశ్వరయ్య, దాసరి శ్రీనివాసులు, వెంకట్నాయక్ పాల్గొన్నారు. -
9 వేల మెట్రిక్ టన్నుల కందుల కొనుగోలు
అనంతపురం అగ్రికల్చర్: ప్రభుత్వం నిర్ధేశించిన మద్ధతు ధరతో క్వింటా రూ.8 వేల ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ 5,964 మంది రైతుల నుంచి రూ.77 కోట్లు విలువ చేసే 9,706 మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేసినట్లు మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ పి.పెన్నేశ్వరి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో రూ.55 కోట్ల విడుదలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. 3,298 మంది రైతుల ఖాతాల్లోకి రూ.37 కోట్లు జమ చేసినట్లు వివరించారు. కొరియర్ సెంటర్లో చోరీ శింగనమల: స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పక్కనే ఉనన పార్సిల్ కొరియర్ సెంటర్లో చోరీ జరిగింది. ముసుగులు ధరించిన ఇద్దరు యువకుల కదలికలు అక్కడి సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమై ఉంది. గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కొరియర్ సెంటర్ వద్దకు చేరుకున్న దుండగులు ముందుగా తలుపు వద్ద ఉన్న సీసీ కెమెరాను తొలగించారు. అనంతరం తాళం బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. పార్శిళ్లను పరిశీలించి, విలువైన వస్తువులున్న వాటిని అపహరించుకెళ్లారు. శుక్రవారం ఉదయం విధులకు హాజరైన సిబ్బంది గమనించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. 900 హెక్టార్లకు ఆటోమేషన్ లక్ష్యం కూడేరు: ఈ ఏడాది మార్చి లోపు జిల్లా వ్యాప్తంగా 900 హెక్టార్లకు ఆటోమేషన్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ఏపీఎంఐపీ పీడీ రఘునాథ రెడ్డి తెలిపారు. ఆటోమేషన్ టెక్నాలజీపై కూడేరులోని వ్యవసాయ కార్యాలయంలో శుక్రవారం ఏపీఎంఐపీ ఆధ్వర్యంలో రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త విజయ శంకరబాబు, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ దేవానందతో పాటు ఆయన మాట్లాడారు. ఆటోమేషన్ విధానం ద్వారా నీటి వృధాని అరికట్డడంతో పాటు రైతులకు శ్రమ కూడా తగ్గుతుందన్నారు. రైతులు పొలాల్లోనే ఉండి పంటలకు నీటిని సరఫరా చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇంటి వద్ద నుంచే సెల్ఫోన్ ద్వారా పంటలకు ఎంత మోతాదులో నీరు అవసరమో అంతే అందించే అవకాశం ఉంటుందన్నారు. 55 శాతం సబ్సిడీతో ఆటోమేషన్ పరికరాలను అందజేస్తున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ లలితమ్మ, ఉద్యానాధికారి యామిని పాల్గొన్నారు. -
ప్రేమ మాటలకు, అక్షరాలకు అందని మధురమైన, అపురూపమైన భావన. ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య కాకుండా, రెండు మనసుల మధ్య ఏర్పడే బంధం. ఎంత వర్ణించినా తక్కువయ్యే ఈ భావోద్వేగానికీ ఓ ప్రత్యేక రోజు ఉంది. అదే ‘వాలెంటైన్స్ డే’. ఆ రోజు రానే వచ్చింది. రప్రేమను వ్యతిరేకిస
అనంతపురం కల్చరల్: ప్రేమలో ఉండే వారికి ప్రతిరోజూ పండగలాగే అనిపిస్తుంది. అయితే ఫిబ్రవరి 14న వచ్చే వాలెంటైన్స్ డే మాత్రం ఇంకా ప్రత్యేకంగా అనిపిస్తుంది. అందుకే చాలా మంది ప్రేమికులు ఈ వాలెంటైన్స్ డే కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ సమయంలో తమ భాగస్వామికి తమ ప్రేమను ప్రత్యేకంగా తెలియజేయాలనుకుంటారు. పేమికుల రోజు సందర్భంగా శనివారం అనంతపురంలోని కొన్ని రెస్టారెంట్ల నిర్వాహకులు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించారు. ప్రేమను మించిన ఆయుధం లేదు వాలెంటైన్ డే కు సంబంధించి ఓ చారిత్రక ఘట్టమూ లేకపోలేదు. క్రీస్తు శకం 270లో వివాహ వ్యవస్థపై ఏ మాత్రం ఇష్టం లేని రోమ్ నగరాన్ని పాలించే రాజు క్లాడియస్ అప్పటికే వివాహంపై నిషేధం విధించారు. తన ముందు ఎవరైనా పెళ్లి ప్రస్తావన తీసుకెళితే కఠినమైన శిక్షలు వేసేవారు. అదే సమయంలో ప్రేమ పెళ్లిళ్లను మతగురువు వాలెంటైన్ విపరీతంగా ప్రోత్సహిస్తూ వచ్చారు. హింస, స్వార్థం, ద్వేషం వంటి చెడు గుణాలపై పోరాడేందుకు ప్రేమను మించిన ఆయుధం లేదని నమ్మిన ఆయన.. ప్రేమలో పడిన వారికి దగ్గరుండి వివాహం జరిపించేవారు. తన రాజ్యంలో వివాహాలు ఎలా జరుగుతున్నాయని ఆరా తీసిన రోమ్ రాజు.. వాలెంటైన్ ప్రేమ పాఠాల గురించి తెలుసుకుని అతనిని కారాగారంలో బంధించాడు. రాజద్రోహానికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో ఫిబ్రవరి 14న ఉరి తీయించాడు. అయితే కారాగారంలో శిక్ష అనుభవించే సమయంలో జైలర్ కూతురితో వాలెంటైన్ ప్రేమలో పడిపోయాడు. తనను ఉరి తీసే ముందు తన ప్రేయసి గురించే తలచుకుంటూ ‘యువర్ వాలెంటైన్’ అంటూ ఓ ప్రేమ లేఖ రాశాడు. అలా అది కాస్త ప్రేమకు నిర్వచనంగా మారి ఏటా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సందర్భం నేడు ‘వాలెంటైన్స్ డే’ -
నమ్మించి మోసం చేశారు
● చంద్రబాబు ప్రభుత్వంపై ఎస్టీయూ నాయకుల ధ్వజం అనంతపురం అర్బన్: ‘మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఉద్యోగ, ఉపాధ్యాయులను నమ్మించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లు అవుతున్నా పీఆర్సీ కమిటీ వేయకుండా మోసం చేశారు. ఇంతటి దౌర్భాగ్యం ఎన్నడూ లేదు’ అంటూ ఎస్టీయూ నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యోగులకు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ ఎస్టీయూ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఎన్.రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్.రామాంజనేయులు మాట్లాడుతూ కొత్తగా తీసుకొస్తున్న 33 ఏళ్ల సర్వీసు విధానం ఉద్యోగుల మెడలో పాములాంటిదన్నారు. అది ఎప్పుడైనా కాటువేయవచ్చని హెచ్చరించారు. రెండేళ్లు అవుతున్నా పీఆర్సీ కమిటీ వేయకపోవడం దారుణమన్నారు. 12వ పీఆర్సీ కమిటీ వేయడంతో పాటు మధ్యంతర భృతి 30 శాతం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలు, పీఆర్సీ బకాయిలు తక్షణం చెల్లింపునకు రోడ్మ్యాప్ ప్రకటించి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఇటీవల ఉద్యోగ సంఘాలను చర్చకు పిలిచి డీఏలు ఇస్తామని చెప్పారని, తీరా ఒక డీఏ ఇచ్చి తీవ్ర నిరాశకు గురిచేశారన్నారు. పాత పెన్షన విధానం అమలు చేయాలన్నారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు మెమో 57 మేరకు పాత పెన్షన అమలు చేయాలన్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇవ్వాల్సిన సౌలభ్యాలు చెల్లించకుండా వారిని ఏడిపిస్తూ తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పదవీ విరమణ చేసి మరుసటి రోజునే సౌలభ్యాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సూరీడు, ఫణిభూషణ్, కృష్ణమూర్తి, రాజశేఖర్, జిల్లా నాయకులు నాగభూషణం, మల్లికార్జున, సుధాకర్, నాగేంద్ర, రాధాకృష్ణంరాజు, నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
సేవాలాల్ జయంత్యుత్సవాలు ప్రారంభం
గుత్తి రూరల్: బంజారాల ఆరాధ్య దైవం సంత్శ్రీ సేవాలాల్ మహరాజ్ 287వ జయంత్యుత్సవాలు శుక్రవారం గుత్తి మండలం చెర్లోపల్లి పంచాయతీ సేవాగఢ్లో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు సాగే ఉత్సవాలకు మాతా జగదాంబ ఆలయంలో హోమాలు, ప్రత్యేక పూజలు చేసి అంకురార్పణ చేశారు. సేవాలాల్ ఆలయ ముఖద్వారం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం వైద్యశిబిరం, ఫొటో ఎగ్జిబిషన్, మరుగుదొడ్లు, వసతి ఏర్పాట్లతో పాటు ద్విచక్రవాహనాలు, జీపులు, కార్ల పార్కింగ్కు స్థలం కేటాయించారు. విద్యుత్కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. మాతా జగదాంబ ఆలయంలో హోమం సేవాగఢ్లోని మాతా జగదాంబ ఆలయ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని హోమాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు మారుతీ ప్రసాద్ ఆధ్వర్యంలో అమ్మవారికి సుప్రభాతం, పంచామృతాభిషేకం, మహాగణపతి పూజ, అభిషేకం తదితర పూజలు చేశారు. భారీ బందోబస్తు సేవాలాల్ జయంత్యుత్సవాల సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ శ్రీనివాస్, సీఐ రామారావు తెలిపారు. బందోబస్తుకు వచ్చిన పోలీసులతో సమావేశమైన సీఐ వారికి దిశానిర్దేశం చేశారు. ఉత్సవాలు విజయవంతం చేయండి సేవాలాల్ మహరాజ్ జయంత్యుత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ట్రస్టు అధ్యక్షుడు కొర్రా జగన్నాథరావు, ఉపాధ్యక్షుడు కేశవనాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ రవీంద్రనాయక్, కార్యదర్శి అశ్వత్థనాయక్ కోరారు. ఆలయ ఆవరణలో వారు విలేకరులతో మాట్లాడుతూ భక్తులకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలను పూర్తి చేశామన్నారు. ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులకు భోజన ఏర్పాట్లు చేశామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ పుణ్యవతి, ఎంపీడీఓ ప్రభాకర్నాయక్, డీటీ సూర్యనారాయణ, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. సేవాలాల్ మహరాజ్ మూలవిరాట్, మాతా జగదాంబ ఆలయ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతున్న ట్రస్టు సభ్యులు -
బీటెక్ ఫలితాల విడుదల
అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో శుక్రవారం బీటెక్ ఫలితాలు విడుదలయ్యాయి. డిసెంబర్, జనవరి నెలలో నిర్వహించిన బీటెక్ మొదటి సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–23) రెగ్యులర్, సప్లిమెంటరీ, (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ ఫలితాలు, రెండో సెమిస్టర్ (ఆర్–23), (ఆర్–20), (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ, బీసీఏ మొదటి సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–24)రెగ్యులర్, బీబీఏ రెండో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (24) రెగ్యులర్, బీబీఏ ఒకటో సంవత్సరం ఒకటో సెమిస్టర్ రెండో సెమిస్టర్ (24) సప్లిమెంటరీ ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ వి.నాగప్రసాద నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఏపీ శివకుమార్, అడిషనల్ కంట్రోలర్స్ డాక్టర్ ఎం.అంకారావు, డాక్టర్ శారద, డాక్టర్ ఎస్. శ్రీధర్ విడుదల చేశారు. ఫలితాలు యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలని కోరారు. ముగిసిన ఏపీపీఎస్సీ పరీక్షలు అనంతపురం అర్బన్: ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఈ నెల 9న ప్రారంభమైన పరీక్షలు శుక్రవారం ముగిశాయి. జిల్లా ఖజానా స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన జవాబు పత్రాలను డీఆర్ఓ మలోల పర్యవేక్షణలో ప్రత్యేక బస్సులో పోలీసు బందోబస్తు ద్వారా విజయవాడకు తరలించారు. కార్యక్రమంలో ఏఓ అలెగ్జాండర్, ఏపీపీఎస్సీ అధికారులు పాల్గొన్నారు. పిల్లల ఆరోగ్యమూ ప్రధానమే అనంతపురం అర్బన్: పిల్లలకు విద్యతో పాటు వారి ఆరోగ్యమూ ప్రధానమేనని కలెక్టర్ ఆనంద్ ఆన్నారు. ఈ నెల 17న చేపట్టనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 17న అన్ని విద్యాసంస్థల్లో పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను వేయాలన్నారు. కార్యక్రమంలో వైద్యారోగ్య, విద్యా, మహిళాశిశు సంక్షేమ శాఖల అధికారులు పాల్గొన్నారు. నేడు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు రాక అనంతపురం ఎడ్యుకేషన్: జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ శనివారం అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం 10 గంటలకు అనంతపురం చేరుకోనున్నారు. ఆదర్శనగర్లోని మారెమ్మ ఆలయాన్ని సందర్శించిన అనంతరం ఆత్మకూరు మండలం మదిగుబ్బ తండాకు 11 గంటలకు చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అనంతపురం రూరల్ మండలం కురుగుంట సేవాలాల్కాలనీలో పర్యటిస్తారు. 2 గంటలకు కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో ఎస్టీ సంఘాల నాయకులతో సమావేశం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. 6 గంటలకు గుత్తి మండలం సేవాఘడ్కు వెళ్లి, అక్కడి నుంచి హైదరాబాద్కు తిరిగి వెళతారు. -
మెటీరియల్ పేమెంట్లు పూర్తి చేయాలి
అనంతపురం అర్బన్: ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టి పనులకు సంబంధించి రూ.22 కోట్ల చెల్లింపులు ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలు నుంచి ఉపాఽధి హామీ కింది మెటీరియల్ ఎక్స్పెండేచర్, మెటీరియల్ పేమెంట్లు, తదితర అంశాలపై ఎంపీడీఓలు, ఏపీఓలు, ఎంసీసీ సిబ్బంది, పీఆర్ ఏఈలు, ఈసీలు, తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెటీరియల్ పేమెంట్ల లక్ష్యాన్ని చేరుకునేందుకు రోజూ రూ.7.35 కోట్ల విలువైన పనులు అప్లోడ్ చేయాలన్నారు. శని, ఆది వారాలు సెలవు రోజులైనప్పటికీ ఎంపీడీఓలు, ఏపీఓలు, ఇంజినీరింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాకు కేటాయించిన మెటీరియల్ బడ్జెట్ను ఈ నెలాఖరులోగా పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో డ్వామా పీడీ సలీంబాషా, పీఆర్ ఎస్ఈ సుబ్బరాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా అంతటా శుక్రవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఉదయం చలి వాతావరణం కొనసాగుతోంది. ఆగ్నేయం దిశగా గంటకు 8 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
కంటితుడుపుగా టమాట కొనుగోలు అనంతపురం అగ్రికల్చర్: టమాట ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు నష్టాలపాలవుతున్నారు. అనంతపురం రూరల్ పరిధిలోని కక్కలపల్లి మార్కెట్కు ఇటీవల కాలంలో రోజూ 600 నుంచి 800 టన్నుల వరకు సరుకు అమ్మకానికి వస్తోంది. అయితే ధరలు పతనం కావడంతో కూలీల ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. నెలన్నర రోజులుగా అత్యంత నాణ్యమైన టమాట గరిష్ట ధర కిలో రూ.10 పలుకుతుండగా మిగతావన్నీ రూ.5 నుంచి రూ.7కు మించి పలకడం లేదు. ఈ పరిస్థితుల్లో మార్కెటింగ్ శాఖ కంటితుడుపు చర్యలు చేపట్టింది. రెండు రోజులుగా రోజుకు 30 నుంచి 40 టన్నుల టమాటా కొనుగోలు చేస్తూ పక్క జిల్లాలకు సరఫరా చేస్తుండగా.. అలాగే ఆటోల ద్వారా కిలో రూ.10 ప్రకారం విక్రయాలు మొదలు పెట్టారు. మార్కెటింగ్ శాఖ కూడా రైతుల నుంచి కిలో రూ.5 ప్రకారం కొనుగోలు చేస్తుండటం గమనార్హం. మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేకపోవడంతో కొన్ని లాట్లు అమ్ముడుపోక వదిలేసుపోతున్నట్లు చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో రైతులకు ఏదో లబ్ధి చేకూర్చుతున్నట్లు చెప్పుకునే క్రమంలోనే కంటితుడపు చర్యలకు దిగినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
రెవెన్యూ అధికారి ‘దూకుడు’
