breaking news
Anantapur District News
-
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై పోరాటం
అనంతపురం క్రైం: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని ఏపీపీటీడీ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. జేఏసీ పిలుపు మేరకు సోమవారం అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్దకు ఆర్టీసీ ఉద్యోగులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉద్యోగుల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ ఆనంద్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, ప్రభుత్వంలో విలీనం అనంతరం రావాల్సిన ప్రయోజనాలను అందజేయాలని కోరారు. కార్యక్రమంలో ఎన్ఎంయూఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భాస్కర్ నాయుడు, జిల్లా జేఏసీ కన్వీనర్లు వి.సూరిబాబు, టి.ప్రతాప్ నారాయణ, కె.కొండయ్య, రెడ్డి, రత్నం, ఆర్ఎన్ రెడ్డి, బి.సోమశేఖర్, ఖాన్, కేజే ప్రకాష్, ఎం.శ్రీనివాసులు, ఎం.నారాయణస్వామి, కేఎం నాయక్, మనోజ్, సి. శ్రీరాములు, పరమేష్, మల్లికార్జున, సి.సుందర్రాజు తదితరులు పాల్గొన్నారు. -
30న కృత్రిమ చేతుల పంపిణీ
అనంతపురం అర్బన్: మోచేతి కింది భాగంలో చేయి కోల్పోయిన వారికి రెడ్ క్రాస్ సొసైటీ, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 30న చేయూత కార్యక్రమం ద్వారా ఉచితంగా కృత్రిమ చేతుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ‘చేయూత’ పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారు ముందుస్తుగా తమ వివరాలను ‘చేయూత’ కాల్ సెంటర్ 88663 06969కు ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. 30న నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని జిల్లాలో అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ మలోల, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీ అర్చన, రోటరీ క్లబ్ అధ్యక్షుడు కేశవరెడ్డి, రెడ్క్రాస్ సొసైటీ సభ్యుడు లక్ష్మీనారాయణ, సుంకర రమేష్, బిసాతి భారత్, దాసరి భరత్కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరిగి తిరిగి అలసిపోతున్నాం అనంతపురం అర్బన్: తిరిగి తిరిగి అలసిపోతున్నామని, కనికరించి తమ సమస్యలు పరిష్కరించండి అని ప్రజలు విన్నవించుకున్నారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన ‘ప్రజాసమస్యల పరిష్కార వేదిక’లో కలెక్టర్ ఆనంద్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్కుమార్, డీఆర్ఓ మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, కిరణ్మయి రెవెన్యూ సమస్యలపై 286, ఇతర సమస్యలపై 413 చొప్పున మొత్తం 699 అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అర్జీల్లో మచ్చుకు కొన్ని.. ● బుక్కరాయసముద్రం మండలం సిద్దరాంపురం గ్రామానికి చెందిన గంగపన్న అనే దివ్యాంగుడు నడవలేనిస్థితిలోనే దోక్కుంటూ కలెక్టరేట్కు వచ్చాడు. మూడు చక్రాల సైకిల్ కోసం రెండేళ్లకు పైగా విన్నవించుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయాడు. ● నార్పల మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్, కళాశాల స్థలాన్ని ఆక్రమించారని 1091–92 బ్యాచ్ పూర్య విద్యార్థులు ఫిర్యాదు చేశారు. కళాశాలకు సర్వేనంబర్ 139/1డిలో 10.02 ఎకరాలు ఉందన్నారు. ఇక్కడ స్థలం సెంటు రూ.20 లక్షలు ఉందన్నారు. అయితే కొందరు ప్రైవేటు వ్యక్తులు తమ వాహనాల పార్కింగ్ కోసం కళాశాలకు చెందిన దాదాపు 20 సెంట్ల స్థలాన్ని ఆక్రమించారని చెప్పారు. ● వితంతు పింఛను మంజూరు చేయాలని కణేకల్లు మండలం మాల్యం గ్రామానికి చెందని బి.ఆదిలక్ష్మి, గుమ్మఘట్ట మండలం రంగసముద్రం ఎస్సీ కాలనీకి చెందిన ఎం.బేబి విన్నివించారు. -
పంద్రాగస్టు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి
● అధికారులకు జేసీ విష్ణుచరణ్ ఆదేశం అనంతపురం అర్బన్: పోలీసు పరేడ్ మైదానంలో ఈ నెల 15న జరగనున్న స్వాతంత్య్ర దినోత్సవానికి ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జేసీ సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో అసిస్టెంట్ కలెక్టర్ సుయాష్కుమార్, ఏఎస్పీ (అడ్మిన్) నాగభూషణం, డీఆర్ఓ ఎ.మలోలతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవంలో జాతీయ పతాకాన్ని రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ ఆవిష్కరిస్తారన్నారు. ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాలకు సంబంధించి స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా శకటాలను ప్రదర్శించాలన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులను అవార్డుకు సిఫారసు చేయాలని ప్రభుత్వ శాఖల అధిపతులను ఆదేశించారు. అప్పగించిన బాధ్యతలను అధికారులు సక్రమంగా నిర్వర్తించాలని చెప్పారు. సమావేశంలో ఆర్డీఓ ప్రేమనాథ్కుమార్, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, కిరణ్మయి, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. టెట్ పకడ్బందీగా నిర్వహించాలి జిల్లావ్యాప్తంగా ఈ నెల 5 నుంచి 16వ తేదీ వరకు టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం రెవెన్యూభవన్లో డీఈఓ శ్రీనివాసరావుతో కలిసి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరు కేంద్రాల్లో జరగనున్న టెట్కు 18,191 మంది అభ్యర్థులు, 128 మంది స్కైబ్ర్స్ హాజరవుతారన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్ష ఉంటుందన్నారు. పరీక్షల నిర్వహణకు ఆరుగురు అధికారులను ఫ్లయింగ్ స్క్వాడ్గా నియమించామన్నారు. కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు నిబంధనలు పాటించాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ మలోల, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ శేషాద్రి, డీఐపీఆర్ఓ బాలకొండయ్య, ఆరోగ్యాధికారి వెంకటేశ్వర్లు, డీపీఓ నాగరాజునాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రైతులు అప్రమత్తంగా ఉండాలి
రాప్తాడు రూరల్: ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని కేవీకే రెడ్డిపల్లి శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వీరి బృందం సోమవారం అనంతపురం రూరల్ చియ్యేడు, ఇటుకలపల్లి్, మన్నీల, కందుకూరు గ్రామాల్లో పర్యటించి ఎల్నినోపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కంది పంటలో ప్రస్తుతం ఎల్నినో కారణంగా ఉన్న బెట్ట పరిస్థితులను అధిగమించేందుకు రైతులందరూ పొటాషియం నైట్రేట్ ఐదు గ్రాములు, బోరాన్ మూడు గ్రాముల చొప్పున లీటరు నీటిలో కలిపి, ఒక ఎకరానికి 200 లీటర్ల ద్రావణాన్ని పిచికారీ చేయాలని సూచించారు. ప్రస్తుతం సాగు చేసిన కంది, ఆముదం పంటల్లో మొక్కల సాంద్రతను తగ్గించడం ద్వారా అధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు. ఆముదం, కంది పంటల్లో ఎక్కువ వత్తుగా ఉన్న మొక్కలను తొలగించి, వరుసలో మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉండేలా చూడాలని సూచించారు. విత్తిన 30, 60 రోజులకు గుంటక లేదా గొర్రుతో అంతరకృషి చేయడం ద్వారా కలుపు నివారణతో పాటు నేలలో తేమను సంరక్షించుకోవచ్చన్నారు. ఈ నెలలో వర్షాలు కురిసిన తర్వాత తేలికపాటి నేలల్లో జొన్న, కొర్ర, సజ్జ, పెసర, అలసంద, మేత జొన్న, ఉలవలు వంటి పంటలను సాగు చేసేందుకు సిద్ధంగా ఉండాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ నారాయణస్వామి, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ సుధారాణి, డాక్టర్ కిషోర్, కళాశాల సిబ్బంది డాక్టర్ సుస్మిత, డాక్టర్ కవిత తదితరులు పాల్గొన్నారు. పంటల పరిశీలన డి.హీరేహాళ్(బొమ్మనహాళ్)/బెళుగుప్ప: డీ హీరేహాళ్ మండలంలోని మలపనగుడి, గొడిసెలపల్లి, హులికల్లు, బెళుగుప్ప మండలంలో హనిమిరెడ్డిపల్లి,శీర్పి, గంగవరం, గుండ్లపల్లిలో పంటలను సోమవారం శాస్త్రవేత్తల బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం, నీటి పొదుపు, తేమ సంరక్షణ, ఎరువుల వినియోగం, సమగ్ర చీడపీడల యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. పత్తి పంటలో 13:0:45 ఎరువును లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయడం ద్వారా పంటను రక్షించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ వి.యుగంధర్, శిరీషా, డాక్టర్ వింధ్య, బాంధవ్య, బాలాజీనాయక్, మల్లికార్జున, హరిణి, గోవర్దన్, నాగేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
బైకుకు నిప్పు
● తాగుబోతు నిర్వాకం గుత్తి: పట్టణంలో వాసవీ బజారులోని వినాయక గుడి సమీపంలో నివాసముండే రాజేష్కు చెందిన బైక్కు అదే కాలనీకి చెందిన నూర్ నిప్పు పెట్టాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బైక్ను రాజేష్ తన ఇంటి ముందు పార్క్ చేశాడు. ఉదయం లేచి చూసేసరికి బైక్ పూర్తిగా కాలిపోయింది. అక్కడున్న సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా.. అదే కాలనీకి చెందిన నూర్ తప్పతాగి బైక్కు నిప్పు పెట్టినట్లు తెలిసింది. పోలీసులు నూర్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాగిన మైకంలోనే నూర్ బైక్కు నిప్పు పెట్టి కాల్చి వేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. రాజేష్కు నూర్తో ఎలాంటి విభేదాలు లేవని వెల్లడైంది. ఇంట్లో చోరీగుత్తి: పట్టణంలోని ఆశా నగర్లో నివాసముండే రంగస్వామి, లీలావతి దంపతుల ఇంట్లో సోమవారం చోరీ జరిగింది. దొంగలు బీరువాలో ఉన్న రూ. 3 వేల నగదుతో పాటు రూ. 35 వేల విలువైన వెండి గ్లాస్ అపహరించారు. రంగస్వామి, లీలావతి దంపతులు పని మీద ముద్దనూరు వెళ్లడంతో కుమారుడు నందు తన స్నేహితుడి ఇంట్లో నిద్రించాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి దొంగలు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలోని వెండి గ్లాస్, మూడు వేలు నగదు అపహరించారు. చోరీ జరిగిన ఇంటిని ఎస్ఐ సురేష్ పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు. ఒకే ఇంట్లో ఏడుగురికి అందని తల్లికి వందనం అనంతపురం అర్బన్: ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికీ ‘తల్లికి వందనం’ ద్వారా లబ్ధి చేకూరుస్తాం అంటూ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. స్థానిక బిందెలకాలనీకి చెందిన అన్నదమ్ములు ప్రసాద్, వీరయ్యలు నివాసం ఉంటున్నారు. వీరిలో ప్రసాద్కు నలుగురు సంతానం కాగా వీరయ్యకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరి ఏడుగురు పిల్లలకూ తల్లికి వందనం అందలేదు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పరిష్కార వేదిక కార్యక్రమంలో అన్నదమ్ములిద్దరూ తమ పిల్లలతో కలెక్టర్ వద్దకు వచ్చిన గోడు వెళ్లబోసుకున్నారు. అధికారులను అడిగితే తమ కుటుంబంతో ఐదుగురు సభ్యులను హౌస్ హోల్డ్ మ్యాపింగ్ జరిగిందని చెబుతున్నారని, వాస్తవంగా ఆ ఐదురుగు సభ్యులతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని వాపోయారు. తాము రోజువారీ కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తుంటామని, తమకు తల్లికి వందనం డబ్బులు మంజూరయ్యేలా చూడాలని వేడుకున్నారు. కర్కశత్వానికి బలైన శిశువు అనంతపురం సిటీ: నానమ్మ కర్కశత్వానికి చిన్నారి బలైంది. గత నెల 28న వేకువజామున ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని రెండో అంతస్తు పైనుంచి నవజాత శిశువును నానమ్మ కిందకు విసిరేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న చిన్నారి ఆదివారం రాత్రి ప్రాణం విడిచింది. శ్రీసత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కంచిసముద్రం పంచాయతీ మామిడాకులపల్లికి చెందిన అశోక్కుమార్, పూజిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి అశోక్కుమార్ తల్లికి ఇష్టం లేదని తెలిసింది. అయినా కుమారుడి కోసమని ఆమె మౌనంగానే ఉంటూ వచ్చారు. గర్భం దాల్చిన పూజిత గత మే నెల 31న హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న అశోక్కుమార్ తల్లి లోలోన రగిలిపోయింది. ఇష్టంలేని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆడపిల్లకు జన్మనిచ్చావంటూ కోడలిపై ఆగ్రహం వ్యక్తం చేసేది. ఈ క్రమంలోనే శిశువుకు ఫిట్స్ వస్తుండడంతో తల్లిదండ్రులు జూలై 22న అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. రెండో అంతస్తులో ఉన్న పీడియాట్రిక్ వార్డులో వైద్యులు అడ్మిట్ చేసుకుని చికిత్స చేస్తూ వచ్చారు. 28వ తేదీ వేకువజాము తల్లి నిద్రిస్తుండగా.. నానమ్మ ఆ శిశువును తీసుకెళ్లి రెండో అంతస్తుపై నుంచి కిందకు విసిరేసింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన చిన్నారిని అప్పటి నుంచి ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స చేస్తూ వచ్చారు. లేత శరీరం లోపల తీవ్రమైన గాయాలు ఉండడంతో శిశువు కోలుకోలేక ఆదివారం రాత్రి మృతి చెందింది. కాగా, ఘటన వెలుగు చూసిన రోజే నానమ్మను అనంతపురం రెండో పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుని, హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు. -
ముమ్మాటికీ మోసమే
అనంతపురం: ‘మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను నిలువునా మోసగించారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. డీఎస్సీ–2025 దేశంలోనే అతిపెద్ద కుంభకోణం. మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలి’ అని మేధావులు డిమాండ్ చేశారు. సోమవారం నగరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి మేధావులు, రిటైర్డ్ ప్రిన్సిపాళ్లు, విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులు భారీగా హాజరయ్యారు. ముందుగా వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు సూపర్ సిక్స్తో పాటు అనేక హామీలను గుప్పించారని గుర్తు చేశారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, లేనిపక్షంలో ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మాట తప్పారన్నారు. మెగా డీఎస్సీ పేరుతో అవకతవకలకు పాల్పడి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారని విమర్శించారు. వీటన్నిటికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని, ఆయన రాజీనామా చేయని పక్షంలో మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐతో విచారణ చేయించాలన్నారు. నిరుద్యోగులకు భృతి ఇవ్వడంతో పాటు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వ అన్యాయాలను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 6,7,8,9 తేదీల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలతో పాటు 10వ తేదీన నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ శ్రేణులతో పాటు మేధావులు, విద్యావంతులు, యువతీ యువకులు, విద్యార్థులు, రాజకీయాలకు అతీతంగా ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎమ్మెల్సీ మంగమ్మ, సీఈసీ సభ్యుడు నదీం అహమ్మద్, ఎస్ఈసీ సభ్యుడు కోగటం విజయభాస్కర్ రెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వీర రామకృష్ణా రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్ రెడ్డి, మాజీ మేయర్ వసీం, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, మద్దిరెడ్డి నరేంద్ర రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ దాసరి వాసంతి సాహిత్య, జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆలమూరు శ్రీనివాస రెడ్డి, గౌని నాగన్న, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివా రెడ్డి, జానీ, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రా రెడ్డి, మొఘల్ సైఫుల్లా భేగ్, మల్లెమీద నరసింహులు, కట్టుబడి తానీషా, కొర్రపాడు హుస్సేన్ పీరా, ఓబిరెడ్డి, అనిల్ కుమార్ గౌడ్, కాగజ్ఘర్ రిజ్వాన్, ఫయాజ్, దాదా ఖలందర్, వేముల నదీం, బాకే హబీబుల్లా, ఎద్దుల అమర్నాథ రెడ్డి, సాకే అశోక్కుమార్, సాకే కుళ్లాయిస్వామి, రామకృష్ణ, కుళ్లాయప్ప, రాధా యాదవ్, సాకే చంద్రలేఖ, హిమబిందు, భారతి, అంజలి, శోభారాణి, శోభా భాయి, మహేశ్వరి, ప్రసన్న, హజరాబి, లీల, ఖమర్తాజ్, లక్ష్మీనరసమ్మ, చంద్రకళ పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం డీఎస్సీ–2025 తక్షణమే సీబీఐతో విచారణ చేయించాలి అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి రౌండ్టేబుల్ సమావేశంలో వక్తలు రిలే నిరాహార దీక్షలతో నిలదీద్దాం: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత నియోజకవర్గాల్లోనూ సమావేశాలు.. డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు. శింగనమలలోని వాసవీ కల్యాణమండపంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పు చేయకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. తాడిపత్రిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ పరీక్షల్లో భారీగా అక్రమాలు జరిగాయన్నారు. మంత్రివర్గం నుంచి లోకేష్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ రాయదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవింద రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. డీఎస్సీ అక్రమాలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని మెట్టు పిలుపునిచ్చారు. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకూ పోరాడతామని స్పష్టం చేశారు. బాబుకు మోసం అలవాటై పోయింది నిరుద్యోగులను వంచించడం చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటైపోయింది. 2014లోనూ నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారు. 2024లోనూ అదే పరిస్థితి ఎదురైంది. డీఎస్సీ అవకతకలపై సీబీఐతో విచారణ జరిపించాలి. ఇప్పటి దాకా డిగ్రీ అడ్మిషన్లు చేపట్టకపోవడం దారుణం. – డాక్టర్ శంకరయ్య, కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ఇక్కడా ఉద్యమం తథ్యం గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే 1.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసింది. చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ ఉద్యోగాల్లో సగం భర్తీ చేస్తే చాలు. డీఎస్సీఅక్రమాలపై పోరాడుతున్న వైఎస్సార్ సీపీ పక్షాన విద్యార్థులు ఉన్నారు. రాష్ట్రంలోనూ మరో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం తథ్యం. – సురేష్ యాదవ్, ఎస్కేయూ ఐక్య విద్యార్థి సంఘం నాయకుడు వైఎస్సార్ సీపీ పోరాటాలకు మద్దతు యువత భవిష్యత్తుతో చెలగాటమాడడం బాధాకరం. డీఎస్సీలో ఎస్సీ,ఎస్టీ, బీసీ వర్గాలకు అన్యాయం జరి గింది. మెరిట్ ఉన్న అభ్యర్థులకూ ఉద్యోగాలు రాకపోవడం అన్యాయం. డీఎస్సీలో అర్హులై అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ చేస్తున్న పోరాటాలకు మద్దతిస్తాం. – సాకే హరి, ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు -
ఎట్టకేలకు డీఈఓ నియామకం
● ‘డైట్’ సీనియర్ అధ్యాపకుడు అయూబ్ హుసేన్కు ఎఫ్ఏసీ బాధ్యతలు అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా విద్యాశాఖలో నెలలుగా కొనసాగుతున్న పరిపాలనా అని శ్చితికి ఎట్టకేలకు తెరపడింది. డీఈఓ పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) డాక్టర్ ఎన్.అయూబ్ హుసేన్కు అప్పగిస్తూ పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్షారియా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం ఉత్తర్వులు అందుకున్న అయూబ్ హుసేన్ మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ప్రస్తుతం కర్నూలు జిల్లా డైట్ కళాశాలలో సీనియర్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. డీఈఓగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్, జాయింట్ కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం డీఈఓ చేరుకుని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా డీవైఈఓలు శ్రీనివాసరావు, లక్ష్మన్న, కార్యాలయ ఏడీలు మునీర్ఖాన్, శ్రీనివాసరావు, సూపరింటెండెంట్లు, సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రెండు నెలలుగా ఎఫ్ఏసీ లేక ఇబ్బందులు గతంలో డీఈఓగా పని చేసిన ప్రసాద్బాబు అనారోగ్య కారణాలతో దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడంతో జిల్లా విద్యాశాఖలో పరిపాలన ఇబ్బందులు తలెత్తాయి. ఆయన సెలవులోకి వెళ్లిన తర్వాత డీవైఈఓ శ్రీనివాసరావు ఇన్చార్జ్గా వ్యవహరించినప్పటికీ, పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) లేకపోవడంతో కీలకమైన పరిపాలనా ఫైళ్లు పెండింగ్లోనే నిలిచిపోయాయి. దీంతో జిల్లాలో విద్యాశాఖ పాలన గాడి తప్పింది. ఒత్తిళ్లతో ప్రసాద్బాబు సెలవు? ప్రసాద్బాబు ఏడీగా పనిచేస్తున్న సమయంలో డీఈఓగా ఎఫ్ఏసీ బాధ్యతలు నిర్వహిస్తూ అందరితో సమన్వయంగా వ్యవహరించిన అధికారిగా గుర్తింపు పొందారు. అయితే ఉన్నతాధికారుల ఒత్తిళ్ల నేపథ్యంలో అనారోగ్యానికి గురయ్యారని, చికిత్స అనంతరం విధుల్లో చేరడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు తిరిగి విధుల్లో చేరిన కొద్దికాలానికే మళ్లీ ఒత్తిళ్లు పెరగడంతో ఆరోగ్య దృష్ట్యా దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లినట్లు సమాచారం. మళ్లీ ఇన్చార్జ్ పాలన తప్పదా? డాక్టర్ అయూబ్ హుసేన్ ఈ ఏడాది నవంబర్లో ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఆయన పదవీకాలం కూడా కొద్దికాలమే ఉండనుంది. అనంతరం మళ్లీ ఇన్చార్జ్ పాలన కొనసాగే అవకాశం ఉందని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖకు శాశ్వత డీఈఓను నియమించి పరిపాలనలో స్థిరత్వం తీసుకురావాలని కోరుతున్నారు. -
బ్రెయిన్ స్ట్రోక్తో పోరాడి ఓడిన ఏఓ శ్రీనివాసులు
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న నల్లాని శ్రీనివాసులు (60) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మృతితో మండల పరిషత్ కార్యాలయంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆరు నెలల క్రితం కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో శ్రీనివాసులకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే బెంగళూరులోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం ఆరోగ్యం మెరుగుపడటంతో ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటూ పూర్తిస్థాయిలో కోలుకున్నారని, త్వరలోనే తిరిగి విధుల్లో చేరనున్నారని అందరూ భావించారు. అయితే అనారోగ్యం మళ్లీ తీవ్రతరం కావడంతో పరిస్థితి విషమించింది. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్రీనివాసులు విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమన్వయంతో పనిచేసే అధికారిగా గుర్తింపు పొందారు. సహోద్యోగులు, కిందిస్థాయి ఉద్యోగులను ఇబ్బంది పెట్టకుండా అందరినీ కలుపుకొని పనిచేసే వ్యక్తిగా పేరొందారు. ఆయన అకాల మరణం సహోద్యోగులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. శ్రీనివాసులుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆయన అంత్యక్రియలు స్వగ్రామమైన పెద్దపప్పూరు మండలం అమ్మలదిన్నె గ్రామంలో నిర్వహించారు. అనంతపురం రూరల్ ఎంపీడీఓ దివాకర్, కార్యాలయ సిబ్బంది, పలువురు పంచాయతీ కార్యదర్శులు వెళ్లి శ్రీనివాసులు భౌతికకాయానికి నివాళి అర్పించారు. -
గురుకులంలో తాగునీటి కష్టాలు
కుందుర్పి: మండల కేంద్రంలో ఉన్న జ్యోతిరావుపూలే బాలుర గురుకుల పాఠశాలలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. 3 నెలలుగా పంచాయతీ సిబ్బంది ట్యాంకర్ల ద్వారా పాఠశాల విద్యార్థులకు నీటిని సరఫరా చేసేవారు. అయితే ఉన్నఫలంగా గత 15 రోజులుగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుక్కెడు తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు సొంత నిధులతో నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తానని ప్రకటనలు చేయడం మినహా కనీసం పాఠశాలల్లో విద్యార్థులకు తాగునీరు ఇవ్వడంలో విఫలమైయ్యారని స్థానికులు విమర్శిస్తున్నారు. పాఠశాలలో నీరు లేకపోవడంతో స్వంత గ్రామాలకు వెళ్లి స్నానాలు చేసి వస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. పలుసార్లు తాగునీటి సమస్యపై ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. కనీసం ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కుందుర్పిలోని బాలుర గురుకుల పాఠశాలలో నెలకొన్ని మంచినీటి ఎద్దడిని తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. తీవ్ర ఇబ్బందుల్లో విద్యార్థులు -
ముగిసిన వాతావరణ బీమా గడువు
అనంతపురం అగ్రికల్చర్: ఎల్–నినో పరిస్థితుల నడుమ పంటల బీమా పథకాలు ఆదుకుంటాయనే ఆశతో రైతులు ప్రీమియం చెల్లింపునకు ఆసక్తి చూపుతున్నారు. వాతావరణబీమా, ఫసల్బీమా పథకాల నోటిఫికేషన్ ఖరీఫ్ ఆరంభమైన 40 రోజులకు ప్రకటించడంతో తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య గత 10 రోజులుగా రైతులు పడిన బాధలు వర్ణనాతీతం. ఈ క్రమంలో వాతావరణ బీమా కింద నోటిఫై చేసిన వేరుశనగ, పత్తి, చీనీ, దానిమ్మ, అరటి, టమాట పంటలకు ప్రీమియం చెల్లింపు గడువు ఈ నెల ఒకటో తేదీ (శనివారం) అర్ధరాత్రి 12 గంటలకు ముగిసింది. మొత్తంగా 80,097 మంది రైతులు 1,15,354 హెక్టార్ల పంటలకు ప్రీమియం కట్టినట్లు అధికారులు తెలిపారు. 1.47 లక్షల హెక్టార్లకు ఫసల్బీమా.. ఫసల్బీమా కింద నోటిఫై అయిన వరి, జొన్న, మొక్కజొన్న, కంది, ఆముదం, ఎండుమిరప పంటలకు ప్రీమియం చెల్లింపునకు ఈ నెల 15 వరకు గడువు ఉంది. ప్రస్తుతానికి 90,500 మంది రైతులు 1.47 లక్షల హెక్టార్లకు ప్రీమియం చెల్లించారు. గడువు నాటికి 1.75 లక్షల హెక్టార్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులో కంది పంటకే వేలాదిమంది రైతులు ప్రీమియం చెల్లించగా.. ఆ తర్వాత ఆముదం, ఎండుమిరప, అలాగే వరికి ప్రీమియం కడుతున్నట్లు చెబుతున్నారు. ప్రీమియం చెల్లింపులో ప్రస్తుతానికి వజ్రకరూరు మండల రైతులు మొదటి స్థానంలో నిలిచారు. అటు వాతావరణ, ఇటు ఫసల్బీమా కింద వజ్రకరూరులో 12 వేల మంది రైతులు 20 వేల హెక్టార్లకు బీమా చేయించుకుని టాప్లో నిలిచారు. ప్రీమియం గడువు ముగిసిన 15 రోజులకు పంటల వారీగా సమగ్ర వివరాలు అందుబాటులోకి వస్తాయని బీమా కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. పంటల బీమా విలువ రూ.2,289 కోట్లు జిల్లా రైతులు తమ వాటా కింద ప్రీమియం చెల్లించి రూ.2,289 కోట్లు విలువ చేసే పంటలకు బీమా చేయించుకున్నారు. అందులో వాతావరణ బీమా కింద రైతులు తమ వాటా కింద రూ.33.32 కోట్ల మేర ప్రీమియం చెల్లించడంతో దాని విలువ రూ.1,083.06 కోట్లుగా గుర్తించారు. అలాగే ఫసల్బీమా ప్రీమియం ఇంకా కొనసాగుతుండగా ప్రస్తుతానికి రైతులు తమ వాటా కింద చెల్లించిన రూ.6.17 కోట్ల ప్రీమియం ఆధారంగా పంట విలువ రూ.1,206.30 కోట్లుగా లెక్క తేల్చారు. 1.15 లక్షల హెక్టార్ల పంటలకు వాతావరణ బీమా -
టీచర్లకు టెట్ టెన్షన్ !
అనంతపురం ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) అంటే ఇప్పటివరకు నిరుద్యోగ బీఈడీ, డీఈడీ అభ్యర్థుల పరీక్షగానే భావించేవారు. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు కూడా భారీ సంఖ్యలో టెట్ రాయనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బోధన చేసే టీచర్లందరికీ టెట్ అర్హత తప్పనిసరి. దీంతో టెట్ అర్హత లేని ప్రభుత్వ ఉపాధ్యాయులు పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 5 నుంచి 16 వరకు టెట్ నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 18,191 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇందుకోసం ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ ది చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియా, శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల, గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సీవీ రామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రాలుగా ఉన్నాయి. రోజూ రెండు విడతలుగా పరీక్షలు జరగనున్నాయి. తొలివిడత ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో విడత మధ్యాహ్నం 2.30 నుంచి సాయత్రం 5 గంటల వరకు ఉంటుంది. టీచర్లకు సవాల్గా టెట్.. పది, పదిహేను, ఇరవై ఏళ్లుగా ఉద్యోగంలో ఉన్న కొందరు ఉపాధ్యాయులు మళ్లీ టెట్ రూపంలో పోటీ పరీక్ష రాయాల్సి రావడం వారికి మానసికంగా సవాల్గా మారింది. కొత్త సిలబస్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ), సమయ నిర్వహణ వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు విద్యార్థులకు పాఠాలు చెప్పడం, పాఠశాలల పరిపాలనా పనులు, రికార్డుల నిర్వహణ, ఎఫ్ఏ–1 పరీక్షల ఏర్పాట్లు, సమావేశాలు, సమీక్షలు... ఇలా రోజంతా విధుల్లోనే గడుస్తోంది. ఇంటికి చేరుకున్న తర్వాతే టెట్ పుస్తకాలు చేతిలోకి తీసుకుంటున్నారు. కొందరు తెల్లవారుజామునే లేచి చదువుతుంటే, మరికొందరు అర్ధరాత్రి వరకు మాక్ టెస్టులు రాస్తూ సన్నద్ధమవుతున్నారు. అభ్యర్థులకు సూచనలు.. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం పరీక్షకు 1.30 నుంచి 2.30 వరకు మాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థులు హాల్టికెట్తో పాటు ఏదో ఒకటి గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి. గుర్తింపు కార్డు పరిశీలించిన తర్వాతనే అనుమతిస్తారు. హాల్టికెట్లో ఫొటో లేకపోయినా, సరిగా కనిపించకపోయినా గుర్తింపు కార్డును పరిశీలించి రెండు ఫొటోలు, డిక్లరేషన్ తీసుకుని పరీక్షకు అనుమతిస్తారు. స్క్రైబ్స్ జాబితాలో ఉన్న దివ్యాంగ అభ్యర్థులకు డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన విద్యార్థులను మాత్రమే స్క్రైబ్స్గా కేటాయించాలి. వీహెచ్, ఓహెచ్ (రెండు చేతులు లేనివారు) అభ్యర్థులకు 50 నిముషాల అదనపు సమయం కేటాయిస్తారు. అభ్యర్థులతో పాటు ప్రభుత్వ టీచర్లకూ తప్పనిసరి పరీక్ష ఈ నెల 5 నుంచి 16 వరకు పరీక్షల నిర్వహణ జిల్లాలో 6 సెంటర్లలో పరీక్షలు రాయనున్న 18,191 మంది అభ్యర్థులు ఏర్పాట్లు సిద్ధం చేశాం టెట్ నిర్వహణకు జిల్లాలోని సెంటర్లలో అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేశాం. ఇబ్బంది పడకుండా అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు. – శ్రీనివాసరావు, జిల్లా విద్యాశాఖ అధికారి -
ఒకే గది.. ఐదు తరగతులు
శింగనమల: మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుంచి 5 వ తరగతి వరకూ 40 మంది విద్యార్థులున్నారు. అయితే విద్యార్థులందరూ ఒకే గదిలోనే కూర్చోవాల్సిన దుస్థితి నెలకొంది. మరో గది ఉన్నా .. పైకప్పు పెచ్చులు పడుతుండడంతో అందరికీ ఒకే గదిలోనే చదువు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. దెబ్బతిన్న భవనానికి మరమ్మతు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. దీనికి తోడు పాఠశాల సమీపంలోనే మురికికాలువలు పూడిపోవడంతో దోమలతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారని చెబుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి భవనాలకు మరమ్మతు చేయాలని కోరుతున్నారు. -
తేనెటీగల పెంపకానికి ప్రోత్సాహం
అనంతపురం అగ్రికల్చర్: ఉద్యానశాఖ ద్వారా తేనెటీగల పెంపకానికి ముందుకు వచ్చే లబ్ధిదారులకు రాయితీతో ప్రోత్సహిస్తామని ఆ శాఖ డీడీ ఉమాదేవి తెలిపారు. హార్టికల్చర్ ఆఫీసర్ రత్నకుమార్తో కలిసి ఆదివారం రూరల్ మండలం సిండికేట్నగర్ సమీపంలో నల్లమల హనీబీ పార్క్తో ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. తేనేటీగల పెంపకం, పెట్టుబడులు, ఆదాయం, మార్కెటింగ్ తదితర విషయాల గురించి శిక్షణ కేంద్రం నిర్వాహకుడు రమేష్ను అడిగి తెలుసుకున్నారు. తేనెటీగల వల్ల ఆదాయంతో పాటు ఉద్యాన పంటల్లో పరపరాగ సంపర్కానికి తోడ్పడి మంచి దిగుబడులు వస్తాయన్నారు. కేంద్ర నిల్వ ఉత్పత్తి కేంద్రం, తేనెటీగల కాలనీ ఉత్పత్తి, తేనెటీగల సమూహం, తేనెటీగల గూళ్లు, తేనెతీసే యంత్రం... ఇలా ఈ రంగానికి వివిధ రూపాల్లో రాయితీలు వర్తిస్తాయన్నారు. యూనిట్ విలువపై 40 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు. ప్రధానంగా ఉద్యానతోటల్లో అదనంగా తేనెటీగల పెంపకం చేపడితే అన్ని రకాలుగా ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు. తేనెటీగల వల్ల పురుగు మందుల పిచికారీ ఖర్చు తగ్గడమే కాకుండా మంచి పంట దిగుబడులు వచ్చినట్లు దానిమ్మ రైతు గంగాధర్రెడ్డి తెలిపారు. -
ప్రత్యేక పిల్లలకు ఊరట
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రత్యేక అవసరాల గల (సీడబ్ల్యూఎస్ఎన్) పిల్లలు, తల్లిడండ్రులకు శుభవార్త. ఇన్నాళ్లు సదరం సర్టిఫికెట్లు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్న పరిస్థితికి త్వరలో తెరపడనుంది. జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సదరం సర్టిఫికెట్ల జారీ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. దీంతో జిల్లాలో సుమారు 1,100 మంది ప్రత్యేక అవసరాల గల విద్యార్థులకు ప్రభుత్వ ప్రయోజనాలు అందనున్నాయి. సంక్షేమానికి దూరం.. జిల్లాలో 6 నుంచి 18 ఏళ్లలోపు ప్రత్యేక అవసరాల గల విద్యార్థులు 4,090 మంది ఉన్నారు. వీరిలో 1,100 మందికి సదరం సర్టిఫికెట్లు లేవు. దీంతో ప్రభుత్వ పింఛన్లు, వివిధ సంక్షేమ పథకాలు, అలిమ్కో ద్వారా అందించే సహాయక పరికరాలు వంటి అనేక ప్రయోజనాలకు వారు దూరమవుతున్నారు. సదరం సర్టిఫికెట్ పొందాలంటే ప్రభుత్వం విడుదల చేసే ఆన్లైన్ స్లాట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే స్లాట్లు పరిమితంగా ఉండడం, కొద్దిసేపే అందుబాటులో ఉండటం, తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం, రోజువారీ కూలీ పనులకు వెళ్లడం వంటి కారణాలతో చాలామంది నమోదు చేసుకోలేకపోయారు. ఫలితంగా అర్హత ఉన్నప్పటికీ వందలాది మంది పిల్లలు ప్రతి ఏడాది ప్రభుత్వ ప్రయోజనాలను కోల్పోతున్నారు. కలెక్టర్ చొరవతో ప్రత్యేక డ్రైవ్.. సమస్యను సమగ్ర శిక్ష అధికారులు కలెక్టర్ ఓ. ఆనంద్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సంబంధిత ఫైల్ తెప్పించి రాష్ట్ర అధికారులతో చర్చించారు. ఫలితంగా జిల్లాకు ప్రత్యేకంగా సదరం సర్టిఫికెట్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు అనుమతి లభించింది. ఇదీ షెడ్యూల్ .. ఈ నెల 8న ప్రత్యేక లింక్ అందుబాటులోకి రానుంది. ఆన్లైన్లో అర్హులైన విద్యార్థుల వివరాలు నమోదు చేయనున్నారు. 19,20,21,22,24 వరకు స్లాట్ బుకింగ్లు నిర్వహిస్తారు. తల్లిదండ్రులు తమకు అనుకూలమైన తేదీని ఎంపిక చేసుకోవచ్చు. అనంతరం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, వైద్యుల ధ్రువీకరణ ఆధారంగా సదరం సర్టిఫికెట్లు జారీ చేస్తారు. సర్టిఫికెట్ పొందిన తర్వాత అర్హులైన విద్యార్థులకు దివ్యాంగుల పింఛన్లు, అలిమ్కో ద్వారా అందించే సహాయక పరికరాలు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందే అవకాశం ఉంది. సదరం సర్టిఫికెట్ల కోసం ప్రత్యేక డ్రైవ్కు కలెక్టర్ ఆనంద్ చొరవ ఆగస్టు 8న ప్రత్యేక లింక్.. 19 నుంచి 24 వరకు స్లాట్ బుకింగ్లు అవకాశాన్ని వినియోగించుకోవాలి కలెక్టర్ ప్రత్యేక చొరవతో వచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఐఈఆర్పీలు, ఐఈడీఎస్ఎస్ ఉపాధ్యాయులు తమ పరిధిలోని అర్హులైన ప్రతి ప్రత్యేక అవసరాల విద్యార్థిని ఈ ప్రత్యేక డ్రైవ్కు తీసుకురావాలి. – శైలజ సమగ్ర శిక్ష ఏపీసీ. ఫణిరాజు ఐఈడీ కోఆర్డినేటరు -
నేడు కలెక్టరేట్లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్ కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో సోమవారం ఉదయం 9 గంటలకు ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు. భూసమస్యలకు సంబంధించిన అర్జీలను పరిష్కార వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్లో అందజేయాలని పేర్కొన్నారు. ప్రజలు తమ అర్జీ పరిష్కార స్థితిని కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in వెబ్సైట్లోనూ సమర్పించవచ్చని తెలిపారు. ఉరవకొండ డిగ్రీ కళాశాలకు అరుదైన అవకాశం ఉరవకొండ: నేషనల్ సర్వీస్ స్కీమ్ అధ్వర్యంలో ఆదివారం నషా ముక్త్ యువ వికసిత్ భారత్ వర్చువల్ సమావేశంలో పాల్గొనేందుకు ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులకు అరుదైన అవకాశం దక్కింది. కాన్ఫరెన్స్కు 125 కళాశాలలు ఎంపిక కాగా, తెలుగు రాష్ట్రాల్లో కేవలం 10 కళాశాలలు ఎంపికయ్యాయి. ఇందులో ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కుడా ఉండటం విశేషం. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వర్చువల్ సమావేశం ద్వారా మాట్లాడుతూ మాదక ద్రవ్యాల రహిత భారత నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఇందు కోసం వంద వారాల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నట్లు తెలిపారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శైలజారాణి, వైస్ ప్రిన్సిపాల్ మస్తానప్ప, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్లు ఎం.విష్ణుప్రియ, సుధాకర్, ఎన్సీసీ అధికారి ప్రశాంత్, అద్యాపకులు అయ్యన్న, సిరాజ్ అలీ, వెంకటరాముడు, నారాయణస్వామి, జమీల, సుజాత, వెంకటేష్, ఆంజినేయులు, రమేష్, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు. రెండు స్కూల్ బస్సులకు నిప్పు తాడిపత్రి రూరల్ : ప్రమాదవశాత్తూ రెండు స్కూల్ బస్సులకు నిప్పంటుకుంది. పట్టణ సమీపాన పుట్లూరు రోడ్డులోని గురుకుల్ స్కూల్కు చెందిన రెండు బస్సులు 15 ఏళ్ల కాలపరిమితి ముగియడంతో స్క్రాప్ కింద పరిగణించి ఆవరణలో ఉంచారు. ఆదివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ రెండు బస్సులకూ నిప్పంటుకున్నాయి. ఇందులో ఒక బస్సు పూర్తిగా దగ్ధం కాగా.. మరొకటి పాక్షికంగా దెబ్బతినింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. మంటలు ఎలా వ్యాపించాయో తెలియడం లేదని పాఠశాల కరస్పాండెంట్ సతీష్ తెలిపారు. -
అడ్డంకులు సృష్టించడం తగదు
మంత్రి పయ్యావుల కేశవ్ అనుచరులు, టీడీపీ నేతల దౌర్జన్యాలను నిరసిస్తూ సోమవారం ఉరవకొండలో నిర్వహించే శాంతియుత ధర్నాకు అడ్డంకులు సృష్టించడం తగదని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ధర్నాను విఫలం చేయడానికి అధికార పార్టీ నేతలు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ శాంతియుత పద్ధతిలో నిరసన తెలిపే హక్కు ఉందని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినా ఇక్కడ పట్టించుకోవడం లేదన్నారు. జూలై 31వ తేదీనే ధర్నాకు పిలుపునిస్తే.. అనుమతి ఇవ్వకుండా వాయిదా వేసుకోవాలని తెలిపితే పోలీసులను గౌరవించి సోమవారానికి వాయిదా వేశామన్నారు. ఉదయం 9.30 గంటలకు వైఎస్సార్సీపీ కార్యాలయం వద్దకు పార్టీ శ్రేణులు చేరుకుని, ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సత్కారం
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని అటల్ ఇంక్యుబేషన్ కేంద్రానికి చెందిన ఇద్దరు గ్రామీణ ఆవిష్కర్తలకు జాతీయ సత్కారం దక్కింది. గ్రామీణ భారతదేశానికి ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాల అభివృద్ధి అంశంపై గరిగంటి సుధాకర్ బాబుకు, రాయలసీమ మోసంబి రైతుల కోసం విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి అంశానికి సంబంధించి ఉషన్ శివరామ్ను ఘనంగా సత్కరించారు. దేశ వ్యాప్తంగా కేవలం 26 మంది ఎంపిక కాగా, వారిలో ఇద్దరు ఎస్కేయూ అటల్ ఇంక్యుబేషన్ కేంద్రానికి చెందిన వారు కావడం గమనార్హం. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో గ్రాస్రూట్స్ ఇన్నోవేటర్ రికగ్నేషన్–2026 కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వారిని సత్కరించారు. ఎస్కేయూ వీసీ జ్యోతికుమార్ వారిని అభినందించారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
అనంతపురం కల్చరల్: జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య సర్వసభ్య సమావేశం జిల్లా కేంద్రంలోని సమాచార కేంద్రంలో ఆదివారం జరిగింది. శ్రీనివాసుల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన సీఏపీసీఓ చైర్మన్ సురేష్కుమార్ మాట్లాడుతూ ఇన్నిరోజులుగా అధ్యక్షుడిగా వ్యవహరించిన రవీంద్రనాథరెడ్డి, కోశాధికారి సుబ్రమణ్యం, ప్రధాన కార్యదర్శి నబీరసూల్ ముగ్గురూ ఒకే ఏడాదిలో మరణించడం సమాఖ్యకు తీరని లోటని సంతాపం తెలియజేశారు. వారి స్థానాలలో నూతన సభ్యులను ఎన్నుకున్నట్లు వెల్లడించారు. వినియోగదారుల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమన్నారు. హక్కుల పరిరక్షణ, అవగాహన కార్యక్రమాల విస్తరణతో పాటు జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య బలోపేతమే లక్ష్యంగా నూతన కార్యవర్గం పనిచేయాలని సూచించారు. అధ్యక్షుడిగా తోట చెన్నప్ప.. అనంతరం జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షుడిగా తోట చెన్నప్పను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంటుగా చల్లా కిషోర్, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడిగా పి.కృష్ణమూర్తి, చంద్ర మహేష్, రాయల్ కొండయ్య, కోశాధికారిగా శేషాద్రి, జాయింట్ సెక్రటరీగా హసీన్వలి, సంయుక్త కార్యదర్శిగా అశ్వత్తరెడ్డితో పాటు వివిధ మండలాల కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై తీర్మానాలు చేశారు. -
పార్సిల్ సర్వీసులో కొత్త టారిఫ్లు
