అనంతపురం అగ్రికల్చర్: రైతులు కొనుగోలు చేసిన ఎరువులకు బిల్లులు ఇవ్వలేదనే కారణంతో అనంతపురంలోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్డులో ఉన్న సాయి గణేష్ ఆగ్రో ఏజెన్సీస్ దుకాణం లైసెన్స్ను రద్దు చేస్తూ ఏడీఏ అల్లాఫ్ అలీఖాన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు ఉత్తర్వులను దుకాణం యజమాని సురేష్కుమార్రెడ్డికి ఏఓ వెంకటకుమార్ అందజేశారు. గతేడాది అక్టోబర్ 18న కూడేరు మండలానికి చెందిన రైతు లక్ష్మీనారాయణ కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో వివరించారు.