అనంతపురం ఎడ్యుకేషన్: ఆయన రెవెన్యూ శాఖలో డివిజనల్ స్థాయిలో కీలక అధికారి. రిటైర్డ్మెంట్ దగ్గర పడుతుండడంతో ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాల’నే నానుడిని బాగా వంట పట్టించుకున్నారు. ఆయన అదృష్టం కొద్దీ సామాజికవర్గమూ కలిసొచ్చింది. తెలుగుదేశం పార్టీకి బలంగా ఉంటున్న సామాజిక వర్గానికి చెందినవ్యక్తి కావడంతో చెట్టుపేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్న చందంగా వ్యవహరిస్తూ అక్రమాలకు తెరతీశారు. ఆ సామాజికవర్గంలో కీలకమైన ప్రజాప్రతినిధుల పేర్లు చెబుతుండడంతో బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈయన ‘బరితెగింపు’ అధికార పార్టీతోపాటు రెవెన్యూశాఖలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈయన వ్యవహారంపై కొందరు ఏకంగా సీఎంఓ దృష్టికి తీసుకెళ్లగా అక్కడి నుంచి గుట్టుగా ఆరా తీస్తున్న వైనం రెవెన్యూశాఖలో కలకలం రేపుతోంది. వివాదాల భూములు.. ఏకపక్ష నిర్ణయాలు వివాదం ఉన్న భూముల వ్యవహారంలో ఆ అధికారి చాలావరకు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఆర్ఓఆర్ (రికార్డ్ ఆఫ్ రైట్స్) కేసుల విచారణ వివాదాస్పదమవుతోంది. ఎప్పుడూ లేని విధంగా ప్రతి వారం 100కు పైగా కేసులను విచారణకు పిలుస్తుండడం పట్ల చర్చ జరుగుతోంది. గతంలో వారానికి 30 కేసులకు మించి విచారణకు పిలిచేవారు కాదు. ఈ అధికారి రిటైర్డ్మెంట్ తేదీ దగ్గర పడేకొద్దీ కేసుల సంఖ్య పెంచుతూ వస్తున్నారని చెబుతున్నారు. కొన్ని కేసల్లో నాలుగుసార్లు నోటీసులు ఇచ్చి తుది తీర్పు ఇచ్చేస్తున్నారు. ‘కమిట్’ అయిన వారితో ప్రతి ఫైలుకూ రూ. లక్షల్లోనే తన వాటా ఉంటుందనే ప్రచారం ఉంది. ఈయన ఏకపక్షంగా ఇచ్చిన తీర్పులపై హైకోర్టును ఆశ్రయిస్తున్న బాధితులకు అక్కడ ఊరట లభిస్తోంది. గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, అనంతపురం రూరల్, రాప్తాడు మండలాల్లో ఇలాంటి కేసులు ఎక్కువగా ఉన్నాయి. అనంతపురం రూరల్ మండలం కురుగుంట 172 సర్వే నంబరులోని భూ వివాదంపై ఈయన ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టేసింది. అలాగే కక్కల పల్లి, కాటిగానికాలవ, నరసనాయనికుంట గ్రామాల్లోని భూములకు సంబంధించి ఈయన ఉత్తర్వులను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇంకా పలువురు బాధితులు ఈయన తీర్పును సవాల్ చేస్తూ హైకోరునాశ్రయించారు. ఏదేమైనా ఆర్ఓఆర్ కేసులు ఈయనకు పెద్ద ఆదాయవనరుగా మారాయి. తహసీల్దార్ కార్యాలయ నివేదికలు కూడా అక్కడి నుంచే... ఆర్ఓఆర్ కేసులకు సంబంధించి పిటీషనర్లు, రెస్పాండెంట్లకు నోటీసులు ఇచ్చి రికార్డులను తెప్పించుకుంటారు. ఆ రికార్డులను సంబంధిత తహసీల్దారు కార్యాలయానికి పంపి క్షేత్రస్థాయిలో విచారణ చేయించి నివేదికలను తెప్పించుకుంటారు. వాటి ఆధారంగా ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చాలా కేసుల్లో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఆర్ఓఆర్ కేసులకు సంబంధించి తాను మాట్లాడుకున్న వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చేందుకు.. తహసీల్దార్ కార్యాలయాల నుంచి రావాల్సిన నివేదికలు (ఫైళ్లు) అక్కడే సిద్ధం చేసుకుంటున్నారు. కేవలం సంతకాల కోసం తహసీల్దార్ల కార్యాలయాలకు పంపుతున్నారు. సంబంధిత వీఆర్ఓ, ఆర్ఐఓ, డీటీ, తహసీల్దారు సంతకాలు చేయాలి. ఇక్కడ కాదుగీదు అనేకి లేదని మండలాల ఉద్యోగులు వాపోతున్నారు. మరికొన్ని కేసుల్లో సదరు అధికారి బరితెగించి ఇచ్చిన ఉత్తర్వులను ధైర్యం చేసి తాము అమలు చేయలేకపోతున్నామని ఓ డీటీ వాపోయారు. ఓ మిల్ట్రీ పట్టా ఫేక్ అని నిర్ధారించినా కూడా.. ఆ కేసులో భారీగా దండుకున్న అధికారి ఆ పట్టాను అడ్డుపెట్టుకుని కొనుగోలు చేసిన వారికి ఆన్లైన్లో ఎక్కించాలంటూ ఉత్తర్వులు ఇవ్వడం కలెక్టరేట్లోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎంఓ దృష్టికి వ్యవహారం ఈ అధికారి నెలల వ్యవధిలోనే రూ.కోట్లకు పడగలెత్తాడని రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. ఏమైనా మాట్లాడితే ప్రొటోకాల్ ఖర్చులు అంటూ జిల్లా ఉన్నతాధికారుల పేర్లను వాడుకుంటున్నారని వాపోతున్నారు. ఈయన బరితెగింపు వ్యవహారం చివరకు సీఎంఓ దృష్టికి కూడా వెళ్లిందని చెబుతున్నారు. అక్కడి నుంచి కీలక అధికారులు, ప్రజాప్రతినిధులను ఆరా తీస్తున్నట్లు తెలిసింది. జిల్లా ఉన్నతాధికారులు సైతం ఈయన వ్యవహారంపై ఓ కన్నేశారు. రిటైర్మెంట్ దగ్గర పడుతుండటంతో అక్రమ వసూళ్లు భూవివాదాల్లోవిపరీతమైన జోక్యం రికార్డుస్థాయిలో ప్రతి వారం వందదాకా కేసుల విచారణ -
అహూడా.. ఏదీ అభివృద్ది జాడా?
అనంతపురం క్రైం: అనంతపురం–హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అహుడా)లో అభివృద్ధి జాడ కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అథారిటీ కార్యాలయం ఎవరికి ఉపయోగపడుతుందో తెలియడం లేదని పలువురు అంటున్నారు. కేవలం ప్రచార కార్యాలయంగా మార్చారంటూ పెదవి విరుస్తున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ‘అహుడా’ ఒక వెలుగు వెలిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏకంగా రూ.6.53 కోట్ల నిధులతో మొత్తం 22 పనులు చేపట్టారు. రోడ్లు, సెంట్రల్ లైటింగ్, పార్కులు, జిమ్ పరికరాలు, లేఅవుట్ల అభివృద్ధి, ప్రహరీల నిర్మాణాలను ప్రణాళికాబద్ధంగా చేశారు. అనంతపురంలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి జేఎన్టీయూ దాకా సుందరంగా రహదారి నిర్మించడంతో పాటు ధర్మవరంలో రహదారులు, గుత్తి లేఅవుట్ అభివృద్ధి, పట్టణ ప్రాంతాలో పార్కులు, జర్నలిస్ట్ కాలనీల్లో పార్కు అభివృద్ధిలో భాగంగా ప్రహరీ ఏర్పాటు చేశారు. ఫొటోలకు ఫోజులతో సరి.. అనంతపురం నగరంలోని అహుడా కార్యాలయంలో ప్రతి గురువారం నిర్వహించే ‘గ్రీవెన్స్’ కార్యక్రమం ఫొటోలకు ఫోజులివ్వడానికి మినహా మరెందుకూ ఉపయోగపడడం లేదని ఆ కార్యాలయ సిబ్బందే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వారం నిర్వహించిన గ్రీవెన్స్లో ఉన్నతాధికారులు, పాలకవర్గం సభ్యులు కనిపించకపోవడం గమనార్హం. ఈ క్రమంలో కేవలం రెండు అర్జీలే వచ్చాయి. చాలామంది అర్జీదారులు ఖాళీ కుర్చీలను చూసి నిరాశతో వెనుదిరగడం కనిపించింది. గతంలో వచ్చిన అర్జీలకు కూడా పరిష్కారం చూపిన దాఖలాలు లేవు. 19 నెలల చంద్రబాబు పాలనలో ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదంటే ‘అహుడా’ దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. అహుడా చైర్మన్ టీసీ వరుణ్ వైఎస్సార్ సీపీ హయాంలో వేసిన ఎంఐజీ లేఅవుట్లలో హంగామా తప్పా పైసా కూడా తీసుకురాలేదన్న విమర్శలున్నాయి. ఆదాయం.. దూరం జిల్లాలో ఎక్కడ చూసినా వందల ఎకరాల్లో అక్రమ లేఅవుట్లు దర్శనమిస్తున్నాయి. మారుమూల ప్రాంతాలు కాదు.. నగరానికి రెండు, మూడు కిలోమీటర్ల దూరంలోనే ఇష్టారాజ్యంగా లేఅవుట్లు వేశారు. వీటిపై కూడా చర్యలు తీసుకోవడంలేదు. ప్రభుత్వం తీసుకువచ్చిన క్రమబద్ధీకరణ పథకం కూడా సా...గుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలసి ఒక్క సమీక్ష నిర్వహించలేదు. లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలన్న సూచనలు కూడా ప్రజల్లోకి వెళ్లలేదు. దీంతో చాలా మందికి క్రమబద్ధీకరణ విషయంలో స్పష్టత లేకుండా పోతోంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా గణనీయంగా తగ్గిపోయింది. చంద్రబాబు ప్రభుత్వంలో ఒక్క పని జరిగితే ఒట్టు వినతులనూ పట్టించుకోని అధికారులు గ్రీవెన్స్లో ఫొటో షూట్లకే పరిమితమవుతున్నారన్న విమర్శలు వైఎస్సార్ సీపీ హయాంలో రూ. 6.53 కోట్లతో అభివృద్ధి పనులు -
త్వరలో ఓటర్ మ్యాపింగ్పై శిక్షణ
అనంతపురం అర్బన్: త్వరలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున అందుకు సంబంధించి ఓటరు మ్యాపింగ్ అంశంపై బీఎల్ఓలు, ఎన్నికల అధికారులకు శిక్షణ ఇస్తామని డీఆర్ఓ ఎ.మలోల తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఓటరు నమోదు, తొలగింపు, వివరాల మార్పు క్లెయిమ్లను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలన్నారు. రాజకీయ పార్టీలు చొరవ తీసుకుని యువత ఓటర్లుగా నమోదయ్యేలా చూడాలని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన కార్మిక, కర్షక లోకం
● కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కన్నెర్ర ● మోదీ, చంద్రబాబు తీరుపై మండిపాటు అనంతపురం అర్బన్: కార్మిక, రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సత్తా చూపిస్తామని కార్మిక, రైతు సంఘాల నాయకులు హెచ్చరించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం జిల్లావ్యాప్తంగా కార్మిక, రైతు సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతపురం నగరంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, వైఎస్సార్టీయూ, ఐఎఫ్టీయూ, మునిసిపల్, ఎల్ఐసీ, బ్యాంక్, హమాలీ, రైతు, కౌలు రైతు, వ్యవసాయ కార్మిక, రైతు కూలీ తదితర సంఘాల నాయకులు క్లాక్టవర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు మాస్క్లు ధరించి వినూత్నంగా నిరసన తెలిపారు. వ్యతిరేక విధానాలపై మండిపాటు టవర్క్లాక్ వద్ద సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీష్, మేయర్ సలీం, సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి, రాష్ట్ర కార్యదర్శి జాఫర్, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, వైఎస్సార్టీయూ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్వీనాయుడు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు ఏసురత్నం, సీపీఎం నగర కార్యదర్శి రామిరెడ్డి, సీపీఐఎంఎల్ లిబరేషన్ కార్యదర్శి వేమన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నాయని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ కార్మికుల హక్కులను కాలరాస్తోందని దుమ్మెత్తిపోశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చి యాజమాన్యాలకు కార్మికులను బానిసలుగా మారుస్తోందని విమర్శించారు. లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు చట్టపరమైన హక్కులన్నీ కోల్పోతారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక నిర్ణయాలకు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మద్దతునిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఎనిమిది గంటల పనివేళలను 12 గంటలకు మార్చడం కార్పొరేట్ యాజమాన్యాలకు కార్మికుల శ్రమను దోచిపెట్టడమేని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అన్యాయం చేస్తున్నాయని, పంటలకు మద్ధతు ధరలు కల్పించడం లేదని విమర్శించారు. ఇటీవల అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందం కార ణంగా రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి వీబీ జీ రామ్జీ పథకం తీసుకొచ్చి వ్యవసాయ కార్మికులకు తీరని అన్యాయం చేశారన్నారు. లేబర్ కోడ్లు రద్దు చేయాలని, పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వాలే కొనుగోలు చేయాలని, వీబీ–జీ– రామ్జీ పథకాన్ని రద్దు చేసి ఉపాధి చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కార్మిక, రైతు సంఘాల నాయకులు రాజేష్గౌడ్, రమణ, గోపాల్, వెంకటనారాయణ, నాగరాజు, ముత్తుజా, పద్మావతి, జయలక్ష్మి, లక్ష్మిదేవి, తదితరులు పాల్గొన్నారు. -
ఆలయాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు
● కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీష్ అనంతపురం అర్బన్: ‘బ్రహ్మోత్సవాలు, జాతరలు, పర్వదినాల్లో దేవాలయాల వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలి. పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక, మునిసిపల్, పంచాయతీ శాఖలు సమన్వయంతో పనిచేయాలి’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. ఆలయాల వద్ద బారికేడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ పి.జగదీష్ సూచించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శివరాత్రి సందర్భంగా ఆలయాల వద్ద భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని, ఇందుకు తగ్గట్టుగా భద్రత ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రధాన ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అన్ని వర్గాలు, మతాల వారు మతసామరస్యంతో ఉండేలా చూడాలన్నారు. రంజాన్ వేడుకలు, క్రైస్తవ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా దేవదాయ, మైనారిటీ శాఖ అధికారులు, ఈఓలు, పోలీసులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. మసీదులు, ఆలయాలు ఇతర ముఖ్య ప్రాంతాల్లో సెక్యూరిటీ ఆడిట్ ఒక నెలలో పూర్తి చేసి సమర్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో దేవదాయ శాఖ అధికారి మల్లికార్జున ప్రసాద్, మైనారిటీ సంక్షేమాధికారి రామసుబ్బారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ‘నకిలీ’ కేటుగాళ్ల అరెస్ట్ అనంతపురం సెంట్రల్: నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఇంటి కబ్జాకు యత్నించిన కేటుగాళ్లను వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. నగరంలోని శారదానగర్లో సుసర్ల కనకదుర్గ, సుసర్ల శ్రీలక్ష్మికి ఇల్లు ఉంది. వీరు 2024 నవంబర్లో కాకినాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న నగరానికి చెందిన పాములపాటి అమర్నాథ్, పుట్టపర్తికి చెందిన ఆవుల సుబ్రహ్మణ్యం ఇంటిని కొట్టేయాలని పథకం రచించారు. హిందూపురానికి చెందిన బి.శకుంతలకు సుసర్ల కనకదుర్గ తన ఇంటిని రాసి ఇచ్చినట్లుగా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారు. అనంతరం పుట్టపర్తికి చెందిన శేఖర్కు అనంతపురం అర్బన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శకుంతల నుంచి జీపీఏ (జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ) చేయించారు. ఈ తతంగమంతా అప్పటి అర్బన్ సబ్రిజిస్ట్రార్ రమణరావు కనుసన్నల్లో జరిగింది. తర్వాత సదరు జీపీఏ డాక్యుమెంట్ల ద్వారా నగరపాలకసంస్థ కార్యాలయంలో మ్యుటేషన్ చేయించారు. దీనిపై సుసర్ల కనకదుర్గ వారసుడైన సాయి మనోహర్ అనంతపురం వన్టౌన్ పోలీసులసు ఆశ్రయించాడు. ఎస్పీ జగదీష్ ఈ కేసును తీవ్రంగా పరిగణించడంతో డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో మహిళా పోలీసు స్టేషన్ సీఐ వెంకటేశులు సమగ్ర విచారణ జరిపారు. శకుంతల, శేఖర్, ఆవుల సుబ్రహ్మణ్యం, దయ్యాల ఉమాపతి, అమర్నాథ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా ఈనెల 25 వరకూ న్యాయమూర్తి రిమాండ్ విధించారు. నిందితుల్లో ఒకడైన పాములపాటి అమర్నాథ్పై ఇది వరకూ ఇలాంటివే నాలుగు కేసులు ఉన్నాయి. కేసులో మరికొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉందని పోలీసులు వివరించారు. -
వీఆర్ఓలకు పదోన్నతి