అనంతపురం టౌన్: తపాలశాఖ అనుబంధంగా పనిచేస్తున్న పార్సిల్ సర్వీసులకు ధరలను తగ్గిస్తూ కొత్త టారీఫ్లను ఇండియా పోస్టు ప్రవేశపెట్టినట్లు తపాలశాఖ అనంతపురం జిల్లా సూపరింటెండెంట్ అమర్నాథ్ ఒక ప్రకనటో తెలిపారు. తగ్గింపు టారిఫ్లతో వ్యాపార సంస్థలు, ఈ కామర్స్ విక్రేతలు, వస్తు తయారీ సంస్థలు, హోల్సెల్, రిటైల్ వ్యాపారస్తులు, బల్క్ పార్సెల్ వినియోగదారులకు అనువుగా ఉంటుందన్నారు. దేశంలో ఎక్కడికై న 500 గ్రాముల లోపు పార్సిల్ను పంపితే గతంలో రూ.100కు పైగా ఉండేదన్నారు. ప్రస్తుతం రూ.35 లోపే ధర ఉంటుందన్నారు. దీంతో పాటు మెట్రో ప్రాంతాలకు పంపే పార్సెల్స్ ధరలను బాగా తగ్గించామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ‘ఆశావాది’ సాహితీ సేవలు చిరస్మరణీయం అనంతపురం కల్చరల్: స్వయంకృషితో ఎదిగిన మహోన్నత సాహితీ శిఖరం డాక్టర్ ఆశావాది ప్రకాశరావు తెలుగు సాహిత్యానికి చేసిన సేవలు నిరుపమామని పలువురు వక్తలు కొనియాడారు. ఆశావాది సాహితీ పురస్కార ప్రదానోత్సవం ఆదివారం ఆర్ట్స్ కాలేజీ వేదికగా ఘనంగా జరిగింది. ఆశావాది శశాంక మౌలి అధ్యక్షతన జరిగిన పద్మశ్రీ ఆశావాది ప్రకాశరావు సాహితీ ఉత్సవంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులకు పురస్కారాలను అందించారు. మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ అధికార ప్రతిఽనిధి డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగకు ‘సామాజిక సేవా పురస్కారం,’ హైదరాబాద్కు చెందిన నల్లాన్ చక్రవర్తుల సాహిత్కు ‘అవధాన పురస్కారం’, పద్యబంధ కవి అన్నమరాజు ప్రభాకరరావుకు ‘సాహిత్య పురస్కారం’ అందించి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో శతావధాని కళారత్న ఆముదాల మురళి, జనప్రియ కవి ఏలూరు యంగన్న, డాక్టర్ వైస్సార్ జీవిత సాఫల్య పురస్కార గ్రహీత శాంతినారాయణ, వైఎస్సార్ జిల్లాకు చెందిన ప్రముఖ గాయకులు ముండ్లపాటి వెంకటసుబ్బయ్య, హైదరాబాదుకు శిల్పి కళారత్న డాక్టర్ గొల్లపల్లి జయన్న , సంస్కృత ఉపన్యాసకులు ఆశావాది సుధామ వంశి తదితరులు విశిష్ట అతిథులుగా విచ్చేసి ఆశావాది సాహిత్యంలోని విశిష్టతలను తెలియజేశారు. ఈ సందర్భంగా అవధానాచార్య పద్మశ్రీ డాక్టర్ ఆశావాది ప్రకాశరావు సాహితీపీఠం లోగోను ఆవిష్కరించారు. సంతల ఆదాయం రూ.3.17 లక్షలు అనంతపురం అగ్రికల్చర్: స్థానిక వ్యవసాయ మార్కెట్యార్డులో ఈ వారం జరిగిన జీవాలు, పశువుల సంతల ద్వారా రూ.3.17 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు చైర్పర్సన్ బల్లా పల్లవి, సెక్రటరీ కె.గోవిందు తెలిపారు. అందులో శనివారం జరిగిన గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల సంత ద్వారా రూ.1.57 లక్షలు, ఆదివారం జరిగిన పశువులు, గేదెలు, ఎద్దుల సంత నుంచి రూ.1.60 లక్షలు మేర వసూలైనట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి రాయదుర్గం రూరల్: మండల పరిధిలోని 74 ఉడేగోళం వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బిదురు బొమ్మయ్య కుమారుడు బి.ఓబయ్య (38) మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. మృతుడు ఓబయ్య గ్రామంలో నుంచి సబ్స్టేషన్ వెనుక భాగాన ఉన్న తన ఇంటికి ద్విచక్ర వాహనం బయలుదేరాడు. అయితే హైవేపై రోడ్డు దాటుతుండగా రాయదుర్గం నుంచి అనంతపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు (ఏపీ 39జడ్ 0704) ఢీ కొంది. స్థానికులు రాయదుర్గం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడు ఓబయ్య ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడన్నారు. మృతుడికి భార్య సూరమ్మ, 10వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నట్లు తెలిపారు. గ్రామంలోకి వెళ్లొస్తానని చెప్పి , తిరిగరాని లోకాలకు వెళ్లావా అంటూ మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. రూరల్ సీఐ వెంకటరమణ, అర్బన్ ఎస్ఐ సురేష్ ఘటనా స్థలానికి వెళ్లి విచారించారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మహిళ మెడలో బంగారు చైన్ అపహరణ రామగిరి: మండలంలోని మక్కినవారిపల్లిలో శనివారం అర్ధరాత్రి అశ్వర్థమ్మ అనే మహిళ మెడలోని నగలను దొంగలు అపహరించారు. బంధువులు తెలిపిన వివరాల మేరకు.. శనివారం అర్ధరాత్రి ఇంటి సమీపంలో అశ్వర్థమ్మ బహిర్బూమికి వెళ్లింది. ఈ సమయంలోనే దుండగులు ఆమె మెడలోని తాళిబొట్టు చైన్ను లాక్కెళ్లారు. చైన్ సుమారు మూడు తులాల ఉంటుందని బాధితురాలు పేర్కొంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
బళ్లారి రాఘవ రంగస్థల సేవలు ఆదర్శప్రాయం
అనంతపురం కల్చరల్: బళ్లారి రాఘవ రంగస్థల సేవలు ఆదర్శప్రాయమని, ఆయన జిల్లాలో జన్మించడం మన అదృష్టమని వక్తలన్నారు. ఆదివారం రాత్రి బళ్లారి రాఘవ 146వ జయంతి స్థానిక లలితకళాపరిషత్లో ఘనంగా జరిగింది. ఎల్కేపి కార్యదర్శి పద్మజ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో డీఆర్వో మలోల, జేఎన్టీయూ రిజిస్ట్రార్ దుర్గాప్రసాద్, ఎల్కేపి అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది గురుప్రసాద్, ఉపాధ్యక్షుడు సంగాల నారాయణస్వామి, రామగోవిందసాగర్ ఆత్మీయ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బళ్లారి రాఘవ ఆదర్శప్రాయ జీవితాన్ని గురించి రంగస్థలానికి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం బళ్లారి రాఘవ పురస్కారాలకు ఎంపికై న రాష్ట్రస్థాయి విభాగంలో డీసీ కృష్ణ, జంగం ధర్మారావు జిల్లా విభాగంలో సోమిరెడ్డి, ఎర్రిస్వామి, జేకే రామాంజనేయులు, నారాయణస్వామి, ఉంగరాల శ్రీనివాసులు, ఆముదాల సుబ్రమణ్యం, వరప్రసాద్లకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా పురస్కారాలనందించారు. అనంతరం ప్రదర్శించిన ‘శ్రీపోతులూరి వీరబ్రహ్మంద్రస్వామి జీవిత చరిత్ర’ చారిత్రక నాటకం ఆహూతులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో లలితకళాపరిషత్ కార్యనిర్వాహక సభ్యులు ఆదినారాయణరెడ్డి, శంకర్, రమణారెడ్డి, అస్లాంబాషా, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
గుప్తనిధుల తవ్వకాలు భగ్నం
బత్తలపల్లి: గుప్తనిధుల తవ్వకాలను గ్రామస్తులు భగ్నం చేశారు. ముఠాకు చెందిన ఒకరిని పట్టుకున్నారు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన మేరకు.. మండలంలోని అప్రాచెరువు గ్రామ సమీపంలో ఉన్న అపరాదయ్య బండ వద్ద కొన్ని రోజులుగా రాత్రి సమయాల్లో గుప్త నిధుల కోసం దుండగులు తవ్వకాలు సాగిస్తున్నారు. శనివారం రాత్రి వారిని ఎలాగైనా పట్టుకోవాలనే ఉద్దేశంతో గ్రామస్తులు సూలా నరసింహులు, బుట్రా గోపాల్, సంగాల నాగరాజు, సూలా ఓబన్న ఆ ప్రాంతంలో మాటువేయగా.. అర్ధరాత్రి సమయంలో టవేరా వాహనంలో ఏడుగురు అక్కడికి చేరుకున్నారు. విషయం తెలియగానే అపరాదయ్య బండ వద్దకు గ్రామస్తులతో కలిసి సింగిల్విండో అధ్యక్షుడు ఆకులేటి వీరనారప్ప వచ్చారు. అందరూ కలిసి దుండగులను పట్టుకునేందుకు యత్నించగా పారిపోయారు. డ్రైవర్ వాహనంతో పాటు పారిపోతుండగా గ్రామస్తులు వాహనాల్లో వెంబడించారు. జాతీయ రహదారిపై సంకేపల్లి వద్ద పట్టుకున్నారు. పట్టుబడిన వ్యక్తి పామిడి మండలం కొండాపురం గ్రామానికి చెందిన తిప్పారెడ్డి కుమారుడు కొండూరు సుధీర్రెడ్డిగా గుర్తించారు. పోలీసులు టవేరా వాహనంతోపాటు తవ్వకాల కోసం తెచ్చిన పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. గుప్తనిధుల కోసం పామిడికి చెందిన ఇద్దరు, కల్లూరుకు చెందిన ఇద్దరు, అనంతపురానికి చెందిన ఇద్దరు వచ్చినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆదివారం పోలీసుస్టేషన్ వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కాపు కాసి వాహన డ్రైవర్ను పట్టుకున్న గ్రామస్తులు -
అధికార అండ.. దౌర్జన్యకాండ
సాక్షి టాస్క్ఫోర్స్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరాక ఉరవకొండ నియోజకవర్గంలో అధికార ‘పచ్చ’ నేతలు రెడ్బుక్ రాజ్యాంగం మాటున వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై విరుచుకుపడుతున్నారు. మంత్రి పయ్యావుల కేశవ్ అండ చూసుకుని పేట్రేగిపోతున్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై దౌర్జన్యాలకు పాల్పడటమే కాక ఇళ్లపైనా దాడులు చేసి భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. భూములు తదితర ఆస్తులు కబ్జా చేసి.. ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. ఎవరైనా ఎదురుతిరిగితే మంత్రి కేశవ్తో పాటు సోదరుడు శీనప్పను కలిసి టీడీపీ కండువా వేసుకుంటే అన్నీ ఆపేస్తామంటున్నారు. గ్రామాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని మంత్రి అనుచరులు బెదిరింపులు, దాడులకు తెగబడుతున్నారు. ● ఉరవకొండ మండలం లత్తవరం గ్రామానికి చెందిన కౌడిగి గోవిందు వైఎస్సార్సీపీలో చురుగ్గా పనిచేస్తున్నారు. ఈయన్ను టీడీపీ నేతలు టార్గెట్ చేశారు. గోవిందు అల్లుడు జయకుమార్ విడపనకల్లు మండలం వేల్పుమడుగులో కొనుగోలు చేసిన 21.05 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్లాన్ వేశారు. కొనుగోలు చేసిన భూమి దేవదాయ శాఖకు చెందినదంటూ గ్రామానికి చెందిన టీడీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేసి, పోలీసులతో భయబ్రాంతులకు గురిచేశారు. దీనిపై బాధితుడు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సదరు భూమి జయకుమార్దేనని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. రెవెన్యూ అధికారులు కూడా ఎండార్స్మెంట్ ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు రైతు జయకుమార్ను సదరు పొలంలోకి వెళ్లకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. ● ఉరవకొండ మండలం రేణుమాకులపల్లిలో గొర్రెల కాపర్ల మధ్య జరిగిన గొడవల్లో ఎటువంటి సంబంధమూ లేని 12 మంది వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు పోలీసుల ద్వారా అక్రమ కేసులు బనాయించారు. ● జల్లిపల్లి సర్వేనంబర్ 486లో 24.45 ఎకరాల భూమి వైఎస్సార్సీపీ కూడేరు మండల కన్వీనర్ బైరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యుల పేర్లపై ఉంది. అయితే ఆ భూమికి టీడీపీ నేతలు ఫేక్ రికార్డులు సృష్టించి రెవెన్యూ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి భూ వివాదానికి కారకులయ్యారు. ● ఉదిరిపికొండలో తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో గ్రామస్తులు రాస్తారోకో చేశారు. దీంతో టీడీపీ నాయకులు పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి రాస్తారోకోలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నాయకులను గుర్తించి.. 108 అంబులెన్స్కు దారి ఇవ్వలేదంటూ కేసులు పెట్టించారు. ● బెళుగుప్ప మండలం నక్కలపల్లికి చెందిన వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ఇన్చార్జ్ సంజీవరెడ్డి ముఖ్యమంత్రిపై అభ్యంతరకర పోస్టు పెట్టారంటూ టీడీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు వేసి.. విచారణ పేరిట 20 పోలీసు స్టేషన్లు తిప్పారు. ● ఉరవకొండ మండలం లత్తవరం తండాకు చెందిన వైఎస్సార్సీపీ గిరిజన నాయకుడు ప్రసాద్ నాయక్పై దాడి చేసి.. ఆయనే దాడి చేసినట్లు టీడీపీ వారు తప్పుడు కేసు పెట్టారు. ● ఉరవకొండ మండలం బూదగవి వైఎస్సార్సీపీ నాయకుడు ధనంజయకు సర్వే నంబర్ 333–ఏలోని 6.20 ఎకరాలు, సర్వే నంబర్– 313లోని 2.43 ఎకరాల భూమి ఉంది. ఇందులో కొన్నేళ్లుగా పంటలు సాగుచేస్తున్నాడు. అయితే ఈ భూమిని ఇతరులు కొనుగోలు చేసినట్లు టీడీపీ నాయకులు ఫేక్ రికార్డులు సృష్టించి, జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేయించారు. దీనిపై బాధితుడు ధనంజయ సివిల్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టులో కేసు నడుస్తుండగానే టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఏకంగా పొలంలోకి వెళ్లి సర్వే చేయించే ప్రయత్నం చేశారు. ఇదేమిటని అడ్డుకోబోయిన ధనంజయ సోదరుడిని పోలీసులు దూషించారు. దీంతో మనస్తాపం చెందిన ధనంజయ సోదరుడు పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వైఎస్సార్సీపీ నాయకులే టార్గెట్ పేట్రేగిపోతున్న టీడీపీ నేతలు బాధితుల పక్షాన నిలవని అధికార యంత్రాంగం దౌర్జన్యాలకు నిరసనగా నేడు వైఎస్సార్సీపీ మహా ధర్నా నేడు మహా ధర్నా.. టీడీపీ నేతల దౌర్జన్యకాండకు నిరసనగా వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉరవకొండలో మహాధర్నా నిర్వహించనున్నారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, మాజీ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, బీసీ సెల్ రాష్ట్ర నాయకులు రమేష్గౌడ్ తదితరులు హాజరుకానున్నారు. పార్టీ శ్రేణులు తరలిరానున్నాయి. పోలీసు, రెవెన్యూ అధికారులు నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని నినదించనున్నారు. కక్ష కట్టి.. కేసులు పెట్టి.. -
ఆసుపత్రిపై నుంచి నగ్నంగా దూకి ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్: నగరంలో రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిపై నుంచి యువకుడు నగ్నంగా దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. త్రీటౌన్ సీఐ కౌలుట్లయ్య తెలిపిన మేరకు.. తాడిమర్రి మండలం రామాపురానికి చెందిన దబ్బర అశోక్ (30) తల్లిదండ్రులు గతంలోనే చనిపోయారు. అప్పటి నుంచి అతను నగరంలో ఉంటూ రైల్వే స్టేషన్ సమీపంలోని హిత మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో కమీషన్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. వివిధ ఆసుపత్రుల నుంచి రోగులను తీసుకువస్తే అతనికి ఆసుపత్రి యాజమాన్యం కమీ షన్ ఇచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. మూడు సంవత్సరాలుగా అదే ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆసుపత్రిపై నుంచి అశోక్ నగ్నంగా కిందికి దూకాడు. తీవ్ర గాయాలైన అతడిని ఆసుపత్రి సిబ్బంది వెంటనే లోపలికి తీసుకొచ్చి చికిత్స ప్రారంభించగా.. శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. అశోక్ మృతిపై తమకు అనుమానాలున్నాయని బంధువులు ఆరోపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ప్రభుత్వాసుత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసు నమోదు చేస్తామని సీఐ కౌలుట్లయ్య తెలిపారు. -
పిల్లర్ల మాటున దోపిడీ
రామ్నగర్లోని అప్పాజీ నిలయం అపార్ట్మెంట్ వద్ద నిర్మించిన ట్రాన్స్ఫార్మర్ పిల్లర్ ఇది. ఇక్కడ కూడా యజమానే పిల్లర్ ఏర్పాటు చేసుకున్నా దీనికి సైతం ఎస్టిమేషన్లో రూ.36 వేలు బిల్లు వేసి మళ్లీ అతడి నుంచి కట్టించుకున్నారు. ఈ రెండే కాదు.. అనంతపురంలో చాలా చోట్ల ఇదే తంతు నడుస్తోంది. భవన యజమానులకు అవగాహన లేకపోవడంతో కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారు. అనంతపురంలోని మొదటి రోడ్డు రాఘవేంద్రస్వామి గుడి వెనుక భాగంలో గురు నిలయం అపార్ట్మెంట్ వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ పిల్లర్ ఇది. ఈ పిల్లర్ ఏర్పాటు కోసం విద్యుత్ సంస్థకు అపార్ట్మెంట్ నిర్వాహకుడు రూ.36 వేలు చెల్లించాడు. పిల్లర్ను నిర్మించాల్సిన కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంతో సొంతంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో పిల్లర్ బిల్లును ఎస్టిమేట్లో మినహాయించాల్సిన అధికారులు అలాంటిది పట్టించుకోకుండా కాంట్రాక్టర్ బిల్లులో జమ చేశారు. అధికారులకు బాధితుడు ఫిర్యాదు చేసినా స్పందన కరువైంది. అనంతపురం టౌన్: అనంతపురం నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో ఇటీవల పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు, షాపింగ్మాల్స్, కమర్షియల్ భవనాలు వెలుస్తున్నాయి. ప్రతి భవంతి వద్ద విద్యుత్ వినియోగం బట్టి ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసుకోవాలి. ఇందు కోసం విద్యుత్ సంస్థకు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్, పిల్లర్ల నిర్మాణాల కోసం నిర్దేశించిన మొత్తాన్ని యజమానులు ముందస్తుగా చెల్లించాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్లు పిల్లర్ నిర్మించి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఎక్కడా వాటి నిర్మాణం చేపట్టకుండా భవన యజమానులతోనే ఏర్పాటు చేయించి అ డబ్బు దండుకుంటున్నారు. ఈ రెండేళ్ల కాలంలో నగరంలోని మొదటి, రెండు, నాలుగో రోడ్లతో పాటు కోవూర్నగర్, రామ్నగర్, లక్ష్మీనగర్, శ్రీనగర్కాలనీ, సవేరా ఆసుపత్రి 80 ఫీట్ రోడ్డు, గౌరవ్గార్డెన్స్, కళ్యాణదుర్గం రోడ్డు హెచ్ఎల్సీ కాలనీ ప్రాంతాల్లో ప్రతి అపార్ట్మెంట్ నుంచి రూ.36 వేల చొప్పున 200కు పైగా భవనాల యజమానుల నుంచి పిల్లర్ల రూపంలోనే రూ.70 లక్షలకు పైగా దోచేశారనే ఆరోపణలున్నాయి. కొంత మంది విద్యుత్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై ్క వినియోగదారుల నడ్డి విరుస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ విషయంపై ఆ శాఖ ఉన్నతాధికారులు స్పందించి వినియోగదారుల నుంచి లాగిన డబ్బును తిరిగి వెనక్కు ఇవ్వాల్సి ఉంది. రికవరీ చేయిస్తాం పిల్లర్ల నిర్మాణాల కోసం ఎస్టిమేషన్లోనే డబ్బు చెల్లించి నిర్మాణాలు సైతం వినియోగదారులే చేపట్టి ఉంటే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి. ఎలాంటి విచారణ లేకుండానే వారు చెల్లించిన డబ్బు 20 రోజుల్లో రికవరీ చేయిస్తాం. ఏఈలతో వినియోగదారులకు అవగాహన కల్పించి దోపిడీకి అడ్డుకట్ట వేస్తాం. – శేషాద్రి శేఖర్, విద్యుత్ శాఖ ఎస్ఈ వినియోగదారుల నడ్డి విరుస్తున్న కాంట్రాక్టర్లు పిల్లర్ల నిర్మాణానికి ముందే డబ్బు చెల్లించినా మళ్లీ లాగుతున్న వైనం 200కు పైగా పిల్లర్లకు దండుకున్నారనే ఆరోపణలు ‘మామూలు’గా పోతున్న విద్యుత్ శాఖ అధికారులు -
బలహీనులపై ప్రతాపం చూపుతారా?
● రిటైర్డు జడ్జి కిష్టప్ప మండిపాటు అనంతపురం టవర్క్లాక్: రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు వచ్చాక అధికార టీడీపీ నాయకుల భూదందాలు పెరిగిపోయాయని, బలహీనుల భూములను కబ్జా చేస్తూ వారిపై ప్రతాపం చూపుతున్నారని రిటైర్డు జడ్జి కిష్టప్ప మండిపడ్డారు. శనివారం ఆయన అనంతపురంలోని ప్రెస్క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ఎక్కడ చూసినా టీడీపీ నాయకుల దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు మితిమీరి పోయాయన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలోని వేల్పుమడుగు గ్రామంలో కురుబ గోవిందు అల్లుడు 20 ఎకరాల భూమిని కొనుగోలు చేస్తే.. కొంతమంది అధికార పార్టీ పెద్దల అండదండలతో ఆ భూమిని కబ్జా చేసేందుకు పథకం వేశారన్నారు. టీడీపీలో చేరలేదన్న కారణంగా కురుబలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పాయని, న్యాయ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, సామాన్యులకు న్యాయం చేకూరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కురుబల జోలికొస్తే ఊరుకోం ఎవరికీ ఎటువంటి ఇబ్బందులూ కలిగించని కురుబల జోలికి వస్తే ఊరుకునేది లేదని రిటైర్డు జడ్జి హెచ్చరించారు. కురుబలు ఆర్థికంగా ఎదగకూడదా అంటూ ప్రశ్నించారు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా.. ఎదిరించినందుకు ఎన్కౌంటర్ చేస్తారా.. ఇదెక్కడి రాజ్యాంగం అంటూ నిలదీశారు. కురుబల తరఫున న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో టీడీపీ నాయకుల ప్రోద్బలంతో ఇళ్లు కూల్చేశారని, అక్కడ బాధితులకు తాను అండగా నిలిచి పోరాటం చేశానని గుర్తు చేశారు. యువత సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఢిల్లీలో యువత ఉద్యమిస్తే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని, చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కూడా యువత ముందుకు వచ్చి సమాజం కోసం పాటుపడాలన్నారు. కార్యక్రమంలో ఆదినారాయణ, వశికేరి రమేష్, హనుమన్న, రైతు గోవిందు, రామచంద్ర, రాధాకృష్ణ, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద
బొమ్మనహాళ్: వర్షాభావంతో ఇబ్బంది పడుతున్న తుంగభద్ర ఆయకట్టు రైతులకు ఊరటనిచ్చే పరిణామం చోటు చేసుకుంది. తుంగభద్ర డ్యాం ఎగువ ప్రాంతమైన శివమొగ్గ జిల్లాలో కొద్ది రోజులుగా ఆశాజనకంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎగువన ఉన్న గాజనూరు జలాశయం (అప్పర్ తుంగ ప్రాజెక్ట్)లో నీటి నిల్వ గరిష్ట మట్టానికి చేరింది. అక్కడి ఇంజినీర్లు కొన్ని గేట్లను ఎత్తి 55,197 క్యూసెక్కుల నీటిని తుంగ నదిలోకి విడుదల చేశారు. ఆ నీరు దిగువన ఉన్న తుంగభద్ర డ్యాంకు శనివారం రాత్రికి చేరింది. ఆదివారం ఉదయానికల్లా జలాశయంలోకి నీటి ప్రవాహం 50 వేల క్యూసెక్కులకు పైగా పెరిగే అవకాశం ఉందని బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. డ్యాంలో ప్రస్తుతం 38.69 టీఎంసీల నీరు నిల్వ ఉంది. హెచ్చెల్సీకి నీటి విడుదల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని తుంగభద్ర జలాశయం నుంచి ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కు శనివారం 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అంతకు ముందు అధికారులు డ్యాంపై పూజలు చేశారు. అనంతరం సంప్రదాయబద్ధంగా రైతులతో కలిసి వాయనం వదిలారు. డ్యాం నుంచి హెచ్చెల్సీకి నీటిని విడుదల చేసినట్లు జలాశయ ఈఈ ఎన్.చంద్రశేఖర్, ఎస్ఈ నారాయణ నాయక్ తెలిపారు. -
శతాధిక వృద్ధురాలికి ఘన సన్మానం
కూడేరు: మండల పరిధిలోని కరుట్లపల్లికి చెందిన లక్ష్మమ్మకు 110 ఏళ్లు నిండాయి. శనివారం కుటుంబ సభ్యులు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించగా.. ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. లక్ష్మమ్మకు శాలువ కప్పి, పూలమాల వేసి సన్మానించారు. ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శివరామి రెడ్డి మాట్లాడుతూ వృద్ధులను గౌరవించడం భారతీయ సంస్కృతిలో భాగమన్నారు. వారి ఆశీర్వాదాలు సమాజానికి ఎంతో అవసరమన్నారు. లక్ష్మమ్మ ఆరోగ్యంగా మరిన్ని సంవత్సరాలు జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ జయచంద్ర నాయుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మలమ్మ, మాజీ ఎంపీపీ రమణా రెడ్డి, రామాంజనేయులు, చంద్రమోహన్ రెడ్డి, తిప్పారెడ్డి, గురుమూర్తి, శ్రీరామిరెడ్డి, నాగిరెడ్డి, ఎంసీ ఆంజనేయులు, శైలాద్రి, సతీష్, శశికాంత్ నీలకంఠరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్యడి.హీరేహాళ్(బొమ్మనహాళ్): మండలంలోని ఓబులాపురం–బళ్లారి రైల్వే మార్గంలోని ట్రాక్పై శనివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల మేరకు.. 50 ఏళ్లు పైబడిన వ్యక్తి సాయంత్రం 5 గంటల సమయంలో గూడ్స్ కింద పడి మృతి చెందాడు. గుంతకల్లు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఎవరికై నా తెలిసి ఉంటే 9247575605 నంబర్కు తెలపాలని ఏఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి కోరారు. బైపీసీ విద్యార్థులకూ ‘బీటెక్’ అనంతపురం: మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (మిట్స్) డీమ్డ్ టుబీ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను బీటెక్ బయో ఇన్ఫర్మాటిక్స్ కోర్సులో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆ యూనివర్సిటీ వీసీ డాక్టర్ యువరాజ్ వెల్లడించారు. జీవశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ రంగాల సమ్మేళనంగా రూపొందించిన ఈ కోర్సు ద్వారా విద్యార్థులకు ఆరోగ్య సంరక్షణ, బయోటెక్నాలజీ, ఔషధ పరిశోధన, జీనోమిక్స్, బయోలాజికల్ డేటా అనాలిటిక్స్ తదితర అభివృద్ధి చెందుతున్న రంగాల్లో విస్తృతమైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వీసీ తెలిపారు. బయాలజీతో పాటు కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై విద్యార్థులకు సమగ్ర శిక్షణ అందించేందుకు ఆధునిక ప్రయోగశాలలు, పరిశోధనా సదుపాయాలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉన్నారని, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన పాఠ్యప్రణాళిక, ప్రాజెక్టులు, పరిశోధన, ఇంటర్న్షిప్లు, కెరీర్ మార్గదర్శకత్వం ద్వారా విద్యార్థులను భవిష్యత్తు అవకాశాలకు సన్నద్ధం చేస్తామని వివరించారు. ప్రతి సెమిస్టర్కు సాధారణ ఫీజు రూ.80వేలు కాగా, విద్యార్థుల ప్రతిభ ఆధారంగా ప్రత్యేక ఫీజు రాయితీలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 10+2 ఇంటర్మీడియెట్లో బైపీసీ, ఎంబైపీసీ లేదా ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులని, ఆసక్తి కలిగిన విద్యార్థులు www.admission.mits.ac.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు 8712655132/ 8712655138 నంబర్లను సంప్రదించాలని కోరారు. మహిళ మెడలో బంగారు చైన్ అపహరణ కూడేరు: మండల పరిధిలోని కమ్మూరులో నాగరత్నమ్మ అనే మహిళ మెడలోని బంగారు చైన్ను గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లారు. బాధితురాలి వివరాల మేరకు.. శనివారం సాయంత్రం గ్రామానికి చెందిన శంకర్ రెడ్డి తన భార్య నాగరత్నమ్మతో కలిసి అనంతపురం నుంచి ద్విచక్ర వాహనంలో గ్రామం దగ్గరకు రాగానే ఫోన్ కాల్ వచ్చింది. దీంతో బైకు నిలబెట్టి మాట్లాడుతున్నాడు. వారిని ద్విచక్రవాహనంలో వెంబడించిన ఇద్దరు వ్యక్తులు గార్లదిన్నెకు ఎలా వెళ్లాలంటూ మాటలు కలిపి ఆమె మెడలోని 3 తులాల చైన్ బంగారు చైన్ను లాక్కొని ఉడాయించారు. బాధితురాలు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఓటీపీ అడిగి.. 90 వేలు ఊడ్చి! గుంతకల్లు: సైబర్ వలలో పడి ఓ వ్యక్తి తన బ్యాంకు ఖాతాలోని రూ.90,000 నగదు పోగొట్టుకున్నాడు. వివరాలు.. గుంతకల్లు గంగానగర్లో నివాసముంటున్న కమల్బాషా మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. తనకు కొంత డబ్బు అవసరం ఉండి క్రెడిట్ నోవా యాప్ను డౌన్ లోడ్ చేసుకున్నాడు. దరఖాస్తు చేసుకున్న సమయంలో ప్లస్ 923330445343 నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది. వారు అడిగిన ప్రకారం వివరాలు తెలియజేయడంతో పాటు ఓటీపీ చెప్పాడు. 15 నిమిషాల్లో కమల్బాషా ఖాతా(కరూర్ వైశ్య బ్యాంక్)లోని రూ.90,000 ఖాళీ అయ్యింది. ఈ విషయమై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. -
అమ్మపాలు అమృతమే
7వ తేదీ వరకూ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ‘అమ్మ’ అనే పదంలోనే ఆప్యాయత, అనురాగం వంటి సుగుణాలు మిళితమై ఉన్నాయి. అలాంటి అమ్మ పాలు బిడ్డకు జీవామృతమే అంటే అతిశయోక్తి కాదు. తల్లి పాలపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించడం కోసం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీ వరకూ తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ● శిశువు పుట్టిన అరగంటలోపు తల్లిపాలు పట్టించడం శ్రేష్ఠం ● ముర్రుపాలతో వ్యాధి నిరోధక శక్తి పెంపు రాయదుర్గంటౌన్: తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం. పుట్టిన అరగంటలోపు తల్లిపాలు తాగించడం వల్ల శిశువుకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో మూఢ నమ్మకాలతో బిడ్డ పుట్టిన రెండు,మూడు రోజుల వరకూ తల్లిపాలు ఇవ్వడం లేదు. పట్టణాల్లో నివసించే వారు పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడి బిడ్డకు పాలివ్వడం లేదు. దీంతో బిడ్డలతో పాటు తాము కూడా నష్టపోతున్నామనే విషయాన్ని తల్లులు గ్రహించలేకపోతున్నారు. దేశంలో ప్రతి ఏడాది నీళ్ల విరేచనాలు, నిమోనియా వంటి జబ్బులతో లక్ష మంది ఏడాది లోపు శిశువులు మరణిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. పుట్టిన అరగంటలోపు తల్లిపాలు తాగించడం ద్వారా నెలలోపు శిశువుల్లో సంభవిస్తున్న మరణాలను 50 శాతం వరకూ తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూనిసెఫ్ పేర్కొంటున్నాయి. మొదటి ఆరు నెలలు ఎటువంటి డబ్బా పాలు పట్టించకుండా, తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. సాధారణ ప్రసవమైతే పుట్టిన అరగంటలోపు తల్లిపాలు పట్టించాలి. సిజేరియన్ అయితే నాలుగు గంటల లోపు ఇవ్వాలి. సందర్భం ఉపయోగాలిలా.. తల్లిపాలు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. మెదడు ఎదుగుదలతో జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. శిశువు జీర్ణాశయ అభివృద్ధికి దోహదపడే పదార్థాలు అధిక మోతాదులో ఉంటాయి. తల్లిపాలలో సహజిసిద్ధమైన ప్రోటీన్లు, లాక్టొఫెరిన్, కోలోస్ట్రమ్, కొన్ని కీలకమైన హార్మోన్లు, రోగ నిరోధక బ్యాక్టీరియా ఉంటాయి. పసిబిడ్డకు ప్రధాన శత్రువు చలి. బిడ్డను ఒడిలో ఉంచుకుని పాలివ్వడం ద్వారా తల్లి శరీరం నుంచి శిశువుకు అవసరమైన వేడి అందుతుంది. తల్లీబిడ్డ మధ్య అనుబంధం పెరుగుతుంది. బిడ్డకు పాలిచ్చే మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, రక్తహీనత, ఎముకల బలహీనత వంటి జబ్బుల నుంచి రక్షణ పొందే అవకాశం ఉంది. అపోహలు మానుకోవాలి మర్రుపాలపై నేటికీ చాలా అపోహలు ఉన్నాయి. పుట్టిన అరంగంటలోపు బిడ్డకు ముర్రుపాలు పట్టిస్తే ఆరోగ్యం పంచినట్లే అవుతుంది. శిశుమరణాలు కూడా తగ్గుతాయి. తల్లిపాలు తాగిన పిల్లలు చురుగ్గా ఉంటారు. బిడ్డకు పాలిచ్చే తల్లుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. – మెర్సీ జ్ఞానసుధ, సూపరింటెండెంట్, రాయదుర్గం ఏరియా ఆస్పత్రి మొదటి వ్యాధి నిరోధక టీకా బిడ్డ పుట్టిన అరగంటలోపు తల్లిపాలు ఇవ్వాలి. ఇది స్వయంగా బిడ్డకు తల్లి ఇచ్చే మొదటి వ్యాధి నిరోధక టీకా అవుతుంది. తర్వాత ఆరు నెలలు నిండే వరకూ కేవలం తల్లిపాలే పట్టించాలి. ఎండాకాలమైనా సరే నీరివ్వాల్సిన అవసరం లేదు. అంగన్వాడీలో ఇచ్చే పోషణ్ కిట్స్తోపాటు ఇతర మృదువైన, సులువుగా జీర్ణమయ్యే పదార్థాలు సమయానుసారంగా పెంచాలి. – బి.లక్ష్మీప్రసన్న, సీడీపీఓ, రాయదుర్గం -
పంటలు ఎండుతున్నా పట్టించుకోరా?
కూడేరు: విద్యుత్ సరఫరాలో అంతరాయంతో మోటార్లు ఆడక.. నీరందక పంటలు ఎండిపోతుండటంతో రైతులు ఆగ్రహించారు. వ్యవసాయానికి నిర్దేశించిన సమయం మేర విద్యుత్ సరఫరా చేయాలని శనివారం మరుట్ల –1, 2, 3 కాలనీలకు చెందిన రైతులు మరుట్ల–2 కాలనీలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ను ముట్టడించారు. సిబ్బందిని స్టేషన్ నుంచి బయటకు పంపించేశారు. ఆవరణలోనే వంటావార్పు చేపట్టి.. నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఏడీ రవి శంకర్, ఏఈ గౌస్ ఆందోళనకారుల వద్దకు వచ్చి చర్చించారు. తరచూ బ్రేక్ డౌన్ అవుతుండడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోందని రైతులు తెలిపారు. పగలు 3 గంటలు, రాత్రి పూట 4 గంటలు చొప్పున వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తామని అధికారులు చెప్పినా.. అరగంటకొకసారి సరఫరా ఆగిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోటర్లు పని చేయక.. పంటలకు నీరందక కళ్లెదుటే ఎండిపోతున్నాయని మండిపడ్డారు. లైన్మెన్ లేకపోవడంతో విద్యుత్ సమస్యలపై స్పందించేవారే కరువయ్యారన్నారు. స్థానిక సిబ్బంది ఏదైనా సమస్య వస్తే ప్రైవేటు వ్యక్తులను పంపుతారని, వారేమో రూ.500 నుంచి రూ.1000 వరకు డిమాండ్ చేస్తున్నారని వాపోయారు. సమస్య తలెత్తిన ప్రతిసారీ రూ.వందల్లో డబ్బులు ఇవ్వాలంటే ఎక్కడినుంచి తేవాలని ప్రశ్నించారు. వ్యవసాయ మోటర్లకు 9 గంటలు పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, లైన్మెన్ను నియమించాలని డిమాండ్ చేశారు. కేటాయింపు మేరకు సక్రమంగా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు చేపడతామని ఏడీ, ఏఈ హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. విద్యుత్ సరఫరా అంతరాయంపై మరుట్ల కాలనీల రైతుల కన్నెర్ర విద్యుత్ సబ్స్టేషన్ ముట్టడి.. అక్కడే వంటావార్పుతో నిరసన నాణ్యమైన విద్యుత్ అందించాలని రైతుల డిమాండ్ -
పక్కా ప్రణాళికతోనే డీఎస్సీ స్కామ్
ఉరవకొండ: చంద్రబాబు ప్రభుత్వం పక్కా ప్రణాళికతోనే డీఎస్సీలో స్కామ్ చేసిందని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలతో అర్హత ఉన్న ఎంతో మంది నిరుద్యోగులు టీచర్ పోస్టులను కోల్పోయారన్నారు. తమ పార్టీ నేతలతో పాటు లక్షలాది మంది యువత ఇదే విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి డీఎస్సీ నిర్వహణలో కీలక బాధ్యతలను అప్పగించగా, ఆయనకే ప్రథమ ర్యాంకు వచ్చిందని తెలిపారు. నిబంధనలు తుంగలో తొక్కి స్పోర్ట్స్ కోటాను రెండు నుంచి మూడు శాతానికి పెంచారని ధ్వజమెత్తారు. సర్వీస్ రూల్స్ సవరించి క్రీడల్లో పాల్గొన్న వారు పోటీ పరీక్షలు రాయాల్సిన అవసరం లేదనే జీఓ తెచ్చి అనేక మందికి పోస్టులను కట్టబెట్టారని దుయ్యబట్టారు. 29 రకాల ఆటలను 64కు పెంచి చివరికి పేకాట, టగ్ఆఫ్ వార్ను సైతం క్రీడలుగా ప్రకటించి ఉద్యోగాలను కట్టబెట్టడం సిగ్గుచేటని విమర్శించారు. నీట్ అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విధంగానే మంత్రి లోకేష్ డీఎస్సీ అక్రమాలపై నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై యువత, విద్యార్థులు ధర్మ యుద్ధానికి సిద్ధం కావాలని, జంతర్ మంతర్ వద్ద కాక్రోజ్ జనతా పార్టీ తరహాలోనే ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, వైస్ ఎంపీపీ ఈడిగ ప్రసాద్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజేష్, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నవీన్కుమార్ రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథ్రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షుడు సాకే పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. -
స్వాములకే శఠగోపం
● ఆలయ ఆదాయం మాయం ● కీలక అధికారి తీరుపై అనుమానాలు ● గూగూడు జంట దేవాలయాల్లో దుస్థితి నార్పల : దేవదాయ శాఖలో అవినీతి రాజ్యమేలు తోంది. ఆలయ ఆదాయానికే కన్నం వేస్తున్నారు. స్వాములకే శఠగోపం పెడుతున్నారు. గూగూడులోని ప్రసిద్ధ కుళ్లాయిస్వామి– ఆంజనేయస్వామి జంట ఆలయాల్లో జరుగుతున్న గోల్మాల్ వ్యవహారం కలకలం రేపుతోంది. మొహర్రం ఉత్సవాలకు గూగూడు ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ కుళ్లాయిస్వామితో పాటు ఆంజనేయస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. గత ఏడాది మొహర్రం ఉత్సవాల సమయంలో భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకల లెక్కింపు వ్యవహారం గందరగోళానికి దారితీసింది. రెండు ఆలయాల్లోని హుండీల కానుకలను లెక్కించినట్లు అప్పటి ఆలయ కీలక అధికారి తెలిపారు. అయితే సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయిన దృశ్యాలకు.. అధికారి మాటలకు పొంతన కుదరడం లేదు. ఆంజనేయస్వామి ఆలయానికి చెందిన రెండు కానుకల సంచులు, ఒక హుండీ మాత్రమే కనిపిస్తున్నాయి. కుళ్లాయిస్వామి ఆలయంలోని పసుపురంగు హుండీ బరువుగా ఉందని కానుకలను ఒక సంచిలోకి వేసుకొచ్చి లెక్కించినట్లు చెబుతున్నట్లుగా అక్కడ లేదు. కుళ్లాయిస్వామి ఆలయం నుంచి బయటకు వచ్చిన కానుకల సంచి.. లెక్కింపు ప్రదేశంలో కనిపించకపోవడాన్ని గమనిస్తే ఆ సంచి మిస్సింగ్ అయినట్లు స్పష్టమవుతోంది. బ్యాంకు ఖాతాలకూ కన్నమే! భక్తుల కానుకలతో పాటు స్వామివారి బ్యాంకు ఖాతాలకూ కన్నం పడుతోంది. గూగూడు కుళ్లాయిస్వామి ఆలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు కాంట్రాక్టర్ ద్వారా జీతాలు చెల్లిస్తున్నారు. కానీ గడిచిన మూడేళ్లుగా తద్విరుద్ధంగా జరుగుతోంది. ఆలయ కీలక అధికారి చేతివాటమే ఇందుకు కారణం. ఉద్యోగుల పేరు మీద లక్షలాది రూపాయలు డ్రా చేశారు. ఇక ఆంజనేయస్వామి ఆలయ బ్యాంక్ ఖాతా నుంచి ఏ విధమైన పనులకూ నగదు డ్రా చేయరాదు. కానీ ఈ అంకౌట్ నుంచి కూడా రూ.లక్షల్లోనే యథేచ్ఛగా డ్రా చేసినట్లు తెలుస్తోంది. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి జంట దేవాలయాల కానుకలు, డబ్బుకు పటిష్ట భద్రత కల్పించాలని, ఇప్పటి వరకు జరిగిన గోల్మాల్ వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. -
అబార్షన్లపై నివేదిక సమర్పించండి
అనంతపురం అర్బన్: యల్లనూరు, వజ్రకరూరు మండలాల్లో జరిగిన అబార్షన్ల ఘటనలపై నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో మొదటి అదనపు జిల్లా జడ్జి సత్యవాణి, పోక్సో కోర్టు జడ్జి చినబాబుతో కలిసి భ్రూణహత్యల నిషేధ చట్టం అమలు కమిటీ జిల్లాస్థాయి సమావేశాన్ని, పీసీ పీఎన్డీటీ యాక్ట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ లింగ నిష్పత్తిలో వ్యత్యాసం పెరిగిపోతోందన్నారు. లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న మండలాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారీగా గుర్తించి అవగాహన శిబిరాలను విస్తృతంగా నిర్వహించాలని చెప్పారు. ఇటీవల అబార్షన్లు జరిగిన యల్లనూరు, వజ్రకరూరు మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ తర్వాత అబార్షన్లు జరిగి ఉంటే.. బాధ్యులైన స్కానింగ్ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలన్నారు. భ్రూణహత్యల నిరోధానికి పోలీసు స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) నిఘా సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ఏఆర్టీ అండ్ సరోగసి యాక్ట్–2021 పటిష్టంగా అమలు చేయాలని పోక్సో కోర్టు జడ్జి చినబాబు ఆదేశించారు. జిల్లాలోని 12 ఏఆర్టీ అస్పత్రులను తనిఖీ చేసి ఆన్లైన్లో ఫిర్యాదుల నమోదుకు సాఫ్ట్వేర్ అభివృద్ధి చేయాలని చెప్పారు. అనంతరం వివిధ పోస్టర్లను కలెక్టర్, జడ్జీలు, అధికారులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీటీ హెల్త్ డైరెక్టర్ దుర్గేష్, గైనకాలజిస్ట్ సుచిత్ర, రెడ్స్ సంస్థ అధ్యక్షురాలు భానూజా, సీఐ రమేష్, తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రజా ధనమా.. పప్పూబెల్లాలా! ● బాబు బర్త్డేకి మున్సిపల్ ఖజానా నుంచి రూ. 4 లక్షల ఖర్చు అనంతపురం క్రైం: ప్రజా ధనాన్ని పప్పూ బెల్లాల్లా ఖర్చు చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 20న కళారామంలో నిర్వహించిన సీఎం చంద్రబాబు జన్మదినోత్సవం పేరిట మొత్తం రూ.3,92,249 ఖర్చు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నాలుగు బిల్లులు ఉండగా, ఒకే కార్యక్రమానికి సంబంధించిన పనులను కావాలనే విడదీసి చిన్న బిల్లులుగా తయారు చేశారనే అనుమానాలున్నాయి. వీటిలో ఒక బిల్లు మొత్తం రూ.96,996, రెండోది రూ.99,255, మూడోది రూ.96,996, నాలుగోది రూ.99,002గా ఉండడం గమనార్హం. 600 కుర్చీలు, 16 టేబుళ్లు, 8 పైలాన్ స్టోన్స్, పూల అలంకరణ, 3,250 చదరపు అడుగుల గ్రీన్ మ్యాట్, సౌండ్ సిస్టమ్, షామియానాలు, జేసీబీ, ట్రాక్టర్, తాగునీటి క్యాన్లు, నీటి సీసాలు, పూల కుండీలు, పైలాన్ ఫ్రేమ్ వంటి వాటికి చెల్లింపులు చూపించారు. ఒక్క అనంతపురంలోనే రూ.4 లక్షలు బాబు బర్త్డేకి ఖర్చు చేశారంటే రాష్ట్ర వ్యాప్తంగా లెక్కిస్తే కోట్ల రూపాయల్లో ఉంటుందని పలువురు విమర్శిస్తున్నారు. ప్రజా ధనాన్ని ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తుండడంపై మండిపడుతున్నారు. -
అదను చూసి ‘ఎల్–నినో’ పంజా విసురుతోంది. కీలక తరుణంలో ఆశల నైరుతిని కదలకుండా ఆపేస్తోంది. రుతుపవనాలు విస్తరించకుండా నిలువరించింది. మేఘాలు వర్షించకుండా గాలివాటం చేసింది. లక్షలాది హెక్టార్ల ఖరీఫ్ను చిదిమేసి ‘అనంత’ రైతుల ఆశల సౌధాన్ని నిలువునా కూల్చేసింది. కరువ
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్లో లక్షలాది హెక్టార్ల పంటలు సాగులోకి రావాలంటే జూలై వర్షాలు అత్యంత కీలకం. వేరుశనగ, కంది, మొక్కజొన్న, ఆముదం, పత్తి, సజ్జ, కొర్ర తదితర ప్రధాన పంటలు విత్తుకునేందుకు జూలై నెల మంచి అదను. ఆరుద్రతో పాటు పునర్వసు, పుష్యమి లాంటి విత్తన కార్తెలు, ఏరువాక పౌర్ణమి, విత్తనాల ఏకాదశి వంటి శుభగడియలన్నీ దాదాపు కాస్త అటుఇటుగా జూలైలోనే వస్తాయి. 64.3 మి.మీ మేర సాధారణ వర్షపాతం నమోదైతే దాదాపు పంటలన్నీ సాగులోకి వస్తాయి. అలాగే ఏడు నుంచి తొమ్మిది వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదు కావాల్సి ఉంటుంది. అయితే ఈ జూలై పరిస్థితి దారుణంగా తయారైంది. కేవలం 18.8 మి.మీ వర్షం కురిసింది. ఏకంగా 71 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఆ 18.8 మి.మీ కూడా గాలివాటం వర్షం కావడం గమనార్హం. కేవలం రెండంటే రెండు మాత్రమే రెయినీడేలు నమోదు కావడం గమనార్హం. అందులో జూలై 19న 4.3 మి.మీ, 21న 5.6 మి.మీ తేలికపాటి సగటు వర్షపు రోజులు నమోదయ్యాయి. గుంతకల్లు, గుత్తి, పెద్దవడుగూరు, యాడికి, ఉరవకొండ, బెళుగుప్ప, గుమ్మఘట్ట, గార్లదిన్నె, శింగనమల, రాప్తాడు తదితర పది పన్నెండు మండలాల్లో మాత్రమే జూలైలో తేలికపాటి వర్షం కురిసింది. మొత్తం మీద ఈ ఖరీఫ్ రెండు నెలల కాలంలో 126.9 మి.మీ గాను 31.1 శాతం లోటుతో 87.4 మి.మీ వర్షం కురిసింది. ఇక ఆగస్టులో 84.4 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉన్నా... కష్టంగానే కనిపిస్తోంది. ఫలించని పూజలు, యాగాలుఎల్–నినో కారణంగా చినుకులు పడటం గగనమైపోయింది. జూన్ 14 వరకు వర్షాల పరిస్థితి బాగానే ఉంది. ఆ తర్వాత ఎల్–నినో గుప్పిట్లోకి వరుణుడు వెళ్లిపోయాడు. నెలల తరబడి ఎదురుచూసినా పట్టుమని 10 మి.మీ వర్షం కురిసిన దాఖలాలు లేవు. వర్షాల కోసం గ్రామ గ్రామాన రైతులు, ప్రజలు కప్పలు, గాడిదలకు పెళ్లిళ్లు, బొడ్రాళ్లు, గ్రామ దేవతలకు పూజలు, వరుణయాగం, హోమాలు, రామదండు, విరాట పర్వం, సుందరకాండ పారాయణం లాంటి అనేక రూపాల్లో పూజలు చేసినా వరుణుడు కరుణించడం లేదు. జూన్ 15 తర్వాత వర్షాభావం నెలకొనడంతో 32 మండలాల్లోనూ 21 రోజుల మొదటి డ్రైస్పెల్స్ నమోదు కాగా.. 22 మండలాల్లో 30 నుంచి 40 రోజుల సుదీర్ఘ డ్రైస్పెల్స్ నమోదు కావడం గమనార్హం. 3.43 లక్షల హెక్టార్లకు గాను ప్రధానపంటలు 1.15 లక్షల హెక్టార్లకు పరిమితం కాగా... ఇంకా 2.30 లక్షల హెక్టార్ల వరకు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. ఆగస్టు 15 తర్వాత 40 వేల క్వింటాళ్లు ప్రత్యామ్నాయ విత్తనాలు అందజేస్తామని అధికారులు చెబుతున్నారు. అంతలోపు వర్షం వస్తే ఏ పంట వేసుకోవాలో తెలియక రైతులు ఇబ్బంది పడుతున్నారు. జూలై లోటు 71 శాతం 64.3 మి.మీకు గాను 18.8 మి.మీ కురిసిన వర్షం రెండే రెండు రెయినీడేస్, 22 మండలాల్లో డ్రైస్పెల్స్ రికార్డు 1.15 లక్షల హెక్టార్లకే పరిమితమైన ఖరీఫ్ పంటల సాగు -
యువత కలలను ఛిద్రం చేశారు
