వైఎస్సార్సీపీ నూతన కార్యాలయం పరిశీలన
అనంతపురం: నగరంలోని హెచ్చెల్సీ కాలనీలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలోని మెటీరియల్ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకెళ్లారు. నిర్మాణ సామగ్రిని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు బుధవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మొత్తం రూ.40 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు నిర్ధారించారు. పరిశీలించిన వారిలో పార్టీ పార్లమెంట్ పరిశీలకులు నరేష్ రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, నియోజకవర్గ సమన్వయకర్తలు వై. విశ్వేశ్వర రెడ్డి, తలారి రంగయ్య, కేతిరెడ్డి పెద్దారెడ్డి, వై.వెంకట్రామి రెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, మేయర్ వసీం సలీం, రాష్ట్ర కార్యదర్శి రమేష్గౌడ్ తదితరులు ఉన్నారు.
వైఎస్సార్సీపీ నూతన కార్యాలయం పరిశీలన
వైఎస్సార్సీపీ నూతన కార్యాలయం పరిశీలన