అనంతపురం అర్బన్: రెవెన్యూశాఖలో గ్రేడ్–2 వీఆర్ఓలకు గ్రేడ్–1 వీఆర్ఓలుగా పదోన్నతి కల్పించారు. కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో 110 మందికి పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులను జిల్లా రెవెన్యూ అధికారి ఎ.మలోల గురువారం జారీ చేశారు. అనంతపురం జిల్లాలో 60 మంది గ్రేడ్–2 వీఆర్ఓలు, శ్రీ సత్యసాయి జిల్లాలో 50 మంది గ్రేడ్–2 వీఆర్ఓలకు గ్రేడ్–1 వీఆర్ఓలుగా పదోన్నతి లభించింది. గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ చేతుల మీదుగా పదోన్నతి ఉత్తర్వులను వీఆర్ఓలు అందుకున్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, డీఆర్ఓ మలోల, ఆర్డీఓలు కేశవనాయుడు, వసంతబాబు, రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దివాకర్రావు పాల్గొన్నారు. వీఆర్ఏలకు లైన్క్లియర్.. వీఆర్ఓలకు గ్రేడ్–1 పదోన్నతి కల్పించడం ద్వారా గ్రేడ్–2 వీఆర్ఓలుగా పదోన్నతి పొందేందుకు డైరెక్టర్ రిక్రూట్ వీఆర్ఏ (గ్రామ రెవెన్యూ సహాయకులు)లకు లైన్ క్లియర్ అయ్యింది. గ్రేడ్–1 వీఆర్ఓ ఖాళీలు దాదాపు 140 వరకు ఉన్నాయి. ప్రభుత్వం నిబంధన ప్రకారం పదోన్నతి ద్వారా 30 శాతం మాత్రమే భర్తీ చేయాల్సి ఉంటుంది. వీఆర్ఏకు పదోన్నతి కల్పిచేందుకు అర్హత ఇంటర్మీడియేట్ లేక డిగ్రీ అనేదానిపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. గత ప్రభుత్వంలో... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మానవతాదృక్పథంతో వ్యవహరించి 2020లో వన్టైమ్ సెటిల్మెంట్ కింద ఒకే దఫా 231 మందికి గ్రేడ్–2 వీఆర్ఓలుగా పదోన్నతి కల్పించింది. అదే తరహాలో ప్రస్తుతమూ వన్టైమ్ సెటిల్మెంట్ కింద అర్హులందరికీ పదోన్నతి కల్పించాలని వీఆర్ఏలు కోరుతున్నారు. పదోన్నతి ద్వారా 30 శాతం కాకుండా 70 శాతం ఖాళీలు భర్తీ చేయాలని ఒక ఫైలు, వన్టైమ్ సెటిల్మెంట్కు సంబంధించిన ఫైలు సీసీఎల్ఏ వద్ద ఉందని చెబుతున్నారు. ఈ రెండింటిలో ఏది ఆమోదం పొందినా దాదాపు అర్హులైన వీఆర్ఏలందరికీ ప్రయోజనం చేకూరుతుందన్నారు. అలా కాకుండా 30 శాతం నిబంధన అమలు చేస్తే 140 ఖాళీల్లో 46 మంది వీఆర్ఓలకు మాత్రమే పదోన్నతి లభిస్తుందని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 110 మందికి అవకాశం -
రాష్ట్రంలో ఉద్యోగ వ్యతిరేక పాలన
● ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు జక్కుల మాధవ్ అనంతపురం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ వ్యతిరేక పాలన సాగిస్తోందని ఏపీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు జక్కుల మాధవ్ విమర్శించారు. సార్వత్రిక సమ్మెకు మద్దతుగా గురువారం కలెక్టరేట్ ఆవరణలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాధవ్తో పాటు జిల్లా కార్యదర్శి రవికుమార్, ప్రభుత్వ పెన్షనీర్ల సంఘం జిల్లా కార్యదర్శి శిల జయరామప్ప, నగర అధ్యక్షుడు మనోహర్రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల విషయంలో నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. రెండేళ్లవుతున్నా సమస్యలు పరిష్కరించలేదన్నారు. బకాయిలు పేరుకుపోతున్నాయన్నారు. తక్షణం 12వ పీఆర్సీ నియమించడంతో పాటు మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ (ఓపీఎస్) విధానం అమలు చేయాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింజేయాలన్నారు. సుప్రీం కోర్టు చెప్పిన విధంగా సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీఎన్జీజీఓ నిరసనకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్డీ నాయుడు, నగర అధ్యక్షుడు వెంకటనారాయణ సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శ్రీధర్బాబు, చంద్రమోహన్, నాయకులు జమీలబేగం, లక్ష్మినారాయణ, లింగమేష్, దస్తగిరి, లక్ష్మినరసయ్య, వెంకటరాముడు, ప్రవీణ్, ప్రవీణ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
కేశవ్ అండతోనే మట్టి దోపిడీ
ఉరవకొండ: మంత్రి పయ్యావుల కేశవ్ అండతోనే టీడీపీ నేతలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయ పరిసరాల్లో మట్టి దోపిడీకి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. గురువారం పెన్నహోబిలం ఆలయ కమిటీ మాజీ చైర్మన్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తూలురు అశోక్, రూరల్ పరిశీలకులు డిష్ సురేష్, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి కౌడిగి గోవిందు, పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు ముస్టురు నరేష్ తదితరులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇష్టారాజ్యంగా సహజ సంపదను దోపిడీ చేస్తున్నారన్నారు. అక్రమాలపై ప్రశ్నించే వారు ఉండకూడదన్న ఉద్దేశంతోనే పెన్నహోబిలం ఆలయానికి ఈఓను సైతం నియమించలేదన్నారు. పెద్ద ఎత్తున మట్టి దోపిడీ జరుగుతున్నా దేవదాయ శాఖ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం దుర్మార్గమన్నారు. ఇకపై సహజ సంపద దోపిడీ జరగకుండా వైఎస్సార్సీపీ అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జయరాం, షేక్షానుపల్లి రమేష్, చంద్ర, నీలప్ప తదితరులు పాల్గొన్నారు. -
అరటి ఎగుమతికి సహకారం
అనంతపురం అర్బన్: ‘రైలు ద్వారా అరటి ఎగుమతికి తగిన సహకారం అందిస్తామని ఎగుమతిదారులకు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. అరటి ఎగుమతిపై కలెక్టర్ బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో ఉద్యాన శాఖ అధికారులు, ఎగుమతిదారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైలు ద్వారా తాడిపత్రి నుంచి జేఎన్పీటీ పోర్టుకు అరటి ఎగుమతులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. రిఫర్ కంటైనర్కు రూ.10 వేలు ప్రోత్సాహకం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎగుమతిదారులు రవాణా ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు. ఇన్సెంటివ్ విషయంపై ఉద్యాన శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడామన్నారు. అరటి ఎగుమతి ఒకసారి విజయవంతం అయితే దీర్ఘకాలికంగా చాలా ప్రయోజనం ఉంటుందన్నారు. అరటి నాణ్యత పెంచేందుకూ చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని గ్రామాల్లోనూ రైతులకు సంబంధిత అధికారుల ద్వారా శిక్షణ ఇప్పిస్తామన్నారు. ఎగుమతిదారులతో మాట్లాడి వారి సమస్యలను కలెక్టర్ తెలుసుకున్నారు. రైలు ద్వారా అరటి రవాణాలో పరిష్కరించాల్సిన అంశాలపై చర్చించారు. సమావేశంలో ఉద్యాన శాఖ డీడీ ఉమాదేవి, ఇతర అధికారులు, ఎగుమతిదారులు, వాటాదారులు పాల్గొన్నారు. -
వేడుకగా ఘంటసాల రాష్ట్ర స్థాయి పురస్కారాల ప్రదానం
అనంతపురం కల్చరల్: ఘంటసాల 52వ వర్ధంతి సందర్భంగా ఘంటసాల సంగీత కళాభారతి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఘంటసాల పురస్కార వేడుకలు బుధవారం రాత్రి అనంతపురంలో వేడుకగా జరిగాయి. సంస్థ అధ్యక్షుడు సుగుమంచి సురేష్బాబు నేతృత్వంలో హైదరాబాదుకు చెందిన ప్రముఖ గాయకుడు, అభినవ ఘంటసాలగా కీర్తికెక్కిన ధూళిపాళ మిత్రకు అవార్డును అందజేశారు. స్థానిక అనంతపురం క్లబ్ వేదికగా సాగిన ఈ వేడుకలో తొలుత సంగీత విభావరి వీనుల విందుగా సాగింది. అనంతరం డీఆర్వో మలోల, సామాజిక సేవా కార్యకర్త రవికాంత్ రమణ, క్లబ్ సెక్రటరీ కేశవరెడ్డి, జీవీ రామయ్య తదితరులు మాట్లాడుతూ.. ఘంటసాల జీవితంలోని విశేషాలను గుర్తు చేశారు. అనంతరం శ్రీదేవి, సురేష్, ఆదినారాయణ, జ్యోతి , కృష్ణవేణి, సూర్యనారాయణ తదితరులు ఆలపించిన పాటలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. -
ముగిసిన పోలీసు క్రీడా పోటీలు
అనంతపురం సెంట్రల్: జిల్లా పోలీసు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ బుధవారంతో ముగిసింది. మూడు రోజులుగా వివిధ క్రీడల్లో రాణించిన పోలీసులను అభినందిస్తూ స్థానిక పరేడ్ మైదానంలో ముగింపు కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. విజేతలకు ట్రోఫీలు, మెడల్స్, మెమొంటోలను డీఐజీ డాక్టర్ షిమోషి, ఎస్పీ జగదీష్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. పండుగ వాతావరణంలో క్రీడా పోటీలు జరుపుకోవడం అభినందనీయమన్నారు. ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ.. క్రీడా స్ఫూర్తితో అన్ని జట్లూ ఉత్తమ ప్రతిభ కనబరిచారని ప్రశంసించారు. కార్యక్రమంలో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్కుమార్ చౌదరి, ట్రైనీ ఐపీఎస్ అధికారి అశ్వనిమణిదీప్, ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాజ్ బాషా, డీఎస్పీలు శ్రీనివాసరావు, రవిబాబు, శ్రీనివాస్, మహబూబ్బాషా, నీలకంఠేశ్వరరెడ్డి, సూర్యనారాయణరెడ్డి, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు. -
పెన్నహోబిలంలో మట్టి తోడేళ్లు
● లక్ష్మీనృసింహుని ఆలయం చుట్టూ తవ్వకాలు ● జేసీబీతో తవ్వి.. ట్రాక్టర్ల ద్వారా తరలించి అమ్ముకుంటున్న వైనంఉరవకొండ: రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని ప్రముఖ పర్యాటక – పుణ్యక్షేత్రం పెన్నహోబిలంలో సహజ వనరులపై అక్రమార్కులు కన్నేశారు. ఆలయ పరిధిలోని భూముల్లో మట్టిని యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఏటా మే నెలలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇక్కడ ఉత్సవాల సమయంలో ఆలయ పరిసరాలు– చుట్టుపక్కల ఆరుబయలు ప్రాంతాల్లో టెంట్లు వేసుకుని ఇక్కడే వంటావార్పు చేసుకుంటుంటారు. కొందరు భక్తులు వారి ఆర్థిక స్థోమతను బట్టి వసతి కోసం సత్రాలు/ భవనాలు , బేస్మెంట్లు నిర్మించారు. అలాంటి ఈ పుణ్యక్షేత్ర పరిసరాల్లోని ఆరుబయలులో మట్టితో పాటు వివిధ రకాల చెట్లు ఉన్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కొందరు అక్రమార్కులు సహజ వనరులను సొంత ఆదాయమార్గంగా మార్చుకున్నారు. ఇప్పటికే ఉరవకొండ, వజ్రకరూరు ప్రాంతాల్లోని హంద్రీ–నీవా కాలువ గట్ల మట్టిని దోచేసి రూ.కోట్లు గడించారు. తాజాగా వీరి కన్ను పెన్నహోబిలంపై పడింది. ఇక్కడ ఆరుబయలులోని ఎర్రమట్టిని జేసీబీలు పెట్టి తవ్వేస్తున్నారు. ట్రాక్టర్ మట్టి రూ.1000 దాకా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మూడు వారాలుగా మట్టిని తోడేస్తుండటంతో పెద్ద పెద్ద గోతులు కనిపిస్తున్నాయి. అక్రమార్కులకు టీడీపీ నేతల అండ దండలు ఉండటంతో రెచ్చిపోతున్నారని తెలుస్తోంది. దేవదాయ శాఖ నిర్లక్ష్యం పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఆలనా పాలనా గాలిలో దీపంలా మారింది. ఇక్కడ రెగ్యులర్ కార్య నిర్వహణ అధికారి (ఈఓ) లేరు. దీంతో ఆలయ నిర్వహణ – సిబ్బంది పర్యవేక్షణ గాడితప్పింది. దేవదాయ శాఖ ప్రస్తుతానికి ఇన్చార్జ్ అధికారిని నియమించి చేతులు దులుపుకొంది. ఈ నేపథ్యంలో ఆలయం చుట్టుపక్కల ఏమి జరుగుతోందో పట్టించుకునేవారు లేరు. మట్టి తవ్వుకుపోతున్నా.. పచ్చని చెట్లు నేల కూలుస్తూ పర్యావరణానికి హాని కలిగిస్తున్నా తమకు సంబంధం లేదన్నట్టుగా ఉంటున్నారు. పెన్నహోబిలంలో ఆలయ దిగువన ఆమిద్యాల మార్గంలో అక్రమంగా మట్టి తవ్వకాలు -
‘ప్రైవేట్’ భాగస్వామ్యంతో టెన్త్ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఈసారి ప్రైవేట్ పాఠశాలల టీచర్లకు భాగస్వామ్యం కల్పించనున్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), డిపార్ట్మెంటల్ అధికారులు (డీఓ), ఇన్విజిలేటర్లగా ప్రైవేట్ పాఠశాలల టీచర్లను తీసుకోనున్నారు. పరీక్షల నిర్వహణలో నూతన ఒరవడికి విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ యాజమాన్యాల పాఠశాలల నుంచి 75 శాతం మందిని తీసుకుంటే, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల నుంచి 25 శాతం మందిని తీసుకోనున్నారు. అలాగే తొలిసారిగా అన్ని పరీక్ష కేంద్రాలకు సీఎస్, డీఓ, ఇన్విజిలేటర్ల నియామకం ప్రక్రియ ఎస్ఎస్ఈ బోర్డు నుంచే చేపట్టనున్నారు. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (టిస్) ఆధారంగా హెచ్ఎంలు, టీచర్ల జాబితా తయారు చేసి మండల విద్యాశాఖ అధికారులు, డిప్యూటీ డీఈఓలకు పంపారు. వారు ఆ జాబితాలను పరిశీలించి ప్రతి టీచరుకూ సంబంధించి రిమార్కులు రాసి పంపాలి. నిబంధనల మేరకు అనర్హులైన వారిని తొలిగించి.. అర్హులైన వారిని విధుల్లో నియమిస్తారు. ఈ విషయాలను వెబెక్స్లో విద్యాశాఖ కమిషనర్ జిల్లాల అధికారులకు స్పష్టం చేశారు. 60 ఏళ్లు నిండిన వారికి, ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్నవారికి మినహాయింపు ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మినహాయింపు ఇస్తారు. అయితే వీరు సంబంధిత మెడికల్ ధ్రువీకరణ సర్టిఫికెట్లను ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలకు అందజేయాల్సి ఉంటుంది. వారు సిఫార్సు చేస్తే డీఈఓ ద్వారా బోర్డుకు వెళ్తాయి. అక్కడి నుంచి మినహాయింపు ఇస్తారు. చార్జెస్ ఫ్రేమ్ అయిన వారు, ఇతర క్రమశిక్షణ చర్యలకు పాల్పడిన వారిని పరీక్షల నిర్వహణ విధులకు తీసుకోరు. ఉన్నతాధికారులు వెబెక్స్లో తెలియజేశారని పూర్తిస్థాయి విధివిధానాలు రెండుమూడు రోజుల్లో రానున్నాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 143 పరీక్ష కేంద్రాలు మార్చి 16 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షలకు జిల్లాలో 143 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 31,931 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 16,384 మంది బాలురు, 15,547 మంది బాలికలు ఉన్నారు. మూడు ఓరియంటల్ స్కూల్స్ నుంచి 41 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అలాగే 36 కేంద్రాల్లో 1,288 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన విద్యాశాఖ కమిషనర్ ప్రభుత్వ పాఠశాలల నుంచి 75 శాతం, ప్రైవేట్ నుంచి 25 శాతం -
ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై రేపు ధర్నా