అనంతపురం: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే యువత కలలను ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఛిద్రం చేశారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి విమర్శించారు. మెగా డీఎస్సీ అంటూ అనర్హులకు పోస్టులు కేటాయించి.. అర్హులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. దగా డీఎస్సీపై వైఎస్సార్సీపీ చేపట్టిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టి.. మంత్రి లోకేష్ను బర్తరఫ్ చేయాలని శుక్రవారం పార్టీ నేతలు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే విద్యాశాఖ తొలుత విడుదల చేసిన మెరిట్ లిస్ట్, డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకానికి సంబంధించి బేరాలు జరిగిన వీడియోతో కూడిన ఆధారాల పెన్డ్రైవ్ను కూడా సమర్పించారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలకు సంబంధించి ఆధారాలు ఉన్నా మంత్రి లోకేష్తో పాటు అధికార పార్టీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఇకనైనా నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు రూ.9,500 కోట్లతో పాటు తక్షణం విద్యాదీవెన, వసతిదీవెన నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అర్హులైన నిరుద్యోగులకు వెంటనే భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమగ్ర విచారణ చేపట్టాలి మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలపై వచ్చిన ఆరోపణలు, బాధిత అభ్యర్థులు వెల్లడించిన అంశాలు, బయటకు వచ్చిన అంశాలపై సీబీఐతో సమగ్ర విచారణ చేయించాలన్నారు. విచారణ పూర్తయ్యే వరకు విద్యాశాఖ మంత్రి లోకేష్ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ డీఎస్సీలో అవకతవకలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేశాయన్నారు. అక్రమాలు జరిగినట్లు ఆధారాలు చూపుతున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం నిరుద్యోగులను ఆవేదనకు గురి చేస్తోందన్నారు. మాజీ ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ డీఎస్సీ ప్రక్రియలో ఘోర తప్పిదాలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రహించిందన్నారు. అందుకే నెలన్నరక్రితం విడుదల చేసిన ఉద్యోగ నోటిఫికేషన్ల పేరుతో హడావుడి చేస్తోందని విమర్శించారు. ప్రతిభ లేని వారికి పట్టం కట్టారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ స్పోర్ట్స్ కోటా పేరుతో ప్రతిభ లేని వారికి, అనుకూలమైన వారికి ఉద్యోగాలు కట్టబెట్టారని, ఇందుకు బాధ్యత వహిస్తూ లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకుడు బోరెడ్డి నరేష్రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలకు లోకేష్ బాధ్యత వహించాల్సిందేనన్నారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ యువత భవిష్యత్తుతో ప్రభుత్వ చెలగాటం ఆడుతోందని విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్ధుల్లో నైరాశ్యం నెలకొందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్రెడ్డి,, పార్లమెంట్ విభాగం రాష్ట్ర కార్యదర్శులు నార్పల సత్యనారాయణరెడ్డి, ఎల్ఎం మోహన్రెడ్డి, వీరా రామకృష్ణారెడ్డి, యుజవన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వెన్నం శివారెడ్డి, బండ్లపల్లి ప్రతాప్రెడ్డి, గోకుల్రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, మాజీ మేయర్ మహమ్మద్ వసీం, నాయకులు ఎద్దుల అమర్నాథరెడ్డి, ఎస్సీ సెల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మొఘల్ సైఫుల్లా భేగ్, వేముల నదీం, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొండ్రెడ్డి ఓబిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు కైలాష్, సంపంగి రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ నియామకాల్లో అర్హులకు అన్యాయం అక్రమాలకు లోకేష్ నైతిక బాధ్యత వహించాలి తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలి వైఎస్సార్సీపీ జిల్లా నేతల డిమాండ్ జేసీకి వినతిపత్రం అందజేత -
ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఉద్యమించిన స్కీమ్వర్కర్లు
అనంతపురం అర్బన్: చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై స్కీమ్ వర్కర్లు ఉద్యమించారు. తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీ, ఆశా వర్కర్లతో పాటు మధ్యాహ్న భోజన ఏజెన్సీ, వీఓఏ, మెప్మా ఆర్పీలు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు తరలివచ్చారు. న్యాయమైన కోర్కెలను ప్రభుత్వం పరిష్కరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ జిల్లా కోశాధికారి నాగమణి అధ్యక్షతన జరిగిన ధర్నాలో జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్, అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శకుంతల, రమాదేవి, ఆశా వర్కర్ల సంఘం రాష్ట్ర నాయకురాలు ప్రమీల మాట్లాడారు. స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీసవేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హత మేరకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. మానసిక ఒత్తిళ్లకు గురిచేసేలా సంబంధం లేని విధులు అప్పగించడం నిలిపివేయాలన్నారు. నవచేతన యాప్ల పేరుతో మోపుతున్న అదనపుభారాన్ని తప్పించాలన్నారు. పింఛను, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రత సౌకర్యాలు కల్పించాలన్నారు. స్కీమ్ వర్కర్లకూ సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ను చాంబర్లో కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మధ్యాహన భోజన పథకం వర్కర్ల సంఘం అధ్యక్షురాలు శ్రీదేవి, మెప్మా ఆర్పీల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జయమ్మ, లక్ష్మీదేవి, వీఓఏల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు తిరుపాలు, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పాటుపడాల్సిన ప్రజాప్రతినిధి అందుకు విరుద్ధంగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని తన సంస్థకు ఆదాయం తెచ్చిపెట్టేందుకు పాటుపడుతున్నారు. ఏకంగా ప్రకృతి సంపదపై కన్నేశారు. అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాల
కళ్యాణదుర్గం : ప్రకృతి సంపద యథేచ్ఛగా దోపిడీకి గురవుతోంది. అధికార పార్టీకి చెందిన వారే కొల్లగొడుతుండటంతో అధికారులు కూడా మిన్నకుండిపోతున్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుకు ఎస్ఆర్సీ అనే నిర్మాణ సంస్థ ఉంది. ఈ కంపెనీ ఇటీవల కంబదూరు మండలంలో పదుల సంఖ్యలో గాలిమరలు ఏర్పాటు చేస్తోంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బీటీపీ కాలువ పనులను సైతం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆయా పనులకు కాంక్రీట్ అవసరముంది. ఇందుకు అవసరమైన కంకర, ఇసుక సులభంగా లభించే కంబదూరు మండలంలోని రాళ్ల అనంతపురం గ్రామాన్ని ఎంచుకుంది. ఇక్కడ ఒక మిక్సింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. రాళ్ల అనంతపురం సమీపంలోని పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి జేసీబీతో ఇసుక తవ్వకాలు చేపట్టింది. నాలుగైదు ట్రాక్టర్ల ద్వారా ప్లాంట్ వద్దకు ఇసుకను భారీగా డంప్ చేస్తోంది. మార్కెట్లో టన్ను ఇసుక ధర రూ.1800 నుంచి రూ.2000 వరకు పలుకుతోంది. సివిల్ వర్క్లు, ఇతర ప్రాంతాల్లోని పనుల కోసం ప్లాంట్ వద్ద నుంచి రోజూ సగటున 20 నుంచి 30 టిప్పర్ల ఇసుక అక్రమంగా తరలుతోంది. టిప్పర్ (టస్కర్)లో 15 నుంచి 20 టన్నుల ఇసుక పడుతుంది. గడిచిన రెండేళ్లుగా ఇసుక రూపంలోనే కోట్లాది రూపాయలు ఎస్ఆర్సీ సొమ్ము చేసుకుంటోంది. ఇక కాంక్రీట్కు అవసరమైన కంకరను కూడా దేవేంద్రపురం తండా వద్దనున్న క్రషర్ నుంచి సరఫరా చేసుకుంటోంది. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అట్టడుగుకుపోతున్నాయని, నీటి ఎద్దడి ఏర్పడుతుందని ప్రశ్నించిన రాళ్ల అనంతపురం గ్రామ ప్రజలను, వైఎస్సార్సీపీ నాయకులను అమిలినేని అనుచరులు తీవ్రస్థాయిలో బెదిరిస్తున్నారు. తమకెదురు తిరిగితే అక్రమ కేసులు పెడతామంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయాలన్నీ అధికారులకు తెలిసినా ఏమీ తెలియదన్నట్లుగా ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక రీచ్ కోసం పట్టు! ఇసుక అక్రమ తవ్వకాలు.. రవాణాతో రూ.కోట్లు వెనకేసుకున్న అమిలినేని.. సంస్థ అవసరాల కోసం కంబదూరు మండలంలోని పెన్నా నది పరివాహక ప్రాంతాలైన నూతిమడుగు, రాళ్ల అనంతపురం, చెన్నంపల్లి, గూళ్యం పరిసర ప్రాంతాల్లో ఇసుక రీచ్ ఏర్పాటు చేసుకునేందుకు మైనింగ్, రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇసుక రీచ్లు నడుస్తున్నాయి. కానీ ఒక ప్రైవేట్ సంస్థ రీచ్ కోసం పట్టు పడుతుండటం గమనార్హం. డంప్కు అనుమతులు లేవు ఎస్ఆర్సీ సంస్థ తన పనులకు ఇసుక అవసరముందని లేఖ పెట్టింది. ఇందుకోసం ఇసుక రీచ్కు దరఖాస్తు చేసుకుంది. దీనిపై పరిశీలన చేస్తున్నాం. ఇక మిక్సింగ్ ప్లాంట్ వద్ద అక్రమంగా ఇసుక డంప్ చేసి ఉంటే చర్యలు తీసుకుంటాం. ఇసుక డంప్ చేయడానికి అనుమతులు లేవు. – ఆదినారాయణ, డిప్యూటీ డైరెక్టర్, మైనింగ్ అండ్ జియాలజి, అనంతపురం పట్టపగలే యథేచ్ఛగా తవ్వకాలు రెండేళ్లలో రూ.కోట్ల ఇసుక అక్రమ రవాణా రాళ్ల అనంతపురం వద్ద భారీగా ఇసుక డంప్ ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు, బెదిరింపులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు -
హత్య కేసు ఛేదింపు
● నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కళ్యాణదుర్గం రూరల్: వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి బంగారు ఆభరణాలు రికవరీ చేశారు. అరెస్ట్ వివరాలను డీఎస్పీ రవిబాబు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. కళ్యాణదుర్గంలోని వడ్డే కాలనీకి చెందిన రఘు అనే యువకుడు జల్సాలకు అలవాటుపడి అప్పులు చేశాడు. వాటిని తీర్చడం కోసం కాలనీలోనే నివాసముంటున్న ఈడిగ లక్ష్మిదేవి అనే వృద్దురాలిని జూన్ 30న పట్టపగలే హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న నాలుగు తులాల బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు. పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం కొల్లాపురం గుడివద్ద ఉన్న నిందితుడు రఘును పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి వద్ద నుంచి 2.6 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు విద్యార్థినుల గొంతు కోసేందుకు యత్నం ● తోటి విద్యార్థిని ఘాతుకం ● విడపనకల్లు మోడల్ స్కూల్ హాస్టల్లో దారుణం విడపనకల్లు: విడపనకల్లు మోడల్ స్కూల్ హాస్టల్లో దారుణ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. విడపనకల్లు గ్రామానికి చెందిన చాకలి సుంకన్న కుమార్తె సుస్మిత, మహబూబ్ బాష కుమార్తె సోఫియా స్థానిక మోడల్ స్కూల్లో ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. ఏమైందో ఏమో కానీ అదే హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతున్న మరో విద్యార్థిని గురువారం రాత్రి పడుకున్న సమయంలో బ్లేడుతో సుస్మిత, సోఫియాల గొంతు కోయడానికి ప్రయత్నించింది. బ్లేడు సరిగా తెగకపోవడంతో ఇద్దరికి గొంతు కింద స్వల్ప గాయమైంది. గొంతు కోసిన విద్యార్థినిని వెంటనే హాస్టల్ నుంచి ఇంటికి పంపించేశారు. గాయపడిన విద్యార్థినులను కనీసం ఆసుపత్రికి కూడా తీసుకెళ్లలేదు. వార్డెన్ ఈ విషయాన్ని తల్లిదండ్రులకు కూడా తెలపలేదు. ఇతరుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు శుక్రవారం మోడల్ స్కూల్కు చేరుకుని ప్రిన్సిపాల్, వార్డెన్లపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. తమ పిల్లలకు ఏదైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. తమ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడతారా అంటూ వార్డెన్ నల్లమ్మపై మండిపడ్డారు. ఇందుకు వార్డెన్.. ‘మీ పిల్లల ప్రాణాలు పోలేదు కదా! ఏదో చిన్న గీత పడింద’ంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో తల్లిదండ్రులు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి వార్డెన్పై చర్యలు తీసుకోవాలని కోరారు. బ్లేడుతో కోయడంతో విద్యార్థినుల గొంతు కింద పడిన గాటు -
2.26 లక్షల హెక్టార్లకు పంటల బీమా
అనంతపురం అగ్రికల్చర్: వాతావరణ, ఫసల్బీమా పథకాలకు సంబంధించి చివరి గడువు శుక్రవారం సాయంత్రానికి 2.26 లక్షల హెక్టార్లకు ప్రీమియం చెల్లించి రైతులు బీమా పరిధిలోకి చేరినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అందులో 1.01 లక్షల హెక్టార్ల పంటలకు వాతావరణ బీమాకు ప్రీమియం కట్టగా.. 1.25 లక్షల హెక్టార్ల పంటలకు ఫసల్బీమా ప్రీమియం చెల్లించారని పేర్కొన్నాయి. మొత్తం మీద 1.45 లక్షల మంది రైతులు బీమా పరిధిలోకి వచ్చారు. 2024 ఖరీఫ్లో అనంతపురం జిల్లాలో 3,62,601 హెక్టార్లు బీమా పరిధిలోకి రాగా... అప్పటితో పోల్చితే ఈసారి 37 శాతం విస్తీర్ణం తగ్గుదల నమోదైంది. రెండో స్థానంలో ‘అనంత’ రాష్ట్రంలో శుక్రవారం నాటికి 2.90 లక్షల హెక్టార్లకు బీమా చేయించుకోవడంతో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో కొనసాగుతోంది. 2.26 లక్షల హెక్టార్లతో అనంతపురం రెండో స్థానం, 1.30 లక్షల హెక్టార్లతో శ్రీసత్యసాయి జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఇక ఏ జిల్లాలోనూ లక్ష హెక్టార్లకు మించి బీమా చేయించలేదు. ఫసల్ బీమా గడువు పొడిగింపు పంటల బీమా ప్రీమియం గడువు పొడిగింపుపై రకరకాలుగా ప్రచారం జరిగింది. కొందరు ఫసల్బీమాకు మాత్రమే పొడిగించారని, వాతావరణ బీమాకు లేదని చర్చించుకున్నారు. బీమా ప్రీమియం చెల్లించేందుకు జిల్లాలో రైతులు వారం రోజులుగా తీవ్ర అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. గడువు పొడిగిస్తే రైతులందరికీ న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం ఫసల్ బీమా ప్రీమియం చెల్లింపు గడువును మాత్రమే ఈ నెల 15 వరకు పొడిగించింది. ఇక వాతావరణ బీమా ప్రీమియం చెల్లింపునకు ఎటువంటి గడువునూ పొడిగించలేదు. -
వైభవంగా రథోత్సవం
విడపనకల్లు: గడేకల్లులో ప్రసిద్ధ భీమలింగేశ్వరస్వామి రథోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. సాయంత్రం స్వామివారి ప్రతిమను అందంగా అలంకరించిన రథంలో కొలువుదీర్చారు. హరహర మహాదేవ అంటూ భక్తులు రథాన్ని లాగారు. ప్రధాన వీధుల గుండా రథం ముందుకు సాగింది. భీమలింగేశ్వరున్ని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. ఏపీతో పాటు కర్ణాటక నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గడేకల్లు కిక్కిరిసిపోయింది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
17, 18 తేదీల్లో క్రీడా పోటీలు
అనంతపురం అర్బన్: ‘నియోజకవర్గస్థాయిలో బాలబాలికలకు (అండర్–14) ఆగస్టు 17, 18 తేదీల్లో క్రీడా పోటీలు నిర్వహించాలి. ఇందుకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేయండి’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ వ్యాయమ ఉపాధ్యాయులను ఆదేశించారు. స్పోర్ట్స్ చాంపియన్ షిప్–2026 అండర్–14 క్రీడా పోటీల నిర్వహణపై కలెక్టర్ గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మండలస్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు ఆగస్టు 17, 18 తేదీల్లో నియోజకవర్గస్థాయిలో పోటీలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత జిల్లాస్థాయిలో పోటీలు నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాస్థాయి క్రీడా పోటీల్లో పొల్గొనే క్రీడాకారులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్ ఆధ్వర్యంలో డీఎస్డీఓకి ఆర్డీటీ సంస్థ క్రీడా సామగ్రిని అందజేసింది. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ విజయలక్ష్మి, డీఎస్డీఓ మంజుల, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయి, ఇతర శాఖల అధికారులు పాల్గొనారు. పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్న కలెక్టర్ ఆనంద్ -
రైతుల ద్రోహి చంద్రబాబు
ఉరవకొండ: ‘రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. అన్ని విధాలా రైతులకు అండగా ఉండాల్సిన చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకుండా విఫలమైంది. సీఎం చంద్రబాబు మరోసారి రైతుల ద్రోహిగా మిగిలారు’ అని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, ఉరవకొండ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. గురువారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవసాయం రంగం సంక్షోభంలో పడిందన్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 70 శాతం లోటు వర్షపాతం ఉందన్నారు. చెరువులు, బోర్లు నీటి మట్టాలు అడుగంటి పోయాయన్నారు. ఎన్నడూ లేని విధంగా నాగార్జున సాగర్ , తుంగభద్ర డ్యాముల్లో నీటి మట్టం డెడ్ స్టోరేజ్ పడిందన్నారు. రాయలసీమకు శ్రీశైలం నుంచి అందాల్సిన సాగు, తాగు నీరు అందించే పోతిరెడ్డిపాడు జలాశయం ఒట్టిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ధైర్యం చెప్పే పరిస్ధితి లేదన్నారు. శాస్త్రవేత్తలు ఎల్నినోపై ముందస్తుగా హెచ్చరించినా చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. వేరుశనగ పంటకు సంబంధించి సగం విత్తనాలు కూడా అందించలేదని, రాష్ట్రంలో పొగాకు, ఆక్వా, టమాటతో పాటు రైతులు ఏ పంట పండించినా మద్దతు ధర లేదన్నారు. బీమా గడువు పొడిగించాలి జూలై 31తో బీమాకు గడువు ముగుస్తున్నా దాదాపు 1.50 లక్షల మంది రైతులు బీమా చేసుకోలేదని పేర్కొన్నారు. జిల్లాలో రైతులు 20 శాతం మాత్రమే వివిధ పంటలు సాగు చేశారని, మిగిలిన 80 శాతం మంది రైతులు ఏ పంటలూ సాగు చేయలేదన్నారు. కనీసం ప్రభుత్వం వద్ద ఎంత మంది రైతులు ఏ పంటలు సాగు చేశారు. లక్షలాది మంది రైతులు ఇన్సూరెన్స్కు దూరమైతే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. బీమా గడువు పొడిగించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 3న నిరసన.. మంత్రి పయ్యావుల కేశవ్ అనుచరుల దౌర్జన్యాలకు నిరసనగా ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు సిద్దార్థ్, నాయకులు ఎర్రిస్వామిరెడ్డి, ఎంపీపీ నరసింహులు, వైస్ ఎంపీపీ ఈడిగ ప్రసాద్, ఓబన్న తదితరులు పాల్గొన్నారు. పయ్యావుల దౌర్జన్యాలకు నిరసనగా 3న తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి -
పీఏబీఆర్లో తగ్గిన నీటి మట్టం
కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లోకి ఇన్ ఫ్లో లేక నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది. గురువారం నాటికి జలాశయంలో 1.9 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. డ్యాం ఎగువ ప్రాంతాల్లో వర్షం బాగా కురిస్తే వరద రూపంలో నీరు వచ్చి డ్యాంలో చేరేది. కానీ వర్షా కాలమైనప్పటికీ వర్షాలే కురవలేదు. డ్యాంలో ఏర్పాటైన ఉమ్మడి అనంతపురం జిల్లాలకు చెందిన తాగునీటి ప్రాజెక్టులకు 55 క్యూసెక్కులు, లీకేజీ, నీటి ఆవిరి రూపంలో మరో 75 క్యూసెక్కుల నీరు రోజు బయటకు వెళ్లి పోతోంది. ఇన్ఫ్లో లేక అవుట్ ప్లో మాత్రమే ఉండడంతో రోజురోజుకీ నీటి మట్టం తగ్గిపోతోంది. ఇలానే కొనసాగితే తాగునీటి ప్రాజెక్టులకు నీటి కొరత ఏర్పాడే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. దేవదాయశాఖ సహాయ కమిషనర్గా సుధారాణి అనంతపురం కల్చరల్: జిల్లా దేవదాయశాఖ సహాయ కమిషనర్గా సుధారాణి గురువారం బాధ్యతలను స్వీకరించారు. ఇటీవల సస్పెన్షన్కు గురైన మల్లికార్జున ప్రసాద్ స్థానంలో ఇన్చార్జిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. సుధారాణి మాట్లాడుతూ శాఖాపరంగా ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అంతకు ముందు ఎండోమెంటు సిబ్బంది ఆమెకు అభినందనలు తెలిపారు. రిటైర్డ్ ఆర్ఎస్ఐపై సీఐ దాడి అనంతపురం సెంట్రల్: రిటైర్డ్ ఆర్ఎస్ఐపై సీఐ దాడి చేసిన ఘటన గురువారం అనంతపురం నగరంలో చోటు చేసుకుంది. బాధితుడు రామకృష్ణ వివరాల మేరకు.. అనంతపురంలోని కార్తికేయ రెసిడెన్సీలో పోలీసుశాఖలో ఏఆర్ విభాగంలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఆర్ఎస్ఐ రామకృష్ణ నివాసముంటున్నారు. ఆయన ఇంటికి ఎదురుగా వీఆర్లో ఉన్న సీఐ దేవానందం ఉంటున్నారు. సీఐ దేవానందం వంట గది కిటికీ ఆర్ఎస్ఐ రామకృష్ణ ఇంటి వైపు ఉంది. దీంతో వంట చేసిన సమయంలో పొగ మొత్తం రామకృష్ణ ఇంటి వైపు వస్తోంది. అప్పటికే ఆయన గుండెకు సంబంధిత ఆపరేషన్ చేయించుకోవడంతో ఇబ్బంది కలుగుతోందని, వంట చేసే సమయంలో కిటికీ వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెడచెవిన పెట్టడంతో పాటు పరుష పదజాలంలో మాట్లాడడంతో రెండురోజుల క్రితం నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఒకే డిపార్ట్మెంట్ అధికారి కావడంతో కేసు నమోదు చేయలేదు. ఈ విషయం సదరు సీఐ దేవానందంకు తెలియడంతో గురువారం ఉదయం ఇరువురు గొడవకు దిగారు. సీఐ దేవానందం లాఠీతో దాడి చేయడంతో ఆర్ఎస్ఐ రామకృష్ణ చేతికి తీవ్రంగా గాయమైంది. పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగడం లేదని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా తనపైనే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతానని బెదిరిస్తున్నట్లు వాపోయారు. ఎస్పీ, డీఐజీ స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. చోరీ కేసు ఛేదించిన పోలీసులు డీ.హీరేహాళ్ (బొమ్మనహాళ్): డీ.హీరేహాళ్ మండలంలోని మల్లికేతిలో ఇటీవల జరిగిన ఇంటి చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్ఐ గురుప్రసాద్రెడ్డి వివరాల మేరకు.. మల్లికేతికి చెందిన ఆదిమూర్తి ఇంట్లో రెండు రోజుల క్రితం రూ. 21,500 నగదును అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పక్కా సమాచారం మేరకు గురువారం ఉదయం మల్లికేతి గేటు వద్ద అదే గ్రామానికి చెందిన నాగార్జునను అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద నుంచి చోరీ సొమ్ములో రూ.19,200 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఇది ఆరంభం మాత్రమే..
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం జరిగే పోరాటం ఒక ప్రాంతం కోసం కాదు... లక్షలాది రైతుల హక్కుల కోసం జరిగే మహా ఉద్యమం. కరువు నేలగా మిగిలిన రాయలసీమను పచ్చని పంటల సీమగా మార్చే శక్తి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకే ఉంది. సాగునీటి హక్కు కోసం న్యామద్దల గడ్డపై చేపట్టిన పోరాటం ఆరంభం మాత్రమే. ఇది కొనసాగుతుంది. హంద్రీ–నీవా ద్వారా కరువు జిల్లాలో కృష్ణాజలాలు పారించిన ఘనత వైఎస్సార్దే. ఆ తర్వాత పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచి రాయలసీమకు కృష్ణా జలాలు అందించాలనే ప్రతిపాదన ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేశారు. – కేవీ ఉషశ్రీచరణ్, వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు -
మచ్చా దత్తారెడ్డి సూపర్ సెంచరీ
● 321 పరుగులకు ఆలౌటైన ‘అనంత జట్టు’ అనంతపురం న్యూటౌన్: జిల్లాకు చెందిన రంజీ క్రికెటర్ మచ్చా దత్తారెడ్డి మరోసారి సత్తాచాటాడు. సీనియర్ అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో సెంచరీ చేశాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అనంతపురం ఆర్డీటీ మైదానంలో నిర్వహిస్తున్న సీనియర్ అంతర్ జిల్లాల సౌత్ జోన్ క్రికెట్ పోటీలు గురువారం కూడా కొనసాగాయి. అనంతపురం – కడప జట్ల జరుగుతున్న మ్యాచ్లో తొలిరోజు కడప జిల్లా జట్టు 344 పరుగులు చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. రెండోరోజు ఆటలో అనంతపురం జట్టు 321 పరుగులు చేసింది. మచ్చా దత్తారెడ్డి 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 108 పరుగులు, రోహిత్ రోషన్ 39 , వీరారెడ్డి 46 ,రాజకుళ్లాయప్ప 39 పరుగులు సాధించారు. 321 పరుగులకు అనంతపురం జిల్లా జట్టు ఆలౌట్ అయింది. కడప బౌలర్లు చెన్నారెడ్డి, వరుణ్ తేజారెడ్డి, విజయ్ భార్గవ్, షరీఫ్ తలో 2 వికెట్లు చోప్పున తీసుకున్నారు. తర్వాత బ్యాటింగ్ చేసిన కడప జట్టు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 60 పరుగులు సాధించింది. శుక్రవారం మూడోరోజు ఆట కొనసాగనుంది. ఎస్కేయూ పాలక మండలి రద్దు అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పాలకమండలిని రద్దు చేశారు. ఈ మేరకు ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2023 సెప్టెంబర్ 1న ఎస్కేయూ పాలకమండలి సభ్యులను నియమించగా.. తాజాగా కొత్త సభ్యులను నియమించే ఉద్దేశంతో రద్దు చేశారు. ఈ క్రమంలో పాలకమండలిలో చోటు దక్కించుకునేందుకు పలువురు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. -
అంతర్జాతీయ చెస్ పోటీల్లో ‘దివీష’ సత్తా
రాయదుర్గంటౌన్: చిన్న వయసులోనే చదరంగం బోర్డుపై విన్యాసాలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో దేశ పతాకాన్ని ఎగురవేసింది రాయదుర్గానికి చెందిన నాయకుల దివీష. చైనా వేదికగా జరిగిన 28వ అంతర్జాతీయ ఏషియన్ చెస్ చాంపియన్ షిప్ అండర్–8 విభాగం పోటీల్లో అద్బుత ప్రతిభను కనబరచింది. రాయదుర్గం పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ మారెప్ప కుమార్తె సునీత, ఆమె భర్త నవీన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. వీరు ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉన్నారు. సునీత, నవీన్ దంపతల కుమార్తె దివీష హైదరాబాద్లోని శ్రీరామ అకాడమిలో 3వ తరగతి చదువుతోంది. అంతర్జాతీయ స్థాయిలో విజేతగా నిలిచిన చిన్నారి దివీష .. శుక్రవారం రాయదుర్గానికి వస్తున్న సందర్భంగా ర్యాలీతో స్వాగతం పలకనున్నట్లు రాయదుర్గంలో ఉన్న ఆమె అత్త పూల పార్వతి తెలిపారు. అపూర్వ విజయాలు : చిన్నారి దివీష వరుస చెస్ టోర్నమెంట్లలో మెడళ్ల పంట పండిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఈనెల 25న చైనాలో 28వ ఏషియన్ చెస్ చాంపియన్ షిప్లో స్టాండర్డ్ టీమ్ (వెండి పతకం), రాపిడ్ టీమ్ (వెండి పతకం), బ్లిడ్జ్ ఫార్మాట్లో కాంస్య పతకం సాధించింది. అంతకుముందు శ్రీలంకలో జరిగిన కామన్వెల్త్ చెస్ టోర్నమెంట్లో బ్లిడ్జ్ ఫార్మాట్లో ప్రతిభ చూపి కాంస్య పతకం కై వసం చేసుకుంది. అండర్–9 కేటగిరిలో ఇండియాలో నంబర్–1 స్థానాన్ని కై వసం చేసుకుంది. అలాగే ఈ ఏడాది మేలో జార్జియాలో జరిగిన చెస్ పోటీల్లోనూ ప్రతిభ చూపింది. -
కీలక మార్పులు
ఉద్యోగుల హాజరు విధానంలో.. అనంతపురం క్రైం: రాష్ట్ర ప్రభుత్వ, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు విధానంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై ప్రతి ఉద్యోగి రోజూ అవేర్ యాప్ డ్యాష్బోర్డులో లాగిన్ అయి విధులకు హాజరయ్యే సమయాన్ని నమోదు చేయడం తప్పనిసరి చేసింది. అలాగే సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య విధులను ముగించిన సమయాన్ని కూడా తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించింది. ఉద్యోగి స్వయంగా హాజరు నమోదు చేయలేని పరిస్థితి ఉంటే, సంబంధిత వేతన పంపిణీ అధికారి (డీడీఓ) తన ప్రవేశం ద్వారా హాజరు నమోదు చేసే అవకాశాన్ని కల్పించారు. అలా నమోదు చేసిన వివరాలు ఉద్యోగి వ్యక్తిగత నమోదులోనే ప్రతిబింబిస్తాయని స్పష్టం చేశారు. అధికారిక విధుల కోసం కార్యాలయానికి దూరంగా ఉన్న సందర్భాల్లో విధి క్రమబద్ధీకరణకు సంబంధించిన దరఖాస్తులను ఏడురోజుల్లోపు అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. హాజరు సమయాలు ఇలా... ఉదయం 10:30 గంటల్లోపు హాజరు నమోదు చేయాలి. 10:31 నుంచి 10:40 గంటల వరకు గ్రేస్ పిరియడ్ ఉంటుంది. అనుమతితో నెలలో మూడుసార్లు మాత్రం 10:41 నుంచి 11:30 గంటల మధ్య విధులకు హాజరయ్యే అవకాశం ఇచ్చారు. మూడు సార్లు దాటితే దాన్ని సాధారణ సెలవుగా నమోదు చేస్తారు. 11:31 నుంచి మధ్యాహ్నం 2:00 గంటల మధ్య హాజరైనా ఆ రోజు సాధారణ సెలవుగానే పరిగణిస్తారు. మధ్యాహ్నం 2:01 నుంచి సాయంత్రం 5:00 గంటల మధ్య తొలిసారి హాజరైనా ఆ రోజును సాధారణ సెలవుగానే నమోదు చేయనున్నారు. ఈ నూతన విధానం ద్వారా ఉద్యోగుల్లో సమయ పాలన పెంపొందించడంతో పాటు హాజరు వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆలస్యంగా వస్తే సెలవుగా నమోదు -
నెట్టికంటుడి ఆదాయం రూ.54.42 లక్షలు
గుంతకల్లు రూరల్: హుండీ కానుకల లెక్కింపు ద్వారా ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానానికి రూ.54,42,524 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజు తెలిపారు. భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలను గురువారం ఆలయంలో లెక్కించారు. 77 రోజులకు రూ.54,42,524తో పాటు 14 గ్రాముల 300 మిల్లీ గ్రాముల మిశ్రమ బంగారం, 770 గ్రాముల వెండిని భక్తులు స్వామివారికి అందజేసినట్లు పేర్కొన్నారు. అలాగే బ్యాంక్ ఆఫ్ కెనడా 10 డాలర్లు, సెంట్రల్ బ్యాంక్ ఆరబ్ కంట్రీ 15 దీనమ్స్, యూఎస్ఏ 10 డాలర్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఈజిప్ట్ 50 పౌండ్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ 10 దినార్ లభించాయన్నారు. అన్నదానం హుండీ ద్వారా రూ.1,41,629 నగదును కూడా భక్తులు సమర్పించినట్లు పేర్కొన్నారు. -
హెచ్చెల్సీ ఆయకట్టులో క్రాప్ హాలిడే?!
వలసలే శరణ్యం ఇన్నాళ్లు మా ప్రాంతానికి వేరే గ్రామాల వారు వలస వచ్చి జీవించేవారు. తాజాగా ఆ పరిస్థితులు మారిపోనున్నాయి. మేమంతా వలసలు వెళ్లే దుస్థితి దాపురించింది. ఈ కష్ట కాలంలో రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – రవి, ఉద్దేహాళ్, బొమ్మనహాళ్ మండలం నారు ముదిరిపోతోంది నారు పోశాక నీరు లేవంటున్నారు. ముందే చెప్పి ఉంటే ఎంతో బాగుండేది. విత్తనాలు, ఎరువులు, సేద్యం ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. ఎల్నినో దెబ్బకు రైతులు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు. – విరుపాక్షి, ఆయకట్టు రైతు, లింగదహాళ్, బొమ్మనహాళ్ మండలం ఆరు తడి పంటలే మేలు ఎల్నినో నేపథ్యంలో రైతులు సహకరించాలి. తుంగభద్ర జలాశయానికి ఆశించిన స్థాయిలో వరద రావడం లేదు. కలెక్టర్ ఆదేశాల మేరకు తాగునీటి అవసరాలకు తప్ప పంటల సాగుకు నీరు విడుదల చేసేది ఉండదు. ఆయకట్టులో బోర్లున్న రైతులు కూడా ఆరుతడి పంటల వైపు దృష్టి సారించాలి. – సుధాకర్రావ్, హెచ్ఎల్సీ ఎస్ఈ రాయదుర్గం: జిల్లాలో సాగు, తాగు నీటి అవసరాలు తీర్చే తుంగభద్ర జలాశయంపై నీలినీడలు కమ్ముకున్నాయి. సాధారణంగా జూలై పూర్తయ్యే సరికి డ్యాం గేట్లన్నీ ఎత్తి దిగువకు నీరు వదిలేవారు. ఈ ఏడాది సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవక డ్యాంకు ఆశించిన రీతిలో వరద రావడం లేదు. మునుపెన్నడూ లేని విధంగా తుంగ, భద్ర నదులు పిల్ల కాలువలను తలపిస్తున్నాయి. ఈ క్రమంలో డ్యాం నుంచి హెచ్చెల్సీకి నీరు విడుదలైనా ఆయకట్టులో వరి సాగుకు అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. తాగునీటి అవసరాలకే వినియోగించనున్నట్లు స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ ఆనంద్ కూడా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆయకట్టు రైతులు క్రాప్ హాలిడే దిశగా సన్నద్ధమవుతున్నారు. దీంతో 2.85 లక్షల ఎకరాలు బీళ్లుగా మారనున్నాయి. నారు పోసిన రైతుకు కన్నీరు.. తుంగభద్ర జలాశయం నుంచి హెచ్ఎల్సీకి ఏటా జూలై 15 కల్లా నీటిని విడుదల చేసేవారు. దీంతో బోర్లు ఉన్న రైతులు ముందస్తుగా వరి నారు పెంచేవారు. ఈ సారి కూడా నీళ్లు వస్తాయనే నమ్మకంతో చాలా మంది నారు పోయగా.. తాజా పరిణామాలతో వారి ఆశలన్నీ అడియాసలుగా మారాయి. నారు ముదిరిపోతున్నా కొనేవారు కరువయ్యారు. విత్తనాలు, ఎరువులు, సేద్యం ఖర్చులన్నీ నెత్తిన పడడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఎల్నినో ప్రభావంతో టీబీ డ్యాంకు ఆశించిన మేర చేరని వరద హెచ్చెల్సీకి నీరు వదిలినా తాగునీటి అవసరాలకు మాత్రమే అంటున్న అధికారులు ఆయకట్టులో బీళ్లుగా మారనున్న 2.85 లక్షల ఎకరాలు -
ఇక్కడే ముందు నీళ్లందించాలి
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రతి ఎకరాకు సాగునీరు అందించిన తర్వాతే కుప్పం వరకు నీళ్లు తరలించాలి. రాయలసీమను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నఫలంగా పనులన్నీ ఆపేశారు. ఆంధ్ర సీఎంతో మాట్లాడి పనులు నిలిపినట్లు తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు సాక్ష్యం. – బోయ గిరిజమ్మ, జెడ్పీ చైర్పర్సన్ -
బీమా ప్రీమియం చెల్లించేందుకు మనసు రాలేదా?
అనంతపురం: అత్యంత విలువైన భూములను సైతం 99 పైసలకే పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి రైతన్నలను ఆదుకోవడానికి మాత్రం మనసు రావడం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉచితంగా పంటల బీమా ప్రీమియం చెల్లించి రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ పథకానికి మంగళం పాడారని విమర్శించారు. ఎల్నినో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక రెండేళ్లుగా అతివృష్టి, అనావృష్టితో అన్నదాతలు నష్టపోయారని తెలిపారు. రైతులు ప్రీమియం చెల్లించినా గత ఖరీఫ్, రబీలో పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ అందించలేదని దుయ్యబట్టారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 8.48 లక్షల ఎకరాలైతే ఇప్పటి వరకు కేవలం 2.59 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగు చేశారన్నారు. ఇంకా 6 లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి రావాల్సి ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేరుశనగ సాగు దారుణంగా పడిపోయిందన్నారు. జూన్లోనే ఖరీఫ్ ప్రారంభమైనా బీమా ప్రీమియం చెల్లించడానికి మాత్రం నోటిఫికేషన్ను జూలై 6న విడుదల చేసి.. ఆ తర్వాత రెండు రోజులకు ప్రీమియం వివరాలు తెలియజేశారన్నారు. అప్పటికే రైతులు రుణాల రెన్యూవల్తో పాటు కొత్త రుణాలు తీసుకున్నారని చెప్పారు. ప్రతి పంటకూ బీమా ప్రీమియం చెల్లించేలా చర్యలు తీసుకోవాలంటూ సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని, జూలై 31కి గడువు ముగుస్తున్నా ఇంకా 1.90 లక్షల మంది రైతులు ప్రీమియం చెల్లించలేదన్నారు. వైఎస్ జగన్ హయాంలో ఉచిత పంటల బీమా చేస్తే కొన్ని పంటలకు ఏకంగా రూ.18 లక్షల వరకు సాయం అందిందని గుర్తు చేశారు. మంత్రులు ఉన్నా ఒరిగిందేమీ లేదు.. ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా రైతులకు ఒరిగిందేమీ లేదని ‘అనంత’ ఎద్దేవా చేశారు. పంట మార్పిడి చేసుకోవాలని చంద్రబాబు చెబుతుండడం అన్యాయమన్నారు. ఇప్పటికే వేరుశనగ సాగు కోసం కొందరు రైతులు ఎకరాకు రూ.640 చొప్పున ప్రీమియం చెల్లించారని, అలాంటి రైతులు వర్షాభావ పరిస్థితుల్లో పంట మార్పిడి చేసుకుంటే ప్రీమియం పరిస్థితి ఏంటని నిలదీశారు. వేరుశనగకు సంబంధించి ఎకరాకు ప్రీమియం రూ.640 చెల్లిస్తే, కందికి ప్రీమియం రూ.80 మాత్రమేనని, ఈ క్రమంలో మిగిలిన డబ్బు రైతులకు తిరిగిస్తారా అనే విషయంపై ఎవరికీ స్పష్టత లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్ రెడ్డి, కేశవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతన్నలపై మరీ ఇంత చిన్నచూపా? పారిశ్రామికవేత్తలకు మాత్రం విలువైన భూములను 99 పైసలకే కట్టబెడతారా? వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజం -
బైకును ఢీకొన్న ఐచర్.. ఇద్దరి దుర్మరణం
తాడిపత్రి రూరల్: బైకును ఐచర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. తాడిపత్రి అప్గ్రేడ్ సీఐ నారాయణరెడ్డి తెలిపిన మేరకు.. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బందార్లపల్లికి చెందిన అన్నదమ్ములు పెద్ద దస్తగిరి, చిన్న దస్తగిరి (35), సమీప బంధువు రాజేంద్ర (40)లు బండల గనిలో కూలీలుగా పనిచేసేవారు. కొన్ని రోజులుగా పెద్ద దస్తగిరి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గనిలో పని చేసి ఇంటికి వచ్చిన అతనికి అకస్మాత్తుగా బీపీ పడిపోయింది. దీంతో చిన్న దస్తగిరి, రాజేంద్రలు కలిసి పెద్ద దస్తగిరిని బైకులో ఎక్కించుకుని వైద్యం కోసం తాడిపత్రికి బయలుదేరారు. మార్గమధ్యంలో మండలంలోని అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద పెద్దమ్మ గుడి సమీపంలో రోడ్డు దెబ్బతినడంతో బైకును చిన్నగా పోనిస్తుండగా ఓ ఐచర్ వాహనం వేగంగా వచ్చి వీరిని ఢీకొంది. దీంతో తీవ్రగాయాలైన రాజేంద్ర అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. చిన్న దస్తగిరి, పెద్ద దస్తగిరిని 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ చిన్న దస్తగిరి మృతి చెందాడు. రాజేంద్రకు భార్య అలివేలితో పాటు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. చిన్న దస్తగిరికి భార్య కవితతో పాటు 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. రాజేంద్ర మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఐచర్ డ్రైవర్ రఘురాముడుపై కేసు నమోదు చేసినట్లు సీఐ నారాయణరెడ్డి వెల్లడించారు. వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్తుండగా ఘోరం అన్నను తీసుకెళ్తున్న తమ్ముడు, సాయం కోసం వచ్చిన వ్యక్తి కన్నుమూత -
టీబీ డ్యాంలో 36 టీఎంసీల నీరు
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయంలో గురు వారం 36.04 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 1,633 అడుగులకు గాను 1609.21 అడుగల మేర నీటిమట్టం ఉంది.ఇన్ఫ్లో 14,922 క్యూసెక్కులుండగా.. 3680 క్యూసెక్కులు అవుట్ఫ్లో నమోదైంది. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1624.80 అడుగులతో 75.84 టీఎంసీల నీరు ఉంది. జేఎన్టీయూ(ఏ)కు ఎన్జీయూ 24వ ర్యాంకు అనంతపురం: జేఎన్టీయూ (ఏ)కు అరుదైన గుర్తింపు దక్కింది.జాతీయ గ్రీన్ యూనివర్సిటీ (ఎన్జీయూ) ప్రకటించిన ర్యాంకింగ్లో జేఎన్టీయూ(ఏ)కు 24వ ర్యాంక్తో పాటు గోల్డ్ రేటింగ్ దక్కింది. ఇందుకు సంబంధించిన వివరాలను వర్సిటీ వీసీ హెచ్.సుదర్శనరావు గురువారం వెల్లడించారు. మొత్తం పది అంశాలకు సంబంధించిన సూచికలపై పనితీరును పరిగణనలోకి తీసుకుని ఎన్జీయూ ర్యాంకులను ప్రకటించిందన్నారు. సుస్థిరత వ్యూహం, నాయకత్వం, వెల్లడింపులు, హరిత భవనాలు, సామర్థ్యం, పునరుత్పాదకం, గ్రీన్హౌస్ వాయువుల జాబితా, డీకార్బనైజేషన్ ప్రయత్నాలు, కోర్సులు,అనుభవపూర్వక అభ్యాసం, సహ పాఠ్య కార్యకలాపాలు, ప్రచురణలు, పైలట్ ప్రాజెక్టులు, ఆవిష్కరణల బదిలీ, స్థానిక జాతులు, పర్యావరణ ప్రణాళిక, ప్రజా రవాణా, సైక్లింగ్, ఈవీ మౌలిక సదుపాయాలు, పంటకోత, పరిరక్షణ, గ్రే వాటర్ పునర్వినియోగం, విభజన, కంపోస్టింగ్, ప్లాస్టిక్ నిషేధాలు, ఎస్యూసీఎన్ సహకారాలు, స్థానిక ప్రభావం అంశాల్లో జేఎన్టీయూ(ఏ)కు మెరుగైన ర్యాంక్ దక్కడం అభినందనీయమన్నారు. ఈ ఘనత సాధనకు కృషి చేసిన వర్సిటీ అధ్యాపక బందానికి వీసీతో పాటు రిజిస్ట్రార్ ఎస్.కష్ణయ్య, ఐక్యూఏసీ డైరెక్టర్ ఆర్. పద్మసువర్ణ, వర్సిటీ ర్యాంకింగ్ ఆఫీసర్ డాక్టర్ ఓంప్రకాష్ అభినందనలు తెలిపారు. పనితీరు మారకుంటే చర్యలు తప్పవు ● ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీలకు కలెక్టర్ హెచ్చరిక అనంతపురం అర్బన్: ‘‘పిల్లల్లో తలెత్తే పౌష్టికాహార లోపాన్ని సరిగా పర్యవేక్షించడం లేదు. ఎదుగుదల లేని పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదు. ఇకనైనా పనితీరు మార్చుకోండి.అంగన్ వాడీ కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేస్తా. లోపాలు గుర్తిస్తే చర్యలు తప్పవు’’ అని కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. కలెక్టర్ గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో సీడీపీఓలు, సూపర్వైజర్లు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎదుగుదల లేని పిల్లలపై సీడీపీఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీలు సరిగా శ్రద్ధ పెట్టడం లేదని అసహనం వ్యక్తం చేశారు. సమావేశానికి కనీస సమాచారంతో రాకపోవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్తహీనత ఉన్న పిల్లల సంఖ్యను సున్నా శాతానికి తీసుకురావాలన్నారు. తక్కువ బరువున్న పిల్లలను ఎన్ఆర్సీలో చేర్చాలని, డ్రాపవుట్ అయిన చిన్నారులను తిరిగి అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని ఆదేశించారు. ప్రీ స్కూల్లో పిల్లల నమోదు తగ్గకుండా చూసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో కచ్చితమైన డేటా నమోదు చేయకపోతే చర్యలు తప్పవన్నారు. బాల్యవివాహాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ షాహిదా, డీఆర్డీఏ పీడీ శైలజ, డీఎస్ఓ శోభరాణి పాల్గొన్నారు. ● పిల్లల ఎదుగుదల పర్యవేక్షణలో పురోగతి చూపని కళ్యాణదుర్గం సూపర్వైజర్ సుధారాణి, కణేకల్లు సీడీపీఓ నాగమణి, ఉరవకొండ సీడీపీఓ శ్రీదేవికి చార్జ్ మెమోలు ఇవ్వాలని ఐసీడీఎస్ పీడీ షాహిదాను కలెక్టర్ ఆదేశించారు.అంగన్వాడీ కేంద్రాలను స్వయంగా తనిఖీ చేసి పిల్లల బరువులు పరీక్షించి సంబంధిత రిపోర్టుతోపాటు చార్జ్ మెమోలను తనకు అందించాలని పీడీకి సూచించారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
బెళుగుప్ప: మండల పరిధిలోని కోనాపురం క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. ఎస్ఐ శివ తెలిపిన మేరకు.. కణేకల్లు మండలం సొల్లాపురానికి చెందిన సాలమ్మ (36) అనంతపురంలో నివాసం ఉంటోంది. మంగళవారం రాత్రి తన బంధువు మల్లికార్జునతో కలిసి ద్విచక్ర వాహనంపై ఎర్రగుడిలో జరుగుతున్న శుభ కార్యంలో పాల్గొనేందుకు వెళ్తుండగా, కోనాపురం వద్ద బైకు అదుపుతప్పి ఇద్దరూ కిందపడ్డారు. ప్రమాదంలో సాలమ్మ తలకు తీవ్రగాయాలు కాగా కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం సాలమ్మ మృతి చెందింది. ఘటనపై మృతురాలి భర్త హరిజన రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ పేర్కొన్నారు. గుంతలోకి దూసుకెళ్లిన 108 ● గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఘటన బ్రహ్మసముద్రం: గర్భిణిని ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో ఓ 108 అంబులెన్స్ అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లింది. వివరాలు.. మండలంలోని చెలిమేపల్లి గొల్లలదొడ్డి గ్రామానికి చెందిన గర్భిణి బసమ్మతో పాటు ఆమె తల్లి సరస్వతిని 108లో కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోని భైరసముద్రం సమీపంలో స్టీరింగ్ రాడ్ కట్ అయ్యింది. దీంతో వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కనే ఉన్న గుంతలోకి దూసుకెళ్లింది. గర్భిణి బసమ్మ తలకు, ఆమె తల్లి సరస్వతికి తీవ్ర గాయాలయ్యాయి. 108 డ్రైవర్ ఇషాక్, ఈఎంటీ అంజి స్వల్పంగా గాయపడ్డారు. బసమ్మను వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. వివాహిత ఆత్మహత్య గార్లదిన్నె: వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని కల్లూరులో జరిగింది. ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపిన మేరకు.. కల్లూరుకు చెందిన మహేంద్ర, శిరీష (22) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల మహేంద్ర పేటీఎం ద్వారా రూ.2 లక్షల అప్పు తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న శిరీష తనకు తెలియకుండా లోన్ తీసుకోవడంపై భర్తతో గొడవ పడింది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూపర్ వాస్మాయిల్ తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ శిరీష మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 1,127 మందికి ‘తల్లికి వందనం’ పెండింగ్ అనంతపురం న్యూ టౌన్: జిల్లాలో ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంకా 1,127 మందికి నగదు అందలేదని అధికారులు గుర్తించారు. సమస్యను పరిష్కరించేందుకు గ్రామ, పట్టణ ప్రాంతాల్లో సచివాలయ సిబ్బందిని అప్రమత్తం చేశారు. సచివాలయాల వారీగా ఆయా విద్యార్థుల డేటా సేకరిస్తున్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 77 మంది, గుంతకల్లు– 122, కళ్యాణదుర్గం–135, రాప్తాడు–164, రాయదుర్గం–158, శింగనమల–139, తాడిపత్రి–180, ఉరవకొండ నియోజకవర్గంలో 152 మందికి డబ్బు అందలేదని వెల్లడైంది. ఈ విషయంపై స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు జిల్లా అధికారి జి. నాసరరెడ్డి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. అర్హత ఉన్న ఏ ఒక్క విద్యార్థికీ నష్టం జరగకుండా చూస్తామన్నారు. బాధితులు సంబంధిత సచివాలయాలలో తగిన వివరాలతో ఆగస్టు మూడులోపు ఫిర్యాదు చేయాలని కోరారు. మృతి చెందిన హరిజన సాలమ్మ -
బీమాకు రేపటి వరకే గడువు
అనంతపురం అగ్రికల్చర్: వాతావరణ బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాల ప్రీమియం చెల్లింపు గడువు ముగిసే దశకు చేరుకుంది. శుక్రవారం వరకు మాత్రమే గడువు మిగిలి ఉంది. అసలే ఎల్–నినో పరిస్థితులు ఉండటం, నెలల పాటు వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, సాగు చేసిన పంటలు చేతికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో ‘అనంత’ అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భూగర్భజలాలు అడుగంటిపోయి జీవనాడిగా భావిస్తున్న ఉద్యానపంటలు కూడా దెబ్బతినే పరిస్థితి ఉన్నందున రోజురోజుకూ టెన్షన్ రెట్టింపవుతోంది. ఈ నేపథ్యంలో పంటల బీమా పథకాలపై గంపెడాశలు పెట్టుకున్నారు. గత రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం బీమా కింద పరిహారం ఇవ్వకపోయినా.. ఈసారి ప్రతికూల పరిస్థితులు నెలకొనడం, మొదట్లోనే కరువు కబళించే పరిస్థితులు ఉన్నందున బీమా ధీమాపై ఆశలు వదులుకోకుండా ప్రీమియం కట్టేందుకు ఎగబడుతున్నారు. ప్రీమియం కోసం అవస్థలు బీమా పథకాల కింద నోటిఫై చేసిన 12 రకాల పంటలకు తమ వాటా కింద ప్రీమియం చెల్లించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. ఫసల్ బీమా కింద వరి, కంది, జొన్న, మొక్కజొన్న, ఆముదం, మిరప పంటలు ఉండగా వాతావరణ బీమా కింద వేరుశనగ, పత్తి, దానిమ్మ, చీనీ, బత్తాయి, అరటి, టమాటా పంటలు ఉన్నాయి. వరికి ఆగస్టు 15 వరకు గడువు ఉండగా.. మిగతా అన్ని పంటలకూ ఈ నెలాఖరులోపు ప్రీమియం చెల్లించాల్సి ఉంది. వ్యవసాయశాఖ, ఆర్ఎస్కేలు, బ్యాంకులు, మీ–సేవ, కామన్ సర్వీసు సెంటర్లు (సీఎస్సీ) చుట్టూ పరుగులు పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అటు వ్యవసాయ, ఇటు ఉద్యాన పంటలు 1.76 లక్షల హెక్టార్లకు 1.13 లక్షల మంది రైతులు ప్రీమియం కట్టి బీమా పరిధిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. మిగిలి ఉన్న ఈ రెండు రోజుల్లో అంచనా మేరకు ఇంకా 1.50 లక్షల హెక్టార్ల పంటలకు చెల్లించి బీమా పరిధిలోకి రావడం కష్టంగానే కనిపిస్తోంది. మరో వారం రోజులు గడువు పొడిగిస్తే కాని రైతులకు న్యాయం జరిగే పరిస్థితి లేదని చెబుతున్నారు. ప్రభుత్వ తీరుపై మండిపాటు ఖరీఫ్ మొదలైన 40 రోజుల తర్వాత ప్రభుత్వం బీమా పథకాల నోటిఫికేషన్ విడుదల చేయడం రైతులకు పెద్ద సమస్యగా మారింది. అప్పటికే బ్యాంకుల్లో పంట రుణాల రెన్యూవల్స్, కొత్త రుణాల పంపిణీ 90 శాతం ముగియడం వల్ల... 70 నుంచి 80 శాతం మంది రైతులు వేరుశనగ పంట కింద రుణాలు తీసుకున్నట్లు బ్యాంకర్లు నమోదు చేసుకున్నారు. అయితే వర్షాభావం, ఇతరత్ర కారణాల వల్ల వేరుశనగ పంట సాగు విస్తీర్ణం కేవలం 20 వేల హెక్టార్లకు పడిపోయింది. వేరుశనగ పంట కింద రుణం తీసుకుని ప్రీమియం చెల్లించినట్లు నమోదు చేసుకున్న రైతులు పొలంలో వేరుశనగ సాగు చేసినట్లు ఈ–క్రాప్లో నమోదు కావాల్సి ఉంది. దీంతో ఇపుడు బ్యాంకులకు వెళ్లి పంట మార్పిడి చేసుకుని.. సాగు చేసిన... సాగు చేయబోతున్న పంటకు ప్రీమియం చెల్లించడానికి నానా అవస్థలు పడుతున్నారు. ఎల్–నినో పరిస్థితుల్లో బీమాపై ఆశలు పెట్టుకున్న రైతులు ప్రీమియం కట్టేందుకు బ్యాంకులు, సీఎస్సీల వద్దకు పరుగులు -
అదుపు తప్పిన బైకు.. వ్యక్తి దుర్మరణం
వజ్రకరూరు: మండల పరిధిలోని పీసీ ప్యాపిలి సమీపంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద బుధవారం సాయంత్రం కుక్క అడ్డు రావడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. వజ్రకరూరు పోలీసులు తెలిపిన మేరకు.. గుంతకల్లు మండలం పులగుట్టపల్లికి చెందిన కురుబ అయ్యంగారి శివశంకర్ (40) ఉరవకొండ మండలం బూదగవి వద్ద నాలుగు ఎకరాలు కౌలు చేస్తున్నాడు. వ్యవసాయ పనుల నిమిత్తం రెండు రోజుల క్రితం బూదగవికి వెళ్లాడు. బుధవారం సాయంత్రం స్వగ్రామం పులగుట్టపల్లికి ద్విచక్ర వాహనంలో బయలుదేరాడు. మార్గమధ్యంలో పీసీ ప్యాపిలి విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఒక్కసారిగా కుక్క అడ్డు రావడంతో ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. దీంతో తీవ్రగాయాలైన శివశంకర్ అక్కడికక్కడే మరణించాడు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. వజ్రకరూరు ఎస్ఐ నాగస్వామి, ఏఎస్ఐ రమేష్ అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య లలిత, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ధనుష్ అదుర్స్ అనంతపురం: సౌత్ జోన్ సీనియర్ పురుషుల అంతర జిల్లా క్రికెట్ టోర్నీ బుధవారం ప్రారంభమైంది. ఆగస్టు 16 వరకు అనంతపురం ఆర్డీటీ స్టేడియంలో పోటీలు నిర్వహించనున్నారు. టోర్నమెంట్లో అనంతపురం, కడప, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు ఇలా మొత్తం ఐదు జట్లు పాల్గొంటున్నాయి. బుధవారం కడప, అనంతపురం జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కడప పది వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసింది. ధనుష్ మర్తాల అద్భుతమైన సెంచరీ (127 బంతుల్లో 174 పరుగులు)తో మెరిశాడు. అనంతరం అనంతపురం జట్టు రెండు వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. ● చిత్తూరు, కర్నూలు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చిత్తూరు పది వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన కర్నూలు జట్టు రెండు వికెట్ల నష్టానికి 16 పరుగులు సాధించింది. -
కొండకు గుండు
అనంతపురం రూరల్ పరిధిలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. కొండలు, గుట్టలను పిండిచేస్తూ రోజూ పదుల సంఖ్యలో టిప్పర్లతో ఎర్రమట్టిని దోపిడీ చేస్తోంది. రియల్ ఎస్టేట్ వెంచర్లు, నిర్మాణ పనులకు తరలిస్తూ భారీమొత్తంలో సొమ్ము చేసుకుంటోంది. ఈ మాఫియాకు అధికార పార్టీ నేతల అండదండలు, అధికారుల సహకారం ఉండడంతో అడ్డూ అదుపు లేకుండా చెలరేగిపోతోంది. అనంతపురం రూరల్ మండలం నరసనాయనకుంట సమీపాన కొండను తవ్వి అక్రమంగా మట్టి తరలిస్తున్న దృశ్యాలివీ. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం. -
కొనసాగుతున్న ఇన్ఫ్లో
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయంలోకి వరద నీరు కొనసాగుతోంది. రిజర్వాయర్ పూర్తి సామర్ధ్యం 1,633 అడుగులకు గాను బుధవారం నాటికి 1608.70 అడుగులతో 35.09 టీంఎసీల నీరు నిల్వ ఉన్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. 14,614 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 3,691 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. గుంతకల్లులో మరో కరోనా కేసు గుంతకల్లు: గుంతకల్లులో మరో కరోనా కేసు నమోదైంది. ఓ రైల్వే ఉద్యోగి భార్య జ్వరం, శ్వాసకోశ సమస్యతో బాధపడుతూ బుధవారం రైల్వే డివిజనల్ ఆస్పత్రికి వెళ్లింది. దీంతో వైద్యులు ర్యాపిడ్ టెస్ట్ చేయగా స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించాయి. ఆమె భర్తకు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. దీంతో వెంటనే ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారులకు తెలియజేశారు. అధికారులు రైల్వే ఆస్పత్రికి చేరుకుని ఆమెకు మరోసారి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయడానికి అవసరమైన శాంపిల్స్ తీసుకెళ్లినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. దీంతో పట్టణంలో కరోనా బాధితుల సంఖ్య రెండుకు చేరుకుంది. ఓటీపీ చెప్పండి ‘సర్’ ● ‘మై టీడీపీ’ యాప్లో నిర్ధారణ పేరుతో ఓటర్లకు కాల్స్ ● ఓటీపీ అడుగుతుండడంతో ప్రజల్లో ఆందోళన రాప్తాడు రూరల్: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో కొందరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఫోన్లు చేస్తూ ఓటీపీలు అడుగుతుండడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాము సచివాలయ సిబ్బంది, బీఎల్ఓలమంటూ పరిచయం చేసుకుని, ఓటరు వివరాల నిర్ధారణ పేరుతో మొబైల్కు వచ్చే ఓటీపీ చెప్పాలని కోరుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. మూడు రోజులుగా అనంతపురం రూరల్, అర్బన్ మండలాల పరిధిలో పలువురికి ఈ తరహా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ సందర్భంగా సేకరించిన ఓటర్ల వివరాలను ’మై టీడీపీ’ యాప్లో నమోదు చేసిన తర్వాత, వాటి నిర్ధారణ కోసం ఫోన్లు చేస్తున్నట్లు కాల్ చేసిన వ్యక్తులు చెబుతున్నారని సమాచారం. ఓటీపీ చెబితేనే ప్రక్రియ పూర్తవుతుందంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. సచివాలయ ఉద్యోగుల పేర్లు చెప్పి నమ్మించే యత్నం ఓటీపీ చెప్పేందుకు చాలామంది నిరాకరిస్తుండటంతో కాల్ చేస్తున్న వ్యక్తులు స్థానిక సచివాలయ ఉద్యోగులు, బీఎల్ఓల పేర్లు ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారని తెలుస్తోంది. దీంతో మొదట కొందరు నమ్మినా, అనుమానం వచ్చిన వారు అసలు బీఎల్ఓ ఎవరో తమకు తెలుసని, మీరు ఎవరో చెప్పాలని ప్రశ్నించగానే ఫోన్ కట్ చేస్తున్నారు. మరికొందరు కాల్ చేసిన వ్యక్తులు మాత్రం తమకు పార్టీ అధిష్టానం నుంచి ఒత్తిడి ఉందని, ఒక్కసారి ఓటీపీ చెబితే కన్ఫర్మేషన్ పూర్తవుతుందని బతిమాలుతున్నట్లు ఓటర్లు చెబుతున్నారు. అయినప్పటికీ ఎక్కువ మంది ఓటీపీ చెప్పేందుకు ముందుకు రావడం లేదు. తమ వ్యక్తిగత వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశం ఉందన్న భయంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారికంగా ఓటరు ధ్రువీకరణ కోసం ఓటీపీలు అడుగుతున్నారా? లేక వ్యక్తిగతంగా కొందరు ఈ విధంగా వ్యవహరిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండోమెంట్ ఏసీగా సుధారాణి అనంతపురం కల్చరల్: జిల్లా దేవదాయ శాఖ (ఎండోమెంట్) అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ)గా సుధారాణి నియమితులయ్యారు. ఇది వరకు ఏసీగా ఉన్న గంజి మల్లికార్జున ప్రసాద్ వారం రోజుల కిందట లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం పాఠకులకు విదితమే. ఆ వెంటనే మరొకరికి బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా ఉన్నతాధికారులు జాప్యం చేశారు. ఎట్టకేలకు అనంతపురం గ్రూప్ టెంపుల్స్–1 ఈఓ, ఉరవకొండ గవిమఠం ఇన్చార్జ్గా ఉన్న సుధారాణిని సహాయ కమిషనర్ (ఏసీ)గా నియమించారు. ఈ మేరకు దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
100 చౌకదుకాణాల్లో ‘మీ మార్ట్’
● జేీసీ విష్ణుచరణ్ అనంతపురం అర్బన్: జిల్లావ్యాప్తంగా 100 చౌకధరల దుకాణాల్లో ‘మీ మార్ట్’ పథకం ప్రారంభించనున్నట్లు జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో డీఎస్ఓ శోభారాణితో కలిసి చౌక దుకాణాల డీలర్లు, సీఎస్డీటీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైన వారికి రుణ సదుపాయం కల్పిస్తారన్నారు. రుణం అవసరం లేని వారు సొంతంగానైనా మార్ట్ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. రేషన్ సరుకులతో పాటు ఇతర నిత్యావసర సరుకులను రిటైల్ మార్జిన్ ద్వారా విక్రయించవచ్చన్నారు. రేషన్ పంపిణీలో ఎలాంటి అంతరాయం లేకుండా చూసుకోవాలని చెప్పారు. మీ మార్టు ప్రారంభించే డీలర్లకు ప్రాంటియర్ సంస్థ లాగిన్ ఐడీ, పాస్వర్డ్, మేరి సహేలి అప్లికేషన్లో క్రియేట్ చేసి ఇస్తుందన్నారు. దీని ద్వారా వినియోగదారులు రేషన్తో పాటు వారికి అవసరమైన నిత్యావసర వస్తువులను ఒకేచోట కొనుగోలు చేసుకునే వీలు కలుగుతుందన్నారు. కంపెనీల ప్రతినిధులతో సమన్వయం చేసుకుని పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో సీఎస్డీటీలు, డీలర్లు తదితరులు పాల్గొన్నారు. -
క్రీడా అవకాశాలను సద్వినియోగం చేసుకోండి
● కలెక్టర్ ఆనంద్ రాప్తాడు రూరల్: క్రీడా అవకాశాలను గ్రామీణ ప్రాంత విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆనంద్ సూచించారు. అనంతపురం రూరల్ మండలం చియ్యేడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం అమరావతి చాంపియన్షిప్–2026 మండలస్థాయి బాలబాలికల క్రీడా పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన, గ్రామీణ స్థాయి నుంచే విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం పోటీలను నిర్వహిస్తోందన్నారు. విద్యతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిస్తే శారీరక, మానసిక వికాసంతో పాటు ఉన్నత అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న శిక్షణ, ప్రోత్సాహాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించి పాఠశాలలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో విద్యాభ్యాసం పూర్తి చేసి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. అనంతపురం రూరల్ మండలంలోని 12 పాఠశాలల నుంచి 500 మంది బాలబాలికలు పోటీల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. క్రీడాకారుల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ, కలెక్టర్ ప్రోత్సాహంతో చియ్యేడు జెడ్పీ పాఠశాల క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. జిల్లా విద్యాశాఖ, ఆర్డీటీ, జిల్లా క్రీడాభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అండర్–14 బాలురు, బాలికల విభాగాల్లో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీల వివరాలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మంజులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ దివాకర్, ఆర్ఐ సందీప్, సింగిల్ విండో అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రధానోపాధ్యాయుడు విశ్వనాథ్, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయి పాల్గొన్నారు. -
బావిలో పడి వ్యక్తి మృతి
నార్పల: మండల పరిధిలోని ముచ్చుకుంటపల్లికి చెందిన రైతు ఏ.గోపాల్రెడ్డి (60) బావిలో పడి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన మేరకు.. బుధవారం గోపాల్రెడ్డి తన పొలం వద్దకు బయలుదేరాడు. మార్గమధ్యంలోని బావిలోకి ప్రమాదవశాత్తు పడిపోయాడు. స్థానికులు అప్రమత్తమై బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. మహిళపై అత్యాచార యత్నం గుంతకల్లు రూరల్: మండల పరిధిలోని మొలకలపెంట గ్రామానికి చెందిన దండు వెంకటేశులు అదే గ్రామానికి చెందిన ఓ మహిళపై అత్యాచార యత్నం చేశాడు. కసాపురం ఎస్ఐ టీపీ వెంకటస్వామి తెలిపిన మేరకు.. మొలకలపెంటకు చెందిన మహిళకు పది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నిరోజులుగా ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి పుట్టినింట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. మంగళవారం సాయంత్రం ఒంటరిగా ఉన్న ఆమైపె కన్నేసిన దండు వెంకటేశులు ఇంట్లోకి దూరి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. బాధిత మహిళ కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు తన తల్లిదండ్రులతో కలిసి బుధవారం కసాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్మీ మద్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ అనంతపురం సెంట్రల్: ఆర్మీ మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారులు అరెస్ట్ చేశారు. బుధవారం నగరంలోని గుల్జార్పేట ఎకై ్సజ్ కార్యాలయంలో సీఐ సత్యనారాయణ వివరాలు వెల్లడించారు. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి పంచాయతీ బీజేపీ కాలనీ చెందిన బోగే నరేష్బాబు ఆర్మీ క్యాంటీన్లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేసేవాడు. ఇతను 15 ఆర్మీ మద్యం బాటిళ్లను తరలిస్తున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి రామ్మోహన్రెడ్డికి సమచారం అందింది. ఈ క్రమంలోనే ఆయన ఆదేశాల మేరకు ఎకై ్సజ్ పోలీసులు దాడులు నిర్వహించి కక్కలపల్లి టమాట మండీ సమీపంలో నరేష్బాబును పట్టుకున్నారు. మాజీ సైనికుల నుంచి మద్యం బాటిళ్లు సేకరించిన అనంతరం బయటి వ్యక్తులకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో తేలింది. ఎకై ్సజ్ చట్టం ప్రకారం నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆర్మీ మద్యం అక్రమ కొనుగోలు, రవాణ, నిల్వ, విక్రయం నేరమని, ఎక్కడైనా ఇలాంటి కార్యకలాపాలు జరుగుతుంటే ఎకై ్సజ్ అధికారులకు సమాచారం ఇవాలని సీఐ కోరారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ ఎస్ఐలు జయనరసింహ, జాకిర్ హుస్సేన్, కృష్ణారెడ్డి, రాజేంద్రప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఉత్తీర్ణతపై దృష్టి పెట్టండి
అనంతపురం అర్బన్: సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు పదో తరగతిలో మంచి మార్కులతో 100 శాతం ఉత్తీర్ణత సాధించేలా ఇప్పటి నుంచే దృష్టి సారించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్పరెన్స్ హాలులో సంక్షేమ సెక్టార్పై ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎంఈఓలు, ఎంపీడీఓలు సమన్వయంతో బడిబయట ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రభుత్వ ఆదర్శ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. కేజీబీవీల్లో 40 శాతం లోపు మార్కులు వచ్చిన విద్యార్థినులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపించాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఫేస్–2, నాడు–నేడు కార్యక్రమం కింద పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆదర్శ ఎస్సీ కాలనీల్లో తాగునీరు, వీధిదీపాలు, మరుగుదొడ్ల సమస్య లేకుండా అభివృద్ధి పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. -
స్కాంలు సహజమైపోయాయి
అనంతపురం: డీఎస్సీ–2025లో చోటు చేసుకున్న అక్రమాలపై విద్యార్థులు, యువత గర్జించింది. ఉద్యోగాలు అమ్ముకున్నారని, అర్హులకు మొండిచేయి చూపి దగా చేశారని మండిపడింది. జాతీయ స్థాయి ‘నీట్’ స్కాంను తలదన్నేలా డీఎస్సీ కుంభకోణం నిలుస్తోందని విరుచుకుపడింది. డీఎస్సీ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే గద్దె దిగాలంటూ వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మంగళవారం అనంతపురంలో చేపట్టిన చేపట్టిన ర్యాలీకి జిల్లా నలుమూలల నుంచి యువత, ప్రజలు, విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులు తరలివచ్చారు. ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఎదురుగా ఉన్న అనంత వెంకటరెడ్డి విగ్రహం వద్ద నుంచి ర్యాలీ మొదలైంది. జిల్లాపరిషత్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి సప్తగిరి సర్కిల్కు చేరుకుని మానవహారంగా ఏర్పడ్డారు. జీవితాలతో చెలగాటం వద్దు మెగా డీఎస్సీ అంతా దగానే అని, కష్టపడి చదివి పరీక్ష రాసిన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని వైఎస్సార్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ నిప్పులు చెరిగారు. ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ పెట్టి.. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఒకే నోటిఫికేషన్తో 1.35 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినా.. ఎక్కడా చిన్న ఆరోపణ కూడా రాలేదన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తొలి సంతకం చేసిన డీఎస్సీని అక్రమాల పుట్టగా మార్చేశారని విమర్శించారు. డబ్బులిస్తే చాలు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే పరిస్థితికి తెచ్చారన్నారు. కష్టపడి చదివితే ఉద్యోగం వస్తుందని యువత భావిస్తే కనీసం మెరిట్ లిస్ట్ కూడా ప్రకటించకుండా పోస్టులను అమ్ముకున్నారని ఆరోపించారు. నిరుద్యోగ భృతి కింద ఒక్కో నిరుద్యోగికి రెండేళ్లకు గాను రూ.75 వేల చొప్పున ప్రభుత్వం బాకీ పడిందన్నారు. విద్యార్థులకు సంబంధించి విద్యాదీవెన, వసతి దీవెన నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, ఎస్ఈసీ సభ్యుడు కోగటం విజయభాస్కర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కొణిదెల రమేష్రెడ్డి (రాప్తాడు నియోజకవర్గ పరిశీలకులు), నార్పల సత్యనారాయణరెడ్డి, సాకే రుత్విక్, తలారి సాయి హర్ష, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు బండ్లపల్లి ప్రతాప్రెడ్డి, వెన్నం శివారెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్రెడ్డి, మాజీ మేయర్ వసీం సలీం, మాజీ డిప్యూటీ మేయర్ దాసరి వాసంతి సాహిత్య, జ్వాలాపురం శ్రీకాంత్, పామిడి వీరాంజనేయులు, చామలూరు రాజగోపాల్, పెన్నోబిలేసు, ఎగ్గుల శ్రీనివాసులు, ఆలమూరు శ్రీనివాస్రెడ్డి, ఎద్దుల అమర్నాథరెడ్డి, ప్రియాంక, కాగజ్ఘర్ రిజ్వాన్, మొఘల్ సైఫుల్లాబేగ్, ఓబిరెడ్డి, కేశవరెడ్డి, శ్రీనివాసనాయక్, అంజలి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాదా ఖలందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మణికంఠ, వంశీ, నగర ఉపాధ్యక్షుడు వినీత్, ఉదయ్, నగర ప్రధాన కార్యదర్శి మసూద్, మంజు, నగర కార్యదర్శి హర్ష, రిజ్వాన్, గువ్వల రాజేష్రెడ్డి పాల్గొన్నారు. అనంతపురంలోని సప్తగిరి సర్కిల్లో మానవహారంగా ఏర్పడిన వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన నేతలు.. ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిచంద్రబాబు ప్రభుత్వంలో స్కాంలు సహజమయ్యే పరిస్థితి నెలకొంది. ప్రజల్లో ప్రభుత్వంపై అభద్రతాభావం ఏర్పడింది. ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా చెల్లించకపోవడం, డీఎస్సీలో అవకతకవలపై యువతలో ఆందోళన నెలకొంది. ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో చెల్లిస్తే.. విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పదే పదే కోరుతున్నారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలి. సంబంధిత శాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేసి చిత్తశుధ్ధి నిరూపించుకోవాలి. – కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో డీఎస్సీ నియామక ప్రక్రియపై తీవ్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లక్షలాది మంది నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. డీఎస్సీ నిర్వహణపై వచ్చిన ప్రతి ఆరోపణలపైనా సీబీఐతో విచారణ చేయించాలి. టీచర్ పోస్టుల కోసం బేరసారాలు జరిగాయనే వీడియోలు బయటకు వచ్చినా, ఫిర్యాదులు ఉన్నా.. అసలు సూత్రధారులను ఎందుకు బయటకు తీసుకురాలేదు. ప్రభుత్వం తప్పు చేయలేదనే నమ్మకం ఉంటే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశించాలి. – మెట్టు గోవిందరెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయకర్త, రాయదుర్గం నీట్ యూజీ పేపర్ లీకేజీ స్కాంను తలదన్నేలా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని లక్షలాది మంది అభ్యర్థులు వాపోతున్నారు. ప్రతి తప్పిదానికీ రుజువులు ఉన్నా ఈ ప్రభుత్వం ఎందుకు సీబీఐ విచారణ చేపట్టదు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎందుకు బాధ్యత వహించరు? – బోరెడ్డి నరేష్కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంట్ పరిశీలకులు లక్షలాది మంది యువతకు దగా ‘నీట్’ను తలదన్నేలా డీఎస్సీ స్కాం డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాల్సిందే ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి చెల్లించాలి నిరసన ర్యాలీలో యువత, విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థుల డిమాండ్ -
అవన్నీ అక్రమ నిర్మాణాలే
రాప్తాడు రూరల్: అనంతపురం రూరల్ మండలం మన్నీల గ్రామం సర్వే నంబరు 26లోని ప్రభుత్వ భూమిలో కుంటను పూడ్చి.. అక్కడ నిర్మించిన భవనం, వేసిన ఫెన్సింగ్ అన్నీ అనుమతి లేనివేనని తేలింది. దీంతో అక్రమ నిర్మాణాలు చేపట్టిన సదరు సంస్థకు తహసీల్దారు ఉదయ్భాస్కర్ నోటీసు జారీ చేశారు. వాస్తవానికి సర్వే నంబరు 28లో సదరు సంస్థ మైనింగ్కు అనుమతులు పొందింది. అయితే పక్కనే ఉన్న 26 సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. అక్కడ వర్షపు నీటికుంట ఉండేది. కొండపై నుంచి వచ్చే వర్షపునీరు కుంటలో చేరుతుండడంతో భూగర్భ జలాలు పెరిగేవి. పశువులు, మేకలు, గొర్రెలకు తాగునీటి వనరుగా ఉపయోగపడేది. ఇలాంటి కుంటను పూడ్చేశారు. దీంతో వర్షపు నీరంతా చుట్టుపక్కల పొలాల్లోకి చేరి నిల్వ ఉంటూ పంటలు దెబ్బతింటున్నాయి. దీనికితోడు కుంట కనుమరుగు కావడంతో భూగర్భజలాలు అడుగంటి బోర్లు ఎండిపోతున్నాయి. కంకర ఫ్యాక్టరీ నుంచి వస్తున్న వేస్ట్మట్టి తీసుకొచ్చి 26 సర్వే నంబరు భూమిలో డంప్ చేస్తున్నారు. రైతుల గోడుపై ‘సాక్షి’లో ఇటీవల ‘కుంటను మింగేశారు’ శీర్షికతో ప్రత్యేక కథనం వెలువడింది. ఈ కథనంపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్పందించి విచారణకు ఆదేశించారు. మరోవైపు స్థానిక రైతులు తరచూ అధికారులను కలిసి ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో వీఆర్ఓ, గ్రామ సర్వేయర్ విచారణ చేపట్టగా సర్వే నంబర్–26లోని 3.41 ఎకరాల ప్రభుత్వ భూమిలో సుమారు 0.03 సెంట్ల విస్తీర్ణంలో కార్యాలయ భవనం నిర్మించడంతో పాటు తాత్కాలిక ఇనుప ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు, ఇందుకు సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేదా లీజు పొందలేదని తేలింది. ఈ నేపథ్యంలో సంస్థ యాజమాన్యానికి తహసీల్దార్ ఉదయ్ భాస్కర్ మంగళవారం నోటీసు జారీ చేశారు. మూడు రోజుల్లోగా కార్యాలయ భవనం, ఫెన్సింగ్ తొలగించాలని ఆదేశించారు. కుంట పూడ్చివేతపై కదిలిన రెవెన్యూ యంత్రాంగం మూడు రోజుల్లో భవనం, ఫెన్సింగ్ తొలగించాలంటూ సంస్థకు నోటీసు -
ప్రైవేటు బండికి.. ప్రభుత్వ డీజిల్!
● కూడేరు సీఐ రాజు నిర్వాకం అనంతపురం సెంట్రల్: కూడేరు సీఐ రాజు వ్యవహార శైలి పోలీసుశాఖలో చర్చనీయాశంగా మారుతోంది. ప్రభుత్వ వాహనాన్ని మూలనపడేసి.. సొంత కారులో తిరుగుతూ ప్రభుత్వం నుంచి నెలనెలా డీజిల్ డ్రా చేస్తున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే... పోలీసుశాఖలో ఎస్ఐల దగ్గర నుంచి సీఐలు, డీఎస్పీలు, పైస్థాయి అధికారులతో పాటు బందోబస్తుకు వినియోగించే వాహనాలకు ఏఆర్లోని మోటార్ ట్రాన్స్పోర్టు విభాగం నుంచి డీజిల్ మంజూరు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 పైచిలుకు వాహనాలున్నట్లు సమాచారం. వాటన్నింటికీ కోర్టురోడ్డులోని పోలీసు పెట్రోల్ బంకు నుంచే డీజిల్ పంపిణీ జరుగుతోంది. నెలకు సీఐకు 120 లీటర్లు, ఎస్ఐలకు 100 లీటర్లు చొప్పున మంజూరు చేస్తారు. అయితే గత కొన్ని నెలలుగా కూడేరు సీఐ వాహనం మూలనకు పడేశారు. అంతకుముందు ఉన్న సీఐలందరూ అదే వాహనంలో విధులు నిర్వర్తించారు. ఆ సారు మాత్రం అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న టాటా సుమో వాహనాన్ని ఏఆర్ హెడ్క్వార్టర్కు చేర్చారు. ఏ కారణం చేతైనా ప్రభుత్వ వాహనం వినియోగించకపోతే సదరు పోలీసు అధికారి ఎస్పీ అనుమతి తీసుకొని ప్రైవేటు వాహనాలను వినియోగించాలి. అది కూడా రోజుల వ్యవధి మాత్రమే. కానీ నిబందనలకు విరుద్ధంగా సదరు సీఐ దాదాపు ఏడాది కాలంగా తన సొంత కారులోనే ప్రయాణిస్తున్నారు. అందుకు సంబంధించి డీజిల్ మాత్రం నెలానెలా ప్రభుత్వ కారు నంబర్పైనే తీసుకుంటున్నట్లు సమాచారం. మా దృష్టికి రాలేదు సీఐ రాజు వాడుతున్న వాహనం మరమ్మతులకు వచ్చిన విషయం మా దృష్టికి రాలేదు. నిబంధనల ప్రకారం ప్రైవేటు వాహనానికి డీజిల్ ఇవ్వ కూడదు. ఎస్పీ నుంచి అనుమతి తీసుకున్న వాహనానికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అసలు ఆ వాహనం ఎందుకు మూలన పెట్టారు. డీజిల్ వినియోగం ఎలా చేస్తున్నారనే విషయం తెలుసుకుంటాను. – ఇలియాజ్ బాషా, అదనపు ఎస్పీ, ఏఆర్ -
రేపు సాగునీటి సాధన పాదయాత్ర
కనగానపల్లి: రాయలసీమకు దక్కాల్సిన సాగు, తాగునీటి హక్కుల కోసం గురువారం పాదయాత్ర చేపట్టనున్నట్లు వైఎస్సార్సీపీ రాప్తాడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి తెలిపారు. మంగళవారం తోపుదుర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ నీటి హక్కుల సాధన కోసం చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల సమీపంలోని హంద్రీ–నీవా కాలువపై 34వ కి.మీ రాయి వద్ద నుంచి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించనున్నట్లు చెప్పారు. జిల్లాలోని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేలు, సమన్వకర్తలు, నాయకులు హాజరవుతారన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఆయకట్టుకు నీరివ్వలేంకణేకల్లు/ ఉరవకొండ: ఎల్–నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నందున ఈసారి తుంగభద్ర నుంచి హెచ్చెల్సీ ద్వారా వచ్చే నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఈసారి ఆయకట్టు పరిధిలోని భూములకు నీరివ్వలేమని స్పష్టం చేశారు. మంగళవారం కణేకల్లులోని చెరువు, ఉరవకొండ మండలం నింబగల్లు ఎస్ఎస్ ట్యాంకులు, విడపనకల్లులోని ఆర్డబ్ల్యూఎస్ కింద జరుగుతున్న పనులను అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. టీబీ డ్యామ్లో నీటి పరిస్థితి ఆశాజనకంగా లేదన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా తాగునీటి అవసరాల కోసం ఆగస్టులో హెచ్చెల్సీ ద్వారా నీటిని తీసుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారు. హెచ్చెల్సీ ఆయకట్టు పరిధిలో వరిసాగుకు నీరివ్వడం చాలా కష్టమని స్పష్టం చేశారు. రైతులెవ్వరూ వరిసాగు చేయ వద్దన్నారు. హెచ్చెల్సీలో జలచౌర్యం కట్టడికి టాస్క్ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రత్యామ్నాయ సాగు పెంపుపై దృష్టి అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్ సాగు విస్తీర్ణం కనీవినీ ఎరుగని విధంగా పతనం కావడంతో ప్రత్యామ్నాయ పంటల సాగు పెంపు కోసం వ్యవసాయశాఖ తాజాగా ప్రణాళిక తయారు చేసింది. 40,435 క్వింటాళ్లతో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో అత్యధికంగా 21,226 క్వింటాళ్ల ఉలవలు, 8,353 క్వింటాళ్ల పెసలు, 8,001 క్వింటాళ్ల అలసందలు, 2,335 క్వింటాళ్ల జొన్నలు, 524 క్వింటాళ్ల కొర్రలు అవసరమని నివేదించారు. ఇంతకుమునుపు కందులు, ఆముదం, ఉలవ, పెసర, అలసంద, జొన్న, కొర్ర తదితర ఏడు రకాల విత్తనాలు 24,168 క్వింటాళ్లు అవసరమని నివేదించిన విషయం తెలిసిందే. అయితే వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుతున్నందున విస్తీర్ణం అంచనాలు తారుమారు కావడంతో ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణం పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒకట్రెండు రోజుల్లోనే అనుమతులు రావచ్చని తెలుస్తోంది. తోపుదుర్తి ప్రకాష్రెడ్డి -
రైతు సమస్యలపై మరీ ఇంత అలసత్వమా?
● పెట్రోల్ బాటిళ్లతో బ్యాంక్ మేనేజర్ ఎదుట రైతుల బైఠాయింపు బ్రహ్మసముద్రం: రైతు సమస్యలపై అలసత్వం తగదని పలువురు మండిపడ్డారు. మండలంలోని వేపులపర్తి యూనియన్ బ్యాంక్లో పంట రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో వడ్డీ చెల్లించినా రెన్యూవల్ చేయలేదంటూ మంగళవారం బ్యాంక్ ఎదుట ఆందోళన చేపట్టారు. న్యాయం చేయకుంటే పెట్రోల్ పోసుకుంటామని రైతులు హెచ్చరించారు. వీరికి వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ కార్మిక సంఘం అధ్యక్షుడు తలారి సంజీవయ్య మద్దతుగా నిలిచారు. కాయకష్టం చేసుకునే రైతులను వేధించడం తగదన్నారు. రూ.3 లక్షలకు ఏడాది వడ్డీ రూ.21 వేలే అయినా రూ. 31 వేలు కట్టించుకుని రైతులను మోసం చేస్తున్నారన్నారు. మేనేజర్ శ్రీను మాట్లాడుతూ బ్యాంక్లో ఇంతకు ముందు పనిచేసిన సిబ్బంది తప్పిదంతో ఇలా జరిగిందని రైతులకు తెలియజేశారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లి బాధిత రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మాజీ మండల కన్వీనర్ కేపీ బసవరాజు, నాయకులు పడమటి కోడిపల్లి మోహన్, గౌడప్ప, చంద్ర, గొల్లబసవరాజు, నాగరాజు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
భద్రతా నియమాలు పాటించాలి
● డీఆర్ఎం సీఎస్ గుప్తా గుంతకల్లు: ప్రతి ఉద్యోగి భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా పేర్కొన్నారు. డివిజన్ పరిధిలో ప్రమాదాల నివారణకు కృషి చేసిన ఆరుగురు ఉద్యోగులకు మ్యాన్ ఆఫ్ మంత్ అవార్డులు అందజేశారు. గుంతకల్లు స్టేషన్కు చెందిన ట్రైనీ మేనేజర్ వై.శివ, పుల్లంపేటలో పాయింట్స్మెన్గా పని చేస్తున్న గౌరవ్ శర్మ, ఆదోని సెక్షన్లో టీఆర్డీ విభాగంలో జూనియర్ ఇంజినీర్ డీ.శ్రీహరి, గుంతకల్లు సెక్షన్లో కీమ్యాన్గా పని చేస్తున్న బీ.లీలాధర్తోపాటు తిరుపతికి చెందిన లోకోపైలట్ ఓఏవీ రమణ, అసిస్టెంట్ లోకోపైలట్ విక్కీకుమార్ రామ్లకు మంగళవారం డీఆర్ఎం కార్యాలయంలోని తుంగభద్ర చాంబర్లో అవార్డులను డీఆర్ఎం అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్ఎం శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కుమారుడి లేని లోకంలో ఉండలేనని తండ్రి ఆత్మహత్యశెట్టూరు: కుమారుడి మృతితో తీవ్ర మనస్తాపం చెందిన ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శెట్టూరు మండలంలోని చిన్నంపల్లిలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన గొల్ల సీగన్న (57), గొల్ల రామలక్ష్మిల ఒక్కగానొక్క కుమారుడు గొల్ల వీరేష్ (24) నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. అప్పటి నుంచి తండ్రి సీగన్న నిత్యం ఆవేదన చెందుతుండేవాడు. కుమారుడు లేని లోకంలో ఎందుకు బతకాలంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో బాధపడేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని భార్య రామలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ఆసుపత్రికి పంపారు. ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్టు గుత్తి/గుత్తిరూరల్: గుత్తి పోలీసులు మంగళవారం ఇద్దరు గంజాయి విక్రేతలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1,130 గ్రాముల గంజాయి, ఆరు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం స్థానిక పోలీసు స్టేషన్లో సీఐ రామారావు, ఎస్ఐ సురేష్లు వివరాలు వెల్లడించారు. గుత్తికి చెందిన సాయి రాం, కొత్త ఊబిచెర్లకు చెందిన బోయ ఓబయ్యలు గుంతకల్లుకు చెందిన అంజి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి గుత్తి, పరిసర ప్రాంతాల్లో విక్రయించేవారు. రాబడిన సమాచారం మేరకు పోలీసులు కాపు కాచి ఇద్దరినీ అరెస్టు చేశారు. ఓబయ్య ఇంటి పక్కన గంజాయిని సాగు చేస్తున్నట్లు గుర్తించి, ఆరు మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా, ఎక్కడైనా గంజాయి సేవిస్తున్నా, విక్రయిస్తున్నా, సరఫరా చేస్తున్నా తమకు సమాచారం ఇవ్వాలని, అలాంటి వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్ఐ రామాంజనేయ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ హనుమంతు, సిబ్బంది పాల్గొన్నారు. బైకు అదుపుతప్పి యువకుడి దుర్మరణం గార్లదిన్నె: బైకు అదుపుతప్పి యువకుడు దుర్మరణం పాలైన ఘటన మండల పరిధిలోని తిమ్మంపేట వద్ద జరిగింది. ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపిన మేరకు.. పామిడి మండలంలోని అప్పాజిపేటకు చెందిన చంద్రశేఖర్ (30) ఓ మార్కెటింగ్ సంస్థలో పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి పామిడికి చెందిన సంజయ్ కుమార్తో కలిసి స్కూటీలో అనంతపురం నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. తిమ్మంపేట వద్ద స్కూటీ అదుపు తప్పి డివైడర్ను ఢీకొంది. దీంతో తీవ్రగాయాలైన చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్ప గాయాలైన సంజయ్కుమార్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు చంద్రశేఖర్కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు. -
శాసీ్త్రయ పద్ధతులతో అధిక దిగుబడులు
● నిమ్మ రైతులకు శాస్త్రవేత్తల సూచన గుత్తి రూరల్: రైతులు నిమ్మ పంట సాగులో శాసీ్త్రయ పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చని ఉద్యాన శాస్త్రవేత్తలు డాక్టర్ కేసీ.భానుమూర్తి, డాక్టర్ ఎం.సునీల్కుమార్, డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ సహాయ సంచాలకుడు బీసీ ధనుంజయలు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని కొత్తపేట గ్రామంలోని హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో సీఈఓ నారాయణస్వామి ఆధ్వర్యంలో ఎల్నినో పరిస్థితులలో నిమ్మ తోటల నిర్వహణ, వ్యాధుల నివారణతో పాటు పునర్ వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ నిమ్మ పంటల్లో వేరుకుళ్లు, ఆకుమచ్చలు, కాండం సంబంధిత వ్యాధులు, పోషక లోపాలను రైతులు గుర్తిస్తూ ఉండాలన్నారు. వాటి నివారణకు జీవ ఎరువులు, జీవ నియంత్రణ పద్ధతులు, తోటల ఆరోగ్య నిర్వహణ, వాతావరణ మార్పులకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలను వివరించారు. అనంతరం ఆర్డబ్ల్యూబీసీఐఎస్ పథకం గురించి అవగాహన కల్పించారు. వాతావరణ మార్పుల వలన కలిగే పంట నష్టాల నుంచి రైతులకు ఆర్థిక రక్షణ కల్పించే ఈ పథకం అర్హత, నమోదు విధానం, ప్రయోజనాలు, బీమా పొందే ప్రక్రియను వివరించారు. రైతుల సందేహాలను శాస్త్రవేత్తలు, నిపుణులు నివృత్తి చేశారు. కార్యక్రమంలో వీఎహెచ్ఏలు మారుతీనాయక్, భాస్కర్, సురేంద్రబాబు, ఇన్సూరెన్సు మేనేజర్ ఎం.నారాయణస్వామి, ‘హ్యాండ్స్’ వ్యవస్థాపకుడు రామకృష్ణ, జిల్లా మేనేజర్ భాగ్య, పీఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
చెరువుల్లో పశుగ్రాసం పెంపకానికి ప్రణాళిక
అనంతపురం అగ్రికల్చర్: ఎల్–నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొన్నందున పశు, జీవసంపదకు గడ్డి కొరత ఏర్పడకుండా పశుసంవర్ధక శాఖ అధికారులు చెరువుల్లో పశుగ్రాసం పెంపకానికి ప్రణాళికలు తయారు చేస్తున్నారు. తొలివిడతగా రెండు చెరువులను ఎంపిక చేశారు. బుక్కరాయసముద్రం చెదళ్ల, గుంతకల్లు మండలం వైటీ చెరువు కింద 25 ఎకరాల చొప్పున 50 ఎకరాల్లో సాగు చేయడానికి చర్యలు చేపట్టినట్టు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. స్థానిక రైతుల ద్వారా జొన్న విత్తనాలు చల్లించడానికి విత్తనాలు సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది ద్వారా మరికొన్ని చెరువులను ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ‘తల్లికి వందనం’ ఎందుకు అందలేదు?’పామిడి: మండలంలో ఇద్దరు విద్యార్థులకు అర్హత ఉన్నా ‘తల్లికి వందనం’ పథకం వర్తించక పోవడంపై అధికారులు స్పందించారు. కలెక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు పామిడి డిప్యూటీ ఎంపీడీఓ రంగనాయకులు మంగళవారం దేవరపల్లికి వెళ్లి విద్యార్థులు నక్కా అభిరామ్, నక్కా హర్షల తండ్రి నక్కా ఓబులేసుతో మాట్లాడారు. విద్యార్థుల తల్లి కీర్తి చనిపోవడంతో ‘తల్లికి వందనం’ డబ్బు జమ కాలేదని తెలుసుకున్నారు. అనంతరం ఎంఈఓ జయానాయక్తో ఫోన్లో మాట్లాడారు. ఓబులేసుతో కలిసి సచివాలయానికి వెళ్లి సిబ్బందితో సమస్యపై ఆరా తీశారు. విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తానని డిప్యూటీ ఎంపీడీఓ తెలిపారు. -
సమష్టి కృషితోనే ఎస్కేయూకు పూర్వ వైభవం
● వీసీ జ్యోతికుమార్ అనంతపురం: బోధన, బోధనేతర ఉద్యోగుల సమష్టి కృషితోనే శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం సాధ్యమని వీసీ ప్రొఫెసర్ ఎన్వీఆర్ జ్యోతి కుమార్ పేర్కొన్నారు. ఎస్కేయూ 45వ ఆవిర్భావ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీసీతో పాటు ప్రముఖ తెలుగు పండితుడు, తెలుగు మాజీ ప్రొఫెసర్ శలాక రఘునాథ శర్మ, గౌరవ అతిథులుగా ద్రావిడ వర్సిటీ వీసీ ప్రొఫెసర్ చిన్న మల్లయ్య లక్కినేని, జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ జ్యోతి కుమార్ మాట్లాడుతూ 45 సంవత్సరాల క్రితం నాటిన చిన్న విత్తనం నేడు మహావృక్షంగా ఎదిగిందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో నాణ్యమైన విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలతో భాగస్వామ్యం పెంపొందిస్తామన్నారు. త్వరలో స్నాతకోత్సవం నిర్వహిస్తామన్నారు. అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఇద్దరు గ్రామీణ ఆవిష్కర్తలు నీతి ఆయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ప్రకటించిన దేశంలోని 26 మంది గ్రాస్రూట్ ఇన్నోవేటర్ల జాబితాలో చోటు దక్కించుకోవడం గర్వకారణమన్నారు. వీరిని జూలై 31న రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి సత్కరించనున్నట్లు తెలిపారు. ప్రొఫెసర్ శలాక రఘునాథ శర్మ మాట్లాడుతూ రాయలసీమలో ఉన్నత విద్యా వికాసానికి ఎస్కేయూ అపూర్వ సేవలు అందించిందన్నారు. ద్రావిడ విశ్వవిద్యాలయం వీసీ, ఎస్కేయూ పూర్వ విద్యార్థి ప్రొఫెసర్ చిన్న మల్లయ్య లక్కినేని మాట్లాడుతూ, విశ్వవిద్యాలయంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ చదువుకున్న వేలాది మంది దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని, పూర్వ విద్యార్థులంతా విశ్వవిద్యాలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ హెచ్. సుదర్శనరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు నైపుణ్యాధారిత విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, పరిశ్రమలతో అనుసంధానంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.కార్యక్రమంలో రెక్టార్ అనిత, రిజిస్ట్రార్ రమేష్ బాబు, ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కళాశాల ప్రిన్సిపాల్ అంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ఉరవకొండలో టీడీపీకి బీజేపీ బినామీనా?