అనంతపురం ఎడ్యుకేషన్: మేనిఫెస్టో సాక్షిగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ఆధ్వర్యంలో ఈ నెల 13న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం స్థానిక సంఘం జిల్లా కార్యాలయంలో ఎస్టీయూ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు నీలూరి రమణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి 20 నెలలు కావస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన ఎన్నికల హామీలను ఇంతవరకు నెరవేర్చకపోవడం దారుణమన్నారు. మెరుగైన పీఆర్సీ ఇస్తామని నమ్మించి రెండున్నరేళ్లు ఆలస్యమవుతున్నా కనీసం కమిటీ కూడా వేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. సకాలంలో పీఆర్సీ ఇవ్వకపోవడంతో ప్రతి ఉద్యోగీ ఆర్థికంగా చాలా నష్టపోతున్నారన్నారు. నష్ట నివారణ చర్యలో భాగంగా మధ్యంతర భృతి ప్రకటించకపోవడం అన్యాయమన్నారు. రిటైర్డు ఉద్యోగులకు అందాల్సిన సౌలభ్యాలు నెలల తరబడి ఆలస్యం అవుతున్నాయన్నారు. డిమాండ్ల సాధన కోసం శుక్రవారం తలపెట్టిన ధర్నా విజయవంతం చేయాలని రమణారెడ్డి పిలుపునిచ్చారు. సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కమిటీ మెంబర్ వి.రాజశేఖర్, జిల్లా గౌరవాధ్యక్షుడు శివయ్య చారి, జిల్లా ఆర్థిక కార్యదర్శి జి.మల్లికార్జున, రాష్ట్ర కౌన్సిలర్ కె.కృష్ణమోహన్, జిల్లా ఉపాధ్యక్షుడు నాగభూషణ, నాయకులు వై.రవి, నిట్టూరు చంద్రశేఖరరావు, రామకృష్ణ, శ్రీనివాసులు, మహేష్రెడ్డి పాల్గొన్నారు. తాగునీటి సమస్యలపై కమాండ్ కంట్రోల్ సెంటర్ ● 97017 45437కు ఫోన్ ద్వారా ఫిర్యాదు అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం జిల్లా పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి టి.నాగరాజనాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సంబంధిత సమస్యలు ఎదురైతే ప్రజలు ఫోన్ ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. అందిన ఫిర్యాదులను తక్షణమే సంబంధిత అధికారులకు తెలియజేసి వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బి.మదన్మోహన్ 97017 45437 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయొచ్చని డీపీఓ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
ఉద్యాన శాఖ కార్యాలయ తలుపులు ధ్వంసం
ఉరవకొండ: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పక్కనే ఉన్న ఉరవకొండ నియోజకవర్గ ఉద్యాన శాఖ కార్యాలయ తలుపులను మంగళవారం రాత్రి దుండగులు ధ్వంసం చేశారు. బుధవారం ఉదయం విధులకు వచ్చిన సిబ్బంది గమనించి ఆ శాఖ అధికారి యామినికి తెలపడంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే కార్యాలయంలో రికార్డులు, ఫర్నీచర్, ఇతర సామగ్రి చెక్కుచెదరలేదని పోలీసులు గుర్తించారు. ఇది ఆకతాయిల పనిగా అనుమానిస్తున్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తనివ్వకండి● జెడ్పీ సీఈఓ శివశంకర్ ఆత్మకూరు: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో ఎక్కడేగానీ తాగునీటి సమస్య తలెత్తరాదని, ఈ మేరకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జెడ్పీ సీఈఓ శివశంకర్ ఆదేశించారు. ఆత్మకూరు మండలం సిద్దరాంపురం, ఆత్మకూరు, సింగంపల్లి గ్రామాల్లో జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకట సుబ్బయ్యతో కలసి బుధవారం ఆయన పర్యటించారు. స్థానిక సమస్యలపై ప్రజలతో ఆరా తీశారు. ఘన, ద్రవ వ్యర్థ పదార్థాలతో సంపద తయారీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం సర్వేల ప్రగతిపై ఉద్యోగులతో సమీక్షించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మీనరసింహ, డిప్యూటీ ఎంపీడీఓ సాదిక్వలి, పంచాయతీ కార్యదర్శులు మల్లేష్, అశోక్, శిరీష, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కేసుల దర్యాప్తులో వేగం పెరగాలి : ఎస్పీ అనంతపురం సెంట్రల్: తీవ్రమైన నేరాల దర్యాప్తులో వేగం మరింత పెరగాలని సిబ్బందిని ఎస్పీ జగదీష్ ఆదేశించారు. పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నిర్వహించిన నెల వారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రేవ్, నాన్గ్రేవ్ కేసులు, హత్యలు, పోక్సో, అత్యాచారం, దొంగతనాలు, దోపిడీలు, మిస్సింగ్, చీటింగ్, రోడ్డు ప్రమాదాలు తదితర కేసుల దర్యాప్తుపై ఆరా తీశారు. రాత్రి సమయాల్లో గస్తీ పెంచాలని, పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. గంజాయి తదితర మాదక ద్రవ్యాలు తీసుకోవడం ద్వారా కలిగే దుష్ప్రభావాలు, శిక్షలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మార్చిలో జరగనున్న లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకుని కేసులు పరిష్కరించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో తాడిపత్రి ఏఎస్పీ రోహిత్కుమార్, ట్రైనీ ఐపీఎస్ అశ్వని మణిదీప్, డీఎస్పీలు శ్రీనివాసరావు, రవిబాబు, శ్రీనివాస్, మహబూబ్బాషా, సూర్యనారాయణరెడ్డి, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
మొదలైన ‘చీనీ’ సీజన్
అనంతపురం అగ్రికల్చర్: చీనీ సీజన్ ప్రారంభమైంది. అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డుకు సరుకు రావడం ఇప్పుడిప్పుడే మొదలైంది. గత అక్టోబర్ నుంచి జనవరి వరకు దాదాపు నాలుగు నెలల పాటు నామమాత్రపు అమ్మకాలు జరిగాయి. ఈ కాలంలో రోజుకు 100 టన్నులు కూడా క్రయ విక్రయాలు జరగలేదు. సాధారణంగా ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు మార్కెట్ జోరుగా ఉంటుంది. దీంతో ఈ సీజన్ మొదలు కావడంతో ఈ నెల నుంచి మార్కెట్కు సరుకు పెరుగుతూ వస్తోంది. బుధవారం మార్కెట్లో 500 టన్నుల వరకు అమ్మకాలు జరిగాయి. ఇక నుంచి మరింత పెరిగే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. ఇక మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో రోజుకు 1,500 టన్నుల దాకా క్రయ విక్రయాలు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. గిట్టుబాటు ధర కోసం ఎదురుచూపు చీనీ ధరలు గత ఏడాది నేలచూపు చూడటంతో రైతులు నష్టాలు మూటగట్టుకున్నారు. మార్చి, ఏప్రిల్ మినహా మిగతా నెలల్లో గరిష్ట ధర రూ.20 వేలకు మించి పలకలేదు. ఇప్పుడు సీజన్ ఆరంభంలో గరిష్ట ధర రూ.24 వేలతో నడుస్తోంది. వేసవిలో ఈసారి చీనీకి మంచి ధరలు పలికే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలో 37 వేల హెక్టార్ల భారీ విస్తీర్ణంలో చీనీ తోటలు విస్తరించగా.. 7.50 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఫలసాయం వస్తుందని చెబుతున్నారు. ఇక్కడ పండుతున్న చీనీలో 60 శాతం వరకు రాజస్తాన్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలతో పాటు హైదరాబాద్, చైన్నె, బెంగళూరుకు చెందిన వ్యాపారులు కొందరు నేరుగా, మరికొందరు తమ ఏజెంట్ల ద్వారా కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్ యార్డులో గ్రేడ్–ఏతో పాటు బీ, సీ గ్రేడ్ చీనీ అమ్మకాలు జరుగుతున్నందున ఉత్తరాది నుంచి వచ్చే పెద్ద పెద్ద వ్యాపారులతో పాటు లోకల్ వ్యాపారులు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. గతేడాది నష్టాల నుంచి గట్టెక్కడానికి మంచి గిట్టుబాటు ధర కోసం ‘అనంత’ చీనీ రైతులు ఎదురుచూస్తున్నారు. మార్కెట్ యార్డులో చీనీ క్రయ విక్రయాలు -
దేవుళ్ల పేరుతో రాజకీయమా..?
ఉరవకొండ: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక దేవుళ్లను వాడుకునే నీచ సంస్కృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారారని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరుముడితో శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లిన శివమాలధారులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడం దారుణమన్నారు. ఆలయాల నిర్వహణ, భక్తుల భద్రత విషయంలో చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. గతంలో తిరుమల, సింహాచలం తొక్కిసలాటలో తొమ్మిది మంది మృతి చెందినా, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తొక్కిసలాటలో మరో పది మంది భక్తులు చనిపోయినా ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోలేదన్నారు. శ్రీశైలంలోనూ పొరపాటున అలాంటి ఘోర ఘటనలు జరిగి ఉంటే ప్రభుత్వం బాధ్యత వహించేదా అని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలు పట్టని బాబు అండ్ కో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నా రాజకీయ స్వార్థమే తమకు ముఖ్యం అన్నట్టుగా చంద్రబాబు అండ్ కో వ్యవహరిస్తోందని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ నివేదిక ఇచ్చినా.. దుష్ప్రచారం చేసినందుకు పశ్చాత్తాపం చెందకుండా మరింత దిగజారుడుగా వ్యవహరించారన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు కేబినెట్ మొత్తం ప్రెస్మీట్ పెట్టి లడ్డూ ప్రసాదం అంశంలో సిట్ నివేదిక ఇచ్చిన అంశంపై ఏకసభ్య కమిటీతో విచారణ చేయిస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఇక శ్రీశైలం మల్లన్న లడ్డూ ప్రసాదం తయారీలోనూ బాత్రూంలు కడిగే ద్రావణం కలిపారని చేసిన ప్రకటన భక్తులు నిర్ఘాంతపోయేలా చేసిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఈ విషప్రచారాన్ని కోట్లాది మంది భక్తులు చీదరించుకుంటున్నారన్నారు. తిమ్మిని బమ్మిని చేసే ఘనుడు కేశవ్ ఉరవకొండ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తిమ్మిని బమ్మిని చేసి పచ్చి అబద్దాలు చెప్పడంలో ఘనుడని విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు ప్రభుత్వం తప్పులు ఎప్పుడు బయటపడ్డా ప్రెస్మీట్ల ద్వారా పచ్చి అబద్ధాలు వల్లెవేయడం కేశవ్కు పరిపాటిగా మారిందన్నారు. ముఖ్యంగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో మాట్లాడి అభాసుపాలయ్యారన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవహారంలోనూ జీఓలను వక్రీకరిస్తూ గందరగోళం సృష్టిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తులూరు అశోక్, జిల్లా అధికార ప్రతిని సీపీ వీరన్న, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ ఈడిగ ప్రసాద్, రాష్ట్ర నాయకులు బసవరాజు, రూరల్, మండల సమన్వయకర్తలు ఎర్రిస్వామిరెడ్డి, ఓబన్న, పరిశీలకులు డిష్ సురేష్, వజ్రకరూరు కన్వీనర్ సోమశేఖర్రెడ్డి, చాబాల జగదీష్, నాయకులు పచ్చి రవి, చిన్న భీమా, మారెష్, వడ్డే ఆంజినేయులు, మహనంది తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలంలో శివభక్తులపై లాఠీచార్జ్ చేయడం దారుణం భక్తులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలం వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజం -
విభిన్న ప్రతిభావంత యువతకు ‘ఇగ్నైట్’
● స్వయం ఉపాధి దిశగా శిక్షణ ● జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అనంతపురం క్రైం: విభిన్న ప్రతిభావంత యువత స్వయం ఉపాధి సాధించే దిశగా ‘ఇగ్నైట్’ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బుధవారం అనంతపురంలోని అహుడా కార్యాలయంలో అధికారులతో కలసి ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త కార్యాచరణ లక్ష్య సాధనలో భాగంగా అనంతపురంలోని రతన్టాటా ఆవిష్కరణ కేంద్రం ఆధ్వర్యంలో స్వయం ఉపాధి రంగాల్లో శిక్షణను అందజేస్తున్నట్లు వివరించారు. వ్యాపార ప్రారంభానికి అవసరమైన నైపుణ్యాలు, మార్కెటింగ్ విధానాలు, ఆర్థిక నిర్వహణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై సమగ్ర మార్గదర్శకత్వంపై శిక్షణ ఉంటుందన్నారు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న ప్రత్యేక అవసరాలున్న వ్యక్తులు, దివ్యాంగులు, లింగ వైవిధ్య వ్యక్తులు అర్హులన్నారు. మార్చి 2 నుంచి 16వ తేదీ వరకూ ఉచిత వసతి సదుపాయంతో శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్న వారు ముందుగా rtih. ananthapuramu@gmail. com మెయిల్కు దరఖాస్తులు పంపి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 91003 32660, 77299 32987లో సంప్రదించాలని కోరారు. -
పేట్రేగిపోతున్న టీడీపీ నాయకులు
● రస్తా లేదంటూ దౌర్జన్యం ● వత్తాసు పలుకుతున్న పోలీసులు విడపనకల్లు: మండలంలోని వి.కొత్తకోటలో టీడీపీ నేతల ఆగడాలకు అంతు లేకుండా పోతోందని, వారు పేట్రేగి పోతుండడంతో తమకు రక్షణ లేకుండా పోతోందని ఆ గ్రామానికి చెందిన పలువురు ముస్లిం మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఫర్వీన్, రుబియా, షేక్ బాబూన్నీ, ఖాజీము, బడేషావలి తదితరులు మాట్లాడుతూ... గ్రామంలోని బడేషావలి దర్గా సమీపంలో సర్వే నంబర్ 703లో తమకు పూర్వీకుల నుంచి సంక్రమించిన 4 ఎకరాల భూమి ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ ఉన్నాయన్నారు. రూ. కోట్లు విలువ చేసే ఈ ఆస్తిని ఆక్రమించుకునేందుకు సిద్ధమైన స్థానిక టీడీపీ నేతలు కొందరు తమను భూమిలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. బరితెగించి ఆడవాళ్లని కూడా చూడకుండా దాడులకు తెగబడుతున్నారని వాపోయారు. బుధవారం వారి దౌర్జన్యాలను తాళలేక డయల్ 100కి కాల్ చేసి సమస్య తెలిపినా ఎలాంటి చేకూరలేదన్నారు. చివరకు విడపనకల్లు పీఎస్కు వెళ్లి తమపై అసభ్యంగా మాట్లాడికి దాడికి ప్రయత్నించిన అసుండ షెక్షావలి, హోతూరు వలి, నేమకల్లు బాషు, మహమ్మద్, చాంద్, రజాక్వలిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని వేడుకున్నా ఫిర్యాదు స్వీకరించలేదన్నారు. చివరకు ఈ విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళతామనడంతో ఫిర్యాదు తీసుకుని, విచారణ చేస్తామని పేర్కొన్నారని వివరించారు. టీడీపీ నేతల దౌర్జన్యం నుంచి తమకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా బాధితులు కోరుతున్నారు. విద్యుదాఘాతంతో వృద్ధుడి మృతిరాప్తాడు రూరల్: విద్యుత్ షాక్కు గురై ఓ వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ఆత్మకూరు మండలం బి.యాలేరు గ్రామానికి చెందిన జయచంద్రారెడ్డి (64) అనంతపురంలోని రాంనగర్లో నివాసం ఉంటున్నాడు. ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం అనంతపురం రూరల్ మండలం సజ్జలకాలువలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో విద్యుద్దీకరణ పనుల్లో పాల్గొన్న ఆయన ప్రమాదవశాత్తు షాక్కు గురై మృతి చెందాడు. భార్య నాగేశ్వరి బుధవారం చేసిన ఫిర్యాదు మేరకు అనంతపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