● వైఎస్సార్సీపీ రాయలసీమ జోనల్ అధికార ప్రతినిధి కేవీ రమణఅనంతపురం సిటీ: ఉరవకొండ నియోజకవర్గంలో పసుపు రంగు మాటున కాషాయం కనుమరుగవుతోందని వైఎస్సార్సీపీ రాయలసీమ జోనల్ అధికార ప్రతినిధి కేఈ రమణ విమర్శించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలను నిరసిస్తూ ఈ నెల 31న అక్కడి తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ ధర్నాకు పిలుపునిస్తే కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఓ శిఖండిలా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ను మంత్రి పయ్యావుల కేశవ్ వాడుకుంటూ చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు నిదర్శమని పేర్కొన్నారు. జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ జాతీయ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉంటున్న కడదరకుంట రాజేష్కు తన ఇంటి ముందే జరుగుతున్న హంద్రీ–నీవా కాలువ పనుల్లో అక్రమాలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. తన సొంత మండలంలోని ముద్దలాపురం, ఇప్పేరు చెరువులకు నీరు అందకుండా పయ్యావుల అడ్డు వేస్తే కనీసంగానూ ప్రశ్నించలేకపోతున్నాడని విమర్శించారు. విడపనకల్లు మండలం వేల్పుమడుగు సర్వేనంబర్ 141లో 21.50 ఎకరాల భూమి కురుబ గోవిందు కొనుగోలు చేశాడని, అయితే ఈ భూమి దేవదాయ శాఖకు చెందినదిగా పెడదోవ పట్టించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. సాక్షాత్తూ కలెక్టరే ఎండార్స్ ఇచ్చినా ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, భూమిలోకి పయ్యావుల అనుచరులైన జనార్దనపల్లికి చెందిన సుధాకర్నాయుడు, పాండురంగనాయుడు, మాజీ సర్పంచ్ రాయంకి జనార్దన నాయుడు దౌర్జన్యంగా ప్రవేశించి బోర్లు ధ్వంసం చేయడం, పైపులు ఎత్తుకెళ్లడం, భారీ వృక్షాలను నరికి విక్రయించుకోవడంపై రాజేష్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. వైఎస్సార్సీపీ మహాధర్నాకు విరుద్ధంగా ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటే ఆయనకు టీడీపీ ద్వారా ఎంత లెక్క ముట్టిందో చెప్పాలన్నారు. సమావేశంలో సీనియర్ న్యాయవాది హరినాథరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు కురుబ దేవేంద్ర, కురుబ రామచంద్ర, కురుబ గోవిందు, కురుబ సురేష్, బెస్త తిరుపాల్ పాల్గొన్నారు. -
శ్రీరామ్ ఫైనాన్స్ ఉద్యోగులపై చీటింగ్ కేసు
గుంతకల్లుటౌన్: పట్టణంలోని శ్రీరామ్ ఫైనాన్స్ ఉద్యోగులపై చీటింగ్ కేసు నమోదైంది. వన్టౌన్ సీఐ మనోహర్ తెలిపిన మేరకు.. గుంతకల్లు తిలక్నగర్కు చెందిన సుంకన్న ఎఫ్సీఐ గోడౌన్ వద్ద ఉన్న తన 144 గజాల స్థలాన్ని స్థానిక శ్రీరామ్ ఫైనాన్స్లో 2024 మార్చి 10న తాకట్టు పెట్టి రూ.15 లక్షల రుణం పొందాడు. 10 నెలల పాటు కంపెనీ నిర్ణయించిన మేర ఈఎంఐలు చెల్లించాడు. వడ్డీలు అధికంగా విధిస్తున్నారని భావించిన సుంకన్న తన వద్దనున్న రూ.8 లక్షలను అదే ఏడాది డిసెంబర్ 10న చెల్లించి ముందస్తుగానే రుణాన్ని పూర్తి చేయడానికి వెళ్లాడు. ఈ క్రమంలోనే మేనేజర్ నరసింహులు, ఉద్యోగి ప్రభాకర్లు రూ.8 లక్షలను వారి సన్నిహితుడైన రాయలచెరువు వెంకటరావు బ్యాంకు ఖాతాలో జమ చేయించారు. రెండు నెలల తరువాత ఫైనాన్స్ కార్యాలయానికి వెళ్లి తాను తాకట్టు పెట్టిన పత్రాలు తిరిగి ఇవ్వాలని సుంకన్న కోరగా డొంకతిరుగుడు సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలో సోమవారం సుంకన్న దంపతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేనేజర్ నరసింహులు, ఉద్యోగి ప్రభాకర్, రాయలచెరువు వెంకటరావుపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. ‘ఐఫియా’ జాతీయ కమిటీలో జిల్లావాసులకు చోటుఅనంతపురం ఎడ్యుకేషన్: అఖిల భారత విద్యా ఉద్యోగుల సమాఖ్య (ఐఫియా) జాతీయ కమిటీలో అనంతపురం జిల్లాకు ప్రాధాన్యత లభించింది. ఉపాధ్యాయ నాయకులు కె. వెంకటరెడ్డి జాతీయ ఉపాధ్యక్షుడిగా, కేహెచ్వీ సత్యప్రసాద్ జాతీయ శాశ్వత సభ్యుడిగా ఎన్నికయ్యారు. వీరి ఎన్నికపై ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (1938) జిల్లా శాఖ హర్షం వ్యక్తం చేసింది. ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణతో పాటు ప్రభుత్వ విద్యాభివృద్ధి కోసం వారు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగానే ఈ కీలక బాధ్యతలు అప్పజెప్పారని జిల్లా శాఖ పేర్కొంది. జాతీయ స్థాయిలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి వారు మరింత సమర్థవంతంగా కృషి చేస్తారని ఆకాంక్షించింది. -
జీజీహెచ్లో మహిళల బాహాబాహీ
అనంతపురం సిటీ: రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సొంత ఇలాకాలో ప్రభుత్వ వైద్య సేవలు నానాటికీ దిగజారిపోతున్నాయి. వీల్చైర్లు, స్ట్రెచ్చర్లు సైతం అందుబాటులో లేక సోమవారం రోగుల సంబంధీకుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం చోటు చేసుకుంది. వివరాలు.. తీవ్ర అస్వస్థతకు గురైన ఇద్దరు రోగులను వారి కుటుంబసభ్యులు సోమవారం జీజీహెచ్కు తీసుకువచ్చారు. ఆ సమయంలో వీల్చైర్లు, స్ట్రెచ్చర్లు అందు బాటులో లేకుండా పోయాయి. దీంతో ఎమర్జెన్సీ వార్డులోకి రోగిని చేర్చే క్రమంలో ఓ కుటుంబం అక్కడున్న వీల్ చైర్ను తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అదే సమయంలో అక్కడకు చేరుకున్న మరో రోగి కుటుంబసభ్యులు వీల్చైర్ను తాము ముందే తీసుకున్నామంటూ వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కానీ, వైద్య సిబ్బంది కానీ పట్టించుకోక పోవడంతో వివాదం తారాస్థాయికి చేరుకుంది. ఇరువైపులా మహిళలు ఒకరినొకరు తోసుకుంటూ కిందామీద పడ్డారు. చివరకు ఔట్ పోస్టు పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. వేడుకున్నా కనికరించని వైనం మహిళలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్న కాసేపటి తర్వాత ఎమర్జెన్సీ వైద్య సిబ్బంది లెక్కలేని తనానికి అద్దం పట్టే మరో ఘటన అక్కడున్న వారిని కలిచివేసింది. రెండు కాళ్లూ విరిగి పూర్తిగా నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తిని తరలించేందుకు వీల్చైర్ కాని, స్ట్రెచ్చర్ కాని సమకూర్చడంలో వైద్య సిబ్బంది పూర్తి నిర్లక్ష్యం కనబరిచారు. గంటల తరబడి వేచి ఉన్నా ఫలితం లేకపోవడంతో చివరకు కుటుంబసభ్యులు తమ భుజాల సాయంతో రోగిని ఎమర్జెన్సీ వార్డు నుంచి నడిపించుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. స్పందించని యాజమాన్యం సాధారణంగా ఎమర్జెన్సీ వార్డుకు వచ్చే రోగులు పూర్తి అసహాయ స్థితిలో ఉంటారు. వీరిని వార్డులోకి తరలించాలంటే వీల్చైర్, స్ట్రెచ్చర్లు తప్పనిసరిగా ఉండాలి. అయితే ఎమర్జెన్సీ వార్డులో భూతద్దం పెట్టి వెదికినా వీల్చైర్, స్ట్రెచ్చర్ కనిపించవు. దీంతో రోగులను వార్డులోకి కుటుంబసభ్యులు మోసుకెళ్లాల్సి వస్తోంది. వార్డులో ఉన్న వీల్చైర్లు, స్ట్రెచ్చర్లను ఖాళీ డబ్బాలు తరలించడానికి, ఇతర బయో మెడికల్ వ్యర్థాలను తరలించేందుకు వార్డుబాయ్లు తీసుకెళుతుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వాస్తవానికి ఆక్సిజన్ సిలిండర్లు, స్టోర్ రూమ్ నుంచి మందులను వార్డులోకి తరలించాలంటే వీల్చైర్లు, స్ట్రెచ్చర్లు కాకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉండగా ఆ దిశగా యాజమాన్యం కనీస ఆలోచన కూడా చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మేడమ్ గారు బిజీగా ఉన్నారు జీజీహెచ్ ఎమర్జెన్సీ వార్డు వద్ద సోమవారం చోటు చేసుకున్న రెండు ఘటనలపై సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరిని వివరణ కోరేందుకు ‘సాక్షి’ పయత్నించగా, ఆమె చాంబర్ ఎదుట ఉన్న సిబ్బంది నిరాకరించారు. ‘మేడమ్ గారు బిజీగా ఉన్నారు. మీరు మళ్లీ రండి’ అంటూ బుకాయించారు. మేడమ్ను ఎందుకు కలవాలనుకుంటున్నారో ముందుగా తమకు తెలపాలని, లేకపోతే లోపలికి అనుమతించేది లేదంటూ స్పష్టం చేశారు. -
విద్యార్థులకు సర్దు‘పోటు’
అనంతపురం ఎడ్యుకేషన్: ఉన్న ఉపాధ్యాయులను సర్దుబాటు పేరుతో ఇతర పాఠశాలలకు పంపించడంతో పలు సబ్జెక్టులకు బోధన పూర్తిగా దెబ్బతిని విద్యార్థుల చదువు ప్రశ్నార్థకంగా మారింది. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో హిందీ, గణితం వంటి కీలక సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఎఫ్ఏ–1 పరీక్షలు సమీపిస్తున్నా ప్రభుత్వం ఇప్పటికీ అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించకపోవడంతో చదువులకు తీవ్ర విఘాతం ఏర్ప డింది. ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు టీసీలు తీసుకుని ఇతర పాఠశాలలకు వెళ్లే పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆగస్టు 3 నుంచి ఎఫ్ఏ–1 పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 1,090 మంది విద్యార్థినులు.. 26 మంది టీచర్లు శారదా బాలికల నగరపాలక ఉన్నత పాఠశాలలో మొత్తం 35 టీచరు పోస్టులు ఉండగా ప్రస్తుతం 26 మంది విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాలలో 1,090 మంది విద్యార్థినులు చదువుతున్నారు. హిందీ బోధించేందుకు ఒక్క ఉపాధ్యాయురాలు మాత్రమే ఉండగా, గణితంలో ఆరు పోస్టులకు ఇద్దరే పని చేస్తున్నారు. దీంతో 9వ, 10వ తరగతుల్లో రెండు సెక్షన్లను కలిపి 120 మంది విద్యార్థినులకు ఒకేసారి పాఠాలు బోధించాల్సిన దుస్థితి నెలకొంది. ఫలితంగా విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ పూర్తిగా కరువైంది. హెచ్ఎం సొంత ఖర్చుతో బోధన 15వ వార్డు నగరపాలక ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది తొలిసారిగా పదో తరగతి ప్రారంభమైంది. సుమారు 40 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ హిందీ బోధించేందుకు ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేరు. విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకూడదన్న ఉద్దేశంతో ప్రధానోపాధ్యాయురాలు తన సొంత డబ్బుతో ప్రైవేట్ హిందీ ఉపాధ్యాయుడిని నియమించి బోధన కొనసాగించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇతర పాఠశాలల్లోనూ అంతే.. రాజేంద్ర నగరపాలక ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల నగరపాలక ఉన్నత పాఠశాలల్లో కూడా హిందీకి ఒక్కో ఉపాధ్యాయుడే ఉన్నారు. ఇతర సబ్జెక్టుల్లోనూ పోస్టులు ఖాళీగా ఉండటంతో బోధన అస్తవ్యస్తంగా సాగుతోంది. నగర పరిధిలోనే సుమారు 30 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భర్తీలు మాత్రం లేవు గత ఏడాది క్లస్టర్ విధానంలో సర్ప్లస్గా ఉన్న ఎస్జీటీలను ఉన్నత పాఠశాలలకు సర్దుబాటు చేసి 6, 7 తరగతులకు బోధన చేయించారు. అయితే తాజా సర్దుబాటులో ఉన్నత పాఠశాలల్లో ఎస్జీటీలు ఉండకూడదనే నిబంధనతో వారిని ఇతర పాఠశాలలకు పంపించారు. దీంతో సమస్య మరింత తీవ్రమైంది. ఖాళీలను భర్తీ చేసేందుకు అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమిస్తామని, జూన్ 30 నాటికి ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు రెండు నెలలు గడుస్తున్నా నియామకాలపై ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. మరోవైపు నగరపాలక పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు 30 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు పేరుతో ఇతర ప్రాంతాలకు పంపించడం వల్ల పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఎఫ్ఏ–1 పరీక్షలు ఎలా రాయాలి? ఆగస్టు 3 నుంచి ఎఫ్ఏ–1 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పరీక్షల టైమ్టేబుల్ విడుదలైంది. అయితే సబ్జెక్టు ఉపాధ్యాయులే లేకపోతే విద్యార్థులు పరీక్షలకు ఎలా సిద్ధమవుతారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా గణితం, హిందీ వంటి సబ్జెక్టుల్లో బోధన సక్రమంగా జరగకపోవడం విద్యార్థుల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే స్పందించి అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించడం ద్వారా విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు, హెచ్ఎంలు కోరుతున్నారు. టీచర్ల కొరతతో నగరపాలక పాఠశాలల్లో అటకెక్కిన చదువులు వందలాదిమంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడితో బోధన హిందీ, గణితంలో తీవ్ర కొరత ఎఫ్ఏ–1 పరీక్షల వేళ విద్యార్థుల ఆందోళన జాడలేని అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల భర్తీ -
అప్పులు అధికమై ఆత్మహత్య
కూడేరు: మండల పరిధిలోని జల్లిపల్లికి చెందిన అశోక్ కుమార్ రెడ్డి(40) అనే వ్యక్తి ఆదివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. మృతుడు ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పని చేసేవాడు. అలాగే పొలంలో పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య లక్ష్మీ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల కరెంట్ పనులు లేక, పంటలు సరిగా పండక అప్పులపాలయ్యాడు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారమైంది. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఉరేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించారు. మృతుని భార్య లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తండ్రి మందలించారని కుమారుడు.. యాడికి: మద్యానికి బానిసైన ఓ యువకుడు తండ్రి మందలించాడని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాడికి మండల కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. మండల కేంద్రంలోని చౌడేశ్వరీ కాలనీకి చెందిన బద్దల రామ్మోహన్, బద్దల కృష్ణమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు అజయ్కుమార్ (23) ఉన్నారు. ఇటీవల అజయ్ కుమార్ మద్యానికి బానిసయ్యాడు. తండ్రిని ఆదివారం రాత్రి కొంత డబ్బు ఇవ్వాలని అడిగాడు. ‘ఇంత కాలం నీవు ఏ పని చేయకున్నా మేమే నెట్టుకొస్తున్నామం’టూ తండ్రి కుమారుడిపై ఆగ్రహం చేయగా.. మనస్తాపానికి గురైన అజయ్కుమార్ గ్రామ సమీపంలోని వేపచెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. రామ్మోహన్ ఫిర్యాదు కేసు నమోదు చేశారు. అజయ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. -
ఛీత్కారాలు, అవమానాలు
● స్వేచ్ఛగా మా విధులు నిర్వహించలేం ● కలెక్టర్ సమక్షంలో నగరపాలక సంస్థ అధికారుల ఆవేదన అనంతపురం క్రైం: నగరపాలక సంస్థలో స్వేచ్ఛగా విధులు నిర్వర్తించలేని పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు మూకుమ్మడిగా కలెక్టర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అధికార టీడీపీకి చెందిన ముఖ్య ప్రజాప్రతినిధి నుంచి ఛీత్కారాలు, దూషణలు, అవమానాలతో విసిగిపోతున్నామని గత శనివారం జరిగిన ప్రత్యేక సమావేశంలో గోడు వెల్లబోసుకున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... నగరంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు ఎందుకు జరగడం లేదని కలెక్టర్ ఆనంద్ ప్రశ్నించగా.. నగరపాలక సంస్థ అధికారులు అసలు పరిస్థితులను వివరించారు. అభివృద్ధి పనుల టెండర్ల నుంచి భూమిపూజల వరకు అన్నింటా రాజకీయ జోక్యం పెరిగిందని చెప్పారు. అధికార పార్టీ, ప్రజాప్రతినిధి ఆదేశాలను కాదని ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. ఇటీవల ఓ సహాయ ఇంజినీర్ను ప్రజాప్రతినిధి తన ఇంటికి పిలిపించుకుని అతని సెల్ఫోన్లోని వాట్సాప్ గ్రూపులు, సందేశాలను పరిశీలించిన అనంతరం తీవ్ర పరుష పదజాలంతో దూషించారని, బెదిరింపులకు దిగారని ప్రస్తావించారు. అధికారుల సాదకబాధలు విన్న కలెక్టర్ ఏం చేయాలో తెలియక కొంతసేపు మౌనంగా ఉండిపోయినట్లు తెలిసింది. ఎలుగుబంట్ల దాడిలో రైతుకు గాయాలు కళ్యాణదుర్గం రూరల్: ఎలుగుబంట్ల దాడిలో ఓ రైతు గాయపడ్డాడు. కంబదూరు మండలం లక్ష్మీపురం తండాకు చెందిన కృష్ణానాయక్ సోమవారం ఉదయం తన పొలంలో పని చేస్తుండగా రెండు ఎలుగుబంట్లు దూసుకొచ్చి దాడి చేశాయి. కృష్టానాయక్ గట్టిగా కేకలు వేయడంతో ఎలుగుబంట్లు సమీపంలోని పొదల్లోకి వెళ్లిపోయాయి. గాయపడ్డ రైతును పక్క పొలంలో వారు గమనించి సీహెచ్సీకి తరలించారు. ఎలుగుబంట్ల నుంచి రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అదనపు ఎస్పీ మహబూబ్బాషా బదిలీ అనంతపురం సెంట్రల్: ఇటీవల అదనపు ఎస్పీగా పదోన్నతి పొందిన మహబూబ్బాషాను చిత్తూరు ఏఎస్పీ (అడ్మిన్)గా బదిలీ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం ఈయన మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీగా, అనంతపురం ఇన్చార్జ్ డీఎస్పీగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. బదిలీ నేపథ్యంలో త్వరలోనే రిలీవ్ కానున్నారు. అనంతపురం డీఎస్పీగా చంద్రశేఖర్ అనంతపురం డీఎస్పీగా మాగాల చంద్రశేఖర్ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడినట్లు పోలీసువర్గాలు తెలిపాయి. ఈయనది నగరంలోని సున్నపుగేరు ప్రాంతం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇక్కడ బాధ్యతలు స్వీకరిస్తారా లేదా అన్నది సందిగ్ధంగా మారింది. పదోన్నతులకు ఆమోదం అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) పాలకమండలి సమావేశం సోమవారం వీసీ ప్రొఫెసర్ జ్యోతికుమార్ అధ్యక్షతన నిర్వహించారు. అందుబాటులో ఉన్న పాలకమండలి సభ్యులు నేరుగా, ఎక్స్ అఫిషియో అధికారులు ఆన్లైన్లో హాజరయ్యారు. సమావేశంలో పలు అంశాలకు అమోదం తెలిపారు. ప్రొఫెసర్లకు సీనియర్ ప్రొఫెసర్లుగా, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించనున్నారు. కెరీర్ అడ్వాన్సెమెంట్ స్కీం (సీఏఎస్) కింద పదోన్నతికి ఇవ్వనున్నారు. యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్న మినిమం స్కేలు ఉద్యోగులకు నెలకు రూ.4 వేల జీతం పెంపుదలకు పాలకమండలి సమ్మతించింది. అకడమిక్ అసిస్టెంట్లు, టీచింగ్ అసిస్టెంట్లు, అడ్హాక్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అడ్హాక్ ప్రిన్సిపాల్స్ ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచాలనే నిర్ణయాన్ని పాలకమండలి తిరస్కరించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 60 సంవత్సరాలే పదవీ విరమణ అని స్పష్టం చేసింది. దూరవిద్య విభాగం నుంచి బీఈడీ కళాశాలకు బదలాయించిన అధ్యాపకులకు అనుమతి ఇవ్వలేదు. దీంతో తిరిగి దూరవిద్య విభాగంలోనే విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. గత వీసీ ప్రొఫెసర్ మాచిరెడ్డి రామకృష్ణారెడ్డి హయాంలో పరీక్షల విభాగం ఉద్యోగులు నేరుగా విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారనే కారణంతో సదరు ఉద్యోగులందరికీ ఒక ఇంక్రిమెంట్ కోత విధించారు. తాజాగా ఉద్యోగులకు ఇంక్రిమెంట్ కోత విధించకుండా ఇవ్వాలని పాలకమండలి ఆమోదం తెలిపింది. -
నేడు ఎస్కేయూ ఆవిర్భావ దినోత్సవం
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 45వ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం నిర్వహించనున్నారు. భువన విజయం ఆడిటోరియంలో జరిగే కార్యక్రమానికి ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ ఎన్వీఆర్ జ్యోతి కుమార్ ముఖ్య అతిథిగా, శలాక రఘునాథ శర్మ విశిష్ట అతిథిగా హాజరు కానున్నారు. ● విజయనగర రాజుల్లో గొప్పవాడైన శ్రీకృష్ణదేవరాయలు పేరున 1981 జులై 27న విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఎస్వీయూ అనుబంధంగా 1968లో పీజీ సెంటర్ను ఏర్పాటు చేశారు. 1976లో స్వయంప్రతిపత్తి హోదా లభించింది. 1981లో పూర్తిస్థాయి వర్సిటీగా రూపాంతరం చెందింది. ఎస్కేయూలో చదివిన పలువురు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారు. ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణా రావు, మాజీ డీజీపీ జేవీ రాముడు ఎస్కేయూలో పీజీ చదివారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ డీజీపీ బయ్యారపు ప్రసాద్ రావు ఫిజిక్స్ విభాగంలో పీహెచ్డీ పూర్తి చేశారు. మాజీ డీజీపీ అరవింద రావు ఇంగ్లిష్ విభాగంలో పీజీ చదివారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస రెడ్డి ఎస్కేయూలో ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఇలా ఎంతో మంది పూర్వ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారు. మిద్దైపె నుంచి పడి భవన నిర్మాణ కార్మికుడి మృతిరాయదుర్గంటౌన్: ఓ భవన నిర్మాణ కార్మికుడు ప్రమాదవశాత్తు మిద్దైపె నుంచి పడి మృతి చెందాడు. ఎస్ఐ సురేష్ తెలిపిన మేరకు.. పట్టణంలోని కణేకల్లు రోడ్డు ఎంఏసీ లేఅవుట్లో నివాసం ఉంటున్న జాకీర్ హుస్సేన్ (53) ఆదివారం స్థానిక నేసేపేటలో భవన నిర్మాణ పనికి వెళ్లాడు. సాయంత్రం మరో మిద్దైపె సామాన్లు ఉంచేందుకు ప్రయత్నిస్తుండగా, కాలు జారి కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బళ్లారికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే మృతి చెందాడు. సోమవారం ఉదయం మృతదేహానికి రాయదుర్గంలోని ఏరియా ఆస్పత్రిలో పోస్ట్మార్టం నిర్వహించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉంది. ట్రాక్టర్పై నుంచి పడి రైతు..కూడేరు: ట్రాక్టర్పై నుంచి పడి రైతు మృతి చెందిన ఘటన కూడేరు మండలం కొర్రకోడులో సోమవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన బోయ రామన్న (60) తన పశువులకు గ్రాసం కోసం వేరే రైతుతో వేరుశనగ పొట్టు కొనుగోలు చేశాడు. పొట్టును తన పొలంలోకి తరలించేందుకు ట్రాక్టర్ ట్రాలీలో కుప్ప పెడుతున్న క్రమంలో జారి కింద పడి మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ద్విచక్ర వాహన దొంగల అరెస్ట్అనంతపురం సెంట్రల్: కొన్నేళ్లుగా ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురిని త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు మైనర్లు ఉండడం గమనార్హం. వివరాలను సోమవారం త్రీటౌన్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ మహబూబ్బాషా వెల్లడించారు. అనంతపురం రూరల్ మండలం రాజీవ్కాలనీకి చెందిన కుమ్మర సుబాష్ ఆచారి, నగరంలో ప్రియాంక నగర్కు చెందిన గోవిందయోగేష్, మరో ఇద్దరు మైనర్లు కలిసి ద్విచక్రవాహనాల దొంగతనాలకు పాల్పడేవారు. చెడు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడి, అప్పులు తీర్చేందుకు దొంగతనాలను ఎంచుకున్నారు. నగరంలో బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలతో పాటు ధర్మవరం, కడప, కొండాపురం, ముద్దనూరు, మదనపల్లి తదితర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. ఇటీవల ద్విచక్రవాహనాల దొంగతనాలపై త్రీటౌన్ పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టడంతో గుత్తిరోడ్డు మార్కెట్యార్డు సమీపంలో నిందితులు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.17.50 లక్షల విలువజేసే 24 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అమ్మమ్మ ఊరికి వెళ్లి.. తిరిగి రాని లోకాలకుశాంతిపురం: అమ్మమ్మ ఊరికి వెళ్లిన ఓ బాలుడు తిరిగి రాని లోకాలకు చేరాడు. కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన సాత్విక్ (5) తన తల్లి దీపతో కలిసి కొన్ని రోజుల క్రితం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కడపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. సోమవారం ఇంటి అవసరాల కోసం రోడ్డు పక్కన ట్యాంకర్ నుంచి గ్రామస్తులు నీరు పడుతుండగా, తోటి చిన్నారులతో సరదాగా సాత్విక్ అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలోనే ఓ టెంపో వీరిపై దూసుకెళ్లింది. తీవ్ర గాయాలైన సాత్విక్ను కుప్పం ఏరియా ఆస్పత్రిఇకి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. టెంపో అంతకుముందు ఇద్దరిని ఢీకొనగా వారు కూడా మృతి చెందడం గమనార్హం. -
కర్షకలోకం.. కకావికలం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో కర్షకలోకం కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతోంది. చూస్తుండగానే మృగశిర, ఆరుద్ర, పునర్వసు లాంటి మంచి విత్తన కార్తెలు కరిగిపోయాయి. అదను దాటిపోతుందనే ఆందోళనతో అడపాదడపా కురిసిన అరకొర వర్షాలకే అరకొర తేమలోనే కొంతవరకు పంటలు సాగు చేశారు. నెలల పాటు వర్షాభావం, 15 నుంచి 20 కిలోమీటర్ల బలమైన గాలులుకు సాగు చేసిన పంటలు కూడా చేతికిరాకుండా పోతుండటంతో రైతు ఇంట ఆందోళన నెలకొంది. కూలిన ఖరీఫ్ ఆశలు.. ఎల్–నినో తీవ్రత, నైరుతి నిరాశల మధ్య అన్నదాత ఖరీఫ్ ఆశలు కళ్లముందే అడియాసలయ్యాయి. జూన్ 6న నైరుతి ప్రవేశించాక తొలుత రుతుపవనాలు కొంత ప్రభావం చూపడంతో మొదటి పక్షంలో మోస్తరుగా వర్షాలు కురిశాయి. పంటలు సాగు చేద్దామని పొలం బాట పట్టారు. జూన్ 15 తర్వాత రుతుపవనాలు మందగించి ఎల్–నినో ప్రభావం చూపడంతో వర్షం జాడ కరువైపోయింది. జూలై ఆఖరు వరకు ప్రధాన పంటల సాగుకు అనుకూలమని అధికారులు చెబుతున్నా.. దాదాపు ఆ గడువు కూడా ముగిసేదశకు చేరుకుంది. 3.43 లక్షల హెక్టార్లు అంచనా వేయగా ప్రస్తుతానికి 1.05 లక్షల హెక్టార్ల వద్ద ఆగిపోయింది. పంటల సాగు ఈ స్థాయిలో పతనం కావడం గత 50 ఏళ్ల జిల్లా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇటీవల అక్కడక్కడా కురిసిన తేలికపాటి వర్షాలకు కంది సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద 1.20 లక్షల హెక్టార్లకు కాస్త ఇటుగా విస్తీర్ణం రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఆగస్టు, సెప్టెంబర్లో ప్రత్యామ్నాయ పంటలే శరణ్యమని భావిస్తున్నా.. దాదాపు 2.30 లక్షల హెక్టార్లలో సాగులోకి రావడం ఆషామాషీ కాదు. దీంతో ఈ సారి వేలాది హెక్టార్లు క్రాప్ హాలిడే ప్రకటించినా ఆశ్యర్యపోనవసరం లేదు. 25 వేల క్వింటాళ్లతో ప్రత్యామ్నాయ విత్తన ప్రణాళిక.. వ్యవసాయశాఖ 25 వేల క్వింటాళ్లతో ప్రత్యామ్నాయ విత్తన ప్రణాళిక ప్రభుత్వానికి పంపింది. 10,215 క్వింటాళ్ల ఉలవలు, 5,565 క్వింటాళ్ల కందులు, 2,670 క్వింటాళ్ల జొన్నలు, 2,620 క్వింటాళ్ల జొన్నలు, 2,206 క్వింటాళ్ల అలసందలు, 500 క్వింటాళ్ల ఆముదం, 500 క్వింటాళ్ల కొర్రలు.. ఇలా 80 శాతం రాయితీతో ఇవ్వాలని ప్రతిపాదనలు పంపారు. ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదని చెబుతున్నారు. దెబ్బతీసిన ‘జూలై’జూలైలో కురవాల్సిన వర్షాలు రైతును భారీగా దెబ్బతీశాయి. జూన్లో ఎలాగోలా సాధారణ వర్షం కురిసినా.. కీలకమైన జూలైలో 63.4 మి.మీ గానూ కేవలం 17.6 మి.మీ నమోదైంది. ఈ 25 రోజుల్లో కేవలం ఒకే ఒక్క వర్షపు రోజు (రెయినీ డే) నమోదు కావడం, 32 మండలాల్లో సుదీర్ఘ వర్షపాత విరామాలు (డ్రైస్పెల్స్) నమోదు కావడంతో ఖరీఫ్ సాగు పడకేసింది. ఓవరాల్గా జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 118.3 మి.మీ గానూ 27 శాతం లోటుతో 86 మి.మీ వర్షం కురిసింది. దీంతో కేవలం పెద్దవడుగూరు, వజ్రకరూరు, బెళుగుప్ప, గుత్తి మినహా మిగతా మండలాల్లో పంటల విస్తీర్ణం భారీగా పడిపోయింది. ప్రధానంగా వేరుశనగ పంట సాగులోకి వచ్చే రాయదుర్గం, కళ్యాణదుర్గం డివిజన్లలో వర్షాలు లేక వేలాది హెక్టార్లు బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి. గుమ్మఘట్ట మండలంలో 13,400 హెక్టార్లు అంచనా వేయగా 300 హెక్టార్లకు మించి పంటలు సాగుచేయని దుస్థితి నెలకొంది. రాయదుర్గంలో 16,875 హెక్టార్లకు గానూ 700 హెక్టార్లు, పుట్లూరులో 4 వేల హెక్టార్లకు గానూ 150 హెక్టార్లు, కణేకల్లులో 16,303 హెక్టార్లకు గానూ 900 హెక్టార్లు.. ఇలా చాలా మండలాల్లో 10 నుంచి 20 శాతం విస్తీర్ణంలో పంటలు వేయగా..మిగతా 80 శాతం పొలాలు బీళ్లుగా ఉండటం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఎల్–నినో తీవ్రత, నైరుతి నిరాశల మధ్య పడకేసిన ఖరీఫ్ జిల్లా చరిత్రలో తొలిసారిగా భారీగా పతనమైన పంటలు 2.30 లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయం ఆషామాషీ కాదు 25 వేల క్వింటాళ ్ల ప్రత్యామ్నాయ విత్తన ప్రణాళిక ఎప్పుడో? -
పెరిగిన పోలింగ్ కేంద్రాలు
● 330 కేంద్రాల పెంపునకు ఎన్నికల కమిషన్ ఆమోదం ● 48 పీఎస్ల ప్రదేశాల మార్పు, 7 పీఎస్ల పేరు మార్పు అనంతపురం అర్బన్: జిల్లాలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణను ఎన్నికల కమిషన్ ఆమోదించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆనంద్ తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం వెల్లడించారు. హేతుబద్ధీకరణ ద్వారా ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో మరో 330 కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 2,226 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కొత్త వాటితో పోలింగ్ కేంద్రాల సంఖ్య 2,556కు చేరింది. అత్యధికంగా గుంతకల్లు నియోజకవర్గంలో 71 కేంద్రాలు పెరగగా.. అత్యల్పంగా శింగనమల, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో 21 చొప్పున పెరిగాయి. అదే క్రమంలో రాయదుర్గం నియోజకవర్గంలో 3, ఉరవకొండలో ఒకటి, శింగనమలలో 10, అనంతపురం అర్బన్లో 30, కళ్యాణదుర్గంలో ఒకటి, రాప్తాడు నియోజవర్గంలో 3 కేంద్రాలు మొత్తం 48 పోలింగ్ కేంద్రాల ప్రదేశాలు మారనున్నాయి. ఇక రాయదుర్గం నియోజకవర్గంలో 2, అనంతపురం అర్బన్లో 2, కళ్యాణదుర్గం నియోజక వర్గంలో 3 కేంద్రాల పేరు మార్పు చేయనున్నారు. పెరిగాయి ఇలా.. రాయదుర్గం నియోజకవర్గంలో 47, ఉరవకొండలో 26, గుంతకల్లులో 71, తాడిపత్రిలో 47, శింగనమలలో 21, అనంతపురం అర్బన్లో 70, కళ్యాణదుర్గంలో 21, రాప్తాడులో 27 చొప్పున పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. కేంద్రానికి 1,200 ఓట్లు ఒక పోలింగ్ కేంద్రానికి ఇప్పటి వరకు గరిష్టంగా 1,500 ఓట్లు ఉండేవి. అంతకు మించి ఓట్లు ఉంటే యాగ్జిలరీ కేంద్రం ఏర్పాటు చేసేవారు. ఎన్నికల కమిషన్ ఈ క్రమాన్ని మార్పు చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఒక పోలింగ్ కేంద్రంలో 1,200 ఓట్లు మించరాదు. -
భళా.. కల్లూరు విద్యార్థుల కళ
అనంతపురం అర్బన్: కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విదార్థుల ప్రతిభ తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నమోదైంది. సంపూర్ణ రామాయాణాన్ని వినూత్నంగా మట్టికుండలపై ప్రదర్శించి ఈ ఘనత దక్కించుకున్నారు. ఈ క్రమంలో కలెక్టర్ ఓ.ఆనంద్ను సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో డిప్యూటీ డీఈఓ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిశారు. వారిని కలెక్టర్ అభినందించారు. పాఠశాల ఆంగ్లభాష ఉపాధ్యాయురాలు డాక్టర్ వరలక్ష్మి మాట్లాడుతూ సంపూర్ణ రామాయణంలోని ఏడు ఖండాలను, 20 మార్కులు ఉన్న పాఠ్యాంశాన్ని 20 కుండలపై చిత్రీకరించడం (వర్లీ ఆర్ట్ పెయింటింగ్) ద్వారా రికార్డు సాధించారన్నారు. స్కూల్ అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ స్పెషల్ ఎడ్యుకేటర్, సైకాలజిస్ట్ సాయి దీపిక ప్రోత్సాహం అందించారన్నారు. కార్యక్రమంలో జేసీ సి.విష్ణుచరణ్, డీఆర్ఓ ఎ.మలోల, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, విద్యార్థులు రక్షిత, సౌజన్య, సుప్రజ, హేమంత్, తరుణ్ తేజ, సురేఖ, శ్రీలేఖ, తదితరులు పాల్గొన్నారు. రౌడీషీటర్ అరెస్ట్ అనంతపురం సెంట్రల్: యువకుడిపై దాడి చేసిన రౌడీషీటర్ సుధీర్ అలియాస్ పులి అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వన్టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నగరంలో ఉమానగర్కు చెందిన రౌడీషీటర్ దాసరి సుధీర్ ఈనెల 23న పాతూరు కూరగాయల మార్కెట్ సమీపంలో మహమ్మద్ ఫైజాన్ అహ్మద్పై కర్రతో దాడి చేశాడు. దీంతో ఫైజాన్ ముక్కు వద్ద తీవ్ర గాయమైంది. ఎముక విరిగింది. దీనిపై బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సోమవారం నిందితున్ని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్కు పంపామన్నారు. డీటీ ప్యానల్ విడుదల అనంతపురం అర్బన్: తహసీల్దారు పదోన్నతుల ప్రక్రియలో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి 92 మందితో డీటీ (డిప్యూటీ తహసీల్దార్) ప్యానల్ను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందుకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే వారంలోగా సమర్పించాలని సూచించింది. 2018–19కు సంబంధించి 15 మంది డీటీలు, 2019–20కు 16 మంది, 2020–21కు 31 మంది, 2021–22కు ముగ్గురు, 2022–23కు 18 మంది, 2023–24కు నలుగురు, 2024–25కు సంబంధించి ఐదుగురు మొత్తం 92 మందితో ప్యానల్ విడుదల చేసింది. -
చంద్రబాబు పాలనలో రైతాంగం కుదేలు
ఉరవకొండ రూరల్: చంద్రబాబు పాలనలో రైతాంగం కుదేలైందని ఎమ్మెల్సీ వై.శివరామి రెడ్డి మండిపడ్డారు. ఖరీఫ్–2024 ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద మూడు రోజుల నుంచి ఇన్సూరెన్సు మొత్తం రైతుల ఖాతాల్లో జమ కావడానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలే కారణమని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గిట్టుబాటు ధర లేక టమాట పంటను రైతులు రోడ్లలో పడేస్తున్నారన్నారు. ధరలను దళారులు అమాంతం తగ్గించి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన ధరల స్థిరీకరణ నిధిని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తివేయడం అసమర్థతకు నిదర్శనమన్నారు. ఉచిత పంటల బీమాను రద్దు చేసి గత ఏడాది ఇన్సూరెన్స్ చెల్లించకపోవడంతో రైతులకు బీమా డబ్బు అందని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రైతులకు చేదోడువాదోడుగా ఉన్న ఆర్బీకే తదితర వ్యవస్థలను కనుమరుగు చేశారని దుయ్యబట్టారు. తీవ్ర కరవుతో రైతులు అల్లాడిపోతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయిందని, స్వార్థ రాజకీయాలకే కూటమి నేతలు పాకులాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ వై.శివరామి రెడ్డి -
చంద్రబాబు ప్రభుత్వం నోరు విప్పాలి
నీట్ ప్రశ్నపత్రం లీక్పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించి.. దిద్దుబాటు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కానీ, రాష్ట్రంలో డీఎస్సీ అవకతవకలపై చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు నోరు విప్పడం లేదు? మెగా డీఎస్సీ కాదు ఇది దగా డీఎస్సీ. అర్హులకు ఉద్యోగాలు దక్కకుండా చంద్రబాబు ప్రభుత్వం అక్రమాలకు పాల్పడింది. అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై పూర్తిస్థాయిలో విచారణ చేసే వరకు వదిలిపెట్టం. నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆటలాడుతుంటే చూస్తూ ఊరుకునేది లేదు. – అనంత వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
తల్లికి వందనం.. అందలేదు సారూ..!
అనంతపురం అర్బన్: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నా తమకు ఆస్తులు ఉన్నట్లు చూపడంతో తల్లికి వందనం అందకుండా పోయిందని పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తప్పిదాలను సరిదిద్ది పథకం వర్తింపజేయాలని కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్ఓ మలోల, డిప్యూటీ కలెక్టర్లు రామ్మోహన్, రమేష్రెడ్డి, మల్లికార్జునరెడ్డి, కిరణ్మయి ప్రజల నుంచి వివిధ సమస్యలపై 697 అర్జీలు స్వీకరించారు. ఇందులో రెవెన్యూకు సంబంధించి 302, తల్లికి వదనం, తదితర సమస్యలపై 395 అర్జీలు ఉన్నాయి. అంతకు ముందు వివిధ అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అర్జీదారులు తృప్తి చెందేలా వారి సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపించాలన్నారు. ఎల్–నినో కారణంగా తలెత్తనున్న తాగు, సాగునీటి కొరతను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టాలన్నారు. -
దంపతుల ఆత్మహత్యాయత్నం
కుందుర్పి: కుందుర్పి మండల కేంద్రంలోని కెనరా బ్యాంకు బ్రాంచ్లో ఎలాంటి రుణమూ తీసుకోకపోయినా క్రాప్లోన్ తీసుకున్నారంటూ ఖాతాను హోల్డ్లో పెట్టడంతో మనస్తాపం చెందిన నాగేంద్ర, చంద్రకళ దంపతులు సోమవారం బ్యాంకు ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కుందుర్పి మండలం మందలపల్లికి చెందిన హనుమంతరాయప్ప పెద్దకుమారుడు నాగేంద్ర 20 ఏళ్ల క్రితమే తండ్రి నుంచి విడిపోయి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నాగేంద్ర భార్య చంద్రకళకు కెనరా బ్యాంకులో ఖాతా ఉంది. ఈమె ఎలాంటి రుణమూ తీసుకోలేదు. అయితే.. మామ హనుమంతరాయప్ప రూ.3.75 లక్షల పంట రుణం తీసుకుని తిరిగి చెల్లించలేదన్న నెపంతో చంద్రకళ ఖాతాను హోల్డ్లో పెట్టారు. ఇటీవల చంద్రకళ ఖాతాలో తల్లికి వందనం డబ్బు రూ.26 వేలు జమ అయ్యింది. సోమవారం బ్యాంకుకు వెళ్లి డబ్బు ఇవ్వాలని కోరగా.. మీ మామ పేరిట క్రాప్లోన్ ఉన్నందున ఇవ్వడం కుదరదని బ్యాంకు సిబ్బంది చెప్పారు. తాము 20 ఏళ్ల క్రితమే ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయి ఇతర ప్రాంతాల్లో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నామని, వారి రుణాలతో తమకు సంబంధం లేదని చెప్పినా బ్యాంకు సిబ్బంది వినలేదు. దీంతో చంద్రకళ, ఆమె భర్త నాగేంద్ర మనస్తాపానికి గురై బ్యాంకు ముందు వందలాది మంది చూస్తుండగానే ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. రైతులు, బ్యాంకు సిబ్బంది వారిని కాపాడారు. ఆ తర్వాత చంద్రకళ ఖాతాను హోల్డ్ నుంచి తొలగించి డబ్బు ఇస్తామని తెలపడంతో వారు వెనుదిరిగారు. -
మోదీది ప్రజాకంటక పాలన
అనంతపురం అర్బన్: నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాకంటక పాలన సాగిస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఎన్టీఏ వ్యవస్థ రద్దు, ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలనే డిమాండ్తో సోమవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద సీపీఐ నిరసన చేపట్టింది. కార్యక్రమానికి రామకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాసమస్యలపై గళమెత్తిన వారిని అరెస్టు చేయడం, అక్రమ కేసులు బనాయించడం, బెదిరింపులు వంటి దుర్మార్గపు చర్యలకు మోదీ ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీపై శాంతియుతంగా ఉద్యమిస్తున్న విద్యార్థులపై పోలీసులు క్రూరంగా దాడి చేయడంతో పాటు తప్పుడు కేసులు బనాయించడం అన్యాయమన్నారు. తక్షణం కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యారంగాన్ని కాషాయీకరణ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తి కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారని, ఇలాంటి వారి చేతుల్లో విద్యారంగం నాశనమవుతుందన్నారు. దేశవ్యాప్తంగా లక్షకు పైగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని, మరోవైపు ఆర్ఎస్ఎస్, విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో 43 వేల పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. వీటిలో విద్యార్థులకు మతోన్మాదాన్ని నూరిపోస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సి.జాఫర్, జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి, జిల్లా నాయకులు టి.నారాయణస్వామి, మల్లికార్జున, శ్రీరాములు, రాజేష్గౌడ్, లింగమయ్య, రమణయ్య, పద్మావతి, సంతోష్కుమార్, కృష్ణుడు, చిరంజీవి, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ -
మీరైనా న్యాయం చేయండి
అనాథనైన తనకు ‘తల్లికి వందనం’ డబ్బు పడలేదంటూ కీర్తిబాయి అనే బాలిక కలెక్టర్ వద్ద మొర పెట్టుకుంది. ‘మాది బ్రహ్మసముద్రం మండలం రాయలప్పదొడ్డి గ్రామం. మా నాన్న హనుమంతునాయక్, అమ్మ జయలక్ష్మిబాయి. నాన్న అనారోగ్యంతో ఆరేళ్ల క్రితం చనిపోయాడు. అమ్మ రెండేళ్ల క్రితం ప్రమాదంలో చనిపోయింది. మేనమామ శీనానాయక్ నన్ను చేరదీసి చదివిస్తున్నారు. ప్రస్తుతం బ్రహ్మసముద్రం కేజీబీవీ బ్రిడ్జి స్కూలులో ఆరో తరగతి చదువుతున్నాను. నాకు రెండేళ్లుగా ‘తల్లికి వందనం’ డబ్బులు రాలేదు. అక్కడ ఎవరూ పట్టించుకోవడంలేదు. అందుకే ఇక్కడికి వచ్చి కలెక్టర్ సార్కు చెప్పుకున్నాను’ అంటూ కీర్తిబాయి వేడుకుంది. -
పేదలను దోచుకుంటున్న అమిలినేని
కుందుర్పి : కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కల్యాణి వైన్షాపులకు అనుబంధంగా ఊరూరా బెల్టుషాపులు పెట్టి అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ పేదలను నిలువుదోపిడీ చేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులు ధ్వజమెత్తారు. బెల్టుషాపులు ఎత్తివేయాలని కోరుతూ వారు సోమవారం కుందుర్పిలోని రామస్వామి ఆలయం నుంచి రెవెన్యూ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ హనుమంతరాయుడు, ఎంపీపీ నాగరాజు తదితరులు మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని సొంత నిధులతో అభివృద్ధి చేస్తానని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే అమిలినేని బెల్టుషాపులు పెట్టించి బాటిల్ మద్యంపై రూ.40 అదనంగా వసూలు చేస్తూ జేబులు నింపుకుంటున్నారని ధ్వజమెత్తారు. మద్యానికి బానిసలైన పేదలను ఆర్థికంగా పీల్చిపిప్పి చేస్తున్న బెల్టుషాపులను తక్షణమే ఎత్తేయాలని డిమాండ్ చేశారు. మద్యం విక్రయాల్లో దోచుకున్న సొమ్ముతో కొంత ఖర్చు చేసి సేవ చేస్తున్నట్లు పబ్లిసిటీ చేసుకుంటున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో చాలాచోట్ల తాగునీటి సమస్య ఉన్నా పట్టించుకోని ఎమ్మెల్యే.. మద్యాన్ని మాత్రం ఏరులా పారిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల మాజీ కన్వీనర్ సత్యనారాయణశాస్త్రి, వాల్మీకి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పాలాక్షి, ఉపాధ్యక్షుడు భీమప్ప, పార్టీ డివిజన్ మహిళా అధ్యక్షురాలు నాగలక్ష్మి, మాజీ సర్పంచులు రామ్మూర్తి, బొమ్మయ్య, శివశంకర్రెడ్డి, వెంకటేష్, ఓబన్న పాల్గొన్నారు. బెల్టు షాపుల్లో అధిక ధరలకు మద్యం తాగునీటి సమస్య తీర్చరు కానీ మద్యాన్ని ఏరుల్లా పారిస్తున్నారు వైఎస్సార్సీపీ నాయకుల మండిపాటు -
వినియోగదారులకు షాక్
అనంతపురం టౌన్: విద్యుత్ చార్జీలు పెంచబోమంటూనే చంద్రబాబు ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డివిరుస్తోంది. ఇప్పటికే పెరిగిన విద్యుత్ బిల్లులతో అల్లాడిపోతున్న ప్రజలపై డెవలప్మెంట్ చార్జీల పేరిట మరో భారం మోపింది. వినియోగం అధికంగా ఉందంటూ గృహ విద్యుత్ వినియోగదారులపై బిల్లుతోపాటు అదనంగా డెవలప్మెంట్ చార్జీలను కిలో వాట్కు రూ.2,350 చొప్పున బాదుతోంది. వినియోగాన్ని బట్టి కొంతమంది వినియోగదారులకు రెండు నుంచి మూడు కిలోవాట్లకు డెవలప్మెంట్ చార్జీల భారం వేస్తోంది. నెలవారీ బిల్లుతోపాటే డెవలప్మెంట్ చార్జీలు వసూలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. లక్ష మందిపై భారం అనంతపురం జిల్లాలో 8.15 లక్షలు, శ్రీసత్యసాయి జిల్లాలో 6.79 లక్షల గృహ విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. ఈ జూలై నెలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్ష మంది వినియోగదారులకు పైగానే డెవలప్మెంట్ చార్జీల భారాన్ని చంద్రబాబు ప్రభుత్వం మోపింది. ఒక్కో వినియోగదారునికి రూ.2,350 నుంచి రూ.8వేల వరకు డెవలప్మెంట్ చార్జీల పేరుతో షాక్ ఇచ్చింది. ఓ వైపు ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ తీసుకువచ్చామంటూ విద్యుత్ శాఖ మంత్రి ఊదరగొడుతున్నారు. విద్యుత్ బిల్లుపై యూనిట్కు పైసల్లో తగ్గించి.. డెవలప్మెంట్ పేరిట వేలాది రూపాయాలు వసూళ్లు చేస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. ఈ నెల బిల్లుతోపాటే డెవలప్మెంట్ చార్జీలు చెల్లించాలని, లేకుంటే విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తామంటున్నారని వాపోతున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి డెవలప్మెంట్ చార్జీలను వేయాలని కోరుతున్నారు. వినియోగం మేరకు చార్జీలు విద్యుత్ వినియోగించిన మేరకే డెవలప్మెంట్ చార్జీల వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా అధికంగా విద్యుత్ వినియోగించిన వినియోగదారులకు మాత్రమే చార్జీలు వేశారు. తక్కువ విద్యుత్ వినియోగం ఉన్న వారికి డెవలప్ మెంట్ చార్జీలు వేసి ఉంటే.. అలాంటి వారు ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం. బిల్లుల చెల్లింపులో వినియోగదారులు విద్యుత్ ఉద్యోగులకు సహకరించాలి. – శేషాద్రి శేఖర్, ఎస్ఈ, విద్యుత్ శాఖ అనంతపురం రూరల్ మండలం తపోవనం శివాలయం దగ్గర ఉన్న ఈ షాపు రెండేళ్లుగా మూతపడింది. షాపు యజమాని ఈశ్వరమ్మ ప్రతి నెలా కరెంటు (సర్వీస్ నంబర్ 7111201048364) బిల్లు చెల్లిస్తోంది. విద్యుత్ వినియోగం లేని ఈ షాప్కు డెవలప్మెంట్ చార్జీలు రూ.4,550 చెల్లించాలంటూ బిల్లు జారీ చేశారు. వినియోగం పెరిగిందని చార్జీల మోత ఒక కిలో వాట్కు రూ.2,350 మేర డెవలప్మెంట్ చార్జీ ఇదేం బాదుడు బాబోయ్ అంటున్న వినియోగదారులు అనంతపురంలోని బళ్లారి రోడ్డు వేదగాయత్రి దేవాలయం దగ్గర నివాసముంటున్న వి.తేజానాయక్ ఇంటికి విద్యుత్ (సర్వీస్ నంబర్ 7111201208300) వినియోగం అధికంగా ఉందంటూ ఇప్పటికే అధికారులు రెండు పర్యాయాలు డెవలప్మెంట్ చార్జీలు వేశారు. ఈ జూలైలో మరోసారి డెవలప్మెంట్ చార్జీల కింద రూ.4,550 వేశారు. ఓ వైపు బిల్లు.. మరోవైపు డెవలప్మెంట్ చార్జీలబాదుడుతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. -
నేడు ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సోమవారం ఉదయం తొమ్మిది గంటలకు ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు. భూసమస్యలకు సంబంధించిన అర్జీలను పరిష్కార వేదికలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్లో అందజేయాలన్నారు. ప్రజలు తమ అర్జీలో ఆధార్, ఫోన్ నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి అర్జీ పరిష్కార స్థితిని తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in ద్వారా ఆన్లైన్ లోనూ సమర్పించవచ్చని తెలిపారు. టీబీ డ్యాంలో 31 టీఎంసీల నీరు బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతుండటంతో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ఆదివారం 31.18 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. రిజర్వాయర్ పూర్తి సామర్ధ్యం 1,633 అడుగులకు గాను 1606.50 అడుగల మేర నీటిమట్టం ఉంది. ఇన్ఫ్లో 12,869 క్యూసెక్కులుండగా.. 3,561 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1625.43 అడుగులతో 77.91 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నేడు ఎస్కేయూ పాలక మండలి సమావేశం ● ఎజెండాలో లేని రిజిస్ట్రార్ నియామకం అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ (ఎస్కేయూ) పాలక మండలి సమావేశం సోమవారం నిర్వహించనున్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఇన్చార్జ్ రిజిస్ట్రార్ నియామకం జరిగింది. అయితే అసోసియేట్ ప్రొఫెసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ హోదాలో ఉన్న వారిని రిజిస్ట్రార్గా నియమించాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా రీసెర్చ్ కమ్ స్టాటస్టికల్ ఆఫీసర్గా ఉన్న రమేష్బాబును నియమించడం విమర్శలకు తావిచ్చింది. ప్రాధాన్యత లేని పోస్టు నుంచి ఏకంగా రిజిస్ట్రార్ పదవిలోకి వచ్చి.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు పదవీ కాలం కూడా ముగుస్తోంది. కొత్త రిజిస్ట్రార్ నియామకంపై నేటి పాలక మండలి సమావేశంలో చర్చిస్తారని అందరూ భావించగా.. అజెండాల్లో ఆ అంశమే లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. గ్లోబల్ మెడికల్ క్యాంప్ ప్రారంభం ప్రశాంతినిలయం: గురుపౌర్ణమిని పురస్కరించుకొని పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఉచిత వైద్యం అందించే లక్ష్యంతో గ్లోబల్ మెడికల్ క్యాంప్ను ఆదివారం ప్రారంభించారు. నార్త్ –1 భవన్లో సత్యసాయి బాబా చిత్రపటం వద్ద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించి క్యాంప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 30 వరకు ఐదు రోజుల పాటు వైద్య శిబిరం ఉంటుందన్నారు. దేశ విదేశాలకు చెందిన 70 మందికి పైగా వైద్యులు, 40 మంది పారామెడికల్ నిపుణులు, 80 మంది ఆరోగ్య సిబ్బంది సేవలందిస్తారని తెలిపారు. ఈఎన్టీ, గుండె జబ్బు లు, జనరల్ మెడిసిన్, కంటి, గైనకాలజీ, దంత వైద్యం, మానసిక ఆరోగ్యం, పిల్లల వైద్యం, పాదాల వైద్యం, మధుమేహంతో పాటు అవసరమైన ల్యాబ్ పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు. పుట్టపర్తి పరిసర ప్రాంతాల ప్రజలు మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
కొర్రీల కోరల్లో తల్లికి వందనం
అనంతపురం ఎడ్యుకేషన్: పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల ప్రజలు అధికంగా నివసించే కరువు జిల్లాలోనే ’తల్లికి వందనం’ పథకం సగానికి పైగా విద్యార్థులకు దూరమైంది. ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం జిల్లాలోని విద్యార్థుల్లో 53.57 శాతం మందిని అనర్హులుగా ప్రకటించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. నిజంగా ఇంతమంది అనర్హులా..? లేక కొర్రీలు, సాంకేతిక కారణాల పేరుతో వేలాదిమంది పేద విద్యార్థులను పథకం నుంచి తప్పించారా..అనే ప్రశ్నలు తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతున్నాయి. సగానికి పైగా అనర్హుల జాబితాలోకి.. జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల పరిధిలో 2,512 పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు మొత్తం 4,12,778 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 1,91,636 మందిని మాత్రమే ‘తల్లికి వందనం’ పథకానికి అర్హులుగా ప్రకటించారు. మిగిలిన 2,21,132 మంది వివిధ కారణాలతో అనర్హుల జాబితాలో చేరారు. అంటే 46.43 శాతం మంది మాత్రమే అర్హులు కాగా, 53.57 శాతం మంది పథకానికి దూరమయ్యారు. వేలాదిమందికి జమకాని డబ్బు.. అనర్హుల సమస్య ఒకవైపు ఉంటే, అర్హులుగా ప్రకటించిన వారిలో కూడా వేలాది మందికి ఇంకా నగదు జమ కాలేదు. ప్రభుత్వం ప్రకటించిన 1,91,636 మంది అర్హుల్లో శనివారం నాటికి 1,49,713 మందికి మాత్రమే నగదు అందింది. ఇంకా 41,923 మంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. డబ్బులు అందని లబ్ధిదారుల్లో ఎక్కువగా అనంతపురం అర్బన్లో 7,451 మంది, కణేకల్లు మండలంలో 2,825 మంది, రాయదుర్గంలో 2,745 మంది, గుంతకల్లులో 2,684 మంది, డి.హీరేహాళ్లో 2,558 మంది, గుత్తిలో 2,543 మంది, విడపనకల్లో 2,155 మంది, కళ్యాణదుర్గంలో 2,051 మంది ఉన్నారు. సమాధానం చెప్పేవారే లేరు.. డబ్బులు ఎందుకు జమ కాలేదో, ఎప్పటిలోగా జమ అవుతాయో, అసలు వస్తాయో లేదో చెప్పే పరిస్థితి అధికార యంత్రాంగంలో కనిపించడం లేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయాలు, ఎంఈఓ కార్యాలయాల చుట్టూ తిరిగినా సరైన సమాధానం దొరకక, చివరకు డీఈఓ కార్యాలయానికి వెళ్లినా అక్కడ కూడా స్పష్టత లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. అసలు పథకానికి అర్హత ప్రమాణాలు ఏమిటి, ఎవరిని ఏ ప్రాతిపదికన అనర్హులుగా గుర్తించారు, పెండింగ్లో ఉన్న వారికి నిధులు ఎప్పుడు జమ చేస్తారు అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. 4.12 లక్షల మందిలో 2.21 లక్షల మందికి పథకం దూరం అర్హుల జాబితాలో ఉన్న 41,923 మందికి అందని డబ్బు కార్యాలయాల చుట్టూ తల్లిదండ్రుల ప్రదక్షిణ సమాధానం ఇచ్చే వారే కరువు అనంతపురం రూరల్ మండలానికి చెందిన ఎం.చిరంజీవికి ముగ్గురు పిల్లలు. రాకేష్ 9వ తరగతి, నిహారిక, నిహాల్ 3వ తరగతి. వీరిలో నిహారికకు మాత్రమే తల్లికి వందనం పథకం కింద రూ.13 వేలు జమయ్యింది. తక్కిన ఇద్దరి పిల్లలకు రాలేదు. నిహాల్కు గతేడాది అమలు చేశారు. ఈసారి పరిశీలన జాబితాలో ఉంచారు. మరో విద్యార్థి రాకేష్కు సంబంధించి సెంట్రల్ షేర్ రూ. 2400, స్టేట్ షేర్ రూ.10,600 అని అర్హత జాబితాలో చూపిస్తోంది. కానీ ఇప్పటి దాకా జమ కాలేదు. ఇలా అర్హుల జాబితాలో ఉండి డబ్బులు జమకాని వారు జిల్లాలో 41,923 మంది ఉన్నారు. వారి తల్లిదండ్రులు రోజూ సచివాలయాలు, విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఎంతమంది ఉంటే.. అంతమందికీ తల్లికి వందనం పథకం ఇస్తామన్నారు.. ఇప్పుడేమో మొండి చేయి చూపుతారా..?మా చేతుల్లో ఏమీలేదురీ సర్వే ఎఫెక్ట్తో పథకం దూరం పుట్లూరు మండలం గరుగుచింతలపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో ఇటీవల చేపట్టిన రీ సర్వేలో సర్వే నంబర్ 564–ఎ1లోని 1182 ఎకరాల భూమిని ఎల్పీఎం నంబర్ 456తో జాయింట్గా పెట్టారు. దీంతో ఆ సర్వే నంబర్లో భూమి ఉన్న ప్రతి రైతుకూ 1182 ఎకరాల భూమి ఉన్నట్లు చూపుతోంది. నిబంధనల ప్రకారం పదెకరాల్లోపున్న కుటుంబాలు ‘తల్లికి వందనం’ పథకానికి అర్హులు. ఇక్కడ 1182 ఎకరాలు నమోదు కావడం వల్ల గ్రామంలోని 20 బీసీ, ఎస్సీ కుటుంబాలలోని విద్యార్థులు పథకానికి దూరమయ్యారు. – పుట్లూరు : -
ఆరోగ్యకర దేహంతోనే స్వచ్ఛమైన ఆలోచనలు
ప్రశాంతినిలయం: శరీరం ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే స్వచ్ఛమైన ఆలోచనలు పుడతాయని సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ పేర్కొన్నారు. పుట్టపర్తిలో ఆదివారం నిర్వహించిన ‘శ్రీ సత్యసాయి 5కే రన్ అండ్ రైడ్–ఏ స్పిరిట్ ఆఫ్ యూనిటీ’ కార్యక్రమం ఉల్లాసంగా ఉత్సాహంగా సాగింది. సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో ఉదయం 5.30 గంటలకు ఆర్జే రత్నాకర్ రాజు, సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీష్ పాండే లాంఛనంగా జెండా ఊపి రన్ అండ్ రైడ్ను ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారత మహిళా క్రికెట్ జట్టు కోచ్ అమోల్ మజుందార్, కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్, జేసీ మౌర్య భరద్వాజ్, ఆర్డీఓ సువర్ణ, హిమవాహినీ రత్నాకర్, కమలాపాండ్యా హాజరయ్యారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ దేశంలోని 45 ప్రధాన నగరాల్లో ఇప్పటి వరకూ నిర్వహించిన రన్ అండ్ రైడ్లో 1.20 లక్షల మంది పాల్గొన్నారన్నారు. తాజాగా పుట్టపర్తిలో 19 వేల మంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. పని ఒత్తిడి కారణంగా చాలా మంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, సత్యసాయి బాబా జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యకర జీవన విధానం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ● హిల్వ్యూ స్టేడియంలో ప్రారంభమైన 5కే రన్ అండ్ రైడ్ ఎనుములపల్లి గణేష్ సర్కిల్, పెట్రోలు బంకు, పెద్ద కమ్మవారిపల్లి రోడ్ మీదుగా తిరిగి హిల్వ్యూ స్టేడియం చేరుకుంది. దారి వెంబడి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్స్ సేవలు, తాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేశారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు పుట్టపర్తిలో ఉత్సాహంగా 5కే రన్ అండ్ రైడ్ -
నేడు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ
అనంతపురం టౌన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఎండీ శివశంకర్ లోతేటి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు మొబైల్ నంబర్ 8977716661కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. ఫోన్ చేసే వినియోగదారులు తమ విద్యుత్ నంబర్ను తప్పకుండా తెలియజేయాలని సూచించారు. జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ.. అనంతపురం జిల్లాలో డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. విద్యుత్ సమస్యలున్న వినియోగదారులు ఫోన్ నంబర్లు 08554–272943, 9154790350కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. -
ఫుట్బాల్ విజేత ‘శ్రీసత్యసాయి’
అనంతపురం: అనంతపురం జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ (ఏడీఎఫ్ఏ) ఆధ్వర్యంలో ఆర్డీటీ క్రీడా మైదానం వేదికగా సాగిన ఏపీ రాష్ట్ర స్థాయి బాలికల ఫుట్బాల్ టోర్నీ విజేతగా శ్రీసత్యసాయి జిల్లా జట్టు నిలిచింది. ఈ నెల 24న ప్రారంభమైన ఈ టోర్నీ ఆదివారంతో ముగిసింది. ఫైనల్స్లో తూర్పుగోదావరి జిల్లా జట్టుతో తలపడిన శ్రీసత్యసాయి జిల్లా జట్టు క్రీడాకారులు విజయం కోసం శ్రమించారు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో చివరి క్షణంలో శ్రీసత్యసాయి జిల్లా జట్టు ఒక్క గోల్ సాధించి విజయ కేతనం ఎగురవేసింది. అలాగే మూడో స్థానం కోసం అనంతపురం, కర్నూలు జట్లు తలపడగా.. అనంతపురం జిల్లా బాలికలు ఆది నుంచి ఆధిపత్యం కనబరిచారు. కర్నూలు జిల్లా క్రీడాకారులను ముప్పుతిప్పలు పెడుతూ 0–4 గోల్స్ తేడాతో విజయకేతనం ఎగుర వేశారు. దీంతో నాల్గో స్థానంతో కర్నూలు జట్టు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముగింపు కార్యక్రమానికి ఎన్ఐసీ కోచ్ ఇస్మాయిల్ (పోలీస్ ఇన్స్పెక్టర్), ఏడీఎఫ్ఏ అధ్యక్షుడు దాదాఖలందర్, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, కోశాధికారి మల్లేష్, కృష్ణా జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ హాజరై, విజేతలకు ట్రోఫీలను ప్రదానం చేసి, అభినందించారు. రన్నర్స్గా తూర్పు గోదావరి జిల్లా మూడో స్థానంతో సరిపెట్టుకున్న అనంతపురం జట్టు -
ఆలయ మాన్యమా... ఆక్రమణే !