బ్రహ్మసముద్రం : మండలంలోని పడమటి కోడిపల్లి గొల్లలదొడ్డి గ్రామానికి చెందిన జి.వీరేష్ (28) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుదవారం మృతి చెందాడు. వారం క్రితం ద్విచక్ర వాహనంపై వెళుతూ అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఆయన ఆస్పత్రి పాలయ్యాడు. తలకు బలమైన గాయం కావడంతో అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వైద్యులు రెఫర్ చేశారు. కోమాలో ఉన్న వీరేష్ పరిస్థితి విషమించి బుధవారం సాయంత్రం మృతి చెందాడు. కసాపురంలో ప్రశాంతంగా టెండర్లు ● తలనీలాల సేకరణకు రూ.1.36 కోట్లు గుంతకల్లు: కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆదాయ వనరులపై బుధవారం నిర్వహించిన టెండర్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఆలయ ఈఓ ఎం.విజయరాజు, ధర్మకర్త కె.సుగుణమ్మ నేతృత్వంలో ఆలయ ప్రాంగణంలో బహిరంగ వేలంతో పాటు ఈ–టెండర్లలో పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. గత ఏడాది రూ.1,02,6000 తలనీలాల సేకరణ హక్కుకు టెండర్ పాడగా... ఈ ఏడాది అనంతపురానికి చెందిన కాంట్రాక్టర్ నవీన్ ఏకంగా రూ.1,36,50,000కు పాడి వేలం దక్కించుకున్నాడు. టోల్గేట్ నిర్వహణకు గత ఏడాది రూ.7.10 లక్షలు కాగా, ఈ ఏడాది రూ.19,07,069కు, సెల్ఫోన్లు భద్రపరుచు హక్కు కోసం గత ఏడాది రూ.6.20 లక్షలు ఉండగా ఈ ఏడాది రూ.8.15 లక్షలకు, హుండీ ద్వారా వచ్చిన బియ్యం సేకరణ హక్కుకు గత ఏడాది రూ.12.75 లక్షలు కాగా, ఈ ఏడాది కిలోపై రూ.29 అధికంగా పాడినట్లు అధికారులు వివరించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ఐస్ క్రీమ్ విక్రయ హక్కు రూ.2.16 లక్షలు, అగర బత్తి తయారీకి రూ.6.11 లక్షలు, కేసరి సదనం వద్ద తాత్కాలిక షెడ్డు ఏర్పాటు చేసుకుని క్యాంటీన్ నిర్వహణకు రూ.69వేలు, గోశాలలో ఎరువు సేకరణకు రూ.57 వేలు, ఒక్కో ఖాళీ డబ్బా సేకరణకు రూ.19 చొప్పన వేలం పాట సాగిందన్నారు. కాగా, ఏడాది పాటు కసాపురం ఆలయంలో కొబ్బరి కాయలు, తమలపాకులు, పూలు, పూలమాలలు, కండువాలు, శాలువాలు, జాకెట్లు, కొర పంచలు, రక్షా కంకణాలు సరఫరాకు గురువారం టెండర్లు నిర్వహించనున్నారు. అలాగే ప్రసాదాల కవర్లు, స్టెయిన్ లెస్ స్టీల్ బ్లేడ్లు, డెటాయిల్, స్టేషనరీ, రసీదు పుస్తకాలు వగైరా ముద్రించి ఇవ్వడం, ఎలక్ట్రికల్, ఫ్లంబింగ్ , శానిటేషన్ మెటిరియల్ సరఫరాకూ టెండర్లు ఉంటాయి. కార్యక్రమంలో ఏఈఓ గంజి మల్లికార్జున ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. 18 నుంచి టీసీసీ పరీక్షలుఅనంతపురం ఎడ్యుకేషన్: డ్రాయింగ్, హ్యాండ్లూమ్ వీవింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీలో లోయర్, హయ్యర్ గ్రేడ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) పరీక్షలు ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకూ అనంతపురంలోని మూడు కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు డీఈఓ ఎం.ప్రసాద్బాబు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ జి.వెంకటేష్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు www.bse.ap. gov. in వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకుని తప్పకుండా ఽధ్రువీకరించుకోవాలన్నారు. హాల్టికెట్తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఒక ధ్రువీకరణ కార్డును వెంట తీసుకెళ్లాలని సూచించారు. -
ధరల పతనంతో వంగ రైతు బెంగ
గుత్తి రూరల్: మార్కెట్లో వంకాయ పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో గుత్తి మండలం బేతాపల్లికి చెందిన రైతు నరేష్.. పంట మొత్తాన్ని గొర్రెలకు ఆహారంగా వదిలేశాడు. తనకున్న భూమిలో నుంచి ఒకటిన్నర ఎకరా విస్తీర్ణంలో సిమ్రాన్ రకం వంకాయ మొక్కలను గత నవంబర్లో రైతు నాటాడు. నార, ఎరువులు, కూలీలు, మందుల పిచికారీ తదితరాలకు రూ.80 వేలు ఖర్చు చేశాడు. మూడు నెలల పాటు పంట సంరక్షణకు మరో రూ.50 వేలు ఖర్చైంది. మంచి దిగుబడి రావడంతో ఈ ఏడాది అప్పులు తీరి తన కష్టాలు దూరమవుతాయని రైతు భావించాడు. వారం క్రితం పంట కోత కోసి ఒక్కో బస్తాలో 20 కిలోల చొప్పున మొత్తం 120 బస్తాల్లో 2.40 క్వింటాళ్ల దిగుబడిని మార్కెట్కు తరలిస్తే ఒక్కో బస్తా రూ.30 చొప్పున దళారులు అడగడంతో రైతు తీవ్రంగా నష్టపోయాడు. గతంలో 20 కిలోల బస్తా రూ.300 నుంచి రూ.500 వరకూ అమ్ముడు పోయిందని, ఈ లెక్కన రూ.5 లక్షలు వస్తుందని ఎంతో ఆశతో మార్కెట్కు పంట తరలిస్తే చివరకు రూ.50 వేలు కూడా చేతికి అందలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక చేసేది లేక పంట మొత్తాన్ని గొర్రెలకు వదిలేసినట్లుగా తెలిపాడు. -
ల్యాండ్ టైట్లింగ్ ఆదర్శం
భూమికి, వాటి యజమానులకు రక్షణగా నిలిచేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ల్యాండ్ టైట్లింగ్ చట్టంపై అప్పటి ప్రతిపక్ష టీడీపీ విషం చిమ్మింది. పచ్చమీడియా విషప్రచారం చేసింది. అయితే అంతర్జాతీయ స్థాయిలో దావోస్ వేదికగా ఇటీవల జరిగిన సదస్సులో ఆ విష ప్రచారం బట్టబయలైంది. నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ల్యాండ్ టైట్లింగ్ చట్టం గొప్పతనం.. ఆవశ్యకతను వివరిస్తూ ఐఎంఎఫ్ (ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్) ఎండీ గీతా గోపీనాథ్ ప్రశంసలు కురిపించారు. అది కూడా సీఎం చంద్రబాబు పాల్గొన్న సమావేశంలో.. ఆయన సమక్షంలోనే ప్రశంసించడం గమనార్హం. అనంతపురం అర్బన్: భూ యాజమాన్యానికి సంబంధించి గ్రామస్థాయిలో 1బి, అసైన్మెంట్, ఈనాం వంటి పలు రిజిస్టర్లు ఉన్నాయి. కలెక్టర్ కార్యాలయంలో కొన్ని, సర్వే భూ రికార్డుల శాఖ కార్యాలయంలో మరికొన్ని, సబ్రిజిస్ట్రార్, పంచాయతీ, మునిసిపల్ కార్యాలయాల్లోనూ ఇంకొన్ని రికార్డులు నిర్వహిస్తుంటారు. అటవీ, దేవదాయ, వక్ఫ్ వంటి పలు శాఖల్లోనూ భూముల రికార్డులు ఉన్నాయి. ఇన్ని రికార్డులు ఉన్నా... చట్టపరంగా ఏదీ తుది రికార్డు కాదు. ఈ రికార్డుల్లో పేరున్నా... వేరే వాళ్లు అది తనదని దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఇలాంటి కేసులు కోర్టులో చాలా నడుస్తున్నాయి. అయితే టైట్లింగ్ చట్టం ద్వారా ఒక్కసారి రిజిస్టర్ అయితే భూ యజమానులకు వారి భూములపై సంపూర్ణ హక్కులు ఉంటాయి. ఆ హక్కులపై ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరిస్తుంది. వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్లూ ఉంటాయి. ఇంతటి బృహత్తర చట్టాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టారు. ఈ ప్రక్రియ వంద శాతం పూర్తయితే ఇక తమకు విలువ ఉండదని భావించిన అప్పటి ప్రతిపక్ష టీడీపీ... పచ్చ మీడియా విష ప్రచారాన్ని చేపట్టాయి. చివరకు అధికారం చేపట్టిన తర్వాత వైఎస్ జగన్పై అక్కసుతో ఆ చట్టాన్ని సీఎం చంద్రబాబు రద్దు చేశారు. హుక్కులకు ప్రభుత్వ పూచీ ● ప్రస్తుతం రికార్డుల్లో ఉన్న వివరాలకు ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లోనూ జవాబుదారీ వహించదు. ● రెవెన్యూ రికార్డుల్లో పేరున్నంత మాత్రాన అతను భూ యజమాని కాదని... రెవెన్యూ రికార్డులు యాజమాన్య హక్కులకు సాక్ష్యంగా పనికిరావని సుప్రీం కోర్టు పలు సందర్భాల్లో తీర్పులు వెలువరించింది. ● టైట్లింగ్ చట్టం కింద రూపొందించిన రిజిస్టర్ ప్రకారం టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. దీంతో పాత రికార్డులేవీ చెల్లవు. టైట్లింగ్ ద్వారా భూ యజమాని హక్కులకు ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒక్కసారి టైటిల్ రిజిస్టర్లో పేరు నమోదైన తర్వాత ఏదైనా నష్టం జరిగిందని భూ యజమాని నిరూపించుకోగలిగితే బీమా పరిహారం కూడా చెల్లిస్తారు. భూమి హక్కులకు ఇబ్బంది కలిగితే టైటిల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా పేర్కొనడమే ఇందుకు నిదర్శనం. ● టైటిల్ రిజిస్టర్లో పేరు నమోదయ్యాక ఎవరికై నా అభ్యంతరాలు ఉంటే రెండేళ్లలోపు దాన్ని ఛాలెంజ్ చేయాలి. అలా చేయని పక్షంలో టైటిల్ రిజిస్టర్లో ఉన్న పేరే ఖరారు అవుతుంది. టైట్లింగ్ చట్టం ప్రకారం భూమి యజమానిగా ఒక్కసారి నిర్ధారణ అయితే అదే అంతిమ నిర్ణయం అవుతుంది. ● భూములకు సంబంధించిన వివాదాలు ఉంటే వాటిని ప్రత్యేకంగా నమోదు చేస్తారు. టైటిల్ నిర్ధారించే క్రమంలో భూ సమస్య తలెత్తితే పరిష్కారానికి ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో ఒక ట్రిబ్యునల్, రాష్ట్ర స్థాయిలో ఒక ట్రిబ్యునల్ వ్యవస్థ ఉంటుంది. ప్రస్తుతంలా రెవెన్యూ, సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం ఉండదు. రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్ తీర్పు మీద అభ్యంతరం వస్తే అప్పుడు హైకోర్టుకు వెళ్లవచ్చు. ● ఇప్పటి వరకూ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజుల రిజిస్ట్రేషన్ మాత్రమే జరుగుతుంది. హక్కుల రిజిస్ట్రేషన్ జరగడం లేదు. అయితే ల్యాండ్ టైటిల్ చట్టం కింద రిజిస్ట్రేషన్కు సంబంధించి పాత వ్యవస్థ స్థానంలో టైటిల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ వస్తుంది. ఈ వ్యవస్థను జిల్లా, రాష్ట్ర స్థాయిలో టైటిల్ గ్యారంటీ అథారిటీలు పర్యవేక్షిస్తూ ఉంటాయి. భూముల రిజిస్ట్రేషన్ ఎక్కడైనా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అప్పట్లోనే స్పష్టత ఇచ్చిన నీతి ఆయోగ్ తప్పుడు పత్రాలతో... భూ యజమానుల తప్పుడు ఆధార్లు సృష్టించి వారి భూములను వేరొకరికి విక్రయించిన పలు ఘటనలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చోటు చేసుకున్నాయి. వీటిపై పోలీసు విచారణ జరగడం... వాస్తవమని నిర్దారణ కావడం... తదనంతరం కేసులు నమోదు కావడం... తదితర పరిణామాలు ఉమ్మడి జిల్లా ప్రజలకు తెలిసిందే. ఇదే ల్యాండ్ టైట్లింగ్ చట్టం కింద రిజిస్టర్ జరిగితే... యజమానిని కాదని వారి భూమిని తప్పుడు మార్గాల్లో విక్రయించడం ఎలాంటి పరిస్థితుల్లోనూ సాధ్యపడదు. ఇలాంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న భూ యజమానులకు సంపూర్ణ భరోసానిస్తూ జగన్ ప్రభుత్వంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రవేశపెట్టగానే రాజకీయాల్లో పెను దుమారం రేగింది. తమ ఉనికిని కాపాడుకునేందుకు ఈ అంశంపై అప్పటి అధికార పక్షంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వచ్చాయి. ఆ సమయంలోనే ల్యాండ్ టైట్లింగ్ చట్టం పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన చేసింది. దుష్ప్రచారానికి చెక్ పెడుతూ ఈ చట్టం ప్రయోజనాలు భేష్ అంటూ కితాబునిచ్చింది. ఈ చట్టంతో భూమిపై రైతులకు సర్వ హక్కులు లభిస్తాయని స్పష్టం చేసింది. రైతుల భూములు లాక్కునే పరిస్థితి అస్సలే ఉండదని పేర్కొంది. గత జగన్ ప్రభుత్వం చేపట్టిన టైట్లింగ్ విధానానికి అంతర్జాతీయ స్థాయిలో కితాబు చంద్రబాబు సమక్షంలోనే దావోస్ వేదికగా అభినందనల వెల్లువ అయినా వైఎస్ జగన్పై అక్కసుతో రద్దు చేసిన చంద్రబాబు సర్కారు -
డుమ్మా టీచరుకు చివరి అవకాశం
ఎయిర్పోర్టుకు స్థల పరిశీలన కూడేరు: ఎయిర్ పోర్టు నిర్మాణానికి అనువైన స్థలం కోసం బ్రాహ్మణపల్లి వద్ద భూములను మంగళవారం ఆర్డీఓ కేశవనాయుడు పరిశీలించారు. ఆయన వెంట కూడేరు, ఆత్మకూరు, అనంతపురం రూరల్ మండలాల రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో నిందితుడి అరెస్ట్ గుంతకల్లుటౌన్: వివాహితను ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో భర్తను అరెస్ట్ చేసినట్లు గుంతకల్లు వన్టౌన్ పీఎస్ సీఐ మనోహర్ తెలిపారు. వివరాలను మంగళవారం రాత్రి ఆయన వెల్లడించారు. గుంతకల్లులోని భాగ్యనగర్లో నివాసముంటున్న ఆటోడ్రైవర్ షాహీర్ ఎనిమిదేళ్ల క్రితం షేక్ రుక్సార్ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. మద్యం, ఇతర చెడు వ్యసనాలకు బానిసై రెండో పెళ్లి చేసుకుంటానంటూ తీవ్ర వేధింపులకు గురి చేయడంతో మనస్తాపం చెందిన రుక్సార్ రెండు రోజుల క్రితం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో షాహీర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పాడి అనుబంధ యూనిట్ల ఏర్పాటుకు రాయితీ అనంతపురం అగ్రికల్చర్: ప్రధానమంత్రి ఆహారశుద్ధి క్రమబద్ధీకరణ పథకం (పీఎంఎఫ్ఎంఈ) కింద పాడి అనుబంధ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి 35 శాతం రాయితీతో రుణాలు అందిస్తున్నట్లు పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్చంద్ తెలిపారు. స్థానిక పశుశాఖ డీడీ కార్యాలయ హాలులో అనంతపురం డివిజన్ ఏడీలు, డాక్టర్లతో మంగళవారం ఆయన సమావేశమై మాట్లాడారు. జిల్లాలో పాడిపశువుల సమాచారాన్ని సేకరించాలన్నారు. అవసరమైతే వైద్యచర్యల్లో భాగంగా ఫార్మసీ పూర్తి చేసిన మహిళల ద్వారా ఔషధ విక్రయ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎదకు వచ్చిన పశువులకు ఇకపై తప్పనిసరిగా లింగనిర్ధారిత వీర్యం (ఎస్ఎస్ఎస్) ద్వారా కృత్రిమ గర్భోత్పత్తి చేపట్టాలన్నారు. వేసవిలో గడ్డి, నీటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని, వీఏహెచ్ఏల పనితీరు మెరుగయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీడీ డాక్టర్ వై.రమేష్రెడ్డి, డీఎల్డీఏ ఈఓ డాక్టర్ జి.వెంకటేష్, ఏడీలు డాక్టర్ రాధిక, డాక్టర్ కేఎల్ శ్రీలక్ష్మి, పశువ్యాధి నిర్ధారణ కేంద్రం (ఏడీడీఎల్) ఏడీ డాక్టర్ రవిబాబు పాల్గొన్నారు. అనంతపురం ఎడ్యుకేషన్: దాదాపు ఏడాదిన్నరకు పైగా ఎలాంటి అనుమతులు లేకుండా విధులకు డుమ్మా కొట్టిన టీచరుకు విద్యాశాఖ చివరి అవకాశం ఇచ్చింది. 10 రోజుల్లో రిపోర్టు చేసుకోకపోతే శాశ్వతంగా విధుల నుంచి తొలిగింపునకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వివరాల్లోకి వెళ్తే...విడపనకల్లు మండలం హావలిగి జెడ్పీహెచ్ఎస్లో గణితం టీచరుగా పని చేస్తున్న బద్రీనాథ్ 2024, జూలై 15 నుంచి విధులకు గైర్హాజరవుతూ వస్తున్నారు. ఈ అంశంపై అనంతపురం డిప్యూటీ డీఈఓ విచారణ చేపట్టి ఇచ్చిన నివేదిక ఆధారంగా మేజర్ పెనాల్టీ కోసం తుది షోకాజ్ నోటీసు జారీ చేశారు. అయినా ఆయన అందుబాటులోకి రాలేదు. డీఈఓ కార్యాలయానికి ఎలాంటి సంజాయిషీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో పది రోజుల్లోపు రిపోర్టు చేసుకోని పక్షంలో శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఉద్యోగం నుంచి తొలిగించేందుకు చర్యలు తీసుకుంటామని డీఈఓ ప్రసాద్బాబు స్పష్టం చేశారు. కాగా, అప్పుల కారణంగానే బద్రీనాథ్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. సుమారు రూ. 4 కోట్ల మేర అప్పులున్నట్లు తెలిసింది. అతని బాధితుల్లో 60 మందికి పైగా విద్యాశాఖలో పని చేస్తున్న టీచర్లు, నాన్ టీచింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఆయన పని చేస్తున్న పాఠశాలలోనే సుమారు రూ. 25 లక్షలకు పైగా అప్పులు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. -
ఆర్డీటీ నాశనానికి టీడీపీ నేతలే కారణం
కళ్యాణదుర్గం: ఉమ్మడి జిల్లాలో ఆర్డీటీ సేవలు అంతరించిపోయేందుకు టీడీపీ నాయకులే కారణమయ్యారని వైఎస్సార్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ డాక్టర్ తలారి రంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఓ టీవీ ఛానల్తో ఆయన మాట్లాడుతూ... ఆర్డీటీకి 2025 ఏప్రిల్ నుంచి ఎఫ్సీఆర్ఏ (ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్) రెన్యువల్ కాలేదన్నారు. దీంతో సేవా కార్యక్రమాలకు నిధులు అందకుండా పోయాయన్నారు. అంతేకాక సంస్థ ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో ఆర్డీటీపై ఉద్దేశపూర్వకంగానే కుట్ర జరిగినట్లుగా అర్థమవుతోందన్నారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏను పునరుద్దరించాలని తాను కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తే రాజకీయ ఉనికి కోసమేనంటూ కళ్యాణదుర్గం, రాయదుర్గం టీడీపీ ఎమ్మెల్యేలు ప్రజలను పెడదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు. అసలు ఆర్డీటీ పుట్టిందే కళ్యాణదుర్గం ప్రాంతం బెళుగుప్ప మండలంలోనన్నారు. అక్కడి నుంచే తాను పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. తాను బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లిలో పాదయాత్ర చేస్తున్నప్పుడు నాలుగు రోజుల్లో ఎఫ్సీఆర్ఏ తెస్తామని టీడీపీ నాయకులు పేర్కొన్నారని, అయితే నేటికీ ఇది సాధ్యం కాలేదని తెలిపారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆదేశాలతో ఆ రోజుల్లో పాదయాత్ర సాగనివ్వకుండా పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారని గుర్తు చేశారు. నిధులు అందకపోవడంతో ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన సంస్థ... సేవా కార్యక్రమాలను కొనసాగించే క్రమంలో ఆస్తుల విక్రయానికి సిద్ధమవుతోందని, ఇది కూడా కళ్యాణదుర్గం నుంచే ప్రారంభం కావడం బాధాకరమన్నారు. బెళుగుప్ప, కొత్తూరు, బోయలపల్లి, మల్లికార్జున పల్లి, కై రేవు తదితర ప్రాంతాల్లోని దాదాపు 8కి పైగా స్థిరాస్తులు అమ్ముకోవాల్సిన దుర్గతికి సంస్థను నెట్టేశారని మండిపడ్డారు. ఆర్డీటీ ఆస్తులు అమ్ముతున్నారంటే సంస్థ మూసివేతకు సంకేతంగా భావించాల్సి వస్తోందన్నారు. ఇప్పటికై నా ప్రజలు చైతన్యం కాకపోతే రానున్న రోజుల్లో తీవ్ర నష్టాలను చవిచూడాల్సి ఉంటుందన్నారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లోనైనా ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. తలారి రంగయ్య -
వక్ఫ్ భూముల సేకరణ నిలిపివేయాలి
అనంతపురం అర్బన్: గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో ఉన్న 71.57 ఎకరాల వక్ఫ్ భూముల సేకరణను తక్షణమే నిలిపివేయాలని, ఇందుకు జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు సైఫుల్లాబేగ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఆనంద్ను మంగళవారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో మైనారిటీ నాయకులతో కలసి వినతి పత్రం అందజేసి, తమ డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళగిరి మండలంలో వివిధ సర్వే నంబర్లకు సంబంధించి నోటిఫికేషన్లో చూపిన 71.57 ఎకరాల భూములు మత, ధార్మిక, విద్యా ప్రయోజనాల కోసం దశాబ్ధాలుగా వక్ఫ్ ఆస్తులుగా ఉన్నాయన్నారు. వీటిని కౌలు ప్రాతిపదికన చాలా మంది రైతులు సాగు చేస్తున్నారన్నారు. తద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ముస్లిం మైనారిటీ నిరుపేద విద్యార్థుల ప్రయోజనాలకు, మసీదులు, పాఠశాలల నిర్వహణకు, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారని వివరించారు. 1995 వక్ఫ్ చట్టం ప్రకారం వక్ఫ్ ఆస్తిని బదిలీ చేయడానికి వీలు లేదన్నారు. వివాదాస్పద నోటిఫికేషన్ జారీ చేయడానికి ముందు ముస్లిం సమాజానికి, వక్ఫ్ బోర్డుకు, అంజుమన్ సొసైటీకి, కౌలు రైతులకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని, విచారణకు అవకాశం కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపాదిత భూమిని సేకరించడం ద్వారా ముస్లిం సమాజానికి, ఈ భూముల నుంచి వచ్చే ఆదాయంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన సమాజంలోని పేదలకు పూడ్చలేని సామూహిక నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి వక్ఫ్ భూముల సేకరణ చర్యలను ప్రభుత్వం నిలిపివేయాలని, నోటిఫికేషన్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర మేయర్ వసీంసలీమ్, మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ఘర్ రిజ్వాన్, రాష్ట్ర కార్యదర్శి గౌస్బేగ్, మైనారిటీ విభాగం రాష్ట కార్యదర్శులు వేముల నదీమ్, రహంతుల్లా, అనంతపురం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ఫయాజ్, కార్పొరేటర్లు అబుసలేహ, ఇషాక్, షంషుద్ధీన్, మైనారిటీ విభాగం నగర అధ్యక్షుడు మన్సూర్, నాయకులు బాకే హబీబుల్లా, షేక్ జావీద్, ఖాజాపీరా, షరీఫ్ ఖాన్, రియాజ్, ఖాదర్బాషా, మహబూబ్బాషా, ఆసీఫ్, ఖమ్మర్ తాజ్, రపీ, షాహీ, ఇషాక్, షబ్బీర్, అబ్బాస్, ముక్తియార్ తదితరులు పాల్గొన్నారు. -
సేవాలాల్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
గుత్తి: బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ జయంత్యుత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆనంద్ అఽధికారులను ఆదేశించారు. గుత్తి మండలం సేవాగఢ్లోని సమావేశ మందిరంలో మంగళవారం ఆయా శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో మూడు రోజులపాటు సేవాలాల్ జయంతి ఉత్సవాలు జరుగుతాయన్నారు. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశముందని గిరిజన సంఘాల నాయకులు, సేవాలాల్ ట్రస్ట్ సభ్యులు చెప్పారన్నారు. భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రస్ట్ సభ్యులతో సమన్వయం చేసుకుని తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి సేవాలాల్ జయంత్యుత్సవాలను జయప్రదం చేయాలన్నారు. అనంతరం సేవాలాల్, మాతా జగదాంబ ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అశ్విన్ మణిదీప్, గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాస్, సేవాలాల్ ట్రస్ట్ అధ్యక్షులు కేశవ నాయక్, ట్రస్ట్ సభ్యులు అశ్వత్థ నాయక్, డీటీడబ్ల్యూఓ శ్రీనివాసరావు, డీఎల్డీఓ విజయలక్ష్మి, చెర్లోపల్లి సర్పంచు అప్పా వెంకటేష్, గుత్తి మున్సిపల్ కమిషనర్ బబ్బార్మియా, ఐఅండ్పీఆర్ డీఐపీఆర్ఓ బాల కొండయ్య, ఎకై ్సజ్ ఎస్ఐ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
బుగ్గరామలింగేశ్వర బ్రహ్మోత్సవాలు ప్రారంభం
గ్రామోత్సవంలో స్వామి ఉత్సవ విగ్రహాలు గోపూజ అనంతరం యాగశాల ప్రవేశానికి గోవును తీసుకెళ్తున్న దృశ్యంతాడిపత్రి రూరల్: పట్టణంలోని బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. తొలిరోజు తెల్లవారుజామున స్వామివారికి అర్చకులు అభిషేకాలు, నక్షత్ర హారతులు ఇచ్చి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయంలోని పార్వతీమాతకు కుంకుమార్చనలు అనంతరం విశేష అలంకరణ చేశారు. ఈఓ రామాంజినేయులు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అర్చకులు గోపూజ నిర్వహించి, యాగశాల ప్రవేశం చేయించారు. ఆలయంలో గణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ స్థాపన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి స్వామి, అమ్మవార్ల విశేష అలంకరణ అనంతరం పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. -
భూముల రీ సర్వే పక్కాగా చేపట్టండి
కళ్యాణదుర్గం: భూముల రీ సర్వేని పక్కాగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి వద్ద జరుగుతున్న భూముల సమగ్ర రీ సర్వే ప్రక్రియను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ల వారీగా రైతులకు ముందుస్తుగా సమాచారం ఇచ్చి సర్వే చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లకూ తావివ్వరాదని సిబ్బందికి సూచించారు. ఏవైనా అభ్యంతరాలుంటే వెంటనే పరిశీలించి క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు లోపు సర్వే పూర్తి చేయాలని తెలిపారు. అనంతరం పలు అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్వే ఆఫ్ డివిజినల్ ఇన్స్పెక్టర్ అంజలి, తహసీల్దార్ భాస్కర్, మండల సర్వేయర్ ప్రభాకర్, వీఆర్వో జవహర్ బాషా, రైతులు అంజనరెడ్డి, పాతూరప్ప, పలువురు రైతులు పాల్గొన్నారు. కసాపురంలో నేడు టెండర్లు గుంతకల్లు రూరల్: ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానంలో ఏడాది పాటు నిర్వహించే వివిధ రకాల పనులకు ఈ నెల 11న బహిరంగ వేలంతో పాటు షీల్డు, ఈ–టెండర్లు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు తలనీలాల సేకరణ, ఖాళీ ఆయిల్ డబ్బాలు, నెయ్యి, గోడంబి డబ్బాల సేకరణ, కొబ్బరి చిప్పలు, మొబైల్ ఫోన్ కౌంటర్, పార్కింగ్, టోల్గేట్, బెడ్షీట్స్, చాపలు అద్దెకు ఇచ్చే లైసెన్స్, తాత్కాలిక షెడ్డు వేసి హోటల్ నిర్వహణ, గోశాల ఎరువు సేకరణ, అగరు బత్తీలు, సంగంధ ద్రవ్యాలు అమ్ముటకు, బియ్యం– బేడల సేకరణ, భక్తుల లగేజీ భద్రపరుచుట తదితర వాటికి టెండర్లను నిర్వహించనున్నట్లు వివరించారు. ఆసక్తిగలవారు బుధవారం ఉదయం జరిగే బహిరంగ వేలం పాటతో పాటు షీల్డు, ఈ–టెండర్లలో పాల్గొనవలసిందిగా ఆయన సూచించారు. బాల్యవివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి అనంతపురం అర్బన్: జిల్లాను బాల్యవివాహరహితంగా తీర్చిదిద్ధాలని కలెక్టర్ ఆనంద్ అన్నారు. ఐసీడీఎస్, జిల్లా బాలల పరిక్షణ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన బాల్య వివాహ విముక్త్ భారత్ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాల్యవివాహ విముక్తి రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బాల్యవివాహాలు చోటు చేసుకుంటున్న ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. మూడు నెలల పాటు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని, శిక్షలు ఏ విధంగా ఉంటాయనేదానిపై అవగాహన కల్పించాలని చెప్పారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ అరుణకుమారి, డీఆర్డీఏ పీడీ శైలజ, జిల్లా బాలల పరిరక్షణ అధికారి మంజునాథ్, ఓఏసీ శాంతమ్మ, ఉమా, నర్మద, ఆదినారాయణ, భానుజ, సమీర్, వసంతలక్ష్మి, కమలాక్షి, వెంకటర్, ఇర్ఫాన్, నిర్మల పాల్గొన్నారు. ముగిసిన ‘ప్రాక్టికల్స్’ అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన జిల్లా యంత్రాంగం, ఇంటర్ బోర్డు సిబ్బందికి పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, ఆర్ఐఓ వెంకటరమణనాయక్ కృతజ్ఞతలు తెలిపారు. చివరి రోజు ఉదయం విడత పరీక్షలకు జనరల్ విద్యార్థులు 522 మందికి గాను 518 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షలకు 403 మందికి గాను 398 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 286 మందికి గాను 269 మంది హాజరయ్యారు. ఆర్ఐఓ 2 కేంద్రాలు, జిల్లా వృత్తి విద్యా శాఖాధికారి గురువయ్యశెట్టి 2, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు 3, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు 5 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. -
అత్యవసరమైతేనే సిజేరియన్ చేయాలి
అనంతపురం మెడికల్: అత్యవసర సమయాల్లోనే సిజేరియన్ చేపట్టాలని డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబదేవి పేర్కొన్నారు. మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో గత నెలలో చోటు చేసుకున్న మాతా, శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. పుట్లూరు మండలానికి చెందిన సరస్వతికి సకాలంలో సిజేరియన్ చేయకపోవడంతో మృతి చెందిందని, ప్రజలకు అవగాహన కల్పించలేకపోయిన వైద్య సిబ్బందికి డీఎంహెచ్ఓ మోమో జారీ చేశారు. కష్టతరమైన కేసుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ శశిభూషణ్రెడ్డి, గైనకాలజిస్టు డాక్టర్ రేణుక, పీడియాట్రీషియన్లు డాక్టర్ దినకర్, డాక్టర్ లోక్నాథ్, తదితరులు పాల్గొన్నారు. -
బాబులో రాజకీయ అభద్రతాభావం
అనంతపురం: సీనియర్ రాజకీయ నాయకుడిగా చెప్పుకొనే చంద్రబాబునాయుడు తొలిసారి రాజకీయ అభద్రతాభావంలో మునిగిపోయారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ అయ్యిందంటూ చేసిన దుష్ప్రచారం సీబీఐ– సిట్ నివేదిక కొట్టిపారేసిందని, దీంతో ఏమి చేయాలో ఆయనకు దిక్కుతోచడం లేదన్నారు. ఆయన వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని తప్పుబట్టారు. మంగళవారం ఆయన అనంతపురంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఇప్పటివరకు నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారని, అయితే ఎన్నడూ లేని విధంగా తొలిసారి రాజకీయంగా అభద్రతా భావంలో పడిపోయారని విమర్శించారు. తనపై తనకే నమ్మకం లేకుండా పోయిందన్నారు. ఎన్నికల హామీలు అరకొరగా అమలు చేశారన్నారు. ఓసారి కల్తీ మద్యం అంటూ హడావుడి చేస్తారని, మరోసారి వివేకానందరెడ్డి హత్య కేసులో అబద్ధాలు ప్రచారం చేస్తారని, ఇంకోసారి శ్రీవారి లడ్డూ కల్తీ అంటూ దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, టీడీపీ నేతలు తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యిందని అసత్య ప్రచారం చేశారన్నారు. వాస్తవానికి చంద్రబాబు చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది తమ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ నేత సుబ్రమణ్యం అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ సిట్ ఏర్పాటు చేసిన అంశాన్ని ప్రస్తావించారు. చివరకు లడ్డూ ప్రసాదానికి వాడే నెయ్యిలో ఎటువంటి జంతు కొవ్వూ కలవలేదని ఎన్డీఆర్ఏ, ఎన్డీడీబీ ల్యాబ్లు తేల్చినా ఇంకా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు దుష్ప్రచారాలు ఆపడం లేదన్నారు. చంద్రబాబు చెప్పిందే సీబీఐ నివేదికలో రావాలన్నట్లుగా మాట్లాడుతున్నారన్నారు. పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం విచారకరమన్నారు. తప్పు ఒప్పుకో...చంద్రబాబూ..! ‘ఎన్నికల సమయంలో మహిళలకు నెల నెలా రూ.1500 ఇస్తామన్నారు.. నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఎవరైనా ఈ హామీల గురించి అడిగితే ఉండండయ్యా లడ్డూలో కల్తీ జరిగింది’ అంటూ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారని చంద్రబాబుపై అనంత మండిపడ్డారు. చివరకు కేబినెట్ సమావేశాల్లోనూ ఇదే చర్చలు చేస్తున్నారని, చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోబియా పట్టుకుందన్నారు. నిద్రలో కూడా చంద్రబాబు, పవన్కళ్యాణ్లు మాజీ సీఎం జగన్ను కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన సొంత మామ ఎన్టీఆర్, ఆ తర్వాత హరికృష్ణపై కూడా వ్యక్తిగత ఆరోపణలు చేసి లబ్ధి పొందిన విషయాన్ని ప్రస్తావించారు. రాజకీయాల్లో తనకు ఎవరు అడ్డువచ్చినా వారిపై లేనిపోని ఆరోపణలు చేయడం చంద్రబాబుకు అలవాటన్నారు. అలానే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి కూడా ఏదో ఒక మరక అంటించాలనే ఆరాటం తప్ప మరొకటి లేదన్నారు. ఇప్పటికై నా చేసిన తప్పులను చంద్రబాబు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. మీ హయాంలో ఉన్న కాంట్రాక్ట్ సంస్థే కదా? ‘తక్కువ ధరకు నెయ్యి వస్తుందా? అని అంటున్నారు. చంద్రబాబు కూడా వ్యాపారంలో ఉన్నాడు. డెయిరీలు ఉన్నాయి. చంద్రబాబు హయాంలో తక్కువ ధరకే నెయ్యి కొనుగోలు చేయలేదా?’ అని అనంత ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో సరఫరా జరిగి తిరస్కరించిన ట్యాంకర్ల నుంచి తీసుకున్న శాంపిళ్ల మీదే ప్రస్తుతం కేసు నడుస్తోందన్నారు. మీ హయాంలోనే ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీ నుంచే రూ.320, రూ.321కి సరఫరా జరిగింది వాస్తవం కాదా? అని నిలదీశారు. సమావేశంలో రాష్ట్ర ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాసరెడ్డి, క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జానీ, సాకే కుళ్లాయిస్వామి, కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినే రీతిలో వ్యాఖ్యలేంటి? పాలనా వైఫల్యం, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే డైవర్షన్ పాలిటిక్స్ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజం -
పీఆర్సీ కోసం పోస్ట్ కార్డుల ఉద్యమం
అనంతపురం ఎడ్యుకేషన్: పీఆర్సీ వేయాలని, ఇంటీరియం రిలీఫ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో పోస్టుకార్డుల ఉద్యమం చేపట్టారు. రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మంగళవారం యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ మెంబర్ ఎస్వీవీ రమణయ్య, బసవరాజు ఆధ్వర్యంలో గార్లదిన్నె మండలం మర్తాడు, కోటంక జెడ్పీహెచ్ఎస్లో టీచర్లతో కలిసి పోస్ట్ కార్డులను ముఖ్యమంత్రికి పంపారు. ఈ సందర్భంగా ఎస్వీవీ రమణయ్య మాట్లాడుతూ 2023 జూలై నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయులకు పే రివిజన్ జరగాలని, ఇందు కోసం కమిషన్ను నియమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు శ్రీనివాస్బాబు, దేవదానం, ముక్తియార్, కృష్ణవేణి పాల్గొన్నారు. -
నేటితో ముగియనున్న ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ విద్యార్థులకు మంగళవారంతో ప్రాక్టికల్ పరీక్షలు ముగియనున్నాయి. ఒకేషనల్ విద్యార్థులకు జనవరి 27 నుంచి ప్రారంభం కాగా, జనరల్ విద్యార్థులకు ఈ నెల 1 నుంచి ప్రారంభమయ్యాయి. సోమవారం జరిగిన పరీక్షలకు 65 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం విడతలో జనరల్ విద్యార్థులు 1,179 మందికి గాను 1,160 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 1,066 మంది విద్యార్థులకు గాను 1,051 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 433 మందికి గాను 402 మంది హాజరయ్యారు. 31 మంది గైర్హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్, ప్రాంతీయ పర్యవేక్షణాధికారి వెంకటరమణనాయక్ మూడు కేంద్రాలు, జిల్లా వృతి విద్యా శాఖాధికారి గురువయ్యశెట్టి మూడు, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు ఎనిమిది, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు పది పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అన్ని కేంద్రాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏడాది వృథా కాకుండా... జిల్లా వ్యాప్తంగా 13 మంది విద్యార్థులు అనారోగ్య కారణాలతో వారికి కేటాయించిన విడతల్లో ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాలేకపోయారు. వాస్తవానికి వారు మళ్లీ వచ్చే ఏడాదే రాసుకోవాల్సి ఉంది. అయితే వైద్య చికిత్స చేయించుకుని మెడికల్ సర్టిఫికెట్లు జతచేసి ఆర్ఐఓ వెంకటరమణనాయక్కు దరఖాస్తు చేసుకున్నారు. తర్వాత విడతల్లో అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. ఈ విషయాన్ని బోర్డు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పలుమార్లు చర్చించారు. ఎట్టకేలకు అనుమతులు తీసుకున్నారు. తర్వాత విడతల్లో రాసుకునే అవకాశం కల్పించారు. అనంతపురం, కంబదూరు, రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాలకు చెందిన 13 మంది విద్యార్థులకూ మళ్లీ అవకాశం కల్పించి రాయించారు. -
జిల్లాకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు ఓ అధికారిపై అమితమైన ప్రేమ చూపుతున్నారు. ఆయన ఉద్యోగ విరమణ చేసినా.. తిరిగి అదే స్థానంలో మరికొంత కాలం కొనసాగించేందుకు మంత్రాంగం నడుపుతున్నారు. అధికారి ద్వారా ప్రతిపాదనలు పెట్టించి మరీ ప్రభుత్వ పెద్దలకు సిఫార్సు చేస్తున
హంద్రీ–నీవా సీఈ నాగరాజ రిటైర్డు ● 10 రోజులైనా ఇన్చార్జ్ బాధ్యతలు అప్పజెప్పని వైనం ● ఆ సీటులో మరికొంతకాలం కొనసాగేందుకు ప్రయత్నాలు ● ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెస్తున్న టీడీపీ ప్రజాప్రతినిధులు ● రూ.వందల కోట్ల బిల్లుల మంజూరు కోసమేననే ఆరోపణలు అనంతపురం సెంట్రల్ : జల వనరుల శాఖలో ఎన్నడూ లేనివిధంగా నయా ట్రెండ్కు టీడీపీ ప్రజాప్రతినిధులు శ్రీకారం చుట్టారు. ఉద్యోగ విరమణ చేసిన అధికారినే తిరిగి కొనసాగించాలంటూ పట్టుబడుతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు.. ఆయన తప్ప సమర్థవంతమైన మరో అధికారి లేరా... ఇంత వరకూ ఆయన చేసిన సేవలు ఏమిటి అనే ప్రశ్నలు ఎవరికై నా ఉత్పన్నం కాకమానదు. అయితే ప్రజాప్రతినిధులు మాత్రమే ఆయన సేవలు కావాలని ఒత్తిడి తెస్తుండడంపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం (హెచ్ఎన్ఎస్ఎస్) ప్రధాన కాలువ లైనింగ్ పనులకు శ్రీకారం చుట్టింది. కేవలం ఫేజ్–2 పరిధి (అనంతపురం, చిత్తూరు)లోనే రూ.1300 కోట్లు వెచ్చిస్తున్నారు. లైనింగ్ పనుల వల్ల భూగర్భజలాలు అభివృద్ధి చెందవని, నేరుగా సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంకు నీరు తరలించేందుకు మాత్రమే ఉపయోగపడతాయని రాజకీయపక్షాలే కాకుండా రైతులు సైతం వ్యతిరేకించినా పరిగణనలోకి తీసుకోకుండా ముందుకుపోయారు. రూ.వందల కోట్లు నీళ్ల ప్రాయంగా వెచ్చిస్తున్నారు. ఎక్కడేకానీ డిస్ట్రిబ్యూటరీ పనుల జోలికి వెళ్లకుండా ప్రధాన కాలువకు లైనింగ్ చేశారు. దాదాపు 90 శాతానికి పైగా పూర్తయ్యాయి. త్వరలో నీటి సరఫరా ఆగిపోతే మిగిలిన పనులు పూర్తి చేయనున్నారు. రెండు నెలల కాలంలోనే రూ.వందల కోట్లు విలువ చేసే పనులు జరిగాయి. అయితే ఈ పనుల పర్యవేక్షణలో చీఫ్ ఇంజినీర్ (సీఈ) విధులు క్రియాశీలకం. ప్రస్తుతం పనిచేస్తున్న హంద్రీ–నీవా సీఈ నాగరాజ పదవీ కాలం జనవరి 30తో ముగిసింది. దాదాపు పది రోజులు కావస్తున్నా తదుపరి సీఈ ఎవరన్నది సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే తన పదవీకాలాన్ని పొడిగించుకోవాలని సీఈ నాగరాజ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇందు కోసం ఓ మంత్రితో పాటు ఓ ఎమ్మెల్యే ప్రభుత్వ పెద్దలపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఓ ఎమ్మెల్యేకే రూ.వందల కోట్లు హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు లైనింగ్ పనులతో పాటు గతంలో ఆధునికీకరణ పనులు కూడా దక్కించుకున్న ఓ కాంట్రాక్టు సంస్థకు అధిపతి అయిన ఎమ్మెల్యేకు రూ.వందల కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. దీంతో సదరు ఎమ్మెల్యే.. సీఈ పదవీకాలం పొడిగించేందుకు ప్రభుత్వ పెద్దలను ఒప్పిస్తున్నట్లు సమాచారం. దీనికి తోడు మంత్రి అండదండలు కూడా పుష్కలంగానే ఉన్నాయని జోరుగా చర్చించుకుంటున్నారు. ముందు నుంచి ఈ ఇద్దరి ఆశీస్సులతోనే సదరు అధికారి సీఈగా నియమితులయ్యారనే చర్చ నడుస్తోంది. వాస్తవానికి ఎస్ఈగా ఉన్న ఆయనను అడహాక్ పదోన్నతిపై సీఈగా నియమించారు. తాజాగా పదవీ విరమణ చెందినా కూడా సీఈగా కొనసాగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవసరముంటే పొడిగించవచ్చు ప్రభుత్వ అవసరాన్ని బట్టి అధికారుల పదవీ కాలాన్ని పొడిగించవచ్చు. ఈఈ, ఎస్ఈల పదోన్నతుల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దీంతో ముఖ్యమైన అధికారుల పోస్టులు చాలా ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా సీఈ క్యాడర్ పోస్టుల్లో అధికారులు లేరు. ఈ నేపథ్యంలో నేను పదవీ కాలాన్ని పొడిగించాలని కోరాను. ఇంత వరకూ ఎలాంటి ఉత్తర్వులూ రాలేదు. గతంలో ఇతర జిల్లాల్లో ఈఈ పదవీకాలాన్ని పొడిగించారు. – నాగరాజ, చీఫ్ ఇంజినీర్, హంద్రీ–నీవా -
ఇంటర్నెట్ను బాధ్యతగా వినియోగించాలి
అనంతపురం అర్బన్: ఇంటర్నెట్, కృత్రిమ మేధస్సు (ఏఐ)ని దుర్వినియోగం చేయకుండా బాధ్యతాయుతంగా వినియోగించాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సేఫర్ ఇంటర్నెట్ డే– 2026 పోస్టర్లను ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. సేఫర్ ఇంటర్నెట్ డేను ఏటా ఫిబ్రవరి రెండో మంగళవారం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారన్నారు. సైబర్ హైజిన్కు సంబంధించి ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించడం, సైబర్ ముప్పులు, వాటి నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమన్నారు. ఏఐ డీఫ్ ఫేక్లు, ఏఐ వాయిస్ మోసాలు వంటి సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎన్ఐసీ ఏడీఐఓ భారతి సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్ఓ ఎ.మలోల, ఎన్ఐసీ ఏడీఐఓ టి.భారతి, ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ రమణారెడ్డి, ఈ–ఆఫీస్ అసోసియేట్ అనిల్ యాదవ్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీ పెయిడ్ మీటర్లు
● ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి తిరుపతి రూరల్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలోని ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ఇప్పటికే ఏర్పాటు చేసిన స్మార్ట్ మీటర్లకు ప్రీ–పెయిడ్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి తెలిపారు. స్థానిక ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సంస్థ డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లతో సోమవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో సీఎండీ మాట్లాడారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో ఆధునిక సాంకేతికతతో కూడిన మెరుగైన సేవలు అందుతాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు అనంతపురం జిల్లాలో 8,136, శ్రీసత్యసాయి జిల్లాలో 6,717 సర్వీసులకు స్మార్ట్ మీటర్లను అమర్చినట్లు వివరించారు. ఈ సర్వీసులన్నింటినీ ప్రస్తుతం ప్రీ పెయిడ్ మీటర్లుగా మారుస్తున్నామని, రీఛార్జ్ చేసేందుకు వీలుగా ఈ–వాలెట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. దశలవారీగా మిగిలిన కేటగిరీలకూ ప్రీ–పెయిడ్ స్మార్ట్ మీటర్లను అమర్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అధికారులతో సమీక్షిస్తున్న సీఎండీ శివశంకర్ -
అకాల మరణాలపై న్యాయ విచారణ చేపట్టాలి
● సచివాలయ ఉద్యోగుల డిమాండ్ అనంతపురం క్రైం: రకరకాల సర్వేలను గడువులోపు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుండటంతో సచివాలయ ఉద్యోగులు ఒత్తిడి తట్టుకోలేక మృత్యువాత పడుతున్నారని సచివాలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అకాల మరణాలపై న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పని ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన స్వర్ణ గ్రామ – స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆత్మ శాంతి కలగాలని సోమవారం రాత్రి అనంతపురంలోని కేఎస్ఆర్ కళాశాల ముందు నుంచి దాదాపు 300 మంది ఉద్యోగులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయ పార్కులో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో పలు సర్వేలను ఒకే సమయంలో పూర్తి చేయాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ చేస్తున్నారన్నారు. అయితే సంబంధిత యాప్లు సరిగా పనిచేయకపోవడం, అప్గ్రేడ్ మొబైల్ ఫోన్లు లేకపోవడం, నెట్ సరిగా పనిచేయకపోవడంతో సర్వేలు ఆలస్యమవుతున్నాయన్నారు. ఈ క్రమంలో తీవ్రమైన పని ఒత్తిడి అనేకమంది సచివాలయ ఉద్యోగుల అకాల మరణాలకు కారణమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వేల ప్రారంభానికి ముందే ప్రజల్లో అవగాహన కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. దీంతో ప్రజల నుంచి సిబ్బందికి సరైన సహకారం అందకపోవడంతో పాటు ఓటీపీలు అడిగే సమయంలో అవమానాలు ఎదురవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యోగులు చిన్నూరప్ప, వీరనారప్ప, డి.సుధాకర్, వరప్రసాద్, వి.లక్ష్మీనారాయణ, ముత్యాల రాజ్, మల్లికార్జున, సిరాల చంద్ర, రామకష్ణ, ముత్యాలు పాల్గొన్నారు. -
బాలికల పాఠశాలలో సమస్యలు
● పరిష్కరించాలని టీచర్ల వినతి గుమ్మఘట్ట: మౌలిక సదుపాయాలు లేక విద్యార్థినులు పడుతున్న బాధను చూసి ఉపాధ్యాయినులు చలించిపోయారు. వారి గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేందుకు వారే ముందుకు కదిలారు. రాయదుర్గంలోని జెడ్పీ ప్రభుత్వ బాలికల ఉన్నతపాఠశాలలో 1,400 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంతమందికి గాను మరుగుదొడ్లు, మూత్ర శాలలు అరకొరగా ఉన్నాయి. దీంతో విద్యార్థినులు అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలాగే కొనసాగితే విద్యార్థినులు అనారోగ్యానికి గురయ్యే అవకాశాలూ లేకపోలేదు. దీంతో ప్రధానోపాధ్యాయురాలు జయప్రద, ఉపాధ్యాయినులు అంజలి, ప్రభావతి, హేమలత సోమవారం మండల పరిషత్ కార్యాలయానికి చేరుకుని ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. బాలికల ఉన్నతపాఠశాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీడీఓ కొండన్న హామీ ఇచ్చారు. -
జంబుకేశ్వరుడికి ద్రాక్షపండ్లతో అలంకరణ
రాయదుర్గంటౌన్: పట్టణంలోని కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వరస్వామికి సోమవారం విశేష పూజలు జరిగాయి. మూలవిరాట్కు ద్రాక్షపండ్లతో చేసిన ప్రత్యేక అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అర్చకులు రామకృష్ణశర్మ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. కాచిగూడ–తిరుపతి మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్ గుంతకల్లు: ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని కాచిగూడ–తిరుపతి మధ్య ఈ నెల 12న వన్ వే స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎ.శ్రీధర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రైలు (07511) 12వ తేదీ మధ్యాహ్నం 3.45 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు తిరుపతి రైల్వే జంక్షన్కు చేరుకుంటుందని పేర్కొన్నారు. ఈ రైలు ఉందానగర్, షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి రోడ్డు, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట రైల్వేస్టేషన్ల మీదుగా తిరుపతికి చేరుకుంటుందని తెలిపారు. ఇందులో 3ఏ, చైర్ కార్, జనరల్, సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్థిక అక్షరాస్యతతో సరైన నిర్ణయాలు అనంతపురం అర్బన్: ఆర్థిక అక్షరాస్యత ద్వారా సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుందని కలెక్టర్ ఆనంద్ స్పష్టం చేశారు. ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆధ్వర్యంలో ఈ నెల 13 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఇందుకు సంబంధించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఎల్డీఎం నరేష్రెడ్డితో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ బాధ్యతాయుతమైన ఆర్థిక ప్రవర్తనపై అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమన్నారు. వారోత్సవం సందర్భంగా బ్యాకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు, డిజిటల్ ఆర్థిక భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఎల్డీఎం తెలిపారు. బేబీ కిట్లు.. ఇస్తే ఒట్టు..! ● ఆగిపోయిన కిట్ల సరఫరా ● పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం ఉరవకొండ రూరల్: ప్రభుత్వాస్పత్రుల్లో నవజాత శిశువులకు బేబీ కిట్లు అందడం లేదు. పేద కుటుంబాలకు చెందిన గర్భిణులు ఎక్కువగా ప్రభుత్వాస్పత్రుల్లోనే ప్రసవం చేయించుకుంటారు. నవజాత శిశువులకు బేబీ సోప్, ఆయిల్, పౌడర్, షాంపూ, దోమతెర, బేబీ బెడ్, దుస్తులు, న్యాప్కిన్స్, డైపర్లు తదితర వస్తువులతో కూడిన కిట్ను గత ప్రభుత్వం ఉచితంగా అందించేది. ఇది పేదలకు ఆర్థికంగా ఎంతో ఉపశమనం కలిగించేది. గత వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవమైన వారికి బేబీ కిట్లు ఠంచన్గా అందించేది. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత బేబీ కిట్ల సరఫరా ఆగిపోయింది. దీంతో కూలీనాలి చేసుకునే బతికే తాము వేల రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని బాలింత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉరవకొండ ప్రభుత్వాస్పత్రితో పాటు రాకెట్ల, పెద్దకౌకుంట్లలో పీహెచ్సీలు ఉన్నాయి. ఈ మూడు ఆస్పత్రుల్లో నెలకు సగటున 50 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. అయితే ఒక్కరికీ బేబీ కిట్లు అందించిన దాఖలాలు లేవు. ఉరవకొండ మండలమే కాకుండా జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉన్నట్లు ప్రజలు చెబుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం బేబీ కిట్ల సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