అనంతపురం కల్చరల్: దేవాలయాలకు సంబంధించి విలువైన మాన్యం భూములు కబ్జాకు గురవుతున్నాయి. పరిరక్షించాల్సిన దేవదాయ, ధర్మదాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అధికార పార్టీ అండతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. అందినకాటికి ఆక్రమించి.. సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో దేవదాయ, ధర్మదాయ శాఖ పరిధిలో 35,936 ఎకరాల దేవుని మాన్యం ఉంది. ఇందులో 4,846 ఎకరాల మాన్యం కబ్జాకు గురైనట్టు రికార్డుల్లో నమోదైంది. ఇవి కాకుండా మరెన్నో చోట్ల మాన్యం భూములు ఆక్రమణలకు గురయ్యాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండ నియోజకవర్గంలోని పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. చాలాచోట్ల అధికార పార్టీ నాయకుల అండతోనే మాన్యం భూములు అన్యాక్రాంతం అవుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కబ్జాల్లో మచ్చుకు కొన్ని... జిల్లా కేంద్రం అనంతపురంలోని శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానానికి వివిధ ప్రాంతాల్లో 254 ఎకరాలకు పైగా మాన్యం ఉంది. అయితే చిన్నజలాలపురంలో 150 ఎకరాలు, బి.కొత్తకోటలో 70 ఎకరాలు, బుక్కరాయసముద్రంలో 4 ఎకరాల మాన్యం భూములు కబ్జాకు గురయ్యాయి. గూగూడులోని శ్రీచెన్నకేశవస్వామి ఆలయ పరిధిలోని 150 ఎకరాలకు రెవెన్యూ అధికారులు సాగు పట్టాలిచ్చేశారు. ఇక శింగనమల మండలం ఆనందరావుపేట ఆంజనేయస్వామి గుడి పరిధిలో 80వ సర్వే నంబరు కింద 6.60 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. ఇవన్నీ మచ్చుకు మాత్రమే. నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం ఆలయాల నిర్వహణ, మాన్యం భూముల పరిరక్షణ విషయంలో దేవదాయ, ధర్మదాయ శాఖ అధికారులు విఫలమవుతున్నారు. కొందరు అధికారులు అక్రమార్జనకు అలవాటు పడి.. భగవంతునికే పంగనామాలు పెడుతున్నారు. అక్రమార్కులకు అండగా నిలుస్తుండటంతో మాన్యాలు కరిగిపోతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా జిల్లా దేవదాయ, ధర్మదాయ శాఖ సహాయ కమిషనర్ గంజి మల్లికార్జునప్రసాద్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో పలువురు అధికారుల పనితీరు చర్చనీయాంశంగా మారింది. జిల్లాలో మాన్యం భూములకు రక్షణ కరువు దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్న అక్రమార్కులు చర్యలు తీసుకుంటున్నాం జిల్లాలో అన్యాక్రాంతమైన ఆలయ భూముల వ్యవహారం చాలా వరకు కోర్టుల్లో నడుస్తున్నాయి. ముఖ్యంగా గూగూడు చెన్నకేశవస్వామి ఆలయ భూములు, శింగనమల మండలం ఆనందరావు పేట ఆంజనేయస్వామి గుడి భూములు తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఆర్డీఓ నేతృత్వంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టాం. – వన్నూరుస్వామి, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ -
‘అనంత’ యువతతో ముచ్చటించిన ప్రధాని
అనంతపురం అర్బన్: వికసిత్ వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమంపై ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ఆన్లైన్ ద్వారా నిర్వహించిన చర్చావేదికకు అనంతపురం కలెక్టరేట్లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 20 మంది యువతీ యువకులు పాల్గొన్నారు. వీరితో ప్రధాని ముచ్చటించారు. సరిహద్దు గ్రామాల్లో వారు పొందిన అనుభూతిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న యువతకు కలెక్టర్ ఆనంద్ అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ‘మై భారత్ ప్రోగ్రాం’ సూపర్వైజర్ శ్రీనివాసులు, కో–ఆర్డినేటర్ బిసాతి భరత్, ఆన్సెట్ మేనేజర్ శ్రీనివాసులు, రాష్ట్రపతి అవార్డుగ్రహీతలు బిసాతి జీవన్కుమార్, జయమారుతి, వలంటీర్లు అంబరీష్, రాము, సాయికార్తీక్ పాల్గొన్నారు. -
ఆరుగురి జీవితాల్లో రమా‘కాంతులు’
అనంతపురం సిటీ: జీవించినంత కాలమూ వృత్తినే దైవంగా భావిస్తూ వచ్చిన మాజీ జర్నలిస్ట్ ఎస్ఆర్ రమాకాంతరెడ్డి (50) కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఆరుగురి జీవితాలకు... శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండకు చెందిన రమాకాంతరెడ్డికి భార్య సరస్వతి, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న కుమార్తె భావన, తొమ్మిదో తరగతి చదువుతున్న కుమారుడు విఖ్యాత్ ఉన్నారు. గతంలో టీవీ 9, సాక్షి టీవీల్లో కెమెరామెన్గా పని చేశారు. వివాదాలకు దూరంగా ఉంటూ వృత్తి పట్ల అంకితభావంతో పనిచేసే వ్యక్తిగా అందరి మన్ననలు పొందారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో సచివాలయ సిరికల్చర్ టెక్నీషియన్ అసిస్టెంట్గా ఆయనకు ఉద్యోగం వచ్చింది. ఈ నెల 20న అనంతపురంలోని టీవీ టవర్ సమీపంలో బైక్పై వెళ్తున్న రమాకాంత్రెడ్డిని యూ–టర్న్ వద్ద వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన మరో ద్విచక్ర వాహనదారుడు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేర్చగా బ్రెయిన్డెడ్గా వైద్యులు నిర్ధారించారు. అంతటి విషాదంలోనూ కుటుంబ సభ్యులు గొప్ప మనసుతో అవయవదానానికి ముందుకు వచ్చారు. కర్ణాటక ప్రభుత్వ ఆరోగ్యశాఖ సమన్వయంతో ఆయన కళ్లు, కిడ్నీలు, గుండె, కాలేయాన్ని దానం చేశారు. దీంతో ఆరుగురికి కొత్త జీవితం లభించింది. పిల్లల చదువులకు పూర్తి సహకారంతో పాటు కారుణ్య నియామకం కింద ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని జర్నలిస్టులు, సహచర ఉద్యోగులు కోరుతున్నారు. సోమవారం పెనుకొండలోని హిందూ శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బ్రెయిన్డెడ్ అయిన మాజీ జర్నలిస్టు రమాకాంతరెడ్డి అవయవ దానంతో ఆరుగురికి సాయం -
సాగునీటి హక్కుల కోసం పోరాటం
కనగానపల్లి (చెన్నేకొత్తపల్లి): రాయలసీమ ప్రాంతానికి దక్కాల్సిన సాగు, తాగునీటి హక్కుల కోసం కలసికట్టుగా పోరాటాన్ని సాగిద్దామని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పిలుపునిచ్చారు. నీటి హక్కుల సాధన కోసం ఈ నెల 30న చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల గ్రామం వద్ద హంద్రీనీవా కాలువ వద్ద వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆదివారం ఆయన న్యామద్దలకు వెళ్లి పార్టీ నాయకులు, రైతులతో చర్చించారు. తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాతా మన ప్రాంతానికి దక్కాల్సిన నీటిని దక్కకుండా అన్యాయం చేస్తున్నారన్నారు. హంద్రీనీవా జలాల వాటా పెంచకపోవటంతో పాటు లైనింగ్ పనులతో ఈ ప్రాంత రైతుల నోట్లో మట్టికొట్టారన్నారు. సాగు, తాగునీరు లేక ఈ ప్రాంత రైతులు, ప్రజలు పడుతున్న కష్టాలను తెలియజేసేందుకు పాదయాత్రను చేపడుతున్నామన్నారు. న్యామద్దల సమీపంలోని హంద్రీనీవా కాలువపై 34 కి.మీ. రాయి వద్ద నుంచి ప్రారంభించే ఈ పాదయాత్రలో జిల్లాలోని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేలు, సమన్వకర్తలతో పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు హాజరవుతున్నారన్నారు. పార్టీ శ్రేణులు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ మెట్టు గోవిందరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ డోలా రామచంద్రారెడ్డి, పార్టీ నాయకులు న్యామద్దల రామకృష్ణారెడ్డి, వెంకటంపల్లి సత్యనారాయణరెడ్డి, ఎర్రోనిపల్లి చన్నప్పయ్య, ప్యాదిండి నరసింహారెడ్డి, చెన్నేకొత్తపల్లి ఎస్టీడీ శీనా, చిన్నా, ప్రకాష్, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 30న చలో న్యామద్దలను విజయవంతం చేయండి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పిలుపు -
భార్యలతో గొడవ .. ఇద్దరు యువకుల బలవన్మరణం
గోరంట్ల: భార్యలతో గొడవ కారణంగా ఇద్దరు యువకులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మండల పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వివరాలు... మండల పరిధిలోని కళ్లగేరి తండాకు చెందిన రమేష్నాయక్ (33) శనివారం అర్ధరాత్రి గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలోకి వెళ్లి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ శేఖర్ పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాలమేరకు... రమేష్నాయక్ తాగుడుకు బానిసై తరచు భార్యతో గొడవ పడేవాడన్నారు. శనివారం రాత్రి కూడా భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయి వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరివేసుకున్నాడని చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మసీదు సర్కిల్ ఏరియాలో మరొకరు.. మండల కేంద్రమైన గోరంట్లలోని మసీద్ సర్కిల్ ఏరియలో నివాసం ఉంటున్న ఉత్తరప్రదేశ్కు చెందిన పానీపూరి వ్యాపారి జోగేంద్ర సింగ్ (42) శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ శేఖర్ తెలిపారు. జోగేంద్ర సింగ్, అతని భార్య రేఖారాణి ఇద్దరూ శనివారం రాత్రి గొడవ పడ్డారు. మనస్తాపం చెందిన జోగేంద్ర సింగ్ క్షిణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య రేఖారాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. -
డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి
అనంతపురం అర్బన్: రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్ అన్నారు. అభ్యర్థులు భవిష్యత్తుతో చంద్రబాబు ప్రభుత్వం చెలాగాటం ఆడుతోందని మండిపడ్డారు. ఆదివారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణలో చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. గతంలో పరీక్షల మార్కులు అందరికీ తెలిసేలా బహిరంగంగా ప్రకటించేవారన్నారు. ఇప్పుడు గోప్యంగా ఉంచడం వెనుక మతలబు వ్యవహారం కనిపిస్తోందని చెప్పారు. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా నియామకాలకు సంబంధించి కొత్త నిబంధనలతో జీఓలు ఇవ్వడం వెనుక కుట్ర కోణం కనిపిస్తోందన్నారు. అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించకుండా దాటవేసే ధోరణి అవలంభిస్తుండటాన్ని బట్టి చూస్తేి ఇందులో పెద్దల ప్రమేయం ఉన్నట్లుగా తెలుస్తోందన్నారు. నీట్ పేపర్ లీకేజీ, విద్యారంగ సమస్యలపై ఆందోళన చేసిన విద్యార్థులు, యువతపైన పోలీసులు క్రూరంగా దాడి చేస్తే చంద్రబాబు ప్రభుత్వం మద్దతు తెలపకపోగా కనీసం సానుభూతి చూపకోవడం బాధకారమన్నారు. బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు చంద్రబాబు తొత్తుగా మారారనడానికి ఇదే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీరాములు, నారాయణస్వామి, లింగమయ్య, రాజేష్గౌడ్, కృష్ణుడు, అల్లీపీరా, తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా భూతప్ప ఉత్సవాలు
మడకశిరరూరల్: ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మండల పరిధిలోని భక్తరపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఆదివారం మినీ భూతప్ప ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తొలుత లక్ష్మీనరసింహస్వామి, జిల్లెడుగుంట ఆంజనేయస్వామి ఆలయాల్లో భక్తులు ఉపవాస దీక్షలతో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్నవారు, సంతానం లేని మహిళలు తడి బట్టలతో భూతప్పలు వచ్చేదారిలో బోర్లా పడుకున్నారు. స్వామివారి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకొస్తూ భూతప్పలు భక్తులపై కాలుమోపుతూ ఆలయానికి చేరుకున్నారు. భూతప్పలు కాలుమోపితే రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. అనంతరం భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. -
చెట్లకు నిప్పు .. వాతావరణానికి పెనుముప్పు
వజ్రకరూరు: మండల కేంద్రమైన వజ్రకరూరు సమీపంలోని ఉరవకొండ–గుంతకల్లు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెడుతున్నారు. దీంతో పచ్చని చెట్లు కాలిపోతున్నాయి. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెట్లకు కావాలనే నిప్పు పెడుతున్నారా, లేక ఇతర కారణాల వల్ల నిప్పు పెడుతున్నారా అన్నది తెలియాల్సి ఉంది. కనీసం ఇప్పటికై నా అధికారులు తక్షణమే స్పందించి ఉరవకొండ – గుంతకల్లు ప్రధాన రహదారిలో ఉన్న చెట్లను సంరక్షించేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గొర్రెల కాపరి ఆత్మహత్య డీ.హీరేహాళ్ (బొమ్మనహాళ్): డీ.హీరేహాళ్ మండలంలోని బాదనహాళ్ గ్రామ శివారులో గొర్రెల కాపరి బోయ శివరుద్ర (30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ గురుప్రసాద్రెడ్డి వివరాలమేరకు... శివరుద్ర గొర్రెలు మేపుతూ జీనవం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన, బాదనహాల్ రైల్వే బ్రిడ్జి సమీపంలోని పొలంలో వేపచెట్టుకు లుంగీతో ఉరివేసుకొని కనిపించాడు. విషయాన్ని గమనించిన గొర్రెల కాపరులు గ్రామస్తులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడికి ఇద్దరు కుమారైలు ఉన్నారు. మృతుడి భార్య అమృత ప్రస్తుతం గర్భిణిగా ఉన్నట్లు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బళ్లారి విమ్స్కు తరలించారు. మృతుడి తండ్రి గంగన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అనారోగ్యంతో మహిళ .. రాప్తాడు రూరల్: అనారోగ్యంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాప్తాడు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. పామిడి మండలం ఖాదర్పేటకు చెందిన లేట్ బుసా చంద్రశేఖర్రెడ్డి భార్య బుసా చంద్రకళ (50) ప్రస్తుతం రాప్తాడు మండలం ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటోంది. పది రోజులుగా ఆమె శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ, ఆహారం కూడా సరిగా తీసుకోలేకపోతున్నారు. దీంతో కుమార్తె బుసా వీర భార్గవి, మేనత్త ఉషారాణి కలిసి వివిధ ఆస్పతుల్లో చూపించినా ఫలితం లేకపోయింది. మనస్తాపానికి గురైన చంద్రకళ శనివారం రాత్రి ఇంటి హాలులోని ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనాస్థలాన్ని ఆదివారం పరిశీలించారు. భార్గవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి గుత్తి రూరల్: మండలంలోని అనగానదొడ్డి గ్రామ శివారులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు. మండలంలోని పి.ఎర్రగుడి గ్రామానికి చెందిన కుళ్లాయప్ప (45) పని నిమిత్తం గుత్తికి వచ్చాడు. ద్విచక్ర వాహనంలో ఇంటికి తిరిగి వెళ్తుండగా అనగానదొడ్డి గ్రామ శివారులో ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుళ్లాయప్పను వెంటనే చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స అందించేలోపే అతను చనిపోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలి
ఉరవకొండ: రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో చోటుచేసుకున్న అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం అనంతపురంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణలోని ప్రతి అంశాన్ని నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నీట్ పరీక్షలో అక్రమాలు, పేపర్ లీకేజీల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారని గుర్తు చేసిన ఆయన, రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షల నిర్వహణపై అనేక ఆరోపణలు వచ్చినా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వ బడులను నాడు–నేడు ద్వారా కార్పొరేట్ తరహలో తీర్చిదీద్ది, అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ బోధన వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ విద్యకు కొత్త ఊపు తీసుకొచ్చారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సంస్కరణలను కొనసాగించకుండా విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని విమర్శించారు. డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం స్పందించకుండా కాలయాపన చేస్తోందన్నారు. సీబీఐ దర్యాప్తు ద్వారానే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. అలాగే పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని వివరాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసి ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలన్నారు. ప్రభుత్వం దీని పై స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగులతో వైఎస్సార్సీపీ భారీ ఉద్యమాలకు శ్రీకారం చుడుతుందని హెచ్చరించారు. నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి వైఎస్సార్సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి -
‘టెట్’కు హాజరయ్యే టీచర్లకు ఓడీ ఇవ్వాలి
అనంతపురం ఎడ్యుకేషన్: టెట్–2026 పరీక్షలకు హాజరయ్యే ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీ (ఓడీ) సౌకర్యం కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు కళ్యాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రిస్వామి ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు శాఖాపరమైన (డిపార్ట్మెంటల్) పరీక్షలకు హాజరయ్యే సమయంలో ప్రభుత్వం ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పిస్తోందని వారు గుర్తు చేశారు. అలాగే ప్రభుత్వం నిర్వహిస్తున్న టెట్ పరీక్షలకు హాజరయ్యే ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా పరీక్ష రాసే రోజు ఓడీ మంజూరు చేయడం సముచితమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉపాధ్యాయులు పరీక్షలకు హాజరవుతారని పేర్కొన్నారు. సెలవు విషయంలో ఇబ్బంది తలెత్తకుండా, ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేందుకు ప్రభుత్వం ఓడీ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి హిందూపురం: మండలంలోని అప్పలకుంట గేట్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరొకరు గాయపడ్డారు. హిందూపురం రూరల్ పోలీసుల వివరాలమేరకు.. సంతేబిదనూరుకు చెందిన ముబారక్ (30)తో పాటు మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై తూమకుంట నుంచి హిందూపురం వైపునకు వస్తున్నారు. అయితే అప్పలకుంట గేట్ వద్ద తుఫాన్ వాహనం వేగంగా వచ్చి ఢీకొంది. ఘటనలో ముబారక్ తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన మరో వ్యక్తిని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటన ప్రదేశాన్ని హిందూపురం రూరల్ ఏఎస్ఐ శ్రీరాములు, సిబ్బంది పరిశీలించారు. -
డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం
అనంతపురం అర్బన్: జిల్లాలో ఎక్కడా డ్రగ్స్ మహమ్మారి కనిపించకూడదని, డ్రగ్స్రహిత జిల్లాగా తీర్చిదిద్ధేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ జగదీష్తో కలిసి కలెక్టర్ నార్కోటిక్ కో–ఆర్డినేషన్ జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగం ద్వారా కలిగే దుష్ప్రభావాలపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కల్పించే దిశగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బుక్కరాయసముద్రం చెరువు కట్ట దిగువన ఉన్న పార్కును వినియోగంలోకి తేవాలని నగరపాలక సంస్థ కమిషనర్ను ఆదేశించారు. గంజాయి, మాదకద్రవ్యాలు, ఇతర నిషేధిత పదార్థాల విక్రయాలను పూర్తిగా అరికట్టాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్కు వ్యతిరేకంగా పోలీసు శాఖ, ఈగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలకు పాఠశాల యాజమాన్యం పూర్తి సహకారం అందించాలని చెప్పారు. సమావేశంలో డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ వలిబాషా, ఈగల్ నోడల్ అధికారి జయపాల్రెడ్డి, ఎస్ఐ హనుమంతు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ‘ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. ఇళ్లకు వెళ్తే నిలదీస్తారు’ రాయదుర్గం రూరల్: ‘మనం ఇచ్చిన వాగ్దానాలు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడాన్ని ఇప్పటికే ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇంటింటికీ వెళితే కచ్చితంగా నిలదీస్తారు’ అంటూ ఏకంగా రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన సభలోనే ఆ పార్టీ నాయకుడు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. మండలంలోని 74 ఉడేగోళం మద్దానేశ్వర స్వామి కల్యాణమండపంలో శనివారం కాలవ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 27 నుంచి ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించాలని, ప్రతి ఇంటినీ సందర్శించి అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ క్రమంలోనే రాయదుర్గం మండలం బీఎన్ హళ్లికి చెందిన టీడీపీ నాయకుడు కాటా వెంకటేశులు మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టాడు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకూ ప్రతి నెలా రూ.1,500, అలాగే 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు పింఛన్, నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి, రైతులకు పంటల బీమా బకాయిలు, వితంతు పింఛన్, తల్లికి వందనం తదితర విషయాలపై బాధితులు నిలదీస్తారని అనడంతో అక్కడున్న వారంతా కంగుతిన్నారు. ఎమ్మెల్యే స్పందిస్తూ చిన్నచిన్న సమస్యలపై ప్రశ్నిస్తే పరిష్కరిస్తామని సమాధానం చెప్పాలనడం గమనార్హం. లోకేష్ రాజీనామా ఎప్పుడు? అనంతపురం: ‘నీట్ ప్రశ్నపత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇదే తరహాలో డీఎస్సీ నిర్వహణలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారు? అని వైఎస్సార్ విద్యార్థి, యువజన విభాగం నాయకులు ప్రశ్నించారు. విద్యార్థి, నిరుద్యోగ యువత సమస్యలపై వైఎస్సార్ విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ర్యాలీలకు సంబంధించిన పోస్టర్లను వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలన్న డిమాండ్లతో పాటు ‘నీట్’ అక్రమాలపై విద్యార్థుల ఆందోళనలకు సంఘీభావంగా ర్యాలీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. డీఎస్సీలో అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ మండిపడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్మోహన్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఎల్లుట్ల మారుతీనాయుడు, రాష్ట్ర కార్యదర్శి రాజేష్, జిల్లా ఉపాధ్యక్షుడు దాదా ఖలందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి మణికంఠ, విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దిరెడ్డి నరేంద్ర రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. -
ప్రీమియం చెల్లింపునకు తంటాలు
● బ్యాంకులు, కామన్ సర్వీస్ సెంటర్ల వద్ద రైతుల పడిగాపులు అనంతపురం అగ్రికల్చర్: వాతావరణ బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా కింద సాగు చేసిన పంటలకు తమ వాటా కింద ప్రీమియం చెల్లించేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. మీసేవ కేంద్రాల్లో అలాంటి సదుపాయం లేకపోవడం, కామన్ సర్వీసు సెంటర్లు (సీఎస్సీ) ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియకపోవడంతో రైతులు తికమక పడుతున్నారు. అక్కడక్కడ పని చేస్తున్నా సర్వర్లు సతాయింపుతో నెమ్మదిగా సాగుతుండడంతో రైతులు ప్రీమియం చెల్లింపు కోసం గంటలకొద్దీ ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ● జిల్లా వ్యాప్తంగా 50 వేల హెక్టార్ల వరకు కంది పంట వేశారు. 20 వేల హెక్టార్లలో పత్తి, 15 వేల హెక్టార్లలో వేరుశనగ, మిగతాది ఆముదం, మొక్కజొన్న సాగు చేశారు. దీంతో ఇప్పుడు కంది, పత్తి, ఆముదం పంటకు బదులు పంట మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కొత్తగా సాగు చేసిన పంటకు తమ వాటా కింద ప్రీమియం చెల్లిస్తే బీమా పథకాలు వర్తించనున్నాయి. ఫసల్బీమా కింద వరి, కంది, జొన్న, మొక్కజొన్న, ఆముదం, మిరప పంటలు ఉండగా.. వాతావరణ బీమా కింద వేరుశనగ, పత్తి, దానిమ్మ, చీనీ, బత్తాయి, అరటి, టమాట పంటలు ఉన్నాయి. వరికి ఆగస్టు 15 వరకు గడువు ఉండగా.. మిగతా అన్ని పంటలకూ ఈ నెలాఖరులోపు ప్రీమియం చెల్లించాలని గడువు ఉంది. అసలే ఎల్–నినో పరిస్థితులు ఉన్నందున పంట చేతికిరాని సమయంలో కనీసం బీమా పరిహారమైనా వస్తుందనే ఆశతో ప్రీమియం చెల్లించేందుకు ఎగబడుతున్నారు. పంట మార్పిడి ధ్రువీకరణకు అవస్థలు ఖరీఫ్లో దాదాపు వేరుశనగ పేరుతో బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకోవడం ఇప్పుడు రైతులకు సమస్యగా మారింది. సాగు చేసినట్లు ఈ–క్రాప్లో నమోదైన పంటకే ప్రీమియం చెల్లించినట్లుగా ఉండాలనే నిబంధన ఉండటంతో పంట మార్పిడి ధ్రువీకరణ కోసం ఇప్పుడు బ్యాంకులకు పరుగులు తీసి అవస్థలు పడాల్సి వస్తోంది. సీఎస్సీ నోడల్ ఆఫీసర్ పాండురంగయ్య (7989690495), ఫసల్ బీమా కంపెనీ ప్రతినిధి సిద్దేశ్వర్ (8431377472), వంశీకృష్ణ–టెక్నికల్ ఏఓ (8331057724)లను రైతులు సంప్రదించినా ప్రీమియం కట్టడానికి వెసులుబాటు లభించే అవకాశం ఉంటుంది. -
డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీద్దాం
● మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి రాప్తాడు రూరల్: డీఎస్సీలో చోటుచేసుకున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీద్దామని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పిలుపునిచ్చారు. ఎస్కేయూతో పాటు రాప్తాడు నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు, యువతతో శనివారం అనంతపురం రూరల్ మండలం ఆకుతోటపల్లిలో ‘టీ టైమ్ విత్ స్టూడెంట్స్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, యువతతో ఆయన ముఖాముఖి సమావేశమై రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, విద్యా సమస్యలు, నిరుద్యోగ యువత ఇబ్బందులు, ఉపాధి అవకాశాలు, ఫీజు రీయింబర్స్మెంట్, ఉన్నత విద్య, పోటీ పరీక్షలు తదితర అంశాలపై చర్చించారు. సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ తరఫున పోరాడుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 28న నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు, నీట్ పరీక్షల్లో అవకతవకలు, నిరుద్యోగ భృతి అమలు, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గంగుల సుధీర్రెడ్డి, అమర్నాథ్రెడ్డి, రాప్తాడు వైస్ ఎంపీపీ బోయ రామాంజనేయులు, ఎస్కేయూ లింగారెడ్డి, అనంతపురం రూరల్, రాప్తాడు మండలాల కన్వీనర్లు గోవిందరెడ్డి, సాకే వెంకటేశు, ఎంపీటీసీలు సోమశేఖర్రెడ్డి, సునిల్దత్తరెడ్డి, మాజీ సర్పంచ్లు ఆనంద్, గురుప్రసాద్, నాయకులు నారాయణస్వామి, మన్నల చిరంజీవి, రమేష్, పెరవళి జయచంద్రారెడ్డి, పూలకుంట భాస్కర్రెడ్డి, మన్నీల శేషు, ఎస్సీ సెల్ నల్లప్ప, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
నిరుద్యోగులతో చంద్రబాబు చెలగాటం
● ఘోరంగా డీఎస్సీ నిర్వహణ ● వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు విశ్వ వజ్రకరూరు: రాష్ట్రంలో డీఎస్సీ పరీక్ష నిర్వహణ అత్యంత ఘోరంగా జరిగిందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధారాలతో బయటపెట్టినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. శనివారం వజ్రకరూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. డీఎస్సీ పేపర్ తయారు చేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో పరీక్షలు రాయించి అక్రమాలకు తెరతీశారని, దీనిపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించకపోవడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు. పేపర్ లీకేజీలు, రాష్ట్రంలో విద్యావ్యవస్థలో జరుగుతున్న అక్రమాలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల 28న ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు, నిరుద్యోగ యువత, నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.విద్యార్థులపై అణచివేత చర్యలు దుర్మార్గం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్న విద్యార్థులపై అణచివేత చర్యలు చేపట్టడం దుర్మార్గమని విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించడం, లాఠీచార్జ్ చేయడం దారుణమన్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని అణచివేయాలని భావించడం సరికాదన్నారు. దేశంలో విద్యావ్యవస్థ పనితీరు అధ్వానంగా మారిందని విమర్శించారు. నీట్–యూజీ పేపర్ లీక్పై చేపట్టిన పోరాటానికి వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు స్వచ్ఛందంగా తరలివచ్చి పాల్గొన్నారన్నారు. 10 సంవత్సరాల్లో దాదాపు 150 సార్లు నీట్తోపాటు వివిధ పరీక్షల పేపర్లు లీక్ కావడం ఆందోళన కలిగిస్తోందని, కోట్లాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మనోవేదన మిగులుతోందని వాపోయారు. ఇలాంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి కారకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను విద్యార్థులు, యువత సాధించిన విజయంగా అభివర్ణించారు. విద్యార్థుల నుంచి వ్యతిరేకత వచ్చిన వెంటనే అప్రమత్తమై రాజీనామా చేసి ఉంటే ఇంత దాకా వచ్చి ఉండేదే కాదని చెప్పారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ.వీరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి రాకెట్ల అశోక్, వజ్రకరూరు మండల పార్టీ ఉపాధ్యక్షుడు ఉస్మాన్, జిల్లా నాయకులు రాకెట్లబాబు, రఘుపతి తదితరులు ఉన్నారు. -
వైద్యం అందక వృద్ధుడు మృతి
అనంతపురం సిటీ: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో సకాలంలో వైద్యం అందక ఓ వృద్ధుడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రాణం పోయిందంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. నార్పలకు చెందిన లక్ష్మీనారాయణ (60) కొంత కాలంగా గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శనివారం అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను 108 అంబులెన్స్ ద్వారా అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. వాహనం దిగి నడుచుకుంటూ ఎమర్జెన్సీ వార్డులోకి చేరుకున్న లక్ష్మీనారాయణకు చికిత్స చేయండని కుటుంబ సభ్యులు ప్రాధేయపడ్డారు. అయితే కొంతసేపటి తర్వాత వైద్యులు ఈసీజీకి రెఫర్ చేశారు. ఈలోపు పరిస్థితి విషమించింది. రాత్రి 7.30 గంటల సమయంలో ఆక్సిజన్ అందజేస్తూ సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు చూస్తుండగానే ప్రాణం విడిచాడు. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైద్యులు సకాలంలో వైద్యం అందించకపోవడం వల్లే తమ ఇంటి పెద్దదిక్కును కోల్పోవాల్సి వచ్చిందంటూ ఏఎంసీ వద్ద ఆందోళనకు దిగారు. రాత్రి 9 గంటల వరకు ఉద్రిక్తత నెలకొంది. చివరకు అవుట్పోస్టు ఎస్ఐ రవి, టూటౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులకు నచ్చచెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. కాగా, ఘటనకు బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు మృతుడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. -
ఆరుతడి పంటలే సాగు చేసుకోండి
అనంతపురం అర్బన్: ఎల్–నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులు ఆరు తడి పంటలు మాత్రమే సాగు చేసేలా చూడాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ సంబంధిత అంశాలపై కలెక్టర్ శనివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్–నినో ప్రభావం కారణంగా జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులకు అవకాశం ఉందన్నారు. దీంతో తాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రైతులు వరికి బదులు ఆరుతడి పంటలైన మొక్కజొన్న, జొన్న, కంది, ఉలవ, పెసర, మినుము, కొర్ర వంటివి సాగు చేసేలా చూడాలన్నారు. ఈ నెల 31లోగా రైతులు పంటల బీమా చేసుకునేలా అవగాహన కల్పించాలని చెప్పారు. పాడిపశువులకు గ్రాసం కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యాన పంటల్లో పీఎండీఎస్ విధానాన్ని అనుసరించేలా రైతులను ప్రోత్సహించాలని ఆదేశించారు. జిల్లాలో పట్టు పరిశ్రమ విస్తీర్ణం పెంచేలా, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి సాలురెడ్డి, ఉద్యాన శాఖ అధికారి ఉమాదేవి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథ్రెడ్డి, పశుసంవర్ధక శాఖ అధికారి ప్రేమ్చంద్, తదితర శాఖ అధికారులు పాల్గొన్నారు. -
●ఘనంగా తొలి ఏకాదశి పూజలు
బొమ్మనహాళ్: ఆంధ్ర పండరీపురంగా ప్రసిద్ధి చెందిన ఉంతకల్లు రుక్మిణీ పాండురంగస్వామి దేవాలయంలో తొలి ఏకాదశి పూజలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. పాండురంగస్వామికి తెల్లవారుజామున వేదమంత్రోచ్ఛరణల మధ్య అభిషేకం నిర్వహించారు. పుష్పాలకరణ, ఆకుపూజ, ప్రత్యేక అలంకరణ చేసి కుంకుమార్చన, పంచామృతాభిషేకం, మహామంగహారతి వంటి ప్రత్యేక పూజలు చేపట్టారు. విఠల విఠల... రుక్మిణీ పాండురంగ విఠల అంటూ భక్తులు స్వామికి ప్రత్యేక పూజలు, భజనలు చేశారు. ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. -
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
● సర్వజనాస్పత్రి వైద్యులను హెచ్చరించిన కలెక్టర్ అనంతపురం సిటీ: విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వ సర్వజనాస్పత్రి వైద్యులను కలెక్టర్ ఆనంద్ హెచ్చరించారు. అనంతపురంలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోని సెమినార్ హాలులో శుక్రవారం సర్వజనాస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. సర్వజనాస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అయిన కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి కమిటీ ఉపాధ్యక్షుడు, అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గత సమావేశంలో చేసిన తీర్మానాల అమలు ప్రగతి, ప్రస్తుతం అవసరమైన సౌకర్యాల కల్పన ప్రతిపాదనలపై జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. గత సమావేశంలో తీర్మానించిన పనులు పెండింగ్లో ఉంచడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒప్పందం మేరకు సిబ్బందిని పెంచని సెక్యూరిటీ ఏజెన్సీని బ్లాక్ లిస్ట్లో పెట్టాలని ఆదేశించారు. వ్యక్తిగత విద్వేషాలను పక్కన పెట్టి రోగులకు మానవతా దృక్పథంతో సేవలందించాలన్నారు. ఆస్పత్రి క్యాంటీన్ అనుమతి ప్రక్రియను వారం రోజుల్లోపు పూర్తి చేయాలని సూచించారు. ఆస్పత్రి పరిసరాలు, వార్డుల్లో పారిశుధ్యం మెరుగుపడాలని, తాగునీటి సమస్య రాకుండా చూడాలని, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో వెంటనే తాగునీటి పైప్లైన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, ప్రస్తుతం జరుగుతున్న సివిల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయశ్రీ, అడ్మినిస్ట్రేటర్ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జునరెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ హేమలత, సూపర్ స్పెషాలిటీ డిప్యూటీ సూపరింటెండెంట్ బెనడిక్ట్, డీఎంహెచ్ఓ కట్టా వెంకటేశ్వర్లు, డీసీహెచ్ఎస్ డాక్టర్ నవీన్కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ జస్వంత్రావు, ఈఈ రామ్మోహన్, హెచ్డీఎస్ కమిటీ సభ్యులు విశా ఫెర్రర్, ఓ.రత్నమయ్య, మిద్దెల నరసింహులు, కొప్పల వెంకటరమణయ్య, వివిధ విభాగాధిపతులు, వైద్యులు పాల్గొన్నారు. -
పిల్లలతో మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తారా?
● మెగా పీటీఎంలోవిద్యార్థుల తల్లిదండ్రుల నిరసన గుత్తి రూరల్: పిల్లలను చదువుకోవడానికి పంపిస్తే వారితో మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తారా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ను నిలదీశారు. శుక్రవారం గుత్తి మండలం రజాపురంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి విద్యార్థినుల తల్లిదండ్రులు హాజరయ్యారు. గురుకులంలో నెలకొన్న సమస్యలపై తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ నాగజ్యోతితో వాగ్వాదానికి దిగారు. తమ పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని గురుకుల పాఠశాలలో చేర్పిస్తే.. ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినులతో మరుగుదొడ్లు, స్నానపు గదులు, పరిసరాలు ఎలా శుభ్రం చేయిస్తారు.. మీ పిల్లలైతే ఇలా చేయిస్తారా.. పేద పిల్లలంటే అంత చులకనగా కనపడుతున్నారా అంటూ నిలదీశారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. జీతాలు రాలేదని పారిశుధ్య సిబ్బంది పని మానేస్తే.. వారి పనిని మా పిల్లలతో చేయిస్తారా అంటూ ప్రశ్నించారు. భోజనం కూడా నాణ్యతగా ఉండటం లేదని, నీళ్ల పప్పు, చారు వడ్డిస్తున్నారని, ఇదేమని ప్రశ్నిస్తే విద్యార్థినులపై కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐ సురేష్బాబు, అమీర్ ఖాన్ సిబ్బందితో కలిసి వచ్చి విద్యార్థినుల తల్లిదండ్రులను శాంతింపజేశారు. నాసికరం భోజనంపై అసంతృప్తి డి.హీరేహాళ్ (బొమ్మనహాళ్): మండల కేంద్రమైన డీ.హీరేహాళ్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో విద్యార్ధులు వారి తల్లిదండ్రులకు అందించిన మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉండటంతో అసంతృప్తి వ్యక్తమైంది. ఈ కార్యక్రమానికి రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ గ్రామాల నుంచి మెగా పీటీఎం 4.0 కార్యక్రమానికి విద్యార్ధులు, తల్లిదండ్రుల కార్యక్రమానికి వచ్చారు. వడ్డించిన అన్నం ముద్దగా ఉండటంతో పాటు సాంబార్ నాణ్యత లేకపోవడంతో చాలామంది భోజనం చేయకుండా వెళ్లిపోయారు. లక్ష్యం ఎంచుకుని చదవండి గార్లదిన్నె: విద్యార్థులు తమ లక్ష్యం ఏమిటో ఎంచుకుని అందుకు తగ్గట్టు చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం గార్లదిన్నెలోని జెడ్పీ హైస్కూల్లో తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం (మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్) నిర్వహించారు. ముఖ్య అతిథి కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు గర్వించే స్థాయికి విద్యార్థులు ఎదగాలని ఆకాంక్షించారు. హిందీ ఉపాధ్యాయుల కొరత, ప్రహరీ, క్రీడా మైదానం సమస్యలను ఉపాధ్యాయులు విన్నవించారు. పీటీఎం విజయవంతం అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 1,752 ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (పీటీఎం) విజయవంతంగా ముగిసిందని డీఈఓ శ్రీనివాసరావు తెలిపారు. 1,69,102 మంది విద్యార్థులు, 1,47,525 మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, 22,240 మంది పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, 1,334 మంది పూర్వ విద్యార్థులు, 767 మంది దాతలు, 1,428 మంది ప్రజాప్రతినిధులు, 32,299 మంది ఇతరులు పాల్గొన్నారు. -
31న ఉరవకొండలో మహాధర్నా
ఉరవకొండ: మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ నేతల దౌర్జన్యకాండను నిరసిస్తూ ఈనెల 31న ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహాధర్నా చేపట్టనున్నట్లు వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీకి చెందిన కురుబ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కౌడిగి గోవిందు అల్లుడు జయకుమార్ వేల్పుమడుగు పొలం సర్వే నం.141లోని 21 ఎకరాల పొలం కొనుగోలు చేస్తే , ఆపొలాన్ని ఎలాగైనా కబ్జా చేయాలని టీడీపీ నేతలు మంత్రి కేశవ్ డైరెక్షన్తో ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడుతూ రైతును పొలంలోకి వెళ్లకుండా చేస్తున్న అధికారులపైనా చట్టపరమైనచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పొలంపై జయకుమార్కు సర్వహక్కులున్నాయని, జిల్లా కోర్టు, హైకోర్టు, సివిల్ కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందన్నారు. దీనిపై అనేక మార్లు జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓలను కలిసి విన్నవించినట్లు తెలిపారు. రైతు తన పొలంలో వేసిన మూడు బోర్లు, పైప్లు టీడీపీ నేతలు ధ్వంసం చేశారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు డిష్ సురేష్, కౌడిగి గోవిందు, వైస్ ఎంపీపీ ఈడిగ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జూనియర్ అసిస్టెంట్పై వేటు అనంతపురం అగ్రికల్చర్: వ్యవసాయశాఖ ఏడీ కార్యాలయంలో మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలపై విచారణ ఎదుర్కొన్న జూనియర్ అసిస్టెంట్ రమణారెడ్డిపై కలెక్టర్ ఆనంద్ సస్పెన్షన్ వేటు వేశారు. రమణారెడ్డిని తక్షణం సస్పెండ్ చేస్తూనే ఆయన వివరణ తీసుకుని, తదుపరి క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని జేడీఏ ఎన్.సాలురెడ్డిని ఆదేశించినట్లు వ్యవసాయశాఖ వర్గాలు ధ్రువీకరించాయి. ప్రొఫెసర్లను విచారించిన సీబీ సీఐడీ అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లను సీబీ సీఐడీ అధికారులు శుక్రవారం విచారణ చేశారు. గతంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్–1 మెయిన్స్ పరీక్షకు సంబంధించి మూల్యాంకనం చేసిన ప్రొఫెసర్ల వివరాలను ఆరా తీసి, జవాబు పత్రాల్లో పెట్టిన సంతకం.. తాజాగా నమోదు చేస్తున్న సంతకాన్ని పోల్చి చూశారు. అన్ని యూనివర్సిటీల్లోనూ ప్రొఫెసర్ల సంతకాలను సరిపోల్చి చూస్తున్నట్లు తెలిసింది. ఇక జేసీ ఆగడాలు సాగనివ్వంపెద్దవడుగూరు: ‘నా ఊపిరి ఉన్నంత వరకూ జేసీ ప్రభాకర్రెడ్డి ఆగడాలు సాగనివ్వను’ అని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం మేడిమాకులపల్లిలో వైస్సార్సీపీ నేత చితంబరరెడ్డిని కలిసి మాట్లాడారు. ఇటీవల జేసీ ప్రభాకర్రెడ్డి తన అనుచరులతో కలిసి చితంబరరెడ్డి ఇంటి వద్ద హల్చల్ చేసిన విషయం విదితమే. దీనిపై కేతిరెడ్డి పెద్దారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే జేసీ అస్మిత్రెడ్డి అండతోనే వైఎస్సార్సీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయన్నారు. రౌడీలను, గూండాలను ఉసిగొల్పి గ్రామాల్లో కక్షలు ప్రేరేపిస్తున్నారన్నారు. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి నాయకుడు, కార్యకర్తకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ఇటీవల మదన్మోహన్రెడ్డి ఇంటిపై దాడి చేసిన కేసులో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై నాన్బెయిలబుల్ కేసులు పెట్టడం, అధికార పార్టీ వాళ్లకు మాత్రం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపడం సరికాదన్నారు. కేవలం వైఎస్సార్సీపీ కార్యకర్తలను పిలిపించి బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారని, పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్సార్సీపీ నాయకుడు గూడూరు సూర్యనారాయణరెడ్డిపై టీడీపీ నాయకులు దాడి చేస్తే పోలీసులు కౌంటర్ కేసు నమోదు చేస్తామని చెప్పడం సరికాదన్నారు. కార్యక్రమంలో మండల నాయకులు ఎద్దుల శరభారెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్రెడ్డి, సూర్యప్రభాకర్రెడ్డి, కొట్టాలపల్లి హరినాథరెడ్డి, గుత్తి అనంతపురం గోవర్ధన్రెడ్డి, మోహన్రెడ్డి, మహేష్రెడ్డి, చింతలచెరువు భాస్కర్రెడ్డి, శేఖర్, రాజాకొండయ్య, రంగేశ్వరెడ్డి, సజ్జలదిన్నె రాజు, కొండారెడ్డి పాల్గొన్నారు. -
బీజేపీకి వత్తాసు పలుకుతారా?
అనంతపురం ఎడ్యుకేషన్: ‘నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కారణంగా జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ విద్యా సంస్థల బంద్ చేపడితే రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాల్సింది పోయి బీజేపీకి వత్తాసు పలుకుతారా? వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతాం’ అని విద్యార్థి, యువజన, మహిళా సంఘాల నాయకులు హెచ్చరించారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని దేశవ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం జిల్లాలో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, పీడీఎస్యూ, ఏఐఎస్ఏ, పీఎస్ఎఫ్, ఏఐఎస్బీ, ఏఐవైఎఫ్, డీవైఎఫ్ఐ, ఐద్వా తదితర సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతపురంలోని కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల పాఠశాల వద్ద శాంతియుతంగా బంద్ నిర్వహించేందుకు వెళ్లిన విద్యార్థి, యువజన సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. బలవంతంగా అరెస్టులు చేసి టూటౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నాయకులు తీవ్రంగా ఖండించారు. శాంతియుత నిరసన తెలిపే ప్రజాస్వామ్య హక్కును కూడా పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్కు మద్దతు తెలపగా, ప్రభుత్వ విద్యాసంస్థల వద్ద పోలీసులను మోహరించి బంద్ను అడ్డుకోవడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పక్షాన నిలవాల్సింది పోయి కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేసే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పరమేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు హనుమంతరాయుడు, ఏఐఎస్బీ జిల్లా కార్యదర్శి పృథ్వీ, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి వీరేంద్ర ప్రసాద్, పీఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు అబ్దుల్ అలం, ఎన్ఎస్యూఐ జిల్లా కార్యదర్శి ఓబులేసు, ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి బాలకృష్ణ, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రమేష్, ఏఐవైఎఫ్ నాయకుడు దుర్గాప్రసాద్తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. రాయదుర్గంలో ఉద్రిక్తత రాయదుర్గంటౌన్: నీట్ పేపర్ లీకేజీ, విద్యార్థులపై దాడులకు నిరసనగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్లతో విద్యార్థి సంఘాలు తలపెట్టిన విద్యా సంస్థల బంద్ శుక్రవారం రాయదుర్గంలో ఉద్రిక్తతకు దారి చేసింది. మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్(పీటీఎం)లు నిర్వహిస్తుండడంతో బంద్ చేయించేందుకు వచ్చిన ఏఐవైఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి కావలి కొట్రేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ఆంజనేయులు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు బంగి శివ, పీడీఎస్యూ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్ చేసి, పోలీస్స్టేషన్కు తరలించారు. స్టేషన్ వద్ద విద్యార్థి సంఘాల నేతలు ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసన తెలియజేశారు. ఆందోళనకారులను బలవంతంగా అరెస్టు చేస్తున్న పోలీసులు అనంతపురంలో కేఎస్ఆర్ పాఠశాల ఎదుట ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థి సంఘాల నేతలు స్థానిక ఎన్నికల్లో ‘కూటమి’కి బుద్ధి చెబుతాం నీట్ లీకేజీపై విద్యార్థి నాయకుల ఆగ్రహం విద్యా సంస్థల బంద్ విజయవంతం -
'చదవడం' నావల్ల కాదన్నా వినిపించుకోరేం?
ఉరుకులపరుగుల జీవితంలో అన్నింటా పోటీనే.. అన్నింటికీ మార్కులే కొలమానం. ర్యాంకులే రాజ్యమేలుతున్న తరుణంలో అర మార్కు తక్కువైనా... పరువు సమస్య. అందుకే విద్యార్థులపై మోయలేని భారం. నావల్ల కాదన్నా.. వినిపించుకోని కుటుంబం. భరించగలిగినోళ్లు బతికిపోతుండగా.. చేతగాని వారంతా చావును వెతుక్కుంటున్నారు. తాజాగా మార్కుల ఒత్తిడి తట్టుకోలేక.. హాస్టల్లో ఉండలేక మడకశిరలో ఓ విద్యార్థి ఉరివేసుకున్నాడు. హాస్టల్లో చేరిన గంటల వ్యవధిలోనే బలవన్మరణం చెందాడు. హాస్టల్లో ఉండి చదవడం ఇష్టంలేని ఓ విద్యార్థి ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. మృతుని కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు...రొళ్ల మండలం చిగమతిగట్ట గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప, నళినమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కూతురు సంతానం. అందరిలో చిన్నవాడైన చంద్రేగౌడ్(18) అగళి మండలం ఇనగలూరు జెడ్పీ హైస్కూల్లో 385 మార్కులతో పదో తరగతి పూర్తి చేశాడు. ఆ తర్వాత హిందూపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్లో (ఎంపీసీ) చేరినా అక్కడ ఉండటం ఇష్టంలేక మధ్యలోనే ఇంటికి వచ్చాడు. దీంతో తల్లిదండ్రులు చంద్రేగౌడ్ను మడకశిరలోని వెంకటేశ్వర కళాశాలలో చేర్పించారు.రోజూ ఇంటివద్దనుంచే కళాశాలకు వచ్చి వెళ్లేవాడు. మొదటి సంవత్సరంలో 470 మార్కులకుగాను 399 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే కళాశాలలోని హాస్టల్లోనే ఉంచితే చదువుకునేందుకు సమయం ఉంటుందని, మార్కులు కూడా పెరుగుతాయని భావించిన కుటుంబీకులు ద్వితీయ సంవత్సరం హాస్టల్లో ఉండి చదువుకోవాలని చెప్పారు. దీంతో ఇష్టంలేకపోయినా చంద్రేగౌడ్ ఒప్పుకున్నాడు. ఈక్రమంలోనే బుధవారం సాయంత్రం లగేజీతో హాస్టల్కు వచ్చిన చంద్రేగౌడ్.. రాత్రి వేళ హాస్టల్లోని వాష్రూంకు వెళ్లి అక్కడే ఉరివేసుకున్నాడు.గురువారం ఉదయం గమనించిన హాస్టల్ సిబ్బంది పోలీసులకు, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఇంటికి దూరంగా ఉంటూ ఒత్తిడితో కూడిన చదువులు తనకు ఇష్టంలేదని చంద్రేగౌడ్ తరచూ చెప్పేవాడని, ఈక్రమంలోనే చదవలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణం చెందాడని స్నేహితులు, బంధువులు చెబుతున్నారు. చంద్రేగౌడ్ మృతితో స్వగ్రామం చిగమతిగట్టలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న మడకశిర ఎస్ఐ కృష్ణారెడ్డి కళాశాల హాస్టల్కు వెళ్లి వివరాలు సేకరించారు. కళాశాల యాజమాన్యం, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
‘ఉపాధి’ కూలీల వేతన వెతలు
● రూ. 73.23 కోట్ల మేర బకాయిలు ● ఆవేదన చెందుతున్న గ్రామీణులు అనంతపురం న్యూటౌన్: రెండు దశాబ్దాల పాటు గ్రామీణ పేదలకు జీవనోపాధి కల్పించిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ (నరేగా) చట్టం ఇటీవల ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్’ (వీబీజీ–రాంజీ)గా మారిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ 30 కంటే ముందు మంజూరైన పనులన్నీ ఆటోమేటిక్గా కొత్త చట్టంలోకి మారాయి. అయితే పాత చట్టంలో భాగంగా చేసిన పనులకు సంబంధించి ఇప్పటికీ వేతనాలు విడుదల కాకపోవడం గమనార్హం. జూన్ 8 వరకూ మాత్రమే కూలి డబ్బులు అందాయని, ఆ తర్వాత ఖాతాల్లో జమ కాలేదని ఉపాధి కూలీలు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఉపాధి కూలీలకు రూ. 73,23,82,790 మేర బకాయిలున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. అత్యధికంగా శింగనమల మండలానికి చెందిన కూలీలకు రూ. 5,33,01,578 మేర బకాయిలున్నాయి. రెండు, మూడు స్థానాల్లో బుక్కరాయసముద్రం, గుంతకల్లు మండలాలు ఉన్నాయి. వేతనాలు అందకపోవడంతో చేసేదిలేక వందలాది పేద కుటుంబాలు బెంగళూరు, చైన్నె, హైదరాబాద్ తదితర నగరాలకు వలస బాట పట్టాయి. వృద్ధులు, పిల్లలను వదలి సుదూర ప్రాంతాలకు ఉపాధి వెతుక్కుంటూ వెళుతున్నా ప్రభుత్వాలకు కనికరం లేకుండా పోయిందని ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నారు. -
టీబీ డ్యాంకు పెరిగిన ఇన్ఫ్లో
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయానికి వరద పెరుగుతోంది. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఆశాజనకంగా కురుస్తున్న వర్షాలతో డ్యాంకు ఇన్ఫ్లో భారీగా వస్తోంది. తుంగభద్ర జలాశయం ఎగువన ఉన్న గాజునూరు జలాశయం (అప్పర్ తుంగా ప్రాజెక్ట్)లో నీటి నిల్వ గరిష్ట మట్టానికి చేరడంతో అక్కడి అధికారులు 22 క్రస్ట్ గేట్లు ఎత్తి 37 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులు తున్నారు. ఆ నీరంతా పరుగున వచ్చితుంగభద్ర డ్యాంలో చేరుతోంది. ప్రస్తుతం జలాశయంలో 28 టీఎంసీల నీరు ఉంది. తాగునీటి అవసరాల నిమిత్తం వివిధ కాలువలకు 3,035 క్యూసెక్కులు వదులు తున్నారు. ఇన్నాళ్లూ నిరాశ పరిచిన వరద ఒక్కసారిగా పెరగడంతో తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. వరుణుడి కరుణ కొనసాగి జలాశయం త్వరగా నిండాలని ఆకాంక్షిస్తున్నారు. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1,625.64 అడుగులతో 78.60 టీఎంసీల నీరు నిల్వ ఉండి 29,546 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 38,557 క్యూసెక్కుల అవుట్ఫ్లో నమోదైంది. రైతులకు 2024 ఫసల్ బీమా పరిహారం! అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్–2024కు సంబంధించి ఫసల్బీమా పథకం కింద రైతులకు పరిహారం విడుదలైనట్లు తెలుస్తోంది. ఏయే పంటలకు వర్తింపజేశారు, ఎంత మంది రైతులున్నారు, ఎంత మొత్తం విడుదలైంది, వాతావరణ బీమా కింద ఏమైనా పరిహారం వచ్చిందా అనే వివరాలు తమకు ఇంకా అందలేదని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. కొందరు రైతుల మొబైల్కు గురువారం మెసేజ్లు వచ్చినట్లు చెబుతున్నారు. ఇందులో 2024 ఖరీఫ్ ఫసల్బీమా కింద పాక్షికంగా పరిహారం విడుదల చేస్తున్నట్లు పేర్కొనడం గమనార్హం. దీనిపై బీమా కంపెనీలను సంప్రదించి స్పష్టత తీసుకుంటామని జేడీఏ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ప్రతి ఎకరాకూ బీమా వర్తించాలి అనంతపురం అర్బన్: సాగు చేసిన ప్రతి ఎకరాకూ బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి పర్యవేక్షణ కమిటీ, క్రాప్ ఇన్సూరెన్స్ (డీఎల్ఎంసీ) సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పంటల బీమాకు ఈనెల 31 వరకు అవకాశం ఉందన్నారు. రైతులందరూ నమోదు చేసుకునేలా చూడాలన్నారు. వాతావరణ ఆధారిత బీమా కింద ఇప్పటి వరకు 38,416 హెక్టార్లకు సంబంధించి 25,621 మంది,దిగుబడి ఆధారిత బీమా కింద 32,514 హెక్టార్లకు 19,908 మంది రైతులు నమోదు చేసుకున్నారన్నారు. ఎంత మంది రైతులు రుణాలు తీసుకున్నారు.. ఎంత మంది బీమా నమోదు చేసుకున్నారు.. వేరుశనగ నుంచి ఇతర పంటలకు మారిన రైతులు ఎంత మంది తదితర వివరాలతో నివేదిక అందించాలని ఎల్డీఎంను ఆదేశించారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో ఉద్యాన శాఖ అధికారి ఉమాదేవి, ఎల్డీఎం మారుతి శ్రీనివాసులు, ఏడీఏలు, బ్యాంకర్లు, బీమా ఏజెన్సీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వెనక్కిరాని ఈఎఫ్లు 2.40 లక్షలు అనంతపురం అర్బన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పొడిగించిన షెడ్యూల్ ప్రకారం తొలి అంకమైన ఓటర్ల ఎన్యుమరేషన్ ప్రక్రియ శుక్రవారంతో ముగియనుంది. జిల్లావ్యాప్తంగా 20,38,523 మంది ఓటర్లు ఉండగా, వీరందరికీ ఎన్యుమరేషన్ ఫారాలు అందజేశారు. పది రోజులు గడువు పొడిగించిన తరువాత కొనసాగిన ఎన్యుమరేషన్ ప్రక్రియలో రోజురోజుకూ ఈఎఫ్ల డిజిటలైజేషన్ సంఖ్య తగ్గుతుండగా... అదే క్రమంలో వెనక్కిరాని (అన్ కలెక్టబుల్) ఈఎఫ్ల సంఖ్య పెరుగుతూ పోతోంది. బుధవారం నాటికి ఈఎఫ్ల డిజిటలైజేషన్ 18,07,239 ఉండగా గురువారం నాటికి 8,978 మేర తగ్గి 17,98,261కు చేరింది.అన్కలెక్టబుల్ ఈఎఫ్లు బుధవారం నాటికి 2,31,284 ఉండగా గురువారానికి మరో 8,978 పెరిగి 2,40,262కు చేరాయి. ప్రక్రియ ముగియనున్న చివరి రోజు శుక్రవారం నాటికి ఈఎఫ్ల డిజిటలైజేషన్ మరికొంత తగ్గి, అన్కలెక్టబుల్ ఈఎఫ్ల సంఖ్య మరికొంత పెరగవచ్చని అధికావర్గాలు చెబుతున్నాయి. -
మెగా పీటీఎం.. బంద్ టెన్షన్
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం నిర్వహించనున్న ‘మెగా పేరెంట్–టీచర్ మీటింగ్’ (పీటీఎం)కు అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్న వేళ, దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు ఉపాధ్యాయుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకవైపు ప్రభుత్వం పీటీఎంను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆదేశిస్తుండగా, మరోవైపు బంద్ నేపథ్యంలో కార్యక్రమం సజావుగా సాగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం, 21 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్య విద్యార్థి సంఘాలు దేశవ్యాప్త బంద్కు పిలుపునిచ్చాయి. జిల్లాలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐఎస్బీ, ఏఐఎస్ఏ, పీఎస్యూ, పీఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, పీడీఎస్యూ తదితర విద్యార్థి సంఘాలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరాయి. అధికారుల స్పష్టమైన ఆదేశాలు జిల్లా వ్యాప్తంగా 1,752 ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పీటీఎంలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బంద్కు, పీటీఎంకు సంబంధం లేదని, నిర్ణయించిన ప్రకారమే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని విద్యాశాఖ అధికారులు హెచ్ఎంలు, టీచర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అడ్డుకుని తీరుతామని విద్యార్థి నాయకులు హెచ్చరిస్తున్నారు. నిధులు తక్కువ.. ఖర్చులు ఎక్కువ మెగా పీటీఎం నిర్వహణకు ప్రభుత్వం కేటాయించిన నిధులు సరిపోవడం లేదని హెచ్ఎంలు, టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 251 నుంచి 1,000 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.6,750లు, 1,000 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలకు రూ.9,000 మాత్రమే కేటాయించారని, ఈ మొత్తంతో కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించడం సాధ్యం కాదంటూ పెదవి విరుస్తున్నారు. ఖాతాల్లోకి చేరని నిధులు కేటాయించిన నిధులు ఎంఈఓల ఖాతాల్లో జమ చేశామని అధికారులు చెబుతున్నా గురువారం రాత్రి వరకు అనేక మంది హెచ్ఎంల ఖాతాలకు బదిలీ కాలేదు. దీంతో కార్యక్రమ నిర్వహణ కోసం సొంతంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు వాపోతున్నారు. ఒకవైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మెగా పీటీఎంను నిర్వహించాలని ఒత్తిడి చేస్తుండగా, మరోవైపు బంద్ ప్రభావం, నిధుల కొరత, నిర్వహణ భారంతో క్షేత్రస్థాయిలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. నేడు పాఠశాలల్లో సమావేశాలు నిర్వహించాలని సర్కారు ఆదేశాలు విద్యార్థి సంఘాల దేశవ్యాప్త బంద్ పిలుపుతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నిధులు నామమాత్రంగా ఉన్నా పండుగలా చేపట్టాలని ఆదేశించడంపై పెదవివిరుపు -
‘పెద్ద సారు’ లేక.. శాంతిభద్రతలు పడక!
తాడిపత్రి రూరల్: జిల్లాలో అత్యంత సమస్యాత్మకమైన తాడిపత్రి పోలీసు సబ్ డివిజన్కు డీఎస్పీని నియమించడంలో పోలీసుశాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. ఇక్కడ పనిచేసిన ఏఎస్పీ రోహిత్కుమార్ బదిలీపై పల్నాడుకు వెళ్లి 15 రోజులు కావొస్తున్నా ఇప్పటికీ ఆ స్థానంలో మరొకరిని నియమించకపోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఫ్యాక్షన్ ప్రభావితనియోజకవర్గంలో ఏ క్షణాన ఏం జరుగుతుందో ఉహకందని పరిస్థితి. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఏళ్ల తరబడిగా పోలీసు పికెటింగ్ కొనసాగుతున్నా తరచూ హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటుండడమే ఇందుకు నిదర్శనం. తాడిపత్రి మండలంలోని వీరాపురంగ్రామంలో 2019లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా భాస్కర్రెడ్డి అనే వ్యక్తిని ప్రత్యర్థులు హతమార్చడంతో ప్రతీకార దాడులు జరగకుండా ఏర్పాటు చేసిన పికెటింగ్ నేటికీ కొనసాగుతోంది. ఆలూరు గ్రామంలో సైతం 2024 నుంచి పోలీసు పికెటింగ్ ఉంది. బ్రహ్మణపల్లిలో కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి ఉన్నా కొన్నిరోజుల క్రితం ఒక వర్గానికి చెందిన వ్యక్తిపై దాడి చేయడం, అతని బైక్ను ప్రత్యర్థులు కాల్చి వేయడం గమనార్హం. ఊరుచింతల గ్రామంలో అయితే జంట హత్యలు జరిగాయి. నియోజకవర్గంలోని పెద్దపప్పూరు మండలందేవుని ఉప్పలపాడు, యాడికి మండలంలోని కోన ఉప్పలపాడు, పెద్దవడుగూరు మండలంలోని ఓ గ్రామంలో కూడా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వంద కిలోమీటర్ల దూరంలో ఇన్చార్జ్ డీఎస్పీ.. రోహిత్కుమార్ బదిలీపై వెళ్లాక గుంతకల్లు డీఎస్పీకి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు. తాడిపత్రి పట్టణానికి గుంతకల్లు వంద కిలోమీటర్ల దూరంలో ఉండడంతో అత్యవసరమైతే తప్ప ఇన్చార్జ్ డీఎస్పీ ఇక్కడికి రాని పరిస్థితి. ఇదే అదనుగా కింది స్థాయి అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అన్నింటినీ ‘క్యాష్’ చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేకాట, మట్కారాయుళ్లతో కొందరు పోలీసులు ప్రతి నెలా పెద్ద మొత్తంలో పుచ్చుకుంటున్నారనే విమర్శలు సైతం ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న సీఐ, ఎస్ఐలు అధికార పార్టీ నేత చెప్పిందల్లా చేస్తుండడం, అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తుతుండడంతో శాంతిభద్రతలు గాల్లో దీపంలా మారాయి. అక్రమ పంచాయితీలు, పేకాట, మట్కా, ఇసుక, మట్టి తవ్వకాలు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు హద్దే లేకుండా పోతోంది. ప్రతిపక్ష పార్టీ నాయకులను అక్రమ కేసులతో వేధిస్తున్నారు. ఈ క్రమంలో తమకు జరిగిన అన్యాయంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక బాధితులు సతమతమవుతున్నారు. ఇప్పటికై నా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని సబ్డివిజన్ ప్రజలు కోరుతున్నారు. తాడిపత్రి ఏఎస్పీ బదిలీపై వెళ్లి 15 రోజులు గుంతకల్లు డీఎస్పీకి ఇన్చార్జ్ ఇచ్చి చేతులు దులుపుకున్న ఉన్నతాధికారులు ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతంలో క్షణక్షణం భయాందోళనగా పరిస్థితి -
టెక్సాస్ తెలుగు సదస్సుకు రాచపాలెం
అనంతపురం సెంట్రల్: ఉత్తర టెక్సాస్లో ఈనెల 26న జరగనున్న అంతర్జాల సాహిత్య సదస్సుకు జిల్లాకు చెందిన ఏపీ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడు, సుప్రసిద్ధ సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి హాజరుకానున్నారు. ‘తెలుగు సాహిత్య విమర్శ నాడు–నేడు’ అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నట్లు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షుడు మాధవి లోకిరెడ్డి, సమన్వయకర్త దయాకర్మాడ తెలిపారు. ప్రతినెలా తెలుగు వెన్నెల పేరుతో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక ఆధ్వర్యంలో వెబ్నార్ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. -
‘బడుగు, బలహీన వర్గాలపై కక్ష సాధింపు’
అనంతపురం: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బడుగు, బలహీన వర్గాలపై కక్ష సాధింపు అధికమైందని వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్గౌడ్ ధ్వజమెత్తారు. వైఎస్సారీసీపీ జిల్లా కార్యాలయంలో గురువారం బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్షపూరితంగా తప్పుడు కేసులు బనాయిస్తూ, అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో 2023లో వైఎస్సార్సీపీకి చెందిన బీసీ నాయకుడు గోవిందు అల్లుడు జయకుమార్ కొనుగోలు చేసిన 21 ఎకరాల భూమిలో వేసిన బోర్లను టీడీపీ నాయకులు ధ్వంసం చేశారన్నారు. ఆ భూమిని ఆక్రమించుకునేందుకు దౌర్జన్యం చేస్తున్నారన్నారు. పలుమార్లు అధికారులు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించినా స్పందించకపోవడం బాధాకరమన్నారు. వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యులు మీసాల రంగన్న మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్గా చేసుకుందన్నారు. రాష్ట్రంలో సామాన్య ప్రజలకు రక్షణ కరువైందన్నారు. వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు దేవేంద్ర, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి మాట్లాడుతూ జయకుమార్కు చెందిన వ్యవసాయ భూమిలో వేసిన బోర్లను టీడీపీ నాయకులు ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు. వెంటనే అధికారులు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనాల హరికృష్ణ, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మాలపాటి శ్రీనివాసులు, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి కౌడికి గోవిందు, జిల్లా కార్యదర్శి మల్లెల జగదీష్, ఉరవకొండ నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు జి.సురేష్, మున్సిపల్ విభాగం జిల్లా కార్యదర్శి వడ్డే రామచంద్ర, నాయకులు నిమ్మల నాగరాజు, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి లబ్బే రాఘవ తదితరులు పాల్గొన్నారు. -
‘సర్’లో మీ పేరుందా?
● ఒక్క ఎస్ఎంఎస్తో వెంటనే వివరాలు ● నేటితో ముగియనున్న సర్ గడువు రాయదుర్గం టౌన్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్–స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) గడువు శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఓటర్లు తమ వివరాలు తెలుసుకునేందుకు బీఎల్ఓలను సంప్రదిస్తున్నారు. కొందరైతే బీఎల్ఓలు నమోదు చేశారా? లేదా? అనే సందేహంలో ఉన్నారు. సందేహాలన్నింటికి చాలా సులభమైన పరిష్కారాన్ని ఎన్నికల సంఘం చూపించింది. మొబైల్ ఫోన్తోనే ఇంటి నుంచే కేవలం ఒక ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఓటు వివరాలు సర్లో నమోదు అయ్యాయో లేదో తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ అవసరం లేదు. స్మార్ట్ఫోన్ లేకపోయినా ఈ సేవను సాధారణ ఫోన్తో కూడా తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలంటే... ఎస్ఐఆర్లో మీ పేరు నమోదు కాకపోతే ఓటు హక్కు కోల్పోతారు. ఈ నేపథ్యంలో ఓటర్లు తమ ఎస్ఐఆర్ పూర్తయిందా.. లేదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు. కేవలం ఒక ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఎస్ఐఆర్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఈ మేరకు ఈసీ ఏర్పాట్లు చేసింది. ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవాలంటే.. ECI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆ తర్వాత ఓటర్ ఐడీ నంబర్ నమోదు చేయాలి. అనంతరం 1950 నంబర్కు మెస్సేజ్ పంపించాలి. మెస్సేజ్ పంపగానే సెకన్లలోనే ఈసీ నుంచి మెస్సేజ్ వస్తుంది. అందులో మీ పేరు, సీరియల్ నంబర్, పోలింగ్ కేంద్రం, పార్ట్ నంబర్, నియోజకవర్గం వివరాలు ఉంటాయి. ఈ వివరాలు వస్తే పేరు ఎస్ఐఆర్లో నమోదైనట్లు అర్థం చేసుకోవచ్చు. ఈ మెస్సేజ్లో వివరాలు తప్పుగా ఉన్నా లేదా మెస్సేజ్ రాకపోయినా బూత్ లెవర్ ఆఫీస్ లేదా ఎన్నికల అధికారులను సంప్రదించాలి. -
చదవలేక.. చావుకోరి
ఉరుకులపరుగుల జీవితంలో అన్నింటా పోటీనే.. అన్నింటికీ మార్కులే కొలమానం. ర్యాంకులే రాజ్యమేలుతున్న తరుణంలో అర మార్కు తక్కువైనా... పరువు సమస్య. అందుకే విద్యార్థులపై మోయలేని భారం. నావల్ల కాదన్నా.. వినిపించుకోని కుటుంబం. భరించగలిగినోళ్లు బతికిపోతుండగా.. చేతగాని వారంతా చావును వెతుక్కుంటున్నారు. తాజాగా మార్కుల ఒత్తిడి తట్టుకోలేక.. హాస్టల్లో ఉండలేక మడకశిరలో ఓ విద్యార్థి ఉరివేసుకున్నాడు. హాస్టల్లో చేరిన గంటల వ్యవధిలోనే బలవన్మరణం చెందాడు. మడకశిర: హాస్టల్లో ఉండి చదవడం ఇష్టంలేని ఓ విద్యార్థి ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. మృతుని కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు...రొళ్ల మండలం చిగమతిగట్ట గ్రామానికి చెందిన హనుమంతరాయప్ప, నళినమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కూతురు సంతానం. అందరిలో చిన్నవాడైన చంద్రేగౌడ్(18) అగళి మండలం ఇనగలూరు జెడ్పీ హైస్కూల్లో 385 మార్కులతో పదో తరగతి పూర్తి చేశాడు. ఆ తర్వాత హిందూపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్లో (ఎంపీసీ) చేరినా అక్కడ ఉండటం ఇష్టంలేక మధ్యలోనే ఇంటికి వచ్చాడు. దీంతో తల్లిదండ్రులు చంద్రేగౌడ్ను మడకశిరలోని వెంకటేశ్వర కళాశాలలో చేర్పించారు. రోజూ ఇంటివద్దనుంచే కళాశాలకు వచ్చి వెళ్లేవాడు. మొదటి సంవత్సరంలో 470 మార్కులకుగాను 399 మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. అయితే కళాశాలలోని హాస్టల్లోనే ఉంచితే చదువుకునేందుకు సమయం ఉంటుందని, మార్కులు కూడా పెరుగుతాయని భావించిన కుటుంబీకులు ద్వితీయ సంవత్సరం హాస్టల్లో ఉండి చదువుకోవాలని చెప్పారు. దీంతో ఇష్టంలేకపోయినా చంద్రేగౌడ్ ఒప్పుకున్నాడు. ఈక్రమంలోనే బుధవారం సాయంత్రం లగేజీతో హాస్టల్కు వచ్చిన చంద్రేగౌడ్..రాత్రి వేళ హాస్టల్లోని వాష్రూంకు వెళ్లి అక్కడే ఉరివేసుకున్నాడు. గురువారం ఉదయం గమనించిన హాస్టల్ సిబ్బంది పోలీసులకు, కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. ఇంటికి దూరంగా ఉంటూ ఒత్తిడితో కూడిన చదువులు తనకు ఇష్టంలేదని చంద్రేగౌడ్ తరచూ చెప్పేవాడని, ఈక్రమంలోనే చదవలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణం చెందాడని స్నేహితులు, బంధువులు చెబుతున్నారు. చంద్రేగౌడ్ మృతితో స్వగ్రామం చిగమతిగట్టలో విషాద ఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న మడకశిర ఎస్ఐ కృష్ణారెడ్డి కళాశాల హాస్టల్కు వెళ్లి వివరాలు సేకరించారు. కళాశాల యాజమాన్యం, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మడకశిరలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చదవడం ఇష్టంలేక హాస్టల్లోనే ఉరివేసుకున్న వైనం -
●ఆశల పంట.. ఆవేదనే రైతు ఇంట
పంపనూరు వద్ద రోడ్డు పక్కన పడేసిన టమాటాలు ఒక్క కోత కూడా కోయకుండానే ట్రాక్టర్తో టమాట పంటను దున్నేస్తున్న దృశ్యంమంచి ధరలు వస్తాయన్న ఆశతో అప్పు చేసి మరీ పంట సాగు చేస్తే చివరికి ఆవేదనే మిగిలింది. పెట్టిన పెట్టుబడి కూడా చేతికందని దుస్థితి దాపురించింది. దీంతో చేసేదిలేక ఒక్క కోత కూడా కోయకుండానే పంటను నిలువునా దున్నేస్తున్నారు. కొందరు రోడ్ల పక్కన పారబోస్తున్నారు. ఆత్మకూరుకు చెందిన రైతు పుల్లారెడ్డి రెండు ఎకరాల్లో టమాట పంట పెట్టాడు. మొత్తం రూ.1.20 లక్షల ఖర్చయింది. పంట చేతికి వచ్చిన సమయంలో మార్కెట్లో ధరలు లేకపోవడం శాపంగా పరిణమించింది. ఒక్క కోత కూడా కోయకుండానే గురువారం ట్రాక్టర్తో రెండు ఎకరాల్లోని పంటను ధ్వంసం చేయాల్సి వచ్చింది. – ఆత్మకూరు -
బీఎల్ఏ నాగేష్ హత్య కేసులో 9 మంది అరెస్టు
కనగానపల్లి: రెండు రోజుల క్రితం జరిగిన వైఎస్సార్సీపీ బీఎల్ఏ అంకె నాగేష్ హత్య కేసులో 9 మంది ముద్దాయిలను పోలీసులు అరెస్టు చేశారు. రామగిరి సీఐ ఎస్ మహమ్మద్ అలీ తెలిపిన వివరాల మేరకు... కనగానపల్లిలో ఈ నెల 21వ తేదీన హత్యకు గురైన అంకె నాగేష్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం కనగానపల్లి సమీంలోని మారెమ్మగుడి వద్ద 9 మంది పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో వడ్ల దస్తగిరి బాబు, నితీష్కుమార్, వన్నూరప్ప, అంకె మురళీ, సురేష్, అక్కులప్ప, నాగమణి, జ్యోతి, లక్ష్మిదేవి ఉన్నారు. అనంతరం వారిని ధర్మవరం కోర్టుకు తరలించారు. జోడు లింగాల ఆలయంలో చోరీ కూడేరు: ప్రసిద్ధి చెందిన కూడేరులోని శివపార్వతుల జోడు లింగాల సంగమేశ్వరస్వామి ఆలయంలో బుధవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. వివరాలు.. గురువారం ఉదయం 6 గంటలకు అర్చకుడు శివ ఆలయానికి వచ్చారు. అప్పటికే గర్భగుడి ముందు మందిరంలో నుంచి కోతులు బయటకు రావడంతో వాచ్మెన్ తలుపులు తీశాడనుకున్నారు. లోపలికి వెళ్లగా శాశ్వత హుండీ తలుపులు తెరిచి ఉండటం, మరో హుండీ బీగం పగలగొట్టి ఉండడాన్ని గమనించి వెంటనే ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమేష్బాబుకు సమాచారమిచ్చారు. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవదాయశాఖ ఏసీ మల్లికార్జున, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సీఐ రాజు, పోలీసు సిబ్బంది, కూ్ల్స్ టీం వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వాచ్మెన్ను ప్రశ్నిస్తే తాను ఆలయం బయట నిద్రించినట్లు చెప్పాడు. తర్వాత సీసీ కెమెరాలు పరిశీలించారు. ఈ నెల 3న హుండీల్లోని నగదును లెక్కించామని ఈఓ తెలిపారు. సుమారు రూ.20 నుంచి రూ.30 వేల వరకూ నగదును ఎత్తికెళ్లి ఉండొచ్చని ఈఓ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య గుంతకల్లుటౌన్: పట్టణంలోని హనుమేష్నగర్కు చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని (17) ఆత్మహత్యకు పాల్పడింది.వన్టౌన్ సీఐ మనోహర్ వివరాల మేరకు.. తిరుపతిలో ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న రవి, మేరీలకు ముగ్గురు పిల్లలున్నారు. మొదటి కుమార్తె ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. సమీప బంధువు భాగ్యనగర్కు చెందిన ఎలక్ట్రీషియన్ అనిల్కుమార్ బాలికను వేధింపులకు గురిచేశాడు. మనస్తాపంతో మంగళవారం సదరు బాలిక ఇంట్లోని బెడ్రూమ్లో చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక తండ్రి రవి బుధవారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలిక ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన అనిల్కుమార్పై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. అయితే బాలిక తల్లితో సదరు అనిల్ సన్నిహితంగా ఉన్న విషయాన్ని బాలిక తన తండ్రికి తెలియజేయడంతో ఇరు కుటుంబాల మధ్య కొన్ని రోజులుగా వివాదం నెలకొంది. దీంతోనే బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. హాస్టల్ ఆవరణలో క్షుద్రపూజలు ఉరవకొండ: పట్టణ పోలీస్స్టేషన్కు కూత వేటు దూరంలో ఉన్న గాంధీ హరిజనోద్ధరణ హాస్టల్ ఆవరణలో బుధవారం రాత్రి క్షుద్ర పూజలు నిర్వహించడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కొందరు క్షుద్ర పూజల కోసం రెండు రాళ్లను పేర్చి దానిపై బండ పరిచి రాళ్ల మధ్యలో దీపాన్ని వెలిగించి జంతువు పుర్రె, ఎముకలు ఉంచి ఆ ప్రాంతంలో రక్తం, పసుపు, కుంకమ చల్లి పూజలు నిర్వహించినట్లు అక్కడి వస్తువులను బట్టి తెలుస్తోంది. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి అర్ధరాత్రి పూజలు చేసినట్లు గుర్తించారు. కోట్లాది రూపాయాలు విలువ చేస్తే హరిజనోద్దరణ హస్టల్ స్థలం కోసం చాలా కాలంగా వివాదం నడుస్తోంది. స్థలం రికార్డులను కొందరు స్వార్థపరులు తారుమారు చేసి హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు. సదరు స్థలంలో ఇలాంటి క్షుద్ర పూజలు నిర్వహించడం చర్చనీయంశంగా మారింది. -
ట్రాక్టర్ ట్రాలీ కింద పడి వృద్ధురాలి మృతి
తాడిపత్రి రూరల్: మండలంలోని ఆలూరుకు చెందిన లక్ష్మీదేవి (60)పై ట్రాక్టర్ ట్రాలీ టైరు వెళ్లడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గురువారం ట్రాక్టర్ ట్రాలీ కింద ఉన్న నీడలో లక్ష్మీదేవి పడుకొని ఉండగా అదే గ్రామానికి చెందిన రామనాథ్రెడ్డి ట్రాక్టర్ను నడపగా ఆమైపె టైరు ఎక్కింది. ఆమె కేకలు విన్న రామనాథ్ ట్రాక్టర్ నిలిపి వెనక్కి వచ్చి చూడగా తీవ్రంగా గాయపడిన లక్ష్మీదేవి కనపడింది. చికిత్స నిమిత్తం హుటాహుటిన అనంతపురం తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తి బలవన్మరణం కూడేరు: మండల పరిధిలోని జయపురానికి చెందిన బోయ సూర్య (50) గురువారం తన ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు.. బోయ సూర్యకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఓ రైతుకు చెందిన 4 ఎకరాల భూమిని నాలుగేళ్లుగా కౌలుకు తీసుకొని అందులో బ్యాడిగి మిర్చి, వేరుశనగ పంటలు సాగు చేస్తూ వచ్చాడు. పంటలు సరిగా పండక అప్పులయ్యాయి. మరో పక్క కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి రాలేదు. సాయంత్రం సమీపంలోని చెట్టుకు సూర్య వేలాడు కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుని భార్య సావిత్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సిక్సర్లతో చెలరేగిన దత్తారెడ్డి అనంతపురం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరంలోని నార్త్ జోన్ అకాడమీలో జరుగుతున్న అండర్ – 23 ఇంటర్నల్స్ క్రికెట్ టోర్నీలో జిల్లాకు చెందిన రంజీ క్రికెటర్ మచ్చా దత్తారెడ్డి సిక్సర్లతో చెలరేగాడు. గురువారం అనంతపురం, ప్రకాశం జిల్లా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న అనంత జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 195 పరుగులు సాధించింది. ఓపెనర్ మచ్చా దత్తారెడ్డి 45 బంతుల్లో ఎనిమిది సిక్సర్లు, ఆరు ఫోర్లతో 89 పరుగులు చేశాడు. మరో బ్యాటర్ మనోజ్కుమార్ 32 పరుగులు, ప్రదీప్రెడ్డి 22, రేహన్ 28, మల్లికార్జున 12 పరుగులు చేశారు. -
పంట దిగుబడి ఆధారంగా ఫసల్బీమా
● జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఎన్.సాలురెడ్డి అనంతపురం అగ్రికల్చర్: ఎల్నినో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వాతావరణ, ఫసల్ బీమా పంటల బీమా పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ జేడీ ఎన్.సాలురెడ్డి రైతులకు సూచించారు. గురువారం స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో ఉద్యానశాఖ డీడీ ఉమాదేవి, ఎల్డీఎం మారుతీ శ్రీనివాసులుతో కలిసి జేడీఏ విలేకరుల సమావేశం నిర్వహించారు. జేడీఏ మాట్లాడుతూ పంట దిగుబడులు ఆధారంగా ఫసల్ బీమా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో కంది రైతులు ఎకరాకు 80, వరి రైతులు రూ.164, జొన్నకు రూ.84, మొక్కజొన్నకు రూ.132, ఆముదంకు రూ.80, మిరపకు రూ.576 ప్రకారం రైతులు తమ వాటా కింద ఈనెల 31లోపు ప్రీమియం చెల్లించాలన్నారు. వరికి ఆగస్టు 15 వరకు గడువు ఉందన్నారు. జెనరాలీ సెంట్రల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఫసల్బీమా అమలవుతుందన్నారు. ఇక వాతావరణం ఆధారంగా అమలు చేస్తున్న వాతావరణ బీమా కింద వేరుశనగ ఎకరాకు 640, పత్తికి రూ.1,140, దానిమ్మకు రూ.3,750, చీనీ, బత్తాయికి రూ.2,750, అరటికి రూ.3 వేలు, టమాటాకు రూ.1,600 ప్రకారం రైతులు తమ వాటా కింద ఈనెల 31లోపు ప్రీమియం చెల్లించి బీమా పథకంలో చేరాలన్నారు. ఏఐసీ ఆధ్వర్యంలో వాతావరణ బీమా అమలు.. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఇండియా (ఏఐసీ) ఆధ్వర్యంలో వాతావరణ బీమా అమలవుతున్నట్లు డీఏఓ సాలురెడ్డి తెలిపారు. బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులు వేరే పంట సాగు చేసివుంటే మార్పు చేసుకోవాలన్నారు. పంట మార్పు చేసినట్లు సెల్ప్ డిక్లరేషన్ బ్యాంకుల్లో సమర్పించి... కొత్తగా సాగు చేసిన పంటకు ప్రీమియం చెల్లించాలని తెలిపారు. పంటల బీమా వద్దనుకునే రైతులు ప్రీమియం గడువుకు రెండు మూడు రోజులు ముందే బ్యాంకుల్లో దరఖాస్తు ఇవ్వాలన్నారు. పంట రుణాలు తీసుకోని (నాన్లోనీ) రైతులు కామన్ సర్వీసు సెంటర్లు (సీఎస్సీ)కు వెళ్లి ప్రీమియం కట్టి బీమా పరిధిలోకి రావాలన్నారు. -
పుట్టింది రైతు కుటుంబంలో అయినా పట్టుదల, క్రమ శిక్షణతో కూడిన విద్య ఆమెను ఉన్నతస్థాయికి తీసుకెళ్లింది. దేశ చరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలికిన విక్రమ్ –1 రాకెట్ విజయంలో కీలక పాత్ర పోషించేలా చేసింది. జిల్లా ఖ్యాతిని దశ దిశలా చాటిన మారక సుష్మ విజయగాథపై ‘
అనంతపురం ఎడ్యుకేషన్: తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ఇటీవల విక్రమ్–1 రాకెట్ విజయవంతంగా ప్రయోగించారు. భారత అంతరిక్ష రంగంలో ఒక ప్రైవేట్ సంస్థ అభివృద్ధి చేసిన రాకెట్ను అంతరిక్షంలోకి పంపడం ఇదే తొలిసారి. ఈ విజయంతో భారత అంతరిక్ష రంగం మరో కీలక మైలురాయిని అధిగమించింది. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ పూర్తి స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన విక్రమ్–1 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ చారిత్రక ప్రయోగ విజయంలో రాప్తాడు మండలం ఎం. బండమీదపల్లికి చెందిన యువ ఇంజినీర్ మారక సుష్మ కీలక పాత్ర పోషించి జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. శభాష్.. సుష్మ అంటూ జిల్లా వాసులందరూ ఆమెను అభినందనలతో ముంచెత్తుతున్నారు. గ్రౌండ్ చెకౌట్ సిస్టమ్స్లో కీలక బాధ్యతలు స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థలో గ్రౌండ్ చెకౌట్ సిస్టమ్స్ అండ్ ల్యాబ్వ్యూ ఇంజినీర్గా పని చేస్తున్న మారక సుష్మ, రాకెట్ ప్రయోగానికి ముందు నిర్వహించే కీలక సాంకేతిక పరీక్షలు, గ్రౌండ్ చెకౌట్ సిస్టమ్స్, ల్యాబ్వ్యూ సాఫ్ట్వేర్ అభివృద్ధి వంటి విభాగాల్లో బాధ్యతలు నిర్వహించారు. విక్రమ్–1 ప్రయోగ బృందంలో సభ్యురాలిగా శ్రీహరికోటలో జరిగిన ప్రయోగ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. రైతు కుటుంబం నుంచి... మారక సుష్మ వయస్సు 26 సంవత్సరాలు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం ఎం.బండమీదపల్లి గ్రామానికి చెందిన రైతు మారక సుబ్బారెడ్డి, మారక సుజాత దంపతుల కుమార్తె. రైతు కుటుంబంలో జన్మించిన సుష్మ చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి కనబరిచి క్రమశిక్షణతో ముందుకు సాగారు. వారి కుటుంబం ప్రస్తుతం అనంతపురంలో నివాసం ఉంటోంది. అభినందనల వెల్లువ రైతు కుటుంబంలో పుట్టి పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించి, దేశ చరిత్రలో నిలిచిపోయే అంతరిక్ష ప్రయోగంలో భాగస్వామ్యం కావడంతో జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, యువత సుష్మను అభినందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ప్రపంచస్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని సుష్మ నిరూపించిందంటున్నారు. దేశానికి సేవ చేయడమే లక్ష్యం : సుష్మ భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో చరిత్రాత్మకమైన విక్రమ్–1 ప్రయోగంలో భాగస్వామ్యం కావడం తనకు, తన కుటుంబానికి ఎంతో గర్వకారణమని సుష్మ తెలిపారు. భవిష్యత్తులో భారత అంతరిక్ష పరిశోధన రంగంలో మరిన్ని విజయవంతమైన ప్రయోగాల్లో పాల్గొని దేశానికి సేవలందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. విక్రమ్–1 రాకెట్ ప్రయోగంలో కీలక పాత్ర రైతు కుటుంబంలో పుట్టి జిల్లా ఖ్యాతిని దశ దిశలా చాటిన వైనం యువతకు స్ఫూర్తిగా నిలిచిన సుష్మ దేశానికి మరిన్ని సేవలు అందిస్తానంటున్న యువ శాస్త్రవేత్త -
టీబీ డ్యాంకు కొనసాగుతున్న ఇన్ఫ్లో
బొమ్మనహాళ్: ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి రిజర్వాయర్, అనంతపురం జిల్లా ప్రజల వరప్రదాయిని తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో హెచ్చుతగ్గుల మధ్య కొనసాగుతోంది. బుధవారానికి డ్యాంలో నీటి నిల్వ 26.45 టీఎంసీలకు చేరింది. జలాశయం ఎగువన ఉన్న శివమొగ్గ, తీర్ధనహాళ్లి, చిక్కమగళూరు, వరనాడు, శృంగేరి తదితర ప్రాంతాల్లో వర్షాలు అడపాదడపా కురుస్తుండటంతో డ్యాంకు వరద చేరుతోందని టీబీ బోర్డు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రిజర్వాయర్లో 1,633 అడుగులకు గాను 1,603.54 అడుగల మేర నీరు నిలిచింది. 105.788 టీఎంసీల నీటి సామర్థ్యానికి గాను 26.45 టీంఎసీల నీరు ఉంది. ఇన్ఫ్లో 10,938 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 3,184 క్యూసెక్కులుగా నమోదవుతోంది. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 1,625.88 అడుగులతో 79.40 టీఎంసీల నీరు నిల్వ ఉండి 36,539 క్యూసెక్కుల ఇన్ఫ్లో, 39,457 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉండింది. రేపు విద్యాసంస్థల బంద్ అనంతపురం ఎడ్యుకేషన్: నీట్ పరీక్షల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వద్ద కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఓతూరు పరమేష్, ఏఐఎస్బీ అధ్యక్షుడు పృథ్వి, పీఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రతిభాభారతి, పీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర, ఏఐఎస్ఏ జిల్లా కార్యదర్శి బాలకృష్ణ మాట్లాడారు. నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జీని ఖండించారు. 24న నిర్వహించే విద్యాసంస్థల బంద్కు విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు తరిమెల గిరి, రాష్ట్ర కమిటీ సభ్యురాలు రజిత, ఎన్ఎస్యూఐ వినోద్ కుమార్, ఎస్ఎఫ్ఐ నాయకులు శివ, అరుణ్ రషీద్, గణేష్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘పోలీస్ కేసు పెట్టిస్తా.. జీవితాన్ని నాశనం చేస్తా’ తాడిపత్రిటౌన్: మట్టి అక్రమ తవ్వకాలు అడ్డుకున్న ఓ యువకుడిపై టీడీపీ నాయకుడు బెదిరింపులకు దిగడం చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. పెద్దపప్పూరు మండలం సోమనపల్లి సమీపంలో కొన్ని నెలలుగా కొట్టాలపల్లికి చెందిన టీడీపీ నాయకుడు రఘునాథనాయుడు మట్టి అక్రమ తవ్వకాలు సాగిస్తున్నాడు. పశు సంపదకు ఉపయోగపడుతున్న కొండను కరిగించేస్తున్నాడు. అక్రమ తవ్వకాలు ఆపాలని గ్రామస్తులు విన్నవించినా పెడచెవిన పెట్టాడు. దీంతో బుధవారం వీఆర్ఏ రాఘవేంద్ర, గ్రామస్తులు మట్టి టిప్పర్లను అడ్డుకుని రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చారు. ఎవరూ స్పందించక పోవడంతో కలెక్టరేట్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆర్ఐ ఉదయ్, వీఆర్ఓ నాగేంద్ర అక్కడికి వెళ్లగా గ్రామస్తులు రెండు టిప్పర్లను వారికి అప్పగించారు. వాటిని రెవెన్యూ కార్యాలయానికి తరలిస్తుండగా, నంబర్ ప్లేట్ లేని ఒక టిప్పర్ మార్గమధ్యంలోనే కనబడకుండా పోయింది. దీంతో గ్రామస్తులు ఆగ్రహంతో అక్రమ మట్టి తవ్వకాల వద్ద నిరసనకు దిగగా, ఇటాచీ వాహనాన్ని అక్రమార్కులు వదిలేసి పారిపోయారు. రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు జోక్యం చేసుకొని ఇటాచీని పోలీస్స్టేషన్కు తరలించారు. మట్టి తవ్వకాలు అడ్డుకున్న తనపై ఎస్సీ,ఎస్టీ కేసు బనాయించి, జీవితాన్ని నాశనం చేస్తానంటూ టీడీపీ నాయకుడు బెదిరిస్తున్నట్లు వీఆర్ఏ రాఘవేంద్ర ‘సాక్షి’తో వాపోయాడు. -
‘మెగా పీటీఎం’ నిర్వహణకు రూ.52.11 లక్షల విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 24న (శుక్రవారం) నిర్వహించనున్న మెగా పీటీఎం–4.0 కార్యక్రమం కోసం ప్రభుత్వం సమగ్ర శిక్ష ద్వారా అనంతపురం జిల్లాలోని 1,752 ప్రభుత్వ పాఠశాలలకు రూ.52,11,450 విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయం నుంచి బుధవారం ఆయా మండల విద్యాశాఖ అధికారులకు (ఎంఈఓలు) నిధులు విడుదల చేసినట్లు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ టి. శైలజ తెలిపారు. గంజాయి కేసులో నిందితుడి అరెస్టు రాప్తాడు రూరల్: గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడిని రాప్తాడు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. రాప్తాడు పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైం నం.62/2026 కేసులో పరారీలో ఉన్న అనంతపురం రూరల్ తపోవనంకు చెందిన అరుణ్ జాకబ్ అలియాస్ అరుణ్ రాస్తాను రాప్తాడు సమీపంలోని జాతీయ రహదారిపై బ్రిడ్జి వద్ద అరెస్టు చేశారు. వివరాలను సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి డ్రగ్స్ వినియోగానికి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. యువత గంజాయి, డ్రగ్స్తో పాటు ఇతర మత్తు పదార్థాలు, హానికరమైన వ్యసనాలకు దూరంగా ఉండాలని సీఐ సూచించారు. -
ప్రకృతి వ్యవసాయంతో అధిక దిగుబడులు
కుందుర్పి: ప్రకృతి వ్యవసాయం ద్వారానే రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని రాయలసీమ అటవీశాఖ అధికారి యశోద బెన్ తెలిపారు. బుధవారం మండలంలోని అప్పిలేపల్లి, తమ్మయ్యదొడ్డి గ్రామాల్లో రైతులు ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన వివిధ రకాల పంటలను ఆయనతో పాటు జిల్లా అటవీశాఖ అధికారుల బృందం పరిశీలించింది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా కుందుర్పి మండలంలో 10 గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధించడం గర్వకారణమన్నారు. కుందుర్పి మండల రైతులను ఆదర్శంగా తీసుకొని జిల్లా వ్యాప్తంగా రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పంటలను సాగుచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారులు ప్రభాకర్, రేంజ్ అధికారి దీపిక తదితరులు పాల్గొన్నారు. -
రెండేళ్లు ఓపిక పట్టా.. ఇక ప్రజల్లోకే
● పోలీసుల ఏకపక్ష వైఖరితోనే గ్రామాల్లో శాంతిభద్రతల సమస్య ● మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితాడిపత్రిటౌన్: ‘టీడీపీ నాయకుల ప్రోగ్రాం ఉందంటూ పోలీసులే నన్ను బయట తిరగకుండా చేశారు. రెండేళ్లు ఓపిక పట్టా. ఇక గ్రామాల్లో తిరుగుతాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటాం’ అని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. బుధవారం యాడికిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్రెడ్డి ఆదేశాలతో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ గ్రామాల్లో శాంతిభద్రతల విఘాతానికి కారణమవుతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులపై బైండోవర్ కేసులు నమోదు చేసి స్టేషన్లకు పిలిపించడం, తిట్టడం, కొట్టడం చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తమ పార్టీ నాయకులు గ్రామాల్లో లేకుండా చేయడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఏ అధికారం ఉందని జేసీ ప్రభాకర్రెడ్డి 50 వాహనాల్లో విచ్చలవిడిగా గ్రామాల్లో తిరుగుతున్నాడని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నాయకులు అక్రమాలు, అన్యాయాలు చేశారంటూ బురద చల్లడం అలవాటుగా మార్చుకున్నాడన్నారు. తిట్లు తిట్టడంలో ఎమ్మెల్యే జేసీ అస్మిత్రెడ్డి కూడా తండ్రి కంటే రెండు ఆకులు ఎక్కువే చదివాడని విమర్శించారు. పెద్దపొలమడ ఫీల్డ్ అసిస్టెంట్పై అస్మిత్రెడ్డి చేయి చేసుకోవడం చూస్తుంటే తండ్రికి ఏ మాత్రమూ తీసిపోడనిపిస్తోందన్నారు. తాడిపత్రి పట్టణంలో పోలీసుల వైఖరి మరీ అధ్వానంగా మారిందని, గంజాయి, మట్కా, పేకాట ఆదాయాల కోసం జేసీ చెప్పిందే వేదంలా ముందుకెళ్తున్నారని విమర్శించారు. దీనికి బదులు పోలీసులే మట్కా, పేకాట కేంద్రాలు నిర్వహించి గంజాయి అమ్మకాలు చేస్తే ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుంది కదా అంటూ ఎద్దేవా చేశారు. ఇకపై బైండోవర్ పేరుతో వైఎస్సార్సీపీ నాయకులను అణచివేయాలని ప్రయత్నిస్తే పోలీస్స్టేషన్ల ముందు పెద్ద ఎత్తున ప్రజలు, వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. -
రైటర్ల పెన్డౌన్ .. రిజిస్ట్రేషన్లు ఢమాల్
● జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్య దాటని వైనం ● తగ్గిపోయిన రిజిస్ట్రేషన్శాఖ ఆదాయంఅనంతపురం టౌన్: ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా భారీగా ఆదాయం సమకూరుతుంది.. అయితే ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు జీఓ 396 విడుదల చేసింది. దీంతో రిజిస్ట్రేషన్లు మందగించాయి.. రిజిస్ట్రేషన్శాఖ రెవెన్యూ భారీగా తగ్గిపోయింది.. దీంతో పాటు డాక్యుమెంట్ రైటర్లు పెన్డౌన్కు పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు జిల్లా వ్యాప్తంగా 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో రోజూ 500లకు పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు అయ్యేవి. అయితే ఆ సంఖ్య కాస్తా 40కి పడిపోయింది. డాక్యుమెంట్ రైటర్ల స్థానంలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి, వారి ద్వారా వినియోగదారులకు సేవలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించి ఉత్తర్వులిచ్చింది. ప్రైవేట్ వ్యక్తులకు సేవా కేంద్రాలను అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఇదే జరిగితే డాక్యుమెంట్ రైటర్ల మనుగడ కష్టతరంగా మారనుంది. దీంతో వారు పెన్డౌన్ చేస్తూ సమ్మెకు దిగారు. తగ్గిన రిజిస్ట్రేషన్లు రైటర్ల పెన్డౌన్తో జిల్లా వ్యాప్తంగా స్తిరాస్తుల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. అనంతపురం రామ్నగర్ ప్రధాన రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రోజువారీగా 78 స్లాట్లు ఉంటే మంగళ, బుధవారాల్లో కేవలం నాలుగైదు రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. రుద్రంపేటలోని రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, గుంతకల్లు, గుత్తి, కణేకల్లు, తాడిపత్రి, ఉరవకొండ, శింగనమల తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి. దీంతో పాటు రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయానికి సైతం పెద్ద ఎత్తున గండి పడుతోంది. రోజులవారీగా జిల్లా వ్యాప్తంగా రూ.2 కోట్లకు పైగా రెవెన్యూ వచ్చేది. గత రెండు రోజులుగా రూ.5 లక్షలు కూడా దాటలేదంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు డాక్యుమెంట్ రైటర్ల అవసరం ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. -
కూలి ఖర్చులూ రాకపాయె
● పాతాళానికి పడిపోయిన టమాట ధరలు ● కుదేలవుతున్న రైతన్నలు కళ్యాణదుర్గం/ అనంతపురం అగ్రికల్చర్: మార్కెట్లో టమాట ధరలు ఒక్కసారిగా పాతాళానికి పడిపోయాయి. కనీసం కాయలు కోసే కూలీల ఖర్చులు, మార్కెట్కు తరలించే రవాణా చార్జీలు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ఆరుగాలం కష్టపడి, లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట చేతికొచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో దిగాలు చెందుతు న్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాలో ఈసారి రైతులు టమాట పంట సాగు చేశారు. జిల్లావ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో పంట సాగులోకి వచ్చినట్లు గణాంకాలు వెల్లడిన్నాయి. భూమి దున్నడం, విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులతో పాటు కూలీ ఖర్చుల కోసం ఎకరానికి రూ. లక్షకు పైగా పెట్టుబడులు పెట్టారు. పంట చేతికి వచ్చి మంచి లాభాలు వస్తాయని ఆశించిన రైతులకు మార్కెట్లో ధరలు కోలుకోలేని దెబ్బ తీశాయి. ప్రస్తుతం మార్కెట్లో 15 కిలోల బాక్సు మొదటి రకం రూ.150 నుంచి రూ.200, రెండో రకం రూ.120–రూ.140, మూడో రకం రూ.30–రూ.100 లోపే పలుకుతుండడంతో ఆవేదనలో కూరుకుపోయారు. చిన్న సైజు కాయలు, తేమ ఉన్నవి, మచ్చ వచ్చిన కాయలు కొనడానికి వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదు. అలాంటివి బాక్సు రూ.50 కూడా పలకడం లేదు. గరిష్ట ధర కూడా నాణ్యమైన కొన్ని లాట్లకే లభిస్తోంది. మిగతావన్నీ రూ.100–రూ.150 పలుకుతుండంతో పెట్టుబడులు కూడా రావడం లేదంటూ నిట్టూరుస్తున్నారు. చాలా మంది పంటను కోయకుండానే పొలాల్లో వదిలేస్తుండడం గమనార్హం. ప్రభుత్వం ఆదుకోవాలి.. ఏటా టమాట రైతులకు నష్టాలు తప్పడం లేదు. జిల్లాలో పండించే టమాటలను బెంగుళూరు, చైన్నె, హైదరాబాద్, మహారాష్ట్ర, కోలార్ వంటి ప్రధాన నగరాలకు సరఫరా చేస్తున్నారు. ఆయా చోట్ల మార్కెట్ తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మద్దతు ధర ప్రకటించాలని, మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించాలని వేడుకుంటున్నారు. -
సమస్యలు పరిష్కరించేదాకా పోరాటం
అనంతపురం అర్బన్: వ్యవసాయశాఖ పరిధిలో మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ అధికారులుగా 12 ఏళ్లగా పనిచేస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఏపీ ఎంపీఈఓల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎం.నాగారాజు ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్ల సాధనకు ఎంపీఈఓలు సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం ఆ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో నాగరాజు మాట్లాడారు. 12 ఏళ్లగా పనిచేస్తున్న ఎంపీఈఓలకు ఇప్పటికీ రూ.12 వేలు వేతనం, రూ.3 వేలు ఇన్సెంటివ్ ఇస్తున్నారన్నారు. ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలంటూ 12 ఏళ్లుగా విన్నవిస్తున్నా నేటికీ తమ సమస్యకు పరిష్కారం చూపలేదని వాపోయారు. నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఉద్యమబాట పట్టామన్నారు. సమాన పనికి సమాన వేతనం కింద రూ.35 వేలు ఇవ్వాలన్నారు. ఎంపీఈలోకు ఉద్యోగభద్రత కల్పించాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకూ పోరాటం కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గంగారాజు, నరసింహులు, శివ, మనోహర్నాయుడు, ఉమాదేవి, ఎంపీఈఓలు పాల్గొన్నారు. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
గుమ్మఘట్ట: మండలంలోని వేపులపర్తి క్రాస్ సమీపంలో ఉన్న వేదావతి హగరి నుంచి రాయదుర్గం పట్టణానికి ఇసుకను తరలిస్తున్న 7 ట్రాక్టర్లను పోలీసులు బుధవారం పట్టుకుని స్టేషన్కు తరలించారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఇన్సూరెన్స్ , రిజిస్ట్రేషన్ లేకపోవడంతో పాటు ఇసుకపై టార్పాలిన్ లేకుండా వెళుతున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్ఐ చిన్నరాయుడు తెలిపారు. ఒక్కో ట్రాక్టర్కు రూ.5 వేలు అపరాధ రుసుం వేశామన్నారు. అప్పులబాధతో యువకుడి ఆత్మహత్య డీ.హీరేహాళ్ (బొమ్మనహాళ్): అప్పుల భారం తాళలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన డీ.హీరేహాళ్లో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ గురుప్రసాద్రెడ్డి వివరాల మేరకు.. మండల కేంద్రానికి చెందిన గౌరీశంకర్ (27) సాయి బాలాజీ స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ పనిచేస్తున్నాడు. ఆన్లైన్ గేమింగ్, ట్రేడింగ్లకు అలవాటు పడిన గౌరీశంకర్ తెలిసిన వారి వద్ద అప్పులు చేసి అందులో డబ్బు పెట్టాడు. తీవ్ర నష్టాలు రావడంతో చేసిన అప్పులు తీరేమార్గం లేక మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి తన ఇంటి బెడ్రూమ్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. లక్ష్మీకి ఇద్దరు కుమారులు ఉండగా గౌరీశంకర్ చిన్న కుమారుడని, ఇంకా వివాహం కాలేదన్నారు. జెడ్పీ ప్రగతికి పాటుపడతాం అనంతపురం న్యూటౌన్: ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా జి. కృష్ణమూర్తి బుధవారం బాధ్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కొత్త డిప్యూటీ సీఈఓ మీడియాతో మాట్లాడుతూ బాధ్యతగా పనిచేద్దాం.. జిల్లా పరిషత్ ప్రగతికి పాటుపడుదామంటూ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్న మల్లికార్జున, ఏఓలు భాస్కర్ రెడ్డి, లెక్కల శ్రీనివాసులు, షేక్ నియాజ్ పలువురు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ‘కేఎస్ఎన్’ డిగ్రీ కళాశాల సెమిస్టర్ ఫలితాల విడుదల అనంతపురం ఎడ్యుకేషన్: స్థానిక కేఎస్ఎన్ డిగ్రీ కళాశాల (మహిళలు)లో ఈ ఏడాది మే 4 నుంచి 19వ తేదీ వరకూ నిర్వహించిన 2, 4 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ లక్ష్మయ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శ్రీరామ్ నాయక్ చేతుల మీదుగా ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఎం.ప్రగతి, కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ బీవీ రమణనాయుడు, అదనపు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ పి.రామలింగారెడ్డి, నాగభూషణంతో పాటు అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. దొంగ అరెస్ట్ ● రూ. 7 లక్షలు విలువైన ఆభరణాలు స్వాధీనం అనంతపురం సెంట్రల్: తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు పాల్పడుతున్న దొంగను అనంతపురం ఫోర్త్టౌన్, సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. బుధవారం నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్లో వివరాలను నాల్గవ పట్టణ సీఐ మస్తాన్, సీసీఎస్ సీఐ జయపాల్రెడ్డి, ఎస్ఐ గోపి వివరించారు. కక్కలపల్లి కాలనీకి చెందిన సాయికిరణ్ మద్యం, జూదం వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. పగటి పూట తాళం వేసిన ఇళ్లను గుర్తించి, రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడేవాడు. ఈ ఏడాది జూన్ నెల నుంచి నగర పరిసరాల్లో మూడు చోరీలకు పాల్పడ్డాడు. దొంగతనాలపై నిఘా పెట్టి నిందితున్ని నగర శివారులో అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ. 7 లక్షలు విలువజేసే 3.14 తులాల బంగారం, 203. 5 గ్రాములు వెండి , రూ. 8 వేలు నగదు, టీవీ, గ్యాస్ సిలిండర్, నాలుగు చేతి గడియారాలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
పావగడకు రైలొచ్చేదెన్నడో?