యువకుడి దుర్మరణం
కూడేరు: ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా ఎ.కొండాపురం మండలం వెంకయ్యకాలువ గ్రామానికి చెందిన అరుణ్ (18), శివయ్య జేసీబీ వాహన డ్రైవర్, సహాయకుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కూడేరు మండలంలో జేసీబీతో చేపట్టిన పనుల్లో పాలు పంచుకుంటున్న వారు సోమవారం వాహనానికి అవసరమైన గ్రీజును అనంతపురంలో కొనుగోలు చేసి, ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. బ్రాహ్మణపల్లి సమీపంలోకి చేరుకోగానే 67వ జాతీయ రహదారిపై ఎదురుగా వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొంది. ఘటనలో అరుణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన శివయ్యను స్థానికులు వెంటనే అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, ప్రమాదానికి కారణమైన డ్రైవర్ తన కారును అక్కడే వదిలేసి పారిపోయినట్లు సమాచారం. -
హోరాహోరీగా రాతిదూలం లాగుడు పోటీలు
గుంతకల్లు రూరల్: మండలంలోని వెంకటాపల్లి కనుమల్లో వెలసిన పెద్ద కదిరప్ప స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఏర్పాటు చేసిన రాతిదూలం లాగుడు పోటీలు హోరాహోరీగా సాగాయి. న్యూ కేటగిరి విభాగంలో నిర్వహించిన ఈ పోటీలకు మొత్తం 12 జతల వృషభాలను రైతులు తీసుకువచ్చారు. ఎ.నారాయణపురం గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ ఫరీద్ వృషభాలు ప్రథమ స్థానంలో నిలిచాయి. ద్వితీయ స్థానంలో నంద్యాల జిల్లా పీఆర్పల్లికి రైతు రాజు యాదవ్ వృషభాలు, అదే జిల్లా చెన్నకానల గ్రామ రైతు చెన్నారెడ్డి వృషభాలు తృతీయ స్థానం, గుంతకల్లు మండలం గుర్రబ్బాడు గ్రామానికి చెందిన రైతు నరసింహారెడ్డి వృషభాలు నాల్గో స్థానంలో నిలిచాయి. విజేత వృషభాల యజమానులను నగదు పురస్కారాలతో నిర్వాహకులు సత్కరించారు. రామాలయంలో చోరీ శింగనమల: మండలంలోని లోలూరు పంచాయతీ రఘునాథపురంలో వెలసిన రామాలయంలో చోరీ జరిగింది. ఆదివారం రాత్రి ఆలయంలో చొరబడిన దుండగులు సీసీ కెమెరాలను ఆఫ్ చేసి, 3.5 కిలోల వెండి ఆభరణాలు, అర తులం బంగారును అపహరించారు. సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న పూజారి గుర్తించి గ్రామస్తుల ద్వారా సమాచారం అందించడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. పట్టపగలే రెండిళ్లలో... గుత్తి: స్థానిక ఆర్ఎస్ రోడ్డులోని రైల్వే బ్రిడ్జి సమీపంలో సోమవారం పట్టపగలే రెండిళ్లలో చోరీ జరిగింది. కారు డ్రైవర్ ప్రవీణ్ ఇంట్లో చొరబడిన దుండగులు బీరువాలోని ఒక తులం బంగారు ఆభరణాలు, వెండి కాళ్ల పట్టీలతో పాటు రూ. 18 వేలు నగదు అపహరించారు. అనంతరం ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు సరస్వతి ఇంట్లో చొరబడి బీరువాలో దాచిన రెండున్నర తులాల బంగారు ఆభరణాలు, రూ. 3,500 నగదు అపహరించారు. ఇంటి యజమానాలు పనిపై బయటకు వెళుతూ ఇళ్లకు తాళం వేసి ఉన్న సమయంలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎస్ఐ సురేష్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసులు నమోదు చేశారు. -
విద్యార్థి కాలు విరిచిన ఆట సరదా
గుంతకల్లు టౌన్: సరదా పేరుతో విద్యార్థులు ఆడే ఆటలు తల్లిదండ్రుల్ని తీవ్రవేదనకు గురిచేస్తున్నాయి. స్థానిక లోని రోటరీ హైస్కూల్లో జరిగిన ఈ ఘటనే ఓ తార్కాణం. సోమవారం ఉదయం పాఠశాల విరామ సమయంలో స్టేజ్ వద్ద నిలబడిన ఎనిమిదో తరగతి విద్యార్థి శ్రీవర్ధన్ను తొమ్మిదో తరగతి విద్యార్థి విక్రమ్ పైకెత్తి కిడ్స్ ప్లే జోన్లోకి కింద పడేశాడు. దీంతో గాయపడిన శ్రీవర్ధన్ బాధ తాళలేక గట్టిగా కేక వేయడంతో గమనించిన ఉపాధ్యాయులు వెంటనే స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. శ్రీవర్ధన్ ఎడమ కాలి తుంటి ఎముక విరిగినట్లు ఎక్స్రే ఆధారంగా వైద్యులు నిర్ధారించడంతో పాఠశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన అంబులెన్స్లో అనంతపురంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్హోమ్కు పాఠశాల హెచ్ఎం వరలక్ష్మి తరలించారు. బేల్దారి పని కోసమని గూళ్లపాళ్యంకు వెళ్లిన బాలుడి తల్లిదండ్రులు నారాయణస్వామి, ధనలక్ష్మి హుటాహుటిన పాఠశాలకు చేరకుని టీచర్లతో కలిసి అనంతపురానికి వెళ్లారు. విషయం తెలుసుకున్న వన్టౌన్ పోలీసులు ఆస్పత్రిలో బాలుడిని పరామర్శించారు. -
నాకొచ్చినవన్నీ సరిగ్గానే రాశాను.. అయినా మంచి మార్కులు రాలేంటూ విద్యార్థులు వాపోతుంటారు. మా అబ్బాయి బాగానే చదువుతుంటాడు. అయినా మార్కులు సరిగా రావడం లేదని తల్లిదండ్రులూ ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అయితే ఆశించిన మేర మార్కులు రాకపోవడానికి చేతి రాత అందంగా లేకపో
● పరీక్షల్లో చేతిరాత కూడా ముఖ్యమే ● అర్థమయ్యేలా రాయాలి ● దస్తూరిపై సాధన చేయాలంటున్న నిపుణులు చేతి రాతపై సాధన చేస్తున్న విద్యార్థులు రాయదుర్గం టౌన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించాల్సిన తరుణమిది. ధ్యాసంతా చదువుపైనే నిమగ్నం చేసే విద్యార్థులు కీలకమైన చేతిరాతపై దృష్టి సారించకపోతే మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఏడాది పాటు చదివిన అంశాలను రెండున్నర గంటల్లో జవాబు పత్రంపై రాయగలగాలి. పరీక్షల సమయంలో సహజంగా ఆందోళన ఉంటుంది. ఈ ఆందోళనలోనే చేతి రాత అందంగా లేకపోవడం.. మూల్యాంకనం చేసే వారికి అర్థం కాకపోవడం తదితర కారణాలతో మార్కులు తగ్గే అవకాశముంది. ఈ సమస్యను అధిగమించాలంటే ముందుగా దస్తూరిపై సాధన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవి పాటించాలి.. ● సమాధాన పత్రంపై రాసే జవాబు సూటిగా ఉండాలి. అక్షరాలు పొందికగా ఉంటే మూల్యాంకన చేసేవారికి సులువుగా అర్థమై కచ్చితమైన మార్కులు వేసే అవకాశం ఉంటుంది. ● పేజీ పైభాగంలో ఒక అంగుళం, ఎడమ వైపు అదే స్థాయిలో మార్జిన్ విడిచిపెట్టాలి. ● సామాన్య, భౌతిక శాస్త్రాల్లో బొమ్మలు గీసి భాగాలు గుర్తించే విషయంలో పెన్నును వత్తి పెట్టి రాయకూడదు. ● పేజీకి పదహారు నుంచి ఇరవై లైన్లకు మించి రాయకుండా జాగ్రత్త పడాలి. పదానికి, పదానికి అర సెంటీమీటరు గ్యాప్ ఇవ్వాలి. ● రోజూ చేతిరాతపై కొద్దిసేపు సాధన చేస్తే పరీక్షల్లో ఆందోళన లేకుండా సాఫీగా రాయగలుగుతారు. ● అక్షరాలు, పదాలు, వ్యాక్యాల మధ్య తగినంత ఖాళీ ఉండాలి. ● ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. లేకుంటే ఆ ప్రభావం చేతిరాతపై కూడా పడుతుంది. -
సమయానికి రాని వైద్యులు
● సిబ్బందితో రోగుల వాగ్వాదం కూడేరు: ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం కింద సోమవారం కూడేరులోని పీహెచ్సీలో గర్భిణుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య సిబ్బంది సమాచారమివ్వడంతో మండల పరిఽధిలోని పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో గర్భిణులు తరలి వచ్చారు. వీరికి తోడు వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వందల సంఖ్యలో రోగులు కూడా చికిత్స కోసం వచ్చారు. అయితే ఉదయం 9 గంటలకు వైద్యులు హాజరు కావాల్సి ఉండగా 11 గంటలైన రాకపోవడంతో సహనం కోల్పోయిన రోగులు అక్కడ ఉన్న వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పీహెచ్సీ డాక్టర్ వెంకటప్రసాద్ సైతం 104 ద్వారా వైద్య సేవలు అందించేందుకు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లడంతో సమస్య తలెత్తిందని, డాక్టర్ ఉషారాణి వచ్చేస్తారని సిబ్బంది చెప్పుకొచ్చారు. చివరకు 11.10 గంటలకు డాక్టర్ ఉషారాణి వచ్చి వైద్య సేవలందించారు. వివాహిత బలవన్మరణం గుంతకల్లు టౌన్: భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... గుంతకల్లులోని గంగానగర్కు చెందిన రుక్సార్ (27), అనంతపురంలోని కేకే నగర్లో నివాసముంటున్న సయ్యద్ షామీర్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న షాహీర్, తన భార్యాపిల్లలతో కలసి ఏడాది క్రితం గుంతకల్లులోని భాగ్యనగర్ ధర్మవరం రైల్వేగేట్ వద్ద ఓ అద్దె ఇంట్లోకి మకాం మార్చాడు. ఈ క్రమంలో చెడు వ్యసనాలకు బానిసగా మారి కుటుంబపోషణను పట్టించుకోవడం మానేసి తరచూ భార్యను వేధింపులకు గురి చేసేవాడు. ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న షాహీర్ తన భార్యతో గొడవ పడ్డాడు. వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె ఇంట్లో భర్త, పిల్లలు నిద్రిస్తుండగా ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం నిద్ర లేచిన పిల్లలు ఉరికి విగతజీవిగా వేలాడుతున్న తల్లిని గమనించగానే గట్టిగా కేకలు వేస్తూ రోదించసాగారు. సమాచారం అందుకున్న వన్టౌన్ సీఐ మనోహర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మృతురాలి తల్లి షేక్ భానూ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
కర్తనపర్తిలో ఎలుగుబంటి సంచారం
కళ్యాణదుర్గం (కంబదూరు): కంబదూరు మండలం కర్తనపర్తి గ్రామానికి చెందిన రైతు ఎర్రప్ప తోటలో సోమవారం ఉదయం ఎలుగుబంటి కనిపించింది. ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లిన ఎర్రప్ప.. ఎలుగుబంటిని గమనించి చుట్టుపక్కల పొలాల్లో ఉన్న రైతులను పోగేసుకుని అక్కడి నుంచి తరిమేశారు. కుక్కను తప్పించబోయి బీటెక్ విద్యార్థి మృతి అనంతపురం సెంట్రల్: రోడ్డుకు అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురంలోని ఆదర్శనగర్లో నివాసముంటున్న బీటెక్ విద్యార్థి తనూజ్ (23) సోవమారం శ్రీనగర్ కాలనీ నుంచి తన నివాసానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా రోడ్డుకు అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన తనూజ్ను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై నాల్గో పట్టణ సీఐ జగదీష్ కేసు నమోదు చేశారు. రాష్ట్రస్థాయి త్రోబాల్ చాంపియన్గా ‘అనంత’ అనంతపురం కార్పొరేషన్: లీప్ టీచర్స్ త్రోబాల్ రాష్ట్ర స్థాయి పోటీల్లో అనంతపురం మహిళల జట్టు విజేతగా నిలిచింది. ఈ నెల 8 నుంచి రెండ్రోజుల పాటు గుంటూరులో త్రోబాల్ చాంపియన్షిప్ పోటీలు జరిగాయి. సోమవారం ఏలూరుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో వరుసగా 26–19, 17–25, 15–9 పాయింట్ల తేడాతో అనంతపురం జట్టు విజయ కేతనం ఎగురవేసింది. ఈ సందర్భంగా విజేత జట్టు క్రీడాకారులను డీఈఓ ప్రసాద్బాబు, డిప్యూటీ డీఈఓ శ్రీనివాస్ తదితరులు అభినందించారు. చెరువులో పడి వృద్ధుడి మృతి బుక్కరాయసముద్రం: అనంతపురంలోని మున్నానగర్కు చెందిన చిన్న ఆంజనేయులు (65) స్థానిక చిక్క వడియార్ చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. సోమవారం చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన ఆయన కాలు జారీ చెరువు నీటిలో పడ్డాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 35 ఏళ్ల తర్వాత ఒకే చోట.. అనంతపురం సెంట్రల్: వారంతా ఒకేసారి పోలీసుశాఖలో ఏఆర్ విభాగంలోకి అడుగుపెట్టారు. వివిధ ప్రాంతాల్లో పోస్టింగ్లు రావడంతో ఆయా ప్రాంతాలకు వెళ్లిపోయారు. 35 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సోమవారం అనంతపురంలోని రహమత్ ఫంక్షన్ హాల్లో కలుసుకుని సంబరాలు జరుపుకున్నారు. -
ఇద్దరు మైనర్ల అరెస్ట్
కణేకల్లు: చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు మైనర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం కణేకల్లు పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఎస్ఐ నాగమధు వెల్లడించారు. కణేకల్లు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు తమ తల్లిదండ్రులతో కలసి కూలి పనులకు వెళ్లేవారు. ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడిన బాలురు తమ అవసరాలు తీర్చుకునేందుకు దొంగతనాలకు తెరలేపారు. చాకలి రామన్న ఇంట్లో చొరబడి 5 గ్రాముల బంగారు ఉంగరం, రూ.వెయ్యి నగదు, బెస్త వన్నూరుస్వామి ఇంట్లో రూ.10వేల నగదు, జెడ్పీహెచ్ఎస్లో నీటి పంపింగ్ మోటారు, నల్లంపల్లి గ్రామ శివారున ఉన్న మరో ఇంట్లో విద్యుత్ మోటార్ను అపహరించారు. ఆయా కేసుల్లో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం కళ్యాణదుర్గం–బళ్లారి రహదారిలో వెళుతున్న బాలురు తమ వద్ద ఉన్న డబ్బు పంచుకునే విషయంగా గొడవపడడంతో అనుమానం వచ్చిన స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించిన వారిని అదుపులోకి తీసుకుని పాలిథిన్ సంచుల్లోని రెండు మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో చోరీలను అంగీకరించడంతో ఇరువురినీ గ్రామపెద్దల సమక్షంలో అరెస్ట్ చేశారు. ఉపాధి నూతన చట్టాన్ని రద్దు చేయాలి : సీపీఐఅనంతపురం టౌన్: ఉపాధి హామీ చట్టానికి పేరు మార్చి నూతనంగా తీసుకువచ్చిన చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి డిమాండ్ చేశారు. డిమాండ్ సాధనలో భాగంగా సోమవారం డ్వామా కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. వీ–బీ–జీ రామ్జీ పేరుతో గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడిచేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి చిరుతల మల్లికార్జున మాట్లాడుతూ.. వెంటనే కొత్తచట్టాన్ని రద్దుచేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యకాసం జిల్లా ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి, సహాయ కార్యదర్శి మల్లికార్జున, నాయకులు రాజారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