ఇటీవల దొడ్డహళ్లి–పావడగ వరకు రైలు మార్గం తనిఖీ కూడా పూర్తి చేశారు. దాదాపు రెండు నెలల గడిచిపోతున్నా నేటి వరకు పావగడ వరకు రైలు నడపడం లేదు. ప్రస్తుతం కదిరిదేవరపల్లి వరకు తిరుపతి రైలును నడపుతున్నారు. రాయదుర్గం మీదుగా రైలుమార్గం పూర్తయిన దొడ్డహళ్లి, పావడగ వరకూ కొత్త రైలు నడిపితే రైలు మార్గం దెబ్బతినకుండా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర కర్ణాటక లేదా ఆంధ్రాలోని ముఖ్యమైన నగరాల నుంచి మరొక రైలు నడిపితే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. కానీ ఆ దిశగా నేటికీ ప్రజాప్రతినిధులుగాని, రైల్వేశాఖ ఉన్నతాధికారులు గాని ఏమాత్రం ఆలోచించడం లేదు. -
నీట్ లీకేజీ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
అనంతపురం అర్బన్: మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పయనం పతనం దిశగా సాగుతోందని సీపీఐ నాయకులు విమర్శించారు. ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువతపై పోలీసుల చేత కూర్రంగా దాడి చేయించడమే ఇందుకు నిదర్శమన్నారు. నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత విద్యార్థి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులు, యువతపై పోలీసులు జరిపిన దాడిని ఖండిస్తూ సీపీఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక క్లాక్టవర్ వద్ద నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి.జగదీష్, జిల్లా కార్యదర్శి పాళ్యం నారాయణస్వామి మాట్లాడారు. విద్యార్థులు, యువతపై లాఠీచార్జీ అమానుష చర్య మాత్రమే కాకుండా ప్రజాస్వామ్య హక్కుపై దాడి చేయడమే అన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం, సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు, నాయకులు మస్తాన్, సాయికుమార్, రామకృష్ణ, నారాయణస్వామి, రమణయ్య, కృష్ణుడు, లింగమయ్య, చిరంజీవి, నరేషన్, తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే జయరాం సోదరుడి డ్రైవర్ వీరంగం
● బాలింతతో పాటు మరో ఇద్దరిపై దాడి ● 15 మంది దాడికి రావడంతో స్థానికుల బెంబేలుగుంతకల్లు: ఎమ్మెల్యే జయరాం సోదరుడి డ్రైవర్ పట్టణంలో వీరంగం సృష్టించాడు. క్రికెట్ ఆటలో తలెత్తిన చిన్నపాటి వివాదంతో ఓ కుటుంబంపై దాడికి దిగారు. దీంతో బాలింతతో పాటు మరో ఇద్దరు ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు గుమ్మనూరు నారాయణస్వామి వద్ద డ్రైవర్ కమ్ అసిస్టెంట్గా అబ్బాస్ అనే టీడీపీ కార్యకర్త పనిచేస్తున్నాడు. పట్టణంలోని ఫక్కీరప్ప కాలనీలో క్రికెట్ ఆటలో అబ్బాస్ బంధువుల పిల్లలు, బాషా పిల్లలకు మధ్య చిన్న వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో అబ్బాస్ – బాషా మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి అబ్బాస్ 15 మంది అనుచరులతో కలసి వచ్చి ఫుల్గా మద్యం సేవించి బాషా ఇంటిపైకి దాడికి పాల్పడ్డారు. బాషా ఇంటిపై దాడి సమయంలో కేవలం అతని చెల్లెల్లు కరీమున్నీ (బాలింత) మాత్రమే ఉంది. బాలింత అని కూడా చూడకుండా అబ్బాస్, అతని అనుచరులు ఆమైపె రాడ్లు, కట్టెలతో దాడి చేశారు. విషయం తెలుసుకున్న బాషా అతని తమ్ముడు రహంతుల్లా ఇంటి వద్దకు చేరుకోగానే వారిపై కూడా దాడి చేసి అక్కడి నుంచి జారుకున్నారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఏకంగా 15 మంది దాడిలో పాల్గొనడంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. ఘటనపై కసాపురం పోలీసుస్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. బుధవారం అబ్బాస్తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి
రాయదుర్గంటౌన్: కర్ణాటకలోని గుడేకోట వద్ద బుధవారం మధ్యాహ్నం ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో రాయదుర్గం పట్టణానికి ఆర్టీసీ డ్రైవర్ ఎం.కరిబసప్ప (54) దుర్మరణం పాలయ్యారు. బంధువుల వివరాల మేరకు ... కరిబసప్ప దాదాపు 17 ఏళ్లుగా రాయదుర్గం ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం తిరుపతి సర్వీస్ డ్యూటీ ముగించుకుని వ్యక్తిగత పని నిమిత్తం బుధవారం సాయంత్రం కర్ణాటకలోని గుడేకోటలోని బంధువుల ఇంటికి ద్విచక్ర వాహనంపై బయలు దేరాడు. గుడేకోట సమీపంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ను ఢీకొన్నాడు. ఘటనలో కరిబసప్ప అక్కడిక్కడే మృతి చెందాడు. కర్ణాటక పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మొలకాల్మూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కరిబసప్ప మృతిపై ఆర్టీసీ ఉద్యోగ సంఘం నాయకులు, ఆర్టీసీ డీఎం శ్రీనివాసరావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. విద్యుదాఘాతంతో టిప్పర్కు మంటలు గుమ్మఘట్ట: మండలంలోని సిరిగెదొడ్డి సమీపంలో ఓ టిప్పర్కు విద్యుత్ తీగలు తగలడంతో మంటలు చెలరేగాయి. స్థానికుల వివరాల మేరకు పట్టణంలోని మున్సిపాలిటికీ చెందిన చెత్తను డంపింగ్ యార్డు నుంచి వేరు చేసిన వ్యర్థపదార్థాలను తీసుకుని టిప్పర్ సిరిగెదొడ్డి గ్రామ సమీపంలో ఉన్న గోపాల్ పొలంలోని పాడుబడ్డ బావి వద్దకు వెళ్లింది. పైన వున్న హైటెన్షన్ విద్యుత్ తీగలను డ్రైవర్ గమనించకపోవడంతో టిప్పర్ను అన్లోడ్ చేసేందుకు యత్నించాడు. పైన ఉన్న విద్యుత్ తీగలకు టిప్పర్పై భాగం తగలడంతో విద్యుదాఘానికి గురికావడంతో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకుని బయటపడ్డాడు. ఘటనలో టిప్పర్ టైర్లు కాలిపోయాయి. అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోని తీసుకువచ్చారు. అరటి ఎగుమతికి రూ.1.03 కోట్లు మంజూరు అనంతపురం అగ్రికల్చర్: జిల్లా నుంచి ఈ ఏడాది అరటి ఉత్పత్తుల ఎగుమతుల ప్రోత్సాహకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.03 కోట్లు మంజూరు చేసినట్లు ఆ శాఖ డీడీ ఉమాదేవి, ఏడీ ధనుంజయ తెలిపారు. ప్రధానంగా తాడిపత్రి నుంచి ముంబైకి రైల్వే ఏసీ కంటైనర్ల ద్వారా రవాణాకు చర్యలు చేపట్టనున్న నేపథ్యంలో ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
ఉద్యోగాల పేరుతో మోసం
● పోలీసుల అదుపులో కేటుగాళ్లు అనంతపురం సెంట్రల్: ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు కేటుగాళ్లను అనంతపురం టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ పుల్లయ్య బుధవారం మీడియాకు ఆ వివరాలు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం చెంచుగారిపల్లికి(ప్రస్తుతం దేవహనహళ్లి, బెంగళూరులో ఉంటున్నాడు) చెందిన కొర్రా విజయనాయక్, అనంతపురంలోని రహమత్నగర్కు చెందిన షేక్ ముజీమ్ మిల్, తాడిపత్రికి చెందిన పల్లా నారాయణస్వామి ముఠాగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నారు. డీఆర్డీఓ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇస్రో అనుబంధ సంస్థ అయిన ఎన్ఏఆర్ఎల్ తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలిప్పిస్తామని నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. అలాగే రిజర్వ్బ్యాంకులో తమకు రూ.కోట్ల డబ్బు ఉందని, విత్డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని, తొలుత డబ్బులు ఇస్తే తిరిగి ఎక్కువ ఇస్తామని చెప్పి డబ్బులు వసూళ్లకు పాల్పడ్డారు. ఇలా నగరంలోని అరవింద్నగర్కు చెందిన ఓ వ్యక్తికి ఎన్ఏఆర్ఎల్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.14 లక్షలు, రిజర్వ్ బ్యాంకులో డబ్బులు డ్రా చేయడ కోసమంటూ రూ. 6 లక్షలు చొప్పున మొత్తం రూ. 20 లక్షలు తీసుకొని మోసం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఆదర్శనగర్ సమీపంలో నిందితులు ఉన్నట్లు సమాచారం రావడంతో కొర్రా విజయ్కుమార్, షేక్ ముజీమ్ మిల్ను అరెస్ట్ చేశారు. పల్లా నారాయణస్వామి అలియాస్ బన్ని పరారీలో ఉన్నట్లు సీఐ పుల్లయ్య పేర్కొన్నారు. -
ఎన్నాళ్లీ ఎదురుచూపులు ?
రాయదుర్గం–తుమకూరు నూతన రైలుమార్గ నిర్మాణ పనులు దశాబ్ద కాలానికిపైగా కొనసాగుతూనే ఉన్నాయి. 206.52 కి.మీలో ఇప్పటికీ 109 కి.మీ మాత్రమే పూర్తి చేశారు. నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యంపై అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాయదుర్గంటౌన్: రాయదుర్గం – తుమకూరు నూతన రైలుమార్గ నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. అనంతపురం జిల్లాతో పాటు దక్షిణ కర్ణాటక ప్రజల రవాణా అవసరాలతో పాటు గార్మెంట్స్, వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా, రైల్వే వ్యవస్థ బలోపేతాన్ని దృష్టిలో ఉంచుకుని 2007–08లో ఈ రైలుమార్గం నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది. 206.53 కి.మీ రైలుమార్గం నిర్మాణానికి రూ.1714.50 కోట్ల అంచనాతో 2012లో శంకుస్థాపన చేశారు. ఇది పూర్తయితే రాయదుర్గం నుంచి కళ్యాణదుర్గం, కంబదూరు, దొడ్డహళ్లి, మడకశిర, కోతాళం, పావగడ, దొడ్డబెట్ట, హొసకెరె, మధుగిరి మీదుగా కర్ణాటకలోని తుమకూరు ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది. 2016లో కళ్యాణదుర్గం వరకు, 2017లో కదిరిదేవరపల్లి వరకు రైలుమార్గం పూర్తికావడంతో తిరుపతి–కదిరిదేవరపల్లి రైలు సర్వీసును ప్రారంభించారు. ప్రస్తుతం ఇటీవల కంబదూరు, దొడ్డహళ్లి, పావగడ వరకు (99 కి.మీ), అటు వైపు నుంచి తుమకూరు–ఉరుకెర వరకు 10 కి.మీ మేర మొత్తం 109 కిలోమీటర్ల వరకు రైలుమార్గ నిర్మాణం పూర్తయింది. మరో 97 కిలోమీటర్ల మేర కర్ణాటక రాష్ట్రంలో నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. పెరిగిన అంచనా వ్యయం పనుల్లో తీవ్ర జాప్యం, ఇతరాత్ర కారణాలు, దీర్ఘకాలంగా సాగుతుండడంతో నిర్మాణ అంచనా వ్యయం అమాంతం రూ.4 వేల కోట్లు దాటినప్పటికీ ప్రాజెక్ట్ పూర్తికాకపోవడం విచారకరం. ఇంకా కోతాళం, మడకశిర, దొడ్డబెట్ట, హొసకెరె, మధుగిరి, కొరటగెరె మార్గంలో భూ సేకరణతో పాటు బ్రిడ్జి నిర్మాణ పనులు, అండర్పాస్ నిర్మించేందుకు దీర్ఘకాలం పట్టవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. రైల్వేసహాయ మంత్రి సోమన్న 2027 డిసెంబర్ నాటికి రైలు మార్గం నిర్మాణాన్ని పూర్తచేస్తామంటున్నా అది అసాధ్యమని రైల్వే అధికారులే చెబుతున్నారు. తగినన్ని నిధులు బడ్జెట్లో విడుదల చేస్తే తప్ప రైల్వేమార్గం నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ఎలాంటి జాప్యం లేకుండా, నిధుల విడుదలతో పాటు అన్ని పనులు సక్రమంగా జరిగితే 2031 నాటికి రైలుమార్గం నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంది. 14 ఏళ్లుగా నిర్మాణ దశలోనే రాయదుర్గం – తుమకూరు రైలుమార్గం 206.52 కి.మీలో నేటికీ 109 కి.మీ మాత్రమే పూర్తి నిర్మాణ పనుల్లో జాప్యంపై అన్ని వర్గాల ప్రజల అసంతృప్తి -
చెదిరిన అసిస్టెంట్ ప్రొఫెసర్ కల
● అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లిన జేఎన్టీయూ ఉన్నతాధికారులు ● వేరే యూనివర్సిటీల్లో అర్హులుగా గుర్తించినా ఇక్కడ మాత్రం తిరస్కరణఅనంతపురం: యూనివర్సిటీలో రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా స్థిరపడాలనే వారి కల చెదిరిపోయింది. ఆవేదన చెందడం మినహా చేసేదేమీ లేక మిన్నకుండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జేఎన్టీయూ (ఏ) పరిధిలో 79 ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించగా, మొత్తం 12,892 దరఖాస్తులు అందాయి. ఇందులో 11,676 దరఖాస్తులకు ఆమోదం తెలిపిన అధికారులు మిగిలిని వాటిని తిరస్కరించారు. వీటిల్లో సింహభాగం ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులవే ఉండడం గమనార్హం. ఈ క్రమంలో జేఎన్టీయూ(ఏ) అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పే స్లిప్పులు లేవంటూ.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ బోధనానుభవాన్ని ధ్రువీకరించే పత్రాలతో పాటు వేతనాలకు సంబంధించిన పే స్లిప్పులను సమర్పించాలనే నిబంధన విధించారు. అయితే, కన్సాలిడేటేడ్ ప్రాతిపదికన పనిచేస్తున్న పలువురు అధ్యాపకులకు వర్సిటీల నుంచి సాధారణ ఉద్యోగుల తరహాలో పే స్లిప్పులు జారీ చేయలేదు. తాజాగా పే స్లిప్ లేదనే సాకుతో దరఖాస్తులు తిరస్కరించడంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీలే తమను నియామకం చేసి, ఇప్పుడు ఇలా వ్యవహరించడం సరికాదంటూ బాధితులు వాపోతున్నారు. వారిపై అమితప్రేమ.. గతంలో వివాదాస్పదంగా చేపట్టిన పోస్టులను తాజాగా రెగ్యులరైజ్ చేసేందుకు కసరత్తు చేస్తుండడంపైనా సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. జేఎన్టీయూ (ఏ) పరిధిలో 2017లో 9 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసిన అధికారులు.. 2019 జనవరి మొదటి వారంలో హడావుడిగా నియామక పత్రాలు అందజేశారు. పాలిమర్ సైన్సెస్లో పీహెచ్డీ పూర్తి చేసిన వారికి మెకానికల్ విభాగంలో ప్రొఫెసర్ పోస్టు ఇవ్వడం, నోటిఫికేషన్ సమయానికి పీహెచ్డీ పూర్తి కాని వారికి సైతం పోస్టు కట్టబెట్టడం తదితర వింత ఘటనలు చోటుచేసుకోవడంతో అప్పట్లో పోస్టుల భర్తీ వివాదాస్పదమైంది. ఈ క్రమంలో 2019 జూన్లో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం వీరిని ఉద్యోగంలో నుంచి తొలగించగా.. హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని తిరిగి విధుల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో నడుస్తోంది. తాజాగా ఈ 9 ప్రొఫెసర్ పోస్టులను రెగ్యులరైజ్ చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వింత వైఖరి అవలంబిస్తూ అర్హుల దరఖాస్తులను తిరస్కరిస్తున్న వర్సిటీ అధికారులు.. మరోవైపు అనర్హులైన ఉద్యోగులపై అమిత ప్రేమ కనబరుస్తూ పోస్టులను క్రమబద్ధీకరించేందుకు ఆసక్తి కనబరుస్తుండడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. జేఎన్టీయూ (ఏ)లోని ఈసీఈ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు అజయ్ అనే వ్యక్తి దరఖాస్తు చేసుకున్నారు. ఈయన ప్రైవేట్ అనుబంధ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. 10 సంవత్సరాల అధ్యాపక అనుభవం ఉంది. అనుభవ ధ్రువీకరణ పత్రంతో పాటు పేస్లిప్పులు కూడా అందించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు అన్ని అర్హతలు ఉన్న అతని దరఖాస్తును జేఎన్టీయూ అధికారులు తిరస్కరించారు. కాకినాడ జేఎన్టీయూలో అజయ్ దరఖాస్తు చేసుకోగా, అక్కడ ఆమోదించడం గమనార్హం. అజయ్ ఒక్కరిదే కాదు.. జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ఏకంగా ఇలాంటి 351 దరఖాస్తులు తిరస్కరించారు. -
ఎకరాకు రూ.19 లక్షల పరిహారం
యాడికి: చింతలాయపల్లి, కుందనకోట వద్ద 950 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు భూమి ఇచ్చే రైతులకు ఎకరాకు రూ.19 లక్షల పరిహారం నిర్ణయించినట్లు జేసీ విష్ణుచరణ్ తెలిపారు. మంగళవారం కమలపాడు సమీపంలోని కొండల్లో ఉన్న చింతల వెంకటరాయుడు స్వామి ఆలయ ఆవరణలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జేసీ విష్ణుచరణ్ మాట్లాడుతూ చింతలాయపల్లి, కుందనకోట వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటుకు చింతలాయపల్లిలో 223 మంది రైతులకు చెందిన 321.79 ఎకరాలు, కుందనకోటలోని 38 మంది రైతులకు చెందిన 76.5 ఎకరాల పట్టా భూమిని సేకరించినట్లు తెలిపారు. ఎకరా పొలం రూ.19 లక్షలతో ఏపీ జెన్కో కంపెనీ సంస్థ ప్రటించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ ప్రతాప్రెడ్డి, ఏపీ జెన్కో ఇంజినీర్లు ఆదినారాయణ రెడ్డి, డీటీ శ్రీనివాసులు, ఆర్ఐ కిష్టప్ప, గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు. పెద్దారెడ్డి ఇంటి వద్ద ఆకతాయి చేష్టలపై కేసు తాడిపత్రిటౌన్: తాడిపత్రి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద ఆకతాయిల చేష్టలపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఆరోహనరావు తెలిపారు. మంగళవారం సాయంత్రం రెండు ద్విచక్రవాహనాల్లో నలుగురు వ్యక్తులు ముఖాలకు మాస్కులు వేసుకొని రెండు గాజు సీసాలు కేతిరెడ్డి ఇంటి కాంపౌండ్ గోడకు విసిరి పరారయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ గౌస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. వాటి ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఆరోహణరావు తెలిపారు. 20 మండలాల్లో వర్షం అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు 20 మండలాల పరిధిలో 6.2 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. బెళుగుప్ప 22.2 మి.మీ, బ్రహ్మసముద్రం 21.2, యల్లనూరు 21, గుమ్మఘట్ట 18.8, కళ్యాణదుర్గం 14.6, శింగనమల 11.2 మి.మీ వర్షపాతం నమోదైంది. పెద్దవడుగూరు, నార్పల, ఆత్మకూరు, కూడేరు, అనంతపురం, శెట్టూరు, యాడికి, బుక్కరాయసముద్రం, పుట్లూరు, కణేకల్లు, గార్లదిన్నె తదితర మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. జూలై నెల సాధారణ వర్షపాతం 68.4 మి.మీ కాగా ప్రస్తుతానికి 14.7 మి.మీ నమోదైంది. ఓవరాల్గా జూన్ ఒకటి నుంచి ఈ సీజన్లో 106.8 మి.మీ గానూ 22 శాతం తక్కువగా 83.1 మి.మీ వర్షం కురసింది. మరోసారి తెరపైకి ఈ స్టాంప్ కుంభకోణం కళ్యాణదుర్గం: రాష్ట్రంలో సంచలనం రేపిన ఈ– స్టాంప్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. కేసు విచారణ నిమిత్తం మంగళవారం కర్నూలు సీఐడీ రీజినల్ ఆఫీస్ నుంచి ఎస్ఐ శివశంకర్ నాయక్ కళ్యాణదుర్గం రావడం చర్చనీయాంశమైంది. పట్టణ పోలీసు స్టేషన్లో స్థానిక సీఐ హరినాథ్తో కేసు విషయమై చర్చించినట్లు సమాచారం. మీ సేవ సెంటర్లో నాన్ జ్యుడీషియల్ ఈ–స్టాంపుల విక్రయానికి సంబంధించి జరిగిన మోసాలపై అప్పట్లో కళ్యాణదుర్గం పట్టణ పోలీసు స్టేషన్లో నమో దైన కేసులపై ఆరా తీసినట్లు తెలిసింది. దీంతో పాటు నిందితుల బ్యాంకు లావాదేవీల ఆధారాలను సేకరించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బాబు మీ సేవ నుంచి ఈ–స్టాంపులు కొనుగోలు చేసిన వారు తమ ఉద్ద ఉన్న స్టాంపులు నిజమైనవో కాదో ఆన్లైన్లో ధ్రువీకరించుకోవాలని సీఐడీ అధికారులు ప్రజలకు సూచించారు. అనుమానాలుంటే వెంటనే తమను సంప్రదించాలన్నారు. ఈ–స్టాంప్లు, సంబంధిత రసీదులు అందజేస్తే కేసు దర్యాప్తునకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కేసుకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు చేయాలంటే సీఐడీ సీఐ జి.ప్రియతమ్ రెడ్డి (9000099309), ఎస్ఐ శివశంకర్ నాయక్ (9247598089), పీసీలు ధనుంజయ, షఫి (9030976992)ను సంప్రదించాలన్నారు. ఈ–స్టాంప్ కేసుపై సీఐడీ అధికారులు లోతైన విచారణ చేపట్టేందుకు కళ్యాణదుర్గం రావడంతో నిందితుల్లో ఆందోళన మొదలైందని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
ఇంకెన్నాళ్లీ దుశ్శాసన పర్వం..?
● మహిళలపై వరుస దాడులకు హోం మంత్రి అనిత బాధ్యత వహించాలి ● వైఎస్సార్ సీపీ మహిళా విభాగం ధ్వజంఅనంతపురం: చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలపై దుశ్శాసన పర్వం నడుస్తోందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నేతలు మండిపడ్డారు. విభాగం జిల్లా అధ్యక్షురాలు బి. శ్రీదేవి ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో భారీ ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న వరుస దాడులను ఖండిస్తూ నగర వీధుల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. జెడ్పీ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో శ్రీదేవి మాట్లాడుతూ గుంటూరులో మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసి దాడి చేయడం, బద్వేలులో ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరుడు ఓ వృద్ధ మహిళపై కిరాతకంగా దాడి చేసిన ఘటనలను చూసి సమాజం సిగ్గుతో తలవంచుకుంటోందన్నారు. హోం మంత్రి అనిత, ఎమ్మెల్యేలు మాధవి రెడ్డి, గల్లా మాధవి వీటిపై ఎందుకు స్పందించడం లేదన్నారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు వైఎస్సార్ సీపీ పోరాడుతుందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్కు ఏమాత్రం నైతికత ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం మహిళల భద్రత అంశంలో పూర్తిగా విఫలమైందన్నారు. గుంటూరులో మహిళను వివస్త్రను చేసి అవమానించినా, ఆడబిడ్డలు అదృశ్యమవుతున్నా స్పందించడం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు మహిళలపై నేరాలకు పాల్పడాలంటే నేరస్తులు భయపడేలా చట్టాలు తీసుకొస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక గాలికి వదిలేశారన్నారు. రాష్ట్ర బీసీ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో దుశ్శాసన పర్వం నడుస్తోందని విమర్శించారు. గుంటూరులో ఒక బీసీ మహిళను వివస్త్రను చేసి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఇప్పటి దాకా ఎలాంటి చర్యలూ లేవన్నారు. రెడ్బుక్ స్టార్ నారా లోకేష్ కనుసన్నల్లోనే అరాచకాలు జరుగుతున్నాయని ఈ సంప్రదాయం మంచిది కాదన్నారు. మాజీ మేయర్ వసీం మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను చూసి మహిళలు భయపడే పరిస్థితి నెలకొందన్నారు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్, మాజీ డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, సాకే చంద్రలేఖ, మొఘల్ సైఫుల్లా భేగ్, మల్లెమీద నరసింహులు, రాధా యాదవ్, పేరం స్వర్ణలత, వసంత, మౌలీశ్వరి, బోయ సుశీలమ్మ, నాగలక్ష్మి, పార్వతి, ఉషారాణి, ఎద్దుల అమర్నాథ రెడ్డి, జానీ, ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ శంకరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టుబడి తానీషా, నాగార్జున రెడ్డి, కైలాష్, సంపంగి రామాంజినేయులు, అనిల్ కుమార్ గౌడ్, ఇషాక్, సాకే కుళ్లాయిస్వామి, సతీష్, శ్రీనివాసులు, గుణశేఖర్ బాబు, శ్రీనివాస రెడ్డి, షేక్ ఖాజా, రమణా రెడ్డి, లబ్బే రాఘవ, థామస్, సాకే అశోక్ కుమార్, కిషోర్, మహిళా విభాగం నాయకురాళ్లు దేశాయి భారతి, లక్ష్మీదేవి, నాగలక్ష్మి, పార్వతి, చంద్రలేఖ, ఉషా, అంజలి, సుశీల, పద్మావతి, జాహ్నవి, దేవి, సుజాత, సుహాసిని, శోభారాణి, పద్మావతి, పార్వతి, అంజలి, ప్రసన్న, చంద్రకళ, మహేశ్వరి, అనూరాధ, లీల, హజరాబీ తదితరులు పాల్గొన్నారు. -
నీళ్లడిగితే దాడి చేసి ప్రాణం తీస్తారా?
● వైఎస్సార్ సీపీ రాయదుర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి రాయదుర్గంటౌన్: నీళ్లడిగిన పాపానికి దాడి చేసి ప్రాణం తీస్తారా? అంటూ వైఎస్సార్ సీపీ రాయదుర్గం సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి ధ్వజమెత్తారు. కణేకల్లు మండలం 43 ఉడేగోళం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లావణ్య, ఆమె భర్త మారుతిప్రసాద్లను తక్షణమే అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఆంజనేయులు మృతి తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. 43 ఉడేగోళం గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండడంతో తన ఇంటి కొళాయికి సరిగా నీరు రావడం లేదని ఆంజనేయులు ఆవేదన చెందారన్నారు. పింఛన్ డబ్బు కట్ చేసినా కొళాయికి నీరు రాకపోవడంతో అడిగేందుకు టీడీపీ నాయకుడు మారుతీప్రసాద్ ఇంటికి వెళ్లాడన్నారు. ఈ క్రమంలోనే ఇంటి వద్దకు వచ్చి ప్రశ్నిస్తావా అంటూ మారుతీప్రసాద్, అతని భార్య లావణ్యలు అధికార మదంతో ఆంజనేయులు పొలం వద్దకు వెళ్లి వృద్ధుడిని కూడా చూడకుండా చెప్పులతో కొట్టి కాళ్లతో తన్ని అమానుషంగా చితకబాదారన్నారు. నలుగురి ముందు జరిగిన ఈ అవమానం తట్టుకోలేక పురుగుల మందు తాగిన ఆంజనేయులు మృత్యువుతో వారం రోజులు పోరాడి మృతి చెందా డని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంజనేయులుది ఆత్మహత్య కాదని, ముమ్మాటికీ అధికార మదంతో చేసిన హత్య అని మండిపడ్డారు. వృద్ధుడిపై దాడికి పాల్పడిన మారుతితోపాటు అతని భార్యపై తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, పింఛన్ డబ్బు కట్ చేసి కొళాయి పన్నుకు కట్టిన గ్రామ కార్యదర్శిపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అండదండలతో టీడీపీ నాయకుల ఆగడాలు, అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గకుండా బాధ్యులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉషారాణి, కణేకల్లు మండల కన్వీనర్ బ్రహ్మానందారెడ్డి, రాయదుర్గం మండల కన్వీనర్ రామాంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షుడు మారెన్న, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి హళ్లి, నాగరాజు, మక్కబుల్భాష తదితరులు పాల్గొన్నారు. -
ఎరక్కపోయి ఇరుకున పడి
బొమ్మనహాళ్:ఎరక్కపోయి వచ్చిన ఓ ఎలుగుబంటి ఇరుక్కుపోయిన ఘటన మండలంలోని నేమకల్లు వద్ద జరిగింది. ఆహారం కోసం గ్రామ శివారులోని కొండపైకి ఎక్కిన ఎలుగుబంటి తిరిగి దిగే అవకాశం లేకపోవడంతో అక్కడే ఉండిపోయింది. మంగళవారం కొండ వద్ద క్వారీలో పనిచేసేందుకు వెళ్లిన కార్మికులు ఎలుగుబంటిని గుర్తించి ముందు భయాందోళన చెందారు. కొంతసేపటి తర్వాత ఎటూ కదల్లేని స్థితిలో ఉందని గుర్తించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దామోదర్రెడ్డి, బీట్ ఆఫీసర్ సుబ్రమణ్యం ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఎలుగుబంటి భయాందోళనకు గురి కాకుండా కొండ ప్రాంతంలోని క్వారీల్లో కంకర తవ్వకాలను తాత్కాలికంగా నిలిపి వేయించారు. ఈ సందర్భంగా డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ దామోదర్రెడ్డి మాట్లాడుతూ ఎలుగుబంటికి ఎలాంటి హాని కలగకుండా సహజ ఆవాసంలోకి వెళ్లేలా చూస్తామన్నారు. ఒకవేళ భల్లూకం వెళ్లకుండా అక్కడే ఉంటే బుధవారం రోప్వే ద్వారా బోనులో బంధిస్తామని చెప్పారు. -
‘తమ్ముళ్ల’ పైశాచికం
విడపనకల్లు: ‘పచ్చ’ మూకలు పైశాచికం ప్రద ర్శించారు. వ్యవసాయ పొలంలోకి దౌర్జన్యంగా ప్రవేశించడమే కాకుండా మూడు బోర్లు ధ్వంసం చేశారు. బాధితుడి వివరాల మేరకు.. విడపనకల్లు మండలం వేల్పుమడుగు గ్రామ సర్వే నంబర్ 141లో 21.50 ఎకరాల భూమిని వైఎస్సార్ సీపీ నాయకుడు కురుబ గోవిందు అల్లుడు జయకుమార్ 2023 జూన్లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అదే ఏడాది రూ.5 లక్షలు ఖర్చు చేసి పొలంలో ఐదు బోర్లు వేయించగా.. మూడు బోర్లలో పుష్కలంగా నీళ్లు పడ్డాయి. పొలంలోకి ఈ నెల 19న ఆదివారం జనార్దనపల్లికి చెందిన టీడీపీ నాయకులు సుధాకర్ నాయుడు, ముప్పారపు పాండురంగ నాయుడు, మాజీ సర్పంచు రాయంటి జనార్దన నాయుడు అక్రమంగా ప్రవేశించి మూడు బోర్లను ధ్వంసం చేశారు. కేసింగ్ పైపులు ఎత్తుకెళ్లారు. పైశాచికంగా బోర్లలోకి పెద్ద పెద్ద రాళ్లు వేశారు. బాధితులు ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు విడపనకల్లు పోలీసుస్టేషన్కు వెళ్లగా ఎస్ఐ ఏమాత్రమూ స్పందించలేదు. దీంతో మంగళవారం ఉరవకొండ రూరల్ సీఐ మహానందిని ఆశ్రయించారు. స్థానికంగా తమకు న్యాయం జరగకపోతే ఎస్పీని కలిసి ఫిర్యాదు చేస్తామని గోవిందు తెలిపారు. -
తప్పుడు కేసుతో వేధింపు
వేధింపులు, అరాచకాలు తాళలేక వరుసగా బాధితులు బలవన్మరణాలకు పాల్పడుతున్నా టీడీపీ నేతలు ఏ మాత్రమూ తగ్గడం లేదు. ‘మాకు పై నుంచి ప్రెజర్ ఉంద’ని చెబుతూ పోలీసులు పూర్తి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నాయకులు చెబితే చాలు ప్రతిపక్ష పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. అనంతపురం రూరల్ మండలం ఆలమూరులోని జగనన్న లేఔట్లో మోటార్లను దొంగతనం చేశాడన్న తప్పుడు ఫిర్యాదు మేరకు వైఎస్సార్ సీపీ నాయకుడు అంకే నరేంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. తాను తప్పు చేయకపోయినా స్థానిక టీడీపీ నేత సూర్యనారాయణ వేధింపులకు పాల్పడుతున్నారని సెల్ఫీ వీడియోలో చెబుతూ నరేంద్ర క్రిమి సంహారక ద్రావణాన్ని తాగాడు. గమనించిన స్థానికులు హుటాహుటిన అనంతపురంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో బాధితుణ్ని బెంగళూరుకు తరలించారు. ఇలా టీడీపీ నేతలు వరుస వేధింపులకు పాల్పడుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. బాధితులపైనే కేసులు పెడుతూ ‘పచ్చ’ నాయకులను మరింతగా ప్రోత్సహిస్తున్నారు. ఇటీవల మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేసిన విమర్శలకు కౌంటర్గా తాను సమాధానమిస్తే మూడు రోజుల పాటు పోలీసులు చిత్రహింసలకు పాల్పడ్డారని పటాస్ శ్రీకాంత్ అనే యువకుడు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
హంద్రీ–నీవా లైనింగ్లో లూటీ
● కోతల రాయుడు పయ్యావుల కేశవ్ జిల్లాకు చేసిన మేలు ఏమిటో? ● వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ధ్వజం అనంతపురం: ‘ఉమ్మడి అనంతపురం జిల్లాకు జీవనాడి లాంటి హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ పేరుతో వందలాది కోట్లు లూటీ చేశారు. ఈ అంశంపై పరిశీలనకు వెళ్లిన వైఎస్సార్సీపీ నాయకులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్కు ఉలుకెందుకు?’ అని పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హంద్రీ–నీవా పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తే కేసులు పెడుతానంటూ బెదిరిస్తావా అంటూ కేశవ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము చేపట్టిన హంద్రీ–నీవా యాత్రకు అనూహ్య స్పందన రావడం చూసి భయంతో వెంటనే ఆయన కాలువ వద్దకు వెళ్లారన్నారు. తాను ఎక్కడా కేశవ్ను వ్యక్తిగతంగా విమర్శించకపోయినా టార్గెట్ చేశారని మండిపడ్డారు. నెల్లూరు మీటింగ్లో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి వారి అనుకూల సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారన్నారు. రూ.కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకుంటూ అవి నీతికి పాల్పడ్డారని వ్యాఖ్యానిస్తే ఆ అంశాన్ని అనుకూలంగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. ‘సాగునీరు, వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలపై చంద్ర బాబుకు మంచి అభిప్రాయం లేదని చాలా సార్లు చెప్పా. నెల్లూరు సమావేశంలో ఏం మాట్లాడానని నాకు తెలుసు, మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుసు’ అన్నారు. ఆత్మసాక్షి లేనిది కేశవ్కే అని ఘాటుగా స్పందించారు. ‘గతంలో నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఎన్ని ప్రయత్నాలు చేశావో చెప్పమంటావా’ అంటూ నిలదీశారు. లక్ష్మీపార్వతి కాళ్లు పట్టుకుని టికెట్ తెచ్చుకుని మళ్లీ చంద్రబాబు పంచన చేరిన విలువలు లేని నాయకుడు కేశవ్ అంటూ విరుచుకుపడ్డారు. నమ్మే వారు ఉంటే ఉరవకొండలో ఉన్న కొండను, అనంతపురం టవర్క్లాక్ను కూడా కట్టానంటారని ఎద్దేవా చేశారు. ఆర్థిక శాఖను అవినీతి శాఖగా మార్చేశాడని, కమిషన్లు లేకుండా ఏ పనీ జరగదన్న ముద్ర పడిందన్నారు. బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేశారు. జగన్కు పేరొస్తుందనే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుచూపుతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని, అలాంటి ప్రాజెక్టుకు టీడీపీ వచ్చిన తర్వాత గ్రహణం పట్టిందన్నారు. జగన్కు పేరు వస్తుందనే ఒకే ఒక ఉద్దేశంతో అడ్డుకున్నారన్నారు. ఈ అంశాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారని, దీనిపై టీడీపీ నేతలు ఎందుకు స్పందించలేదని నిలదీశారు. అనుమతులు లేకున్నా అప్పర్ పెన్నా పనులు చేస్తున్నారన్నారు. తుంగభద్ర కేటాయింపుల కంటే ఎక్కువ వాడుకుంటున్నా కనీసం చంద్రబాబు ప్రశ్నించిన పాపాన పోలేదన్నారు. గోబెల్స్ ప్రచారం తప్ప ప్రాజెక్టులు ఆపే ప్రయత్నం చేయడం లేదని మండిపడ్డారు. హంద్రీ–నీవా అంటే దివంగత నేత వైఎస్సార్ గుర్తుకు వస్తారని ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. కేశవ్ చెప్పేవన్నీ అబద్దాలేనని, గతంలో రెండు సార్లు భూమిపూజ చేయడం తప్ప హంద్రీ–నీవాకు చేసిందేమీ లేదని ఆయన తెలుసుకోవాలని హితవు పలికారు. కౌకుంట్ల పంచాయతీ విభజనకు ఎందుకు సమ్మతించలేదో దమ్ముంటే బహిరంగ పరచాలని సవాల్ విసిరారు. పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఒప్పుకోలేదని దుయ్యబట్టారు.


